రెండేళ్ల కాంగ్రెస్ పాలన నిస్సారం, నిరర్థకం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు మొండి చే యి చూపిందని, పాలన పూర్తిగా ఆగమాగంగా ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు విమర్శించారు. రెండేళ్ల పాలన అనేది ప్రభు త్వ పనితీరుకు గీటురాయిలాంటిదని, కానీ కాం గ్రెస్ ప్రభుత్వ పాలన నిస్సారం, నిష్పలం, నిరర్ధకంగా మిగిలిపోయిందని దుయ్యబట్టారు. ఈ రెం డేళ్లలో ఆత్మస్తుతి, పరనింద తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీ డియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, రెండేళ్ళ కాం గ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించా రు. తమ ప్రభుత్వం రాగానే మిషన్ భగీరథ, మిష న్ కాకతీయ వంటి పథకాలు తెచ్చామని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా దర్బార్ కూడా ఇప్పుడు అమలు కావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రజా దర్బార్లో ప్రజల ను కలుస్తా అన్నారని.. ఆ గొప్పలు ఏమయ్యాయ ని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి బిల్డప్ బాబాయ్ అం టూ ఘాటు విమర్శలు చేశారు. జల్సాలకు, విం దులకు పెళ్లిళ్లకు, సిఎల్పి మీటింగ్లకు ప్రజా భవన్ను వాడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ తెచ్చిన మెట్రో రైలు, ఫార్మా సిటీ వంటి కీలక ప్రాజెక్టులను రద్దు చేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఆరోపించారు. మక్కలు కొని 50 రోజులు దాటినా రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. రైతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వం రైతు సంక్షోభ ప్రభుత్వం అని మండిపడ్డారు.పూర్తిస్థాయి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని... నిరూపించలేకపోతే రాజీనామాకు సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లు బిల్లులు అడిగితే ప్రభుత్వం విజిలెన్స్, ఎసిబి దాడులు చేయిస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు గ్లోబల్ సమ్మిట్ను ‘గోబెల్స్ సమ్మిట్‘ అంటూ హరీష్రావు ఎద్దేవా చేశారు. గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బిఆర్ఎస్ హయాంలో సమీకరించినదే గుర్తు చేశారు. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని అన్నారు. కెసిఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉందని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అని ఆరోపించారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్రావు అన్నారు.
మంగళవారం రాశి ఫలాలు (09-12-2025)
మేషం వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారమున పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి. వృషభం దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. మిధునం చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. బందు మిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కర్కాటకం సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సింహం ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కన్య ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తుల పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి. వృశ్చికం సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు నుండి బయటపడతారు. ధనస్సు పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. మకరం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది. నూతన వస్తులాభాలు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. కుంభం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మీనం చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.
పూలమ్మి, పాలమ్మి వందల ఎకరాలు కబ్జా పెట్టిండు!
మేడ్చల్ జిల్లా మేడిపండు చందంగా ఉందే తప్పితే ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్న కవిత సోమవారం కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా మేడ్చల్ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోపాటు పెరెన్నికగన్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, డిఫెన్స్, ఎరోనాటిక్స్ లాంటి సంస్థలు, ఫార్మా కంపెనీలకు నెలవుగా ఉన్నా జిల్లాలోని అన్ని బస్తీలు, కాలనీలో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని అన్నారు. జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నోచుకోలేదని గుర్తు చేశారు. జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా బీటి బ్యాచ్ అని, ఉద్యమకారులు లేరని, ఉన్న ఒక్క శంభీపూర్రాజుకు మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నారని, మిగతా వారంతా అధికారం, డబ్బు సంపాదన , భూముల ఆక్రమణ కోసమే వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారని వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ భజన చేయడం అలవాటు చేసుకున్నారని కవిత విమర్శించారు. కుత్బుల్లాపూర్ ఇప్పుడు కబ్జాల పూర్గా మారిందని స్థానికులు అంటున్నారని కవిత ఆరోపించారు. మేడ్చల్లో మల్లారెడ్డి పూలమ్మిన, పాలమ్మిన అని డైలాగులు చెబుతూ వందల ఎకరాలు కబ్జా చేశాడని ఆరోపించారు. గతంలో రేవంత్రెడ్డిపై తొడలు గొట్టి ఇప్పుడు మనువడితో రేవంత్రెడ్డి కాళ్ళుమొక్కించి సెటిల్మెంట్ చేసుకున్నాడని ఆరోపించారు.
9 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
9 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 9 dec cartoon
జపాన్లో భారీ భూకంపం .. ఎగసి పడిన సునామీ అలలు
జపాన్ ఉత్తర తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. కోస్తాలో 40 సెంమీ ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ ప్రధాన హోన్సు ద్వీపంలో ఉత్తర ప్రాంతంలో అయోమోరికి తూర్పు భాగంలో భూకంపం కేంద్రీ కృతమైందని వివరించింది. దీని ప్రభావంతో హొక్కైడో ద్వీపంలో యురాక్వా పట్టణం, ముత్సు ఒగవారా రేవుపట్టణాన్ని సునామీఅలలు 40 సెంమీ ఎత్తున ఎగసి చుట్టుముట్టాయని వివరించింది. హచినోహి పట్ణంలో ఒక హోటల్లో సునామీ అలల తాకిడికి అనేక మంది గాయపడ్డారు. అత్యవసరంగా నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిందని ప్రధాని సనాయె తకైచి వెల్లడించారు. ప్రజల ప్రానాలు కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియో
భారత్ ప్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం చేయనున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు నటుడు అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. ఫ్యూచర్ సిటి లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒక ప్రత్యేకమైన ఫిలిం హబ్ ను ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రణాళికలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చోటు కల్పించడం పట్ల నటుడు నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సినిమా షూటింగ్లకు, నిర్మాణాలకు ప్యూచర్ సిటి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.
surabhi group|రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి
surabhi group| రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి ప్రభుత్వంతో ఎంఓయు1000
థాయిలాండ్ పారిపోయిన గోవా నైట్క్లబ్ యజమానులు
25మంది మరణానికి కారణమైన గోవా నైట్క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని గుర్తించేందుకు ఇంటర్పోల్ సాయం కోరినట్లు పోలీసులు వెల్లడించారు. అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్క్లబ్లో ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు ఓనర్లు ఆదివారం తెల్లవారుజామున ఫుకెట్కు పారిపోయారని గోవా పోలీసులు సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ క్రమంలో గుర్తించినట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్పోల్ సాయం కోరామని వివరించారు.
మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్, అలియాస్ దేవ్ మజ్జి, ఆయన భార్య సహా పది మంది మావోయిస్టులు సోమవారం నాడు చత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల తలలపై మొత్తం రూ.2.95 కోట్ల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఎకె 47 రైఫిల్ సహా మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఇతర పేలుడు పదార్థాలను కూడా పోలీసులకు అప్పగించారు. రాంధెర్కు హొరుపు, అమర్జీత్ అనే పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేవ్ మజ్జి ఎంఎంసి జోన్లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన తలపైనే రూ.1.05 కోట్ల రివార్డు ఉంది. ఆయన భార్య అనిత, అలియాస్ లత డివిజినల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, మరో నలుగురు సభ్యులు, ఇద్దరు ఏరియా కమిటీ మెంబర్లు. మరోవైపు మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో 10మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. వీరి లొంగుబాటుతో దిండోరి, మాండ్లా ప్రాంతాలు పూర్తిగా మావోయిస్టు రహితం అయ్యాయని ఆయన వెల్లడించారు. లొంగిపోయిన నక్సల్స్పై రూ.2.36కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానని సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఓ సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానేమోనని భయంతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్ పల్లి గ్రామంలో సోమవారం నాడు చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పిప్పడ్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చాల్కి రాజు (36) అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసి బరిలో నిలిచారు. అయితే ఆయన అప్పటికే అయ్యప్ప మాలాధారణ వేసి మండలంలోని శంషాద్దీన్ పూర్ గ్రామ శివారులో గల అయ్యప్ప సన్నిధానంలో తోటి అయ్యప్ప స్వాములతో ఉంటున్నాడు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి తోటి స్వాములతో నిద్రించాడు. సోమవారం తెల్లవారు జాము నాలుగు గంటల ప్రాంతంలో నిద్ర లేచి తోటి స్వాములతో కలిసి కాలకృత్యాలు చేయడానికి బయటకు వెళ్లాడు. అయితే బయటకు వెళ్లినఅయ్యప్ప స్వాములు తిరిగి సన్నిధానానికి వచ్చారు.. కాని రాజుస్వామి మాత్రం రాలేదు. దీంతో అయ్యప్ప స్వాములు చుట్టు పక్కల వెతికినా.. రాజు స్వామి ఆచూకి లభించలేదు. దీంతో చేసేదేమి లేక శంషాద్దీన్ పూర్ గ్రామస్తులకు సమాచారం అందించడంతో వెంటనే కొంత మంది గ్రామస్తులు అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకొని సమీప ప్రాంతంతో వెతికడంతో ఓ చెట్టుకు టావల్ తోని ఉరి వేసుకొని కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పీ సైదా, రూరల్ సీఐ హన్మంత్ లు పరిశీలించి జరిగిన విషయాన్ని అయ్యప్ప స్వాములను అడిగి తెలుసుకున్నారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరిణ్ తెలిపారు.
తప్పుడు ప్రచారంతో టిఆర్ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారింది:మంత్రి సీతక్క
తప్పుడు ప్రచారంతో టిఆర్ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైతే హరీష్ రావు ఓర్చుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, గోబెల్స్ సమ్మిట్ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా సమాధానం చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే సహించలేకపోతున్నారని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని తెలంగాణ ఆగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కెసిఆర్ కుటుంబమే గొప్పదన్న అహంకారంతో హరీష్ రావు మాట్లాడుతూ విజనరీ ఉన్న నేతలను చులకన చేసి మాట్లాడటం హరీష్ రావు నైజమని మండిపడ్డారు. ఖరీదైన భూములను పప్పు బెల్లాలకు అమ్ముకున్న చరిత్ర బిఆర్ఎస్ పెద్దలదని ఆరోపించారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సమ్మిట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ దేశ విదేశా కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు వేల కొలది ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు. నిరుద్యోగులను సొంత అవసరాలకు వాడుకొని కేసీఆర్ కుటుంబం వదిలేసిందని అన్నారు. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ కల్పన చేస్తున్నామని చెప్పారు. దావోస్ సమ్మిట్ ను వినడమే కానీ నేను చూడలేదని, భారత్ ఫ్యూచర్ సిటీలో దావోస్ సమ్మిట్కు మించి ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని మంత్రి సీతక్క వివరించారు.
గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది వివిధ రంగాల్లో రాణించారు..
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్ స్టా ద్వారా వెల్లడించింది.
టికెట్ ధరలను తగ్గించిన ఎయిర్ ఇండియా
ఇండిగోలో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది.
రిటైర్మెంట్ తీసుకోలేదు: షకీబ్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు.
Rajinikanth announces Sequel for his Iconic Film
Padayappa is one of the best films in Rajinikanth’s career and the film is a massive hit. The film was dubbed into Telugu as Narasimha and the film ended up as a super hit after a simultaneous release in Telugu along with Tamil. Ramya Krishna played one more important role and her performance will be […] The post Rajinikanth announces Sequel for his Iconic Film appeared first on Telugu360 .
Chandrababu Naidu Breaks Silence on IndiGo Crisis, Blames Airline’s Poor Management
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addressed the media at the AP Secretariat and responded for the first time to the ongoing IndiGo Airlines crisis. He stated that the mass cancellations and passenger distress were the direct result of IndiGo’s failure to follow the rules set by the Directorate General of Civil Aviation. He […] The post Chandrababu Naidu Breaks Silence on IndiGo Crisis, Blames Airline’s Poor Management appeared first on Telugu360 .
జుక్కల్ నియోజకవర్గం పిట్లం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ రాజీ నామా బాండ్ పేపర్ను అందజేశారు. ఈ సందర్బంగా నవాబ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ- తన పదవీకాలం సగం అంటే 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే, ఎలాంటి పదవి మోహం లేకుండా తాను స్వయంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ప్రకటించారు. తమ మాట, తమ హామీల పరిరక్షణ పట్ల ప్రజల ముందే ప్రమాణం చేస్తున్నానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, పంచాయతీ పనుల్లో ప్రజా భాగస్వామ్యం పెంపు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా తీసుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని నమ్మకమిస్తున్నట్లు నవాబ్ సుదర్శన్ గౌడ్ తెలిపారు. పిట్లం గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అండమాన్ నికోబార్ టూర్: మీ మరపురాని ప్రయాణానికి ఒక కంప్లీట్ గైడ్
అండమాన్ నికోబార్ దీవుల టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారా? తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల కోసం వెతుకుతున్నారా? సమగ్ర వివరాలు ఈ ప్రత్యేక కథనంలో డియర్ అర్బన్ అందిస్తోంది. నీలి సముద్రపు లోతుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రపంచం, తీరం వెంబడి దట్టంగా పెరిగిన పచ్చని అడవులు, ఇసుక తిన్నెలు మీకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. మీ సాహసయాత్రకు ఇలా సిద్ధమవ్వండి. 1. అండమాన్ లో ది బెస్ట్ ఏవో తెలుసుకోండి: మీ ఐలాండ్ విహార ప్రణాళిక అండమాన్ […] The post అండమాన్ నికోబార్ టూర్: మీ మరపురాని ప్రయాణానికి ఒక కంప్లీట్ గైడ్ appeared first on Dear Urban .
జపాన్ లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
టోక్యో: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ ఉత్తర తీరంలో సోమవారం 7.2 తీవ్రతతో భారీ భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం నేపథ్యంలో మూడు మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. అమోరి, హక్కైడో తీరంలో భూకంపం సంభవించిందని ఏజెన్సీ పేర్కొంది. జపాన్ తీరాన్ని భూకంపం అతలాకుతలం చేయడంతో సీలింగ్ లైట్లు ఊగుతున్నట్లు సోషల్ మీడియా పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. కాగా, భూకంపం కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గానీ జరగలేదని అధికారులు తెలిపారు.
తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిన తోడేలు #UttarPradesh #Wildlife #Kaisarganj
తెలంగాణ హైకోర్టులో ఐఎఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
సీనియర్ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కేడర్ కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే విధించింది. ఈ పరిణామంతో ఆమ్రపాలికి తాత్కాలికంగా చుక్కెదురైంది. గత ఏడాది అక్టోబర్లో కేంద్రంలోని డివొపిటి ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలి డివొపిటి ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు చేయగా క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఐఎఎస్ అధికారి హరికిరణ్తో స్వాపింగ్ పద్ధతి ద్వారా ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అయితే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివొపిటి తెలంగాణ హైకోర్టులో అప్పీల్కు వెళ్లింది. ఐఎఎస్ కేటాయింపు నిబంధనల ప్రకారం ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డివొపిటి ప్రధానంగా వాదించింది. ఐఎఎస్ హరికిరణ్ రిజర్వ్ కేటగిరీకి చెందిన అధికారి కాబట్టి ఓపెన్ కేటగిరీకి చెందిన ఆమ్రపాలికి ఆయనతో స్వాపింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని డివొపిటి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. డివొపిటి అప్పీల్ను పరిశీలించిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశించింది.
నెహ్రూ వాటిని ఆరంభించకపోయి ఉంటే..?: ప్రియాంక గాంధీ
పధాని మోడీ విమర్శలకు కాంగ్రెస్ సభ్యురాలు, గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా కౌంటర్ ఇచ్చారు. వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ తరపున ఆమె మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్లో త్వరలో ఎన్నికలు ఉన్నందునే బిజెపి వందేమాతరంపై ప్రత్యేక చర్చ చేపట్టిందన్నారు. జాతీయ గేయం ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నదని, ప్రజా సమస్యలు ఇప్పుడు దేశంలో ఎన్నో ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి ఈ చర్చ ఇప్పుడు చేపట్టడం అవసరమా అని ప్రశ్నించారు. భవిష్యత్ను వదిలి ప్రధానమంత్రి గతాన్ని తవ్వుతున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యను పక్కనపెట్టి వందేమాతరం చర్చ చేపట్టి అందులో నెహ్రూపై ప్రధానమంత్రి విమర్శలకు పాల్పడుతున్నారని, అయితే నెహ్రూపై కూడా ఈ తరహాలోనే చర్చకు సమయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఆయన గురించి ఒక జాబితా రూపొందించి అంశాల వారీగా మాట్లాడుకుందామని ప్రియాంక సూచించారు. ప్రియాంక ప్రధాని మోడీపై పదునైన విమర్శలు గుప్పించారు. ‘మీరు పదేపదే నెహ్రూతో పాటు ఆయన వారసత్వంపై విమర్శలకు దిగుతున్నారు. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి పదవిలో ఉంటున్నారు. కానీ నెహ్రూ 17 ఏళ్లు ఆ పదవిని అధిష్టించారు. ఆయనపై ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఆయన ఇస్రో ఆరంభించకపోయి ఉంటే ఈనాడు మంగళయాన్ ఉండకపోయేది. ఆయన డిఆర్డిఓను తీసుకురాకపోయి ఉంటే తేజాస్ మనుగడ సాధ్యమయ్యేదా?. నెహ్రూ ఐఐటిలు, ఐఐఎంలు ప్రారంభించకపోయి ఉంటే ఐటి ఎక్కడిది? ఆయన ఎయిమ్స్ మొదలు పెట్టి ఉండకపోతే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమయ్యేదా? అని ప్రశ్నలు గుప్పించారు. నెహ్రూ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా 9 సార్లు జైలు పాలయ్యారు. మొత్తం 3200 రోజులు కారాగారంలో ఉన్నారని గుర్తు చేశారు. నెహ్రూను అవమానించదలచుకుంటే ఒక జాబితా తయారు చేయాలని, ఆ సంఖ్య 99 లేదా 999 మీ ఇష్టం అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమయం నిర్ణయించి చర్చ చేపడితే దానికి మేం సిద్ధమని ప్రియాంక సవాల్ విసిరారు. ఇందిర, రాజీవ్ ఈ దేశానికి ఏం చేశారు? వారసత్వ రాజకీయాలు అంటే ఏంటీ? నెహ్రూ చేసిన తప్పిందాలు ఏమేం ఉన్నాయి వీటన్నింటిపై చర్చ చేపడదామన్నారు. అదే సమయంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కూడా మాట్లాడుకుందామని ప్రియాంక పేర్కొన్నారు.
Candidate |ప్రజా సమస్యల కోసం పని చేస్తా
Candidate | ప్రజా సమస్యల కోసం పని చేస్తా Candidate | నర్సింహులపేట,
మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు.. అంతలోనే
పుట్టిన రోజే ఆ బాలుడికి మరణ దినంగా మారింది. మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించి వేడి సాంబార్ గిన్నెలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.... గురుకుల విద్యాలయం వసతిగృహం వంట మనిషిగా పని చేస్తున్న మొగిలి మధుకర్ ఆదివారం వంట చేసి సాంబారు గిన్నె పక్కనే పెట్టగా మధుకర్ కుమారుడు నాలుగు సంవత్సరాల మోక్షిత్ ఆడుకుంటూ వెళ్లి వేడి సాంబార్ గిన్నెలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన మధుకర్ బాలుడు మోక్షిత్ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మోక్షిత్ మృతి చెందాడు. ఆదివారం నాడే మోక్షిత్ పుట్టిన రోజు కాగా అదే రోజు మరణం సంభవించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాలుడి తండ్రి మధుకర్ ఫిర్యాదు మేరకు ధర్మారం ఎస్సై ఎం.ప్రవీణ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
MD |జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి..
MD | జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి.. MD | విజయవాడ, ఆంధ్రప్రభ
అఖండ 2 సినిమా ఘన విజయం సాధించాలని అభిమానుల ప్రత్యేక పూజలు #telugupost #balakrishna #akanda2
ఫ్యూచర్ సిటీలో జూపార్క్ ఏర్పాటు.. కుదిరిన ఒప్పందం
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో కొత్త జూపార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. జూపార్క్ ఏర్పాటుకు వంతారా ఎంవొయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూపార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వన్యప్రాణులకు సేవ అనే నినాదంతో వంతారా పని చేస్తోందని కొనియాడారు. ఈ నెల చివర్లో గుజరాత్కు వెళ్లి వంతారాను సందర్శిస్తామని పేర్కొన్నారు. వంతారా సంస్థ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి చెందినది అన్న విషయం తెలిసిందే.
బైక్ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి
వేగంగా దూసుకు వచ్చిన లారీ కిందపడి ఇద్దరు వ్యక్తులు దూర్మరణం. సూరారం పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతి మిల్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుండి వేగంగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తు లో తెలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పాండు బస్తీ కి చెందిన రాపిడో డ్రైవర్ సురేందర్ రెడ్డి (45). సూరారం వెంకటరమణ కాలనీ కి చెందిన జ్యోతి (32) పల్సర్ బైక్ పైన నర్సాపూర్ రోడ్డులో వెళ్తున్నారు. బైక్ పై వెళ్తున్న వారిని వెనుక నుండి వచ్చిన లారీ అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సురేందర్ రెడ్డి, జ్యోతి కింద పడిపోయారు. లారీ ముందు టైర్లు జ్యోతి, సురేందర్ పై నుండి వెళ్ళగా అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. లారీని ట్రేస్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూరారం సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
Govt |కాపు, బీసీ భవనాల నిర్మిస్తా
Govt | కాపు, బీసీ భవనాల నిర్మిస్తా నా సొంత నిధులు వెచ్చిస్తున్నారాష్ట్ర
పెట్టుబడులకు కొత్త వేదిక - గ్లోబల్ సమ్మిట్: మంత్రి సురేఖ
గ్లోబల్ సమ్మిట్లో స్టాల్స్ను సందర్శించిన మంత్రి సురేఖ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త వేదిక - తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు, విశిష్ట అతిథులతో కలిసి మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను విస్తృతంగా సృష్టించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్టాల్స్ను పరిశీలించిన మంత్రి సురేఖ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ప్రతి స్టాల్కు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్ వద్ద సంప్రదాయ నృత్యకారిణిలతో కలసి నృత్యం చేశారు. మంత్రి ఆత్మీయ పలకరింపునకు సంప్రదాయ నృత్యకారిణీలు హర్షం వ్యక్తం చేశారు.
ఎగరని విమానాలు.. ఎందుకో ఈ కష్టాలు!! | Flight Cancellations in India
Cricket |బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం
Cricket | బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం Cricket | శ్రీ
TET |టెట్ పై పునః సమీక్ష అవసరం
TET | టెట్ పై పునః సమీక్ష అవసరం TET | పల్నాడు
నవజ్యోత్ కౌర్ సిద్ధూను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూపై కాంగ్రెస్ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల పార్టీపై నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. కాంగ్రెస్ 2027కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తేనే ఆయన మళ్లీ పోటీ చేస్తారని చెప్పారు. రూ.500 కోట్లు సూట్ కేసు ఇచ్చేవారే ముఖ్యమంత్రి అవుతారని..ఆ పదవిని కొనడానికి అంత డబ్బు తమ వద్ద లేవని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు పార్టీలో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆమెను ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.
Ravi Teja’s BMW Second Single Promo: A Dazzling Melody
Mass Maharaja Ravi Teja and writer-director Kishore Tirumala have come together for the first time for a grand family entertainer, Bhartha Mahasayulaku Wignapthy. The movie first single, Bella, has become a good hit adding to the excitement created by the glimpse. Now, the makers are releasing the second single, Addam Mundu, on 10th December. The […] The post Ravi Teja’s BMW Second Single Promo: A Dazzling Melody appeared first on Telugu360 .
Welcome |బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ
Welcome | బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ Welcome | కర్నూలు,
OSSS Teaser: Tharun, Eesha’s Fun Ride
Tharun Bhascker joined hands with a debutant A R Sajeev for a rustic entertainer Om Shanti Shanti Shantihi. Eesha Rebba is cast opposite Tharun Bhascker in the movie which is done with its shoot and is getting ready for its theatrical release. Meanwhile, the makers started the promotions by revealing the teaser. Tharun Bhascker plays […] The post OSSS Teaser: Tharun, Eesha’s Fun Ride appeared first on Telugu360 .
కిరాయి వ్యక్తులతో అల్లుడిపై దాడి చేయించిన అత్త
పెనగలూరు: అన్నమయ్య జిల్లా పెనగలూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడిపైనే ఓ అత్త కిరాయి వ్యక్తులతో దాడి చేయించింది. మునుస్వామి అనే వ్యక్తిపై నలుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాపూరు వాసి మునుస్వామి నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవపడి పెనగలూరులోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన అత్త పెంచలమ్మ అల్లుడిపై దాడికి పురమాయించింది. రెండు బైక్లపై వచ్చిన కిరాయి వ్యక్తులు కత్తితో మునుస్వామి గొంతుపై దాడి చేశారు. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కత్తితో సహా రాజంపేట ప్రభుత్వాస్పత్రికి బాధితుడిని తరలించారు. పెనగలూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Gold |లక్కీ క్రికెటర్కు గోల్డ్ కాయిన్
Gold | లక్కీ క్రికెటర్కు గోల్డ్ కాయిన్ యువ హీరోలు రామ్ -హరి
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి
విశాలాంధ్ర – బెలుగుప్ప:రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి (60) మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రకారం, హోటల్ నిర్వహణ చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న చంద్రమౌళి బెలుగుప్పకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా, ఆవులెన్న క్రాస్ సమీపంలో తిప్పేస్వామి నడుపుతున్న బైక్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో చంద్రమౌళికి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించిగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు.ఆయన మృతితో కుటుంబ […] The post రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి appeared first on Visalaandhra .
health |శతాధిక వృద్ధురాలు కన్నుమూత
health | శతాధిక వృద్ధురాలు కన్నుమూత health | చల్లపల్లి, ఆంధ్ర ప్రభ
Award |ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు
Award | ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు Award |
నవ్వులు పూయిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్
‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ఆయన నటుడిగా మారిపోయారు. పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితమే ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారిపోయారు. ఆ హీరోగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళం వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘జయ జయ జయహే’ సినిమాకి ఇది రీమేక్. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. గోదావరి బ్యాక్డ్రాప్ ఈ సినిమా సాగుతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని అనుకొనే భర్తకి.. ఊహించని విధంగా భార్య అతడిపై తిరగబడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. మొత్తానికి టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. నేయిటివిటికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఈశా రెబ్బా హీరోయిన్గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎఆర్ సజీవ్ ఈ సినిమా దర్శకుడు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Electric |విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి
Electric | విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి Electric | పామర్రు
మహిళల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఇందిర మహిళా శక్తి స్టాల్
తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఇందిర మహిళా స్టాల్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం మహిళలను ఆత్మవిశ్వాసంతో నిలబడే యజమానిగా తీర్చిదిద్దడమేనని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో మహిళా సాధికారతను ప్రతిబింబించే ఇందిరా మహిళా శక్తి స్టాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఎదిగితే కుటుంబం, సమాజం, రాష్ట్రం ఎదుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళ శక్తిని కేంద్ర బిందువుగా చేసుకుని పని చేస్తోందని అన్నారు. ఈ స్టాల్లో కనిపిస్తున్న ప్రతీ విజయకథ తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. సెర్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా రూపొందించిన ఈ స్టాల్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఆధ్వర్యంలో మహిళల చేతుల్లో నడుస్తున్న విభిన్న వ్యాపారాలు, సేవలు, ఆర్థిక కార్యకలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. మహిళల నిర్వహణలో ఉన్న పెట్రోలు బంకులు, హైటెక్ సిటీలో పనిచేస్తున్న మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన మహిళా శక్తి భవనాలు, శక్తి క్యాంటిన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో మహిళలు సాధిస్తున్న విజయాలు దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ మహిళా సంఘాలు పెద్ద స్థాయిలో వ్యాపారాలు నడపడం, కార్పొరేట్ స్థాయి సేవలు అందించడం, ఇదే కొత్త తెలంగాణ శక్తి అని అన్నారు. మహిళకు వేదిక ఇస్తే ఆమె అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుందనే దానికి ఈ ప్రదర్శనే సాక్షమని అన్నారు.
Distribution |వృద్ధులకు దుప్పట్లు పంపిణీ..
Distribution | వృద్ధులకు దుప్పట్లు పంపిణీ.. Distribution | టేకుమట్ల, ఆంధ్ర ప్రభ
Why is Dhurandhar a Game Changer in Indian Cinema?
Bollywood has been struggling to deliver impressive films and some of the biggest action dramas fell short of expectations. Many recent spy thrillers and action dramas are packed with glamour, expensive locations and forceful action. Then came Dhurandhar, a realistic and honest action drama that unfolded some of the shocking facts that happened behind the […] The post Why is Dhurandhar a Game Changer in Indian Cinema? appeared first on Telugu360 .
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యా నగర్, కేశవ్ నగర్ కాలనిలో గల శ్రీనివాస్ శర్మ నివాసంలో సోమవారం భారీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ శర్మ, అతని కుటుంబ సభ్యులు నవంబర్ 30న వేరే ఊరికి వెళ్ళి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం విరిగిపడి ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండడం ,బీరువాలు తెరిచి ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గమనించిన శ్రీనివాస్ శర్మ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ఎస్సై మాధవరెడ్డి తన సిబ్బందితో చేరుకుని ఇళ్ళంతా పరిశీలించారు. బాధితుడు 40 తులాల బంగారు, 6 లక్షల నగదు చోరీకి గురైందని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు.
Social |శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు….
Social | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు…. Social | ధర్మపురి,
2BHK ప్లాన్ చేస్తున్నారా? 3BHK నా? ఏది బెస్ట్? మొదటిసారి ఫ్లాట్ కొనేవారికి గైడ్
హైదరాబాద్ వంటి నగరంలో మొదటిసారి ఫ్లాట్ కొనాలనుకునే వారు ఎదుర్కొనే అతిపెద్ద సందిగ్ధత 2BHK కొనాలా? లేక 3BHK తీసుకోవాలా? ఈ నిర్ణయం కేవలం ఒక అదనపు గది గురించి మాత్రమే కాదు.. ఇది మీ భవిష్యత్తు, జీవనశైలి, ఆర్థిక ప్రణాళికతో ముడిపడి ఉంటుంది. డియర్ అర్బన్ అందిస్తున్న ఈ గైడ్ ముఖ్యమైన అంశాలైన ఖర్చు, జీవనశైలి, భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషించడం ద్వారా ఈ క్లిష్టమైన నిర్ణయాన్ని సులభతరం చేయడానికి రూపొందించింది. 1. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ […] The post 2BHK ప్లాన్ చేస్తున్నారా? 3BHK నా? ఏది బెస్ట్? మొదటిసారి ఫ్లాట్ కొనేవారికి గైడ్ appeared first on Dear Urban .
వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ హైకోర్టుకు జూ.ఎన్టీఆర్ #telugupost #ntr #highcourt
incident |సాంబారులో పడి బాలుని మృతి..
incident | సాంబారులో పడి బాలుని మృతి.. incident | పెద్దపల్లి జిల్లా
టి-20 ప్రపంచకప్.. జియో హాట్స్టార్ కీలక నిర్ణయం?
వచ్చే ఏడాది ఐసిసి టి-20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ ప్రపంచకప్కి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ మ్యాచ్ల షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే ఈ టోర్నీకి ముందు ప్రముఖ ఒటిటి సంస్థ జియో హాట్స్టార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి షాక్ ఇస్తూ.. ఈ టోర్నమెంట్ ప్రసారకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఐసిసికి చెప్పినట్లు సమాచారం. అంతేకాక నాలుగేళ్ల భారత మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్ని కూడా కొనసాగించలేమని జియో హాట్స్టార్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు ఒటిటి ఫ్లాట్ఫామ్కి వస్తున్న భారీ ఆర్థిక నష్టాలే ఈ నిర్ణయం వెనుక కారణంగా తెలుస్తోంది. దాదాపు 2.4 బిలియన్ల డాలర్లతో 2026-29 మధ్య కాలానికి భారత మీడియా హక్కులకు సంబంధించిన విక్రయ ప్రక్రియను ఐసిసి తాజాగా ప్రారంభించింది. జియో హాట్స్టార్ 2024-27 మధ్య కాలానికి 3 బిలియన్ల డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు జియో హాట్స్టార్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో బిడ్లు దాఖలు చేయాలని పలు ప్రధాన ఒటిటి ఫ్లాట్ఫామ్లను ఐసిసి ఆహ్వానించిది. సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ, ఒప్పందం విలువ చాలా అధికంగా ఉండటంతో ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం.
Teacher |చదువుకున్న వారికి పట్టం కట్టండి.
Teacher | చదువుకున్న వారికి పట్టం కట్టండి. Teacher | ధర్మసాగర్, ఆంధ్రప్రభ
funding |గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!
funding | గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..! funding | ఇంద్రవెల్లి,
Vote |అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా…
Vote | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి ఈనెల 11వ తేదీన
candidate |భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా…
candidate | భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా… candidate | బిక్కనూర్,
Services |ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా..
Services | ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా.. Services | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ :
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: పనితీరు, టాప్ హోల్డింగ్స్, ఇంకా రిస్క్ గురించి సమగ్ర వివరాలు
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మీకు అవగాహన కల్పించడానికి ఈ కథనం సహాయపడుతుంది. ఈ ఫండ్ పనితీరు, వేటిలో పెట్టుబడులు పెడుతుంది? వంటి అంశాలు కూడా చర్చించుకుందాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన ఉదాహరణ తీసుకుందాం. దీనిని ఒక నిపుణుడు నిర్వహించే వివిధ కంపెనీల స్టాక్స్ ఉన్న బుట్టగా ఊహించుకోండి. మీరు డబ్బు పెట్టినప్పుడు, ఆ ఫండ్ మేనేజర్ మీ కోసం ఆ స్టాక్స్ను కొనుగోలు చేసి, అమ్మి, వాటిని […] The post క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: పనితీరు, టాప్ హోల్డింగ్స్, ఇంకా రిస్క్ గురించి సమగ్ర వివరాలు appeared first on Dear Urban .
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం #telugupost #accidentnews #bikeaccident #latestnews
Grand |చారిత్రక వైభవానికి చిరునామా బెల్లంపల్లి స్టేషన్..
Grand | చారిత్రక వైభవానికి చిరునామా బెల్లంపల్లి స్టేషన్.. Grand | బెల్లంపల్లి,
Fake Break Inspector : అతడే ఇతడు
Fake Break Inspector : అతడే ఇతడు ఓ ఏఎస్ఐ ముద్దు బిడ్డ
Schemes |కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి…
Schemes | కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి… ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్….
Gold Eyes |బంగారు కన్నులు సమర్పణ..
Gold Eyes | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని
State |గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
State | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా State | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ
WOMEN |తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని
WOMEN | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని WOMEN |
Public |గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి
Public | గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి Public |
ఇండిగో సంక్షోభం పై రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే?
ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు
వెంబడించిన వీధి కుక్కలు.. బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా: జిల్లాలోని రాయచోటి పట్టణంలో దారణం చోటు చేసుకుంది. వీధి కుక్కలు వెంబడించడంతో బైక్ వెళ్తున్న వ్యక్తి మృత్యువాత పడ్డారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో నివాసముంటున్న ఫజిల్(42) అనే వ్యక్తి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్స్టేషన్ సమీపం నుంచి రాత్రి 3 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో వీధి కుక్కలు ఆయన బైక్ను వెంబడించాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు ఫజిల్ బైక్ను వేగంగా నడిపారు. దీంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న ఆలయ గోడను ఢీకొని.. అక్కడికక్కడే ప్రాణాలు కో్ల్పోయారు. సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆవులు, కుక్కలు ఇష్టారీతిన రోడ్ల మీద తిరుగుతున్నా.. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
Chandrababu : విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
Awareness Meeting |నేతలకు దూరంగా ఉండాలి
Awareness Meeting | నేతలకు దూరంగా ఉండాలి Awareness Meeting | జన్నారం,
Army |ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం
Army | ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం Army | నారాయణపేట, ఆంధ్రప్రభ
Bharat Army |ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం
Bharat Army | ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం తెలంగాణ జాగృతి జిల్లా
Telangana: డాబుసరితనం లేదు.. గొప్పలు చెప్పు కోలేదు..గ్లోబల్ సమ్మిట్ పై ప్రశంసలు
తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
DRUGS |విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
DRUGS | విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ DRUGS | తిర్యాణి, ఆంధ్రప్రభ :
Nallagonda |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..
Nallagonda | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధి
1 rupee ఇదీ..నా కథ.. 1 rupee ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Venkateswar |బీజేపీ అభ్యర్థులను గెలిపించండి
Venkateswar | బీజేపీ అభ్యర్థులను గెలిపించండి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ Venkateswar
Elections | నియమాలు పాటించాలి Elections | దండేపల్లి, ఆంధ్రప్రభ : రానున్న
37,440 people | రేపే లాస్ట్! 37,440 people | తెలంగాణ న్యూస్
టీం ఇండియాకు ఝలక్ ఇచ్చిన ఐసిసి
సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్కి ముందు టీం ఇండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లకు భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశిత సమయం కంటే రెండు ఓవర్లు వెనకబడింది. దీంతో ఓవర్కు 5 శాతం చొప్పున పది శాతం మ్యాచ్ ఫీజ్ను టీం ఇండియాకు జరిమానాగా విధించారు. ఐసిసి ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి 5 శాతం కోత విధిస్తారు. అయితే ఈ జరిమానాను కెప్టెన్ కెఎల్ రాహుల్ అంగీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ లేకుండా ఈ కేసు ముగిసింది. కాగా ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరీస్ని 1-1గా సమం చేసింది. కానీ, వైజాగ్లో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించి.. 2-1 తేడాతో సిరీస్ని కైవసం చేసుకుంది.
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. మరో టాప్ కమాండర్ సరెండర్..
రాజ్నంద్గావ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నక్సలైట్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) రామ్ధేర్ మజ్జి సోమవారం తన బృందంతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయాడు. హిడ్మాతో సమానంగా కీలక నేతగా ఎదిగిన అతని తలపై ఇప్పటికే పోలీసులు రూ. కోటి రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ బకర్ కట్టాలోని పోలీస్ స్టేషన్లో మజ్జి లొంగిపోయాడు. మజ్జితో పాటు లొంగిపోయిన ఇతర మావోయిస్టు కార్యకర్తలలో చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేశ్ పొట్టం, లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు. వీరి లొంగుబాటుతో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మండలాలు నక్సల్ రహితంగా మారాయి. కాగా, ఇటీవల మావోయిస్టులు భారీగా ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోతున్న విషయం తెలసిందే. ఛత్తీస్గఢ్లో 80 శాతం నక్సలిజం నిర్మూలించబడింది.. కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 2026 నాటికి ఈ హింస నుండి రాష్ట్రం విముక్తి పొందుతుంది. అభుజ్మద్లోని పశ్చిమ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో, సుక్మా, బీజాపూర్ జిల్లాల దక్షిణ ప్రాంతాలలో మాత్రమే నక్సలిజం కొనసాగుతోంది. నేడు, బస్తర్లోని ప్రజలు భయం లేకుండా బహిరంగ గాలిని పీల్చుకోగలరు అని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం అన్నారు
Revanth Reddy : గ్లోబల్ సమ్మిట్ అసలు లక్ష్యమిదే
తెలంగాణలో చైనా లోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
భవిష్యత్తు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, అక్కినేని నాగార్జున, పలువురు మంత్రులు, దేశవిదేశీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలనను పూర్తి చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. ఉత్పత్తి, ఇంధన, నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ప్రపంచమంతా లాంచ్ ప్యాడ్ కోసం ఎదురుచూస్తోంది. తెలంగాణ అందుకు సిద్ధంగా ఉంది. టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, రాజకీయ నిబద్ధతతో అభివృద్ధికి కృషి చేస్తోంది అని చెప్పారు
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: దశాబ్ద కాలంగా భారత్ కు విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పదేళ్లుగా అన్ని రంగాల్లో ఈ అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందని తెలియజేశారు. పదేళ్లలో ఎయిర్ పోర్టులు రెండింతలయ్యాయని, జాతీయ రహదారులు 60 శాతం ఎక్కువై లక్షా 46 వేల కి.మి. చేరుకున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సెల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ ప్రస్తుతం రెండోస్థానంలో ఉందని, అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. కేంద్రం పాటిస్తున్న పారదర్శకత, జవాబుదారితనం వల్లే పెట్టుబడులు పెరిగాయని, గ్లోబల్ కంపెనీలకు డెస్టినేషన్ హబ్ గా భారత్ మారిందని కొనియాడారు. గత దశాబ్దకాలంగా భారత్ లో ఎన్ హెచ్ ల నిర్మాణం 70 శాతం పెరిగిందని, పదేళ్ల క్రితం 240 కి.మి. ఉన్న మెట్రో రైల్ నెట్ వర్క్ ఇప్పుడు 1013 కి.మి. పెరిగిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Chandrababu : వచ్చే నెలలో చంద్రబాబు దావోస్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఖరారయింది.
తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం: రేవంత్
హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నామని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు సిఎం పరిశీలించారు. సదస్సులో ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది తమ ఆశయం అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నదని, జిడిపిలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ ఆశయం అని పేర్కొన్నారు. లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని, అందరి సహకారంతో తమ లక్ష్యాన్ని అందుకుంటామని సిఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం అని కొనియాడారు. అన్ని రంగాల నిపుణులు వచ్చినందుకు చాలా సంతోషం అని రేవంత్ అన్నారు. దేశజనాభాలో 2.9 శాతమే ఉన్నా.. 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజించామని చెప్పారు. 3 జోన్లను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని, క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని ప్రశంసించారు. తెలంగాణలో గ్వాంగ్ డాంగ్ నమూనా అమలు చేయదలచామని రేవంత్ స్పష్టం చేశారు.
Tandoor |బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి
Tandoor | బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి ఓటర్లను అభ్యర్థించిన బీజేపీ రాష్ట్ర
‘ఎందుకో అంత క్యూట్గా?’ ప్రభాస్పై ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ కామెంట్స్
రెబల్స్టార్ ప్రభాస్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు ప్రభాస్. అభిమానులంతా ‘డార్లింగ్’ అంటూ ప్రభాస్ని ప్రేమగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎంతటి పవర్ఫుల్ రోల్స్ చేసినా.. బయట మాత్రం చాలా సౌమ్యంగా, ప్రేమగా ఉంటారు. అయితే ప్రభాస్ అంటే చాలా మంది సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అందులో ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్పుత్ ఒకరు. తనకి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ఆమె తాజాగా ఎక్స్లో వేసిన ఓ పోస్ట్ చూస్తే తెలుస్తోంది. ప్రభాస్ ఇటీవల జపాన్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల సందర్భంగా ఆయన జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ స్టిల్స్ కొన్ని వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ పోస్ట్ చేసిన పాయల్.. ‘‘ఇంత అమాయకంగా ఎవరైనా ఉండగలరా? ఇండస్ట్రీ మనల్ని కఠినంగా మార్చుతుంది. అంతేకాక.. మంద చర్మం గత వారిలా చేస్తుంది. కానీ, ఈ వ్యక్తి మాత్రం సులువుగా సిగ్గుపడుతుంటారు.. దాంతో ఎక్కువ మాట్లాడలేరు. ఎందుకు అంత క్యూట్గా ఉంటాడో? దేవుడు అతడిని దీవించుగాక’’ అంటూ ప్రభాస్ని పొగుడుతూ ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు ‘‘మీరిద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

18 C