SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

కాళేశ్వరం నివేదికపై తీర్పు వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రా జెక్టు అవకతవకలు, పిసి ఘోష్ కమిషన్ భ వితవ్యంపై ఉత్కంఠత కొనసాగుతోంది. దా ని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం వెల్లడించాల్సిన తుది తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమయిన మేడిగడ్డి, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణం, నిర్వాహణలో అవకతవకలు జరిగాయని, వాటిని నిగ్గుతేల్చేందు కు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఏర్పా టు, దాని విచారణ ప్రక్రియ, నివేదికను స వాల్ చేస్తూ మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సిఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గత కొన్నినెలలుగా ఈ పిటిషన్లపై వాదనలు సుదీర్ఘ జరిగాయి. మార్చి 12వ తేదీన దీనిపై వాదనలు పూర్తి కాగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14వ తేదీన ప్రభుత్వం జీఓ నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌ను నియమించింది. దీనికి అనుగుణంగా కమిషన్ మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులను విచారించి తుది నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి అందచేసింది. కమిషన్ నివేదికపై మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులు వేరు వేరుగా కోర్టును ఆశ్రయించడంతో ఈ పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. వాదనల సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. తమపై అభియోగాలు మోపే ముందు, తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని వారు కోర్టుకు విన్నవించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. సెక్షన్8(బి), 8(సి) ప్రకారం నోటీసులు ఇవ్వలేదని, ఎక్కడా సాక్షులతో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఎలాంటి విచారణ లేకుండానే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయకక్షలో భాగంగానే ఈ కమిషన్ ను వేశారని ఆరోపించారు. కాగా, ప్రభుత్వం తరపు న్యాయవాదనలు తమ వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను వెలికితీసేందుకే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. కమిషన్ తన నివేదికను అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే సిద్ధం చేసిందని కోర్టుకు వివరించారు. విచారణలో భాగంగా పిటిషనర్లందరికీ నోటీసులు ఇచ్చి, నిబంధనల ప్రకారమే కమిషన్ ముందుకు వెళ్లిందని, ఈ పిటిషన్లను కొట్టివేయాలని ప్రభుత్వం తరపున కోర్టును కోరారు. ఈ క్రమంలో తుది తీర్పును ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం వాయిదా వేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠత ఈ నెల 22వ తేదీన తెరపడనుంది.

మన తెలంగాణ 9 Apr 2026 4:00 am

ఇరిగేషన్ మోటార్లపై ఇదేం కుట్ర?

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రా వు ధ్వజమెత్తారు. బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతుందని, ఆ నె పాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నా రా అంటూ ప్రశ్నించారు. భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చే శారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా?, లేక ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? అని నిలదీశారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, పదే పదే ఆపితే తీవ్ర న ష్టం కలుగుతుందని హెచ్చరించారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరమని, తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్ కు అనుగుణంగా ని రంతరాయంగా పంపులు నడిపించాలని, రాజకీయాల కోసం రా ష్ట్ర రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హ రీష్ రావు హెచ్చరించారు.

మన తెలంగాణ 9 Apr 2026 3:30 am

నేడు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

 నేడు (గురువారం) కేరళ, అసోం, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవల్సి ఉంది. ఇక్కడ ఎల్‌డిఎఫ్ వరుసగా మూడోసారి తన బలాన్ని పరీక్షించుకొంటోంది.కాంగ్రెస్ సారధ్య అ యుడిఎఫ్ రాష్ట్రంలో విరామం తరువాత పాగాకు యత్నిస్తోంది. ఇక బిజెపి సారధ్య ఎన్‌డిఎ తన ఖాతా తెరిచేందుకు రంగంలోకి దిగింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలలో మొత్తం మీద 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ అత్యధిక స్థానాలలో యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్ మధ్యనే ఉంటుంది. బిజెపి రాకతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. పది సంవత్సరాల తమ పాలనలో సాధించిన ప్రగతిని చాటుకుంటూ అధికార ఎల్‌డిఎఫ్ ప్రచారం సాగించింది. ఈ హయాంలో అవినీతిని ఎండగడుతూ ప్రతిపక్ష యుడిఎఫ్ విజయం కోసం ఆరాటపడుతోంది. ఈశాన్య రాష్ట్రం అసోంలో బిజెపి ఈసారి గెలుపుతో హ్యాట్రిక్‌కు సర్వశక్తులు ఒడ్డింది. ఇక్కడ ఎన్‌డిఎ, కాంగ్రెస్ నాయకత్వ ప్రతిపక్ష కూటమి నడుమ పోటి నెలకొని ఉంది. 126 మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇప్పుడు మొత్తం 722 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ్ గొగోయ్, ప్రతిపక్ష నేత దెవవ్రత సైకియా, ఎఐయుడిఎఫ్ అధ్యక్షులు బద్ద్రుద్దీన్ అజ్మల్, రాయ్‌జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్ , ఎజెపి ప్రెసిడెంట్ లూరింజ్యోతి గగోయ్ రంగంలో ఉన్నారు. ఈసారి ఎన్నికలకు చాలా కాలం ముందుగానే రాష్ట్ర కాంగ్రెస్ నేత గౌరవ్ ప్రధాన కేంద్రంగా బిజెపి పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆయన జాతీయతను ప్రశ్నించింది. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారమే ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 294 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు, ఇక్కడ ఎన్‌డిఎకు కాంగ్రెస్, అన్నాడిఎంకె, విసికెతో కూడిన ఇండియా కూటమి సవాలు విసురుతోంది. ఈసారి నటుడు విజయ్ కూడా తమ టివికె పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఎన్‌డిఎలో కీలకమైన ఎఐఎన్‌ఆర్‌సి నేత , సిఎం రంగస్వామి ఇప్పుడు థట్టన్‌చావడీ, మంగళం స్థానాల నుంచి పోటీలో ఉన్నారు

మన తెలంగాణ 9 Apr 2026 12:20 am

గురువారం రాశి ఫలాలు(09-04-2026)

మేషం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృషభం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. మిధునం గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు. సింహం చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. కన్య సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వృశ్చికం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనస్సు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మకరం వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీనం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.  

మన తెలంగాణ 9 Apr 2026 12:00 am

ఢిల్లీ క్యాపిటల్స్‌ పై గుజరాత్ టైటాన్స్ విజయం

 ఐపిఎల్ గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో గుజరాత్ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇదే తొలి గెలుపు కాగా, ఢిల్లీ మొదటి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన జోస్ బట్లర్ 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ (55) పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (41), కెఎల్ రాహుల్ (92) అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది.

మన తెలంగాణ 8 Apr 2026 11:51 pm

తాగునీటి కొరత రానీయొద్దు

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం విశాలాంధ్ర-హైదరాబాద్: వేసవి నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ జల సరఫరా శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టుగా వినియోగించేలా అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి […] The post తాగునీటి కొరత రానీయొద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:45 pm

హర్మూజ్ జలసంధిని తిరిగి మూసేసిన ఇరాన్

బుధవారం కొద్ది సేపు హర్మూజ్ జలసంధి మార్గం తెరిచేందుకు అంగీకరించిన ఇరాన్ తరువాత నిర్ణయం మార్చుకుంది. ఇజ్రాయెల్ నుంచి లెబనాన్‌పై భారీ స్థాయిలో దాడులతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. దీనితో కాల్పుల విరమణ ప్రక్రియ ఆదిలోనే ఆటంకాలతో కుంటుపడింది. హర్మూజ్‌పై ఇరాన్ తాజా నిర్ణయం గురించి ఇరాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ తూట్లుపొడుస్తున్న దశలో తమ నిర్ణయాలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికా తన పెంపుడు పిచ్చికుక్కను అదుపులో పెట్టలేకపోతే , తాము అందుకు తగ్గట్లుగానే దెబ్బ తీయాల్సి ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రక్రియలో లెబనాన్ కూడా ఉందని శాంతిచర్చలలో కీలకమైన పాకిస్థాన్ అంతకు ముందు తెలిపింది. 

మన తెలంగాణ 8 Apr 2026 11:34 pm

నేటి నుంచి దుకాణాల వేలం

అందుబాటులో 36 కాలనీల్లో 1400 షాపులు విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగరంలోని క్యూర్ పరిధిలో డబుల్ బెడ్ రూం కాలనీల్లో ఉన్న 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేల ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీచేశారు. తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది కాలనీల్లో […] The post నేటి నుంచి దుకాణాల వేలం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:33 pm

తోక ముడిచిన ట్రంప్

ఇరాన్‌పై రెండు వారాలు సైనిక చర్య నిలిపివేసినట్లు ప్రకటన . ఈ లోగా ఒప్పందం చేసుకుంటామని వెల్లడి. పది షరతులతో కాల్పుల విరమణకు అంగీకరించిన తెహ్రాన్. దురాక్రమణకు పాల్పడితే దీటుగా స్పందిస్తామని హెచ్చరిక. రేపు ఇస్లామాబాద్‌లో చర్చలకు ఇరుదేశాలకు పాక్ ఆహ్వానం తెహ్రాన్/వాషింగ్టన్: ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని ప్రగల్బాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఇరాన్ చూపిన తెగువకు తల వంచారు. ీVAర్మోజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడువు మరో […] The post తోక ముడిచిన ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:24 pm

ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం

. పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి. ఈవీ బస్సుల వినియోగం పెంచుదాం. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు, […] The post ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:21 pm

అమరావతికి మరో కీలక ప్రాజెక్టు

కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణంరూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ను […] The post అమరావతికి మరో కీలక ప్రాజెక్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:18 pm

లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్‌టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోకు […] The post లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:16 pm

అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ […] The post అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:12 pm

ఆహార భద్రత డొల్ల!

. ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్ల చెలగాటం. మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. 28వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంకింగ్. ఎఫఎసఓలు, ఏఎఫ్‌సీలు విజిటింగ్‌లకే పరిమితం. 30 శాతం లైసెన్సులు లేకుండానే వ్యాపారం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ అపహాస్యమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను కట్టడి చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాల్లో నాణ్యతలేని పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతుంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు […] The post ఆహార భద్రత డొల్ల! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:08 pm

ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం

డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. హోర్మూజ్ జలసంధిలో […] The post ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:03 pm

అమెరికా జర్నలిస్ట్ విడుదల

వాషింగ్టన్: ఇరాక్‌లో గత వారం కిడ్నాప్‌కు గురైన అమెరికా జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ సురక్షితంగా విడుదల య్యారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం అధికారికంగా ధ్రువీకరిం చారు. ఆమె విడుదలతో తామంతా ఊపిరి పీల్చుకున్నామని, ఇరాక్ నుంచి ఆమె సురక్షితంగా బయటకు వచ్చేం దుకు పూర్తి సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. మార్చి 31న బాగ్దాద్‌లోని ఒక వీధిలో ఇరాన్ మద్దతున్న కతైబ్ హిజ్బుల్లా అనే మిలీషియా గ్రూప్ షెల్లీ కిటిల్సన్‌ను […] The post అమెరికా జర్నలిస్ట్ విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 10:59 pm

నెతన్యాహుపై ఇజ్రాయిల్‌లో తిరుగుబాటు!

తెలఅవీవ్: ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. ఇరాన్‌ను సమూలంగా దెబ్బతీస్తానని ప్రకటించి, మధ్యలోనే యుద్ధ విరమణకు అంగీకరించడంపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ‘చారిత్రక తప్పిదం’ అంటూ ప్రతిపక్షాలు, రక్షణ రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒప్పందం ఇజ్రాయిల్ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ వైఫల్యమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సైన్యం సమర్థవంతంగా పోరాడుతున్నప్పటికీ, నెతన్యాహు తీసుకున్న అనాలోచిత […] The post నెతన్యాహుపై ఇజ్రాయిల్‌లో తిరుగుబాటు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 10:57 pm

డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లొద్దు

యువతకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సూచనచెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్… యువతకు మంచి సందేశం ఇచ్చారు. దయచేసి డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లవద్దని సూచించారు. చెన్నై విమానాశ్రయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కాలంలో యువత పెడదోవ పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేని జీవితం నరకప్రాయమవుతుందని హెచ్చరించారు. యువత కేవలం సినిమాల్లోని స్టంట్లు, నటుల వేషధారణ చూసి ప్రభావితమై బైక్ రేసింగ్ వంటి ప్రమాదకర పనులకు పాల్పడటం సరికాదని… అది ప్రాణాపాయానికి దారితీస్తుందని హితవు […] The post డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లొద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 10:55 pm

Iran War Strategy: ఆయుధ సేకరణం Andhra Prabha Top Story

Iran War Strategy: ఆయుధ సేకరణం Andhra Prabha Top Story (

ప్రభ న్యూస్ 8 Apr 2026 10:31 pm

Supriya reveals emotional journey behind production logo

Producer Supriya Yarlagadda became talk of the town post Adivi Sesh’s Dacoit pre-release event. While Mythri Ravi and Naga Vamsi words about her strictness went viral, her emotional side while revealing story behind logo of their production banner, SS Creations. She stated that she added Akkineni Nageswara Rao’s Panche, who guided them throughout their life, […] The post Supriya reveals emotional journey behind production logo appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 10:23 pm

Active Producers Guild strongly Oppose Percentage Model

A week ago, the exhibitors of the single screens from Telangana announced that Hyderabad single screens will be in business on a percentage models and a list of 23 single screens are listed in the statement issued. The distributors will get 60 percent share from the Nett in the first week, 50 percent share in […] The post Active Producers Guild strongly Oppose Percentage Model appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 10:10 pm

Iran Us Ceasefire : జ‌ల‌తంత్రం Andhra Prabha Top Story

Iran Us Ceasefire : జ‌ల‌తంత్రం Andhra Prabha Top Story ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 8 Apr 2026 10:09 pm

టాటా మోటార్స్ టాటా ఇంట్రా ఈవీ పికప్ విడుదల

ముంబయి: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, సరికొత్త టాటా ఇంట్రా ఈవీ పికప్‌ను ప్రారంభిస్తూ ఎలక్ట్రిక్ వాణిజ్య చలనశీలతలో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసింది. ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, ఈ కొత్త పికప్ విశ్వసనీయ ఇంట్రా ప్లాట్‌ఫారమ్ బలాన్ని, ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌తో కలిపి అందిస్తోంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న కార్గో అవసరాలను తీర్చేందుకు నమ్మదగిన, అధిక ఆదాయం సాధించే పరిష్కారంగా ఇది రూపుదిద్దుకుంది. […] The post టాటా మోటార్స్ టాటా ఇంట్రా ఈవీ పికప్ విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 10:02 pm

ఖరీఫ్ ఎరువులపై రూ 41,534 కోట్ల సబ్సిడీ ఖరారు

 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో ఖరీఫ్ పంటకాలానికి ఎరువులలో సబ్సిడీని 12 శాతం పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖరీఫ్‌లో నత్రజని, భాస్వర (పి. కె) ఎరువులపై ప్రభుత్వ సబ్సిడీ పెరుగుదల రూ 41,534 కోట్లుగా నిర్ణయించారు. గల్ఫ్ యుద్ధంతో సరఫరాల ఆటంకాలతో అంతర్జాయ స్థాయి ధరల ప్రభావం ఎరువులపై పడకుండా ఉండేందుకు సబ్సిడీని పెంచారు. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటకాలానికి నత్రజని ఆధారిత ఎరువులపై కిలోకు రూ 47.32 పైసలు చొప్పున పెరుగుతుంది. ఇక ఫాస్పేట్ ఎరువులపై సబ్సిడీలు కిలోకు రూ 52.76 చొప్పున పెరుగుతాయని కేబినెట్ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఇక సల్ఫర్ ఎరువులపై సబ్సిడీలు రూ 3.16గా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ పంటల పోషక ప్రతిపాదిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) స్కీమ్ పరిధిలో ఈ సబ్సిడీల పెంపుదల ఖరారు చేశారు. ఈ పథకం 2010 ఏప్రిల్ నుంచి అమలులో ఉంది. గత ఏడాది 2025 ఖరీఫ్ సీజన్ సబ్సిడీ మొత్తంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఏడాది పెంపుదల రూ 4317 కోట్లుగా ఉందని తెలిపారు.ఎన్‌బిఎస్ స్కీమ్ పరిధిలోకి వచ్చే 28 రకాల ఎరువుల సబ్సిడీలకు ఈ పెంపుదల వర్తిస్తుంది. కోవిడ్ దశలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు ప్రత్యేకించి డిఎపి వంటి వాటి దరలు గణనీయంగా పెరిగాయి. అయితే దేశంలో 50 కిలోల ఎరువుల సంచి రిటైల్ ధర రూ 1350గానే ఉంచామని మంత్రి వివరించారు. ఇప్పుడు యుద్ధం దశలోనూ రైతుల ఎరువులపై భారం పడకుండా పలు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేబినెట్‌లో రెండు ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రూ 40000 కోట్ల వ్యయ అంచనాలతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన అంశం కూడా ఉంది. జైపూర్ మెట్రోరైలు రెండో దశకు కూడా ఆమోదం వెలువడిందని కేబినెట్ తరువాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వెస్ట్‌బెంగాల్ జార్ఖండ్ మల్టీ ట్రాకింగ్ రైలు ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ వెలువడింది.రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీ రెట్టింపు సామర్థపు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజస్థాన్ రిఫైనరీ డబ్లింగ్ పనులకు రూ 79,450 కోట్ల వ్యయ అంచనాలకు ఆమోదం తెలిపారు. హెచ్‌పిసిఎల్ నుంచి అదనపు ఈక్విటీ మద్దతు కూడా ఈ ప్రాజెక్టుకు దక్కుతుంది. ఈ మేరకు ఇప్పుడు హెచ్‌సిఎల్ నుంచి ఈ ప్రాజెక్టులో రూ 19600 కోట్ల వరకూ ఈక్విటీ ఉంటుంది. ఈ రిఫైనరీకి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న ప్రారంభోత్సవం జరుపుతారు.

మన తెలంగాణ 8 Apr 2026 10:01 pm

జీవన్ రెడ్డికి కెటిఆర్ ఫోన్.. బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫోన్ కాల్ మాట్లాడారు. రేపు(ఏప్రిల్ 9) కెటిఆర్ జగిత్యాల పర్యటనలో భాగంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసానికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీలోకి కెటిఆర్ ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో తనకు అవమానం జరిగిందని.. ఆ పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన బిఆర్ఎస్ లో  చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కెటిఆర్, జీవన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.

మన తెలంగాణ 8 Apr 2026 9:57 pm

వెల్కమ్‌హోటల్ బ్రాండ్ 50వ హోటల్ మైలురాయి: ఐటీసీ హోటల్స్ వేడుకలు

న్యూదిల్లీ: ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ (ఐటీసీహెచఎల్) భారతదేశంలో వెల్కమ్‌హోటల్ బ్రాండ్ కోసం 50వ హోటల్ మైలురాయి ఒప్పందాన్ని ఈరోజు ప్రకటించింది. పెరుగుతున్న ఈ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోకు షిర్డీ మరియు భువనేశ్వర్‌లలో కొత్త హోటళ్లను చేర్చింది. వెల్కమ్‌హోటల్ బ్రాండ్ కోసం త్వరలో ప్రారంభం కానున్న గమ్యస్థానాలలో సిక్కింలోని గాంగ్‌టక్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్ ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డీలో మెస్సర్స్ శాండీ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న 73 గదుల హోటల్‌ను నిర్వహించడానికి ఐటీసీహెచఎల్ ఇటీవల వారితో ఖచ్చితమైన ఒప్పందాలను […] The post వెల్కమ్‌హోటల్ బ్రాండ్ 50వ హోటల్ మైలురాయి: ఐటీసీ హోటల్స్ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 9:57 pm

ఎసిబి వలలో అవినీతి పోలీసులు

పాస్‌పోర్ట్ కేసులో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్ పోస్ట్ సీఐ సంపత్తి కనుకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇటీవల ఫేక్ పాస్‌పోర్ట్ కేసులో నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన కేరళకు చెందిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన వ్యక్తిని ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని పోలీసులు సూచించారు, చార్జిషీట్ ఫైల్ చేయడం కోసం బాధితుడిని సీఐ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర్‌లు మొదటగా రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబసభ్యుల పేర్లు కూడా చార్జిషీట్‌లో చేరుస్తామని వారు హెచ్చరించారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడగా రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా మంగళవారం రూ.2 లక్షల లంచం సీఐ కనకయ్య, ఎస్‌ఐ సిద్దేశ్వర్‌లు తీసుకుంటుండగా పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.

మన తెలంగాణ 8 Apr 2026 9:56 pm

సహజ రత్నాల విభాగంలో తనిష్క్ కొత్త అధ్యాయం ప్రారంభం

హైదరాబాద్: పవిత్రమైన అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో, టాటా సంస్థకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్, సహజ రత్నాల విభాగంలో తమ తాజా ఆభరణాలను రుక్మిణి వసంత్‌తో కలిసి ఆవిష్కరించింది. దక్షిణ భారతదేశంలో ఎల్లప్పుడూ రత్నాలు, కేవలం అలంకరణకు మించినవి; అవి సంప్రదాయం, గుర్తింపు, నిత్యజీవితపు సొగసుకు ప్రతీకలు. టెంపుల్ జ్యువెలరీ ప్రభావం నుండి ఉత్సాహభరితమైన వేడుకల వరకూ, ఈ ప్రాంతపు సౌందర్య భాషలో లోతుగా రత్నాలు పెనవేసుకుపోయాయి. కెంపులు, పచ్చలు, […] The post సహజ రత్నాల విభాగంలో తనిష్క్ కొత్త అధ్యాయం ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 9:54 pm

Jagan Threats to ABN Radha Krishna and Chandrababu Naidu

Former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has once again stirred political debate with his sharp remarks against ABN Andhra Jyothy and its managing director Vemuri Radhakrishna. His statements were not limited to criticism. They carried clear warnings of action if his party returns to power. Jagan alleged that the media house has […] The post Jagan Threats to ABN Radha Krishna and Chandrababu Naidu appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 9:41 pm

హరీష్ రావు వనపర్తి సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బిఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు వనపర్తి సభకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా ఎస్పి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం నియోజకవర్గంలో హరీశ్ రావు సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు హరీశ్ రావు వనపర్తి పర్యటనకు సిద్దమయ్యారు. దీని కోసం ముందుగా అనుమతులు తీసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ జిల్లా ఎస్పి అనుమతులను రద్దు చేశారు. ఈ క్రమంలో అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ హరీష్ రావు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు పోలీసుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సభ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే, నిబంధనల ప్రకారం శాంతియుతంగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో హరీష్ రావు వనపర్తి సభకు మార్గం సుగమమయ్యింది.

మన తెలంగాణ 8 Apr 2026 9:37 pm

యురేనియం శుద్ధి నిలిపివేతే లక్ష్యం: ట్రంప్

ఇరాన్‌తో కాల్పుల విరమణ అనంతరం కొత్త దశ చర్చల్లో యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్న పట్టుదలతో అమెరికా ముందుకు వెళ్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో టారిఫ్ తగ్గింపులు, ఆర్థిక ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ ఒప్పందం విసృ్తత పరిధిలో ఇప్పటికే కొన్ని కీలక అంశాలు అంగీకారానికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో, ఇరాన్‌లో యురేనియం శుద్ధి పూర్తిగా నిలిచిపోతుంది. అమెరికా, ఇరాన్‌తో కలిసి లోతుగా దాచిన అణు మౌలిక సదుపాయాల అవశేషాలను వెలికితీసి తొలగిస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలు ఉపగ్రహాల ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయని, దాడి జరిగినప్పటి నుంచి వాటిలో మార్పులేమీ లేవని కూడా ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో ఆర్థిక చర్చలు కీలక పాత్ర పోషిస్తాయని ట్రంప్ సూచించారు. టారిఫ్‌లు తగ్గించడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 15 అంశాల్లో చాలా వరకు ఇప్పటికే అంగీకారానికి వచ్చాయి అని పేర్కొన్నప్పటికీ, వాటి వివరాలు వెల్లడించలేదు. అలాగే, ఇరాన్‌కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికాకు ఎగుమతులపై వెంటనే 50 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నిర్ణయానికి ఎలాంటి మినహాయింపులూ ఉండవని స్పష్టం చేశారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం చివరి క్షణంలో సాధ్యమైంది. అయితే దీని అమలు, షరతులపై ఇంకా స్పష్టత లేదు. ఒప్పందం ప్రకటించిన కొద్ది గంటల్లోనే యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో క్షిపణి హెచ్చరికలు నమోదయ్యాయి. ఇరాన్‌లో చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు కూడా సమాచారం వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని సున్నితమైన తాత్కాలిక విరమణగా అభివర్ణించారు. లెబనాన్‌లోని హెజ్బొల్లాపై యుద్ధం కూడా ఒప్పందంలో భాగమా అనే విషయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదంలో ప్రధాన కేంద్రంగా మారింది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై ఫీజులు విధించే విధానాన్ని ఇరాన్ అమలు చేయవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఒమాన్‌తో కలిసి ఈ వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మార్గంలో రాకపోకలు ఇరాన్ సైన్య పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. అయితే గల్ఫ్ దేశాలు దీనికి వ్యతిరేకంగా నిలిచే అవకాశముంది. ఇరాన్ అణు కార్యక్రమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఇరాన్ గతంలో యురేనియంను 60 శాతం వరకు శుద్ధి చేసింది, ఇది ఆయుధ స్థాయి శుద్ధికి దగ్గరగా ఉంటుంది. అధిక శుద్ధి యురేనియం నిల్వలు ఇంకా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరాన్ విడుదల చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనలో ఫార్సీ, ఇంగ్లీష్ పత్రాల్లో వ్యత్యాసాలు కనిపించాయి. ఫార్సీ వెర్షన్‌లో శుద్ధి కొనసాగుతుందని సూచనలు ఉండగా, ట్రంప్ దానిని తప్పుడు పత్రంగా కొట్టిపారేశారు. అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ఇంకా వెలుగులోకి రాలేదు. యుద్ధం ముగియాలంటే అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, ఆంక్షలు ఎత్తివేయడం, నిల్వ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను ఇరాన్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి అమెరికాకు ఆమోదయోగ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టెహ్రాన్‌లో కాల్పుల విరమణ అనంతరం ప్రభుత్వ అనుకూల నిరసనలు కొనసాగడం, అమెరికాఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు వినిపించడం, దేశంలో కఠిన వైఖరి ఇంకా కొనసాగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో శాశ్వత ఒప్పందంపై చర్చలు త్వరలో ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మన తెలంగాణ 8 Apr 2026 9:29 pm

ఐపిఎల్ 2026: ఢిల్లీ ముందు భారీ టార్గెట్ ఉంచిన గుజరాత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు, గుజరాత్ టైటాన్స్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) అర్ధ శతకాలతో చెలరేగారు

మన తెలంగాణ 8 Apr 2026 9:29 pm

కొత్త అవతారంతో ‘రాకా’

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సంచలన దర్శకుడు అట్లీ, టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ముందు వరుసలో ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ‘రాకా’ టైటిల్‌తో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ అప్డేట్‌లతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ కొత్త అవతారంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండుతో, వింత శరీరాకృతితో అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు. అల్లు అర్జున్ చూపుల్లో వాడివేడి, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు అందరిలోనూ అంచనాల్ని రెట్టింపు చేసింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.అభిమానులు ఐకాన్ స్టార్ పుట్టినరోజును ఈ అప్డేట్లతో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపు కుంటున్నారు. దాదాపు ఏడాది పాటు అభిమానులను ఎదురుచూసేలా చేసిన తర్వాత అట్లీ, అల్లు అర్జున్ ఈ అప్డేట్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ‘పుష్ప: ది రూల్’ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ‘రాకా’తో అందరినీ మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ‘రాకా’ ఒక భారీ సాంకేతిక చిత్రంగా ఉంటుందని, హాలీవుడ్ దిగ్గజాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్, ప్రపంచ నిర్మాణాన్ని సృష్టించాలని అట్లీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ‘జవాన్’, ‘తేరి’, ‘బిగిల్’, ‘మెర్సల్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లతో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా అట్లీ నిలిచారు. అలాంటి అట్లీ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన మీడియా పవర్‌హౌస్‌లలో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్‌తో కలిసి ‘రాకా’ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథనాన్ని మేళవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా ‘రాకా’ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 8 Apr 2026 9:25 pm

జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఖరీఫ్ సబ్సిడీ కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో రెండు ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రూ 40000 కోట్ల వ్యయ అంచనాలతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన అంశం కూడా ఉంది. 2026 ఖరీఫ్ సీజన్‌కు ఎన్‌బిఎస్ సబ్సిడీ రేట్లకు ఆమోదం, జైపూర్ మెట్రోరైలు రెండో దశకు కూడా ఆమోదం వెలువడిందని కేబినెట్ తరువాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. వెస్ట్‌బెంగాల్ జార్ఖండ్ మల్టీ ట్రాకింగ్ రైలు ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ వెలువడింది. 

మన తెలంగాణ 8 Apr 2026 9:20 pm

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. తీవ్రంగా స్పందించిన ఇరాన్

టెహ్రాన్: ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. మిస్సైల్స్ తో పెద్ద ఎత్తున దాడులకు దిగింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై 100 వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. లెబనాన్‌పై దాడి చేస్తూ.. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కొనసాగిస్తే, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం నుండి వైదొలుగుతామని ఇరాన్ హచ్చరించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్, యుద్ధ విరమణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ దేశాన్ని శిక్షిస్తామని ఇరాన్‌ పేర్కొంది. ఈ యుద్ధ విరమణ ఒప్పందం లెబనాన్‌ కూ వర్తిస్తుంది. ఇజ్రాయెల్ వాగ్దానాలను ఉల్లంఘించడంలో పేరుగడించింది. దానిని తూటాలతో మాత్రమే ఆపగలం అని ఇరాన్ తెలిపింది. 

మన తెలంగాణ 8 Apr 2026 9:20 pm

ఇరాన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపై 50 శాతం టారిఫ్‌లు : ట్రంప్

ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ తమ దేశానికి ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవంటూ ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు. ఇరాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ట్రంప్ ప్రయోజనకరమైన పాలనాపరమైన మార్పుగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పని చేస్తామన్నారు. భూగర్భ అణు కేంద్రాలపై బి2 బాంబర్లతో చేసిన దాడుల వల్ల ఏర్పడిన అణువ్యర్థాలను టెహ్రాన్ సహాయంతో పూర్తిగా వెలికి తీసి తొలగిస్తామన్నారు. దాడులు జరిగిన నాటి నుంచి ఆ ప్రాంతంలో దేనినీ కదిలించలేదని, అమెరికా స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాల ద్వారా నిరంతరం ఆ ప్రదేశంపై నిఘా ఉంచామని తెలిపారు. ఇరాన్‌లో ఇకపై ఎలాంటి యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగబోవని తేల్చి చెప్పారు. సుంకాలు, ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించే అంశంపై ప్రస్తుతం ఆ దేశంతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రతిపాదన లోని అనేక అంశాలపై ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. 

మన తెలంగాణ 8 Apr 2026 9:17 pm

మొహిసినా కిద్వాయ్ కన్నుమూత

కాంగ్రెస్ ప్రముఖ నాయకురాలు , కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్ బుధవారం కన్నుమూశారు. ఈ నాయకురాలి వయస్సు 94 సంవత్సరాలు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మంత్రివర్గాలలో కిద్వాయ్ కీలక మంత్రిత్వశాఖలు నిర్వర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకికి చెందిన కిద్వాయ్ ఇందిరా గాంధీకి కుడిభుజంగా వ్యవహరించారు. వయోవృద్ధ అనారోగ్య సమస్యలతో చికిత్సకు చేరిన ఆమె నోయిడాలోని మెట్రో హాస్పిటల్‌లో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు రజీ ఉర్ రెహ్మన్ కిద్వాయ్ తెలిపారు. అంత్యక్రియలు, సాయంత్రం నిజాముద్దిన్ ఖననవాటికలో జరిగాయి. అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులు అర్పించారు. ఖర్గే, రాహుల్ గాంధీ ఇతరులు సంతాపం తెలిపారు. 

మన తెలంగాణ 8 Apr 2026 9:13 pm

భభానీపూర్‌తోనే ఏదైనా నామినేషన్ దశలో మమత బెనర్జీ

తన జీవితంలో అంతా ఇక్కడి నుంచే ఆరంభమయిందని సొంత నియోజకవర్గం భభానీపూర్ నుంచి నామినేషన్ సందర్భంగా తెలిపారు. బుధవారం ఆమె మమత బెనర్జీ జిందాబాద్, జాయ్ బంగ్లా, టిఎంసి జిందాబాద్ నినాదాల మధ్య మమత బెనర్జీ ఆకర్షణీయమైన ప్రదర్శన సాగింది. తాను ఇక్కడనే పుట్టానని, ఇక్కడనే ఏడాది పొడవునా ఉంటానని, తన జీవితం ఇక్కడ ఆరంభమైంది. ఉద్యమాలు, జయాపజయాలు అన్నింటికీ ఈ ప్రాంతం కేంద్రీకృతం అయిందని , ఇక్కడి వారికి ధన్యవాదాలు అని మమత తెలిపారు. తమ కాళీఘాట్ నివాసం నుంచి అలీపోర్ సర్వే బిల్డింగ్ వరకూ ప్రదర్శన సాగింది. 2021లో మమత ఎన్నికల రాజకీయ ప్రక్రియ ఆరంభమైంది. ముకుళిత హస్తాలతో, తనదైన చిరునవ్వుతో పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు వెంటరాగా మమత నామినేషన్ దాఖలు కార్యక్రమం సాగింది. పార్టీ కార్యకర్తలు టిఎంసి జెండాలు పట్టుకుని, ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడిన మమత బిజెపిపై, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. సర్ ప్రక్రియతో అర్హులైన ఓటర్లపై వేటు వేశారని మమత ఆరోపించారు. ఈ వ్యవహారంపై తమ పార్టీ కోర్టుకు వెళ్లుతుందని హెచ్చరించారు. పేర్ల తొలిగింపుతో రాష్ట్రంలో తమ టిఎంసి ఓడిపోదని, జనం గుండెల్లో నిలిచి ఉందని తెలిపారు. బెంగాల్‌లో ఈ 23, 29 తేదీలలో రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. రాష్ట్రంలో అధికార పరివర్తనకు బిజెపి పిలుపు నిచ్చింది. మమత ప్రతిష్టాత్మక స్థానం నుంచి బెంగాల్ బిజెపి నేత సువేందు అధికారి గత వారం నామినేషన్ దాఖలు చేశారు. దీనితో ఇక్కడ పోటీ కీలకమైంది.

మన తెలంగాణ 8 Apr 2026 9:10 pm

కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ చమురు శుద్ధి కేంద్రంపై దాడి

యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్‌లోని లావన్ దీవిలో ఉన్న ఒక చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. ఈ దాడి కారణంగా శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. దాడిని ఎవరు నిర్వహించారు అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు.

మన తెలంగాణ 8 Apr 2026 9:00 pm

Dacoit Censor Report: Adivi Sesh is back with a blockbuster

Adivi Sesh has consistently delivered blockbusters with his unique style of films and consistent performances at the box office. Taking a four-year gap to deliver perfect love story with thriller elements, he brought us the highly anticipated Dacoit, hitting theaters on this April 10, 2026. The movie completed censor formalities with a U/A certification with […] The post Dacoit Censor Report: Adivi Sesh is back with a blockbuster appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 8:55 pm

హెజ్బొల్లాపై యుద్ధం కొనసాగుతూనే ఉంది: ఇజ్రాయెల్

 లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై యుద్ధంలో పోరాటం, భూభాగ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి అని ఇజ్రాయెల్ సైన్యం బుధవారం స్పష్టం చేసింది. ఇరాన్ యుద్ధానికి సంబంధించి రెండు వారాల కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ దాడులను నిలిపివేస్తుందని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ, యుద్ధం కొనసాగుతుందనే విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. కాల్పుల విరమణ అమలులోకి వచ్చే వరకు ఇరాన్‌పై కూడా దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ వర్గాలు అంగీకరించాయి. ఇరాన్‌పై కాల్పుల విరమణను గౌరవిస్తూనే, హెజ్బొల్లాపై యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ముందుగా పేర్కొన్నారు. ఈ పరిణామాలపై హెజ్బొల్లా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనా వెలువడలేదు.

మన తెలంగాణ 8 Apr 2026 8:52 pm

అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం

పశ్చిమాసియా రణరంగంగా మారింది. ప్రపంచమంతా పెట్రోల్ ధరల మంటలు.. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు.. వీటన్నింటి నడుమ హార్మూజ్‌ను తెరవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన డెడ్‌లైన్ దగ్గరపడుతోంది. గడువు ముగిస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో అని ప్రపంచమంతా ఆందోళనగా ఎదురుచూసింది. ఈ సమయంలోనే ట్రంప్ ‘ఓ నాగరికత అంతమవుతోంది’ అని విరుచుకుపడ్డారు. మరోవైపు.. ఏమాత్రం తొణకని ఇరాన్.. సంధికి మాత్రం ససేమిరా అంటూ కూర్చుంది.. దీంతో భీకరదాడులు తప్పవనే ఉత్కంఠ పరిస్థితుల్లోకి ప్రపంచం వెళ్లిపోయింది.డెడ్‌లైన్ ముగిసేది రాత్రి ఎనిమిది గంటలకు.. ఆ తర్వాత వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులకు టార్గెట్ లిస్ట్ సిద్ధమైంది. టెహ్రాన్ సమీపంలోని ఒక భారీ వంతెనను ధ్వంసం చేశామని.. జరగబోయే విధ్వంసానికి ఇది నిదర్శనమంటూ ట్రంప్ చేసిన ప్రచారం, ఖార్గ్ ద్వీపంపై దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. యుద్ధంలో వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేని ఇరాన్.. ఈ బెదిరింపులను మరింత సీరియస్‌గా తీసుకుంది. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాలన్నీ యుద్ధం తీవ్రరూపం దాల్చొచ్చనే సంకేతాలను ఇచ్చాయి. ఈ సమయంలో ట్రంప్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. డెడ్‌లైన్‌కు కేవలం 90 నిముషాల ముందు సాయంత్రం పోస్టు పెట్టారు. హార్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ పది పాయింట్ల ప్రతిపాదనలు, చర్చలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇరాన్ స్పందించింది. అలా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. చివరి క్షణాల్లో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై భారీ బాంబుదాడుల హెచ్చరికల నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిందా? దాని షరతులు ఏమిటి? దీర్ఘకాలిక శాంతికి దారి తీస్తుందా? అనే అంశాలపై స్పష్టత లేదు. పక్షాలు ఒప్పంద నిబంధనలను భిన్నంగా వివరిస్తున్నాయి. ఒప్పందం ప్రకటన అనంతరం గంటల వ్యవధిలోనే ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు ఇరాన్ నుంచి క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం రావడంతో పాటు, కువైట్ సైన్యం డ్రోన్ దాడులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఇరాన్‌లోని ఒక చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు సమాచారం వెలువడింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని సున్నితమైన తాత్కాలిక విరమణగా అభివర్ణించారు. ఒప్పందంపై చర్చలు త్వరలో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నప్పటికీ, కీలక అంశాలు ఇంకా అనిశ్చితంగా ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఫీజులు వసూలు చేసే విధానాన్ని చట్టబద్ధం చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఇరాన్ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన షరతులు ఇంకా వెల్లడి కాలేదు. ఇతర దేశాలు దీనికి అంగీకరించాయా, లేదా అన్నదీ తెలియరాలేదు. ఇదే సమయంలో లెబనాన్‌లోని పోరాటాలను ఈ ఒప్పందం నిలిపివేస్తుందని పాకిస్తాన్ పేర్కొనగా, ఇజ్రాయెల్ మాత్రం అంగీకరించలేదు. టెహ్రాన్ వీధుల్లో ప్రభుత్వం అనుకూలంగా నిరసనకారులు అమెరికా మృతి, ఇజ్రాయెల్ మృతి అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామాలు తీవ్రవాద వర్గాల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒప్పందం కుదరకపోతే ఒక నాగరికత అంతరించిపోతుంది అని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ షరతులపై విభిన్న వాదనలు ట్రంప్ చెప్పిన ప్రకారం, ఇరాన్ 10 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఫార్సీ భాషలో బయటకు వచ్చిన ఈ పత్రంలో ఇరాన్ యురేనియం శుద్ధిని కొనసాగిస్తుందని పేర్కొనడంతో, ట్రంప్ దానిని తప్పుడు పత్రంగా పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిలో అమెరికా యుద్ధనౌకలు కొనసాగుతాయని కూడా ఆయన సూచించారు. ఇరాన్ మాత్రం యుద్ధం ముగియాలంటే అమెరికా, తమ సైన్యాన్ని ఆ ప్రాంతం నుంచి ఉపసంహరించుకోవాలని, ఆంక్షలను ఎత్తివేయాలని, తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇవి అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో శాశ్వత శాంతి చర్చలు త్వరలో ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఈ ఒప్పందాన్ని మద్దతు ఇచ్చినా, లెబనాన్‌లోని హెజ్‌బుల్లా పై యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధిలో వసూళ్లకు అవకాశం యుద్ధంలో సాంకేతికంగా ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కంటే వెనుకబడి ఉన్నప్పటికీ, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ ఇరాన్‌కు వ్యూహాత్మకంగా లాభించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం నియంత్రణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. ఒప్పందం ప్రకారం, ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్, ఒమన్ దేశాలు ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని పునర్నిర్మాణానికి వినియోగిస్తామని ఇరాన్ భావిస్తోంది. అయితే ఇది అంతర్జాతీయ నావిగేషన్ సంప్రదాయాలకు విరుద్ధమని గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశముంది. ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణు, క్షిపణి కార్యక్రమాలపై స్పష్టత లేదు యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేసినప్పటికీ, అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమని చెబుతున్నప్పటికీ, అధిక శుద్ధి యురేనియం నిల్వలు ఇంకా ఉన్నట్లు అంచనా. అమెరికా, ఇజ్రాయెల్ ప్రకారం ఈ ముప్పులను తొలగించడమే యుద్ధానికి ప్రధాన కారణం. ఇజ్రాయెల్ అధికారులు, అమెరికా ఈ ఒప్పందాన్ని ముందుగానే సమన్వయం చేసిందని, ఇరాన్ మౌలిక వసతులపై దాడులు ఈ ఒప్పందానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఒప్పందం తర్వాత కూడా దాడులు ఒప్పంద ప్రకటన తర్వాత కూడా పలు దేశాల్లో క్షిపణి హెచ్చరికలు జారీ అయ్యాయి. అబుదాబిలో గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కువైట్, యుఏఇ దేశాలు డ్రోన్, క్షిపణి దాడులను అడ్డుకున్నట్లు వెల్లడించాయి. ఇరాన్‌లోని లావన్ దీవిలో చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించగా, లెబనాన్‌లో 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో కూడా పలువురు మృతిచెందినట్లు సమాచారం. అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

మన తెలంగాణ 8 Apr 2026 8:49 pm

గత ప్రభుత్వంలోనే నాదర్‌గుల్ భూములకు మ్యుటేషన్: మంత్రి పొంగులేటి

నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. ఈ భూమి బాగోతం మొత్తం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి, రేకుల షెడ్లు వేయించింది బిఆర్‌ఎస్ నాయకులేనని ఆయన మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని గత ప్రభుత్వమని, కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వం తరపు కౌంటర్ దాఖలు చేశామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.

మన తెలంగాణ 8 Apr 2026 8:43 pm

మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నగరంలో సామాన్య ప్రయాణికుడిలా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రోటోకాల్స్‌కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు. నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లారు. స్టేషన్ చేరుకున్న మంత్రి స్వయంగా టికెట్ తీసుకుని ప్లాట్‌ఫాంపైకి వెళ్లారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మంత్రి సీటు కోసం ప్రయత్నించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణీకులతో ఆయన ముచ్చటించారు. ప్రయాణీకులతో ఆయన ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని తమ మధ్య చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడారు. పలువురు ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా మంత్రి ఎంతో ఓపికగా వారితో ఫొటోలు దిగారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 8 Apr 2026 8:33 pm

మైదానంలో బట్లర్ బౌండరీల వర్షం.. హాఫ్ సెంచరీ చేసి వెంటనే ఔట్..

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు గుజరాత్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్‌కు ముఖేశ్ కుమార్ షాక్ ఇచ్చాడు. 3వ ఓవర్ తొలి బంతికే సాయి సుదర్శన్‌(12) క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన జాస్ బట్లర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 52 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్(29), సుందర్(15) ఉన్నారు.

మన తెలంగాణ 8 Apr 2026 8:27 pm

Vijay’s TVK To Reshape Tamil Nadu Poll Dynamics ?

In a significant political observation ahead of the April 23 Tamil Nadu Assembly election, Durai Vaiko stated that actor Vijay and his party Tamilaga Vettri Kazhagam (TVK) could secure close to 15 percent vote share in their debut electoral outing. He said such a performance could alter the balance of power in the state. Speaking […] The post Vijay’s TVK To Reshape Tamil Nadu Poll Dynamics ? appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 7:53 pm

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:50 pm

Powerstar to attend Mega158 Launch

Megastar Chiranjeevi is all set to launch his 158th film in a grand manner. The film will be directed by Bobby Kolli and this is their second collaboration after Waltair Veerayya. The film will have its launch in a grand manner in Hyderabad on April 11th. Powerstar Pawan Kalyan will attend the event as Special […] The post Powerstar to attend Mega158 Launch appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 7:49 pm

‘ధురంధర్’ కథ కాపీ వివాదం.. హైకోర్టులో అదిత్యకు ఊరట..

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే జోరుతో ఆ సినిమా సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ చిక్కుల్లో పడ్డారు. సంతోష్ కుమార్ అనే దర్శకుడు.. అదిత్య తన కథను కాపీ కొట్టి సినిమా తీశారంటూ ఆరోపణలు చేశాడు. ‘స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’లో తన కథ రిజిస్టర్ అయి ఉందని అదిత్య పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిచాడు. దీంతో ఆదిత్య తనపై సంతోష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని.. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నాడని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తాజాగా హై కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ చేపట్టే వరకూ ఆదిత్య గురించి ఏం మాట్లాడకూడదంటూ సంతోష్‌కు న్యాయస్థానం సూచించింది. ఇలాంటి పునరావృతం కాకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీన జరుగనుంది.

మన తెలంగాణ 8 Apr 2026 7:47 pm

స్నేహితున్ని పరామర్శించిన మాజీ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్

స్నేహితున్ని పరామర్శించిన మాజీ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:46 pm

ఇరాన్ కు ఆయుధాలు ఇస్తే.. భారీగా సుంకాలు విధిస్తా: ట్రంప్ వార్నింగ్

ఇరాన్ తో కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ హెచ్చరికలు ఇరాన్ కు కాదు..  ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు. ఇక నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ.. అమెరికాకు ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని తన ట్రూత్ సోషల్ లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.  కాగా, ఇరాన్ ఎట్టకేలకు అమెరికాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. కాల్పుల విరమణ డీల్ తర్వాత రెండు వారాల పాటు ఇరాన్‌పై దాడులకు ట్రంప్ విరామం ప్రకటించారు. హర్మూజ్‌ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్‌ అంగీకారించడంతోపాటు 10 ప్రతిపాదనలను ఇరాన్‌.. అమెరికా ముందు ఉంచింది. దీనికి ట్రంప్ ట్రంప్ అంగీకరించడంతో రెండు వారాలపాటు హార్ముజ్ లో రాకపోకలకు అనుమతి ఇస్తామని భద్రతామండలికి ఇరాన్ తెలిపింది.

మన తెలంగాణ 8 Apr 2026 7:44 pm

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : విద్యుత్ కార్మికుల సమస్యలు

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:44 pm

జుక్కల్ ఎస్సైగా మురళి నియామకం

జుక్కల్ ఎస్సైగా మురళి నియామకం జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ పోలీస్ స్టేషన్

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:41 pm

బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి…

బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి… రూ 38 లక్షలతో కేజీబీవీలో పలు పనులకు

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:37 pm

మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి

మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి చిలుపూర్, ఆంధ్ర

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:33 pm

సురక్షిత మాతృత్వమే లక్ష్యం.. సర్పంచ్ డ్యాగల రాజశేఖర్

సురక్షిత మాతృత్వమే లక్ష్యం.. సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ఆరోగ్యవంతమైన

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:31 pm

పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి

పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి పీఆర్‌టీయూ తెలంగాణ డిమాండ్ నిజామాబాద్ స్పోర్ట్స్,

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:29 pm

మాహగం సబ్ సెంట‌ర్‌కు ఉత్తమ అవార్డు…

మాహగం సబ్ సెంట‌ర్‌కు ఉత్తమ అవార్డు… సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : కొమరం

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:26 pm

అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు

అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు గీసుగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:22 pm

పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..ఆవిరైపోతున్న వానాల్లోని ఇంధనం

రాజు ఒక చిరు ఉద్యోగి, సమయానికి కార్యాలయానికి చేరుకోక పోతే వేతనంలో కోత విధించడంతో రోజుకు 60 కిలో మీటర్లు ఇచ్చే ద్విచక్ర వాహానాన్ని ఆశ్రయించారు. గత కొద్ది రోజులు క్రితం నుంచి ఒక లీటర్‌కు 60 కిలో మీటర్లు ఇచ్చే వాహనం మైలేజ్ తగ్గడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చి పెట్రోల్ పోసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాడు. అయితే బంక్ నుంచి పెట్రోల్ సరిగ్గా వస్తున్నట్లుగానే గుర్తించాడు. దాంతో వెంటనే సమీపంలోని మెకానిక్‌ను సంప్రందించగా అతడు కూడా క్షుణ్ణంగా బండి పరిశీలించి ఎటువంటి సమస్య లేదని తేల్చి చెప్పాడు. ఇటువంటి సమస్య కేవలం ఒక రాజుది అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే .నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లో ఇంధనం 20 శాతం ఆవిరై పోతుండటంతో వాహనాల్లో గత వారం రోజులుగా మైలేజి తగ్గుముఖం పడుతోంది. వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఏ మాత్రం సరిపోవడం లేదు. పశ్చిమాసియా యుద్ద ప్రభావంతో వినియోగదారులు తమ వాహనాల్లో పెట్రోల్‌ను పూర్తి స్థాయిలో నింపుకోవడంతో గత కొద్ది రోజులుగా పెట్రోల్,డిజీల్ అమ్మకాలు బాగా పెరిగాయి. ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్ ,డీజిల్ బంకులు వుండగా ప్రతి రోజు సగటున 30 లక్షల లీటర్ల డీజిల్,పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి. అయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతి రోజు పెట్రోల్ బంకులకు 170 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్లలో సగటున 12 నుంచి 30వేల లీటర్ల సామర్థం కలిగి ఉన్నాయి. వాహన ట్యాంక్‌లను పూర్తిగా నింపవద్దు ః పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పెట్రోల్ వాహనాల ట్యాంకులు పూర్తిగా నింపవద్దు, సగం వరకు మాత్రమే నింపాలని అయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ట్యాంక్ నిండా నింపితే ప్రమాదమని గతంలో ట్యాంక్‌ను పూర్తిగా నింపడం వల్ల ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గ్తురు చేశాయి.వాహనంలో పెట్రోల్ ఆవిరి కాకుండా ఉండాలంటే ద్విచక్ర వాహనాలయితే పెట్రోల్ ట్యాంక్‌పై గుడ్డతో కూడిన ట్యాంక్ కవర్‌ను ఉపయోగించాలి. అంతే కాదు వాహనాన్ని ఎక్కువ సమయం ఎండలో నిలపకూడదని, కార్ల వంటి వాహనాలను కూడా ఎక్కవ సేపు ఎండలో ఉండకుండా చూడాలని , ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నాయి.

మన తెలంగాణ 8 Apr 2026 7:19 pm

న్యాయవాదులు విధుల బహిష్కరణ

న్యాయవాదులు విధుల బహిష్కరణ యువ న్యాయవాది హత్యకు దమ్మపేట బార్ అసోసియేషన్ ఖండన

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:14 pm

బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి.

విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ […] The post బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 7:12 pm

విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం….

విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం…. మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:11 pm

కొలనూరులో సన్న బియ్యం పంపిణీ…

కొలనూరులో సన్న బియ్యం పంపిణీ… పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:07 pm

వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం….

వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం…. చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:05 pm

పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలి..!

పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలి..! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : పిల్లలను

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:02 pm

వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్…

వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:59 pm

మతిస్థిమితం లేని వ్యక్తికి భరోసా నిచ్చిన సర్పంచ్

మతిస్థిమితం లేని వ్యక్తికి భరోసా నిచ్చిన సర్పంచ్ చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:57 pm

ఆదిలాబాద్‌లో పెద్ద ఎయిర్‌పోర్టు: రామ్మోహన్ నాయుడు

ఎయిర్‌పోర్టులపై వస్తున్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫీజబులిటి ఉన్న చోట ఎయిర్‌పోర్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్‌లో పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఉంటుందని అన్నారు. సివిల్ ఏవియేషన్‌తో కలిసి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ చెప్పిందని తెలిపారు. ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని పేర్కొన్నారు. రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు 360 ఎకరాలు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కావాల్సిన అనుకూలతలు ఆదిలాబాద్‌కు ఉన్నాయని.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఏయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వివరించారు. పెద్దపల్లి ఎయిర్‌పోర్టు ప్రతిపాదనపై ఫీజబులిటీ నివేదిక సానుకూలంగా ఉందని అన్నారు.

మన తెలంగాణ 8 Apr 2026 6:42 pm

అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి…

అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి… కోర్టు ముందు న్యాయవాదులు ధర్నాబార్ అసోసియేషన్

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:27 pm

చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి

చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:23 pm

Telangana : యాష్కీకి ఇక పదవులు లభించడం కష్టమేనా?

మధుయాష్కీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్యున్నత పదవి లభిస్తుందని భావించారు

తెలుగు పోస్ట్ 8 Apr 2026 6:21 pm

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ…

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ… జవహర్ నగర్, ఆంధ్రప్రభ : కీసర

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:19 pm

నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి

నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రె

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:13 pm

ఇషాన్, పంత్ రికార్డులను బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ..

గౌహతి: ఐపిఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ యువ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ మరోసారి భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లు ఉన్న ముంబైకి ముచ్చెమటలు పట్టించాడు. టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రాను సైతం లెక్క చేయలేదు. ఏమాత్రం బెదరకుండా భారీ సిక్సులతో స్టేడియంలో మెరుపులు మెరిపించాడు. కేవలం 14 బంతుల్లోనే ఒక ఫోర్, ఐదు సిక్సులతో 39 పరుగులు చేసి రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలో 15ఏళ్ల ఈ చిచ్చరపిడుగు.. టీమిండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. 20 ఏళ్లు నిండకముందే ఐపిఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. కిషన్, పంత్‌లు చెరో 30 సిక్సర్లు కొట్టగా, సూర్యవంశీ ఇప్పటికే 35 సిక్సర్లు బాదాడు. 20 ఏళ్లు నిండడానికి ఇంకా ఐదేళ్ల సమయం ఉండటంతో సూర్యవంశీ మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(39), యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో అజేయంగా 77 పరుగులు) రాణించారు. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 11 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ముంబైపై రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది.

మన తెలంగాణ 8 Apr 2026 6:07 pm

మొట్టమొదటి ‘వరల్డ్ డైమండ్ డే’ వేడుకలు…

మొట్టమొదటి ‘వరల్డ్ డైమండ్ డే’ వేడుకలు… వారసత్వ సంపద నుండి ఆధునిక మైలురాళ్ల

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:05 pm

YSRCP : చంద్రబాబు ప్రసంగాలు కామెడీగా ఉంటున్నాయ్చంద్రబాబు ప్రసంగాలు కామెడీగా ఉంటున్నాయ్

చంద్రబాబుకు రాయలసీమ అంటే ద్వేషమని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 8 Apr 2026 5:52 pm

కొత్తపల్లి పాఠశాలకు దాతల చేయూత…

కొత్తపల్లి పాఠశాలకు దాతల చేయూత… పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 8 Apr 2026 5:48 pm

ఎన్టీఆర్ వైద్య సేవలో రావలసిన బకాయిలకు ప్రభుత్వం స్పష్టమైన హామీ..

ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మె విరమణ.. డాక్టర్ బషీర్విశాలాంధ్ర ధర్మవరం;; ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించవలసిన బకాయిల్లో సుమారు 1000 కోట్ల రూపాయలను 10 రోజుల్లో చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు విరమించడం జరిగిందని డాక్టర్ బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యవర్గం తెలిపిన మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుతీరులు ఆశా ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం […] The post ఎన్టీఆర్ వైద్య సేవలో రావలసిన బకాయిలకు ప్రభుత్వం స్పష్టమైన హామీ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 5:41 pm

ఆ విషయంలో అందుకే హరీశ్ రావు దుష్ప్రచారం: పొంగులేటి

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాదర్‌గుల్ భూముల విషయంలో హరీశ్ దుష్ప్రచారం చేస్తున్నారని పొంగులేటి అన్నారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన హరీశ్‌రావు, బిఆర్ఎస్ సర్కార్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. సర్వే నంబర్.613లోని భూములను 2014లో మూడు సంస్థలకు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని.. భూముల మ్యుటేషన్ 2016లో జరిగినప్పుడు కూడా బిఆర్‌ఎస్‌యే అధికారంలో ఉందని తెలిపారు. 2014, 2016లో జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ‘‘హరీశ్‌రావు చెబుతున్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభించారు. భూములు పొందిన వారు నాలా కన్వర్షన్ ఇవ్వట్లేదని 2022లోనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాళ్లు కోర్టుకు వెళ్తే, బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక కౌంటర్‌ కూడా దాఖలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అవి ప్రభుత్వ భూములు అని చెప్పి మం కౌంటర్ వేశాం. ఆనాడు వాటాల ఒప్పందం చేసుకుని భూములు కట్టబెట్టి ఇలాళ మా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాదల్‌గుల్ వాటా రాకపోవడంతో హరీశ్ రావు ఇవాళ తెరపైకి తెచ్చారు. ప్రొహిబిటెడ్ భూముల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. హరీశ్ రావు చెబుతున్న కంపెనీల్లో నా కుటుంబ సభ్యులు లేరు. నా కుటుంబ సభ్యులు ఉన్నారని నిరూపించాలని సవాల్ చేస్తున్న. వట్టి నాగులపల్లి భూముల్లోనే హరీశ్ రావు పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారు’’ అని పొంగులేటి విరుచుకుపడ్డారు.

మన తెలంగాణ 8 Apr 2026 5:40 pm

హెయిర్ కటింగ్ సెలూన్ యజమానికి 72 లక్షల జీఎస్టీ

విజయవాడలోని హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు 72 లక్షలు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు అందాయి

తెలుగు పోస్ట్ 8 Apr 2026 5:40 pm

Instagram Subscriptions: What Are You Really Paying For?

Once a simple social media platform has now turned into a full-fledged monetization machine. Instagram is no longer just about sharing photos or staying connected. Celebrities and influencers are now selling access. The rise of subscriptions has changed the game. Earlier, users followed accounts and engaged with content freely. Now, many creators have locked their […] The post Instagram Subscriptions: What Are You Really Paying For? appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 5:32 pm

సిఎం రేవంత్ ను కలిసిన ఘనా హైకమిషనర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా క్వాసి ఒబిరి-డాన్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిఎం రేవంత్ ను కలిశారు. ఘన, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని సిఎం రేవంత్ ను హైకమిషనర్ క్వాసి ఒబిరి డాన్ కోరారు.

మన తెలంగాణ 8 Apr 2026 5:32 pm

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించాలి: ఎంపీడీవో

విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎంపీడీవో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గ్రామంలో తలెత్తే త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు వంటి ఇతరత్రా ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే సోషల్ మీడియా గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డ్రైనేజీలు చెత్తతో పేరుకుపోయినా, పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిర్ణీత ప్రాంతాలకు రాకపోయినా లేదా వేసవి దృష్ట్యా ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఏర్పడితే […] The post గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించాలి: ఎంపీడీవో appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 5:31 pm

Iran - America Cease Fire : కాల్పుల విరమణతో దిగివచ్చిన చమురు ధరలు

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన తర్వాత చమురు ధరలు తగ్గాయి

తెలుగు పోస్ట్ 8 Apr 2026 5:30 pm

సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి…

సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి… ఉప సర్పంచ్ ల సంఘం

ప్రభ న్యూస్ 8 Apr 2026 5:30 pm

ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా): మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోగ్రామాల్లో ఉపాధి అవసరమైన వారిని గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న పనుల గురించి వారికి వివరించి, వారు పనికి వచ్చేలా (లేబర్ మొబలైజేషన్‌)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల మన రాప్తాడు […] The post ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 5:25 pm

Rs 72 lakhs |నకిలీ కంపెనీ మోసం

Rs 72 lakhs | నకిలీ కంపెనీ మోసం Rs 72 lakhs

ప్రభ న్యూస్ 8 Apr 2026 5:23 pm