SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్న యం బిఆర్‌ఎస్ ఒక్కటే అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది నిజంగా తమకు సానుకూలమైన అంశం అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అద్భుతంగా పనిచేశారని.. పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కెటిఆర్ స్పందిస్తూ రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని పేర్కొన్నారు. ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిజాయతీగా కొట్లాడాం బిఆర్‌ఎస్ గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను అద్భుతంగా పోషించిందని కెటిఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిజాయతీగా కొట్లాడమని స్పష్టం చేశారు. 2014 నుంచి 2023 వరకు దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నిక ల్లో కూడా గెలవలేదని గుర్తుచేశారు. దాదాపు ఐ దింటిలో తాము గెలిచామని చెప్పారు. జిహెచ్‌ఎం సి ఎన్నికలో కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కి ఒకటి 2సీట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. డైవర్షన్ రాజకీయాలు చేయలేదు ఎన్నికల్లో లబ్ధి కోసం కులం, మతం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయలేదని కెటిఆర్ అన్నారు. బూతులు అస్సలు మాట్లాడలేదని, హుందాగా కేవ లం ప్రజాసమస్యలపై మాత్రమే కొట్లాడామని తెలిపారు. ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్ర మే చర్చకు పెట్టామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎంత కవ్వించేందుకు యత్నించినా కూ డా సమన్వయం పాటించామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో కూడా తెలిపామని చెప్పారు. రెండేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయని ముఖ్యమంత్రి.. ఆఖరి రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక పరిస్థితి వచ్చిందంటే అది బిఆర్‌ఎస్ విజయమే అని పేర్కొన్నారు. రెండేళ్లలో మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు అని, దీనిపై బిఆర్‌ఎస్ గట్టిగా మాట్లాడి.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిన అనివార్యతను కల్పించామని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడుతుందో నెల రోజుల ముందే చెప్పామని, స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదని, ఆర్‌ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కవుట్ అయినట్టుందని కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పది ఉపఎన్నికలు వస్తే ఏం చేస్తారో చూద్దాం పశ్చిమబెంగాల్‌లో బిజెపి నుంచి టిఎంసిలో చేరిన ఎంఎల్‌ఎపై హైకోర్టు అనర్హత వేటు వేసిందని, అక్కడ జరిగిందే ఇక్కడా జరుగుతుందని ఆశిస్తున్నామని కెటిఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశమంతా ఒకటే న్యాయం ఉంటుంది కదా...? అని అడిగారు. ఒక్క ఉపఎన్నికకే కాంగ్రెస్ నేతలు ఆపసోపాలు పడ్డారని, 10 ఉపఎన్నికలు వస్తే వాళ్లకు ముచ్చెమటలు పడతాయేమో..ఏం చేస్తారో చూద్దాం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 15 Nov 2025 4:00 am

ఎసిబి మెరుపుదాడులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి మరోమారు మెరుపు దాడులు నిర్వహించింది. ఈనెల 6నకూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసిబి అ ధికారులు మరోమారు రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్‌లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కొన్ని చోట్ల నగదును, ఫోన్‌లను సైతం అధికారులు తమవెంట తీసుకెళ్లారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, గండిపేట్, మే డ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నల్లగొండ జి ల్లాలోని మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాలోని వైరా, జహీరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వనపర్తి సబ్ రి జిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి దాడులు నిర్వహించింది. శనివారం తెల్లవారుజాము వరకు ఏ సిబి అధికారులు ఈ తనిఖీలను కొనసాగించా రు.వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. ఈ సోదాల్లో అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహబూబ్‌నగర్ ఏసిబి డిఎస్పీ బాలకృ ష్ణ ఆధ్వర్యంలోసోదాలు జరగ్గా ఈ కార్యాలయం లో డాక్యుమెంట్ రైటర్స్, కార్యాలయ సిబ్బంది దగ్గర నగదును ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులను, పలు డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ మహిళ అనధికారికంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఈ కార్యాలయంలో 60,160 రూపాయలను ఏసిబి అధికారులు సీజ్ చేశారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది ఫోన్‌ల స్వాధీనం పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. ముందుగా సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది ఫోన్‌లను స్వాధీనం చేసుకొని గదిలో ఉంచారు. వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసిబి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ముందుగా ఈ దాడుల్లో ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు రూ. 2.90 లక్షల రూపాయల నగదును ఏసిబి అధికారులు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.42,300లు జహీరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో 10 మంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్టు ఏసిబి గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.42,300లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిన 113 డాక్యుమెంట్‌లు సబ్ రిజిస్ట్రార్ వారికి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నారని ఏసిబి అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఏసిబి ఆరా తీస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ జి.మధు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఫైళ్లను పరిశీలించిన ఏసిబి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. పలు ఫైళ్లను క్షుణ్ణంగా ఏసిబి అధికారులు పరిశీలించారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ ఏసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను, డాక్యుమెంట్‌లను ఏసిబి అధికారులు పరిశీలించారు. త్వరలోనే మరికొన్ని త్వరలోనే మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. మూసాపేట్, ఎల్‌బినగర్, హయత్‌నగర్, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శంషాబాద్, ఫరూక్‌నగర్, షాద్‌నగర్, చౌటుప్పల్, ఉప్పల్, భువనగిరి, యాదగిరి గుట్ట, సరూర్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, బీబీనగర్, ఘట్‌కేసర్, చంపాపేట్, కీసర, నారపల్లి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబికి అధికంగా ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. సబ్ రిజిస్ట్రార్‌లపై ఆరోపణలు వస్తే అందినకాడికి తమ నుంచి డిఆర్‌లు, డిఐజిలు వసూళ్లు చేస్తున్నారని ఏసిబి దాడులు వారిపై ఎందుకు చేయడం లేదని సబ్ రిజిస్ట్రార్‌లు ప్రశ్నిస్తున్నారు. డాక్యుమెంట్‌ల విషయంలో తమపై ఫిర్యాదులు వస్తే వెంటనే డిఆర్‌లు భయబ్రాంతులకు గురి చేసి తమనుంచి అందినకాడికి దండుకుంటున్నారని సబ్ రిజిస్ట్రార్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ డిఆర్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

మన తెలంగాణ 15 Nov 2025 3:30 am

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహాం

మన తెలంగాణ/హైదరాబాద్ : హైడ్రాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏజెన్సీకి ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేయవద్దని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టు అధికారం చూపుతామని కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను హెచ్చరించారు. హైడ్రా 50, 100 గజాల్లో నిర్మాణాలే లక్షంగా ఎందుకు వెళుతున్నారని కమిషనర్‌ను ప్రశ్నించారు. తుమ్మిడి కుంట చెరువు పునరుద్దరణ పనులపై ఇతర భూముల్లో యధాస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. శుక్రవారం తుమ్మిడి కుంట చెరువుపై కోర్టు ధిక్కార పిటిషన్ విచారణను చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి హైడ్రాపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రజలకు సేవ చేయడం కోసమే అధికారులకు అధికారం ఇవ్వబడిందని కోర్టులకు ఉన్నతమైన అధికారం ఉందని అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. అలాంటి అధికారాన్ని ఉపయోగించమని మమ్మల్ని బలవంతం చేయవద్దుని న్యాయమూర్తి వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమిషనర్‌తో అన్నారు. బఫర్ జోన్‌లు, సరస్సు ప్రాంతాలలో ఉన్న భూములలో భవనాలు వచ్చినప్పటికీ, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానాలను పాటించకుండా నిర్మాణాల కూల్చివేతలు చేపట్టకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభావిత వ్యక్తులకు సరైన నోటీసులు జారీ చేయకుండా నిర్మాణాలను కూల్చివేసే అధికారాన్ని హైడ్రా ఎక్కడి నుండి పొందిందో తెలపాలని న్యాయమూర్తి కోరారు. పెద్దపెద్ద నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని, 50, 100 గజాల నిర్మాణలే లక్షంగా ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. కొంతమంది తమ ఇంటి నిర్మాణం కోసం 50 నుండి 100 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్‌లను కొనుగోలు చేస్తారని న్యాయమూర్తి అన్నారు. కొన్నిసార్లు, ప్రభుత్వాలు భూమి క్రమబద్ధీకరణ పథకం, భవన క్రమబద్ధీకరణ పథకం కింద అటువంటి ప్లాట్లలో ఏర్పడిన నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తాయని గుర్తు చేశారు. హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయకుండా శని, ఆదివారాల్లో వాటిని కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణదారులు అకస్మాత్తుగా ఎక్కడికి వెళతారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అన్ని కేసులలోనూ ఏజెన్సీ చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని హైడ్రా కమిషనర్, ప్రభుత్వ న్యాయవాది ఇమ్రాన్‌ఖాన్ ధర్మాసనానికి తెలియజేశారు. ప్రభుత్వ ప్రజా వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్య తీసుకుంటూ కూల్చివేతలను చేపట్టామని కమిషనర్ కోర్టుకు తెలిపారు. హైటెక్ సిటీ, చార్మినార్, ఇతర ప్రాంతాలలో వరదలను నివారించడానికి తుమ్మిడి కుంట సరస్సు అడుగుభాగం నుండి టన్నుల కొద్దీ బయో-వేస్ట్‌లు, శిధిలాలను తొలగిస్తూ హైడ్రా చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని కమిషనర్ రంగనాథ్ కోర్టు వివరించారు. ప్రజా వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన అనేక ఫిర్యాదులపై అటువంటి చర్య అవసరమని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడానికి చట్టం ఏజెన్సీకి ఎటువంటి అధికారాన్ని ఇవ్వలేదని పిటిషనర్ మొహమ్మది బేగం న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో తుమ్మిడి కుంట చెరుపు పునరుద్దరణ నిర్మాణ పనులు, ఇతర భూముల్లో యధాతద స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను కోర్టు ధిక్కార కేసును ఈనెల 27కి వాయిదా వేశారు.

మన తెలంగాణ 15 Nov 2025 3:00 am

శనివారం రాశి ఫలాలు (15-11-2025)

మేషం విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృషభం ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. మిధునం ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. కర్కాటకం చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. సింహం సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. కన్య వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తుల ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృశ్చికం ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. ధనస్సు భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. మకరం ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. కుంభం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీనం కొన్ని పనులలో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.  

మన తెలంగాణ 15 Nov 2025 12:20 am

బాలాజీ నగర్‌లో జార్ఖండ్ యువకుడి ఆత్మహత్య

జార్ఖండ్‌కు చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాజీ నగర్‌లో చోటుచేసుకుంది. బాలాజీ నగర్‌లోని మా భూమి న్యాచురల్స్‌లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బినాయి కుమార్(27) సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటున్నాడు, ఈ నెల 13వ తేదీన షాపులోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డైరీలో కుటుంబ సభ్యులకు సారీ, గుడ్‌బై, ఫర్‌గివ్ అని రాసుకున్నాడు. డిప్రెషన్‌లో ఉండేవాడని, ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 14 Nov 2025 10:50 pm

ఉరివేసుకొని పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య…

ఖమ్మం రూరల్‌, (ఆంధ్రప్రభ) : ఖమ్మం నగర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌

ప్రభ న్యూస్ 14 Nov 2025 10:49 pm

జనావాసాల్లో వైన్స్‌కు నో !!

మోత్కూర్, (ఆంధ్రప్రభ): మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో జనావాసాల మధ్య నూతన వైన్స్ దుకాణాలు,

ప్రభ న్యూస్ 14 Nov 2025 10:32 pm

నెలకు రూ.10కే..!

రాయల్ ర్యాప్చీ సంస్థ ‘టీబీడీ’ ఓటీటీని దుబాయ్‌లో లాంచ్ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన లోగో లాంచ్ కార్యక్రమానికి సంస్థ ఎండి ధరమ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీ, డి.యస్.రావు, వి. సముద్ర, వి.యన్. ఆదిత్య, చంద్రమహేష్, ఇ.సత్తిబాబు, శివనాగు, బసిరెడ్డి, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ చేతుల మీదుగా ఈ యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిబిడి ఎండి ధరమ్‌గుప్తా మాట్లాడుతూ టిబిడి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ నెలకు కేవలం రూ.10 మాత్రమేనని అన్నారు.

మన తెలంగాణ 14 Nov 2025 10:26 pm

రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలి…

మోత్కూర్, ఆంధ్రప్రభ: రైతులు నాణ్యమైన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తేనే ప్రభుత్వ

ప్రభ న్యూస్ 14 Nov 2025 10:20 pm

తాడ్వాయిలో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు..

తాడ్వాయి, ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో

ప్రభ న్యూస్ 14 Nov 2025 10:12 pm

We are happy with how people are warming up to Kaantha – Rana

Kaantha starring Dulquer Salmaan, Bhagyashri Borse, Samuthirakani, Rana Daggubati has released to highly positive reviews and praises for DQ’s performance. Bhagyashri shocked many with her Kumari character, being a newcomer. Rana Daggubati and Dulquer have produced the film and Rana interacted with media about the film. He stated that Telugu people are taking time to […] The post We are happy with how people are warming up to Kaantha – Rana appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 10:11 pm

మిర్యాలగూడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నల్గొండ జిల్లా, మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు

ప్రభ న్యూస్ 14 Nov 2025 10:03 pm

15 Nov Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

15 Nov Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 15 Nov

ప్రభ న్యూస్ 14 Nov 2025 9:58 pm

ఇసుక లారీల మాఫియా విధ్వంసం..

ఏటూరు నాగారం, ఆంధ్ర ప్రభ : ​ఇసుక అక్రమ రవాణా చేసే లారీల

ప్రభ న్యూస్ 14 Nov 2025 9:44 pm

ప్రజా పాలన ఫలితం జూబ్లీ విజయం: మంత్రి అడ్లూరి

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రెండేళ్ల ప్రజా పాలన ఫలితమే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ విజయమని తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం నాడు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ సంబరాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బాణాసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పై విశ్వాసం నమ్మకంతో ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగింటిని అమలు చేసిందని వాటి ఫలితమే ఈనాటి విజయానికి కారణమని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఆదర్శంగా తీసుకొని మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని బి ఆర్ ఎస్, బిజెపి ఎన్ని అబద్ధాలు ఆడిన దొంగ మాటలు చెప్పిన ప్రజలు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేశారని ఇప్పటికైనా వక్రబుద్ధి మానుకోవాలని సూచించారు. కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారని నీతి నిజాయితీకి పట్టం కట్టారని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వచ్చే 20 ఏళ్లు తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడియా రూప్లనాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కిలవనపర్తి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యక్షులు సంతోష్, యువజన కాంగ్రెస్ ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు యశోద అజయ్, ధర్మారం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోగాల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జనగామ తిరుపతి,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 14 Nov 2025 9:30 pm

వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి అధికారుల తనిఖీలు

వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు మహబూబ్నగర్ రేంజ్ డిఎస్పి బాలకృష్ణతోపాటు ఇద్దరు ఎస్సైలు సిబ్బందితో కలిసి కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్, కార్యాలయసిబ్బంది,వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని బయటికి వెళ్లకుండా లోపలనే ఉంచి వారితో ఉన్న డాక్యుమెంట్ లను క్షుణ్ణంగా పరిశీలించి, రైటర్స్,కార్యాలయ సిబ్బంది వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.లోపల ఉన్న ప్రతి ఒక్కరి వివరాలతో పాటు,ఏ పని నిమిత్తం వచ్చారనే సమాచారంను సేకరించారు. అనంతరం డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ గత కొంత కాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.ఈ తనిఖీల్లో పలు రికార్డులతో పాటు కార్యాలయ,డాక్యుమెంట్ రైటర్స్ సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం.పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాక మీడియాకు వివరాలు వెల్లడిస్తాం.జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు,సిబ్బంది లంచం అడిగితే నేరుగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064,91543 88974 కి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం అని తెలిపారు. అనంతరం వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని అక్కడ నుంచి పంపించేసి కార్యాలయంలో అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు సమయం పడుతుందని తెలిపారు. ఉలిక్కిపడ్డ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విస్తృత అకస్మిక తనిఖీల నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేసే అధికారులు,సిబ్బంది ఉలికిపడ్డారు.ఈ సమాచారం తెలుసుకున్న పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఆ సమయానికి కార్యాలయాల్లో ఉండకుండా బయటికి వెళ్లారు.మొదట ఏసీబీ జిల్లాకు వచ్చి తనీఖిలు చేస్తున్నారనే సమాచారం లేక పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారనే తప్పుడు సమాచారం రావడంతో పలువురు మీడియా సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆరా తీయగా...అక్కడ పనిచేసే ఏజెంట్లు ,సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అకస్మిక తనిఖీలు చేస్తున్నారనే సమాచారం రావడంతో పలు శాఖల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మన తెలంగాణ 14 Nov 2025 9:20 pm

Shiva Re-release dominates Friday Releases

This Friday, Dulquer Salmaan and Rana Daggubati’s Kaantha, Santhana Prapthirasthu, Love OTP, Gopi Galla Goa Trip, Jigris released in the Telugu states. Apart from this, Nagarjuna’s cult classic film Shiva has been remastered and it was released after 36 years in theatres. Dominating all the five new releases, Shiva performed well and opened on a […] The post Shiva Re-release dominates Friday Releases appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 9:20 pm

కిడ్స్ విత్ కాకి..

కామారెడ్డి, తాడ్వాయి (ఆంధ్రప్రభ): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో

ప్రభ న్యూస్ 14 Nov 2025 9:19 pm

Shraddha Kapoor and Nora Fatehi named in a Drug Probe

Bollywood beauties Shraddha Kapoor and Nora Fatehi have been named in a Rs 252 crore drug trafficking racket and it is linked to underworld don Dawood Ibrahim. Shraddha Kapoor’s brother Siddhanth Kapoor too is named in the drug probe. Other celebrities are Orry, Abbas Mustan, Zeeshan Siddiqui. The investigation told that parties were organized in […] The post Shraddha Kapoor and Nora Fatehi named in a Drug Probe appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 9:18 pm

Prabhas to be seen in a New Makeover

Prabhas is stepping into a bold new avatar for his upcoming film Spirit. Director Sandeep Reddy Vanga asked him to grow his beard and moustache for forty-five days. The actor has taken the brief seriously. His look is now shaping up under the supervision of celebrity hairstylist Aalim Hakim. Aalim is well known in the […] The post Prabhas to be seen in a New Makeover appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 9:15 pm

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు..

ఉట్నూర్, (ఆంధ్రప్రభ): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్(బి) ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థులు

ప్రభ న్యూస్ 14 Nov 2025 9:14 pm

పాత కేసులను పరిష్కరించుకునే అవకాశం…

బిక్కనూర్, (ఆంధ్రప్రభ): జాతీయ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న పాత కేసులను పరిష్కరించుకునేందుకు

ప్రభ న్యూస్ 14 Nov 2025 9:07 pm

బీహార్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచి సత్తా చాటిన ఎంఐఎం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోగా, అక్కడ పోటీ చేసిన అసదుద్దీన్ ఓవైసికి చెందిన ఎంఐఎం పార్టీ మరోసారి తన పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ తన సత్తా చాటింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాలను ఏఐఎంఐఎం గెలుచుకుంది. ఆ పార్టీ వర్గాల సమాచారం మేరకు అమౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అక్తర్ ఉల్ ఇమాన్, బహదూర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తౌసీఫ్ ఆలం, జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ ముర్షీద్ ఆలం, బైసి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గులాం సర్వార్, కొచధమాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ సర్వార్ ఆలం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలను 2020 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ గెలుచుకుంది.

మన తెలంగాణ 14 Nov 2025 9:00 pm

కర్నూలుకు  రిలయన్స్ రెడీ

గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటునకు సానుకూలత తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో

ప్రభ న్యూస్ 14 Nov 2025 8:47 pm

ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జనం మాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఏడుపాయలకు చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. ఘనాపూర్ ప్రాజెక్టు ఎత్తు పెంపు, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక ప్రాజెక్టు అయిన ఘనాపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు కోసం స్థానిక నాయకులు ప్రయత్నం చేసి, మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఆనకట్ట ఎత్తు పెంపు పనుల పూర్తికి 30 లక్షల రూపాయలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురైన రైతులకు చెల్లించాల్సిన పరిహారం కింద రూ.13 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురైన రైతులతో మాట్లాడతామని కవిత తెలిపారు. ఆనకట్ట ఎత్తు పెంచడం వలన ముఖ్యంగా ఏడుపాయల ఆలయానికి కలిగే ప్రయోజనాన్ని ఆమె వివరించారు. ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం ప్రతి సంవత్సరం వర్షాల కారణంగా ముంపుకు గురవుతోంది. ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల అమ్మవారి ఆలయం ముంపుకు గురికాకుండా ఉంటుందని కవిత పేర్కొన్నారు. అమ్మవారి దయవల్ల ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచి, అమ్మవారి ఆలయమునగకుండా చూడాలని మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని కవిత తెలిపారు.

మన తెలంగాణ 14 Nov 2025 8:42 pm

ఎస్ఎఇఎల్ చైర్మన్  మంత్రి లోకేష్ భేటీ

డాటా సెంటర్లపై పెట్టుబడుల ఆహ్వానం ( విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో) ఎస్ఎఇఎల్

ప్రభ న్యూస్ 14 Nov 2025 8:34 pm

జాతీయ రహదారిపై కారు బోల్తా

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి 44పై కారు బోల్తా పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.  హైదరాబాద్ నుండి కర్నూలు వైపు  వెళ్తున్న కారును గద్వాల డిపోకు చెందిన ఆర్టిసి బస్సు కొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసి బస్సు కారును ఢీకొట్టి ఆగడంతో వెనకాల వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గద్వాల ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఆర్టీసీ బస్సును ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. సుమారు 50 మంది ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మన తెలంగాణ 14 Nov 2025 8:33 pm

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

ఆటోలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 331 గ్రాముల గంజాయి, ఆటో, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దుంప శ్రీనివాస్, కావేటి విజయ్‌కుమార్ కలిసి బాలాపూర్, మిథాని రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే ఎస్‌టిఎఫ్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి వెళ్లింది. ఆటోలో ఇద్దరు నిందితులు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. ధూల్‌పేట్‌లో... ధూల్‌పేట, ఝాన్సీ చౌరాయి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.152కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ సింగ్, విజయలక్ష్మి, బిజిమా ది బాయి కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. నరేందర్ సింగ్‌ను అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మన తెలంగాణ 14 Nov 2025 8:22 pm

వేగంగా.. ఆక్వా రిజిస్ట్రేషన్   

ప్రక్రియను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రక్రియను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్

ప్రభ న్యూస్ 14 Nov 2025 8:20 pm

‘అఖండ-2’ నుంచి సాంగ్ విడుదల.. ఫ్యాన్స్‌కి పూనకాలే

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ-2’ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్ని ఆకట్టుకున్నాయి. కాగా, శుక్రవారం ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ‘అఖండ తాండవం’ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పాటకి తమన్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. శంకర్ మహదేవన్, కైలాస్ ఖేర్, దీపక్ బ్లూ ఈ పాటను ఆలపించారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాటలో ఆఘోర గెటప్‌లో బాలకృష్ణ అదరగొట్టారు. ఇక ఈ సినిమాను ఎం తేజస్వీని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

మన తెలంగాణ 14 Nov 2025 8:15 pm

జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం నాదే:మాగంటి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. కాంగ్రెస్‌ది గెలుపే కాదు అని, నైతిక విజయం తనది, బిఆర్‌ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం యూసుఫ్‌గూడలో మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎంతో అరాచకం సృష్టించారని ఆరోపించారు. ఒక మహిళపై అంతమంది రౌడీయిజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అన్నారు. తాను ఏం మాట్లాడినా.. కార్యకర్తలను పరామర్శించినా తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కౌంటింగ్ రోజున ఉదయం నుంచే కౌంటింగ్ హాలులో ఆడవాళ్లపై కాంగ్రెస్ ర్యాగింగ్ మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. ఒక మహిళపై కాంగ్రెస్ నేతలు రౌడీ రాజకీయం చేశారని, ప్రజలను కాంగ్రెస్ భయబ్రాంతులకు గురిచేసిందని మండిపడ్డారు. గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటో ప్రజలు గమనించారని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు మాగంటి సునీత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు.

మన తెలంగాణ 14 Nov 2025 8:14 pm

Akhanda 2 Reflects Our Desh & Dharm: Balakrishna

Nata Simham Nandamuri Balakrishna and director Boyapati Sreenu, who together delivered a hat-trick of blockbusters, are set to enthrall audiences once again with Akhanda 2, which marks the fourth film in their collaboration. The film’s first song, The Thaandavam, was released today in Mumbai. Boyapati Sreenu expressed his happiness at beginning the promotions in Mumbai, […] The post Akhanda 2 Reflects Our Desh & Dharm: Balakrishna appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 8:12 pm

జూబ్లీహిల్స్ ప్రజల ఆశలు వమ్ము చేయను: నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేశారని, ప్రజల ఆశలు వమ్ము చేయను అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. గతంలో బిఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదని, ప్రజలకు ఆ విషయం చెప్పుకోలేక తమపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని ఆ పార్టీ చూసిందని ఆరోపించారు. ప్రజలందరూ తమ ఓటుతో బిఆర్‌ఎస్ పార్టీ దుష్ప్రచారాలను తిప్పికొట్టారని చెప్పారు. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని ఆయన అన్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ముగిశాయని, ఇక అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు.

మన తెలంగాణ 14 Nov 2025 8:11 pm

Telangana |ఉన్న‌త స్థాయికి ఎద‌గాలి….

Telangana | ఉన్న‌త స్థాయికి ఎద‌గాలి…. Telangana |తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి

ప్రభ న్యూస్ 14 Nov 2025 8:07 pm

6138 కిశోర బాలికల స్నేహ సంఘాల ఏర్పాటు

మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే కిశోర బాలికల కోసం స్నేహ సంఘాల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 19.13 లక్షల మంది కిషోర బాలికలు ఉండగా, వారి కోసం స్నేహ సంఘాలను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సెర్స్ సీఈఓ దివ్యా దేవరాజన్‌తో కలిసి శుక్రవారం ప్రజాభవన్‌లో ప్రారంభించారు. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే స్నేహ సంఘాలు కూడా పని చేస్తాయి. 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న కిశోర బాలికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 65,615 మందితో 6,138 కిశోర బాలికల స్నేహ సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి యువతిని సురక్షితంగా, ఆరోగ్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో సమాజానికి నాయకురాలిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్నేహ సంఘాలు ఏర్పాటయ్యాయని అన్నారు. కిశోర బాలికల్లో ఆరోగ్య అవగాహన, మానసిక ఆరోగ్యం, రుతుక్రమ సమయంలో శుభ్రతపై శిక్షణలు, అనిమియా తగ్గింపు, సరైన పోషకాహారంపై ప్రోత్సాహం, సైబర్ భద్రత, ఆన్‌లైన్ దుర్వినియోగాల నివారణ, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ మేళాలు, ఆర్థిక స్వావలంబపై స్నేహ సంఘాలు అవగాహన కల్పించనున్నాయని తెలిపారు. ప్రతి కిశోర బాలికను స్నేహ సంఘంలో చేర్పించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, టీజీ ఫుడ్స్ చైర్‌పర్సన్ ఫహీం తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 14 Nov 2025 8:07 pm

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించిన ఆలేరు విద్యార్థి….

నెల్లికుదురు, (ఆంధ్రప్రభ): ఎస్జీఎఫ్ 69వ అండర్-17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నెల్లికుదురు మండలం

ప్రభ న్యూస్ 14 Nov 2025 8:04 pm

ప్రజా పాలనకు పట్టం కట్టారు:మంత్రి పొంగులేటి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంతో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంచారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అబద్దాలు, అవాస్తవాలు, విష ప్రచారాలు చేసిన పార్టీలకు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాతీర్పును పరిగణనలోకి తీసుకొని తమ నోటికి తాళం వేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా విజేత నవీన్ యాదవ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదక్షతకు ఈ ఫలితం ఒక రెఫరెండంగా నిలిచిందన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూబ్లీహిల్స్ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఇందుకు ప్రభుత్వం తరపున అన్నివేళలా సహకారం ఉంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా తాను ఇన్‌చార్జీగా వ్యవహారించిన రహ్మత్‌నగర్ డివిజన్‌లో అధిక మెజార్టీ కాంగ్రెస్‌కు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 14 Nov 2025 8:04 pm

Telangana |ఆర్థిక సహాయం అంద‌జేత‌…

Telangana | ఆర్థిక సహాయం అంద‌జేత‌… Telangana |కామారెడ్డి,తాడ్వాయి, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:56 pm

కుక్కునూరులో కలకలం

కుక్కునూరు (ఆంధ్రప్రభ) : ఏలూరు జిల్లా కుక్కునూరు (kukkunuru) మండలంలో క్షుద్రపూజల (Horror

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:53 pm

ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

మంచిర్యాల జిల్లా, చెన్నూర్ (ఆంధ్రప్రభ): చెన్నూర్ లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:53 pm

Telangana |నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం…

Telangana | నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం… Telangana | జుక్కల్

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:50 pm

Telangana |ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…..

Telangana | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు….. Telangana | రేగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:45 pm

పెద్దజట్రంలో పోలీసుల ముఖాముఖి..

ఊట్కూర్ (ఆంధ్రప్రభ): గ్రామాల్లో ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, రాబోయే పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:44 pm

ప్రజారోగ్యమే లక్ష్యం

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ వెల్లడి ( కర్నూలు ,

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:26 pm

Telangana |అక్రమ తవ్వకాలు ఆపాలి…

Telangana | అక్రమ తవ్వకాలు ఆపాలి… Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:26 pm

Telangana |ఘనంగా బాలాల దినోత్సవం…

Telangana | ఘనంగా బాలాల దినోత్సవం… Telangana | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:18 pm

వైసీపీ భ్రమవద్దు  

అధికారులపై మాజీ ఎమ్మెల్యే భూమా ఫైర్​ ( నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో)

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:12 pm

Telangana |జూబ్లీహిల్స్ గెలుపుతో మ‌రింత బలం…

Telangana | జూబ్లీహిల్స్ గెలుపుతో మ‌రింత బలం… Telangana | ఎండపల్లి ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:12 pm

Thaman promises a perfect Feast with Akhanda 2 Interval

The first single from Akhanda 2 is out today and the team interacted with the media through an event in Mumbai. The film’s music composer Thaman announced that the interval episode will offer goosebumps for the audience. “The interval reel is enough for the audience and it is worth Rs 500 for the audience. They […] The post Thaman promises a perfect Feast with Akhanda 2 Interval appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 7:11 pm

విధ్వంసం సృష్టించిన వైభవ్.. సూపర్‌ఫాస్ట్ సెంచరీ

దోహ: ఆసియా రైజింగ్ స్టార్స్ 2025లో యుఎఇతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఎ తరఫున 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఎ జట్టుకు వైభవ్ వీరోచిత బ్యాటింగ్‌తో 297 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆరంభం నుంచి వైభవ్ దూకుడుగా ఆడాడు. ఆయాన్ ఖాన్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదిన వైభవ్.. ఆ తర్వాత జవదుల్లా బౌలింగ్‌లో్ మూడు ఫోర్లు ఓ సిక్సు రాబట్టాడు. రోహిద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి.. 16 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. అనంతరం ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4 కొట్టాడు. పరాజుద్దీన్ తర్వాతి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు బాది 98 పరుగులకు చేరుకున్నాడు. ముహమ్మద్ అర్ఫాన్ వేసిన పదో ఓవర్‌లో ఫోర్ కొట్టి సెంచరీ చేశాడు. శతకం చేసిన తర్వాత కూడా వైభవ్ తన దూకుడుకు బ్రేక్ వేయలేదు. హర్షిత్ కౌశిక్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండు సిక్సులు కొట్టి 144 పరుగుల వద్ద పరాజుద్దీన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. వైభవ్‌తో పాటు కెప్టెన్ జితేశ్ శర్మ(83) పరుగులతో రాణించడంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది యుఎఇ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

మన తెలంగాణ 14 Nov 2025 7:08 pm

Telangana |కాంగ్రెస్ గెలుపు పై హర్షం

Telangana | కాంగ్రెస్ గెలుపు పై హర్షం Telangana | తాడ్వాయి, ఆంధ్ర

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:05 pm

Telangana |ఘనంగా జన్మదిన వేడుకలు.

Telangana | ఘనంగా జన్మదిన వేడుకలు. Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 7:01 pm

Bihar : బీహార్ బీజేపీ కూటమిదే.. వార్ వన్ సైడ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు

తెలుగు పోస్ట్ 14 Nov 2025 6:58 pm

Telangana |విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ‌…

Telangana | విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ‌… Telangana | నర్సింహులపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:51 pm

Bihar verdict: Big blow to Rahul image, while ‘Brand Modi’ stays invincible

The verdict of Bihar Assembly polls, threw up quite unexpected results for both the warring sides. While Mahaghatbandhan, the alliance of Congress and Rashtryia Janata Dal (RJD) got a big shock, even National Democratic Alliance (NDA) faced pleasant surprise, as its majority exceeded its expectations. While the stunning verdict will remodel Bihar politics, it is […] The post Bihar verdict: Big blow to Rahul image, while ‘Brand Modi’ stays invincible appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 6:47 pm

Telangana |డయాబెటిస్ నివారణ ర్యాలీ

Telangana | డయాబెటిస్ నివారణ ర్యాలీ Telangana | కొడకండ్ల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:47 pm

Bihar Election 2025: How Nitish Kumar Achieved a Massive Positive Wave Even After 20 Years in Power

The National Democratic Alliance’s sweeping victory in Bihar has stunned both political analysts and rival parties. The scale of the mandate is extraordinary. The NDA surged ahead in nearly 200 out of 243 seats, while the BJP emerged as the single largest party with an exceptional strike rate. What makes this victory even more remarkable […] The post Bihar Election 2025: How Nitish Kumar Achieved a Massive Positive Wave Even After 20 Years in Power appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 6:45 pm

ప్ర‌జాపాల‌న‌కు ప్రజల గ్రీన్ సిగ్నల్..

ఓల్డ్ బోయిన్పల్లి, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర అభివృద్ధి కోసం గత రెండు

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:28 pm

Telangana |ఘనంగా స్వయంపాల దినోత్సవం..

Telangana | ఘనంగా స్వయంపాల దినోత్సవం.. Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:26 pm

Kaantha Movie Genuine Review Analysis

The post Kaantha Movie Genuine Review Analysis appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 6:21 pm

Adilabad |మాజీ ఎంపీటీసీకి ఎంపీ నగేష్ పరామర్శ

Adilabad | మాజీ ఎంపీటీసీకి ఎంపీ నగేష్ పరామర్శ Adilabad| ఉట్నూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:20 pm

Warangal |విష‌య జ్ఞానాన్ని పెంపొందింస్తుంది…

Warangal | విష‌య జ్ఞానాన్ని పెంపొందింస్తుంది… Warangal | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:15 pm

Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ పై కవిత సంచలన ట్వీట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సంచలన ట్వీట్ చేశారు

తెలుగు పోస్ట్ 14 Nov 2025 6:14 pm

జూబ్లీహిల్స్ రిజల్ట్.. కవిత ఆసక్తికర పోస్ట్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ ఫలితాల తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోల్ అయ్యాయి. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చి.. డిపాజిట్ గల్లంతు అయింది. 

మన తెలంగాణ 14 Nov 2025 6:11 pm

WGL |విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యం..

ములుగు, (ఆంధ్రప్రభ): శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో విద్య, మౌలిక

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:08 pm

Adilabad |స్వ‌చ్చందంగా గుడిసెల తొల‌గింపు..

Adilabad | స్వ‌చ్చందంగా గుడిసెల తొల‌గింపు.. Adilabad | దండేపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:08 pm

Cantonment |ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Cantonment | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగన్వాడి కేంద్రంలో కేక్ కట్

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:03 pm

Narayanpet |లక్ష్య‌సాధన కోసం కృషి చేయాలి

Narayanpet | లక్ష్య‌సాధన కోసం కృషి చేయాలి Narayanpet | నారాయణపేట ప్రతినిధి,

ప్రభ న్యూస్ 14 Nov 2025 6:01 pm

BRS : కారును గ్యారేజీకి పంపాల్సిందే.. ఇంజిన్ ను మార్చాల్సిందేనా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులను మరింత కుంగ దీశాయి

తెలుగు పోస్ట్ 14 Nov 2025 5:59 pm

కురాష్ ఆట క్రీడల్లో ప్రతిభ చాటిన జివిఇ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినీలు

విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్ర పోటీలు నిర్వహించడం జరిగింది. హెచ్డిఎఫ్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఈ కురాష్ గేమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సుమన మాట్లాడుతూ ఇందులో జివి ఈ జెడ్పి గర్ల్స్ స్కూలుకు చెందిన 8వ తరగతి విద్యార్థి వి.సింధు అండర్ 14 మైనస్ 32 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచిందని, తదుపరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. అనంతరం డిసెంబర్ 15వ తేదీ నుంచి […] The post కురాష్ ఆట క్రీడల్లో ప్రతిభ చాటిన జివిఇ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Nov 2025 5:36 pm

Jupally |బీఆర్ఎస్‌కు చెంపదెబ్బ..

Jupally | బీఆర్ఎస్‌కు చెంపదెబ్బ.. Jupally | జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:26 pm

Nizamabad |గొనుగోలుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 10

Nizamabad | గొనుగోలుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 10 Nizamabad | సదాశివనగర్,

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:25 pm

TG |వందశాతం పూర్తి చేయాల్సిందే..

జనగామ, ఆంధ్రప్రభ : నిరుపేదలకు కనీస నివాస గృహం కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:23 pm

Revanth Reddy : ఉప ఎన్నికల్లో గెలుపు మాపై మరింత బాధ్యతను పెంచింది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు

తెలుగు పోస్ట్ 14 Nov 2025 5:23 pm

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు కుర్చీలు అందజేత

ప్రిన్సిపాల్ వనితా వాణివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు దాత ప్రముఖ సన్ ఫీస్ట్ కంపెనీ ప్రతినిధి కె. సూర్య నారాయణ 15 కుర్చీలను తన వంతు సాయం గా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనిత వాణి కి అందజేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల అభివృద్ధి కమిటీ తరుపున బండి వేణుగోపాల్, ప్రిన్సిపాల్ వనితా వాణి, అధ్యాపక సిబ్బంది సునీత, మునుస్వామి నాయుడు తదితరులు దాత కు కృతజ్ఞతలు […] The post ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు కుర్చీలు అందజేత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Nov 2025 5:18 pm

Mahabubnagar |కాంగ్రెస్ సంబరాలు

Mahabubnagar | కాంగ్రెస్ సంబరాలు Mahabubnagar | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:15 pm

TG |ఏసీబీ సడన్ ఎంట్రీ..

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:14 pm

Kamareddy |వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి

Kamareddy | వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి నోడల్ ఆఫీసర్ షేక్ సలాం

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:10 pm

Nalgonda |లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే

Nalgonda | లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే Nalgonda | నల్గొండ, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:08 pm

హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం

* గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ సభ్యులు గురువారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న ( చిన్న ఉరుకుందు), గ్రామ ఉపాధ్యక్షులుగా నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సత్యన్న, బోయ సురేష్, బోయ వీరేష్ ప్రమాణ […] The post హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Nov 2025 5:08 pm

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అధికారం దుర్వినియోగం చేసింది : రామచందర్ రావు

హైదరాబాద్: బిహార్ ఫలితాలు భవిష్యత్ లో దేశమంతా వచ్చే ఫలితాలకు నిదర్శనం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బిహార్ లో ఎన్డిఎ ఘన విజయం సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్ లో కాంగ్రెస్ కంటే ఎంఐఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బాగుంటుందని.. అన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయని రామచందర్ రావు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని భావిస్తున్నామని, జూబ్లీహిల్స్ లో బిజెపి ఎప్పుడూ గెలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కాకుండా.. ఎంఐఎం గెలిచినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం దుర్వినియోగం చేసి గెలిచిందని, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచే పోటీ చేశారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఓటమి తర్వాత బిజెపి మంచి విజయాలు సాధించిందని రామచందర్ రావు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 14 Nov 2025 5:06 pm

సీఎంకే  క్రెడిట్

భళా.. కాంగ్రెస్ టీమ్ జూబ్లీహిల్స్ లో పాగా సూపర్ గురూ (

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:03 pm

Mahabubnagar |స‌మ‌స్య‌లు సృష్టించ‌డం స‌రికాదు…

Mahabubnagar | స‌మ‌స్య‌లు సృష్టించ‌డం స‌రికాదు… Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Nov 2025 5:02 pm

ముగిసిన తొలి రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బుమ్రా ఐదు వికెట్ల పడగొట్టి సఫారీలను చిత్తు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. నిదానంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అయితే జెన్సన్ బౌలింగ్‌లో ఓపెనర్ జైస్వాల్(12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బ్యాటర్‌గా వాషింగ్టన్ సుందర్‌ని బరిలోకి దింపారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి 122 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్‌లో రాహుల్(13), సుందర్(6) ఉన్నారు.

మన తెలంగాణ 14 Nov 2025 4:52 pm

Mahbubnagar |వరి రైతులకు సంచులు ఇవ్వాలి

Mahbubnagar | వరి రైతులకు సంచులు ఇవ్వాలి Mahbubnagar | నారాయణపేట ప్రతినిధి,

ప్రభ న్యూస్ 14 Nov 2025 4:52 pm

19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ

విశాలాంధ్ర- అనంతపురం : ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ ను షెడ్యూల్ కు […] The post 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Nov 2025 4:52 pm

ఎర్రజెండాలన్ని ఐక్యం కావాలిరాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలి ….. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృశ్య ఎర్రజెండాలన్ని ఐక్యం కావలసిన అవస్యకత నెలకొందని, రాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలని, మావోయిస్టు సోదరులు మీ ప్రాణాలు చాలా అమూల్యమైన వని జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రజా ఉద్యమాలకు నిర్వహించి ప్రజలకు అండగా నిలుద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య కోరారు. శుక్రవారం సీఆర్‌ భవన్‌లో సీపీఐ కర్నూలు జిల్లా కౌన్సిల్‌ సమావేశం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ మునెప్ప […] The post ఎర్రజెండాలన్ని ఐక్యం కావాలిరాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలి ….. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Nov 2025 4:36 pm

Telangana |ర్యాగింగ్ చేస్తే జైలుకే..!

Telangana | ర్యాగింగ్ చేస్తే జైలుకే..! విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత Telangana |

ప్రభ న్యూస్ 14 Nov 2025 4:28 pm

Satya’s Jetlee Title Poster: I’m Done With Comedy

Director Ritesh Rana, known for his eccentric storytelling and trademark humor, is reuniting with actor Satya for another rollercoaster entertainer. This marks their third collaboration after the cult favorite Mathu Vadalara and its hit sequel, Mathu Vadalara 2. Today, the makers unveiled the film’s title poster, on the special occasion of Children’s Day. Jetlee is […] The post Satya’s Jetlee Title Poster: I’m Done With Comedy appeared first on Telugu360 .

తెలుగు 360 14 Nov 2025 4:27 pm