SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

కామారెడ్డి లో టెన్షన్.. టెన్షన్

బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించడంతో కామారెడ్డిలో టెన్షన్ నెలకొంది

తెలుగు పోస్ట్ 21 Feb 2026 9:26 am

సౌత్‌లో బిజీ బిజీగా..

కెరీర్ ప్రారంభంలో ‘మహానటి’ సినిమాతో పెద్ద హిట్‌ను అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘రౌడీ జనార్దన’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. దీంతోపాటు వెంకటేష్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనూ ఈ భామనే హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు. ఇంత వరకూ ఈ జోడీ వెండి తెరపై కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఈ జోడీపై ఆసక్తి నెలకొంది. అలాగే ‘మహేంద్రగిరి వానర’లోనూ అతిధి పాత్రలో నటిస్తోంది. ఇక తమిళ్‌లో ‘కన్నైవేడి’, మలయాళంలో ‘తొట్టమ్’ అనే చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా కోలీవుడ్ లో మరో రెండు ప్రాజెక్ట్‌లకు సైన్ చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. అలాగే హిందీలో కూడా ఓ సినిమాకు కమిట్ అయిందని ప్రచారం జరుగుతోంది. మాలీవుడ్‌లో కూడా ఓ సీనియర్ స్టార్ కు జోడీగా నటిస్తుందని వార్తలొస్తున్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కీర్తి సురేష్ ఇంత బిజీ గా మారుతుందని తాను కూడా ఊహించి ఉండదు. అమ్మడికి వెంకటేష్ ప్రాజెక్ట్ కీలకమైంది. ఇందులో వెంకీకి జోడీగా సెట్ అయితే గనుక మిగతా సీనియర్ హీరోల సరసన ఛాన్సులు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చిరంజీవి, రజనీకాంత్ లాంటి స్టార్స్ చిత్రాల్లో కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 21 Feb 2026 9:25 am

ధ్రిల్లర్ జోనల్ మూవీలో..?

గత సంవత్సరం జాక్, తెలుసు కదా సినిమాలతో వచ్చిన యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రేక్షకులను నిరాశ పరిచాడు. తెలుసు కదా సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని కొత్త కథతో ఈ హీరో సిద్ధమవుతున్నాడు. నవీన్ పొలిశెట్టికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా దర్శకుడు స్వరూప్ దర్శకత్వంలో సిద్దు సినిమాకు లైన్ క్లియర్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వీరి కాంబినేషన్‌ను ముందుకు తీసుకు వెళ్లేందుకు కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే స్వరూప్ రెడీ చేసుకున్న థ్రిల్లర్ జోనర్ స్క్రిప్ట్ కి తనదైన హంగులు అద్దుతూ సిద్ధ్దు దాన్ని తీర్చి దిద్దుతున్నాడని సమాచారం. సూపర్ హిట్స్ డీజే టిల్లు, టిల్లు స్వేర్ సినిమాల స్క్రిప్ట్ విషయంలో సిద్దు జోక్యం చేసుకున్నాడని అంటారు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఇప్పటికే ’రాంబో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. 

మన తెలంగాణ 21 Feb 2026 9:14 am

Will Prabhas work with Puri Jagannadh?

During the promotional interview of Couple Friendly, Prabhas has expressed his love for Puri Jagannadh. He said that no director can write the characterization of a lead actor like Puri Jagannadh. Prabhas heaped praise on Puri and he also wished to work with him again. But what’s stopping him from working with Puri is the […] The post Will Prabhas work with Puri Jagannadh? appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 9:12 am

Tirumala : శనివారం ఎందుకు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

తెలుగు పోస్ట్ 21 Feb 2026 9:05 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ನದಿಯ ಮೇಲೆ ನಿರ್ಮಿಸಲಾಗಿದ್ದ ಸೇತುವೆಯೊಂದು ಕುಸಿದಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ನದಿಯ ಮೇಲೆ ನಿರ್ಮಿಸಲಾಗಿದ್ದ ಸೇತುವೆಯೊಂದು ಕುಸಿದಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 21 Feb 2026 9:00 am

ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసిన మహిళపై వ్యామోహం

అమరావతి: ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయం కావడంతో ఆమెతో వన్ సైడ్ లవ్‌లో పడ్డాడు. ఆమెపై వ్యామోహంతో సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కంచుకోట అశోక్(26), సోషల్ మీడియాతో దుర్గాభవాని అనే మహిళ పరిచయమైంది. ఆమె భర్త సాయికుమార్‌తో ఆశోక్‌కు సోషల్ మీడియాలో పరిచయం ఉండడంతో స్నేహితులుగా మారారు. దంపతులతో చెన్నైలో రెస్టారెంట్ పెడుదామని సదరు యువకుడు నిర్ణయం తీసుకోవడంతో వాళ్లతో చర్చలు జరిపాడు. పది రోజుల క్రితం సదరు యువకుడ పత్తికొండకు వచ్చి దంపతులను కలిశాడు. ఓ రూమ్ అద్దెకు చూపించి అక్కడనే యువకుడిని ఉంచారు. సదరు యువకుడు దుర్గభవానిపై కన్నేశాడు. తనతో రావాలని పలుమార్లు కోరాడు ఆమె నిరాకరించింది. అర్థరాత్రి ఫోన్ చేసి భర్తను వదిలి రావాలని ఆమెను కోరాడు. ఆమె నిరాకరించడంతో తన రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. వెంటనే ఈ విషయం భర్తకు తెలపడంతో ఇద్దరు కలిసి అతడి రూమ్‌కు వెళ్లారు. ఉరేసుకున్న అతడిని కిందకు 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. 

మన తెలంగాణ 21 Feb 2026 8:56 am

Hyderabad : తుది దశకు హైదరాబాద్ మెట్రో టేకోవర్

హైదరాబాద్ మెట్రో టేకోవర్ తుది దశకు చేరుకుంది

తెలుగు పోస్ట్ 21 Feb 2026 8:47 am

India - South Africa : చివర వరకు మ్యాచ్ ఉత్కంఠ.. గెలుపు ఎవరిదన్నది అంచనా కష్టమే

భారత్ -దక్షిణాఫ్రికాల మధ్య సూపర్ 8 మ్యాచ్ రేపు జరగనుంది

తెలుగు పోస్ట్ 21 Feb 2026 8:27 am

శ్రీశైలంలో మార్చి 3న ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన ఉదయం శ్రీశైలంలో ఆలయాన్ని మూసివేస్తారు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 8:23 am

Trump Imposes 10% Global Tariff After Supreme Court Setback

In a dramatic escalation of his trade policy agenda, US President Donald Trump announced a sweeping 10 percent global tariff on imports from all countries. The move came within hours of a Supreme Court ruling that reportedly declared portions of his earlier tariff measures unlawful. The decision signals a direct confrontation between the executive branch […] The post Trump Imposes 10% Global Tariff After Supreme Court Setback appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 8:17 am

సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యాడు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 8:13 am

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్

సచివాలయ ఉద్యోగులకు రంజాన్ మాసం సందర్భముగా హాజరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమినహాయింపు ఇచ్చింది.

తెలుగు పోస్ట్ 21 Feb 2026 8:08 am

దుబ్బాకలో కాంగ్రెస్ నేత గొంతుకోసి హత్య

దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. రాజక్క పేట గ్రామ శివారులో కాంగ్రెస్ నేత వంగ బాల్ రెడ్డిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్ రెడ్డికి తన దాయాదులతో  భూ తగాదాలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం రాజక్కపేట గ్రామ శివారులో  బాల్ రెడ్డిపై దాడి చేసి అనంతరం గొంతు కోసి చంపేశారు. అనంతరం నిందితులు తల్లి, కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. 

మన తెలంగాణ 21 Feb 2026 7:54 am

America : ట్రంప్ సుంకాల రద్దు..కోర్టు తీర్పు మండిపడిన అమెరికన్ ప్రెసిడెంట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రపంచ దేశాలపై విదించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది

తెలుగు పోస్ట్ 21 Feb 2026 7:45 am

రైతును కోటీశ్వరుడిని చేసిన పాత ట్రాక్టర్...

హైదరాబాద్: సోషల్ మీడియా వచ్చిన తరువాత ఎప్పుడు ఎవరు వైరల్ అవుతున్నరో అర్థం కావడం లేదు. రాత్రికి రాత్రే కొందరు సెలబ్రిటీ లిస్ట్ లో చేరిపోతున్నారు. ఒక వీడియో వైరల్ అయితే చాలు వాళ్లు సెలబ్రిటీలు అవుతున్నారు. మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది వైరల్ గా మారి  ఓ విదేశీయుడి కంట్లో పడింది. విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడికి పాత ట్రాక్టర్ నచ్చడంతో పాటు ఆ వాహనం అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించారు. వెంటనే ట్రాక్టర్ యజమానికి రూ.1.25 కోట్లు చెల్లించి పాత ట్రాక్టర్ ను కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్టుతో ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించడంలో ఉంటుందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. 

మన తెలంగాణ 21 Feb 2026 7:30 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಬಂಗೀ ಜಂಪ್‌ ಮಾಡುವಾಗ ಯುವತಿಯೊಬ್ಬಳು ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾಳೆ ಎಂದು ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಂಚಿಕೆ

ಬಂಗೀ ಜಂಪ್‌ ಮಾಡುವಾಗ ಯುವತಿಯೊಬ್ಬಳು ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾಳೆ ಎಂದು ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 21 Feb 2026 7:10 am

కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో ఎఐ వార్ రూమ్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తు న్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేం దుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ప్రసంగించిన సిఎం, మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసా యం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇం కో టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన కీలకమలుపు అని ఆయన అభివర్ణించారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుం డా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని ఆయన పేర్కొన్నారు. రోబోటిక్స్ కలిసినప్పుడు యంత్రాలు మానసిక మేథస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా  పొందుతున్నాయని సిఎం రేవంత్ అన్నారు. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని ఆయన హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో -సెమీకండక్టర్ చిప్ తయారీ, జీపియూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫాంలు, దరఖాస్తులు భారత్ స్పష్టమైన వ్యూహాంతో ముందుకు సాగాలని సిఎం సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం-రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. వార్‌రూం నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధం కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చన్నారు. అయితే సరైన రీ-స్కిల్లింగ్, అప్- స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించబడే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ- ఆధారిత భవిష్యత్‌కు సిద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపా దించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ఏఐ స్టార్టప్ విలేజ్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని సిఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఏఐ అభివృద్ధి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని సిఎం కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

మన తెలంగాణ 21 Feb 2026 6:00 am

21stfeb2026 |శనివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

21stfeb2026 | శనివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 21stfeb2026 |

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:00 am

ట్రంప్ సుంకాలకు చుక్కెదురు

వాషింగ్టన్: నాకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్ అని ప్రకటించుకోవడమే కాకుండా... ఎడాపెడా సుంకాలు వేస్తూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా తన దారి కి తెచ్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవు అని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా దేశాల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి వారికి చెల్లించాలని స్పష్టం చేసింది. ట్రం ప్ తన అధికారాలను అతిక్రమించారని మొట్టికాయలు వేసింది. దేశ వాణిజ్య భాగస్వాముల పై సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, అధికార పరిధిని మించిపోవడమేనని ఘాటైన వ్యా ఖ్యలు చేసింది. ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. జాతీయ అ త్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన అత్యవసర వినియోగాల చట్టాన్ని అతిక్రమించారని అభిప్రాయపడింది. శుక్రవారంనాడు అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం 6-3 తేడాతో ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. 1997 నాటి అంతర్జాతీయ అత్యవసర అధికారాల చట్టం(ఐఇఇపిఎ) ప్రకారం వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విధించిన టారిఫ్‌లు చెల్లనేరవని స్పష్టం చే సింది. ‘సుంకాలను విధించే ప్రత్యేక అసాధారణ అధికారాన్ని చట్టసభ కాంగ్రెస్ ఐఇఇపిఎతో తెలియజేయాలనుకుంటే అది స్పష్టంగా చేసి ఉండేది. సుంకాలను, పన్నులను విధించే అధికారం అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్‌కు మాత్రమే ఇస్తుంది, అధ్యక్షుడికి కాదు’ అని కుండబద్ధలు కొట్టింది. ఈ సుంకాలను ట్రంప్ కీలక ఆర్థిక, విదేశాంగ విధానాలకు సాధనంగా ఉపయోగించారని దుయ్యబట్టింది. దిగువ కోర్టుల తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తీర్పును విపక్ష డెమొక్రాట్లు, పరిశ్రమ, వాణిజ్య వర్గాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్‌లు లాభాల బాటలో దూసుకెళ్లాయి. మరోవైపు సుప్రీం తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తనదగ్గర ‘ప్లాన్ బి’ ఉందని వ్యాఖ్యానించారు. తద్వార టారిఫ్‌లపై వెనక్కి తగ్గేది లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అప్పుడు ట్రంప్ ఏమన్నారంటే..? 2025, ఏప్రిల్‌లో ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి పేరిట దేశంలో వాణిజ్య లోటును పరిష్కరించడానికి చాలా దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక భద్రతకు ఈ సుంకాలు ముఖ్యమని అభివర్ణించారు. లేకపోతే దేశం రక్షణ భారమవుతుంది, అది విధ్వంసానికి దారితీస్తుందని ప్రకటించారు. ఏప్రిల్ 2న శ్వేతసౌధంలో ‘మేక్ అమెరికా వెల్తీ అగేన్‘ అనే పేరుతో రోజ్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో పరస్పర సుంకాలపై వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఒక చార్ట్‌ను పట్టుకుని ఏయే దేశాలపై ఎంత మేరకు టారిఫ్‌లు విధిస్తున్నది ప్రకటించడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. డిసెంబర్ నాటికి అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల నుండి ట్రెజరీ 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని సమాఖ్య డేటా చూపిస్తుంది. మరోవైపు వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ వచ్చి ట్రంప్ భారత్‌ను కూడా వదిలిపెట్టలేదు. ఏకంగా 50శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్ సంప్రదింపులు, ఒప్పందం నేపథ్యంలో ఇటీవల వాటిని 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎంత వసూలు అయింది? కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం ప్రకారం, ట్రంప్ సుంకాల ఆర్థిక ప్రభావం వచ్చే దశాబ్దంలో సుమారు 3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల నుండి ట్రెజరీ 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని డిసెంబర్ నుండి ఫెడరల్ డేటా చూపిస్తోంది. ప్రభుత్వం ఇతర మార్గాల్లో సుంకాలను తిరిగి విధించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ తీర్పు తాత్కాలికమేనని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

మన తెలంగాణ 21 Feb 2026 5:30 am

డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ రోల్‌మోడల్

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ), క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ చేసి.. డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాల కు రోల్ మోడల్‌గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్ర భుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించా రు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్‌వేర్‌గా మాత్రమే కాకుండా... ఓ ట్రాన్స్‌ఫర్మేషన్ టూల్‌గా మార్చుకుంటున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రణాళికలను న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో భాగంగా శుక్రవారం ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్: ఎఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియెన్స్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. పౌర సేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి... ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఎఐ సిటీ, ఎఐ యూనివర్సిటీ, ఐకం, ఎఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్‌ఛేంజ్, భూ భారతి లాంటి విప్లవాత్మక సంస్కరణలు డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ బ్రాండ్‌ను సుస్థిరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ఫలాలను కేవలం ఓ ప్రాంతానికో లేదా వర్గానికో పరిమితం చేయకుండా అందరికీ చేరువ చేసేలా ఏజెంటిక్ ఏఐ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించామని పేర్కొన్నారు. టెక్నాలజీని కేవలం గవర్నెన్స్‌కు మాత్రమే పరిమితం చేయకుండా వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర రంగాలకూ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ అవకాశాల గని : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణలో ఎఐ పరిశోధలు, ఆవిష్కరణలకు ప్రభావశీలమైన టాలెంట్ పూల్ ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.శుక్రవారం నాడు ఆయన ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్‌లో స్వీడెన్ వాణిజ్య ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. కృత్రిమ మేథ వెల్లువ వల్ల ఎదురయ్యే సవాళ్లను, అది తీసుకువచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ముందే సంసిద్ధమైందని తెలిపారు. దానికి తగ్గట్టుగా సాఫ్ట్‌వేర్ నిపుణుల నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఎఐ విస్తృతితో ఉద్యోగ విధుల్లో గణనీయమైన మార్పులు వస్తాయని, అందుకు అవసరమైన సన్నధను తమ ప్రభుత్వం మొదలు పెట్టిందని చెప్పారు. ఎఐ పరిశోధన కేంద్రాలు, అప్లికేషన్లు, సేవల వల్ల కొత్త ఉద్యోగాలు ఫుట్టుకొస్తాయని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు ఎఐ అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని, స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ అనేది రెండేళ్లుగా తాము మంత్రంలా జపిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఎఐ వినియోగం వల్ల లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెరుగుతుందని, దుర్వినియోగానికి ద్వారాలను మూసివేస్తుందని చెప్పారు. ఇందుకు అవసరమైన అప్లికేషన్లను రూపొందించడం, నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు గ్లోబల్ టెక్ కంపెనీలు ముందుకు రావాలని కోరారు. కృత్రిమ మేథ ఫలాలను ప్రజలందరి వద్దకు చేర్చేందుకు ప్రతి గ్రామానికి ఇంర్నెట్ కనెక్టివిటీని అందించే బృహత్తర యజ్ణం ఇప్పటికే మొదలైందని వెల్లడించారు. టీ- ఫైబర్ ప్రతి గ్రామాన్ని ప్రంపచంతో కనెక్ట్ చేసేందుకు రెండేళ్లుగా శ్రమిస్తోందని అన్నారు. ఎఐ ఓ గేమ్ ఛేంజర్ అని, దాన్ని మచ్ఛిక చేసుకోవాలి.. మన నైపుణ్యాలకు పదును పెట్టుకుని దానిని నియంత్రణలోకి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణా స్వర్గధామం లాంటిదని, కొత్తదనానికి రాష్ట్రం ఎప్పుడూ స్వాగతం పలుకుతూ ఉంటోందని వ్యాఖ్యానించారు. దీనికి అనుకూలమైన ఎకోసిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేశామని, నిరంతర విద్యుత్తు సరఫరా, స్థిరమైన విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 

మన తెలంగాణ 21 Feb 2026 5:00 am

ప్రపంచ దేశాల ముందు పరువుపోయింది

` ఏఐ సమ్మిట్‌లో నవ్వులపాలైన యూపీకి గల్గోటియాస్ యూనివర్సిటీ ` చైనా రోబో మాదేనంటు తప్పుడు క్లైమ్ ` సదస్సు నుంచి యూనివర్సిటీ గెంటివేత న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్ అత్యంత …

జనం సాక్షి 21 Feb 2026 4:31 am

ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం

` హైదరాబాద్‌లో వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం ` భారతదేశాన్ని ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి ` తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం …

జనం సాక్షి 21 Feb 2026 4:30 am

దానంపై ఏదీ దారి?

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసు అటు స్పీకర్‌కు, ఇటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్‌గా, చి క్కుముడిగా మారింది. కేసును త్వరితగతిన ము గించాలని సుప్రీంకోర్టు విధించిన గడువు ముంచుకొస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా చేసి ఎన్నికలకు వెళ్ళే ముందు స్పీకర్ తీసుకునే నిర్ణయంతో కొంత ప్రభా వం పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దానంపై అనర్హత వేటు వేస్తే తామే గెలుపొందినట్లు బిఆర్‌ఎస్ గొప్పగా ప్రచారం చేసుకునే అవకాశం లేకపోలేదు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ ఎనలేని జాప్యం చేస్తున్నారంటూ బిఆర్‌ఎస్ సు ప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇప్పటికే రెం డుసార్లు గడువు విధించిన సుప్రీం కోర్టు తాజాగా వచ్చే నెల 12వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా స్పీకర్‌కు ఇదే చివ రి గడువు అని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాస నం ఆదేశించింది. దీంతో స్పీకర్ తప్పని సరిగా ని ర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఫి రాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూలు ప్ర కారం) అనర్హత పిటిషన్లపై ఫలానా గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న నియమం ఏమీ లే దు. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కెఆ ర్ సురేష్‌రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు కౌన్సిల్‌లో ఎ మ్మెల్యేల కోటా నుంచి ఖాళీలేర్పడిన ఎమ్మెల్సీ స్థా నాలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ అ భ్యర్థిగా బరిలో నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్‌కు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో కాసాని విజ యం సాధించారు. దీంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరు తూ అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సురేష్ రెడ్డి సంవత్సరానికి పైగా కేసు విచారణ కొనసాగించారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ముగ్గురిపై అనర్హత వేటు వేసి మిగతా వారిని కేసు నుంచి మినహాయింపునిచ్చారు. వేటు పడిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణ రెడ్డి, లకా్ష్మరెడ్డి, బండారి శారా రాణిపై అనర్హత వేటు వేశారు. చిక్కు ముడి ఎక్కడంటే.. దానం కేసులో చిక్కు ముడి ఎక్కడంటే ఆయన పార్టీ ఫిరాయించారని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లయితే కాంగ్రెస్‌కు, ప్రభుత్వానికి కొంత నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకు కారణం లేకపోలేదు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించి లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దానంపై అనర్హత వేటు వేయించగలిగామని బిఆర్‌ఎస్ గళం విప్పి తమకు నష్టం కలిగించే ప్రమాదం ఉందన్న అనుమానం ఉంది. హైదరాబాద్‌లోని మూడు కొత్త కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. లోగడ సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు జాప్యం చేసినట్లు ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మీరు చర్య తీసుకుంటారా? లేక మమ్మల్నే తీసుకోమంటారా? అని వ్యాఖ్యానించిన సందర్భాలూ ఉన్నాయి. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ అందుకు కారణం సర్వోనత న్యాయస్థానం ధర్మాసనం సీరియస్‌గా ఉంది. అనర్హత పిటిషన్లను తేల్చేయాలంటూ ధర్మాసనం స్పీకర్‌కు విధించిన గడువు వచ్చే నెల 12వ తేదీతో ముగియనున్నది. దీంతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠత నెలకొంది. మణిపూర్‌లో ఏమి జరిగింది ? మణిపూర్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంతో సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకున్నది. స్పీకర్‌ను తీసుకుని రావాల్సిందిగా పోలీసులను ఆదేశించిడంతో, పోలీసులు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాల్సి వచ్చింది. దానం ఎలా బయటపడతారు ? దానం కేసుపై ఇప్పటికే పలు దఫాలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు దానంపై కేసు వేసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే (పిటిషనర్) పాడి కౌశిక్ రెడ్డి , కౌంటర్ పిటిషనర్ దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దానం పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేశారని, ఏఐసిసి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దానం పేరు ఉందని, బి-ఫారం తీసుకున్నారని ఆధారాలు చూపించారు. ఈ దశలో దానం తాను పార్టీ మారలేదని ఏ విధమైన సాక్షాలు చూపిస్తారని అన్ని పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా తన జీతభత్యాల నుంచి ఐదు వేల రూపాయలు బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం నిర్వహణ కోసం చెల్లిస్తున్నట్లు చెప్పారు. సస్పెన్షన్ మినహాయింపు అవుతుందా? దానం నాగేందర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నారన్న వార్తలు, ఊహగానాలు వస్తున్న సమయంలో తామే పార్టీ నుంచి దానంను సస్పెండ్ చేశామని ఆ పార్టీనే కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని దానం తనకు అనుకూలంగా మార్చుకుంటారని, పార్టీ నుంచి సస్పెండ్ చేసినందున తాను యధేచ్ఛగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశానని చెబుతారా? లేక ఇంకా ఏమైనా బలమైన సాక్షాలు ఉన్నాయా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. సస్పెన్షన్ అంతరంగిక వ్యవహారం.. అయితే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినందుకే తాను కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో దిగానన్న వాదనకు బలం లేదు. పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది పార్టీ అంతరంగిక వ్యవహారం. పార్టీ సస్పెండ్ చేయడం, అనంతరం సస్పెన్షన్ ఎత్తి వేయడం సర్వసాధారణం. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైనా సదరు సభ్యుని పదవీ కాలం ముగిసేంత వరకూ ఆ పార్టీ సభ్యుడిగా ఉండాలి. అంతేకాకుండా ఆ పార్టీ జారీ చేసే ‘విప్’ను సైతం పాటించాల్సిందే. సస్పెన్షన్ వేటు పడడంతోనే ‘ఫ్రీ బర్డ్’ అనేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు బిజెపి నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్ (గోషామహల్) సస్పెన్షన్‌కు గురయ్యారు. కానీ ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఆ పార్టీ జారీ చేసే విప్‌ను రాజాసింగ్ పాటించాల్సిందే. రెండింట మూడో వంతు మంది సభ్యులు పార్టీ మారేందుకు పదవ షెడ్యూలులో అవకాశం ఉందే తప్ప ఒక్కొక్కరు పార్టీ మారేందుకు చట్టంలో సౌలభ్యం లేదు. గతంలో దానంకు ఏమి జరిగింది..? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు గతంలోనూ చుక్కెదురైంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో దానం నాగేందర్ తనకు టిక్కెట్టు ఇస్తారో లేదోనన్న అనుమానంతో, టిడిపి అధికారంలోకి వస్తుందేమోనన్న ఆలోచనలతో టిడిపి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కెఆర్ సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నారు. టిడిపి ఎమ్మెల్యే దానంను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి వైఎస్ అయిష్టత కనబరిచారు. వెంటనే దానం నాగేందర్‌ను రాజీనామా చేయించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించడంతో త్రిముఖ పోటీలో దానం ఓటమి చెందారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై దానం నాగేందర్ తాను పార్టీ మారలేదని ఎటువంటి సాక్షాలు చూపిస్తారు? స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అన్ని పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. దానం ముందున్న ఏకైక మార్గం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి బయటపడాలంటే రాజీనామా చేయడం మినహా మారో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. రాజీనామా చేయకుండా అనర్హత వేటు పడితే ఆరేళ్ళ పాటూ చట్ట సభలకు పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోతుంది. బయటపడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మొత్తం పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎనిమది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిలేదని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య. టి. ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, కె. సంజయ్. అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ తీర్పునిచ్చారు. స్పీకర్ తీర్పుపై న్యాయస్థానంలో సవాల్ చేస్తామని బిఆర్‌ఎస్ ప్రకటించింది. (వీరన్నగారి ఈశ్వర్‌రెడ్డి)

మన తెలంగాణ 21 Feb 2026 4:30 am

బెంగాల్ ‘సర’ విధుల్లో సుప్రీం అసాధారణ నిర్ణయం

` ప్రక్రియలో జ్యూడీషియల్ అధికారుల నియామించండి ` ఆ రాష్ట్ర హైకోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు ` ఈసీ, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం దురదష్టకరం …

జనం సాక్షి 21 Feb 2026 4:29 am

ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ మెరుపు ధర్నా

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఏఐ సదస్సు వేదిక భారతీయ మండపంలో శుక్రవారం యువజనకాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. కొంద రు కార్యకర్తలు షర్టులు విప్పి, బనియన్లతోహాల్ నెంబరులో కొద్దిసేపు నినాదాలకు దిగారు. కేం ద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వీరు ఈ విధం గా దాదాపుగా అర్థనగ్నంగా మెరుపు ధర్నా చే పట్టారు. వారి చేతుల్లో మోడీ, ట్రంప్ బొమ్మలు ఉన్న టీషర్టులు ఉన్నాయి. హాల్ కలియతిరుగుతూ నినాదాలకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పే విధంగా మారింది. విదేశీ ప్రతినిధులు, నేతలు పరిస్థితిని విస్తుపోతూ చూస్తూ ఉన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది ఈ పది మందిని అదుపులోకి తీసుకుని తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్‌కు తరలించింది. శాంతిభద్రతలను ఉ ల్లంఘించేలా ఎవరూ వ్యవహరించరాదని, వీరి ని వెంటనే ఇక్కడి నుంచి వెంటనే తొలిగించామ ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై బిజెపి తీవ్రస్థాయిలో విమర్శించింది. ఏఐ సదస్సుతో భారతదేశానికి వస్తున్న ప్రపంచ స్థాయి ప్రతిష్ట కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అందుకే ఈ విధంగా చేశారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విమర్శించారు. 

మన తెలంగాణ 21 Feb 2026 4:00 am

పంచాయతీలకు నిధుల వరద

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సం ఘానికి సంబంధించిన పెండింగ్ నిధులను కేంద్ర ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తోంది. ఈ క్రమంలో మూడో విడతగా తెలంగాణకు రూ.387.53 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.1034.42 కోట్ల నిధులు అందాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల మరమ్మతులు వంటి పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. అయితే, తెలంగాణకు ఇంకా సు మారు రూ.2000 కోట్ల మేర 15వ ఆర్థిక సం ఘం నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిధులు ఆలస్యం కావడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగాలంటే నిధుల సమయానుకూల విడుదల అత్యంత అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటివరకు విడుదలైన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, ముఖ్యంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, అలాగే గ్రామాల్లో ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పారదర్శకతతో నిధుల వినియోగం, ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు.

మన తెలంగాణ 21 Feb 2026 3:30 am

శనివారం రాశి ఫలాలు (21-02-2026)

మేషం చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృషభం ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాలలో శ్రమపడ్డా ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. మిధునం ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కర్కాటకం ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. సింహం వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. కన్య ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహమును కొందరు ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. తుల కీలక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చికం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ధనస్సు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మకరం _ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. కుంభం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు. మీనం చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వాహనాలు కొలత కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది.  

మన తెలంగాణ 21 Feb 2026 12:20 am

టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులకు స్వస్తి?

ఏప్రిల్ 1 నుంచి దేశంలోని నేషనల్ హైవే టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను ని లిపివేయాలని జాతీయ రహదారుల అధారిటీ సంస్థ ఆలోచిస్తోంది. పూర్తిగా డిజిటల్ చెల్లింపులనే అనుమతిస్తారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, జాతీయ రహదారుల ప్రయాణికులు టో ల్ చెల్లింపులకోసం ఫాస్ట్ ట్యాగ్, లేదా యుపిఐ వంటి డిజిటల్ మోడ్ ల ద్వారా మాత్రమే ఉపయోగించాలి. టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపునకు అవకాశం ఉండే మార్గాలు ఉండవు. 

మన తెలంగాణ 20 Feb 2026 11:45 pm

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అమెరికా అమ్మాయి.. నస్పూర్ అబ్బాయి

 ప్రేమ కు ఎల్లలలు లేవు&హద్దులు కూడా లేవు. మన దేశపు అబ్బాయి పరదేశి అమ్మాయిని ప్రేమించగా అబ్బాయి తల్లితండ్రులు, అమ్మాయి తల్లి తండ్రులు వారి ప్రేమకు ఒప్పుకుని భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా వేద మంత్రాల సాక్షి గా వారి కి వివాహాం జరిపించి ఒకింటి వారిని చేసారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామానికి చెందిన సింగరేణి గని కార్మికుడు గంగిపెల్లి రాములు కమల ప్రథమ పుత్రుడు గంగిపెల్లి ప్రణీత్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అమెరిక వాస్తవ్యులు గ్రియర్ చెర్యల్ ఏకైక పుత్రిక లవినిశ్రీ(తమీ) లు అమెరికాలో ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరువైవుల వారు అంగీకరించారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక మండపంలో వారికి భారతీయ పద్ధతిలో వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య వివాహం జరిపించారు. 10 రోజుల క్రితమే అమెరికా నుండి లవనశ్రీ తమ కుటంబ సభ్యులతో మంచిర్యాల జిల్లాకు చేరుకున్నారు. ఐదు రోజుల క్రితం నస్పూర్ లో అసలైన పెళ్లి ఆచారాల ప్రకారం అన్ని కార్యక్రమాలు చేపట్టగా పరదేశీ అతిధులు అన్ని కార్యాక్రమాల్లొ పాల్గొని భారతదేశ సంప్రదాయలను చూసి ముగ్ధులయ్యారు. నేటి వివాహా వేడుకలు పాశ్చాత్య పోకడలకు పోతున్న నేపధ్యంలో అమెరికా నుండి వచ్చిన వారు భారతీయ సంస్కృతి సంప్రాదాయలను గౌరవిస్తూ చీర కట్టు తో మురిసి పోయారు. పెళ్లి పందిరిలో వారే భారతదేశ పౌరులుగా కట్టు, బొట్టుతో అలరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయం మాటల్లో చెప్పలేనిదని, ఇక్కడి ఆచారాలు మంత్రముగ్ధులను చేశాయని ఆనందం వ్యక్తం చేసారు. స్థానికులు వారితో చేసిన సందడి మరింత ఆనందాన్నిచ్చింది. వారితో స్థానికులు సెల్ఫీలు తీసుకుని సంబరాలు జరుపుకున్నారు. మంచిర్యాలలోని పద్మనాయక మండపంలో అమెరికా అమ్మాయి, నస్పూర్ అబ్బాయి వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది.

మన తెలంగాణ 20 Feb 2026 10:23 pm

దేవాదులపై ప్రభుత్వ నిర్లక్ష్యం: హరీష్‌రావు

దేవాదుల పంపుహౌజ్ మోటర్లను తక్షణమే ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం హసన్ పర్తి మండలం లోని దేవాదుల పంపుహౌజ్ ను ఆయన బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలసి సందర్శించి పరిశీలించారు. పంపుహౌజ్ వద్ద దేవాదుల అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని అగ్రహారం వ్యక్తం చేశారు. వెంటనే దేవాదుల ప్రాజెక్టు కు చెందిన భీంఘన్ పూర్ ,గండి రామారాం, దేవన్న పేట పంపుహౌజ్ మోటర్ల ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిలో నీళ్లు ఉన్నా దేవాదుల మోటార్లు ఆన్ చేయడం లేదని హరీశ్ రావు అన్నారు. గతంలో జిల్లా మంత్రులు ఇక్కడ హడావిడి చేశారని చెప్పారు. గతంలో ఇక్కడి మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇక్కడ పంపింగ్ ఆగిపోవడం వల్ల జనగామ, స్టేషన్ ఘన్ పూర్,పాలకుర్తి రైతాంగానికి ఇబ్బందులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ ఉన్న మోటార్లు కూడా నడపడం కాంగ్రెస్ వల్ల కావడం లేదన్నారు. కాంగ్రెస్ తీరుతో రైతుల ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తాము ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ వాటిని నిర్వహించలేకపోతోందన్నారు. దేవాదుల మీద కాంగ్రెస్ కనీసం రూ. 200 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ పై బీఆర్‌ఎస్ రూ. 7300 కోట్లు ఖర్చుచేసిందన్నారు. ఏపీ నల్లమల్ల సాగర్ కడుతుంటే సీఎం రేవంత్ మౌనంగా ఉన్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని ఆరోపించారు. గోదావరిలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. కృష్ణాలో మన నీటి వాటాను వాడుకోలేకపోతున్నారని విమర్శించారు.ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే అడ్డుకోలేకపోతున్నారని, ఎప్పటికపుడు రైతుబంధు అంటూ రేవంత్ రైతులను మోసం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తో పలవురు బిఅర్ ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

మన తెలంగాణ 20 Feb 2026 10:17 pm

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు... ఏడుగురు మృతి

గుజరాత్ లోని వాస్లాడ్ జిల్లా కర్నాడ లోని కుంభ్‌ఘాట్ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారును ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టగా,అది అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కారులో ప్రయాణించిన ఏడుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలించిన తరువాత మరో ఇద్దరు చనిపోయారు. మృతులంతా అంబా జంగిల్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నానా పోండాకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక ఎమ్‌ఎల్‌ఎ జితు చౌదరి ఆ ప్రదేశం ప్రమాదాల జోన్ అని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 20 Feb 2026 10:10 pm

సిగరెట్ కాల్చవద్దన్నందుకు ఫ్యూయల్ టాంక్ కు నిప్పు పెట్టాడు

పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటుండగా, సిగరెట్ కాల్చవద్దని అన్నందుకు ఆగ్రహించిన ఓ వ్యక్తి ఫ్యూయల్ టాంక్ కు నిప్పుపెట్టిన ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరిగింది. పెట్రోల్ బంక్ ఉద్యోగి వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఫిబ్రవరి 18న రాయ్ పూర్ లో ఈ సంఘటన జరిగింది. సిసిటివి కెమెరా వీడియో ఆధారంగా పెట్రోల్ బంకు వద్ద మోటర్ సైకిల్ కు నిప్పుఅంటించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను ఉర్లలోని బిర్గావ్ కు చెందిన ధర్మేంద్ర సింగ్, ఏహెచ్ పి కాలనీకి చెందిన ఇమ్రాన్ ఖురైషిగా గుర్తించారు. ఉర్లా ప్రాంతంలో కర్మచౌక్ దగ్గరలోని సంగీత ఫ్యూయల్ పెట్రోల్ పంపు వద్దకు బుధవారం రాత్రి 7.40 గంటల ప్రాతంలో ఇద్దరు యువకులు బైక్ లో ఇంధనం నింపుకోవడానికి వచ్చారు. పెట్రోల్ బంక్ ఉద్యోగి ట్రాంక్ లో పెట్రోల్ పోస్తుండగా, బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి దిగి, సిగరెట్ వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ ఉద్యోగి సిగరెట్ ముట్టించవద్దని అనడంతో అతను రెచ్చిపోయి లైటర్ ను ఫ్యూయల్ ట్యాంక్ లోకి విసరడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బైక్ తో పాటు పెట్రోల్ పంపు ఇంధన నాజిల్ కు కూడా చేరాయి. అకస్మాత్ గా మంటలు చెలరేగడంతో సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తుండగానే బైకర్, అతడి స్నేహితుడు పారిపోయారు. పెట్రోల్ బంకు ఉద్యోగుల ఫిర్యాదు తర్వాత, సిసిటివి కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారి బైక్ ను,లైటర్ ను స్వాధీనం చేసుకున్నారు.

మన తెలంగాణ 20 Feb 2026 10:02 pm

Ayesha Meera Case: CBI Court Orders Return of Remains

Nearly nineteen years after the brutal rape and murder of B Pharmacy student Ayesha Meera in Vijayawada, the case remains unresolved. Despite multiple investigations and years of legal battles, the identity of the real culprits has not been conclusively established. The prolonged delay in justice continues to haunt the victim’s family. In a significant development […] The post Ayesha Meera Case: CBI Court Orders Return of Remains appeared first on Telugu360 .

తెలుగు 360 20 Feb 2026 9:55 pm

Big Update on Kalki 2898 AD Sequel

Nag Ashwin and his team are left in waiting mode for the sequel of Kalki 2898 AD. The national-award-winning director has completed the script and he is waiting to kick-start the shoot. Prabhas has finally allocated dates for the film and the shoot of Kalki 2898 AD sequel starts tomorrow in a massive set. The […] The post Big Update on Kalki 2898 AD Sequel appeared first on Telugu360 .

తెలుగు 360 20 Feb 2026 9:14 pm

అమీర్‌పేట్‌లో అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న 200 మంది విద్యార్థులు

షార్ట్ సర్కూట్ వల్ల అమీర్‌పేట్‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమయానికి అగ్నిపమాక సిబ్బంది వచ్చి విద్యార్థులను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. అమీర్‌పేట్‌లోని మైత్రివనం భవనం పక్క ఉన్న నీలగిరి బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగాయి. మంటలు చెక్కలకు అంటుకోవడంతో మంటలు, పొగలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు వెంటనే సరఫరాను ఆపివేశారు. కాంప్లెక్స్‌లో పలు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు ఉండడంతో చాలామంది విద్యార్థులు భవనంలో చిక్కుకుపోయారు. మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు మెట్ల మార్గం నుంచి కిందకు దిగడానికి వీలులేకుండా పోయింది. ఆందోళనకు గురైన విద్యార్థులు బాల్కనీలోకి వెళ్లిన కింకి దూకేందుకు ప్రయత్నించారు. అప్పుడే అక్కడికి చేరుకున్న ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సంజీవ్ విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సమీపంలో ఉన్న షాపులో నుంచి నిచ్చెనలు తీసుకుని వచ్చి బాల్కనీలోకి నిచ్చేనలు వేసి హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రజల సాయంతో 80 మంది విద్యార్థులను బయటకు తీసుకుని వచ్చారు. నాలుగో అంతస్థులోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో 200మంది విద్యార్థులు ఉండగా వారిని కూడా క్షేమంగా బయటికి తీసుకుని వచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని రెండు , మూడో అంతస్థుల్లో పొగ దట్టంగా అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్‌కుమార్ యాదవ్ వచ్చి అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ భవనాన్ని పరిశీలించారు, అక్కడ ఉన్న వారితో సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోచింగ్ సెంటర్లకు కేరాఫ్... అమీర్‌పేట్‌లోని మైత్రివనం వద్ద భవనాల్లో సాఫ్ట్‌వేర్ కోర్సు కోచింగ్ సెంటర్లకు పెట్టింది పేరు. ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబిఏ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగంలో చేరేందుకు ఇక్కడికి వచ్చి కోర్సులు నేర్చుకుంటారు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న చాలామంది విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్నారు. ఉద్యోగంలో చేరిన తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ సెంటర్లు ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరగడంలో పలువురు ఆందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మన తెలంగాణ 20 Feb 2026 8:47 pm

చెలరేగిన ఆసీస్ బౌలర్లు.. స్వల్పస్కోర్‌కే ఒమాన్ ఆలౌట్..

పల్లెకెలె: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో ఒమాన్ స్వల్పస్కోర్‌కే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఒమాన్ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ అమీర్ ఖలీమ్ తొలి బంతికే ఔట్ అయ్యాడు. మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ల ధాటిని ఒమాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలింగ్‌లో ఒమాన్ బ్యాటర్లు పేక మేడల కుప్పకూలిపోయారు. ఒమాన్ బ్యాటింగ్‌లో వసీం అలీ (32) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో ఒమాన్ 16.2 ఓవర్లలో 104 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలింగ్‌లో అడం జంపా 4, మాక్స్‌వెల్, బార్ట్‌లెట్ చెరి 2, స్టొయినిస్, ఎల్లీస్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 20 Feb 2026 8:36 pm

యూరియా యాప్‌ను రద్దు చేయాలి: హరీష్ రావు

యూరియా కోసం రైతులు చెప్పులు లైన్‌లో పెట్టే ఆనాటి రోజులు తేవడమేనా మీరు చెప్పిన మార్పు..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మంది రైతులు ఏ విధంగా యాప్‌ను వినియోగిస్తారన్న కనీస సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. షాపుల్లో అమ్మాల్సిన యూరియాను, యాపుల్లో ఇస్తామని ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డి.. ఈ రైతు ఆక్రందన మీకు వినిపిస్తుందా..అని ప్రశ్నిస్తూ యూరియా కోసం ఓ రైతు పడుతున్న ఆందోళనకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారుర. గుండెలు మండి ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాత రోధన అర్థమవుతుందా..? అని నిలదీశారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరిదీ ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ఇంత కర్కషంగా, కఠినంగా వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు.యూరియా యాప్‌ను రద్దు చేసి, పాత విధానంలో, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని తెలంగాణ రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే యూరియా కష్టాలు భరించని రైతులు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడించే రోజులు వస్తాయని హెచ్చరించారు.

మన తెలంగాణ 20 Feb 2026 8:26 pm

Simbu in talks for a Telugu Film?

Tamil actor Simbu once had a decent Telugu market and his films had a simultaneous Telugu release. But his market has seen a decline and the actor too is focused on Tamil films. After years, he is all set to do a bilingual. Top Telugu production house Mythri Movie Makers is in talks with Simbu […] The post Simbu in talks for a Telugu Film? appeared first on Telugu360 .

తెలుగు 360 20 Feb 2026 8:26 pm

When Prabhas ordered Food from Other States during Cheat Meal

Prabhas, the pan-Indian star has spent his time between his busy schedules to meet the team of Couple Friendly. The film ended up as a decent hit and it is doing well in multiplexes. During the conversation, Prabhas shared a funny update during the shoot of Adipurush. On one of the Cheat Meal day, Prabhas […] The post When Prabhas ordered Food from Other States during Cheat Meal appeared first on Telugu360 .

తెలుగు 360 20 Feb 2026 8:24 pm

భూ తగాదాలు.. కాంగ్రెస్ నేత దారుణ హత్య

దుబ్బాక: సిద్ధపేటలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. భూ తగాదాల నేపథ్యంలో బాల్ రెడ్డి(50) అనే వ్యక్తిని దాయాదులు హత్య చేశారు. దుబ్బాక పురపాలికలోని చేల్లాపూర్ వార్డు శివారులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. చేల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్‌రెడ్డిని అదే గ్రామానికి చెందిన దాయాదులు భూ తగాదాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గొంతుకోసం చంపారు. అనంతరం నిందితులు తల్లి, కొడుకు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం హత్యకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని ఎసిపి తెలిపారు.

మన తెలంగాణ 20 Feb 2026 8:12 pm

ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

ఎసిబి దాడిలో మంథని సబ్ రిజిస్ట్రార్ అడ్డంగా బుక్కయ్యారు. శుక్రవారం మంథని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి డిఎస్‌పి మధు ఆధ్వర్యంలోకార్యాలయంపై దాడులు నిర్వహించగా సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో కలిసి ఓ రైతు వద్ద రూ.16,500 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపుకు చెందిన ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేయగా ఏసీబీ పక్కా ప్రణాళికతో రైతు సహకారంతో కార్యాలయంపై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు లంచం డిమాండ్ చేయకూడదని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఎసిబి సహకారం పొందవచ్చని వారు తెలిపారు. ఎసిబి దాడితో మంథని ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మన తెలంగాణ 20 Feb 2026 8:11 pm

కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత

రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న 25 మంది విద్యార్థినిలు శుక్రవారం వాంతులు, విరేచనాలతో ఇబ్బందికి గురయ్యారు. ప్రతిరోజు పాఠశాలలో మెనూ ప్రకారం ఉదయం విద్యార్థినులకు సిబ్బంది అల్పహారం వడ్డించారు. టిఫిన్ తిన్న కొద్దిసేపటికి కొంతమంది విద్యార్థినిలు కడుపునొప్పితో విలవిలలాడారు. ఆ తర్వాత వరుసగా మరికొందరు వాంతులు చేసుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకర వాతవరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై బాదితులను స్థానిక రేగోడ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి అత్యవసర చికిత్స అందుతోంది. బాధితులకు స్లైన్లు ఎక్కించి మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ప్రస్తుతానికి అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి విజయ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను పరామర్శించారు. అనంతరం జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థుల పట్ల అశ్రద్ద వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మన తెలంగాణ 20 Feb 2026 8:05 pm

గ్రహాంతరవాసుల సమాచారం వెల్లడి

గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అన్నఅనుమానాలు పటాపంచలయ్యే సమయం వచ్చేసింది. గ్రహాంతర వాసులకు సంబంధించి అమెరికా వద్ద ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయాలని పెంటగాన్, ఇతర ఫెడరల్ సంస్థలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం ఆదేశించారు. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారో లేదో తనకు తెలియదని ట్రంప్ అన్నారు. అయితే ఈ అంశం పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి మాత్రం ఉందని ఆయన తెలిపారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా ఈ మధ్య ఓ పాడ్ కాస్ట్ ఇంటర్ వ్యూలో గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా అన్న ప్రశ్నకు ఒబామా అందుకు సంబంధించి రహస్య సమాచారం వెల్లడించారని పుకార్లు షికారు చేశాయి. దాంతో ట్రంప్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఈ ప్రకటన చేశారు. ఒబామా వెల్లడించిన రహస్య సమాచారం ఏమిటన్నది ఇప్పటికీ తెలియలేదు. దశాబ్దాలుగా గ్రహాంతరవాసులు, ఇతర గ్రహాల్లో జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువులపై పలు కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన, ఆసక్తి కరమైన విషయాలకు సంబంధించి అమెరికా వద్ద పలు ఫైళ్లు ఉన్నాయని చెబుతారు, అలాంటి సమాచారం ఉన్న ఫైళ్లను బహిర్గతం చేసి, ఈ సస్పెన్స్ కు తెరతీయాలని ఆదేశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ గ్రహాంతరవాసులకు సంబంధించి నిజాలు తనకు తెలియదని, ఈ ఫైళ్లలో విషయాలు వెల్లడైతే, తాను, ఒబామా కు కూడా ఓ విషయం స్పష్టమవుతుందని ఆయన వివరించారు. బరాక్ ఒబామా ఈ మధ్య పాడ్ కాస్ట్ లో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, గ్రహంతరవాసులతో మనవారు కాంటాక్ట్ లోకి వచ్చారని తెలిపే ఎలాంటి ఆధారాలు తాను చూడలేదని, అయితే విశ్వం చాలా విశాలమైనదని, అక్కడ ఏదో ఓ గ్రహంలో జీవం ఉండే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ట్రంప్ కోడలు లారా ట్రంప్ ఈ వారం తాను గ్రహాంతరవాసుల గురించి మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ప్రెసిడెంట్ గ్రహాంతరవాసుల గురించి సరైన సమయంలో వెల్లడిస్తారని ఆమె పేర్కొన్నారు. కాగా, ట్రంప్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ను ఈ అంశంపై ప్రస్తావించినప్పుడు, గ్రహాంతరవాసుల గురించి వచ్చిన ఏ సమాచారమైనా తనకు వార్త అవుతుందని ఆమె మీడియాతో చెప్పారు. 2017లో అప్పటి పెంటగాన్, ప్రభుత్వ అధికారుల బృందం గుర్తు తెలియని వస్తువులకు సంబంధించి ఓ నేవీ వీడియోను లీక్ చేసిన తర్వాత, ప్రజలలో ఆసక్తి పెరిగింది. గుర్తు తెలియని ఎగిరే వస్తువులు, గ్రహాంతరవాసులకు సంబంధించిన రహస్యాలను అమెరికా ప్రభుత్వం దాచే అవకాశం చాలామంది అమెరికా వాసులు అభిప్రాయపడ్డారు. 2022 మేలో దాదాపు 50 ఏళ్లుగా గ్రహాంతరవాసులు, లేదా గుర్తుతెలియని వస్తువులకు సంబంధించి విచారణ నిర్వహించడానికి కాంగ్రెస్ సిద్ధపడింది. అయితే నౌకాదళం అధికారులు మాత్రం నేవీ షిప్ పైన తేలియాడే ఆకుపచ్చ త్రిభుజాకారపు ఆకారాలు డ్రోన్ లు కావచ్చు నని పేర్కొన్నారు. ఏది ఏమైనా, ట్రంప్ ఆదేశంతో ఆ సస్పెన్స్ కు తెరపడనుంది.

మన తెలంగాణ 20 Feb 2026 8:00 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଫ୍ଲାଏଓଭର ଭୁଶୁଡିବା ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ

ହଳିଦିଆପଦର ବ୍ରିଜ ଡିଜାଇନ ହେବ । ହଳଦିଆପଦର ଦୁର୍ଘଟଣା ପ୍ରସଙ୍ଗରେ ପରିବହନ ମନ୍ତ୍ରୀ ବିଭୂତି ଭୂଷଣ ଜେନାଙ୍କ ପ୍ରତିକ୍ରିୟା । ସେ କହିଛନ୍ତି, ଏ ଘଟଣା ଏବେର ନୁହେଁ । ଯେଉଁଦିନରୁ ବ୍ରିଜ ତିଆରି ହୋଇଛି, ସେବେଠାରୁ ଡିଜାଇନ ଭୁଲ ଅଛି । ଏହା ଭିତରେ ବହୁତ୍ ଜୀବନ ଅକାରଣରେ ଗଲାଣି । ନିଜର ସ୍ବାର୍ଥ ସାଧନ ପାଇଁ ଯେଉଁ ଭଳି କାମ କରାଯାଇଥିଲା । ସମସ୍ତେ ନିନ୍ଦା ମଧ୍ୟ କରୁଛନ୍ତି, ଆଉ ଆଜି ଯେଉଁମାନେ କହୁଛନ୍ତି, ସେମାନେ ଆଗରୁ କହୁନଥିଲେ ।ସୂଚନା ଥାଉକି ହଳଦିଆପଦର ବ୍ରିଜ ଏକ ମରଣ ଯନ୍ତା ପାଲଟିଥିବାର ବିଭିନ୍ନ ଖବରକାଗଜରେ ପ୍ରକାଶିତ ହେବା ପରେ ସରକାର ଏହି ପଦକ୍ଷେପ ନେଇଥିବାର ଜଣାଯାଉଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଏକ ବିରାଟ ବ୍ରିଜ ଭୁଶୁଡ଼ି ପଡୁଥିବାର ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓକୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରି ସରକାରଙ୍କ ଉପରେ ଅସନ୍ତୋଷ ଝାଡିଛନ୍ତି ଜନତା । ସାଧାରଣ ଜନତା ଝାଳ ବୁହା ଧନ ଅର୍ଜନ କରି ସରକାରଙ୍କୁ କର ଦେଉଥିବା ବେଳେ ସରକାର ଏବଂ ତାଙ୍କ ଦୁର୍ନୀତିଗସ୍ତ ଅଧିକାରୀ କିଭଳି ଭାବେ ସେହି କର ଟଙ୍କାକୁ ଆତ୍ମସାତ କରୁଛନ୍ତି ବୋଲି କହିଛନ୍ତି ୟୁଜର୍ସ । ୟୁଜର୍ସ ଲେଖିଛନ୍ତି, କୋଟିକୋଟି ଟଙ୍କାରେ ପୋଲ ନିର୍ମାଣ ହୋଇଥିବା ବେଳେ ଦେଖନ୍ତୁକିଭଳି ୧୦ ସେକେଣ୍ଡରେ ଭୁଶୁଡ଼ି ପଡୁଛି । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ଆଉ ଜଣେ ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ବିକଶିତ ଭାରତର ଆଉ ଏକ ପ୍ରମୁଖ ସଫଳତା, ଏହା କେବଳ ଏକ ସେତୁ ନୁହେଁ ଯାହା ଫମ୍ପା, ଏହା ଆମର ଆଶା ଯାହା ଏପରି କାର୍ଯ୍ୟ ପରେ ଦିନକୁ ଦିନ ଫମ୍ପା ହେଉଛି । କିନ୍ତୁ ଯେତେବେଳେ ମୁଁ ଏକ ନ୍ୟୁଜ୍ ଚ୍ୟାନେଲ୍ ଚାଲୁ କରେ, ମୁଁ ଉତ୍ସାହରେ ପୂର୍ଣ୍ଣ ହୋଇଯାଏ। ମୋତେ ଲାଗୁଛି ଯେ ଆମେ ୨୦୪୭ ନୁହେଁ, ମାତ୍ର ଗୋଟିଏ କିମ୍ବା ଦୁଇ ବର୍ଷ ମଧ୍ୟରେ ବିକଶିତ ହେବୁ ! କିନ୍ତୁ ଯେତେବେଳେ ମୁଁ ଏସବୁ ଦେଖେ...ବୋଲି ଲେଖିଛନ୍ତି ୟୁଜର୍ସ ।  विकसित हो रहे भारत का एक और बड़ा कारनामा ! यह केवल एक ब्रीज खोखला नही है ,, यह हमारी उम्मीद है जो ऐसे कामों के बाद दिन प्रतिदिन खोखली होती जा रही है ! परंतु जैसे ही News चेनल खोलता हूं तो जोश में भर जाता हुं लगता है 2047 नही एक दो साल में ही हम विकशित हो जाएंगे ! पर जब ये सब… pic.twitter.com/pTNNBK0DiQ — Suresh Prajapat (@SURESHK27439361) February 13, 2026 ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ପୋଲ ଭୁଶୁଡ଼ି ପଡୁଥିବାର ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଦାବୀର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ନିକଟ ଦିନରେ ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ନିଶ୍ଚିତ ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥାନ୍ତା । ବହୁ ପୂର୍ବରୁ କିଛି ରାଜ୍ୟରେ ଏଭଳି କିଛି ଘଟଣା ଘଟିଥିବା ବେଳେ ଏହି ଭିଡିଓ ସହ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଆମର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଇନସ୍ଟାଗ୍ରାମ ପୋଷ୍ଟ ହସ୍ତଗତ ହୋଇଥିଲା ।  ଏଆଇ ଇନଲାଇଫ ନାମକ ଏକ ଇନସ୍ଟାଗ୍ରାମ ପେଜ୍ ୫ଅଗଷ୍ଟ ୨୦୨୫ରେ ଏକ ଭିଡିଓ ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ଏକ ବ୍ରିଜ ଭୁଶୁଡ଼ି ପଡୁଥିବାର ଦୃଶ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରାରେ ସମାନତା ଥିବାର ଦେଖୁବାକୁ ପାଇଥିଲୁ । ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିବାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ସମୟର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ପେଜ୍ ଟି ଏଆଇ ଭିଡିଓ ପାଇଁ ଏକ ପ୍ଲାଟଫର୍ମ ବୋଲି ଉଲ୍ଲେଖ ରହିଛି । ସେହିପରି ଉକ୍ତ ପେଜ୍ ରେ ଏଭଳି ବିଭିନ୍ନ ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥିବାର ଭିଡିଓ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ଅନୁମାନ କରାଯାଏ ଯେ, ଉକ୍ତ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇ ପରେ । ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓକୁ ହାଇଭ ମୋଡରେସନ ଟୁଲ ରେ ପରୀକ୍ଷା କରିବାରୁ ଏହା ୯୬%ରୁ ଉର୍ଦ୍ଧ ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ପୋଲ ଭୁଶୁଡ଼ି ପଡୁଥିବାର ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । 

తెలుగు పోస్ట్ 20 Feb 2026 7:49 pm

అధ్యాపకురాలు తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: ఈ మధ్యకాలంలో యువత ప్రతి చిన్న విషయానికే ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారని.. లేదా బయట ఎవరో ఏదో అన్నారని ఆవేశంలో ప్రాణాలు తీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గురుకుల కళాశాల భవనం పై నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అధ్యాపకురాలు దూషించిందని మనస్తాపంతో ఆ విద్యార్థిని ఈ దారుణానికి ఒడిగట్టింది. బోనకల్లు ఎస్సీ బాలికల గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని అధ్యాపకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 20 Feb 2026 7:31 pm

భూపాలపల్లి జిల్లా కోర్డులో ఎసిబి రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ ముగ్గురు సిబ్బంది

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్డులో శుక్రవారం వరంగల్ ఎసిబి అధికారులు డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రైడ్స్ నిర్వహించి రూ.5000 లంచం తీసుకుంటుండగా ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్(స్టెనోగ్రాఫర్), అటెండర్లు పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుకున్నారు. డిఎస్పీ వివరాల ప్రకారం..భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి శివారులో ఒక వ్యక్తికి 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఇట్టిభూమిపై పక్కనున్న వ్యక్తి 1984లో సివిల్ దావా వేయగా వివిద కోర్టుల తీర్పులతో జిల్లా కోర్టు వరకు వచ్చిందని, గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో జిల్లా ప్రెన్స్‌పల్ జడ్జి పిర్యాధు దారునికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని, ఆతీర్పు కాఫీ కొరకు ఫిబ్రవరి 10న చాలన్‌కట్టి కాఫీ సెక్షన్‌లో అడుగగా రూ.20వేల లంచం డిమాండ్ చేశారని ఇచ్చకోలేక అతను మల్లి అదేనెల 13న వచ్చి అంత ఇవ్వలేనని అడుగగా రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా మూడు రోజులకు ఇస్తానని వెల్లాడని, లంచం ఇచ్చుడు ఇష్టంలేక ఆవ్యక్తి ఎసిబి అధికారులకు పిర్యాదు చేశారని తెలిపారు. శుక్రవారం ఆవ్యక్తి ఎసిబి అధికారులతో చరణ్‌కు లంచం ఇవ్వటానికి రాగా చరన్ అటెండర్లు గా పని చేస్తున్న రజిత ,సునీతలను అప్రోచ్ కావాలని వారికి డబ్బులు ఇచ్చికాఫీ తీసుకోండనిచెప్పగా రజితకు డబ్బులు ఇచ్చి కాఫీ తీసుకొనగా ఆత్వాత సునీత చరణ్ నన్నే తీసుకొమ్మడని ఆడబ్బులు సునీత తీసుకుందని తెలిపారు. ఆ డబ్బులు లంచం డబ్బులు అని వారికి అవగాహణ పూర్థిస్థాయిలో ఉందని తెలిపారు. చరణ్, రజిత, సునీతలను అదుపులోకి తీసుకొని నేడు వరంగల్ ఎసిబికోర్టులో హాజరపుచనున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు సంప్రదించాలని డిఎస్పీతెలిపారు. ఈకార్యక్రమంలోఎసిబి సిబ్బంది ఎస్ రాజు, ఎల్ రాజు, ప్రభాకర్ సిబ్బంది ఉన్నారు.

మన తెలంగాణ 20 Feb 2026 7:05 pm

చివరి లీగ్‌ మ్యాచ్‌: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

పల్లెకల్లె: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో ఒక దశ శుక్రవారంతో ముగియనుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్ ఒమాన్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ రెండు జట్లు టోర్నమెంట్‌ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గౌరవప్రదంగా టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టులో ఒక మార్పు చేసింది. కూపర్ కన్నోల్లీ స్థానంలో మాట్ రెన్షా జట్టులోకి వచ్చాడు. ఒమాన్ నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకూ ఆడేందుకు అవకాశాం రాని ఆటగాళ్లను ఈ మ్యాచ్‌లో ఆడిస్తోంది. తుది జట్లు: ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మాట్ రెన్షా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా. ఒమాన్: అమీర్ కలీమ్, జతీందర్ సింగ్(కెప్టెన్), కరణ్ సోనావాలే, హమ్మద్ మీర్జా, వసీం అలీ, మహ్మద్ నదీమ్, వినాయక్ శుక్లా(కీపర్), జితేన్ రామానంది, జే ఒడెద్రా, షకీల్ అహ్మద్, షఫీక్ జాన్.

మన తెలంగాణ 20 Feb 2026 6:50 pm

ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు

ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు ఖమ్మం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల హబ్‌గా

ప్రభ న్యూస్ 20 Feb 2026 6:31 pm

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి హత్యకు గురయ్యాడు.  సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బాల్‌రెడ్డి (50) దారుణంగా హత్యకు గురయ్యారు. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బాల్‌రెడ్డి తన సొంత ఊరైన రాజక్కపేటలో పని ముగించుకుని బైకుపై తెల్లాపూర్‌లోని తన నివాసానికి వెళ్తుండగా గ్రామ శివారులో  కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనను అడ్డగించి కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

మన తెలంగాణ 20 Feb 2026 6:30 pm

అక్షయపాత్రగా… వర్ధిల్లుతున్న శ్రీ విద్యాధరి క్షేత్రం

వర్గల్, ఆంధ్రప్రభ ; శ్రీ విద్యా సరస్వతి స్వరూపమైన శ్రీ అన్నపూర్ణాదేవి సంపూర్ణ

ప్రభ న్యూస్ 20 Feb 2026 6:27 pm

వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు ఇచ్చారు

తెలుగు పోస్ట్ 20 Feb 2026 6:24 pm

ఓపీడీ ఆర్ రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

జైనూర్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లో మార్చి 15 16 తేదీల్లో జరిగే

ప్రభ న్యూస్ 20 Feb 2026 6:23 pm

ఏసీబీ దాడిలో ఇద్దరు పట్టుబాటు..

మంథని, ఆంధ్రప్రభ: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు ప్లాట్

ప్రభ న్యూస్ 20 Feb 2026 6:18 pm

నూతన కౌన్సిలర్ ఇమ్రాన్ కు సన్మానం

చెన్నూర్, ఆంధ్రప్రభ : గతకొద్దిరోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు 11వ

ప్రభ న్యూస్ 20 Feb 2026 6:12 pm

గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు

గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు తిర్యాణి, ఆంధ్రప్రభ : జిల్లాలోని

ప్రభ న్యూస్ 20 Feb 2026 6:07 pm

Telangana Congress : కాంగ్రెస్ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఎవరంటే?

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది

తెలుగు పోస్ట్ 20 Feb 2026 6:03 pm

పోస్టాఫీసు సేవలు సద్వినియోగం చేసుకోవాలి

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజలు పోస్టాఫీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ

ప్రభ న్యూస్ 20 Feb 2026 6:03 pm

నెట్స్‌లో చెమటోడుస్తున్న గిల్.. అందుకోసమేనా..

టీం ఇండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్.. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఫామ్ లేమి కారణంగా గిల్ టి-20 జట్టు వైస్ కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు.. టి-20 ప్రపంచకప్ జట్టకు ఎంపిక కాలేదు. దీంతో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిల్ భావిస్తున్నాడు. మార్చి 26 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించే గిల్.. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ప్రారంభించాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్‌లో చెమటోడ్చాడు. బంతిని టైమ్ చేయడంతో పాటు బలంగా బాదడంపై ఫోకస్ చేస్తున్నాడు. అతడు తిరిగి ఫామ్‌ని అందిపుచ్చుకొని ఐపిఎల్-2026లో పరుగుల వరద పారించాలని.. అలాగే భారత టి-20 జట్టులో పునరాగమనం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మన తెలంగాణ 20 Feb 2026 6:01 pm

Photos : Hey Balawanth Movie Success Celebrations

The post Photos : Hey Balawanth Movie Success Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 20 Feb 2026 5:59 pm

టెక్ కంపెనీ సీఈవోలతో చంద్రబాబే భేటీ

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెక్ కంపెనీల సీఈఓలు భేటీ అయ్యారు

తెలుగు పోస్ట్ 20 Feb 2026 5:55 pm

బుగ్గ రాజేశ్వరుడి జాతర ఆదాయం రూ. 12.63 లక్షలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 20 Feb 2026 5:53 pm

ఉదారత చాటుకున్న మోతిపటర్ కొత్త సర్పంచ్

లింగాపూర్, ఆంధ్రప్రభ : తాను సర్పంచ్ గా గెలిస్తే పెళ్లి జరుపుకునే పేదింటి

ప్రభ న్యూస్ 20 Feb 2026 5:50 pm

ముగిసిన కబడ్డీ పోటీలు

దండేపల్లి, ఆంధ్రప్రభ : చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని

ప్రభ న్యూస్ 20 Feb 2026 5:44 pm

Breaking : లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది

తెలుగు పోస్ట్ 20 Feb 2026 5:44 pm

Telangana : ఉద్యమ కారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కారులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 20 Feb 2026 5:33 pm

పారిశుద్ధ్య పనుల పరిశీలన..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 12వ వార్డులో

ప్రభ న్యూస్ 20 Feb 2026 5:23 pm

ప్రభుత్వ అనుమతితో హల్దివాగులోకి నీటి విడుదల

వర్గల్, ఆంధ్ర్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుండడంతో

ప్రభ న్యూస్ 20 Feb 2026 5:16 pm

సత్యసాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు…

ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనబోవు సబ్ జూనియర్ క్రీడాకారులు 01-01-2010 తరువాత జన్మించి […] The post సత్యసాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Feb 2026 5:13 pm

వెలుగుమట్ల నారాయణ కాలేజీలో దారుణం..

వెలుగుమట్ల నారాయణ కాలేజీలో దారుణం.. ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల

ప్రభ న్యూస్ 20 Feb 2026 5:12 pm

సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, తద్వారా మానవతా విలువలను పెంపొందించవచ్చునని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, వైకే శ్రీనివాసులు, కోటేశ్వరరావు, కౌన్సిలర్ కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు షీలా నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలను తమ ఫౌండేషన్ గత కొన్ని […] The post సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Feb 2026 5:10 pm

కాంగ్రెస్ గెలిచిన పాపానికి రైతులకు శాపమెందుకు? : హరీష్ రావు

హైదరాబాద్: గోదావరిలో కావాల్సినంత నీళ్ల ప్రవాహం ఉందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర 16 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయని, నదిలో నీళ్లు ఉన్నాయని..రైతాంగానికి నీళ్లు అవసరముందని అన్నారు. హన్మకొండ జిల్లాలోని దేవన్నపేటలో దేవాదుల పంప్ హౌస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని బిఆర్ఎస్ పనులు పూర్తి చేసిందని, దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది మాజీ సిఎం కెసిఆర్ అని కొనియాడారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అంగుళం కూడా ముందుకెళ్లడం లేదని, దేవన్న పేట పంప్ హౌస్ లో 3 మోటార్లు ఆఫ్ చేసి పెట్టారని హరీష్ రావు విమర్శించారు. 155 మీటర్ల లోతైన పంప్ హౌస్ ఇది అని.. ఉన్న మోటార్లు సరిగా నడపడం చేతకావడం లేదని, ఆనాడు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే అని మండిపడ్డారు. ఆనాడు దేవాదులకు 25 టిఎంసిలు మాత్రమే నీటి కేటాయింపులు అని.. మోటార్లు ఆన్ చేసి చేయకుండానే గాలిమోటార్ ఎక్కి హైదరాబాద్ చేరారని ఎద్దేవా చేశారు. 2025 మార్చి 18న జిల్లా మంత్రులు వచ్చి హడావుడి చేశారని, గత ఏడాది ప్రభుత్వ నిర్తక్ష్యం వల్ల 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పోరాటం తర్వాత 45 రోజులకు మోటార్లు ఆన్ చేశారని, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయిందని, గండిరామారం లిప్ట్ లు ఎందుకు నడవడం లేదు అంటే వాటర్ లెవల్ లేదు అంటున్నారని, మోటార్లు ఎందుకు నడుపడం లేదంటే అక్కడ లెవల్ ఫుల్ ఉందంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో 30 వేలు ఎకరాలు పూర్తి చేశామని, దేవాదుల ప్రాజెక్టుపై బిఆర్ఎస్ రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిచిన పాపానికి రైతులకు శాపమెందుకు? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే 17వ తేదీన రైతుబంధు ఇస్తా అన్నారని, 20వ తేదీ వచ్చింది ఇంకా రైతుబంధు రాలేదని, రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తారా కోతలు జరిగేటప్పుడు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పంటలకు రైతుబంధు వేయలేదని, ఈ సారి అయినా వేస్తారా లేదా? అని.. బడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం రూ.20వేల కోట్ల బకాయిలు చెల్లించావు కానీ రైతులకు రైతుబంధు వేయడానికి డబ్బులు లేవా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

మన తెలంగాణ 20 Feb 2026 5:08 pm

అల్పాహారమును పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు, సహాయకులకు అల్పాహారంలో భాగంగా ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను శ్రీ సత్య సాయి సేవ సమితి.2 నిర్వాహకులు వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని, వృత్తిని ఇస్తుందన్నారు. పుట్టపర్తి బాబా తెలిపిన మేరకు సేవా కార్యక్రమాలను ప్రతి […] The post అల్పాహారమును పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి సేవ సమితి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Feb 2026 5:06 pm

OPS |మళ్లీ డీఎంకేనే గెలుస్తది..

OPS | మళ్లీ డీఎంకేనే గెలుస్తది.. ఓపీఎస్ కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో

ప్రభ న్యూస్ 20 Feb 2026 5:04 pm

ప్రత్యర్థులను చిత్తు చేసిన ఏసీపీల జోడి

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో వరంగల్

ప్రభ న్యూస్ 20 Feb 2026 5:00 pm

ప్రభుత్వ ఆసుపత్రి మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తాం

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ను మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సోనియా, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, పుల్లయ్య, డాక్టర్ హరి శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. […] The post ప్రభుత్వ ఆసుపత్రి మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Feb 2026 4:57 pm

ఏఎల్ ఎంకు బహుమతి..

కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; ఖమ్మం పట్టణంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో

ప్రభ న్యూస్ 20 Feb 2026 4:54 pm

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి..

సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మార్చి 14వ తేదీన నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి చాంబర్లో కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో సిఐలకు, ఎస్ఐలకు, కోర్టు న్యాయవాదులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలతో ఇచ్చిన తీర్పు తుది తీర్పు అవుతుందని, ఈ విషయాన్ని కచ్చి దారులకు తప్పక […] The post జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Feb 2026 4:51 pm

ఎల్బీనగర్‌లోని ఛట్నీస్ హోటల్‌లో పేలుడు

హైదరాబాద్: ఎల్బీనగర్‌ అర్కేపురంలోని ఛట్నీస్ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్ధానికి కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్‌లో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడిమి కారణంగానే స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు పేలుడు సంభవించిన కిచెన్‌ను పరిశీలించాయి. ఇడ్లీ స్టీమర్ వేడెక్కడంతోనే పేలుడు సంభవించిందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 20 Feb 2026 4:50 pm

యాదగిరిగుట్టలో ‘తిలకం’తంతు..

యాదగిరిగుట్టలో ‘తిలకం’ తంతు.. యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై భక్తిభావం

ప్రభ న్యూస్ 20 Feb 2026 4:49 pm

సర్ మేడి దేవురావుకు ఘనంగా అంతిమ వీడ్కోలు

జైనూర్ , ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని

ప్రభ న్యూస్ 20 Feb 2026 4:45 pm

ఎన్నికల హామీ అమలు – కదిరిగేట్ నిర్వాసితులకు రూ.10.74 కోట్ల చెల్లింపు

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:;ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ధర్మవరం అభివృద్ధికి అత్యంత కీలకమైన కదిరి గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో జరిగిన నిర్లక్ష్య పాలన కారణంగా నిలిచిపోయిందని తెలిపారు.ఈ పరిస్థితిని పూర్తిగా […] The post ఎన్నికల హామీ అమలు – కదిరిగేట్ నిర్వాసితులకు రూ.10.74 కోట్ల చెల్లింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Feb 2026 4:43 pm

బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా

ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా తప్పదనిరాప్తాడు ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి హెచ్చరించారు. బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా రాప్తాడు రెండో అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 18ఏళ్ళు, అబ్బాయిలకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. నిర్దేశిత […] The post బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Feb 2026 4:35 pm

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలో టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ అధ్యక్షులు సొంటెన్న, బూత్ ఇంచార్జి దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్యలు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. The post సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Feb 2026 4:31 pm

పదవి భాద్యతలు చేపట్టిన చైర్మన్

ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పురపాలక సంఘం లో నూతనంగా ఏర్పడిన పాలక …

జనం సాక్షి 20 Feb 2026 4:31 pm

فیکٹ چیک: کشمیر ٹول پلازہ پر صرف اردو سائن بورڈ کا دعویٰ گمراہ کن

وائرل پوسٹس میں دعویٰ کیا گیا کہ کشمیر ٹول پلازہ پر سائن بورڈ صرف اردو میں ہیں۔ جانچ سے واضح ہوا کہ بورڈز اردو، ہندی اور انگریزی میں ہیں۔ این ایچ اے آئی کے مطابق یہ دعویٰ گمراہ کن ہے۔

తెలుగు పోస్ట్ 20 Feb 2026 4:28 pm