SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే..

అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే.. చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నెరవేర్చని

ప్రభ న్యూస్ 23 Mar 2026 10:26 am

Tamil Superstar Badly Needs a Producer

Tamil Superstar Ajith Kumar is one of the leading actors in Tamil. Though he did not deliver many debacles, Ajith’s big and fat pay cheque has been putting his producers to stay away. Top Telugu producers Mythri Movie Makers produced Good Bad Ugly with Ajith and they did not make any profits. But the production […] The post Tamil Superstar Badly Needs a Producer appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 10:25 am

‘కొరియన్ కనకరాజు’లో కీలక పాత్రలో..

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్ర క్లైమాక్స్‌లో వస్తోందని తెలుస్తోంది. ఈ పాత్రలో కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు, ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మన తెలంగాణ 23 Mar 2026 10:22 am

Telangana : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? అయితే మీరు ఈ పని చేయాల్సిందే

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 10:19 am

మత విద్వేషాలను సృష్టించడం సరికాదు..

మత విద్వేషాలను సృష్టించడం సరికాదు.. నెక్కొండ, ఆంధ్రప్రభ : కొంత మంది వ్యక్తులు

ప్రభ న్యూస్ 23 Mar 2026 10:16 am

Zodiac Signs : ఈరోజు రాశిఫలాలను చూసుకుని పనిని ప్రారంభించాల్సిందే

దినఫలాలు చూసుకుని మరీ చాలా మంది పనులు ప్రారంభిస్తారు.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 10:15 am

Iran - Israel War : హర్మూజ్ దాటితే భారీ సుంకం

హర్మూజ్‌ను దాటే నౌకలపై ఇరాన్ భారీగా సుంకం విధించింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 10:00 am

నాన్నకు ప్రేమతో.... జనం కోసం నాన్న స్థలం

ప్రేమను నిరూపించుకున్న కుమారులు మన తెలంగాణ/మద్దిరాల : గజం జాగా కోసం పేగు బంధాన్ని మరచి, సొంత తోబుట్టువుల రక్తం చూడడానికి కూడా వెనకాడని రోజుల్లో.... తండ్రి పేరు గ్రామ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నారు ఇద్దరు సుపుత్రులు. పరమో సేవా ధర్మః అనే శ్లోకాన్ని ఆచరించి, ఎంతోమందికి సేవలను అందించడానికి బాటలు వేశారు. వివరాల్లోకెళితే మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామంలో కొన్నేండ్లుగా కిరాయి గదుల్లో, చెట్ల కింద, పాత పెచ్చులూడే భవనాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది వైద్య సేవలు అందిస్తూ ఉండేవారు. చికిత్స చేస్తున్నప్పుడు పై కప్పు పెచ్చులు.. రోగుల పై, వ్యాక్సిన్ కోసం వచ్చే పిల్లల పై పడుతాయేమో అనే భయాలతో సేవలు అందిస్తూ వచ్చారు . అలాంటి భయానక పరిస్థితుల నుంచి తమ గ్రామస్థులను దూరం చేసేందుకు దోహదహ పడ్డారు నాయిని రాజేశ్వర్ రావు మరియు రామేశ్వర్ రావు లు. వాళ్ళ నాన్న నాయిని వెంకటేశ్వర్ రావు జ్ఞాపకార్ధం, గ్రామ నడిబొ డ్డున ఉన్న లక్షల విలువ గల 14 గుంటల స్థలాన్ని జిల్లా వైద్య ఆరో గ్య శాఖ కు దానం చేశారు.   గ్రామంలోని కొంతమంది నాయకులకు, గ్రామానికి బహుమతి గా ఇస్తున్నట్లు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి, కుల మతాలకు అతీతంగా తమ నాన్న స్థలంలో ఉచిత ఆరోగ్య సేవలకు మాత్రమే ఉపయోగపడాలని దాతలు కోరారు. స్థలాన్ని దుర్వినియోగం కాకుండా హుటాహుటిన ఆరోగ్య శాఖకు అందించి, గ్రామ స్థాయి ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని నిర్మించాల్సిందిగా గ్రామంలోని కొంతమంది నాయకులు అధికారులను కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే పనిచేస్తున్న రెడ్డిగూడెం గ్రామానికే చెందిన ఓ అధికారి, దాతలకు సంతృప్తి కలిగేలా భవనం ఉండాలని ప్రయత్నం చేస్తూ... చిన్న ఉప కేంద్రం కాదు జాతీయ ప్రమాణాలతో కూడిన ఆదర్శ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను నిర్మించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కలెక్టర్ ల ద్వారా రాష్ట్ర అధికారుల నుంచి నిధుల మంజూరు సాకారం చేసుకున్నారు. ఎక్కడో ఊరి చివరన, చెరువు దగ్గరో, స్మశాన వాటిక దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టిన ఆరోగ్య భవనాల నిర్మాణం కు గ్రామస్తుల ప్రోత్సాహమే కరువయ్యే పరిస్థితుల్లో, రెడ్డిగూడెం గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పాలుపంచుకోవడం ఆనంది ంచదగ్గ విషయం. దాతలు నాయిని రాజేశ్వర్ రావు మరియు రామే శ్వర్ రావు లాంటి మంచి మనసున్న వ్యక్తులు అన్ని గ్రామాల్లో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారి క్షేత్ర సిబ్బందికి రెడ్డిగూడెం గ్రామ పెద్దలు, నాయకులు, దాతలు చేస్తున్న కృషిని ఇతర గ్రామాల్లో చర్చించేలా చేసి, మరికొంత మంది ముందుకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మంజూరు అయిన భవన నిర్మాణాన్ని గ్రామ ఆరోగ్య సిబ్బంది డాక్టర్ పరమ్యా నాయక్, అదే గ్రామానికి చెందిన ఏ ఎన్ ఎం హసానబాద ఉమా, ఆశా కార్యకర్త పద్మ లతో పాటు ఇతర ఆశాలు నిబంధనలకు అనుగుణంగా, రోగులకు సౌలభ్యం గా ఉండేలా నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ, త్వరితగతిన పూర్తి కావడానికి సమన్వయ పరిచారు.   భవన నిర్మాణం పూర్తి కాగానే సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు ను గ్రామ నాయకుల సహకారం తో ఆహ్వానించి, దాతల సమక్షంలో ప్రారంభం చేయించారు. ప్రారంభోత్సవం రోజున దాతలు నాయిని రామేశ్వరరావు మరియు నాయిని రాజేశ్వరరా వులను గ్రామస్తుల కరతాల ధ్వనుల మధ్య ఘనంగా సత్కరించి, ఆరోగ్య శాఖ సిబ్బంది వారు చేసిన మేలును కొనియాడారు. దాతలు కూడా తమ నాన్న కలలు కన్నట్లుగా, ఈ భవనంలో ప్రతి గ్రామస్తుడు ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నరు. జిల్లా డి ఎం హెచ్ ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ దాతల దాతృత్వాన్ని, గ్రామ నాయకుల సంకల్పాన్ని, ఆరోగ్య మందిర్ సిబ్బంది సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఎవరు ఏ స్థాయిలో ఎంత సహకారం అందించాలో, అంతకుమించిన పట్టుదలతో అందించడంతోనే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. జిల్లాలో బెస్ట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మాత్రమే కాకుండా, జాతీయస్థాయిలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సర్వీస్ అందిస్తున్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందే వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది కష్టపడతారని ఆయన హామీ ఇచ్చారు. ఇది తెలుసుకున్న దాతలు వారి తండ్రి నాయిని వెంకటేశ్వరరావు ను తలుచుకొని, వారి స్థలంలో గ్రామస్తులకు జరుగుతున్న మేలును కళ్ళారా చూస్తూ ఆనందభాష్పాలతో కళ్ళు చెమర్చాయి. ప్రభుత్వ సహకారంలో కొంత ఆలస్యం వలన, ఏదైనా మందుల సరఫరా ఆలస్యం ఉంటే గ్రామస్తుల కోసం తామే మందులు కూడా పంపిస్తామని స్థల దాతలు ప్రకటించడం అభినందనీయం. దగ్గుల మల్లయ్య నేలను చదును చేయడం జరిగింది. మరికొంత మంది గ్రామస్థులు సైతం ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కుక్క కాటు మరియు టీటీ లాంటి ఇంజెక్షన్ ల కోల్డ్ చైన్ ప్రక్రియ కోసం స్థల దాతలే ఫ్రిజ్ ను కూడా బహుకరించడం విశేషం. ఈ నిజ సంఘటనలో అంతా మూకుమ్మడిగా, ఎలాంటి భేద భావాలకు తావు లేకుండా, వారు అనుకున్నది సాధించడంలో రెడ్డిగూడెం టీమ్ చూపించిన ఐకమత్యం పలువురికి ఆదర్శం. జ్ఞాపకార్ధకంగా కట్టే ఎవరికీ పనికిరాని సిమెంట్ కట్టడాల కన్నా... నలుగురికి ఉపయోగపడే హెల్త్ సెంటర్, బస్ స్టాండ్, గ్రంథాలయం, తాగు నీరు పంపిణీ లాంటి సేవలకు స్థలాన్ని ఇవ్వడమో, లేక నేరుగా నిర్మాణాలు చేయడమో చేస్తే అదే నిజమైన జ్ఞాపకార్ధం. వారి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని పలువురు చర్చిస్తున్నారు. ప్రజా ఆరోగ్యం మెరుగు పరిచేందుకు సిద్ధం - తీగల ఉపేంద్ర వెంకన్న, గ్రామ సర్పంచ్ రెడ్డిగూడెం గ్రామ ప్రజల ఆరోగ్యానికి దోహదపడే హెల్త్ సెంటర్ కి కావాల్సిన సహకారం అందిస్తాం. గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది ద్వారా భవనం లోపల మరియు చుట్టు పక్కల పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తాం. స్థల దాతల ఉద్దేశాన్ని అమలు అయ్యేలా చేసి, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకుని, వైద్యాన్ని మరింత చేరువయ్యేలా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామస్తుల సహాకారం మరువలేనిది.

మన తెలంగాణ 23 Mar 2026 9:59 am

పరిశీలన పాక్షికత

పరిశీలన పాక్షికత మన దృష్టి కిటికీ కాదు మనసు రంగుతో పూయబడిన అద్దం చూస్తున్నామనుకునేది ప్రపంచం కాదు మనలో ముందే వ్రాసిన భావనల ప్రతిబింబం సాక్ష్యం ఒకటే అయినా నమ్మకం దానికి వేరే రూపం ఇస్తుంది భావాలు మబ్బులైతే,తర్కం సూర్యుడు కావాలి నిజం బయట దాగి ఉండదు మన పక్షపాతపు పొరలలో చిక్కుకుపోతుంది గత అనుభవం గీతలు గీస్తే ప్రస్తుతం వాటి మధ్యే నిలుస్తుంది పక్షపాతం తెలియని చూపు బంధనం పక్షపాతం తెలిసిన చూపు విముక్తి మన అద్దం శుభ్రం అయినప్పుడే ప్రపంచం కాదు సత్యమే మనలో ప్రతిఫలిస్తుంది - డాక్టర్ నూకరాజు బెందుకుర్తి

మన తెలంగాణ 23 Mar 2026 9:58 am

Iran - Israel War : అమెరికా–ఇరాన్ హెచ్చరికలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత

మధ్యప్రాచ్యంలో యుద్ధం నాలుగో వారంలోకి చేరిన వేళ పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారాయి

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:52 am

గోవులొస్తున్నాయి జాగ్త్త్రత్త!

ఇరానీ కేఫ్‌లో నల్లమబ్బుల తెల్ల చొక్కా టేబుల్ మీద టీ కప్పులోంచి లేచి జోగుతూనే పడగలు విప్పి ఆడే పాములు ఎక్కడో కరెంటు తీగమీంచి పడిన కాకి చుట్టూ మూగిన కాకుల అరుపులు చమురు మబ్బుల పొగలు కేఫ్‌లో తారూ, చమురు కలిసి నల్లటి వర్షం నల్లమబ్బుల తెల్ల చొక్కా నెత్తిమీది టోపీ తీసి మీద పెట్టే సరికి టోపీతో పాటు వచ్చేసిన పుర్రె మీది చిప్ప టేబుల్ మీది టీ కప్పు లేచి డిప్పలేని తలని కప్పులా అందుకుని సిప్పు చేస్తుంది సుళ్లు తిరుగుతూ తలల్ల్లోంచి లేస్తాయి ఆకాశంలోకి రంకెలు వేస్తూ ఆబోతుల ప్రవాహాలు సుడి మధ్యలోనేమో కొండ దిగే గంగిగోవులు, గోధూళి జలపాతంలో విస్తరించే విద్యుల్లతలు తల లోపలి మనిషి కల భగ్నమౌతుంది సవ్యాపసవ్యంగా మనిషి అణువులు కొంటాయి తలలోపలి మనిషి తలపగిలి విలపిస్తాడు రెండు శతగ్నులుపైకి లేచి గర్జిస్తాయి మొబైల్ తుపుకూ తుపుకూ విరామం లేకుండా ఆకాశంలోకి మిసైళ్లని ఉమ్మేస్తాయి పెంటగన్లో నూక్లియర్ లేవు డిప్పల్లేని తలకాయల్లో, ఎప్పటికీ ఆకలి తీరని డైనోసార్లున్నాయి కుప్పల కుప్పల వార్‌హెడ్స్ మధ్య నుంచి చమురు సముద్రం మీద తేలే స్కూలు పిల్లల సమాధుల మధ్య నుంచి శిశువును ఎత్తుకుని పరుగెడుతోన్న ఓ పిచ్చి తల్లి ఆమెను మిసైళ్లతో బీ12 బాంబర్లతో వెంటాడే సామ్రాజ్యం ఆపండ్రా బాబూ ఆపండి, అరుస్తోంది ఓ చిన్నారి సమాధి ఇరానీ కేఫ్ ముందు సింహం తన వెన్నెముకలోంచి ఓ కొవ్వొత్తిని తీసిచ్చి చేపల్లో కలిసి పోయింది కొవ్వొత్తిని కపాలంలో వెలిగించింది టీకప్పు తల లాంతరుగా మారిపోయింది ఇరానీ కేఫ్ అద్దాల్లో లాంతరు ముఖం గోడ్ల నిండా లాంతర్లు టేబుళ్ల చుటూ లాంతర్లు కేఫ్‌కి వచ్చిపోయే శబ్ధాలన్నీ లాంతర్లు కేఫ్ బయట రోడ్డు మీద ప్రవహించే లాంతర్లు భూగోళమంతా లాంతర్లు లాంతర్లు పిచ్చి తల్లినీ, ఆమె చేతిలో శిశువునీ వెంటాడే వేటాడే ఉన్మాదుల నుంచి లాంతర్లే రక్షించాలి లాంతర్ల కాంతిలోంచి దూకే సిక్కోలు గంగిగోవులే రక్షించాలి హరిత గోళాన్ని పొదుగుల్లో మోసే గోమాతలే రక్షించాలి - వసీరా

మన తెలంగాణ 23 Mar 2026 9:52 am

లిటిల్ ధియేటర్ కొన్ని అనుభవాలు

(గత సంచికతరువాయి) స్విస్ నాటక రచయిత Friedrich Durren matt రాసిన In the Matter of J.Robert Oppenheimer నుంచి కొన్ని భాగాలు కూడా లిటిల్ థియేటర్ బృందం రీడింగ్ చేసింది. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ గా ఆయన్ని పిలుస్తారు. ఇక్కడ ’మాక్స్ ముల్లర్ భవన్’ డైరెక్టర్ గారి భార్య ఈ రీడింగ్ సెషన్ ఏర్పాటు చేయించారు. బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ లో కూడా ఇదే ప్రదర్శన ఇచ్చారు. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందట! “హైదరాబాద్‌లోని ఇఫ్లూ (English and Foreign Languages University)లో కూడా ఈ ప్రదర్శన ఇచ్చాం. ఇఫ్లూకి బ్రిటీష్ కౌన్సిల్ వాళ్లు కొందరు ప్రొఫెసర్స్‌ని పంపేవాళ్లు. అందులో John Irving అని ఒక ప్రొఫెసర్ ఉండె. షేక్సియర్ వర్స్ స్కాలర్. జాన్ ఇర్వింగ్ తాత Henry Irving. ఆయన ‘The Henry Irving Shakespeare’ పేరిట ఎనిమిది సంపుటాలు రాశారు. అంతటి మహనీయుడి మనవడైన John Irving కూడా మాతో కలిసి In the Matter of J.Robert Oppenheimer రీడింగ్ చేశాడు” అని మరో జ్ఞాపక పుట నా ముందు తెరిచారు శంకర్ మెల్కొటె. ఇలాంటిదే మరో సందర్భం. శాంతా రామేశ్వరరావు ఒక కథ రాశారు. అచ్చవడానికి ముందే ఆ కథని శంకర్ చదివారు. ‘ద కాన్సర్ట్ (The Concerts) పేరుతో రాసిన ఆ కథ ఆయనకు చాలా నచ్చింది. ‘లిటిల్ థియేటర్’ తరపున దానిని ప్రదర్శిస్తానని ఆమెని అడిగితే “నీ మీద నమ్మకం ఉంది. చేయి” అన్నారట. ఆ కథ ఆమె ఫ్యామిలీలో నిజంగా జరిగిన ఘటన. మహారాష్ట్రలోని ఓ గ్రా మీణ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటుంది. భా ర్య, భర్త, ఇద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి. వాళ్లు చిన్నపిల్లలు. ఆ అబ్బాయికి క్యాన్సర్ ఉందని నిర్ధారణ అవుతుంది. ఆ అబ్బాయి చదువులో, ఆటల్లో చురుకైనవాడు. కానీ క్యాన్సర్! ఆ ఫ్యామిలీ మొత్తం మ్యూజిక్ లవర్స్. కచేరీ చూడ్డానికి ఆ తండ్రి రెండు టిక్కెట్లు కొంటాడు. కొడుకు రాలేడు గనుక తల్లిని తోడుగా ఉంచుతారు. తండ్రీ ‘కూతుళ్ళు కచేరీకి వెళతారు. కచేరీ ముగిసిన తర్వాత చూస్తే అతనికి తన కూతురు కనిపించదు. ఆడిటోరియంలో ఎక్కడ వెతికినా ఫలితం ఉండదు. చివరికి స్టేజ్ మీదకు వెళ్లి తెర వెనుక చూస్తే ఆ పాప పండిట్ రవిశంకర్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది. “మా అన్నయ్యకి ఆరోగ్యం బాగోలేదు. బాగుంటే తప్పక వస్తుండె. తనకి సంగీతమంటే పిచ్చి.. తనకి క్యాన్సర్‌” అని చెప్తూ ఉందట. అది విన్న రవిశంకర్ జాకీర్ హుసేన్ వైపు తిరిగి “ఉస్తాద్ ఏమంటావ్‌” అన్నారట. అతను “ఛలో” అని బదులిచ్చాడట. తర్వాత రోజు వాళ్లిద్దరు టాక్సి కట్టుకుని ఆ చిన్న ఇంటికి వస్తారు. ఆ పిల్లవాడి కోసం గంటసేపు కచేరీ చేస్తారు. అతని మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. కొనాళ్లకి ఆ బాబు చనిపోతాడు. ఇదీ ‘ద కాన్సర్ట్’ స్టోరీ సంక్షిప్తంగా. “ఈ కథని కూడా లిటిల్ థియేటర్ ఎంతో బాగా పెర్ఫార్మ్ చే సింది. ప్రముఖ ఎకనమిస్ట్ రాజా అంగార ఇందు లో పాల్గొని సితార్ ప్లేచేశారు. మంచి స్పందన వ చ్చింది” అంటూ ఆ మొత్తాన్ని కళ్లకు కట్టినట్టు చె ప్పుకొచ్చారు శంకర్ మెల్కొటె. అనంతర కాలంలో పబ్లిష్ అయిన ఈ కథని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ 10వ తరగతి ఇంగ్లీషు పాఠ్యాంశంగా స్వీకరించడం మరో ఆసక్తికర అంశం. ఇక ఇటీవలి సంగతికి వస్తే... ఈ మధ్య జర్మన్ కల్చరల్ సెంటర్ గోథెజెంత్రం (goethe-zentrum)లో పర్యావరణం గురించి ఒక రీడింగ్ చేశారు. దీంట్లో కూడా మ్యూజిక్ ని బాగా ఉపయోగించారు. కోల్ కతాలో జూనియర్ డాక్టర్ ని రేప్ చేసి చంపిన ఘటనకి నిరసనగా జాదవ్ పూర్ యూనివర్శిటీ విద్యార్ధులు స్ట్రీట్ డాన్స్ మాదిరిగా ఒక ప్రొటెస్ట్ నిర్వహించారు. దీనికి భూపేన్‌హజారికా రాసిన O Ganga Behti Ho KYun అనే పాటని ఉపయోగించారు. ఆ వీడియోతో రీడింగ్ మొదలుపెట్టారట. వారు ఎంచుకున్న సబ్జెక్టుకి సూటయ్యే పాట అది. ఆ తర్వాత పర్యావరణం మీద అయిదారు పీసెస్ చదివారట. చివర్లో అమెరికన్ ఫోక్ సింగర్ Joanbaez వర్షం గురించి పాడిన WHAT HAVE THEYDONE TO THE RAIN అనే పాటతో ముగించారట. దీనికి కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందని శంకర్ చెప్పారు. తమకి తటస్థపడే గురించి ఆయన వివరిస్తూ “మమ్మల్ని పురికొల్పే అంశాలు కొన్ని ఉంటాయి. ఎవరైనా ప్రసిద్ధ రచయిత హైదరాబాద్ వస్తే ఆ రచయిత వర్‌క్స్ చదువుతాం. ఎవరిదైనా వర్ధంతి వస్తే వారి రచనలు చదువుతాం. వరల్డ్ లిటరేచర్ డే వచ్చిందనుకోండి. లేదా ఏదైనా కొత్త మ్యాగజైన్ విడుదలైనా మాకు సందర్భమే” అన్నారు. ఇందుకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తావించారు కూడా. ITC గ్రూపు ఒక మ్యాగజైన్ తెస్తుంటుంది. ఒకసారి వాళ్లు సంగీతం గురించి ఒక ప్రత్యేక సంచిక తెచ్చారట. అందులోంచి మూడు కథలను ఎంచుకుని అదే హోటల్లో రీడింగ్ చేశారట. సంగీత విద్వాసురాలు మాలినీ రజుర్కర్ ముందు వరుసలో కూర్చుని తాళం వేశారట. “ఆ దృశ్యం మరచిపోలేనిది..” అన్నారాయన ఎంతో తృప్తిగా. ‘ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ స్ఫూర్తితో తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో కొందరు రీడింగ్స్ చేస్తున్నారిప్పుడు. శంకర్ మెల్కొటె అండ్ కో చూపిన మార్గానికి ఇది అర్ధవంతమైన కొనసాగింపుగా భావిస్తూ ‘ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ కృషికి మనసారా అభినందనలు తెలియచేద్దాం. - ఒమ్మి రమేష్ బాబు

మన తెలంగాణ 23 Mar 2026 9:46 am

Weather Report : చల్లటి వాతావరణం.. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:38 am

Telangana : నేడు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు

భారతీయ జనతా పార్టీ నేడు ఆందోళనకు దిగనుంది.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:33 am

సర్వ అమానవీయ రుగ్మతలకు.. ఏకైక ఔషధం పుస్తకం ఒక్కటే!

నేను నా సాహితీ యాత్ర: సరిగ్గా ఆరేళ్ళ క్రితం మనోధర్మ పరాగం అనే నవలను రాస్తున్నప్పుడు, ఆ కథను తెలుగు వాళ్ళదిగా చేయడం కోసమని నేను దా ని భూమికను మదురై నుంచీ కొన్నేళ్ల పాటు చిత్తూరుకు తీసుకొచ్చా ను. అయితే ఆ నవల పురివిప్పే కొద్దీ ఒకనాటి తొండనాడులోని భాగమైన చిత్తూరు జిల్లాలోని దక్షిణ ప్రాంతానికీ, కన్యాకుమారి నుంచీ మద్రాసు వరకూ వ్యాపించిన కర్ణాటక సంగీత ప్రపంచానికీ మధ్య వుండే అవిభాజ్యమైన సంబంధాన్ని తెలుసుకోగలిగాను. నేటి తమిళనాడులోని విల్లుపురం నుంచీ యిటు తిరుపతి వరకూ విస్తరించిన తొండనాడు అనే ప్రాంతానికున్న భిన్నమైన, విశిష్టమైన సాంస్కృతిక వారసత్వమేమిటో అప్పుడే నాకు అర్ధమైంది. కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీ రత్నత్రయమని పిలిచే వారిలో ఒకరైన డి.కె.పట్టమ్మాళ్ బాల్యం చిత్తూరులోనే గడచింది. మరో విదుషీమణి ఎమ్.ఎల్. వసంత కుమారి తల్లిగారు చిత్తూరు నుంచే మద్రాసుకెళ్లారు. ఆధునిక కర్ణాటక ప్రముఖ వాగ్గేయకారుడు మైసూరు సదాశివరావు చిత్తూరులోనే పుట్టాడు. చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై నుంచీ నాగయ్య వరకూ ఎందరో చిత్తూరులోనే పుట్టిపెరిగారు. చిత్తూరుకు కేవలం అరవై మైళ్ళ దూ రంలో వుండే కంచి కర్ణాటక సంగీతాని కే కాదు, తొండనాడుకే రాజధానిగా ఉండే ది. స్వతంత్రం వచ్చేముందు వరకూ తెలు గూ, తమిళమూ ఎంతో స్నేహంగా కలిసి జీవించాయి. ఆ స్నేహం లోంచే తిరువయ్యూరు సంగీతత్రయం, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రీ పుట్టారు. మదురై తెలుగు సాహిత్యానికి శతా బ్దం పాటూ వేదికయ్యింది. భరతనాట్యం సదర్ పేరుతో వెలుగొందింది. తొండనాడులోని జనాలకు రెండు మాతృ భాషలుంటాయని చెప్పడం ఉత్ప్రేక్ష కాదు. కంబరామాయణం తెలుగు అనువాదానికి ముందుమాట రాస్తూ కట్టమంచి రామలింగారెడ్డి గారు ‘జాతి చేత తెనుగువారును అరవ వారును ఒక్కరని శాస్త్రజ్ఞుల సిద్ధాంతము. వీరిరువురకును ఎన్ని యోతరముల క్రిందట సామాన్యమైన తెగ ఒక్కటి యుండెడిది’ అని చెప్పారు. 1850 ప్రాంతంలో మాముత్తాత ఇప్పటి చిత్తూరు జిల్లాలోని రవణయ్యగారి పల్లి అనే పాతిక యిండ్ల గ్రామపు రైతుల ఆహ్వానం మేరకు తెలుగు పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయుడుగా నాటి అదే దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని జింజికోట దగ్గరి వెంకటాపురం గ్రామం నుంచి వలసవచ్చి స్థిరపడ్డాడు. అయితే ఆయనప్పుడు చేసిన నూరుమైళ్ళ ప్రయాణం తీసుకొచ్చిన ఉపద్రవాలేమిటో తరువాతే నాకు తెలిసివచ్చాయి. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలుగా విభజించడం అవసరం. అయితే భాషను కొలబద్దగా చేసుకుని భాషాప్రయుక్త రాష్ట్రాల యేర్పాటు చేసుకోవడం తెలుగువాళ్లు చేసిన నేరం. కన్యాకుమారి నుంచీ నాగపూరు వరకూ తమిళ, కన్నడ, మలయాళ, మహారాష్ట్రులతో కలసి జీవిస్తున్న తెలుగువాళ్ళను ఒకటో లేక రెండు భాషాప్రయుక్త రాష్టాలలోకి తీసుకురావడం జరగని పని. ఈ రాజకీయ విభజనల వల్ల సగంమంది మాతృభాషను పరిరక్షించుకోవడం కోసం ఉద్యమాలు చేయవలసిన దుర్గతి సంభవించింది. తొండనాడుకైతే తన మూలాల్ని కోల్పేయే ప్రమాదం వచ్చింది. మనోధర్మపరాగం నవల నన్ను నా వేర్లను వెతుక్కోవలసినదిగాహెచ్చరించింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జరిగిన అనేక సాంఘిన , సాంస్కృతిక విధ్వంసాలు ‘దాయాదుల తోట’ అనే నవలను రాసేలా చేసింది. తొండనాడు చెరువుల కింద వ్యవసాయం చేసేప్రాంతం. ఏడాదికి యిరవై పదున్ల వానలు పడితేయేర్లు పారి చెరువులు నిండి రైతుకు ఒక పంటైనా యిల్లుచేరేది. యిక్కడి రైతులందుకే ఒకప్పుడు సుఖంగానే జీ వించారు. అయితే తొండనాడును రాయలసీమ గొడుగుకిందికి తోసి, ఇక్కడ కూడా యేర్లకు చెక్డాముల్ని గట్టేసారు. దాని తోడాముల దగ్గర వందల ఎకరాల్లో ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయి. కానీ ఆయే ర్ల దిగువ పరీవాహిక ప్రాం తాల్లో వేల ఎకరాల్లో భూగర్భ జలాలు ఎండిపోయి, వందల అడుగుల బోర్లుదించి నా నీళ్లు అందక తాగే నీళ్ళు కూడా లేక ప్రజలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోంచే కొత్తగా ‘నీరు పల్లమెరుగు’ అనే నవల రూపొందింది. మా ముత్తాత నెలకొల్పిన ప లు కూటంలో పెద్దబాలశిక్ష, బాల రామాయణం, అమ రం, ఆంధ్ర నామసంగ్రహం, భారతంలోని ఆదిపర్వం పా ఠ్య పుస్తకాలుగా ఉండేవి. వీటితోబాటు నాటి ఉపాధ్యాయుడు గ్రామీణులకు భారత రామాయణాలలోని కథల నాధారంగా చేసుకున్న నాటాకాలను (వాటిని ఆట అనేవాళ్ళు) నేర్పించాలి. విరాట పర్వం, నలచరిత్ర ఏడాదికోసారైనా రైతులు పారాయణం చేసేవాళ్ళు. యివి కాకుండా పజ్జెనిమిది రోజుల భారత యజ్ఞాలు, వీరగాధలు, పేరంటాల కథలు, కాంభోజ రాజుకథ, బాలనాగమ్మ కథ, ముగ్గురు మరాఠీలు, పల్లెపడుచులు పాటలు, జంగం దేవర్ల పాటలు మొదలైన తొండనాడు జానపద సంస్కృతి తన రచనలకంతా గంభీరమైన నేపధ్యాన్ని సమకూర్చిందని మా నాన్న చెప్పుకున్నారు. ఈ పాదులోంచి పుట్టినవాడిని నేను. మా నా న్న మాటల్లోనే చెప్పాలంటే కొత్త నీటికి ఎక్కొచ్చిన చేప పిల్లలా నేను సాహిత్యంలోకి ప్రవేశించాను. తొలి నుంచీ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేసి రూపుదిద్దిన మార్కిస్టు మానవీయ దృక్పథం నాకూ జవసత్వాలనిచ్చింది. నా పదహారవ సంవత్సరంలో 1973లో నా మొదటి కథ వచ్చింది. పెద్ద మాటల్లో చెప్పాలంటే నా సాహిత్య స్వర్ణోత్సవం రెండేళ్ల క్రితమే జరిగిపోయింది. సృజనాత్మక రచన తొలిరోజుల్లో నాకు సాహి త్య సాధన గానూ, వ్యక్తిగత శోధన గానూ, ప్రాపంచికావగాహనా వేదిక గానూ, సత్యాన్వేషణా వాహిక గానూ తోడ్పడింది. క్రమంగా అది మానసికావసరంగా (pscychological necessity)గా కూడా మారింది. నిస్సిమ్ ఏజె కిఎల్ అ న్నట్టుగా నన్ను నేను యెదుర్కోవడానికీ, నన్ను నేను అదుపులో పెట్టుకోడానికి రచన తప్పనిసరి అవసరమైపోయింది. చాలామంది లాగే నేనూ నా కోసమే రాసుకుంటాను. అయి తే ఈ క్రమంలో సహృదయుడైన పాఠకుడికీ చేరువవ్వాలని గాఢంగా కోరుకుంటాను. పాఠకుడనే వాడు లేకుంటే ఏ రచనకైనా అస్తిత్వముండదు. అయితే రచయితగా నేను ప్రారంభించినప్పుడున్నంత సౌలభ్యం, సౌకర్యం యిప్పుడు లేదు. నేటి తెలుగుసాహిత్య మూ, సంస్కృతులు సోదర దక్షిణ భారత భాషలతో పోల్చడానికి వీల్లేనంత దయనీయంగా వున్నాయి. యిరవై కోట్ల మంది వుండే తెలుగు కు ఒక సాహిత్య పత్రికైనా లేదు. మనలో సగమైనా జనాభా లేని ఆ భాషల్లో వున్న పాఠకుల్లో మనకు నాలుగో వంతయినా లేరు. ఆ ప్రభుత్వాలు భాషా సాహిత్యాలకిచ్చే ప్రాముఖ్యత మనకు మచ్చుకైనా లేదు. మనలో వున్న విద్యావంతులకు వ్యాపార సినిమాల పైన వున్నంత మోజు మరిదేనిపైనా లేదు. భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి పత్రికలు కేవలం మనకు చరిత్ర మాత్రమే! ఇప్పుడు కూడా పదికిపైగా సాహిత్య పత్రికలున్న సోదర దక్షిణ భారత భాషల్లో విందు భోజనాల్లాంటి పెద్ద ప్రత్యేక సంచికలూ వస్తున్నాయి. ఒకప్పుడు మారుమూల పత్రికలో కథ వచ్చినా చదివి స్పందించే వాళ్లు ఎందరో ఉండేవారు. యిప్పుడు యింకా రాస్తున్నావా అని అడిగే వాళ్లే కనబడుతున్నారు. తెలుగు సాహిత్యంలో యిది ఒక చీకటి కాలం. ఇటీవలి కాలంలో జరిగిన గ్రంధాలయ పునరుజ్జీవనోద్యమం, బుక్ బ్రహ్మ పుస్తకోత్సవం లాంటివి కొద్దిగా కాంతి కిరణాల్ని ప్రసరిస్తున్నాయి. కొత్తగా వచ్చిన యువ ప్రచురణకర్తలు చాలా పుస్తకాల్ని ప్రచురించి పెద్ద సంఖ్యలో పుస్తకాల్ని అమ్మగలగడం ఆశాజనకంగా వుంది. కాలక్షేప పుస్తకాలతో, ఊహా ప్రేమ కథలతో మురిసిపోతున్న పాఠకులలో కొందరైనా మంచి సాహిత్య పాఠకులయి తీరుతారనే నమ్మకముంది. వాచకాని (text) కున్న ప్రాముఖ్యతను తెలుగు సినిమా విస్మరించినట్టుగా మరే యితర భాష రాష్ట్రాల్లోనూ నిర్లక్ష్యం చేయలేదు. కంప్యూట ర్లూ, ఇంటర్నెట్, సినిమాల లాంటి ఆధునిక మాధ్యమాలెన్ని వచ్చినా అవి వాచకపు మారు రూపాలే గానీ, వాచకపు ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు. యిప్పుడు ప్రపంచంలో వున్న సర్వ అమానవీయ రుగ్మతలకూ వున్న ఏకైక ఔషధం పుస్తకం ఒక్కటే! యిన్ని విపత్కర పరిస్థితులలోనూ సా హిత్యాన్ని నిష్కామకర్మగా భావించే రచయితలిందరుండడం తెలుగు వాళ్ళు గర్వించవలసిన విషయం. అయితే వాళ్ల మాటల్ని వినే పాఠకలోక మొకటి బలపడకపోతే, అది అరణ్య రోదనమే అవుతుంది. పుస్తకాలు చదవడమనే ఈ పనిని స్వయంగా రచయితలూ, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ బలంగా కొనసాగించినప్పుడే పిల్లలూ, వి ద్యార్థులూ పాఠకులుగా ఎదుతారు. తెలుగువాళ్లిప్పుడు మిగిలిన భా షల వాళ్ళ నుంచీ నేర్చుకుని, తమను తాము నాగరికులమని అవసరం అత్యవసరమైంది. - మధురాంతకం నరేంద్ర  

మన తెలంగాణ 23 Mar 2026 9:31 am

Tirumala : సోమవారం కూడా తిరుమల కిటకిట

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:25 am

Ustaad Bhagat Singh: Why Outright Rejection?

Pawan Kalyan’s recent offering Ustaad Bhagat Singh has turned out to be a big shock for the audience, fans and the film industry. After being released during Ugadi holiday season, Ustaad Bhagat Singh failed to register minimum numbers and the film was badly rejected. What really happened? Pawan Kalyan: The actor has sent clear signs […] The post Ustaad Bhagat Singh: Why Outright Rejection? appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 9:20 am

అక్రమ అరెస్టులతో ఆపలేరు..

అక్రమ అరెస్టులతో ఆపలేరు.. చిట్యాల, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు

ప్రభ న్యూస్ 23 Mar 2026 9:18 am

20 సార్లు మటన్ ఉడికించిన ఉడకలేదు సర్... కేసు నమోదు చేయండి

అమరావతి: మటన్ ఉడక లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. ఉగాది సందర్భంగా సోడాల హాజీ అనే వ్యక్తి కిలో మేక తలకాయ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లిన తరువాత కుక్కర్ లో వేసి ఉడికించాడు. 20 సార్లు ఉడికించినా ఉడకకపోవడంతో మటన్ గిన్నెతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మటన్ అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాడు. పోలీసులు అతడికి సర్ది చెప్పి పంపించారు. అనంతరం హాజీ మటన్ అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్లి గొడవకు దిగాడు. తన గిరాకీకి ఎసరు పెట్టేటట్లు ఉన్నాడని తల కాయ కూరకు బదులుగా కిలో మటన్ ఇచ్చి అతడిని మాంసపు వ్యాపారి పంపించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మన తెలంగాణ 23 Mar 2026 9:17 am

బీజేపీ నాయకులు అరెస్ట్.. ఎందుకంటే..

బీజేపీ నాయకులు అరెస్ట్.. ఎందుకంటే.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 23 Mar 2026 9:08 am

Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ విడుదలయింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:02 am

మత్స్యకారుల నేత చెన్ను గురుమూర్తి మృతి..

మత్స్యకారుల నేత చెన్ను గురుమూర్తి మృతి.. అవనిగడ్డ, ఆంధ్రప్రభ : జాతీయ మత్స్యకారుల

ప్రభ న్యూస్ 23 Mar 2026 8:53 am

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:49 am

కన్న కొడుకే… కాటికి పంపాడు..

కన్న కొడుకే…కాటికి పంపాడు.. అవుకు రూరల్, ఆంధ్రప్రభ : కుమారుడు కాదు.. తల్లిదండ్రుల

ప్రభ న్యూస్ 23 Mar 2026 8:45 am

Positive response for Guvvala Cheruvu Ghat & Kiran Abbavaram’s OTT Entry

The recently released glimpse of Guvvala Cheruvu Ghat has garnered strong and largely positive attention across digital platforms, setting the tone for what could be one of the most intriguing Telugu OTT debuts in recent times. Viewers and netizens have particularly appreciated the raw, rustic visuals and grounded setting, which hint at a gritty, rooted […] The post Positive response for Guvvala Cheruvu Ghat & Kiran Abbavaram’s OTT Entry appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 8:45 am

Gold Prices Today : గుడ్ న్యూస్...బంగారం లక్షకు దిగి వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే?

ఈరోజు దేశంలో బంగారం ధర తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:39 am

Andhra Pradesh : ఏపీఐఐసీ భూముల విషయంలో కీలక నిర్ణయం

ఏపీఐఐసీ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:19 am

Weekend Box-office: Dhurandhar overshines UBS

It is a surprising weekend for Telugu cinema during the Ugadi weekend. Pawan Kalyan’s Ustaad Bhagat Singh and Bollywood film Dhurandhar: The Revenge released across the globe. Ustaad Bhagat Singh was preponed by a week to take the advantage of Ugadi weekend but the film has been badly rejected by the audience. The biggest surprise […] The post Weekend Box-office: Dhurandhar overshines UBS appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 8:19 am

Andhra Pradesh : ఏపీలో రేషన్ షాపుల్లో కిరోసిన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:13 am

33 కేవీ వోల్టేజ్ బూస్టర్ ఏర్పాటు..

33 కేవీ వోల్టేజ్ బూస్టర్ ఏర్పాటు.. ఆళ్లపల్లి/ గుండాల, ఆంధ్రప్రభ : ఉమ్మడి

ప్రభ న్యూస్ 23 Mar 2026 8:10 am

ఔటర్ రింగ్ రోడ్ పై డిసిఎంను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిఎస్ పిఎ సమీపంలో ముందుగా వెళ్తున్న డిసిఎంను కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రోడ్డుపై ప్రమాదం జరగడంతో ఔటర్ రింగ్ రోడ్ పై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపు నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా  స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. 

మన తెలంగాణ 23 Mar 2026 8:05 am

ఫ్యాక్ట్ చెక్: హాంగ్ కాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడిగా ప్రచారం చేస్తున్నారు

ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసిన వీడియో ఇది. వైరల్ వీడియోకు ఇజ్రాయెల్ కు ఎలాంటి సంబంధం లేదు. హాంగ్ కాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడిగా ప్రచారం చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:02 am

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభృద్ధిలో నేడు అతి పెద్ద పెట్టుబడి

ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి రానుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:01 am

బంజారా సంస్కృతికి ప్రతీకగా మహోత్సవ వేడుకలు..

బంజారా సంస్కృతికి ప్రతీకగా మహోత్సవ వేడుకలు.. నల్లబెల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ ఉమ్మడి

ప్రభ న్యూస్ 23 Mar 2026 7:58 am

ఫ్యాక్ట్ చెక్: ఉచితంగా ప్రధానమంత్రి వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉన్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు

ఉచితంగా ప్రధానమంత్రి వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉన్నారనే వాదనలో

తెలుగు పోస్ట్ 23 Mar 2026 7:44 am

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్..

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్.. ఊర్కొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 23 Mar 2026 7:42 am

Iran - Israel War : నాలుగో వారంలోనూ కొనసాగుతున్న యుద్ధం

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమయింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 7:42 am

Sudan : సూడాన్ యుద్ధం మరింత తీవ్రం.. ఆసుపత్రిపై దాడిలో 64 మంది మృతి

సూడాన్ పశ్చిమ దార్ఫూర్‌ ప్రాంతంలో గత వారం ఆసుపత్రిపై జరిగిన దాడిలో కనీసం 64 మంది ప్రాణాలు కోల్పోయారు

తెలుగు పోస్ట్ 23 Mar 2026 7:26 am

Chandrababu Naidu Unveils Vision to Build Amaravati Beyond Hyderabad

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has outlined an ambitious plan to develop Amaravati into a world-class city that can surpass Hyderabad. Speaking at the South Asia Learning Summit at ISB in Gachibowli, he presented a clear roadmap focused on technology, infrastructure, and long-term growth. Naidu expressed concern over the neglect of Amaravati during the […] The post Chandrababu Naidu Unveils Vision to Build Amaravati Beyond Hyderabad appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 7:25 am

Biker Will Be Of Hollywood Standards: Sharwa

Charming Star Sharwa’s upcoming sports–family drama Biker is already creating ripples nationwide, with its theatrical trailer drawing great applause for its scale, emotion, and technical brilliance. At the trailer launch, director Abhilash Reddy shared his excitement over the overwhelming response. He revealed that the film spans two distinct timelines. “Every race has an emotion. Every […] The post Biker Will Be Of Hollywood Standards: Sharwa appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 7:22 am

బీజేపీ నాయకుల బైండోవర్..

బీజేపీ నాయకుల బైండోవర్.. చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ

ప్రభ న్యూస్ 23 Mar 2026 7:00 am

రైతు భరోసా నిధులు విడుదల... నేడు రైతుల ఖాతాల్లో జమ

తొలిరోజు రూ.3,446 కోట్లు 68.90 లక్షల మంది రైతులకు లబ్ధి నర్మెట్ట వేదికగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 20 రోజుల్లో రెండో విడత రైతు భరోసా ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు ఆదివారం విడుదలయ్యాయి. రైతు భరోసా పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సుమారు 70 లక్షల మందికి పైగా రైతు భరోసా ద్వారా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. దీని కోసం తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. ఆదివారం మొదటి దశలో భాగంగా ఎకరం వ్యవసాయ భూమి విస్తీర్ణం కలిగిన 57,44,907 ఎకరాలకు 68,89,955 మంది రైతులకు రూ. 3,446.94 కోట్లు విడుదల చేసింది. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ నిధులు సోమవారం రైతుల బ్యాంకుల ఖాతాలకు చేరనున్నాయి. రెండో విడతగా 20 రోజుల్లో రూ.2,650 కోట్లు, తర్వాత మూడో విడతగా రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు వ్యవ0సాయ భూమి ఉంది. మిగిలిన 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ క్రమంలో మొదటి విడతలో ఎకరం భూమి కలిగిన 24.32 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో 30 రకాల పంటలను పండిస్తున్నారు. వీటిని 2.14 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 1.28 కోట్ల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి ప్రధాన పంటలుగా వేస్తున్నారు. తర్వాత స్థానాల్లో మొక్కజొన్న, కందులు, సోయాబీన్ ఉన్నాయి. నాలుగవ విడతలో తొమ్మిది వేల కోట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. తాజాగా రైతుభరోసా నాలుగో సీజన్‌కు నిధులు రైతులకు అందనున్నాయి. ప్రభుత్వం 2023, -24 యాసంగి సీజన్లో ఎకరానికి ఐదు వేల చొప్పున రూ.7,625 కోట్లు జమ చేయగా, 2024, -25 యాసంగి సీజన్లో ఐదు వేల చొప్పున రూ.5,057 కోట్లు, 2025-,26 వానాకాలం సీజన్‌లో ఎకరానికి సాయాన్ని ఆరు వేలకు పెంచి 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లను జమ చేసింది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు దశల వారీగా నిధులు విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతుల భరోసా పథకంలో అత్యధికంగా నల్గొండ జిల్లా 5,22,313 రైతులకు రూ. 268.57 కోట్లు, ఖమ్మం జిల్లా 3,35,377 మంది రైతులకు రూ. 169.51 కోట్లు ఉండగా, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 24,935 మంది రైతులకు రూ. 10.43 కోట్లు, ములుగు 79,040 రైతులకు రూ. 40.98 కోట్లు అత్యల్పంగా రైతు భరోసా నిధులు విడుదలయిన జిల్లాలుగా ఉన్నాయి.

మన తెలంగాణ 23 Mar 2026 7:00 am

పంటల మార్పిడి చేద్దాం

వరి సాగుతోనే సమస్యలు పరిష్కారం కావు రైతులు వాణిజ్య పంటల వైపు మళ్లాలి  నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు ఇబ్బందులున్నా రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అన్ని గ్రామాలు అంకాపూర్‌లా మారాలి ప్రతి నెలా రైతాంగంపై రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం రూ.9వేల కోట్ల రైతుభరోసా నిధులు 45రోజుల్లో ఖాతాల్లో వేస్తాం కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్షం ఏ నియోజకవర్గంపైనా వివక్ష లేదు.. అన్నీ సమానమే యుద్ధం నేపథ్యంలో యూరియా కొరత తలెత్తే అవకాశం రామగుండంలో ఉత్పత్తి అవుతున్నదంతా తెలంగాణకే కేటాయించాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేద్దాం కొడంగల్‌లోనూ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి సూచన మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రైతును రా జుగా చేసేంతవరకు విశ్రమించేది లేదని, వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మె ట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఆయన ప్రారంభించి అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించా రు. 114 నెలల కేసీఆర్ పాలనలో రైతుల కోసం సుమారు రూ.2533 కోట్లు ఖర్చు చేస్తే, ప్రజా పాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 28 నెలల్లో రూ.5500 కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసిందన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని స్ప ష్టం చేశారు. వ్యవసాయ రంగంలో మార్పు రా వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొద టి స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుందన్నారు. మిగతా ధాన్యం ఎగుమతి చేయలేక ఉండే పరిస్థితి నెలకొందన్నారు .అయినా రైతులు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. వరి పంట సాగు ఒక్కటే మన సమస్యలకు పరిష్కారం కాదని పంటల మార్పు జరిగితే ఇంకా ఎంతో లాభాలు వస్తాయన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని దీన్ని కాస్త పది లక్షల ఎకరాల్లో సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే మిల్లెట్స్‌తో పాటు రకరకాల పండ్ల సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పంటలు మన రాష్ట్రంలో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. పంట మార్పిడి చేసిన రైతులకు ప్రభుత్వపరంగా అన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. పంట మార్పిడి చేస్తే నష్టం వాటిల్లుతుందన్న అపోహ వీడాలన్నారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయాన రైతు అని అందుకే ఆయనకు రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి లాభసాటి వ్యవసాయంపై ఆలోచనలు చేద్దామన్నారు. వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే మరో రూపాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చి రైతులకు లాభం చేస్తామన్నారు. సిద్దిపేట నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తరహాలో కొడంగల్ లో సైతం నిర్మించే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు అమాయకులని ఇప్పుడిప్పుడే మా ప్రాంతాన్నీ అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ అన్ని రకాల సాగుకు అనుకూలమన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు 45 రోజుల్లో 9,000 కోట్ల డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత 3600 కోట్ల రూపాయల నిధులను సిద్దిపేట గడ్డ నుంచే విడుదల చేశామన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే భూ నిర్వాసితులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఇలా కాకుండా తన కొడంగల్ నియోజకవర్గంలోని భూ నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు పూర్తిస్థాయి పరిహారాన్ని చెల్లించి భూమిని సేకరించామన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణ సమయంలో నిర్వాసితులకు న్యాయం జరగాలని తానే 48 గంటలు దీక్ష చేశానని గుర్తు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంపై ఎలాంటి వివక్ష లేదు.. సిద్దిపేట నియోజకవర్గంపై తాను వివక్ష చూపుతున్నానని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయంగా మా మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై వివక్ష లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలతో సమానంగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గం చూస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల తరహాలోనే ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు .2014 నుంచి 2024 వరకు బిఆర్‌ఎస్ హయాంలో కొడంగల్ కు అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో పూర్తి లెక్కలు తీద్దామా అని ప్రశ్నించారు. మీ తరహాలో నేను వివక్ష చూపలేనని అలాంటి తత్వం తనది కాదని స్పష్టం చేశారు.ఇన్ని సంవత్సరాలు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇచ్చారనీ 2029లో మా కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇచ్చి గెలిపించాలన్నారు.సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోనీ ప్రతి గ్రామం అంకాపూర్ల మారాలని ఆయన పేర్కొన్నారు. అంకాపూర్ గ్రామంలో అన్ని రకాల పంటలు సాగు చేస్తారనీ ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. అంకాపూర్ లా ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కోటి మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం.. రాష్ట్రంలోని కోటి మహిళలను కోటేశ్వరులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికీ స్వయం సహాయక సంఘాల్లోఇప్పటికీ 67 లక్షల మంది మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారని వీరి సంఖ్య కోటి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యమే కల్పించడమే కాకుండా వెయ్యి బస్సులకు యజమానులుగా మార్చామన్నారు. అలాగే పెట్రోల్ పంపు నిర్వహణ కూడా మహిళ సంఘాలకు అందించామన్నారు.ఆర్టీసీ నష్టాల్లో ఉంటే ఉచిత బస్సు పథకాన్ని తీసుకువచ్చి లాభంలోకి తీసుకువచ్చామన్నారు. ఇప్పటికే ఉచిత ప్రయాణం కింద 9,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ మహిళలు అదాని,అంబానీలకు దీటుగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. మహిళల ప్రాతిపదికనా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అందులోని భాగంగా ఏ పథకం ప్రవేశపెట్టిన మహిళల పేరు మీదనే అందిస్తున్నామన్నారు. మహిళలందరూ ఆర్థికంగా స్వయం శక్తితో నిలబడాలన్నదే తన లక్ష్యమన్నారు. మహిళలందరికీ ఒక అన్నగా అహర్నిశలు శ్రమిస్తానని ఉద్గాటించారు. రామగుండం యూరియా ఉత్పత్తి తెలంగాణకే కేటాయించాలి రామగుండంలోని న్యూరో ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇరాన్ ,ఇజ్రాయిల్, అమెరికా మధ్యలో యుద్ధం జరుగుతుందన్న గ్యాస్ ,ఆయిల్ లాంటి సమస్యలు పెరగవచ్చు అన్నారు. ఇందులో భాగంగానే యూరియా సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం నుంచి బిజెపి కేంద్ర మంత్రులతో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని మంత్రులంతా బృందంగా ఏర్పడి ఢిల్లీ వెళ్లి యూరియా అత్యధికంగా వచ్చేలా చర్చించాలన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేద్దామని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమ లక్ష్యంగా కలిసి పనిచేద్దామని అన్ని పార్టీలకు సూచించారు. దేశ ప్రధాని మోడీ అభివృద్ధి పనుల కోసం రాష్ట్రానికి వస్తే తాను వెళ్తానని అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు. పేద ప్రజలపై ముసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలు మూసి పేద ప్రజలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలపై ప్రతిపక్షం పగతో వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డం పడుకుంటామంటే ఆగేది లేదని వారిని దాటుకుంటా వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు... రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని విద్యాలయాల్లో నర్సరీని ప్రారంభిస్తున్నామన్నారు. విద్యార్థులకు నిత్యం పాలు, రాగి జావా తో పాటు బ్రేక్ ఫాస్ట్ మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల మోజులో పడవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన, ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఏ టి సి సెంటర్లలో శిక్షణ పొందే విద్యార్థులకు నెలకు రెండు వేల చొప్పున అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. కాలానికి అనుకూలంగా మార్పులు వస్తున్నాయన్నారు. కులాలకు అతీతంగా ఒకరి వృత్తి పనులను మరొకరు చేస్తూ అత్యధిక ఆదాయం పొందుతున్నారన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన రైతు మేళా స్టాళ్లను పరిశీలించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహ, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావు లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య యాదవ్,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణారావు, నవీన్ యాదవ్, తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ హైమావతి తో పాటు వివిధ శాఖల ఉన్నత అధికారులు,ప్రజలు పాల్గొన్నారు

మన తెలంగాణ 23 Mar 2026 6:30 am

నేటి నుంచి పద్దులపై చర్చ

వాడీవేడిగా సాగనున్న అసెంబ్లీ సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం భేటీ ఫ్రొఫెసర్ కోదండరామ్, అజహరుద్దీన్‌ల ఎంఎల్‌సి ఎన్నిక అంశంపై చర్చ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం (23) నుం చి బడ్జెట్‌పై చర్చ ప్రారంభంకానున్నది. వివిధ శాఖల పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ నె ల 20వ తేదీన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా, అదే సమయంలో కౌన్సిల్‌లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం ప్ర వేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, సోమవా రం నుంచి ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చ ప్రా రంభమవుతుంది. అంతకుముందు యధావిధిగా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. బడ్జెట్ పై 30న అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదిస్తాయి. ఇదిలాఉండగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ (2018-2019)కు సంబంధించిన ఐదవ వార్షిక నివేదికను సభ ముందు ఉంచుతారు. ఇంకా రాష్ట్ర వై ద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వై ద్య విధాన పరిషత్‌కు సంబంధించిన సవరణ బిల్లు- 2026ను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (రెగ్యులేషన్ ఆఫ్ అప్పాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్)కు సంబంధించి (మూడవ సవరణ) బిల్లును సభ ఆమోదం కోసం ప్రవేశపెడతారు. నేడు సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీ కమిటీహాల్ మంత్రివర్గ సమావేశం నేడు సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీ కమిటీహాల్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై కీలక చర్చ జరుగనుంది. ఎమ్మెలీగా అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించడం గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అజహరుద్దీన్ మంత్రిగా అక్టోబర్ 31వ తేదీ 2025లో బాధ్యతలు స్వీకరించి ఏప్రిల్ 30వ తేదీకి ఆరునెలలు పూర్తికానున్న నేపథ్యంలో ఈ అంశం గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. దీంతోపాటు కోదండరాం, అజహరుద్దీన్‌ల ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన అంశం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ ఉండడం దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న అంశాన్ని చర్చించనున్నట్టుగా సమాచారం. గవర్నర్‌ను మరోసారి కలిసి ఈ విషయమై విన్నవించే అంశాన్ని కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అసెంబ్లీలో కొన్ని బిల్లులను ఆమోదించుకోవాల్సి ఉన్నందున వాటిపై కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించుకునే అవకాశం ఉందని సమాచారం.

మన తెలంగాణ 23 Mar 2026 6:20 am

విస్తరణా.. ప్రక్షాళనా?

 ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీతో పాటు కేబినెట్‌లో మార్పులపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత ముహూర్తం ఇద్దరిపై వేటు వేసే అవకాశం అదే సామాజికవర్గాలతో తిరిగి భర్తీ చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులకూ నియామకాలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మం త్రివర్గ విస్తరణపై కొందరు ఎమ్మెల్యేలు ఆశ లు పెట్టుకోగా, కేబినెట్ విస్తరణ కంటే ప్రక్షాళన పేరు వింటేనే కొందరు మంత్రులు భ యపడుతున్నట్టుగా సమాచారం. కొత్తగా మంత్రివర్గంలో వచ్చేది ఎవరూ? పోయేది ఎవరన్న దానిపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జోరు గా చర్చ మొదలయ్యింది. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటడం, ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల పైచిలుకు మిగిలి ఉండడంతో మిగిలిన రెండు మంత్రి పదవులను భర్తీ చేసి, పనితీరు మార్చుకోని మంత్రులను తప్పించి, మరికొందరు మంత్రుల శాఖలను మార్చాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే, పదవుల భర్తీ లో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వాటిని భర్తీ చేసే అవకాశం ఉందని తెలిసిం ది. ఎవరిని తొలగిస్తున్నారో అదే సామాజిక వర్గ నేతతో మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్టుగా సమాచారం. దీంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేసే అవకాశం ఉందని తెలిసింది. సీడబ్ల్యూసీ, ఏఐసిసి పదవులు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో ఇప్పటికే సిఎం రేవంత్‌రెడ్డి హైకమాండ్‌తో పలుమార్లు చర్చించడంతో అధిష్టానం మార్పులు, చేర్పులపై కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రుల్లో ఇద్దరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకురావాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. తప్పించిన ఇద్దరికి పార్టీ పదవులు (సీడబ్ల్యూసీ, ఏఐసిసి) పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయా మంత్రులకు ఇప్పటికే పార్టీ హైకమాండ్ సంకేతాలు ఇచ్చిందని, దీనికి సంబంధించి ఆ నేతలు కూడా సానుకూలంగా అంగీకరించినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలు, ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఈ మంత్రివర్గ విస్తరణలో చాన్స్ దక్కుతుందని, అందులో భాగంగానే కూడికలు, తీసివేతలు ఉంటాయని, మరికొందరి శాఖల్లో పదోన్నతులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, మైనార్టీ శాఖ మంత్రి అజహరుద్దీన్ భవితవ్యంపై గందరగోళం నెలకొనడంతో ఈ విషయమై త్వరలో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేసేందుకు ఆయా జిల్లాల ప్రాతినిథ్యం, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టుగా సమాచారం. కేబినెట్ విస్తరణపై పార్టీలో అంతర్గత వివాదాలు రాకుండా ఉండేందుకు అధిష్టానం పక్కాగా ప్రణాళికలు వేసిందని తప్పించిన మంత్రుల స్థానాలను అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనే భర్తీ చేస్తేనే తగిన న్యాయం జరుగుతుందని అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక, మంత్రివర్గ విస్తరణలో బిసి, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలిసింది. బిసిల్లో సంఖ్యాబలం ఎక్కువ ఉన్న మున్నూరు కాపులు, ఎస్టీల్లో ఎక్కువ జనాభా ఉన్న లంబాడీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు సైతం కేబినెట్‌లో మార్పుల సందర్భంగానే చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ, మండలి విప్‌ల నియామకాలు ఇటీవలే చేపట్టినా చీఫ్ విప్ నియామకాలను మాత్రం వాయిదా వేసినట్లుగా చర్చ జరుగుతోంది. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులకు కేబినెట్ హోదా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా వాటిని కూడా భర్తీ చేస్తారన్న ప్రచారం జరుగు తోంది. మంత్రి పదవి రాని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నట్టు గతేడాది జూన్‌లో ప్రకటించినా ఆయన ఈ పదవిపై అయిష్టత వ్యక్తం చేయడంతో ఆయనకు మంత్రి ఇస్తారా లేదా అన్న త్వరలోనే తేలనుంది. దీంతోపాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, వీరితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్‌లకు మున్సిపల్, విద్యా శాఖలు చాలా మంది ఎమ్మెల్యేలు తమకు మంత్రి ఇవ్వాలని లాబీయింగ్ చేస్తుండగా, ఎక్కడ తమ పదవులు పోతా యోనని ఇప్పుడు కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులు టెన్షన్ పడుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సిఎం వద్ద మున్సిపల్, విద్యా, హోంశాఖలు ఉన్నాయి. మరో ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకొని సిఎం దగ్గర విద్యా, మున్సిపల్, హోంశాఖలను సీనియర్‌లకు కేటాయించి సీనియర్‌ల దగ్గర ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. జీహెచ్‌ఎంసి ఎన్నికలు జూలై లోపు ఉండే అవకాశం ఉండడంతో ఆలోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మన తెలంగాణ 23 Mar 2026 6:00 am

23rdMarch2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

23rdMarch2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 23rdMarch2026 |

ప్రభ న్యూస్ 23 Mar 2026 6:00 am

23rdMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

23rdMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 23rdMarchCartoon | అంతర్జాతీయ పరిణామాలు

ప్రభ న్యూస్ 23 Mar 2026 6:00 am

25న కాంగ్రెస్‌ను వీడుతున్నా

 జగిత్యాలతో నా అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరు నా విషయంలో రాష్ట్ర నాయకత్వం చొరవ చూపకుండా అధిష్ఠానంపై నెట్టివేసింది: జీవన్‌రెడ్డి మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 25న స్థానిక బండారి గార్డెన్‌లో తన అనుచరులు, అభిమానులు, రాజకీయ సహచరులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి రాజీనామా చేస్తానని, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవడం కొంత బాధగా ఉన్న పార్టీనీ వీడక తప్పడం లేదన్నారు. గత 20 మాసాల నుంచి జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగాలా... వద్దా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందన్నారు. నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి నేటి వరకు పదవి ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా రూ. 5 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి జగిత్యాలలో అమలు చేయకపోవడంతో రైతులకు ప్రోత్సాహం అందించాలని మంత్రిగా ఉండి కూడా రైతుల పక్షాన నిలిచి ధర్నా చేశానని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీ అంతర్గత వ్యవహరాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని సూచించినా పార్టీ పెద్దలెవరూ పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా గత దశాబ్దకాలంగా పని చేసి అధికారం వచ్చిన తర్వాత మా హక్కులు కాలరాస్తుంటే ఎంత కాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం చేయడమే గౌరవం కోసమని, ఆ గౌరవమే లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వీడోద్దని కోరేందుకు వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబుకు నా పరిస్థితి వివరించిన తర్వాత ఆయన కూడా సమాధానం చెప్పలేకపోయారన్నారు. ప్రత్యర్థి పై పోరాటం చేయడం సహజం కానీ, సొంత పార్టీపై పోరాటం చేయడం ఎంత బాధకరమో అనుభవించిన వారికి తెలుస్తుందన్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో నేను ప్రతిపాదించిన వారికి టిక్కెట్లు వచ్చిన వారికి ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయానని అన్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగటం సరి కాదని, అందుకే పార్టీ నుంచి వైదొలగాలనే అభిప్రాయానికి వచ్చానన్నారు. నా విషయంలో రాష్ట్ర నాయకత్వం చొరవ చూపకుండా పార్టీ అధిష్టానంపై నెట్టివేస్తున్నారన్నారు. నాకు పార్టీలో అన్యాయం జరగడంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పాత్ర కూడా ఉందన్నారు. రాష్రంలో జరిగిన పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రభావం తప్పక చూపుతుందన్నారు. ఎంఎల్‌సిగా కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా శాసన మండలిలో ఒంటరి పోరాటం చేశానని, రేవంత్ రెడ్డి కేబినేట్‌లో మంత్రి పదవి పొందేందుకు నాకు అన్ని విధాల అర్హత ఉందని, అయినా నాకు ఇవ్వకుండా మొండి చేయి చూపారన్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలాగా నేను నా స్థాయిలో పోరాటం చేశానని, అయినా నాకు పదవి ఇవ్వకుండా పక్కన బెట్టి నా సంయమనాన్ని పరీక్షించారన్నారు. ప్రజాస్వామ్యంలో నా స్వేచ్చకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు. జగిత్యాలతో నా అనుబంధం ఎవరూ తెంచలేరని, నా చివరి శ్వాస వరకు జగిత్యాలతో నా అనుబంధం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు దుర్గయ్య, రాధాకిషన్‌రావు, పుప్పాల అశోక్, సురేందర్, నేహాల్, దామోదర్‌రెడ్డి, రాంచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మన తెలంగాణ 23 Mar 2026 5:30 am

బిల్డర్లకు శుభవార్త!

 భవన నిర్మాణ నిబంధనల్లో సవరణలు జీఓ 95 ద్వారా కొత్త మార్గనిర్దేశక సూత్రాలు టిడిఆర్‌ల ద్వారా అదనపు అంతస్థులు హైరైజ్డ్ భవనాల్లో టిడిఆర్‌లు తప్పనిసరి సెట్ బ్యాక్‌లలో వెసులుబాటు మన తెలంగాణ/సిటీబ్యూరో: భవన నిర్మాణదారు ల (బిల్డర్లు)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిం ది. ఇక ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టిడిఆర్)లతో సెట్‌బ్యాక్‌ల్లో మార్పులు లేకుండానే అదనపు అంతస్థుల నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగాన్ని మరింత పురోగతి వైపు నడిపించేందుకు, హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు టిడిఆర్‌ల వినియోగంపై ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ భవన ని ర్మాణ నిబంధనలు 2012, జీఓ నెం. 168’కు కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాల న, పట్టణాభివృద్ధి (ఎంఏ, యుడి) విభాగం తాజా గా జీవో నెం. 95ను విడుదల చేసింది. తాజా మా ర్పులతో హై-రైజ్డ్ భవనాల నిర్మాణాలకు అదనంగా మరో అంతస్థు కలిసిరానున్నది. అనుమతి పొంది న భవన నిర్మాణపు సెట్ బ్యాక్‌లతోనే మరో అదనపు అంతస్థును నిర్మించుకునే సౌలభ్యాన్ని ప్రభు త్వం కల్పించింది. ముఖ్యంగా టీడీఆర్ వినియో గం, అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్‌బ్యాక్‌ల సడలింపులపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. వెసులుబాటు.. జీఓ 95 ద్వారా వెలువరించిన తాజా మార్గనిర్దేశకాల ప్రకారం, టిడిఆర్‌తో నిర్మించిన హైరైజ్‌డు భ వనాల్లో చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ గదులు, వాటర్ ట్యాంకులకు మినహాయింపునిచ్చింది. పారిశ్రామిక ప్రాం తాల్లోని భవనాలు, వాస్తుకోసం భవనాల్లో వాటర్ ట్యాంక్‌లను కూడా పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం వెసులబాటు కల్పించింది. దీంతో భవనం ఎత్తు పెరిగినా, అనుమతుల ప్రక్రియలో బిల్డర్లకు సెట్‌బ్యాక్‌లను వదలడంతో కొంత మినహాయింపు లభించనుంది. 2000 చ.మీ.లకు పైగా ఉన్న ప్లాట్లకు 40 అడుగుల రోడ్డు ఉన్నప్పటికీ టిడిఆర్‌ల ద్వారా 3 అదనపు అంతస్థులకు అనుమతి లభిస్తుంది. ఇదే విస్తీర్ణంలోని ప్లాట్‌లో రోడ్డు వెడల్పు 60 అడుగులుగా ఉంటే టిడిఆర్ ద్వారా 4 అంతస్థులు, 80 అడుగులు రోడ్డు ఉంటే 5 అదనపు అంతస్థులను అనుమతించడం జరుగుతుంది. కానీ, ఫైర్, ఏయిర్‌పోర్టు ఎన్‌ఓసిలతో పాటు ఇతర నియమాలను పాటించాలని సూచించింది. హైరైజ్డ్ కానీ భవన నిర్మాణాలు టిడిఆర్‌ను వినియోగించిన సందర్భంలో కనీస సెట్‌బ్యాక్‌లను పాటించాలని స్పష్టంచేసింది.టిడిఆర్‌ను వినియోగించి నిర్మించే హైరైజ్‌డు భవనాలకు సెట్‌బ్యాక్‌ల విషయంలో వెసులుబాటు కల్పించింది. రోడ్డు విస్తరణలో భూమిని కోల్పోయిన ప్రాంతంలో కనీసంగా సెట్ బ్యాక్‌లను పాటించాలని స్పష్టం చేసింది. టిడిఆర్ తప్పనిసరి.. 750 చ.మీ.ల నుండి 2000 చ.మీ.లలో నిర్మించే భవనాలు 18 మీ.ల నుండి 21 మీ.ల ఎత్తులో నిర్మించే భవనాలు టిడిఆర్‌ను వినియోగించడం తప్పనిసరి చేసింది. వీటిలో పార్కింగ్‌తో పాటు ఇతర నియమాలను కూడా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక వేళ మాస్టర్‌ప్లాన్ రోడ్‌ను తొలగించినా, రోడ్‌ను తగ్గించినా, సవరించినా.. భవన నిర్మాణ దరఖాస్తుదారులు డెవలప్‌మెంట్ చార్జీలను చెల్లించడంగానీ, ఈ చార్జీలకు సరిపోవు టిడిఆర్‌లను సమర్పించే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. 10 అంతస్థుల నుండి 20 అంతస్థుల భవన నిర్మాణాలలో 10వ అంతస్థు తర్వాత బిల్టప్ ఏరియాలో 3శాతం బిల్టప్ ఏరియాను టిడిఆర్‌ల ద్వారా నిర్మాణం చేయాలని షరతును విధించింది. హైరైజ్డ్ భవనాల కేటగిరీలోని 20 అంతస్థులకు పైబడి నిర్మిస్తున్న భవనాలలో 5 శాతం బిల్టప్ ఏరియా టిడిఆర్ వినియోగంతో చేపట్టాలని నిర్దేశించింది. ఈతరహా హైరైజ్డ్ భవన నిర్మాణాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పుడు 50% టిడిఆర్‌ను జతపరచాలి. మిగతా 50% టిడిఆర్ ఈ భవనపు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకునే సమయంలో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.

మన తెలంగాణ 23 Mar 2026 5:00 am

ప్రధాని మోడీ జీవితం... ప్రజా సేవకే అంకితం

సిఎంగా, ప్రధానిగా 8,931 రోజుల చారిత్రాత్మక మైలురాయి దాటిందన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మన తెలంగాణ/హైదరాబాద్‌ః సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పావన్ కుమార్ చామ్లింగ్ రికార్డును ప్రధాని నరేంద్ర మోడీ అధిగమించి సిఎంగా, ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ప్రధాని మోడీ జీవితం, ప్రజలకే అంకితమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో అత్యంత కాలం పాటు ప్రభుత్వాధినేతగా సేవలందించిన నాయకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. తొలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధానిగా మొత్తం 8,931 రోజుల పాటు ప్రజాసేవలో కొనసాగుతున్న మోడీ ప్రయాణం అంకితభావం, క్రమశిక్షణ, దేశం పట్ల నిస్వార్థ సేవకు ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన వివరించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే భావనతో దేశానికి దిశానిర్దేశం చేశారని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా వచ్చిన విజయాలు, ప్రజా మద్దతు, నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోందని ఆయన తెలిపారు. 24 ఏళ్ళలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా దేశ సేవలో నిరంతరం పని చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనమని, ముఖ్యంగా యువతకు ఆయన జీవితం ఒక ప్రేరణ అని ఆయన పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్న ప్రధాని మోడీ ప్రయాణం దేశ ప్రజాస్వామ్య శక్తికి ఒక గొప్ప ఉదాహరణ అని రాంచందర్ రావు పేర్కొన్నారు.

మన తెలంగాణ 23 Mar 2026 4:30 am

25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా

` పార్టీలో ఇక కొనసాగలేను: జీవన్‌రెడ్డి ` నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు,మార్గదర్శనం కావాలని కార్యకర్తలను కోరిన సీనియర్ కాంగ్రెస్ నేత జగిత్యాల(జనంసాక్షి): కాంగ్రెస్‌లో కొనసాగలేనంటూ …

జనం సాక్షి 23 Mar 2026 3:54 am

భారత్ చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక

` తీరనున్న ఎల్‌పీజీ కొరత ` రష్యాకు చెందిన చమురు నౌక కూడా భారత సముద్రజలాల్లోకి ప్రవేశం న్యూఢిల్లీ(జనంసాక్షి):పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు, ఎల్‌పీజీ సరఫరా గొలుసుకు …

జనం సాక్షి 23 Mar 2026 3:53 am

ప్రపంచం కోసమే ఇరాన్‌తో యుద్ధం

` అమెరికా కలిసి పోరాడుతున్నాం: నెతన్యాహు ` 48 గంటల్లో పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిందని విమర్శలు టెలఅవీవ్(జనంసాక్షి):యావత్ ప్రపంచం కోసం అమెరికా`ఇజ్రాయెల్‌లు కలిసి …

జనం సాక్షి 23 Mar 2026 3:52 am

తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్

` అమెరికాకు ముచ్చెమటలు ` ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా.. విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ ` డిమోనా నగరాన్ని తాకిన ఇరాన్ క్షిపణులు ` హర్మూజ్‌కు బ్రిటన్ …

జనం సాక్షి 23 Mar 2026 3:52 am

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭିଡିଓଟି ଦିଲ୍ଲୀର ଅଟେ, ଯେଉଁଥିରେ ଇରାନ ସୁପ୍ରିମ ଲିଡରଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ଶାନ୍ତିପୂର୍ଣ୍ଣ ଭାବେ ବିରୋଧ ପ୍ରଦର୍ଶନ ହୋଇଥିଲା

ସୋସିଆଲ ମିଡିଆରେ ଏକ ଭିଡିଓ ଏବେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ କଳା ପୋଷାକ ପିନ୍ଧିଥିବା ଲୋକମାନେ ସ୍ଲୋଗାନ ଦେଉଥିବାରଦେଖା ଯାଇଛି । ଉକ୍ତ ଭିଡିଓକୁ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଦାବି କରିଛନ୍ତି, ଭାରତର ଦିଲ୍ଲୀରେ, ଇସ୍ରାଏଲୀ ଦୂତାବାସ ବାହାରେ ପ୍ରତିବାଦକାରୀ । ଇସ୍ରାଏଲୀ ଦୂତାବାସ ଉପରେ ପେଟ୍ରୋଲ ବୋମା ଫିଙ୍ଗାଯାଉଥିବା ସୁଚନା । ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଦିଲ୍ଲୀର ଅଟେ ଯେଉଁଥିରେ ଇରାନ ସୁପ୍ରିମ ଲିଡରଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ଶାନ୍ତିପୂର୍ଣ୍ଣ ଭାବେ ବିରୋଧ ପ୍ରଦର୍ଶନ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ, ହେଲେ ଏ ନେଇ କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏତେବଡ଼ ପ୍ରଦର୍ଶନ ହୋଇଥାନ୍ତା, ନିଶ୍ଚିତଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୂଖ ଗଣମାଧ୍ୟମ ଏହାକୁ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ କରିଥାନ୍ତେ । ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ଋଭ ଇମେଜରେ ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ୍ସରେ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧ ମାର୍ଚ୍ଚ ୨୦୨୬ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଏନଡିଟିଭି ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ କରି ଉଲ୍ଲେଖ କରିଛି, ଆମେରିକା-ଇସ୍ରାଏଲ ଆକ୍ରମଣରେ ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ନେତା ଆୟାତୋଲ୍ଲା ଅଲି ଖାମେନେଇଙ୍କ ହତ୍ୟା ବିରୋଧରେ ପ୍ରତିବାଦ ଜଣାଇବା ପାଇଁ ଦିଲ୍ଲୀର ଉଲାମା ଏବଂ ଅଖିଳ ଭାରତୀୟ ଶିୟା ପରିଷଦଙ୍କ ନେତୃତ୍ୱରେ ଶିୟା ମୁସଲିମ ସମ୍ପ୍ରଦାୟର ସଦସ୍ୟମାନେ ଦିଲ୍ଲୀର ଜନ୍ତରମନ୍ତରରେ ଏକତ୍ରିତ ହୋଇଥିଲେ ।  #Watch | Members of the Shia Muslim community, led by Ulama of Delhi and the All India Shia Council, gathered at Jantar Mantar in Delhi for protest against the killing of Iran's Supreme Leader, Ayatollah Syed Ali Khamenei in US-Israeli strikes #Iran #AyatollahKhamenei pic.twitter.com/Zam7hUm43o — NDTV (@ndtv) March 1, 2026 ଉକ୍ତ ଘଟଣା ନେଇ ପ୍ରମୁଖ ଖବର କାଗଜ ସମାଜ ଏକ ବିଶୃତ ଖବର ପ୍ରକାଶିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଖବର ପ୍ରକାଶିତ କରି ସମାଜ ଉଲ୍ଲେଖ କରିଛି, ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ଶାସନ ନେତା ଆୟାତୋଲ୍ଲା ଅଲି ଖାମେନେଇଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ଭାରତର ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ପ୍ରତିବାଦ ପ୍ରଦର୍ଶନ ଦେଖା ଦେଇଛି। ଖାମେନେଇଙ୍କ ପରଲୋକରେ ଶୋକ ପ୍ରକାଶ କରିବା ସହ ଆମେରିକା ଏବଂ ଇସ୍ରାଏଲ ବିରୋଧୀ ସ୍ଲୋଗାନ ଦେଇଛନ୍ତି ପ୍ରତିବାଦକାରୀ। ଉତ୍ତେଜନା ନିୟନ୍ତ୍ରଣ ପାଇଁ ଘଟଣାସ୍ଥଳରେ ସୁରକ୍ଷାକର୍ମୀଙ୍କୁ ନିୟୋଜିତ କରାଯାଇଛି।ଆମେରିକା ଏବଂ ଇସ୍ରାଏଲ ଆକ୍ରମଣରେ ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ଶାସନ ନେତା ଆୟତୁଲ୍ଲା ଖାମେନିଙ୍କ ହତ୍ୟା ପରେ ଭାରତର ଜମ୍ମୁ ଏବଂ କାଶ୍ମୀର, ଲେହ, ଲଦାଖ, ଦିଲ୍ଲୀ, ମୁମ୍ବଇ ସମେତ ଉତ୍ତର ପ୍ରଦେଶରେ ବ୍ୟାପକ ପ୍ରତିବାଦ ଦେଖାଦେଇଛି। ଜାମ୍ମୁ ଏବଂ କାଶ୍ମୀର ଧର୍ମଗୁରୁ ମୀରୱାଇଜ୍ ଉମର ଫାରୁକ୍ ଏବଂ ପୂର୍ବତନ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମେହବୁବା ମୁଫତି ତାଙ୍କ ମୃତ୍ୟୁ ଘଟଣାକୁ କଡ଼ା ନିନ୍ଦା କରିବା ସହ ବନ୍ଦ ଡାକରା ଦେଇଥିଲେ। ଲକ୍ଷ୍ନୋରେ ପ୍ରତିବାଦ ସମୟରେ ସିଆ ମୁସଲିମ ମହିଳାମାନେ କାନ୍ଦିଥିଲେ। ଏହାସହ ସେମାନେ ଇସଲାମିକ ଗଣରାଜ୍ୟ ସପକ୍ଷରେ ସ୍ଲୋଗାନ ଦେଉଥିଲେ। ବୋମା ଫିଙ୍ଗା ଦାବିକୁ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ୨୭ ଡିସେମ୍ବର ୨୦୨୩ରେ ସମ୍ବାଦ ଏକ ଖବର ପ୍ରକାଶିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ପ୍ରକାଶିତ ଖବର ଅନୁଯାୟୀ, କଡ଼ା ସୁରକ୍ଷା ବଳୟରେ ଥିବା ଲୁଟିୟେଞ୍ଜ୍‌ ଜୋନ୍‌ ଅଞ୍ଚଳସ୍ଥିତ ଇସ୍ରାଏଲୀ ଦୂତାବାସ ନିକଟରେ ସ୍ବଳ୍ପ ତୀବ୍ରତାସମ୍ପନ୍ନ ବିସ୍ଫୋରଣ ଘଟିଥିବା କଥା ସରକାରୀ ଅଧିକାରୀମାନେ କହିଛନ୍ତି। ବିସ୍ଫୋରଣ ସୂଚନା ପାଇବାକ୍ଷଣି ସନ୍ଧାନୀ କୁକୁର ସ୍କ୍ବାଡ୍‌, କ୍ରାଇମ୍‌ ଟିମ୍‌ ଓ ବୋମା ନିଷ୍କ୍ରିୟକାରୀ ଟିମ୍‌ଙ୍କୁ ଧରି ପୁଲିସ ଘଟଣାସ୍ଥଳରେ ପହଞ୍ଚିଥିଲା। ଅବିଳମ୍ବେ ଫୋରେନ୍‌ସିକ୍‌ ଲାବ୍ରଟରି ବିଶେଷଜ୍ଞମାନ‌େ ବି ସେଠାରେ ହାଜର ହୋଇଥିଲେ।ସମ୍ପୃକ୍ତ ଅଞ୍ଚଳ ତଲାସ କରିବା ବେ‌ଳେ ପୁଲିସ ଇସ୍ରାଲୀୟ ରାଷ୍ଟ୍ରଦୂତଙ୍କ ପ୍ରତି ଲେଖାଯାଇଥିବା ଖଣ୍ଡେ ଚିଠି ଦୂତାବାସଠାରୁ କିଛି ମିଟର ଦୂରରେ ଏକ ଖୋଲା ପଡ଼ିଆରୁ ପାଇଛନ୍ତି। ସେ ଚିଠିରେ ଗୋଟାଏ ପତାକା ବି ଗୁଡ଼ା ହୋଇଥିଲା। ସେ ଚିଠି ଓ ପତାକା ସମେତ ଦୀର୍ଘ ୩ ଘଣ୍ଟା କାଳ ସେ ଅଞ୍ଚଳ ତଲାସ କରିବା ବେଳେ ମିଳିଥିବା ଅନ୍ୟାନ୍ୟ ସାମଗ୍ରୀଗୁଡ଼ିକୁ ମଧ୍ୟ ପୁଲିସ ଫୋରେନ୍‌ସିକ୍‌ ପରୀକ୍ଷା ନିମନ୍ତେ ପଠାଇଛି। କିନ୍ତୁ, ଘଟଣାସ୍ଥଳରୁ ସେଭଳି କୌଣସି ମାରାତ୍ମକ ପଦାର୍ଥ ମିଳି ନ ଥିବା କଥା ପୁଲିସ କହିଥିବାର ଉକ୍ତ ଖବରରେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ଏହା ମଧ୍ୟ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ବୋମାମାଡ଼ର ଖବରଟି ୨୦୨୩ର ଅଟେ । ନିକଟ ଦିନରେ ଇସ୍ରାଏଲ ଦୂତାବାସ ନିକଟରେ କୌଣସି ବୋମାମାଡ଼ ହୋଇ ନାହିଁ । ଏଥିରୁ ଜଣାଯାଏ ଯେ, ଦାବିଟି ଫେକ୍ ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଆମେରିକା-ଇସ୍ରାଏଲ ଆକ୍ରମଣରେ ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ନେତା ଆୟାତୋଲ୍ଲା ଅଲି ଖାମେନେଇଙ୍କ ହତ୍ୟା ବିରୋଧରେ ପ୍ରତିବାଦ ଜଣାଇବା ପାଇଁ ଦିଲ୍ଲୀର ଉଲାମା ଏବଂ ଅଖିଳ ଭାରତୀୟ ଶିୟା ପରିଷଦଙ୍କ ନେତୃତ୍ୱରେ ଶିୟା ମୁସଲିମ ସମ୍ପ୍ରଦାୟର ସଦସ୍ୟମାନେ ଦିଲ୍ଲୀର ଜନ୍ତରମନ୍ତରରେ ଏକତ୍ରିତ ହୋଇଥିବା ସମୟର ଅଟେ ।

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:15 am

సోమవారం రాశి ఫలాలు (23-03-2026)

మేషం వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి. వృషభం ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది. మిధునం ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. కర్కాటకం ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. సింహం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు. కన్య ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. తుల అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి. వృశ్చికం కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. మకరం కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరోబాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. కుంభం చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలలో వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. మీనం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.  

మన తెలంగాణ 23 Mar 2026 12:10 am

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ନୀତିଶ ତାଙ୍କ ପୁଅକୁ ଧରି କାନ୍ଦୁଥିବା ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ

ସାରା ଦେଶର ନଜର ଥିବା ବିହାର ରାଜ୍ୟସଭା ନିର୍ବାଚନରେ ବିଜେପି ଓ ଏନ୍‌ଡିଏ ବାଜିମାତ୍‌ କରିଛନ୍ତି। ଏନ୍‌ଡିଏ ସମସ୍ତ ଆସନରେ ବିଜୟୀ ହୋଇଛି। ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ନୀତୀଶ କୁମାର ଓ ବିଜେପି ଜାତୀୟ ସଭାପତି ନିତିନ ନବୀନ ଅଛନ୍ତି । ତେବେ କିଛିଦିନ ପୂର୍ବରୁ ନିତିଶଙ୍କ ପୁଅଙ୍କ ଏକ ଭିଡିଓ ଖୁବ ଭାଇରାଲ ହୋଇଥିଲା ଯେଉଁଥିରେ ସିଏ କହିଥିଲେ, ଯେ ଅମିତ ଅଙ୍କଲ କହିଥିଲେ ଯେ, ୧୫ ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ୟେ ଆମ ନେତା ୟେ ଆମ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ । ଅନ୍ୟପଟେ ରାଜ୍ୟସଭା ଯିବାକୁ ନିଜେ ଇଚ୍ଛାପ୍ରକାଶ କରିଛନ୍ତି ବୋଲି ସୋସିଆଲ ମିଡିଆରେ ଲେଖିଥିଲେ ନୀତିଶ । ଦୁଇ ଦଶନ୍ଧିରୁ ଅଧିକ ସମୟ ଧରି ଆପଣମାନେ ମୋ ପ୍ରତି ନିରନ୍ତର ଭାବରେ ଆପଣଙ୍କର ବିଶ୍ୱାସ ଏବଂ ସମର୍ଥନ ବଜାୟ ରଖିଛନ୍ତି । ସେହି ଶକ୍ତି ମାଧ୍ୟମରେ ମୁଁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ନିଷ୍ଠାର ସହିତ ବିହାର ଏବଂ ଆପଣମାନଙ୍କ ସମସ୍ତଙ୍କର ସେବା କରିଛି। ଆପଣଙ୍କ ବିଶ୍ୱାସ ଏବଂ ସମର୍ଥନ ଯୋଗୁଁ ହିଁ ବିହାର ଆଜି ବିକାଶ ଏବଂ ସମ୍ମାନର ଏକ ନୂତନ ଦିଗକୁ ଗ୍ରହଣ କରୁଛି। ଏଥିପାଇଁ ମୁଁ ପୂର୍ବରୁ ଅନେକ ଥର ଆପଣଙ୍କ ପ୍ରତି ମୋର କୃତଜ୍ଞତା ପ୍ରକାଶ କରିଛି । ବୋଲି ନିଜ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ କରିଥିଲେ ନୀତିଶ । ଇତିମଧ୍ୟରେ ଏକ ଫଟୋ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ଫଟୋରେ ବିହାରର ପୂର୍ବତନ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ନୀତିଶ କୁମାର ଜଣେ ଯୁବକକୁ ଧରି କାନ୍ଦୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଯୁବକ ଜଣଙ୍କ ତାଙ୍କ ପୁଅ ବୋଲି ଜାଣିବାକୁ ମିଳିଥିବା ବେଳେ, ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ପଦରୁ ଇସ୍ତଫା ଦେବାପରେ ବାପପୁଅ କାନ୍ଦୁଥିବାର ଦାବି ହୋଇଛି । ରାଜ୍ୟସଭା ଯିବା ନେଇ ବିଜେପି ତାଙ୍କୁ ଏବଂ ବିହାର କୁ ଧୋକା ଦେଇଛି ବୋଲି ତାତ୍ସ୍ୟଲ୍ୟ କରିବା ସହ ଉକ୍ତ ଫଟୋକୁ ସେୟାର କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । क्या से क्या हो गया? ऐसा नहीं है, BJP का स्क्रिप्टेड कहानी थी! जो हो, यह बिहार के जनादेश के साथ भाजपा का विश्वासघात है! जदयू क्या बिहार की जनता इसे कबूल नहीं करेगी! pic.twitter.com/dgK2LAjhi7 — Dhirendra Jha (@dhirendra_ml) March 5, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଆଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଦାବୀର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ସହ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ। ଅନୁସନ୍ଧାନରୁ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ କିମ୍ବା ନୀତିଶଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏହି ଫଟୋ ସେୟାର ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ତେଣୁ ଏଭଳି କୌଣସି ଫଟୋ ଉଠାଯାଇନଥିବାର ଅନୁମାନ କରାଯାଏ । ରାଜନୈତିକ ମାହୋଲ ଏଭଳି ସରଗରମ ଥିବା ବେଳେ ଯଦି ଏଭଳି ଫଟୋ ଉଠିଥାଏ ତେବେ ଏହା ବିହାର ଗଣମାଧ୍ୟମ ପାଇଁ ଏକ ଖବର ପାଲଟି ଯାଇଥାନ୍ତା । ଉକ୍ତ ଫଟୋର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଫଟୋଟିକୁ ହାଇଭ ମଡରେସନ ଟୁଲ୍ ରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ଫଟୋଟି ୯୯.୯% ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ହାଇଭ ମଡରେସନ ରିପୋର୍ଟ ପ୍ରକାଶ କରିଥିଲା । ସମାନ ଫଟୋଟିକୁ ଇଜଇଟ ଏଆଇରେ ମଧ୍ୟ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ପରୀକ୍ଷାରୁ ଉକ୍ତ ଫଟୋଟି ୮୮% ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା ।   ଅନ୍ୟପଟେ ଚଳିତବର୍ଷ ମାର୍ଚ୍ଚ ୪ରେ ଫାଇନାନସିଆଲ ଏକ୍ସପ୍ରେସ ନିଶାନ୍ତ କୁମାର ଅର୍ଥାତ ନୀତିଶ କୁମାରଙ୍କ ପୁଅ ଉପରେ ଏକ ଖବର ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯେଉଁଥିରେ ସିଏ ଏବେ ବିହାର ରାଜନୀତିର ଜଣେ ଚର୍ଚ୍ଚିତ ଚେହେରା ବୋଲି ଉଲ୍ଲେଖ ରହିଛି । ଉକ୍ତ ଖବରରେ ଯେଉଁ ଫଟୋ ବ୍ୟବହାର ହୋଇଛି, ସମାନ ପୋଷାକ ମଧ୍ୟ ଭାଇରାଲ ଫଟୋରେ ନୀତିଶ ଏବଂ ନିଶାନ୍ତ ଉଭୟେ ପିନ୍ଧିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଫଟୋକୁ ବ୍ୟବହାର କରି କେହି ଏଆଇର ସାହାରା ନେଇ ଏହି ଫେକ୍ ଫଟୋ ନିର୍ମାଣ କରିଥାଇ ପାରିଥାନ୍ତି ବୋଲି ଅନୁମାନ କରାଯାଏ । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ । 

తెలుగు పోస్ట్ 22 Mar 2026 11:50 pm

డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఇక అంత సులభం కాదు

ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి ఎల్‌ఎల్‌ఆర్‌కు ముందు దరఖాస్తు చేసుకుని ఆన్‌లైన్‌లో రాయాలి ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు ఆరు మాడ్యుల్స్‌తో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహణ రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ సర్కార్ నిర్ణయం మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్డు భద్రతపై రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా ప్రమాదాలకు కారణమవుతున్న వారిని తగ్గించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు రవాణా శాఖ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఇక మీదట డ్రైవింగ్ లైసెన్సు పొందడం అనుకున్నంత సులభం కాదని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ పరీక్ష ఏదో రకంగా చేసి లైసెన్సుతో బయటపడుతూ వచ్చారు. ఇక మీదట అటువంటి వాటికి చెక్‌పెడుతూ రవాణా శాఖ లైసెన్సుల జారీలో కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఎల్‌ఎల్‌ఆర్ దరఖాస్తు చేసే ముందే ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో విజయం సాధించాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాల నివారణ, డ్రైవింగ్ నిబంధనల పట్ల చైతన్యం తీసుకురావడం వంటి ప్రమాణాలను పాటించేందుకు వీలుగా ఈ కొత్త ఎంట్రీ లెవెల్ పరీక్షను నిర్వహించేందుకు రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో విజయం సాధించిన తర్వాతే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందో, అది ఉత్తీర్ణత అయిన తర్వాత డ్రైవింగ్ టెస్టుకు వెళ్లడం ఉత్తీర్ణత కావడం జరుగుతుంది. కొత్తగా ప్రారంభించనున్న ఈ నిబంధన కారణంగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించి, డ్రైవర్లలో భద్రతా అవగాహన కలిగించినట్లు అవుతుంది. కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్‌కు సంబంధించిన పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో ఇది తొలి దశగా ఉంటుంది. రోడ్ సేఫ్టీ పరీక్షలో ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల చొప్పున అన్నింటికీ కలిపి మూడు గంటల సమయం పడుతుంది. ఈ పరీక్షకోసం అభ్యర్థులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కెమెరా ఉన్న ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌తో ఇల్లు లేదా కార్యాలయం నుంచి ఈ పరీక్షను సులభంగా రాసే వీలుంది. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేకంగా ఓ సర్టిఫికెట్ నంబర్‌ను కేటాయిస్తారు. దాని ఆధారంగానే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణా శాఖ అధికార వర్గాల సమాచారం. తెలంగాణలో ఏటా సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాలతో మృతి దేశంలో ఏటా దాదాపు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తుంటే తెలంగాణలో ఏటా సుమారు ఏడున్నర వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరితో పాటు 23 వేల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. ఈ క్రమంలో రహదారి ప్రమాదాలు, మరణాల నియంత్రణకు రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనలతో రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లైసెన్సు ఉన్నా రోడ్డు ప్రమాదాలకు గురికావడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. ఇటు ఆయా కుటుంబాలు రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన పెంచడంతో పాటు రోడ్డు భద్రత మాడ్యుల్స్‌లో ఉన్న అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఈ ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షకు అవసరమైన మెటీరియల్‌ను కూడా రవాణా శాఖ రూపొందించింది. చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అందుకే లైసెన్స్ ఇచ్చే ముందు అభ్యర్థులకు తప్పనిసరిగా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునే తొలి దశలోనే ఈ పరీక్షకు సన్నద్దత కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రవాణా శాఖ త్వరలోనే విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది.

మన తెలంగాణ 22 Mar 2026 11:23 pm

ఇక్రిశాట్‌ను అమెరికా సంస్థ అనడం... సిఎం అవగాహన రాహిత్యానికి నిదర్శనం

ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడి తెలంగాణ పరువు తీయకండి మాజీ మంత్రి హరీష్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌ను అమెరికా సంస్థ అనడం సిఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. నల్లమల సరిహద్దులు, కృష్ణా-గోదావరి జలాలు, సుంకేసుల ప్రాజెక్టుల మీదే కాదు.. కళ్ల ముందున్న సంస్థల పైనా సిఎంకు క్లారిటీ లేదా..? అని ప్రశ్నించారు. కనీస వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి, ప్రాథమిక అవగాహన లేకుండా తెలంగాణ పరువు తీయకండి అంటూ చురకలంటించారు. పటాన్‌చెరులో దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఇక్రిశాట్.. ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు అని, ఇది సిజిఐఎఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అని తెలిపారు. దీని ఏర్పాటులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఎఒ), యునైటెడ్ నేషన్స్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్(యుఎన్‌డిపి), వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఫోర్డ్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ల సహకారంతో పాటు, భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక ఇది అని, దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణమని అన్నారు. ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని నడపడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హరీష్‌రావు హితవు పలికారు.

మన తెలంగాణ 22 Mar 2026 10:53 pm

ఈ యాప్‌లతో మహిళా భద్రత

అవగాహనతో స్వీయ రక్షణ మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దపీట మన తెలంగాణ/హైదరాబాద్ : ఆధునిక, సాంకేతిక యుగంలో సైతం మహిళల భద్రత కలవర పెడుతున్న అంశం. దీన్ని అధిగమించేందుకు మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ నూతన రీతిలో భద్రతకు సంబందించిన సంస్కరణలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం, ఉపాధి, కళాశాలకు వెళ్లే విద్యార్థినుల పనిచేసే చోట, ప్రయాణ సమయాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. పోలీస్ శాఖ ఇప్పటికే 100, 181, 1098 లాంటి టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినా మరి కొన్ని యాప్‌లతో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. టీ సేఫ్ టి- సేఫ్ అనే యాప్ రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం మహిళల ప్రయాణ భద్రత కోసం రూపోందించింది. ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం, రియల్ టైమ్ రైడ్ మానిటరింగ్ చేయడానికి ఈ యాప్ అభివృద్ధి చేశారు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. రాత్రి వేళ ఉద్యోగాలు చేసే మహిళలు, విధులు ఆలస్యమయిన సందర్భంలో, అర్దరాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించే వారికి యాప్‌తో భరోసా లభిస్తుంది. యాప్‌లో లాగిన్ అయిన తరువాత డయల్ 100 అనే ఆప్షన్‌లో మానిటరింగ్ ఎంపిక చేసుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాం, ఏ వాహనంలో వెళుతున్నాం అనే వివరాలు నమోదు చేస్తే పర్యవేక్షణ ప్రారంభమవుతుంది. ఎదయిన ఆపద వస్తే ఈ వివరాలతో పోలీసులు తక్షణమే సంబంధిత ప్రదేశానికి చేరుకుని బాధితులను రక్షిస్తారు. మై సేఫ్టీ పిన్ మై సేఫ్టీ పిన్ యాప్ రాత్రి సమయాల్లో, కొత్త ప్రదేశాల్లో ఒంటిరిగా ప్రయాణిస్తున్న మహిళలకు రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది. ఈ యాప్‌తో రాత్రి సమయాల్లో ప్రయాణించే మార్గం ఎంత సురక్షితమో తెలుసుకోవచ్చు. వెలుతురు, జనసాంద్రత, ప్రజల రాకపోకలు వంటి ఆధారంగా రహదారి వివరాలు, ఎంత సురక్షితమో తెలుపుతుంది. లైవ్ ట్రాకింగ్ ద్వారా ప్రయాణ మార్గాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేస్తుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్ బటన్ నొక్కడం ద్వారా సమీపంలోని పోలీసులకు సమాచారం వెళుతుంది. 112(112 ఇండియా) 112 ఇండియా అనేది రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ఇఆర్‌ఎస్‌ఎస్) యాప్ కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలల భద్రత కోసం పనిచేసే ప్లాట్ ఫారమ్‌గా పనిచేస్తుంది. దీనికి వినియోగించడం ద్వారా మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత ప్రయాణ సమయంలో ఏదయినా సమస్య తలెత్తినప్పుడు యాప్‌లోని ప్యానిక్ బటన్ నొక్కిగానే వెంటనే సదరు మహిళ ఉన్న లోకేషన్, వ్యక్తిగత సమాచారం(పేరు, వయస్సు, ఎమర్జెన్సీ కాంటాక్ట్) కంట్రోల్ రూంకు పంపుతుంది. దీంతో వేగంగా పోలీస్ శాఖ సహాయం అందుతుంది.

మన తెలంగాణ 22 Mar 2026 10:47 pm

IPL వైపు విదేశీ ఆటగాళ్ల చూపు.. పాక్ క్రికెట్ బోర్డు వార్నింగ్

న్యూఢిల్లీ: కొందరు విదేశీ ఆటగాళ్లు.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌(పిఎస్ఎల్) వదిలి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపిఎల్)లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. సదరు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరి నిమిషంలో పిఎస్ఎల్ వదిలి ఐపిఎల్ కు మారిన ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పిసిబి ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హెచ్చారించారు. ఐపీఎల్‌కు రెండు రోజుల ముందు, అంటే మార్చి 26న పీఎస్ఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌ను కాదని, డబ్బులు బాగా వచ్చే భారత లీగ్‌ను ఎంచుకున్నారు. ఈ సీజన్‌లో బ్లెస్సింగ్ ముజరబానీ, దాసున్ షనక వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు పిఎస్ఎల్‌ను కాదని ఐపిఎల్‌ను ఎంచుకున్నారు. దీంతో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వైదొలిగే అంతర్జాతీయ ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నఖ్వీ హెచ్చరించారు. మీడియా సమావేశంలో నఖ్వీ నిబంధనల ప్రకారం ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటాం. గత ఏడాది కూడా ఇలానే చేసిన కార్బిన్ బాష్‌పై పీఎస్ఎల్ నుంచి ఏడాది పాటు నిషేధం విధించడం జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతుంది. కాగా, ముజరబానీ, దాసున్ షనక ఇద్దరితో పాటు గుడకేష్ మోతీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఒట్నీల్ బార్ట్‌మన్, స్పెన్సర్ జాన్సన్ కూడా పీఎస్ఎల్ నుండి వైదొలిగిన వారిలో ఉన్నారు. అయితే  వీరిలో చాలా మంది వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగారు.

మన తెలంగాణ 22 Mar 2026 10:36 pm

యుద్ధ ప్రభావం..విమాన టికెట్ ధరలకు రెక్కలు

స్వదేశానికి రావడానికి తెలుగు టెక్కీలు, ఎన్నారైలు తీవ్ర ఇబ్బందులు మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన ధరల పెరుగుదల, ఎయిర్ స్పేస్ పరిమితులతో హైద రాబాద్‌తో సహా భారత్‌కు వచ్చే విమాన టికెట్ ధరలు 40-60 శాతం వరకు పెరిగాయి. లండన్-హైదరాబాద్ రూట్‌లో ధరలు రూ. 2.5 లక్ష లకు చేరాయి. 5,500 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి, దీంతో తెలుగు టెక్కీలు, ఎన్నారైలు స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావాల్సి రావడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతోంది. పని ఒత్తిడి, ఆందోళన: అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇండియాకు వెళ్లలేని స్థితి నెలకొందని, సెలవులు దొరికినా విమానం దొరకడం, ధరలు భరించడం కష్టంగా మారిందని టెక్కీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి. ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా కొన్ని సంస్థలు విమానాలను లిమిటెడ్‌గా నడపడంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే మూడు రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇండియా నుంచి అమెరికా యూరప్ దేశాలకు కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎయిర్ ఇండియావే. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అనుమతి వుంటేనే నడుపుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా యూరప్ వెళ్ళాలంటే టికెట్ ధర వన్ వే కే టూ వే టికెట్ ధరలు సంస్థలు వసూలు చేస్తున్నాయి . ఎయిర్ ఇండియా, ఎతిహాద్. ఎమిరేట్స్ విమానాల రేట్లకు రెక్కలొచ్చాయి. అమెరికా వెళ్ళాలంటే టికెట్ ధరలు ఫ్లైట్ బుకింగ్ టైం లో ఒకలా.. పేమెంట్ టైం లో ఒకలా చూపిస్తున్నాయి. అంటే నిమిషం నిమిషానికి చార్జ్ మారుతోంది. గల్ఫ్ దేశాలకు కొన్ని విమానాలు నడుస్తున్నా అవి టేకాఫ్ అవుతాయా లేదా అన్నది మరో డైలమా. ఇంకొన్ని విమానాలు గమ్యస్థానాలకు వెళ్ళే దారి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా ప్రయాణికులు ఉంటారు. ఒకవేళ విమానాలు షెడ్యూల్ చేసినా ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో అర్థంకాక ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా..యుద్ధం విమానయాన రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు రిస్క్ ఎందుకులే అని తమ సర్వీసులను ఆపేయగా.. కొన్ని సంస్థలు భారీగా టికెట్ రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మొత్తంగా యుద్ధ ప్రభావంతో విమాన ప్రయాణాలు భారంగా మారాయి. టికెట్ దొరకడం ఒకెత్తయితే.. రేట్లు మరో ఎత్తు. టికెట్ దొరికినా అది డెస్టినేషన్‌కు పోతుందో యుద్ధం భయంతో మధ్యలోనే రిటర్న్ అవుతుందో తెలీక ప్రయాణికులకు డైలమా తప్పడం లేదు. ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం ...! పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం ఈ ప్రభావం ప్రధానంగా ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరల ద్వారా కనిపించే అవకాశం ఉంది. ప్రతి నెలా మొదటి తేదీన ఎటిఎఫ్ ధరలు సవరించబడుతాయి. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి ఈ పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం విమానయాన సంస్థలతో నిరంతరంగా చర్చలు జరుపుతోంది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో సుమారు 40 శాతం వరకు ఎటిఎఫ్ ఖర్చే ఉంటుంది. చమురు ధరలు పెరగడం వల్ల ఈ ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో విమాన టిక్కెట్ ధరలు కూడా పెరగడం ప్రారంభమైంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ వంటి సంస్థలు ఫ్యూయల్ సర్‌ఛార్జీలను అమలు చేస్తున్నాయి. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి పలు మంత్రిత్వ శాఖలు కలిసి పని చేస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాలకు విమాన సర్వీసులు సురక్షితంగా కొనసాగడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎటిఎఫ్ ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. అయితే పెరిగిన ఇంధన ఖర్చులను సమతుల్యం చేసేందుకు విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను విధిస్తాయి. ఇది టిక్కెట్ బేస్ ఫేర్‌కు అదనంగా వసూలు చేయబడుతుంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారాయి. దీని ప్రభావం భారతదేశంలో విమాన ప్రయాణ ఖర్చులపై పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం, విమానయాన సంస్థలు సమన్వయంతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయి.

మన తెలంగాణ 22 Mar 2026 10:33 pm

చమురు , గ్యాస్ సరఫరా కటకటపై ఏం చేద్ధాం?

కీలకశాఖల మంత్రులపై ప్రధాని మోడీ సమీక్ష విద్యుత్ , పరిశ్రమలు, ఎరువులపై ప్రభావం విశ్లేషణ ఎల్‌పిజి, కమర్షియల్ ఇంధన విషయాలపై బేరీజు పోర్టుల్లో పరిస్థితి, దిగుమతుల్లో ఆటంకాలపై దృష్టి న్యూఢిల్లీ ః పశ్చిమాసియా ఘర్షణ తీవ్రస్థాయికి చేరుతూ, చమురు సంక్షోభానికి దారితీస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పరిస్థితిని సమీక్షించారు. ఆయన దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా ఇతరులు, పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వంటగ్యాసు, పెట్రోలు, డీజిల్, దేశానికి ఇతర దేశాల నుంచి అందుతున్న ముడిచమురు వంటి అనేక అంశాలపై వారితో చర్చించారు. విద్యుత్ రంగం, ఎరువుల కర్మాగారాలపై పడుతున్న ప్రభావం, తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు. పరిశ్రమలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సి ఉంటుంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా ఇంధన సరఫరా నిరంతరాయంగా జరగాల్సి ఉంది. సరఫరాల స్థిరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ప్రధాని సూచించారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్, జెపి నడ్డా, పియూష్ గోయల్ పాల్గొన్నారు. తమ మంత్రిత్వశాఖల నుంచి అభిప్రాయాలను తెలిపారు. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా సమస్య తలెత్తడంతో కేంద్ర రేవులు, నౌకాయాన మంత్రి సర్బనందా సోనోవాల్, ఇంధన మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ , కేంద్ర ఆహార, వినియోగదారుల మంత్రి ప్రహ్లాద్ జోషీతో చర్చించారు. వైమానిక రంగ సమస్యలు, విమానాల రాకపోకలను ప్రధానికి సంబంధిత మంత్రి కింజారపు రామ్మోహన నాయుడు తెలిపారు. దేశంలో పెట్కోలు, డీజిల్ పరిస్థితిని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలియచేశారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శులు ఇద్దరు పికె మిశ్రా, శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇప్పుడు జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యత గల అత్యయిక సమీక్షా సమావేశం అయింది. కీలక ఇంధన సమస్యతో దేశవ్యాప్తంగా పరిశ్రమలపై పడుతున్న ప్రభావం ప్రస్తావనకు వచ్చింది. దేశంలో ప్రతి ఇంటికి అత్యవసరం అయిన వంటగ్యాసు, వాహనదారులకు, పరిశ్రమలకు కీలకమైన పెట్రోలు డీజిల్ ,కమర్షియల్ గ్యాస్ వంటి విషయాలు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలకు మరింతగా కమర్షియల్ గ్యాస్ కోటా అందించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. హాస్టళ్లు, ఆసుపత్రులకు ఇతర అత్యవసర రంగం కేంద్రాలకు సరఫరా నిలిచిపోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని సంకల్పించారు. దేశంలో రేవుల వద్ద పరిస్థితి సవ్యంగానే ఉందని అధికారులు తెలిపారు. 

మన తెలంగాణ 22 Mar 2026 10:15 pm

ట్రంప్ నాడీ వ్యవస్థ పని చేయడంలేదా?... నింపాదిగా నడక... తడబాటు

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ తమ అధికారిక ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ ఒన్ నుంచి తడబడుతూ పక్కన ఊతం పట్టుకుని జాగ్రత్తగా దిగారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి పలు వార్తలు వెలువడ్డాయి. తరువాత అక్కడ ఉన్న కుర్చీపై ఆసీనుడు కావడానికి కూడా కంగారుపడాల్సి వచ్చింది. 79 సంవత్సరాల ట్రంప్ నాడీ మండల సమస్యలు ఎదుర్కొంటున్నాయని, రక్తనాళాలు గడ్డకట్టుకుపోతున్నాయని చాలాకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఎయిర్‌ఫోర్స్ ఒన్ నుంచి అతికష్టం మీద దిగినట్లుగా ఆయనను అనుసరించిన వీడియో కెమెరాలతో స్పష్టం అయింది. ట్రంప్ వయస్సు మీదపడింది. ఇక సరిగ్గా నడవలేకపోతున్నారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అయితే ఇటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోరాదని, ఆయన ఆరోగ్యంపై వదంతుల్లో ఇవో భాగం అని కొందరు ఎదురుదాడికి దిగారు. ట్రంప్ ఇప్పుడు ఫ్లోరిడాలో రెండు మూడు రోజులు గడుపనున్నారు. తరువాత టెన్సెసీకి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వాషింగ్టన్ చేరుకుంటారు. ప్రస్తుతం ట్రంప్ ఆలోచనాశక్తి కూడా మునుపటిలా లేదని విమర్శలు తలెత్తుతున్నాయి.

మన తెలంగాణ 22 Mar 2026 10:10 pm

టీ20ల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్..

టీ20 క్రికెట్ లో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ చరిత్ర సృష్టించింది. మార్చి 22, ఆదివారం వెల్లింగ్టన్‌లోని స్కై స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కెర్ 29 బంతుల్లో 31 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 31 పరుగులతో కెర్.. పురుషుల, మహిళల టీ20 క్రికెట్‌లో ఆల్-టైమ్ రికార్డును సృష్టించింది. ఈ పొట్టి అంతర్జాతీయ ఫార్మాట్‌లో ఆమె వరుసగా 30కి పైగా పరుగులు చేయడం ఇది 10వ సారి. మహిళల, పురుషుల టీ20లలోనే అత్యధిక సార్లు.. 30కి పైగా స్కోరు చేసి బ్యాటర్ గా కెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు వరుసగా తొమ్మిది సార్లు 30కి పైగా పరుగులు చేసిన శ్రీలంకకు ప్లేయర్ చమరి అథపత్తు, రొమేనియాకు చెందిన రెబెక్కా బ్లేక్‌ రికార్డును కెర్ బ్రేక్ చేసింది. ఇక, పురుషుల టీ20 క్రికెట్‌లో వరుసగా ఏడు సార్లు 30 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించిన రికార్డు.. రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్, అభిషేక్ శర్మ, హ్రిస్టో లాకోవ్ పేరిట ఉంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అతిథి జట్టు దక్షిణాఫ్రికా 159/6 స్కోరు చేసింది. అన్నెరీ డెర్క్‌సెన్ 32 బంతుల్లో అజేయంగా 55 పరుగులతో రాణించింది. తర్వాత కివీస్ 160 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను న్యూజిలాండ్ 3-1తేడాతో ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

మన తెలంగాణ 22 Mar 2026 9:45 pm

తల్లి రుణం తీర్చుకునేందుకు బిసి బుద్ది జీవులు కదలాలి: జూలూరి గౌరీ శంకర్

మన తెలంగాణ,సిటీబ్యూరో: తల్లి రుణం తీర్చుకునేందుకు బిసి బుద్ది జీవులు కదలాలని, బహుజన ఉద్యమకవి, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బిసి కుల వృత్తుల దీర్ఘకవితల సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ.. బిసిలలో కదలిక వచ్చిందని, దాన్ని సామూహిక శక్తిగా మార్పే పని బిసి సాహిత్య కదలడమంటే తల్లి రుణం తీర్చుకోవడం లాంటిదే అన్నారు. కుల పత్తి సాహిత్యాలు ప్రవాహంగా వస్తున్నాయని,అవి ఇప్పుడు బిసి వాద సాహిత్యంగా రూపుదాల్చాలన్నారు. బీసీ ఉద్యమ జెండాగతా ఎగురవేసే పని బీసీ బుద్ది జీవుల చేతుల్లో ఉందన్నారు. కలుషత ఆహారం తిని భావిభారత బిడ్డలు రాలిపోతుంటే బీసీ సాహత్యకారులు పాలకుల దుర్నితీని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సాహిత్య వేత్తల కర్తవ్యం విశ్వమానవ విముక్తి గీతమన్నారు.ఈ కార్యక్రమంలో సింగిశెట్టి శ్రీనివాస్, కాళోజి తొలి అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్,ఆచార్య పిల్లల మర్రి రాములు, బహుళమహిళాపక్ష పత్రిక సంపాదకురాలు జ్వలిత, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 22 Mar 2026 9:37 pm

welcome |జన్నారం చేరుకున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ..

welcome | జన్నారం చేరుకున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్

ప్రభ న్యూస్ 22 Mar 2026 9:10 pm

నట్టేట ముంచుతున్నారు.... పెరుగుతోన్న రియల్ మోసాలు

పెరుగుతోన్న రియల్ మోసాలు మోసపోయి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన టెకీ ప్రభుత్వ భూములను వదలని రియల్టర్లు వాటిని చూపించి కోట్లు దోచుకున్న వ్యాపారులు మనతెలంగాణ / సిటిబ్యూరోః రియల్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రీలాంచ్, ఆఫర్ల పేరిట కొందరు రియల్ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటూ చేతులు ఎత్తివేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ ధరకే ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామని తక్కువ ధరకే ఇస్తామని ప్రకటించి అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు అప్పులు, బ్యాంక్‌ల్లో రుణాలు తీసుకుని ముట్టజెప్పి నిండామునుగుతున్నారు. ఇలాంటి కేసులు హైదరాబాద్ మహానగరంలోని పోలీస్ స్టేషన్లలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. చాలా వరకు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, కొన్ని కేసుల్లో సివిల్ వివాదం పేరుతో మోసాలు చేస్తున్నవారిపై కేసులు పెట్టడంలేదు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రీలాంచ్ పేరుతో చాలా రియల్ ఎస్టేట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. సాహితీ ప్రీలాంట్ పేరుతో పలువురి వద్ద నుంచి రూ.3వేల కోట్లు వసూలు చేసింది, డబ్బులు కట్టి ఏళ్లు అవుతున్నా కూడా కనీసం పునాది కూడా వేయకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జయత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రీలాంచ్ పేరుతో పలువురి వద్ద నుంచి వందల కోట్లు వసూలు చేసింది. తక్కువ డబ్బులకు ఫ్లాట్ కట్టిఇస్తామని చెప్పడంతో ఏడేళ్ల క్రితం పలువురు బాధితులు లక్షలాది రూపాయలు కట్టారు. సాఫ్ట్‌వేర్ ఇంజీనర్లు, వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగులు లక్షలాది రూపాయలు కట్టారు. ప్రైం లొకేషన్‌లో ఫ్లాట్లను కట్టుతున్నట్లు చెప్పడంతో చాలామంది బాధితులు తక్కువ ధరకు వస్తున్నాయని భావించి డబ్బులు కట్టారు. డబ్బులు వసూలు చేసిన రియల్ వ్యాపారులు వారు చెప్పిన ప్రాంతంలో పిల్లర్లు వేసి వదిలేశారు. డబ్బులు కట్టి సంవత్సరాలు అవుతున్నా పనులు ముందుకు సాగకపోవడంతో బాధితులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన నిందితులు చెల్లని చెక్కులు ఇచ్చి చేతులుకు దులుపుకున్నారు. బాధితులు చెక్కులను బ్యాంక్‌లో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి, మళ్లీ పోలీసులను బాధితులను సంప్రదించడంతో సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈవికే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, మోకిలాలో తక్కువ ధరకు విల్లాలు కట్టిస్తామని చెప్పడంతో చాలామంది బాధితులు లక్షలాది రూపాయలు కట్టారు. కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితులు కనీసం భూమి కూడా కొనుగోలు చేయలేదు, కాని ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి చేతులు ఎత్తివేశారు. తక్కువ ధరకు విల్లా వస్తుందని భావించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ.50లక్షలు కట్టాడు, ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో నిండామునిగాడు. వేతనంపై బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేసి రూ.50లక్షలు కట్టాడు, దీనికితోడు ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో మోసపోయాడు. అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు ఉద్యోగం పోవడంతో నిండామునిగాడు, అప్పులు తీర్చేందుకు రాత్రి సమయంలో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భారతీ లేక్ వ్యూ ప్రాజెక్ట్ పేరుతో ప్రీలాంచ్‌కు తెరలేపిన భారతీ బిల్డర్స్ 350మంది నుంచి 80కోట్ల రూపాయలు వసూలు చేసి నిండాముంచారు. హైదరాబాద్, మాదాపూర్‌కు చెందిన దూపటి నాగరాజు భారతీ బిల్డర్స్ చైర్మన్, ముల్‌పూరి శివరామకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్‌గా 2021లో భారతీ బిల్డర్స్‌ను మాదాపూర్‌లో ఏర్పాటు చేశారు. ఇద్దరు కలిసి కొంపల్లిలో 6.23 ఎకరాలను అపార్ట్‌మెంట్లు కట్టేందుకు కొనుగోలు చేశారు. భారతీ లేక్ వ్యూ పేరుతో అపార్ట్‌మెంట్లు కడుతున్నామని చెప్పి ప్రీ లాంచ్ పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. 350మంది నుంచి రూ.80కోట్లు వసూలు చేశారు. బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత భూమిని వేరే వారికి రూ.100కోట్లకు విక్రయించారు. భారతీ బిల్డర్స్ తమ వద్ద డబ్బులు వసూలు చేసి రెండేళ్లు అవుతున్నా కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎపిలోని చిత్తూరూ జిల్లా, రేణిగుంటకు చెందిన ఓబిలి పాపనగిరి రామాచంద్రారెడ్డి ఓబిలి హౌసింగ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట్ మండలం, వెంకటాపురంలో హైవే ప్యారడైజ్ పేరుతో 200 ఎకరాల్లో వెంచర్‌ను ప్రారంభించారు. ప్రీలాంచ్ పేరుతో పలువురు అమాయకుల వద్ద నుంచి మూడేళ్లలో 50మంది రూ.10 నుంచి రూ.15కోట్లు వసూలు చేశాడు. ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన గుంటుపల్లి శ్రీనివాస రావు మరో ఇద్దరితో కలిసి జిఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేశారు. కోల్లూరులో తక్కువ డబ్బులకు విల్లాలు, అపార్ట్‌మెంట్లు కట్టిస్తామని ప్రీలాంచ్ విల్లా పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. నిందితులు బ్రోచర్లు ముద్రించి పలువురికి పంపిణీ చేశారు. వాటిని చూసిన 31మంది బాధితులు వీరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేశారు. మూడేళ్లలో విల్లా కట్టి ఇస్తామని చెప్పారు, ఒకవేళా సమయానికి కట్టకుంటే 24శాతం వడ్డీ కలిసి డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో చాలామంది డబ్బులు ఇచ్చారు, కోట్లాది రూపాయలు తీసుకున్న నిందితులు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలు కట్టిస్తామని చెప్పి బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితులు నిండాముంచారు. రియల్ మోసాలకు బలైన బాధితులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఒప్పందాలు చేసుకుని... రియల్ మోసాలు చేస్తున్న నిందితులు భూమి యజమానులకు కొంత డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ పత్రాలను బాధితులకు చూపించి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత ఒప్పందాలను రద్దు చేసుకోవడం లేదా భూమిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించి రెండు విధాలుగా సొమ్ము చేసుకుంటున్నారు. భారతీ బిల్డర్స్ బాధితులకు ప్రభుత్వ భూమిని తమదిగా నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి మోసం చేశారు. చాలా కేసుల్లో ఒప్పందాలు రద్దు చేసుకుని ఎలాంటి నిర్మాణాలు చేపట్టడంలేదు. అందమైన బ్రౌచర్లు... ప్రాజెక్ట్‌లు ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ సంస్థలు అందంగా బ్రౌచర్లు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. తాము చేపట్టబోయే అపార్ట్‌మెంట్లు ఇలాగే ఉంటాయని చెప్పడంతో చాలా మంది ఆకర్షితులై డబ్బులు కడుతున్నారు. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండాలని ఆశతో డబ్బులు కడుతున్నారు. ప్రజల ఆశల గ్రహిస్తున్న నిందితులు డబ్బులు వసూలు చేసి నిండాముంచుతున్నారు. సాహితీ, భారతీ సంస్థలు ఏకంగా ప్రభుత్వ భూములను చూపించి డబ్బులు వసూలు చేశాయి. అంతేకాకుండా హైరైజ్ బిల్డింగ్‌లు ఇప్పుడు ఫ్యాషన్ కావడంతో వాటిని చూపించి డబ్బులు దోచుకున్నారు. కేసు పెట్టినా లాభంలేదు... రియల్ మోసాల కేసులో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినా బాధితులకు ఎలాంటి న్యాయం జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసినా కూడా వారి నుంచి డబ్బులు రికవరీ చేయలేకపోవడంతో బాధితులకు నయాపైసా కూడా రావడంలేదు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఒక్క బాధితుడికి కూడా డబ్బులు రికవరీ కాలేదు. కోర్టుల్లో కేసులు కొనుసాగుతున్నాయి కానీ బాధితులకు న్యాయం జరగడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మన తెలంగాణ 22 Mar 2026 9:06 pm

ట్రంప్ వార్నింగ్ తో వెనక్కి తగ్గిన ఇరాన్.. కానీ

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్‌ జలసంధి విషయంలో వెనక్కి తగ్గింది. హార్ముజ్‌ మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. 'భద్రతా' ఏర్పాట్ల కోసం ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటే విదేశీ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ అధికారి తెలిపారు. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని ఇరాన్ కండీషన్ పెట్టింది. అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO)లో ఇరాన్ ప్రతినిధి అలీ మౌసావి మాట్లాడుతూ.. టెహ్రాన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని అన్నారు. సముద్ర భద్రతను పెంపొందించడానికి, నావికులను రక్షించడానికి ప్రపంచ సంస్థలు, ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని అన్నారు. దౌత్యం ఇరాన్‌కు ప్రాధాన్యతగా ఉంటుంది. అయితే, దురాక్రమణను పూర్తిగా నిలిపివేయడం, అలాగే పరస్పర విశ్వాసం, నమ్మకం మరింత ముఖ్యం. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులే..పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, హోర్ముజ్ జలసంధిలోని ప్రస్తుత పరిస్థితికి మూల కారణం అని ఆయన పేర్కొన్నారు. కాగా.. 48 గంటలలో ఇరాన్ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించాలని.. లేకపోతే ఇరాన్ ఇందన కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ ఆదివారం తీవ్ర హెచ్చరికలు చేశారు. మరి, ఇరాన్ పూర్తిస్థాయిలో జలసంధిని ఓపెన్ చేయకపోవడంపై ట్రంప్ ఎలా స్పందిస్తాడనేది చర్చనీయాంశంగా మారింది.

మన తెలంగాణ 22 Mar 2026 9:05 pm

బంజారాహిల్స్‌లో బిజెపి ఎంపి రమేష్ హల్‌చల్

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఎపిలోని అనకాపల్లి బిజేపి ఎంపి సిఎం రమేష్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో ఆదివారం తన అనుచరులతో హల్‌చల్ చేశారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీకి చెందిన వివాదాస్పద స్థలంలోకి వచ్చి హంగామా సృష్టించాడు. సర్వే నంబర్ 129లో ప్లాట్ నంబర్ 29,30లోని భూమిని కొనుగోలు చేసిన శివనారాయణ అనే వ్యక్తి పొజిషన్‌లో ఉన్నాడు. దీనిపై సిఎం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2006 నుంచి సిఎం రమేష్ తమను ఇబ్బంది పెడుతున్నాడని బాధితులు ఆరోపించారు. తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తమ భూమిలోకి ఎవరూ ఎంటర్ కావద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా సిఎం రమేష్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదులు చేశారు. సిఎం రమేష్, శివనారాయణ ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ సుహాసన్ తెలిపారు.

మన తెలంగాణ 22 Mar 2026 8:46 pm

Rajasekhar opens doors for New Roles

Veteran actor Rajasekhar has delivered several classics in Telugu cinema in his career. After a long pause, Rajasekhar played a crucial role in Sharwanand’s Biker and he plays the father of the lead protagonist in the film. During the trailer launch of Biker, Rajasekhar announced that he is open to do character-driven roles and he […] The post Rajasekhar opens doors for New Roles appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 8:39 pm

జ్వరం @ రూ.9900... నేను రాను బిడ్డో కార్పొరేట్ ఆస్పత్రికి

చెన్నై లో ఓ వ్యక్తి జ్వరం వచ్చిందని అపోలో క్లినిక్ వెళ్లాడట అక్కడ అతనికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్వాబ్ మరియు మిగతా పరీక్షలు చేసి మందులు 900 రూపాయలు తో కలిపి 9 వేల రూపాయలు బిల్లు వేశారు. అని ఇది అవసరమా? అని పెరిగిన హెల్త్ కేర్ ఖర్చుల గురించి అతను సోషల్ మీడియా వేదికగా వాపోయారు.. చాలా మటుకు జ్వరాలు వైరల్ ఫీవర్ ఉంటాయి, లేదా ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ లేక యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటాయి. వైరల్ జ్వరాలు పారాసిటమాల్ మరియు సెట్రిజిన్ వేసుకుంటే తగ్గిపోతాయి. అదే దగ్గు లాంటిది లేక యూరిన్ మంట లాంటివి ఉంటే ఇక్కడ సిప్రోఫ్లాక్ససిన్ లాంటిది యాంటీబయాటిక్ వేసుకోవాలి. కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళితే వారు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నదా అని యూరిన్ టెస్ట్ చేస్తారు. మలేరియా డెంగు లాంటి జ్వరాలు ఉన్నాయా అని కూడా పరీక్ష చేయాల్సిందే. ఇంకా లివర్ ఫంక్షన్ టెస్టులు మరియు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. ఇది మినిమం పరీక్షలు దీనికి 5వేల రూపాయల కచ్చితంగా అయిపోతాయి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే మోడ్రన్ వైద్య పరీక్షలో ఇది నిర్ధారించడం కోసం ఒకదానిని ఒకటి ఎలిమినేట్ చేయడం అనేది కంపల్సరీ. ఈ విధానం లో తప్పదు. కావున మనము అత్యవసరం అయితేనే పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే మన ఫ్యామిలీ డాక్టర్ తో చూపించుకోవాలి. వైద్యం ఇండస్ట్రీ అయిపోయి కన్జ్యూమర్ పరిధిలోకి డాక్టర్ వచ్చి పేషెంట్ కన్జ్యూమర్ అయిన తర్వాత పరీక్షలు అనేది తప్పనిసరిగా మారింది. చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి అనే విధంగా ఈ వైద్యం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద జబ్బులు కూడా పరీక్షలలో బయటపడతాయి. ఇంకా ఎక్కువ పరీక్షలు కూడా చేయాల్సి వస్తాయి సిటీ స్కాన్ లాంటివి అవసరం అవుతాయి. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్  గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 22 Mar 2026 8:33 pm

ప్రజల జీవితాలను మెరుగుపరిచే.. పీపుల్స్ బడ్జెట్..!

ప్రజల జీవితాలను మెరుగుపరిచే.. పీపుల్స్ బడ్జెట్..! నేటి నుండి రైతుల బ్యాంకు ఖాతాల్లో

ప్రభ న్యూస్ 22 Mar 2026 8:29 pm

అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య నిర్వహించబడ్డాయి. వేలాది మంది అభిమానులు తరలివచ్చి పెద్దాయన్ను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీదేవి, కుమారులు […] The post అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 8:29 pm

అమెరికా నుంచి భారత్‌కు భారీ ఎల్‌పిజి నౌక

మంగళూరు పోర్టుకు చేరుకున్న ‘పైక్సిస్ పయనీర్’ మంగళూరు : భారత్‌కు మరింత ఊరటనిచ్చే విషయం. అమెరికా నుంచి భారీ పరిమాణంలో ఎల్‌పిజితో కూడిన కార్గో నౌక ఆదివారంనాడు ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకుంది. పైక్సిస్ పయనీర్ అనే నౌక సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజితో పోర్టుకు చేరుకుంది. దక్షిణ భారతదేశంలోని గృహ, పారిశ్రామిక అవసరాలకు ఇది మరింత సాయపడనుంది. భారత్‌కు సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ దిగుమతులు అత్యధికం. తాజాగా పశ్చిమాసియా పరిణమాల నేపథ్యంలో అమెరికా నుంచి నేరుగా భారీ నౌక రావడం ఇంధన వనరుల వైవిధ్యీకరణలో భాగంగా భావిస్తున్నారు. మంగళూరు పోర్ట్ ద్వారా అన్‌లోడ్ చేసే ఈ గ్యాస్‌ను పైప్‌లైన్లు, ట్యాంకర్ల ద్వారా కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు అస్థిరంగా ఉన్న వేళ, ఇలాంటి భారీ దిగుమతులు స్థానిక మార్కెట్లో ఎల్‌పిసి ధరలు అదుపులో ఉండటానికి దోహదపడతాయి.

మన తెలంగాణ 22 Mar 2026 8:12 pm

రాజకీయ జోక్యంతో సింగరేణికి కష్టాలు

రాజకీయ జోక్యంతో సింగరేణికి కష్టాలు మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలీఏఐటియుసి అధ్యక్షుడు

ప్రభ న్యూస్ 22 Mar 2026 8:12 pm

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నిత్యావసరాలపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని మోడీ, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్‌ కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌, జైశంకర్‌, నిర్మలా సీతారామన్, హర్దీప్‌సింగ్‌ పూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి కీలక రంగాలలోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. ఇంధన మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనించాలన్న మోడీ సూచించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా సులభమైన లాజిస్టిక్స్, స్థిరమైన సరఫరా, సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థలను కొనసాగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పాయి. కొరతను నివారించడం, సేవలను స్థిరంగా ఉంచడం కీలక ప్రాధాన్యతలుగా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ఏవైనా మార్పులు వస్తే వేగంగా స్పందించేందుకు నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపాయి

మన తెలంగాణ 22 Mar 2026 8:09 pm

ప్రభుత్వాధిపతిగా మోడీ రికార్డు

విరామ లేకుండా 8931 రోజులు సిక్కిం మాజీ సిఎం పికె చామ్లింగ్ రికార్డు అధిగమించిన ప్రధాని కేంద్ర మంత్రుల ప్రశంసలు న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డు నెలకొల్పారు. విరామం లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసిన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ (8,930 రోజులు) పేరిట ఉంది. తాజాగా ఆయన రికార్డును ప్రధాని మోడీ అధిగమించారు. పవన్ కుమార్ 8,930 రోజుల పాటు సిక్కిం సీఎం హోదాలో ఉన్నారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలతో అన్ని రోజుల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా ఉన్నారు. అంతేకాదు గుజరాత్‌కు అత్యధిక కాలం సిఎంగా ఉన్న రికార్డు కూడా మోడీ పేరిటే ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా మోడీనే కావడం గమనార్హం. ఇక, ప్రధాని పదవిలో కొనసాగుతూ కూడా మోడీ పలు రికార్డులను నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం జన్మించి, దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేతగా మోడీ నిలిచారు. అలాగే కేంద్రంలో రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా రికార్డు నెలకొల్పారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో నేతగా కూడా మోడీ నిలిచారు. తాజా రికార్డు నెలకొల్పిన మోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేంద్ర మంత్రలు అమిత్ షా, రాజ్‌నాథ్, పీయూష్ గోయల్, జెపి నడ్డా, అశ్విని వైష్ణవ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నేతృత్వంలో భారత నూతన మైలురాళ్లను నెలకొల్పుతుందన్నారు.

మన తెలంగాణ 22 Mar 2026 8:08 pm

ఘనంగా నాగేంద్ర స్వామి తిరునాళ్ళ మహోత్సవం…

ఘనంగా నాగేంద్ర స్వామి తిరునాళ్ళ మహోత్సవం… భారీగా తరలివచ్చిన భక్తులు.. పుట్టలో పాలు

ప్రభ న్యూస్ 22 Mar 2026 8:08 pm

మల్లయ్య హత్య పై విచారణ జరపాలి…

మల్లయ్య హత్య పై విచారణ జరపాలి… సహకరించిన స్టేషన్ సిబ్బంది పై చర్యలు

ప్రభ న్యూస్ 22 Mar 2026 8:06 pm

హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ

హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 8:01 pm

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ పోరాటం

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ పోరాటం ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చాలి24న

ప్రభ న్యూస్ 22 Mar 2026 7:56 pm

NBK112: Young Music Composer on Board

Telugu360 broke the news that young director Vivek Athreya is all set to direct the 112th film of Nandamuri Balakrishna and the shoot commences after Dasara. The pre-production work of the film is currently happening. Young Malayalam music composer Jakes Bejoy who scored music for Telugu films like Saripodhaa Sanivaaram, Mechanic Rocky, Oke Oka Jeevitham […] The post NBK112: Young Music Composer on Board appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 7:56 pm

48 గంటల్లో హర్మూజ్‌ను తెరవాలి

ట్రంప్ ఘాటు హెచ్చరిక.. ఇరాన్ బేఖాతరు కైరో: హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆదివారం ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు వెలువరించారు. 48 గంటలలో ఇరాన్ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని పూర్తి స్థాయిలో రాకపోకలకు తిరిగి ప్రారంభించాల్సి ఉంది. లేకపోతే ఇరాన్ ఇందన కేంద్రాలపై అమెరికా దాడులకు దిగుతుందని ట్రంప్ తెలిపారు. దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయి. పలు ఇంధన కేంద్రాలను దెబ్బతీస్తామని తెలిపిన ట్రంప్ వీటిలో మొదటి దాడి అత్యంత భారీ స్థాయిలో ఉంటుందని స్పందించారు. ఇప్పటికే దెబ్బతిన్న ఇరాన్‌కు చెందిన అతి పెద్ద బషేర్ అణు ఇంధన కేంద్రం, లేదా టెహరాన్‌కు దగ్గరిలోని సహజ వాయువు కేంద్రం దామావంద్‌పై దాడులు ఉంటాయని తెలిపారు. తమ డెడ్‌లైన్ మేరకు ఇరాన్ స్పందించకపోతే తమ చర్యలు అత్యంత భయానకంగా ఉంటాయని ట్రంప్ తెలిపారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ వెంటనే తిప్పికొట్టింది. ఆయన హెచ్చరికలకు జవాబు ఏమీ ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన రెండు ప్రధాన నగరాలపై దాడులు చేసింది. ట్రంప్ 48 గంటల హర్మూజ్ గడువు, దీనిని ఇరాన్ బేఖాతరు చేయడంతో మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు మరింత ప్రమాదకర మలుపు తిరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. తమ అణు స్థావరాలపై ఎటువంటి దాడులు జరిగినా వీటికి స్పందనగా వెంటనే గల్ఫ్ దేశాల్లోని పలు చమురు కేంద్రాలు, క్షేత్రాలపై దాడులు జరుగుతాయని ఇరాన్ హెచ్చరించింది. తాము హర్మూజ్ జలసంధి మార్గంలో తమ దేశ శత్రు నౌకలు కాకుండా ఇతర నౌకలను అనుమతిస్తామని మరోసారి ఇరాన్ ఆదివారం తెలిపింది. ట్రంప్ ఘాటు హెచ్చరికల గురించి స్పందించకుండా ఈ విషయం తెలిపారు. 

మన తెలంగాణ 22 Mar 2026 7:55 pm

Monday 23:44 PM : 48 గంటల డెడ్‌లైన్ Andhra Prabha Story

Monday 23:44 PM : 48 గంటల డెడ్‌లైన్ Andhra Prabha Story

ప్రభ న్యూస్ 22 Mar 2026 7:54 pm