ఆలయాల్లో ప్రవేశంపై ఆంక్షలు హిందూ మతానికే నష్టం
సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక శబరిమలలో మహిళలకు నిషేధంపై దాఖలైన కేసులో కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికీ అన్ని దేవాలయా లు, మఠాల్లో ప్రవేశం ఉండాలని, ఏదైనా వ ర్గాన్ని లేదా పంథాను వెలివేయడం హిందూమతంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు సమాజాన్ని విభజిస్తుందని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మహిళలపై మతపరమైన స్థలాల్లో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇందులో సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించగా, న్యాయమూర్తులు బి.వి.నాగరత్న, ఎం.ఎం.సుందరేశ్, అహ్సానుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి.వరాలే, ఆర్.మహాదేవన్, జోయ్మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్నారు. శబరిమల కేసు నేపథ్యం కేరళలోని శబరిమల ఆలయం సహా వివిధ మతస్థలాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు, మత స్వేచ్ఛ పరిమితులపై ఈ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప సేవా సమాజం వంటి సంస్థల తరఫున వాదిస్తూ, ఒక నిర్దిష్ట పంథానికి చెందిన దేవాలయాలు తమ వర్గానికే పరిమితమయ్యే హక్కు ఉందని వాదించారు. అయితే న్యాయమూర్తి నాగరత్న స్పందిస్తూ, ప్రవేశ హక్కు విషయంలో ఒక వర్గాన్ని మాత్రమే అనుమతించడం హిందూమతానికి నష్టం కలిగిస్తుంది అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ దేవాలయాలు, మఠాల్లో ప్రవేశం ఉండాలి. ఇతరులను నిరాకరించడం మతానికి మంచిది కాదు అని స్పష్టం చేశారు. న్యాయమూర్తి అరవింద్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి విధానాలు సమాజాన్ని విభజిస్తాయని హెచ్చరించారు. “మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి. దేవి భగవతి ఆలయంలో కొన్నేళ్లుగా ఇలాంటి ఆచారం కొనసాగుతోంది. ఇక కేరళలో ఓ ఆలయంలోకి అబ్బాయిలు మహిళల వేషధారణలో వెళ్తారు. అందుకోసం వారు బ్యూటీపార్లర్కు వెళ్లి మరీ అమ్మాయిల్లా తయారవుతాయి. కాబట్టి ఇది పురుషాధిక్య లేదా స్త్రీ ఆధిక్య మత విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్న కాదు అని తుషార్ మెహతా పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలు దేవాలయాలు కేవలం తమ వర్గానికే సేవలు అందిస్తే, ప్రభుత్వం లేదా ప్రజల నుండి నిధులు స్వీకరించకూడదని వాదనలు వినిపించాయి. అలాగే ఏ చట్టమైనా ప్రజా శాంతి, నైతికత, ఆరోగ్య ప్రమాణాలను పాటించాల్సిందేనని న్యాయవాదులు పేర్కొన్నారు. గతంలో దేవరు కేసులో సుప్రీంకోర్టు మద్రాస్ ఆలయ ప్రవేశ చట్టాన్ని సమర్థిస్తూ, అన్ని హిందువులకు దేవాలయ ప్రవేశం అనుమతించాలనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక ఆచారాలను మాత్రం నిర్దిష్ట వర్గాలకు పరిమితం చేయవచ్చని పేర్కొంది. విసృ్తత విచారణ కొనసాగుతోంది మత స్వేచ్ఛ పరిధిపై ఏడు కీలక ప్రశ్నలను ఈ రాజ్యాంగ బెంచ్ రూపొందించింది. 2018లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అనంతరం 2019లో ఈ అంశాన్ని మరింత విసృ్తతంగా పరిశీలించేందుకు ఉన్నత బెంచ్కు బదిలీ చేశారు. ఈ కేసు తీర్పు మత స్వేచ్ఛ, లింగ సమానత్వం, సామాజిక సమగ్రతపై దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
అసోంలో 85.04% పోలింగ్ 2021లో నమోదైన రికార్డుస్థాయి పోలింగ్ కన్నా ఎక్కువ కేరళంలో 77.38% నమోదు పుదుచ్ఛేరిలో రికార్డు స్థాయిలో 89.08% ఓటింగ్ న్యూఢిల్లీ: అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 296 నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కేరళ, పుదుచ్చేరిలో సాయంత్రం 6 గంటల వరకు నమోదైన ఓటింగ్ గణాంకాలు చూస్తే, పుదుచ్చేరిలో అత్యధికంగా 89.08శాతం పోలింగ్ నమోదు కాగా, అస్సాంలో 85.04శాతం, కేరళలో 77.38శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గం టల వరకూ రికార్డు స్థాయిలో 85.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2021లో నమోదైన 82.04 శాతాన్ని మించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ దశాబ్దం తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. డాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 94.57 శాతం ఓటింగ్ నమోదవగా, అమ్రి నియోజకవర్గంలో కనిష్ఠంగా 70.40 శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 జిల్లాల్లోని 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 6 గంటల వరకూ 77.38 శాతం పోలింగ్ నమోదై, 2021లో నమోదైన 74.06 శాతాన్ని మించింది. పుదుచ్చెరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ కూడా సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 89 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి స్థానిక స్వయం పాలన, పరిపాలనా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని పోటీ చేస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతం ప్రజల్లో ఎన్నికలపై ఉన్న ఆసక్తిని, రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ ఎఫ్ఆర్ఎస్
విద్యార్థుల హాజరు ప్రక్రియలో మార్పు ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో అమలు ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ‘దోస్త్’ నోటిఫికేషన్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ అమలవుతుండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేట్లోనూ అమలు చేయనున్నారు. సంబంధిత విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కళాశాలలకు సర్యులర్ జారీ చేసి ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయించారు. అనేక డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా వారి నుంచి భారీమొత్తంలో అదనపు ఫీజులు వసూలు చేస్తూ పరీక్షలకు అనుమతిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారా..లేదా..? అనేది అధికారులు పర్యవేక్షించనున్నారు. సచివాలయంలో గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పిఎంయు) సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, వివిధ వర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, ఉన్నతాధికారులు పాల్గొని డిగ్రీ కోర్సులలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఈ నెల 13వ తేదీన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ల సమావేశం నిర్వహించి కొత్త కోర్సులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసే ఆవకాశం ఉంది.
అవినీతి బయటపడడంతో ఆత్మరక్షణలో పడ్డ మంత్రి పొంగులేటి బూతులు, తిట్లు, పిట్టకథలు చెబుతున్నారని ఆగ్రహం సిఎం సహా మంత్రులందరూ అవినీతిపరులే అని పొంగులేటి ఒప్పుకున్నారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి వనపర్తి జిల్లాలో విలేకరుల సమావేశంలో హరీశ్రావు మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: పొంగులేటి కాదు.. పొంగు లూటీ పొగరులేటి.. బాంబులూటీ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొగురులేటి మాటలు విన్నాం.. అంబేద్కర్, బిర్లా మందిరం, అమ్మవారు, మసీదు, చ ర్చి పక్కనే ఉన్నా నిజాలు దాచి అబద్ధాలు మా త్రమే మాట్లాడారని అన్నారు. ఆయన బూతు లు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్ తెలుస్తుందని అన్నారు. సరుకు లేనప్పుడు, సమాధానం లేనప్పు డు తిట్లు ఎత్తుకుంటారని, డిఫెన్స్లో పడ్డాడు పొగరులేటి అని, ఒక రాష్ట్ర మంత్రిగా కాకుం డా... రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడా రు. కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేసి పిట్ట కబుర్లు చెప్పి బయటపడాలని అనుకున్నాడని తెలిపారు. నేనొక్కన్నె అవినీతి పరుడున్ని కాదు.. అందరూ మంత్రులు అవినీతి పరులే అని తేల్చారు. జూపల్లి కృష్ణారావు, సీఎం, భట్టి సహా రాష్ట్రంలో అవినీతి కుంభకోణాల చిట్టా ఆయనే చదివారు. ఆయనతో పాటు అందరిని కలుపుకున్నాడని, పొంగులేటి కాదు.. పొంగులూటీ అని ఆయనే చెప్పకనే చెప్పిండు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు.. రాఘవ కన్స్ట్రక్షన్లో జరిగిన అవినీతి మా అధికారులే గుర్తు పట్టారు.. ఫైన్ కూడా కట్టారని సీఎం చెప్పారని తెలిపారు. అనుమతులు ఆలస్యం అవుతాయని మైనింగ్ మంత్రి చెప్పారని తెలిపారు. రెవెన్యూ ఎలక్ట్రిసిటీ పిసిబి మైనింగ్ నాలుగు శాఖల అధికారులు మైనింగ్ ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించారు. పొంగులేటి చెప్పింది తప్పా...అధికారులు చెప్పింది తప్పా.. ముఖ్యమంత్రి చెప్పింది తప్పా? మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా? నువ్వేమో సంబంధం లేదని చెప్తున్నావ్.. పొగరులేటి నీవి ఇంకా చాలా ఉన్నాయి.. అన్ని బయటపెడతామని తెలిపారు. పొగరు తగ్గించుకో పొంగులేటి రాఘవ కు మైనింగ్ లేదని ఎందుకు చెప్పలేదని, అసెంబ్లీ లో ఉండి కూడా నాది కాదని చెప్పలేదని ఆరోపించారు. సీఎం మైనింగ్ మంత్రి తప్పు అని చెప్పని, కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉంది.. కాంగ్రెస్ జెండా ఎందుకు ఉంది? పిసిబి, మైనింగ్ అధికారులు నోటీస్ ఇస్తే మీ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న కాపీ నేను అసెంబ్లీలో చూపెట్టానని తెలిపారు. బాంబులేటి బుకాయిస్తున్నావ్..వాస్తవాలు అసెంబ్లీ లో ఎందుకు చెప్పలేదని తెలిపారు. నాదార్ గుల్ భూములు కాపాడింది బీ ఆర్ఎస్ పార్టీ.. నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. హై కోర్ట్ లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడిందని, సీలింగ్ భూములు అమ్మినవారి మీద.. కొన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ తెచ్చింది బీఆర్ఎస్ అని తెలిపారు. ఎందుకు దాచి పెడుతున్నావని, డివిజన్ బెంచ్లో కేసు గెలిచింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా, మీరు చెప్పినట్లు నేడు అవి ప్రభుత్వ భూములు అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుందని తెలిపారు. రెండున్నర ఏండ్లుగా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఎందుకు కంపెనీల బోర్డులు మారుతున్నాయి? శిల్పతో రాఘవ కంపెనీకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఏ క్యూ స్క్వేయిర్ తో సంబంధాలు ఉన్నాయి నిజామా కాదా? మీరు అన్నట్లు ప్రభుత్వ భూములు అయితే హైడ్రా గడ్డి పీకుతుందా అని తెలిపారు. ఆర్డీవో ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ల్యాండ్ అని ఆర్డర్ ఉండగా హైడ్రా ఎందుకు కండ్లు మూసుకుందని తెలిపారు. నిజాయతీ ఉంటే, చిత్తశుద్ధి అక్రమణదారులపై చర్యలు తీసుకోండని తెలిపారు. పొంగులూటి పొగరులేటి నీ బాంబులు అన్ని తుస్సుమన్నాయని తెలిపారు. నీ విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఏం కాలేదని తెలిపారు. హైడ్రాను పంపి చిత్తశుద్ధి నిరూపించుకో తప్పు అయితే నాలుగు శాఖల మీద చర్యలు అయినా తీసుకో అని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ లో అబద్దం ఆడారు అని చెప్పించు, పొగరు లేటి నువ్వు బాంబు లూటీ ఇప్పటికైనా తప్పు ఒప్పుకో ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
10thApril2026 |శుక్రవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
10thApril2026 | శుక్రవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 10thApril2026 |
హైదరాబాద్ పాతబస్తీలో తూతూమంత్రంగా ‘సర్’ ప్రక్రియ వెరిఫికేషన్లో బిఎల్ఓలకు బదులు వారి అసిస్టెంట్లు అక్షర జ్ఞానం లేని అసిస్టెంట్లతో అవస్థలు ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు ..బడా నేతల ఒత్తిళ్లు ఓటు హక్కు లేనివారి పేర్లూ జాబితాలో చేరుతున్న వైనం మన తెలంగాణ/సిటీ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘సర్’ సమర్థవంతంగా జరగడంలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ) నుండి యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకుని ఇష్టారాజ్యంగా రివిజన్ నమో దు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతనగరంలో రాజకీయ ఒత్తిడితో సర్ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోందనేది ప్రధాన ఆరోపణ. చాంద్రాయణగుట్ట, చా ర్మినార్, బహదూర్పుర, యాకుత్పురా తదిత ర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ‘సర్’ ఇష్టారాజ్యంగా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ఓటరు సవరణలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని, అధికంగా ఓటు హక్కులేని వార్ల పేర్లు కూడా చేరే ప్రమాదం లేకపోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో సమర్థవంతంగా, పొరపాట్లు, తప్పులు లే కుండా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాల్సిన జీహెచ్ఎంసి అధికార యంత్రాంగం ఇప్పుడు అక్రమాలకు మరోమారు తావిచ్చిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓటరు సవరణకే పరిమితం కా కుండా మరింత లోతుగా ఓటరు డాక్యుమెంట్స్ను తనిఖీ చేసే ప్రక్రియ ను చేపట్టాల్సిన బి ఎల్ఓలు కేవలం తమ అసిస్టెంట్లను ఏ ర్పాటు చేసుకుని ‘సర్’ ప్రక్రియను పూర్తిచేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. స్వీపర్లుగా కూడా బిఎల్ఓలుగా పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్వీపర్లు, నిరక్షరాస్యులు కూడా బిఎల్ఓలుగా ఉండటంతో వారి నుండి యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకుని పలువురు ఇష్టారాజ్యంగా ‘సర్’లో వివరాలను నమోదు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. పలువురు ఓల్డ్ సిటీలో డ్యూటీలు చేసే బిఎల్ఓలు నేరుగా విధులను నిర్వహించకుం డా.. తమతమ అసిస్టెంట్లను వెరిఫికేషన్కు పంపించడంతో అసిస్టెంట్లు సర్ ప్రక్రియను పూర్తిచేయడంపైనే ఫోకస్ పెడుతున్నారే తప్ప కచ్ఛితంగా అవసరమయ్యే డాక్యుమెంట్లను మరింత లోతుగా తనిఖీలు చేయడంలేదనేది ప్రధాన ఆరోపణ. సర్ ద్వారా బోగస్ ఓట్లు, చ నిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉంటే వాటిని తొలగించాల్సి ఉంది. కానీ, ఈ ప్రక్రియను చేసేందుకు నిరక్షరాస్యులు వెల్లుతున్నందున సమర్థవంతంగా జరుగడంలేదనేది ప్రధాన ఆరోపణ. ప్రతి ఇంటికి.. బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ)లకు 2002 సంవత్సరంనాటి ఓటరు జాబితాను అందించడంతో పాటు బిఎల్ఓ యాప్ను వారి ఫోన్ల డౌన్లోడ్ చేసి ప్రక్రియను చేపడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళుతూ ఓటరు జాబితాలోని పేర్లను, వారి కుటుంబ సభ్యుల వివరాలతో పోల్చిచూస్తున్నారు. ఓటరుగా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను, వారి కుటుంబ సభ్యుల వివరాలను సరిపోల్చడం జరుగుతుంది. 18 సం.లు నిండినట్టు అధికారిక డాక్యుమెంట్లు ఉంటే కొత్తగా ఓటరు జాబితాలో నమోదు చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఓల్డ్ సిటీలో చాలా వరకు డబుల్గా ఓటరు జాబితాలో ఉన్నట్టు బిఎల్ఓలు గుర్తిస్తున్నట్టు సమాచారం. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును కూడా ఈ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తించి తొలగించేస్తున్నారు. చనిపోయిన వారు, ఇల్లు మారి వేరే చోటుకి వెళ్ళిపోయిన వారు, అనర్హులైన ఓటర్లను, ఒకటి కంటే రెండు చోట్ల ఓటర్లు ఉన్నవారిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా తొలగించే ముందు కుటుంబ సభ్యులకు పూర్తిగా వివరిస్తున్నారు.
శుక్రవారం రాశి ఫలాలు (10-04-2026)
మేషం దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంభందిత వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభం బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిధునం ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కర్కాటకం నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కన్య విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి. తుల వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చికం దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ధనస్సు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ఉద్యోగ విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుంభం సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనం కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు 254 మంది మృతి
బీరుట్ : లెబనాన్లో సెంట్రల్ బీరుట్, ఇతర ప్రాంతాల్లో బుధవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు దాదాపు 254 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. వెయ్యిమందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. ఇజ్రాయెల్, లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు గత ఐదు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఒకే రోజు ఇన్ని మరణాలు సంభవించడం చాలా ఎక్కువని ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది. ఇజ్రాయెల్ మిలిటరీ తాము హెజ్బొల్లా నివాసాలనే లక్షంగా చేసుకున్నామని ప్రకటించింది. అయితే బుధవారం మధ్యాహ్నం జనం రద్దీగా ఉన్న వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడంతో పౌరులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ అయోన్ ఈ దాడి కిరాతకమైన చర్యగా విమర్శించారు.
అందమైన ఊరి వాతావారణం చూపించే చిత్రం
కొత్త టాలెంట్ ను ప్రోత్సాహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ‘. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్గా పరిచయమవుతున్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ‘ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హైదరాబాద్లో ‘తిమ్మరాజుపల్లి టీవీ‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ.. ‘అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మా సినిమాను ఈనెల 17న చూడండి. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్ ను చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫామిలీస్ కి అందరికీ ఈ సినిమా నచ్చతుంది” అని తెలియజేశారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. “మన లైఫ్ లో మొదటిసారి ఎక్సిపీరియన్స్ చేసేవన్నీ ఒక మంచి ఫీల్ ను ఇస్తాయి. మొదటిసారి తిన్న అమ్మచేతి ముద్ద ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా మన లైఫ్ లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి‘ అని అన్నారు. నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మా మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇంటిల్లిపాదీ థియేటర్స్ కు వెళ్లేవాళ్లం. మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్ లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్ లో వచ్చాను. బాలకృష్ణ కి థ్యాంక్స్. అలాగే వింటేజ్ హీరోలందరికీ థ్యాంక్స్. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. వాళ్లు మా మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు.టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల బ్రహ్మాండమైన పర్ ఫార్మెన్స్లు, ఊరిలోని ఆహ్లాదకరమైన వాతావారణం.. ఈ మూడు చూసేందుకు మా మూవీకి వెళ్లండి. ఈ వేసవికి సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే. ఈ సారి మా తిమ్మరాజుపల్లికి రండి. మీ ఊరు గుర్తుస్తుంది, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నా ‘ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో హీరోయిన్ వేద జలంధర్,తో పాటు చిత్ర బృందం పాల్గొంది.
ఇజ్రాయెల్ దాడులు.. అల్ జజీరా విలేకరి, ఇద్దరు జర్నలిస్టుల మృతి
బీరట్ : ఇజ్రాయెల్ దాడుల్లో గాజాకు చెందిన అల్ జజీరా కరస్పాండెంట్ , ఇద్దరు లెబనీస్ జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల కమిటీ వెల్లడించింది. వెస్ట్గాజా సిటీలో మొహమ్మద్ విషాహ్ను ఇజ్రాయెల్ డ్రోన్ దాడి టార్గెట్ చేసుకుంది. విషాహ్ హమాస్ సభ్యుడని, హమాస్ మిలిటరీ విభాగంలో కమాండర్గా ఉన్నాడని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు.
Adivi Sesh’s Dacoit USA Premieres Today
Hero Adivi Sesh is riding high on momentum, delivering five consecutive blockbusters and now inching toward a rare double hat-trick. His much-awaited love-and-action drama Dacoit is set for a worldwide theatrical release tomorrow, with premieres kicking off today across the USA. Overseas distributor Moksha Movies is releasing the film on a grand scale in a […] The post Adivi Sesh’s Dacoit USA Premieres Today appeared first on Telugu360 .
ఎపి హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట..
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఎపి హైకోర్టు ఆదేశించింది. విద్యార్థి నాయకుడి కిడ్నాప్నకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎపి హైకోర్టులో మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ నిర్వహించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు పోలీసులను ఆదేశించింది. కేసు సిడిని తమ ముందు ఉంచాలని పోలీసులకు కోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలోని మోహన్బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుం దంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు యూనివర్సిటీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు నేతలు ఆందోళనకు పిలుపు నిచ్చారు. దీంతో విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్లను మోహన్బాబు యూనివర్సిటీకి చెందిన బోన్సర్లు బలవంతంగా ఎత్తుకెళ్లా రు. ఈ నేపథ్యంలో మరో విద్యార్థి సంఘం నేత తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించారు. బౌన్సర్ల తోపాటు వారి వాహనాలను తిరుపతి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్బాబుతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో చోటు చేసుకుంది.
ఐపిఎల్ 2026: లక్నోకు టార్గెట్ ఎంతంటే?
ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గెయింట్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్182 పరుగుల టార్గెట్ విధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానె(41), రఘువంశీ(45), కమెరూన్ గ్రీన్(32 నాటౌట్), పొవెల్(39 నాటౌట్)లు రాణించారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, దిగ్నష్ సింగ్ లు తలో వికెట్ తీశారు.
AP High Court Grants Interim Relief to Mohan Babu in Student Kidnap Case
The Andhra Pradesh High Court has directed Tirupati police not to take any hasty action against veteran actor Mohan Babu in connection with a student leader kidnapping case. The court asked the police to place the case diary before it and said further action should wait until the next hearing. Mohan Babu approached the High […] The post AP High Court Grants Interim Relief to Mohan Babu in Student Kidnap Case appeared first on Telugu360 .
Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha Top Story
Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha
లక్ష్మీనారాయణకి కార్పొరేటర్ ఆగం రాజ్ ఘన నివాళి
విశాలాంధ్ర-దుండిగల్ : గురువారం లక్ష్మీనారాయణ ఆకస్మిక మరణం పట్ల బాచుపల్లి 17వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆగం రాజు ముదిరాజ్ కాలనీ ప్రజలతో కలిసి ఘన నివాళులర్పించారు. The post లక్ష్మీనారాయణకి కార్పొరేటర్ ఆగం రాజ్ ఘన నివాళి appeared first on Visalaandhra .
హరీష్ రావు జీవితమే బ్లాక్ మెయిల్: అద్దంకి
హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావు ఎన్నిసార్లు చెప్పినా ఆయన బ్లాక్ మెయిల్ ఆగడం లేదు పొంగులేటి కుటుంబంపైన ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు పభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిల ఆగ్రహం మనతెలంగాణ/హైదరాబాద్: హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావు అని, ఎన్నిసార్లు చెప్పినా ఆయన బ్లాక్ మెయిల్ ఆగడం లేదని, పొంగులేటి కుటుంబంపైన ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని, పొంగులేటి కానీ, ఆయన కుటుంబానికి సంబంధం లేని కంపెనీలను హరీష్రావు అంటగడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మిర్యాలగూడ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శిల్పా ఇన్పోటెక్ కంపెనీలో పొంగులేటి లేదా ఆయన కొడుకు డైరెక్టర్లుగా లేరని, ఏక్యూ అండ్ ఏఎం బిల్డర్స్ , క్రిస్టల్ మ్యాన్క్షన్తో కూడా పొంగులేటికి సంబంధం లేదని వారు తెలిపారు. హరీష్ రావు జీవితమే బ్లాక్ మెయిల్ అని, ఆంధ్రా, తెలంగాణ పారిశ్రామికవేత్తలను ఉద్యమ సమయంలో బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర హరీష్ రావుదని వారు ఆరోపించారు. సొంత మామను బ్లాక్ మెయిల్ చేసి ఇరిగేషన్ మంత్రి అయ్యారని, తమ సీక్రెట్ ఫైల్స్ నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కవిత కూడా నెమ్మదిగా రూపాంతరం చెందుతోందని, తండ్రిని మళ్లీ మంచి చేసుకోవడానికి కవిత ప్రయత్నాలు చేస్తోందని వారన్నారు. అనేక కంపెనీలను కెటిఆర్, హరీష్రావులు బ్లాక్ మెయిల్ చేశారని వారు ఆరోపించారు. మామ ఫాంహౌస్ నుంచి రాడనీ, బామ్మర్థి ఊర్లో లేడని, కవిత పార్టీలో లేదని, అందుకే హరీష్ రావు రెచ్చిపోతున్నారని వారు పేర్కొన్నారు. 2029 వరకు బిఆర్ఎస్లోనే ఉంటానని చెప్పే దమ్ము హరీష్ రావుకు ఉందా..? అని వారు ప్రశ్నించారు. 2014 నుంచి 2026 వరకు భూముల కేటాయింపులు, బదలాయింపులపైన విచారణకు ప్రభుత్వం సిద్ధమని వారు పేర్కొన్నారు.
పొంగులేటిపై ఆధారాలు చూపండి.. బిఆర్ఎస్ పై పిసిసి చీఫ్ ఫైర్
హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్కు వచ్చి ఇవ్వాలని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆధారాలు ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు. గురువారం గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలు తీసుకొని వస్తే తాను చర్చకు సిద్ధం అన్నారు. పస లేని ఆరోపణలు చేయొద్దని నాదర్గుల్ భూముల కుంభకోణం బిఆర్ఎస్ హయంలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. తమపై బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. బిఆర్ఎస్ దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రులపై ఆరోపణలు సరికాదని హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు. తాము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎక్కడ గీత కూడా పడలేదని, అదే బిఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందని మహేష్ కుమార్ విమర్శించారు.
Shocker: Vijay’s Jana Nayagan Leaked Online
The makers of Vijay’s film Jana Nayagan are struggling to clear all the hurdles and release the film. With the Tamil Nadu Assembly elections nearing in this month, the election fever has gripped the state and Jana Nayagan will release only after the elections. Some of the scenes along with a song from Jana Nayagan […] The post Shocker: Vijay’s Jana Nayagan Leaked Online appeared first on Telugu360 .
Why is Tollywood waiting for Dacoit Result?
Almost all the top producers of Telugu cinema were present for the pre-release event of Adivi Sesh’s upcoming release Dacoit. Many felt that the producers rushed to the event for Adivi Sesh but it is for the producer Supriya Yarlagadda. Though she has not been actively producing films, Supriya plays a key role in the […] The post Why is Tollywood waiting for Dacoit Result? appeared first on Telugu360 .
నందమూరి బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' గెటప్లో సందడి చేసిన నటుడు కిరణ్ అబ్బవరం#KiranAbbavaram
Fire Accident on the sets of Spirit
A minor fire mishap took place on the sets of Prabhas’ upcoming film Spirit that is directed by Sandeep Reddy Vanga. One of the team members suffered minor injuries and he was rushed to the hospital. Some of the tents along with the shooting material on the sets were burned partially because of the fire […] The post Fire Accident on the sets of Spirit appeared first on Telugu360 .
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి ఎన్ పి ఆర్ డి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా.. రాయపర్తి, ఆంధ్రప్రభ : బాధిత కుటుంబాలకు అండగా
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి రాయపర్తి, ఆంధ్రప్రభ : పశువుల్లో గాలికుంటు
బృందావన్ కాల్వను శుద్ధిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి..
బృందావన్ కాల్వను శుద్ధిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
Photos : Thimmarajupalli Tv Trailer Launch Event
The post Photos : Thimmarajupalli Tv Trailer Launch Event appeared first on Telugu360 .
గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర అతికీలకం
గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర అతికీలకం .. కామారెడ్డి డిఆర్డిఓ సురేందర్ జుక్కల్,
ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందిచడమే లక్ష్యం…
ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందిచడమే లక్ష్యం… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రతి ఇంటింటికీ
ఆ తర్వాతే.. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి:కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బిజెపి మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ బిల్లు అమలులో 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకుంటామని చెప్పటం మహిళా లోకాన్ని మోసం చేయటమే అని పేర్కొన్నారు. మహిళా కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం చేపట్టే జనగణనలో ఒబిసి గణన చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులం కాలమ్ ఉన్నా వాళ్లు ఒబిసిలకు చెందుతారు అనే స్పష్టత లేదని అన్నారు. దీంతో బిసిల జనాభా ఎంత అనే లెక్క తేలదని పేర్కొన్నారు. జనగణనలో ఒబిసిలను లెక్కించి ఆ తర్వాతే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కోటా విషయంలో బిజెపి చేస్తున్న అన్యాయంపై పోరాటానికి బిసి మహిళలంతా సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు. డ్రాఫ్ట్ బిల్లు ముందే ఇవ్వాలి మహిళ రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశాలకు ముందే డ్రాప్ట్ బిల్లును అన్ని పార్టీలకు ఇవ్వాలని కవిత కోరారు. లేదంటే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని అన్నారు. బిల్లుపై చర్చ జరిగే రోజు ఉదయమే సభ్యులకు బిల్లు పత్రులను ఇస్తామని చెప్పటమంటే కచ్చితంగా ఇది అన్యాయం చేసే కుట్ర అని మండిపడ్డారు. డ్రాఫ్ట్ బిల్లును ముందే ఇచ్చే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దేశంలోని జాతీయ పార్టీల నేతలతో మాట్లాడతానని చెప్పారు. పార్లమెంట్లో మహిళ బిల్లు విషయంలో బిజెపి వైఖరిని నిరసిస్తూ మహిళలకు న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు ఒక్కలి కావాలని కోరారు. మహిళ బిల్లు రావటంలో జాగృతిదే కీలక పాత్ర దేశంలో మహిళ రిజర్వేషన్ల బిల్లు రావటంలో జాగృతిదే కీలక పాత్ర ఉందని కవిత చెప్పారు. ఈ బిల్లు కోసం ఢిల్లీలో దీక్ష చేసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. దేశంలోని 18 పార్టీలను ఏకం చేసి బిల్లు కోసం పోరాటం చేసే విధంగా కో ఆర్డినేట్ చేశామన్నారు. ఢిల్లీలో తాను చేసిన దీక్ష చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు ఢిల్లీకి వచ్చి పోరాటం చేశారని తెలిపారు. మహిళ బిల్లు కోసం జాగృతి వెలిగించిన దీపం ద్వారా దేశంలోని 29 రాష్ట్రాల మహిళలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి…
మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి… పట్టణాలకుదీటుగా గ్రామాల అభివృద్ధికికృషి.కేంద్ర ప్రభుత్వపథకాలుప్రజలకు వివరించండి.పల్లె
ఘనంగా రాంజీ గొండ్ వర్థంతి వేడుకలు…
ఘనంగా రాంజీ గొండ్ వర్థంతి వేడుకలు… దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆదివాసులకు పోరాట
నూతన తహసిల్దార్ ను కలిసిన చిట్యాల గ్రామ సర్పంచ్…
నూతన తహసిల్దార్ ను కలిసిన చిట్యాల గ్రామ సర్పంచ్… చిట్యాల, ఆంధ్రప్రభ :
తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు…
తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు… అనధికార మిల్లర్లకు ధాన్యం పంపితే
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుంది: ఎమ్మెల్యే యెన్నం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ముఖచిత్రం మార్చే దిశగా అడుగులు పడ్డాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన వివరించారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రూ. 24,000 కోట్ల రీ-స్ట్రక్చరింగ్తో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టామని ఆయన తెలిపారు. మందగించిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుందని, ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వాహనాల విక్రయాలు కూడా భారీగా పెరిగాయని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం పేదలకు సాయం చేయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక చక్రం తిరిగేలా చేస్తున్నాయని యెన్నం తెలిపారు. తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి కొత్త ఆర్థిక ఇంజన్గా మారబోతోందన్నారు. గ్రీన్ ప్లానింగ్, క్లీన్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి వసతులతో దీనిని నిర్మిస్తున్నామని, మూసీ నది ప్రక్షాళన ద్వారా హైదరాబాద్కు కొత్త అందం రావడమే కాకుండా, టూరిజం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈ సహా ప్రపంచ వేదికలపై తెలంగాణకు గుర్తింపు పెరిగిందని, గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా సాగుతోందని యెన్నం తెలిపారు. ఇప్పటికే 2,34,000 ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మేస్త్రీలు, కార్మికులకు భారీగా ఉపాధి దొరుకుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం జోడెద్దుల తరహాలో సాగుతూ తెలంగాణ జీడిపి వృద్ధికి బాటలు వేస్తున్నాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి 108ఉమ్మడి జిల్లా మేనేజర్ సామ్రాట్
బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి: పిసిసి చీఫ్
జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చింది జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు కాంగ్రెస్ను విమర్శించే ముందు.. గతంలో బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి -పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్: జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చిందని పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాలని, జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, సిఎం రేవంత్ రెడ్డి పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరని పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ను విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. గురువారం గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు రేపైనా కలుస్తాయన్నారు. బిజెపి ఆధ్వర్యంలో ఎవరూ బాగుపడలేదని మార్పు వచ్చింది కాబట్టి బిఆర్ఎస్ పోయిందని పిసిసి అధ్యక్షుడు అన్నారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం మంథని, ఆంధ్రప్రభ :
సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం
సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రైతులు
IPL 2026: కోల్ కతాపై బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుని, కోల్ కతాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్ కు దూరమైన కెకెఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న కెకెఆర్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా కనిపిస్తోంది. జట్లు: కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే (సి), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (w), రింకు సింగ్, రోవ్మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ…
వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ… టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా
వినతి పత్రానికి స్పందించిన సింగరేణి అధికారులు
వినతి పత్రానికి స్పందించిన సింగరేణి అధికారులు మంథని, ఆంధ్రప్రభ : దుబ్బపల్లి గ్రామ
Video : Deputy Speaker Raghu Rama Krishna Raju Special Interview
The post Video : Deputy Speaker Raghu Rama Krishna Raju Special Interview appeared first on Telugu360 .
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఎప్పుడు..?
మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఎప్పుడు..? ఈసారైనా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారా?
BJP : పొత్తుతో ప్రమాదమే.. ప్రయోజనం లేదు.. ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న కమలం
తెలంగాణలో బీజేపీ ఇక ఒంటరిపోరుకే సిద్ధమవుతుంది
Sandeep Vanga about Dhurandhar 2
Last night, Prabhas and Sandeep Reddy Vanga watched Dhurandhar: The Revenge in Allu Cinemas, Kokapet. Sandeep Reddy has taken to his social media page to post his review about the film. His words have been extremely strong and positive about the film. “Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like […] The post Sandeep Vanga about Dhurandhar 2 appeared first on Telugu360 .
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు..
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు.. రణస్థలం, ఆంధ్రప్రభ :
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో
జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్ చేశారు.
శేష జీవితంలో కెసిఆర్తో పని చేసే అవకాశం వచ్చింది: జీవన్ రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. శేష జీవితంలో కెసిఆర్తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్తో కలిసి పని చేస్తే.. రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని పేర్కొన్నారు. ‘‘27 నెలలుగా చాలా క్షోభ అనుభవించాను. కాంగ్రెస్కు రాజీనామా చేసినప్పుడు.. భావోద్వేగానికి గురయ్యాను. బిఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్కు ఓటేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచింది. 2014లోనే కెసిఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం వచ్చింది. అయినా కూడా కాంగ్రెస్లోనే కొనసాగాను. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బిఆర్ఎస్తో కలిసి పని చేస్తా’’ అని జీవన్ రెడ్డి స్ఫష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. మంథని, ఆంధ్రప్రభ : మత్స్యకారులను మంథని మండలం
అల్లూరి జిల్లాలో విషాదం.. ముగ్గురి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది
జగన్ “మావిగన్ జోకర్” : వైఎస్ షర్మిల
వైఎస్ జగన్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు
జోగినీలకు పునరావాసం కల్పించాలి: మంత్రి శ్రీహరికి వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; జోగినిలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కోరుతూ రాష్ట్ర పాడి
Forbesganj | ఇద్దరు బలి… Forbesganj | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Chandrababu : జగన్ ను అరెస్ట్ చేయడం నాకు నిమిషం పట్టదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ ఎ.కొండూరు,
పారిశుద్ధ్యం పరిశుభ్రతపై అవగాహన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండల మహిళా సమాఖ్య భవనంలో గ్రామ సంఘ
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిళ్ళా
ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం
ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం మక్తల్, ఆంధ్రప్రభ ; భీమా ప్రాజెక్టులో
Pawan Kalyan Urges Youth to Become a Force for Change at AU Centenary Event
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan called on students to emerge as a powerful force that can transform systems and shape the future of the nation, while speaking at the centenary mega cultural fest of Andhra University in Visakhapatnam. Addressing the gathering, Pawan Kalyan said that youth must move beyond personal goals and think […] The post Pawan Kalyan Urges Youth to Become a Force for Change at AU Centenary Event appeared first on Telugu360 .
మీడియా సమావేశంలో కంట తడిపెట్టిన బొత్స
వైఎస్సార్ గురించి మాట్లాడుతూ సీనియన్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికిలోనయ్యారు
రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..
గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్ […] The post రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ.. appeared first on Visalaandhra .
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా
నిర్లక్ష్యానికి పరాకాష్ట –సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల సమీపంలోని అశోక్ లేలాండ్ ఎదురుగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఓ ప్రైవేట్ షెడ్డుకు వెళ్లేందుకు ఏకంగా సర్వీస్ రోడ్డుకు అడ్డంగా భారీగా మట్టి మేటలు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్డును మూసివేస్తూ ఇలా మట్టి తోలడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దీనివల్ల అటుగా వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేక ప్రమాదాలకు గురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురికావడం, ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు […] The post నిర్లక్ష్యానికి పరాకాష్ట – సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు appeared first on Visalaandhra .
Minister |పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు..
Minister | పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు.. Minister | ఆంధ్రప్రభ, వెబ్
ഫാക്ട് ചെക്ക്: ഇറാൻ - യുഎസ് മധ്യസ്ഥതയിൽ പാകിസ്താനെ പ്രകീർത്തിച്ച് അമിത് ഷാ? പ്രചാരണം വ്യാജം
പാകിസ്താൻ അഖണ്ഡ ഭാരതത്തിൻ്റെ ഭാഗമാണെന്നും പാക് ജയം ഇന്ത്യയുടേതാണെന്നും അമിത് ഷാ പറഞ്ഞെന്നാണ് പ്രചാരണം
బేబీ బంప్తో ఉష మరోసారి తండ్రి కాబోతున్న జేడీ వాన్స్ #JDVance #UshaVance #BreakingNews #ViralVideo
వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది..
బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివి. శేషువిశాలాంధ్ర ధర్మవరం : వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనము తెలుస్తుందని బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివిశేషు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చటర్జీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శేషు మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్దుల దాకా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమకాంక్షను వందేమాతరం రగిలించింది అని తెలిపారు. […] The post వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది.. appeared first on Visalaandhra .
అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు..
తెలుగుదేశం పార్టీ నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లు కూటమి ప్రభుత్వం చేస్తోందని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ,ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు పవర్లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మామాట్లాడుతూ […] The post అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు.. appeared first on Visalaandhra .
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం..
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం.. రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ నాయకులు
తహసిల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు..
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తహసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. జతపాతంలో పడి మగ్గురు మృతి
అనంతగిరి: సెల్ఫీ మోజు ముగ్గరి నిండు ప్రాణాలను బలిగొంది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో సెల్ఫీ దిగుతతూ నలుగురు బాలికలు జలపాతం లో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉంది. అంజలిని అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతులు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర(16)ను హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా గుర్తించారు. ఇటీవలే వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.
Waterfall |ముగ్గురి ప్రాణాలు తీసింది
Waterfall | ముగ్గురి ప్రాణాలు తీసింది Waterfall | అల్లూరి జిల్లా, ఆంధ్రప్రభ
మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; ఆర్మూర్ లోని విశాఖ నగర్ లో గల
24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం..
24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం.. మేడ్చల్, ఆంధ్రప్రభ :
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత… భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణకు
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు…
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు… 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్
10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం
విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే […] The post 10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం appeared first on Visalaandhra .
చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కూచిపూడి – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look
Rao Bahadur is emerging as a highly interesting film, set to showcase Satya Dev in a never-seen-before character. After a title glimpse that made a lasting impact, the team is ready to unveil the first single, O Sundari, on April 15th. The excitement surrounding the movie is steadily growing among film lovers. Much of this […] The post Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look appeared first on Telugu360 .
ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు
గత ఐదు రోజులుగా లాభాల జోరు చూపిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 931.25 పాయింట్లు పతనమై 76,631.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. జియో […] The post ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|రేవంత్ ఫెయిల్/పల్లాకు ఝలక్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ts రేవంత్ ఫెయిల్.. కేసీఆర్ను
అమ్మ భాషే కంటి చూపు… భారతీయతే మన అసలైన గుర్తింపుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
Andhra Prabha Smart Edition |AP|పక్కాగా పాస్బుక్కులు /కేంద్ర సచివాలయం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ap తారుమారుకు చాన్స్ లేదు..
అఫ్గాన్ క్రికెట్ అభిమానులకు షాక్.. రషీద్ ఖాన్ రిటైర్మెంట్!
అఫ్గానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్కి అతడి దేశంలోనే కాదు.. భారత్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఐపిఎల్లో రషీద్ బౌలింగ్ని ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రషీద్ ఖాన్ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లోె గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్ అద్భుత ప్రదర్శన (3/17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అనంతరం రషీద్ మాట్లాడుతూ.. తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చాడు. ‘‘టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా సరే నేను ఆడాను. గతేడాది జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 67 ఓవర్లు బౌలింగ్ చేశాను. దీంతో ఇది నా ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్టులు ఆడే సాహసం చేస్తే.. ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగలేనని హెచ్చరించారు’’ అని వెల్లడించాడు. రషీద్ 2023 వన్డే ప్రపంచకప్ కోసం శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత యుకెలో సర్జరీ చేయించుకొని 2024లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ఇక అఫ్తానిస్థాన్కు 2017లో టెస్ట్ క్రికెట్ హోదా వచ్చింది. అప్పటినుంచి ఆ జట్టు 12 టెస్టులు ఆడగా.. అందులో రషీద్ 6 టెస్టుల్లో పాల్గొన్నాడు. ఈ 6 మ్యాచుల్లో 45 వికెట్లు తీశాడు.
Ajith to Produce his Next Film
Tamil Superstar Ajith has been struggling to find a producer for his next film. His huge quote of remuneration made a couple of producers to take a back step. His next film which is tentatively titled #AK64 was planned to kick-start early this year but it was pushed. Finally, Ajith is stepping in to produce […] The post Ajith to Produce his Next Film appeared first on Telugu360 .
ప్రాణం తీసిన మటన్ ముక్క #MahabubabadDistrict #Telangana #ViralNews #PublicSafety #FoodAccident

26 C