Tirupati |అభివృద్ధి అంటే మాటలు కాదు..
Tirupati | అభివృద్ధి అంటే మాటలు కాదు.. Tirupati | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ
US Social Media Vetting Triggers Major Delays for Indian H-1B Visa Applicants
The US State Department’s new social media vetting policy has created significant disruption for thousands of Indian H-1B visa holders planning to travel during the holiday season. Applicants with interviews scheduled from mid to late December have received unexpected notices informing them that their appointments have been moved to next year. Many interviews are now […] The post US Social Media Vetting Triggers Major Delays for Indian H-1B Visa Applicants appeared first on Telugu360 .
Brain Switch |మెదడులో అలవాట్లను మార్చే స్విచ్
Brain Switch | మెదడులో అలవాట్లను మార్చే స్విచ్ ఆంధ్రప్రభ : మెదడు
Ys Jagan : నేడు ముఖ్యనేతలతో జగన్ భేటీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు.
Video: Gurram Paapi Reddy Movie Team Exclusive Interview
The post Video: Gurram Paapi Reddy Movie Team Exclusive Interview appeared first on Telugu360 .
విషాదం: కారు, ఆటో బోల్తా.. నలుగురు మృతి
తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తరోడ సమీపంలో తెల్లవారుజామున ఓ కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అలాగే,కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో ఆటో బోల్తా కొట్టింది. ఉదయం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఒకురు చనిపోయారు. మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిని వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Official: Venkatesh’s Aadarsha Kutumbam
Victory Venkatesh and Trivikram Srinivas are teaming up for the first time and the film is said to be a family entertainer with all the needed emotions and entertainment. The regular shoot of the film kick-started today in Hyderabad. The film is titled ‘Aadarsha Kutumbam House No 47 – AK 47’ and the makers unveiled […] The post Official: Venkatesh’s Aadarsha Kutumbam appeared first on Telugu360 .
Chandrababu :నేడు ధాన్యం సేకరణపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
Andhra Pradesh : దివ్యాంగులకు త్వరలోనే గుడ్ న్యూస్... ఉచిత ప్రయాణంపై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
100 Years |శత జయంతి ఉత్సవాలు..
100 Years | శత జయంతి ఉత్సవాలు.. 100 Years, మోపిదేవి, ఆంధ్రప్రభ
Christmas 2025 |ఐక్య క్రిస్మస్..
Christmas 2025 | ఐక్య క్రిస్మస్.. Christmas 2025, గుడివాడ, ఆంధ్రప్రభ :
తొలి భారత బౌలర్ గా బుమ్రా అరుదైన రికార్డు..
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. మంగళవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో బుమ్రా రెండు వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుని బుమ్రా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన రెండవ భారత బౌలర్ గా.. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదవ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20ల్లో 101 వికెట్లు సాధించాడు బుమ్రా. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా కంటే ముందు.. న్యూజిలాండ్ ఐకాన్ టిమ్ సౌథి ఉన్నారు. సౌథి107 టెస్టుల్లో 391, 161 వన్డేల్లో 221, 126 టీ20ల్లో 164 వికెట్లు పడగొట్టాడు. అయితే, డిసెంబర్ 2024లో టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు.. కానీ వైట్-బాల్ ఫార్మాట్లో అందుబాటులో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడు ఫార్మాట్లలో సెంచరీ వికెట్లు తీసిన మరో బౌలర్. మలింగ 30 టెస్టుల్లో 101 వికెట్లు, 226 వన్డేల్లో 228 వికెట్లు, 338 వికెట్లు, 84 టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. మలింగ 2021 సెప్టెంబర్లో అన్ని రకాల క్రికెట్ల నుంచి రిటైర్ అయ్యాడు. అలాగే, పాకిస్తాన్ స్టార్ షాహీన్ షా అఫ్రిది కూడా ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో షహీన్ 100 టీ20 వికెట్లు పూర్తి చేసి మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించాడు. షహీన్ 33 టెస్టుల్లో 121 వికెట్లు, 71 వన్డేల్లో 135 వికెట్లు, 96 టీ20ల్లో 126 వికెట్లు పడగొట్టాడు.ఇక, బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల ఫీట్ ను అందుకున్నాడు. షకీబ్ 2021లో తన 100వ టీ20 వికెట్ను సాధించాడు. షకీబ్ 71 టెస్టుల్లో 246 వికెట్లు, 247 వన్డేల్లో 317 వికెట్లు, 129 టీ20ల్లో 149 వికెట్లు పడగొట్టాడు.
Weather Report : ఎముకలు కొరికే చలి.. మరో వారం రోజులు ఇంతేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగిపోతుంది.
భోపాల్ లో ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడని అధికారులు అరెస్టు
AB Vajpayee |తెలుగు గడ్డపై వాజ్పేయి చెరగని ముద్ర
AB Vajpayee | ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ స్వాతంత్ర్యం కోసం,
లోక్సభలో నేడు కూడా ఎన్నికల సంస్కరణలపై చర్చ
పార్లమెంట్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యాయామంపై లోక్సభ చర్చ నేడు కూడా కొనసాగనుంది
Lokesh Nara’s US Tour Sparks Momentum. Major Tech Giants Signal Growing Interest in Andhra Pradesh
Andhra Pradesh Minister for Education, IT and Electronics, Nara Lokesh, is on a high-impact tour of the United States. His meetings with global technology leaders in San Francisco and Santa Clara have opened the door to new partnerships and stronger investment pipelines in the state’s digital and industrial transformation. During the trip, Lokesh met senior […] The post Lokesh Nara’s US Tour Sparks Momentum. Major Tech Giants Signal Growing Interest in Andhra Pradesh appeared first on Telugu360 .
ఓల్డ్ సిటీలో యువకుడు దారుణ హత్య..
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఓదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓల్డ్ సిటీలోని కామాటిపురలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం హైదారాబాద్ నగరంలో ఓ రియల్ ఎస్టేటర్ ను కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో నరి నరికి చంపారు. అదే రోజు వారసిగూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై దారున హత్యకు గురైంది. పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతుండటంతో.. సిటీలో శాంతి భద్రతలపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Nara Lokesh : సుందర్ పిచాయ్ తో లోకేశ్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమయ్యారు
RTC | బంపర్ ఆఫర్.. RTC, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : హైదరాబాద్ వెళ్లే
Medaripet |ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
Medaripet | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.. Medaripet, దండేపల్లి, ఆంధ్రప్రభ : ఈనెల
Global summit |విద్యార్థి ప్రతిభకు డీజీపీ ప్రశంసలు..
Global summit | విద్యార్థి ప్రతిభకు డీజీపీ ప్రశంసలు.. Global summit, నాగర్
Gold Price Today : గుడ్ న్యూస్.. పసిడి కొనాలనుకునే వారు ఇప్పుడు కొనేయండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
Naskal |సమస్యలు పరిష్కరిస్తా..
Naskal | సమస్యలు పరిష్కరిస్తా.. Naskal, నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట మండల
బడ్జెట్ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్: POCO C85 5G లాంచ్ – ధర, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు
పోకో తమ సరికొత్త మోడల్ POCO C85 5Gను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన స్టైల్, అత్యుత్తమ బ్యాటరీ అనుభవంతో వినియోగదారులకు అద్భుతమైన విలువను అందిస్తుంది. ప్రత్యేకించి, రూ. 12,000 లోపు ధర విభాగంలో ఈ ఫోన్ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది. రెండు రోజుల బ్యాటరీ లైఫ్ మీ సొంతం పోకో C85 5Gలో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఇది సాధారణ వినియోగంలో ఏకంగా రెండు రోజుల పాటు […] The post బడ్జెట్ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్: POCO C85 5G లాంచ్ – ధర, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు appeared first on Dear Urban .
తెలంగాణపై చలి పంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణపై చలి పంజా విసురుతోంది. దీంతో రాష్ట్రమంతా గజ గజా వణుకిపోతోంది. ఈ నెల 16 వరకు రాష్ట్రంలో తీవ్ర చలి వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి, ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుండి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ప్రత్యేకించి డిసెంబర్ 10, 11, 12, 13 తేదీల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తెలంగాణతో పాటు కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధి కంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉందని తెలిపింది. హైదరాబాద్లో పెరగనున్న చలి తీవ్రత హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 9నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా. హైదరాబాద్ వాసులు కూడా చలిగాలుల ప్రభావం నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల అదనపు శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. చలి తీవ్రత పెరిగే క్రమంలో ఉదయం వేళల్లో, రాత్రి సమయాల్లో వెచ్చని దుస్తులు ధరించడం, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కర మని చెబుతున్నారు. పొగమంచు, చలి కారణంగా వాహనదారులు కూడా రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిం చారు.
Pawan Kalyan : నేడు అధికారులతో పవన్ మాటామంతీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం కానున్నారు
నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా వర్సిటీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి ఓయూను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో సిఎం రేవంత్ ప్రసంగించనున్నారు. కాగా, వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ప్రకటించింది. ఇటీవల సిఎం మాట్లాడుతూ.. ఓయూను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ డీపీఆర్ రెడీ చేస్తోంది. కాగా, సిఎం రేవంత్ రెడ్డి.. ఓయూకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి సిఎం హోదాలో రేవంత్ ఓయూకు వెళ్లారు.
Karthi announces Collaboration with a Telugu Director
Tamil actor Karthi has cemented his position in Telugu and all his films get a simultaneous release in the Telugu states. The actor is keen to take up Telugu films in his next slots for 2026. The actor is currently promoting his upcoming release Vaa Vaathiyaar and the film will release as Annagaru Vostaru in […] The post Karthi announces Collaboration with a Telugu Director appeared first on Telugu360 .
Reshuffle in New Releases of December
The release date of Nandamuri Balakrishna’s Akhanda 2 has been finally announced and the film releases on December 12th with special paid premieres on 11th night. A bunch of films are planned for December 12th release and some of them are moved out to avoid a clash. Roshan Kanakala’s Mowgli is pushed by a day […] The post Reshuffle in New Releases of December appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Fights, Fun and Fan Fury Mark a Dramatic Episode
With the finale fast approaching, tensions are peaking inside the Bigg Boss house. The latest episode delivered a mix of humour, strategy, shock, and controversy, leaving viewers sharply divided over perceived unfairness and shifting alliances. Sanjana Receives a Secret Task Sanjana, who has been confined to the Bigg Boss jail, was assigned a secret mission: […] The post Bigg Boss Telugu 9: Fights, Fun and Fan Fury Mark a Dramatic Episode appeared first on Telugu360 .
Tekumatla |ఒక్కసారి అవకాశం కల్పిస్తే..
Tekumatla | ఒక్కసారి అవకాశం కల్పిస్తే.. Tekumatla, జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్
బస్సు-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి, 15మందికి గాయాలు
సికార్: రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఫతేపూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై స్లీపర్ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వివరాల ప్రకారం, జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Andhra Pradesh : ధాన్యం కొనుగోళ్లపై నాదెండ్ల ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Telangana : రేపు తెలంగాణలో మొదటి పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ లో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.
Dharmasagar |సేవ చేసే ఛాన్స్ ఇవ్వండి..
Dharmasagar | సేవ చేసే ఛాన్స్ ఇవ్వండి.. Dharmasagar, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో
భారత్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు
భారత్లో భారీ పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత తెలిపింది
Chandrababu : నేడు మంత్రులతో చంద్రబాబు భేటీ
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం మంత్రులతో సమావేశం కానున్నారు
Power Star |డ్యాన్ చేస్తే.. భూకంపం..
Power Star | డ్యాన్ చేస్తే.. భూకంపం.. Power Star, ఆంధ్రప్రభ వెబ్
India vs South Africa: తొలి టీ20 భారత్ దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య కటక్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.
Rachapalli |ఆ ఒక్కటీ ఏకగ్రీవం..
Rachapalli | ఆ ఒక్కటీ ఏకగ్రీవం.. Rachapalli, చెన్నూర్ ఆంధ్రప్రభ : మూడోవిడత
Elections |నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది..
Elections | నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది.. Elections, జైపూర్, ఆంధ్రప్రభ : మూడోవ
Revanth Reddy |హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చేస్తే..
Revanth Reddy | హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చేస్తే.. Revanth
ఇండిగో విమానాల సర్వీస్ 10 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ/ముంబై : శీతాకాల షెడ్యూల్లో 10 శాతం విమాన సర్వీసులను తగ్గించుకోవాలని డిజిసిఎ ఆదేశించడంతో ఇండిగో తన విమానసర్వీసులను ఆ మేరకు తగ్గించుకుంది. ప్రస్తుతం రోజుకు నడుస్తున్న 2200 ఇండిగో విమాన సర్వీసుల్లో 200 కు పైగా రద్దవుతాయి. విమానయాన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇండిగో విమాన షెడ్యూల్ను 10 శాతం తగ్గించాలని ఆదేశించింది. సవరించిన షెడ్యూల్ను బుధవారం అందజేయాలని డిజిసిఎ ఆదేశించింది. 2025-26 శీతాకాలం షెడ్యూల్ ప్రకారం రోజుకు 2200 విమానసర్వీసులను ఇండిగో నడపవలసి ఉండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 200 వరకు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని తేల్చి చెప్పారు. తగిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డిజిసిఎ ఇప్పటికే ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఇండిగో విమానసర్వీసులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, ఇబ్బందులు పడిన ప్రయాణికులకు రిఫండ్ చెల్లించాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే రూ750 కోట్ల రిఫండ్ ప్రయాణికులకు చేరిందని తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానున్నాయి. అప్పటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే అత్యంత ప్రాధాన్యంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అద్భుతమైన ఫలితాలకు వేదికగా అందర్నీ ఆశ్చర్యపర్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో సదస్సులను నిర్వహించారు. మొదటి రోజునే ఈ సదస్సు సూపర్ సక్సెస్ అయింది. 35 కంపెనీలు రూ. 2.43లక్షల కోట్లు తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం కావడం గొప్ప విషయం. రెండో రోజు మంగళవారం అదే స్థాయిలో కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా, ఈ రెండు రోజుల సదస్సులో ఇప్పటివరకు రూ. 6లక్షల వేల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఎకానమీ ప్రస్తుతం దాదాపు 185 బిలియన్ డాలర్ల వరకు ఉండగా, త్రీ ట్రిలియన్ డాలర్లకు చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సంకల్పాన్ని పెట్టుకుంది. ఎకానమీ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావిస్తోంది. విజన్లో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) మోడళ్లను ప్రభుత్వం నిర్దేశించుకుంది. డీప్టెక్, ఎఐ, క్వాంటమ్, కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రపంచంలో తెలంగాణను ఆసియాకు ఇన్నోవేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దే ప్రయత్నాల ప్రారంభంగా ప్రభుత్వం ఈ రైజింగ్ విజన్ సదస్సు భారీ ఎత్తున నిర్వహించింది. చైనా లోని అన్ని ప్రావిన్స్ల్లో పెద్దదైన గ్వాంగ్డాంగ్ ప్రాంతం 20 ఏళ్ల లోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించింది. ఆ ప్రావిన్స్నే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజన్కు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ విజన్ సాధించడం కష్టంగా అనిపించినా, కృషితో సాధించగలమన్న నమ్మకంతో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటి, గ్రీన్ఎనర్జీ, విద్యుత్, రవాణా, విద్య, వైద్యం, పర్యాటకం, వినోదం, ఈ విధంగా వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్క ఇంధన రంగంలోనే రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రావడం విశేషం. దీని ద్వారా 1,52,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ 14 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41 వేల కోట్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. డీప్టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ రూ. 75 వేల కోట్లు (భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు), ఎప్రిన్/యాక్సిస్ రూ. 31 వేల కోట్లు, విన్గ్రూప్ రూ. 27 వేల కోట్లు, సల్మాన్ఖాన్ రూ.10 వేల కోట్లు, మేఘా 8 వేల కోట్లు, వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధమయ్యాయి. పునరుత్పత్తి శక్తి, పవర్ సెక్యూరిటీ రూ. 39,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ లాజిస్టిక్ గేల్వేలకు రూ. 19,350 కోట్లు, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ , కోర్ ఇండస్ట్రీ రూ. 13,500 కోట్లు ఒప్పందం కుదిరింది. మై హోం నుంచి గ్లోబల్ కంపెనీల వరకు ఈ ఒప్పందాల వెల్లువ ఉప్పొంగింది. ప్రస్తుతం తెలంగాణలో 11.4 గిగావాట్ల (11,400 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్కు అదనంగా మరో 20 గిగావాట్ల (20 వేల మెగావాట్ల) విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్షంగా పెట్టుకున్నారు. 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం అవుతుంది కాబట్టి ఆ డిమాండ్ సాధన కోసం మరిన్ని సౌర, థర్మల్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలు నెలకొల్పడానికి నిర్ణయించుకున్నారు. రక్షణ, అంతరిక్షరంగాల పరిశోధనలతోపాటు ఉత్పత్తులకు వీలుగా హైదరాబాద్ నగరం త్వరలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరో మూడు యూనిట్లు నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ ఉత్పత్తులు అందించడానికి 3500 కంపెనీలు 25 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయని చర్చలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న సూచన వెలువడింది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయం, అనుబంధ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 34.6 బిలియన్ డాలర్లు ఉండగా, 2047 నాటికి 400 బిలియన్ డాలర్లకు పెంచడం లక్షంగా పెట్టుకున్నారు. సోమవారం క్రీడారంగానికి ప్రోత్సాహకరంగా రూ.16వేల కోట్ల పెట్టుబడులు సమకూరగా, మంగళవారం మరో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు సమకూరుతున్నాయి. రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో 200 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. అపోలో గ్రూప్ ఆధునిక విశ్వవిద్యాలయం, వైద్య, విద్య పరిశోధన కేంద్రం నిర్మాణానికి 200 కోట్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. అరబిందో ఫార్మా రూ. 2 వేల కోట్లు, ఎఐ రెడీ డేటా పార్క్ రూ.70 వేల కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండడం విశేషం. ఆయన సమక్షం లోనే ఒప్పందాలు కుదురుతుండడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరుపురాని ఘట్టం.
ఎన్నికల తీరు మారితేనే కల నెరవేరేది!
‘తెలంగాణలోని గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడిగా నడుస్తున్నది. ఎన్నికలు మూడు దశల్లో నడుస్తున్న తరుణంలో ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలు కాలంతో పోటీపడి పనిచేస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రెండు సంవత్సరాల నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన సమస్యలకు పరిష్కారాల్ని చూపే అసలైన గ్రామ స్వపరిపాలన కోసం పల్లెలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో 12,728 గ్రామ పంచాయతీలకు, 1,12,242 వార్డులకు 1 కోటి 60 లక్షల ఓటర్లతో ఎన్నికల రణరంగం సిద్ధమైనది. గ్రామంలోనే దేశం ఉంది. అవి అంతరించిపోతే దేశమే అంతమయ్యే ప్రమాదం ఉన్నది. పల్లెసీమలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలా నడవాలంటే ఎన్నికల ప్రక్రియనే కీలకం. అలాంటి కీలకమైన ఈ దేశ ఎన్నికల ప్రక్రియలో గ్రామస్థాయినుంచే సమూలమైన మార్పులు తేవాలి. కానీ మన దగ్గర అది పంచాయతీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా వాటి తీరు ‘ప్రలోభాల’ పర్వమే తప్ప ప్రగతి సూత్రంగా లేదు.రోజులు గడుస్తున్నా కూడా పార్టీల జెండాలే తప్ప ప్రజా ‘ఎ’జెండాలు ముందుకు వెళ్లే పరిస్థితులు కనబడడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభంగా, నాయకుడి ఎంపికలో నిర్ణయాత్మకమైన శక్తిగా నిలిచే ‘ఓటు’ను డబ్బుతో, మద్యంతో, పరపతి, ప్రలోభాలతో చట్టవిరుద్ధమని తెలిసిన కూడా యథేచ్ఛగా లాక్కుంటున్నారు. ప్రజల నిజాయితీని పక్కదారిపట్టించి ప్రలోభాల రొంపిలోకి దించారు. వీరి ప్రవర్తన, విధానాల వలన ఈతరమే కాదు భవిష్యత్తు తరాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. ఈ ధోరణి ఇప్పటికే సమాజంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఇలానే కొనసాగితే రానురాను ఎటువైపు దారి తీస్తుందో..? ఏ రూపు దాలుస్తుందో..? రేపటికి ఏ సంకేతం ఇస్తుందో..? ఊహిస్తేనే ఆందోళన కలిగిస్తున్నది. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే మరింత ప్రమాదంలోకి నెట్టుతున్నది. వీటన్నిటికి మన రాజకీయ పార్టీల ఎన్నికల విధానాలు, వైఖరినే కారణం. స్వరాజ్యం కొద్దిమంది అధికారాన్ని చేజిక్కించుకున్నంత మాత్రానరాదు, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకున్నచోట అడ్డుపడనప్పుడు మాత్రమే వస్తుంది. నేడు ఆ స్వరాజ్యం లేదు.. రాజ్యం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి అధికార దుర్వినియోగానికైనా సిద్ధపడడమే ఉంది. వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు, పొత్తులు, జిత్తులు, జిమ్మిక్కులు, రాజకీయాల సహజ స్వభావాన్ని మార్చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఎప్పుడు మారుతారో.. అధికార దాహం కోసం ఏం చేయడానికి అయినా ఎలా సిద్ధపడతారో ఎవరికి అర్థం కానీ స్థితి ఉన్నది. ఈనాటి రాజకీయ ప్రక్రియలో తమ స్వార్థం, రాజకీయ దాహం తప్ప ప్రజల కోణం లేదు. కుట్రలు, కుతంత్రాలు, స్వార్థం, స్వప్రయోజనాలే కానీ మంచికి మానవత్వానికి, నీతికి, నిజాయితీకి అవకాశం లేదు అన్నట్టుగా ఉంది. నేటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే, సామాన్యుడికి రాజకీయాల్లో స్థానం లేదని, భవిష్యత్తులో కూడా రాదని స్పష్టంగా కనబడుతున్నది. ఎన్నికల్లో పోటీకి నిలబడితే ఏం చేస్తావు..? ఎలా చేస్తావు..? అని అడిగే పద్ధతులు పోయి నీ వద్ద ఎన్ని పైసలు ఉన్నాయి..? ఎంత పెడతావు..? ఎంత ఇస్తావు..?అని బహిరంగంగా మాట్లాడే దుస్థితికి వచ్చింది. అభివృద్ధికి పాటుపడే వ్యక్తుల విధానపరమైన ప్రవర్తన, పని విధానం, నిజాయితీ, నిబద్ధతలను పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థుల కుల, ధన, బల, బలగాలను బేరీజు వేసుకొని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా నడిచే దుస్థితి ఉన్నది. అభ్యర్థులను ఎంపికచేసే దగ్గర కూడా కొద్దిమంది వ్యక్తులే కూర్చొని శాషిస్తూ అభ్యర్థుల భవితవ్యాన్ని ఖరారు చేసే రాచరికపు పోకడలకు నిలయంగా మారింది. చివరికి విలువలతో బతకాల్సిన విద్యావంతులు సైతంజెండా, ఎజెండాలు ఏమీ లేక ఎవరికి పడితే వారికి జై కొట్టే అయోమయ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా సమాజ అభివృద్ధికి పురోగమనం కాదు తిరోగమనమే. మనదేశంలో రాజకీయ వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. ఎలక్షన్ అంటేనే కలెక్షన్ అన్నట్టుగా ఎంత పెట్టాలి..? గెలిచిన తర్వాత తిరిగి ఎంత రాబట్టాలి ..? అని ముందే లేక్కలు వేసుకొని రంగంలోకి దిగే పరిస్థితులు వచ్చాయి. సేవ చేసేందుకు కాదు సంపాదించేందుకే రాజకీయాలను వాడుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తి, గుణగణాలు, వయస్సు తదితర రాజ్యాంగ నియమాలకు సంబంధించిన హక్కులు పోయి ‘డబ్బే’ ప్రధాన హక్కుగా నేడు మారింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ఉండాలి, డబ్బు ఉన్నోళ్లే కావాలి అనే పరిస్థితులు వచ్చాయి. డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సామాన్యులకు రాజకీయాల్లో స్థానం లేదని, భవిష్యత్తులో కూడా రాదనేది అక్షర సత్యం. కాళోజీ లాంటి మహనీయులు జరుగుతున్న తీరును గమనించే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పాటివాడో చూడు, ఎన్నుకుంటే ఏం చేస్తాడో కాదు ఇప్పటివరకు ఏం చేశాడో చూడు, పెట్టిన టోపీని కాదు.. పెట్టే టోపీని చూడు అంటూ చైతన్యం చేశాడు. అయినా ప్రజలు చైతన్యం కాలేదు.. ప్రజల్ని విభజించి వారి ఆలోచన శక్తిని చంపి తమ అనుచరులుగా మలుచుకున్నారు. కాబట్టే పార్టీల జండాలే తప్ప వారికి మరొకటి అర్థం కాదు. వారి అభివృద్ధి, అభ్యున్నతి ఆలోచన రాదు. అందుకే ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడనే మిగిలారు. అభివృద్ధి కూడా అలానే మిగిలింది. కానీ మనల్ని ఏలే నాయకులు మాత్రం కోట్లాది రూపాయలకు అధిపతులుగా మారారు. అందువల్లనే నాయకుల్లో ఎదుగుదల ఉన్నది కానీ ప్రజల్లో ఎదుగుదల లేదు. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకోబడే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారి నిర్ణయాధికారం మీదనే పాలన వ్యవస్థ ఆధారపడి ఉన్నది. కానీ ప్రజలు ఆ నిర్ణయాధికార శక్తి ఏంటో..? ఒక్కసారి ఉపయోగిస్తే ఎలా ఉంటుందో..? ఎలాంటి మార్పులు తెస్తుందో.. తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించడం మాని దీర్ఘకాలిక ప్రయోజనాలు మార్పుపై దృష్టిపెటి ప్రజాస్వామ్యయుతంగా, విశ్వజనీయమైన, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత పద్ధతిలో ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా ఓటును వినియోగించుకుంటే మహోత్తరమైన మార్పులు ఎన్నో జరుగుతాయి. ఆ మార్పులన్నింటికీ వజ్రాయుధం మన ఓటే. నా జాతి ప్రజలకు కత్తిని ఆయుధంగా ఇవ్వలేదు.. ఓటునే ఆయుధంగా ఇచ్చాను, పోరాడి రాజులవుతారో లేక ఓడిపోయి (అమ్ముకొని) బానిసలు అవుతారో తేల్చుకోవాలని అంబేద్కర్ సందేశం ఇచ్చారు.. ఓటు హక్కు సాధించిన అనంతరం ఓటు ఆవశ్యకతను, అవసరతను వివరించారు. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగంలో ఓటు హక్కు వచ్చి 75 ఏళ్లు దాటిన కూడా ఇంకా ఓటు అవసరతను, ఆవశ్యకతను ప్రజలు గ్రహించడం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని రాజ్యాంగ సంస్థలు, అధికారులు ఓటుపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఫోటో వరకే పరిమితమై చైతన్యం తెచ్చామంటే కాదు ఫోటో షూట్లు మానీ అధికార యంత్రాంగమంతా పల్లెబాట బట్టి ప్రజలకు ఓటు ఆవశ్యకతను వివరించాలి. ‘ఓటర్లు చైతన్యమైనప్పుడు మాత్రమే పరిపాలన వ్యవస్థలో కానీ, పాలకుల ఆలోచన ధోరణుల్లో కానీ మార్పు వస్తుంది. ఓటరులో మార్పు రానంత కాలం సమాజంలో మార్పురాదు..’ కాబట్టి ఓటరు పూర్తిగా మారాలి.. ఆ దిశగా మార్పు జరగాలి. నాయకుడి ఎంపికలో ఓటరే కీలకమైనప్పుడు అసమర్ధున్ని ఎన్నుకొని బాధపడే కంటే ఎన్నికకు ముందే అన్ని ఆలోచించి సమర్థవంతమైన నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలి. అలా ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థలో మార్పుతో పాటు ప్రజల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రశ్నించే స్వభావం పెరుగుతుంది. పాలనలో కూడా జవాబుదారీతనం ఉంటుంది. పాలన సరిగ్గా చేయకపోతే ప్రజలు నిలదీస్తారని భయం పాలకుల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ ఓటు మీదనే ఆధారపడి ఉంది. ఇది జరగాలంటే ప్రస్తుత రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. స్వార్థంతో కాదు సామాజిక బాధ్యతతో పరిపాలించే వ్యవస్థ రావాలి. ప్రజలకు జవాబుదారీగా లేకుంటే, ప్రజలు వద్దనుకుని పాలకులను నేరుగా తొలగించే ‘రీకాల్ సిస్టం’ రావాలి. మన రాజకీయ వ్యవస్థలో వారసత్వ పోకడలు పోవాలి. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఉన్నట్టుగా పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రెండుసార్లు మాత్రమే పోటీ చేసేలా నిబంధనలతో పకడ్బందీ చట్టాన్ని తేవాలి. రాజకీయాల్లో యువతరం, కొత్త రక్తం ఎదిగేలా ప్రోత్సహించాలి. ప్రజల్లో రాజకీయాలపై పేరుకుపోయిన చెత్తను, భ్రమల్ని పోగొట్టాలి. క్షేత్రస్థాయిలో వీటిని ఆచరణలో అమలు చేయాలి. అలా సంస్కరించినప్పుడే రాజకీయాలు రేపటి తరానికి ఆదర్శవంతంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.. ఇలా జరిగినప్పుడే ధనంతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం ఒక సామాన్యుడు కూడా సమాజం కోసం పాటుపడతాడని, సేవ చేస్తాడనే విశ్వాసం పెరుగుతుంది. పార్టీలు సైతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే అర్హత సేవా గుణమే కానీ ధనం కాదని గుర్తిస్తే, సంపాదన కోసం కాదు సమాజ బాగు కోసమే రాజకీయాలు అన్నట్టుగా మారితేనే అవి నీతివంతమైన రాజకీయాలు అవుతాయి. వాటివల్ల రేపటి తరానికి మేలు జరుగుతుంది. ప్రజలకు కూడా సమన్యాయం, సామాజిక న్యాయం అందుతుంది. కావున రేపటి తరం నిలబడాలంటే ఎన్నికల తీరు పూర్తిగా మారాలి, అది పంచాయతీ ఎన్నికల నుండే ప్రారంభం కావాలి. ఆ దిశగా పాలకవర్గం క్షేత్రస్థాయిలో పలు సంస్కరణలు తీసుకురావాలి. అలా చేస్తేనే ఎన్నికల తీరు మారుతుంది. ప్రగతి వైపు నడుస్తుంది. రాగల్ల ఉపేందర్ (మాదిగ)
సామాజిక న్యాయమే 'విజన్ ' లక్ష్యం
మనతెలంగాణ/హైదరాబాద్: పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ ఆకాంక్ష అని, కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిదని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. కానీ, తనకు పేదరికం అంటే ఏమిటో తెలుసనీ, తాను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకొని వచ్చానని, తనకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతి పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన అని ఆయన తెలిపారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉందని, జల్, జంగిల్, జమీన్ అని కొమురంభీమ్ పోరాడిన గడ్డ ఇది అని, భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానిదని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోందని ఆయన అన్నారు. వాటిని అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు (రెండోరోజూ) కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను రూపొందించామన్నారు. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదని, నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయాలు తీసుకొని తయారు చేసిందని ఆయన తెలిపారు.విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందని, అందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని ఆయన అన్నారు. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్షంతో ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారని కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ కూడా లక్ష్యాలను నిర్ధేశించుకుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి యంగ్ఇండియా స్కిల్ యూనివర్శిటీని నిర్మిస్తున్నామని, 140 కోట్ల జనాభా ఉన్న దేశం గత ఒలింపిక్స్తో ఒక్క సర్ణపతకం గెలవలేకపోయిందని, అందుకే క్రీడాలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్ యూనివర్శిటీని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ స్పీచ్ అనంతరం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2025ను సిఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ విజన్ డాక్యుమెంట్ను రోబో సిఎం వద్దకు తీసుకురావడంతో అతిథులు ఆశ్చర్యపోయారు. రోబో చేతుల మీదుగా ఆ డాక్యుమెంట్ను అందుకున్న సిఎం దానిని ఆవిష్కరించారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే ‘విజన్’: ఉప ముఖ్యమంత్రి భట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించిందని కాదన్నారు. విస్తృత సంప్రదింపులు, అభిప్రాయాల తర్వాతే రూపకల్పన జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ దిక్సూచీ అని ఆయన చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిదన్నారు. సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యమన్నారు. తెలంగాణ విజన్ మార్గదర్శకంగా ఉంది: ఆనంద్ మహీంద్రా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దేశ భవిష్యత్ అని, తెలంగాణ విజన్ చాలా మార్గదర్శకంగా ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రత్యేక మార్గంలో దూసుకెళ్తోందన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించారని కితాబిచ్చారు. ప్రభుత్వం తరపున ఇండస్ట్రీ పూర్తి మద్దతు:మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ విభిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఇక్కడ ఉన్నారని, వారితో కలిసి వేదిక పంచుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇది కేవలం చిరంజీవికి వచ్చిన ఆహ్వానం మాత్రమే కాదనీ, మొత్తం సినీ ఇండస్ట్రీకి దక్కిన గౌరవమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కలలుగన్నట్లుగా హైదరాబాద్ను ప్రపంచానికి సినీ హబ్గా మార్చే ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతామన్నారు.
‘రష్యా అధినేత పుతిన్ ఢిల్లీ సందర్శించారు’ అని ఇది చారిత్రక యాత్ర అని జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వం, విశ్వనగరాలలో నివాసయోగ్యం కాని నగరం ఏదైనా ఉందా అంటే అది ఢిల్లీ అని పిల్లల దగ్గర నుంచి చాట్జిపిటి ఒకే సమాధానం చెబుతున్నారు. ఢిల్లీ, శనివారం నాడు మరోసారి విషజన్య వాయువు పొగతిమ్మడుతో మగ్గిపోయింది. నగరంలో వాయు ప్రమాణం 330 వద్ద నిలిచిపోయింది. ఇది ‘చాలా చెడు’ విభాగంలో ఉంటుందని సూచిస్తుంది. ఇది 24 గంటల సగటు ఎక్యుఐ గా నమోదయింది. ఢిల్లీ నగరంలో 40 వాయు గమన కేంద్రాల్లో 31 కేంద్రాలు ‘చాలా చెడు’ స్థాయిలో నమోదయ్యాయి. సిబిపిబి సమీర్ యాప్ ప్రకారం నెహ్రూనగర్ అతి పెద్ద ఎక్యుఐ స్థాయిని 369గా నమోదుచేసింది. శనివారం ఉదయం ఢిల్లీవాసులు మరోసారి గాలి కంటే చూర్ణమైన వాయు ద్రవ్యరాశిని తట్టుకున్నారు. ఉదయం 9 గంటలకు ఎక్యుఐ 335కి చేరుకుంది. మొత్తం 36 గమన కేంద్రాలు ‘చాలా చెడు’ స్థాయిలో ఉన్నాయి. ముంఢకా 387వరకు అత్యంత హానికరమైన గాలి నాణ్యతను నమోదు చేసింది. వాయు నాణ్యతపై ప్రభావం వరుసగా చాలా రోజులు దరిద్రంగా తయారైంది. సిబిపిబి ప్రకారం, 0-50 ఎక్యుఐ మంచి గా, 51-100 సంతృప్తికరమైనగా, 101-200 మోడరేట్గా, 201-300 చెడుగా, 301-400 చాలా చెడుగా, 401-500 తీవ్రమైనగా పరిగణించబడుతుంది. శనివారం రాత్రి, ఢిల్లీ వాయు నాణ్యత 330 వద్ద నమోదైంది. ఇది ఢిల్లీ గురించి తీవ్రమైన కాలుష్యాన్ని సూచిస్తుంది. వాయు నాణ్యత దిగజారడానికి అనేక కారణాలు ఉన్నాయని సమాచారం. ఢిల్లీ వాయు నాణ్యత నిర్వహణ కోసం నిర్ణయ సహాయ వ్యవస్థ ప్రకారం, రవాణా వాయు కాలుష్యానికి ప్రధాన కారణం కావడం గమనించబడింది. ఇది మొత్తం కాలుష్యలో 14.8% కంటే ఎక్కువ బాధ్యత వహిస్తుంది. దీనికి తరువాతి కారణాలు ఢిలీ, పరిసర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు (7.3%), గృహకాలుష్య మూలాలు (3.6%), నిర్మాణాలు (2%) అని గుర్తించబడ్డాయి. గత రెండురోజులు ప్రజారోగ్యపట్ల భయంకరమైన ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ఢిల్లీవాసుల ఆరోగ్యం తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కొంటున్నాయి. 2022, 2024 మధ్య ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,00,000కి పైగా ప్రాథమిక శ్వాసకోశ సంబంధిత రోగాల కేసులు నమోదయ్యాయి. ఈ గడువులో 30,000 మందికిపైగా ప్రజలు ఆసుపత్రిలో చేరినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పేర్కొంది. పార్లమెంట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఢిల్లీలో ఉన్న శ్వాసకోశ సంబంధిత కేసులు 2022లో 67,054, 2023లో 69,293, 2024లో 68,411 గా నమోదు అయ్యాయి. 2025 నవంబర్ నాటికి లక్ష దాటినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనికి తోడు చల్లని వాతావరణం ఢిల్లీని మరింత ఇబ్బందిపెడుతోంది. పరిసర వాతావరణం కూడాఢిల్లీని బాధిస్తోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీ నూతన సంవత్సరానికి ముందు చల్లని ఉదయం గమనించింది. బుధవారం 5.6 డిగ్రీల సెల్సియస్ (3.9 డిగ్రీలు సాధారణం కంటే తక్కువ) నమోదైంది. వాతావరణం కారణంగా ఢిల్లీ వాయు నాణ్యత మరింత దిగజారిపోయింది. శనివారానికి వాయు నాణ్యత ఇంకా పడిపోయింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి, వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి తోడ్పడుతుంది. వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే పియం 2.5, పియం 0.5 వంటి చక్కటి రేణువుల హానికరమైన పదార్థాలను కలిగి ఉంది. ఎసిలు, రిఫ్రిజిరేటర్లు విపరీతంగా వాడడం వలన క్లోరోఫ్లోరో కార్బన్లు, ద్రావకాలు, రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే వాయువుల ద్వారా ఓజోన్ పొరను నాశనం చేసి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు సాంద్రత పెరగడం వల్ల గ్రీన్హౌస్ ప్రభావం వాతావరణంలో పర్యావరణ విధ్వంసం సమస్యగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీని పాలిస్తున్న ప్రభుత్వాలు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చూపాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు ప్రభుత్వాలు, పరిశ్రమలు, మీడియా, ప్రజల సహకారం అవసరం. డా. ముచ్చుకోట సురేష్ బాబు 9989988912
‘విజన్’ సాకారానికి పది సూత్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ‘తెలంగాణ మీన్స్ బిజినెస్’ పేరుతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2025ను రూపొందించారు. 10 కీలక వ్యూహాలతో దీనికి రూపకల్పన చేయడంతో పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో కోర్, ప్యూర్, రేర్, మూడు ట్రిలియన్ల వృద్ధి, మూడంచెల తంత్రంతో దీనిని తయారు చేశారు. అన్ని జిల్లాల నుంచి దాదాపు 4 లక్షల మంది ఆకాంక్షలు, అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్ను రూపొందించారు. 65 శాతం యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పనలో పాలుపంచుకోగా మొత్తం ఇందులో 83 పేజీలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ డాక్యుమెంట్ను రూపొందించారు. ఈ డాక్యుమెంట్లో క్యూర్, ఫూర్, రేర్ జోన్లుగా తెలంగాణను విభజించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్షంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్కు రూపకల్పన జరిగింది. అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సలహాలకు ఈ డాక్యుమెంట్లో ప్రాధాన్య ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ తయారీలో నీతిఅయోగ్ కీలక భూమిక నిర్వహించింది. ఐఎస్బి (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు. లక్ష్య సాధనకు మూడు సూత్రాలు ఇలా... ఆర్థిక వృద్ధి: ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం. సమ్మిళిత అభివృద్ధి: యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడటం. సుస్థిర అభివృద్ధి: అన్ని రంగాల్లో సుస్థిరతను పొందుపరచడం, 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం. మూడు ఉత్ప్రేరకాలు ఇలా.. సాంకేతికత అండ్ ఆవిష్కరణ: పాలన, పరిశ్రమ, సేవల్లోఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం. సమర్థవంతమైన ఆర్థిక వనరులు: పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించడం. సుపరిపాలన: పారదర్శక, జవాబుదారీ, పౌర-కేంద్రీకృత పాలనను అందించడం. మూడంచెల వ్యూహం ఇలా: తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని మూడు విభిన్న, రంగాల వారీగా మూడు జోన్లుగా విభజించడం. అభివృద్ధి ప్రామాణికంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ విధానం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేస్తుంది. క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ):160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ప్రాంతం వల్ల సేవల విస్తరణకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతోపాటు నెట్-జీరో సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్, ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది. ఫ్యూర్ (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ల మధ్య ఉన్న జోన్ తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్లు ఏర్పాటు చేయవచ్చు. రేర్ (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ): ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతంతో వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు.---- ఈ దార్శనికతను సాధించడానికి 10 కీలక వ్యూహాల డాక్యుమెంట్ ప్రస్తావించింది. 10 కీలక వ్యూహాల డాక్యుమెంట్లు ఇలా... 10 కీలక వ్యూహాల డాక్యుమెంట్లో భాగంగా మొదటగా తెలంగాణ సమతుల్య అభివృద్ధికి క్యూర్, ఫ్యూర్, రేర్ నమూనాతో ముందుకెళ్లడం. విచక్షణ నుంచి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం. గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజనల్ రింగ్ రోడ్డు, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులను చేపట్టడం. సమర్ధ పాలన: డిజిటల్ గవర్నమెంట్, టీ ఫైబర్, స్పీడ్ వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం. నాలెడ్జ్ హబ్: ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం. సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అందరికీ సమాన అవకాశాలు. అభివృద్ధికి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం. పర్యావరణం, సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం. సంస్కృతి: రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం. ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడుల ప్రవాహాం కొనసాగింది. రెండో రోజు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు జరిపారు. ఈ నేపథ్యంలోనే సి ఎం బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భగా పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. రెండోరోజూ 2 లక్షల 96 వేల 995 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీ య సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నా యి. మొదటి రోజు 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందా లు జరగ్గా మొత్తం ఈ రెండు రోజులు కలిపి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ప లు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. ఇన్ఫ్రాకీ డిసి పారక్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం తో భారీ డేటా పార్క్ అభివృద్ధి చేసేందుకు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడానికి ముందుకొచ్చింది. జెసీకే ఇన్ఫ్రా ప్రా జెక్ట్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏజిపి గ్రూప్ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) టీకాలు, పరిశోధన-అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడిని ప్రకటించింది. గ త పెట్టుబడితో కలిపి మొత్తం రూ.4 వేల కోట్లను రాష్ట్రంలో పెట్టనుం ది. దీనివల్ల 3 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఫెర్టిస్ ఇండి యా ప్రైవేటు లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో అధునాతన ఆహార -వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి రూ.200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు. హెట్రో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి మంది వరకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ కన్యూమర్ ప్రోడక్ట్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే యూనిట్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది. ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600 కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్ కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ చేపట్టి 3 వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించనున్నారు. హెట్రో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9 వేలకి పైగా ప్రత్యక్ష-పరోక్ష ఉద్యోగాలు సృష్టించనున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడితో 2,500-3 వేల మందికి ఉపాధి కల్పించనుంది. భారత్ బయోటెక్ రూ.1,000 కోట్ల పెట్టుబడి భారత్ బయోటెక్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీంతో 200లకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆహార-పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 1,551 మందికి ఉపాధి లభించనుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. డెయిరీ వ్యాపారాన్ని విస్తరించడానికి గోద్రెజ్ ఆసక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గోద్రెజ్ జర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మిల్క్, ఎఫ్ఎమ్సీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి గోద్రెజ్ సంస్థ ఆసక్తి చూపింది. రాష్ట్రంలో తమ డెయిరీ వ్యాపారాన్ని (రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం) రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే ప్రతిపాదనపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 40 ఎకరాల భూమి అవసరం కానుండగా 2 సంవత్సరాల్లో 300 ప్రత్యక్ష ఉద్యోగాలను ఈ సంస్థ కల్పించనుంది. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ ఎంఓయూతో 60వేల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ లో 60 వేల ఉద్యోగాలు సృష్టిస్తామని యూనివర్సిటీ సీనియర్ వైస్ ఛాన్స్లర్ అనంత శేఖర్ తెలిపారు. మొదటగా హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రంలోని 13 జిల్లాలకు విస్తరిస్తామని ఆయన ప్రకటించారు. పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులు పర్యాటక రంగంలోనూ రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులు తెలంగాణకు రానున్నాయి. దీంతో ప్రత్యక్షంగా 10 వేల మందికి పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఫుడ్ లింక్ ఎఫ్అండ్బి హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ - రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డ్రీమ్వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్ - రూ.1,000 కోట్లతో నిర్మించనున్నారు. సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు) - రూ.800 కోట్లు, కేఈఐ గ్రూప్ (కామినేని గ్రూప్) - రూ.200 కోట్లు, పోలిన్ గ్రూప్ (టర్కీ), మల్టీవర్స్ హోటల్స్ - రూ.300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్) - రూ.300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ - రూ.300 కోట్లు, రిధిరా గ్రూప్ - రూ.120 కోట్లు, సలామ్ నమస్తే దోసా హట్ (ఆస్ట్రేలియా), విశాఖ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ - ఐఫా ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్ల భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి రూ.550 నుంచి -600 కోట్ల ఆర్థిక లాభం చేకూరనుంది. టిడబ్ల్యూఐ గ్రూప్ ప్రపంచంలోనే తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోట్బాక్ తయారీ కేంద్రం తెలం గాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ.1,100 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ కంపెనీ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్ర రూ.500 కోట్ల పెట్టుబడి మహీంద్రా అండ్ మహీంద్ర జహీరాబాద్ యూనిట్ విస్తరణకు నాలుగేళ్లలో రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఇండియా ఎక్స్ ట్రీమ్ అడ్వెంచర్ 20 ఎకరాల్లో ఎక్స్ ట్రీమ్ స్పోర్ట్, అడ్వెంచర్, ఈ- స్పోర్ట్ అరేనా. మొత్తంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. బయోవరం టిష్యూ ఇంజనీరింగ్, రెజెనరేటివ్ మెడిసిన్, సెల్-జీన్ థెరపీకి ప్రత్యేక కేంద్రం రూ. 250 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. జ్యూరిక్ ఇన్షూరెన్స్ ఇండియాలో తొలి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి) కోసం హైదరాబాద్ను ఎంపిక చేసుకుంది. మూడేళ్లలో దశలవారీగా దీనిని విస్తరించనున్నారు. కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (సిఐబిసి) తమ తొలి భారతీయ జిసిసిని హైదరాబాద్లో స్థాపించనుంది. హైదరాబాద్ను గ్లోబల్ ఇంజినీరింగ్-సైబర్ హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్క్యంగా పేర్కొంది. మాక్సిమస్ (అమెరికా) గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ-ఆపరేషన్స్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. శాటిలైట్ స్పోర్ట్ సిటీని అభివృద్ధి చేయనున్న జీఎంఆర్ స్పోర్ట్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా శాటిలైట్ స్పోర్ట్ సిటీని జీఎంఆర్ స్పోర్ట్ అభివృద్ధి చేయనుంది. అనలాగ్ ఏఐ (అలెక్స్ కిప్మాన్) హైదరాబాద్లో గ్లోబల్ పరిశోధన- ప్రోటోటైపింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆల్ట్ మిన్ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ కేంద్రం ప్రతిపాదించింది. అజయ్ దేవగన్ ఫిల్మ్ స్టూడియోలో స్టూడియోలు, విఎఫ్ ఎక్స్, వర్క్ షాప్లు వంటి ఫిల్మ్ ఎకో సిస్టమ్ను పిపిపి మోడల్లో అభివృద్ధి చేయనున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకావాలు పెరగ నున్నాయి. తెలంగాణ,- యూఏఈ, -ఆఫ్రికా పెట్టుబడి భాగస్వామ్యాల కోసం చర్చించారు. బహుళరంగ పెట్టుబడి డెస్క్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకునేందుకు పరిశీలించారు. బ్లాక్స్టోన్ ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ స్పేస్లోలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. సత్త్వ గ్రూప్ సమగ్ర పట్టణ అభివృద్ధి, స్టూడెంట్- సీనియర్ లివింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. బ్రిగేడ్ గ్రూప్ సమగ్ర టౌన్షిప్ ప్రతిపాదనపై చర్చించారు. ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్ మెంట్పై ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. సుమధుర గ్రూప్ కొత్త టౌన్షిప్, మధ్యతరగతి నివాస సముదాయాల ప్రతిపాదిం చింది. విజ్జీ హోల్డింగ్స్ మల్టీ-ఒమిక్స్, డిజిటల్ ట్విన్, ప్రిసిషన్ హెల్త్ పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదించారు. -- 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ 2026లో ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు ఫీఫా ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్ హాకీ హబ్ గా మార్చేందుకు హాకీ మహిళల వరల్ కప్ క్వాలిఫైయర్ 2026ను 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ 2026లో నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2026 ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం కానుంది. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తా స్క్రిఫ్ట్తో వస్తే సినిమా పూర్తి చేసుకొని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పెద్దలకు భరోసా ఇచ్చారు. ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2025 సదస్సు సందర్భంగా ఆయన మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీకి వచ్చారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు రితేష్- జెనీలియా దంపతులు, అక్కినేని అమల, నటుడు రాహుల్ రవీంద్రన్ పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి వారితో స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సిఎం వివరించారు. 24 క్రాఫ్ట్ సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సినీ పెద్దలు సిఎం రేవంత్కు సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ, సహకారాలు ఉంటాయని సిఎం రేవంత్ తెలిపారు.
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను కొనసాగేలా చూడాలని రాష్ట్ర ప్ర భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకో ర్టు సూచించింది. సర్ ప్రక్రియలో భాగమైన బూత్లెవెల్ అధికారులు (బిఎల్ఒ), ఇతర అధికారులు పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బెదిరింపుల కు గురవుతుండడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించాలని ఆదేశించింది. లేకపోతే అరాచకం అ వుతుందని హెచ్చరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం చీఫ్జస్టిస్ సూ ర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బగ్చీ నేతృత్వం లో ని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అ త్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బిఎల్ఓలకు బెదిరింపులు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే, వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరించాలని పేర్కొంది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల రక్షణ కల్పించడానికి నిరాకరిస్తే స్తానిక పోలీసులను డిప్యుటేషన్ పై తీసుకోవలసి వస్తుందని, అప్పటికీ పరిస్థితి మారకుంటే కేంద్ర బలగాలను రప్పించ వలసి వస్తుందని ఎన్నికల సంఘం తరపున కోర్టుకు హాజరైన ద్వివేది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ సనాతని సంగ్సాద్ , ఇతరుల తరఫున సీనియర్ న్యాయవాది వి. గిరి హాజరయ్యారు. బిఎల్ఒలపై దాడులు , బెదిరింపులు జరగకుండా వారికి రక్షణ కల్పించేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రెండో విడత ఎన్నికల ప్రచా రం 12న, మూడో విడత ప్రచారం ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటల ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) తెలిపింది. ప్రచారం ముగిసిన తర్వాత బ హిరంగ సమావేశాలు, ఎలక్ట్రానిక్ మీడి యా, రేడియోలలో ప్రచారం నిర్వహించ డం పూర్తిగా నిషేధం అని ఎస్ఇసి కార్యద ర్శి ఎం.మకరందు తెలిపారు. పోలింగ్కు 44 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తెలిపారు. మొదటి విడత లో 4,236 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు ఎ న్నికలు జరుగనున్నాయి. ఈనెల 11వ తేదీ న పోలింగ్ 189 మండలాలలో 37,562 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 27 నుంచి 29 వరకు తొలి విడత పోలింగ్కు నామినేషన్లు స్వీకరించారు. తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు 395 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 13,127 అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 37,440 వార్డు స్థానాలకు 67,893 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. మొదటి విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 27,41,070 మంది, మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయనుండగా.. తిరిగి 11న సాయంత్రం తెరుచుకోనున్నాయి.
భారత్లో మైక్రోసాఫ్ట్ బి.డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ చైర్మన్, సిఇఒ సత్య నాదెళ్ల మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అనంతరం భారత్కు 17.5 బిలియన్ డాలర్ల (రూ.1.58 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఆసియాలో ఇప్పటివరకు చేసిన అతిపెద్ద పెట్టుబడిగా ఇది గుర్తిం పు పొందింది. భారతదేశం ఎఐ ఆధారిత భవిష్యత్తు దిశగా ముందుకెళ్లేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం నాదెళ్ల సోషల్ మీడియా లో ధన్యవాదాలు తెలుపుతూ ఈ పెట్టుబడిని అ ధికారికంగా ప్రకటించారు. 2026 నుండి 2029 వరకు నాలుగు సంవత్సరాల కాలంలో ఈ నిధులు క్లౌడ్, కృత్రిమ మేధస్సు రంగాల్లో వి నియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ పెట్టుబడి విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, సార్వభౌమ సాంకేతిక సామర్థ్యాలు వంటి మూడు ప్రధాన కేంద్రీకరణ రంగాలపై దృష్టి పెడుతుం ది. హైదరాబాద్లో ఏర్పాటవుతున్న ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్ 2026 మధ్య నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దేశంలోనే అతి పెద్ద హైపర్స్కేల్ డేటాసెంటర్ ప్రాం తంగా ఉండనుంది. అదనంగా చెన్నై, హైదరాబాద్, పుణెలలోని మూడు ప్రస్తు త డేటా సెంటర్ ప్రాంతాలూ విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల పని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎఐ అభివృద్ధికి దోహదపడుతోందని సంస్థ వెల్లడించింది.
` వారు ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం ` అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ` సీడీఎఫ్గా బాధ్యత స్వీకరణ అనంతరం మునీర్ ప్రసంగం …
` భారత్పై మళ్లీ సుంకాలకు ట్రంప్ రెడీ? న్యూయార్క్(జనంసాక్షి):ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్- అమెరికా చర్చలకు సిద్ధమవుతుండగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ నుంచి …
వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు
` ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై మోదీ ` ఎంత పెద్ద సంస్థ అయినా సహించేది లేదు ` ఇండిగోకు కేంద్రం స్ట్రాంగ్ మెసేజ్ ` …
` సర్వీసులు సాధారణ స్థితికి ` సీఈఓ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని రోజులుగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ …
` ప్రక్రియ కొనసాగాల్సిందే ` రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్(జనంసాక్షి):ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సవరణను …
ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ
` ఈసీని బీజేపీ కబ్జాచేసింది ` లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంస్కరణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో …
` సమ్మిట్లో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ` క్యూ కట్టిన కార్పొరేట్ కంపెనీలు ` రెండు రోజుల్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు ` ఫుడ్ …
బుధవారం రాశి ఫలాలు (10-12-2025)
మేషం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. వృషభం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల ఉండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిధునం అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సహాయసహకారాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కర్కాటకం ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సింహం వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కన్య ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తుల ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వృశ్చికం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ధనస్సు మాతృ వర్గ బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మకరం సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుంభం వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. మీనం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో సన్నిహితుల స్నేహితుల సలహాలు కలిసివస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
10 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
గ్లోబల్ సమ్మిట్లో భారీ డ్రోన్ షోకు గిన్నిస్ రికార్డు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు..
ఆంధ్రప్రభ, విజయవాడ : పెట్టుబడులు తీసుకురావడంలో పోటీపడుతూ దేశంలోనే శరవేగంగా ఏపీ, తెలంగాణ
కటక్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా సంచలన విజయంతో
ఐపీఎల్ 2026 మినీ వేలం.. బరిలో 350 మంది క్రికెటర్లు
అబుదాబి వేదికగా డిసెంబర్ 16న జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మినీ వేలం పాటలో 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఐపిఎల్ వేలం పాట కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా నుంచి బిసిసిఐ ఏకంగా 1005 మంది క్రికెటర్ల పేర్లను తొలగించింది. అబుదాబిలో జరిగే వేలం పాటలో 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఐపిఎల్ మినీ వేలం అబుదాబిలో జరుగుతుందని బిసిసిఐ ఆయా ఫ్రాంచైజీలకు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు మెయిళ్లను పంపించింది మొదట బిడ్డిం ప్రక్రియ, బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్ కీపర్లు/బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా వేలం పాట కొనసాగనుంది. తొలుత క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభమయ్యే ఆక్షన్ తర్వాత అన్క్యాప్ట్ ఆటగాళ్ల వేలంతో ముగుస్తోంది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు
తొలి, మూడో విడత పోలింగ్ జరిగే గ్రామాలలో సెలవులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు వరుస సెలవులు లభించనున్నాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తుండటంతో, ప్రభుత్వం పలు దఫాలుగా సెలవులు ప్రకటించింది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సుమారు ఆరు రోజుల పాటు విరామం దొరకనుంది. తొలి విడత పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్ల కోసం డిసెంబర్ 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనుండగా, ఆ రోజులు రెండో శనివారం, ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు సాధారణ సెలవులుగానే ఉన్నాయి. మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలింగ్ సామగ్రిని సిద్ధం చేయడం, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Pension Cyber scam: నకిలీ బ్యాంకు అఫ్ బరోడా ప్రకటనతో రిటైర్డ్ Bank of Baroda ఉద్యోగి ఖాతా కి చిల్లు
Mehdipatnamలో 81 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు Bank of Baroda లోగోతో వచ్చిన ప్రకటనే మోసానికి కారణం
11న టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా
ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 11న ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టిఆర్టిఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డిలు తెలిపారు. టిఆర్టిఎఫ్, ఎపిటిఎఫ్ (1938), ఐఫియా ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన విద్యా విధానం 2010 నిబంధనలో ఇన్ -సర్వీస్ టీచర్లకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. 2017లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా 2010కి ముందున్న వారిని కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. భారత్ ఘన విజయం
తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా జట్టు కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 101 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఓపెనర్ డిక్వాక్ డకౌటయ్యాడు. ఆది నుంచే టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తూ సౌతాఫ్రికాను కోలుకోకుండా దెబ్బ తీశారు.సౌతాఫ్రికా బ్యాటర్ లో బ్రేవిస్(22 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా టాప్ అర్డర్ బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 12.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 74 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. పాండ్యా, దూబేలు చెరో ఒక వికట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీలో 1-0తో ఆధిక్యం సాధించింది.
గిన్నీస్ రికార్డు లో గ్లోబల్ సమ్మిట్ డ్రోన్ షో
భారత్ ఫ్యూచర్ సిటిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రోన్ షో గిన్నీస్ రికార్డుల్లోకెక్కింది. తెలంగాణ రైజింగ్..కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాల సమూహంతో డ్రోన్ షో నిర్వహించారు. ఈ డ్రోన్ షోలో తెలంగాణ రైజింగ్ 2047 లక్షాలను వివరించే విధంగా థీమ్లను ప్రదర్శించారు. మూడు వేల డ్రోన్లతో థీమ్ షో అతిధులను మైమరపింప చేసింది. మూడు వేల డ్రోన్లతో షో నిర్వహించడం ప్రపంచ రికార్డుగా గిన్నీస్ రికార్డులో నమోదు చేసి, గిన్నీస్ సంస్థ ప్రతినిధులు అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఇప్పటి వరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవయిన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అబుదాబీ పేరిట ఉంది. ఈ సంవత్సరం (2025) నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2,131 డ్రోన్లతో హ్యాపీ న్యూయర్ అనే వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డు అందుకుంది. అంతకు మించిన సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో నిర్వహించిన అద్భుతమైన డ్రోన్ షో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని గగనతలంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డును అధిగమించింది.
ఛాంపియన్: మనసుని హత్తుకునేలా ‘సల్లంగుండాలే...’ సాంగ్
ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ సల్లంగుండాలే రిలీజ్ చేశారు. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించినప్పుడు కుటుంబం మొత్తం, గ్రామం వివాహ వేడుకల ప్రారంభాన్ని ఈ సాంగ్ అద్భుతంగా చూపించింది. ఈ పాటతో మిక్కీ జె మేయర్ మ్యాజిక్ సృష్టించాడు. సల్లంగుండాలే భావోద్వేగం, వేడుక రెండింటినీ కలిగి ఉన్న మరొక అద్భుతమైన పాట. చంద్రబోస్ సాహిత్యం, వివాహంలో జరిగే ప్రతి ఆచారం, భావోద్వేగాన్ని అందంగా చూపించింది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన వధువు తల్లిదండ్రులుగా ఆకట్టుకోగా, రోషన్, అనశ్వర రాజన్ జోడి డ్యాన్స్ తో పాటకు ఉత్సాహాన్ని తెస్తారు. సల్లంగుండాలే సాంగ్ ప్రతి వివాహ వేడుకలో మ్రోగబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆస్తి వివాదాలతోనే రియల్టర్ హత్య
సంచలనం సృష్టించిన రియల్టర్ హత్య కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆస్తి వివాదాలు, పాతకక్షలతోనే రియల్టర్ గంటా వెంకటరత్నంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్లో వెంకటరత్నంను ఆరుగురు యువకులు సోమవారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. ఎపిలోని విజయవాడకు చెందిన వెంకటరత్నం ధూల్పేట్కు చెందిన సుదేష్ సింగ్ వద్ద డ్రైవర్గా పనిచేసేవాడు. సుదేష్ సింగ్ గంజాయి, గుండుంబా, రౌడీయిజంతో నగరంలోని పలువురిని బెదిరిస్తూ డాన్గా ఎదిగాడు. ఇలా పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు, ఇలా వచ్చిన డబ్బులను తన వద్ద పనిచేస్తున్న బినామీల పేర్లపై ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అందులో వెంకటరత్నం పేరుపై కూడా వందల కోట్ల ఆస్తులు పెట్టినట్లు తెలిసింది. 2001లో సుదేష్ సింగ్ను ఎన్కౌంటర్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయిన వెంకటరత్నం నగర శివారులో ఉంటున్నాడు. సుదేష్ సింగ్ తనను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తాడని ముందుగానే తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సుదేష్ సింగ్ ఆచూకీ కోసం ఎంత వెతికినా పోలీసులకు దొరకకపోవడంతో వెంకటరత్నంపై ఒత్తిడి చేసి ఆచూకీ తెలుసుకున్నట్లు తెలిసింది. తర్వాత సుదేష్ సింగ్ను పట్టుకన్న పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో వెంకటరత్నం సుదేష్ సింగ్ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జవహర్ నగర్లో భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. వెంకటరత్నం వల్లే సుదేష్ సింగ్ ఆచూకీ పోలీసులకు తెలిసిందని, అంతేకాకుండా తన పేరుపై ఉన్న ఆస్తులు సుదేష్ సింగ్ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పారిపోవడంతో వారు వెంకటరత్నంపై కక్ష పెంచుకున్నారు. అప్పటి నుంచి వెంకటరత్నం ఆచూకీ కోసం నగరంలో చాలా ఏళ్ల నుంచి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటరత్నం ఉంటున్న ఏరియా గురించి ఇటీవలే సుదేష్ సింగ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. రెక్కీ నిర్వహించిన సుదేష్ సింగ్ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఆటోలో నలుగురు, బైక్పై ఇద్దరు వచ్చారు. వెంకటరత్నం ఇంటి నుంచి కూతురిని తీసుకుని పాఠశాలకు వెళ్లి, తిరిగి వస్తుండగా రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టి కిందపడేశారు. వెంటనే తుపాకీతో కాల్చి, కత్తులతో పొడిచారు, తలపై బండరాయి వేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు నిందితులు హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో వారిని రాచకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. స్పందించిన రైల్వే శాఖ !!
బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ) : చారిత్రక వైభవాన్ని కలిగిన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ దుస్థితిపై
ఇండిగో సేవలు గాడిన పడుతున్నాయి..ఇండిగో సీఈఒ
ముంబై : దేశీయ విమాన సంస్థ ఇండిగో సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకుందని ఆ సంస్థ సీఈఒ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో సంస్థలో తలెత్తిన ఇబ్బందుల వల్ల , అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వేల మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ విషయమై సీఈఒ క్షమాపణలు కోరారు. ఇండిగో విమాన సర్వీసుల్లో ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని పీటర్ హామీ ఇచ్చారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో విమానయాన సిబ్బంది అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రయాణికులే తమ తొలి ప్రాధాన్యమని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత కొన్ని రోజులుగా విమానసర్వీసులు రద్దవడంతో ఇప్పటికే లక్షలాది మంది ప్రయాణికులకు రీఫండ్ చెల్లింపు పూర్తి చేశామని , అలాగే సదరు ప్రయాణికుల లగేజీ కూడా వారి నివాసాలకు చేరవేశామని తెలిపారు. మిగిలిన మరికొన్ని బ్యాగేజీలనూ త్వరలోనే ఆయా ఇళ్లకు చేర్చడానికి తగిన ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. తీవ్ర ఇబ్బందుల నడుమ డిసెంబర్ 5న 700 ఫైట్లను మాత్రమే నడప గలిగామని, అయితే సోమ,మంగళవారాల్లో పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో మొత్తం 1800 విమానాలను అందుబాటు లోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం 138 గమ్యస్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
సాగు–తాగునీటికి మొదటి ప్రాధాన్యతనిస్తా…
పెద్దపల్లి జిల్లా, ధర్మారం (ఆంధ్రప్రభ) : ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్
ఈసారి సంక్రాంతికి టఫ్ ఫైట్.. బరిలో మరో యంగ్ హీరో
చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజవరగమనతో బ్లాక్బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇక మేకర్స్ 'నారి నారి నడుమ మురారి' సినిమా ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుందని ప్రకటించారు. ప్రీమియర్ షో సమయం - సాయంత్రం 5:49 అని మేకర్స్ తెలియజేశారు. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి. కానీ మొదటిసారిగా ఈ సినిమా సాయంత్రం రిలీజ్ ని ఎంచుకుంటోంది. ముహూర్తం ఇంత త్వరగా ఖరారు కావడం టీమ్ ఖచ్చితమైన ప్లానింగ్ని తెలియజేస్తోంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో శర్వా స్టైలిష్గా కనిపిస్తూ, మెడలో పూల హారంతో నిల్చున్నారు. సంయుక్త ఆవేదనతో నిండిన లుక్లో కనిపిస్తే, సాక్షి వైద్య స్వచ్ఛమైన చిరునవ్వుతో ఫ్రేమ్కి ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది.
సూపర్హిట్ సినిమాకు సీక్వెల్.. #telugupost #rajinikanth #narasimha #trendingshorts
ఐపిఎల్ వేలం బరిలో 350 మంది క్రికెటర్లు!
ముంబై: అబుదాబి వేదికగా డిసెంబర్ 16న జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మినీ వేలం పాటలో 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఐపిఎల్ వేలం పాట కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా నుంచి బిసిసిఐ ఏకంగా 1005 మంది క్రికెటర్ల పేర్లను తొలగించింది. అబుదాబిలో జరిగే వేలం పాటలో 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఐపిఎల్ మినీ వేలం అబుదాబిలో జరుగుతుందని బిసిసిఐ ఆయా ఫ్రాంచైజీలకు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు మెయిళ్లను పంపించింది మొదట బిడ్డిం ప్రక్రియ, బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్ కీపర్లు/బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా వేలం పాట కొనసాగనుంది. తొలుత క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభమయ్యే ఆక్షన్ తర్వాత అన్క్యాప్ట్ ఆటగాళ్ల వేలంతో ముగుస్తోంది.
రసవత్తరంగా ఉట్నూర్ పంచాయతీ ఎన్నిక..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికల
Balotsavam |అదరహో అమరావతి బాలోత్సవం…
Balotsavam | అదరహో అమరావతి బాలోత్సవం… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎప్పుడెప్పుడా
6 ఎయిర్ పోర్టుల నుంచి 422 ఇండిగో విమానాలు రద్దు
ముంబై : ఇండిగో సంస్థ మంగళవారం ఆరు ఎయిర్పోర్టుల నుంచి 422 విమానసర్వీసులను రద్దు చేసింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 152,బెంగళూరు నుంచి 121,హైదరాబాద్ నుంచి 58, ముంబై నుంచి 41, చెన్నై నుంచి 50 విమానసర్వీసులు రద్దయ్యాయి. ఇదిలా ఉండగా, శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూళ్లలో 10 శాతం కోత విధిస్తున్నట్టు డీజేసీఎ ప్రకటించింది.
From Films to Future Tech: Key Highlights of Telangana Rising Global Summit
Telangana is preparing for one of its most ambitious phases of development. At the Telangana Rising Global Summit, Chief Minister Revanth Reddy announced wide-ranging plans that aim to transform the state’s film industry, digital infrastructure and investment landscape. A Fresh Start for the Film Industry & As a Leading Film Destination During an exclusive interaction […] The post From Films to Future Tech: Key Highlights of Telangana Rising Global Summit appeared first on Telugu360 .
గత వారం డిసెంబర్ 5న రావాల్సిన ’అఖండ 2’ విడుదల ఆగిపోవడంతో నందమూరి అభిమానులు ఎంత నిరాశకు గురయ్యారో అందరికీ తెలిసిందే. సరిగ్గా ప్రీమియర్స్ పడాల్సిన సమయంలో బ్రేక్ పడటంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడినట్లయింది. అయితే ఇప్పుడు సమస్యలు ఓ కొలిక్కి రావడంతో మేకర్స్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, వారం తిరక్కముందే డిసెంబర్ 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించు కున్నారని తెలిసింది. ఈరోస్ ఇంటర్నేషనల్, - 14 రీల్స్ ప్లస్ మధ్య సమస్యలు ఉండటంతో ‘అఖండ 2’(Akhanda 2) చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారమవడంతో ఈ సినిమా విడుదలకు సిద్ధమైందని సమాచారం. ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్సులు, డిస్ట్రిబ్యూటర్ల పెండింగ్ చెల్లింపులు పూర్తయితే ‘అఖండ 2’ని డిసెంబర్ 12న గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలిసింది. డిసెంబర్ 11న పెయిడ్ ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపు కోసం కూడా టీమ్ మరోసారి దరఖాస్తు చేసిందట. ఇక గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
బౌండరీలతో విరుచుకుపడిన పాండ్యా.. దక్షిణాప్రికా టార్గెట్ ఎంతంటే?
భారత్ టాపార్డర్ చేతులెత్తేసిన వేళ హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చి రాగానే భారీ సిక్సులతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ మంచి స్కోరు సాధించింది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(23) కూడా వెనుదిరగాడు. దీంతో టీమిండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో పాండ్యా, శివమ్ దూబే(23)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధనా ధన్ బ్యాటింగ్ తో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. పాండ్యా 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక, చివర్లో జితేష్ శర్మ 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియా జోరు #sarpanchelections #telugupost #socialmedia
ఎసిబి వలలో సివిల్ సప్లై అధికారి
రేషన్ డీలర్ వద్ద లంచం తీసుకుంటూ ఓ సివిల్ సప్లై అధికారి ఎసిబి వలలో చిక్కారు. రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ నాయక్ అవినీతి నిరోధక శాఖ ట్రాప్లో పడ్డారు. షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఓ రేషన్ డీలర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసిబి అధికారులు వెల్లడించారు. పిడిఎస్ రైస్కు సంబంధించిన కేసు క్లియరెన్స్ విషయంలో బాధితుడి వద్ద జిల్లా సివిల్ సప్లై విభాగం డిటి రవీందర్ నాయక్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసిబి తెలిపింది. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసిబి అధికారులు ప్రజలకు సూచించారు.
ఎసిబికి పట్టుబడ్డ వెల్దండ విద్యుత్ ఇన్ఛార్జి ఏఈ
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల విద్యుత్ ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేశ్వర్లు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎసిబి డిఎస్పి జగదీష్ చందర్ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వెల్దండ మండల కేంద్రం పరిధిలోని చొక్కన్నపల్లి గ్రామ సమీపంలోని ఓ ఫామ్ హౌజ్లో విద్యుత్ మీటర్ ఏర్పాటు కోసం విద్యుత్ ఏఈ రూ. 20 వేలు డిమాండ్ చేయగా ఫిర్యాదు దారుడు రూ. 15 వేలకు ఒప్పందం కుదుర్చుకొని ఫామ్ హౌజ్లో నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలిపి వెల్దండ విద్యుత్ సబ్ స్టేషన్కు తరలించారు. ఫిర్యాదుదారుడు ఈనెల 5వ తేదీన ఎసిబి అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పూర్తి స్థాయి ఆధారాలతో దాడులు నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నట్లు ఎసిబి డిఎస్పి పేర్కొన్నారు. ఇదే సమయంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో గల ఏఈ నివాసంలో మరొక బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిబి డిఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనులు చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి సమాచారం అందజేయాలని ఏసిబి డిఎస్పి సూచించారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటామని పేర్కొన్నారు.
ఆశీర్వదించండి… అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా
ఆలేరు, ఆంధ్రప్రభ : ఒక్కసారి ఆశీర్వదించండి… అభివృద్ధినే ధ్యేయంగా చేసుకుని పనిచేస్తాను అని

20 C