SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి

కల్తీ బేకరీ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్‌ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 12,54,280 విలువైన మైదాపిండి, చెక్కెర బస్తాలు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, కేడి కాలనీకి చెందిన అహ్మద్ రజా బేకరీ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు అహ్మద్ రజా ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు,బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్‌లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు తయారీ కేంద్రంపై దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, గుడిమల్కాపూర్ ఇన్స్‌స్పెక్టర్ రామయ్య, ఎస్సైలు కె. వెంకటరమణ, సురేష్, సిబ్బంది దాడులు చేశారు.

మన తెలంగాణ 28 Mar 2026 7:29 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్‌సిబి జట్టు సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడటం ఇది ఏడోసారి. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది రెండోసారి. తుది జట్లు: ఆర్‌సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకడ్ డఫీ, సుయాశ్ శర్మ. ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగా.

మన తెలంగాణ 28 Mar 2026 7:13 pm

హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలోనే: సిఎం రేవంత్‌రెడ్డి

మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మూసీనది పునరుజ్జీవిం గురించి చాలా మంది ప్రయత్నించారని, కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని, ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తారని, తెలంగాణ పౌరులకు తన విజ్ఞప్తి ఒక్కటేనని, చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందని, సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని సిఎం అన్నారు. దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదని, మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్య కారకంగా మారింది గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 7:07 pm

ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం…

ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర

ప్రభ న్యూస్ 28 Mar 2026 7:04 pm

ఈనెల 30న అసెంబ్లీలో సన్నబియ్యంతో విందు భోజనం

సన్నబియ్యంతో విందు భోజనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30వ తేదీన అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో సన్నంబియ్యంతో వండిన విందు భోజనాన్ని వడ్డించనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 3.39 కోట్ల మందికి దీనిద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీన మధ్యాహ్నాం ఒంటిగంటకు ఈ విందు భోజనం నిర్వహించనుండగా ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 7:04 pm

Sri Rama Navami |ఘనంగా శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం

Sri Rama Navami | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భక్తి, వేడుకలు, సంగీతం,

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:55 pm

లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ…

లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ… విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ మున్సిపల్

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:54 pm

ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:45 pm

BJP : తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్లాన్ సిద్ధం చేసిందటగా?

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 6:45 pm

వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం

వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తజనం ఉరవకొండ రూరల్,

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:44 pm

ఎయిర్‌పోర్ట్ కోసం ల్యాండ్ ఇచ్చి.. రూ.15 కోట్లు దక్కించుకున్నాడు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తర‌ప్రదేశ్‌కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీ పరిహారం అందినట్లు తెలుస్తోంది. తద్వారా ఆ భూమల రైతుల జీవితాలు రాత్రికి రాత్రే బంగారు మయం అయ్యాయని పలు నివేదికల సమాచారం. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతుకు దాదాపు రూ.15 కోట్లు పరిహారం లభించింది. ఈ భారీ సొమ్ము ఆయన ఏకంగా ఒక హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేయడమే కాకుండా, విహార యాత్ర కోసం థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ముఖ చిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. 

మన తెలంగాణ 28 Mar 2026 6:43 pm

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ . డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:41 pm

శిక్షణ పూర్తి చేసిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్ల పంపిణీ

బాసర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీలలో వార్డుల అభివృద్ధికి వార్డు సభ్యులు కీలక పాత్ర

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:39 pm

పెరిగిన టివిలు, ఎసిల ధరలు

మార్కెట్లో అన్ని సైజుల టీవీల ధరలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్, రాగి ధరలు పెరగడం వల్ల ఏసీల రేట్లు కూడా ప్రియం కానున్నాయి. గతంలో రూ.28,000 లభించే 65 అంగుళాల టీవీ ధర ఇప్పుడు రూ.32 వేలకు చేరిందని సమాచారం. అలాగే 32 అంగుళాల టీవీ ధర రూ. 5,700 నుండి రూ.6,400 కు పెరిగింది. ధరలు పెరగడంతో సగానికి పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, సిలిండర్ల కొరత కూడా వేధిస్తోంది.

మన తెలంగాణ 28 Mar 2026 6:36 pm

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి సాగు–తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంఏపీ రైతు సంఘం

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:31 pm

తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్

తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్ ప్లాట్లు కొని మోసపోవద్దు.. కమిషనర్ హెచ్చరిక

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:26 pm

నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి

నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి: కలెక్టర్ డా.ఏ.సిరి.

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:20 pm

Lenin Team Breaks Silence on Release

Akhil Akkineni has been completely occupied with the shoot of Lenin from a long time. The last schedule is currently happening and there were strong speculations that the film releases on May 1st. There is a debate on social media that the team is tight-lipped about the release. With Ram Charan’s Peddi slated for April […] The post Lenin Team Breaks Silence on Release appeared first on Telugu360 .

తెలుగు 360 28 Mar 2026 6:19 pm

పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు

పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు రవీంద్ర రావు అదనపు కమిషనర్ విజయవాడ కార్పోరేషన్,

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:17 pm

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు జిల్లా క్రీడాకారులు ఎంపిక

నిజామాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు శనివారం

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:15 pm

Change of Plan from Anudeep KV

Anudeep KV made an impressive debut with Jathi Ratnalu. The comic timing in the film was hilarious and all the actors from the film are quite busy now. Anudeep did films like Prince and Funky. Prince ended up as a below average film while Funky brought him a lot of criticism. Anudeep KV was trolled […] The post Change of Plan from Anudeep KV appeared first on Telugu360 .

తెలుగు 360 28 Mar 2026 6:14 pm

Revanth Reddy : మైనింగ్ అక్రమాలకు సీఐడీ విచారణకు సిద్ధం

మైనింగ్ పై జరిగిన అక్రమాలన్నింటిపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 28 Mar 2026 6:13 pm

Bjp Support : 2024 లో ఆ వైర‌స్ ను త‌రిమేశాం Andhra Prabha Assembly News

Bjp Support : 2024 లో ఆ వైర‌స్ ను త‌రిమేశాం Andhra

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:05 pm

అక్రమ మైనింగ్ పై హరీశ్ మండిపాటు

రాఘవ కనస్ట్రక్షన్స్ పైన ఎందుకు కేసులు పెట్టరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

తెలుగు పోస్ట్ 28 Mar 2026 6:03 pm

విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి

విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : గిరిరాజ్

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:02 pm

ఆరో తరగతి బాలికపై దారుణం

ఆరో తరగతి బాలికపై దారుణం ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ : ఎన్టీఆర్

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:57 pm

దళిత హక్కుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ..

కరిమాబాద్, ఆంధ్రప్రభ ; దళిత కుల పోరాట సమితి రెండవ మహాసభ వాల్పోస్టర్

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:52 pm

జీజీహెచ్‌లో ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం

జీజీహెచ్‌లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం కర్నూలు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:49 pm

Pawan Kalyan : వైసీపీ అధికారంలోకి రావడం జరగని పని

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా

తెలుగు పోస్ట్ 28 Mar 2026 5:48 pm

Amaravathi : అమరావతి అందరిదీ.. అందుకే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేశాం

అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించేలా కేంద్రానికి పంపే తీర్మానంపై శాసనసభలో కొనసాగుతున్న చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు

తెలుగు పోస్ట్ 28 Mar 2026 5:34 pm

పాడి రైతులకు భారీ లాభం…

పాడి రైతులకు భారీ లాభం… కృష్ణా మిల్క్ యూనియన్ కీలక నిర్ణయంపాల సేకరణ

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:25 pm

నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాలకు రాష్ట్ర అవార్డు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్ర

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:24 pm

Gas cylinders | 30సిలిండర్లతో…

Gas cylinders | 30సిలిండర్లతో… Gas cylinders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:21 pm

రైతాంగ సంక్షేమమే లక్ష్యం…

ఆలేరు, ఆంధ్రప్రభ : రైతాంగ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:19 pm

టీడీపీ కుటుంబానికి సహాయం…

టీడీపీ కుటుంబానికి సహాయం… రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు మండలంలోని మారూరు గ్రామనికి

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:15 pm

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష….

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష…. అప్పట్లో మూడు రాజధానులను వ్యతిరేకించాను.అసెంబ్లీలో ఎమ్మెల్యే వసంత

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:11 pm

అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది..

అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి..అమరావతి సీఎం

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:07 pm

ముందస్తు అడ్మిషన్ల‌ను అరికట్టండి…

ముందస్తు అడ్మిషన్ల‌ను అరికట్టండి… కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలి.పి.డి.ఎస్.యు

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:56 pm

జనవరిలో భర్త మరణం.. పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య

సంగారెడ్డి: కంది మండలం జూలకల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులు చనిపోయిన తర్వాత ఉరేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు తల్లి మమత (28), మణికంఠ(5), ప్రళయ(4)గా గుర్తించారు. జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడనే మనస్తాపంతో పిల్లలతో సహా మమత ఆత్మహత్య చేసుకుంది. ఈ ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మన తెలంగాణ 28 Mar 2026 4:32 pm

పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుంది: రేవంత్

హైదరాబాద్: బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయటం వెనుక సహేతుక కారణం ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ పౌష్టికాహారం అందట్లేదు అని అన్నారు. అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా ‘తొలి ముద్ద’ పథకాన్ని సిఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కొండా సురేఖ, సీతాదయాకర్ రెడ్డి పాల్గొన్నారు. రెడీ టూ కుక్ ఫుడ్ ( ఉప్మా, కిచిడీ మిక్స్) ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీ వర్కర్స్ కు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నాం అని..పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుందని రేవంత్ తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందని, అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు అని..అంగన్వాడీ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించే చర్యలు చేపట్టామని అన్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

మన తెలంగాణ 28 Mar 2026 4:30 pm

అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి..

అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి.. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:25 pm

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:20 pm

IPL betting apps |బలి పశువులుగా మారుతున్న యువత..

IPL betting apps | బలి పశువులుగా మారుతున్న యువత.. IPL betting

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:16 pm

పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు

పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయంలో

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:15 pm

నిత్య అన్నదాన పథకానికి విరాళం…

నిత్య అన్నదాన పథకానికి విరాళం… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:12 pm

Assembly |సభ ఏకగ్రీవ ఆమోదం…

Assembly | సభ ఏకగ్రీవ ఆమోదం… Assembly | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ :

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:09 pm

tirumala|కొండ‌పై కొన‌సాగుతున్న ర‌ద్దీ

tirumala| కొండ‌పై కొన‌సాగుతున్న ర‌ద్దీ ఏడుకొండ‌ల‌వాడి ద‌ర్శ‌నానికి భారీ క్యూ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:06 pm

11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha Assembly News

11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:04 pm

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం..

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం.. శ్రీరామనవమి ఉత్సవాల్లో నేత్రపర్వంగా మహోత్సవంపాలకమండలి సభ్యుల సమక్షంలో

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:01 pm

Andhra Prabha Smart Edition |TS |శివతాండవమే/డిప్రెష్​ మొదలైంది

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 28-03-2026, 4.00PM ts మూసీని అడ్డుకుంటే శివతాండవమే

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:57 pm

నగరం నడిబొడ్డునే అక్రమంగా మైనింగ్ జరుగుతోంది: హరీశ్ రావు

హైదరాబాద్: మైనింగ్ నుంచి వచ్చే నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా కీలకం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తీర్మానాలను ఏకపక్షంగా పాస్ చేయడం సరికాదు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మైనింగ్ శాఖపై హరీశ్ రావు మాట్లాడారు. తాను ఎప్పుడూ ఆధారాలతోనే మాట్లాడతానని తెలియజేశారు. మైనింగ్ శాఖలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, నగరం నడిబొడ్డునే అక్రమంగా మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. తన మాటలను రాజకీయాలు, విమర్శలుగా తీసుకోవద్దు అని సూచించారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయినీ కాపాడే బాధ్యత మనదేనని, ఖనిజాలపై ఆదాయం ఏటా పెరుగుతోందని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డునే జివొ 111 ను ఉల్లంఘిస్తున్నారని, స్టోన్ క్రషర్లకు నిబంధనలు కూడా మీ ప్రభుత్వమే పెట్టిందని మండిపడ్డారు. మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలని, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. స్టోన్ క్రషర్ కు పిసిబి నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి అని.. స్టోన్ క్రషర్ యజమాని.. మైనింగ్ అధికారికి ప్రతి నెలా వివరాలు ఇవ్వాలని సూచించారు. డీజిల్ జనరేటర్లతో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు.   

మన తెలంగాణ 28 Mar 2026 3:44 pm

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత..

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రతినెల 30న పౌర హక్కుల ( సివిల్ రైట్స్

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:27 pm

ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలు నారాయణపేటజిల్లాఊట్కూర్

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:23 pm

రాయపర్తిలో 20 కిలోల గంజాయి స్వాధీనం

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎండు

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:20 pm

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి..

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి.. దుర్గమ్మ ఆలయంలో భారీ పారిశుధ్య కార్యక్రమంప్లాస్టిక్ రహిత

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:16 pm

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లాలో పదన తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:13 pm

పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి..

పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి.. శావల్యాపురం, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రతి ఒక్కరూ

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:12 pm

తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్‌ డైరెక్టర్..

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. మరికొంతమంది సినీ నటీనటులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా డైరెక్టర్ సుందర్ సి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన అన్నాడిఎంకె కూటమిలోని పుతియ నీతి కట్చి(పిఎన్ కె) పార్టీ తరుఫున సుందర్‌.. మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఏ.సి. షణ్ముగం శనివారం ప్రకటించారు. DMK కీలక నేత, మంత్రి పి.టి.ఆర్. పళనివేల్ త్యాగరాజన్‌తో సుందర్ తలపడే అవకాశం ఉంది. డైరెక్టర్ సుందర్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన భార్య, సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన జీవిత భాగస్వామిగా, నేను ఎంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నాను. గత 30 ఏళ్లుగా తమిళనాడు ప్రజలను అలరిస్తూ వస్తున్న ఆయన, తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రజల కోసం తన అత్యుత్తమ సేవలను అందిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను అంటూ ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 28 Mar 2026 3:12 pm

పాలకవర్గం సభ్యుల సహకారంతో అభివృద్ధి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పాలకవర్గం సభ్యులు గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:08 pm

Royal Enfield Guerrilla 450 Apex|బుల్లెట్‌లో న్యూ మోడ‌ల్‌

Royal Enfield Guerrilla 450 Apex|బుల్లెట్‌లో న్యూ మోడ‌ల్‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:06 pm

రామదండు ఆధ్వర్యంలో మైక్ సెట్ ఏర్పాటు..

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శ్రీరామ దండు

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:05 pm

కొలిక్కిరాని ‘జననాయగన్’ వివాదం.. మరోసారి రిలీజ్ వాయిదా?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం ‘జననాయగన్’. నిజానికి ఈ సినిమా ఈ జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా విడదుల వాయిదా పడుతూ వస్తుంది. తాజ నివేదికల ప్రకారం ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విజయ్ పుట్టినరోజున ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. జూన్ 22న హీరో పుట్టినరోజు కావడంతో ఈ సినిమాను జూన్ 18వ తేదీన విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే ఈ తేదీకి కూడా సినిమా రావడం కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా ఒకటి. ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. దీంతో జులైలో ‘జననాయగన్’ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

మన తెలంగాణ 28 Mar 2026 3:02 pm

ViratKohli|ఫేమ‌స్ కోసం ఇంత దిగ‌జారాలా..?

ViratKohli| ఫేమ‌స్ కోసం ఇంత దిగ‌జారాలా..? ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నెట్టింట్లో ఫేమ‌స్

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:29 pm

ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి…

ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : మన ఇళ్లతోపాటు

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:28 pm

టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం…

టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం… హైదరాబాద్, ఆంధ్రప్రభ : తిరుమల

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:25 pm

పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు…

పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు… కర్నూలు, ఆంధ్రప్రభ : సరస్వతీ పుత్రులు పద్మశ్రీ

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:22 pm

భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి..

భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకూడదు..శ్రీశైలం దేవస్థానంలో

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:16 pm

Young People |ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు

Young People | ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు Young People | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:15 pm

బలహీన వర్గాలకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది: పొన్నం

హైదరాబాద్: బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిసిల గురించి మాట్లాడుతుంటే బిఆర్ఎస్ వాకౌట్ చేసిందని, బిసి రిజర్వేషన్ల పెంపు సమయంలో కూడా వాకౌట్ చేశారని  సభలో బిసిల అంశం వచ్చినప్పుడల్లా బిఆర్ఎస్ బయటకు వెళ్తుంది అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిసి రిజర్వేషన్ల పెంపు అంశంపై పొన్నం మాట్లాడారు. నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలకు అండగా నిలుస్తున్నామని తెలియజేశారు. బిసిల అభివృద్ధి కోసం విపక్ష నేతలు మంచి సలహాలు ఇవ్వాలని పొన్నం సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, గురుకులాల్లో మౌలిక వసతులు పెంచుతున్నామని అన్నారు. పోలీసుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డ్రగ్స్ కట్టడి చేస్తున్నాం అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 28 Mar 2026 2:13 pm

తాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మనుమడు

తాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మనుమడు ఘంటసాలలో అడుగు పెట్టిన అంబేద్కర్ వారసుడు

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:09 pm

YSRCP : వైసీపీది రాంగ్ డెసిషన్? రైట్ వే నేనా?

ysrcp-assembly-boycott-amaravati-capital-resolution

తెలుగు పోస్ట్ 28 Mar 2026 2:08 pm

అదుపు తప్పిన బస్సు…

అదుపు తప్పిన బస్సు… కర్నూలు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ‌ : మండల కేంద్రం నందవరం

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:02 pm

జిల్లాలో జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్‌కు శ్రీకారం..

జిల్లాలో జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్‌కు శ్రీకారం.. ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణకు సమగ్ర

ప్రభ న్యూస్ 28 Mar 2026 2:02 pm

అన్న హీరో, చెల్లి నిర్మాత.. ‘బరి’ ప్రపంచాన్ని చూశారా..

వరుణ్ తేజ్ హీరోగా.. నిహారికా నిర్మిస్తున్న చిత్రం ‘బరి’. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ‘ది వరల్డ్ ఆఫ్ బరి’ పేరుతో ఓ ప్రత్యేకమైన వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో బట్టి చూస్తే.. ఈ సినిమా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతుందని అర్థమవుతోంది. వాలీబాల్ క్రీడాకారుడిగా వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.

మన తెలంగాణ 28 Mar 2026 1:47 pm

ఈ ప్రాజెక్టు డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఓ ఉదాహరణ : మోడీ

ఉత్తర్ ప్రదేశ్: నొయిడా సెమీకండక్టర్ ఫ్యాక్టరీ శిలన్యాస్ చేశాం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నోయిడా ఎయిర్ పోర్టును, మీరట్ మెట్రో విస్తరణ ప్రారంభించాం అని అన్నారు. ఈ సందర్భంగా నొయిడా లో మోడీ ప్రసంగించారు. 2003 లో దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలోనే ఈ ఎయిర్ పోర్టు మంజూరైందని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని విమర్శించారు. ఈ విమానాశ్రయం మల్టీమోడల్ కనెక్టివిటి కలిగి ఉంది అని తెలియజేశారు. ఈ కష్టకాలంలో దేశమంతా ఒక్కటై పోరాడాలి అని.. ఈ కష్టకాలంలో దేశం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలి అని సూచించారు. ప్రతి రెండు నిముషాలకు ఓ విమానం ఇక్కడి నుంచి ఎగురుతుంది అని.. సంవత్సరాల నుంచి ఈ ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందకుండా విపక్షం అడ్డుకుంది అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తాయి అని.. నొయిడా ఎయిర్ పోర్టు వల్ల యూపీ రైతులకు చాలా లబ్ధి చేకూరుతుంది అని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. ఈ ఎయిర్ పోర్టు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగం అని.. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం అని.. ఇథనాల్ వాడకం పెరిగితే, రైతులకు ఆదాయం పెరుగుతుంది అని అన్నారు. దేశంలో చిన్నచిన్న నగరాలకు విమాన సర్వీసులు విస్తరిస్తున్నాయి అని.. సామాన్య భారతీయుడు విమాన ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. 85 శాతం విమానాల తయారీ, ఓవర్ హాలింగ్ విదేశాల్లోనే జరుగుతోంది అని.. ఆ పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. రూ. 29,560 కోట్లతో నొయిడా ప్రోజెక్టు నిర్వహణ అని.. యమున ఇంటర్నెల్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు. వికసిత్ భారత్ కోసం అందరూ కలిసి శ్రమించాలి అని.. పశ్చిమాసియా యుద్ధాన్ని నిశింతగా పరిశీలిస్తున్నాం అని మోడీ స్పష్టం చేశారు.  

మన తెలంగాణ 28 Mar 2026 1:31 pm

Allagadda : ఆళ్లగడ్డకు వెళ్లాలంటేనే... టీడీపీ నేతలు భయపడుతున్నారా?

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సొంత పార్టీ నేతలతోనే తలపడుతున్నారు

తెలుగు పోస్ట్ 28 Mar 2026 1:29 pm

10GramsGold|కొనుగోలు దారుల‌కు మ‌ళ్లీ షాక్‌

10GramsGold| కొనుగోలు దారుల‌కు మ‌ళ్లీ షాక్‌ ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : భార‌త్‌లో బంగారానికి

ప్రభ న్యూస్ 28 Mar 2026 1:24 pm

కడెంలో ప్రశాంతంగా పది పరీక్షలు..

కడెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెం లో ని జిల్లా పరిషత్

ప్రభ న్యూస్ 28 Mar 2026 1:22 pm

రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాంపల్లి–మారేడుగొండ శివారులోని శ్రీ రేణుక

ప్రభ న్యూస్ 28 Mar 2026 1:18 pm

44 years |ఉద్యమంలో చురుకైన పాత్ర..

44 years | ఉద్యమంలో చురుకైన పాత్ర.. 44 years | చిత్తూరు,

ప్రభ న్యూస్ 28 Mar 2026 1:17 pm

Amaravathi : అమరావతి రైతులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 1:16 pm

సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోండి.. ప్రజా ప్రతినిధులకు బండి పిలుపు

కరీంనగర్: రాష్ట్రంలోని వార్డు మెంబర్ మొదలు సర్పంచ్ దాకా.. కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తమ తమ ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే మోడీ సర్కార్ లక్ష్యమన్నారు. అందుకోసం రూ.75 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ సోలార్ వ్యవస్థపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన నివాసంపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకున్నారు. శనివారం ఉదయం టీజీరెడ్కో అధికారులు, డిస్ట్రిబ్యూటర్ తో కలిసి సోలార్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులు రూపొందించిన ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పిలుపు మేరకు నా ఇంటిపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ఈ దేశాన్ని కాపాడాలి. దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే మహానేత మోడీ. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం... ముఖ్యంగా చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలనే అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే దేశంలోని కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్ ను అందించాలనే లక్ష్యంతో ‘‘PM సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన’’ పథకాన్ని 2024 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టాం. ఈ సోలార్ ప్యానల్ ద్వారా ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం 75 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాం. తొలుత ప్రజాప్రతినిధులంతా తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని మోడీ పిలుపునిచ్చారు. కాబట్టి వార్డ్ మెంబర్ మొదలు సర్పంచ్ దాకా, కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నా. సోలార్ వ్యవస్థపై అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతోంది. ఎందుకంటే 2024లో ఈ పథకం ప్రవేశపెట్టినా ఇంతవరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 5 నుండి 7 వేల కుటుంబాలు సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకునేందుకు సరిపడా కేంద్రం నిధులు కేటాయించింది. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా... ఒక్కో ఇంటిపై సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుంటే... అందుకయ్యే వ్యయంలో 30 వేల నుండి 78 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోంది. నా ఇంటి విద్యుత్ బిల్లులు ప్రతినెలా 25 నుండి రూ.30 వేలు ఖర్చు వస్తోంది. ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా ఇకపై బిల్లులు రూ.5 వేలలోపే వచ్చే అవకాశముంది. అందుకే ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్ ను కొనుగోలు చేసే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలన్నది మోదీ ఆకాంక్ష. రైతులు, సామాన్య ప్రజలంతా ఈ సోలార్ వ్యవస్థను వాడుకుని కరెంట్ ను కొనే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలని కోరుతున్నా. పేద ప్రజలకు కూడా భారం కాకుండా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుంటే... 80 శాతం వరకు లోన్ వస్తుంది. అది కూడా వాయిదాల పద్దతిలో చెల్లించే అవకాశముంది. కాబట్టి ఏ మాత్రం భారం కాకుండా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లాగే వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో PM-KUSUM (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తెలంగాణలో 1800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని TG-REDCO సంస్థ లక్ష్యం పెట్టుకుంది. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, గ్రామ మండల సమాఖ్యలు ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటి వరకు కరీంనగర్ లో 46, సిరిసిల్లలో 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 63 ఆమోదం ఆమోదం పొందాయి. రైతులు తమ పొలాలకు అవసరానికి మించి అదనపు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే డిస్కంలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 1:15 pm

నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి

నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి కామారెడ్డి, ఆంధ్రప్రభ ; నిర్మల్ పట్టణానికి చెందిన

ప్రభ న్యూస్ 28 Mar 2026 1:13 pm

మార్కాపురం ప్రమాద మృతదేహాలు బంధువులకు అప్పగింత

మార్కాపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మార్కాపురం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర

ప్రభ న్యూస్ 28 Mar 2026 1:07 pm

NARA LOKESH |జగన్‌ ‘సినిమా’ 11 రోజులు కూడా ఆడదు

NARA LOKESH | జగన్‌ ‘సినిమా’ 11 రోజులు కూడా ఆడదు NARA

ప్రభ న్యూస్ 28 Mar 2026 1:06 pm

భారతి, రామ్‌కో సిమెంట్స్‌కు నోటీసులు

భారతి, రామ్‌కో సిమెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 1:05 pm

మరోసారి చిక్కుల్లో యువరాజ్ సింగ్ తండ్రి.. ఈసారి మహిళలపై వ్యాఖ్యలు

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మహిళలు, పిల్లలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడు రిటైర్ కావడానికి అతడి ఇంట్లో ఉండే మహిళలు, పిల్లలే కారణం అని ఆయన అన్నారు. రిటైర్‌మెంట్‌కు ఫిట్‌నెస్‌తో సంబంధం ఉండదని, ఆటగాడి కెరీర్‌కు మహిళలు అడ్డుపడరాదని పేర్కొన్నారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘40 ఏళ్లు దాటిన తర్వాత మాకు వయసైపోతుందని చాలా మంది అనడం గమనిస్తున్నా. 30 ఏళ్ల తర్వాత మహిళలు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు’’ అని అన్నారు. ఓ జిమ్ డైరెక్టర్‌గా తన జిమ్‌కు వచ్చే మహిళలకు, సీనియర్ సిటిజన్లకు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘క్రీడల్లో మాత్రం ఆటగాళ్ల రిటైర్‌మెంట్‌కు అతడి ఇంట్లోని మహిళలే కారణమని చెప్పగలను. ఒక ఆటగాడికి ఫిట్‌నెస్ సమస్యలు మొదలైన తర్వాత అతడి భార్య సలహాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. మీరు రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని.. కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోవాల్సిన సమయం వచ్చిందని చెబుతారు. కానీ, నా దృష్టిలో ఒక గొప్ప అథ్లెట్ కెరీర్ విషయంలో మహిళలు తలదూర్చకూడదన్న విషయాన్ని గట్టిగా నమ్ముతాను. క్రీడాకారులకు ఫిట్‌నెస్‌తో సంబంధం లేదు. శక్తి ఉన్నంతవరకు ఆడాలన్నది నా అభిప్రాయం’’ అని యోగరాజ్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 1:05 pm

19th Season |తొలి పోరులో సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ ఢీ

19th Season | తొలి పోరులో సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ ఢీ 19th Season

ప్రభ న్యూస్ 28 Mar 2026 1:03 pm