డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఇక అంత సులభం కాదు
ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి ఎల్ఎల్ఆర్కు ముందు దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో రాయాలి ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు ఆరు మాడ్యుల్స్తో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహణ రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ సర్కార్ నిర్ణయం మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్డు భద్రతపై రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్పై అవగాహన లేకుండా ప్రమాదాలకు కారణమవుతున్న వారిని తగ్గించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు రవాణా శాఖ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఇక మీదట డ్రైవింగ్ లైసెన్సు పొందడం అనుకున్నంత సులభం కాదని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ పరీక్ష ఏదో రకంగా చేసి లైసెన్సుతో బయటపడుతూ వచ్చారు. ఇక మీదట అటువంటి వాటికి చెక్పెడుతూ రవాణా శాఖ లైసెన్సుల జారీలో కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఎల్ఎల్ఆర్ దరఖాస్తు చేసే ముందే ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో విజయం సాధించాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాల నివారణ, డ్రైవింగ్ నిబంధనల పట్ల చైతన్యం తీసుకురావడం వంటి ప్రమాణాలను పాటించేందుకు వీలుగా ఈ కొత్త ఎంట్రీ లెవెల్ పరీక్షను నిర్వహించేందుకు రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో విజయం సాధించిన తర్వాతే ఎల్ఎల్ఆర్కు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందో, అది ఉత్తీర్ణత అయిన తర్వాత డ్రైవింగ్ టెస్టుకు వెళ్లడం ఉత్తీర్ణత కావడం జరుగుతుంది. కొత్తగా ప్రారంభించనున్న ఈ నిబంధన కారణంగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించి, డ్రైవర్లలో భద్రతా అవగాహన కలిగించినట్లు అవుతుంది. కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్కు సంబంధించిన పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో ఇది తొలి దశగా ఉంటుంది. రోడ్ సేఫ్టీ పరీక్షలో ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల చొప్పున అన్నింటికీ కలిపి మూడు గంటల సమయం పడుతుంది. ఈ పరీక్షకోసం అభ్యర్థులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కెమెరా ఉన్న ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్తో ఇల్లు లేదా కార్యాలయం నుంచి ఈ పరీక్షను సులభంగా రాసే వీలుంది. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేకంగా ఓ సర్టిఫికెట్ నంబర్ను కేటాయిస్తారు. దాని ఆధారంగానే ఎల్ఎల్ఆర్కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణా శాఖ అధికార వర్గాల సమాచారం. తెలంగాణలో ఏటా సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాలతో మృతి దేశంలో ఏటా దాదాపు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తుంటే తెలంగాణలో ఏటా సుమారు ఏడున్నర వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరితో పాటు 23 వేల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. ఈ క్రమంలో రహదారి ప్రమాదాలు, మరణాల నియంత్రణకు రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనలతో రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లైసెన్సు ఉన్నా రోడ్డు ప్రమాదాలకు గురికావడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇటు ఆయా కుటుంబాలు రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన పెంచడంతో పాటు రోడ్డు భద్రత మాడ్యుల్స్లో ఉన్న అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఈ ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షకు అవసరమైన మెటీరియల్ను కూడా రవాణా శాఖ రూపొందించింది. చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అందుకే లైసెన్స్ ఇచ్చే ముందు అభ్యర్థులకు తప్పనిసరిగా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునే తొలి దశలోనే ఈ పరీక్షకు సన్నద్దత కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రవాణా శాఖ త్వరలోనే విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది.
రైతు గణపతిది రేవంత్ సర్కారు చేసిన హత్యనే: కెటిఆర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు తుడుం గణపతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18న తాను స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డకు వెళ్లానని గుర్తు చేశారు. అంతకు ముందురోజే మీడియాతో ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బి)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి తన కష్టాలు చెప్పుకుంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యారని చెప్పారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించారని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యనేనని మండిపడ్డారు.
ఇక్రిశాట్ను అమెరికా సంస్థ అనడం... సిఎం అవగాహన రాహిత్యానికి నిదర్శనం
ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడి తెలంగాణ పరువు తీయకండి మాజీ మంత్రి హరీష్రావు మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ అనడం సిఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. నల్లమల సరిహద్దులు, కృష్ణా-గోదావరి జలాలు, సుంకేసుల ప్రాజెక్టుల మీదే కాదు.. కళ్ల ముందున్న సంస్థల పైనా సిఎంకు క్లారిటీ లేదా..? అని ప్రశ్నించారు. కనీస వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి, ప్రాథమిక అవగాహన లేకుండా తెలంగాణ పరువు తీయకండి అంటూ చురకలంటించారు. పటాన్చెరులో దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఇక్రిశాట్.. ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు అని, ఇది సిజిఐఎఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అని తెలిపారు. దీని ఏర్పాటులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎఒ), యునైటెడ్ నేషన్స్ డవలప్మెంట్ ప్రోగ్రామ్(యుఎన్డిపి), వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ల సహకారంతో పాటు, భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక ఇది అని, దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణమని అన్నారు. ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని నడపడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హరీష్రావు హితవు పలికారు.
అవగాహనతో స్వీయ రక్షణ మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దపీట మన తెలంగాణ/హైదరాబాద్ : ఆధునిక, సాంకేతిక యుగంలో సైతం మహిళల భద్రత కలవర పెడుతున్న అంశం. దీన్ని అధిగమించేందుకు మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ నూతన రీతిలో భద్రతకు సంబందించిన సంస్కరణలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం, ఉపాధి, కళాశాలకు వెళ్లే విద్యార్థినుల పనిచేసే చోట, ప్రయాణ సమయాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు యాప్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. పోలీస్ శాఖ ఇప్పటికే 100, 181, 1098 లాంటి టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినా మరి కొన్ని యాప్లతో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. టీ సేఫ్ టి- సేఫ్ అనే యాప్ రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం మహిళల ప్రయాణ భద్రత కోసం రూపోందించింది. ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం, రియల్ టైమ్ రైడ్ మానిటరింగ్ చేయడానికి ఈ యాప్ అభివృద్ధి చేశారు. యాప్ను ఇన్స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. రాత్రి వేళ ఉద్యోగాలు చేసే మహిళలు, విధులు ఆలస్యమయిన సందర్భంలో, అర్దరాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించే వారికి యాప్తో భరోసా లభిస్తుంది. యాప్లో లాగిన్ అయిన తరువాత డయల్ 100 అనే ఆప్షన్లో మానిటరింగ్ ఎంపిక చేసుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాం, ఏ వాహనంలో వెళుతున్నాం అనే వివరాలు నమోదు చేస్తే పర్యవేక్షణ ప్రారంభమవుతుంది. ఎదయిన ఆపద వస్తే ఈ వివరాలతో పోలీసులు తక్షణమే సంబంధిత ప్రదేశానికి చేరుకుని బాధితులను రక్షిస్తారు. మై సేఫ్టీ పిన్ మై సేఫ్టీ పిన్ యాప్ రాత్రి సమయాల్లో, కొత్త ప్రదేశాల్లో ఒంటిరిగా ప్రయాణిస్తున్న మహిళలకు రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది. ఈ యాప్తో రాత్రి సమయాల్లో ప్రయాణించే మార్గం ఎంత సురక్షితమో తెలుసుకోవచ్చు. వెలుతురు, జనసాంద్రత, ప్రజల రాకపోకలు వంటి ఆధారంగా రహదారి వివరాలు, ఎంత సురక్షితమో తెలుపుతుంది. లైవ్ ట్రాకింగ్ ద్వారా ప్రయాణ మార్గాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేస్తుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్ బటన్ నొక్కడం ద్వారా సమీపంలోని పోలీసులకు సమాచారం వెళుతుంది. 112(112 ఇండియా) 112 ఇండియా అనేది రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ఇఆర్ఎస్ఎస్) యాప్ కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలల భద్రత కోసం పనిచేసే ప్లాట్ ఫారమ్గా పనిచేస్తుంది. దీనికి వినియోగించడం ద్వారా మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత ప్రయాణ సమయంలో ఏదయినా సమస్య తలెత్తినప్పుడు యాప్లోని ప్యానిక్ బటన్ నొక్కిగానే వెంటనే సదరు మహిళ ఉన్న లోకేషన్, వ్యక్తిగత సమాచారం(పేరు, వయస్సు, ఎమర్జెన్సీ కాంటాక్ట్) కంట్రోల్ రూంకు పంపుతుంది. దీంతో వేగంగా పోలీస్ శాఖ సహాయం అందుతుంది.
IPL వైపు విదేశీ ఆటగాళ్ల చూపు.. పాక్ క్రికెట్ బోర్డు వార్నింగ్
న్యూఢిల్లీ: కొందరు విదేశీ ఆటగాళ్లు.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పిఎస్ఎల్) వదిలి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. సదరు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరి నిమిషంలో పిఎస్ఎల్ వదిలి ఐపిఎల్ కు మారిన ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పిసిబి ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హెచ్చారించారు. ఐపీఎల్కు రెండు రోజుల ముందు, అంటే మార్చి 26న పీఎస్ఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ను కాదని, డబ్బులు బాగా వచ్చే భారత లీగ్ను ఎంచుకున్నారు. ఈ సీజన్లో బ్లెస్సింగ్ ముజరబానీ, దాసున్ షనక వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు పిఎస్ఎల్ను కాదని ఐపిఎల్ను ఎంచుకున్నారు. దీంతో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వైదొలిగే అంతర్జాతీయ ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నఖ్వీ హెచ్చరించారు. మీడియా సమావేశంలో నఖ్వీ నిబంధనల ప్రకారం ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటాం. గత ఏడాది కూడా ఇలానే చేసిన కార్బిన్ బాష్పై పీఎస్ఎల్ నుంచి ఏడాది పాటు నిషేధం విధించడం జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతుంది. కాగా, ముజరబానీ, దాసున్ షనక ఇద్దరితో పాటు గుడకేష్ మోతీ, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ఒట్నీల్ బార్ట్మన్, స్పెన్సర్ జాన్సన్ కూడా పీఎస్ఎల్ నుండి వైదొలిగిన వారిలో ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగారు.
యుద్ధ ప్రభావం..విమాన టికెట్ ధరలకు రెక్కలు
స్వదేశానికి రావడానికి తెలుగు టెక్కీలు, ఎన్నారైలు తీవ్ర ఇబ్బందులు మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన ధరల పెరుగుదల, ఎయిర్ స్పేస్ పరిమితులతో హైద రాబాద్తో సహా భారత్కు వచ్చే విమాన టికెట్ ధరలు 40-60 శాతం వరకు పెరిగాయి. లండన్-హైదరాబాద్ రూట్లో ధరలు రూ. 2.5 లక్ష లకు చేరాయి. 5,500 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి, దీంతో తెలుగు టెక్కీలు, ఎన్నారైలు స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావాల్సి రావడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతోంది. పని ఒత్తిడి, ఆందోళన: అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇండియాకు వెళ్లలేని స్థితి నెలకొందని, సెలవులు దొరికినా విమానం దొరకడం, ధరలు భరించడం కష్టంగా మారిందని టెక్కీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి. ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా కొన్ని సంస్థలు విమానాలను లిమిటెడ్గా నడపడంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే మూడు రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇండియా నుంచి అమెరికా యూరప్ దేశాలకు కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎయిర్ ఇండియావే. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అనుమతి వుంటేనే నడుపుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా యూరప్ వెళ్ళాలంటే టికెట్ ధర వన్ వే కే టూ వే టికెట్ ధరలు సంస్థలు వసూలు చేస్తున్నాయి . ఎయిర్ ఇండియా, ఎతిహాద్. ఎమిరేట్స్ విమానాల రేట్లకు రెక్కలొచ్చాయి. అమెరికా వెళ్ళాలంటే టికెట్ ధరలు ఫ్లైట్ బుకింగ్ టైం లో ఒకలా.. పేమెంట్ టైం లో ఒకలా చూపిస్తున్నాయి. అంటే నిమిషం నిమిషానికి చార్జ్ మారుతోంది. గల్ఫ్ దేశాలకు కొన్ని విమానాలు నడుస్తున్నా అవి టేకాఫ్ అవుతాయా లేదా అన్నది మరో డైలమా. ఇంకొన్ని విమానాలు గమ్యస్థానాలకు వెళ్ళే దారి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా ప్రయాణికులు ఉంటారు. ఒకవేళ విమానాలు షెడ్యూల్ చేసినా ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో అర్థంకాక ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా..యుద్ధం విమానయాన రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు రిస్క్ ఎందుకులే అని తమ సర్వీసులను ఆపేయగా.. కొన్ని సంస్థలు భారీగా టికెట్ రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మొత్తంగా యుద్ధ ప్రభావంతో విమాన ప్రయాణాలు భారంగా మారాయి. టికెట్ దొరకడం ఒకెత్తయితే.. రేట్లు మరో ఎత్తు. టికెట్ దొరికినా అది డెస్టినేషన్కు పోతుందో యుద్ధం భయంతో మధ్యలోనే రిటర్న్ అవుతుందో తెలీక ప్రయాణికులకు డైలమా తప్పడం లేదు. ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం ...! పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం ఈ ప్రభావం ప్రధానంగా ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరల ద్వారా కనిపించే అవకాశం ఉంది. ప్రతి నెలా మొదటి తేదీన ఎటిఎఫ్ ధరలు సవరించబడుతాయి. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి ఈ పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం విమానయాన సంస్థలతో నిరంతరంగా చర్చలు జరుపుతోంది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో సుమారు 40 శాతం వరకు ఎటిఎఫ్ ఖర్చే ఉంటుంది. చమురు ధరలు పెరగడం వల్ల ఈ ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో విమాన టిక్కెట్ ధరలు కూడా పెరగడం ప్రారంభమైంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ వంటి సంస్థలు ఫ్యూయల్ సర్ఛార్జీలను అమలు చేస్తున్నాయి. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి పలు మంత్రిత్వ శాఖలు కలిసి పని చేస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాలకు విమాన సర్వీసులు సురక్షితంగా కొనసాగడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎటిఎఫ్ ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. అయితే పెరిగిన ఇంధన ఖర్చులను సమతుల్యం చేసేందుకు విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్ఛార్జ్ను విధిస్తాయి. ఇది టిక్కెట్ బేస్ ఫేర్కు అదనంగా వసూలు చేయబడుతుంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారాయి. దీని ప్రభావం భారతదేశంలో విమాన ప్రయాణ ఖర్చులపై పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం, విమానయాన సంస్థలు సమన్వయంతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ట్రంప్ నాడీ వ్యవస్థ పని చేయడంలేదా?... నింపాదిగా నడక... తడబాటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ తమ అధికారిక ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ ఒన్ నుంచి తడబడుతూ పక్కన ఊతం పట్టుకుని జాగ్రత్తగా దిగారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి పలు వార్తలు వెలువడ్డాయి. తరువాత అక్కడ ఉన్న కుర్చీపై ఆసీనుడు కావడానికి కూడా కంగారుపడాల్సి వచ్చింది. 79 సంవత్సరాల ట్రంప్ నాడీ మండల సమస్యలు ఎదుర్కొంటున్నాయని, రక్తనాళాలు గడ్డకట్టుకుపోతున్నాయని చాలాకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఎయిర్ఫోర్స్ ఒన్ నుంచి అతికష్టం మీద దిగినట్లుగా ఆయనను అనుసరించిన వీడియో కెమెరాలతో స్పష్టం అయింది. ట్రంప్ వయస్సు మీదపడింది. ఇక సరిగ్గా నడవలేకపోతున్నారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అయితే ఇటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోరాదని, ఆయన ఆరోగ్యంపై వదంతుల్లో ఇవో భాగం అని కొందరు ఎదురుదాడికి దిగారు. ట్రంప్ ఇప్పుడు ఫ్లోరిడాలో రెండు మూడు రోజులు గడుపనున్నారు. తరువాత టెన్సెసీకి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వాషింగ్టన్ చేరుకుంటారు. ప్రస్తుతం ట్రంప్ ఆలోచనాశక్తి కూడా మునుపటిలా లేదని విమర్శలు తలెత్తుతున్నాయి.
టీ20ల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్..
టీ20 క్రికెట్ లో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ చరిత్ర సృష్టించింది. మార్చి 22, ఆదివారం వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కెర్ 29 బంతుల్లో 31 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను కైవసం చేసుకుంది. 31 పరుగులతో కెర్.. పురుషుల, మహిళల టీ20 క్రికెట్లో ఆల్-టైమ్ రికార్డును సృష్టించింది. ఈ పొట్టి అంతర్జాతీయ ఫార్మాట్లో ఆమె వరుసగా 30కి పైగా పరుగులు చేయడం ఇది 10వ సారి. మహిళల, పురుషుల టీ20లలోనే అత్యధిక సార్లు.. 30కి పైగా స్కోరు చేసి బ్యాటర్ గా కెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు వరుసగా తొమ్మిది సార్లు 30కి పైగా పరుగులు చేసిన శ్రీలంకకు ప్లేయర్ చమరి అథపత్తు, రొమేనియాకు చెందిన రెబెక్కా బ్లేక్ రికార్డును కెర్ బ్రేక్ చేసింది. ఇక, పురుషుల టీ20 క్రికెట్లో వరుసగా ఏడు సార్లు 30 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించిన రికార్డు.. రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్, అభిషేక్ శర్మ, హ్రిస్టో లాకోవ్ పేరిట ఉంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అతిథి జట్టు దక్షిణాఫ్రికా 159/6 స్కోరు చేసింది. అన్నెరీ డెర్క్సెన్ 32 బంతుల్లో అజేయంగా 55 పరుగులతో రాణించింది. తర్వాత కివీస్ 160 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను న్యూజిలాండ్ 3-1తేడాతో ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.
తల్లి రుణం తీర్చుకునేందుకు బిసి బుద్ది జీవులు కదలాలి: జూలూరి గౌరీ శంకర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: తల్లి రుణం తీర్చుకునేందుకు బిసి బుద్ది జీవులు కదలాలని, బహుజన ఉద్యమకవి, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బిసి కుల వృత్తుల దీర్ఘకవితల సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ.. బిసిలలో కదలిక వచ్చిందని, దాన్ని సామూహిక శక్తిగా మార్పే పని బిసి సాహిత్య కదలడమంటే తల్లి రుణం తీర్చుకోవడం లాంటిదే అన్నారు. కుల పత్తి సాహిత్యాలు ప్రవాహంగా వస్తున్నాయని,అవి ఇప్పుడు బిసి వాద సాహిత్యంగా రూపుదాల్చాలన్నారు. బీసీ ఉద్యమ జెండాగతా ఎగురవేసే పని బీసీ బుద్ది జీవుల చేతుల్లో ఉందన్నారు. కలుషత ఆహారం తిని భావిభారత బిడ్డలు రాలిపోతుంటే బీసీ సాహత్యకారులు పాలకుల దుర్నితీని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సాహిత్య వేత్తల కర్తవ్యం విశ్వమానవ విముక్తి గీతమన్నారు.ఈ కార్యక్రమంలో సింగిశెట్టి శ్రీనివాస్, కాళోజి తొలి అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్,ఆచార్య పిల్లల మర్రి రాములు, బహుళమహిళాపక్ష పత్రిక సంపాదకురాలు జ్వలిత, తదితరులు పాల్గొన్నారు.
3 నెలల్లో 28 మంది మృతి.. ‘కీడు’ సోకిందని ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు! #Karimnagar #VillageNews
welcome |జన్నారం చేరుకున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ..
welcome | జన్నారం చేరుకున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్
నట్టేట ముంచుతున్నారు.... పెరుగుతోన్న రియల్ మోసాలు
పెరుగుతోన్న రియల్ మోసాలు మోసపోయి ర్యాపిడో డ్రైవర్గా మారిన టెకీ ప్రభుత్వ భూములను వదలని రియల్టర్లు వాటిని చూపించి కోట్లు దోచుకున్న వ్యాపారులు మనతెలంగాణ / సిటిబ్యూరోః రియల్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రీలాంచ్, ఆఫర్ల పేరిట కొందరు రియల్ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటూ చేతులు ఎత్తివేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ ధరకే ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామని తక్కువ ధరకే ఇస్తామని ప్రకటించి అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు అప్పులు, బ్యాంక్ల్లో రుణాలు తీసుకుని ముట్టజెప్పి నిండామునుగుతున్నారు. ఇలాంటి కేసులు హైదరాబాద్ మహానగరంలోని పోలీస్ స్టేషన్లలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. చాలా వరకు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, కొన్ని కేసుల్లో సివిల్ వివాదం పేరుతో మోసాలు చేస్తున్నవారిపై కేసులు పెట్టడంలేదు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రీలాంచ్ పేరుతో చాలా రియల్ ఎస్టేట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. సాహితీ ప్రీలాంట్ పేరుతో పలువురి వద్ద నుంచి రూ.3వేల కోట్లు వసూలు చేసింది, డబ్బులు కట్టి ఏళ్లు అవుతున్నా కూడా కనీసం పునాది కూడా వేయకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రీలాంచ్ పేరుతో పలువురి వద్ద నుంచి వందల కోట్లు వసూలు చేసింది. తక్కువ డబ్బులకు ఫ్లాట్ కట్టిఇస్తామని చెప్పడంతో ఏడేళ్ల క్రితం పలువురు బాధితులు లక్షలాది రూపాయలు కట్టారు. సాఫ్ట్వేర్ ఇంజీనర్లు, వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగులు లక్షలాది రూపాయలు కట్టారు. ప్రైం లొకేషన్లో ఫ్లాట్లను కట్టుతున్నట్లు చెప్పడంతో చాలామంది బాధితులు తక్కువ ధరకు వస్తున్నాయని భావించి డబ్బులు కట్టారు. డబ్బులు వసూలు చేసిన రియల్ వ్యాపారులు వారు చెప్పిన ప్రాంతంలో పిల్లర్లు వేసి వదిలేశారు. డబ్బులు కట్టి సంవత్సరాలు అవుతున్నా పనులు ముందుకు సాగకపోవడంతో బాధితులు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన నిందితులు చెల్లని చెక్కులు ఇచ్చి చేతులుకు దులుపుకున్నారు. బాధితులు చెక్కులను బ్యాంక్లో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి, మళ్లీ పోలీసులను బాధితులను సంప్రదించడంతో సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈవికే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, మోకిలాలో తక్కువ ధరకు విల్లాలు కట్టిస్తామని చెప్పడంతో చాలామంది బాధితులు లక్షలాది రూపాయలు కట్టారు. కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితులు కనీసం భూమి కూడా కొనుగోలు చేయలేదు, కాని ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి చేతులు ఎత్తివేశారు. తక్కువ ధరకు విల్లా వస్తుందని భావించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ.50లక్షలు కట్టాడు, ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో నిండామునిగాడు. వేతనంపై బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేసి రూ.50లక్షలు కట్టాడు, దీనికితోడు ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో మోసపోయాడు. అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు ఉద్యోగం పోవడంతో నిండామునిగాడు, అప్పులు తీర్చేందుకు రాత్రి సమయంలో ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భారతీ లేక్ వ్యూ ప్రాజెక్ట్ పేరుతో ప్రీలాంచ్కు తెరలేపిన భారతీ బిల్డర్స్ 350మంది నుంచి 80కోట్ల రూపాయలు వసూలు చేసి నిండాముంచారు. హైదరాబాద్, మాదాపూర్కు చెందిన దూపటి నాగరాజు భారతీ బిల్డర్స్ చైర్మన్, ముల్పూరి శివరామకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్గా 2021లో భారతీ బిల్డర్స్ను మాదాపూర్లో ఏర్పాటు చేశారు. ఇద్దరు కలిసి కొంపల్లిలో 6.23 ఎకరాలను అపార్ట్మెంట్లు కట్టేందుకు కొనుగోలు చేశారు. భారతీ లేక్ వ్యూ పేరుతో అపార్ట్మెంట్లు కడుతున్నామని చెప్పి ప్రీ లాంచ్ పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. 350మంది నుంచి రూ.80కోట్లు వసూలు చేశారు. బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత భూమిని వేరే వారికి రూ.100కోట్లకు విక్రయించారు. భారతీ బిల్డర్స్ తమ వద్ద డబ్బులు వసూలు చేసి రెండేళ్లు అవుతున్నా కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎపిలోని చిత్తూరూ జిల్లా, రేణిగుంటకు చెందిన ఓబిలి పాపనగిరి రామాచంద్రారెడ్డి ఓబిలి హౌసింగ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట్ మండలం, వెంకటాపురంలో హైవే ప్యారడైజ్ పేరుతో 200 ఎకరాల్లో వెంచర్ను ప్రారంభించారు. ప్రీలాంచ్ పేరుతో పలువురు అమాయకుల వద్ద నుంచి మూడేళ్లలో 50మంది రూ.10 నుంచి రూ.15కోట్లు వసూలు చేశాడు. ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన గుంటుపల్లి శ్రీనివాస రావు మరో ఇద్దరితో కలిసి జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేశారు. కోల్లూరులో తక్కువ డబ్బులకు విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టిస్తామని ప్రీలాంచ్ విల్లా పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. నిందితులు బ్రోచర్లు ముద్రించి పలువురికి పంపిణీ చేశారు. వాటిని చూసిన 31మంది బాధితులు వీరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేశారు. మూడేళ్లలో విల్లా కట్టి ఇస్తామని చెప్పారు, ఒకవేళా సమయానికి కట్టకుంటే 24శాతం వడ్డీ కలిసి డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో చాలామంది డబ్బులు ఇచ్చారు, కోట్లాది రూపాయలు తీసుకున్న నిందితులు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలు కట్టిస్తామని చెప్పి బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితులు నిండాముంచారు. రియల్ మోసాలకు బలైన బాధితులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఒప్పందాలు చేసుకుని... రియల్ మోసాలు చేస్తున్న నిందితులు భూమి యజమానులకు కొంత డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ పత్రాలను బాధితులకు చూపించి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత ఒప్పందాలను రద్దు చేసుకోవడం లేదా భూమిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించి రెండు విధాలుగా సొమ్ము చేసుకుంటున్నారు. భారతీ బిల్డర్స్ బాధితులకు ప్రభుత్వ భూమిని తమదిగా నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి మోసం చేశారు. చాలా కేసుల్లో ఒప్పందాలు రద్దు చేసుకుని ఎలాంటి నిర్మాణాలు చేపట్టడంలేదు. అందమైన బ్రౌచర్లు... ప్రాజెక్ట్లు ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ సంస్థలు అందంగా బ్రౌచర్లు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. తాము చేపట్టబోయే అపార్ట్మెంట్లు ఇలాగే ఉంటాయని చెప్పడంతో చాలా మంది ఆకర్షితులై డబ్బులు కడుతున్నారు. హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలని ఆశతో డబ్బులు కడుతున్నారు. ప్రజల ఆశల గ్రహిస్తున్న నిందితులు డబ్బులు వసూలు చేసి నిండాముంచుతున్నారు. సాహితీ, భారతీ సంస్థలు ఏకంగా ప్రభుత్వ భూములను చూపించి డబ్బులు వసూలు చేశాయి. అంతేకాకుండా హైరైజ్ బిల్డింగ్లు ఇప్పుడు ఫ్యాషన్ కావడంతో వాటిని చూపించి డబ్బులు దోచుకున్నారు. కేసు పెట్టినా లాభంలేదు... రియల్ మోసాల కేసులో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినా బాధితులకు ఎలాంటి న్యాయం జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసినా కూడా వారి నుంచి డబ్బులు రికవరీ చేయలేకపోవడంతో బాధితులకు నయాపైసా కూడా రావడంలేదు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఒక్క బాధితుడికి కూడా డబ్బులు రికవరీ కాలేదు. కోర్టుల్లో కేసులు కొనుసాగుతున్నాయి కానీ బాధితులకు న్యాయం జరగడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ వార్నింగ్ తో వెనక్కి తగ్గిన ఇరాన్.. కానీ
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధి విషయంలో వెనక్కి తగ్గింది. హార్ముజ్ మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. 'భద్రతా' ఏర్పాట్ల కోసం ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటే విదేశీ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ అధికారి తెలిపారు. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని ఇరాన్ కండీషన్ పెట్టింది. అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO)లో ఇరాన్ ప్రతినిధి అలీ మౌసావి మాట్లాడుతూ.. టెహ్రాన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని అన్నారు. సముద్ర భద్రతను పెంపొందించడానికి, నావికులను రక్షించడానికి ప్రపంచ సంస్థలు, ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని అన్నారు. దౌత్యం ఇరాన్కు ప్రాధాన్యతగా ఉంటుంది. అయితే, దురాక్రమణను పూర్తిగా నిలిపివేయడం, అలాగే పరస్పర విశ్వాసం, నమ్మకం మరింత ముఖ్యం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులే..పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, హోర్ముజ్ జలసంధిలోని ప్రస్తుత పరిస్థితికి మూల కారణం అని ఆయన పేర్కొన్నారు. కాగా.. 48 గంటలలో ఇరాన్ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించాలని.. లేకపోతే ఇరాన్ ఇందన కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ ఆదివారం తీవ్ర హెచ్చరికలు చేశారు. మరి, ఇరాన్ పూర్తిస్థాయిలో జలసంధిని ఓపెన్ చేయకపోవడంపై ట్రంప్ ఎలా స్పందిస్తాడనేది చర్చనీయాంశంగా మారింది.
బంజారాహిల్స్లో బిజెపి ఎంపి రమేష్ హల్చల్
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఎపిలోని అనకాపల్లి బిజేపి ఎంపి సిఎం రమేష్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో ఆదివారం తన అనుచరులతో హల్చల్ చేశారు. ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీకి చెందిన వివాదాస్పద స్థలంలోకి వచ్చి హంగామా సృష్టించాడు. సర్వే నంబర్ 129లో ప్లాట్ నంబర్ 29,30లోని భూమిని కొనుగోలు చేసిన శివనారాయణ అనే వ్యక్తి పొజిషన్లో ఉన్నాడు. దీనిపై సిఎం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2006 నుంచి సిఎం రమేష్ తమను ఇబ్బంది పెడుతున్నాడని బాధితులు ఆరోపించారు. తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తమ భూమిలోకి ఎవరూ ఎంటర్ కావద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా సిఎం రమేష్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదులు చేశారు. సిఎం రమేష్, శివనారాయణ ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ ఇన్స్స్పెక్టర్ సుహాసన్ తెలిపారు.
జ్వరం @ రూ.9900... నేను రాను బిడ్డో కార్పొరేట్ ఆస్పత్రికి
చెన్నై లో ఓ వ్యక్తి జ్వరం వచ్చిందని అపోలో క్లినిక్ వెళ్లాడట అక్కడ అతనికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్వాబ్ మరియు మిగతా పరీక్షలు చేసి మందులు 900 రూపాయలు తో కలిపి 9 వేల రూపాయలు బిల్లు వేశారు. అని ఇది అవసరమా? అని పెరిగిన హెల్త్ కేర్ ఖర్చుల గురించి అతను సోషల్ మీడియా వేదికగా వాపోయారు.. చాలా మటుకు జ్వరాలు వైరల్ ఫీవర్ ఉంటాయి, లేదా ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ లేక యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటాయి. వైరల్ జ్వరాలు పారాసిటమాల్ మరియు సెట్రిజిన్ వేసుకుంటే తగ్గిపోతాయి. అదే దగ్గు లాంటిది లేక యూరిన్ మంట లాంటివి ఉంటే ఇక్కడ సిప్రోఫ్లాక్ససిన్ లాంటిది యాంటీబయాటిక్ వేసుకోవాలి. కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళితే వారు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నదా అని యూరిన్ టెస్ట్ చేస్తారు. మలేరియా డెంగు లాంటి జ్వరాలు ఉన్నాయా అని కూడా పరీక్ష చేయాల్సిందే. ఇంకా లివర్ ఫంక్షన్ టెస్టులు మరియు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. ఇది మినిమం పరీక్షలు దీనికి 5వేల రూపాయల కచ్చితంగా అయిపోతాయి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే మోడ్రన్ వైద్య పరీక్షలో ఇది నిర్ధారించడం కోసం ఒకదానిని ఒకటి ఎలిమినేట్ చేయడం అనేది కంపల్సరీ. ఈ విధానం లో తప్పదు. కావున మనము అత్యవసరం అయితేనే పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే మన ఫ్యామిలీ డాక్టర్ తో చూపించుకోవాలి. వైద్యం ఇండస్ట్రీ అయిపోయి కన్జ్యూమర్ పరిధిలోకి డాక్టర్ వచ్చి పేషెంట్ కన్జ్యూమర్ అయిన తర్వాత పరీక్షలు అనేది తప్పనిసరిగా మారింది. చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి అనే విధంగా ఈ వైద్యం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద జబ్బులు కూడా పరీక్షలలో బయటపడతాయి. ఇంకా ఎక్కువ పరీక్షలు కూడా చేయాల్సి వస్తాయి సిటీ స్కాన్ లాంటివి అవసరం అవుతాయి. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
ప్రజల జీవితాలను మెరుగుపరిచే.. పీపుల్స్ బడ్జెట్..!
ప్రజల జీవితాలను మెరుగుపరిచే.. పీపుల్స్ బడ్జెట్..! నేటి నుండి రైతుల బ్యాంకు ఖాతాల్లో
అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య నిర్వహించబడ్డాయి. వేలాది మంది అభిమానులు తరలివచ్చి పెద్దాయన్ను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీదేవి, కుమారులు […] The post అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు appeared first on Visalaandhra .
రైతులను ఆదుకోవాలని సీఎంకి విజ్ఞప్తి
రైతులను ఆదుకోవాలని సీఎంకి విజ్ఞప్తి అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి
అమెరికా నుంచి భారత్కు భారీ ఎల్పిజి నౌక
మంగళూరు పోర్టుకు చేరుకున్న ‘పైక్సిస్ పయనీర్’ మంగళూరు : భారత్కు మరింత ఊరటనిచ్చే విషయం. అమెరికా నుంచి భారీ పరిమాణంలో ఎల్పిజితో కూడిన కార్గో నౌక ఆదివారంనాడు ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకుంది. పైక్సిస్ పయనీర్ అనే నౌక సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో పోర్టుకు చేరుకుంది. దక్షిణ భారతదేశంలోని గృహ, పారిశ్రామిక అవసరాలకు ఇది మరింత సాయపడనుంది. భారత్కు సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ దిగుమతులు అత్యధికం. తాజాగా పశ్చిమాసియా పరిణమాల నేపథ్యంలో అమెరికా నుంచి నేరుగా భారీ నౌక రావడం ఇంధన వనరుల వైవిధ్యీకరణలో భాగంగా భావిస్తున్నారు. మంగళూరు పోర్ట్ ద్వారా అన్లోడ్ చేసే ఈ గ్యాస్ను పైప్లైన్లు, ట్యాంకర్ల ద్వారా కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు అస్థిరంగా ఉన్న వేళ, ఇలాంటి భారీ దిగుమతులు స్థానిక మార్కెట్లో ఎల్పిసి ధరలు అదుపులో ఉండటానికి దోహదపడతాయి.
రాజకీయ జోక్యంతో సింగరేణికి కష్టాలు
రాజకీయ జోక్యంతో సింగరేణికి కష్టాలు మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలీఏఐటియుసి అధ్యక్షుడు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నిత్యావసరాలపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని మోడీ, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్, హర్దీప్సింగ్ పూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి కీలక రంగాలలోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. ఇంధన మార్కెట్లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనించాలన్న మోడీ సూచించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా సులభమైన లాజిస్టిక్స్, స్థిరమైన సరఫరా, సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థలను కొనసాగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పాయి. కొరతను నివారించడం, సేవలను స్థిరంగా ఉంచడం కీలక ప్రాధాన్యతలుగా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లో ఏవైనా మార్పులు వస్తే వేగంగా స్పందించేందుకు నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపాయి
టైగర్ టూరిజంపై ఫోకస్ ! రిజర్వ్ ఫారెస్ట్ ల అభివృద్ధికి రూ. 875 కోట్లు #TigerTourism#KawalTigerReserve
ఘనంగా నాగేంద్ర స్వామి తిరునాళ్ళ మహోత్సవం…
ఘనంగా నాగేంద్ర స్వామి తిరునాళ్ళ మహోత్సవం… భారీగా తరలివచ్చిన భక్తులు.. పుట్టలో పాలు
మల్లయ్య హత్య పై విచారణ జరపాలి…
మల్లయ్య హత్య పై విచారణ జరపాలి… సహకరించిన స్టేషన్ సిబ్బంది పై చర్యలు
హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ పోరాటం
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ పోరాటం ఎన్నికల హామీని నెరవేర్చాలి24న
NBK112: Young Music Composer on Board
Telugu360 broke the news that young director Vivek Athreya is all set to direct the 112th film of Nandamuri Balakrishna and the shoot commences after Dasara. The pre-production work of the film is currently happening. Young Malayalam music composer Jakes Bejoy who scored music for Telugu films like Saripodhaa Sanivaaram, Mechanic Rocky, Oke Oka Jeevitham […] The post NBK112: Young Music Composer on Board appeared first on Telugu360 .
ట్రంప్ ఘాటు హెచ్చరిక.. ఇరాన్ బేఖాతరు కైరో: హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆదివారం ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు వెలువరించారు. 48 గంటలలో ఇరాన్ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని పూర్తి స్థాయిలో రాకపోకలకు తిరిగి ప్రారంభించాల్సి ఉంది. లేకపోతే ఇరాన్ ఇందన కేంద్రాలపై అమెరికా దాడులకు దిగుతుందని ట్రంప్ తెలిపారు. దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయి. పలు ఇంధన కేంద్రాలను దెబ్బతీస్తామని తెలిపిన ట్రంప్ వీటిలో మొదటి దాడి అత్యంత భారీ స్థాయిలో ఉంటుందని స్పందించారు. ఇప్పటికే దెబ్బతిన్న ఇరాన్కు చెందిన అతి పెద్ద బషేర్ అణు ఇంధన కేంద్రం, లేదా టెహరాన్కు దగ్గరిలోని సహజ వాయువు కేంద్రం దామావంద్పై దాడులు ఉంటాయని తెలిపారు. తమ డెడ్లైన్ మేరకు ఇరాన్ స్పందించకపోతే తమ చర్యలు అత్యంత భయానకంగా ఉంటాయని ట్రంప్ తెలిపారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ వెంటనే తిప్పికొట్టింది. ఆయన హెచ్చరికలకు జవాబు ఏమీ ఇవ్వకుండా ఇజ్రాయెల్కు చెందిన రెండు ప్రధాన నగరాలపై దాడులు చేసింది. ట్రంప్ 48 గంటల హర్మూజ్ గడువు, దీనిని ఇరాన్ బేఖాతరు చేయడంతో మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు మరింత ప్రమాదకర మలుపు తిరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. తమ అణు స్థావరాలపై ఎటువంటి దాడులు జరిగినా వీటికి స్పందనగా వెంటనే గల్ఫ్ దేశాల్లోని పలు చమురు కేంద్రాలు, క్షేత్రాలపై దాడులు జరుగుతాయని ఇరాన్ హెచ్చరించింది. తాము హర్మూజ్ జలసంధి మార్గంలో తమ దేశ శత్రు నౌకలు కాకుండా ఇతర నౌకలను అనుమతిస్తామని మరోసారి ఇరాన్ ఆదివారం తెలిపింది. ట్రంప్ ఘాటు హెచ్చరికల గురించి స్పందించకుండా ఈ విషయం తెలిపారు.
Monday 23:44 PM : 48 గంటల డెడ్లైన్ Andhra Prabha Story
Monday 23:44 PM : 48 గంటల డెడ్లైన్ Andhra Prabha Story
పేకాట స్థావరంపై పోలీసులు దాడి…
పేకాట స్థావరంపై పోలీసులు దాడి… నాదెండ్ల, ఆంధ్రప్రభ : పేకాట స్థావరంపై పోలీసులు
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో మందులు…
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో మందులు… ఎకొండూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ఎ.కొండూరు
చిత్తూరు ఇరువారం వద్ద నిషేధిత పొగాకు స్మగ్లింగ్ బస్టు #Chittoor #Smuggling #Tobacco #PoliceAction
ఇజ్రాయెల్పై ఇరాన్ బీకర దాడులు
డిమోనా, అరాద్ నగరాలపై క్షిపణులు ఘటనలపై తొలిసారి నెతన్యాహు ఆందోళన అరాద్ విధ్వంస ప్రాంతాలలో పర్యటన ఖతార్లో కుప్పకూలిన హెలికాప్టర్ హర్మూజ్పై ట్రంప్ హెచ్చరికలు ఓపెన్ చేసేందుకు 48 గంటల గడువు ఇజ్రాయెల్ సైన్యం నుంచి వైఫల్య అంగీకారం భారతీయ సంతతి మినీ ఇండియాలో కలకలం టెహరాన్ : ఇరాన్ తమ శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులతో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని డిమోనా నగరంపై దాడికి దిగింది. ఇక్కడ ఇజ్రాయెల్కు చెందిన అత్యంత కీలకమైన నెగెవా అణు పరిశోధనా కేంద్రం నెలకొని ఉంది. అంతకు ముందు ఇజ్రాయెల్, అమెరికా సేనలు ఇరాన్కు చెందిన ప్రధానమైన నతాంజ్ అణు శుద్ధి కేంద్రం కాంప్లెక్స్పై దాడికి దిగింది. దీనికి ప్రతీకారంగానే వెంటనే ఇరాన్ క్షిపణులు డిమోనాను లక్షంగా చేసుకున్నాయి. అయితే నతాంజ్ అణుస్థావరంపై తమ సేనలు దాడి జరపలేదని ఇజ్రాయెల్ ప్రకటన వెలువరించింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డట్లు ప్రాధమిక సమాచారం మేరకు వెల్లడైంది. ఈ నగరంలో అత్యధిక సంఖ్యలో అత్యధిక సంఖ్యలో భారతీయ సంతతి వారు ఉండటంతో దీనిని మినీ ఇండియా అని పిలుస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం వీరు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 30 శాతం మందికి పైగా భారతీయ సంతతివారు, ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన వారు నివసిస్తున్నారు. ఇరాన్ క్షిపణులు ఎక్కువగా నివాసిత ప్రాంతాలనే దెబ్బతీశాయని వెల్లడైంది. ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర వైద్య సేవల విభాగం మాగెన్ డేవిడ్ ఆడం (ఎండిఎ) ఈ ప్రాంతంలో నుంచి దాదాపు వంద మందిని అత్యవసర చికిత్సలకు ఆసుపత్రులకు తరలించింది. ఈ అణు కేంద్రంలో ఇజ్రాయెల్కు చెందిన అత్యంత కీలకమైన అణ్వాయులు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటి దాడులలో అణుధార్మికత ఏదైనా వెలువడలేదని, ప్రజలకు పర్యావరణానికి ముప్పు లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన మరో నగరం అరాద్పై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. డిమోనాపై దాడుల సమయంలోనే ఇక్కడ కూడా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ దాడులు జరిగిన అరాద్ నగరాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహూ ఆదివారం సందర్శించారు. ఇరాన్ అత్యంత శక్తివంతంగా తన అణుపాటవం పెంచుకుంది. చివరికి యూరప్లోని ప్రాంతాలకు, హిందూ మహాసముద్రంలోని స్థావరాలకు కూడా ముప్పు తెచ్చిపెట్టగలదు. డిగో గార్షియా వంటి చోట్ల జరిగిన దాడి ఇందుకు నిదర్శనం అని తెలిపిన నెతన్యాహు అమెరికా, ఇజ్రాయెల్లు మొత్తం ప్రపంచం కోసం పోరుకు దిగాయని స్పందించారు. మొత్తం ప్రపంచానికి ఇరాన్ నుంచి ముప్పు ఏర్పడిందని తెలిపారు. అణు కేంద్రాలపై దాడుల పేరిట పౌరులను బలి తీసుకుంటున్నారని అరాద్, డిమోనాపై ఇరాన్ ఖండాంతర క్షిపణుల ఘటనలను ప్రస్తావించారు.
వినియోగదారుల “వాణి”యే విద్యుత్ ప్రజావాణి
వినియోగదారుల “వాణి”యే విద్యుత్ ప్రజావాణి వినియోగదారులకు, ఉద్యోగులకు మధ్య వారధిగా విద్యుత్ ప్రజావాణి
మంచిరేవులలో వెయ్యేళ్ల శిల్పాన్ని కాపాడుకోవాలి!
మంచిరేవుల్లో రాష్ట్రకూట వీరగల్లు పరిరక్షణపై ఆందోళనశిల్పంపై గీతలు, రంగు పూసిన దుర్వినియోగం
మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్లో అందరూ భారత కెప్టెన్లే #IPL #IndianCaptains #IshanKishan
శర్వా 'బైకర్' ట్రైలర్ వచ్చేైసింది..
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న మూవీ ‘బైకర్’. ఇందులో శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్ద మొదటి పూర్తి మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది.
WAR |ప్రధాని మోడీ కీలక సమావేశం
WAR | ప్రధాని మోడీ కీలక సమావేశం WAR | ఆంధ్రప్రభ, వెబ్
పాతగుంటలో ఉరకలేసిన ఉత్సాహం.. కోలాహలంగా పశువుల పండుగకోడిగిత్తల జోరు బేజారు పడ్డ యువకులువేల
చింతా వెంటేశ్వరరావు మృతి టీడీపీకు తీరని లోటు
చింతా వెంటేశ్వరరావు మృతి టీడీపీకు తీరని లోటు పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండలంలోని
ప్రవేట్ దుకాణదారుల తీరుపై అధికారుల ఆగ్రహం…
ప్రవేట్ దుకాణదారుల తీరుపై అధికారుల ఆగ్రహం… భక్తుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే లీజు
కేజీబీవీ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…
కేజీబీవీ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్… జన్నారం, ఆంధ్రప్రభ :
2047 AP |మేం అధికారంలోకి వచ్చేసరికి..
2047 AP | మేం అధికారంలోకి వచ్చేసరికి.. 2047 AP | ఆంధ్రప్రభ,
IPL 2026లో అన్సోల్డ్.. 69 బంతుల్లోనే 195 రన్స్ తో ఊచకోత
ఐపిఎల్ 2026 మినీ-వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా, అయోధ్య ప్రీమియర్ లీగ్లో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్ లో గోమతి థండర్ తరఫున ప్రియాంశు పాండేతో కలిసి చికారా ఓపెనర్ గా బరిలోకి దిగాడు. వీరిద్దరూ భారీ షాట్లతో ఊచకోత కోశారు. ముఖ్యంగా చికారా ఆకాశే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో కేవలం 69 బంతుల్లో 21 సిక్సర్లు, 11 బౌండరీలతో అజేయంగా 195 పరుగులు సాధించాడు. పాండే 54 బంతుల్లో 100 పరుగులతో (12 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు. ఓపెనర్లు ఇద్దరు సెంచరీలతో చెలరేగడంతో గోమతి థండర్.. 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 307 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. అనంతరం టైటాన్స్ జట్టు 218 పరుగులకే ఆలౌట్ అయింది. శేఖర్ సిరోహి 33 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. థండర్ బౌలర్లలో రితిక్ శ్రీవాస్తవ(3/51), అరవింద్ర వర్మ(3/26), ఆతిఫ్ సాజిద్(2/13)లు రాణించారు. కాగా, స్వస్తిక్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్రాతినిధ్యం వహించినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2026 వేలానికి ముందు స్వస్తిక్ ను ఆర్సిబి విడుదల చేసింది. మినీ వేలంగా అతనిని కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపించకపోవడంతో అన్సోల్డ్గా మిగిలాడు.
తెలంగాణ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం
తెలంగాణ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం బీఆర్ఎస్ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్
వెండి తాపడం తయారీకి రూ.50,516 లు విరాళం…..
వెండి తాపడం తయారీకి రూ.50,516 లు విరాళం….. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ
మధ్యాహ్నం భోజనంపై గరికపాటి గాడిద గుడ్డు వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో ట్రోల్
గాడిద గుడ్డు గాడిద ఎక్కడన్నా గుడ్డు పెడుతుందా? అంటే అది పిల్లలను మాత్రమే కంటుంది.. కానీ గుడ్డు గాడిద గుడ్డు అనేది ఒక జాతీయంగా తెలుగులో స్థిరపడిపోయింది.. ఇది ఒక సెటైరికల్ గా వాడే పదంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం అనేది గత 40 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రవేశపెట్టబడి ఎన్నో అంతర్జాతీయ సంస్థల అభినందనలు అందుకని వాటి సహకారంతో కూడా కొన్నాళ్ళు అంగన్వాడీల ద్వారా నడిచింది.. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దానిని గుర్తించి పిల్లల స్కూల్ డ్రాప్ అవుట్ లు తగ్గించడానికి సహాయపడుతుంది అని దానిని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో ఉన్నారు అని యూనిసెఫ్ సంస్థ చాలా దేశాలలో గుర్తించింది. అందులో మన దేశం కూడా ఒకటి.. దీనిని ఎదుర్కొనడానికి ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా ఒక చిన్న ప్రయత్నం అంతేకానీ అదే సమాధానం కాదు.. ఆ గుడ్లు సరిగ్గా ఉడకలేదని అసహనమో? లేక ఉపాధ్యాయులకు ఆ పని అప్ప చెప్పడం వలన వారు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అని అసహనమో? తెలియదు కానీ ఏదో చెప్పాలని మరేదో అన్నారు. గుడ్డు గాడిద గుడ్డుతో ఆగింటే అదొక జాతీయంగా ఆగిపోయిండేది కానీ శోభనము పెళ్ళికొడుకుల ఇక మాట వింటాడా? అని అనడంతో అది అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.. ఈ మధ్యన ఎందుకో ఆయన ఎక్కువగా వివాదాస్పదమైన వ్యాఖ్యలతో మాట తూలుతున్నారు. తిండి విషయంలో ఒకసారి, లేదా రాష్ట్రం పేరు మార్చాలి అని మరొకసారి, ఇక ఆడవాళ్ళ వస్త్రధారణ పైన అనేకసార్లు, చిరంజీవి గారి పైన కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఈ మధ్యన వార్తలలో ఉంటున్నారు. దానికి తోడు ఈ గుడ్డు వ్యవహారం అనవసరమైన వ్యవహారం గా ఆయన మెడకు చుట్టుకుంది. మాడుగుల నాగఫణి శర్మ లాంటి అష్టావధానులు ఎప్పుడు కూడా ఇటువంటి వివాదాలలో చిక్కుకోలేదు. వారు కూడా అష్టావధానంలో అధిక ప్రసంగం అని ఒకటి ఉంటుంది అందులో కూడా సరస చలోక్తులకు వదులుతూ ఉంటారు. అలా వ్యంగంగా మాట్లాడడం కవులకు కామన్ అయినప్పటికీ ఎందుకో ఈ గుడ్డు విషయంలో వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది. చాలామంది వ్యక్తులకు, సంస్థలకు ప్రయోజనం ఉన్నప్పుడు, చాలా మంది విద్యార్థులకు దీనివలన ప్రయోజనం కలిగి ఉన్నప్పుడు, దీనివలన మాల్ న్యూట్రిషన్న్ తగ్గించే ఒక మంచి ఆలోచన ప్రభుత్వం ద్వారా జరుగుతున్నప్పుడు ఇలాంటి విషయం మాట్లాడకుండా ఉండడం, ఒకవేళ ఉపాధ్యాయుల పనితీరు దీని వలన తగ్గుతుంది అని అనుకుంటే సూటిగా సమస్య గురించి చెప్పి ఉంటే బాగుండేది.. కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః । వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥ భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు. చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశిచునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాలా కేశాలంకరణలూ పురుషునికి నిజమైన అలంకరణలు కా జాలవు. వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకారప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం..!
ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం..! వెండి కిరిటాలు, బంగారపు ఉంగరాలు నాకొద్దు..!నా
అంజుమన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ…
అంజుమన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ… లీజుదారులకు న్యాయం చేయకుంటే ఆందోళన
అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా
‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా’ ఎక్స్ వేదికగా సిఎం రేవంత్రెడ్డి ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి సిఎం రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ కర్మాగారం సిఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రారంభానికి వెళ్లే ముందు ‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని’ సిఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని, సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదనీ, కేవలం 17 నెలల వ్యవధిలో ఫామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామని ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఐపిఎల్ ఆడాలంటే.. ప్రత్యేక డిమాండ్లు.. ఫన్నీగా కోహ్లీ రిప్లై..
టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ శాతం లండన్లో ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఉన్న సమయంలో మాత్రమే ఇండియాకు వచ్చి మళ్లీ పూర్తవగానే తిరిగి వెళ్లిపోతున్నాడు. అయితే కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపిఎల్ కోసం విరాట్ ఇప్పటికే బెంగళూరు చేరుకొని అక్కడ సాధన కూడా ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో విరాట్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొన్ని డిమాండ్లు చేసినట్లు సోషల్మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ఒకటి బెంగళూరు నుంచి నేరుగా లండన్కి ఒక ఛార్టెర్డ్ ఫ్లైట్ కావాలని విరాట్ డిమాండ్ చేసినట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై విరాట్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘ఈసారి ఐపిఎల్కు విరాట్ కోహ్లీ భారీ డిమాండ్లతో వచ్చాడు. మాకున్న సమాచారం ప్రకారం.. భారత్ టు లండన్కు ఛార్టర్డ్ ఫ్లైట్కి అనుమతి ఇవ్వాలి. మ్యాచ్లకు కనీసం మూడు రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఉంటే లండన్కు పంపాలి. తదుపలి మ్యాచ్కు ఒక్క రోజు ముందు మాత్రమే అక్కడి నుంచి వస్తా’’ అని రాసిన పోస్ట్ను విరాట్ షేర్ చేశాడు. దానికి రెండు నవ్వుతూ ఉండే ఎమోజీలను జత చేశాడు. దీంతో విరాట్పై వచ్చిన కథనాలు అన్ని అవాస్తవం అని తేలిపోయింది.
దాతృత్వం చాటుకున్న టీడీపీ నేతలు
దాతృత్వం చాటుకున్న టీడీపీ నేతలు పెదకూరపాడు, ఆంధ్రప్రభ : మండలం గారపాడు గ్రామంలో
ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులకు ఎట్టకేలకు మోక్షం?
మన్నెవారి పల్లి వద్ద ఔట్లెట్ వైపు ప్రత్యేక పూజలు నిర్వహించి టన్నెల్ను పునః ప్రారంభించిన అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్లో జరిగిన ప్రమాదం కారణంగా నిలిచిపోయిన పనులు, సుమారు ఏడాది కాలం తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో నల్లగొండ జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య మన్నెవారి పల్లి వద్ద ఔట్లెట్ వైపు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎస్ఎల్బిసి టన్నెల్ పునః ప్రారంభించి నట్టుగా సమాచారం ఈ ప్రాజెక్టు పనులు గతంలో నిలిచిపోవడంతో జిల్లాలోని సాగునీటి సరఫరాపై ప్రభావం పడింది. అయితే, ఇప్పుడు పనులు మొదలవ్వడంతో ఈ ప్రాంత రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి. సొరంగం పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రస్తుతం డిబిఎం (- డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్) పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో ఈ డ్రిల్లింగ్ పనులను పూర్తి చేసి, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లీంచే ఈ సొరంగం పూర్తయితే, నల్లగొండ జిల్లాలోని లక్షలాది ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. రాష్ట్రంలో ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల్లో కొంతమంది మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. కానీ, ఈ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది.
2రెండో ఎస్టీపీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి…2
రెండో ఎస్టీపీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి… వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ డా.
BRS |సీఎం రేవంత్ పై విమర్శలు..
BRS | సీఎం రేవంత్ పై విమర్శలు.. BRS |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
Sharwa’s Biker Trailer: First-Of-Its-Kind Indian Racing Spectacle
Charming Star Sharwa’s next outing Biker shifts gears with a trailer that fires on all cylinders, raising the anticipation for its April 3rd release. Directed by Abhilash Reddy and backed by UV Creations, the film positions itself as a rare blend of high-speed racing and intense family drama. The trailer opens with a sharp question- […] The post Sharwa’s Biker Trailer: First-Of-Its-Kind Indian Racing Spectacle appeared first on Telugu360 .
హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్
హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి […] The post హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్ appeared first on Visalaandhra .
Kannada Superstar Yash’s upcoming film Toxic was planned for 2025 release but it was finally planned for March 19th release. Then came Dhurandhar: The Revenge and Toxic walked out of the race to avoid the clash. The team cited the Gulf war as the reason for the postponement but the real reasons are different. The […] The post Yash’s Toxic: A Great Escape appeared first on Telugu360 .
Senior Congress Leader Jeevan Reddy Signals Exit, Sets June 25 for Final Decision
Senior Congress leader and former MLC T. Jeevan Reddy has created a major stir in Telangana politics by indicating his decision to quit the party. A veteran with over four decades of association with the Congress, Jeevan Reddy has openly expressed deep dissatisfaction with the party leadership and its recent functioning. In a clear statement, […] The post Senior Congress Leader Jeevan Reddy Signals Exit, Sets June 25 for Final Decision appeared first on Telugu360 .
ఎఫ్ టీసీసీ అవార్డు మరింత ఉత్తేజాన్ని నింపింది…
ఎఫ్ టీసీసీ అవార్డు మరింత ఉత్తేజాన్ని నింపింది… బాయన బాబుజి (బాబ్జి) భవానిపురం,
మృతునికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
మృతునికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో
Revanth Reddy : సిద్ధిపేటలో నాయకత్వాన్ని మార్చండి.. మంత్రిని చేస్తాం : రేవంత్ రెడ్డి
సిద్ధిపేటలో మార్పు చేసి చూడాలని, మంచి జరుగుతుందో లేదో చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ
ప్రపంచ దేశాలకు తిరుపతి నుంచి బలమైన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “యుద్ధం కాదు – శాంతి కావాలి” అనే నినాదాలతో ఈరోజు తిరుపతి నగరంలో విశాలమైన శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.మరణిస్తున్న పసి కందులు, అమాయక ప్రజలు మరియు యుద్ధ వాతావరణం పట్ల మనస్సు కలత చెందిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ […] The post యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ appeared first on Visalaandhra .
చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.కోటి విరాళంగా అందించింది. The post టీటీడీకి రూ.కోటి విరాళం appeared first on Visalaandhra .
పంట మార్పిడి ద్వారానే.. వ్యవసాయం లాభసాటి: సిఎం
నర్మెట: ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాకర్టీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి విడుతలో రూ.3,600 కోట్లను విడుదల చేశారు. విడుదల చేసిన మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమా అవుతుంది. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో మాత్రం వెనుకంజ వేయటం లేదని అన్నారు. ఆర్థిక సమస్యలు అభివృద్ధికి అవరోధంగా మారాయని తెలిపారు. రైతుభరోసా నిధులను మొత్తం మూడు విడతల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 45 రోజుల్లో 3 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు వేయనున్నట్లు సిఎం తెలిపారు. ‘‘రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి, రుణమాఫీ కూడా చేశాం. వరికి బోనస్ ఇస్తున్నాం. వరదల వల్ల నష్టపోతే పరిహారం ఇస్తున్నాం. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ ప్రాంతం నిజాం కాలంలోనే వాణిజ్య పంటలకు ప్రసిద్ధిగా ఉండేది. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు బాగా పండించేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రంగారెడ్డి జిల్లా పంటల సాగు తగ్గింది. కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం 50 లక్షల టన్నుల వరి మాత్రమే కొంటామని చెప్తోంది. పంట మార్పిడి ద్వారా మాత్రమే.. వ్యవసాయం లాభసాటి అవుతుంది’’ అని సిఎం తెలిపారు. సిద్ధిపేటలో నిర్మించినటువంటి ఫ్యాక్టరీ కొడంగల్లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నానని సిఎం అన్నారు. ‘‘అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని రైతులంతా ముందుకెళ్లాలి. తెలంగాణలో ఒక్కో జిల్లా.. ఒక్కో పంటలకు ప్రసిద్ధి. తెలంగాణలో సారవంతమైన భూములున్నాయి.. కష్టపడే రైతులు ఉన్నారు. మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని నిర్ణయించాం. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నాం. ఒకప్పుడు సౌరవిద్యుత్ వ్యాపారం అంబానీ, అదానీ వంటి వారు చేసేవారు. ఈ ప్రభుత్వం మహిళలచే సోలార్ప్లాంట్లను ఏర్పాటు చేయించింది. ఈ ప్రభుత్వం మహిళలను ఆర్టిసి బస్సులకు యజమానులను చేసింది’’ అని సిఎం పేర్కొన్నారు.
70 lakh people | 45 రోజుల్లో 9 వేల కోట్లు…
70 lakh people | 45 రోజుల్లో 9 వేల కోట్లు… 70
కారు–బైక్ ఢీ…. ఊరుకొండ, ఆంధ్రప్రభ : కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్పై
యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం
కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేగ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావంట్రంప్ను నిలదీయడంలో మోదీ మౌనంమోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి29న హైదరాబాద్లో “నో వార్” భారీ ప్రదర్శనతిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?` సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ విజయవాడ The post యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం appeared first on Visalaandhra .
తెలంగాణలో అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు విడుదల చేసినట్లు సిఎం తెలిపారు. ఒక ఎకరం వరకు రైతులందరికీ ఈ నిధులు జమ కానున్నాయి. అయితే, ఇవాళ ఆదివారం కావడంతో రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 9 వేల కోట్లను జమ చేయనుంది.
సేవలకు సలాం… గోనెల నానికి నంది అవార్డు… బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి
March25th | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ఆర్థిక సహాయం అందజేత.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం
శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం…
శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం… చిట్యాల, ఆంధ్రప్రభ : మండల
పైప్డ్ గ్యాస్.. సురక్షితం, సౌకర్యవంతం…
పైప్డ్ గ్యాస్.. సురక్షితం, సౌకర్యవంతం… పీఎన్జీ కనెక్షన్ దిశగా ప్రజలు దృష్టిసారించాలి..ముందు జాగ్రత్తగా
ఆడ.. మగ..వరి అందమైన మడి… ఆడ మగ వరి వేరు వేరు వరసలో..మగరకం
తొర్రూరు, ఆంధ్రప్రభ : గోవుల సంరక్షణ అందరి బాధ్యతగా మారాలని కాంగ్రెస్ నియోజకవర్గ
పంజాగుట్టలో విషాదం.. బాల్కనీ స్లాబ్ కుప్పలకూలి ఇద్దరు మృతి
బాల్కనీ స్లాబ్ కుప్పకూలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటనల హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్ బాగ్ మెథడిస్ట్ కాలనీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్మెంట్ యజమాని ద్వారకా ప్రసాద్.. విద్యుత్ పనుల నిమిత్తం ఇద్దరు కూలీలను తన నివాసానికి పిలిపించాడు. మూడో అంతస్తుకు తీసుకెళ్లి పనుల గురించి మాట్లాడుతుండగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా బాల్కనీ స్లాబ్ కుప్పకూలింది. దీంతో ముగ్గురు కిందపోయారు. స్లాబ్ శిథిలాలు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడిన కూలీ వర్కర్లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యజమాని ద్వారకా ప్రసాద్ కు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను సీతారాంబాగ్కు చెందిన దేవీదాస్ (56), వివేక్ (32)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
నేరాలను అదుపులో ఉంచడానికి సీసీ కెమెరాలు…
నేరాలను అదుపులో ఉంచడానికి సీసీ కెమెరాలు… ముత్తునూరులో సీసీ కెమెరాలు అమరచాలని ఎస్సై
రూ.50 లక్షలతో శివాలయంలో అభివృద్ధి పనులు
రూ.50 లక్షలతో శివాలయంలో అభివృద్ధి పనులు హుజూర్నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్నగర్ పట్టణంలో
Trivikram | టార్గెట్ ఫిక్స్.. Trivikram | త్రివిక్రమ్ – వెంకటేష్ ఆదర్శ
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం
భీమారం, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ మండల పార్టీకి బిగ్ షాక్ తగలనుందా అంటే
నర్సంపేట పెళ్లి వేడుకలో భావోద్వేగ క్షణాలు
నర్సంపేట పెళ్లి వేడుకలో భావోద్వేగ క్షణాలు నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : పెళ్లి
శ్రీ సీతారాముల కళ్యాణంనకు ఏర్పాట్లు…
శ్రీ సీతారాముల కళ్యాణంనకు ఏర్పాట్లు… చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
Rohit Reddy |ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ వేగం..
Rohit Reddy | ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ వేగం.. Rohit Reddy
చిన్నారులకు మాజీ ప్రభుత్వ విప్ సునీత ఆశీర్వాదం…
చిన్నారులకు మాజీ ప్రభుత్వ విప్ సునీత ఆశీర్వాదం… ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి
ఘనంగా ప్రపంచశాంతి కోరుతూ కవి సమ్మేళనం..
ఘనంగా ప్రపంచశాంతి కోరుతూ కవి సమ్మేళనం.. వరల్డ్ పీస్ సొసైటీ తెలంగాణ ప్రభుత్వ
బడ్జెట్ అంతా డోల్ల.. ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : ప్రజల ఆశలను
సైబర్ వలలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు #CyberCrime #Polavaram #MLA #OnlineFraud #RTA
నాకు ఆ సీజన్ ఎంతో దారుణమైంది.. వారికి కోపం తెప్పించా: వరుణ్
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో మనందరికీ తెలిసిందే. లక్షలాది మంది ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ పేరుతో ప్రజల్ని బయటకు రానివ్వకుండా చేశాయి. ఈ వైరస్ ప్రభావం ఐపిఎల్పై కూడా పడింది. దీంతో 2021 సీజన్ ఐపిఎల్ను అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్ మధ్య కొన్ని మ్యాచ్లు మాత్రమే నిర్వహించారు. ఇద్దరు ప్లేయర్లకు కొవిడ్ పాజిటివ్గా రావడంతో లీగ్ను నిర్వహకులు మధ్యలోనే ఆపేశారు. దీనంతటికీ వరుణ్ చక్రవర్తి కారణం అంటూ సోషల్మీడియాలో అభిమానులు అతన్ని ఏకిపారేశారు. భుజం నొప్పితో బాధపడుతున్న అతను బయోబబుల్ దాటి బయటకు వెళ్లడంతో అతడికి కరోనా వైరస్ సోకింది. అతడితో పాటు సందీప్ వారియర్కూ వచ్చింది. దీంతో ఆ తర్వాతి మ్యాచ్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ‘‘నా ఐపిఎల్ కెరీర్లో 2021 సీజన్ అత్యంత దారుణమైంది. నాకు కొవిడ్ రావడం వల్ల లీగ్ మధ్యలోనే వాయిదాపడింది. పాజిటివ్ వచ్చిన తొలి ఆటగాడిని నేనే. దీంతో బయట నుంచి అభిమానులు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన లీగ్ మధ్యలోనే ఆగిపోవడంతో వారికి కోపం వచ్చింది. ఇంకా బతికే ఉన్నావా? అంటూ కామెంట్లు వచ్చాయి’’ అని వరుణ్ వెల్లడించాడు.
ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం..
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఇండోర్లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసకుంది. సాన్వేర్ రోడ్డులోని నర్వాల్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గిడ్డంగిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. ఆ గిడ్డంగిలో ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతూ.. దట్టమైన నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. గిడ్డంగి సమీపంలోని కార్మికుల నివాసాలకు ప్రమాదం పొంచి ఉండటంతో.. వారు ముందుజాగ్రత్తగా తమ సామాగ్రిని బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పది ఫైరింజన్లతో శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఇండోర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

26 C