26 Feb2026 | తిరుమల సమాచారం.. 26-02-2026 తిరుమలలో టోకెన్లులేని
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కులాల ద్వేషం, పెత్తందార్ల పెత్తనం అవశేషాలు ఇంకా బుసకొడుతున్నాయనడానికి ఈ నెల 19న నాగర్కర్నూల్ మండలం లోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దారుణ సంఘటనే ప్రత్యక్ష సాక్షం. జాతరలో జరిగిన చిన్న గొడవ చిలికిచిలికి గాలివానగా మారి ఓ పసికందు మృతికి కారణమైంది. జాతరలో నెలకొన్న రద్దీలో భక్తులకు, నిర్వాహకులకు మధ్య జరిగిన తోపులాటలో నిరుపేద రజకుడు చిల్కేశ్వరం గణేశ్, ఆయన భార్య మౌనికలను పక్కకు నెట్టేయడమే కాకుండా వారి రెండు నెలల కూతురును నిర్వాహకులు కాలితో తన్ని విసిరేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన వివిధ వర్గాల ఆందోళనలకు దారి తీసింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసన చేపట్టాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కుమ్మెర గ్రామం పెత్తందార్ల దాష్టీకానికి కంచుకోటగా గత ముప్ఫయ్యేళ్లుగా సాగుతోంది. పెత్తందార్లు ఎలాంటి అరాచకాలు సాగించినా వారిని ఎదిరించే సాహసం ఎవరికీ లేకుండా పోతోంది. ఒకవేళ ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెడుతుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ ఫిర్యాదు సరిగ్గా లేదని పోలీసులు తిప్పికొట్టారని, పైగా నిందితులకు ఫోన్ చేసి మీరు కూడా కేసు పెట్టాలని సూచించారని అనధికారికంగా తెలుస్తోంది. ఈ సంఘటనతో గత ముఫ్పయ్యేళ్లుగా పెత్తందార్లు సాగిస్తున్న దురాగతాలు ఇప్పుడిప్పుడే వెలుగు లోకి వస్తున్నాయి. కుమ్మెర గట్టు అనేది పూర్తిగా ప్రభుత్వ గైరాన్ భూమిలో ఉంది. ఆ గుట్టపై పెత్తందార్లకు ఎటువంటి సంబంధం లేదు. గట్టుపై పూజలందుకునే మల్లయ్య పూర్తిగా యాదవుల ఆరాధ్య దైవం. యాదవుల ఇంటిలో ఉన్న మల్లయ్య దేవుడిని జాతర ముందు గుడికి తీసుకొస్తారని, జాతర పూర్తికాగానే తిరిగి తమ ఇంట్లోకి తీసుకొస్తారని అక్కడి వారు చెప్పారు. అలాంటప్పుడు గుడికి, గట్టుకు, దేవుడికి ఎలాంటి సంబంధం లేని పెత్తందార్లు ఈ జాతర నిర్వాహకులుగా చెలామణి అవుతుండడం, వంద రూపాయల వంతున ప్రవేశ రుసుం వసూలు చేయడం అక్రమమని తెలుస్తోంది. ప్రవేశ రుసుం వంద రూపాయలు ఇవ్వకపోవడం వల్లనే రజకులైన గణేశ్ దంపతులను క్యూలోంచి నెట్టివేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఫ్ఫయ్యేళ్లుగా కుమ్మెర గ్రామంలోని బడుగు వర్గాలను పెత్తందార్లు ఏ విధంగా హింసిస్తున్నారో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే తెలుస్తుంది. కుర్వ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి గొర్రెలు మేత కోసం బీడు భూముల్లోకి అలా పెత్తందారి చెలకలోకి పోవడంతో గొర్రెల కాపరిపై పెత్తందార్లు దాడి చేసి గడీల ఇంట్లో తాళం వేసి బంధించే సంఘటన ముఫ్ఫైయేళ్ల క్రితం జరిగింది. గడీలో గొర్రెల కాపరి బందీయై తీవ్ర చిత్రహింసలకు గురయ్యాడు. ఇంత జరిగినా ఆ గ్రామంలో ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఇటువంటి దుర్ఘటన ఇటీవల ఒకటి జరిగింది. పెత్తందారి చేలో కుర్వసమాజానికి చెందిన పశువుల కాపరి పశువులు పడ్డాయన్న నెపంపై కర్రతో దాడి చేయడంతో పశువుల కాపరి చెయ్యి విరిగింది. ట్రాన్స్ఫారమ్కు అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న సాకు చూపి దాడికి పాల్పడినట్టు తెలిసింది. కుర్వ సామాజిక తరగతికి చెందిన అమ్మాయి పొలంలో ఉన్న తన అన్న, తండ్రి దగ్గరకు చద్ది తీసుకుని వెళ్తుండగా దారిలో కల్వర్టు వద్ద మద్యం సేవిస్తున్న పెత్తందారీ వ్యక్తులు అమ్మాయిని అటకాయించి లైంగిక దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనలకు నిరసనగా ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాల పైనే కేసులు పెట్టారంటే పెత్తందారులకు పోలీసులు ఎలా వత్తాసు పలుకుతున్నారో తెలుస్తుంది. కుల దురహంకార సంఘటనలు జరగకుండా చూడాలని సుప్రీం కోర్టు అనేక సార్లు తన తీర్పుల ద్వారా హెచ్చరించినా, సమాజం లోని కరడుకట్టిన సంప్రదాయ వర్గాలకు కనువిప్పు కావడం లేదు. కులద్వేష కాటుకు బలైపోతున్న వారు ప్రధానంగా దళితులు, మహిళలే. ఇక కులద్వేషంతో ముడిపడి ఉన్న పరువు హత్యల సంఘటనల గురించి చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 5000 మంది మహిళలు, బాలికలు పరువు కోరలకే బలైపోతున్నారు. వీరిలో దాదాపు మూడింట ఒకవంతు మంది భారత్, పాకిస్తాన్లకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా పరువు హత్యల సంఖ్య దాదాపు 20,000 వరకు ఉంటోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణ లోని మిర్యాలగూడలో అగ్రవర్ణ కుటుంబానికి చెందిన అమ్మాయి, దళితుడిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి 2016లో పెళ్లి చేసుకున్నా ఆమె కుటుంబీకులు సహించలేక ఆమె భర్తను దారుణంగా చంపించిన సంఘటన సంచలనం కలిగించింది. ఇదే విధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన 27 ఏళ్ల యువతి పరువు హత్యకు బలైపోయింది. కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన చిన్న సంఘర్షణ అనుకోరాదు. ఆధునిక సమాజంలో జడలు విప్పుతున్న కులద్వేషానికి ప్రతిబింబం. వంద రూపాయల కోసం పసిప్రాణం బలిగొనడం అమానుషం. దైవదర్శనం కోసం వచ్చిన భక్తుల్లో తక్కువ ఎక్కువ కులాలని తేడాలు చూపించి అడ్డుకోవడం, అవమానించడం, మన సామాజిక నిర్మాణం ఎంత పతనావస్థలో ఉందో స్పష్టం చేస్తుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం, భక్తి, ఆధ్యాత్మికత, ఆరాధన విషయంలో కుల మతాలు అడ్డురావని ప్రబోధించే పెద్దలు ఇలాంటి దురాగతాలకు ఏం సమాధానం చెబుతారు?
అందుకే.. కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందా.?
అందుకే.. కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందా.? ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన
Ap Free Bus : ఉచిత బస్సు ప్రయాణంలో కీలక నిర్ణయం.. ఇక వారికి కూడా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ - విశాఖ హైవై ప్రారంభం ఎప్పటి నుంచి అంటే?
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుడ్న్యూస్
Big Breaking |తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ..
Big Breaking | తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ.. Big Breaking,
నేడు హైకోర్టులో సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటీషన్
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది
ఎన్నో ఆటుపోట్లు, అవాంతరాల మధ్య న్యూఢిల్లీ వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం భారత దేశ ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కొందరు, ట్రంప్ స్వదేశంలో ఎదురవుతున్న నిరసనలకు తలవొగ్గి భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని మరికొందరు వాదించడం గమనార్హం. ఇది భారత్ సాధించిన విజయమని బిజెపి అనుకూల పక్షాలు భాష్యం చెబుతుంటే, మోడీ ట్రంప్ ఒత్తిళ్ళకు లొంగిపోయి రాజీపడ్డారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏది నిజం? ఏది అబద్ధం? అనే అంశం ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుంది. ఏదిఏమైనప్పటికీ ట్రంప్ కనీస మర్యాద, దౌత్య విలువలు పాటించకుండా ఏక పక్షంగా వాణిజ్య ఒప్పందం కుదిరిందని చెప్పడమే కాకుండా, ప్రతీ విషయాన్ని ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించడం సముచితం కాదు. భారత్ కూడా ట్రంప్ పోకడలపై తగిన వివరణ ఇవ్వకపోతే ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తే అవకాశముంది. ఇండో- యుఎస్ ‘ట్రేడ్ డీల్’లో కొన్ని సవరణలు చేస్తూ అమెరికా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. 500 బిలియన్ డాలర్ల అమెరికా వస్తూత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందనే ప్రకటనలో కొంత సవరణ చేయడమే కాకుండా భారత్ నుండి దిగుమతి చేసుకునే పప్పుధాన్యాలపై సుంకాలు తగ్గుతాయనే పదజాలంలో కూడా సవరణలు చేస్తూ కొత్త ఫ్యాక్ట్షీట్లో అమెరికా పేర్కొనడం జరిగింది. భారత్తో ట్రేడ్డీల్పట్ల పాక్ సహజం గానే ఆత్మరక్షణలో పడింది. అమెరికా తమను టాయ్ లెట్ పేపర్లా వాడుకుని, వదిలేయడం పట్ల పాక్ రక్షణ మంత్రి ఆవేదన చెందడం సహజమే. ఉన్నట్టుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో ఎందుకింత మార్పు వచ్చింది? భారతీయ వస్తువులపై సుంకాలను 18 శాతం ఎందుకు తగ్గించారు? ఇప్పటి వరకు నాన్చిన అమెరికా- భారత్ ట్రేడ్ డీల్ను ట్రంప్ ఎందుకు ఆమోదించారు? ట్రంప్ ట్రేడ్ డీల్ లో నిజాయితీ ఉందా? అసలు తెరవెనుక ఏం జరిగిందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇరుదేశాల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వలన ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనే అంశాలను పరిశీలిస్తే ఇరు దేశాలకు ఈ ఒప్పందం వలన ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. ట్రంప్ ప్రకటనకు మోడీ అంగీకారం తెలియజేసిన నేపథ్యంలో ఈ ఒప్పందం భారతీయ రైతులకు శాపంగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల వస్తూత్పత్తులను కొనడం విశేషమేమీ కాదని భారత్ ప్రకటించింది. మోడీ అభ్యర్థనతోనే తాను ట్రేడ్ డీల్కు ఒప్పుకున్నానని, రష్యా నుండి చమురు కొనుగోలు నిలుపుదల చేయడానికి, వెనెజువెలా నుండి చమురు కొనుగోలుకు భారత్ అంగీకరించడం వలన ఈ ఒప్పందాన్ని అంగీకరించడం జరిగిందని ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించగా, సుంకాలను తగ్గించడం పట్ల, ట్రేడ్ డీల్ పట్ల మోడీ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ట్రంప్ చెప్పినట్లుగా రష్యా చమురు నిలిపి వేస్తామని గాని, వెనెజువెలా నుండి చమురు కొనుగోలు చేస్తామని గాని భారత ప్రధాని చెప్పలేదు. రష్యా కూడా భారత్ నుండి చమురు విషయంలో తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొనడం విశేషం. ట్రంప్ మాటల్లో వాస్తవమెంత? భారత్ నిజంగానే రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపివేసి, ప్రస్తుతం అమెరికా అధీనంలో ఉన్న వెనెజువెలా నుండి ఆయిల్ దిగుమతి చేయనుందా? అనే విషయాలపై భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికైతే ఇండో- యుఎస్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైనది. ఈ ఒప్పందం మార్చి నెల నుండి అమల్లోకి రాబోతున్నది. యూరోపియన్ యూనియన్తో భారత్ చేసుకున్న ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ కూడా ఏ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కాని అమల్లోకి వస్తుంది. భారత్పై ఆగ్రహంతో రగిలి పోయిన ట్రంప్ స్వరం మార్చి మోడీని ప్రశంసించడమే కాకుండా అమెరికా- భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దంలోనే అతి పెద్ద చారిత్రక ఒప్పందంగా అభివర్ణించడం జరిగింది. భారత్తో తాము జరిపే 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం జీరో సుంకాలతో జరగబోతుందని చెబుతున్న ట్రంప్, భారతీయ వస్తువులపై 18 శాతం సుంకాలు విధించడం ఇరుదేశాల వాణిజ్య వ్యవహారాల్లోని అసమతుల్యతను, భారత్ పట్ల అమెరికా చూపుతున్న వాణిజ్య వివక్షను చాటి చెబుతున్నది. భారత్- ఇయు దేశాల ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ పట్ల అప్రమత్తమైన ట్రంప్ ఒక మెట్టుదిగి, పట్టుదల వదలి భారత్తో ట్రేడ్ డీల్కు పచ్చజెండా ఊపినట్లు అవగతమవుతున్నది. అమెరికాలో ట్రంప్ పట్ల వ్యతిరేకత ఏర్పడడం, ద్రవ్యోల్బణం పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా మిత్రదేశాలు ట్రంప్కు వ్యతిరేక గళం వినిపించడం, అమెరికా విధించిన రెసిఫ్రోకల్ టారిఫ్లను, అధిక సుంకాలను చైనా వంటి దేశాలు లెక్కచేయకపోవడం, రష్యా ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగించడంతోపాటు అనేక అంశాలు, స్వీయ తప్పిదాలు ట్రంప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా భారత్పై 50% సుంకాలు విధించడం, ఇందులో రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకే ఏకంగా 25 శాతం అదనపు సుంకాలను విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఈ సుంకాలను 18. శాతానికి పరిమితం చేయడం శుభసూచకం. మన పొరుగునున్న చైనా, బంగ్లాదేశ్, పాక్లపై 37, 20, 19 శాతం సుంకాలను విధించిన అమెరికా తన మిత్ర దేశాలపై కూడా భారత్ కంటే ఎక్కువ సుంకాలు విధించిన దేశాల జాబితాలో ఉన్నాయి. బ్రెజిల్పై 50%, మయన్మార్ పై 40% టారిఫ్లు విధించిన అమెరికా ఇప్పుడు భారత్ విషయంలో పన్నుల భారం తగ్గించడం క్షీణిస్తున్న ఇండో- యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకొనే చర్యల్లో ఒక భాగమే. అమెరికా మొండి పట్టుదల వలన ఇప్పటికే యూరోపియన్ యూనియన్ అమెరికాకు దూరం కావడం జరిగింది. అమెరికా శత్రుదేశాలను, మిత్రదేశాలనే కాకుండా భిన్న ధ్రువాలైన ఇరాన్, ఇజ్రాయెల్ పాలస్తీనా లతోపాటు, అరబ్ ఎమిరేట్స్తోను భారత్ తన ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నది. దీనిని భారత్ దౌత్యనీతిగా భావించాలా? లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా మోడీ అమెరికా హెచ్చరికలకు లొంగిపోయారా? అనే సంశయం తొలగిపోలేదు. ఆవేశకావేషాలు, ప్రతీకార చర్యలు, పంతాలు, పట్టింపులు భారత ఆర్థ్ధికాభివృద్ధికి గొడ్డలివేటు. ఈ విషయాన్ని గమనించే భారత్ ప్రపంచ దేశాలన్నింటితోను సఖ్యతను కొనసాగిస్తున్నది. అమెరికా వలన భారత్కు రష్యాతో గల రక్షణ, వాణిజ్య, సాంకేతిక సంబంధాలతో పాటు చారిత్రక, సన్నిహిత సంబంధాలకు విఘాతం కలగకుండా కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో భారత్కు నమ్మదగిన ఏకైక దేశం రష్యా మాత్రమే. ఎన్ని అడ్డంకులెదురైనా రష్యాతో భారత్కు గల చిరకాల బంధాన్ని కొనసాగించాలి. ఈ విషయంలో అమెరికా ఒత్తిడిని భారత్ పరిగణనలోకి తీసుకోకూడదు. ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ వలన భారతీయ వస్తువులకు అమెరికా పెద్ద మార్కెట్గా అవతరించబోతుంది. భారతదేశంలో తగ్గబోయే వస్తువుల ధరలు, ఇంధన ధరల ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకు దక్కాలి. భారతదేశంలో ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలున్న దేశంగా వెనెజువేలా పేరుగాంచింది. 800 సంవత్సరాలకు సరిపడా ఆయిల్ నిల్వలు గల వెనెజువెలాలో చమురు వెలికితీయడంలో హ్యూగోచావెజ్, మదురోలు విఫలమైనారు. ఇప్పుడు వెనెజువెలా అమెరికా కనుసన్నల్లో ఉండడం వలన ఆయిల్ను వెలికితీయడం సాధ్యం కావచ్చు. వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే ట్రంప్ భారత్, చైనాలను కోరడం జరిగింది. ఇది సాధ్యమా? ఏదిఏమైనప్పటికీ ట్రంప్ ధోరణిలో మార్పు వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అభిలషణీయం. ఈ విషయంలో అమెరికా ఎలాంటి షరతులు విధించినా భారత్ అంగీకరించకూడదు. అలాగే భారతీయ ఉత్పత్తులపై విధించిన 18 శాతం సుంకాలను కూడా తొలగించి భారత్పై అమెరికా తనకున్న విశ్వసనీయతను ప్రపంచానికి చాటి చెప్పాలి. రష్యా విషయంలో భారత్ను హెచ్చరించిన అమెరికా ఇప్పుడు రష్యాతో కూడా రహస్య ఒప్పందం కుదుర్చుకోబోతుందని కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. పెట్రో డాలర్ వ్యవస్థను రష్యా అంగీకరించి, చమురును డాలర్లలోనే విక్రయించబోతున్నదనే వార్తల్లో నిజానిజాలు తేలాలి. ఏదిఏమైనప్పటికీ యుద్ధాల వలన ప్రయోజనం లేదని, ఆయుధాలు ప్రజల ఆకలిని తీర్చలేవనే సత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం ఆయుధాలతో, ఉగ్రవాదంతో, అగ్ర దేశాల అవసరార్ధ ప్రయోజనాల కోసం తన ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసుకున్న పాక్కు ప్రస్తుత ప్రపంచ పరిణామాలు గుణపాఠం కావాలి. ఇప్పటివరకు పాక్ సాయంతో, సైనిక మద్దతుతో చిందులేసిన బంగ్లాదేశ్లోని బిఎన్పి నాయకుడు తారిఖ్ రెహమాన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన స్వరం మార్చుకున్నట్టు కనబడుతున్నది. భారత్తో స్నేహ సంబంధాలను నెలకొల్పుకుంటానని, బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తానని ప్రకటించడం ముదావహం. ఈ పరిణామాలను బట్టి ఇక నుండి ప్రపంచం వాణిజ్య సంబంధాల చుట్టే తిరుగుతుందనే వాస్తవం బోధపడుతున్నది. అశాంతి, అలజడులతో ఏమీ సాధించలేమని ప్రపంచ దేశాలు గమనించాలి. - సుంకవల్లి సత్తిరాజు 97049 03463
Andhra Pradesh : అన్ని రోగాలకూ చెక్.. ఏపీ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఫ్యాక్ట్ చెక్: గుజరాత్ లోని ఓ పెళ్లి వేడుకకు హాజరైంది టేలర్ స్విఫ్ట్ కాదు. ఆమెను పోలి ఉన్న మహిళ
గుజరాత్ లోని ఓ పెళ్లి వేడుకకు హాజరైంది టేలర్ స్విఫ్ట్
సైబరాబాద్ కు రానా.. రాడో ఎంట్రీ [8:57 am, 26/02/2026] Pranavi Voice Over: #CyberabadPolice #K9Squad
భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ చారిత్రాత్మక మార్గమధ్యంలో నిలిచింది. ఒకప్పుడు దేశనిర్మాణం సామాజిక పురోగతికి మేధో శక్తిగా భావించబడిన ఈ వ్యవస్థ ఇప్పుడు నిర్మాణాత్మకంగా, నైతికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థల సంఖ్య వేగంగా పెరిగింది, నాణ్యత, స్వయం ప్రతిపత్తి, విద్యా లక్ష్యం పెరగలేదు. ఫలితంగా ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. డిగ్రీలు ఎక్కువ, కానీ నైపుణ్యాలు తక్కువ; క్యాంపస్లు ఎక్కువ, కానీ పరిశోధన బలహీనంగా; ప్రవేశాలు ఎక్కువ, కానీ నమ్మకం తగ్గుతూ ఉంది. విద్య ఎప్పుడూ అభివృద్ధికి పునాది, ముఖ్యంగా ఆలస్యంగా పారిశ్రామీకరణ చెందుతున్న సమాజాలకు. ప్రాథమిక విద్య అక్షరాస్యతను, పౌరచైతన్యాన్ని పెంపొందిస్తే, ఉన్నత విద్య ఆవిష్కరణ, పరిశోధన, నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుంది. గత అర్ధ శతాబ్దంలో తమ ఆర్థిక వ్యవస్థలను మార్చుకున్న దేశాలు మానవ వనరులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. భారతదేశం, విశేష జనాభా ప్రయోజనం ఉన్నప్పటికీ, నిరంతరంగా అది చేయలేకపోయింది. దాని ప్రభావాలు ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల సంక్షేమంపై న్యాయస్థానాల పరిశీలనలు క్యాంపస్లలో ఉన్న ఒత్తిడిని దేశవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చాయి. ఆర్థిక ఒత్తిడి, సామాజిక ఒంటరితనం, విద్యా ఆందోళన, సంస్థాగత మద్దతు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. పరిపాలన బోధనా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరాన్ని కోర్టులు హైలైట్ చేశాయి. ఎందుకంటే పాలనలో ఉన్న ఖాళీలు నేరుగా విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి. అనేక ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అనుమతించిన బోధన పోస్టులలో సగానికి సమీపం ఖాళీగా ఉంది. దీని వల్ల బోధన నాణ్యత, పరిశోధన సంస్కృతి బలహీనపడుతోంది. ఈ పతనం ముఖ్యంగా పాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పేరుగాంచిన విద్యా కేంద్రాలు ఇప్పుడు తక్కువ సిబ్బందితో, నిలిచిపోయిన నియామకాలతో, తగ్గుతున్న పరిశోధనతో నడుస్తున్నాయి. ఒకప్పుడు మేధో చర్చలకు దారిచూపిన విభాగాలు ఇప్పుడు ప్రాథమిక విద్యా కార్యకలాపాలు నిర్వహించడానికి కష్టపడుతున్నారు. నియామకాలు, పాలనపై రాజకీయ విభేదాలు పరిపాలన స్తబ్దతను పెంచగా, అవినీతి, భావజాల అనుకూలత ప్రతిభాపరమైన నియామకాలను దెబ్బతీశాయి. దీంతో స్వయం ప్రతిపత్తి సంక్షోభం విశ్వసనీయత సంక్షోభంగా మారింది. జాతీయ స్థాయిలోకూడా ఉన్నత విద్యా వ్యవస్థలో అసమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది సిద్ధత లేకుండా విస్తరణ. గత రెండు దశాబ్దాల్లో ప్రైవేట్ సంస్థలు వేగంగా పెరిగి డిమాండ్- సప్లై అంతరాన్ని పూరించాయి. కానీ అనేక సంస్థలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా మాత్రమే పని చేస్తున్నాయి. ప్రవేశాలు పెరిగినా ప్రభుత్వ నిధులు పెరగలేదు, మౌలిక వసతులు వెనుకబడ్డాయి, అధ్యాపకుల కొరత తీవ్రమే. ప్రయోగశాలలు పాతబడిపోయాయి, గ్రంథాలయాలు సరిపడా లేవు, తరగతి గదులు కిక్కిరిసిపోయాయి. ఈ పరిమాణాత్మక పెరుగుదల ఉద్యోగ అవకాశాల్లో తీవ్రమైన అంతరాన్ని సృష్టించింది. విద్యార్థులు ప్రాయోగిక నైపుణ్యాలు, పరిశ్రమ అనుభవం, సమస్య పరిష్కార సామర్థ్యం లేకుండా పట్టభద్రులవుతున్నారు. అనేక కోర్సుల సిలబస్ దశాబ్దాలుగా మారలేదు, సిద్ధాంతానికి ప్రాధాన్యం, అన్వయానికి తక్కువ ప్రాధాన్యత. విద్యా సంస్థలు -పరిశ్రమల మధ్య బలహీన సంబంధం విద్యార్థులను వాస్తవ ప్రపంచం నుండి దూరం చేస్తుంది. ఫలితంగా చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరుగుతుండగా, సంస్థలు నైపుణ్యాల కొరతను చెబుతున్నాయి. ఇది వ్యవస్థ వైఫల్యానికి సంకేతం. ఈ క్షీణత ప్రధాన కారణం అధ్యాపక సంక్షోభం. అధిక పని భారం, కాంట్రాక్టు ఉద్యోగాలు, తక్కువ పరిశోధన మద్దతు, పరిపాలన ఒత్తిడి వల్ల ఉపాధ్యాయుల్లో విసుగు పెరిగింది. ఆసక్తి లేని ఉపాధ్యాయులు ఆసక్తిగల విద్యార్థులు సృష్టించలేడు. మార్గదర్శకత తగ్గడంతో హాజరు తగ్గడం, విద్యా ఫలితాలు పడిపోవడం, నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. ఇది దేశ ఉత్పాదకతను దెబ్బతీసే ప్రమాదం. ప్రతిభావంతులైన అధ్యాపకులు విదేశాలకు లేదా కార్పొరేట్ రంగాలకు వెళ్లడం సంస్థల సామర్థ్యాన్ని మరింత బలహీనపరుస్తోంది. అసమానత కూడా సమస్యను పెంచుతోంది. ఉన్నత నాణ్యత విద్యకు ప్రాప్యత ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా, ఆర్థిక స్థాయిల వారీగా సమానంగా లేదు. ప్రముఖ సంస్థలు పెద్ద నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. గ్రామీణ, చిన్న పట్టణాల విద్యార్థుల వలస వెళ్లాల్సి వస్తోంది లేదా తక్కువ వసతులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థిక అడ్డంకులు, మద్దతు వ్యవస్థల లేమి వల్ల అట్టడుగు వర్గాల అవకాశాలు తగ్గుతున్నాయి. సమాన అవకాశాలు ఇవ్వాల్సిన ఉన్నత విద్య అసమానతను పునరుత్పత్తి చేస్తుంది. పరిశోధన రంగం కూడా బలహీనంగా ఉంది. ప్రపంచ పోటీ దేశాలతో పోలిస్తే భారతదేశం ప్రభావవంతమైన పరిశోధన ప్రచురణలు తక్కువగా ఉత్పత్తి చేస్తోంది; పదోన్నతులు తరచుగా సీనియారిటీ ఆధారంగా జరుగుతున్నాయి. సృజనాత్మకతకు తక్కువ ప్రాధాన్యం. తక్కువ నిధులు, అధిక నియంత్రణ, పరిమిత సహకారం సృజనాత్మకతను నిరుత్సాహపరుస్తుంది. బలమైన పరిశోధన సంస్కృతి లేకుండా విశ్వవిద్యాలయాలు సాంకేతిక అభివృద్ధికి లేదా విధాన రూపకల్పనకు పెద్దగా తోడ్పడవు. పాలసీ మార్పులు, గ్రేడ్ చేసిన స్వయం ప్రతిపత్తి, పరిశోధన ఫెలోషిప్లు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్లు వంటి ప్రభుత్వ చర్యలు సమస్యను గుర్తించిన సంకేతాలే. అయితే స్థిరమైన పెట్టుబడి, పారదర్శక పాలన, సంస్థల స్వాతంత్య్రం లేకుండా సంస్కరణలు అసంపూర్తిగానే ఉంటాయి. స్వయం ప్రతిపత్తి అంటే కేవలం పరిపాలనా స్వేచ్ఛ కాదు; ఉన్నత విద్య దేశ కార్మిక శక్తి, ప్రజాస్వామ్య చైతన్యం, శాస్త్రీయ సామర్థ్యాన్ని నిర్మిస్తుంది. విశ్వవిద్యాలయాలు బలహీనపడితే ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. సామాజిక పురోగతి తగ్గుతుంది. మేధో జీవితం పేదరికంలో పడుతుంది. ప్రపంచ నాయకత్వం కోరుకునే దేశం బలహీన విద్యా పునాదులపై నిలవలేను. అందువల్ల భారతదేశానికి స్పష్టమైన మార్పు అవసరం. ప్రభుత్వ పెట్టుబడులు పెంపు, ప్రతిభాపరమైన నియామకాలు, సిలబస్ ఆధునీకరణ, పరిశ్రమ భాగస్వామ్యం, ముఖ్యంగా అకాడెమిక్ స్వేచ్ఛ రక్షణ. విశ్వవిద్యాలయాలను పరిపాలనా విభాగాలుగా లేదా రాజకీయ వేదికలుగా కాకుండా జ్ఞానం, సామాజిక పురోగతికి అంకితమైన ప్రజా నమ్మక సంస్థలుగా చూడాలి. ఉన్నత విద్య సంక్షోభం కేవలం విద్య సమస్య కాదు; అభివృద్ధి సవాలు. దీనిని అత్యవసరంగా, నిష్ఠతో పరిష్కరిస్తే భారత జనాభా ప్రయోజనం జ్ఞాన ప్రయోజనంగా మారింది. నిర్లక్ష్యం చేస్తే డిగ్రీలు ఉన్నా కానీ సామర్థ్యం లేని తరాలు తయారవుతాయి. ఈ ఎంపికే భారత భవిష్యత్తుకు ఉన్నత విద్య ఇంజిన్గా మారుతుందా లేక అడ్డంకిగా మిగిలిపోతుందా అనేది నిర్ణయిస్తుంది. - డా. ముచ్చకోట సురేష్ బాబు
అక్రమ తరలింపు.. చేసింది ఎవరు..?
అక్రమ తరలింపు.. చేసింది ఎవరు..? పెద్దవంగర, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర
India vs Zimbabwe T20 World Cup : నేడు భారత్ - జింబాబ్వే మ్యాచ్
భారత్ - జింబాబ్వే మధ్య మ్యాచ్ నేడు చెన్నై వేదికగా జరగనుంది
కాపీయింగ్ జరుగకుండా.. చెన్నూర్, ఆంధ్రప్రభ : ఇంటర్మిడియేట్ ద్వితీయ సంవత్సర విద్యార్థి, విద్యార్థులకు
KTR : నేడు ఖమ్మం, సూర్యాపేటలో కేటీఆర్ పర్యటన
నేడు ఖమ్మం, సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు.
పేద పిల్లలను స్పృశించని ఆర్థికాభివృద్ధి
దారిద్య్రానికి పూచిన పువ్వులు దయనీయమైన జీవితాల్ని వెళ్ళదీస్తున్నాయి. తల్లిపాలు అందక తల్లడిల్లుతున్న శిశువులు ఎంతో మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చిన్నారులు ఆకలితో నకనకలాడుతూ ఫుట్పాత్ల మీద తచ్చాడుతున్నారు. బుక్కెడు తిండికోసం హోటళ్ళలో కప్పులు కడుగుతున్నారు. కార్ఖానాలలో తాహతుకు మించి బరువులు మోస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ ప్రపంచ దేశాలవైపు దీనంగా చూస్తూనే వున్నాయి. లెక్కకు అందని సంఖ్యలో పిల్లలు పేదరికంలో మగ్గుతున్నారు. ఆర్ధికాభివృద్ధి ఈ పిల్లలకు సహాయపడటంలో విఫలమవుతోంది. మన దేశంలో ఆధ్యాత్మిక సంస్థల ముందు అందించే ఉచిత ఆహార పదార్థాలకోసం ఎంతో మంది పేదపిల్లలు చేతులు చాస్తున్నారు. రోడ్ల పక్కన, ఫుట్పాత్లపై నిద్రపోతున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అడుక్కుంటున్నారు. వీళ్ళందరికీ చేరువ కావడంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు విఫలమవుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పేద పిల్లలకు ఉద్దేశించిన పథకాలేవీ వారికి అందడంలేవు. దీంతో దారిద్య్రరేఖకు దిగువున జీవనం సాగిస్తున్న పిల్లల సంఖ్య అయోమయంగా ఉంది. ఆకలి, కలుషిత వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. మిలియన్ల సంఖ్యలో జీవనం సాగిస్తుండగా, ఆర్థికాభివృద్ధి వీరి వెనుక తచ్చాడుతోంది. ఈ విషయాన్ని పేదరికంలో మగ్గుతున్న పిల్లల మరణాల సంఖ్యను స్పష్టం చేసున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న పిల్లలు తమ ఐదవ పుట్టినరోజు జరుపుకోకుండానే మరణిస్తున్నారు. ఈ మరణాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తున్న పిల్లలతో పోలిస్తే ఎక్కువ. ఇక, పుట్టిన కొద్ది రోజులలో మరణిస్తున్న పిల్లల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. ఈ మరణాల లెక్కలు చెప్పుకోవడం విచారకరమైన విషయంగా భావించాలి. పేదరికం, ఆకలి, లైంగిక అసమానత, నిరక్షరాస్యత తదితర అంశాలను 2000 సంవత్సరం నాటికి రూపుమాపడానికి యునైటెడ్ నేషన్స్ నిర్దేశించిన లక్ష్యాలు నీరుగారిపోయాయి. గత 25 సంవత్సరాలుగా ఊహించనంతగా ప్రపంచ ఆర్థికాభివృద్ధి జరిగింది. పేద, ధనికుల మధ్య తారతమ్యం లేకుండా పోయిందని యునైటెడ్ నేషన్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 40 కోట్ల మంది పిల్లలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నట్లు 2023 నాటి యునిసెఫ్ నివేదికలు వెల్లడించాయి. ఆహారం, నీరు, ఆశ్రయం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కనీస అవసరాలు లేని బహుముఖీయ పేదరికం అనుభవిస్తున్న పిల్లల సంఖ్య సుమారు 900 మినియన్ల వరకు ఉంటుందని అంచనా. గత దశాబ్దంతో పోలిస్తే తీవ్ర పేదరికంలో ఉన్న పిల్లల సంఖ్య దాదాపు 50 మిలియన్లు తగ్గగా; కోవిడ్ 19, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా ఈ తగ్గుదల క్షీణించింది. ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా నగరాకు వలస వస్తున్న పేదల సంఖ్య పెరగడం, దీనికనుగుణంగా మురికివాడల సంఖ్య పెరుగుతుండడం ఆర్థ్ధికాభివృద్ధికి సవాలుగా మారింది. రేపటి తల్లిదండ్రులుగా మారే నేటి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలను తీర్చగలిగే ఆర్థికాభివృద్ధికి పరిమితం కావలసిన అవసరముందని నివేదిక చెప్పకనే చెబుతోంది. మన దేశం విషయానికొస్తే, ఆర్థిక విస్తరణ బలంగా ఉన్నప్పటికీ, పేద పిల్లల సమస్య దశాబ్ద కాలానికిపైగా జటిలంగా మారింది. 23 కోట్ల 68 లక్షలకుపైగా పిల్లలు ఉండగా, వీరిలో 11.45 శాతం మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలు చిన్న చిన్న పనుల్లో కొనసాగుతున్నారు. బాల కార్మికులుగా 14 నుంచి 17 ఏళ్ల పిల్లలు సుమారు 63% ఉన్నారు. పేదరికంతో చాలా మంది పిల్లలు ఫుట్పాత్ల మీద పడుకోవడం, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వాలు వీరికోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక రోజు కూడా కడుపునిండా తిండిని అందించలేకపోతున్నాయి. పేదరికం పిల్లలను అపాయకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. తెలిసీ తెలియని వయస్సులో వివాహం, భద్రత లేని ఉపాధి... తదితర కారణాలు మానసికాందోళనకు గురిచేస్తున్నాయి. దొంగతనాలు, దోపిడీలు, అసాంఘిక కార్యకలాపాలకు దారితీయిస్తున్నాయి. ఈ దారుణమైన పరిస్థితులపై దేశం దృష్టి సారించకపోతే, 2030 నాటికి 68 మిలియన్ల పిల్లలు తమ వయస్సు ఐదు దాటకముందే మరణించే అవకాశముంటుందని యునిసెఫ్ స్పష్టం చేసింది. అంతేకాదు, మరో 119 మిలియన్ల పిల్లలు తీవ్రమైన లోపపోషణకు గురికానున్నట్లు హెచ్చరించింది. ఒక్క భారత్లోనే అపాయకరమైన వ్యాధులు ప్రబలి ఏడాదికి ఏడు లక్షల మంది పిల్లలు మరణించే పరిస్థితులు నెలకొంటాయని వివరించింది. ఇదికాస్త ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తుందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యం పేద పిల్లలవైపు చూపుసారిస్తూ కొంతమేరకు అభివృద్ధి సాధించినట్లుగా యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. 1990 నుంచి తీవ్రమైన లోపపోషణ 41 శాతం, ఐదేళ్లలోపు పిల్లల మరణాలు సగానికిపైగా తగ్గినట్లు పేర్కొంది. దీనికితోడు గర్భస్థ మరణాలు 45 శాతానికి తగ్గినట్లు తెలిపింది. రెండు బిలియన్ల పేద పిల్లలకు సురక్షిత మంచినీరు అందుతుండడంవల్లే ప్రజారోగ్య అభివృద్ధి సాధ్యపడుతున్నట్లు వివరించింది. 2013లో ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాలలోని హింసాత్మక సంఘటనలు, నేపాల్లోని ప్రకృతి వైపరీత్యాలు, ఫిలిఫీన్స్లోని అంటువ్యాధులు, యుద్ధాలు తదితర కారణాలు అభివృద్ధి తిరోగమనం వైపు మళ్ళించింది. దీంతో పేద పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో యునైటైడ్ నేషన్స్ ‘సాధించే దిశలో అభివృద్ధి లక్ష్యాలు’ పేరిట అన్ని దేశాల్లో నిర్దిష్టమైన లక్ష్యాన్ని ప్రవేశపెట్టింది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని సమాజం, మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, పరిశుభ్రమైన నీరు, వాతావరణ చర్య వంటి అభివృద్ధి లక్ష్యాలు సాధించాలన్న దిశగా ప్రయాణం సాగిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకుని అభివృద్ధి పథంలో నడవాలని కాంక్షిస్తోంది. - కోడం పవన్కుమార్ 9848992825
ఫ్యాక్ట్ చెక్: బైకర్ పై దాడి చేసిన చిరుతపులి అంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
బైకర్ పై దాడి చేసిన చిరుతపులి అంటూ వైరల్ అవుతున్న వీడియో
భారత్`పాక్ అణు యుద్ధం నివారించా
. నా జోక్యం లేకుంటే 3.5 కోట్ల మంది ప్రాణాలు పోయేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటన వాషింగ్టన్: అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల కాలంలోనే తాను ఎన్నో గొప్ప పనులు చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు పోయారు. ఏకంగా 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ‘స్టేట్ ఆఫ్ యూనియన’ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆపిన యుద్ధాలలో భారత్, పాక్ […] The post భారత్`పాక్ అణు యుద్ధం నివారించా appeared first on Visalaandhra .
అత్యంత అననుకూలమైన పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల పర్యటనకోసం బుధవారం ఇస్రాయెల్ పర్యటన ప్రారంభించారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ రంగంలో మోదీ పలుకుబడిని బాగా దెబ్బ తీసింది. సన్నిహిత మిత్రుడు అనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ మధ్యవర్తిత్వంతో ట్రంప్కు దగ్గర కావాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఏ దేశ విదేశాంగ విధానమైనా తమ ప్రయోజనాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధాలు […] The post విధ్వంసకులతో మోదీ వియ్యం appeared first on Visalaandhra .
సేవలందించిన ప్రభుత్వ సంస్థల అమ్మకం
డా.రామకృష్ణ సూర్యదేవర స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తరతరాలుగా, కోట్లాది మంది భారతీయులు చెమటోడ్చి, పన్నులు కట్టి, ఎన్నో త్యాగాలు చేసి నిర్మించుకున్న మన ప్రజా ఆస్తులు ఇవాళ ఒక్కసారిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది కేవలం దేశ ఆర్థిక అవసరమా ? లేక ఒక పక్కా వ్యూహమా ? ఈ ప్రశ్న ఇవాళ ప్రతి సామాన్యుడి గుండెను తొలుస్తోంది. నెహ్రూ, పటేల్ వంటి మన పెద్దలు కన్న కలల భారతాన్ని నిజం చేయడంలో మన […] The post సేవలందించిన ప్రభుత్వ సంస్థల అమ్మకం appeared first on Visalaandhra .
వేడెక్కుతున్న భూమితోభవిష్యత్తు అంధకారం
డా.ముచ్చుకోట సురేష్బాబు మనుషులు జీవిస్తున్న ఈ భూగ్రహం విపరీతంగా వేడెక్కకుండా ఉండాలన్నా, వాతావరణ మార్పుల వలన కలిగే ప్రభావాలను నివారించాలన్నా గ్లోబల్ వార్మింగ్ను వీలైనంత వరకు తగ్గించుకునే దిశగా మార్పులు చేసుకోవాలి. ఐతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 1.5 డిగ్రీల సెల్సియస్ను మించిపోవడంతో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ వాతావరణ పరిస్థితి సాధారణ స్థాయికి రావాలంటే కర్బన్ ఉద్గారాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఉష్ణోగ్రత పరిమితిని దాటితే ఎన్నో రకాల విపత్కర […] The post వేడెక్కుతున్న భూమితోభవిష్యత్తు అంధకారం appeared first on Visalaandhra .
Gold Price Today : పసిడి దూకుడు.. వెండి పరుగు.. ఇంకెంత కాలమంటే?
ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీవిశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా కె.శ్రీనివాస్ రెడ్డిని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం బుధవారంతో ముగియడంతో మరో రెండేళ్ల పాటు ఆయన్ను ఆ పదవిలో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులి చ్చింది. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆయన పని చేశారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు […] The post మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు appeared first on Visalaandhra .
వ్యవసాయ యాంత్రీకరణ పథకం లక్ష్యం అదే..
వ్యవసాయ యాంత్రీకరణ పథకం లక్ష్యం అదే.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : రైతుల
డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపైఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
శామ్యూల్ జవహర్కు సీపీఐ నేతల వినతివిశాలాంధ్ర బ్యూరో-అమరావతి: నంద్యాల జిల్లా సీపీఐ డోన్ మండల కార్యదర్శి బి.నారాయణపై దాడి చేసిన పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి… కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్కు సీపీఐ బందం వినతిపత్రం అందజేసింది. విజయవాడ ఏపీఎసఆర్టీసీ ప్రాంగణంలోని ఎన్టీఆర్ భవన్లో గల ఎస్సీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, […] The post డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపైఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు appeared first on Visalaandhra .
The Paradise: Nani got the Right One
Natural Star Nani is the most consistent Telugu actor currently and he has delivered some of the best films in the recent years. The biggest compliant is that Nani’s theatrical market hasn’t seen a huge rise like his non-theatrical market reached. The non-theatrical rights of his films are sold well in advance for fancy prices […] The post The Paradise: Nani got the Right One appeared first on Telugu360 .
ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశంపై సుప్రీం ఆగ్రహం న్యూదిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అందరినీ కలవరపాటుకు గురిచేసిందని, న్యాయవ్యవస్థను కించపరచే ఎలాంటి చర్యలను అనుమతించేది లేదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీనిపై సుమోటో చర్య తీసుకుంటామన్నారు. ‘న్యాయవాదులు, న్యాయమూర్తులతో సహా అందరినీ ఈ అంశం కలవరపాటుకు గురిచేసింది. కొన్ని రోజులు ఆగండి. దీనిపై […] The post న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం appeared first on Visalaandhra .
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో గాయత్రీ మంత్రం, శివస్తోత్రం ప్లే
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీలో ప్రాధాన్య పోస్టుల్లో పని చేస్తున్న 2018 గ్రూప్-1 పరీక్ష ద్వారా ఎంపికయిన అధికారులను ఫోకల్ పోస్టుల నుంచి రిలీవ్ చేయా లని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఫోకల్ పోస్టుల్లో ఉన్న ఈ అధికారులు వెంటనే తమ తమ సంబంధిత శాఖాధిపతుల వద్ద రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నివేదికను బుధవారం […] The post 2018 గ్రూప్-1 అధికారుల రిలీవ్ appeared first on Visalaandhra .
Weather Report : పిడుగులు.. ఉరుములు.. మెరుపులు.. కూల్ వెదర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది.
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. ఇక వేసవి వరకూ ఇంతేనా?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది
New Proposal for OTT Window in Telugu Cinema
Bowing down to the pressure of the digital platforms and to recover the big investments spent, Tollywood producers are agreeing to sell off the digital streaming rights at a gap of four weeks from the theatrical release date. This has turned out to be a dent for the theatrical revenues and threat for the survival […] The post New Proposal for OTT Window in Telugu Cinema appeared first on Telugu360 .
Andhra Pradesh : నేడు శాసనసభలో రెండు కీలక బిల్లులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
లాడ్జిలో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి
కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
గ్లామర్ ప్రపంచంలో వెలుగులు ఎప్పటికీ నిలవవని, స్టార్డమ్ శాశ్వతం కాదని టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేర్కొంది. తాజాగా ఆమె మాట్లాడుతూ “సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పుడే హీరోయిన్లు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. లేకపోతే కెరీర్ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేతి నిండా సినిమాలు ఉన్నప్పుడే సంపాదనను సరైన దిశలో మళ్లించాలి. నటీనటుల కెరీర్ ఎప్పుడెప్పుడు మలుపు తిరుగుతుందో చెప్పలేమని, కాబట్టి ముందుగానే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోవాలి. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల నుంచే నా ఆర్థిక వ్యవహారాలన్నీ మా నాన్నే చూసుకున్నారు. ఖర్చు, పొదుపు, పెట్టుబడుల విషయంలో ఆయన చూపిన క్రమశిక్షణే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నాన్న నేర్పిన పాఠాలే నన్ను రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చేశాయి”అని అన్నారు.
‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలు ఎప్ప్పుడు? . ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు. మండలిలో గందరగోళం విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకం అమలుపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. పరస్పర ఆరోపణలకు దిగడంతో మండలి వేడెక్కింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలి బుధవారం చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా 202425, 2025`26 ఆర్థిక సంవత్సరంలో ఆడబిడ్డ నిధి […] The post మాటల తూటాలు appeared first on Visalaandhra .
ఆవులకు ప్రేమతో.. వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆమెకు ఆవులంటే ప్రాణం. వారి వద్ద
. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటాం. స్పష్టమైన ప్రకటన చేయకపోతే అసెంబ్లీ ముట్టడి. ఉపాధ్యాయుల నినాదాలతో దద్దరల్లిన ధర్నాచౌక్. డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధతం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరిక విశాలాంధ్ర-విజయవాడ:తమ సమస్యలపై సానుకూల ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా పాకుల నుండి ఎటువంటి ప్రకటనలు రాకపోవడంపై మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై మౌనం వీడి… స్పష్టమైన […] The post సమస్యలపై సమరమే appeared first on Visalaandhra .
ప్రముఖ నటుడు శివాజీ నిర్మాతగా, హీరోగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఇంతకు ముందు శివాజీతో పలు హిట్ చిత్రాల్లో నటించి హిట్ జోడిగా ఖ్యాతి పొందిన శివాజీ, లయలు ఈ సినిమాలో మరోసారి జోడిగా కనిపిస్తున్నారు. శివాజీ, ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఈటీవీ విన్లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు తమ సంస్థల ద్వారా మార్చి 6న థియేటర్స్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హీరో, నిర్మాత శివాజీ మాట్లాడుతూ “ఈ సినిమాను అనుకున్నది అనుకున్నట్టుగా, ఈటీవీ వాళ్లకు ఏది చెప్పమో అదే తీశాం. బన్నీవాస్ సినిమా చూసి మెచ్చుకున్నారు. వంశీకి కూడా నచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్గా నవ్వుకున్నారు. ఓ మంచి సినిమా, అందరికి నచ్చే సినిమా తీశానని ధైర్యంగా చెప్పగలను. అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది”అని అన్నారు. లయ మాట్లాడుతూ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని తెలియజేశారు. బన్నీవాస్ మాట్లాడుతూ “ఈ సినిమా విడుదల చేయడానికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను చూసిన ఆయన ఇది పక్కా థియేట్రికల్ సినిమా, థియేటర్లో రిలీజ్ చేయమని చెప్పారు. శివాజీ కూడా ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం”అని తెలిపారు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ సినిమా నుంచి త్వరలోనే ఓ కొత్త ట్రైలర్ను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, వంశీ నందిపాటి, అలీ పాల్గొన్నారు.
మైనర్ బాలిక మిస్సింగ్.. పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలంలోని హనుమంతుని పేట
ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ పోరుకు భారత్ అండ
ప్రధాని నరేంద్ర మోదీతెలఅవీవ్:ఇజ్రాయిల్ పార్లమెంటులో ప్రసంగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయిల్తో 140 కోట్ల మంది భారతీయులకు స్నేహం, గౌరవం, భాగస్వామ్యం ఉన్నాయని చెప్పారు. “ఉగ్రవాదానికి మేం పూర్తిగా వ్యతిరేకం. భారత్ అనేక దశాబ్దాలుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతోంది. హమాస్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయిల్కు పూర్తిగా అండగా ఉంటాం” అని మోదీ అన్నారు. భారత్, ఇజ్రాయిల్ ప్రాచీన నాగరికత కలిగిన దేశాలని… ఇజ్రాయిల్ పార్లమెంట్లో […] The post ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ పోరుకు భారత్ అండ appeared first on Visalaandhra .
అందుకే.. వ్యవసాయ అధికారి సస్పెన్షన్..
అందుకే.. వ్యవసాయ అధికారి సస్పెన్షన్.. పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఏసీబీ ఆకస్మిక
Ys Jagan : నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు
అణు కార్యక్రమంపై కీలక సమావేశం నేడు.. ఇరాన్ హెచ్చరికలు
జెనీవాలో జరగనున్న అణు చర్చల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి రాజకీయాలు నడిపిస్తున్నారని ఇరాన్ బుధవారం తీవ్రంగా స్పందించింది
తయారీ రంగంలో అగ్రస్థానమే లక్ష్యం
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణను మా న్యుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొ న్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని సి ఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గ్లోబల్ ట్రెం డ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డితో శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్కు సంబంధించిన అంశాల గురించి వారిద్దరూఊ మాట్లాడారు. దీంతోపాటు ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభా వం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాల గురించి శంతనునారాయణ్ సిఎం రేవంత్రెడ్డితో చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సిఎం కోరారు.
26thfeb2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
26thfeb2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 26thfeb2026 |
టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించడం తనకు దక్కిన గౌరవం, గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉగ్రవా దం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదకరమే అని ప్రదాని మోడీ చెప్పారు. పరోక్షంగా ఇజ్రాయెల్లో రెండేళ్ల క్రితం హమాస్ నర మేధాన్ని ఖండించారు. ఉగ్రవాదం, హింసోన్మాదంపై ఇజ్రాయెల్ జ రిపే పోరులో భారతదేశం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ప్రకటించా రు. స భ్యులను ఉద్ధేశించి తొలుత హిబ్రూ బాషలో షలోమ్ అని వారికి అభివాదాలు చేశారు. సామరస్యం, సోదరభావం అభివాదాలకు సూచకంగా ఈ పదం వాడుతారు . ఇజ్రాయెల్కు తమ దేశ మద్దతు ఇకపై కూడా నిబద్ధతతో సాగుతుందని వెల్లడించారు. ఇది కాలాతీతంగా ఉంటుందన్నారు. ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ బలగాలు చొరబడి పౌరుల ప్రాణాలు తీసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి ఘటనలో మృతి చెందిన వారికి భారతదేశ ప్రజల తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. హమాస్ దాడిని అనాగరికం, అమానుషం అని పేర్కొన్నారు. ఇక్కడి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం కల్పించినందుకు ఇక్కడి నేతలకు, ఎంపిలకు కృతజ్ఞతలు అని తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ రెండూ ప్రాచీన విశిష్ట నాగరికతల దేశాలని, ఇది రెండు దేశాల స్నేహబంధం పూర్వ చరిత్ర అని పేర్కొన్నారు. రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తొలిరోజే బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్లో ఎంపిలను ఉద్ధేశించి ప్రసంగించారు. తాను ఇక్కడికి 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను తీసుకుని వచ్చానని సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. అదే విధంగా స్నేహం, ఆదరణభావం, భాగస్వామ్యం అనే మూడు కానుకలను అందించేందుకు వచ్చానని తెలిపారు. పలు దశల్లో అనేక కష్టాలు పడ్డ యూదులకు సంఘీభావంగా ఉంటామlన్నారు. ఇదే సమయంలో పాలస్తీనియా సమస్యలపై స్పందించాల్సిన సమయం కూడా వచ్చిందన్నారు. ఇక తాను పుట్టిన తేదీకి విశేషం ఉందని, ఇజ్రాయెల్ను భారతదేశం గుర్తించిన రోజే తాను జన్మించానని కూడా వెల్లడించారు. ఇజ్రాయెల్తో భారత్ సుదీర్ఘ బంధం గురించి తెలిపారు. భారతదేశ ప్రధాని ఒక్కరు ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడటం ఇదే తొలిసారి అయింది. ఇజ్రాయెలీ నేలతో భారతదేశ సంబంధాల పూర్వరంగం అత్యంత పురాతనం. ఇది రక్త సంబందం అని సభికుల మోడీ మోడి నినాదాల నడుమ చెప్పారు. నెత్తురు, త్యాగాల సమ్మిళిత అనుబంధం అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలోనే దాదాపుగా 4 వేల మంది భారతీయులు , పలు కులాలకు చెందిన వారు సైనికులుగా ఇక్కడ హైఫా యుద్ధంలో నెత్తురు చిందించారు. ప్రాణాలు వదిలారని వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రసంగానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సంక్షిప్తంగా మాట్లాడారు. అతిధి గురించి పార్లమెంట్కు అధికారికంగా తెలిపారు. భారతదేశం ఇజ్రాయెల్కు వెంట నిలిచింది. ఇజ్రాయెల్కు తోడుగా నిలిచింది. సత్యం కోసం పాటుపడింది. స్నేహితుడు మోడీకి ధన్యవాదాలు అని నెతన్యాహు తెలిపారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి ఘటనను భారతదేశం ఖండించిన విషయం ప్రస్తావించారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్షం కూడా శ్రద్ధగా ఆలకించింది. అంతకు ముందు పార్లమెంట్ నుంచి వాకౌట్ జరిపిన ప్రతిపక్ష ఎంపిలు ప్రధాని మోడీ ప్రసంగం దశలో లోపలికి వెళ్లారు. పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒమానా అంతకు ముందు ప్రధాని మోడీకి ఆప్ కా స్వాగత్ హై అని పలకరించారు.
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సిఎస్, డిజిపిలు ఎవరన్నది ప్రస్తుతం సస్పెన్ష్గా మారింది. ప్రస్తుతం సిఎస్గా ఉన్న రామకృష్ణారావు పదవీకాలం వచ్చేనెల 31వ తేదీతో పూర్తి కానుండగా, ఇన్చార్జీ డిజిపి శివధర్రెడ్డిది ఏప్రిల్ నెలతో పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తమకే ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ప్రస్తుత సిఎ స్, డిజిపిలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. అయితే, వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా తమకు ఈ పదవులు కేటాయించాలని సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్లు ప్రభుత్వానికి విన్నవించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ పదవుల కోసం పోటీపడుతున్న ఆశావహులు ఈ పదవులను దక్కించునేలా తమవంతు ప్రయత్నా లు చేస్తున్నట్టుగా సెక్రటేరియట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2025 ఏప్రిల్ 30వ తేదీన రామకృష్ణారావు సిఎస్గా బాధ్యతలు చేపట్టారు. 2025 ఆగష్టు 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీస్ను ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మార్చి 31వ తేదీ తో ముగియనుంది. ఇప్పటికే రామకృష్ణారావుకు ఒకసారి ఏడునెలలు సర్వీస్ పొడిగింపును ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆయన పదవీకాలాన్ని పెంచే అవకాశాలు లేవని సీనియర్ ఐఏఎస్లు పేర్కొంటుండడంతో సిఎస్ ఎవరన్న చర్చ ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. అయితే, మరికొందరు ఐఏఎస్లు మాత్రం ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని పేర్కొంటుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే రామకృష్ణారా వు పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక కొత్తవారిని ఎంపిక చేస్తారా? అ న్న విషయం త్వరలో తేలనుంది. అయితే, సిఎస్ రామకృష్ణారావు పదవీ పొడిగింపుపై కేంద్రం నుంచి సానుకూలత రాకుంటే ఆ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలిసింది. మరోవైపు సిఎస్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించవద్దని కొందరు సీనియర్ ఐఏఎస్లు ఫిర్యాదులు చేసినట్లుగా తెలిసింది. మరికొందరు ఆ పదవిని తమకే ఇవ్వాలని ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్పెషల్ సిఎస్లు జయేశ్ రంజన్, సభ్యసాచి ఘోష్, వికాస్రాజ్లు సిఎస్లుగా రేసులో ఉండగా ప్రస్తుతం కేంద్ర సర్వీస్లో ఉన్న సంజయ్జాజు కూడా ఈ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.1992 బ్యాచ్కు చెందిన వికాస్రాజ్, జయేశ్ రంజన్లతో పాటు 1994 బ్యాచ్ అధికారి సవ్యసాది ఘోష్ పేర్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. ఇక, జయేశ్ రంజన్ 2027 సెప్టెంబర్లో, సవ్యసాచి ఘోష్ 2027 ఏప్రిల్లో రిటైర్ కానున్నారు. వికాస్ రాజ్కు 2028 మార్చి వరకు సర్వీస్ ఉంది. ఇక, వీరితో పాటు ఐఏఎస్ల్లో అత్యంత సీనియర్ అయిన 1990 బ్యాచ్కు చెందిన శశాంక్ గోయల్ ఈ ఏడాది తరువాయి 9లో
మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాట?
మన తెలంగాణ/హైదరాబాద్ :మావోయిస్టు పా ర్టీ కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగుబాటుకు రంగం సిద్దమయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ వర్గాల కథనం ప్రకారం రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీలో కీలక అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్ లొంగిపోవడంతో ఇక ఆ పార్టీ నుంచి మిగిలిన పెద్దతలకాయ గణపతి ఒక్కరే. ఈయన కూడా పోలీసులకు లొంగిపోతే మావోయిస్టు పార్టీని తు డిచిపెట్టినట్టు అవుతోందని కేంద్ర ప్రభుత్వ యో చిస్తోన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో గణపతి ఆచూకీ కోసం గత కొన్ని నెలలుగా కేంద్ర, రాష్ట్రా ల ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా గాలిస్తోన్న ట్టు ఈ వర్గాల సమాచారం. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల నుంచి సేకరించిన సమాచారంతో గణపతి పొరుగు దేశం నేపాల్లో తలదాచుకున్నట్టు ఇంటెలిజన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. అక్కడ ఒక ఆశ్రమంలో అజ్ఞాత జీవితం గడుపుతన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందినట్టు చెబుతున్నా రు. అక్కడి నుంచి గణపతిని భారత్కు తీసుకవచ్చేందుకు కేంద్ర హోం శాఖ నేపాల్ ప్రభుత్వం తో రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. అ యితే గణపతి కేంద్ర హోం శాఖ అధికారుల ఎ దుట లొంగిపోతారా? లేక తెలంగాణ పోలీసుల వద్ద లొంగిపోతారా? అనే దానిపై స్పష్టత రావా ల్సి ఉందని కూడా చెబుతున్నారు. ఇలా ఉండ గా, గణపతి 2018లో పార్టీకి రాజీనామా చేసి బ యటకు వచ్చారు. అప్పటి నుండి వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ప్రస్తుతం ఆయ న అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమయిన స్థితిలో ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ వ ర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితిపై కూడా ఆయనకు సమాచారం లేదని వారు అంటున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టా ఎలాంటి హాని కలిగించబోమన్న హామీతో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతోన్నట్టు సమాచారం. ఈ వర్గాల కథనం ప్రకారం గణపతి కూడా రాష్ట్ర పోలీసుల వద్ద లొంగిపోవడానికే మొగ్గు చూపుతునట్లు తెలిసింది. ఈ వర్గాల సమాచారం ప్రకారం గణపతి లొంగుబాటుకు రంగం సిద్దం అయిందని కచ్చితంగా చెబుతున్నారు.
మిర్యాలగూడలో నకిలీ కంటి వైద్యులు
మన తెలంగాణ/ మిర్యాలగూడ: నకిలీ కంటి వై ద్యులను పోలీసులు పట్టుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని డాక్టర్స్ కాలనీ లో ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆఫీసర్ల బృందం తనిఖీలు చేపట్టి నకిలీ కంటి వైద్యుల వ్య వహారం గుర్తించినట్లు తెలిపారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పజ్జూ రి వికాస్ కుమార్ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. 2007 నుంచి 2009 వరకు సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో డిఏవో కోర్స్ చేసి అనంతరం హైద్రాబాద్లో ట్రాన్స్ ఐ, శ్రీ నేత్రాలయలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్గా ఐదేళ్లు, అదేవిధంగా మిర్యాలగూడ హనుమాన్ ఐ క్లినిక్లో ఆరేళ్లు పని చేశాడు. ఈ క్ర మంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్గా పనిచేసేది వదిలేసి 2021లో మిర్యాలగూడలో శ్రీ మహాలక్ష్మీ కంటి ఆసుపత్రిని స్థాపించి నాటి నుంచి ఆప్తాల్మిక్ డాక్టర్గా పేషెంట్లను పరిచయం చేసుకుంటూ చికిత్స చేస్తున్నాడు. ఆయన ప్రారంభించిన శ్రీ మహాలక్ష్మీ కంటి ఆసుపత్రిలో స్పెషలిస్ట్ ఆప్తాల్మిక్ కన్సల్టెంట్ను నియమించి అతని పేరి ప్రిస్క్రిప్షన్లను ప్రింట్ చేయించారు. ఆ స్పెషలిస్ట్ కంటి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా నమ్మించారు. ఈ నేపద్యంలో గత ఏడాది జూన్ 8న కంటి సమస్యపై బైరెడ్డి పద్మ అనే మహిళ ఆసుపత్రికి వచ్చింది. కుడి కన్నును పరీక్షించి కంటిలో చుక్క ఉందని సర్జరీ చేయాలని నిర్ణయించిన వికాస్ కుమార్ డాక్టర్ పిలిపించి టెస్టులు కంప్లీట్ అయ్యాయని సర్జరీ ఖచ్చితంగా చేయాలని సూచిస్తూ అదే రోజు మధ్యాహ్నం సర్జరీ చేయించాడు. సర్జరీ అనంతరం మరుసటి రోజు తన కుడి కన్ను పూర్తిగా కనిపించడం లేదని చెప్పగా వికాస్ కుమార్ డాక్టర్కు చెప్పకుండా అతని ప్రిస్క్రిప్షన్పై కొన్ని మందులు రాసి ఇచ్చాడు. ఫలితంగా ఆ మహిళ కంటి చూపు పూర్తిగా మందగించింది. ఈ తరహాలో అర్హత లేకుండా నకిలీ వైద్యాన్ని అందించిన తీరుపై అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల శ్రీ మహాలక్ష్మీ, శాలిని, యశస్వి, అన్నపూర్ణ, రూఫా కంటి ఆసుపత్రులను తనిఖీ చేసి వారు ఆప్తాల్మిక్ డాక్టర్లు కాదని వారికి ఆధునీక వైద్యం, నేత్ర వైద్యం చేసే అర్హత లేదని పట్టణ పోలీస్ స్టేషన్లో ఆప్తాల్మిక్ డాక్టర్లుగా చెప్పుకుంటూ చలామాణి అవుతున్న వల్కి శ్రీను, పెమ్మి వెంకటేష్, బాణావత్ శివ కోటేశ్వర్రావు, పజ్జూరి వికాస్ కుమార్, గడ్డం నాగరాజులపై చేసిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టి ఆరుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు చెప్పారు. సమవేశంలో సీఐలు నాగభూషణరావు, సోమనర్సయ్య సిబ్బంది ఉన్నారు.
మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ అ న్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేం ద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కు మ్మెర ఘటనలో రెండు నెలల చిన్నారిని కోల్పోయిన కుటుంబం చేస్తున్న దీక్షా శిబిరాన్ని బుధవారం కేటీఆర్ సందర్శించి బాధితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన విషయాలను బాధితులు చంద్రకళ, గణేష్, మౌనిక లను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని న్యాయం జరిగే వరకు పోరాడుతామని కేటీఆర్ భరోసా అందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర మల్లన్న జాతరలో దర్శనం కోరిన చంద్రకళ కుటుంబాన్ని అవమానించడమే కాకుండా ఈ విషయాన్ని ప్రశ్నించిన గణేష్ పై విచక్షణారహితంగా దాడి చేశారని, చిన్నారి ముఖం చూసి అయినా తన భర్త గణేష్ను వదిలిపెట్టాలని మౌనిక కాళ్ళ వేళ్లాపడిన కనికరించని శ్రీనివాస్ రెడ్డి, తుకారాంరెడ్డి తదితరులు చిన్నారిని అదే కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడి మరణించిందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని బాధితుల మాటలు వింటుంటే కళ్ళు చెమర్చాయి అన్నారు. అహంకారంతో కొట్టిన కుమ్మెర సర్పంచ్ ఇతర ఏడుగురిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొని వారిని శిక్షించకపోతే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ లో జరుగుతున్న అరాచక పాలనపై నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో సాగుతున్నది పేరుకే ప్రజా పాలన అని... సాగుతున్నది మాత్రం అరాచక పాలన అని కేటీఆర్ దిగబట్టారు. కుమ్మెర ఘటన మాటలుకు అందని మహావిషాదమని నిందితులకు అండగా నిలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇతర రాజకీయ నాయకులపై కూడా కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పుట్టపాక మహేంద్ర నాథ్ పుట్టిన గడ్డలు ఇంతటి దుర్మార్గం చోటుచేసుకుని సామాజిక న్యాయం పుట్టిన గడ్డపైనే ఇలాంటి కుల వివక్షతో కూడిన దుర్మార్గపు దాడి హత్య జరగడం అమానుషమన్నారు. పసికందులు చంపిన మానవ మృగాలకు శిక్ష పడాలని అందుకు అవసరమైన అన్ని సెక్షన్ లలో నిష్పక్షపాతంగా పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను అందరిని వెంటనే అరెస్టు చేసి తమ నిజాయితీని చాటుకోవాలని పోలీసులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున తక్షణ సహాయంగా లక్ష రూపాయలు అందించడం జరిగిందని భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఇంటిని నిర్మించి పాలు పొంగించే కార్యక్రమానికి తానే స్వయంగా వస్తానని కేటీఆర్ సభ ముఖంగా హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఎంజాయ్ యాదవ్, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, బీఆర్ఎస్ నాయకులు రాజారామ్ యాదవ్, చిలకమర్రి నరసింహ, బత్తుల రాజు, నిన్నపనేని నరేందర్, బైకాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఎన్ సిఇఆర్టి ప్రచురించి న 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఛాప్టర్లను తొలగించి కొత్తగా ప్రచురించడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను కాక, న్యాయవ్యవస్థలో అవినీ తి అంటూ ప్రచురించడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి, అ న్ని వర్గాలనుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా రు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని న్యాయవ్యవస్థ పై తీవ్రమైన దాడిగా అభివర్ణించింది. 8వ తరగతి పాఠ్య పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఉన్న ఒక అధ్యాహం పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ బుధవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలెవరూ న్యాయవ్యవస్థను కించపరచడాన్ని, న్యాయవ్యవస్థ సమగ్రతకు కళంకాన్ని ఆపాదించడానికి అనుమతించబోరని అన్నారు. సీనియర్ న్యాయమూర్తులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి సహా పలువురు సీనియర్ న్యాయవాదులు ఎన్ సిఇఆర్ టి పాఠ్య పుస్తకాల్లో న్యాయవ్యవస్థకు సంబంధించి అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని, వెంటనే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీంతో సిజేఐ తో పాటు జస్టిస్ జోయ్ మల్యబాగ్చి, విపుల్ ఎంపంచోలీ లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆవిషయాన్ని సూ మోటోగా పరిగణనలోకి తీసుకుంది. 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం అవినీతి, పెద్దసంఖ్యలో పెండింగ్ కేసులు, తగినంత సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ముఖ్యమైనవని పేర్కొంది. పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే విభాగం న్యాయమూర్తులు కోర్టులో వారి ప్రవర్తన మాత్రమే కాక, దాని వెలుపల వారు ఎలా ప్రవర్తిస్తారో కూడా నిర్ణయించే నియమావళికి కట్టుబడి ఉంటారని పేర్కొంది. కొత్తగా చదువులు నేరుస్తున్న పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తున్నారని చూసి తాము కలత చెందామని. ఇది ఎన్ సిఇఆర్ టి పుస్తకంలో భాగం అనీ.ఈ అధ్యాయం పూర్తిగా న్యాయవ్యవస్థకు అపకీర్తి ఆపాదించేదిగా ఉందని న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ న్యాయవ్యవస్థ సమగ్రతను ప్రశ్నించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. తనకు న్యాయనిపుణులనుంచి, హైకోర్టు న్యాయమూర్తుల నుంచి చాలా సందేశాలు వచ్చాయని వారంతా కలవరపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకుని తాను ఇప్పటికే ఒక ఉత్తర్వు జారీ చేశానని సిజేఐ వెల్లడించారు.దేశంలోని వ్యవస్థల పనితీరును విశ్లేషించాలని భావిస్తే న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖల పాత్రను, పనితీరును సమానంగా చర్చించి ఉండాలనీ అభిప్రాయం వ్యక్తమైంది. ప్రారంభదశలో ఉన్న విద్యార్థులకు వ్యవస్థ గొప్పతనాన్నికాక, లోపాలను ప్రస్తావించడం వల్ల తప్పుడు అభిప్రాయాలను కల్గించినట్లు కాగలదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మార్చిన ఎడిషన్ లో మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర అనే అధ్యాయం ఉంది ఇది త్వరలో విడుదల అవుతుంది. ఈ చాప్టర్ లో భారత సుప్రీంకోర్టు లో ప్రస్తుతం దాదాపు 81,000 పెండింగ్ కేసులు ఉన్నాయని, న్యాయమూర్తుల కొరత, విధానపరమైన సంక్లిష్టతలు, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎదురైన పరిస్థితిని చర్చిస్తుంది. సవరించిన పాఠ్యాంశాల ప్రకారం హైకోర్టులు 60లక్షల కేసులను పరిష్కరిస్తుండగా, కింది కోర్టులు 40 లక్షలకు పైగా కేసులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
గురువారం రాశి ఫలాలు (26-02-2026)
మేషం చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభం ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ లబ్ది పొందుతారు. మిధునం బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు. కర్కాటకం దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సింహం పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కన్య చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది. తుల చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి. ధనస్సు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. మకరం సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.చాలాకాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు. మీనం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.
చెవినొప్పికి ఆపరేషన్.. యువకుడు బలి
సామాన్య చెవినొప్పితో ఆసుపత్రికి వస్తే, వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన యువకుడు వైద్యుల తప్పిదానికి బలయ్యాడంటూ కుటుంబ సభ్యులు నగరంలోని ద్వారకా ఆసుపత్రి వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పల్లికొండకు చెందిన అజయ్ (22) గత కొంతకాలంగా చెవినొప్పితో బాధపడుతున్నాడని తెలిపారు. దీంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం మధ్యాహ్నం అతనికి చెవికి సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు, అనంతరం అబ్జర్వేషన్లో ఉంచారు. ఆపరేషన్ జరిగిన కొద్ది గంటలకే అజయ్ పరిస్థితి విషమించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యుడు ఒక్కసారిగా చేతులెత్తేస్తూ.. ‘పేషెంట్ సీరియస్గా ఉన్నాడు, వెంటనే హోప్ ఆసుపత్రికి తీసుకెళ్లండి‘ అని సలహా ఇచ్చారని అన్నారు. కంగారుపడిన బంధువులు అజయ్ను హోప్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు అతను మృతి చెందాడని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న యువకుడు కేవలం చెవి ఆపరేషన్తో ఎలా చనిపోతాడని బంధువులు మండిపడ్డారు. మృతదేహాన్ని అంబులెన్స్లో తిరిగి ద్వారకా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ద్వారకా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే అజయ్ ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతదేహంతో బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.
ways2solutions | PCOS కారణాలు, లక్షణాలు, డైట్, జాగ్రత్తలు, సైడ్ ఎఫెక్ట్స్
ways2solutions | పీసీఓఎస్ కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు & ఆరోగ్య సూచనలు ways2solutions
ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోంది
రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని ఎక్స్లో ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేలు ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆయన ఆరోపించారు. కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరుతో నాటకాలు ఆడుతుందని ఆయన అన్నారు. రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డి , మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇళ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు , రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం రూ.25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
రాష్ట్రంలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెయింటింగ్లో ఉన్న అదనపు కలెక్టర్ జి. పద్మజారాణిని గద్వాల జిల్లా డీఆర్వోగా, మేడ్చల్ డీఆర్వో హరిప్రియను మహబూబ్నగర్ అదనపు కలెక్టర్గా, శేరిలింగం పల్లి డిప్యూటీ కలెక్టర్ కె.వెంకారెడ్డిని భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్గా, మెదక్ డీఆర్వో డి.భుజంగరావును ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డిని సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్గా, గద్వాల హౌజింగ్ బోర్డు పీడీ టి.శ్రీనివాసరావును గద్వాల ఆర్డీవోగా, గద్వాల ఆర్డీవో ఎల్.అలివేలును గద్వాల హౌజింగ్ పీడీగా, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ పి.రామకృష్ణను నర్సాపూర్ ఆర్డీవోగా బదిలీ చేశారు. ఇక ఎల్లారెడ్డి ఆర్డీవో కె.పార్థసింహారెడ్డిని చేవెళ్ల ఆర్డీవోగా, నర్సాపూర్ ఆర్డీవో కె.మహిపాల్ రెడ్డిని శేరిలింగంపల్లి తహశీల్దార్గా, మెట్పల్లి ఆర్డీవో ఎన్. శ్రీనివాస్ను ఖమ్మం ఆర్డీవోగా, ఖమ్మం ఆర్డీవో జి.నర్సింహారావును మెట్పల్లి ఆర్డీవోగా, వెయింటింగ్లో ఉన్న పి.మాధవి దేవిని నల్లగొండ స్పెషల్ కలెక్టర్ పీఏగా, డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన ప్రభాకర్ రొద్దను ఎల్లారెడ్డి ఆర్డీవోగా, డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి ఎడ్లను కుడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేశారు. సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ వి.అరుణను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై పాక్ ఉలికిపాటు
ఇజ్రాయెల్ లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన పై పాకిస్తాన్ ఉలికిపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతదేశంతో పొత్తుల షడ్బుజి కోసం చేసిన వాదనపై పాక్ తీవ్రంగా స్పందించింది. దీనిని ముస్లీం వ్యతిరేక ఉమ్మా కూటమిగా అభివర్ణించింది. ఇస్లామిక్ దేశాల రాడికల్ షియా అక్షం ను ఎదుర్కొనేందుకు భారతదేశం ఇతర దేశాలతో పొత్తు పెట్టుకోవాలనే నెతాన్యాహు ప్రణాళికను ఖండిస్తూ, పాకిస్తాన్ సెనెట్ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పాక్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. అన్నిరాజకీయ పార్టీల తరుపున పిపిపి సభ్యుడు పల్వాషా మొహమ్మద్ జైఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Photos : Vishnu Vinyasam Pre Release Event
The post Photos : Vishnu Vinyasam Pre Release Event appeared first on Telugu360 .
మనషులనే కాదు పచ్చని చెట్లను కూడా ప్రభుత్వ బ్రతకనివ్వడం లేదు: కెటిఆర్
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలన్న మహోన్నత లక్ష్యంతో కెసిఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా ఈ ప్రభుత్వం పగబట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మహబూబ్ నగర్లోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని కెటిఆర్ విమర్శించారు. పదేళ్లపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందన్నారు. ఇప్పటికే చెక్ డ్యామ్లను పేల్చివేస్తున్నారని, చెరువులను చెరబట్టారని, వ్యవసాయాన్ని కుప్పకూల్చారని, కులవృత్తులను కాలరాశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ముంబైలో అనిల్ అంబానీ ఖరీదైన ఇల్లు జప్తు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) బ్యాంకును మోసం చేసిన కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ముంబై పాలి హిల్ నివాస ఆస్తిని ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు ఉంటుంది. ఆర్కామ్ బ్యాంకు మోసం కేసులో ఇప్పటివరకు గ్రూప్ కంపెనీల మొత్తం జప్తు ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు పైగా ఉందని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ముంబైలోని ‘అబోడ్’ అనే ఆస్తిని జప్తు చేయగా, దీని విలువ రూ.473.17 కోట్లు ఉంటుంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి దర్యాప్తు కొనసాగుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. వాటిలో రూ.40,185 కోట్లు ఇంకా బకాయిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడి ప్రకారం, పాలి హిల్ ఆస్తిని రైజ్ ఈ ట్రస్ట్ అనే ఫ్యామిలీ ట్రస్టులో చేర్చి, అనిల్ అంబానీకి సంబంధం లేదని చూపించే ప్రయత్నం చేశారని తెలిపింది. పర్సనల్ గ్యారెంటీల బాధ్యతల నుంచి ఆస్తిని రక్షించడమే లక్ష్యమని ఈడి పేర్కొంది.
మున్సిపల్ చైర్ పర్సన్ ను సత్కరిస్తున్న 12వ వార్డు నాయకులు
మున్సిపల్ చైర్ పర్సన్ ను సత్కరిస్తున్న 12వ వార్డు నాయకులు వీవర్స్ కాలనీ
handloom Festival : అసెంబ్లీలో చేనేత పండుగ ; Andhra Prabha News
handloom Festival : అసెంబ్లీలో చేనేత పండుగ ; Andhra Prabha News
ట్రాలీబ్యాగ్లు,అల్మరాల్లో నోట్లకట్టలు..
ఒడిశాలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. ఒడిశా విజిలెన్స్ చేపట్టిన ట్రాప్ ఆపరేషన్, భారీగా నగదును పట్టించింది. కటక్ సర్కిల్ లోని మైన్స్ శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఇంట్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ శాఖ షాక్కు గురైంది. ఆ ఇంటి నుంచి సుమారు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లో ఉన్న అతని ఫ్లాట్ నుంచి బుధవారం ఉదయం ఆ డబ్బును సీజ్ చేశారు. వాస్తవానికి మొహంతిని మంగళవారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఓ బొగ్గు వ్యాపారి లైసెన్సు కోసం అతను రూ. 30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ క్రమంలో అతన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే అతనికి చెందిన పలు లొకేషన్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. పాటియా లోని శ్రీవిహార్లో ఉన్న నేచర్ క్రెస్ట్ అపార్ట్మెంట్తోపాటు భద్రక్ జిల్లాలో ఉన్న మాతసాహి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ నుంచి కళ్లు చెదిరే రీతిలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీబ్యాగులు,అల్మరాల్లో ఆ డబ్బును దాచినట్టు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. నిందిత ఆఫీసర్ రూమ్లోంచి రూ.2 లక్షలు నగదు సీజ్ చేశారు. భువనేశ్వర్లో ఉన్న పహలా లోని రెండు అంతస్తుల బిల్డింగ్లో 130 గ్రాముల బంగారం గుర్తించారు. ఆ బిల్డింగ్తో పాటు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో నోట్ల కట్టలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఇందిరమ్మ లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు
ఇందిరమ్మ లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు నిగ్వ పంచాయతీ కార్యదర్శి సింధుజా ను
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఎన్నిక
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఎన్నిక మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్
జగద్గిరిగుట్టలో 14 తులాల బంగారం అపహరణ.. నిందితుడి అరెస్టు
బయటకు వెళ్తూ ఇంటి తాళం ఇంటి ప్రాంతాల్లో దాచి వెళ్లడంతో దొంగల పని సులభం అయింది. అదను చూసి ఇంట్లోకి ప్రవేశించి 14 తులాల బంగారు ఆభరణాలను దోచుకొని ఉడయించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో వెలుగు చూసింది. జగద్గిరిగుట్ట డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీకి చెందిన రేకపల్లి లక్ష్మి (63) ఈ నెల 23న సాయంత్రం సమయంలో ఇంటికి తాళం వేశారు. ఆ తాళం చెవిని తలుపు పక్కనే ఉన్న డ్రమ్ కింద దాచి బయటకు వెళ్లారు. అయితే ఆమె తాళం దాస్తున్న విషయాన్ని అదే కాలనీకి చెందిన పత్రో శంకర్ (36) గమనించాడు. ఆమె వెళ్లగానే నిందితుడు డ్రమ్ కింద ఉన్న తాళంతో తలుపులు తీసి లోపలికి ప్రవేశించాడు. టీవీ టేబుల్పైనే ఉన్న అల్మారా తాళం చెవులతో లాకర్ను తెరిచి అందులోని సుమారు 14 తులాల బంగారు నగలను దొంగిలించి పరారయ్యాడు. అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న లక్ష్మి దంపతులు, అల్మారా తెరిచి ఉండటం చూసి ఆందోళన చెందారు. నగలు పోయినట్లు గుర్తించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు, సాంకేతిక ఆధారాలతో నిందితుడు పత్రో శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు దొంగతనం విషయమై అంగీకరించాడు. అతని వద్ద నుంచి ఒక బంగారు హారం, నల్లపూసల గొలుసు, మూడు పొరల గొలుసు, లాకెట్ ఉన్న గొలుసు, నాలుగు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
YSRCP Gets Double the Funds of TDP; Megha Among Top Donors
YSR Congress Party (YSRCP) received twice the funds of the Telugu Desam Party (TDP) through electoral trusts in FY 2024–25, even as Hyderabad-based Megha Engineering & Infrastructure Limited (MEIL) figured among the top donors nationally. While YSRCP secured ₹98 crore through electoral trusts during the year, TDP received ₹44 crore, according to the latest disclosures […] The post YSRCP Gets Double the Funds of TDP; Megha Among Top Donors appeared first on Telugu360 .
బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్
బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్ భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభః భీం గల్
డీజీపీ శివధర్రెడ్డికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు
డీజీపీ శివధర్రెడ్డికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు దాడులకు పాల్పడిన ముష్కరులపై
ప్రమాదంలో మహిళ మృతి క్యాతన్ పల్లి,ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్
అవసరమే ఆసరా.. అధిక ధరలకు యూరియా అమ్మకం
అవసరమే ఆసరా.. అధిక ధరలకు యూరియా అమ్మకం బస్తాకు 30 రూపాయలు అధికంగా
MINISTER RAVINDRA : సహజ వనరులకు ఢోకా లేదు Andhra Prabha News
MINISTER RAVINDRA : సహజ వనరులకు ఢోకా లేదు Andhra Prabha News
టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిరువూరు వైసీపీ నాయకులు..
టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిరువూరు వైసీపీ నాయకులు.. పసుపు కండువాలు కప్పి పార్టీలోకి
కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్ముకశ్మీర్ టీమ్ బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 527 పరుగుల భారీ స్కోరును సాధించింది. వర్షం వల్ల రెండో రోజు ఆటను ముందుగానే నిలిపి వేయాల్సి వచ్చింది. 284/2 ఓవర్నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన కశ్మీర్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్లు శుభమ్ పుందిర్ (121), అబ్దుల్ సమద్ (61)లను కర్ణాటక బౌలర్లు ప్రారంభంలోనే పెవిలియన్ పంపించారు. అయితే ఆ తర్వాత కశ్మీర్ బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. రిటైర్డ్ హర్ట్గా డగౌట్కు వెళ్లిన కెప్టెన్ పరాస్ డోగ్రా మళ్లీ క్రీజులోకి వచ్చాడు. కన్హియా వాద్వాన్తో కలిసి డోగ్రా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి ఆరో వికెట్కు 110 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వాద్వాన్ 9 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. డోగ్రా 8 బౌండరీలతో 70 పరుగులు సాధించాడు. ఆట ముగిసే సమయానికి సాహిల్ లోత్రా (57), ఆబిద్ ముస్తాక్ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు.
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తొలిసారిగా యాక్షన్ డైరెక్టర్ సంపత్ నందితో కలిసి భారీ పాన్- ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. బుధవారం మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్లో శర్వా ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, ఫెరోషస్ మాస్ అవతార్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకోసం శర్వా పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ సెట్పై ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్లను డిజైన్ చేశారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్ -ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
3kuja |శక్తి స్వరూపుడు కుజగ్రహం, కుజ దోషం, జ్యోతిష విశ్లేషణ, వైతీశ్వరన్ కోవిల్ పరిహారాలు
3kuja | కుజుడు (అంగారకుడు) మహిమ: జ్యోతిష కారకత్వాలు, కుజ దోష ప్రభావాలు
₹46K Crore Repaid Towards Kaleshwaram Loans in 2 years by Congress govt
A total of ₹72,766.16 crore has been repaid towards loans taken for the Kaleshwaram project over the past six years, as per RTI filed by activist Kareem Ansari data. The year-wise repayments are as follows: • 2020 – ₹1,487.98 crore • 2021 – ₹3,364.65 crore • 2022 – ₹9,077.01 crore • 2023 – ₹11,873.70 crore […] The post ₹46K Crore Repaid Towards Kaleshwaram Loans in 2 years by Congress govt appeared first on Telugu360 .
Why Is YSRCP Struggling to Protect Its Hindu Image?
YSRCP today looks less like a party on the offensive and more like one constantly trying to defend itself. The debate is no longer just about corruption allegations or governance failures. It has now shifted to something more sensitive. Its Hindu image. When Botsa Satyanarayana made his “small thieves and big thieves” remark, Nara Lokesh […] The post Why Is YSRCP Struggling to Protect Its Hindu Image? appeared first on Telugu360 .
Crucial Developments in Andhra Pradesh Legislative Council as YSRCP MLCs Seek Resignation Approval
Major political developments are unfolding in Andhra Pradesh as the aftershocks of the 2024 Assembly elections continue to reshape the state’s political landscape. Following the electoral defeat of the YSR Congress Party, several senior leaders resigned from the party and shifted their allegiance to the ruling coalition. The exits included members from both the Assembly […] The post Crucial Developments in Andhra Pradesh Legislative Council as YSRCP MLCs Seek Resignation Approval appeared first on Telugu360 .
సారీ.. నన్ను క్షమించండి: బిల్ గేట్స్
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానకి సంబంధించిన కథనాలలో తన పేరు, తన రాసక్రీడలు వెలుగులోకి రావడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పౌండేషన్ సిబ్బందికి బేషరతుగా క్షమాపణ చెప్పారు. తనపై కథనాలు వెలుగులోకి రావడంతో భారతదేశంలో జరిగిన ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ నుంచి వైదొలగిన బిల్ గేట్స్ కొత్తగా వెలువడిన ఎప్ స్టీన్ పత్రాలు తనను దోషిగా చూపడంతో తీవ్ర ఆవేదనతో గేట్స్ పౌండేషన్ సిబ్బందికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇటీవల టౌన్ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గేట్స్ పాల్గొన్నారు. ఎప్ స్టీన్ ఫైళ్లలో పేర్కొన్నట్లు రష్యన్ మహిళలతో తనకు రెండు సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు తెలిసింది. అయితే తనకు ఎప్ స్టీన్ బాధితులతో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గేట్స్, ఎప్ స్టీన్ మధ్య జరిగిన పలు సమావేశాలను వివరించే అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ రికార్డులు, ఆయన చిత్రాలు వెలుగులోకి రావడంతో గేట్స్ పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వీటిలో బిల్ గేట్స్ ముఖాలు తొలగించబడిన మహిళలతో ఫోజులు ఇచ్చిన ఫోటోలు ఉన్నాయి. ఫౌండేషన్ అంతర్గత సమావేశంలో గేట్స్ తన తప్పిదాలను ఒప్పుకున్నారు. ఎప్ స్టీన్ తో సమయం గడపడం, అతడితో సమావేశాలలో సీనియర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొనేలా చేయడం చాలా పెద్దతప్పు అని పేర్కొన్నట్లు తెలిసింది. సంస్థలోని ప్రభావితమైన వారికి క్షమాపమలు చేప్పారు. నేను చేసిన తప్పు కారణంగా దీనిలోకి ఆకర్షితులైన ఇతర వ్యక్తులను కూడా తాను క్షమాపణలు కోరుతున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నెల ప్రారంభంలో ఫౌండేషన్ ఓ ప్రకటనలో సంస్థ కు ఎప్ స్టీమ్ కు ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవని, ఎలాంటి చెల్లింపులు చేయలేదని, ఎప్ స్టీన్ ను ఎప్పుడూ ఏ పదవిలోనూ నియమించలేదని స్పష్టం చేసింది.నిజానికి గేట్స్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొని ఏఐ పై ప్రసంగించవలసి ఉంది కానీ, చివరి క్షణంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
MINISTER NARAYANA : అధైర్యం వద్దు Andhra Prabha News
MINISTER NARAYANA : అధైర్యం వద్దు Andhra Prabha News ( శ్రీకాకుళం,
భారత-పాక్ మధ్య అణుయుద్ధం నివారించా: ట్రంప్
భారతదేశం - పాకిస్తాన్ మధ్య అణుయుద్ధంతో సహా ఎనిమిది యుద్ధాలను తానే ఆపానని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు పునరుద్ఘాటించారు. ఇది కొత్త కానప్పటికీ, తొలిసారిగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో తాను జోక్యం చేసుకోనిపక్షంలో మూడున్నర కోట్ల మంది చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు చెప్పారని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి 10 నెలలలోనే, తాను 8 యుద్ధాలు నివారించినట్లు తెలిపారు.తన రెండో పదవీకాలంలో తొలిసారి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఈ పదినెలల్లో తాను సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. తాను నివారించిన యుద్ధాల జాబితాను వెల్లడిస్తూ, ఇజ్రాయెల్ -హమాస్, ఇజ్రాయెల్ -ఇరాన్, ఈజిప్ట్- ఇథియోపియా, భారతదేశం పాకిస్తాన్, సెర్బియా -కసావో,రువాండా- కాంగో డమోక్రటిక్ రిపబ్లిక్, అర్మేనియా -అజర్ బైజాన్,థాయిలాండ్ -కంబోడియా మధ్య వివాదాలను పరిష్కరించినట్లు ట్రంప్ వివరించారు. మూడోసారి అధ్యక్షుడిని అయ్యేవాడినేనన్న ట్రంప్ అమెరికా గతంలో కన్నా బలంగా మెరుగ్గా, సంపన్నంగా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థ మునుపు ఎన్నడూ లేనంత వేగంగా దూరుసుకుపోతోందని ఆయన అన్నారు. ఇది అమెరికాకు స్వర్ణయుగం అంటూ, మున్ముందు మరింత అభ్యన్నపథంలో దూసుకు పోతుందని ఆయన చెప్పారు. మూడోసారి అధ్యక్షుడు కావాలన్న ఆకాంక్షను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రెండో దఫా ప్రెసిడెంట్ పదవి చేపట్టి ఏడాది పూర్తయిందని పేర్కొంటూ, 2020 ప్రెసిడెంట్ ఎన్నికలను ప్రస్తావిస్తూ, కొద్దిలో విజయం తప్పిపోయిందని గుర్తు చేశారు. అమెరికా రాజ్యాంగం 22 వ సవరణ ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ గా ఎవరైనా రెండు సార్లు మాత్రమే బాధ్యతలు వహించవలసి ఉంది. గతంలో కూడా ట్రంప్ మూడో టర్మ్ అధ్యక్ష పదవి చేపట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
మార్చి 5న ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్
తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్బస్టర్ ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు ఈ ప్రాజెక్ట్ను సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్డేట్ ఇచ్చారు. గ్లింప్స్ వృషకర్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొదటి స్నీక్ పీక్ ఇవ్వడానికి మార్చి 5న విడుదల కానుంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో నాగ చైతన్య ఒక చీకటి గుహలో నిలబడి, పైనుండి దూసుకు వస్తున్న పదునైన కాంతి కిరణాలతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపిస్తున్నాడు. అతని కండలు తిరిగిన శరీరం, ఇంటెన్స్ లుక్ అద్భుతంగా వుంది. ఈ పాత్ర కోసం నాగ చైతన్య మాసీవ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. దర్శకుడు కార్తిక్ దండు తన బ్లాక్బస్టర్ డెబ్యూ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని, వృషకర్మను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
cgwb workshop : ఏఐతో గ్రౌండ్ వాటర్ అంచనాలు !
cgwb workshop : ఏఐతో గ్రౌండ్ వాటర్ అంచనాలు ! ( ఆంధ్రప్రభ.
కాంగ్రెస్ హయాంలో అక్రమ అరెస్టులు: గంగుల కమలాకర్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం నడుస్తోందని, అభివృద్ధిని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులపై దృష్టి పెట్టిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా సమ్మక్క సారక్క జాతరలో ఫ్రొటోకాల్ అడిగారని, పోలీసులు, అధికారులు ఫ్రొటోకాల్ కల్పించకపోగా పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు నిరాధార ఆరోపణలు చేశారని, సిపి మత మార్పిడులకు పాల్పడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడా అనలేదని ఆయన తెలిపారు. ఈ కేసును సిఐడికి ఎందుకు ఇస్తున్నారని, ఈ కేసులో స్కాం ఉందా ? దొంగతనం చేశారా ? తవ్వి తీసేందుకు ఏముందని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఎందుకు కస్టడీ కావాలని అడుగుతున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. సిఐడి విచారణ పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. డిజిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారించవద్దని ఆయన సూచించారు. కరీంనగర్ సిపి, హుజురాబాద్ ఏసిపి, జమ్మికుంట సిఐలను సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసులు ఏజెంట్లను పెట్టుకుని వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో ఆధారాలతో బయటపెడతానని ఆయన తెలిపారు. రాజకీయాలకు పోలీసులు బలి కావద్దని ఆయన సూచించారు.
ప్రియురాలితో షణ్ముఖ్ జశ్వంత్ ఎంగేజ్మెంట్
కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యూట్యూబ్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత బిగ్బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. అయితే చాలా కాలం ఓ ఇన్స్టా బ్యూటీతో ప్రేమలో ఉన్నట్లు.. ఆ తర్వాత బ్రేక్ అప్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు షణ్ముఖ్ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. ఆ అమ్మాయి ముఖం కూడా చూపించకుండా, పేరు చెప్పకండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రం వెల్లడించాడు. తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తన కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే తన నిశ్చితార్థం జరిగినట్లు ఫోటోలు షేర్ చేశాడు. ‘‘దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు.. అయిపాయె’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్-వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ సందర్భంగా ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)
లండన్లో అగ్ని ప్రమాదం… రాజమండ్రి యువకుడు మృ*తి #LondonFire #Croydon #Abhishek #TeluguYouth

29 C