World Cup 2026 : 6 నిమిషాల్లో.. గేమ్ చేంజ్.. Andhra Prabha Sports
World Cup 2026 : 6 నిమిషాల్లో.. గేమ్ చేంజ్.. Andhra Prabha
గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై ప్రజలు జాగ్రత్త
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నెరగాళ్లకు
Ram Charan worked hard 8 months for Pehelwan pshyquie!
Mega Powerstar Ram Charan is setting new benchmarks for dedication with his upcoming film Peddi. Directed by Buchi Babu Sana, and produced by Venkata Satish Kilaru on a never-seen-before epic scale, the sports film showcases the actor in a completely new avatar. He transitions from a rural cricketer to a powerful pehelwan. Achieving this rugged […] The post Ram Charan worked hard 8 months for Pehelwan pshyquie! appeared first on Telugu360 .
ప్రతి కార్యకర్త అధినేతె.. కార్యకర్తల సమ్మేళనమే టిడిపి పార్టీ జీవనం..తెలుగుదేశం పార్టీ స్థాపన
మహిళల చదువు దేశానికి వెలుగు మంథని రూరల్, ఆంధ్రప్రభ : మహిళల చదువు
కడియం మాట్లాడుతున్నప్పుడు గన్తో కాలుస్తానని సైగా?... కౌశిక్రెడ్డి పదవికి గండం?
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి శాసన సభలో అనుచితంగా ప్రవర్తించారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్తో కాల్చి పడేస్తానని సైగలు చేయడంతో ఏ పార్టీలో ఉన్నావని ప్రశ్నించారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మంత్రులు మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డి వీడియోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అధి శ్రీనివాస్ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. కౌశిర్ రెడ్డి ఎంఎల్ఎగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ హెడ్ ఫోన్ విసిరి దాడి చేయడంతో స్పీకర్ వారి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. వారు హైకోర్టు మెట్లు ఎక్కడంతో సభ్యత్వ రద్దు చెల్లదని తీర్పు నిచ్చింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ఆసక్తిగా మారింది.
మహిళలు అక్షరాస్యతలో ముందుండాలి
మహిళలు అక్షరాస్యతలో ముందుండాలి మంథని రూరల్, ఆంధ్రప్రభ : మహిళలు చదువుకొని అక్షరాస్యతలో
Kaushik Reddy |బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం
Kaushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం కడియం శ్రీహరిని బెదిరించాడని
పలు బాధిత కుటుంబాలను పరామర్శ…
పలు బాధిత కుటుంబాలను పరామర్శ… మంథని టౌన్, ఆంధ్రప్రభ : మంథని మాజీ
ఆయన ఎస్సి.. అందుకే సభకు కెసిఆర్ రావడంలేదు : రేవంత్
హైదరాబాద్: ఖనిజ సంపద ఆదాయాన్ని పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చాక దళితులకు పాలన చేతకాదని వారిని పక్కన పెట్టారు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ అవినీతిపై సిఎం మాట్లాడారు. దొర మాత్రమే సిఎం కావాలి అని అవమానించారు అని.. మైనింగ్ శాఖలో అవినీతి నిగ్గు తేల్చేందుకు తాము డిసైడ్ అయ్యామని తెలియజేశారు. మాజీ సిఎం కేబినెట్ కూర్పు చూస్తే ఎస్సీలపై వ్యతిరేకత కనిపిస్తోందని, బిఆర్ఎస్ డిఎస్ఎ లోనే ఎస్సిలపై వ్యతిరేకత ఉందని అన్నారు. హౌజ్ కమిటీ సిఫారసులు మళ్లీ సిబిసిఐడి కి ఇవ్వాల్సిందే అని సూచించారు. సిబిఐసిఐడి వద్దు అంటే సిబిఐ విచారణ అడుగుతారా.. చెప్పండి? అని రేవంత్ ప్రశ్నించారు. నువ్వు చేసిన పనికి నేను ఇరుక్కున్నా అని.. శనివారం రాత్రి బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాడి చేశారని పేర్కొన్నారు. ఎస్సిలపై కక్ష సాధింపు తప్ప కనీస మానవత్వం చూపలేదని విమర్శించారు. బిఆర్ఎస్ హయంలో సిఎం మాజీసిఎం కెసిఆర్..ఆర్థిక మంత్రి హరీష్ రావు..మున్సిపల్ మంత్రి కెటిఆర్ అని ఎద్దేవా చేశారు. రెండు కోతులు కలిసి సభను చెరపాలని అనుకుంటున్నారు అని.. మంత్రి పొంగులేటి అయినా..రేవంత్ కుటుంబం అయినా సిబిసిఐడి ముందు ఆధారాలు పెట్టండి అని సూచించారు. జీతం తీసుకుంటూ సభకు రాని కెసిఆర్ రాజీనామా చేయడు అని అన్నారు. 4 లక్షల ఇండ్లు కట్టించిన పొంగులేటి రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. వాళ్లకు మైక్ ఇవ్వండి అని..ఎంత మాట్లాడినా సమయం ఇవ్వండి అని అన్నారు. కెసిఆర్ కు సమానంగా ప్రజా జీవితం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వచ్చారు అని.. కడియం నీతి, నిబద్ధతను దేశంలో ఎవరూ ప్రశ్నించలేదు అని అన్నారు. అసభ్యకరంగా, అసహ్యంగా ప్రవర్తిస్తే హరీష్ రావు, కెటిఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి అని..కడియంకు జరిగిన అవమానమే కెసిఆర్ కు ఎదురైతే పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. కౌశిక్ రెడ్డి సభ్యత్వం తీసుకోవాలని తమ సభ్యులు కోరుతున్నారు అని.. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీని సిఫారసు చేశారు అని అన్నారు. హరీష్ రావు సూచన మేరకు కమిటీ వేయండి అని రేవంత్ కోరారు.
పార్టీ పురోభవృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
పార్టీ పురోభవృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పశ్చిమ నియోజకవర్గ టిడిపి శ్రేణులతో
సన్రైజర్స్ కొంపముంచిన ఆ రెండు ‘క్యాచ్’లు..#IPL2026 #SRH #RCB #Klaasen #Cricket #IPLMatch
అంబేద్కర్ జాతరను వేడుకగా నిర్వహించుకుందాం..
అంబేద్కర్ జాతరను వేడుకగా నిర్వహించుకుందాం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; భారతరాజ్యాంగ నిర్మతడాక్టర్ బాబాసాహెబ్
మన్ కీ బాత్ వీక్షిస్తున్న బిజెపి నేతలు..
మన్ కీ బాత్ వీక్షిస్తున్న బిజెపి నేతలు.. కడెం, ఆంధ్రప్రభ : కడెం
జుక్కల్ మండల కేంద్రంలో కుస్తీ పోటీలు..
జుక్కల్ మండల కేంద్రంలో కుస్తీ పోటీలు.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్
రఘునాథపల్లిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : సమాజమే దేవాలయం.. ప్రజల నా దేవుళ్ళు నినాదంతో యుగ
OTT Hurdles for Megastar and Prabhas
Megastar Chiranjeevi has completed the shoot of Vishwambara long ago and the film’s release date is yet to be announced. Mega fans are eagerly waiting for the update on the release date. The pending VFX work is completed and the makers have to close the OTT deal to finalize the release date. The negotiations are […] The post OTT Hurdles for Megastar and Prabhas appeared first on Telugu360 .
Vijay To Contest from Two Seats in Tamil Nadu Elections
Actor turned politician C Joseph Vijay has taken a strong step into politics by announcing that he will contest from two constituencies in the upcoming Tamil Nadu Assembly elections. He will stand from Perambur in Chennai and Tiruchirappalli East, showing that he is ready for a serious political fight. At a meeting with party members […] The post Vijay To Contest from Two Seats in Tamil Nadu Elections appeared first on Telugu360 .
తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. ఆయన పోటీ ఎక్కడినుంచంటే..
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ధళపతి విజయ్ సిద్ధమవుతున్నారు. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తమిళగ వెట్రి కళగం (టివికె) నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విజయ్ విడుదల చేశారు. ఇక విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. చెన్నైలో జరిగిన సభలో విజయ్ ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 234 స్థానాల్లో టివికె పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు. తన అభ్యర్థులు ప్రజా రక్షకులుగా విజయ్ అభివర్ణించారు. వారు రాజకీయ దిగ్గజాలు కాదని.. ప్రజలకు జవాబుదారీగా ఉంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమకు, సిఎం నేతృత్వంలోని డిఎంకె మధ్యే అసలైన పోటీ ఉంటుందని తెలిపారు. ‘విజిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నా. గెలిచిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయం. అవినీతికి పాల్పడం. మహిళలకు భద్రత కల్పిస్తాం. మాదకద్రవ్యరహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించం’ అని విజయ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం.. టివికెకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
హనుమాన్పేటలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఆంధ్రప్రభ, విజయవాడ ; తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ
కాళేశ్వరంలో దోపిడీపై మోడీ ప్రస్తావించారు: రేవంత్
హైదరాబాద్: బిఆర్ఎస్, బిజెపి కుమ్మక్కై కాళేశ్వరంపై విచారణ ముందుకు సాగనివ్వడం లేదు అని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిజెపి మాటల నమ్మి కాళేశ్వరంపై విచారణ సిబిఐకు ఇస్తే ఇప్పటి వరకు చర్యలు లేవు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై సిఎం మాట్లాడారు. కాళేశ్వరంలో దోపిడీపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు అని.. శనివారం మైనింగ్ పై చర్చకు అవకాశం ఇచ్చాం అని తెలియజేశారు. ధరణి పేరుతో వందల ఎకరాలు మాజీ మంత్రి హరీష్ రావు బంధువులు దోచుకున్నారు అని విమర్శించారు. ధరణి పేరుతో దోపిడీపై హౌస్ కమిటీ వేయడానికి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మద్దతు ఇస్తారా? అని రేవంత్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ లో హరీష్ రావు సోదరుడు వందల ఎకరాలు దోచుకున్నారు అని.. బిఆర్ఎస్, బిజెపి ఎన్నికల్లో ఓట్లు పంచుకున్నారు అని మండిపడ్డారు. హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, కెవిఆర్ హౌస్ కమిటీ వేయడానికి సిద్ధమా ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
747 ప్రభుత్వ భూమి కబ్జా కుంభకోణం బట్టబయలు
747 ప్రభుత్వ భూమి కబ్జా కుంభకోణం బట్టబయలు చిన్న గూడూరు, ఆంధ్రప్రభ ;
స్థిరమైన రాజధానితోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం..
స్థిరమైన రాజధానితోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం.. అవనిగడ్డ – ఆంధ్రప్రభ : స్థిరమైన
నగరం లో రోజురోజుకు పెరుగుతున్న కల్తీ దందా.! #Hyderabad #FoodSafety #TaskForce #Adulteration
ipl2026|ఇన్ ఫ్రంట్ దేర్ ఇజ్ ఏ బిగ్ క్రొకడైల్ ఫెస్టివల్
ipl2026| ఇన్ ఫ్రంట్ దేర్ ఇజ్ ఏ బిగ్ క్రొకడైల్ ఫెస్టివల్ కింగ్
హైదరాబాద్ గోల్డ్ మాన్ ₹1 కోటి అంటూ ప్రచారం… విచారణలో ₹3 లక్షలే #GoldMan #Hyderabad #FakeGold
ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాప్తాడు, ఆంధ్రప్రభ: గ్రామాల్లో ఎటు చూసినా పచ్చజెండా పండుగ సంబరాలే కనిపిస్తున్నాయని టీడీపీ
“No Kings” Protests Spread Across US and Europe Against Trump Policies
Mass protests have erupted across the United States and parts of Europe as thousands gathered under the “No Kings” banner to oppose policies of Donald Trump. Demonstrators raised strong concerns over immigration enforcement and the ongoing conflict involving Iran, calling for immediate changes. One of the largest gatherings took place in St Paul, Minnesota, where […] The post “No Kings” Protests Spread Across US and Europe Against Trump Policies appeared first on Telugu360 .
9 Mn Protesters : జనం విస్ఫోటనం Andhra Prabha Latest News
9 Mn Protesters : జనం విస్ఫోటనం Andhra Prabha Latest News
ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరికాదు: భట్టి
హైదరాబాద్: సభా సంప్రదాయాలు తెలిసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దారుణంగా వ్యవహరిస్తున్నారు అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అడిగిన వెంటనే సిబిఐసిడి విచారణకు ఆదేశించామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభలో బిఆర్ఎస్ సభ్యుల తీరును భట్టి తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ పాలనలో వేసిన 3 హౌస్ కమిటీల నివేదికలు ఏమయ్యాయి? అని భట్టి ప్రశ్నించారు. గతంలో పలువురిని బ్లాక్ మెయిల్ చేసి బిఆర్ఎస్ లో చేర్చుకున్నారు అని.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరికాదు అని విమర్శించారు. సభ హుందాతనాన్ని కాపాడాలి అని సూచించారు. సభలో ప్రజాసమస్యలపై చర్చ జరగకూడదని రాద్ధాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు. మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడీ విచారణకు ఆదేశిస్తే సంతోషించాలి అని అన్నారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని భూములు లాక్కున్నారు అని ధ్వజమెత్తారు. వందలాది ఎకరాలు కబ్జా చేసిన వాటిపై హౌస్ కమిటీ వేయాలి అని భట్టి సభను కోరారు.
అన్నపూర్ణ నమోస్తుతే.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ
కొండగట్టుకు హనుమాన్ దీక్ష స్వాములు పాదయాత్ర..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న పొంగులేటిపై చర్యలు తీసుకోవాలి: కెటిఆర్
హైదరాబాద్: ఆదివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయడంతో పాటు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని బిఆర్ఎస్ ఎంఎల్ఎలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరారు. బిఆర్ఎస్ సభ్యులు నినాదాల మధ్య న్యాయవాదులు రక్షణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశ పెట్టారు. బిఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. వెంటనే మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఎటువంటి చర్చ లేకుండానే రెండు బిల్లులు ఆమోదించడం సరికాదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని గన్ పార్క్ దగ్గర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్లకార్డులతో కెటిఆర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పొంగులేటి అవినీతి సంపాదనలో సిఎం రేవంత్ కూడా భాగం ఉందని ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి పొంగులేటి వెంటనే తొలగించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
Anakapalli Teaser: Love Story Wrapped In Violence
Successful director Thrinadha Rao Nakkina is serving as one of the producers for Vikram Sahidev’s debut film as a hero — Anakapalli. Kandregula Naidu is the other producer, with Kandregula Kumar Raja as co-producer, and the film is directed by Khagesh Tammineni. Made under the Nakkina Narratives and Bhavya Sri Movie Makers banners, the film’s […] The post Anakapalli Teaser: Love Story Wrapped In Violence appeared first on Telugu360 .
Bridge |జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.!
Bridge | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.! వంతెనను ఢీకొని వాగులో పడ్డ
జైనూర్ను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి
జైనూర్ను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి జైనూర్, ఆంధ్రప్రభ : మొన్న పార్లమెంట్లో
హైవేపై అతివేగం.... ఫేస్బుక్ లైవ్లో డ్యాన్స్ ... చివరికి ప్రాణాలు గాల్లో
పాట్నా: ఫేస్బుక్ లైవ్ డ్యాన్ చేస్తూ జాతీయ రహదారిపై అతివేగంగా కారులో వెళ్లడంతో వాహనం పల్టీలు కొట్టి ముగ్గురు మృతి చెందిన సంఘటన బీహార్ రాష్ట్రం మధేపూరా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘన్ శ్యామ్ కుమార్(28), వసంత్(23), అంకిత్ కుమార్(22), సాగర్(23) అనే యువకులు శ్రీరామ నవమి వేడుకలలో పాల్గొని తిరిగి కారులో వస్తున్నారు. ఫేస్బుక్ లైవ్ లో భోజ్పురి పాటలకు డ్యాన్ చేస్తూ, కేకలు వేస్తూ కారులో అతి వేగంగా ప్రయాణిస్తున్నారు. గ్వాల్ పూర్ ప్రాంతంలో కారు అదుపుతప్పి ఓ ఎలక్ట్రిక్ పోల్ను ఢీకొట్టింది. అనంతరం అక్కడి నుంచి 20 అడుగులు ఎత్తు ఎగిరి సుర్సార్ నదిలో పడింది. నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నదిలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. సాగర్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడవద్దని, అతివేగంతో ప్రయాణం చేస్తే ప్రాణాలు పోతాయని ఈ ఘటనే నిదర్శనం. మీ సరదానే మీ ప్రాణాలు తీసిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నెల 30వ మీకోసం కార్యక్రమం.. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం,
బొబ్బర్లంకలో మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు
మోపిదేవి, ఆంధ్రప్రభ : బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వీధుల్లో మారుమోగిన హోసన్నా నాదాలు..
వీధుల్లో మారుమోగిన హోసన్నా నాదాలు.. పరాసుపేట హోలీ క్రాస్ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో మట్టల
కడెం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలోని భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఆదివారం
CRIME |మద్యం మత్తులో అత్త ను చంపిన అల్లుడు…
CRIME | మద్యం మత్తులో అత్త ను చంపిన అల్లుడు… కత్తితో నాలుగు
Akkineni Akhil |లెనిన్ నిర్ణయం సరైనదేనా…?
Akkineni Akhil | లెనిన్ నిర్ణయం సరైనదేనా…? Akkineni Akhil | లెనిన్
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య..
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం
ఇప్పుడు సాగుతున్న యుద్ధాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధాలు శాశ్వతం కావడం ప్రపంచ దేశాలు ఎంత సంక్షోభంతో అల్లాడుతున్నాయో మనం చూస్తున్నాం. ఇరాన్, లెబనాన్, పశ్చిమాసియాలోని డజను అరబ్ దేశాల్లో క్షిపణులు, డ్రోన్లతో బాంబుల దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. ఏప్రిల్ 6 వరకు ఇరాన్ అణుశక్తి ప్లాంట్లపై దాడులు జరపబోమని అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించింది. గాజాలో శిధిలమైన జీవితాలను నిలబెట్టుకోడానికి అక్కడి జనం పోరాడుతుంటే, ఉక్రెయిన్లో భౌగోళిక రాజకీయ ఆధిపత్యం కోసం సైన్యాలు యుద్ధం సాగిస్తున్నాయి. గాజా విధ్వంసం ‘ప్రపంచం మరిచిపోతున్న యుద్ధం’గా మారుతుండగా, ఉక్రెయిన్ యుద్ధం నిరంతర మారణహోమంగా కొనసాగుతోంది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ అమెరికా తిరస్కరించడం వల్ల ఇరాన్ యుద్ధానికి దారి తీసి చమురు, గ్యాస్ రవాణా స్తంభించింది. దీనికి ప్రపంచమంతా మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. ఈ పరిణామాలే కనుక లేకుంటే సోమాలియాలో జరిగిన సైనిక చర్యలు వంటివి కేవలం శత్రుత్వంతో జరిగిన దురదృష్టకర సంఘటనలుగా మాత్రమే పరిగణించబడేవి. ఇరాన్ తన అద్భుతమైన యుద్ధ సామర్ధంతో అరబ్ దేశాలపై దాడి చేస్తూ హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు, గ్యాస్ రవాణాను అడ్డుకుంటోంది. ఇరాన్ అణుసామర్ధాన్ని అడ్డుకునే నెపంతో అమెరికాఇజ్రాయెల్ దేశాలు ఈ యుద్ధాన్ని మొదలు పెట్టినప్పటికీ ఇప్పుడు అది కేవలం చమురు రవాణా మార్గాలను తెరచి ఉంచడానికి జరిగే పోరాటంగా మారిపోయింది. ఈ యుద్ధం నుండి బయటపడడానికి అమెరికా ప్రయత్నిస్తున్నా ఇజ్రాయెల్ను ఒప్పించలేకపోతోంది. శాంతి ప్రయత్నాల పేరుతో అమెరికా 15 డిమాండ్లను ఇరాన్ ముందుకు తెచ్చింది. ఒప్పందం కుదురుతుందని అందరూ భావించారు. కానీ అది ఇరాన్కు లొంగిపోయే డాక్యుమెంట్గా చిత్రీకరించబడ్డది. అరబ్ దేశాలను ఇరాన్ తీవ్రంగా దెబ్బతీయడమే కాక, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయకుండా ఏ నౌకలు ఈ మార్గం ద్వారా వెళ్లాలో, ఏ నౌకలు వెళ్లకూడదో నిర్ణయిస్తూ టోల్బూత్ విధానాన్ని అమలు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ వారి మిత్ర దేశాల నౌకలను అడ్డుకుంటోంది. చైనా, భారత్ వంటి దేశాల నౌకలకే అనుమతిస్తోంది. దీనివల్ల తూర్పు దేశాలకు ముఖ్యంగా ఆసియా దేశాలకు ముడి చమురు, సహజవాయువు (ఎల్ఎన్జి) సరఫరా సాగడం లేదు. ఈ పరిస్థితి 1970నాటి ఇంధన సంక్షోభాన్ని గుర్తు చేస్తోంది. హోర్ముజ్ జలసంధిపై తమకే సార్వభౌమత్వాన్ని కల్పించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోపాటు ఐదు ప్రతీకార డిమాండ్లను ఇరాన్ ప్రతిపాదించిందంటే ఇక ఒప్పందం అన్న మాటకు అవకాశమే లేదని అర్ధం చేసుకోవాలి. యుద్ధం ఎటు వెళ్తోందో తెలియని స్థితిలో అమెరికా ఉంది. తన మిత్రదేశం ఇజ్రాయెల్కు ఒకవైపు మద్దతు ఇస్తూనే, మరోవైపు యుద్ధం వల్ల కలుగుతున్న నష్టాన్ని తగ్గించుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధం మొదట్లో ఇరాన్ అణుబాంబు టార్గెట్లను అణచివేయడం, ఇరాన్ పాలనలో మార్పు తీసుకురావడం, తదితర లక్షాలతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని తొలగించడమే ప్రధాన లక్షంగా మారింది. యుద్ధానికి ముందు ఈ మార్గం నిరంతరం తెరిచే ఉండేది. ఇదెంత హాస్యాస్పదమో అన్న విమర్శలు అందరి నోటా వినిపిస్తున్నాయి. కానీ ట్రంప్ కుటుంబ సభ్యుల సంప్రదింపుల బృందానికి, స్నేహితులకు కేబినెట్ సహచరులకు మాత్రం ఇదేమీ అనిపించడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా వైమానిక దాడులు జరగడానికి 48 గంటల ముందే ఇరాన్ తన అణు కార్యకలాపాలపై చర్చకు సిద్ధమని, 60 శాతం వరకు సుసంపన్నం చేసిన 440 కిలోల యురేనియంను వదులుకోడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సంకేతాలిచ్చినా ఇజ్రాయెల్ అమెరికా పట్టించుకోకుండా దుస్సాహసంతో దాడులు ప్రారంభించారని అమెరికా దౌత్యవేత్తలు కొందరు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ యుద్ధం ఇరాన్, రష్యా దేశాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే వాణిజ్యంగా సాగుతోంది. చమురు విక్రయాలపై ఆంక్షలు సడలించడంతో రోజుకు 140 మిలియన్ డాలర్లను సంపాదించగలుగుతున్నామని ఇరాన్ చెబుతోంది. రష్యాకు కూడా ఇదే విధమైన ప్రయోజనం చేకూరుతోంది. రష్యా తన చమురును ఎవరికైనా విక్రయించుకునేలా వెసులుబాటు లభించడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ లాభాల పంటను పండించుకుంటున్నారు. దీంతో ఉక్రెయిన్తో మరింత పోరు సాగించడానికి ఆర్థిక ఊతం మరింత లభించినట్టయింది. ఇరాన్ భూభాగంలో కానీ, ఇరాన్ అధీనంలో ఉండే ఖర్గ్ ద్వీపంలో కానీ అమెరికా దురాక్రమణకు పాల్పడితే ప్రపంచ దేశాలు మరింత సంక్షోభానికి గురవుతాయి. హోతీ వర్గాలకు స్థావరంగా తయారైన ఎర్రసముద్రం మార్గాన్ని కూడా అష్టదిగ్బంధనం చేస్తామని అమెరికా ఇజ్రాయెల్ దేశాలను ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘమైన ‘ఎండ్గేమ్’ ప్రణాళికను ట్రంప్ రూపొందించడం కంటే శాశ్వత యుద్ధ స్థితి అనే ఊబిలోనుంచి బయటపడడానికి దౌత్యమార్గాల ద్వారా ప్రయత్నాలు సాగించడం శ్రేయస్కరం. ఇదే విధంగా ఇరాన్ కూడా స్థిరమైన నిరంకుశ రాజకీయాలు, యుద్ధ వ్యూహాలతో తమ ప్రతిఘటన సామర్ధం నిరూపించుకోవడం కంటే అణుబాంబుల తయారీ అనేది తెలివి తక్కువ నిర్ణయమని, తాము ఆ దిశంగా వెళ్లడం లేదని ప్రపంచానికి చాటిచెప్పేలా స్పష్టమైన హామీ ఇవ్వడం ప్రపంచ క్షేమానికి దారి చూపుతుంది.
ఎల్డిఎఫ్ హ్యాట్రిక్ సాధించేనా?
కేరళ రాజకీయాలపై ఎన్నో దశాబ్దాలుగా ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. ఏ ఒక్కరికీ వరుసగా అధికారం ఇవ్వకుండా అక్కడి ఓటరు రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారాన్ని మార్చేస్తారు. వామపక్ష కూటమి, కాంగ్రెస్ కూటముల మధ్య అధికార మార్పిడి జరుగుతూ కేరళ రాష్ట్రం ప్రజాస్వామ్యానికి ప్రత్యేకతగా నిలిచింది. అయితే ప్రభుత్వ మార్పు సంప్రదాయానికి 2021లో అక్కడి ప్రజలు తెరదించారు. వామపక్ష కూటమి (ఎల్డిఎఫ్) వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు రాజకీయ వర్గాల ముందున్న ప్రశ్న ఒక్కటే.. ఈసారి ఎల్డిఎఫ్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ దానికి పగ్గాలేస్తుందా..? వేచిచూడాలి. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలో ఒకటైన ఈ రెండు కూటములు కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గత గణాంకాలను పరిశీలిస్తే 51 నియోజకవర్గాల్లో ఎల్డిఎఫ్కు గట్టి పునాదులున్న నేపథ్యంలో 140 స్థానాలున్న కేరళలో మెజారిటీకి కావాల్సిన 71 స్థానాల్లో వామపక్ష ఎల్డిఎఫ్ కూటమి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందా వేచి చూడాలి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడంతోపాటు గత గణాంకాలను కూడా క్షుణ్ణంగా విశ్లేషించిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రకటనలు, సభలు, వాగ్దానాలు ఎలా ఉన్నా వీటన్నిటికంటే ఎక్కువగా వాస్తవ గణాంకాలే నిజాలు చెబుతాయి. రాష్ట్రంలో 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్ ఫలితాలను గమనిస్తే కేరళ ఓటరు తీర్పులో స్థిరమైన ధోరణి కనిపిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 51 నియోజకవర్గాలు ఒకే కూటమికి వరుసగా మద్దతు ఇస్తూ వచ్చాయి. ఈ సంఖ్య సాధారణమైనది కాదు. ఇవి మొత్తం స్థానాల్లో దాదాపు 35 శాతం. ఈ 51 స్థానాల్లో 39 స్థానాలు సిపిఎం పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుండగా, మిగతా 12 స్థానాలు దాని మిత్రపక్షం సిపిఐకి కంచుకోటలుగా నిలవడంతో మొత్తం మీద ఎల్డిఎఫ్ కూటమికి తిరుగులేని పునాదిగా మారాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ చేతిలో కేవలం 26 స్థానాలు మాత్రమే స్థిరంగా ఉన్నాయి. కాంగ్రెస్ 12 స్థానాల్లో మిగతా 14 స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆధిపత్యం సాగిస్తున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ బలాబలాలు తెలుస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్డిఎఫ్కు ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకు యుడిఎఫ్తో పోలిస్తే దాదాపు రెట్టింపు. రాష్ట్రంలో ఈ ఆధిపత్య ధోరణి ఒక్కసారిగా ఏర్పడింది కాదు. 1982 నుంచి 2006 వరకు కూడా కొన్ని నియోజకవర్గాలు నిరంతరం ఒకే కూటమికి మద్దతుఇస్తూ వచ్చాయి. అయితే ఆ కాలంలో ఆ సంఖ్య కేవలం 26 మాత్రమే. కేరళలో 2008 డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతోపాటు రాజకీయాలు కూడా మారాయి. కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాల్లో వామపక్ష నాయకత్వం బలపడింది. ఫలితంగా ఎల్డిఎఫ్ స్థిర స్థానాల సంఖ్య 51కి పెరిగింది. భౌగోళికంగా చూస్తే రాష్ట్రంలో ఎల్డిఎఫ్ యుడిఎఫ్ కూటముల మధ్య ప్రాంతీయంగా ఏర్పడిన రాజకీయ విభజన కూడా ఆసక్తికరమే. కన్నూర్, అలప్పుజ ప్రాంతాలు వామపక్ష పార్టీలకు పటిష్టమైన కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. మైనారిటీలు అధికంగా ఉండే మలబార్ ప్రాంతంలో ముస్లిం లీగ్ తన పట్టును నిలబెట్టుకుంది. మధ్య కేరళలో స్థిరంగా కాంగ్రెస్ ఆధిపత్యం సాగుతోంది. అయితే దక్షిణ కేరళలో మాత్రం పూర్తిగా భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో ఏ ఒక్క కూటమికీ పూర్తి ఆధిపత్యం కనిపించడం లేదు. ఏ కూటమికి ఏకపక్షంగా ఉండని దక్షిణ కేరళ ఓటర్ల తీర్పు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుంది. అందుకే అసలు పోరు దక్షిణ కేరళలోనే జరగబోతోందని కచ్చితంగా చెప్పవచ్చు. అధికారంలో ఉన్న పక్షంపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం దేశ రాజకీయాల్లో సర్వసాధారణం. ప్రత్యేకించి కేరళలో 2021ఎన్నికల ముందు వరకు ఇదే ధోరణీ కొనసాగడంతో వరుసగా ఎవరూ రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే 2021లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారం మార్పిడి సంప్రదాయానికి బ్రేక్ వేస్తూ అధికారాన్ని నిలబెట్టుకోవడం రాష్ట్రరాజకీయాల్లో చరిత్రగా నిలిచిపోయింది. ప్రస్తుత 2026 శాసనసభ ఎన్నికల్లో పినరయి విజయన్ యాంటీ ఇంకంబెన్సీని ప్రో ఇంకంబెన్సీగా మార్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు స్థానిక ఎంఎల్ఎల పనితీరు, ప్రజలతో వారికున్న సత్సంబంధాలు బేరీజు వేసుకుంటూ, అదే సమయంలో మరోవైపు తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు పినరయి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల విశ్లేషణను పూర్తిగా గత ఫలితాల గణాంకాల ఆధారంగానే చేయలేము. కనిపించే గణాంకాలు ఎంత బలంగా ఉన్నా రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ష్యూర్ షాట్గా భావించే కొన్ని స్థానాలు గతంలో కూడా మారినట్టు చరిత్ర చెబుతోంది. 2012లో నెయ్యాటింకర ఉప ఎన్నికల్లో సిపిఎం ఓడిపోవడం, 2019లో అరూర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఇందుకు ఉదాహరణలు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో గమనిస్తే ఇప్పుడూ కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంబలపుజ నియోజకవర్గాన్నే తీసుకుంటే ఇక్కడ గతంలో మూడు సార్లు ఎంఎల్ఎగా గెలిచి 2021లో పోటీ చేయని సిపిఐ(ఎం) సీనియర్ నేత జి. సుధాకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఆయనకు యుడిఎఫ్ మద్దతిస్తోంది. అలాగే పయ్యనూరు సిపిఐ(ఎం) సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనన్పై పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. కొట్టారక్కర నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ 2016లో సిపిఐ(ఎం) ఎంఎల్ఎగా గెలిచిన ఐషా పొట్టి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడంతో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో పటిష్టంగా ఉన్న ఎల్డిఎఫ్ కూటమికి ఈ స్థానాల్లో గట్టి పోటీ ఎదురవుతుండడంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలున్నాయి. వామపక్షల ఎల్డిఎఫ్ కూటమే కాదు యుడిఎఫ్ కూడా బలమైన స్థానాల్లో కఠిన పరీక్షనే ఎదుర్కొంటోంది. పెరువూరు నియోజకవర్గంలో 2011, 2016, 2021లో వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ ఎంఎల్ఎగా గెలిచిన సన్నీ జోషఫ్కు స్థానికంగా సొంత పార్టీ నేతలతో ఉన్న విభేదాలతో వారు పూర్తిగా సహకరించకపోవడంతో ఆయనకు సిపిఐ(ఎం) అభ్యర్థి శైలజతో గట్టి పోటీ ఎదురవుతోంది. పాలక్కాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తీవ్ర త్రిముఖ పోటీ ఎదుర్కొంటోంది. ఇక్కడ బిజెపి కాంగ్రెస్కు గట్టి పోటీ ఇస్తోంది. అధికార ఎల్డిఎఫ్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్ విజయం అంత సులభం కాదు. ఇటీవల జరిగిన పాలక్కాడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డిఎ ఆధిక్యత కనబర్చడంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బిజెపి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ తాజా పరిణామాలు పరిశీలిస్తే గతంలో పటిష్టంగా ఉన్న స్థానాల్లో కూడా యుడిఎఫ్కు విజయం తేలిక కాదని స్పష్టమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి కేరళలో బలమైన పోటీ ఇవ్వడం కోసం శ్రమిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బిజెపికి సంప్రదాయంగా ఉన్న కొంత బలాన్ని విజయాలుగా మల్చుకోవాలని ఆ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా సిపిఐ బలమైన కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి గట్టి సవాల్ విసురుతోంది. బిజెపి ఈ స్థానాల్లో ప్రత్యక్షంగా గెలుపు సాధించకపోయినా చాలా చోట్ల ఓట్లను చీల్చడం ద్వారా గెలుపోటములను శాసించే స్థితిలో ఉంది. శాసనసభ ఎన్నికల ముందు 2025 డిసెంబర్లో జరిగన కేరళ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వామపక్ష ఎల్డిఎఫ్ కంచుకోటల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో యుడిఎఫ్ మెరుగైన ఫలితాలు సాధించింది. స్థానిక ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే ఎల్డిఎఫ్కు బలమైన స్థానాలుగా భావిస్తున్న 51 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. గత గణాంకాల ప్రకారం 51 చోట్ల బలమైన పునాదితో ఎల్డిఎఫ్ ఆధిక్యత కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో గట్టి పోటీ ఎదురవడం ఖాయం. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 14 ఎస్సి నియోజకవర్గాల్లో 12 చోట్ల ఎల్డిఎఫ్ కూటమి, 2 ఎస్టి నియోజకవర్గాల్లో యుడిఎఫ్ కూటమి బలంగా ఉన్నాయని గత గణాంకాలు చెబుతున్నాయి. గణాంకాలు ఎలా ఉన్నా కేరళ ఓటర్ల స్వభావం మారుతూ ఉంటుందని గత చరిత్రతో పాటు స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. పరిస్థితుల దృష్ట్యా ఓటర్ల అభిప్రాయం మారతుంటుంది. ఎల్డిఎఫ్ బలంగా కనిపిస్తున్నా స్థానిక ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో బలపడుతున్న బిజెపి వంటి పరిణామాలు కేరళలో ఎల్డిఎఫ్ను హ్యాట్రిక్ వైపు తీసుకెళ్తాయా..? వామపక్ష ప్రభుత్వానికి బ్రేకులేస్తాయా..? మే 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. - జి.మురళీకృష్ణ
Niharika konidela |ఇక నిర్మాతలకు టెన్షనే..
Niharika konidela | ఇక నిర్మాతలకు టెన్షనే.. Niharika konidela | నిర్మాతలకు
టెక్నాలజీ మనిషి జీవితాన్ని సులభతరం చేయాలి. కానీ అదే టెక్నాలజీ మనిషి మెదడును తన గుప్పిట్లోకి తీసుకుని బానిసను చేస్తే? సరిగ్గా ఇదే అంశంపై కాలిఫోర్నియా జ్యూరీ ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వ్యసనానికి మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), యూట్యూబ్ వంటి సంస్థలే బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేస్తూ, 6 మిలియన్ డాలర్ల జరిమానా విధించడం ఒక చారిత్రాత్మక పరిణామం. సోషల్ మీడియా అనేది కేవలం సమాచార మార్పిడి వేదిక మాత్రమే కాదు, అదొక పకడ్బందీగా రూపొందించబడిన ‘డిజిటల్ సైకాలజీ’. వినియోగదారుడు యాప్ను క్లోజ్ చేయకుండా నిరంతరం స్క్రోల్ చేస్తూనే ఉండేలా చేసే ‘ఇన్ఫైనైట్ స్క్రోలింగ్’, ఆటో-ప్లే ఫీచర్లు యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. అవి యూజర్ల మెదడులో డోపమైన్ విడుదలను ప్రేరేపించి, వారిని ఒక రకమైన మత్తులోకి నెట్టేలా డిజైన్ చేయబడ్డాయి. ఈ ఉచ్చులో పడి పసిపిల్లలు తమ సహజత్వాన్ని కోల్పోతున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియా వినియోగాన్ని వ్యక్తిగత అలవాటుగా మాత్రమే చూశాం. ఫోన్ ఎక్కువగా చూస్తున్నారు అంటే వారి తప్పే అని భావించాం. కానీ ఈ తీర్పు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. వినియోగదారుల బలహీనతలను గుర్తించి, వారిని ఎక్కువసేపు యాప్లలోనే ఉంచేలా రూపొందించిన ఆల్గారిథమ్స్ కూడా ఒక కారణమని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఇది కేవలం వినియోగదారుడి తప్పు మాత్రమే కాదు.. ఇది వ్యవస్థపరమైన సమస్య. సోషల్ మీడియా కంపెనీలు రూపొందించిన ఆటోప్లే, ఇన్ఫినిట్ స్క్రోలింగ్, నిరంతర నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు సాధారణ సాంకేతిక సౌకర్యాలు కావు. అవి మన దృష్టిని బంధించే పద్ధతులు. మన మెదడు డోపమైన్పై ఆధారపడేలా చేసే ఒక మానసిక వ్యూహం. ఇది వినోదం పేరుతో వ్యసనాన్ని పెంచే డిజైన్. అందుకే నిపుణులు దీన్ని డిజిటల్ సైకాలజీగా పేర్కొంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆందోళన కలిగించే విషయం పిల్లలపై పడుతున్న ప్రభావం. చిన్న వయస్సులోనే సోషల్ మీడియా వినియోగం ప్రారంభమవుతోంది. వాస్తవ ప్రపంచంతో పోల్చితే వర్చువల్ ప్రపంచమే వారికి నిజమైన జీవితం అనిపించే స్థితి వస్తోంది. అందం అంటే ఏమిటి? విజయం అంటే ఏమిటి? సంబంధాలు అంటే ఏమిటి? అన్న భావనలు కూడా సోషల్ మీడియా ప్రభావంతో మారిపోతున్నాయి. దీని ఫలితంగా ఆందోళన, ఒంటరితనం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఈ సమస్యను వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయికి తీసుకువచ్చింది. ఇది ఇక ఒక కుటుంబ సమస్య కాదు. ఇది ఒక ప్రజారోగ్య సమస్య. పొగాకు కంపెనీలపై గతంలో వచ్చిన తీర్పుల మాదిరిగా, ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీల బాధ్యతపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఇది ఒక కొత్త దిశలో ప్రారంభమైన మార్పు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. మొత్తం బాధ్యత కంపెనీలదేనా? వినియోగదారుల బాధ్యత ఏమిటి? తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? సమాధానం సులభం కాదు. కానీ స్పష్టమైన విషయం ఏమిటంటే.. ఇది ఒక సంయుక్త బాధ్యత. కంపెనీలు తమ ప్లాట్ఫారమ్లను బాధ్యతాయుతంగా రూపొందించాలి. ప్రభుత్వాలు నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ అలవాట్లపై పర్యవేక్షణ చేయాలి. ముఖ్యంగా వినియోగదారులు తమ సమయాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. ఈ తీర్పు మరో ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తోంది. సాంకేతికత మన కోసం ఉండాలి.. మనపై ఆధిపత్యం కోసం కాదు. మన జీవితం సులభతరం చేయడానికి వచ్చిన సాధనాలు మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి చేరుకుంటే, అది అభివృద్ధి కాదు. అది ప్రమాద సంకేతం. ఇప్పుడు ప్రపంచం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. సోషల్ మీడియా భవిష్యత్తు ఎలా ఉండాలి? అది లాభాల కోసం పనిచేసే యంత్రంగానే కొనసాగాలా? లేక సమాజానికి మేలు చేసే బాధ్యతాయుత వేదికగా మారాలా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ నేపథ్యంలో భారతదేశం వంటి యువ జనాభా అధికంగా ఉన్న దేశాలకు ఈ తీర్పు ఒక ముఖ్యమైన హెచ్చరికగా పరిగణించాలి. ఇప్పటికే మన దేశంలో చిన్న వయస్సు పిల్లల నుంచి కాలేజీ యువత వరకు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. రోజుకు గంటల కొద్దీ ఫోన్లకు పరిమితమవుతున్న జీవితం వారి చదువు, వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్నది. అయితే ఇప్పటివరకు దీనిని ఒక సామాన్య జీవనశైలి మార్పుగా మాత్రమే చూస్తున్నాం గానీ, ఒక ప్రజారోగ్య సమస్యగా చర్చించలేదు. ఇప్పుడు ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రత్యేకంగా పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించడం అత్యంత అవసరం. పిల్లలకు సోషల్ మీడియా ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రమాదాల గురించి కూడా చెప్పాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా వయస్సు పరిమితులు, డేటా రక్షణ, ఆల్గారిథమ్ పారదర్శకత వంటి అంశాలపై కఠినమైన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించాయి. భారత్ కూడా వెనుకబడకూడదు. సోషల్ మీడియాను పూర్తిగా నిరాకరించడం సాధ్యం కాదు, అవసరమూ కాదు. కానీ దాన్ని నియంత్రణలో ఉంచే సామాజిక బాధ్యతను మాత్రం విస్మరించలేము. కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఒకటే.. సాంకేతికత మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి గానీ, మనిషిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి కాదు. ఈ సత్యాన్ని గుర్తించే సమాజమే భవిష్యత్తులో ఆరోగ్యకరమైన డిజిటల్ సంస్కృతిని నిర్మించగలదు. కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఒక కేసుకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది డిజిటల్ యుగానికి ఇచ్చిన హెచ్చరిక. మనం ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే, డిజిటల్ డ్రగ్ అనే పదం, పెను ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉంది. - ముద్దం నరసింహస్వామి - 99498 39699
కూకట్పల్లిలో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడిన చెరకు లారీ #Kukatpally #RoadAccident #TrafficJam
లిటిల్ ప్లవర్ కాలేజీలో లెక్చరర్ వేధింపులు... ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు
ఉప్పల్: డిగ్రీ విద్యార్థినిని లెక్చరర్ లైంగికంగా వేధించిన సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. కాప్రాకు చెందిన ఓ విద్యార్థిని లిటిల్ ప్లవర్ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. సదరు విద్యార్థినికి అనారోగ్య సమస్యలు ఉండడంతో కాలేజీ హాజరు కాలేనని డాక్టరు సర్టిఫికెట్ సమర్పించడంతో పాటు అటెండెన్స్ ఫీజు చెల్లిస్తూ పరీక్షలు రాస్తోంది. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తనను వేధింపులకు గురి చేశాడని, సెకండియర్ చదువేటప్పుడు తన వ్యక్తిత్వ హననం చేయడంతో పాటు ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధించాడని తెలిపాడు. వేధింపులపై గతంలో ఫిర్యాదు చేశానని, మళ్లీ ఇప్పుడు వేధిస్తున్నాడని విద్యార్థిని వాపోయింది. దీంతో ఆమె తల్లికి చెప్పడంతో ఇద్దరు కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి..
న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి.. కామారెడ్డి, ఆంధ్రప్రభ : న్యాయవాదుల సంక్షేమానికి నిరంతరం
నక్సలిజాన్ని అంతం చేస్తే.. విప్లవ భావన మరణిస్తుందా?
నక్సలిజం ముగిస్తే.. విప్లవ భావన కూడా సమాధి అవుతుందా? లేక అది మరింత లోతుల్లోకి వెళ్లి మరో రూపంలో మళ్లీ పుట్టుకొస్తుందా? ఒక వర్గానికి ఇది శోషితుల స్వరంగా, అణగారిన వర్గాల ఆశగా కనిపిస్తే.. మరొక వర్గానికి రక్తపాతం, హింసగా అనిపిస్తుంది. దశాబ్దాలుగా దేశాన్ని వేధిస్తున్న ఈ సమస్యకు మార్చి 31, 2026 లోపు నక్సల్-ముక్త భారత్ అనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యం నిజంగా ముగింపు రేఖనా? లేక ఒక దశ ముగిసిన సంకేతమా? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం తుపాకుల శబ్దాల్లో కాదు.. సమాజం గుండెల్లో దాగి ఉన్న అసమానతల్లో ఉంది. 1967లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరి గ్రామంలో మొదలైన ఈ తిరుగుబాటు ఉద్యమం భూమి, హక్కులు, విముక్తి అనే నినాదాలతో అణగారిన వర్గాలను ఒక్కటి చేసింది. భూస్వామ్య వ్యవస్థపై రైతులు, కూలీలు పిడికిలి బిగించారు. కొన్ని స్థానిక విజయాలు సాధించారు. కానీ కాలం మారినా, వారి పోరాట విధానం మారలేదు. మార్పుకు అనుగుణంగా తమ శైలిని మార్చుకోలేకపోయారు. ఎన్నో ఉద్యమాలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. కానీ విప్లవం? అది ప్రజల గుండెల్లోని అశాంతి, అన్యాయంపై తిరగబడే ఉక్కు పిడికిలి. అది ఎప్పటికీ పూర్తిగా చనిపోదు. నక్సలిజం కేవలం తుపాకులు, గెరిల్లా యుద్ధం మాత్రమే కాదు. ఇది ఒక భావజాలం అణచివేత, శోషణకు వ్యతిరేకంగా పుట్టిన ఆకాంక్ష. ప్రభుత్వాలు దళాలను ఎన్కౌంటర్లు, ఆపరేషన్ల ద్వారా తుడిచిపెట్టవచ్చు. కానీ భావజాలాన్ని బుల్లెట్లతో చంపలేవు. అది ప్రజల మనసుల్లో, చర్చల్లో, సాహిత్యంలో, ఉద్యమాల్లో జీవించి ఉంటుంది. 2025 మేలో అబూజ్మడ్లో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు (బసవరాజు) 27 మంది సహచరులతో ఎన్కౌంటర్లో మరణించారు. 2025 అక్టోబర్లో మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అబయ్, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న బృందం 208 మంది దళ సభ్యులతో భారీగా లొంగిపోయారు. ఫిబ్రవరి 2026లో దేవుజి అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, బడే చొక్కారావు వంటి టాప్ నాయకులు సరెండర్ అయ్యారు. మార్చి 24న పాపారావు 17మంది జట్టుతో లొంగిపోయారు. చత్తీస్గఢ్లో గత రెండేళ్లలో వేలాది సరెండర్లు, అబూజ్మడ్లో భద్రతా దళాల ఆధిపత్యం. కానీ భగత్ సింగ్, అంబేద్కర్ భావజాలాలు ఎలా ఇప్పటికీ జీవించి ఉన్నాయో, నక్సలిజం భావజాలం కూడా అసమానతలు, అన్యాయాలు ఉన్నంతవరకు మరో రూపంలో కొనసాగుతుంది. హింసను అణచడం తాత్కాలికం. అసమానతలను తొలగించడమే శాశ్వత మార్గం. నక్సల్స్ చర్చలకు సిద్ధమని పలుమార్లు ప్రకటించినా, ప్రభుత్వం మార్చి 31, 2026 లోపు పూర్తి నిర్మూలన లక్ష్యంతో లా అండ్ ఆర్డర్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోంది. గత నాలుగు నెలల్లో సుక్మా, బీజాపూర్, నారాయణపూర్లో ఎన్కౌంటర్లు, సరెండర్లు పెరిగాయి. అబూజ్మడ్లో ఒకప్పటి రెడ్ కారిడార్ ఇప్పుడు భద్రతా దళాల చేతుల్లోకి వచ్చింది. మావోయిస్టు నాయకత్వం దాదాపు కుప్పకూలింది. కానీ ఇది నిజమైన శాంతి కాదు కదా? చర్చలు, మానవ హక్కులు, అభివృద్ధి మార్గాలు విస్మరించబడ్డాయని మేధావులు, పౌర హక్కుల సంఘాలు వాదిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది. అన్యాయాలపై స్పందించే బాధ్యత ప్రభుత్వానిది. తుపాకీ మాత్రమే కాకుండా, ప్రజల గుండెల్లో మార్పు తీసుకురాగల అభివృద్ధి, న్యాయం అందించడమే నిజమైన శాంతి మార్గం. కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని దేశ అంతర్గత భద్రతా సమస్యగా చూసి, పోలీసు- సైనిక చర్యలతో ఎదుర్కొంటోంది. గత నాలుగు నెలల్లో ఈ వ్యూహం ఫలితాలు ఇస్తోంది. లీడర్షిప్ దెబ్బతిన్నది, సరెండర్లు పెరిగాయి. కానీ జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్ (2008) చెప్పినట్లు, చర్చలే స్థిరమైన పరిష్కారం. హింసకు హింసతో స్పందించడం తాత్కాలిక విజయం మాత్రమే. సమస్య మూలం భూమి సమస్యలు, ఆదివాసీల హక్కుల దోపిడీ, అట్టడుగు వర్గాల వెనుకబాటుతనం - పరిష్కరించకపోతే, తిరుగుబాటు మరో రూపంలో బయటపడుతుంది. నక్సలిజం పుట్టుకకు కారణం దళితులపై అత్యాచారాలు, గిరిజనుల భూముల దోపిడీ, పేదలకు అవకాశాల లోపం. ఇవి ఇప్పటికీ పూర్తిగా తొలగలేదు. బలప్రయోగంతో ఒక రూపాన్ని అణచవచ్చు. కానీ అన్యాయం బతికి ఉంటే, ఆ భావన మళ్లీ మరో రూపంలో వస్తుంది. న్యాయం లేని సమాజంలో శాంతి కేవలం భ్రమ మాత్రమే. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు అని చెబుతున్న ప్రభుత్వమే హింసాత్మక చర్యలు చేపట్టడం ఏమిటి? అణగారిన వర్గాల బాధలు, దోపిడీ, దమనం సహించలేక నక్సల్స్ ఉద్యమించారు. ప్రభుత్వం వారి హక్కులు, న్యాయం, అభివృద్ధి అందిస్తే నక్సలిజం ఎందుకు పుట్టాలి? ప్రజాస్వామ్యం అంటే చర్చ, సమన్వయం, పరిష్కారం. హింస అది ఎవరి నుంచైనా వచ్చినా - సమస్యను పెంచుతుంది తప్ప తగ్గించదు. మార్చి 31, 2026 తర్వాత ప్రభుత్వం విజయాన్ని ప్రకటించవచ్చు. గణాంకాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. కానీ నిజమైన ప్రశ్న అక్కడితో ముగియదు. తుపాకుల శబ్దం ఆగిపోవచ్చు.. కానీ అన్యాయం ఆగిపోయిందా? అసమానతలు చెరిగిపోయాయా? అణగారినవారికి న్యాయం అందిందా? ఇవే అసలు పరీక్షలు. విప్లవం అంటే కేవలం గన్ కాదు.. అది అన్యాయం చూసిన ప్రతి హృదయంలో మెదిలే ఆగ్రహం. ఆ ఆగ్రహానికి సమాధానం న్యాయం అయితేనే శాంతి శాశ్వతం అవుతుంది. లేకపోతే.. చరిత్ర మళ్లీ తనను తాను రిపీట్ చేసుకునే రోజు దూరంలో ఉండదు. - కాలగిరి శ్రీనివాస్రెడ్డి
భద్రాచలంలో తుఫాన్ బోల్తా: ఇద్దరు మృతి
భద్రాద్రికొత్తగూడెం జిల్లా చింతూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్డుగూడెం శివారులో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి తుఫాన్ పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తుఫాన్ వాహనం 12 మంది ప్రయాణికులతో భద్రాచలం నుంచి చింతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Disastrous Phase for Telugu Cinema Continues
Tollywood opened with a bang with the Sankranthi releases and the films performed well and gave the needed boost for everyone in January. But the audience showed no interest in watching films in theatres in February. The disappointing word of mouth added more troubles for the new releases. The same is the case with the […] The post Disastrous Phase for Telugu Cinema Continues appeared first on Telugu360 .
Weather Report : టెంపరేచర్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయిగా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
IPL 2026 L నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్
నేడు ముంబయి ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 82,040 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.18 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
Dhurandhar: The Revenge Scripts History in USA
Dhurandhar: The Revenge is a stupendous hit and the film is doing exceptional business all over. The film is performing extremely well across the international locations like North America. Baahubali: The Conclusion holds a record among the Indian films as the Biggest Grosser. No Hindi film near to the closing numbers of Baahubali 2. But […] The post Dhurandhar: The Revenge Scripts History in USA appeared first on Telugu360 .
నందివాడ మండలంలో దారుణం.. నందివాడ, ఆంధ్రప్రభ : నందివాడ మండలంలో దారుణం జరిగింది.
Telangana :తెలంగాణలో సన్నబియ్యం పథకానికి ఏడాది
తెలంగాణలో సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తయింది.
వీధి కుక్కల దాడిలో ఆవు దూడలు మృతి..
వీధి కుక్కల దాడిలో ఆవు దూడలు మృతి.. వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్
ఫ్యామిలీ ఎమోషన్స్తో హారర్ థ్రిల్లర్
జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో రవి, శ్రేయ తివారి హీరో హీరోయిన్గా సిస్ ఫిలిమ్స్ బ్యానర్పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘విచిత్ర’. ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన హార్రర్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం మే 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ “ప్రపంచం మొత్తం దూరమైన దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే. ఈ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా ‘విచిత్ర’. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూసే చిత్రమిది. నిజాని అందించిన అన్ని పాటలు బాగా వచ్చాయి. చిత్ర పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ హైలెట్గా నిలుస్తుంది”అని అన్నారు.
“పోలీస్ అక్క”కు జాతీయ స్థాయి గౌరవం..
“పోలీస్ అక్క”కు జాతీయ స్థాయి గౌరవం.. నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : “SKOCH
Gold Prices Today : బంగారం ఇప్పుడు కొనుగోలు చేయడం కంటే ఆగడం మంచిదా?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి
యంగ్ హీరో అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న పాన్- ఇండియా యాక్షన్ -రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. శనివారం మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘చిచ్చుబుడ్డి’ని విడుదల చేశారు. ఇది శేష్ క్యారెక్టర్ సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. ’చిచ్చుబుడ్డి’ పాట సినిమా మూడ్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇందులో అడివి శేష్ తొలిసారిగా తెరపై డ్యాన్స్ చేస్తూ హై-ఎనర్జీ అవతార్లో అదరగొట్టారు. సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఫోక్ బీట్లతో కూడిన పార్టీ జానర్ పాట కంపోజ్ చేశారు. భాస్కరభ ట్ల రవికుమార్ విజువల్స్కి సరిపోయే సర దా, ఆటపట్టించే సాహిత్యం అందించారు. జోనితా గాంధీ తన ఎనర్జిటిక్ గాత్రంతో ఈ పాటకు పవర్ జత చేశారు. తన గ్లామరస్ డ్యాన్స్ తో తెరపై కూడా మెరిశారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ’డెకాయిట్’ చిత్రంలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
America : ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో భారీగా నిరసనలు
అమెరికా అంతటా శనివారం నిర్వహించిన “నో కింగ్స్” ర్యాలీల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు
భారతదేశానికి ప్రాణం హిందూ ధర్మం..
భారతదేశానికి ప్రాణం హిందూ ధర్మం.. రెంజల్, ఆంధ్రప్రభ : సమాజంలో హిందూ సంస్కృతి,
29thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
29thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 29thMarchCartoon | ట్రంప్ పాలనలో
ఆవనూనెను తరలిస్తున్న ఓ ట్యాంకర్ బోల్తా... ఎగబడిన జనం #Agra #OilTanker #ViralVideo #BreakingNews
Tirumala : తిరుమలకు నేడు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం వెంటనే
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
రంజని తండాలో అగ్నిప్రమాదం.. కుబీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్ మండల
Andhra Pradesh : బంగారు గనులు తవ్వకానికి అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో బంగారు గనులు తవ్వకానికి అంతా సిద్ధమయింది
హైదరాబాద్లో కల్తీ ఉస్మానియా బిస్కెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు #HyderabadPolice #HFAST
రాజీ మార్గమే రాజమార్గం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కోర్టు కేసులలో కక్షలకు పోయి
ఓటమితోనే లోపాలు బయటకు వస్తాయి..
ఓటమితోనే లోపాలు బయటకు వస్తాయి.. ఆళ్ళపల్లి, ఆంధ్రప్రభ : క్రీడలతో క్రీడాకారుల నడుమ
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు
ఆ హీరో రూ.3.15 కోట్ల మోసం... యువకుడు ఆత్మహత్యాయత్నం
అమరావతి: జెట్టి సినిమా హీరో తనను మోసం చేశాడంటూ ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో లోకేష్ అనే యువకుడు నివసిస్తున్నాడు. లోకేష్ కు జెట్టి సినిమా హీరో మురళీ కృష్ణ పరిచయం ఉంది. మురళీ కృష్ణ డబ్బులు కావాలని పలుమార్లు అడగడంతో బంధువుల, ఇల్లు తాకుట్టు పెట్టి రూ.3.15 కోట్లు ఆయనకు ఇప్పించానని లోకేష్ ఆరోపణలు చేస్తున్నాడు. మురళీ కృష్ణ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో లోకేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే కాంట్రాక్ట్ పేరుతో మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతడిని బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ లో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు లోకేష్ లేఖ రాశాడు. కనీసం ఆస్పత్రి ఖర్చులకు రూ.20 లక్షలు ఇవ్వాలని కోరిన హీరో మురళీ కృష్ణ పట్టించుకోలేదన్నారు. తన ఇల్లు తాకట్టు పెట్టీ, బంధువుల దగ్గర అప్పులు చేసి హీరోకు రూ.3.15 కోట్లు ఇచ్చానని, ఇప్పుడు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోస పోయానని పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
Hyderabad : హైదరాబాద్ లో ఈ ప్రాంతాల్లో వాహనాలకు నో ఎంట్రీ
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు
అమ్మతనానికి నిదర్శనం.. కొత్తగూడ, ఆంధ్రప్రభ : అమ్మతనానికి నిదర్శనమై చిన్నారిని ఆప్యాయంగా తన
అలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం..
అలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం.. ఉర్కొండ: ఆంధ్రప్రభ : ఐపీఎల్ క్రికెట్
IPL 2026 : అదిరిన ఆరంభ మ్యాచ్.. హైదరాబాద్ పై బెంగళూరు అలవోక విజయం
ఆరంభ మ్యాచ్ అదిరింది. డిఫెండింగ్ ఛాంపియన్ విజేతగా నిలిచిం
North Korea : చర్చల విఫలం తర్వాత టార్గెట్ అమెరికా.. స్వయంగా పరీక్షించిన అధినేత
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను లక్ష్యంగా చేసుకునే క్షిపణుల సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు
భర్త రెండు నెలల క్రితం మృతి... ఎంత పని చేశావ్ తల్లి
సంగారెడ్డి: భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బాధను బరించలేక తల్లి తన బిడ్డలను గొంతు నులిమి చంపి అనంతరం తాను ఉరేసుకొని చనిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మక్త అల్లూర్ గ్రామంలో మమత(28), ప్రవీణ్(32) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు మణికంఠ(5), ప్రళయశ్రీ(3) లు ఉన్నారు. దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం భర్త ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో మమత మనోవేదనతో భర్త లేని జీవితం వృధా అని పలుమార్లు వాపోయింది. మమత తల్లిదండ్రులు, ఆమె మేనత్త ఆమెకు దైర్య చెబుతూ చేదోడువాదోడుగా ఉండేవారు. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లగా మేనత్త పెన్షన్ తీసుకోవడానికి సొంతూళ్లకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంతో ఇద్దరు పిల్లల గొంతు నులిమి అనంతరం మమత ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Israel - Iran War : ఇరాన్ యుద్ధంలో హౌతీల ప్రవేశం.. ఇజ్రాయెల్పై క్షిపణులు
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది
ఇజ్రాయెల్పై యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది
29marcheditorial |భారత్ ఇంధన భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు..
29marcheditorial | భారత్ ఇంధన భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు.. 29marcheditorial | పశ్చిమాసియా
మన తెలంగాణ/హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి తమ ప్రభుత్వం వరకు జరిగిన ఇసుక, మైనింగ్పై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సిబిసిఐడి ఇచ్చే నివేదికను వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చకు కూడా పెట్టనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండి పడినా, ఖనిజ సంపద దోపిడీకి గురైనా తాము చూస్తూ ఊరుకోబోమని, అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ సాగే అక్రమ మైనింగ్ల పట్ల తమ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని సీఎం స్పష్టం చేశారు. శాసనసభలో శనివారం పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పక్షం ఉప నాయకుడు హరీశ్రావు మాట్లాడుతూ,రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుగల సంస్థ మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడుతోందని, అది మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సంబంధించిందని ఆరోపించారు. ఆ కంపెనీతో మంత్రికి ఏం సంబంధం లేకపోయినా కేవలం సదరు మంత్రిని ఎదుర్కొలేక మంత్రికి అంటగడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ మంత్రి పొంగులేటిపై వచ్చిన ఆరోపణలపై సభా కమిటీ వేయాల్సిందేనని బీఆర్ఎ స్ సభ్యులు డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, , రాఘవ కన్స్ట్రక్షన్స్పై తమకు ఎవరు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ప్రభుత్వమే స్పందించి దానికి నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి స్పందించినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు హౌస్ కమిటీ వేయాల్సిందేనని పట్టుబట్టడాన్ని ప్రస్తావిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం (జూన్ 2, 2014) నుంచి తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మైనింగ్ తవ్వకాలపై వచ్చిన ఆరోపణలపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తోన్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన హరీశ్రావు సోదరుడు మహేశ్వర్రావు ఇసుకదందాతో పాటు సిరిసిల్లలో ఇసుక మాఫియా మొదలుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన కంపెనీలతో తాజా రాఘవ కన్స్ట్రక్షన్ వరకు ఆరోపణలు వచ్చిన అన్నింటిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు ఆ నివేదిక పెడుతామని అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్పై మా ప్రభుత్వమే వివరాలు తీసుకుని చర్యలు తీసుకుందని, ఈ సంస్థతో మంత్రికి సంబంధం లేకపోయినప్పటికీ కే వలం మంత్రిపై బురద చల్లాలని, వాళ్ల పైరవీలకు సహకరించడం లేదని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తు న్నారని, వాళ్ల బ్లాక్ మెయిల్ లకు ప్రభుత్వం లొంగదని, సిబిసిఐడి విచారణ జరిపించి నిజాలు నిగ్గు తెలుస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిం చారు. మంత్రి సంస్థకు నిబంధనలు వర్తించవా? హరీశ్రావు బీఆర్ఎస్ ఉప నాయకుడు టి హరీశ్రావు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ‘కంచే చేను మేసినట్లు’ ఉన్నాయని విమర్శించారు. రక్షకులే భక్ష కులుగా మారుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపించారు. తాను చేసే ప్రతి ఆరోపణకూ ప్రభుత్వ డాక్యు మెంట్లే సాక్ష్యమని, ఏ ఒక్క మాట కూడా గాలిలో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎటువంటి అనుమ తులు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ మైనింగ్ వ్యాపారాలు దర్జాగా సాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న మనం రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025’ నిబంధనలను తుంగలో తొక్కి, నగర పరిసరాల్లో డీజిల్ జనరేటర్ల సహాయంతో క్రషర్లు నడుపుతు న్నారని, ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన ’రాఘవ కన్స్ట్రక్షన్స్’ సంస్థ నడుపుతోన్న అక్రమ మైనింగ్ వ్యవహారమని హరీష్ రావు విరుచుకుపడ్డారు. తమ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు చిన్న తప్పు చేస్తే ఆయనను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి నెల రోజులు జైల్లో పెట్టారని, మరి పొంగులేటి సంస్థపై ఎందుకు చర్యలు లేవు? ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయమా?‘ అని హరీశ్రావు నిలదీశారు.రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాలు, అవకతవకలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి లేదా హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన సొంత సంస్థకు లబ్ధి చేకూరుస్తున్నారని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను బిఆర్ఎస్ సభ్యులు ఒక దశలో వెల్లోకి దుసుకవచ్చి అడ్డుకున్నారు. వారి తీరుపై అధికార పక్షం తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేసింది. సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. గందరగోళం మధ్యే సభను అదుపులోకి తెచ్చేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ, బీఆర్ఏస్ సభ్యులు వినిపించుకోకుండా పెద్ద పెట్టునా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నిరసన.. భట్టి విక్రమార్క సీరియస్ రోడ్లపై అల్లరి చేసినట్లు బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వెల్లోకి వచ్చి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేయడం ఇదెక్కడి సంప్రదాయం? పవిత్రమైన సభలో చిన్నపిల్లలాట లాంటి ఈ వ్యవహారం ఎక్కడిదన్నారు. మీరు చేసిన ఆరోపణలన్నీ వాస్తవం అనుకుంటే ఎలా? అని భట్టి ప్రశ్నించారు. ప్రతిపక్ష బాధ్యతతో మీరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ఎలా వెళ్లాలో అలా ముందుకు వెళ్తుందన్నారు. ఇది సభా సంప్రదాయం కాదు : మంత్రి శ్రీధర్బాబు ఒకరిని టార్గెట్ చేస్తూ వ్యక్తి గత విమర్శలు చేయడం సభా సాంప్రదాయం కాదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. అభూత కల్పనలతో అందర్నీ తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. హరీష్రావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఆరోపణలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేరు రికార్డుల నుంచి తొలిగించాలని కోరారు. సభా స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ బాల్నాయక్ మంత్రి పేరును రికార్డుల నుంచి తొలగిస్తోన్నట్టు ప్రకటించారు.
29MarSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
29MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో
29thMarch2026 |ఆదివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
29thMarch2026 | ఆదివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 29thMarch2026 |

36 C