SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

Gold Priece Today :షాక్ లు మామూలుగా లేవుగా.. ఇక బంగారం పెరగడం ఇప్పట్లో ఆగదట... రీజన్ ఇదే

ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.

తెలుగు పోస్ట్ 2 Mar 2026 9:25 am

విమాన ప్రయాణికులకు అలర్ట్‌

ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది.

తెలుగు పోస్ట్ 2 Mar 2026 9:17 am

విశ్వాసులకు సకల సౌకర్యాల ఏర్పాట్లు..

విశ్వాసులకు సకల సౌకర్యాల ఏర్పాట్లు.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా ఆర్సిఎం

ప్రభ న్యూస్ 2 Mar 2026 9:14 am

Telangana : నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ

నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు

తెలుగు పోస్ట్ 2 Mar 2026 9:11 am

మోటర్ కేబుల్ చోరీకి వెళితే..

మోటర్ కేబుల్ చోరీకి వెళితే.. వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్

ప్రభ న్యూస్ 2 Mar 2026 9:05 am

Tirumala : తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ క్యూ లైన్

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 2 Mar 2026 8:59 am

పిఓడబ్ల్యూ సీపీఐ నాయకులు అరెస్ట్. ఎందుకో తెలుసా..?

పిఓడబ్ల్యూ సీపీఐ నాయకులు అరెస్ట్. ఎందుకో తెలుసా..? వికారాబాద్, ఆంధ్రప్రభ : లోక్

ప్రభ న్యూస్ 2 Mar 2026 8:43 am

లండన్‌లో తెలంగాణ యువకుడు మృతి

లండన్‌లో తెలంగాణ యువకుడు మృతి

తెలుగు పోస్ట్ 2 Mar 2026 8:38 am

02 Mar 2026 |తిరుమల సమాచారం..

02 Mar 2026 | తిరుమల సమాచారం.. తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి

ప్రభ న్యూస్ 2 Mar 2026 8:31 am

జ్యోతిష్కుడు జోస్యంతో యువతి మృతి

బెంగళూరులో దారుణం జరిగింది. చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో భయపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జరిగింది

తెలుగు పోస్ట్ 2 Mar 2026 8:31 am

కాముడిని దహనం చేసిన గ్రామస్తులు..

కాముడిని దహనం చేసిన గ్రామస్తులు.. వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని

ప్రభ న్యూస్ 2 Mar 2026 8:23 am

జోర్డాన్ లో 'డ్రాగన్' షూట్ లో ఎన్టీఆర్

జోర్డాన్‌లో షూటింగ్ జరుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' చిత్ర యూనిట్‌కు పెను ప్రమాదం తప్పింది

తెలుగు పోస్ట్ 2 Mar 2026 8:21 am

فیکٹ چیک: فضائی حملے میں آیت اللہ خامنہ ای کی ہلاکت سے منسوب جسد خاکی کی تصویر دراصل اے آئی سے تیار کردہ ہے

اسرائیلی فضائی حملے میں ایران کے سپریم لیڈر آیت اللہ علی خامنہ ای کی ہلاکت اور ملبے سے جسد خاکی ملنے کی خبر، دراصل من گھڑت ہے۔وائرل تصویر اے آئی سے تیار کردہ ہے

తెలుగు పోస్ట్ 2 Mar 2026 8:10 am

కరాటే పోటీలలో.. విద్యార్థుల ప్రతిభ..

కరాటే పోటీలలో.. విద్యార్థుల ప్రతిభ.. లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : జపాన్ కరాటే అసోసియేషన్

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:59 am

Iran : అమెరికా–ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా ఇరానీల్లో భయం

సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతితో ఇరాన్ లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి.

తెలుగు పోస్ట్ 2 Mar 2026 7:43 am

ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ మసీదుపై ఎర్రజెండా దేనికి సంకేతం?

టెహ్రాన్: ఎర్రజెండా.. నిరసనలకు, ప్రతీకారానికి, ధిక్కారానికి ప్రతీక. ఇరాన్‌లో మతపరమైన ప్రాముఖ్యతగల ప్రదేశం అయిన జమ్కరన్ మసీదు గో పురంపై ఎర్రజెండా ఎగురవేయడం సంచలనంగా మారింది. ఇరాన్ సు ప్రీం నాయకుడు మరణించిన తర్వాత, న్యాయానికి, ప్రతీకారానికి ప్రతీక గా ఎర్రజెండా ఎగురవేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కోమ్ నగరంలోని మసీదుపై ఎర్రజెండా ఎగురవేయడం నాయకుడి పై ఇరాన్ వాసులలో పెరిగిన కోపం, ప్రతీకారాన్ని ప్రతిబింబిస్తున్నది. ఇదే సమయంలో ఖమేని మద్దతు దారులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇరాన్ పై శనివారం ఇజ్రాయెల్ -అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానికదాడిలో ఖమేనీ మరణించారు. ఆదివారం ఇరాన్ అధికారికంగా ఈ విషయాన్ని ధ్రు వీకరించింది. దీంతో, పాకిస్తాన్, భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలలో నిరసనలు జరిగాయి. సంతాపాన్ని రేకెత్తించాయి. ప్రపంచ చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ ప్రజలు తమ దేశం దశ,దిశ మార్చుకోడానికి ఇది ఏకైక గొప్ప అవకాశంఅన్నారాయన. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ, ఖమేని అనే నిరంకుశుడు ఇక లేడని స్పష్టమైందన్నారు. 

మన తెలంగాణ 2 Mar 2026 7:32 am

T20 World Cup : గెలిచి నిలిచిన టీం ఇండియా.. సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత్

. భారత్ వెస్టిండీస్ ను ఓడించి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది

తెలుగు పోస్ట్ 2 Mar 2026 7:30 am

నేడు కాంగ్రెస్ శిక్షణ శిబిరానికి రాహుల్

 పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం వికారాబాద్‌లో భారీ బందోబస్తు మాజీ మావోలతో రాహుల్ భేటీ? మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 2న (సోమవారం) రాష్ట్రానికి రానున్నారు. పది రోజుల పాటు వికారాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరి రోజు సోమవారం రాహుల్ హాజరై డిసిసి అధ్యక్షులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వికారాబాద్‌కు బయలుదేరి ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం అక్కడ హరిత హోటల్‌లో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆయన హాజరవుతారు. సాయంత్రం 4.30 వరకూ డిసిసి అధ్యక్షులు, పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశా నిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రాహుల్ గాంధీ పర్యటనలో కేవలం శిక్షణ తరగతులకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. మాజీ మావోయిస్ట్ నేతలతో భేటీ ? ఇదిలాఉండగా రాహుల్ పర్యటనలో మరో ఆసక్తికర అంశం మావోయిస్ట్ మాజీ అగ్రనేతలను కలవనున్నారని తెలిసింది. ఇది ఇంకా ఖరారు కాలేదు. కానీ సమయాన్ని బట్టి కొంతసేపు సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలు, క్షేత్ర స్థాయి పరిస్థితులపై వారితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వికారాబాద్‌లో భారీ ఏర్పాట్లు.. రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా వికారాబాద్ హరిత హోటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. డిసిసి అధ్యక్షులకు పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిసింది. రాహుల్ గాంధీ పర్యటనతో రెండు రాష్ట్రాల్లోని పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వస్తుందని నేతలు ఆశిస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైనా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌తో చర్చించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

మన తెలంగాణ 2 Mar 2026 7:27 am

సోమవారం రాశి ఫలాలు (02-03-2026)

మేష రాశి వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగపరంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మనోవేదన ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహ పరుస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభం దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. మిధునం వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి. కర్కాటకం కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూర ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. సింహం విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటను ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది. కన్య ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. తుల ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు. వృశ్చికం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించినవారే దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు. మకరం కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి. కుంభం ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు. మీనం ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.  

మన తెలంగాణ 2 Mar 2026 7:21 am

గురి చూసి.. బరిగీసి

 ఖమేనీ ప్రతీ కదలికపై నిఘా అత్యంత రహస్య ప్రదేశంలో సమావేశంపై ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నదానిపై ఆరా సరైన సమయంలో వైమానిక దాడులు ఇజ్రాయెల్- అమెరికా పక్కా ప్లాన్ తెహరాన్ : ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం. శనివారం నాడు ఇరాన్ లో పనిదినం. పనిదినాలు శనివారంనాడే మొదలు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేని శనివారం నాడు షంఖానీని, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ, అలీ లారిజాని కలుస్తారన్న వార్త అందుకున్న అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ ప్రెసిడెంట్ ట్రంప్, సైనిక ఉన్నతాధికారులకు ఆ విషయం తెలిపింది. అత్యంత రహస్య ప్రదేశంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిసింది. సిఐఏ దాదాపు పది నెలలుగా ఖమేనీ ప్రతికదలికను గమనిస్తోంది. ఎప్పటి కప్పుడు నిఘావర్గాలు ఆ సమాచారాన్ని అందిస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ సీనియర్ సైనిక అధికారుల ఆ సమావేశం సుప్రీంలీడర్ నివాసం ప్రాంగణంలోనే జరుగుతుందని, కచ్చితమైన టైమ్ కూడా తెలియజేసింది. దీంతో అమెరికా - ఇజ్రాయెల్ ఖచ్చితంగా టార్గెట్ పై బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ - అమెరికా కొద్ది కాలంగా రంజాన్ నెలలోనే ఇరాన్ పై దాడికి ప్లాన్ వేసినా, శనివారం నాడు సమావేశం జరిగే సరైన సమయం పై గూఢచారి వర్గాలనుంచి ఖచ్చిత మైన సమాచారం అందేవరకూ ఎదురు చూశాయి. నిజానికి మొదట్లో శనివారం సాయంత్రం సమావేశం జరపాలని నిర్ణయించినా, ఉదయానికి మారిన విషయాన్ని కూడా ఇజ్రాయెల్ ఇంటిలిజెన్స్ పసికట్టింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రణాళికను కూడా మార్చాయి. అత్యంత భద్రతతో కూడిన ఖమేనీ నివాస ప్రాంగణంలోనే సమావేశం జరుగుతుందని తెలిసినా, సమావేశం జరిగే నిర్దిష్టమైన హాలు విషయంలో అనుమానాలే. శాటిలైట్ దృశ్యాలలో కన్పించిన, మొత్తం ఖమేని నివాస ప్రాంగణం లో అంగుళం కూడా విడవకుండా శనివారం పట్టపగలు బాంబుదాడుల పరంపర కొనసాగింది. ఒక సమాచారం మేరకు అత్యంత శక్తివంతమైన 21 బాంబులు వర్షంలా కురిశాయని తెలిసింది. ఒక పక్క ట్రంప్ ఇరాన్ అణుశక్తి కార్యక్రమంపై రెచ్చగొట్టే ప్రకటనలు .చేస్తుండగా, మరో పక్క ఇరాన్ నిరసన ప్రదర్శనలతో దద్దరిల్లుతున్నది. అదే సమయంలో శాంతి చర్చలు అంటూ సాగదీత కార్యక్రమం జరిగింది. సరైన సమయంలో అమెరికా- ఇజ్రాయెల్ ఒకే సారి సంయుక్తంగా విరుచుకుపడడంతో సుప్రీం లీడర్ శకం అంతమైంది. !

మన తెలంగాణ 2 Mar 2026 6:30 am

వెలుగుమట్ల బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతాం

 ఈనెల తేదీలోగా ఖమ్మంలో అర్హులైన పేదలందకీ ఇళ్ల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు సకల హంగులతో సదుపాయాలు పేదలను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షాల చిల్లర రాజకీయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన వెలుగుమట్ల బాధిత కుటుంబాలతో భేటీ, భరోసా మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయులైన అర్హులైన పేదలందరికీ ఈనెల 15లోగా ఇంళ్ల స్థలాలతోపా టు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి రూ.5 లక్షల సాయాన్ని అందిస్తామని రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం కలెక్టరెట్‌లో వెలుగుమట్ల బాధితులతో సమావేశమైవారి సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖ మ్మం నగరంలో నివాసయోగ్యమైన భూముల్లోని వారికి గృహ సముదాయాలను నిర్మించి మౌలి క సదుపాయాలను కూడా కల్పిస్తామన్నారు.అంగన్ వాడీ సెంటర్, స్కూల్, విద్యుత్, మం చినీటి వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తామన్నారు. వెలుగుమట్లలోని 31 ఎకరాల భూదాన్ భూముల స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు గత తొమ్మిదేళ్ళ నుంచి అక్కడ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిరుపేదల నుంచి రూ.30 వేల నుంచి రూ.9 లక్షల వరకు వసూళ్ళు చేశారని అక్రమంగా వసూళ్ళు చేసిన సొమ్మును సైతం రికవరీ చేయించి బాధితులకు అందజేస్తామన్నారు. వెలుగుమట్ల భూముల్లో నిరాశ్రయిలైన వారిపై సర్వే చేయించగా అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయని, బాధితుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు,గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ద్ధిదారులు ఉన్నట్లు తేలిందన్నారు. మొత్తం 720 కుటుంబాల్లో సగం మంది ఖమ్మం జిల్లా వారు కాగా మిగిలిన వారంతా ఈ జిల్లాకు సమీపంలోని జిల్లాలకు, నియోజకవర్గాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వెలుగుమట్ల ప్రభుత్వ భూదాన్ భూముల ఆక్రమణలో తప్పు ఒకరు చేస్తే, శిక్ష మరొకరికి వచ్చినట్లు కొంతమంది బాధితులు తెలియక అక్కడ ఇండ్ల పట్టాలు పొందామనే భ్రమలో ఇండ్లు కట్టుకున్నారని మంత్రి అన్నారు.అక్కడ ఏ నిరుపేద ఉచితంగా స్థలాన్ని పొందలేదని వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని , తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం పేదలకు ఉద్దేశించని ప్రభుత్వం అని, పేదలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగే ప్రసక్తే ఉండదన్నారు. వెలుగుమట్ల సంఘటనలో బాధితులు ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నారు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికారులతో క్షుణ్ణంగా విచారణ చేయించి నిరుపేదలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని అన్నారు. బాధితులు వెలుగుమట్ల ఇంటి స్థలం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో నిర్భయంగా పోలీసు అధికారులకు చెప్పాలని, ఆ డబ్బులు కూడా బాధితులకు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఒక కమిటి గా ఏర్పడి అక్కడ ప్రత్యేక వ్యవస్ద నడిపించారని ఎవ్వరైనా పని ఉండి ఇతర ఊర్లోకి వెళ్ళి వచ్చే సరికి ఇల్లు చేతులు మారుతుందని, తాళం పట్టిందే తడువుగా కొత్తవారికి విక్రయించారని,ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు ,దౌర్జన్యాలకు దిగారని మంత్రి తెలిపారు.గడిచిన పదేళ్ళు అక్కడ భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారన్నారు.పట్టా ఇవ్వకపోగా,తీసుకున్న డబ్బులకు కూడా రశీదులు పత్రాలు ఇవ్వలేదన్నారు. పేద ప్రజల పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, గత పాలకులు వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేయని కారణంగానే నేడు కూల్చివేతలు జరిగాయని మంత్రి అన్నారు. ఈరోజు వచ్చి మొసలి కన్నీరు కార్చే నాయకులు పదేళ్ళు అధికారంలో ఉండి వారికి ఎందుకు ఇళ్ళ ను నిర్మించి ఇవ్వలేదని,కనీసం విద్యుత్,మంచినీటి సౌకర్యాన్ని కూడా ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.2023లో ఆగస్ట్ నెలలో అనాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో కూడా కొన్ని ఇళ్లను కూడా కూలగొట్టారని ఆయన అన్నారు. శవాల మీద చిల్లరు ఎరుకునేవిధంగా రాజకీయాలు చేయవద్దని నిబద్దతతో నిజాలు మాట్లాడలన్నారు పదేళ్ళు అక్కడ విద్యుత్ సౌకర్యం,మంచినీరు లేక ఉంటే అనాటి ప్రభుత్వానికి కళ్ళు లేకుండా పోయిందా?అని ప్రశ్నించారు.పేదలను ముందు పెట్టి రాజకీయం చేయడం సిగ్గు చేటని ,ముఖ్యమంత్రి,మంత్రుల మీద అభండాలు వేసేముందు అలోచించాలన్నారు.కన్నీరు డ్రామాలను రాష్ట్ర ప్రజలు ఆర్దం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.దమ్ముంటే ముందుకు రండి గీతగిస్తాను రండి ఒక్కొక్కరి చరిత్ర ఏంటో తెలుస్తానన్నారు. తన మాటలను వక్రికరించి చూపించారని,కొన్ని మీడియా సంస్ధలు అవాస్తవాలను ప్రచురించడం తగదన్నారు.డిప్యూటి సి ఎం మల్లు భట్టి,మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తమ వ్యక్తిగత పనుల్లో బిజిగా ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయారన్నారు.రాజకీయంగా కొట్లాడాలే గాని పేదలను అడ్డుపెట్టుకోని రాజకీయంగా లబ్ది పొందాలని అనుకోవడం ముర్ఖత్వం అవుతుందన్నారు.విమర్శలు చేయవచ్చు కాని విమర్శలకు కూడా ఆర్ధం ఉండాలన్నారు.డ్రామా యాక్టింగ్ బాగా చేస్తున్న మాజీ మంత్రులకు వెలుగుమట్ల పేదలు ఈ రోజు గుర్తుకువచ్చారా ? అని ఆయన ప్రశ్నించారు.ఈసందర్బంగా వెలుగుమట్ల బాధితులు దళారులకు ఎలా డబ్బులు ఇచ్చి మోసపోయామో మీడియా ప్రతినిధుల ఎదుట వివరించారు.నిరుపేదలను మోసం చేసిన వారిపై చట్టరిత్య చర్య తీసుకుంటామని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.

మన తెలంగాణ 2 Mar 2026 6:10 am

2ndMarch2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

2ndMarch2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 2ndMarch2026 |

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:00 am

రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం -నడుస్తుంది

ఇండ్లను కూలగొట్టడం, భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడమే రేవంత్ రెడ్డి పాలన మూసీ పేరిట సిఎం చేస్తున్న స్కామ్ కోసం వేలాదిమంది ఇండ్లను కూలకొడుతున్నారు బాధితులకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మూసి బాధిత కుటుంబాలతో కెటిఆర్ మూసి దండి మార్చ్ కార్యక్రమం మూడున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేసి, వేలాదిమంది ప్రజలు, మూసి బాధితుల ఆవేదన వింటూ వారికి భరోసా ఇచ్చిన కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఒకవైపు దేశంలో బిజెపి బుల్డోజర్ రాజ్యం చేస్తుదంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నేతలంతా చెబుతుంటే, తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాన్ని ఆపకుండా కాంగ్రెస్ మౌనంగా అక్రమ ఉందని విమర్శించారు. ఒకవైపు బుల్డోజర్ రాజ్యం పైన విమర్శలు చేస్తూ, ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ అరాచకాలను ఆయన పంపిస్తున్న సంచుల కట్టల కోసం చూడకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇండ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం రియల్ ఎస్టేట్ దందా చేయడమే అని, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సిఎం ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క ఇల్లు గాని, ఒక్క రోడ్డు గాని వేయకుండా కేవలం విధ్వంసమే తన విధానంగా పెట్టుకుని ముందుకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున తమ ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం కెటిఆర్ నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో మూడున్నర కిలోమీటర్ల పాటు అనేకమంది బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో బిఆర్‌ఎస్ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరిగి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా, వేడుకున్నా, చివరికి పసిపాపల పట్ల కనికరం చూపాలని కోరినా.. కర్కశంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ, బెదిరింపులకు దిగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారు ముఖ్యమంత్రి ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా దాన్ని కాదని చెప్పి రూ.200 కోట్లతో తనకంటూ ఒక నివాసం నిర్మించుకుంటున్నారని కెటిఆర్ విమర్శించారు. ఇప్పటికే ఆయనకు ప్యాలెస్ లాంటి ఇల్లు ఉన్నదని, అయినా రేవంత్ రెడ్డికి,ఆయన అన్నదమ్ములకు మాత్రం వందల కోట్ల ఇళ్లు కావాలి కానీ.. పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇళ్లను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగేలా, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేలా ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, తన అనుచరులకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారని ఆరోపించారు. ఇందుకోసం పేదల ఇళ్లను పణంగా పెడుతున్నారన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేవలం 16 వేల కోట్ల రూపాయలతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఒక్క ఇల్లు కూడా పోకుండా డిపిఆర్‌ను కూడా సిద్ధం చేశామని గుర్తు చేశారు. కేవలం సుందరీకరణ మాత్రమే కాకుండా రోడ్లతో పాటు ఫ్లై ఓవర్లను కూడా తమ ప్రణాళికలో ఉంచామని, కానీ ఎక్కడా ఒక్క ఇల్లుకు ఇబ్బంది కాకుండా చూశామని అన్నారు. అలాంటి అంశాన్ని పక్కన పెట్టి లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీ కోసం వేల మంది ఇళ్లను ధ్వంసం చేస్తూ రేవంత్ రెడ్డి కొత్త స్కామ్‌కి తెరలేపారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నడుపుతున్నారు మూసీ బఫర్ జోన్‌కి సంబంధించి రకరకాల మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇచ్చిందని కెటిఆర్ విమర్శించారు. అప్పుడు అలాంటి అధికారులను, కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏమో జాతీయ స్థాయిలో బిజెపి బుల్డోజర్ రాజ్యం నడిపిస్తుందని విమర్శలు చేస్తారని, స్వయంగా తన సొంత ముఖ్యమంత్రి, తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్న బుల్డోజర్ రాజ్యం గురించి మాత్రం మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. మూసీలో ఇళ్లు ఉన్నాయని అబద్ధాలు చెప్తూ ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తన సొంత మంత్రులు, తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫార్మ్‌హౌస్‌లు, విల్లాలను, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నడుపుతున్నారని, అందుకే ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లాంటి భూ బకాసురుడి నుంచి, ఈ బ్రోకర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని కెటిఆర్ పిలుపునిచ్చారు. మూసీ బాధితుల కోసం బిఆర్‌ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ అంశంలో న్యాయ పోరాటంలోనూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం వేలమంది ఇళ్లను కూల్చడం ఆపేయాలని, తమ ఎంఎల్‌ఎలను, నాయకులను పంపి బెదిరింపులకు దిగడం మానేయాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు, ఇండ్లకు బదులు డబ్బులు ఇస్తామని మోసం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు లొంగకుండా ఐక్యంగా ముందుకు సాగాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 2 Mar 2026 5:30 am

మనోళ్లు బిక్కు బిక్కు

 ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో గల్ఫ్‌లోని తెలంగాణ వాసుల్లో ఆందోళన యోగక్షేమాలు తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులు బహ్రెయిన్‌లోని బంకర్‌లో తలదాచుకున్న ఆర్మూర్ వాసులు దుబాయ్‌లో తృటిలో తప్పించుకున్న ప్రముఖ టెన్నిస్ టేఙుకీడాకారిణి పివి.సింధు అక్కడే నటుడు విష్ణు కుటుంబం శంషాబాద్ నుంచి44 విమాన సర్వీసులు రద్దు మన తెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలతో గల్ఫ్ దేశాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన తెలంగాణ వా సులు బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త సైనిక ఆపరేషన్‌లో ఇ రాన్ సుప్రీం ఖమేనీ మృతి చెందడంతో, అందుకు ప్రతిగా గల్ఫ్ దే శాలపై ఇరాన్ కొనసాగిస్తోన్న ప్ర తికార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గల్ఫ్ దేశాల్లో ని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ మిస్సైల్, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఈ క్ర మంలో రాష్ట్రంలో నుంచి గల్ఫ్ దేశాలకు వలస వె ళ్లి న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణకు చెందిన లక్షలాది మం ది గల్ఫ్ దేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా, తోట పనులు, ఇంటి పను లు, డ్రైవర్లుగా ఇలా వివిధ రంగాల్లో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పశ్చిమాసియాలో దేశాల్లో కొనసాగుతోన్న యుద్ధంతో అక్కడ ఉపాధి పొందుతున్న వారి ఇక్కడి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారి యోగక్షేమాలను వాట్సప్ కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు అడిగి అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దుబాయ్, ఖ తార్, అబుదబీ, కువైట్, ఓమన్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులకు దిగడంతో అక్కడ నివాసమున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటున్నారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి జీవనోపాధి పొందుతున్నారన్నది అనధికారిక అంచనా. గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయని ఇక్కడి వారు తమకు కుటుంబం సభ్యులకు తెలిపారు. అమెరికా బేస్ క్యాంపులే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగుతుండటంతో యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, అబుదాబి, ఇజ్రాయెల్ ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలు కచ్చితంగా పాటించాలని గల్ఫ్ ప్రాంతంలోని పలు భారత ఎంబసీలు ఇప్పటికే అప్రమత్తం చేశాయి. అక్కడున్న వలస కార్మికుల మొబైల్ ఫోన్లకు వాట్సప్ నెంబర్లు పంపించి, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాలని సూచిస్తున్నారు. దీంతో ఇక్కడున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంకర్‌లో తలదాచుకున్న ఆర్మూర్‌వాసులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన 8 మంది కార్మికులు బహ్రేన్‌లో ఒక బంకర్‌లో తలదాచుకున్నట్టు ఇక్కడి వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి తమను కాపాడాలని వారు కోరుతున్నారు. దుబాయిలో చిక్కుకుపోయిన పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దుబాయిలో చిక్కుకు పోయారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పీవీ సింధు బర్మింగ్‌హామ్ వెళ్తున్నారు. దుబాయ్ మీదుగా ప్రయాణించాల్సి ఉండటంతో ఆమె అక్కడ ఆగారు. గగనతలం మూసివేత, భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయం తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో సింధు తన టీమ్ కోచ్ ఇర్వాన్సియా ఆది ప్రతామాతో కలిసి దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. కళ్లెదుటే భారీ పేలుడు.. భయంకరమైన క్షణాలు.. సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం విమానాశ్రయంలో ఉన్న సమయంలో ఆమెకు అత్యంత సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సింధు కోచ్ చాలా దగ్గరగా ఉన్నారని ఆమె వివరించారు. పొగ, శిధిలాల మధ్య నుంచి ఆయన ప్రాణాలతో బయటపడాల్సి వచ్చిందని తెలిపారు. ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాలు వినపడుతున్నాయని, పరిస్థితి నిమిష నిమిషానికీ భయంకరంగా మారుతోందని సింధు ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ అధికారులు, భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి సింధు బృందాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు వివరించారు. ఈ ఆపద సమయంలో తమకు అండగా నిలిచిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి, అలాగే నిరంతరం పర్యవేక్షిస్తున్న దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంచు విష్ణు కూడా... సినీ నటుడు మోహన్‌బాబు కుమారుడు, తెలుగు సినిమా హీరో మంచు విష్ణు కుటుంబం కూడా కొంతకాలంగా పిల్లల చదువుల కోసం దుబయ్‌లోని పామ్ జుమేరాలో ఉంటోంది. ఆయనకు ఇక్కడే సొంతిల్లు కూడా ఉంది. తన పిల్లలతో కలిసి ఆదివారం (మార్చి 1న) పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి ఫిబ్రవరి 27న మంచు విష్ణు దుబాయ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో దుబాయ్‌లో ప్రస్తుతం నెలకొన్న యుద్దానికి సంబంధించిన అనుభవాలను సామాజిక మాద్యమం ద్వారా పంచుకున్నారు. దుబయ్‌లో కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చాను. ఆకాశంలో మిస్త్స్రల్స్ కనిపిస్తున్నాయి. క్షిపణి దాడుల దెబ్బకు ఇళ్ల గోడలు కంపించిపోతున్నాయి. వాటి శబ్ధానికి మా చిన్నపాప భయపడిపోయిందని ఆయన పోస్ట్ చేశారు. ‘శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దాలు వింటూ పెరగకూడదు. ఇక్కడి పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు నిజంగా జీవితం ఎంత దుర్బలమైనదో గుర్తుచేస్తాయి” అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు. శంషాబాద్‌ల విమానాశ్రాయంలో 44 విమానాలు రద్దు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాందీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన దాదాపు 23 విమాన సర్వీసులు రద్దు కాగా, వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో 21 సర్వీసులు నిలిచిపోయాయి. ప్రధానంగా దుబాయ్, దోహా, అబుదాబి, జెడ్డా, మస్కట్, కువైట్, దమ్మమ్ వంటి నగరాలకు ప్రయాణించాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ కార్యకలాపాలను పరిమితం చేయగా, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు సంబంధిత విమానయాన సంస్థల వెబ్‌సైట్లు లేదా హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా విమాన స్థితిగతులను సరిచూసుకోవాలని సూచించింది. విమానాల రద్దు కారణంగా నష్టపోయిన ప్రయాణికులకు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. అలాగే, విమాన మార్గాల్లో మార్పుల వల్ల ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది. ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించిన ఓవైసీ ఇరాన్ పై జరిగిన దాడిని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను అమానవీయ, చట్టవిరుద్ధమైన, అనైతిక, అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించిన చర్యగా ఓవైసీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెనీవాలో ఇరాన్, -అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం అని కూడా చూడకుండా ట్రంప్, నెతన్యాహు దాడులకు తెగబడ్డారని, వారికి అసలు మానవత్వమే లేదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో 200 మందికి పైగా చనిపోయారని, వారిలో 108 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. ఇజ్రాయెల్ తీరును ఓవైసీ పాకిస్థాన్‌తో పోల్చారు. ఈ రెండు దేశాలు ఆక్రమణ దారులని, తమ పొరుగు దేశాలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని విమర్శించారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై, పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌పై చేస్తున్న దాడులే ఇందుకు నిదర్శనమని అన్నారు. నెతన్యాహు పాలనలో పాలస్తీనాలో 70 వేల మంది ఊచకోతకు గురయ్యారని ధ్వజమెత్తారు. ట్రంప్, నెతన్యాహు భావిస్తున్నట్లు ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు జరగదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఆపడానికి భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఓవైసీ సూచించారు. ‘గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారని, ఒమన్ పోర్టులో జరిగిన దాడిలో ఇప్పటికే కొందరు భారత కార్మికులు గాయపడినట్లు సమాచారం ఉందన్నారు. ఉమ్రా కోసం వెళ్లిన వారు విమానాలు రద్దై, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఓవైసీ తెలిపారు. బిజెపి ప్రభుత్వం ఖమేనీ హత్యను ఖండించి, ఈ యుద్ధాన్ని ఆపడానికి కృషి చేయాలని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. యుద్ధం ఆగకపోతే ఆ ప్రాంతమంతా అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు. ఉద్రిక్తతలను తగ్గించడంలో, శాంతి ప్రయత్నాలలో భారత ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. యుద్ధం కొనసాగితే, అది ప్రపంచ చమురు ధరల పెరుగుదలకు దారితీస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తుందని అసదుద్దీన్ హెచ్చరించారు. 

మన తెలంగాణ 2 Mar 2026 5:00 am

కరాచీలో హింస

ఇరాన్ సుప్రీం లీడర్ హత్యపై పెల్లుబికిన ఆగ్రహం అమెరికా కాన్సులేట్‌పై నిరసనకారులదాడి పోలీసుల కాల్పులు, 10 మంది మృతి 30మందికి గాయాలు, క్షతగాత్రుల్లో పోలీసులు కరాచీ: ఇరాన్‌లో మెరుపుదాడి చేసి ఇరాన్ సు ప్రీంలీడర్ ఖమేనిని హతమార్చడంపై ఆగ్రహించిన నిరసన కారులు ఆదివారంనాడు కరాచీ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసి, విధ్వసం సృష్టించారు. కర్రలతో విరుచుకు పడి అద్దాలు ధ్వంసం చేసి నిప్పుపెట్టేందుకు యత్నించారు. వారిని ఘర్షణ నివారించేందుకు ఒకదశలో పోలీసులు కాల్పులు జరపాల్సివచ్చిం ది. ఘర్షణ నేపథ్యంలో జరిగిన కాల్పులలో పదిమంది చనిపోయారు. శనివారంనాడు అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై పెద్దఎత్తున జరిపిన వైమానిక దాడిలో సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యానంతరం ఈ ఘర్షణలు జరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మరణవార్త విన్నతర్వాత పెద్దఎత్తున నిరసనకారులు కాన్సలేట్ వద్ద గుమికూడారు. వారిని నివారించేందుకు పెద్దఎత్తున లాఠీచార్జీ చేసినా, బాష్పవాయువు ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో 10 మంది చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారని సింధ్‌లోని పోలీస్ సర్జన్ డాక్టర్ సుమై యా సయ్యద్ తెలిపారు. ఆస్పత్రికి 10 మృతదేహాలను తీసుకువచ్చారని ఆయన తెలిపారు.చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడాన్ని సహించబోమని సింద్ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి జియావుల్ హసన లాగర్ అన్నారు. కాన్సులేట్ పై జరిగిన దాడికి సంబంధించి తక్షణం వివరాలు అం దించాలని కరాచీ అదనపు ఐజీని ఆదేశించారు. 

మన తెలంగాణ 2 Mar 2026 4:40 am

ఖమేనీ హత్య మహాపాపం

 నైతిక విలువలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే ఇరాన్‌పై వెంటనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి: పుతిన్ ఖమేనీ హత్య ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడే దాడులను తప్పుపట్టిన చైనా  అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే రష్యా అధినేత పుతిన్ ఖండన మాస్కో : ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీని చంపివేయడం దారుణ ఘటన అని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ఈ మేరకు ఆయన తరఫున ఆదివారం ప్రకటన వెలువడింది. సంకుచిత రీతిలో జరిగిన మానవీయ నైతికత ఉల్లంఘన, అంతర్జాతీయ చట్టాలకు విఘాతం అని పుతిన్ తీవ్రంగా స్పందించారు. తమ ప్రకటనను ఆయన ఇరాన్ అధ్యక్షుడికి పంపించారు. శనివారం అర్థరాత్రి తరువాత ఇరాన్‌లో జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలలో ఖమేనీ కుటుంబం అంతం అయింది. ఇరాన్ రిపబ్లిక్ అధినేత హత్యాకాండ పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని, దీనిని స్వీకరించాలని తెలిపారు. పుతిన్ ప్రకటన అధికారిక క్రెమ్లిన్ పోర్టల్‌లో పొందుపర్చారు. శనివారమే పుతిన్ తమ దేశ జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఖమేనీ హత్య చట్టాల ఉల్లంఘనే : చైనా ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీని అంతమొందించడంపై చైనా ఖండన వెలువరించింది. ఇరాన్ సుప్రీం నాయకుడిని దారుణ రీతిలో తుదముట్టించడం ఇరాన్ సార్వభౌమాధికారం , భద్రతల నిబంధనల ఉల్లంఘన పరిధికి వస్తుందని చైనా తమ ప్రకటనలో తెలిపింది. ఐరాస నియమావళికి, అంతర్జాతీయ కట్టుబాట్లను దా రుణంగా ఉల్లంఘించారని విమర్శించారు. అంతర్జాతీ య సంబంధాలలో ఇది అత్యంత దారుణ ఘట్టం అని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో తక్షణమే సైనిక చర్యల నిలిపివేత అవసరం అని చైనా డిమాండ్ చేసింది. ప్రపం చం తల్లడిల్లే పరిస్థితిని రాకుండా చేయాలని తెలిపారు. ఇక చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, సెర్గీ లావ్రోవ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్‌పై దాడులు, పరస్పర దాడుల పరిస్థితిపై ఆదివారం సమీక్షించారు.

మన తెలంగాణ 2 Mar 2026 4:20 am

తిరగబడ్డ ఇరాన్

 ఖమేనీ మరణం తర్వాత ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ 27 ప్రతీకార దాడులు ఇజ్రాయెల్‌పై దాడిలో 8 మృతి అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ నౌకపై క్షిపణి దాడి దుబాయ్, అబుదాభి, దోహా, మనామాలపై దాడులు హార్ముజ్ జలసంధి మార్గంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడి.. 15 మంది భారతీయులు సురక్షితం దుబాయ్‌లోని పారిశ్రామిక నగరం షార్జాసిటీలో ఇరాన్ వైమానికి దాడి తర్వాత దృశ్యం దుబాయ్ : తమ ప్రతీకార చర్యల ఉధృతితో ఆదివారం ఇరాన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఓ వైపు ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులకు దిగుతున్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట సైనిక చర్యను ఇరాన్ చేపట్టింది. ఇప్పటివరకూ ఓ ఎత్తు అయితే ఇకపై జరిగేది మరో ఎత్తు అని, తమ దాడులతో ఇక ఇజ్రాయెల్, అమెరికాలు వదలిపెట్టండని వేడుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. తమ బలగాలు ఆదివారం మధ్య ప్రాచ్యంలోని 27 అమెరికా సైని క స్థావరాలపై దాడికి దిగాయని, భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు వర్గాలు టెహరాన్‌లో తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని టెల్‌నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాల యం హాకీర్యా పై కూడా దాడికి దిగినట్లు వెల్లడించారు.ఆదివారం ఇజ్రాయెల్‌లోని బెయిట్ షెమెష్ పట్టణంపై మిస్సైల్ దాడిలో కనీసం ఎనమండుగురు చనిపోయినట్లు. 17 మందికి పైగా గాయపడ్డట్లు ఇరాన్ తెలిపింది. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీనిని ఆ ప్రాంత వైద్యాధికారులు కూడా ధృవీకరించారు. అమెరికాకు చెందిన యుద్ధ విమా న వాహక నౌక లింకన్‌పై దాడికి దిగాయి. యుఎస్‌ఎస్ లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఇరాన్ తీర ప్రాంతంలో మకాం వేసుకుని ఉన్నప్పుడు ఇరాన్ దాడికి గురైంది. మరో వైపు ఇరాన్ సేనలు దుబా య్, అబూధాబి, దోహా, మనామాలపై దాడులకు దిగాయి.ఖతార్ రాజధాని దోహా ఎక్కువగా ఇరాన్ దాడులకు తల్లడిల్లుతోంది. ఇక్కడి అమెరికా సైనిక స్థావరాలను ఎంచుకుని ఆదివారం మధ్యాహ్నానికి 11 సార్లు దాడులు జరిగాయి. కీలకమైన అంతర్జాతీయ విమాన ప్రయాణ కేంద్రం అయిన ఖతార్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి దాడులతో దుబాయ్ వాసులు, ప్రత్యేకించి పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటల ప్రాంతం లో వరుస పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ప ర్యాదం బూర్జు ఖలీఫా సమీపంలోని పలు అంతస్తుల భవనాలపై దాడులు జరిగాయి. అక్కడి ఓ హోటల్ ఇరాన్ క్షిపణి దాడులతో పాక్షికంగా దెబ్బతింది. అక్కడ మకాం వేసుకుని ఉన్న పర్యాటకులు భయంతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చిం ది. శనివారం మధ్యాహ్నం నుంచే దుబాయ్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకుని దాడులు సాగుతున్నాయి. గంటల విరామంతో పేలుళ్లు విన్పిస్తూ వచ్చాయని భారత్‌కు చెందిన ఓ ఐటి నిపుణుడు ఆర్ చౌదరి దుబాయ్ నుంచి ఫోన్‌లో తెలిపాడు. ఖమేనీ అంతంతో ఇరాన్ దాడులు భీకర స్థాయికి చేరిన విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ నిర్థారించింది. ఆదివారం ఇరాన్ శక్తివంతమైన రెండు ఖండాంతర క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణులు సైప్రస్ దిశలో దూసుకువెళ్లాయి. అయి తే సైప్రస్‌ను లక్షంగా ఎంచుకుని దాడులు జరగలేదని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. రెడ్‌లైన్ దాటినందుకు తగు శిక్ష: ఇరాన్ ఇరాన్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. రెవెల్యూషనరీ గార్డు రంగంలోకి దిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు రెడ్‌లైన్ దాటాయని , పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మెహమ్మద్ బఘెర్ ఖాలిబప్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రకటించారు. చావుదెబ్బతీస్తామని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి మార్గంలో దాడులు 15 మంది భారతీయ నౌకా సిబ్బంది సురక్షితం మరో వైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యవసరం అయిన హర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతి సాయుధులు ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారత జాతీయులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఖతార్‌లో అమెరికా వైమానిక స్థావరం ధ్వంసం కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇరాన్ విఘాతం దోహా ః ఆదివారం ఇరాన్ జరిపిన దాడులలో ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం దెబ్బతింది. యుఎస్ కమ్యూనికేషన్స్ కోసం వినియోగించే డోమ్ ధ్వంసం అయిందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కూడా నిర్థారించింది. ఇరాన్ ప్రతీకార దాడుల ప్రభావం ఎక్కువగా దోహాపై పడుతోంది. ఈ ప్రాంతంలో అమెరికా సమాచార వినిమయానికి అవసరం అయిన వ్యవస్థ విచ్ఛిన్నం అయినట్లు వెల్లడైంది. డోమ్‌పై దాడి జరిగిన విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి సియాన్ పర్నేల్ ధృవీకరించారు. అయితే ఖతార్ అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి స్పందనా వెలువరించలేదు. 

మన తెలంగాణ 2 Mar 2026 12:01 am

27 అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌తో చర్యలు ఇజ్రాయెల్ పై దాడుల్లో ఎనిమిది మంది మృతి యుఎస్ లింకన్ నౌకపై దాడి .. దోహా దుబాయ్‌లలో పేలుళ్లు ఖమేనీ అంతం తరువాత టెహరాన్ టార్గెట్ ఇకపై కోలుకోలేని దెబ్బ అని ట్రంప్ హెచ్చరిక బుర్జు ఖలీఫ్ వద్ద హోటల్‌పై ఇరాన్ దాడి భారతీయులు సహా పర్యాటకుల కలవరం దుబాయ్ : తమ ప్రతీకార చర్యల ఉధృతితో ఆదివారం ఇరాన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఓ వైపు ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులకు దిగుతున్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట సైనిక చర్యను ఇరాన్ చేపట్టింది. ఇప్పటివరకూ ఓ ఎత్తు అయితే ఇకపై జరిగేది మరో ఎత్తు అని , తమ దాడులతో ఇక ఇజ్రాయెల్, అమెరికాలు వదలిపెట్టండని వేడుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. తమ బలగాలు ఆదివారం మధ్యప్రాచ్యంలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై దాడికి దిగాయని , భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు వర్గాలు టెహరాన్‌లో తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని టెల్‌నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకీర్యా పై కూడా దాడికి దిగినట్లు వెల్లడించారు.ఆదివారం ఇజ్రాయెల్‌లోని బెయిట్ షెమెష్ పట్టణంపై మిస్సైల్ దాడిలో కనీసం ఎనమండుగురు చనిపోయినట్లు. 17 మందికి పైగా గాయపడ్డట్లు ఇరాన్ తెలిపింది. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీనిని ఆ ప్రాంత వైద్యాధికారులు కూడా ధృవీకరించారు. అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక లింకన్‌పై దాడికి దిగాయి. యుఎస్‌ఎస్ లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఇరాన్ తీర ప్రాంతంలో మకాం వేసుకుని ఉన్నప్పుడు ఇరాన్ దాడికి గురైంది. మరో వైపు ఇరాన్ సేనలు దుబాయ్, అబూధాబి, దహా, మనామాలపై దాడులకు దిగాయి. ఖతార్ రాజధాని దోహా ఎక్కువగా ఇరాన్ దాడులకు తల్లడిల్లుతోంది. ఇక్కడి అమెరికా సైనిక స్థావరాలను ఎంచుకుని ఆదివారం మధ్యాహ్నానికి 11 సార్లు దాడులు జరిగాయి. కీలకమైన అంతర్జాతీయ విమాన ప్రయాణ కేంద్రం అయిన ఖతార్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి దాడులతో దుబాయ్ వాసులు, ప్రత్యేకించి పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాదం బూర్జు ఖలీఫా సమీపంలోని పలు అంతస్తుల భవనాలపై దాడులు జరిగాయి. అక్కడి ఓ హోటల్ ఇరాన్ క్షిపణి దాడులతో పాక్షికంగా దెబ్బతింది. అక్కడ మకాం వేసుకుని ఉన్న పర్యాటకులు భయంతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. శనివారం మధ్యాహ్నం నుంచే దుబాయ్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకుని దాడులు సాగుతున్నాయి. గంటల విరామంతో పేలుళ్లు విన్పిస్తూ వచ్చాయని భారత్‌కు చెందిన ఓ ఐటి నిపుణుడు ఆర్ చౌదరి దుబాయ్ నుంచి ఫోన్‌లో తెలిపాడు.ఖమేనీ అంతంతో ఇరాన్ దాడులు భీకర స్థాయికి చేరిన విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ నిర్థారించింది. ఆదివారం ఇరాన్ శక్తివంతమైన రెండు ఖండాంతర క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణులు సైప్రస్ దిశలో దూసుకువెళ్లాయి. అయితే సైప్రస్‌ను లక్షంగా ఎంచుకుని దాడులు జరగలేదని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. రెడ్‌లైన్ దాటినందుకు తగు శిక్ష ః ఇరాన్ ఇరాన్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. రెవెల్యూషనరీ గార్డు రంగంలోకి దిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు రెడ్‌లైన్ దాటాయని , పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మెహమ్మద్ బఘెర్ ఖాలిబప్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రకటించారు. చావుదెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇంతకు ముందెప్పుడూ చవిచూడని విధంగా ఈ చర్య ఉంటుందని వెల్లడించారు. ఈ వాదనను ట్రంప్ తిప్పికొట్టారు. మీరేం చేయలేరని , ఒకవేళ చేస్తే తమ శక్తివంతమైన దాడికి ఇక కోలుకోలేరని స్పందించారు. హర్మూజ్ జలసంధి మార్గంలో దాడులు 15 మంది భారతీయ నౌకా సిబ్బంది సురక్షితం మరో వైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యవసరం అయిన హర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతి సాయుధులు ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారత జాతీయులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరికలతో ఈ జలసంధి మార్గాన్ని మూసివేశారు. అయితే ఈ ప్రాంతంలో పలు రవాణా నౌకలు యధావిధిగా తిరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి మార్గంలో వెళ్లుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగామని, అది మునిగిపోయిందని ఇరాన్ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలోనే మరో నౌకపై ఇరాన్ మద్దతుగల హౌతీలు దాడికి దిగినట్లు, ఈ క్రమంలో కొందరు గాయపడ్డట్లు వెల్లడైంది. ఈ రెండు వేర్వేరు ఘటనలని ఇరాన్ తెలిపింది.ఖమేనీ అంతం తరువాత ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహరాన్‌పై భీకర క్షిపణి దాడులకు దిగాయి. ఆగకుండా సాగుతోన్న దాడులతో పలు ప్రాంతాలలో భయానక పరిస్థితి ఏర్పడింది. 

మన తెలంగాణ 1 Mar 2026 11:41 pm

ఇరాన్ ఆపద్ధర్మ నేతగా అయతుల్లా రెజా

ముగ్గురు సభ్యుల గార్డియన్ కౌన్సిల్ కొత్త సారధి కీలక మత పెద్ద, మదర్సా సారధి ఖమేనీకి అత్యంత సన్నిహితుడు సమిష్టి నిర్ణయాలతోనే పాలన టెహరాన్ : ఇరాన్‌లో ఖమేనీ హతంతో వెంటనే ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీంలీడర్‌గా అయతుల్లా అలీ రెజా నియమితులు అయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో దేశ నాయకత్వ శూన్యత ప్రమాదకరం కావడంతో ఈ నియామకం జరిగినట్లు అధికార వర్గాల కథనం మేరకు దేశంలోని ఇస్నా వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్‌లో అలీరెజా అనుభవజ్ఞుడైన మత పెద్దగా ఉన్నారు. ఖమేనీ హయాంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 67 సంవత్సరాల అలీరెజా ఇరాన్ మత వ్యవహారాల తంతులో ఇప్పుడు సీనియర్ వ్యక్తి. ఆయనకు పాలనా పగ్గాలు అప్పగించారు. ఇంతకు ముందు ఆయన ఇస్లామిక్ బోధక విద్యాసంస్థలు, మదర్సా కార్యకలాపాల జాతీయ వ్యవస్థకు సారధి. దేశంలోని ప్రాబల్య షియా వర్గంలో ఉన్న గురుత్వంతో ఈ కీలక స్థానం దక్కింది. అంతేకాకుండా ఖమేనీ అంతర్గత కూటమిలో విశ్వాస పాత్రుడుగా పేరొందిన రెజా గార్డియన్ కౌన్సిల్‌లో మతవ్యవహారాల సభ్యుడిగా ఉన్నారు. దేశంలో పలు వ్యవహారాల నిపుణుల సమావేశాల్లో కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. రెజా ముందు పలు సంక్లిష్ట అంశాలు ఉన్నాయి. ముందుగా ఇరాన్‌పై తీవ్రస్థాయి అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తట్టుకోవల్సి ఉంటుంది. ఇదే దశలో ఇరానీయన్లలో పాలకుల పట్ల కనీస సంఘీభావం వ్యక్తం కావాలంటే ఖమేనీ అంతానికి ప్రతీకారం తీర్చుకోవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు ముందుండే ప్రధాన సవాలు దేశంలోని యువనవతరం ఇప్పటి రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు తాము పగ్గాలు స్వీకరించేందుకు ముందుకు వస్తే ఏం చేయాలనేది ఖరారు చేసుకోవాలి. రాబోయే రోజులు గంటల వ్యవధిలోనే తన నాయకత్వ సమర్థతను నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశంలో చలామణిలో ఉన్న అంతర్గత నాయకత్వ మండలి సభ్యుల రహస్య సమావేశంలో కొత్త నేతను ఎంపిక చేశారు. అయితే తాత్కాలిక బాధ్యతల్లోకి తీసుకున్నారని వెల్లడైంది. ఇరాన్‌లో ఖమేనీ హత్య వెంటనే అక్కడి రాజ్యాంగంలోని ఆర్టికల్ 111ను ఆచరణలో పెట్టారు. అత్యవసర రీతిలో నాయకత్వ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సుప్రీం లీడర్‌గా రెజా ఉంటున్నప్పటికీ శాశ్వత వారసుడి ఎంపిక వరకూ ముగ్గురు సభ్యుల కౌన్సిల్ బాధ్యతలను తీసుకుంటుంది. విధి విధానాలను బట్టి రెజా ఇకపై దేశ అధ్యక్షులు మసౌద్ పెజిషుకియాన్, దేశ ప్రధాన న్యాయమూర్తి గోలామ్ హుస్సేని మెహ్‌సెని ఎజితో కలిసి దేశాన్ని పాలించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు పాలనా నిర్వహణకు అంతిమ నిర్ణయాలు అన్ని కూడా ఖమేనీపైనే ఆధారపడి ఉండేవి. అయితే ఇప్పుడున్న కౌన్సిల్‌లోని ముగ్గురు సభ్యులలో రెజానే మతపెద్దగా కీలక పాత్ర పోషిస్తారు. రెజా 1959 లో జన్మించారు. దేశ రక్షణ కీలక విషయాలపై కూడా ఆయనకు అనుభవం ఉందని వార్తా సంస్థలు తెలిపాయి. 

మన తెలంగాణ 1 Mar 2026 10:34 pm

దుబాయ్‌లో భయం భయంగా

భారతీయ సెలబ్రిటీలు సింధు, సోనాల్ స్పందన దుబాయ్/ న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం ఘర్షణల ప్రభావం దుబాయ్‌పై పడటంతో ఈ మహానగరంలో చిక్కుపడ్డ భారతీయ సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. తాము సురక్షితంగానే ఉన్నామని అయితే ఎప్పుడేం జరుగుతుందో అనే భయాలతో ఉండాల్సి వస్తోందని భారత్‌లోని తమ సన్నిహితులకు వాట్సాప్ సందేశాల ద్వారా తెలియచేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతతో దుబాయ్ నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు నిలిచిపోయాయి. దీనితో ప్రపంచ స్థాయి దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి ఎప్పుడు విమానాల రాకపోకలు ఆరంభమవుతాయనేది స్పష్టం కావడంలేదు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ విజేత పివి సింధు దుబాయ్‌లో చిక్కుపడ్డారు. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు బర్మింగ్‌హామ్‌కు ఇండోనేసియా కోచ్ ఇర్వాన్‌స్యాయ్‌తో కలిసి బయలుదేరుగా ఎయిర్‌పోర్టులో నిచిలిపోవల్సి వచ్చింది. సమీపంలోనే ఇరాన్ బాంబుల దాడి జరిగింది. దీనితో తాము పరుగులు తీశామని, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయని తెలిపారు. స్థానిక అధికారులు తమను తరువాత సురక్షిత ప్రాంతంలోని ఓ హోటల్‌కు జాగ్రత్తగా తీసుకువెళ్లారని చెప్పారు. తాము ఇప్పుడు క్షేమంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడి భారతీయ ఎంబసికి, స్థానిక అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నామని తెలిపారు. ఇక బర్మింగ్‌హామ్‌లో క్రీడా నిర్వహణపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ పరిస్థితి సమీక్షిస్తోంది. ఇక నటి సోనాల్ చౌహాన్ కూడా దుబాయ్‌లో ఉండిపోవల్సి వచ్చింది. తాను క్షేమంగా భారతదేశానికి తిరిగివచ్చేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 10:21 pm

ఇజ్రాయెల్, గల్ఫ్‌దేశాలపై ఇరాన్ దాడులు

ఎక్కువగా దుబాయ్ టార్గెట్ ...ఓ వ్యక్తి మృతి హర్మూజ్ జలసంధిలో ఓ నౌకపై దాడి 15 మంది భారతీయ సిబ్బంది సురక్షితం దుబాయ్ : ఖమేనీ అంతంతో ఇరాన్ శనివారం రాత్రి నుంచే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై భీకర దాడులకు దిగింది. తమ అధినేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ కేబినెట్ నుంచి తీవ్రస్థాయి ప్రకటన వెలువడింది. రెవెల్యూషనరీ గార్డు రంగంలోకి దిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు రెడ్‌లైన్ దాటాయని , పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మెహమ్మద్ బఘెర్ ఖాలిబప్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రకటించారు. చావుదెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇంతకు ముందెప్పుడూ చవిచూడని విధంగా ఈ చర్య ఉంటుందని వెల్లడించారు. ఈ వాదనను ట్రంప్ తిప్పికొట్టారు. మీరేం చేయలేరని , ఒకవేళ చేస్తే తమ శక్తివంతమైన దాడికి ఇక కోలుకోలేరని స్పందించారు. ఈ నేపధ్యంలోనే ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. మరో వైపు బహరైన్, కువైట్, ఖతార్ ల్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాంబులు కురిపించారు. ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే దెబ్బతీశారు. ఇక దుబాయ్‌పై కూడా దాడులు తీవ్రతరం అయ్యాయి. దుబాయ్‌లో శకలాలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. జోర్డాన్ , బహరైన్‌లపై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. అయితే వీటి ప్రభావం ఏ మేరకు ఉందనేది స్పష్టం కాలేదు. మరో వైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యవసరం అయిన హర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతి సాయుధులు ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారత జాతీయులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరికలతో ఈ జలసంధి మార్గాన్ని మూసివేశారు. అయితే ఈ ప్రాంతంలో పలు రవాణా నౌకలు యధావిధిగా తిరుగుతున్నాయి. ఖమేనీ అంతం తరువాత ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహరాన్‌పై భీకర క్షిపణి దాడులకు దిగాయి. ఆగకుండా సాగుతోన్న దాడులతో పలు ప్రాంతాలలో భయానక పరిస్థితి ఏర్పడింది. 

మన తెలంగాణ 1 Mar 2026 10:15 pm

పేద విద్యార్థులకు 150 సైకిళ్ల పంపిణీ

పేద విద్యార్థులకు 150 సైకిళ్ల పంపిణీ విజయవాడ, ఆంధ్రప్రభ: ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:14 pm

టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి

టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి భవానిపురం, ఆంధ్రప్రభ : టీటీడీ చైర్మన్

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:10 pm

విజయవాడ పర్యటనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

విజయవాడ పర్యటనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయవాడ, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టు

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:04 pm

సూర్యకుమార్ యాదవ్ ఔట్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సంజూ శామ్సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్ లు(55), తిలక్ వర్మ (01)లతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 10:00 pm

ప్రకృతి అందాలను ఆవిష్కరించే వసంతం

ప్రకృతి అందాలను ఆవిష్కరించే వసంతం కనువిందు చేస్తోన్న మోదుగ పూలువిరగ పూసిన మోదుగ

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:55 pm

పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం

పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం టేకుమట్ల,ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:50 pm

దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం

దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:44 pm

గచ్చిబౌలిలో కానిస్టేబుల్ ను బెంజ్ కారుతో ఢీకొట్టి... కిలో మీటరు లాక్కెళ్లాడు

హైదరాబాద్: గచ్చిబౌలిలో బెంజ్ కారు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు బానెట్ పై ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ను కిలో మీటరు లాక్కెళ్లాడు.  నానక్ రామ్ గూడ వద్ద అతివేగంతో దూసుకొచ్చి మరో కారును టిఎస్ 07 ఇఎక్స్ 556 అనే నంబర్ గల బెంజ్ కారు ఢీకొట్టి ఆగకుండా డ్రైవర్ పరారయ్యాడు. వైర్ లెస్ ద్వారా పోలీసులను ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్రమత్తం చేశాడు.  ట్రిబుల్ ఐటీ చౌరస్తా జంక్షన్ వద్ద కారును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఢీకొట్టడంతో అతడు బ్యానెట్ పై పడ్డాడు. కిలోమీటరు మేర కానిస్టేబుల్ ను కారుతో సహా డ్రైవర్ లాక్కెళ్లాడు. వాహనదారుల సహాయంతో కారును పోలీసులు అడ్డుకున్నారు.  డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. గచ్చిబౌలి పోలీసులు బెంజ్ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

మన తెలంగాణ 1 Mar 2026 9:44 pm

ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి

ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి కూసుమంచి, ఆంధ్రప్రభ: కూసుమంచి మండల కేంద్రానికి చెందిన

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:40 pm

నెటిజన్లను ఆకట్టుకుంటున్న తడోబా అంధారి పులి

మన తెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ ప్రేమికుడు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ తడోబా అంధారి టైగర్ రిజర్వులో పర్యటించి అక్కడి చక్కటి దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఆ సమయంలో అడివిలో తిరుగాడుతున్న ఒక పులిని ఆయన తన కెమెరాతో ఫోటో తీశారు. ఈ దృశ్యాన్ని తన వారాంతపు ఫోటోగ్రఫీలో భాగంగా ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

మన తెలంగాణ 1 Mar 2026 9:32 pm

Fact Check: Viral Airport Blast Image Actually Shows Israeli Strike on Rafah, Not Afghanistan

Loud blasts followed by gunfire were heard in the Afghan capital, Kabul, on Sunday morning amid ongoing clashes between Afghan and Pakistani forces, according to media reports. The violence comes days after Afghanistan's Taliban administration said it remained open to negotiations even as tensions with Pakistan spiralled into an open war following Pakistani airstrikes targeting multiple Afghan cities. Amid this, an image surfaced on the internet. The image shows a town engulfed in flames. Users are sharing the image claiming that it is from Kabul Airport and that the Pakistan Air Force conducted a new airstrike there. A user shared the picture and mentioned in the post: “Two explosions were heard at Kabul Airport. Reportedly, the Pakistan Air Force conducted a new airstrike.” JUST IN: 2 explosions heard at Kabul Airport. Reportedly Pakistan Air Force conducted a new airstrike. Fallow @GeoPoliticlc pic.twitter.com/ET2sCyxT7b — Geopolitics Press (@GeoPoliticlc) February 27, 2026 You can find the archive link here . Fact Check: The claim is false. The image dates back to March 2024 and reportedly shows a fireball erupting during an Israeli bombardment on Rafah in the Gaza Strip. During our investigation, we conducted a reverse image search. This led us to a March 27, 2024 report by Al Monitor , which used the same photograph in a story about heavy Israeli bombardment in southern Gaza, especially in Rafah. The same image was also found in a March 2024 AFP report published on www.news24.com. The caption read: “A fireball erupts during Israeli bombardment on Rafah in the southern Gaza Strip, amid the ongoing battle between Israel and the Palestinian militant group Hamas.” This shows that the image has been available online since at least March 2024. We also found on 27 March 2024 AFP shared a video in their YouTube Channel. In the Title AFP mentioned, Fireball lights up skyline as Israeli strike hits Rafah. In approximately a two-second segment of the video, we found the same explosion visible, matching the viral image. The team webqoof also debunked it and published, Old Image of Huge Explosion Falsely Linked to Afghanistan-Pakistan Escalations Hence, we found the viral claim linking the image to an explosion at Kabul airport amid Afghanistan-Pakistan tensions is false. The photograph predates the current developments and actually captures an Israeli bombardment on Rafah in Gaza from March 2024. Sharing old and unrelated visuals in a new context not only distorts facts but also fuels unnecessary panic and misinformation.

తెలుగు పోస్ట్ 1 Mar 2026 9:32 pm

సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ, మేయర్

సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ, మేయర్ ప్రజా సంక్షేమమే

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:31 pm

అభిషేక్, ఇషాన్ ఔట్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్ లు(20), సూర్య కుమార్ యాదవ్(01)లతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:27 pm

అభిషేక్ శర్మ ఔట్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా మూడు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(1), సంజూ శామ్సన్ లు(19) బ్యాటింగ్ చేస్తున్నారు.  తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:18 pm

వరాహ స్వామిని వెలికి తీసిన వానరం

వరాహ స్వామిని వెలికి తీసిన వానరం భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌ మండలంలోని

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:15 pm

మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్

మార్చి 8 నుండి మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఈ మెగా ఈవెంట్‌కు వేదిక కానున్న గచ్చిబౌలి హాకీ స్టేడియం మన తెలంగాణ/హైదరాబాద్: క్రీడా రంగంలో దేశంలోనే అత్యంత చురుకైన నగరంగా పేరొందిన హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు వేదిక కానుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ద హాకీ (ఎఫ్‌ఐహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది. ఈ పోటీలు ఈ నెల 8 నుండి 14 వరకు హైదరాబాద్‌లో నూతనంగా పునర్నిర్మించబడిన గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగనున్నాయి. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న 8 దేశాల జట్లు ఈ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది దేశాల జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టోర్నమెంట్ 2026 మహిళల హాకీ వరల్ కప్‌కు అర్హత సాధించేందుకు కీలకమవుతుంది. కాగా ఈ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాల ఆస్ట్రో టర్ఫ్, అత్యున్నత భద్రతా ఏర్పాట్లు, క్రీడాకారులు, అధికారుల కోసం ప్రీమియం వసతి అందుబాటులో ఉంచారు. అలాగే హాకీ ఇండియా, (ఎఫ్‌ఐహెచ్) ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జట్లు భారత జట్టు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. అన్ని జట్లకు అంతర్జాతీయ ప్రమాణాల వసతి, ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించబడ్డాయి. ఈ టోర్నమెంట్ సందర్భంగా నగరానికి విచ్చేసే క్రీడాకారులు, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ప్రత్యేక వారసత్వ పర్యటనలు, వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల తెలంగాణలో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 నిర్వహణతో హైదరాబాద్ మరోసారి ప్రపంచ క్రీడా పటంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకోనుంది. ఈ సందర్భంగా అన్ని జట్లు, అధికారులు, అభిమానులను తెలంగాణ ప్రభుత్వం హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది.

మన తెలంగాణ 1 Mar 2026 9:14 pm

మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది..

మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది.. 15లోపు పట్టాలిస్తాం.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాంవెలుగుమట్ల

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:09 pm

వేసవి తాగునీటికి మిషన్ భగీరథ ఏర్పాట్లు

అన్ని ఆవాసాలకు ఇబ్బంది లేకుండా సరఫరా ప్రణాళిక రూపకల్పన చేసిన ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం కసరత్తు చేస్తోంది. మిషన్ భగీరథ ద్వారా అన్ని మారు మూల ప్రాంతాలకు తాగునీటిని అందించి నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు ప్రణాళికను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాలు ఉండగా, వాటిలో కేవలం 150 ఆవాసాలకు మాత్రమే మిషన్ భగీరథ నీరు అందడం లేదు. దీనికితోడు కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటైనట్లు నమోదు కావడంతో వీటికి కూడా మిషన్ భగీరథ నీటిని అందించాల్సి ఉంది. కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైపు లైన్లు వేయడం సవాల్‌గా ఉన్న ప్రాంతాల్లో స్థానిక జల వనరులను వినియోగించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిరంతర తాగునీటి సరఫరా కల్పించేందుకు గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం కృషి చేస్తోంది. మిషన్ భగీరథ పథకానికి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో ప్రస్తుతం అవసరాలకు సరిపడా నీరు నిల్వ ఉందని అధికారులు నివేదిక తయారు చేశారు. దీంతో వేసవిలోనూ పెద్దగా ఇబ్బందులు లేకుండా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మిషన్ భగీరథలో చాలా ప్రాంతాల్లో తాగునీరు అందండం లేదనే ఫిర్యాదులపై నిశిత పరిశీలన చేసేందుకు, అందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇంటింటికి తాగునీరు అందుతున్న పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాల్సి ఉంది. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి, ప్రజల్లో మిషన్ భగీరథ నీటిపై నమ్మకం పెంచేలా చూడాలని అధికారులు ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామసభల్లో మిషన్ భగీరథ నీటి వినియోగంపై తీర్మానాలు చేయించి అవగాహన పెంచేందుకు కూడా నిర్ణయించారు. ప్రతి కుటుంబానికి తాగునీటిని అందించే ప్రణాళిక మిషన్ భగీరథ పథకం నిర్దేశించిన మేరకు ప్రతి కుటుంబానికి తాగునీటిని అందించేందుకు వీలుగా ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతంలో అయితే రోజుకు తలసరి వంద లీటర్లు, అదే మున్సిపాలిటీల్లో అయితే తలసరి 135 లీటర్లు, నగర పాలక సంస్థల్లో అయితే తలసరి 150 లీటర్లు సరఫరా చేయాల్సి ఉంది. గతంలో వర్షాభావం వల్ల నీటి నిల్వలు సరిపడా లేకపోవడం వల్ల అవసరమైన మేర నీటిని సరఫరా చేయలేదు. ఈసారి భారీ వర్షాల కారణంగా నీటి నిల్వలు ఉన్నందున సరఫరా అనుకున్న మేర జరుగుతుందని అధికార వర్గాల సమాచారం. కొత్తగా గుర్తించిన ఆవాసాలకు కూడా తాగునీటిని అందించేందుకు ప్రణాళిక బద్దంగా రూపకల్పన జరుగుతోంది. ఇదిలావుండగా మిషన్ భగీరథ పథకం రాష్ట్రంలో 1.11 లక్షల చదరపు కిలోమీటర్ల మేర నీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. 95 నియోజకవర్గాల్లో 2.72 కోట్ల మంది ప్రజలకు తాగునీటిని ఇవ్వాలన్నది మిషన్ భగీరథ లక్షం. ఈ మేరకు పూర్తి లక్షంతో తాగునీటిని అందించేందుకు ప్రణాళిక రచిస్తోంది. కృష్ణా బేసిన్ నుంచి 32.43 టిఎంసిలు, గోదావరి బేసిన్ నుంచి 53.68 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ రూపకల్పన చేసింది. మిషన్ భగీరథలో కొన్ని చోట్ల పైప్‌లైన్ పనులు జరగాల్సి ఉండగా, మరికొన్ని చోట్ల వేసిన వాటికి నష్టం జరగడంతో తిరిగి వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో 1.50 లక్షల పైప్ లైన్ నెట్ వర్కు ద్వారా నీటిని అందించాల్సి ఉంది. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యంగా వేసవి దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈసారి సర్పంచ్‌లను ఎక్కువగా దీనిలో భాగస్వాములను చేసి మిషన్ భగీరథలో ఇబ్బందులు లేకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలు, సరఫరా పరిస్థితులపై సర్పంచ్‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:07 pm

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఖండించిన : ఎంసిపిఐ(యు)

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇరాన్‌ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్ ను ముందుంచి అమెరికా సాగిస్తున్న అకారణమైన సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా ( యూనైటెడ్) ఆలిండియా కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఎంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఈ మేరకు హైదరాబాద్ ఓంకార్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీ మీదనే కాకుండా వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది హెచ్చరిక అని వారన్నారు. గతంలో వెనుజువెలా దేశ అధ్యక్షుడు మదురో పై దాడి చేసి అరెస్టు చేసి అమెరికా కస్టడీలో పెట్టుకొని ఆ దేశ సహజ వనరుల పై ఆధిపత్యం చెలాయిస్తున్న తీరు గమనించిన వారందరికీ అమెరికా - ఇజ్రాయెల్ జోడి యుద్ద ఉన్మాదం అర్థం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరించి ఇతర దేశాల సార్వభౌమత్వం లో జోక్యం చేసుకుని సాగిస్తున్న ఈ దాడులు రానున్న కాలంలో మానవ మనుగడకు పెనుముప్పు గా మారే నర ఉన్మాదం తో సాగిస్తున్న ఈ సైనిక దాడులను యావత్ ప్రపంచం, అభ్యుదయ, ప్రజా తంత్ర ప్రగతిశీల శక్తులు తీవ్రంగా ఖండిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మాణం లో ముందు వరుసలో ఉండాలని వారు పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 1 Mar 2026 9:00 pm

అగ్ని ప్రమాద బాధితునికి వృత్తి పనిముట్లు అందజేత

అగ్ని ప్రమాద బాధితునికి వృత్తి పనిముట్లు అందజేత రూ.37,116 విలువ గల పనిముట్లు

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:58 pm

రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు : మంత్రి పొన్నం

మన తెలంగాణ / హైదరాబాద్ : రోడ్డు రవాణా శాఖ పై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఆర్‌టిసి నియామకానికి, ఆర్‌టిసికి ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌టిసి నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. డ్రైవర్‌కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని ఆయనన్నారు. డ్రైవర్ పోస్ట్‌కు మోటారు వాహన చట్టం ప్రకారం 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) ప్రామాణికమని తెలిపారు. టికెట్ యాప్‌లో ఎలాంటి సమస్యలు లేవని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:56 pm

టీమిండియా లక్ష్యం: 196

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. భారత మందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  విండీస్ బ్యాట్స్ మెన్లు రోస్టన్ చేజ్(40), రోవన్ పావెల్(34 నాటౌట్), జెసన్ హోల్డర్(37 నాటౌట్), సాయి హోప్(32), సిమ్రాన్ హెట్ మెయిర్ (27) పరుగులు చేసి ఆలౌటయ్యారు. షెర్ఫన్ రూథర్ పోర్డు (14) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోవన్ పావెల్(03), రోమారియో జెషన్ హోల్డర్ (6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హార్ధిక్ పాండ్యా చెరో ఒక వికెట్ తీశారు. 

మన తెలంగాణ 1 Mar 2026 8:48 pm

Nani stuns with his bulky transformation for The Paradise

Natural Star Nani has been pushing the boundaries for each of his film. His script choices and performance has made him a huge star in Telugu Cinema. Now, the actor is working with Srikanth Odela, who delivered mass cult actioner, The Paradise. The transformation to play Jadal in the film is shocking everyone. He released […] The post Nani stuns with his bulky transformation for The Paradise appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 8:39 pm

బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ప్రవేట్ బిల్లు పెట్టాలి

రెండు రాజ్యసభ స్థానాలు బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకివ్వాలి ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలి రాహుల్ గాంధీకి జాజుల శ్రీనివాస్ గౌడ్ బహిరంగ లేఖ మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టాలని బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి బిసి డిమాండ్లపై శ్రీనివాస్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన జరిగి, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి చట్టబద్ధంగా దక్కాలన్న రాహుల్ గాంధీ నినాదాన్ని, ఆచరణలో చూపించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక న్యాయానికి ఒక మోడల్ గా చేయాలని ఆయన రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. అతి త్వరలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాలలో ఒకటి బిసికి, రెండవది ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి సంబంధం లేని వారిని, ఇప్పటికే తమ జనాభా దామాషా కంటే ప్రాతినిధ్యం ఎక్కువగా రాజకీయంగా ఉన్న అగ్రకులాలకు అవకాశం ఇవ్వకుండా బిసిలకే ఇవ్వాలని ఆయన కోరారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పోస్టుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, రాష్ట్ర బడ్జెట్ లో, అన్ని స్థాయిల్లోనూ తెలంగాణలో జరిగిన కులగణన ఆధారంగా బిసిలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించే పేద బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, ఈబిసి విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఫీజుల రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఆదేశించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల ఆధిపత్య వర్గాల దాడిలో రెండు నెలల పసికందు మరణించిన విషయంలో రాహుల్ గాంధీ తక్షణమే జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని, బిసి కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా బిసి రక్షణ చట్టం తేవాలని జాజుల డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:39 pm

CIJ Visit : వావ్ ..సూర్య‌చంద్రోద‌యం Andhra Prabha News

CIJ Visit : వావ్ ..సూర్య‌చంద్రోద‌యం Andhra Prabha News హైకోర్టు జ‌డ్జీల

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:37 pm

పేకాట రాయుళ్లపై పోలీసుల మెరుపు దాడి

పేకాట రాయుళ్లపై పోలీసుల మెరుపు దాడి స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన 9 మంది

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:36 pm

వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం

వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం మార్చి 15 నాటికి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:31 pm

కళలు, సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

దేవాలయాలు, టూరిజం, కల్చర్ తో యాక్షన్ ప్లాన్ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఎల్బీ స్టేడియంలో ఘనంగా రామదాసు జయంతి ఉత్సవాలు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తోందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో రామదాసు జయంతి ఉత్సవాలలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేల గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడు, భద్రాచల రామదాసు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని కళాకారులకు, సాంస్కృతిక వైభవానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను రాష్ట్ర అభివృద్ధి గురించి సంగీత నాటక అకాడమీ ఆధ్యర్యంలో అనేక కార్యక్రమాలతో ప్రజలకు వివరించారు. కళారూపాల్లో ప్రజలు పాల్గొనడంతో పాటు స్పందించిన తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సంగీత నాటక అకాడమీ విరివిగా కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ముందుంటుందని, అవసరమైన ఆర్థిక అవసరాలను తీరుస్తామని డిప్యూటి సిఎం భరోసా ఇచ్చారు. నేలకొండపల్లిలో జన్మించిన గోపన్న తన భక్తితో, కీర్తనలతో భక్త రామదాసుగా చిరస్థాయిగా నిలిచిపోయారని భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన కట్టిన భద్రాచలం ఆలయం, రాసిన కీర్తనలు ప్రతి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మన ప్రాంత వాగ్గేయకారుల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఇటువంటి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. చైతన్యానికి కళలే ఆయువు పట్టని, తెలంగాణ గ్రామాల్లోని ప్రతి సమస్యకు కళారూపాల ద్వారానే పరిష్కారాన్ని, చైతన్యాన్ని తీసుకువచ్చిన చరిత్ర మనదని డిప్యూటి సిఎం గుర్తుచేశారు. కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రజలను జాగృతం చేసేందుకు కళలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప వంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు, రాష్ట్రంలోని పురాతన ఆలయాలను కలుపుతూ పర్యాటకం, సంస్కృతి మేళవించిన ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంగీత నాటక అకాడమీని ఆయన ఆదేశించారు. కళల పట్ల ప్రజలకు ఉన్న మక్కువ చూస్తుంటే సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:27 pm

చింతకాని వాగులో విష్ణుమూర్తి విగ్రహం లభ్యం

చింతకాని వాగులో విష్ణుమూర్తి విగ్రహం లభ్యం కాటారం,ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:22 pm

వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ

వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆత్మ

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:16 pm

100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ

100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:12 pm

6వ వార్డ్ లో మున్సిపల్ పనుల పరిశీలన

6వ వార్డ్ లో మున్సిపల్ పనుల పరిశీలన లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:10 pm

చరిత్రలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు

ఎన్‌పిడిసిఎల్ చరిత్రలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పిడిసిఎల్) చరిత్రలోనే ఆదివారం అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,267 మెగావాట్లు నమోదయినట్లు సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. శనివారం నమోదైన 6,057 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను అధిగమిస్తూ, ఆదివారం 6,267 మెగావాట్లకు చేరుకోవడం ఎన్‌పిడిసిఎల్ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇది సంస్థ ముందస్తుగా తీసుకున్న ప్రణాళికాబద్ధమైన చర్యల ఫలితమని ఆయన స్పష్టం చేశారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. డిమాండ్ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, దిశానిర్దేశంతో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని సిఎండి వివరించారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:08 pm

స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తా….

స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తా…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : వేసవికాలంలోనీటి ఎద్దడి లేకుండా

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:06 pm

స్వామి గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే

స్వామి గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:02 pm

Wedding Celebrations Begin in Allu Family

Mega Producer Allu Aravind’s younger son Allu Sirish is all set to get married and the wedding will be a restricted ceremony and it will witness family members and close friends. The wedding celebrations have begun today in the residence of Allu Aravind. The Pelli Koduku ceremony took place today in the presence of family. […] The post Wedding Celebrations Begin in Allu Family appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 7:59 pm

రెండేళ్లు పూర్తి చేసుకున్న సిఎం ప్రజావాణి

74 శాతం సక్సెస్ రేటు ఇంచార్జ్ చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోందని ఇంచార్జ్ చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతుండడంతో రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు భారీ ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న సిఎం ప్రజావాణికి తరలివస్తున్నారన్నారు. సుమారు 25 నెలల క్రితం ప్రారంభమైన సిఎం ప్రజావాణి ప్రతి వారంలో మంగళ, శుక్రవారాలలో నిర్వహిస్తూ ఇప్పటివరకు 24 సెషన్స్ పూర్తి చేసుకుందని తెలిపారు. రెండేళ్ల కాలంలో సిఎం ప్రజావాణిలో మొత్తం ఒక లక్షా 12 వేల 245 దరఖాస్తులు నమోదు కాగా, అందులో 64 వేల 558 దరఖాస్తులు పరిగణలోకి తీసుకొని 47 వేల 935 దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. మిగిలిన 47, 687 దరఖాస్తులు ప్రభుత్వ పథకాలు, విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాల్సినవి కావడం, ఉద్యోగాల కోసం సంబంధించినవి ఉన్నట్లు వెల్లడించారు. వీటిని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత శాఖలకు సిఫార్సు చేశామన్నారు. సిఎం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారం 74 శాతం మేరకు ఉండడంతో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని, ప్రజల్లో భరోసా పెరిగిందని, దీంతో వారంలో రెండు రోజులు సుమారు వేయి దరఖాస్తులు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. గల్ఫ్ లోని ఏడు దేశాలు సహా ఇతర దేశాలలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిఎం ప్రవాసి ప్రజావాణి కేంద్రాన్ని కూడా ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజావాణిలో దరఖాస్తులు రాసి ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్, ప్రతి శాఖ నుంచి అధికారులతో ప్రత్యేక డెస్కులు, వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపు, వృద్ధులు దివ్యాంగుల రవాణా కోసం బ్యాటరీ బగ్గి, వీల్ చైర్స్, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్, ప్రజలకు మంచినీటి సౌకర్యం, జీ.హెచ్.ఎం.సీ. ఆర్థిక సహకారంతో హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఐదు రూపాయల భోజనం వంటివి ప్రజావాణిలో కల్పించినట్లు తెలిపారు. సిఎం ప్రజావాణి రానున్న రోజుల్లో పరిష్కార శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:58 pm

ఉప్పరపల్లిలో 800 ఏళ్ల శివాలయానికి పునర్జీవం

సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి కృషిని కొనియాడిన డా. ఈమని శివనాగిరెడ్డి

తెలుగు పోస్ట్ 1 Mar 2026 7:55 pm

ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం

ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:55 pm

ఇప్ప‌టికీ పెన్ష‌న్ అందేలా లేదు…

ఇప్ప‌టికీ పెన్ష‌న్ అందేలా లేదు… కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుంటాల

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:48 pm

మహిళల భద్రత గాలికి..

మహిళల భద్రత గాలికి.. హామీల అమలులో ప్రభుత్వం విఫలంఅభయహస్తం హామీలు ఏమయినట్లు?మాలగురుజాల సదస్సులో

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:34 pm

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటి రష్మిక

రేవంత్ ఫ్యామిలీతో గడపడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ నెల 4న నగరంలో జరుగనున్న విజయ్ దేవరకొండ,- రష్మిక వివాహ రిసెప్షన్‌కు సిఎం కుటుంబసభ్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కుటుంబ సభ్యులతో ఆమె కొద్దిసేపు ఆప్యాయంగా గడిపారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సిఎం అర్ధాంగి గీత, రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉందని, దీన్ని తాను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను అని రష్మిక పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:33 pm

స్వర్ణకారులు అన్ని రంగాల్లో ఎదగాలి…

స్వర్ణకారులు అన్ని రంగాల్లో ఎదగాలి… స్వర్ణకార సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:29 pm

సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా ఉంటంది మంత్రి శ్రీధర్ బాబు మనతెలంగాణ/హైదరాబాద్ : కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లనే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి... అక్కడి రాజ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమది బుల్డోజర్ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరూ తమపై కావాలనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:23 pm

ప్రభుత్వమే దాడి చేయించింది…

ప్రభుత్వమే దాడి చేయించింది… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సినీఫక్కీలో పోలీసులతో కలిసి

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:20 pm

అంగన్‌వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం…

అంగన్‌వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం… పాయకాపురం, ఆంధ్ర ప్రభ : అంగన్‌వాడీలకు అండగా

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:17 pm

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం వేద మంత్రోచ్చారణల నడుమ అంకురార్పణ, అభిషేకాలతో

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:09 pm

విజయవాడ టౌన్ డివిజన్ ఈఈగా బాధ్యతల స్వీకరణ

విజయవాడ టౌన్ డివిజన్ ఈఈగా బాధ్యతల స్వీకరణ విజయవాడ, ఆంధ్ర‌ప్ర‌భ : ఏపీసీపీడీసీఎల్

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:04 pm

నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ జైనూర్,ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:03 pm

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత జట్టు

హైదరాబాద్: టి20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా సూపర్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.  భారత జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోతీ, షమర్ జోసెఫ్

మన తెలంగాణ 1 Mar 2026 6:58 pm

కోగంటి సరోజినికి నివాళులు…

కోగంటి సరోజినికి నివాళులు… కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ఇటీవల మృతి చెందిన కోగంటి

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:55 pm

రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీ

రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీ మునుగోడు,ఆంధ్రప్రభ: రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:52 pm

భారత చట్టాలపై అవగాహన : సిఐ శ్రీ హర్ష

భారత చట్టాలపై అవగాహన : సిఐ శ్రీ హర్ష రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:52 pm

ఇరాన్, గల్ఫ్‌లో తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్

సిఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సూచన మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. ఇరాన్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్‌తోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాగ్రత్తగా ఉండండిః మహేష్ కుమార్ గౌడ్ ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు సూచించారు. అక్కడ పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి చెందిన కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ధ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మిసైల్ దాడుల భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన కోరారు. యుద్ధ ప్రభావంతో కొన్ని చోట్ల విమానాశ్రయ సేవలు అంతరాయం కలిగినట్లు సమాచారం అందుతోందని, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు కార్మికులు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకుని తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. యూఏఈ, ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని, భారత రాయబార కార్యాలయాలతో నిరంతర సంబంధం కొనసాగించాలని సూచించారు.

మన తెలంగాణ 1 Mar 2026 6:31 pm

సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి

సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి విజయవాడ, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:28 pm