SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
...

100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో (హైదరాబాద్ నగరం వెలుపల) తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాలని సిఎం ఆదేశించారు. విద్యాశాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గు రువారం సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య కు చిరునామాగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని సిఎం పేర్కొన్నారు. ఇం దుకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సిఎం స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల తరహాలో నిర్మించాలని ఇంజినీర్ల ను ఆదేశించారు. వీటి నిర్మాణంలో ఆధునిక సాం కేతికతను వినియోగించుకోవాలని, ఏడాదిలో క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలని తెలిపారు. నగరంలోని భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలని అన్నారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు, ఇతర వసతులు కల్పించనున్న 164 పాఠశాలల పనుల్లో ఎటువంటి రాజీ పడకూడదని సిఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి అవసరమైన వసతుల కల్పన, ఇతర అంశాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఎఐ బోధన కృత్రిమ మేథ (ఎఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఎఐపై ఉపాధ్యాయులు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎఐతో ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులను తెలుసుకొని దాని ద్వారా వచ్చే అవకాశాలు మన విద్యార్థులే అందిపుచ్చుకునేలా మన సన్నద్ధత ఉండాలని అభిప్రాయపడ్డారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణమైన మార్పులను తీసుకురావాలని పేర్కొన్నారు. 2026-2027 విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్రేక్‌ఫాస్ట్ అందజేతకు సంబంధించి అధికారులు, హరేకృష్ణమిషన్ ప్రతినిధులకు సిఎం పలు సూచనలు చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందజేయాలని.. ఇందుకు విజయా డెయిరీ నుంచి పాలను సేకరించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందజేస్తున్నామనేది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అందజేయాలని అన్నారు. అందులో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్‌లో పొందుపర్చేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. కాలం చెల్లిన కోర్సులను తొలగించాలి పాలిటెక్నిక్ కళాశాలలు, ఎటిసిల్లో ఎఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాలం చెల్లిన కోర్సులను తొలగించాలని చెప్పారు. పాలిటెక్నిక్, ఎటిసిల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయిస్తామని, ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించిన విషయాన్ని సిఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిగతా యూనివర్సిటీలకు ఎంత నిధులు అవసరమనే దానిపై నివేదిక సమర్పించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫీజుల నియంత్రణపై అభిప్రాయ సేకరణ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రైవేటు పాఠశాలల ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ తమ నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి నివేదించింది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు, తెలంగాణలో తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. సావధానంగా విన్న ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి జిల్లా స్థాయిలో కలెక్టర్, డిఇఒల నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజుల నిర్ణయంపై నివేదిక సమర్పించాలన్నారు.అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలోని కమిటీ తుది కమిటీగా ఉండి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే ఫీజు నియంత్రణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, సామాజికవేత్తల అభిప్రాయ సేకరణకు ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. సిఎంకు తెలంగాణ విద్యావిధానం నివేదిక అందజేత తెలంగాణ విద్యా విధానంపై తాము రూపొందించిన నివేదికను తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి సమర్పించారు. అమెరికా, వియత్నాం, మలేసియా దేశాల్లో స్వయంగా పర్యటించడంతో పాటు వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలను పరిశీలించి నివేదిక రూపొందించినట్లు విద్యా కమిషన్ ఛైర్మన్, సభ్యులు సిఎంకు తెలియజేశారు. నివేదికలోని ఒక్కో అంశంపై ఛైర్మన్ మురళి సుదీర్ఘంగా వివరించారు. సావధానంగా ఆలకించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయా అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు. అనంతరం నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు... వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయదగిన అంశాలపై నివేదిక రూపొందించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావు నేతృత్వంలోని కమిటీకి ముఖ్యమంత్రి అప్పగించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావు, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికొలస్, సమగ్ర శిక్ష నోడల్ ఆఫీసర్ డి.నాగరాజు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విసి ప్రొఫెసర్ మొలుగరం కుమార్, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి, ప్రొఫెసర్ పద్మజా షా, కార్తీక్ సుబ్రహ్మణ్యన్, వీర వాసవి, డాక్టర్ జెన్నత్ఫర్ అజ్మీ సయ్యద్, డాక్టర్ ఎన్.వెంకటేష్, షేక్ జావేద్ అఫ్రోజ్, డాక్టర్ జే.స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 5:00 am

ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ పాలనా?

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాకు చెం దిన ముగ్గురు మంత్రుల విలాసల కోసమే పేదల ఇళ్ళ ను కూల్చారని ఈ ముగ్గురు మంత్రులు మహా మయగాళ్లు అని రాష్ట్ర బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్లలో నిరాశ్రయిలైన నిరుపేదలను గురువారం ఆయన పరామర్శించారు. ముందు గా వెలుగుమట్లలో ఇళ్ళను తొలగించిన వినోభ (నవోదయ) కాలనీలోని భూదాన్ ట్రస్ట్ స్ధ్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు.అనంతరం ఖ మ్మం నగరంలో అంబేద్కర్ భవనంలో ఆశ్రయం పొం దిన నిర్వాసితులను సైతం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూదాన భూములు అంటేనే పేదలకు భూములను పంపిణీ చేయడం కానీ.. ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉండి కూడా పేదలకు భూమిని  పంచకుండా ఉన్న భూమిలో నిర్మించుకున్న ఇళ్ళను నిర్దాక్షణ్యంగా కూల్చివేశారని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు 60 ఎకరాల మీద కన్నుబడిందని, ముగ్గురు మంత్రులు కలిసికట్టుగా ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆయన అన్నారు. ఆర్ధరాత్రి శత్రుదేశంపై దండయాత్రకు వచ్చిన విధంగా పోలీలసులు వచ్చి కనీసం సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా నడిరోడ్డుమీద నెట్టివేశారని ఆయన అన్నారు 2014 ఏప్రిల్ లో 1895 మందికి భూదాన ట్రస్ట్ వాళ్ళు పట్టాలు ఇచ్చారని , ఏళ్ల నుంచి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని వారికి విద్యుత్ శాఖ కరెంట్ మీటర్లను, మున్సిపాల్టీ ఇంటి నెంబర్లు ఏలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. తాను భూదాన ట్రస్ట్ ఇచ్చిన పట్టాలను చూశానని, కోర్టు ఉత్తర్వులు కూడా చూశానని అవి అన్ని పేదలకు అనుకూలంగానే ఉన్నాయని ఆయన అన్నారు. భూదాన ట్రస్ట్ జారీ చేసినవి అక్రమ పట్టాలు అంటున్నారని అవి అక్రమ పట్టాలు కావు మంత్రుల బుద్ద్ధి అక్రమమని, దుర్మార్గమైన వక్ర బుద్ద్ధి అని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో కలెక్టర్ బిల్డింగ్‌ను నిర్మించామని, ఆ తరువాత అక్కడ కెసిఆర్ ఆధ్వర్యంలో భారీ సభను కూడా ఏర్పాటు చేశామని అనాడు ఈ కాలనీ వాసులను అప్పటి ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకున్నామని కెటిఆర్ చెప్పారు.ముందుస్తుగా సమాచారం ఇవ్వకుండా ,కనీసం నోటిస్ ఇవ్వకుండా ,కోర్టుకు వెళ్ళేంత సమయం ఇవ్వకుండా రాత్రికి రాత్రే వచ్చి బీభత్సం సృష్టించారని దీని వల్ల ఇంటర్ పరీక్షలకు హాజరయ్య విద్యార్ధులంతా ఆగమాగం అయ్యారని ఆయన అన్నారు.అక్కడ చాలా మంది తమ బాధను వెలబోసుకున్నారని పదేళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న 12లక్షలతో కట్టుకున్న ఇంటిని కళ్ళముందే కూల్చివేశారని, ఏడు లక్షలు పెట్టి ఇళ్ళు కట్టుకొని సంవత్సరం కూడా కాలేదు నేలమట్టం చేశారని బాధితులు గోడువేలబోసుకున్నారని ఆయన అన్నారు .హైద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇళ్ళను కూల్చడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా కన్పిస్తుందన్నారు.హైడ్రాను ఏర్పాటు చేసి హైద్రాబాద్ నగరంలో బడా బడా బిల్డింగ్‌లనే కూల్చివేస్తున్నారని ఆయన అన్నారు. భూదాన భూముల్లో ఇళ్ళను నిర్మించుకుంటే అక్రమ కట్టడాలు అని ముద్ర వేసి కూల్చివేసిన విషయంపై రేపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అంతేగాక మీ తరుపున న్యాయస్ద్థానంలో న్యాయ పోరాటం చేస్తామని కెటిఆర్ అభయం ఇచ్చారు. “మీతో కెసిఆర్ సార్ ఒక మాట చెప్పమన్నారు.. రెండేళ్ళ తరువాత రాష్ట్రంలో మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం వస్తుందని, మన ప్రభుత్వంలో ఇప్పుడు ఎక్కడయితే మీ ఇళ్ళను కూల్చివేశారో గెంటివేశారో అక్కడే మీకు ఇళ్ళను నిర్మించి ఇస్తామని అప్పటి వరకు మీరంతా అప్రమత్తంగా ఉండాలని “పిలుపునిచ్చారు. వెలుగుమట్ల కూల్చివేతలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని ,తప్పు జరగబట్టే ఆర్డివోను బలి పశువును చేశారని,రాత్రికి రాత్రే ఆర్డీవోను బదిలీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తప్పుచేయకపోతే ముగ్గురు మంత్రులు వెలుగుమట్ల కు ఎందుకు రావడం లేదని, తప్పు చేశారు కాబట్టే మీ వద్దకు రావడానికి మొఖం చెల్లడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతామధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, మాజీ జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు, దిండిగల రాజేందర్, పగడాల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 4:30 am

నాడు వెలుగుమట్లలో ఇండ్లు కూల్చింది మీరే

(మొదటి పేజీ తరువాయి) సంఘటనల ఫొటోలను మంత్రి విలేకరులకు చూపించారు. దీంతోపాటు వెలుగుమెట్లలో పేదలకు ఇళ్లు తిరిగి కట్టిస్తామని అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. కానీ, ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇళ్లను తొలగిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు ఇస్తామని, ఇందిరమ్మ ప్రభుత్వానికి పేదలే పెటెంట్ అని ఆయన అన్నారు. ఈవిషయంలో నిజంగా పేదలపై బిఆర్‌ఎస్ బావ మరుదులు, ఫాంహౌస్ లో ఉండి కుట్రలు చేస్తున్నారని, ఈ విషయంలో కెసిఆర్ వెంటనే స్పందించి కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టి ఎనిమిదవ వింతగా ప్రచారం చేసుకుందన్నారు. వారి హయాంలోనే లక్షలాది కోట్ల ప్రాజెక్ట్ కట్టడం, అవినీతి కారణంగా బీటలువారిందని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లలో 168 టిఎంసిల నీరు ఇస్తామని చెప్పి అందులో 50 టిఎంసిల నీటిని సముద్రం పాలుచేశారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బిఆర్‌ఎస్‌కు ఎటిఎంగా మారిందన్న బిజెపి నేతలు నేడు బిఆర్‌ఎస్‌తో చేతులు కలిపారని ఆయన విమర్శించారు. సిబిఐ స్పందించడం లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై జస్టిస్ ఘోష్ కమీషన్ నివేదిక ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఈ కేసును అప్పగించినా ఇంతవరకు కేంద్రం కనీసం స్పందించ లేదని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో వదిలేసిన ప్రాజెక్ట్‌లను తాము పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులు వచ్చి మాట్లాడాలన్నారు. వారు గతంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, మేం కచ్చితంగా అవకాశం ఇస్తామని, వారు అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఉత్తర తెలంగాణకు బిఆర్‌ఎస్ అన్యాయం: మంత్రులు పొన్నం, వివేక్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. 196 టిఎంసీల నీరు ఇస్తామని చెప్పి 168 టిఎంసీలకు పరిమితం చేసిందన్నారు. 50 టిఎంసీలు సముద్రంలో కలిపిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, తమ ప్రభుత్వం వచ్చాక శ్వేత పత్రం ఇచ్చామని, కాళేశ్వరంపై చర్చించామని, కేంద్రం చర్యలు కోరామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా రూ.48వేల కోట్లు మిత్తీగా కట్టిందని, కేంద్రప్రభుత్వం ఇకనైనా నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ అవినీతికి పాల్పడినందును దేశంలోని ప్రాంతీయ పార్టీల్లోకెల్లా ధనిక పార్టీగా మారిందన్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయిల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని కెసిఆర్ నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్లు, కాసుల కోసమే బిఆర్‌ఎస్ అనుకూల నీటిప్రాజెక్టులను చేపట్టిందని ఆయన విమర్శించారు.

మన తెలంగాణ 27 Feb 2026 4:00 am

వందరోజుల కార్యాచరణపై కేబినెట్ సబ్‌కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అమలు చేయాల్సిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశా లు ముగిసిన వెంటనే ఈ యాక్షన్ ప్లా న్‌ను ఖరారు చేసి అమలు దిశగా అడుగులు వేయనుంది. ఈ సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భ ట్టి విక్రమార్క మల్లు ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా కమిటీ సభ్యులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీకి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి ఆర్థిక శాఖతో పాటు సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కమిటీ సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను కాలపరిమితిలో అమలు చేయడం లక్ష్యంగా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ను అత్యంత ప్రాధాన్యతతో రూపొందించి, వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే కమిటీ సమావేశమై అన్ని శాఖలతో సమీక్ష జరిపి వివరమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనుంది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి: సిఎస్ వచ్చే నెల 2 నుంచి జూన్ 9 వరకు వివిధ అభివృద్ధి పనులపై ప్రతీ శాఖ తమ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణా రావు అన్ని శాఖల అధిపతులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే ఈ వంద రోజుల కార్యక్రమంలో అన్ని శాఖల వారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని సిఎస్ నిర్వహించారు. స్పెషల్ సి.ఎస్‌లు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సి.వీ ఆనంద్, సంజయ్ కుమార్ , మహేష్ దత్ ఎక్కా, సబ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్, దాన కిషోర్, అహ్మద్ నదీమ్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణా రావు మాట్లాడుతూ వంద రోజుల కార్యక్రమంపై ఈ నెల 28న నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. మార్చి ఒకటిన జిల్లా కలెక్టర్ల సమావేశం అలాగే మార్చి 1 ఆదివారం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో చర్చనీయాంశాలు వెంటనే రూపొందించాలన్నారు. ఈ సందర్బంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని, ఇందుకు గాను ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనాలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయితీ రాజ్, వ్యవసాయం, రెవెన్యూ, పర్యాటక, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, గృహనిర్మాణం, రెవెన్యూ, విద్యుత్, కార్మిక తదితర అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిఎస్ పేర్కొన్నారు. ముఖ్యంగా, పారిశుద్ధం గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య తదితర కార్యక్రమాలపై నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లకు అవగాహన చైతన్య కార్యక్రమాల మాదిరిగా కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయంతోపాటు హెచ్.ఓ.డిలలో ఈ-ఆఫీస్ ను అమలు చేయాలని ఆదేశించారు.

మన తెలంగాణ 27 Feb 2026 3:30 am

ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక బంధం

(మొదటి పేజీ తరువాయి) ప్రస్తావనకు రాకుండా ఉన్న పలు రంగాల విషయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశలో ఇజ్రాయెల్‌లో మేలో జరిగే చర్చలతో తుది సంతకాలు కుదురుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఎఫ్‌టిఎ పై ఇప్పుడు మొదటి దఫా చర్చలు పూర్తి అయ్యాయని వెల్లడించారు. . కాల పరీక్షకు నిలిచిన బంధం ఇప్పుడు ఎస్‌ఎస్‌పి (ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం) స్థాయికి చేరిందని ఇరుదేశాల నేతలు ప్రకటించారు. రెండు రోజుల పర్యటన తరువాత భారత్‌కు బయలుదేరి వచ్చే ముందు ప్రధాని మోడీ ఇజ్రాయెల్, అంతర్జాతీయ మీడియా వారితో మాట్లాడారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేగవంతం చేయాలని నేతలు నిర్ణయించారు. ఇజ్రాయెల్ ప్రతిపాదిత గాజా శాంతి స్థాపన ప్రతిపాదనకు భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. ఘర్షణలకు . తూటాలకు మానవీయత బలి కారాదని పిలుపు నిచ్చారు. మొత్తం 17 ఒప్పందాలు, కీలక పత్రాలపై సంతకాలు భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక రంగాలకు సంబంధించి ఏకంగా మొత్తం 17 ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండే పత్రాలపై సంతకాలు జరిగాయి. ఏఐ, వ్యాపార వాణిజ్యాలు, పెట్టుబడులు , విద్యారంగం, ఉత్పత్తి, సాంస్కృతిక, మారిటైం హెరిటేజ్, వ్యవసాయం ఇతర పలు రంగాల్లో ఈ ఒప్పందాలు ఖరారు అయ్యాయి. మిడిలిస్టులో శాంతి సుస్థిరతలతో భారతదేశ భద్రతా అంశాలు ఇమిడి ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. గాజాలో ఘర్షణల అంతానికి సామరస్యపూర్వక పరిష్కారం దక్కాలని పిలుపు నిచ్చారు. పౌర అణుఇంధన అంతరిక్ష రంగాల్లో విస్తరణ రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత వేగవంతం అవుతుంది. ప్రత్యేకించి సైనిక హార్డ్‌వేర్ పరిపుష్టికి ఇజ్రాయెల్ సాయం తీసుకుంటారు. సాంకేతికత మార్పిడి పరిధిలో సంయుక్త రంగంలో ఉత్పత్తికి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకించి రెండు దేశాల మధ్య అత్యంత కీలకమైన రక్షణ సహకార భాగస్వామ్య ఒప్పందం ఖరారు కానుంది. రక్షణ రంగంలో సయుక్త ప్రాజెక్టులు, ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతికత బదిలీ జరుగుతుందని ప్రధాని మోడీ తెలిపారు. పౌరుల ప్రయోజనాల దిశలో ఉండే అణుఇంధన రంగంలో , అంతరిక్ష ప్రయోగాలకు పరస్పరం కలిసినడుస్తాయి. ఇరుదేశాల నేతల చర్చలలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం, దీనితో తలెత్తుతున్న ముప్పు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎటువంటి సమస్యకు అయినా శాంతియుత సంప్రదింపులతోనే పరిష్కారం దక్కుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాకు తెలిపారు. ఈ విషయంలో అవసరం అయితే భారతదేశం నుంచి పూర్తి మద్దతు వెలువడుతుందని వివరించారు. పూర్తి స్థాయి పరస్పర నమ్మికతో రెండు దేశాల సంబంధాల్లో పురోగతి నెలకొందని ప్రధాని మోడీ వివరించారు. కాలాతీత భాగస్వామ్యం ఇప్పుడు పరిపూర్ణ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం దిశకు సాగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇరుదేశాలు కలిసికట్టుగా పోరు సలుపుతాయని తెలిపారు. గాజా శాంతి ఒప్పందం శాంతికి దారితీసిందన్నారు. సాంకేతిక పరిణామాలు దేశాల భాగస్వామ్యానికి ప్రధాన కేంద్రబిందువులు అవుతాయి. దీనిని గుర్తించే ఏఐ , క్వాంటమ్, కీలక ఖనిజాల విషయంలో పరస్పర సహకారానికి ప్రక్రియను వేగవంతం చేస్తామని మోడీ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ సాంకేతిక వినిమయం జరుగుతుంది. భారతీయ సాగు అనుభవం ఇజ్రాయెల్ పంచుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తి రంగం విషయంలో నూతన టెక్నాలజీ వినియోగం జరుగుతుంది. సంబంధిత విషయంలో ఇప్పుడున్న నైపుణ్య కేంద్రాల సంఖ్యను వందకు పెంచుతామని ప్రధాని మోడీ మీడియాకు తెలిపారు. నైపుణ్య గ్రామాల ఏర్పాటు.. ఇజ్రాయెల్ టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాలలో కోట్లాది మంది భారతీయ రైతుల కుటుంబాలకు ప్రయోజనం కల్గించేందుకు ఇజ్రాయెల్ సాయం తీసుకుంటారు. రైతాంగ ఆదాయం, పంట దిగుబడి పెంచేందుకు ఆదర్శ స్థాయిలో నైపుణ్య గ్రామాల ఏర్పాటు జరుగుతుంది. దీనితో భారత్‌లోని ప్రతి గ్రామానికి ఈ విషయంలో ఇజ్రాయెల్ సాంకేతికత చేరుతుంది. రైతులకు సరైన శిక్షణ కల్పిస్తారు. రైతుల ఆదాయం రెండింతలు చేయాలనే తమ సంకల్పానికి ఇజ్రాయెల్ సహకారంతో ఏర్పాటు అయ్యే ఈ గ్రామాలు ప్రాతిపదిక అవుతాయని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. పాలస్తీనియా విషయం ఏమిటీ? ఇజ్రాయెల్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్న దశలో భారతదేశం బాధిత పాలస్తీనియన్ల పట్ల ఎటువంటి వైఖరితో ఉంటుందనే ప్రశ్న తలెత్తింది. విదేశాంగ కార్యదర్శి మిశ్రా ఈ మీడియా ప్రశ్నకు జవాబు ఇచ్చారు. అమెరికా ఆమోదిత గాజా శాంతి ప్రతిపాదనకు భారతదేశం మద్దతు ఇస్తుందని వివరించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చేసిన ప్రకటనను గుర్తు చేశారు.

మన తెలంగాణ 27 Feb 2026 3:30 am

Sree Vishnu’s Vishnu Vinyasam USA Premieres Today

Sree Vishnu is coming up with a unique hilarious joyride Vishnu Vinyasam. Directed by Yadunaath Maruthi Rao and produced by Sumanth Naidu G under the banner of Sree Subrahmanyeshwara Cinemas, the film stars Nayana Sarika as the female lead opposite Sree Vishnu. The promotional material has created strong buzz and raised expectations among movie lovers. […] The post Sree Vishnu’s Vishnu Vinyasam USA Premieres Today appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 12:21 am

జింబాబ్వేపై భారత్ జయకేతనం

 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గురువారం జింబాబ్వేతో జరిగిన సూపర్8 గ్రూప్1 కీలక మ్యాచ్‌లో భారత్ 72 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీస్ ఛాన్స్‌ను మెరుగుపరుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి ఔటమి పాలైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 97 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, బుమ్రా, హార్దిక్‌లు అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. ఆరంభం నుంచే.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలు శుభారంభం అందించారు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఇటు శాంసన్ అటు అభిషేక్ చెలరేగి ఆడడంతో స్కోరు వేగం పుంజుకుంది. అయితే 15 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసిన శాంసన్‌ను ముజరబ్బాని ఔట్ చేశాడు. దీంతో 48 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అభిషేక్, ఇషాన్ జోరు.. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి అభిషేక్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పాడు. ఇషాన్, అభిషేక్ విధ్వంసక బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. దూకుడుగా ఆడిన అభిషేక్ 30 బంతుల్లోనే 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ధాటిగా ఆడిన ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. చేలరేగి బ్యాటింగ్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 3 ఫోర్లతో 33 పరుగులు సాధించాడు. చివర్లో తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్యలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఇద్దరు పోటీ పడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో భారత్ రికార్డు స్కోరును నమోదు చేసింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన తిలక్‌వర్మ 16 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన హార్దిక్ 23 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 50 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దీంతో భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 256 పరుగులకు చేరింది. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

మన తెలంగాణ 26 Feb 2026 11:30 pm

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల నిర్మాణం

 ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్హెచ్ 365 బీజీ) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో పాటు మరెన్నో కొత్త అంశాలను ఈ హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఎన్ హెచ్ 65, ఎన్హెచ్ 16ను కలుపుతూ రూ.4451.87 కోట్లతో 162 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు. భారత్ మాల పరియోజన కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో ఐదు ప్యాకేజీలుగా విభజించారు. తెలంగాణ పరిధిలో మూడు ప్యాకేజీలు (105.240 కిలోమీటర్లు), ఏపీలో రెండు ప్యాకేజీలు (56.890 కి.మీ.) ఉంది.2022లో పనులు ప్రారంభం కాగా, వేర్వేరు కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు మున్నేరు మీద బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకోగా, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి, మే మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు హైవే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గనున్న దూరం, ప్రయాణ సమయం! ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు సూర్యాపేట, విజయవాడ మీదుగా 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త హైవే వల్ల హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం మీదుగా వైజాగ్ వెళ్లేందుకు 56 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 3 నుంచి 4 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. మొత్తం స్లోప్ కలుపుకొని 30 మీటర్ల వెడల్పుతో ఈ హైవే నిర్మాణం జరుగుతోంది. ఒక వైపు 9 మీటర్ల చొప్పున రోడ్లు, మధ్యలో నాలుగున్నర మీటర్ల మీడియన్ ఉంటాయి.18 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో ప్రయాణించిన దూరాన్ని బట్టి ఎగ్జిట్ పాయింట్ దగ్గర టోల్ కట్ అవుతుంది. హైవేపైకి పశువులు రాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ల దగ్గర వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు రెస్ట్ తీసుకునేందుకు 6 ట్రక్బేలు సిద్ధం చేస్తున్నారు. డొంకదారులు, అంతర్గత రహదారుల దగ్గర అండర్ పాస్ లు, సాగునీటి కాల్వల దగ్గర 10 మేజర్ బ్రిడ్జిలు, 49 మైనర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒక వైపు రెండు లేన్లకు గాను 80, 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ గా నిర్ణయించారు. విల్లు ఆకారంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి! ఖమ్మం నగరాన్ని ఆనుకొని వెళ్తున్న రైల్వే ట్రాక్ పై నుంచి ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని విల్లు ఆకారంలో నిర్మిస్తున్నారు. బౌ స్ట్రింగ్ గిర్డర్ బ్రిడ్జిగా దీన్ని వ్యవహరిస్తున్నారు. 52 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి 360 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. దీన్ని పూర్తిగా ఛత్తీస్గఢ్లోని భిలాయ్లో హైగ్రేడ్ స్టీల్ తో నాలుగు నెలల పాటు తయారుచేశారు. తర్వాత విడిభాగాలుగా తీసుకువచ్చి మళ్లీ ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు. జాకీల సాయంతో క్రమంగా పైకి ఎత్తుతున్నారు. 11 మీటర్ల ఎత్తుండే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని కంప్లీట్ చేసేందుకు ఇంకా రెండు నెలలు పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. మార్చి నెలాఖరుకు ఒకవైపు నిర్మాణాన్ని కంప్లీట్ చేసి, రాకపోకలకు అనుమతి ఇస్తామంటున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా రైల్వే అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. ప్రతి దశలో రైల్వే సేఫ్టీ టీమ్ తనిఖీలు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పనులు ముందుకెళ్తున్నాయి. రూల్స్ బ్రేక్ చేయకుండా సీసీ కెమెరాలతో చెక్! 162 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిపై ప్రతి రెండు కిలోమీటర్లకు 360 డిగ్రీలు కవర్ చేసే ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రతి కెమెరా ఒక కిలోమీటర్ దూరం వరకు వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్తో ఈ కెమెరాలు 24 గంటలు పని చేస్తాయి. వాహనాలు ఓవర్ స్పీడ్ వెళ్లినా, బాగా నెమ్మదిగా వెళ్లినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, సీటు బెల్ట్ పెట్టకపోయినా, హైవేపై వాహనం నిలిపి ఉంచినా ఆ వాహనాల ఫొటోలు తీస్తాయి. జూమ్ చేసినా వీడియో క్లారిటీ దెబ్బతినకుండా, వాహనాలు స్పీడ్ గా వెళ్తున్నా నెంబర్ ప్లేట్ కూడా రికార్డ్ అయ్యేలా హై రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలతో పాటు హైవే మధ్యలో ఏర్పాటు చేస్తున్న లైట్లకు కూడా పూర్తిగా సోలార్ ప్యానల్స్ బిగించారు. బయటి నుంచి విద్యుత్ అవసరం లేకుండా, సోలార్తోనే నడిచేలా వాటికి రీచార్జబుల్ బ్యాటరీలను బిగించారు. వేరియేబుల్ మెసేజ్ సైన్(వీఎంఎస్) బోర్డులను అక్కడక్కడ ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్, వెదర్, ట్రాఫిక్ డైవర్షన్ ఇన్ఫర్మేషన్, అలర్ట్ మెసేజ్లను ఈ సైన్ బోర్డుల్లో ప్రదర్శిస్తారు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్! ఐదు ప్యాకేజీల్లోనూ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఏటీఎంఎస్) సెంటర్ ను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో ఉండే సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి రియల్ టైమ్ ట్రాఫిక్ మూమెంట్ ను పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై మానిటర్ చేస్తారు. వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తే సీసీ కెమెరాలు ఆటోమెటిక్గా రికార్డు చేసి, ఫొటోల రూపంలో ఏటీఎంఎస్ సెంటర్ కు పంపిస్తాయి. ప్రమాదం జరిగినా, వాహనం అనుకోకుండా ఆగిపోయినా ఈ సెంటర్ లోని ఎల్ఈడీ స్క్రీన్లపై అలర్ట్ చేసేందుకు పాప్ అప్ మెసేజ్ వస్తుంది.హైవే ప్రారంభం తర్వాత అన్ని కెమెరాలు అన్ని చోట్లా కనిపించేలా చూడడంతో పాటు రాష్ట్ర పోలీసులకు వీటిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీంతో నేరుగా ట్రాఫిక్ చలానా జనరేట్ అయ్యేలా ఉపయోగించనున్నారు. ఇక యాక్సిడెంట్లు లేదా ట్రాఫిక్ మళ్లింపు సమయంలో ఉపయోగపడేలా ప్రతి 5 కిలోమీటర్లకు ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ను ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేస్తాం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇదే. సంప్రదాయ హైవేల తరహాలో కాకుండా స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ హైవే నిర్మిస్తున్నాం. రోడ్ సేఫ్టీని క్లోజ్గా మానిటర్ చేసేలా చర్యలు తీసుకున్నాం. సీసీ కెమెరాలు, ఏటీఎంఎస్లు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ వాయిలేషన్స్ తగ్గుతాయి. రెండు నెలల్లో పనులన్నీ కంప్లీట్ చేసి, మే నెలలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నాం.

మన తెలంగాణ 26 Feb 2026 10:50 pm

విమాన టికెట్ రద్దుపై కొత్త రూల్స్

డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) టికెట్ రద్దు, మార్పులపై కొత్త నిబంధనలు జారీ చేసింది. బుకింగ్ చేసిన 48 గంటలలోపు రద్దు చేస్తే అదనపు రుసుము ఉండదు. అయితే ప్రయాణ తేదీకి కనీసం 7 రోజుల ముందు టికెట్ బుక్ చేసి ఉండాలి. 14 పని దినాల్లోపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. వైద్య అత్యవసర పరిస్థితుల్లో పూర్తి వాపసు లేదా క్రెడిట్ సదుపాయం కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటామని డిజిసిఎ స్పష్టం చేసింది.

మన తెలంగాణ 26 Feb 2026 10:28 pm

విండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

టి20 ప్రపంచకప్ సూపర్8 గ్రూప్1లో సౌతాఫ్రికా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ టీమ్ 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. సఫారీ గెలుపు టీమిండియాకు అతి పెద్ద ఊరటగా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను హోల్డర్, షెఫర్డ్ ఆదుకున్నారు. ఇద్దరు సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోల్డర్ 31 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 49పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన రొమారియో షెఫర్డ్ 37బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఎంగిడి మూడు, బోస్చ్, రబడా రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 16.1 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, ఐడెన్ మార్‌క్రమ్ జట్టుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన డికాక్ 24 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 4 బౌండరీలతో 47 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 48 బంతుల్లోనే 95 పరుగులు జోడించాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన మార్‌క్రమ్ 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. అతనికి రియాన్ రికెల్టన్ 45 (నాటౌట్) అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు అభేద్యంగా 82 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.

మన తెలంగాణ 26 Feb 2026 10:24 pm

మూతపడ్డ ఈస్ట్ ఇండియా కంపెనీ

అలనాడు ఓ వ్యాపార సంస్థగా వెలిసి, ఆనక భారతదేశంలో పాలనా పగ్గాల దశకు చేరిన వైభవ ఈస్ట్ ఇండియా కంపెనీ మూతపడింది. ఈ విధంగా ఈ కంపెనీ మూసుకోవడం చరిత్రలో ఇది రెండోసారి అయింది. ఒకనాడు శక్తివంతమైన బ్రిటిష్ వ్యాపార సంస్థగా ఉన్న కంపెనీ దారుణస్థితికి చేరింది. నిజానికి మునుపటి ఈ కంపెనీ దాదాపుగా 152 ఏండ్ల క్రితమే బోర్డు తిప్పేసింది. అయితే దీనిపై ఉన్న ఆసక్తితో 2010లో బ్రిటిష్ ఇండియన్ వ్యాపారవేత్త కంపెనీ హక్కులు కొన్నారు. 1857లో ఈ కంపెనీ భారతీయ పగ్గాలను భారతీయ తిరుగుబాటు క్రమంలో బ్రిటన్ రాజరిక ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. అప్పటి నుంచి భారతదేశంలో బ్రిటిష్ రాజరిక వ్యవస్థ ఏర్పాటు అయింది. ఈస్ట్ ఇండియా హయాంలో భారత్‌కు అనేక కష్టాలు ఎదురయ్యాయి. ప్రపంచ వాణిజ్య వ్యవస్థను మలుపు తిప్పిన ఈ కంపెనీ భారత్‌లో తన దమననీతితో ప్రజలను వేధించుకుతింది. అప్పట్లో ఈ కంపెనీ దోపిడి హయాంలో దారుణ రీతిలో బెంగాల్ కరువు ఏర్పడింది. మూడు కోట్ల మంది వరకూ ఆకలిదప్పులతో మృతి చెందారు. భారతీయ సంతతికి చెందిన సంజీవ్ మెహతా ఈ కంపెనీ హక్కులను ఈ కంపెనీ కర్కశత్వానికి ప్రతీకారంగా తీసుకున్నాడు . పలు ఆర్థిక కారణాలతో ఈ అపఖ్యాతి పేరున్న కంపెనీ చివరికి స్టాల్స్, ఇతర చిన్న వ్యాపారాల షోరూంలతో సాగి మూత పడిందని, కోట్లాది రూపాయిలలో నష్టాలు అప్పుల ఊబితో మూసివేశారని లండన్ పత్రికలు రాశాయి. అయితే తాను ఈస్ట్ ఇండియా కంపెనీపై పగ తీర్చుకున్నానని తరచూ సంజీవ్ మెహతా మీసం వేలేసేవాడు. బోర్డు తిప్పినా, తన పూర్వపు భారతీయ పౌరుషం మిగిలిందని ప్రకటించాడు.

మన తెలంగాణ 26 Feb 2026 10:19 pm

ఘనంగా ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం,ఆంధ్రప్రభః ఆంధ్రప్రభ గ్రూప్ సంస్థల

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:57 pm

తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, జగన్

తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, జగన్ నేడు లేని దేవాలయాల అభివృద్ధి, ధార్మిక

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:53 pm

ఇది అందరికీ ప్రయోజనకరం

ఇది అందరికీ ప్రయోజనకరం కృష్ణానది పక్కన నేషనల్ హైవే ప్రతిపాదనలు ప్రతిబంధకమేఇప్పటికే ఉన్న

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:49 pm

టాటా మోటార్స్ –చిదంబరనార్ పోర్ట్ అథారిటీ ఒప్పందం

టుటికోరిన్: నికరసున్నా ఉద్గారాల దిశగా దేశం ప్రయాణంలో కీలకమైన అడుగుగా, భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్, తమిళనాడులోని టుటికోరిన్‌లోని వీ.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (వీఓసీపీఏ)తో 40 గ్రీన్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్శక్తితో కూడిన (హెచ2 ఐసీఈ) పైమ్ వవర్‌లను పోర్టులో మోహరించడానికి ఒక అవగాహన ఒప్పందం (bంఓj)పై సంతకం చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పిం>, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒడంబడికలో […] The post టాటా మోటార్స్ – చిదంబరనార్ పోర్ట్ అథారిటీ ఒప్పందం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 9:42 pm

చెట్లతో నిండిపోయిన కెనాల్ కాల్వలు

చెట్లతో నిండిపోయిన కెనాల్ కాల్వలు సాగు నీళ్లు రాక రైతుల ఆవేదననర్సంపేట డివిజన్

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:40 pm

సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా స్థిరమైన వృద్ధి

ముంబై: సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్ నాల్గవ తైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఇది కీలక వ్యాపార విభాగాలలో స్థిరమైన వృద్ధి ఊపును ప్రదర్శిస్తుంది. ఈ తైమాసికంలో ఆదాయ వృద్ధి సంవత్సరానికి 47% వద్ద ఉంది. దేశీయ అమ్మకాలు 23% పెరిగాయి. రీకాల్ చేయబడిన ఉత్పత్తులను మార్కెట్‌కు తిరిగి ప్రారంభించడం ద్వారా ఇది జరిగింది. క్యూ4లో పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ.665 మిలియన్లకు చేరుకుంది, ఇది సంవత్సరానికి 50% పెరుగుదల. 2025 […] The post సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా స్థిరమైన వృద్ధి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 9:35 pm

నీటి ఆదాకు నెటాఫిమ్‌తో కలిసి పనిచేస్తున్న అమెజాన్

బెంగళూరుః సుస్థిరమైన నీటిపారుదలలో ప్రపంచ అగ్రగామి ఆర్బియా ప్రెసిషన్ అగ్రికల్చర్‌లో భాగమైన నెటాఫిమ్‌తో కలిసి అమెజాన్ ఇండియా నేడు బెంగళూరు, హైదరాబాద్‌లలో కొత్త నీటి పొదుపు ప్రాజెక్టులను ప్రకటించింది. సంప్రదాయ వరద నీటిపారుదలని బిందు సేద్యంతో భర్తీ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి 325 మిలియన్ లీటర్లకు పైగా నీటిని ఆదా చేస్తాయని భావిస్తున్నారు. బిందు సేద్యం నీటిని నేరుగా మొక్కల వేళ్ళకు అందిస్తుంది, పంట దిగుబడిని కొనసాగిస్తూ వథాను గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశంలోని నీటి […] The post నీటి ఆదాకు నెటాఫిమ్‌తో కలిసి పనిచేస్తున్న అమెజాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 9:27 pm

దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ఎన్‌హెచ్‌-65 విస్త‌ర‌ణ‌..

దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ఎన్‌హెచ్‌-65 విస్త‌ర‌ణ‌.. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల మేర‌కు ర‌హ‌దారి అభివృద్ధివిజ‌య‌వాడ న‌గ‌ర

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:21 pm

చర్లగూడెం రిజర్వాయర్.. నల్లగొండ ప్రజల చిరకాల కోరిక

చర్లగూడెం రిజర్వాయర్.. నల్లగొండ ప్రజల చిరకాల కోరిక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:18 pm

జింబాబ్వే టార్గెట్ 257

చెన్నైలో జింబాబ్వేతో జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీ చేయగా, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా(50: 23 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్స్ లు) అర్థశతకం చేశాడు. తిలక్ వర్మ(44: 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లు), ఇషాన్ కిషన్(38) ,సూర్య కుమార్ యాదవ్(33), సంజు శాంసన్(22) పరుగులు చేశారు. 

మన తెలంగాణ 26 Feb 2026 9:15 pm

కాళేశ్వరం ప్రాజెక్టు తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం: మంత్రి అడ్లూరి

కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను చిన్న భిన్నం చేయడంతో పాటు కోట్ల రూపాయాలు కమీషన్లు దండుకుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మీడియా సెల్ కన్వీనర్ సామ రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అప్పులు తీసుకువచ్చిన గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీరుతో రూ. 47వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కమీషన్లు దండుకుందని, కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కడ లేదని చెప్పారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీరు ఇవ్వలేదని మంత్రి ఆరోపంచారు. కాళేశ్వరంలో చేసిన అవినీతికి ఇతర దేశాల్లో అయితే కఠిన శిక్షలు విధించే వారని మంత్రి ధ్వజమెత్తారు. రైతులకు సంబంధించి రైతు బంధు, మూసీ ప్రక్షాళన గురించి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాళేశ్వరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమయిన అంశాలు మాట్లాడానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా కెసిఆర్ ఏనాడు అసెంబ్లీకి రాలేదని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎస్సి, ఎస్టి విద్యార్ధుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. రెండేళ్ల పరిపాలనతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట ఉన్నారని సహించలేక బిఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తొన్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టె ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం వడ్డీలను తగ్గించడానికి ముఖ్యమంత్రి చోరవ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేస్తున్నామని మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

మన తెలంగాణ 26 Feb 2026 9:10 pm

ఆలేరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఆలేరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఆలేరు, ఆంధ్రప్రభ: ఆలేరు

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:04 pm

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి… కుంటాల, ఆంధ్రప్రభః విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:00 pm

మార్చి ఒకటి నుంచి రహదారి భద్రత పన్ను

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రహదారి భద్రత పన్ను (రోడ్డు సేఫ్టీ సెస్)ను విధించేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారిపై ఈ పన్నును విధించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరిపై ఈ కొత్త పన్ను విధింపు ఉంటుందని పేర్కొంది. కార్లు, ప్రయాణీకులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర రవాణాయేతర వాహనాలపై ఈ పన్నును విధించనుంది. ద్విచక్రవాహనానికి రూ.2 వేలు, లైట్ మోటారు వాహనాలకు రూ.5 వేలు, ఇతర వాహనాలకు రూ.10 వేల చొప్పున సెస్ విధించేందుకు ఈ కొత్త ఉత్తర్వులను విడుదల చేస్తోంది. వాహనాల రిజిష్ర్టేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోడ్డు భద్రత పన్ను విధింపు ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ.270 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఇప్పటి వరకు ఉన్న వాహన రిజిష్ర్టేషన్ చార్జీలకు ఇది అదనంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులకు అదనంగా ఈ పన్ను చెల్లింపు వాహన వినియోగదారులకు భారం కానుంది.

మన తెలంగాణ 26 Feb 2026 8:57 pm

ఇసుక డంపులపై రైడ్ చేసిన పోలీసులు

ఇసుక డంపులపై రైడ్ చేసిన పోలీసులు కరీమాబాద్,ఆంధ్రప్రభః వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్

ప్రభ న్యూస్ 26 Feb 2026 8:56 pm

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన రష్మిక, విజయ్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య విజయ్... -రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇక గురువారం సాయంత్రం 4:30 గంటలకు కడువ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం కన్నులపండువగా జరగడం విశేషం. ఇక పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. ఈ వేడుకలో ప్రత్యేకంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. వివాహ బంధంతో జీవిత భాగస్వాములుగా మారిన విజయ్ దేవరకొండ, - రష్మిక మందన్న జోడీకి సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ఇక మార్చి 4న హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. నోరూరించే రుచులతో విందు... విరోష్ దంపతులు వివాహ వేడుకకు వచ్చిన అతిథుల కోసం పసందైన వంటకాలను వడ్డించారు. రాయల్ వెడ్డింగ్‌లో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ స్పెషల్స్ తో పాటు కర్నాటక స్పెషల్ బిసిబేళా బాత్, కూర్గ్ స్పెషల్ వంటకాలతో పాటు కొడువ సంప్రదాయ వంటకాలను అతిథులకు తినిపించారు. తెలంగాణ, ఆంధ్ర సంప్రదాయ వంటలు అయిన నాటుకోడి పులుసు, హైదరాబాద్ దమ్ బిర్యానీ, గారెలు, పప్పు, పచ్చి పులుసు, కీమా సమోసాలు కూడా మెనూలో ఉన్నాయి.

మన తెలంగాణ 26 Feb 2026 8:51 pm

చిట్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ

చిట్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ చిట్యాల ,ఆంధ్రప్రభ: నాగర్ కర్నూలు జిల్లా బమ్మెర లో

ప్రభ న్యూస్ 26 Feb 2026 8:45 pm

నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత

 నిజామాబాద్ లో గత మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోవడంతో అన్నదాతల ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు ఒక్కసారిగా మార్కెట్ కమిటీ కార్యాలయంపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో కార్యాలయ అద్దాలు పగిలిపోయి, ప్రాంగణమంతా గందరగోళం నెలకొంది. మార్కెట్‌లో పసుపు కొనుగోళ్లకు ఆధునిక సాంకేతికతను జోడించే క్రమంలో చేపట్టిన ఈ-నామ్ 2.0 వెర్షన్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ రైతులకు శాపంగా మారింది. గత మూడు రోజులుగా పాత వెర్షన్ (1.0) పనిచేయకపోవడం, కొత్త వెర్షన్ అందుబాటులోకి రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. పాత సాఫ్ట్‌వేర్ ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించకపోవడంతో అధికారులు చేతులెత్తేయడం గమనార్హం. వారం రోజులుగా వాతావరణం అనుకూలించడం లేదు. ఆకాశం మేఘావృతమై ఎప్పుడు వర్షం పడుతుందోనని భయపడుతున్నాం. ఇలాంటి స్థితిలో మూడు రోజులుగా కొనుగోళ్లు ఆపేస్తే మా గతేం కావాలి?‘ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు పసుపు తెచ్చి రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడం, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లే సమయంలో జరిగిన తోపులాట వల్ల కిటికీల అద్దాలు విరిగిపడ్డాయి. అధికారులు, సిబ్బంది రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సాంకేతిక మార్పులు చేసే సమయంలో ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో మార్కెట్ కమిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. అప్లికేషన్ అప్‌గ్రేడ్ అయ్యే వరకు మాన్యువల్‌గానైనా లేదా పాత పద్ధతిలోనైనా కొనుగోళ్లు జరపాల్సి ఉందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి, పసుపు కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతున్నారు.

మన తెలంగాణ 26 Feb 2026 8:45 pm

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జైనూర్, ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 26 Feb 2026 8:42 pm

మావోయిస్టు కీలక నాయకురాలు లొంగుబాటు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. గురువారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, కాంకేర్ జిల్లాలో ఏడు లక్షల రూపాయల రివార్డు కలిగిన మావోయిస్టు పార్టీకి చెందిన డి వి సి ఎం ( డివిజనల్ కమిటీ మెంబర్ ) సభ్యురాలు మాసే భార్ష కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేషా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టు 2003వ సంవత్సరం నుండి బస్తర్ దండకారణ్యం, అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలలో వివిధ హింసాత్మక సంఘటనలో చురుగ్గా పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ముందుగా ఈమె దండకారణ్యం నుండి చిద్బాంధర్ గ్రామానికి చేరుకొని అక్కడి నుండి నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి జిల్లా ఎస్పీకి ఏకే 47 రైఫిల్ అందించి లొంగిపోయింది.

మన తెలంగాణ 26 Feb 2026 8:38 pm

మహిళలలో క్యాన్సర్ లు నివారించే కార్యక్రమం

దేశవ్యాప్తంగా మహిళలలో క్యాన్సర్ లను నివారించే కార్యక్రమం మొదలు కానున్నది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 28న రాజస్థాన్ లోని అజ్మీర్ లో 14 ఏళ్ల లోపు బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పివి) టీకా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇది మహిళలలో నివారించగల క్యాన్సర్ లను తొలగించేందుకు భారతదేశం సాగించనున్న పోరాటానికి ఆరంభం కాగలదు. గర్భాశయ కేన్సర్ తో పాటు 6,11 రకాలకు కారణమయ్యే హెచ్ పివి రకాలు, 16,18 నుంచి రక్షణకల్పించే వాక్సిన్ ఇది. ప్రభుత్వం పెద్దఎత్తున చేపడుతున్న ఈ ప్రచారం లో భాగంగా క్వాడ్రివాలెంట్ హెచ్ పివి అయిన సింగిల్ షాట్ గార్డసిల్ 4 వాక్సిన్ (టీకా) ను ఇస్తారు.అజ్మీర్ లో ప్రధాని మోదీ హెచ్ పివి టీకా ప్రచారం ప్రారంభించే సమయంలోనే 14 ఏళ్లలోపు వయస్సుగల బాలికలందరికీ హెచ్ పివి టీకా ప్రచారాన్ని ఫిబ్రవరి 28నే ఉదయం 11.30 గంటలకు తాత్కాలికంగా ప్రారంభించాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 25 నే లేఖలు పంపింది. ప్రధాని మోదీ అజ్మీర్ నుంచి హెచ్ పివి వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా అనుసంధానం చేస్తారు.మహిళలలో గర్భాశయ క్యాన్సర్ దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఆరోగ్యసమస్య. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పివి) వల్ల వస్తుంది. టీకా ద్వారా నివారించగల ఏకైక క్యాన్సర్ ఇదే. గర్భాశయ క్యాన్సర్ నివారణకు బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సహించడానికి తాము కట్టుబడిఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 14 సంవత్సరాల లోపు వయస్సుగల బాలికలందరికీ ఒకే మోతాదులో గార్డిసిల్ 4 వాక్సిన్ వేయబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో, (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్- ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యునిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ఉపజిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు అస్పత్రులలో ఈ వ్యాక్సిన్ అందజేస్తారు. హెచ్ పివి టీకా స్వచ్ఛందంగా అందజేస్తారు. బాలికలు టీకాలు వేసే ముందు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది.

మన తెలంగాణ 26 Feb 2026 8:34 pm

CM Revanth Orders 100 ‘Telangana Public Schools’ Across State, Pushes AI, Breakfast Scheme and Fee Regulation

Chief Minister A. Revanth Reddy has directed officials to launch 100 “Telangana Public Schools” this year, one each in 100 Assembly constituencies outside Hyderabad, in a major push to upgrade government education infrastructure. Reviewing the Education Department at the Command Control Centre, the Chief Minister said the new schools should be developed on the lines […] The post CM Revanth Orders 100 ‘Telangana Public Schools’ Across State, Pushes AI, Breakfast Scheme and Fee Regulation appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 8:32 pm

గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి

గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చిట్యాల, ఆంధ్రప్రభ : గురువారం తెల్లవారుజామున

ప్రభ న్యూస్ 26 Feb 2026 8:02 pm

సాగు నీళ్లు రాక రైతుల ఆవేదన

సాగు నీళ్లు రాక రైతుల ఆవేదన నర్సంపేట, రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:56 pm

MLA |జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వం ఒక బాధ్యత…

MLA | జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వం ఒక బాధ్యత… ఒక నిబద్ధత, ఒక

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:49 pm

తిరువూరు అభివృద్ధి పనులపై సమీక్ష..

తిరువూరు అభివృద్ధి పనులపై సమీక్ష.. సీఎంతో జరగనున్న సమావేశానికి ముందస్తు చర్చలు..కలెక్టర్ కార్యాలయంలో

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:35 pm

ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు కేంద్ర

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:31 pm

ఎడమ కాలువ సాగర్ జలాలను పరిశీలన

ఎడమ కాలువ సాగర్ జలాలను పరిశీలన నీటి ఎద్దడి నివారణకు సాగర జలాలే

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:29 pm

బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్...ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్రయాదవ్ తెలిపారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజాపూర్ జిల్లా, ఇంద్రావతి నది ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం ఉదయం భద్రతా బలగాలు, డిఆర్ జి, సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా బలగాలకు తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాల పైకి కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించినట్టు, కాల్పుల అనంతరం సంఘటన ప్రదేశాన్ని పరిశీలించగా పురుష మావోయిస్టు మృతదేహం, మరొక మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు బహిరంగడ్ ఏరియా కమిటీకి చెందిన హిచామీ మద్ద, మంకీ పోడియంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. అలాగే సంఘటన ప్రాంతం నుండి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్‌ఆర్ రైఫిల్స్, ఇన్సస్ రైఫిల్స్, 12 బోర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు చెందిన నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు బస్తర్ రేంజ్ ఐజి పి సుందర్ రాజ్ తెలిపారు.

మన తెలంగాణ 26 Feb 2026 7:27 pm

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ పరకాల, ఆంధ్రప్రభ : పరకాల

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:27 pm

కుష్బూ గుప్తకు బదిలీ

కుష్బూ గుప్తకు బదిలీ ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:24 pm

వారం రోజుల్లో శశికళ పార్టీ..

 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వారం రోజుల్లో శశికళ పార్టీ ఏర్పాటు కానుంది. ఓ వారం రోజుల్లో ఈ పార్టీ పేరు , ఇతర వివరాలను వెల్లడిస్తానని అన్నాడిఎంకె బహిష్కృత నాయకురాలు, జయలలిత నెచ్చెలి వికె శశికళ గురువారం చెన్నైలో తెలిపారు. ఇది ఆషామాషీ పార్టీ కాబోదని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర వహించే పార్టీ కాగలదని స్పష్టం చేశారు. పార్టీని పెడుతానని ఇంతకు ముందే ఆమె ప్రకటించారు. తొమ్దిది సంవత్సరాల రాజకీయ అజాతం వీడారు. రెండు రోజుల క్రితం దివంగత జయలలిత 78వ జయంతి సందర్భంగా రామంతాపురం జిల్లాలోని కమూతి లో జరిగిన బహిరంగ సభలో కొత్త పార్టీ జెండా ఎగురేశారు. అక్కడి నుంచి గురువారం ఇక్కడికి వచ్చిన శశికళ చెన్నై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నా, తమిళులే తన బలం అని, తాము ముందుకు వెళ్లుతానని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 26 Feb 2026 7:24 pm

మంగ‌ళ‌గౌరి షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం

విశాలాంధ్ర – జూబ్లీహిల్స్ : జూబ్లిహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబ‌ర్ 36లో మంగ‌ళ‌గౌరి షోరూమ్‌లో మంట‌లు చెల‌రేగాయి. అక్క‌డ భారీగా మంట‌లు ఎగిసిప‌డుతుండ‌టంతో పాటు ప్రాంత‌మంతా భారీగా పొగ‌లు వ్యాపించాయి. ప‌క్క భ‌వ‌నాల‌కు కూడా మంట‌లు వ్యాపిస్తాయని భయాందోళనలో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు కానీ ఫైర్ సిబ్బంది తక్షణ చర్యతో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందించ‌డంతో వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మంట‌లు అదుపుచేసే ప్ర‌య‌త్నం […] The post మంగ‌ళ‌గౌరి షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 7:24 pm

గాలి నుంచి నీటి తయారీ యంత్రం

ప్రధాని మోడీ ఈ ఎగ్జిబిషన్‌లో పలు ఉపయుక్త సాధనాలను శ్రద్ధగా తిలకించారు. వాటి వివరాలను ఆసక్తితో తెలుసుకున్నారు. ప్రత్యేకించి రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు రూపొందించిన మొబైల్ ఐ వివరాలను ఆరా తీశారు. ఇక వాటర్ జెన్ ద్వారా రూపొందించిన పరికరంతో గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే సాంకేతిక కీలకమైంది. గ్రావిటి ప్రాతిపదికన పనిచేసే ఎన్ డ్రిప్ ఇరిగేషన్ ప్రక్రియ, మైనోరా బయో కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాల సరైన నిర్వహణ మార్గాలను రూపొందించింది. ఇక సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ సాంకేతికత పలు వినూత్న రీతుల్లో సాగింది. లాబ్‌లో ఉత్పత్తి అయ్యే మిల్క్ ప్రొటిన్స్ , పలు రకాల పుట్టగొడుగుల తయారీ సాధనాలు ప్రధాని మోడీతో పాటు అందరినీ ఆకట్టుకున్నాయి. పంటనూర్పిళ్ల దశలో వృధాలు జరుగకుండా చేసే ప్రక్రియలు రైతాంగానికి ఉపయోగం కానున్నాయి.

మన తెలంగాణ 26 Feb 2026 7:21 pm

కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం వేంసూరు, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్యాన్ని

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:14 pm

శ్రీనివాసరెడ్డి కుటుంబానికి గండ్ర దంపతుల పరామర్శ,

శ్రీనివాసరెడ్డి కుటుంబానికి గండ్ర దంపతుల పరామర్శ, చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని, నవాబ్‌పేట

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:10 pm

బోనాలతో మహిళల ఊరేగింపు

బోనాలతో మహిళల ఊరేగింపు జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం,పొనకల్

ప్రభ న్యూస్ 26 Feb 2026 7:04 pm

Vishnu Vinyasam is relatable and a comical treat – Sree Vishnu

Sree Vishnu became King of Entertainment for Telugu Cinema with his known relatable characters and impeccable comic timing. His upcoming film, Vishnu Vinyasam has created good anticipation among audiences with songs and teaser. The bookings have been appreciable and the actor interacted with press today. He stated that he is extremely happy and confident with […] The post Vishnu Vinyasam is relatable and a comical treat – Sree Vishnu appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 7:04 pm

Venky, Kalyan Ram, Anil Ravipudi’s Film Announced

Director Anil Ravipudi continues to redefine consistency in commercial cinema, standing tall with an unbeaten record of nine back-to-back blockbusters. His next movie will feature two prominent stars, Victory Venkatesh and Nandamuri Kalyan Ram, in the lead roles. Venkatesh and Anil Ravipudi form a blockbuster combination, having delivered four successful films together, while the director […] The post Venky, Kalyan Ram, Anil Ravipudi’s Film Announced appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 7:02 pm

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన

ఐదు సంవత్సరాలుగా తాము ఇద్దరం ప్రేమించుకున్నామని, ఈ నెల ఫిబ్రవరి 3 వ తేదీన సికింద్రాబాద్‌లో ఒక గుడిలో తనను పెళ్ళి సైతం చేసుకుని, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల చెప్పుడు మాటలు విని తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడని ఒక యువతి తన ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ తాలూకా దౌల్తాబాద్ మండల పరిదిలోని గోకపస్లావాద్ గ్రామంలో గురువారం రోజు చోటు చేసుకుంది. బాధిత యువతి మరియు యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకపస్లావాద్ గ్రామానికి చెందిన తుప్పుడు బాస్కర్, తుప్పుడు సాయమ్మల కూతురు అశ్విని(23) అదే గ్రామానికి చెందిన కొంగ నర్సప్ప, కొంగ వెంకటమ్మల కుమారుడు కొంగ బుగ్గప్ప(24)లు గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. యువతి గత కొన్ని రోజులుగా హైద్రాబాద్‌లో బ్యూటీపార్లర్‌లో పని చేస్తుంది. యువకుడు బుగ్గప్ప సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కాగా 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఇరువురు పిబ్రవరి నెల 3న సికింద్రాబాద్‌లోని ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు.  ఈ వివాహన్ని యువకుడి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన తమ్ముడు తప్పిపోయినట్లు యువకుడి అన్న శేఖర్ దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకి తెలుసుకుని వివాహం చేసుకున్నట్లు గుర్తించి యువతి, యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాల వారికి పోలీసులు సర్ది చెప్పి పంపించారు. ఈ క్రమంలో యువతిని తీసుకు వెళ్ళిన యువకుడు గత వారం రోజులుగా హైద్రాబాద్‌లో ఒక గదిలో ఉన్నాడు.  మంగళవారం రోజు గదిలో యువతిని ఒక్క దాన్నే ఉంచి భయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో దిక్కు తోచని యువతి తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి వెళ్ళిన వారు యువకుడు తమ అమ్మాయిని మోసం చేసి పారి పోయినట్లుగా అనుమానించి స్థానిక నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కాని బుగ్గప్ప సెల్‌ఫోన్ స్విచ్చాప్ రావడంతో ఏం చేయాలో తెలియక గ్రామంలోని వారి ఇంటి దగ్గరకి వచ్చిన అశ్వినిని వారి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ప్రేమ పేరుతో తనను పెళ్ళి చేసుకుని ఇంట్లోకి రానివ్వకుండా మోసం చేశారని వారి ఇంటి ముందు నిరసనకు దిగింది. కాగా అశ్విని ఇంటి ముందు నిరసనకు దిగడంతో బుగ్గప్ప కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్ళి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా గ్రామానికి చేరుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేయమని తాము వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి తమ అమ్మాయికి న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. తాము గత ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్ళి సైతం చేసుకున్నామని, కాని ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల మాటలు విని తన భర్త తనను మోసం చేస్తున్నాడని, తన భర్త తనకు కావాలని తనకు న్యాయం చేయాలని ఈ సందర్బంగా అశ్విని డిమాండ్ చేస్తుంది.

మన తెలంగాణ 26 Feb 2026 7:02 pm

Reservoir |ఆ దృశ్యం వెనుక దుఃఖం..

Reservoir | ఆ దృశ్యం వెనుక దుఃఖం.. Reservoir | స్టేషన్ ఘన్‌పూర్,

ప్రభ న్యూస్ 26 Feb 2026 6:53 pm

బాసరలో భక్తుల సందడి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శుభ ముహుర్తాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం భక్తుల సందడి నెలకొంది. శుభముహుర్తాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అదిక సంఖ్యలో విచ్చేశారు. ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నది ఒడ్డున గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. భారీగా భక్తులు రావడంతో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. అనంతరం అమ్మవారి సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయ రామరావు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మన తెలంగాణ 26 Feb 2026 6:49 pm

102 cases |అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండండి

102 cases | అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండండి కేంద్ర మంత్రి కింజరాపు

ప్రభ న్యూస్ 26 Feb 2026 6:24 pm

ఆరు నెలల్లో చెత్త రహిత మక్తల్ –ప్రజలందరి భాద్యత

ఆరు నెలల్లో చెత్త రహిత మక్తల్ – ప్రజలందరి భాద్యత మక్తల్ ,

ప్రభ న్యూస్ 26 Feb 2026 6:22 pm

Telangana : మంత్రి పదవులు భర్తీ ఇప్పట్లో లేనట్లేనా? హైకమాండ్ అదే చెప్పిందా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 6:21 pm

‘పెద్ది’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్.. రెండో సింగిల్ వచ్చేది అప్పుడే..

రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం వచ్చి ‘చికిరి చికిరి’ అంటూ సాగే పాట తెగ వైరల్ అయింది. ఈ పాటలోని హుక్ స్టెప్ ఎంతమంది రీక్రియేట్ చేశారో లెక్కే లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో బ్లాస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమా నుంచి త్వరలో రెండో సింగిల్ రాబోతుంది. ‘‘నీ అయ్య వడ్డీ.. నీ బిడ్డ కడితే.. నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… ’’ అంటూ సాగే పాటని మార్చి 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇంకా కొంత భాగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఏప్రిల్ 30కి సినిమా విడుదలను వాయిదా వేశారు. This song fuels the fire within #Peddi second single #RaiRaiRaaRaa will be a blast Full Song on 2nd March. #PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani … pic.twitter.com/dXANh0eXjQ — Ram Charan (@AlwaysRamCharan) February 26, 2026

మన తెలంగాణ 26 Feb 2026 6:15 pm

Milk Union |పాడి రైతు కుటుంబానికి ఆర్థిక సాయం..

Milk Union | పాడి రైతు కుటుంబానికి ఆర్థిక సాయం.. పాల రైతులకు

ప్రభ న్యూస్ 26 Feb 2026 6:12 pm

నీటి ఎద్దడీ లేకుండా ముందస్తు చర్యలు

నీటి ఎద్దడీ లేకుండా ముందస్తు చర్యలు భీంగల్ టౌన్, ఆంధ్రప్రభః రానున్న వేసవి

ప్రభ న్యూస్ 26 Feb 2026 6:05 pm

13 lakhs |ఆశయ సాధనలో కార్యకర్తలే బలం

13 lakhs | ఆశయ సాధనలో కార్యకర్తలే బలం మంత్రి నాదెండ్ల మనోహర్మార్చి

ప్రభ న్యూస్ 26 Feb 2026 5:58 pm

Hero Nani |వైరలైన నాని స్టెప్..

Hero Nani | వైరలైన నాని స్టెప్.. Hero Nani | ‘దసరా’

ప్రభ న్యూస్ 26 Feb 2026 5:58 pm

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ సురేష్

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ సురేష్ నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

ప్రభ న్యూస్ 26 Feb 2026 5:50 pm

ఆలయాలు ఐక్యతకు కేంద్రబిందువులు

ఆలయాలు ఐక్యతకు కేంద్రబిందువులు శతాబ్దాల చరిత్రకు ప్రతీక వాసవి అమ్మవారి ఆలయందేవాలయాల పునర్

ప్రభ న్యూస్ 26 Feb 2026 5:42 pm

Pradeep ranganathan |అలా చేస్తున్నాడా..?

Pradeep ranganathan | అలా చేస్తున్నాడా..? Pradeep ranganathan | ‘లవ్ టుడే’తో

ప్రభ న్యూస్ 26 Feb 2026 5:42 pm

వేడుకగా హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మంథన వివాహం జరిగింది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 5:41 pm

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. లయన్స్ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు బండి ఆంజనేయులు వారి జ్ఞాపకార్థం కుమారుడు బండి వేణుగోపాల్ వ్యవహరించడం జరిగిందన్నారు. మొత్తం 65 మంది కంటి రోగులు పాల్గొనగా […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. లయన్స్ క్లబ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 5:31 pm

Andhra Pradesh : మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు

మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 5:27 pm

28వ తేదీనే పెన్షన్ పంపిణీ

ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 6,722 మంది పెన్షన్ దారులకు 2 కోట్ల 96 లక్షల 79 వేల 500 రూపాయలను 14 సచివాలయాలలోని ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారని […] The post 28వ తేదీనే పెన్షన్ పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 5:27 pm

వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షలో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;;రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించి పాఠశాలకు గర్వకారణమని డి భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పరీక్షలునిర్వహించిన మూడు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి తమ ప్రతిభ, కృషి, పట్టుదలను చాటుకున్నారు అని తెలిపారు.6వ తరగతి నుండి జతిన్ కుమార్, కె. గగన్ గీత్, నిఖిల్ సాయి , 7వ తరగతి నుండి ఆదిత్య సాయి, హర్షవర్ధన్ నాయక్, మధు విద్యార్థులు […] The post వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షలో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 5:21 pm

MPTC,ZPTC ఎన్నికలపై కసరత్తు

MPTC,ZPTC ఎన్నికలపై కసరత్తు ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః తెలంగాణ ప్రభుత్వం ఎంపీటీసీ,

ప్రభ న్యూస్ 26 Feb 2026 5:21 pm

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

బాపట్ల: జిల్లాలోని వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళ్తున్న సహస్ర(20) ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో సహస్ర మృతి చెందగా.. అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్‌ని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సహస్ర గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది.

మన తెలంగాణ 26 Feb 2026 5:20 pm

మాజీ ఎంపీని కలసిన బీజేపీ నేతలు

మాజీ ఎంపీని కలసిన బీజేపీ నేతలు చల్లపల్లి – ఆంధ్రప్రభ : అరకు

ప్రభ న్యూస్ 26 Feb 2026 5:18 pm

ఘనంగా రోటరీ 121 వజన్మదిన ఉత్సవాలు.. రోటరీ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాంస్కృతిక మండలి లో రోటరీ క్లబ్ 121వ జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ ప్రతినిధులు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తొలుత కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి నరేందర్ రెడ్డి, తదితర సీనియర్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ 1905 ఫిబ్రవరి 27న అమెరికాలోని చికాగోలో యూనిటీ బిల్డింగ్స్ లో నలుగురు వ్యక్తులు సమాజసేవయే దృక్పతంగా స్థాపించిన సంస్థ ఇది […] The post ఘనంగా రోటరీ 121 వజన్మదిన ఉత్సవాలు.. రోటరీ క్లబ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 5:16 pm

ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో షాప్ జిల్లా సాయి సైక్లింగ్ ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వచ్చిన వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ,స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపికలు కాలేజీ సర్కిల్ నుంచి ప్రియదర్శిని స్కూల్ వరకు నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 28 […] The post ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 5:13 pm

అనిల్ అంబానీపై సీబీఐ మరో కేసు నమోదు

పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ మరోసారి సోదాలు నిర్వహిస్తుంది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 5:09 pm

సైకిల్ రేస్ పోటీలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం:: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు ఇటీవల నిర్వహించినటువంటి సైకిల్ రేసులో జిల్లా స్థాయికి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాణించి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు గాను ఫిబ్రవరి 28 నుండి మార్చి ఒకటి వరకు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తారని […] The post సైకిల్ రేస్ పోటీలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 5:00 pm

నష్ట పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్న..

భైంసా, ఆంధ్రప్రభ ; రెండు రోజుల క్రితం ఈదురు గాలుల తో భారీ

ప్రభ న్యూస్ 26 Feb 2026 5:00 pm

అజ్మీరా ట్రెండ్స్ డ్రెస్సెస్ షాప్ ప్రారంభం..

అజ్మీరా ట్రెండ్స్ డ్రెస్సెస్ షాప్ ప్రారంభం.. కరిమాబాద్, ఆంధ్రప్రభ ; వరంగల్ తూర్పు

ప్రభ న్యూస్ 26 Feb 2026 4:56 pm

ఆఖర్లో ఆదుకున్న రొమారియో,హోలర్డ్.. విండీస్ స్కోర్ ఎంతంటే

అహ్మదాబాద్: టి-20 ప్రపంచకప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా వెస్టిండీస్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి విండీస్.. సఫారీ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయారు. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డారు. ఈ నేపథ్యంలో జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్‌ల జోడి జట్టుకు అండగా నిలిచింది. ఇద్దరు కలిసి 89 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలో హోల్డర్ 49 పరుగుల వద్ద ఔట్ కాగా, రొమారియో(52) అర్థ శతకం సాధించాడు. ఫలితంగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి.. 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో ఎంగిడి 3, రబాడా, బోష్ తలో రెండు వికెట్లు తీశారు.

మన తెలంగాణ 26 Feb 2026 4:52 pm

ఇందిరమ్మ ఇళ్లపై వివాదం..

ఇందిరమ్మ ఇళ్లపై వివాదం.. భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి మున్సిపాలిటీ నాలుగో

ప్రభ న్యూస్ 26 Feb 2026 4:43 pm

Station Ghanpur |రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు..

Station Ghanpur | రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు.. Station Ghanpur | స్టేషన్

ప్రభ న్యూస్ 26 Feb 2026 4:39 pm

కుమ్మెర ఘటనను ఖండించిన రజక సంఘం నేతలు..

నార్సింగ్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో గుడిలోకి ప్రవేశించారనే కారణంతో

ప్రభ న్యూస్ 26 Feb 2026 4:33 pm

వెస్టిండీస్ కన్నా జింబాబ్వేతోనే మనకు ముప్పు: మాజీ క్రికెటర్

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో పరాజయం పాలై.. భారత్ సెమీస్‌కు వెళ్లే మార్గాన్ని సంక్లిష్టంగా మార్చుకుంది. దీంతో ఈరోజు జింబాబ్వేతో, ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే మ్యాచుల్లో భారీ తేడాలతో విజయం సాధించి రన్‌రేటును మెరుగుపర్చుకుంటే సెమీస్‌కు వెళ్లే మార్గం సుగమం అవుతోంది. దీంతో నేడు జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌ను సూర్యకుమార్ సేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే భారత్‌కు వెస్టిండీస్‌ కంటే జింబాబ్వేతోనే ముప్పు పొంచి ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ‘‘జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో వెస్టిండీస్ మనకంటే ఓ అడుగు ముందుంది. సౌతాఫ్రికా - వెస్టిండీస్‌ ఫలితం మీదే అంతా ఆధారపడి ఉంది. వెస్టిండీస్ కంటే.. జింబాబ్వేతోనే భారత్‌కు ఎక్కువ ముప్పు పొంచి ఉంది’’ అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో అన్నారు. ‘‘ప్రస్తుతం సెమీఫైనల్ ఆశలు జింబాబ్వే కంటే వెస్టిండీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్తే.. భారత్ పని ముగిసినట్లే. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా జింబాబ్వేను ఓడించాల్సి వస్తుంది’’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 26 Feb 2026 4:29 pm

Former Minister |కేటీఆర్ హామీ..

Former Minister | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ ; ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో

ప్రభ న్యూస్ 26 Feb 2026 4:23 pm

కుమ్మేర మల్లన్న జాతర ఘటనపై నిరసన..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా తాండూర్ మండలం కుమ్మేర మల్లన్న జాతరలో

ప్రభ న్యూస్ 26 Feb 2026 4:13 pm

2manythings |డా. జయప్రకాశ్ నారాయణ్ తో andhraprabha digital స్పెషల్ ఇంటర్వ్యూ

2manythings | డా. జయప్రకాశ్ నారాయణ్ తో andhraprabha digital స్పెషల్ ఇంటర్వ్యూ

ప్రభ న్యూస్ 26 Feb 2026 4:09 pm

Etala Rajender |పేద‌ల ఇళ్ల‌ను కూల్చుతున్నారు..

Etala Rajender | పేద‌ల ఇళ్ల‌ను కూల్చుతున్నారు.. Etala Rajender | ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 26 Feb 2026 4:03 pm