కుక్క కాట్లు - పిల్లల పాట్లు...
మా ఇంటి దగ్గర కారు బయటకు తీస్తుంటే ఓ ఆరవ తరగతి అమ్మాయి వచ్చి అంకుల్ మీకు ఓ విషయం చెప్పాలి అంది.. ఏంటమ్మా? అని అడిగాను.. అంకుల్ కుక్కలు ఎక్కువగా ఉన్నాయి.. ప్రైవేట్ కు వెళ్లేటప్పుడు అవి వెంటపడుతూ ఉన్నాయి .. మీకు బాగా అధికారులు తెలుసు కదా ఒకసారి ఈ కుక్కలను ఇక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పండి అని అనింది.. ఇంతకుముందే చెప్పానమ్మా .. వారు ఆ కుక్కలను మొన్న పట్టుకెళ్ళారు కదా.. కానీ వాటిని చంపలేరు ..వాటికి కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసి మరలా ఇక్కడే వదిలేస్తారు.. అందుకనే అవి మరలా ఇక్కడే ఉన్నాయి అని చెప్పాను.. ఎందుకలా అడవిలో వదిలేయచ్చు కదా? అని అడిగింది.. వాటికి వేటాడే కెపాసిటీ ఉండదు.. అవి అడవిలో బ్రతకలేవు .. అందుకని వాటిని ఇక్కడే వదిలేస్తారు .. అవి ఎక్కడ వదిలినా కానీ అవి ఎక్కడ పెరిగాయో అక్కడికే వస్తాయి కాబట్టి మనకు తప్పదు అని చెప్పాను.. మీరు కారులో వెళ్తారు కాబట్టి మీకు వాటి వలన కలిగే బాధ తెలియదు అంకుల్ అని బాధగా చెప్పింది.. లేదమ్మా రోజు నేను వాకింగ్కు మార్నింగ్ వెళ్లినప్పుడు నాకు కూడా ఆ సమస్య ఉంది.. నేను వాకింగ్ స్టిక్ దానికోసమే పట్టుకొని వెళ్తాను.. ఈ మధ్యన భయమేసి కొంచెం వాకింగ్ కూడా మానేశాను అని చెప్పాను.. అయితే ఏం చేయలేరా అంకుల్ అని బాధగా నిష్ఠూరంగా కోపంగా ఎన్నో భావాలు వచ్చేలా ఒక నిష్టూరమైన చూపు చూసి వెళ్ళిపోయింది.. ఓ సంవత్సరం కింద మా ఇంట్లో ఓ పిల్లి ఆరు పిల్లలను పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఓ రోజు బయటి నుంచి కుక్కలు గోడ దూకి వచ్చి విచక్షణారహితంగా ఆరు పిల్లలని చంపేసేయ్.. ఆ తల్లి పిల్లి బాధ వర్ణనాతీతం.. ఈ రోజు 9 గంటల సమయంలో ఆసుపత్రిలోకి వచ్చినప్పుడు ఓ పంది పిల్లను కుక్కలు వెంటపడి నోటితో కరుసుకున్నాయి.. అదిలించిన కానీ అవి వదలలేదు.. ఎక్కడి నుంచి వచ్చిందో వాటి తల్లి పంది వచ్చి వాటితో వీరోచితంగా పోరాడింది.. అతి కష్టం మీద దానిని వదిలేసి కుక్కలు పారిపోయాయి.. చిన్న పిల్లలు చనిపోయిన సంఘటనలు మనం వార్తలలో చూస్తూ ఉంటాం.. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో? ఇది నిజం.. భారతదేశంలో కుక్క కాట్లు మరియు రేబీస్ స్థితి: · ప్రపంచంలో రేబీస్ సంబంధిత మరణాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది (ప్రపంచంలోని మొత్తం రేబీస్ మరణాలలో దాదాపు 36%). · ప్రతి సంవత్సరం సుమారు 1.7 కోట్ల మంది (17 మిలియన్ల) కుక్క కాట్లు నమోదవుతాయని అంచనా. · వీరిలో ప్రతి సంవత్సరం సుమారు 18,000 నుండి 20,000 మంది ప్రజలు రేబీస్ వలన మరణిస్తారు (WHO డేటా ప్రకారం). · ఈ కాట్లలో ఎక్కువ భాగం దెబ్బతిన్న (స్ట్రే) కుక్కల వలన సంభవిస్తాయి. కుక్క కరిస్తే ఏ ఆర్ వి ఇంజక్షన్ తప్పక వేసుకోవాలి.. ఒక ఇంజక్షన్ ఖరీదు 300 రూపాయలు.. 4-6 డోసులు అవసరం.. రేబీస్ కు వైద్యంలేదు..చావే గతి.. కుక్క కరవకుండా చూసుకోవాలి.. కరిస్తే ఎఆర్వీ వేసుకోవాలి.. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
YRCP : నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
వైసీపీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది
TG |ధూప దీప నైవేద్య పథకం అమలు..
TG | ధూప దీప నైవేద్య పథకం అమలు.. TG, కొత్తకోట, ఆంధ్ర
India vs Newzealand : తొలి వన్డే మనదే.. నాగపూర్ లో గెలిచిన టీం ఇండియా
భారత్ - న్యూజిలాండ్ మధ్య నాగపూర్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది
ಚಿಕ್ಕಮಗಳೂರಿನಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟಲ್ನಲ್ಲಿ ಮಹಿಳೆಯೊಬ್ಬರಿಗೆ ದೆವ್ವ ಹಿಡಿದಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
అభిషేక్, రింక్సింగ్ ల సిక్స్ల వర్షం... వీడియో వైరల్
విదర్భ: టి20 సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్పై భారత జట్టు 48 పరుగుల తేడాతో గెలిచింది. భారత బ్యాట్స్మెన్లు అభిషేక్ శర్మ, రింకు సింగ్ సిక్స్ల వర్షం కురిపించారు. అభిషేక్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్లతో 84 పరుగులు చేశాడు. రింకు సింగ్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్లతో 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. Team India won by 48 runs in Nagpur #AbhishekSharma #indvsnzt20 pic.twitter.com/pSs2suTJgG — FunkyFreaks✨ (@ameer72s) January 21, 2026 खौफ अच्छा है #INDvsNZ pic.twitter.com/SzHFnNhXGt — amit (@amitkumarmawai) January 22, 2026
నంద్యాలలో బస్సు ప్రమాదం: ముగ్గురు సజీవదహనం
అమరావతి: ఓ ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి వైపు లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రెండు వాహనాలు దహనమయ్యాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా శిరివేళ్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎఆర్బిసివిఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తోందిజ శిరివెళ్లమెట్ట వద్ద రాగానే బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అనంతరం లారీని ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలంలో సజీవదహనమయ్యారు. ఓ డిసిఎం డ్రైవర్ బస్సు అందాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగాడు. ప్రయాణికులు విండో అందాలు పగుటగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులు కిటీకిలో నుంచి బయటకు దూకడంతో కొందరు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.
Nandyal Road Accident |ఘోర రోడ్డు ప్రమాదం..
Nandyal Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. Nandyal Road Accident,
రిపబ్లిక్ వేళ ఉగ్రదాడికి కుట్ర
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు లేదా జనవరి 26కు ముందే టెర్రరిస్ట్ దాడికి కుట్ర జరుగుతోందని నిఘావర్గాలు హెచ్చరించడంతో భద్రతా దళాలు బుధవారం ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించాయి. దాడి కోడ్ 26-26 గా వ్యవహరిస్తున్నారు. టెర్రరిస్ట్ లు అయోధ్య లోని బాల రామాలయం, జమ్మూ లోని రఘునాథ్ ఆలయాలతో పాటు ఇతర ముఖ్య దేవాలయాలను, నగరాలను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని భద్రతాదళాలకు సమాచారం అందడంతో అంతటా అప్రమత్తం అయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సమాచార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ ఐఎస్ ఐ. జైష్-ఎ-మొహమ్మద్ ద్వారా, పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ల సహాయంతో ఈ దాడిని ప్లాన్ చేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. నవంబర్ 9న ఎర్రకోట వెలుపల జరిగిన కార్ బాంబు దాడిలో 15 మంది మరణించారు. ఈ దాడికి తామే కుట్ర పన్నినట్లు జేష్- ఏ- మొహమ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకపక్క కర్యవ్య పథ్ లో ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే పరేడ్ , సంగీత నృత్య ప్రదర్శలు జరుగనున్న నేపథ్యంలో భద్రతా సంస్థలు ముందుగానే, ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం అంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బస్, రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలలో మోస్ట్ వాండెట్ వ్యక్తుల పోస్టర్లను ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఢిల్లీ లోని చౌహాన్ బంగర్ కు చెందిన మొహమ్మద్ రెహాన్ కూడా ఉన్నాడు. 2016లో ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో అల్ ఖైదా మాడ్యూల్ ను ఛేదించి నప్పుడు అతడు తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతరులలో మొహమ్మద్ ఉమర్, అబు సుఫియాన్, మొహమ్మద్ షాహిద్ ఫైసల్, సయ్యద్ అర్షియా,షార్జిల్ అఖ్తర్ ఉన్నారు. వీరికోసం ఢిల్లీ అడుగడుగునా గాలింపు జరుగుతోంది. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముందు ఎప్పటి లాగానే, ప్రొటోకాల్ మాదిరిగా భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. ఒక పక్క ఖలిస్తానీ టెర్రరిస్ట్ సంస్థలు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించగా, పంజాబ్ కు చెందిన పాత నేరస్థులు వారికి తోడ్పడే ముప్పు ఉండడంతో భద్రతను ముమ్మరం చేశారు. ఒక పక్క కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేస్తున్నా, మరో పక్క కశ్మీర్ కు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ తో మిలాఖత్ అయిన టెర్రరిస్ట్ విభాగం ఫాల్కన్ స్క్వాడ్ కూడా తాజాగా హెచ్చరికతో కూడిన ప్రకటన ముప్పు ప్రమాదాన్ని మరింత పెంచింది. ఇది పాకిస్తాన్ కు చెందిన మరో టెర్రరిస్ట్ సంస్థ లష్కర్ -ఏ-తోయిబా అనుబంధ సంస్థగా పరిగణిస్తున్నారు. 2019లో కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత ఆవిర్భవించిన లష్కర్ శాఖ, గత ఏడాది ఏప్రిల్ లో పహల్గాం లో దాడికి బాధ్యతవహించింది. 26 మంది హిందువుల ఊచకోత కు ప్రతిస్పందనగా , భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ , రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణ, కాల్పుల విరమణ తెలిసిందే.
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (జిసిసి) ప్రధాన కేం ద్రంగా మారిందని, మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడతామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా దేశంలోనే 24 గంట లు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దావోస్ వేదికపై సిఎం రేవంత్రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను ప్రదర్శిస్తూ 30 వే ల ఎకరాల్లో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మూ సీ పునరుజ్జీవనం ద్వారా హైదరాబాద్ను 24 గంటలు పనిచేసే నగరంగా మారుస్తామని సిఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభు త్వం ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’, ‘నెక్ట్జె న్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026, -2030’లను అధికారికంగా సిఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో వినూత్న ప్రతిపాదన ఉంచారు. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగష్టు నెలల్లో హైదరాబాద్లో ‘మినీ దావోస్’ తరహాలో ఫోరం ఫాలో- అప్ సదస్సును ని ర్వహించాలని సిఎం సూచించారు. పెట్టుబడి ఒ ప్పందాలు, వాణిజ్య నిర్ణయాలకు ఏడాది కాలం చాలా ఎక్కువని, అందుకే ఆరు నెలలకోసారి సమీ క్ష సమావేశం అవసరమని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 250 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, రానున్న రో జుల్లో తెలంగాణను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతి ఏడాది తాము ఎంఓయూలపై సంతకాలు చేయడానికి దావోస్కు వస్తామని, కానీ, ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావటంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామని ఆయన తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ లక్ష్యాలను ముఖ్యమంత్రి ప్రదర్శించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు, కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టుల గురించి పెట్టుబడిదారులకు వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ అర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు. తెలంగాణకు అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని వారు పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి స్విట్జర్లాండ్లోని దావోస్కు హాజరైన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి సినీ నటుడు చిరంజీవి విందులో పాల్గొన్నారు. సినీ నటుడు చిరంజీవి అక్కడే ఉన్న జ్యూరిక్ లో ఉన్నారని తెలుసుకున్న సిఎం రేవంత్ ఆయన్ను కూడా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానించారు. ఈ సదస్సులో ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం ఆయనతో సిఎం రేవంత్ మాట్లాడుతూ కుటుంబంతో కలిసి ‘మన శంకరవరప్రసాద్’ సినిమా చూశానని, చాలా బాగుందని సిఎం రేవంత్ ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. కాగా, ప్రస్తుతం చిరంజీవి స్విట్జర్లాండ్ లో ఫ్యామిలీ ట్రిప్లో ఉన్నారు.
22nd jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు
దావోస్: ఓ చిన్న మంచుగడ్డ గ్రీన్లాండ్ను అమెరికా కోరుకొంటోందని దావోస్లో ఆరంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) సదస్సులో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ ప్రాంత కీలక నైసర్గిక స్వరూపం నేపథ్యంలో ప్ర పంచ శాంతి కోసం, ప్రపంచ పరిరక్షణకు దీని ని అమెరికా కావాలనుకొంటోందని ట్రంప్ చె ప్పారు. దీనిని అమెరికాకు ఇవ్వాల్సిందే అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్లోని దావోస్ సమీపంలోని రిసార్ట్ సిటీలో గ్రీన్లాండ్పై ప్ర పంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఇతర దేశం కూడా అమెరికా కన్నా ఈ గ్రీన్లాండ్కు భద్రత కల్పించలేదు. ఇది నిజం. దీని ని ఎవరూ కాదనలేరని తేల్చిచెప్పారు. గ్రీన్లాండ్ను ఆశిస్తున్నాం. దీనిని తాము దక్కించుకోవల్సి ఉందన్నారు. అయినా గ్రీన్లాండ్ ఓ చిన్న కోరిక. ఇది మంచు తునక, ఐస్ లాండ్. దీనిని స్వాధీనపర్చుకునేందుకు తాము బలప్రయోగానికి దిగాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ప్రసంగం ఎక్కువగా గ్రీన్లాండ్ ప్రస్తావనతోనే సాగింది. గ్రీన్లాండ్ను కంట్రోలులోకి తీసుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపడం తెలివితక్కువ పని అవుతుంది. ఇదే సమయంలో గ్రీన్లాండ్ను అమెరికా వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ కైవసానికి తమ మార్గాలు తమకు ఉంటాయని పరోక్షంగా తెలిపారు. గ్రీన్లాండ్ ఐస్ ముక్కనే కావచ్చు. అయితే అది ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మక ఆయువుపట్టు. ఈ ప్రాంతం రక్షణ బాధ్యతను అమెరికానే జాగ్రత్తగా చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. గతంలోనే తెలివితక్కువతనంతోనే ఈ ప్రాంతాన్ని అమెరికా వదులకుంది. ఇందుకు కారణం ఎవరనేది ప్రస్తావించదల్చుకోలేదు. డెన్మార్క్ సొంతంగా గ్రీన్లాండ్ను రక్షించలేదు. డెన్మార్క్ బలహీనతలు డెన్మార్క్కు ఉండనే ఉన్నాయి. ఇక గ్రీన్లాండ్ను అమెరికా లీజుపై తీసుకుంటే ప్రయోజనం ఉండదు. లీజ్ పరిధిలో పూర్తి స్థాయి భద్రత కుదరదని తేల్చిచెప్పారు. ఈ ప్రాంతం చిన్న ఐస్పీస్ కావచ్చు. అయితే భౌగోళిక వ్యూహాత్మక దిశలో చూస్తే ఇది అమెరికాకు అవసరం అన్నారు. పైగా గ్రీన్లాండ్ ఉనికి పరిరక్షణ బాధ్యత అమెరికా చూసుకుంటుందన్నారు. గ్రీన్లాండ్కు డెన్మార్క్కు తరతరాలుగా అమెరికా ఇచ్చిన దానితో పోలిస్తే తాము కోరుకుఉంటున్నది తక్కువే అని ట్రంప్ అన్నారు. తమకు గ్రీన్లాండ్ కావల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెత్తనం ధోరణిని ఖండిస్తూ వస్తోన్న పలు ఐరోపా దేశాలకు ట్రంప్ ఈ వేదిక నుంచి ఘాటైన హెచ్చరికలు వెలువరించారు. గ్రీన్లాండ్పై అమెరికా వాదనను వ్యతిరేకించే వారిని తాము ఎప్పుడూ గుర్తుపెట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. అయితే సమ్మతించే వారిని, సమ్మతించని వారిని గుర్తు పెట్టుకుంటామని ఐరోపా దేశాలకు ట్రంప్ చురకలకు దిగారు. దారి తప్పిన ఐరోపా దేశాలు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) కీలక సమావేశాల ఆరంభంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల దశలో బుదవారం ఇక్కడ జరుగుతున్న ఐదు రోజుల సదస్సులో ఆయన తమ మిత్రదేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ సరిగ్గా తమ బాధ్యతలు నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. పలు ప్రపంచ సమస్యలు రగులుకుంటున్నాయి. అయితే వీటి విషయంలో ఐరోసా దేశాల స్పందన , కనబరుస్తున్న కార్యాచరణ సరిగ్గా లేదని విమర్శించారు. అక్రమ వలసలపై ఐరోపా దేశాల్లో సరైన నియంత్రణ లేదు. దీని పరిణామాలు అంతర్జాతీయంగా దుష్పలితాలకు దారితీస్తోంది. అత్యంత కీలకమైన నిర్మాణాత్మక పాత్ర వహించాల్సిన దేశాలు ఇప్పుడు చేతలుడిగి వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తమ హయాంలో అమెరికా అభివృద్ధి పథంలో దూసుకువెళ్లుతున్నదని, రెండేళ్ల క్రితం బలహీన ఆర్థిక వ్యవస్థ లక్షణాలున్న దేశం నిర్జీవ వ్యవస్థతో ఉన్న దేశం ఈ రెండో దఫా తమ అధికారం తొలి ఏడాదిలో తిరిగి బలోపేతం అయిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన తన మిత్రులకు , కొందరు శత్రువులకు కూడా తన శుభాకాంక్షలు అని తెలిపిన ట్రంప్ నిజాలు పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం యూరప్ దేశాల పతనానికి దారితీసిందన్నారు. ఇప్పుడు అపార వనరులున్న దేశాలకు కూడా చైనా తన ఉత్పత్తులు అంటగడుతోందని తెలిపారు. చాలాకాలంగా ఆర్థిక నష్టాల్లో ఉన్న అమెరికా ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తాము కొన్ని దేశాలపై విధించిన సుంకాలతో సత్ఫలితాలు దక్కుతున్నాయని ట్రంప్ చెప్పారు. తమ భారీ సుంకాలను ఈ ఆర్థిక సదస్సులో సమర్థించుకున్నారు. అమెరికా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ఇంజిన్ అయిందన్నారు. తాను ఎంతగానో ఇష్టపడే ఐరోపా దేశాల్లో కొన్నింటికి ఇప్పటికీ సరైన గుర్తింపు లేదని, ఇందుకు కారణం అవి కీలక విషయాలపై సవ్యమైన రీతిలో వ్యవహరించకపోవడమే అన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: అవినీతి నిరోదకశాఖకు ఇప్పటికే చిక్కిన హన్మకొండ జిల్లా అ దనపు కలెక్టర్ అర్ర మాడ వెంకట్ రెడ్డికి వంద కోట్లకు పైనే ఆస్తిపాస్తులు ఉన్నట్టు తాజాగా ని ర్వహించిన సోదాలలో బయటపడింది. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డి అవినీతి చిట్టా మరోసారి ఎసిబి ని ర్వహించిన సోదాలలో గుర్తించింది. బుధవా రం తెల్లవారుజామున హైదరాబాద్, రంగారె డ్డి, వరంగల్, నల్గొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లోని ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లల్లో ఎసిబి బృందాలు ఏకకాలంలో సోదా లు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఆయన ఆస్తుల విలు వ ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం వంద కోట్ల కు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎసిబి గుర్తించింది. రిజిస్ట్రేషన్ విలువ మేరకు ఎల్బీనగర్లో రూ.4.6 కోట్ల విలువ చేసే భవనం, ఒక ఖరీదైన విల్లాతో పాటు అదే ప్రాంతాల్లో రూ.60 లక్షల విలువ చేసే కమర్షియల్ షాప్, రూ.65 లక్షల చొప్పున విలువ చేసే ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, రూ.50 లక్షల విలువ చేసే 14.25 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్టు ఎసిబి గుర్తించింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటికి సంబంధించిన కీలక పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా వెంకట్ రెడ్డి ఇంట్లో, బ్యాంక్ లాకర్లలో లభించిన నగదు, బంగారం చూసి అధికారులు విస్తుపోయారు. రూ. 30 లక్షల నగదుతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ రూ.44 లక్షలుగా ఎసిబి గుర్తించింది. రూ.11 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.40 లక్షల విలువ చేసే వాహనాలు, రూ.4.35 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఎసిబి అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్తులన్నీ తన అధికార హోదాను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదిం చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, వెంకట్ రెడ్డి అవినీతి భాగోతం డిసెంబర్ 5న ఒక పాఠశాల రెన్యూవల్ కోసం లంచం అడగటంతో ఈ వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. రెన్యూవల్ ఫైల్ క్లియర్ చేయడానికి ఆయన రూ. 60 వేలు లంచం డిమాండ్ చేయగా అతన్ని ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వెంకట్రెడ్డి సస్పెండ్ కాగా. ప్రస్తుతం ఎసిబి అధికారులు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఇతర బినామీ ఆస్తులు, పెట్టుబడులపై దృష్టి సారించింది. నల్గొండ జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో కూడా వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు సమాచారం. ఇలా ఉండగా ఈ అక్రమార్జనలో ఇతర అధికారుల పాత్రపై కూడా విచారణ జరుపనున్నట్టు ఎసిబి వర్గాల సమాచారం. ఎసిబి కేసు నమోదు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డిపై ఎసిబి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. వెంకట్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం 1988 (సవరణ 2018) సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం లో జగిత్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.సంజయ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మం త్రి టి.జీవన్ రెడ్డికి చిర్రెత్తింది. మన పార్టీ సమావేశానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా హాజరవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చే స్తూ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇదంతా బుధవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం గాంధీ భవన్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పార్టీ ముఖ్య నేతల సమావేశం మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేకూడా హాజరుకావడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ సమావేశంలో ఉండడం వల్ల తాను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వచ్చేశారు. దీంతో అందరూ అవాక్కైయ్యారు. అయినప్పటికీ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మహేష్ కుమార్గౌడ్ ఆయనకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా వినిపించుకోకుండా ఆగ్రహంతో బయటకు వచ్చారు. అనంతరం జీవన్ రెడ్డి గాంధీ భవన్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఎలా కూర్చోపెడతారని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇటీవల స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టిన సమయంలోనూ తాను పార్టీ మారలేదనీ, బిఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని స్పీకర్కు అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన ఉదహరించారు. పదేళ్ళు బిఆర్ఎస్ అఘాయిత్యాలపై తాము పోరాటం చేస్తే, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పక్కన కూర్చోపెట్టుకోవాలా? అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. తాను చెబుతున్న అభిప్రాయమే లక్షలాది మంది పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితున్ని అయి కాంగ్రెస్లో చేరుతున్నానని చెప్పిన వ్యక్తి, మళ్లీ తాను పార్టీ మారలేదని, బిఆర్ఎస్లోనే ఉన్నానని అఫిడవిట్ ఇచ్చారని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తాను ఇటీవల పిసిసి అధ్యక్షునికి చెప్పినా ప్రయోజనం కనిపించలేదన్నారు. ఆవేదనను అర్థం చేసుకున్నాః మహేష్కుమార్ ఇదిలాఉండగా సమావేశం ముగిసిన అనంతరం జీవన్ రెడ్డి వాకౌట గురించి మీడియా ప్రతినిధులు పిసిసి చీఫ్ మహేష్కుమార్ గౌడ్ను ప్రశ్నించగా, ఈ విషయంలో ఇప్పుడు తాను ఏమీ మాట్లాడనని, పార్టీయే సుప్రీం అని అన్నారు. జీవన్ రెడ్డి ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని ఆయన చెప్పారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోండిః మంత్రి ఇదిలాఉండగా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలను పార్టీలో ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తక్కువ స్థానాల్లోనే గెలుపొందామని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామన్నారు. కాబట్టి ఇదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపించాలని ఆయన సూచించారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించుకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టిందని, వీటని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ్ర పజలు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరింత ఉధృతంగా ఉద్యమించండి.. జూమ్ మీటింగ్లో మీనాక్షి, మహేష్ ఇదిలాఉండగా బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పార్టీ అధ్యక్షుడు బి. మహేష్కుమార్ గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షులతో, ఇతర ముఖ్య నాయకులతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని మీనాక్షి, మహేష్కుమార్ గౌడ్ సూచించారు. యుపిఏ హయాంలో చేపట్టిన ఈ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని వారు విమర్శించారు.
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేరళతోపాటు త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో బలా న్ని పెంచుకుంటామని సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తెలిపారు. ఖమ్మం నగరంలో నాలుగు రోజులుగా జరుగుతున్న సిపిఐ శతాబ్ది ఉత్సహాల్లో భాగంగా బుధవారం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. సమావేశం అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ.. కేరళను కాపాడుకోవడంతోపాటు త్వరలో ఎన్నికలు జరగనున్న మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కలిసివచ్చే శక్తులతో బలా న్ని పెంచుకుంటామన్నారు. దేశంలో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని సమైక్య పోరా టం చేస్తామన్నారు. సంఘ్ పరివార్ శక్తులు కులా న్ని, మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయని వీటికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. సనాతన ధ ర్మం, మహిళలపట్ల వివక్ష కొనసాగుతుందన్నారు. మతతత్వ శక్తుల కారణంగా దేశంలో లౌకికవా దం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయన్నారు. విద్యారంగంలోనూ మతాన్ని చొప్పిస్తున్నారని, వి ద్యా వ్యవస్థను వ్యాపారమయంగా మార్చారని రా జా వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకాన్ని పో రాడి సాధించుకుంటే దానిని రద్దు చేసేందుకు బిజె పి కుట్ర చేస్తుందని, ఇందుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తూ సమ్మె జయప్రదానికి కృషి చేస్తుందన్నారు. భారతదేశాన్ని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోడీ చెబుతున్నారని, కానీ దేశంలో నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, ఆశ్రిత పెట్టుబడిదారి విధానంతో దేశం విచ్ఛిన్నం దిశగా ప్రయత్నిస్తుందని రాజా అన్నారు. అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ శక్తులు శ్రామిక జనులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. మోడీకి ఈ దేశంలో రైతులు, కార్మికుల గురించి పట్టదని, ఆయన ప్రేమంతా సంపన్న వర్గాలపైనేనని దుయ్యబట్టారు. ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తున్నా కనీసం ఖండించలేని స్థితిలో భారత ప్రధాని మోడీ ఉన్నారన్నారు. ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తూ అత్యంత ప్రమాదకారిగా మారుతున్నారని ఈ సమయంలో వెనెజువెలాకు తాము మద్దతుగా నిలుస్తున్నామన్నారు. వెనెజువెలాపై దాడి కేవలం ఆయిల్ సంపద కోసమేనని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని భారత్ పై ఒత్తిడి తీసుకు వస్తున్నా మోడీ స్పందించడం లేదని నోరు మెదిపే సాహసం కూడా చేయలేకపోతున్నారని రాజా ఆరోపించారు. పాలస్తీనా, వెనెజువెలాకు అంతర్జాతీయ మద్దతు పెరుగుతుందన్నారు.పార్లమెంటును నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారని బిజెపి పాలన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో సాగుతుందని ఆయన తెలిపారు. గవర్నర్ల వ్యవస్థను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు స్థానిక ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ శాసించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగం నిర్వీర్యం అవుతుందని ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్పరం చేస్తున్నారని ఇటువంటి సమయంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్పోర్టులు, ఓడరేవులు, అగ్రికల్చర్, ఎలసి, అణు విద్యుత్ కేంద్రాలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని రాజా తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఖమ్మం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయని పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. ఈ ఉత్సవాలకు వేదికగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం అంటే త్యాగాలు, పోరాటాలేనని ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు, పోరాటాలకు సమాయత్తం అవుతామని రాజా తెలిపారు. విలేఖర్ల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పాండా, పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరోపించారు. ఎన్నికల ముందు స్కీములు అంటూ ప్రజలను మభ్యపెట్టి, అ ధికారంలోకి వచ్చాక స్కాములకే కాంగ్రెస్ పాల న పరిమితమైందని విమర్శించారు. కోల్ బెల్ట్ నుంచి వచ్చిన ప్రజలు ఈ మోసాన్ని తప్పక గు ర్తించాలని, సింగరేణి అంశమే కాంగ్రెస్ అసలుస్వరూపాన్ని బయటపెడుతోందని స్పష్టం చేశా రు. ఈ అంశంపైన మెత్తం మంత్రులు తేలు కు ట్టిన దొంగళ్ల కనీసం మాట్లాడం లేదని కెటిఅర్ అరోపించారు. ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయాడన్నారు. ఈ స్కాం బయటపడగానే కో మటిరెడ్డి, భట్టి విక్రమార్క ఒకరిని మించి ఒక రు నటించారని, అయితే వారీ మాటల మోసా లు స్కాంను దాచి ఉంచలేవన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మంచిర్యాల జిల్లా అధ్యక్షు డు బాల్క సుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ రా జిరెడ్డి, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కెటిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో స్కీములు మాయమై స్కాములు మాత్రమే మిగిలాయని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని, నిజాలు బయటకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ భారీ స్కామ్ బయటపడిందని కెటిఅర్ తెలిపారు. కేసీఆర్ పాలనలో నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తీసుకువచ్చామని, కార్మికులకు ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు అమలు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చాక కొత్త నిబంధనల పేరుతో సింగరేణిని దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధన తీసుకువచ్చి టెండర్లను కట్టడి చేసిందని విమర్శించారు. గతంలో దేశంలో ఎక్కడున్న కాంట్రాక్టర్ అయినా ఈ-టెండర్ ద్వారా పోటీ పడే అవకాశం ఉండగా ఇప్పుడు తప్పనిసరిగా సైట్కు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందేనని చెప్పి అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు. దీని ద్వారా ఎవరు టెండర్ వేయాలి, ఎవరు వేయకూడదో ముందే నిర్ణయించే వ్యవస్థ ఏర్పడిందన్నారు. ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి బంధువుల పాత్రపై కెటిఅర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి పెద్ద కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీకే దక్కిందని, రూ.250 కోట్ల కాంట్రాక్ట్ అందుకున్నారని ఆరోపించారు. గతంలో మైనస్లో పోయే టెండర్లు ఇప్పుడు వేల కోట్ల విలువైన డీల్స్గా మారాయని, ఒక్కో టెండర్ను వాటాలు వేసుకుని మరీ పంచుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్ కాంగ్రెస్ నేతలే వాటాల కోసం పరస్పరం కొట్టుకోవడం వల్లే బయటకొచ్చిందని తెలిపారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ వాటాల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి మధ్య విభేదాలు బయటపడ్డాయని, ఒకరిపై ఒకరు మీడియా ద్వారా ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించగానే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు దిగిందని ఆరోపించారు. సింగరేణి స్కామ్పై సమాధానం చెప్పాల్సిన బదులు, ఫోన్ ట్యాపింగ్ అంటూ పాత సీరియల్లా కేసులు లాగుతున్నారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో మళ్లీ క్షీణించిన గాలి నాణ్యత
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించాయి. గతంకంటే గాలి నాణ్యతలు కొంత మెరుగుపడినప్పటికీ.. ఎక్యూఐ స్థాయిలు వెరీపూర్ కేటగిరీలోనే కొనసాగతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఎక్యూఐ …
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ హైకి చేరుకున్నాయి. గ్రీన్లాండ్ సంక్షోభం కారణంగా ఉద్రిక్తతలు పెరగ్గా, డాలర్ బలహీనపడుతుండడం వల్ల బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. బుధవారం ఎంసిఎక్స్ గోల్డ్ ధర 10 గ్రాములు ఏకంగా 7,774 పెరిగి రూ.1,58,339 కి చేరుకుంది. మంగళవారం రోజు ఇది రూ.150,565 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.3,34,840 కి చేరుకోగా, క్రితం రోజు ఇది రూ.3,23,672 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 4,800 డాలర్ల కీలక మార్క్ దాటింది. ఔన్స్ వెండి ధర 95.87 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ అంశంపై యూరోపియన్ దేశాలను బెదిరించడం వల్ల వాణిజ్య యుద్ధ భయం పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.91.70కి పడిపోవడంతో దేశీయంగా బంగారం ఖరీదైంది. అలాగే ఆర్బిఐ సహా ప్రపంచ కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. డాక్టర్ రెనిషా ప్రకారం, ఉద్రిక్తతలు పెరిగితే 2026లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.90 లక్షలకు చేరవచ్చు.
` ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.91.74కు పతనం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. …
రాష్ట్ర అభివద్ధికి కోసం చిత్తశుద్ధితో కషి చేస్తున్నాం
` విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ` తెలంగాణలో వైద్యవిద్యకు పెద్దపీట ` అన్ని వర్గాల సంక్షేమమే మా లక్ష్యం ` డిప్యూటి సిఎం …
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు
` జాగతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారనందునే ఈ నిర్ణయం ` కానీ మద్దతు కోరినా ఇస్తాం ` ఫోన్ ట్యాపింగ్ తుదిదశకు చేరుతుందన్న నమ్మకం …
సస్పెండైన అదనపు కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు..
` భారీగా అక్రమాస్తులు గుర్తించిన అధికారులు హనుమకొండ(జనంసాక్షి): సస్పెన్షన్లో ఉన్న హనుమకొండ అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకట్రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో అవినీతి నిరోధక …
సింగరేణిపై విచారణ జరిపించమంటారా?
` బీఆరఎస్కు మంత్రి పొన్నం సవాల్ ` కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణిపై బీఆరఎస్ నేతలు దుష్పచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. …
` వరల్డ్ ఎననామిక్ ఫోరంకు ఫాలోఅప్ సదస్సు ఉండాలి ` అది ప్రతి యేటా హైదరాబాద్లో నిర్వహించాలి ` ప్రపంచ ఆర్థిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి …
గురువారం రాశి ఫలాలు (22-01-2026)
మేషం కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభం పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. మిథునం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. శ్రమపడ్డ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటకం పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పొందుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సింహం కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఏర్పడిన అవంతరాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్థానమార్పులు. సోదరుల నుండి స్వల్ప లాభాలు పొందుతారు. కన్య దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. కార్యజయం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. తుల వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృశ్చికం వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థులు ఒక ప్రణాళికతో ముందుకు సాగుతారు. ధనుస్సు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వాహనాలు నడిపే విషయాల్లో చాలా జాగ్రత్తగా వుండాలి. మకరం బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం. జీవిత భాగస్వామి తరపు వారి నుండి అనవసరపు నిందారోపణలు. కుంభం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు. మీనం కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్తో కలిసి పాల్గొన్న మెగాస్టార్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు -2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్లోని జూరిచ్లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయనను సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి మన శంకరవరప్రసాద్ గారు సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవితో పంచుకున్నారు. చిరంజీవి కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్కు వెళ్లిన సమయంలోనే ఈ ఆహ్లాదకరమైన సమావేశం, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం చోటుచేసుకుంది.
మాయివోస్టు పార్టీలో మిగిలింది 17 మంది నేతలే
రాష్ట్రం నుండి మావోయిస్టు పార్టీలో మరో 17 మంది కీలక వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారని, వారంతా దేశ వ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది. గతేడాది 576 మంది వివిధ క్యాడర్లలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ శాఖ తెలిపింది. మిగిలిన 17 మంది పై సుమారు కోటికి పైగా రివార్డు ఉన్నట్లు చెప్పింది. రివార్డు వివరాలు పోలీస్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ్ , సిసిఎం జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ లపై- రూ.25 లక్ష-ల చొప్పున రివార్డు ఉందన్నారు. ఇఆర్బి సభ్యులు పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, డివిజనల్ కార్యదర్శి ముప్పిడి సాంబయ్య, డికెఎస్జెడ్సి సభ్యుడు, కమ్యూనికేషన్ వింగ్ ఇంచార్జ్ వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, కేంద్ర కమిటీ సభ్యురాలు, డికెఎస్జెడ్సి ఇంచార్జ్ జోడే రత్నబాయి అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్ రావు అలియాస్ ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, సైనిక వ్యవహారాల ఇంచార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ -లపై రూ.20 లక్షలు చొప్పున రివార్డు ఉన్నట్లు చెప్పారు. డిసిఎం స్థాయి కేడర్లు నక్కా సుశీల అలియాస్ రేలా, జాడి పుష్ప అలియాస్ రాజేశ్వరి ల-పై రూ.5 లక్షల చొప్పున, ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ సభ్యులు రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, బాదిషా ఉంగ అలియాస్ మంతు ఏరియా, మడివి అడుమె అలియాస్ సంగీత, కాశపోగు భవాని అలియాస్ సుగుణ, కుంజం ఇడమల్ -లపై నాలుగు లక్షల చొప్పున, పార్టీ సభ్యుడు, కంప్యూటర్ ఆపరేటర్ ఉతిమి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ పై లక్ష రూపాయాల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. -
తల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడి దుర్మరణం
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక చిన్నారి విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తల్లితో కలిసి స్కూటీపై స్కూలుకు వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆర్మీ వాహనం కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన నీలాంగ్ తమాంగ్ (32) తన కుమారుడు నిజేన్ తమాంగ్ (8) ను స్కూటీపై ఆర్కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్కు తీసుకెళ్తోంది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వారు ఆఫీసర్స్ కాలనీ రోడ్డుపై ఆర్మీ వాహనం పక్కగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు స్కూటీ స్కిడ్ అయింది. దీంతో తల్లి, కుమారుడు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఆర్మీ అశోక్ లేలాండ్ వాహన డ్రైవర్ ఈ విషయాన్ని గమనించే లోపే కింద పడిన నిజేన్ తమాంగ్ పైనుంచి ముందు చక్రం దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో నీలాంగ్ తమాంగ్కు కూడా గాయాలు కాగా, ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నేరేడ్మెట్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తాత (నీలాంగ్ మామ) రాజు తపా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్మీ వాహనం అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు వెళ్లే సమయంలో మహిళలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అజాగ్రత్త అనాలోచిత నిర్ణయాల వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందని రోడ్డుపై వాహనాలతో వచ్చేవారు పూర్తి జాగ్రత్తతో మసులుకోవడం అత్యంత అవసరమని పలు సిసి కెమెరాల పుటేజీలు తెలుపుతున్నాయి. విద్యాలయాలకు వెళ్లే వచ్చే సమయాలలో భారీ వాహనాలను స్కూల్లో ప్రాంగణాలలో అనుమతించకపోవడం అమల్లో ఉన్నప్పటికీ ప్రమాదం జరగడం అత్యంత విచారకరమని పలువురు భావిస్తున్నారు.
న్యూజిలాండ్తో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 4 ఫోర్లతో 78 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. మార్క్ చాప్మన్ (39), డారిల్ మిఛెల్ (28), కెప్టెన్ సాంట్నర్ (20) పరుగులు చేశారు. అభిషేక్ జోరు.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అండగా నిలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ స్కోరును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ (8) కూడా నిరాశ పరిచాడు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి అభిషేక్ జోరును కొనసాగించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సూర్యకుమార్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అలరించాడు. అద్భుత బ్యాటింగ్ను కనబరిచిన సూర్యకుమార్ 4 ఫోర్లు, ఒక సిక్స్తో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే సమయంలో మూడో వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 35 బంతుల్లోనే 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య 16 బంతుల్లోనే 25 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. మరోవైపు చివర్లో రింకు సింగ్ వీరవిహారం చేశాడు. కివీస్ బౌలర్లపై విరుచుకు పడిన రింకు 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 44 పరుగులు చేశాడు.
వికలాంగురాలైన కూతురిని చంపి కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం
ఆర్థిక ఇబ్బందులతో వికలాంగులైన కూతుర్ని చంపి వారు ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తో మనస్థాపానికి గురైన కుటుంబ సభ్యులు పుట్టుకతో వికలాంగురాలైన కూతురు జావళి (18)ను రెండు రోజుల క్రితం హత్య చేశారు. కూతురు మరణించిన తర్వాత రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహంతో గడిపిన కుటుంబీకులు సతీష్ కుమార్, భార్య ,కొడుకు నితిన్ కుమార్ .ఈ రోజు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా విషయాన్ని కుమారుడు నితిన్ తన స్నేహితునికి సమాచారాన్ని తెలియజేశారు. సమాచారం మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిగితా వారిని చికిత్స నిమిత్తం కూకట్ పల్లి రాందేవ్ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులేనా మరి ఏమైనా సమస్యల అనే కోణంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగద్గిరిగుట్ట సీఐ వెంకటేశం తెలిపారు.
అంతరిక్షం నుంచి చూస్తే ఈ గొడవలు చాలా చిన్న విషయాలే : సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న సునీతా విలియమ్స్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తొలి అంతరిక్ష యాత్రలో భూమిపై భారత దేశాన్ని, స్లోవేనియాను చూశానని తెలిపారు. స్పేస్ లోకి వెళ్లిన వెంటనే తన తల్లిదండ్రుల దేశాలు ఎక్కడ ఉన్నాయని ఆత్రుతగా గమనించానని చెప్పారు. సునీతా తండ్రి గుజరాత్ లోని ఝలసన్ గ్రామానికి చెందినవారు కాగా, తల్లి స్లోవేనియన్ అమెరికన్ మహిళ. అందుకే మొదట ఈ ప్రదేశాల గురించే వెతికాను. చివరకు భూమి అంతా ఒకటే అని తెలుస్తుందన్నారు.అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై జీవితంపై అవగాహన మారుతుందని, చిన్న విషయాలపై ఎందుకు వాదించుకుంటామో ఈ గొడవలు చాలా చిన్న విషయాలు కదా అనిపిస్తుందని, ఆమె అన్నారు. వ్యక్తుల మధ్య విభేదాలపై మన అభిప్రాయం మారుస్తుంది. మనమంతా ఒక్కటే కదా, కలిసి మెలసి పనిచేయాలనే భావనను కలిగిస్తుంది. అని ఆమె అన్నారు.
దయచేసి నన్ను క్షమించండి..మరోసారి ఇలాంటి తప్పు చేయను: నటి టీనా శ్రావ్య
నటి టీనా శ్రావ్య మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు మొక్కు చెల్లించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై ఆమె స్పందిస్తూ క్షమాపణలు కూడా చెప్పారు.కమిటీ కుర్రోళ్లు', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి టీనా శ్రావ్య, ఇటీవల మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తన పెంపుడు కుక్కను త్రాసులో ఒకవైపు కూర్చోబెట్టి, దానికి సమానమైన బరువుతో బెల్లాన్ని (బంగారం) మొక్కుగా చెల్లించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది.ఈ వివాదంపై శ్రావ్య స్పందించారు. తాను ఎవరినీ కించపరచాలని అలా చేయలేదని, మరోసారి ఇలాంటి తప్పు చేయనంటూ క్షమాపణలు తెలిపారు.మేడారం జాతర అత్యంత పవిత్రమైన గిరిజన పండుగ అని, అక్కడ జంతువులతో ఇలాంటి తులాభారం నిర్వహించడం ఆచారాలను కించపరచడమేనని భక్తులు మరియు నెటిజన్లు మండిపడ్డారు.ఆదివాసీల సంప్రదాయాలను గౌరవించాలని, ప్రచార పిచ్చితో ఇలాంటి పనులు చేయవద్దని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
25న సామాజిక న్యాయం రాజ్యాంగ సూర్తిపై వ్యాసరచన పోటీలు
విశాలాంధ్ర`విజయవాడ: 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్సహావంతులైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు” సామాజిక న్యాయం- రాజ్యాంగ స్ఫూర్తి” అనే అంశంపై శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం లో గాంధీ నగరం విజయవాడ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయం కమిటీ అధ్యక్షుడు దోనేపూడి శంకర్, కార్యదర్శి గడ్డం సత్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయం రూ 7వేలు, తృతీయ రూ 5వేలు నగదు […] The post 25న సామాజిక న్యాయం రాజ్యాంగ సూర్తిపై వ్యాసరచన పోటీలు appeared first on Visalaandhra .
పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొవాలి
చదువులో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద సివిఆర్ హైస్కూల్ను తనిఖీ చేసిన కలెక్టర్ జి. లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: రానున్న నెల రోజులు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా ఎదురుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పరీక్ష ఫలితాలలో పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు పెట్టుకున్న సమ్మకాన్ని రెట్టింపు చేసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని, జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ సూచించారు.విద్య సంవత్సరం ముగిసి పరీక్షలు నిర్వహించే సమయం మొదలవుతున్న […] The post పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొవాలి appeared first on Visalaandhra .
.–ప్రజలను చైత్యవంతులను చేసేలా శకటాల ప్రదర్శన The post గణతంత్ర వేడుకలకు సిద్ధంకండి appeared first on Visalaandhra .
అటల్ పెన్షన్ యోజన మరో ఐదేండ్లు
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అటల్ పెన్షన్ యోజన (ఎపివై) 2030-31 వరకూ కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలిలో కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశం తరువాత అధికారిక ప్రకటన వెలువరించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరిట ఈ పథకాన్ని 2015 మే 9వ తేదీన ప్రారంభించారు. దీని పరిధిలో ఇప్పటికే 8.66 కోట్లకు పైగా లబ్ధిదారులను చేర్చారు. పథకం 2030 -31 ఆర్థిక సంవత్సరం వరకూ అమలులోకి ఉంటుంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు వయోవృద్ధ ఆదాయ భద్రతను కల్పించే ఉద్ధేశంతో ఈ పథకం తీసుకువచ్చారు. ఈ పథకానికి మరింత ప్రోత్సాహక నిధులు, కేటాయించడం జరుగుతుంది. అసంఘటిత కార్మికుల్లో మరింత ఎక్కువ మందికి ఈ సౌకర్యం కలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ పథకం పరిధిలో కాంట్రిబ్యూషన్ ప్రాతిపదికన రూ 1000 నుంచి రూ 5000 వరకూ కనీస పింఛన్ కార్మికులకు వారి వృద్ధాప్యదశలో అందుతుంది. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత సిడ్బి బ్యాంక్కు రూ 5000 కోట్ల మేర ఈక్విటి సపోర్టు కల్పించే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని ఈ స్మాల్ ఇండిస్ట్రిస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అందించడం జరుగుతుంది. దీని వల్ల ఈ బ్యాంక్కు అదనపు పెట్టుబడి సమకూరుతుంది. ఈక్విటి సపోర్టుతో ఇకపై ఈ బ్యాంకు ద్వారా సముచిత వడ్డీరేట్లకు వీలేర్పడుతుంది. సూక్ష్మ, చిన్నతరహా , మధ్యస్థ పరిశ్రములు (ఎంఎస్ఎంఇ)లకు రుణాల కల్పన సెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈక్విటి కల్పన పెంచడం వల్ల కోటికి పైగా ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుంది. 2027 28 ఆర్థిక సంవత్సరం చివరికి 25 లక్షలకు పైగా కొత్త ఎంఎస్ఎంఇ లబ్ధిదారులు చేరుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.
Power Star |బాబాయ్ –అబ్బాయ్ కాంబో మూవీ..?
Power Star | బాబాయ్ – అబ్బాయ్ కాంబో మూవీ..? Power Star
సికింద్రాబాద్ జిల్లా అడిగితే అరెస్ట్ చేయించారు: కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో అణచివేసిన బీఆర్ఎస్ అణచివేసిందని, ఇప్పుడు ఆ జిల్లా కావాలని కేటీఆరే అడగటం విచిత్రంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఈ సమయంలో జిల్లాల పునర్విభజన అనేది సాధ్యంకాదన్న కవిత భవిష్యత్ లో ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ ను జిల్లాగా చేయాల్సిందేనన్నారు. బీసీ కులాల పేర్లు, ఉపకులాలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చేయాల్సిన అధ్యయనాన్ని తామే చేస్తున్నామని, గుంపు మేస్త్రీపై నమ్మకం లేకనే ఈ పని చేస్తున్నామని కవిత తెలిపారు. బుధవారం తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జాగృతి ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా మారలేదన్నారు. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో తమ మద్దతు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరు కోరినా ఇస్తామని కవిత వెల్లడించారు.రాజకీయాల్లోకి రావాలనుకునేవారంతా మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత, మహిళలు,బీసీలు, ఎస్సీలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత స్పందించారు. ఈ కేసు తుది దశకు చేరుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని వాపోయారు. ఇక ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలని, వాటితోపాటు ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని కూడా పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేశారన్నారు. అలాంటి ఉద్యమ నేతలెందరికో గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. జాగృతి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వస్తే శ్రీకాంతాచారి జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహిస్తామని కవిత వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనలో బీసీల సంఖ్యను తక్కువగా చూపి ప్రజలను మోసం చేసిందని కవిత ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం చేపట్టనున్న కులగణనద్వారా ఆ మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని, అందుకోసం జాగృతి ముందడుగు వేస్తోందని, బీసీ మేధావులంతా జాగృతితో కలిసిరావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కావాలనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చారని కవిత ఆరోపించారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారని, విచారణతో జరిగేదేమీ ఉండదన్నారు. మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో జరుగుతాయి కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామా ఆడుతున్నారన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామంటున్న బీఆర్ఎస్ బీసీల కోసం ఎందుకు గొంతెత్తి ప్రశ్నించడం లేదని నిలదీశారు. అధికార కాంగ్రెస్ అయితే బీసీలకు న్యాయం చేయాలన్న విషయాన్ని గురించే ఆలోచించడం లేదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసే బీసీలను మోసం చేస్తున్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు.
నన్ను హత్య చేస్తే ..ఇరాన్ మిగలదు: ట్రంప్ వార్నింగ్
ఇరాన్ తనను హత్యచేస్తే , అమెరికా ఏకంగా మొత్తం ఇరాన్నే తుడిచిపెట్టేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుత దశలో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ దశలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ న్యూనేషన్స్ కేటి పావ్లిచ్కు ఇంటర్వూ ఇచ్చారు. తనకు ఇరాన్ ఎటువంటి హాని తలపెట్టినా , ఇకపై ఇరాన్ అనేది ఈ భూమిపై ఉండకుండా పోతుందని ట్రంప్ మంగళవారం ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ఇరాన్ను శిక్షించేందుకు అవసరం అయిన ఆదేశాలను తాను ప్రెసిడెంట్గా ఇప్పటికే ఇచ్చినట్లు వివరించారు. ఖమేనీ, అమెరికా ప్రెసిడెంట్ మధ్య పరస్పర ఘాటు హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇరాన్ అశాంతికి ట్రంప్ కారణం అని ఇటీవల ఖమేనీ విమర్శించారు. కాగా తమ దేశ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీపై ఎటువంటి చర్య తీసకుకున్నా ఊరుకునేది లేదని ఇరాన్ హెచ్చరించింది. తమ నేతపై ఎటువంటి దాడికి దిగే చేతిని అయినా తాము నరికివేయడమే కాకుండా, అటువంటి వారి ప్రపంచాన్ని పూర్తిగా తగులబెడుతామని ఇరాన్ సాయుధ బలగాల అధికార ప్రతినిధి అబోల్ఫజల్ షెకర్చి హెచ్చరించారు. అంతకు ముందు ఖమేనీ పాలన ముగియాలని, అప్పుడే ఇరాన్కు శాంతి అని ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఇంటర్వూలో ట్రంప్ తీవ్రస్థాయి వ్యాఖ్యలు వెలువడ్డాయి.
A Huge Relief for Sithara Entertainments
Young producer S Naga Vamsi was not satisfied with the performance of his films that released in 2025. The year ended up on a disastrous note because of Kingdom and Mass Jathara. For War 2, Naga Vamsi was brutally trolled. 2025 started on a decent note with NBK’s Daaku Maharaj but the year was quite […] The post A Huge Relief for Sithara Entertainments appeared first on Telugu360 .
విదర్భా క్రికెట్ అసోసియేషన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టి20లో భారత్ బ్యాటింగ్ ముగిసింది.భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పొయి 238 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి న బ్యాటింగ్కి దిగిన భారత్కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగుల వద్ద సంజూశాంసన్ (10) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఇషాన్ కిషన్(8) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు.అభిషేక్ శర్మ(84: 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్ లు) విధ్వంసం సృష్టించాడు. సూర్య కుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25), రింకు సింగ్ (44) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 2, కైల్ జేమీసన్ 2, శాంట్నర్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు.
Top Tamil directors looking towards Telugu Cinema
Some of the top Tamil directors are now interested and keen to do Telugu films and work with top Tollywood actors. Here is the list: Atlee: After scoring a massive blockbuster like Jawan, Atlee is directing Allu Arjun and the film is in shooting mode. The film releases in summer 2027. Nelson: Jailer is one […] The post Top Tamil directors looking towards Telugu Cinema appeared first on Telugu360 .
సింగరేణి కాంట్రాక్టులు బిఆర్ఎస్ హయాం నాటివే..!: మహేష్కుమార్ గౌడ్
file name: fnzb1 గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బుదవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సింగరేణి కాలరీస్లో కాంట్రాక్ట్ విషయంలో సృజన్రెడ్డికి లబ్ధి చేకూరుస్తున్నారంటూ కేటీఆర్, హరీష్రావు చేస్తున్న ఆరోపణలు ‘పసలేనివి‘ కొట్టిపారేశారు. సృజన్రెడ్డికి దక్కిన కాంట్రాక్టులన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినవని, కాంగ్రెస్ ఇచ్చినవి కావని స్పష్టం చేశారు. సృజన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బంధువు కావచ్చు, కానీ నిబంధనల ప్రకారమే ఆయనకు గతంలో టెండర్లు దక్కాయని తెలిపారు. కేవలం బంధువు అయినంత మాత్రాన కాంట్రాక్టులు చేయకూడదనే నిబంధన ఎక్కడా లేదని అన్నారు. ‘మీ దగ్గర నిజాలుంటే చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా కాంగ్రెస్ మీద బురదజల్లి పారిపోవాలని చూడకండి‘ అని సవాల్ విసిరారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఒక భయంకర నేరం. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. కేవలం రాజకీయ నాయకులవే కాకుండా, బడా వ్యాపారవేత్తలు, సినీనటుల వ్యక్తిగత విషయాల్లోకి కూడా దూర్చి వారిని బెదిరించారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సైతం నమ్మకుండా వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన ఘనత బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. ఈ నేరంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తెలంగాణను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి, రాష్ట్రాన్ని దోపిడీకి గురిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖల్లో పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చామని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల లబ్ధి కోసం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఖాయం.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డిలు కేవలం దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘దేవుడి పేరు, శ్రీరాముని నామం స్మరించకుండా దమ్ముంటే ఎన్నికల బరిలోకి రావాలి. కేవలం అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడిగితే వీరికి పదివేల ఓట్లు కూడా రావు‘ అని సవాల్ విసిరారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన జిల్లాకు స్మార్ట్ సిటీని తెచ్చుకున్నారు. నిజామాబాద్ కంటే తక్కువ జనాభా, ఆలస్యంగా మున్సిపాలిటీ అయిన కరీంనగర్ స్మార్ట్సిటీగా రూపుదిద్దుకుంటుంటే.. అరవింద్ ఎందుకు స్మార్ట్ సిటీని తీసుకురలేకపోతున్నారని ప్రశ్నించారు. రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్ ఈ జిల్లాకు ఏం తెచ్చారు?‘ అని సూటిగా ప్రశ్నించారు. నిజామాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ప్రస్తుతం అనుభవిస్తున్న స్థాయి, హోదా అంతా కాంగ్రెస్ పెట్టిన బిక్షేనని, విమర్శలు చేసే ముందు తన గతాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తన పుట్టుపూర్వోత్తరాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డి. శ్రీనివాస్ కాంగ్రెస్లో ఉండబట్టే మీ కుటుంబానికి ఈ ఆర్థిక స్థితిగతులు, గౌరవం దక్కాయి. మీ తండ్రి కాంగ్రెస్లో లేకపోతే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండేవారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, తాహిర్ బిన్ హందాని,గడుగు గంగాధర్, శేఖర్ గౌడ్,రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Amazon mounting Pressure on Vijay’s Jana Nayagan
Vijay’s last film Jana Nayagan is yet to clear the censor formalities and the makers are yet to get a clarity on when the film will release. The Madras High Court has reserved the order but the date was not announced. The officials of the CBFC have sought 20 more days for the Revision Committee […] The post Amazon mounting Pressure on Vijay’s Jana Nayagan appeared first on Telugu360 .
10% Cashback |మీ రోజువారీ ఖర్చులకు సరిపోయే రివార్డ్లు!
10% Cashback ఫోన్పే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లో కొత్త దిశరోజువారీ ఖర్చులపై క్యాష్బ్యాక్:
ఆగి ఉన్న ఓలా EV స్కూటర్లో ఆకస్మిక మంటలు #Maharashtra #Solapur #OlaElectric #FireAccident #EV
ఆర్గానిక్స్ మంత్ర ఎప్సమ్ సాల్ట్ రివ్యూ.. ఒళ్లు నొప్పులకు చెక్
కండరాల నొప్పులు, కాళ్ల వాపులకు ఆర్గానిక్స్ మంత్ర ఎప్సమ్ సాల్ట్ (Organix Mantra Epsom Salt) ఒక అద్భుతమైన పరిష్కారం. వేలాది మంది భారతీయులు నమ్ముతున్న ఈ ప్రోడక్ట్ నిజంగా అంత ప్రభావవంతంగా పనిచేస్తుందా? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా వాడాలో ఈ రివ్యూలో వివరంగా తెలుసుకుందాం. ఎప్సమ్ సాల్ట్ అంటే ఏమిటి? చాలామంది ఎప్సమ్ సాల్ట్ అనగానే మనం రోజూ తినే ఉప్పు అనుకుంటారు. కానీ ఇది పూర్తి భిన్నమైనది. ఇది మెగ్నీషియం సల్ఫేట్ […] The post ఆర్గానిక్స్ మంత్ర ఎప్సమ్ సాల్ట్ రివ్యూ.. ఒళ్లు నొప్పులకు చెక్ appeared first on Dear Urban .
మంత్రుల మధ్య వాటాల పంపిణీలో తేడాలు .. వెలుగులోకి సింగరేణి కుంభకోణం
“మంత్రుల మధ్య వాటాల పంపిణీలో తేడాలు రావడంతోనే సింగరేణి కుంభకోణం వెలుగులోకి వచ్చింది..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి, కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణ అక్రమాలపై అనేక ఆరోపణలు వచ్చినందున సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తుందని ఆయన తెలిపారు. గతంలో బిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతులా వాడుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. కోల్ బ్లాకులకు సంబంధించి సిబిఐ దర్యాప్తు జరిపించకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమి చేస్తున్నారంటూ కొంత మంది తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. సిబిఐ విచారణకు తప్పని సరిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందన్న విషయం తెలుసుకోకుండా తనను విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు.గత కొన్ని రోజులుగా సింగరేణికి సంబంధించిన ఒడిశాలోని నైనికోల్ బ్లాక్పై చర్చ జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఎనిమిది జిల్లాలకు పైగా విస్తరించిన సింగరేణి తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు.
Women’s groups |మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్ద పీట
Women’s groups | మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్ద పీట Women’s groups
ఎమ్మెల్యే విజయుడును కొట్టలేదు, తిట్టలేదు: ఎంపీ మల్లు రవి
“బిఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును నేను కొట్టలేదు, తిట్టలేదు, అనవసరంగా నాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడతా&” అని నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు తాను అన్నాదమ్ముల్ల వలే కలిసి ఉంటామని ఆయన బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు.మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉండడంతో తాను ఎమ్మెల్యే విజయుడు కలిసి పాల్గొన్నామని ఆయన తెలిపారు. విజయుడు బిఆర్ఎస్ నుంచి గెలుపొందినా ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ నుంచి గెలవాల్సిన అవసరం లేదన్నారు. ఇద్దరమూ గెలుపొందినప్పటి నుంచి ప్రజల కోసం పని చేయాలన్న తపనతో ఉన్నామని ఆయన చెప్పారు. కాగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో శంకుస్థాపనం చేసేప్పుడు ఎమ్మెల్యే ముందుగా కొబ్బరి కాయ కొట్టిన తర్వాతే తాను కొట్టానని అన్నారు. తాను ప్రొటోకాల్ గురించి పట్టించుకోలేదని ఆయన తెలిపారు.ఈ సమయంలో ఎమ్మెల్యే అనుచరులమని చెప్పి కొందరు వచ్చి కొబ్బరి కాయల బస్తా ను లాక్కొని ఇక్కడ ఎవరూ ఉండడానికి వీల్లేదంటూ గొడవ చేశారని ఆయన చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారమే కొబ్బరి కాయలు కొట్టిస్తానని తాను వారికి చెప్పానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం తర్వాత కూడా వారు ఇలాగే కొబ్బరి కాయలు గుంజుకున్నారని ఆయన చెప్పారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఆగలేదని, పోలీసులు కొంత దూరంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్ణణ జరుగుతుందని తాను భావించి పోలీసులను పిలిచి కొంత గట్టిగా మాట్లాడానని అన్నారు. గొడవ జరగకుండా ఉండేందుకు తాను ఎమ్మెల్యేను కాస్త పక్కకు తీసుకెళ్ళానని ఆయన తెలిపారు. అంతేతప్ప తాను విజయుడిని ఒక్క మాట అనలేదని, కొట్ట లేదని డాక్టర్ మల్లు రవి వివరించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేనే అడిగి తెలుసుకోవాలని ఆయన అన్నారు. దళితునిపై దాడి జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన ఒక పత్రికకు చెందిన యజమాన్యం, బిఆర్ఎస్ నాయకులూ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాను పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడతానని డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు.
వీధికుక్కలను చంపడాన్ని సహించబోం: మంత్రి సీతక్క
కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సంబంధిత ఘటనలపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్ధమని, ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. మూగజీవాలను విషం పెట్టి చంపడం వంటి దారుణమైన చర్యలు పూర్తిగా నేరమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయం స్థానిక సర్పంచుల దృష్టికి రావడం సహజమేనని, అయితే ఆ సమస్యకు పరిష్కారం అనేది చట్టబద్ధమైన, శాస్త్రీయమైన, మానవీయమైన మార్గాల్లోనే చేయాలి తప్ప అతి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని హితువు పలికారు. వీధి కుక్కల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకాలు, కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) వంటి శాస్త్రీయ పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. మూకుమ్మడిగా విషం పెట్టి చంపడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటున్నామని. బాధ్యులపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, వీధి కుక్కల వల్ల సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, మానవీయత, చట్టబద్ధత, శాస్త్రీయతే ప్రభుత్వ విధానం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
CM Revanth |మహిళలకు 4 వందల కోట్ల ప్రమాద భీమా
CM Revanth | మహిళలకు 4 వందల కోట్ల ప్రమాద భీమా CM
అదరగొట్టిన అభిషేక్.. తొలి టి-20లో అర్థశతకం..
నాగ్పూర్: విదర్భా క్రికెట్ అసోసియేషన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టి-20 మ్యాచ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కి దిగిన భారత్కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగుల వద్ద సంజూశాంసన్ (10) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఇషాన్ కిషన్(8) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. ఈ క్రమంలో 22 బంతుల్లో అర్థశతకం కూడా సాధించాడు. అయితే శాంట్నర్ వేసిన 11వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(32) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్లో అభిషేక్ (67), హార్థిక్ (4) ఉన్నారు.
Maruthi | అసలు ప్లాన్ ఇదే.. Maruthi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
కొడవలితో దాడి కేసు – ముద్దాయి అరెస్ట్
రౌడీయిజం చేయాలని చూస్తే తాటతీస్తాం.. డిఎస్పి హెచ్చరిక విశాలాంధ్ర – హిందూపురం:హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం, పులమతి పంచాయతీ పరిధిలోని సడ్లపల్లి గ్రామంలో ఈ నెల 19న ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ఘటనలో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ కె.వి. మహేష్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సీఐలు జనార్ధన్, రాజగోపాల్ నాయుడు, ఎస్సై నరేంద్రలతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, హిందూపురం […] The post కొడవలితో దాడి కేసు – ముద్దాయి అరెస్ట్ appeared first on Visalaandhra .
Gurukula |గురుకులాల దరఖాస్తు గడువు పెంపు
Gurukula | గురుకులాల దరఖాస్తు గడువు పెంపు Gurukula | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ
900 ration cards |ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం చేయూత
900 ration cards | ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం చేయూత 900 ration
మేడారం ఘటనపై క్షమాపణలు చెప్పిన నటి టీనా శ్రావ్య #TeluguNews #TinaShravya #MedaramJathara
అలా చేయడం ఓ వింత అనుభవం: రోహిత్ శర్మ
2024 టి-20 ప్రపంచకప్లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన తర్వాత టీం ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టి-20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభంకానున్న టి-20 ప్రపంచకప్లో రోహిత్ పాల్గొనే అవకాశం లేదు. టోర్నమెంట్ ప్రారంభమైన తొలిసారి దూరం కావడంపై రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. మొదటిసారి టి-20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఇంట్లో కూర్చొని చూడటం తనకు వింత అనుభవం అవుతుందన్నాడు. ‘‘టి-20 ప్రపంచకప్ గురించి మేం ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో కూర్చొని మ్యాచ్లను చూడటం వింత అనుభవం. ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను ప్రతి ప్రపంచకప్లో భాగమయ్యాను. కాబట్టి.. ఇది భిన్నంగా అనిపిస్తుంది. వరల్డ్ కప్ను మిస్ అయినప్పుడు మనం అందులో ఆడట్లేదు కదా అని గుర్తొస్తుంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు.
Video : Exclusive Interview with Producer Sushmita Konidela
The post Video : Exclusive Interview with Producer Sushmita Konidela appeared first on Telugu360 .
Committee |శ్రీ మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు …
Committee | శ్రీ మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు … Committee |
Narcotic |అంతంపల్లి శివారులో దారుణం…..
Narcotic | అంతంపల్లి శివారులో దారుణం….. Narcotic | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ
Rs. 55 crore |ప్రత్యేక నిధులతో మరింత అభివృద్ధి చేస్తా
Rs. 55 crore | ప్రత్యేక నిధులతో మరింత అభివృద్ధి చేస్తా Rs.
Jagan’s Padayatra 2.0: The Sequel Ready For Release?
YSR Congress Party chief YS Jagan has once again indicated that he plans to return to the roads with so called padayatra. During his recent interaction with his party leaders from the Eluru constituency at Tadepalli office, Jagan spoke at length about the need to stay connected with people. He asked leaders to be active […] The post Jagan’s Padayatra 2.0: The Sequel Ready For Release? appeared first on Telugu360 .
చెక్ బౌన్స్ కేసులో తీర్పు – నిందితుడికి జైలు,జరిమానా
విశాలాంధ్ర, పెనుకొండ: 2022 సంవత్సరంలో ఆస్తి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన భూమి విషయంలో యంగ్ కుక్ షైన్ (కొరియన్) మరియు పెనుకొండకు చెందిన కొండేపాగు గోపీనాథ్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో గోపీనాథ్, యంగ్ కుక్ షైన్కు రూ.20,00,000/- (ఇరవై లక్షలు) చెక్కు ఇచ్చినట్లు కేసు వివరాలు చెబుతున్నాయి.అయితే ఆ చెక్కు బ్యాంకులో బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం, చెక్కు బౌన్స్ అయిన విషయం వాస్తవమని […] The post చెక్ బౌన్స్ కేసులో తీర్పు – నిందితుడికి జైలు,జరిమానా appeared first on Visalaandhra .
ఒటిటిలోకి హెబ్బాపటేల్ రొమాంటిక్ థ్రిల్లర్
హైదరాబాద్: కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బాపటేల్. అయితే గత కొంతకాలంగా ఈ భామకు పెద్ద సినిమా ఛాన్స్ రావడం లేదు. దీంతో చిన్న, చిన్న సినిమాలు చేస్తూ.. తన ఫ్యాన్స్ని ఖుషీ చేస్తోంది. హెబ్బా నటించిన లేటెస్ట్ చిత్రం మారియో. అనిరుధ్ శ్రీవాత్సవ ఇందులో హీరో. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్జీ గోగన దర్శకత్వం వహించాడు. నాటకం, తీస్మార్ ఖాన్ వంటి చిత్రాలతో కళ్యాణ్ ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాకి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతం అందించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. తాజాగా ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ప్రముఖ ఒటిటి సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ని కూడా విడుదల చేసింది. మరి మారియో చిత్రం బుల్లితెరపై ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. A Red-Hot Alert Get ready for a turbo-charged, ramp ride that hits hard and burns hotter #Mario from Jan 23 on #aha pic.twitter.com/VlxHQQXMwq — ahavideoin (@ahavideoIN) January 21, 2026
Minister Sitakka |అరైవ్… అలైవ్లో పాల్గొన్న సీతక్క
Minister Sitakka | అరైవ్… అలైవ్లో పాల్గొన్న సీతక్క Minister Sitakka |
50 కులాలను సంచార జాతులుగా గుర్తించిన బిసి కమిషన్
రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా రాష్ట్ర బిసి కమిషన్ గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేయనున్న సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. రాష్ట్ర బిసి కమిషన్ సమావేశం బుధవారం ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బాల మాయ దేవి, అధికారులు డిప్యూటి డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె. మనోహర్ రావు, ప్రత్యేక అధికారి కుమారి ఎన్. సునీత, సెక్షన్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో కమిషన్ వివిధ అంశాలపై చర్చించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న సీడ్ పథకానికి అర్హులకు కావాల్సిన డిఎన్టి సర్టిఫికేట్ జారీ విధివిధానాలపై చర్చించింది. 50 కులాలను సంచార జాతులుగా గుర్తించి ఈ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ జారీలో చేపట్టవలసిన మార్పులు, చేర్పుల గురించి కూడా ప్రభుత్వానికి సిఫారసులను ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మినహా మిగతా అన్ని శాఖల నుండి కమిషన్కు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని క్రోడికరించి ఉద్యోగరంగంలో బిసి స్థితిగతులను అంచనా వేయడానికి ఉపయోగించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
Temple |ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు
Temple |ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు Temple | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ
తొలి టి-20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
నాగ్పూర్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్ విజయంతో మంచి జోష్లో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఈ సిరీస్ని విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. ఇక భారత్ ఈ మ్యాచ్లో గెలిచి వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్తో క్రిస్టన్ క్లార్క్ కివీస్ జట్టులో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇక భారత జట్టులో శ్రేయస్, హర్షిత్, బిష్ణోయ్, కుల్దీప్ ఈ మ్యాచ్కి దూరమయ్యారు. తుది జట్లు: భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వాయ్(కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), క్రిస్టస్ క్లార్క్, కైల్ జెమిసన్, ఇష్ సోదీ, జెకబ్ డఫీ.
Tahsildar |తహసీల్దార్ ను సన్మానించిన నాయకులు …
Tahsildar | తహసీల్దార్ ను సన్మానించిన నాయకులు … Tahsildar | బచ్చన్నపేట,
Public |మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా….
Public | మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా…. Public | జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ
తమిళనాడు ప్రభుత్వ కీలక బాధ్యతలలో IAS అధికారి బోధపాటి చంద్ర మోహన్..
విశాలాంధ్ర, ఉరవకొండ: తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన బోధపాటి చంద్రమోహన్ ఐఏఎస్ నియమితులయ్యారు. ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఆయన స్వగ్రామమైన లత్తవరంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్పతో పాటు బోధపాటి వారి కుటుంబ సభ్యులు బోధపాటి చంద్రమోహన్కు అభినందనలు తెలియజేశారు. తమిళనాడు రాష్ట్ర అత్యున్నత పరిపాలనా పదవికి స్వగ్రామానికి చెందిన వ్యక్తి నియామకం […] The post తమిళనాడు ప్రభుత్వ కీలక బాధ్యతలలో IAS అధికారి బోధపాటి చంద్ర మోహన్.. appeared first on Visalaandhra .
School |భోజనం నాణ్యతగా లేదని విద్యార్థుల నిరసన
School | భోజనం నాణ్యతగా లేదని విద్యార్థుల నిరసన School | దండేపల్లి,
Home construction |సొంత ఇంటి కలను నిజం చేయడమే….
Home construction |సొంత ఇంటి కలను నిజం చేయడమే…. Home construction |బిచ్కుంద,
2026 minicipolls |భవిష్యత్ రాజకీయ అడుగులా?
2026 minicipolls | భవిష్యత్ రాజకీయ అడుగులా? 2026 minicipolls | కేడర్
RTC Logistics |టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు…
RTC Logistics | టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు… RTC Logistics |
దావోస్లో లైఫ్సైన్సెస్ పాలసీ విడుదల
దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం అనేక ఒప్పందాలను కుదుర్చుకుంటుంది.
Utkoor |గ్రామసభ బహిష్కరించిన ప్రజలు
Utkoor | గ్రామసభ బహిష్కరించిన ప్రజలు Utkoor |ఊట్కూర్, ఆంధ్రప్రభ : మక్తల్
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం#telugupost #Tirupati #SVUniversity #leopardsighting
BRS : ఫోన్ ట్యాపింగ్ తో మేనల్లుడిలో అనుమాన బీజం పడిందా?
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో బీఆర్ఎస్ టాప్ లీడర్ల మెడకు చుట్టుకునే అవకాశముంది
Drishyam 3 |పట్టాలెక్కేది ఎప్పుడు..?
Drishyam 3 | పట్టాలెక్కేది ఎప్పుడు..? Drishyam 3 | ఆంధ్రప్రభ వెబ్
TG | మెడికల్ షాపులను తనిఖీ…. TG | నిజాంపేట, ఆంధ్రప్రభ :
యూట్యూబ్ వీడియోలో బరువు తగ్గే టిప్ప్.. చివరికి ప్రాణమే పోయింది
న్యూఢిల్లీ: యూట్యూబ్ వీడియోలో బరువు తగ్గే టిప్స్ చూసి.. వాటిని అనుసరించిన ఓ యువతి చివరికి ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒక యూట్యూబ్ వీడియోలోని చిట్కాల ఆధారంగా స్థానిక దుకాణంలో ఓ పదార్థాన్ని కొని.. దాన్ని తిన్న 19 ఏళ్ల విద్యార్థిని మరణించిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని మీనాంబల్పురానికి చెందిన దినసరి కూలీ వేల్ మురుగన్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కలైయరసిగా గుర్తించారు. ఆమె నరిమేడులోని ఓ ప్రైవేట్ మహిళా కళాశాలలో చదువుతోంది. పోలీసుల ప్రకారం.. సదరు యువతి కొద్దిగా అధిక బరువు ఉన్నందున, బరువు తగ్గడానికి పరిష్కారాల కోసం తరచుగా ఆన్లైన్లో వెతికేది. ఆమె ఇటీవల బరువు తగ్గే టిప్స్ కోసం యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోను చూసింది. ఆ కంటెంట్తో ప్రభావితమై, జనవరి 16న కీళమాసి వీధిలోని ఒక ఆయుర్వేద మందుల దుకాణంలో బొరాక్స్ అనే పౌడర్ ను కొనుగోలు చేసింది. జనవరి 17న యువతి, వీడియోలో చూపిన విధంగానే ఆ పదార్థాన్ని సేవించింది. కొద్దిసేపటికే ఆమెకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి.దీంతో తల్లిదండ్రులు వెంటనే ఆమెను మునిసాలైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చింది. అదే రోజు సాయంత్రం ఆ లక్షణాలు మళ్లీ కనిపించాయి. సమీపంలోని మరో ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్ మెంట్ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, రాత్రి 11 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు తీవ్రమవడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే ఆమెను ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తర్వాత ఈ సంఘటనపై సెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాదయాత్రపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు
సచివాలయ హెల్త్ కార్యదర్శి అకాల మరణం అత్యంత విషాదకరం
ఏపీ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషావిశాలాంధ్ర ధర్మవరం:: వైయస్సార్ జిల్లా కడపలోని గన్నవరం సచివాలయంలో విధులు కొనసాగిస్తున్న హెల్త్ సెక్రటరీ విజయకుమారి (42) అకాల మరణం అత్యంత విషాదకరమని ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పులిబండ్ల నర్సింహారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసంతకాలములో ఎండుటాకులు రాలినట్లు యువ ఉద్యోగులైన […] The post సచివాలయ హెల్త్ కార్యదర్శి అకాల మరణం అత్యంత విషాదకరం appeared first on Visalaandhra .
ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం..
డిఎస్పి హేమంత్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు నూతన కమిటీని డిఎస్పి కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హరి శ్రీనివాస్, రిటైర్డ్ హెడ్మాస్టర్, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు చలపతి, ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ గంగా భవాని, ప్రముఖ న్యాయవాదులు భాగ్యలక్ష్మి, సీనియర్ విశాలాంధ్ర రిపోర్టర్ రాఘవ లను ఈ కమిటీలో […] The post ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం.. appeared first on Visalaandhra .
Library |మాటకు కట్టుబడి ఉండడమే బీజేపీ లక్ష్యం
Library | మాటకు కట్టుబడి ఉండడమే బీజేపీ లక్ష్యం Library | దండేపల్లి,
Telangana |తండ్రీ కొడుకుల మధ్య గొడవ..
Telangana | తండ్రీ కొడుకుల మధ్య గొడవ.. Telangana | వెబ్ డెస్క్,
కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి: మంత్రి పొన్నం
సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు

21 C