SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
...

gudur mandal |బావిలో పడి ఇద్దరు బాలికల మృతి

gudur mandal | బావిలో పడి ఇద్దరు బాలికల మృతి gudur mandal

ప్రభ న్యూస్ 11 Apr 2026 9:15 pm

చమురు సంపదలో అమెరికా నెంబరు 1: ట్రంప్

అమెరికా చమురు సంపన్న దేశం అని దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శనివారం గొప్పగా చెప్పారు. తమ దేశం వద్ద ఇప్పుడు రష్యా కన్నా ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. ఇప్పుడు ఇక సౌదీ ఇతర గల్ఫ్ దేశాలలో కూడా చమురు అడుగంటింది. దీనితో పలు ఖాళీ ట్యాంకర్లు చమురు కోసం అమెరికా తీరానికి చేరుకుంటాయని చమత్కరించారు. అమెరికా ఇప్పుడు తమ తియ్యటి ఆయిల్, కోరుకునే గ్యాస్‌ను ప్రపంచంలో ఎవరికైనా అందించేందుకు సంసిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు చమురు ఎగుమతులలో పై చేయి స్థితికి చేరామని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా వైపు వస్తున్నాయని , ఇంతకు ముందటి వరకూ చమురు సంపన్న దేశాల వారు కూడా ఇక్కడికి రావల్సిందే అన్నారు. వారికి స్వాగతం పలుకుతామని తెలిపారు. అత్యున్నత ప్రమాణాల చమురు, సహజవాయవులు తమ వద్ద ఉన్నాయని, రెండు అత్యంత భారీ ఆర్థిక శక్తుల మిశ్రిత చమురు సంపదతో పోలిస్తే తమ వద్ద ఎక్కువ చమురు ఉందని పరోక్షంగా రష్యా , చైనా లేదా గల్ఫ్ దేశాల పరిస్థితిని తెలిపారు. ఈ సరుకు తీసుకుపోయే వారికోసం వేచి చూస్తున్నామని తెలిపారు. తొందరపడండి, ఆలస్యం వద్దు..డిజెటి అంటూ ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా సంచలనానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన ఇతర మీడియాలపై దుమ్మెత్తిపోశారు. బూటకపు మీడియా సంస్థలు తమ ప్రతిష్ట దెబ్బతీసుకున్నాయని విమర్శించారు. ఎప్పుడూ వారికి ట్రంప్‌ను తిట్టిపోసుకునే జబ్బు తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఈ లక్షణానికి ఆయన టిడిఎస్ అని సంబోంధించారు. ఇరాన్ అన్ని విధాలుగా దెబ్బతింటూ ఉంటే, కొందరు ఇరాన్ నౌకాదళం, వైమానిక బలగాలు దెబ్బతింటూ ఉంటే, వారికి నాయకుడు లేకుండా పోతే , క్షిపణులు , డ్రోన్లు కుప్పకూలితే సంబంధిత ఫ్యాక్టరీలు నేలమట్టం అయితే ఇంకా ఇరాన్ బలంగా ఉందనే వాదన తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. చివరికి ఇరాన్ వారి మిగిలిన నేతలతో కూడిన నౌకలు వారు అమర్చుకున్న సీ మైన్స్‌లో పడి దెబ్బతింటాయని తిట్టిపోశారు. ఇప్పటికే వారి 28 మైన్ బోట్లు సముద్రం అడుగుకు చేరాయని తెలిపారు. కొన్ని దేశాలకు హర్మూజ్‌ను తెరవాలని, చైనా , జపాన్, కొరియా మరికొన్ని దేశాల నేతలను ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నా ఇప్పుడు సీ మైన్స్ ఇరకాటంలో పడ్డారని తెలిపారు. వారంత వారుగా హర్మూజ్‌ను తిరిగి తెరిచే పరిస్థితిలో లేరని స్పందించారు. ఇతర దేశాలు కూడా హర్మూజ్ ఓపెన్ విషయంలో ఏమి చేయలేకపోతున్నాయి. ఈ దశలో చమురు కోసం పలు దేశాలు ఇప్పుడు అమెరికాకు క్యూ కడుతున్నాయని వెల్లడించారు. ఈ విషయంపై దృష్టి పెడుతున్నందుకు థ్యాంక్స్ అంటూ ట్రంప్ తమదైన రీతిలో తమ స్పందనను ముగించారు. ...................

మన తెలంగాణ 11 Apr 2026 8:45 pm

సుప్రీం కోర్టును ఆశ్రయించిన లాలూ..

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఉద్యోగాలకు భూమి’ అవినీతి ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ శనివారం లాలూ ప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 13న ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. అంతకుముందు, తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్లను కొట్టివేయాలన్న లాలూ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రవీందర్ దత్ దేజా తిరస్కరించారు. ఈ కేసులో దాఖలైన మూడు ఛార్జిషీట్లను కూడా కోర్టు సమర్థించింది. కాగా, 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. జబల్‌పూర్‌లోని ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ జోన్‌లో, బహుమతిగా ఇచ్చిన లేదా బదిలీ చేసిన భూమికి బదులుగా “గ్రూప్ డి” రైల్వే ఉద్యోగాలను కేటాయించారని అధికారులు ఆరోపిస్తున్నారు.  అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సీబీఐ ముందస్తు అనుమతి పొందనందున, ఎఫ్ఐఆర్, దర్యాప్తు, ఛార్జిషీట్లు చట్టపరంగా లోపభూయిష్టంగా ఉన్నాయని, అందువల్ల ఈ విచారణ చెల్లదని లాలూ వాదించారు.

మన తెలంగాణ 11 Apr 2026 8:45 pm

డీజిల్‌ ఎగుమతిపై సుంకాన్ని పెంచిన కేంద్రం..

 న్యూఢిల్లీ:  డీజిల్‌ ఎగుమతిపై సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. డీజిల్ ఎగుమతిపై సుంకాన్ని లీటరుకు రూ.21.5 నుంచి రూ. 55.5కు పెంచినట్లు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, విమాన ఇంధనం (ATF)పై కూడా సుంకాన్ని పెంచింది. ATFపై సుంకాన్ని లీటరుకు రూ.29.5 నుంచి రూ. 42కు పెంచింది. ఈ సుంకాల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే, పెట్రోల్‌ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పు లేదని.. యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. కాగా,  పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 26న డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ. 21.50, ATFపై లీటరుకు రూ. 29.5 చొప్పున ఎగుమతి సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 11 Apr 2026 8:22 pm

రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలో మీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయిని వివరించారు. రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హయత్ నగర్-, ఎల్.బి.నగర్ మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నాట్టు వివరించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని, పైన ఉండే రెండు అండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని పేర్కొన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో పికో టెక్నాలజి వ్యవస్థాపక సిఇఒ జారొడ్ యుస్టర్, పికో ఇండియా సిఇఒ హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 8:21 pm

తనపై ఆరోపణలు.. నార్సింగి పిఎస్‌లో మంగ్లీ ఫిర్యాదు

హైదరాబాద్: తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుభా సింగబోష్‌పై సింగర్ మంగ్లీ నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.150 కోట్ల మేర మోసం చేశారంటూ తనపై అతడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభా సియపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించారని తెలిపారు. ‘‘అతడు అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు. నిరాకరిస్తే అప్రతిష్ట పాలుచేస్తానని బెదిరించారు. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యాలు చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారు. సుభా సింగబోష్ తీరుపై నా కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు’’ అని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

మన తెలంగాణ 11 Apr 2026 8:16 pm

‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మిగా కయాదు లోహర్

నేచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ డ్రామా ’ది ప్యారడైజ్’ పై అంచనాలు ’ఆయా షేర్’ సింగిల్ విడుదల తర్వాత నెక్స్ లెవెల్ కి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ప్రతి పాత్ర పరిచయంతో ఆసక్తిని మరింత పెంచుతోంది. అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా, హీరోయిన్ కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర నిర్మాతలు శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కయాదు లోహర్ ’ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి సుబ్బలక్ష్మి (సుబ్బు)పాత్రలో అడుగుపెట్టింది. సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ, ఆమె పాత్ర ఆ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని పోస్టర్ సూచిస్తోంది. ఇప్పటికే భారీ విజువల్స్, గ్రాండ్ సెట్టింగ్, బలమైన పాత్రలతో ఈ చిత్రం అంచనాలు పెంచుతోంది. మోహన్ బాబు విలన్‌గా, రాఘవ్ జుయాల్ కీలక పాత్రలో, అలాగే సంపూర్ణేష్ బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

మన తెలంగాణ 11 Apr 2026 8:07 pm

కాల్పుల విరమణ తరువాత భారత్‌కు తొలి ఎల్‌పీజీ ట్యాంకర్

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత భారత పతాకం కలిగిన ఎల్‌పిజి ట్యాంకర్ జగ్ విక్రమ్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హర్మూజ్ జలసంధిని దాటి శనివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోకి ప్రవేశించింది. మరి కొద్ది రోజుల్లో భారత్‌కు ఇది చేరుకోనుంది. కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత హర్మూజ్‌ను దాటిన మొట్టమొదటి నౌక ఇదే. మార్చి నెల మొదట్లో హార్ముజ్ జలసంధిని దాటిన తొమ్మిదో నౌక జగ్ విక్రమే అవుతుంది. మరో భారత రిజిస్టర్డ్ నౌకలు పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయని,త్వరలో అవి కూడా ఇదే మార్గం మీదుగా భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 

మన తెలంగాణ 11 Apr 2026 8:02 pm

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు: ఎంపి డికె అరుణ

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని బిజెపి లోక్‌సభ సభ్యురాలు డికె అరుణ కోరారు. ఈ బిల్లు ఆమోదంతో దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పడుతుందని ఆమె తెలిపారు.యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే మన భారతీయ సంస్కృతి ప్రకారం, ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారని, అటువంటి గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉందని ఆమె శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహిళా 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో తీసుకువచ్చి మహిళల ప్రాధాన్యాన్ని మరింతగా చాటి చెప్పారని ఆమె తెలిపారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం అని ఆమె అన్నారు. 2029 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడినా, గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించలేదని ఆమె విమర్శించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పార్టీలను సమన్వయం చేసి ఈ బిల్లును తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ బిల్లు అమలు అయితేనే దాని సార్థకత ఉంటుంది. అందుకే అన్ని పార్టీల ఎంపీలు పార్టీలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇది కేవలం ఒక చట్టం కాదు కోట్లాది మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక, దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలికే బిల్లు అని ఎంపీ డికె అరుణ తెలిపారు. తొమ్మిది ఎంపీ సీట్లు మహిళలకు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు పెరిగి, దాదాపు 9 మంది మహిళలు పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం వస్తుందని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 273 మంది మహిళలకు అవకాశం లభిస్తుందని ఆమె వివరిచారు. అసెంబ్లీ స్థాయిలో కూడా మహిళలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పెరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే, దాదాపు 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా గణనీయ ప్రాతినిధ్యం లభిస్తుందని ఎంపీ అరుణ తెలిపారు.

మన తెలంగాణ 11 Apr 2026 7:51 pm

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వసంత ఆకస్మిక తనిఖీ…

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వసంత ఆకస్మిక తనిఖీ… మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:48 pm

పాక్ ప్రధానితో ఇరాన్, అమెరికా బృందాలు వేర్వేరుగా భేటీ

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బిజీ అయ్యారు. ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు శాంతి చర్చలకు ముందు శనివారంనాడు ఆయనతో వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ భేటీల్లో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కూడా ఉన్నారు. ఇరాన్ స్పీకర్ మహ్మద్ బఘేరి, విదేశాంగ మంత్రి అరాగ్చీ తదితరులు పాక్ ప్రధానితో సమావేశమైన చర్చలకు సంబంధించి షరతులను ఆయన ముందుంచారు. అమెరికా స్తంభింపచేసిన విదేశాల్లోని తమ ఆస్తులను విడుదల చేయడం, లెబనాన్‌పై తక్షణమే దాడులు ఆపాలని, అప్పుడే చర్చలు ముందుకు వెళ్తాయని చెప్పినట్లు సమాచారం. అంతకుముందు జెడి వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందంతో కూడా షరీఫ్ సమావేశమయ్యారు. వాన్స్‌తో పాటు ఈ సమావేశంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్ ఉన్నారు. ఇరు పక్షాలతో చర్చలు ప్రశాంతంగా సాగాలని, ఫలితం దిశగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు షరీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఈ చర్చలతో శాశ్వత శాంతి నెలకొనాలని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారని పాక్ అధికారిక టివి వెల్లడించింది. 

మన తెలంగాణ 11 Apr 2026 7:46 pm

‘కొరియన్ కనకరాజు’ నుంచి తొలి సింగిల్ విడుదల

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌కి విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సింగిల్‌ని విడుదల చేశారు. ఈ పాటని కాసర్ల శ్యామ్ రచించగా.. సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 11 Apr 2026 7:45 pm

బోనకల్ వద్ద గంజాయి పట్టివేత…

బోనకల్ వద్ద గంజాయి పట్టివేత… నిందితుడి అరెస్ట్, 2.4 కిలోల గంజాయి స్వాధీనం…

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:41 pm

రూల్స్ పెడతాం....పాటించం

 ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పే పోలీసులే ఉల్లంఘిస్తే...రూల్స్ నగరవాసులకే తప్ప తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తే...తామేమి చేసినా అడిగేవారు లేనట్లుగా నిబంధనలు ఉల్లంఘించడంపై నగర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూల్ పెడుతాం కానీ పాటించం అన్నట్లుగా పోలీసుల తీరుపై సర్వత్రా గుర్రుమంటున్నారు. హెల్మెట్ లేకున్నా, రాంగ్‌రూట్‌లో వెళ్లినా కొరడా జులిపిస్తున్న పోలీసులు తమవారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ వాహనాలతో రాంగ్ రూట్‌లో వెళ్తు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు సాధారణ ప్రజలకు తప్ప తమకు వర్తించవని భావిస్తున్నట్లు ఉంది వారి వ్యవహారం. బండ్లగూడ జాగీర్, కాళీమందిర్ సమీపంలో టిఎస్ 09 పిఏ 2126 టాటా సుమో వాహనం రాంగ్ రూట్‌లో వెళ్లింది. ఎదురుగా వాహనాలు వారి దారిలో వస్తున్నా కూడా పోలీస్ వాహనం ఎదురుగా రాంగ్ రూట్‌లో వెళ్లింది. యూటర్న్ చాలా దూరం ఉండడంతో అంతదూరం ఎవరు తిరిగి వస్తారని, రాంగ్ రూట్‌లో వెళ్లాడు.

మన తెలంగాణ 11 Apr 2026 7:40 pm

స‌మాజ దిశ‌ను మార్చిన మ‌హాత్మా ఫూలే…

స‌మాజ దిశ‌ను మార్చిన మ‌హాత్మా ఫూలే… సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : మ‌హాత్మా

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:33 pm

పూలే విగ్రహానికి నివాళి

పూలే విగ్రహానికి నివాళి ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:25 pm

ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు…

ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు… పాయకాపురం, ఆంధ్రప్రభ : వాహనాల,వాహనచోదకులు ప్రమాద బారిన

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:22 pm

ఎలక్ట్రానిక్స్ తయారీలో ‘గ్లోబల్ హబ్’గా తెలంగాణ

ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచ స్థాయి కేంద్రం(గ్లోబల్ హబ్)గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్ మాత్రమే పరిమితం కాకుండా, విడిభాగాల తయారీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అవసరమైన పూర్తిస్థాయి ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం కోటి(10 మిలియన్లు) టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ‘తెలంగాణ’ కీలక పాత్ర పోషించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ దిశగానే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఓవైపు ఎలక్ట్రానిక్స్ తయారీలో టాప్ గ్లోబల్ ప్లేయర్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తూనే..మరోవైపు వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రెడీ టూ వర్క్ ఫోర్స్ తయారీపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి... ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సరళతర వాణిజ్య విధానాలతో పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్ ఛైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్, లీగల్ అండ్ ఐపీఆర్ హెడ్ శుభజిత్ సాహా, అడ్మినిస్ట్రేషన్ హెడ్ నోయెల్ రాబిన్ సన్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 7:20 pm

హైదరాబాద్ పై పంజాబ్ ఘన విజయం

ఐపిఎల్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 220 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభుసిమ్రాన్(51)లు మెరుపు అర్ధ శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69తో పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసి గెలుపొందింది. సన్ రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దూబే ఒక వికెట్ తీశాడు. అంతకుముందు, హైదరాబాద్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్, శశాంక్‌లు చెరి రెండు, బ్రాట్‌లెట్ ఒక వికెట్ తీశారు.

మన తెలంగాణ 11 Apr 2026 7:16 pm

సామాజిక మార్పు దిశగా జ్యోతిరావు ఫూలే ఆలోచనలు…

సామాజిక మార్పు దిశగా జ్యోతిరావు ఫూలే ఆలోచనలు… ఇటుకాలపల్లి గ్రామంలో ఘనంగా జయంతి

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:14 pm

వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు

రాష్ట్రంలో విడుదల కానున్న ఇంటర్ ఫలితాలు తెలంగాణ మీసేవా వాట్సాప్ చాట్‌బాట్ వాట్సాప్ ద్వారా నేరుగా తమ పరీక్ష ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీసేవా తెలంగాణ వాట్సాప్ నెంబర్ 8096958096కు ‘Hi’ అని మెసేజ్ పంపించడం ద్వారా మీసేవా చాట్‌బాట్ మొదలవుతుంది. ‘BIE Exam Result’ టైప్ చేసి Open Service ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ / 2వ) స్ట్రీమ్ (జనరల్ / వొకేషనల్) ఎంచుకుని సమర్పిస్తే ఇంటర్ ఫలితం తక్షణమే వాట్సాప్‌లో వస్తుంది.

మన తెలంగాణ 11 Apr 2026 7:11 pm

వధూవరులను ఆశీర్వదించిన యశస్విని ఝాన్సీ రెడ్డిలు…

వధూవరులను ఆశీర్వదించిన యశస్విని ఝాన్సీ రెడ్డిలు… తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు బ్లాక్

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:08 pm

'అలా అంటే.. చెప్పు తెగుతది జాగ్రత్త'.. సీతక్క వార్నింగ్

తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. శనివారం ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై స్కాం అంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్దేశించిన స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారం ఓపెన్ టెండర్ ద్వారా GeM పోర్టల్‌లోనే కొనుగోలు చేశామని తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఫోన్లను ఎక్కువ ధరగా చూపిస్తూ ఊహాజనిత కథనాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు ఇకపై తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 11 Apr 2026 7:05 pm

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తాను…

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తాను… హైకోర్టున్యాయమూర్తి తిరుమలా దేవిజిల్లా

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:05 pm

నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు యత్నం : మమతా బెనర్జీ

భవానీపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించడానికి బీజేపీ ప్రయత్నించిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి ఆ పార్టీ నేతలు ఈసీతో కలిసి కుట్ర పన్నారని అన్నారు. ఈ ప్రయత్నాలను తమ పార్టీ నేతలు భగ్నం చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక, మోసపూరిత మార్గాల్లో ఓట్లు రాబట్టుకోవడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. అందుకే సర్ పేరుతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించారని, మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 లక్షల మంది ఓటర్ల పేర్లను ఈసీ ఓటరు జాబితా నుంచి తొలగించిందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడడానికి కూడా ఈసీతో కలిసి బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించడానికే బెంగాల్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేయాలని బీజేపీ చూస్తోందని మమత ఆరోపించారు. ఇది వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా ఉంటుందన్నారు. బెంగాల్‌లో యూసీసీని ఎన్నటికీ అమలు కానివ్వమన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 7:00 pm

మహిళలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన మహానీయుడు…

మహిళలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన మహానీయుడు… చిట్యాల, ఆంధ్రప్రభ : అణగారిన

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:59 pm

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా భ్రమలే..

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా భ్రమలే.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:55 pm

KKR Kamsahamnida Song: Varun Tej Rocks with his charm

Korean Kanakaraju starring Mega Prince Varun Tej has been one of the most anticipated cross-culture horror comedies in Telugu Cinema. Ritika Nayak is playing the leading lady role in this Merlapaka Gandhi directorial produced by UV Creations. The makers have now released the first single, Kamsahamnida, composed by S Thaman and sung by Sid Sriram. […] The post KKR Kamsahamnida Song: Varun Tej Rocks with his charm appeared first on Telugu360 .

తెలుగు 360 11 Apr 2026 6:53 pm

బాధితుడికి రూ. 2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్సీ….

బాధితుడికి రూ. 2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్సీ…. ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:47 pm

Revanth Reddy : రేవంత్ ను నమ్ముతారా? నిజాలను జనం అంగీకరిస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్భయంగా నిజాలు చెప్పి మరోసారి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 11 Apr 2026 6:46 pm

బిఆర్‌ఎస్ వలలో పడ్డా జీవన్ రెడ్డి: మల్లు రవి

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు ఘాటైన విమర్శలతో ముప్పెట దాడి ప్రారంభించారు.బిఆర్‌ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం, కానీ ప్రస్తుత ప్రభుత్వం పోయి కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని అంటున్నారని ఆయన శనివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కెసిఆర్ మళ్లీ ఎందుకు సిఎం కావాలో జీవన్ రెడ్డి సరైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని హరీష్ రావు, కెటిఆర్ చూడలేకపోతున్నారని, అందుకే ప్రతి రోజూ తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన విమర్శించారు. వారి శాపనార్ధాలే మా ప్రభుత్వానికి దీవెనలని ఆయన తెలిపారు. గతంలో కూడా డి. శ్రీనివాస్ ఇలాగే మోసపోయారని, ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యని ఇలాగే మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ గమనించి మీరు ఎక్కడున్నా మీ వ్యక్తిత్వాన్ని, మీ సిద్ధాంతాలను కాపాడుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా జీవన్ రెడ్డి నిబద్ధతతో పని చేశారని, పెత్తందారి వ్యవస్థకు దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశారని, మీ నాన్న కూడా దొరల గడీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఉన్నారని చెబుతుంటారని ఆయన తెలిపారు. అత్యంత సాధారణంగా మీరు జీవించారని, కాంగ్రెస్ విధానం కూడా సెక్యులరిజం, సోషలిజం, ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్ ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఈ మూల సిద్ధాంతాలకు అనుకూలంగా మీరు ఒక వ్యక్తిగా పెరిగి.. కాంగ్రెస్ పార్టీకి మీకు ఒక గుర్తింపును తీసుకొచ్చారని, అటువంటి మీరు.. ఇటీవల రాజ్యసభకు వెళ్లే అవకాశం రాలేదని కాంగ్రెస్ పార్టీని విడిచి.. రాజకీయ శత్రువైన బిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం బాధగా ఉందని డాక్టర్ మల్లు రవి అన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 6:44 pm

నల్ల బ్యాడ్జీలతో పంజాబ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే..

న్యూ చంఢీగఢ్: శనివారం ఐపిఎల్-2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో ఓ విషయం అందరి దృష్టిని ఆకట్టుకుంది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించారు. అందుకు కారణం ఏంటని చర్చ జరుగుతోుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన పడవ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారికి నివాళిగా టీమ్ నల్ల బ్యాడ్జిలు ధరించినట్లు పంజాబ్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘పడవ ప్రమాదంలో మరణించిన వారి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో అండగా నివాలనుకుంటున్నాం’’ అని పంజాబ్ పేర్కొంది. మథుర సమీపంలో యమునలో పంజాబ్‌కి చెందిన పది మంది భక్తులు పడవ ప్రమాదంలో మరణించారు. స్వల్ప గాయాలైన 18 మందిని రెస్క్యూ బృందం రక్షించింది. మృతులు అందరూ పంజాబ్‌కు చెందిన వారే కావడంతో పంజాబ్ కింగ్స్ ఈ క్రమంలోనే నల్ల బ్యాడ్జిలు ధరించి నివాళులు ఆర్పించారని టీమ్ పేర్కొంది. కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. పంజాబ్‌ విజయానికి ఇంకా 48 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో శ్రేయస్(18), నేహల్(9) ఉన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 6:41 pm

దోపిడీ రహిత సమాజం కోసం నిరంతర పోరాటాలు

దోపిడీ రహిత సమాజం కోసం నిరంతర పోరాటాలు సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:28 pm

అంజన్న గర్భగుడి పునర్నిర్మానంలో భాగస్వాములు కండి..

అంజన్న గర్భగుడి పునర్నిర్మానంలో భాగస్వాములు కండి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; శ్రీ పడమటి

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:24 pm

చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం

చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల దాహార్తి

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:21 pm

చిట్యాలలో పాఠశాలల్లో ఫూలే జయంతి వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మహాత్మా జ్యోతిరావు

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:20 pm

ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించిన జన్నారం ఎస్సై

జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం నూతన ఎస్సైగా గుర్రం ఉదయ్ కిరణ్ శనివారం

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:13 pm

నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన మంగ్లీ

సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావుపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు

తెలుగు పోస్ట్ 11 Apr 2026 6:12 pm

క్యాతన్‌పల్లిలో బీజేపీలోకి చేరికలు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కల రమేష్ ఆధ్వర్యంలో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:11 pm

Iran Supreme Leader Alive : జన్బాజ్ బ‌చ్ గ‌యా Andhra Prabha News

Iran Supreme Leader Alive : జన్బాజ్ బ‌చ్ గ‌యా Andhra Prabha

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:11 pm

పూలే ఆశయాలకు అనుగుణంగానే చంద్రబాబు పాలన

పూలే ఆశయాలకు అనుగుణంగానే చంద్రబాబు పాలన రాప్తాడు, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిరావు

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:11 pm

పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఫూలేకు నివాళులు

పరకాల, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలేకు

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:09 pm

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 11 Apr 2026 5:59 pm

ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు

టీడీపీ మండల కన్వీనర్ కుళ్లాయప్ప…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- నార్పల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బండ్లపల్లి కుళ్లాయప్ప మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు. ఆయన జీవితమే సమాజానికి ఆదర్శమని, సమానత్వం కోసం ఆయన […] The post ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:39 pm

కారుపై లారీ బోల్తా... పలువురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం జిల్లాలోని కీసర టోల్‌ప్లాజా దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఓ భారీ ట్యాంకర్ లారీ అదుపుతప్పి.. బిఎండబ్ల్యూ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో లారి కింద కారు చిక్కుకుని నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారుపై పడ్డ ట్యాంకర్‌ను తొలగించేందుకు రెస్క్యూ టీమ్‌, పోలీసులు శ్రమిస్తున్నారు. 

మన తెలంగాణ 11 Apr 2026 5:38 pm

Road Accident : కారుపై ... ట్యాంకర్...ఘోర ప్రమాదం

కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 11 Apr 2026 5:34 pm

సమిష్టి కృషితో బలోపేతం అవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ…

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఉపాధ్యాయుడు రవి కుమార్ విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందుతున్నాయని ఉపాధ్యాయుడు రవి కుమార్ తెలిపారు. విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ఎంపీపీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ […] The post సమిష్టి కృషితో బలోపేతం అవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:29 pm

సన్‌రైజర్స్ జోష్‌గా స్టార్ట్.. ఆ తర్వాత స్లో.. పంజాబ్‌ టార్గెట్ ఇదే..

న్యూ చంఢీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసింది. ఆరంభంలో ఇన్నింగ్స్‌ని దూకుడుగా ఆరంభించిన సనరైజర్స్ ఆ తర్వాత అత్యంత స్లోగా బ్యాటింగ్ చేసింది. పవర్‌ప్లేలోనే 100 పరుగులు దాటినప్పటికీ.. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్‌లు కలిసి తొలి వికెట్‌కి 120 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అభిషేక్ అర్థ శతకం కూడా సాధించాడు. అయితే శశాంక్ ఈ జోడీకి బ్రేక్ వేశాడు. ఒకే ఓవర్‌లో హెడ్(38), అభిషేక్(74, 28 బంతుల్లో, 5ఫోర్లు, 8 సిక్సులు) లను ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లు నెమ్మదిగా స్కోర్ పెంచుతూ వెళ్లారు. అయితే 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కిషన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన అనికేత్ 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సుతో 18 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇక సాలిల్ అరోరా(9) అర్ష్‌దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆఖరి ఓవర్‌లో చివరి దాక పోరాడిన క్లాసెన్(39) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి.. పంజాబ్‌కి 220 పరుగుల టార్గెట్‌ని ముందుంచింది. పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్, శశాంక్‌లు చెరి రెండు, బ్రాట్‌లెట్ ఒక వికెట్ తీశారు.

మన తెలంగాణ 11 Apr 2026 5:28 pm

Toll Plaza |కారుపై సిమెంట్ ట్యాంక‌ర్ బోల్తా

Toll Plaza | కారుపై సిమెంట్ ట్యాంక‌ర్ బోల్తా Toll Plaza |

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:27 pm

జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం : జల ధారతో సంఘాల చెరువుకు నీళ్లు అందేలా చేస్తామని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు చిత్రావతి నాలాను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాలో పూడికతీత పనులు చేపట్టే విధంగా ప్రతిపాదన చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఇలాంటి మేలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం ద్వారా ఈ సారి సంగాల చెరువుకు ఖచ్చితంగా నీరందించేలా చూస్తామని తెలిపారు. పరిజలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత […] The post జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:24 pm

ఫ్రెండ్స్ క్లబ్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్‌లో

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:24 pm

పారిశుద్ధ్య కార్మికుల మధ్య జన్మదిన వేడుకలు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్‌లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య తన జన్మదిన

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:20 pm

రాప్తాడు లో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.

రాప్తాడు లో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. రాప్తాడు , ఆంధ్రప్రభ : సూర్యుడు

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:17 pm

బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి..

బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి.. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. పాయకాపురం, ఆంధ్ర

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:13 pm

ఉన్నసిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ కు లేదు: కెటిఆర్

హైదరాబాద్: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి అహంకారానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మంత్రి పొంగు లేటి శ్రీనావాస్ రెడ్డి పై కెటిఆర్ ఫైరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోర్త్ సిటీ ఒక డ్రామా..తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్రని, నిషేధిత భూముల జాబితాల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు అని కెటిఆర్ విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని, కోహెడలో 178 ఎకరాల భూమి అమ్ముకునేందుకు ప్రయత్నమని మండిపడ్డారు. ఉన్నసిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ కు లేదని, ఫ్యూచర్ లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ కడతా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, అధికారులు కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడితే వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలని కెటిఆర్ కోరారు. 

మన తెలంగాణ 11 Apr 2026 5:13 pm

ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల హర్షం..

విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల సంఘ సేవకులు పోలా ప్రభాకర్ తో పాటు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆర్ డి టి సేవల అధ్యయనకర్త సత్య నిర్ధారణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలా ప్రభాకర్తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూపురం నుండి శ్రీ ఆదిత్య వైష్ణవి సోలార్ ఎంటర్ప్రైజెస్ అధినేత లక్ష్మయ్య, కళ్యాణదుర్గం స్వచ్ఛంద కార్యకర్త, […] The post ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల హర్షం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:11 pm

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం..

కన్వీనర్ నామా ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను అందజేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సేవా కార్యక్రమానికి ఊరు గుండ్ల రంగనాథం వారు దాతగా సహకరించి విజయవంతం చేసినందుకు వారు సేవాసమితి తరపున […] The post ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:04 pm

తన ఆత్మను చంపుకొని కెసిఆర్‌ను కౌగిలించుకున్నాడు..

జీవన్‌రెడ్డి తన ఆత్మను చంపుకొని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కౌగిలించుకున్నాడని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్‌ అన్నారు. కాంగ్రెస్ ను వదలి ఆ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఆయన కెసిఆర్ ను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు.. జీవన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. శనివారం జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. 40 ఏళ్లు అండగా ఉన్న పార్టీని వదిలి కెసిఆర్ విషకౌగిలిలోకి జీవన్‌రెడ్డి వెళ్లారన్నారు. జీవన్‌రెడ్డి.. తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడని, కెసిఆర్ విష కౌగిలిలో చిక్కుకుని బలై ఇప్పుడు కనిపించకుండా పోయిన సీనియర్ నాయకులను జీవన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు. కెసిఆర్ రాక్షస, అవినీతి పాలనపైన 10 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశానని చెప్పుకున్న జీవన్ రెడ్డిని దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడు? అని ప్రశ్నించారు. అవినీతి పరులు, నియంతలతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెపుతాడా? అంటూ సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి పోవాలని, కెసిఆర్ రావాలని ఈ రాష్ట్రంలో ఏ సామాన్యుడైనా అన్నాడా?.. కెసిఆర్ అనే చీడ పురుగును తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారన్నారు.కెసిఆర్‌ రావాలని తెలంగాణ ప్రజలెవరూ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. -

మన తెలంగాణ 11 Apr 2026 5:01 pm

ఘోర రోడ్డు ప్ర‌మాదం…

ఘోర రోడ్డు ప్ర‌మాదం… కంచిక‌చ‌ర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:57 pm

Sai Reddy Chooses a New Path, Moves into Media

Former YSRCP MP V. Vijayasai Reddy has clearly spoken about his future plans. For some time, there were many rumours. Some said he would go back to the YSRCP because of his supportive posts on X. Others said he might join the BJP. Now, he has put an end to all that talk. Sai Reddy […] The post Sai Reddy Chooses a New Path, Moves into Media appeared first on Telugu360 .

తెలుగు 360 11 Apr 2026 4:56 pm

రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు: కెటిఆర్

ఇబ్రహీంపట్నం: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే అని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని ఎంత వరకు అమలు చేసిందని ప్రశ్నించారు. ‘‘సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారో.. ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊరించి.. గద్దెనెక్కి గడిచిన రెండున్నరేళ్లలో 11వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. స్కూటీలు, నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి మహిళలను కూడా మోసం చేశారు. రెండు నెలల పింఛను ఇవ్వకుండా వృద్ధులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. గడిచిన 28 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు’’ అని కెటిఆర్ విమర్శించారు.

మన తెలంగాణ 11 Apr 2026 4:54 pm

దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్‌కు సన్మానం …

దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్‌కు సన్మానం … జైనూర్,

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:52 pm

Summer 2026 Release Chart Updated

Ram Charan’s Peddi is almost postponed from April 30th release and the new date will be announced soon. Now with the exit of Peddi, several films are gearing up for release in May and the release chart is updated. A number of films are releasing in summer and here is the updated release chart: May […] The post Summer 2026 Release Chart Updated appeared first on Telugu360 .

తెలుగు 360 11 Apr 2026 4:50 pm

​నవోదయ కాలనీ సమస్యలు పరిష్కరించాలి….

​నవోదయ కాలనీ సమస్యలు పరిష్కరించాలి…. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి ​మేడ్చల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:49 pm

కార్మికుల ప్రాణాలతో చెలగాటం..

కార్మికుల ప్రాణాలతో చెలగాటం.. రసాయన పరిశ్రమల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం ఎమ్మెల్సీ నెల్లికంటి

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:46 pm

పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు

యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం ;12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం లోని యూటిఎఫ్ […] The post పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:42 pm

AP |ప్రేమజంటల వీడియోలతో బ్లాక్‌మెయిల్..

AP | ప్రేమజంటల వీడియోలతో బ్లాక్‌మెయిల్.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:28 pm

ఉచిత కంటి సేవలకు భారీ స్పందన

మూడవ రోజు కూడా విశేష స్పందన మధ్య కొనసాగిన ఉచిత కంటి పరీక్ష శిబిరంవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పోతుకుంట వద్ద గల ప్రభుత్వ ఆసుపత్రిలో మూడవరోజు కూడా ప్రజల నుంచి విశేష స్పందన మధ్య ఉచిత కంటి పరీక్ష శిబిరం జరిగిందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు అక్కడకు చేరుకొని రోగులను ఆప్యాయతతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపికగా కంటి పరీక్షలు నిర్వహించుకొని ఆరోగ్యం […] The post ఉచిత కంటి సేవలకు భారీ స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:26 pm

పవర్‌ప్లేలో అభిషేక్-హెడ్ జోడీ దూకుడు.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

న్యూ చంఢీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో అభిషేక్-హెడ్‌లు కలిసి పంజాబ్ బౌలర్లను వణికించారు. ముఖ్యంగా అభిషేక్ పపర్‌ప్లేలోనే 5 ఫోర్లు 7 సిక్సులతో అర్థ శతకం సాధించాడు. మరోవైపు హెడ్‌ కూడా అభిషేక్‌కి తగిన సహకారం అందించాడు. దీంతో పవర్‌ప్లే లోనే ఎస్‌ఆ‌ర్‌హెచ్ స్కోర్ వంద దాటింది. 8 ఓవర్లలో వీరిద్దరు కలిసి 120 భాగస్వామ్యం జత చేశారు. అయితే శశాంక్ సింగ్ ఈ జోడీకి బ్రేక్ వేశాడు. శశాంక్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి హెడ్(38) ఔట్ అయ్యాడు. అదే ఓవర్‌ మూడో బంతికి అభిషేక్(74) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్(1), క్లాసెన్(1) ఉన్నారు. 

మన తెలంగాణ 11 Apr 2026 4:24 pm

కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన

రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు పురాతన నాణెముల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షాలు ఈ చారిత్రక నాణెములు అని తెలిపారు. తొలి తెలుగు శాసనమును క్రీస్తు శకం 575లో రేనాటి […] The post కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:22 pm

Andhra Prabha Smart Edition|AP|మావిగన్​/గోల్డ్​ స్మగ్లర్స్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 11-04-2026, 4.00PM ap స్కోప్​ లేని మావిగన్​..

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:20 pm

సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ […] The post సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:19 pm

మహాత్మా జ్యోతిరావు ఫూలేకు ఘన నివాళులు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : సమాజంలోని అసమానతలను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిరావు

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:19 pm

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ కుమార్

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ కుమార్ క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:18 pm

ఉరవకొండలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్్ కింద కార్డన్ అండ్ సెర్చ్

విశాలాంధ్ర, ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని కొలిమి లేఅవుట్, న్యూ జగనన్న కాలనీ ప్రాంతంలో శనివారం పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్్ణలో భాగంగా విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఉరవకొండ సిఐ మహానంది ఆధ్వర్యంలో ఉరవకొండ పోలీస్ సిబ్బంది, వజ్రకరూరు పోలీస్ సిబ్బంది కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్లను, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా, మత్తు పదార్థాలు మరియు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. […] The post ఉరవకొండలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్్ కింద కార్డన్ అండ్ సెర్చ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:15 pm

AndhraPrabha Smart Edition |TS|భారీ యాక్షన్ /దొరికిపోయారుగా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 11-04-2026, 4.00PM ts హైడ్రా భారీ యాక్షన్​..

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:15 pm

మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి

మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి కరీమాబాద్, ఆంధ్రప్రభ : మహిళలకు 33 శాతం

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:13 pm

కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్…

కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్… 48 వాహనాలు స్వాధీనంఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:13 pm

జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లి తప్పు చేశారు: మహేష్ గౌడ్

హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100 స్థానాలు గెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. తదుపరి మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ పార్టీ ముక్కలైంది, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని, కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు తీసుకోవడం వల్లే కాళేశ్వరం కూలిందని మహేష్ గౌడ్ మండిపడ్డారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లి తప్పు చేశారని, స్థానికంగా జరిగిన చిన్న సమస్యలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ని వీడారని, అవినీతి చేశారని మాజీ సిఎం కెసిఆర్ ని ఆయన విమర్శించారని, ఇన్నాళ్లు బిఆర్ఎస్ అవినీతిపై మాట్లాడి అందులోనే చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా గౌరవమిచ్చామని, బిర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్లడాన్ని జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికీ జీవన్ రెడ్డి పట్ల తమకు గౌరవం ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. 

మన తెలంగాణ 11 Apr 2026 4:09 pm

శతాబ్ది వేడుకల సందడి…

శతాబ్ది వేడుకల సందడి… ఏప్రిల్ 14న ‘స్వరనీరాజనం’ సంగీత విభావరియువతలో దేశభక్తి జ్వాల

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:08 pm

అలా కొట్టడం.. నేను ఇంతవరకు చూడలేదు: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. శుక్రవారం(ఏప్రిల్ 10) ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్యంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. సూర్యవంశీ కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి, ఆర్‌సిబి బౌలింగ్ దళాన్ని బెంబేలెత్తించాడు. వైభవ్ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్‌కు ఫించ్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఆటపై ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూర్యవంశీ, బ్యాటింగ్ చేసే తీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు. వైభవ్, హేజిల్‌వుడ్ పై ఆరంభంలోనే ఆధిపత్యం చెలాయించాడు. నేరుగా గ్రౌండ్‌లోకి, వికెట్‌కు స్క్వేర్‌గా బంతిని కొట్టే విధానం నమ్మశక్యం కానిది. పేరుప్రతిష్టలను పక్కనపెట్టి, బంతిని ఎంత దూరం కొట్టగలనో అంత దూరం కొట్టాలనే పట్టుదలతో ఆడటం.. నేను ఇంతవరకు చూడలేదు. యవ్వనంలో ఉండే అజ్ఞానం ఒక అద్భుతమైన విషయం. అతను వీడియో గేమ్‌లలో లాంటి గణాంకాలను నమోదు చేస్తున్నాడు. అతను బంతిని సునాయసంగా కొట్టడం నమ్మశక్యం కానిది అని ఫించ్ పేర్కోన్నాడు. కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుతో తొలుత బ్యాటింగ్ చేసి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సూర్యవంశీతో పాటు ధ్రువ్ జూరెల్‌ అజేయంగా 81 పరుగులు చేసి జట్టుకు సునాయసంగా విజయాన్ని అందించాడు. దీంతో రాజస్థాన్ ఆడిన నాలుగు మ్యాచ్ లో గెలచి టేబుల్ టాపర్ గా నిలిచింది.

మన తెలంగాణ 11 Apr 2026 4:05 pm

మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం..

మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మహాత్మ జ్యోతిరావు

ప్రభ న్యూస్ 11 Apr 2026 3:27 pm

faria abdullah|మ‌త్తెక్కిస్తున్న జాతిర‌త్నాలు హీరోయిన్‌

faria abdullah| మ‌త్తెక్కిస్తున్న జాతిర‌త్నాలు హీరోయిన్‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : జాతిరత్నాలు సినిమాతో

ప్రభ న్యూస్ 11 Apr 2026 3:11 pm

అంబేద్కర్ జయంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్..

వెల్దండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని కొట్ర గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా

ప్రభ న్యూస్ 11 Apr 2026 3:05 pm

'ప్యారడైజ్'లో కయాదు.. లుక్ అదిరిపోయింది

'డ్రాగన్'తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన యంగ్ బ్యూటీ కయాదు లోహర్.. క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ అమ్మడి హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో కయాదు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్యారడైజ్'లో హీరోయిన్ గా కయాదు నటిస్తోంది. శనివారం కయాదు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ‘సుబ్బు’ అనే పాత్రలో నటిస్తుంది కయాదు. పోస్టర్ లో వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్‌లో క్యాప్ ధరించి వింటేజ్ లుక్‌లో సైకిల్‌పై వెళ్తున్న కయాదు లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా మూవీ తర్వాత తెరకెక్కుతున్న రెండో చిత్రం ప్యారడైజ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సినీ ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ వెనక్కి తగ్గారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 3:03 pm