Supreme Court : నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పై విచారణ
బీసీ రిజర్వేషన్ల పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
Narendra Modi : ప్రధాని మోదీ ఏపీ నేటి షెడ్యూల్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు
దీపావళికి ముందే కాలుష్య మేఘాలు
దీపావళి అంటే రంగురంగుల వెలుగుల పండుగ. కన్నుల విందుగా కనిపించే ఈ పండగ ముఖ్యంగా పిల్లలకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ పండగ సందర్భంగా బాణాసంచా కాల్పులతో కోరలుచాచే వాయు కాలుష్యం ప్రజలను తీవ్ర అస్వస్థులుగా చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సిఆర్, హర్యానా ప్రాంతాల్లో ఒకవైపు పంట వ్యర్థాల దగ్ధాలతో వాయు కాలుష్యం పెరుగుతుంటే ఈ దీపావళి వచ్చే సరికి వాయు కాలుష్యం మరింత కమ్ముకుని రావడం ఏటా తీవ్ర సమస్యగా తయారవుతోంది. ఈ ఏడాది దీపావళి ఇంకా రాకముందే ఢిల్లీ తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలకు చేరుకోవడం గమనార్హం. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ క్యాస్టింగ్ అండ్ రీసెర్చి నివేదిక ప్రకారం గాలి నాణ్యత స్థాయి బాగా క్షీణించిందని వెల్లడైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) 0100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని సూచిక. గాలి నాణ్యత 447 కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. బుధవారం ఉదయానికే ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 300 పాయింట్లు దాటిందంటే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నోయిడాలో 369, ఘజియాబాద్లో 325, ఫరీదాబాద్లో 267 పాయింట్లలో వాయు నాణ్యత క్షీణత నమోదైంది. వాయు నాణ్యత సూచిక ప్రకారం బుధవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణత 300 పాయింట్లు దాటింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల సమయానికి నోయిడాలో నాణ్యత సూచిక 369 కాగా, ఘజియాబాద్లో 320 325 మధ్య నమోదయ్యాయి. గాలిలో కాలుష్య రేణువులు ప్రతి ఘనపు మీటర్ పరిమాణంలో ఏ స్థాయిలో ఉన్నాయో లెక్కగట్టి పరిశీలిస్తేనే కాలుష్య స్థాయి తెలుస్తుంది. దీనిని పర్టిక్యులేట్ మాటర్ అంటే పిఎంగా పరిగణిస్తారు. గత ఏడాది దీపావళి రోజున దేశంలోని అనేక నగరాల్లో అత్యధిక స్థాయిలో కాలుష్య రేణువుల (పిఎం) స్థాయిలు నమోదయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, లక్నో, అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా, తదితర ఏడు నగరాల్లో గంటగంటకు కాలుష్య స్థాయిలు పెరిగిపోయాయి. ప్రతి ఘనపు మీటర్ పరిమాణంలో 500 మైక్రోగ్రాముల వంతున కాలుష్య స్థాయిలు దాటిపోయాయి. దీపావళి రోజున, టపాసులు, బాణాసంచాల కాల్పులే ఈ కాలుష్య స్థాయిలు పెరిగిపోవడానికి కారణమైందని పరిశోధకులు వెల్లడించారు. 2016లో పుణెకు చెందిన ది చెస్ట్ రీసెర్చి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దీపావళి రోజున బాణాసంచా నుంచి వెలువడే పిఎం 2.5 కాలుష్య రేణువుల మొత్తాన్ని కొలవడానికి ప్రయోగాలు నిర్వహించింది. పాము మాత్ర పటాకుల నుంచి అత్యధిక స్థాయిలో 2.5 మైక్రాన్ల వ్యాసంలో 64,500 పిఎం కాలుష్య రేణువులు విడుదల అవుతున్నాయని వెల్లడించింది. గత ఏడాది ఉత్తరాది నగరాల్లో దీపావళి రోజున కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. దీపావళి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఈ ప్రభావం కనిపించింది. దీపావళి రోజున ఇతర రకాల కాలుష్య కారకాలు కూడా రికార్డు స్థాయిని అధిగమించాయి. కార్బన్ మోనాక్సైడ్, అట్మాస్ఫియరిక్ అమ్మోనియా, నైట్రస్ ఆక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు రికార్డు స్థాయిని దాటడం విశేషం. ఢిల్లీలో సాధారణంగా 80 వరకు కాలుష్య స్థాయిల పరిమితి ఉంటుంది. కానీ గత ఏడాది దీపావళి రోజున 140 వరకు కాలుష్య రేణువుల స్థాయిలు కనిపించాయి. సల్ఫర్డైయాక్సైడ్ స్థాయిల ప్రభావంతో గుండె జబ్బుల రోగులు ఆస్పత్రుల్లో అత్యధికంగా చేరవలసి వచ్చింది. వాయు కాలుష్యానికి ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంబంధం ఉంది. గుండెపోటు, పక్షవాతం, ఇవి కాక మరికొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు కూడా దారి తీయవచ్చు. కేవలం వాయు కాలుష్యం వల్లనే 2019 లో దాదాపు 1.67 మిలియన్ మంది అకాల మరణాలకు బలయ్యారని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాలుష్య 20 నగరాల్లో 14 ఉత్తర భారతం లోనే ఉన్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వాయు నాణ్యత క్షీణించడం కేవలం ఢిల్లీకే పరిమితం కాదు. ఏటా ముఖ్యంగా శీతాకాలంలో ఇండో గంగాటిక్ మైదాన ప్రాంతంలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో చేరుకోవడం పరిపాటిగా వస్తోంది. ఢిల్లీలో కాలుష్యానికి గత ఏడాది ఆప్ ప్రభుత్వమే కారణమని బిజెపి ఆరోపించింది. ఈ ఏడాది బిజెపి ప్రభుత్వమే ఢిల్లీలో ఉన్నా కాలుష్యం మితిమీరడానికి ఎవరు బాధ్యులు అన్న వివాదం ఎదురవుతోంది. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో దీపావళి రోజున బాణాసంచా కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు అనేక ఆంక్షలు విధించినా, అనేక అభ్యర్థనలతో చివరకు గ్రీన్ కాకర్స్కు అనుమతించింది. ఐదేళ్లపాటు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ కాకర్స్ వెలిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్), నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్( ఎన్ఇఇఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజులో రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ బూడిద వాడకుండా, తయారు చేసే బాణాసంచాను గ్రీన్ కాకర్స్గా పిలుస్తారు. హానికరమైన రసాయనాలు ఇందులో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30శాతం తక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ కాకర్స్కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) అనుమతి ఇచ్చింది. మరి దీని ప్రభావం దీపావళి రోజున ఎలా ఉంటుందో చూడవలసిందే.
రాగాల వాగ్దేవి రావు బాలసరస్వతి
పట్టుకుచ్చుల లాంటి రెక్కలు విప్పి పైకెగరడమే పాట లక్షణం. భావమెంత బరువైనా వినేవారి గుండెల్లోకి సులువుగా దూసుకెళ్ళి కదిలించటం దాని స్వభావం. అది భావగీతమైనా, లలితగీతమైనా, జానపదమైనా, సినిమా పాటైనా, విన్న వెంటనే అందులోని భావం శ్రోతకి స్ఫురించి, పులకింపజేయడం పాట నైజం. చిన్నమాటలతో పెద్దభావాన్ని చెప్పడం పాట కుండాల్సిన ముఖ్యమైన నేర్పు. ఒకటీ రెండు కఠినమైన పదాలు కవి వాడాల్సి వచ్చినా, వాటికి బాణీ కూర్చేవారు సంగీతంలోకి వొది గేలా మలుస్తారు. అప్పుడది మెత్తగా శ్రోతకి చేరుతుంది. 1920ల తర్వాత భావకవిత్యోద్యమం వల్ల కవులందరూ అన్ని ప్రక్రియలకంటే పాట (గేయం) రచించడానికి ఉత్సా హంగా ముందుకురికారు. పద్యాలు, పద్యకావ్యాలు, నాట కాలు... ఏది వ్రాయాలని వ్రాస్తున్నా, తోచినప్పుడు ఒక పాట కూడా వ్రాస్తూ వచ్చారు. పాటంటూ వ్రాస్తే దానికి బాణీ కూర్చుకుని పాడే గాయకులు కావాలి. పాట పాడితేనే అందం... ఉత్తినే పాటలోని మాటలు చదివితే తృప్తిగా ఉండదు... అందమూ రాదు. ఒక పక్క రేడియో, మరొక పక్క గ్రామఫోను, ఇంకొక పక్క సినిమా తెలుగు పాటకి గొప్ప ఆలంబనాలయ్యాయి. ఆ సమయంలోనే గొప్ప ప్రతిభావంతులైన గాయనీగాయకులు పాటలు పాడేందుకు ముందుకొచ్చి తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టారు. గ్రామఫోను కంపెనీవారు అప్పటికే క్లాసికల్ సంగీతం రికార్డులుగా తీసుకొచ్చి, సంగీత ప్రియులకు వీనులవిందు చేస్తున్నారు. వారే లలిత(భావ)గీతాలను రికార్డులుగా తీసుకురావడం మొదలు పెట్టారు. అప్పట్లోనే రావు బాలసరస్వతీదేవి పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. 1928, ఆగస్ట్టు 28న పార్థసారథి, విశాలాక్షి దంపతులకు మద్రాసులో అపురూపంగా జన్మించింది అందాల బాలసరస్వతీదేవి. ఆ తర్వాతవారు గుంటూరులో ఉండేవారట. నాన్నగారు పార్థసారథికి ఒక సినిమా థియేటర్ ఉండేదట. తల్లి విశాలాక్షి గొప్ప సంగీతజ్ఞురాలు. ఆమెకి సంగీతమన్నా, పాటలన్నా పట్టరాని మక్కువ. అందుకే ఇంటి నిండా సంగీతమయంగా, ఎన్నో గ్రాముఫోను రికార్డులు, వాటిలోని సంగీతం ముఖరితమవుతుండగా పెరిగిన బాల సరస్వతి తనూ పాడటం మొదలు పెట్టారు. గ్రామ ఫోను రికార్డుల్లో కపిలవాయి రామనాథశాస్త్రి, స్థానం నరసింహారావు లాంటి గొప్పగొప్ప వాళ్ళు పాడిన పాటలామెకి అవలీలగా వచ్చేసేవి. ఆమె వాటిని గొంతెత్తి హాయిగా పాడేవారు. మూడునాలుగేళ్ళ వయసు చిన్నారిగా బాలసరస్వతి నాటకానికి వెళ్ళి మామూలుగా తల్లి ఒళ్లో కూర్చున్నారు. రంగస్థలం మీద రామనాథశాస్త్రి పాట మొదలుపెట్టగానే హాలంతా పాటతో మారుమోగడం మొదలైంది. ఒళ్ళో కూర్చున్న బాలసరస్వతి తనూ వెళ్ళి పాట పాడుతానని మారంచేయడం మొదలుపెట్టింది. ఆమెను సముదాయిం చడం ఆ తల్లి వల్ల కాలేదు. ఇంతలో విషయం తెలుసుకున్న రామనాథశాస్త్రి స్వయంగా వేదిక దిగివచ్చి, బాలసరస్వతిని ఎత్తుకుని తీసుకువెళ్ళి ‘పాడమ్మా పాడు’ అన్నారు. ఆమె వెంటనే జంకూ గొంకూ లేకుండా ‘నమస్తే ప్రాణనాథా’ అంటూ, అంతక్రితమే ఆయన పాడిన పాటనే మొదలుపెట్టి అత్యంత అద్భుతంగా పాడేసరికి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులై విన్నారు. ఆయన ఆ చిన్నారిని ఆశీర్వదించి, ‘ఈ పసిపాప గొప్ప గాయని అవుతుంది’ అంటూ దీవించారు. 1935లో ఆమెకు బాలనటిగా ‘సతీ అనసూయ’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ధృవ విజయం’, ‘బాల యోగిని’, ‘భక్త తుకారాం’ మొదలైన చిత్రాలలో నటించారు. ‘భక్త కుచేల’లో కృష్ణుడిగా చేసి గొప్పపేరు పొందడమే కాకుండా, ఆమె పాడటంలోని ప్రత్యేకతను అందరూ గుర్తించేలా చేశారు. ఆ తర్వాత సాలూరి రాజేశ్వరరావుగారితో కలిసి ‘ఇల్లాలు’ చిత్రంలో నటించారు. ఏడేళ్ళ వయసుకే గ్రామఫోను రికార్డిచ్చిన బాలసరస్వతీ దేవి కేవలం పదిహేనేళ్ళ వయసులోపునే పదమూడు సినిమాల్లో నటించి పాడారు. అదీకాక లలిత సంగీతం తెలుగు నాట వెల్లివిరుస్తున్న తరుణంలో భావగీతాలు పాడటంలో ఒక ప్రత్యేకతను సాధించారు. అప్పట్లో రాజేశ్వరరావుగారితో కలిసి ఆమె పాడిన ఈ పాటలు ఇప్పటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉన్నాయి. ‘పాట పాడుమా కృష్ణా - పలుకు తేనెలొలుకునటుల’ ‘కలగంటి కలగంటి - కమల రేకుల’ వంటి ఈ రెండు పాటలు శ్రీసాలూరి వారితో కలిసి పాడారు రేడియోలో. కానీ ఈ పాటలు హెచ్.ఎమ్.వి కంపెనీ రికార్డు తీసుకొచ్చినప్పుడు రాజేశ్వరరావుగారు ఒక్కరు మాత్రమే పాడారు. అవి ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే లలితగీతాలు పాడుతూనే ఆమె సినిమా పాటకీ ఒక ప్రత్యేకతని చేకూర్చారు. రావు బాలసరస్వతీదేవి మరొకరికి తన గళాన్నిచ్చిన మొట్టమొదటి తెలుగు నేపథ్యగాయని (ప్లేబాక్ సింగర్). 1943లో శ్రీరేణుకా ప్రొడక్షన్స్వారు ‘భాగ్యలక్ష్మి’ చిత్రం నిర్మించారు. అందులో హీరోయిన్ కమలా కొట్నీస్, ఆ సినిమాకి సంగీతం భీమవరపు నరసింహారావు (బిఎన్ ఆర్) ఆ సినిమా కోసం -‘తిన్నెమీద చిన్నోడ వన్నెకాడా/ తేనె తుట్టిలాంటి ఓ చిన్నవాడా’ అనే సముద్రాల రాఘవాచార్య రచన మొట్టమొదటి సారిగా నేపథ్య గీతంగా రికార్డు చేశారు. ఆ పాటను రావు బాలసరస్వతీదేవి పాడి, మొట్టమొదటి నేపధ్యగానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆమె ఎన్నో పాటలు సినిమాలకి పాడుతూనే ఉన్నారు. ఆమె పదహారో ఏట ఆమెని హార్స్ రేస్ గ్రౌండ్లో కోలంకి రాజావారు చూశారు. రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దర్’ అయిన ఆ కోలంక జమీందారు ఆమెని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆమెకి పదహారేళ్ళు, ఆయనకి నలభై ఏళ్ళు. అలాగని మొదటి వివాహమూ కాదు. విశాలాక్షిగారికి తన కూతురికి పెళ్ళికుదరడం ఎంతో ఆనందం కలిగించింది. పార్థసారధిగారికి కళలయందు ఎంత ఇష్టం ఉన్నా, ఆ గొప్ప సంబంధం, కోరుండి, ఎదురొచ్చేసరికి ఆయనా ఆనందపడ్డారు. బాలసరస్వతికి పెద్ద ఆలోచించుకునే శక్తీలేదు. అవకాశమూ లేదు. 1944లో (సుమారుగా) పెళ్ళయితే కొంతకాలం ఆమె సినిమాల్లో పాటలు పాడారు. కానీ ఎన్నో ఆంక్షల మధ్య, పరువు పరదాల చాటున మగ్గుతూనే మద్రాసు వచ్చి పాటలు పాడుతూండేవారుట. అంతవరకు స్వేచ్ఛగా రాత్రీ, పగలూ షూటింగ్లు, రికార్డింగులు చేసి, జనాల మధ్య గొప్ప ఆకర్షణతో, కీర్తి ప్రతిష్టలతో, ధనార్జనతో మసులుకున్న బాలసరస్వతీదేవి ఒక్కసారి బందిఖానాలో పడిపోయినట్లు, ఊపిరాడనట్లు బాధపడ్డారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘దేవదాసు’ సినిమా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో, సంగీతం కూడా అంత ఉన్నత స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా బాలసరస్వతీ దేవి పాడిన మూడు పాటలూ ఆణిముత్యాలై నిలిచాయి. సి.ఆర్. సుబ్బరామనికి శాశ్వత కీర్తిని ఆర్జించి పెట్టిందీ ‘దేవదాసు’ సినిమా. సినీరంగంలోకి ప్రవేశించినప్పుడు లలితగీతాలు, కొన్ని సినిమా పాటలు సాలూరి రాజేశ్వరరావుగారితో పాడినా, ఆ తర్వాత కాలంలో ఆమె ఆయన సంగీత దర్శకత్వంలో పాటలు పాడినట్లు కనిపించదు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధులైన సంగీత దర్శకులు బి.ఎన్.ఆర్. (భీమవరపు నరసింహారావు), గాలిపెంచెల నరసింహారావు, అద్దేపల్లి రామారావు, సి.ఆర్. సుబ్బరామన్, పెండ్యాల నాగేశ్వర రావు, సాలూరి హనుమంతరావు, రమేష్ నాయుడు, టి.వి. రాజు, ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.వి. మహదేవన్, ఎమ్.ఎస్. విశ్వనాథన్, రజని... ఇలా ఇలా ఎందరెందరో ఆ గాత్రం మీద మోజుతో, ఇష్టంతో పాటలు పాడించారు. సుమారు ఇరవై సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత రావు బాలసరస్వతీదేవి బయట ప్రపంచంలోకి మళ్ళీ అడుగుపెట్టారు. రాజాగారి మరణం తర్వాత ఆమె మళ్ళీ సంగీతం వైపు దృష్టి పెట్టారు. ఏ భోగభాగ్యాలు, హోదాలు, ఆస్తిపాస్తులు ఆశించి ఆమె కఠోర నిర్ణయం తీసుకున్నారో అవి ఆమెకి పెద్దగా లభించనేలేదు. రాచరిక వ్యవస్థలోని మోసాలు, దగాలు ఆమె చవిచూసారు. ఇద్దరు పిల్లలతో ఆమె నిరాడంబరంగా బయటకొచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశంలోని సంగీతాభిమానులందరూ ఆమెని సాదరంగా ఆహ్వానించారు. కొంత వయసు మీద పడినా ఆమె చక్కగా పాడగలుగు తూండటం వల్ల సంగీత దర్శకులు రమేష్ నాయుడుగారు ఆమెని ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో పాడించి గౌరవించారు. తరువాత ఆమె సి. నారాయణరెడ్డిగారు రచించిన మీరా భజన్లు, రమేష్ నాయుడు సంగీతంలో పాడి, క్యాసెట్ విడుదల చేశారు. ఆమె సినిమా రంగంలోకి మళ్ళీ ప్రవేశించే నాటికి సినిమా పాట స్వరూప స్వభావాలు చాలా మారిపోయాయి. కాలానుగుణంగా ఆమె చేత పాడించేవీలు కూడా తగ్గిపోయింది. రావు బాలసరస్వతీదేవి ఆనాటి నుంచీ పరిశ్రమలోనే ఉండి ఉంటే మరికొన్ని మంచి పాటలు పాడగలిగే వారేమో గానీ, మధ్యలో ఖాళీ వల్ల, పూర్వస్థితిని చేరుకోవడం కష్టమే అయింది. ఆ సమయంలోనే ఆమె పాడిన పాటలన్నీ క్యాసెట్లుగా వచ్చాయి. ఆమె అభిమానులందరూ మళ్ళీ ఆమె గాత్రం విని ఆనందించారు. అయితే అప్పట్లో ఆర్థికంగా కూడా బాగా లేకపోవడం, పిల్లలు చిన్నవారు కావడం, రాజావారి ద్వారా ఆమె కొచ్చిన ఆస్తి చిక్కులు తీసుకురావడం ఆమెని బాధించాయి. అయినా ఆమె ధైర్యంగా నిలబడ్డారు. ఆమె బొంబాయిలో వసంత్ దేశాయ్ దగ్గర కొన్నాళ్ళు శిక్షణ పొందారు. సున్నితంగా పాడే విధానం, మెత్తని కంఠ స్వరం, స్పష్టంగా పలికే కళలు, సాహిత్యాన్ని భావంతో పలికే తీరు అక్కడి సంగీత దర్శకుల్ని ఆకర్షించాయి. నౌషాద్ సంగీత దర్శకత్వంలో తయారవుతున్న ‘ఉడన్ ఖటోలా’ తమిళ వర్షన్లో పాటలు పాడేందుకు బాలసరస్వతి కంఠాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆమెని బొంబాయి పిలిపించుకుని రెండు పాటలు రికార్డు చేశారు. హిందీలో లతామంగేష్కర్ పాడిన పాటలు తమిళంలో ఈమె పాడటం కొంత సంచలనాన్ని సృష్టించింది -ఆమె పాడిన పాటలు అంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాతేం జరిగిందోగానీ మిగిలిన పాటలు రికార్డు కాలేదు. ఆ తర్వాత ఆమె పాడలేదు. ఇంద్రగంటి జానకీబాల (రచన మాసపత్రిక సౌజన్యంతో)
` పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు ఘర్షణల్లో పలువురు మృతి ఇస్లామాబాద్(జనంసాక్షి): పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు, స్థానిక ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి …
ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
` మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి ` ఆరు కోట్ల రివార్డు అందజేత ` ఆయనతో పాటు మరో 61 మంది సభ్యులు …
మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
` ఆస్ బయోటెక్ సదస్సుకు ఆహ్వానం ` లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతిపై కీలకోపన్యాసం ` భారత్లో ఘనత దక్కించుకున్న తొలి మంత్రి హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ఐటీ, …
` పదేళ్ల అభివృద్ధి, రెండేళ్ల అరాచకానికి మధ్య పోరు: కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. …
` బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం ` బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలి ` పిలుపునిచ్చిన ఆర్.కృష్ణయ్య ` బీసీ ఐకాస ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు …
2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్లో..
` నిర్వహణ హక్కులు దక్కించుకున్న ఇండియా ` అహ్మదాబాద్ను వేదికగా ఎంపిక చేస్తూ కామన్వెల్త్ స్పోర్ట్ బాడీ నిర్ణయం ` నైజీరియాతో పోటీపడి ఆతిథ్య హక్కులు చేజిక్కించుకున్న …
సిఎం టూర్కు మంత్రి సురేఖ డుమ్మా
మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి టూర్కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. బుధవారం హన్మకొం డ జిల్లాలో జరిగిన సిఎం టూర్లో జిల్లా కు చెందిన మంత్రి కొండా సురేఖ పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా, నర్సంపేట ఎంఎల్ఎ దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మకు సిఎం హాజరయ్యారు. గం టన్నర పాటు ఉన్న సిఎం టూర్లో ఎక్క డా మంత్రి సురేఖ కనిపించలేదు. ఇప్పుడిదే జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్టాపిక్ గా మారింది. అయితే కాంగ్రెస్లో తొలినుంచి కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డి వర్గీయులకు రాజకీయంగా విబేధా లు ఉన్నాయి. ఎంఎల్ఎ దొంతి మాధవరెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే సురేఖ గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. మాధవరెడ్డి తల్లి కాంతమ్మ చనిపోయిన తర్వాత జిల్లా పర్యటనకు వ చ్చిన సురేఖ వాళ్ల ఇంటికి పరామర్శకు వెళ్లలేదు. కనీసం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగానైనా మంత్రి సురేఖ హాజరవుతారనిని భావించినా అలా జరగలే దు. సుదీర్ఘకాలంగా దొంతితో ఉన్న రా జకీయ విభేదాల వల్లనే రాలేదనే ప్రచా రం సాగుతోంది. మరోవైపు ఎంఎల్ఎ దొంతి తల్లి దశదినకర్మకు సంబంధించి మంత్రి సురేఖకు సమాచారం లేదని కొండా అనుచరులు చెబుతున్నారు. జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఎఐసిసి పరిశీలకులతో కలిసి మీడియా స మావేశం నిర్వహించిన మంత్రి సురేఖ హైదరాబాద్ వెళ్లిపోయారు. బుధవారం సిఎం పర్యటన ఖరారు అయినప్పటికీ మంత్రి సురేఖ మాత్రం మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు. కాగా, కొద్దిరోజులుగా జిల్లా కు చెందిన మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు పొడసూపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మేడారం జాతర సమీక్ష సమయంలో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి మాత్రం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి సురేఖ సైతం తాము జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు వచ్చిన కథనాలను కొట్టిపారేశారు. మేడారం జాతర సమీక్షను కూడా ప్రస్తావించారు. కేబినెట్ మంత్రిగా ఎక్కడికి వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లకూడదో తనకు తెలుసునని ప్రకటించారు. జిల్లా రాజకీయాల్లో కొద్దికాలంగా హాట్టాపిక్గా మారిన్ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోమారు సిఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కనిపించకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవన్నీ కాంగ్రెస్లో కామన్ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కోచింగ్ సెంటర్ల హబ్గా పేరు పొందిన రాజస్థాన్లోని కోటలో విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్లో యువదంపతులు తమ నాలుగునెలల పసివాడికి విషం ఇచ్చి తరువాత ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారక సంఘటన. వారి సూసైడ్ నోట్లో తమ ఇల్లు, కారు అమ్మి అప్పులు తీర్చాలని రాశారు. ఈ వైపరీత్యాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తే ఈ విషాదాంతాలు దేశంలోని సంక్షోభాన్ని తెరపైకి తీసుకొస్తాయి. ఈ భయంకరమైన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షోభం గ్రామాలు, నగరాలు, పాఠశాల తరగతులు, బోర్డు రూమ్స్, పొలాలు, ఇళ్ల వరకు వ్యాపించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యాక్సిడెంటల్ డెత్స్, సూసైడ్స్ ఇన్ ఇండియా (ఎడిఎస్ఐ) 2023 నివేదిక ప్రకారం దేశంలో 1,71,418 ఆత్మహత్యలు సంభవించాయి. అంతకు ముందటి సంవత్సరం కన్నా 0.38 శాతం ఎక్కువ పెరిగాయి. అండమాన్, నికోబార్దీవులు, సిక్కిం, కేరళలలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉండగా, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 40 శాతం కన్నా ఎక్కువగా ఆత్మహత్యల మరణాలు సంభవించాయి. గ్రామీణ భారతం కన్నా నగరాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇది నగరజీవితంలో ఒత్తిళ్లను ప్రతిబింబిస్తోంది. ఆత్మహత్యలకు బలైన వారిలో 72.8% పురుషులు ఉండటం లింగ ఆధారిత ఆర్థిక, సామాజిక ఒత్తిడిని వెల్లడిస్తుంది. ఆత్మహత్యల్లో 31.9% కుటుంబ సమస్యలే కారణం అవుతుండగా, రోగాల బారినపడి అస్వస్థులు కావడం వల్ల 19%, మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) బానిసై 7% మంది, ప్రేమ సంబంధాలు, వివాహాల సమస్యలతో 10% మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. 2023 లో సంభవించిన మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 6.3% అంటే 10,786 మంది రైతుల ఆత్మహత్యలే. వీటిలో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి ఈ వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉండడంతో 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 1995 2015 మధ్య దాదాపు 2,96,000 కేసులు అప్పుల పాలవ్వడం, పంటలు దెబ్బతినడం, మార్కెట్ షాక్, వ్యవస్థాపరమైన నిర్లక్షం వల్లనే సంభవించాయి. ఇళ్ల యజమానులు, సంరక్షకుల మరణాల సంగతి కూడా బయటపడకపోయినా పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మనస్తాపానికి, వైవాహిక సమస్యలకు, గృహహింసకు గురవుతున్నారు. ఈ సమస్యలు అధికారిక గణాంకాల్లో ఇవి స్పష్టం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే మనలో ఒకరికి ఒక సామాన్య ఉదయం అకస్మాత్తుగా మనుగడ బరువు భరించలేనంతగా అనిపించింది. అనారోగ్యం లేదా అలసట వల్ల కాదు. కానీ ప్రతి చిన్న పనికి తిమ్మిరి భావన అంటే అలసత్వం కనిపిస్తోంది. తమ పని పురోగతిలో ఉంది. కనిపించే సంక్షోభం లేదు. అయినప్పటికీ భరించలేనంత భారం అనిపిస్తోంది. అటువంటి నిశ్శబ్ద భయాందోళన క్షణంలో ఎవరితోనో మాట్లాడడం కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ప్లాట్ఫారమ్ను చేరువకావడం సురక్షితం అనిపిస్తోంది. మనుషులకు చేరువ అవడం కన్నా టెక్నాలజీ ఎందుకు అందుబాటులో ఉంది? అది ఒక బాధాకరమైన సత్యం లెక్కలేనంతమంది భారతీయులు ఆల్గోరిథమ్స్ను నమ్ముతున్నారు ఎందుకంటే వారికి వేరే ఎవరూ లేరు. ఇది సాంకేతిక వైఫల్యం కాదు, మానవ వైఫల్యం. దాదాపు 230 మిలియన్ మంది భారతీయులు మానసిక రుగ్మతలతో అల్లాడుతున్నారు. మానసిక కుంగుబాటు, ఆందోళననుంచి మానసిక రుగ్మత, డ్రగ్స్కు బానిసవ్వడం వరకు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నా సామాజిక కళంకం, తలకు మించిన ఖర్చు, వైద్య నిపుణుల తీవ్ర కొరత కారణంగా అధికారిక లేదా వృత్తిపరమైన సంరక్షణ ఉండడం లేదు. ఈ విధంగా వ్యక్తి తన జీవిత కాలంలో కుంగుబాటుకు గురయ్యే పరిస్థితి 10.6% వరకు ఉండగా, నిర్దిష్ట చికిత్సల మధ్య అంతరం అంటే చికిత్స సరిగ్గా అందని సమయాలు 70% నుంచి 92% వరకు ఉంటోంది. ఆత్మహత్యల అధికారిక గణాంకాలు స్థిరంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా, ప్రతి లక్షమందిలో 16.3% ఆత్మహత్యల మరణాలు భారతదేశ అత్యధిక మానసిక ఆరోగ్య భారాన్ని తెలియజేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వెల్లడించింది. ఈ సంఖ్యల వెనుక యువ యూనివర్శిటీ విద్యార్థిని తాను జీవించడానికి అనర్హురాలునంటూ సూసైడ్ నోట్రాసి బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేయడం వంటి నిశ్శబ్ద నిరాశామయమైన గాథలున్నాయి. అనర్హురాలిని లేదా అనర్హుడను అన్న మాట హాస్టళ్లు, ఆఫీసుల్లో ఆత్మహత్యల నోట్ల్లో ప్రతిధ్వనించడం నిశ్శబ్ద నిరాశామయ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. భారత మానసిక ఆరోగ్య వ్యవస్థలో అప్రమత్తత అవసరం. ప్రతి లక్షమంది జనాభాకు ముగ్గురు సైకియాట్రిస్టులు తప్పనిసరి కాగా, కనీసం 1.7 మంది సైకియాట్రిస్టులైనా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, భారత్లో కేవలం 0.75 మంది మాత్రమే సైకియాట్రిస్టులు ఉండడం చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది. అలాగే నర్సులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు కూడా చాలా తక్కువగా ఉంటున్నారు. కాలేజీలు, స్కూళ్లలో వేలాదిమంది విద్యార్థులకు ‘కౌన్సెలింగ్’ ఇవ్వడానికి పార్ట్టైమ్ టీచర్ అరుదుగా ఉంటుంటారు. యూనివర్శిటీలు, కోచింగ్ హబ్ల్లో కౌన్సెలింగ్ ఇచ్చేవారు నామమాత్రం. వారిని నియమించడానికి సరిగ్గా నిధులు కూడా ఉండవు. కాగితం మీద మాత్రం, చట్టాలు చాలా ప్రగతిదాయకంగా ఉంటాయి. ఆత్మహత్యల నేరరహితానికి, మానసిక ఆరోగ్యం హామీ ఇవ్వడానికి 2017 లో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అమలులోకి తెచ్చినా ఆత్మహత్యల మరణాలను 10% వరకైనా తగ్గించాలని 2022 లో నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ లక్షంగా పెట్టుకున్నప్పటికీ ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. పాఠశాలల ఆధారంగా సైకొలాజికల్ సపోర్టు స్కీమ్ ‘మనోదర్పణ్’ అమలులోకి తెచ్చినప్పటికీ చాలా అచేతనంగా మిగిలిపోయింది. ఇవికాక 47 పోస్ట్గ్రాడ్యుయేట్ సైకియాట్రీ విభాగాలు, 25 ఎక్స్సెలెన్స్ (శ్రేష్ఠత) సెంటర్లు మంజూరైనా, సిబ్బంది నియామకం, వేతనాల చెల్లింపు, శిక్షణ సమస్యల అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి ప్రత్యేకించి రూ. 270 కోట్ల బడ్జెట్ కేటాయించినా, అధిక శాతం ఏమాత్రం ఖర్చు కాకుండా ఉండిపోయింది. విధానాలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోయాయి. ఈ రోజు కొన్ని కోట్లమంది భారతీయులు చాట్జిపిటి వంటి కృత్రిమమేధ (ఎఐ) సాధనాల వినియోగంలో నిమగ్నమవుతున్నారు. ఇది నమ్మకం వల్ల కాదు ఒంటరితనం వల్లనే. ఈ ఎఐ ప్లాట్ఫారమ్ను జోక్యం, గోప్యత హామీలు లేకపోయినా సంక్షోభమైనా, అనేక మంది యువ వినియోగదారులు చికిత్స అందించే వైద్యునిగా లేదా జీవిత తోడుగా పరిగణిస్తున్నారని ది ఓపెన్ ఎఐ సిఇఒ సామ్ ఆల్ట్మన్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఎఐ సహకరిస్తుంది. కానీ క్రమబద్ధీకరణ లేకుంటే ఈ రిస్కులు వాస్తవానికి, మానవ భద్రతకు ప్రమాదకరమైన ప్రత్యామ్నాయంగా పరిణమిస్తాయి. భారతదేశం మానసిక ఆరోగ్యాన్ని తరువాతి ఆలోచనగా కాకుండా అత్యవసరమైనదిగా గుర్తించాలి. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి అంతర మంత్రిత్వ టాస్క్ఫోర్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అది ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళా శిశుసంక్షేమం రంగాలకు విస్తరించాలి. స్వయం ప్రతిపత్తిగల, స్వతంత్ర నిధుల కేటాయింపు వ్యవస్థగా స్పష్టమైన జవాబుదారీతనంతో నిర్వహించాలి. ఐదేళ్లలో ప్రతి లక్షమందికి కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు వరకు మానసిక ఆరోగ్య వైద్య నిపుణులు ఉండేలా నియామకం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నియామకమైన వైద్యనిపుణులకు శిక్షణ పొడిగించి, స్కాలర్షిప్లు, రాయితీలు కల్పించాలి. కౌన్సెలింగ్ను స్వచ్ఛంద సంస్థలా కాకుండా ప్రజామౌలిక సదుపాయంగా పరిగణించాలి. ప్రతిస్కూలు, కాలేజీ, జిల్లా ఆసుపత్రి, వ్యవసాయ విభాగాల్లో పూర్తికాల శిక్షణ కౌన్సెలర్ ఉండాలి. ప్రతివారితో ప్రత్యక్ష అనుబంధం ఉండాలి. భారత్ తప్పనిసరిగా అత్యవసరంగా డిజిటల్ మెంటల్ హెల్త్ పర్యావరణ వ్యవస్థను క్రమబద్ధం చేయాలి. భావోద్వేగ సహాయ యాప్స్, ఎఐ సాధనాలు గోప్యతా రిస్కులను బహిర్గతం చేయాలి. పటిష్టమైన, నైతిక, చట్టపరమైన, నిబంధనల చట్రం ఉంటేకానీ, ఆ సాధనాలు నాణ్యమైన మానవ భద్రతను కల్పించలేవు.
బిసి రిజర్వేషన్లపై సుప్రీంలో నేడు విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బిసిలకు రిజర్యేవషన్ల శాతాన్ని పెంచడం పట్ల హై కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభు త్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్ నాధ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఈ కేసును వాదించనున్నారు. రిజర్వేషన్లపై 50శాతం దాటాకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభు త్వం రిజర్వేషన్ల శాతాన్ని పెంచిందని, అందుకు సం బంధించి జారీ చేసిన జీవో నెంబరు 9ని హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేర కు స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని, కేవలం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారమే తప్ప ఇందుకు తగిన మార్గదర్శకాలు లేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వా దించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకుమించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వ ర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకో ర్టు చెప్పిందని కూడా ప్రభుత్వం గుర్తు చేసింది. రా ష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముందు ఈ అంశంపై సమ గ్ర, శాస్త్రీయ అధ్యయనం నిర్వహించిన విషయాన్ని స్పె షల్ లీవ్ పిటిషన్లో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, వి ద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33 శాతం మంది బిసిలు ఉన్నట్లు తేలిందని, 42శాతం రిజర్వేషన్ల కల్పనకు అదే ప్రాతిపదికని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342-ఎ(3) కిం ద దాఖలు పడిన అధికరణలను అనుసరించి ప్రభుత్వం ఈ కసరత్తు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ఇలాంటి కసరత్తును రాహుల్ రమేశ్ వాఘ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేసింది. సమగ్ర కుల సర్వే తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిటైర్ట్ ఐఎఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ సర్వే డేటాను విశ్లేషించిన విషయాన్ని కూడా తన స్పెషల్ లీవ్ పిటిషన్లో పేర్కొంది. బిసిలకు రిజర్వేషన్ల పెంపునకు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించిందని పేర్కొంది. ఆ కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడంతో పాటు తెలంగాణ బిసి రిజర్వేషన్ల బిల్లు -2025 ను శాసనసభ, మండలిలో ఏకగీవ్రంగా ఆమోదించిం దని పేర్కొంది. ఆమోదించిన ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టు సుప్రీం కోర్టుకు నివేదించింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అన్నది కేవలం వివేకపూర్వకమైన నియమం తప్ప అదేమీ రాజ్యాంగపరమైన నిబంధన కాదని ప్రభుత్వం పేర్కొంది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు రిజర్వేషన్ల శాతాన్ని పరిమితికి మించి పెంచుకునేందుకు ఇందిరా సాహ్ని తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్న విషయాన్ని తన పిటిషన్లో పేర్కొంది. జనహిత్ అభియాన్ కేసు తీర్పులోనూ ఈ విషయం ఉందని గుర్తు చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకొని జీవో 9 జారీ చేసినట్టు పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీ ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అస్పష్టతను ఏర్పరిచాయని, ఒకవైపు జీవోపై స్టే విధించిన హైకోర్టు, మరోవైపు ఎన్నికలపై స్టే విధించడంలో సంయమనం పాటించిందంది. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలా చేస్తే వెనుకబడిన తరగతుల వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను నిలువరించి, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకొనేందుకు అనుమతివ్వండని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ కేసు గురువారం విచారణకు జరగనుండటంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపట్ల సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఇలా ఉండగా గురువారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరనగుంది.
ఆహారం మనిషి జీవితానికి ప్రాణాధారం. ప్రాచీన కాలంలో ఆహారం అంటే జీవనవిధానం, ఆరోగ్యం, సంస్కృతి, ఆధ్యాత్మికత అన్ని కలసిన సమగ్ర దృక్కోణం. కానీ నేడు ఆహారలేమి, పోషకాహార లోపం, శూన్యపుటాకలి, ఆకలివిపత్తు, ఆహారపు వృథా అనేవి ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆహార సమస్యలు. ప్రపంచ వ్యాప్తంగా 78 కోట్లమంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని 190 కోట్ల మందికి సురక్షితమైన పోషకాహారం అందుబాటులో లేదని, 14 కోట్ల మంది పిల్లలు పోషకాహర లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలో కల్తీ ఆహారం కారణంగా ప్రతి ఏటా 10 కోట్ల మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందులో 70 వేల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల పేర్కొంది. అందరికీ ఆహారం లక్ష్యసాధన కోసం ఐక్యరాజ్యసమితి ఆహార- వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఒ) వ్యవస్థాపక దినం 1945 అక్టోబర్ 16వ తేదీని ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరపాలని యుఎన్ఒ సభ్యదేశాలు నిర్ణయించాయి. 1981లో మొదటిసారిగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. 2024 లో మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరికీ ఆహారపు హక్కు అనే నినాదంతో జరుపుకున్నాం. ఈ సంవత్సరం ‘మంచి ఆహారం మెరుగైన భవిష్యత్తు కోసం చేయిచేయి కలుపుదాం’ అనే ఇతివృత్తంతో వరల్డ్ ఫుడ్ ఫోరం- 2025 సమావేశాలు అక్టోబర్ 10- 17 తేదిలలో ఇటలీలోని రోమ్ నగరంలో జరుగుతున్నవి. ఇందులో బెటర్ ఫుడ్- బెటర్ ఫ్యూచర్ లక్ష్య సాధనకు బెటర్ ప్రొడక్షన్ బెటర్ న్యూట్రిషన్ బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ లైఫ్ అను నాలుగు శాఖల ద్వారా ఆహార వ్యవస్థలను మెరుగుపరచవచ్చునని పేర్కొన్నారు. ఆహారం కేవలం అవసరం మాత్రమే కాదు ప్రతి వ్యక్తి హక్కు అని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరుగుదల అధికంగా ఉండే అవకాశం ఉంది. త్వరితగతిన మారుతున్న వాతావరణ సామాజిక ఆర్థిక అసమతుల్యతల వల్ల, భూతాపం, వరదలు, ఉక్రెయిన్ రష్యా వంటి యుద్ధాలు, ఎల్నినో- లానినా పరిస్థితులు జీవవైవిధ్యనష్టం, ఆహారపు గొలుసుల విచ్ఛిన్నం వంటి కారణాలతో సమీప కాలంలో అనూహ్య రీతిలో ఆహారసమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో గత కొన్నేళ్లుగా రుతుపవనాలు సహకరించటం వల్ల ఆహారదినుసుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. 2021 -22 లో 316 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంచనాలను అధిగమించింది. అలాగే నూనెగింజలు, పప్పుధాన్యాలు ఉద్యానవన ఉత్పత్తులు కూడా పెరిగాయి. పంటల ఉత్పత్తి పెంపుకు కేంద్రప్రభుత్వం మిల్లెట్స్మిషన్, పల్స్రెవల్యూషన్ పిఎం కిసాన్, పిఎం పోషణ్, పిఎం గరీబ్ అన్నయోజన వంటి పథకాలను బలోపేతం చేసి 2030 నాటికి ఆహారోత్పత్తి 20% పెంపు లక్ష్యంగా పెట్టుకొని ఆరోగ్యవంతమైన, సుస్థిరమైన, స్వావలంబన భారతదేశం దిశగా ముందుకు సాగుతోంది. ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించటానికి జాతీయ ఆహార భద్రతా చట్టం -2013ను తెచ్చింది. ఆహార లభ్యత ఆహార అందుబాటు ఆహార వినియోగం, ఆహార స్థిరత్వం అను నాలుగు అంశాలు ఈ చట్టంలోని ముఖ్యఅంశాలు. దేశజనాభాలో మూడింట రెండువంతుల మందిని ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చింది. రాష్ట్రంలోనూ 2017లో తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ను ఏర్పాటు చేసి రాష్ట్ర జనాభాలో 75% గ్రామీణ జనాభాను, 50% పట్టణ జనాభాను ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చింది. స్థూలంగా ఈ చర్యల వల్ల దేశంలో ఆహార భద్రత బాగా మెరుగుపడింది. భారతీయుల ఆహారపు అలవాట్లు అత్యంత ఉత్తమమైనవని ప్రపంచ దేశాలు భారత్ను అనుసరిస్తే 2050 నాటికీ పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని మన ఆహార వియోగం తీరు గురించి ఇటీవల వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్కు చెందిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ -2024 అభిప్రాయపడటం గమనార్హం. వ్యవసాయంలో అధునాతన సాంకేతికతలను వినియోగించాలి. ఆహార నిల్వకు కోల్డ్ స్టోరేజ్, సరఫరా చక్రంను బలోపేతం చేయాలి. చెట్ల పెంపకం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఆహార వ్యర్థం ఆహార వృథాలను అరికట్టాలి. ధనవంతులు ఆహారాన్ని వృథా చేయకుండా పేదవారితో పంచుకోవటం ద్వారా ఆకలితో ఉన్నవారి సంఖ్యను తగ్గించవచ్చును. ఆహారాన్ని జాగ్రత్తగా వినియోగించడం, అంగీకరించడం, గౌరవించడం అత్యంత అవసరం. భారత రవీందర్, 99125 36316
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదని, ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదని బిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల అభివృద్ధి, పాలనకి, రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని స్పష్టం చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కోసం బయలుదేరేముందు భారత రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మా ట్లాడారు. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని, ఈ మె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. లక్షల మంది రైతన్నలు ఈమె గెలుస్తుందని ఆశిస్తున్నారని, ఆ తర్వాతే తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతి యువకులు చూస్తున్నారని, తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తరువాత ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు చూస్తున్నారని స్పష్టం చేశారు. మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదని అన్నారు. కేసీఆర్ హైదరాబాద్లో కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తున్నాయని, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధం ప్రభుత్వంలో ఒక్క మైనారిటీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన మైనారిటీలు, ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారని చెప్పారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. దళిత బంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారని, తమ అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నదన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదని, మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని వెల్లడించారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి అన్ని వర్గాల మద్దతు, అండతో తమ పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నదని, రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్ అని, హైదరాబాద్ నగరంలో అన్ని నియోజక వర్గాల్లో మా పార్టీ గెలుపొందిందంటే అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ కృషి కూడా ఉందన్నారు. గోపీనాథ్ అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని అందరూ ఆదుకోవాలని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయించి, ఆయన సతీమణి సునీత గోపీనాథ్కి టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. సునీతకి సహాయం కోసం పార్టీ కీలక నాయకులంతా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారని, అందరి ఆశీర్వాదాలతో సునీత ఎన్నికల్లో గెలవబోతున్నారని కెటిఆర్ పునరుద్ఘాటించారు.
జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి లంకల దీపక్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎట్టకేలకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బి జెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఇదివరకే తమ అభ్యర్థులను బరిలోకి దించి విస్తృతంగ ప్రచారం నిర్వహిస్తుండగా బిజెపి అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం చేసింది. చివరకు లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిత్వా న్ని ఖరారు చేసింది. దీపక్ రెడ్డి గత అసెంబ్లీ సా ర్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయన ప్ర స్తుతం బిజెపి హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ తరపున ఎన్నికైన మగంటి గోపినాథ్ ఈ ఏడాది జూన్ 8న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ వచ్చే నెల 11న, ఓట్ల లెక్కింపు 14న జరగనున్నది.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం లో సాగైన మక్కలను గురువారం నుంచి కొనుగోలు చేసేందు కు సర్కారు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 202సెంటర్లలో మక్కలు కొనుగోలు చేయనున్నారు. ఈ సీజన్లో మొక్కజొన్న పంట మార్కెట్కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నియమించి మక్కల కొనుగోళ్ల బాధ్యతలు అప్పగించింది. మార్క్ఫెడ్ అధికారులు కొనుగోళ్లపై కసరత్తు పూర్తి చేసి, ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోకుండా సర్కారు మ ద్దతు ధరలకు మక్కలు కొనుగోలు చేయనుంది. క్వింటాకు రూ.2,400 చొప్పున మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చే యనుండగా, సాధారణ ధర క్విటాకు రూ. 1900 నుంచి రూ.2000 ధర మాత్రమే ఉంది. రాష్ట్రంలో 6.24 లక్షల ఎకరాల్లో సాగు ఈ వానాకాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 6.24 ల క్షల ఎకరాల్లో 11.55 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సాగు చేసి రాష్ట్ర రైతులు రికార్డు సృష్టించారు. వానాకాలం మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 5.21లక్షల ఎకరాలు కాగా, నిరు డు ఇదే సమయానికి 5.23 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది కంటే అధికంగా మక్కలు సాగైనట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. మక్కల సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 95,116 ఎకరాలతో ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 65,262 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 59,734 ఎకరాల్లో సాగైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 53,128 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 52,093 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 50,736 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక నివేదికలో పేర్కొన్నారు. వానాకాలం సీజన్లో 11లక్షల టన్నులు మార్కెట్కు రావచ్చని అధికారులు తెలిపారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు సెంటర్లకు 5 నుంచి 6 లక్షల టన్నుల మక్కలు వస్తాయని మార్క్ ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
మన తెలంగాణ/అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో గురువారం జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే సభకు వచ్చే ముందు శ్రీశైలం దివ్యక్షేత్రానికి వెళ్లి జ్యోతిర్లింగ మూర్తి శివుణ్ణి, శక్తిపీఠంలో కొలువైన భ్రమరాంబిక దేవిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. కర్నూలు, నంద్యాల జిల్లా ల్లో ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రధాని చేరుకు ని అక్కడి నుంచి శ్రీశైల దేవస్థానానికి చేరుకుంటారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంత రం శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్ర ధానమంత్రి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కర్నూలు సభ కు చేరుకుని సభలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని హెలీకాప్టర్ ద్వా రా కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. రూ. 13,429 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ. 13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు ఉండగా, ఓ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు ప్రధాని. రూ. 9449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తుండగా, రూ. 1704 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. ఇక రూ. 2276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు.
గురువారం రాశి ఫలాలు (16-10-2025)
మేషం - ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు. సాంస్కృతి కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ విషయాలలోనూ గృహది విషయాలలోనూ ఆసక్తి చూపుతారు. వృషభం - చేస్తున్న వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మిథునం - గృహ విషయాలకు అతిధి మర్యాదలకు ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. మానసిక ఉద్వేగాన్ని సాధ్యమైనంతగా అదుపు చేసుకోవడం మంచిది. కర్కాటకం - ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.ఉద్యోగాలలో ఏర్పడిన అవంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. సింహం - సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు సాగిస్తారు. వివాదాస్పద అంశాల విషయంలో చేసేది లేక కలిసొచ్చే కాలం వస్తే అన్ని సద్దుమడుగుతాయని భారం భగవంతుడి మీద వేసి మిన్నకుంటారు. కన్య - పెట్టుబడులకు తగిన సహాయ సహకారాలు అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో అవి ఉపకరిస్తాయి. మానసిక ఆనందం కలుగుతుంది. తుల - ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది. వృశ్చికం - వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతనమైన ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలు ముఖ్యం. మీ ప్రమయం వల్ల ఒక శుభకార్యం సానుకూలపడే సూచనలు ఉన్నాయి. ధనుస్సు - అనుభవాలు నేర్పిన పాఠాలు దృష్టిలో ఉంచుకొని అడుగులు జాగ్రత్తగా వేస్తారు. ఎదుటివారి మనసును నొప్పించకుండా పనులను చక్కబెట్టుకోవడం ఎలా అన్నది మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపచేస్తుంది. మకరం - చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించి తమ అనుకున్న లబ్ధిని పొందగలుగుతారు. కుంభం - సమస్యల నుండి ఎప్పటికప్పుడు బయటపడే విషయం మీదనే దృష్టిని కేంద్రీకరిస్తారు. గాని శాశ్వతమైన పరిష్కారాలను అన్వేషించరు. శుభకార్యాలు ముడి పడతాయి. మీనం - దూర ప్రాంతంలో ఉన్న మీవారికి ఇక్కడి స్థితిగతులను వివరించి వారిని ఆర్థిక సహాయం అర్థిస్తారు. సాంకేతిక విద్యా సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది.
లొంగిపోయిన మావోయిస్టు నాయకులు సభ్యులకు భారత రాజ్యాంగం ప్రతులను అందచేసిన CM ఫడ్నవీస్ #telugupost
Women Are The Most Beautiful Species Ever: Siddu Jonnalagadda
Siddu Jonnalagadda’s youthful musical and love entertainer Telusu Kada will be hitting the screens on the 17th of this month. The team celebrated the pre-release event. Siddu made an interesting statement, expressing his sadness about saying goodbye to the character Varun, whom he portrayed in the film. “As you know, for almost a year, I’ve […] The post Women Are The Most Beautiful Species Ever: Siddu Jonnalagadda appeared first on Telugu360 .
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 16-10-2025
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గను: మంత్రి జూపల్లి
బ్లాక్ మెయిల్ రాజకీయాల కు తాను లొంగనని, తప్పుడు వార్తలు, ఆరోపణలపై స్పం దించాల్సిన అవసరం లేదని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తన మేనల్లు డు సతీశ్ రావు కనపర్తి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కుట్రపూరిత ఆరోపణల వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పుఒప్పులు అందరి దగ్గర జరుగుతాయన్నారు. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటానని ఆయన తెలిపారు. లిక్కర్ టెండర్లు చివరి మూడు రోజుల్లో భారీ సంఖ్యలో వస్తాయ ని గతేడాది చివరి మూడు రోజుల్లో 96 వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పేరుతో వ్యాపారం అమెరికాలో ఉండే మంత్రి జూపల్లి కృష్ణారావు మేనల్లుడు సతీశ్ రావు కనపర్తి తన మేనమామ మంత్రి జూపల్లి కావటంతో ఆయన ఇండియాకు వచ్చి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పే రుతో వ్యాపారం మొదలు పెట్టారని, అందులో భాగంగా హైదరాబాద్లో 4 స్టోర్లు ప్రారంభించిన సతీశ్ రావు నేచురల్గా పండిన వ్యవసాయ ఉత్పత్తులు అందించి ఆరో గ్యం కాపాడుతానని ప్రజలను నమ్మించి వారి వద్ద కోట్లు వసూలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను నమ్మి అనేక మంది సీనియర్ సిటిజన్లు పెట్టబడులు పెట్టా రు. కొంతకాలం వారికి నెల నెల వడ్డీలు కడుతూ వారిలో నమ్మకం కలిగించిన సతీశ్ కోట్లాది రుపాయలు వసూలు చేశారని అనంతరం ఆ సొమ్ముతో అమెరికా పారిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ డబ్బులేవని అడిగినందుకు సతీశ్ రావు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తుండడంతో ఈ అంశంపై మంత్రి జూపల్లి స్పందించారు.
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో అఫ్గాన్ ప్లేయర్ల హవా..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ బౌలింగ్ను కనబరిచి అఫ్గాన్కు సిరీస్ను సాధించి పెట్టిన రషీద్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. తాజా ర్యాంకింగ్స్లో రషీద్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన సౌతాఫ్రికా స్టార్ కేశవ్ మహరాజ్ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. మహీశ్ తీక్షణ (శ్రీలంక) మూడో, జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) నాలుగో ర్యాంక్ను సాధించారు. భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక ర్యాంక్ను కోల్పోయి ఐదో స్థానంలో నిలిచాడు. మరో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా పదో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్మన్ గిల్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గిల్ 784 పాయింట్లతో టాప్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. అఫ్గాన్ స్టార్ ఇబ్రహీం జద్రాన్ తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 8 ర్యాంక్లు ఎగబాకి ఏకంగా రెండో ర్యాంక్ను దక్కించుకున్నాడు. బంగ్లా సిరీస్లో రాణించడంతో ఇబ్రహీం ర్యాంక్ గణనీయంగా పెరిగింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ మూడో, విరాట్ కోహ్లి ఐదో, శ్రేయస్ తొమ్మిదో ర్యాంక్లో కొనసాగుతున్నారు.
45 కేసుల్లో రోడ్డు నిందితుడు రోడ్డు ప్రమాదం తో పట్టుబడి జైలు బాట! #InterstateThief #crime #apnews
మంత్రి ఓఎస్డీ అరెస్టుకు యత్నం..
హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం
అంతరిక్షానికి 80 వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు
అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారు చేయడం , 2026 లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షం లోకి పంపడం , 2035 నాటికి జాతీయ అంతరిక్షకేంద్రం ,చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ ఏర్పాటు , వంటి లక్షాలను ఏర్పర్చుకున్నామన్నారు. అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ బిగ్ డేటా వంటివాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వికసిత భారత్కు దూతగా 2040 లో భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని నారాయణన్ పేర్కొన్నారు. 2027 లో చేపట్టబోయే మానవ సహిత గగనయాత్ర మిషన్ ట్రాక్లో ఉందని వెల్లడించారు. 2040 నాటికి తొలి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు.పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో ఇస్రో ప్రణాళికలను పంచుకున్న వి. నారాయణను గగన్యాన్లో భాగంగా తాము మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టుతెలిపారు. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో రెండు లేక మూడు స్టార్టప్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై అధ్యయనం కోసం 300 కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ అన్నారు. వ్యవసాయం, విపత్తు ప్రతిస్పందన , నిర్వహణ, టెలికమ్యూనికేషన్, రియల్ టైమ్రైలు , వాహన పర్యవేక్షణలో ఉపగ్రహ ఆధారిత అనువర్తనాల అధ్యయనానికి ఇవి ఉపయోగపడతాయన్నారు.
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో సంచలనం సృష్టించిన ఆఫ్రికా దేశం కేప్ వెర్డె
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఆఫ్రికా దేశం కేప్ వెర్డె పెను సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, కెనడా వేదికగా జరుగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి కేప్ వెర్డె అర్హత సాధించింది. కేవలం ఐదు లక్షల 25 వేల జనాభా మాత్రమే కలిగిన కేప్ వెర్డె ఆఫ్రికా జోన్ గ్రూప్డి పోటీల్లో అద్భుత ఆటను కనబరిచిన మెగా టోర్నీకి దూసుకెళ్లింది. కీలకమైన మ్యాచ్లో కేప్ వెర్డె త్రీ-0 గోల్స్ తేడాతో ఈశ్వతిని టీమ్ను చిత్తు చేసింది. ఐస్లాండ్ తర్వాత ప్రపంచకప్కు అర్హత సాధించిన అతి తక్కువ జనాభా కలిగిన రెండో దేశంగా కేప్ వెర్డె అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్కప్లో 48 దేశాలు పోటీ పడనున్నాయి. ఆఫ్రికా జోన్కు 9 బెర్త్లు కేటాయించగా ఆరు జట్లు ఇప్పటికే వరల్డ్కప్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి.
ఖైదీలకు ఉరిశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణం?
దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారణ జరిపింది. అయితే, మరణశిక్ష అమలుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం అభిప్రాయం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఉరి ద్వారా మరణశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేయాలని లేదా, దోషి ఏ విధంగా తనకు మరణశిక్ష అమలు చేయాలో ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు.ఉరి ద్వారా మరణం క్రూరమైనది, అనాగరికమైనదని, ఉరి వేసిన తర్వాత దోషి మరణానికి చాలా సమయం పడుతుందని. అందువల్ల దాని బదులు నవీన పద్ధతుల్లో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి శిక్ష అమలు చేయవచ్చునని పిటిషనర్ తరుపు న్యాయవాది రిషి మల్హోత్రా అన్నారు. సైన్యంలో దోషి అలాంటి ఆప్షన్ ఎన్నుకునే వీలు ఉందన్నారు. అమెరికా లోని 50 స్టేట్ లలో కనీసం 40 స్టెట్ లలో ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు అవుతున్నదని ,దీని వల్ల ఉరి తీసిన తర్వాత ఆ జీవి చాలా సేపు అనుభవించే వేదన నుంచి విముక్తి లభించవచ్చు నని పిటిషనర్ తరుపు న్యాయవాది వివరించారు.ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో దోషికి అలాంటి ఆప్షన్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చుకునేందుకు సిద్ధంగా లేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఉరి తీయడం ద్వారా మరణశిక్ష అమలు చాలా పాత విధానం. కొద్ది కాలంగా పరిస్థితులు మారిపోయాయి. సమస్య ఏమిటంటే, ప్రభుత్వం మార్పును అంగీకరించేందుకు సిద్ధంగా లేదు అని ధర్మాసనం పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్ మాట్లాడుతూ, ఖైదీలకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడంలో విధానపరమైన నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసు విచారణ నవంబర్ 11 కు వాయిదా పడింది.
కామన్వెల్త్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం
2030లో అహ్మదాబాద్ వేదికగా మెగా పోటీలు లండన్: ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్త్ క్రీడలకు భారత్ రెండో ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా 2030లో కామన్వెల్త్త్ పోటీలు జరుగనున్నాయి. ఇంతకుముందు 2010లో రాజధానిఢిల్లీలో కామన్వెల్త్త్ పోటీలను నిర్వహించారు. తాజాగా రెండోసారి మెగా పోటీలకు భారత్ వేదికగా నిలువనుంది. ఒలింపిక్స్ తర్వాత ప్రపంచ క్రీడల్లో రెండో అతి పెద్ద క్రీడా సంగ్రామంగా కామన్వెల్త్ గేమ్స్ పేరు తెచ్చుకున్నాయి. మరో ఐదేళ్ల తర్వాత జరిగే పోటీలను అహ్మదాబాద్లో నిర్వహించేందుకు కామన్వెల్త్ స్పోర్ట్ బాడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రీడా మైదానం ఈ పోటీలకు వేదికగా ఎంపికైంది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీ పడి అహ్మదాబాద్ మెగా క్రీడలను నిర్వహించే ఛాన్స్ను దక్కించుకుంది. నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రత్యేక వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఢిల్లీ తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా అహ్మదాబాద్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్, కెనడా, భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాలతో సహా గతంలో ఆంగ్లేయుల పాలనలో ఉన్న దేశాలు ఈ పోటీల్లో పాల్గొనడం అనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అసాధారణ ఆటతో పతకాల పంట పండిస్తోంది. ఇక సొంత గడ్డపై జరిగే క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయం.
మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ కన్నుమూత
మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఈ విఖ్యాత ధారావాహికంలో పంకజ్ ధీరజ్ మహారధి కర్ణుడి పాత్రకు జీవం పోయడం ద్వారా విశేష అభిమానులను పొందారు. 68 సంవత్సరాల ఆయనకు క్యాన్సర్ కబళించివేసింది. ఆయన మృతి వార్తను సినిమా , టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ సిన్టా నిర్థారించింది. తమ సంస్థకు పూర్వపు ఛైర్మన్, తరువాత ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపి , నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రమే ఆయనకు విలే పార్లే సమీపంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. మహాభారతం సీరియల్లో నటించిన పలువురు నటులు , సాంకేతిక నిపుణులు అనేకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సీరియల్లో అర్జున పాత్రధారి అయిన అర్జున్ సామాజిక మాధ్యమం ద్వారా తమ సంతాపం తెలిపారు. ఆయనతో ఈ సీరియల్లో నటించినప్పటి అనుభవాలతో కూడిన ఫోటోలను జతచేశారు. ధీరజ్ కుమారుడు , నటుడు అయిన నికితిన్ ధీరజ్ తన తండ్రి ఓ సందర్భంలో పేర్కొన్న మాటలను తుది అంకంగా అందరికి వెల్లడించారు. జీవితంలో ఏది వచ్చినా రానివ్వండి, ఎవరేమి చెప్పినా చెప్పనివ్వండి, ఏది జరిగినా జరగనివ్వండి, అంతా శివార్పణం అనుకుని ముందుకు సాగండి అనే తండ్రి సందేశాన్ని అభిమానులకు అందించారు.
డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభం
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ -గూగుల్తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని క్యాంపస్లో నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది. దీని ద్వారా 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో ్ సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు అందించబడతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూగుల్ సంస్థ నుండి వైభవ్ కుమార్ శ్రీవాస్తవ (ఇండియా హెడ్ - ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్స్), సిద్ధార్థ్ దల్వాడి (దక్షిణ భారత హెడ్ - ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్స్), మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో 50,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని గూగుల్ లోగోతో ఉన్న 50,000 బెలూన్లు ఆకాశంలోకి ఎగురవేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, మల్లారెడ్డి డీమ్ డ్ టు బీ యూనివర్సిటీ లతో కూడిన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్య ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విద్యా ప్రపంచం, డిజిటల్ ఇండస్ట్రీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే కాకుండా, విద్యార్థులు ప్రపంచ టెక్నాలజీ మార్పులకు సన్నద్ధంగా ఉండేలా చేస్తుంది. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ భద్రా రెడ్డి మాట్లాడుతూ గూగుల్తో ఈ భాగస్వామ్యం కేవలం సాంకేతికతను అనుసంధానించడం మాత్రమే కాదని, ఇది మొత్తంగా విద్యా వ్యవస్థను మార్చగలిగే ఒక విప్లవాత్మక అడుగు అన్నారు. ప్రతి మల్లారెడ్డి విద్యార్థిని ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడం పై దృష్టి కేంద్రీకరించామని, విద్యా ప్రావీణ్యాన్ని డిజిటల్ ఆవిష్కరణతో మేళవించడం ద్వారా ‘గూగుల్ క్లౌడ్పై డిజిటల్ క్యాంపస్’ తమ విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో సాధికారులను చేస్తుందన్నారు.మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం హైదరాబాద్ వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న ప్రీతి రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యా రంగంలో ఈ మార్పు దిశలో ముందంజలో నిలవడం మా గర్వకారణంగా ఉంది. గూగుల్ సాంకేతికతను మా విద్యా బలంతో కలిపి, డిజిటల్ లెర్నింగ్కి కొత్త నిర్వచనాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఇంజినీరింగ్ నుండి హెల్త్కేర్ వరకు ప్రతి విద్యార్థి ఈ ప్లాట్ఫాం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆవిష్కరణ, సమగ్రత, ప్రతిభను ప్రోత్సహించే తమ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు.
భారత్ హెల్ప్ కావాలి: అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్ : రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ఓ వైపు భారత్పై సుంకాల మోత మోగించిన అమెరికా, చైనా విషయంలో మాత్రం మన సాయం కోరుతోంది. అరుదైన ఖనిజాలపై బీజింగ్ నియంత్రణను ఎదుర్కొనేందుకు భారత్, ఐరోపా మద్దతు కావాలని ఆశిస్తోంది. ఈమేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇటీవల చైనా నియంత్రణలు విధించింది. ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై తాజాగా స్కాట్ బెసెంట్ స్పందించారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని బీజింగ్పై ఆయన విమర్శలు చేశారు. “ఇది చైనాకు , ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురి పెట్టింది. మేం అలా జరగనివ్వం. బీజింగ్ దూకుడును మేం అడ్డుకుంటాం. ఇందుకోసం ఇప్పటికే మిత్ర దేశాలను సంప్రదిస్తున్నాం. చైనాను ఎదుర్కొనేందుకు మాకు భారత్, ఐరోపా దేశాల మద్దతు కావాలి ” అని ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వూలో అమెరికా మంత్రి వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే.. చైనా ఆర్థిక యుద్ధం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.
సిక్కోలు సమీకృత కలెక్టరేట్ పనులు చకచక…
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ డిసెంబరు నాటికి పూర్తి
క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను వినేందుకు ఈ నెల 25 నుంచి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు ‘జాగృతి జనం బాట’ పేరుతో జిల్లాల్లో పర్యటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని, అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటామన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న మనం సామాజిక తెలంగాణ ఇంకా సాధించుకోలేదని మాట్లాడితే తనను బీఆర్ఎస్ నుంచి కుట్రపూరితంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. నాడు చెప్పిందే నేడు తాను మళ్లీ చెబుతున్నానని సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి తెలంగాణ జాగృతి కట్టుబడి పని చేస్తుందన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదని ఇది విధానపరమైన నిర్ణయం అని దీనికోసం జాగృతి పని చేస్తుందన్నారు. కేసీఆర్ పేరు చెప్పి బతకాలని లేదు : కేసీఆర్ ఫొటో లేకుండానే ఈ యాత్ర నిర్వహించబోతున్నామని కవిత క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ సభ్యురాలిని కూడా కాదని అందుకే నైతికంగా కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేయబోతున్నామని, అంత మాత్రాన కేసీఆర్ను అవమానించినట్లు కాదన్నారు. కేసీఆర్ అనే చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడటానికి తాను చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. ఆ చెట్టు నీడ నాది కానప్పుడూ ఆ చెట్టుపేరు చెప్పి బతకాలనే ఉద్దేశం నాకు లేదన్నారు. తాను తన దారి వెతుక్కుంటున్నానన్నారు. కేసీఆర్ కూతురుగా పుట్టడం జన్మజన్మలకు తాను చేసుకున్న అదృష్టం అని అయితే దారులు వేరవుతున్నప్పుడు తాను ఇంకా వారి పేరు చెప్పుకోవడం నైతికంగా మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు. పరిష్కారాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుందన్నదని విమర్శించారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా ఒక్క రూపాయి కూడా కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా ఉందన్నారు. జిల్లాల వారీగా టూర్ షెడ్యూల్ : నిజామాబాద్ - అక్టోబర్ 25, 26. మహబూబ్నగర్ - అక్టోబర్ 28, 29, కరీంనగర్ - అక్టోబర్ 31, నవంబర్ 1, ఆదిలాబాద్ - నవంబర్ 3, 4, వరంగల్ / హన్మకొండ - నవంబర్ 8, 9, నల్గొండ - నవంబర్ 11, 12, మెదక్ - నవంబర్ 14, 15, ఖమ్మం - నవంబర్ 17, 18, రంగారెడ్డి - నవంబర్ 20, 21, నారాయణపేట - నవంబర్ 23, 24, కామారెడ్డి - నవంబర్ 27, 28, గద్వాల్ - నవంబర్ 30, డిసెంబర్ 1, పెద్దపల్లి - డిసెంబర్ 3, 4, యాదాద్రి భువనగిరి - డిసెంబర్ 6, 7, భూపాలపల్లి - డిసెంబర్ 9, 10, మంచిర్యాల - డిసెంబర్ 12, 13, సిద్దిపేట - డిసెంబర్ 15, 16, భద్రాద్రి కొత్తగూడెం - డిసెంబర్ 18, 19, మెద్చల్ - మల్కాజిగిరి - డిసెంబర్ 21, 22, నాగర్కర్నూల్ - డిసెంబర్ 27, 28, రాజన్న సిరిసిల్ల - జనవరి 3, 4, సూర్యాపేట - జనవరి 6, 7, జనగామ - జనవరి 10, 11, ఆసిఫాబాద్ - జనవరి 17, 18, సంగారెడ్డి - జనవరి 20, 21, వికారాబాద్ - జనవరి 24, 25, ములుగు - జనవరి 27, 28, జగిత్యాల - జనవరి 30, 31, మహబూబాబాద్ - ఫిబ్రవరి 2, 3, నిర్మల్ - ఫిబ్రవరి 5, 6, వనపర్తి - ఫిబ్రవరి 8, 9, హైదరాబాద్ - ఫిబ్రవరి 12, 13.
Fact-check: PM Modi Was not Invited to Gaza Peace Summit? Viral Claim Is Misleading
Gaza Peace Summit held in Sharm El-Sheikh, Egypt endorsed the newly agreed ceasefire and peace plan aimed at ending the conflict in Gaza
అఫ్గాన్-పాక్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య తాత్కాలికంగా 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమలు లోకి వచ్చింది. ఉభయ దేశాల మధ్య తాజాగా సంఘర్షణలు చెలరేగి ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ ఒప్పందంపై ప్రకటించింది. సానుకూల పరిష్కారం కోసం ఉభయ దేశాలు విశ్వసనీయమైన ప్రయత్నాలు చేయడానికి అంగీకరించాయి. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ వల్ల దౌత్యపరమైన చర్చలకు వీలవడమే కాక, తదుపరి ప్రాణనష్టం జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని పాక్ విదేశీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
త్వరలో విధివిధానాలు : మంత్రి పొంగులేటి
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమం, గౌరవాన్ని కాపాడే దిశగా అక్రిడిటేషన్ పాలసీపై ప్రభుత్వం వేగంగా
ఇప్పుడు 3 జిల్లాలకే నక్సలిజం పరిమితం: కేంద్రం
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఆరు జిల్లాలో ప్రాబల్యం చాటుకున్న నక్సలిజం ఇప్పుడు కేవలం మూడు జిల్లాలకు పరిమితం అయిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. మల్లోజుల, ఆయన బృందం సరెండర్ తరువాత బుధవారం ఈ స్పందన వెలువడింది. ఇప్పుడు కేవలం బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్ జిల్లాలో నక్సల్స్ ఉనికి ఉందని ప్రకటనలో తెలిపారు. ఎల్డబ్లుఇ కథ ముగిసేదశకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. నక్సల్స్ రహిత భారత్ రూపొందించాలనే మోడీ ప్రభుత్వ విజన్ దిశలో ఇది భారీ ముందడుగు అని, తమ 2026 లక్షం ముందే దీనిని చేరుకుంటామని అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో తాము 2026 మార్చి 31కు ముందే అనుకున్న లక్షం చేరుకుంటామని ప్రకటనలో వివరించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 312 కేడర్స్ నిర్మూలన జరిగింది. ఇందులో మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి, 8 మంది వరకూ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. దాదాపుగా 836 మంది అరెస్టు అయ్యారు. 1639 మంది సరెండర్ అయ్యారని లెక్కలు తెలిపారు. ఇప్పుడు మల్లోజుల లొంగుబాటుతో ఇది కీలకమ లుపు తిరిగిందన్నారు. భూపతి సరెండర్తో సరికొత్త అధ్యాయం: ఫడ్నవిస్ మల్లోజుల సరెండర్, వెంట భారీ స్థాయిలో నక్సల్స్ లొంగుబాట కీలక పరిణామం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం తెలిపారు. ఈ పరిణామంతో మహారాష్ట్రలో నక్సల్స్ కదలికలు ఉండబోవని ఆయన విశ్లేషించారు. ఇక కొద్దిరోజుల్లోనే చత్తీస్గఢ్, తెలంగాణాల్లోని మొత్తం ఈ ఎర్ర ప్రాంగణం లేదా రెడ్ కారిడార్ కథ కంచికి అని వ్యాఖ్యానించారు. నిషేథిత వర్గాలపై పోరులో తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రధాన పాత్ర వహించడం తమ ప్రాంతానికి గర్వకారణం అని కూడా తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చే నక్సల్స్కు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఆశ్రమం, పునరావాసం కల్పిస్తాయని, నాయకత్వం లేని తమ ఉద్యమం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటకి రావాలని కూడా ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. సీనియర్ మావోయిస్టు నేత భూపతి తమ దళం సభ్యులు దాదాపుగా 60 మందితో కలిసి బుధవారం మహారాష్ట్ర సిఎం ముందు లొంగిపోయారు. ఈ దశలో ఏర్పాటు అయిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తమ ముందు నక్సల్స్ లొంగిపోయారని, వారికి చెందిన ఎకె 47లు ఇతర మొత్తం 54 మారణాయుధాలను స్వాధీనపర్చుకున్నామని ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో నక్సలిజం పూర్తి స్థాయి అంతానికి తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఆరంభం జరిగిందని, ఇది దేశ చరిత్రలో మైలురాయి అవుతుందని ఫడ్నవిస్ గర్వగా తెలిపారు. ఇప్పుడు ఇక చత్తీస్గఢ్, కొంతలో కొంత తెలంగాణలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కేవలం వారి ఉనికి పరిమితం అయింది. ఇది కూడా అంతరిస్తుందన్నారు. ఇది పోలీసు, భద్రతా సిబ్బంది, ప్రత్యేకించి ఇంటలిజెన్స్ వర్గాల ఘనత అన్నారు.
పెద్దపల్లి పులి ఎందుకు లొంగినట్లు?.. సంచలనంగా మావో అగ్రనేత సరెండర్
అంతర్మథనంతోనే ఆత్మార్పణం ..ఆయుధ త్యాగం సాయుధ పోరాట యోధుడు భూపతి సరండర్ సంచలనం చాలారోజులుగా లొంగుబాటు మంతనాలు.. భవితపై సందిగ్థాలు గడ్చిరోలి (మహారాష్ట్ర): నక్సల్స్ వర్గాల్లో తీవ్ర సంచలనానికి దారితీసిన పేరు మోసిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు, అలియాస్ భూపతి సరెండర్ ఎందుకు జరిగింది? ఇది ఇప్పుడు సామాజిక రాజకీయ, పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలలో కూడా కీలక చర్చనీయాంశం అయింది. ఈ అజ్ఞాతపు , లోగుట్టు ఎవరికీ అంతుపట్టని నక్సల్ భూపతి నిషేధిత పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్లుజి) వ్యవస్థాపక సభ్యుల కేడర్లోని వాడు. నక్సల్స్ ఉద్యమానికి కీలక వ్యూహకర్త. దశాబ్దాలుగా మహారాష్ట్ర , చత్తీస్గఢ్ సరిహద్దులలో మావోయిస్టు ప్రాబల్యం పెరగడంలో ప్రధాన భూమిక వహించాడు. ఆయన ప్రభావం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో కూడా నక్సలైట్ల ఉద్యమంపై బలీయంగానే ఉంది. ఆయనను పట్టిస్తే రూ 6 కోట్ల నజారానాను ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకాలం రెండురోజుల క్రితం వరకూ దట్టమైన అరణ్యంలో దళాల మధ్య నాయకత్వంతో గడిపి, సాయుధ పోరాటమే జీవితం అని నిర్ధేశితంగా గడిపిన వ్యక్తి ఇప్పుడు తనతో పాటు 60 మంది నక్సల్స్తో సహా పోలీసులకు లొంగిపొయ్యారు. ఇప్పుడు గడ్చిరోలి పోలీసు కస్టడీకి తరలివెళ్లారు. నక్సల్ సమస్య లేకుండా చేస్తామనే కేంద్ర ప్రభుత్వ, ప్రత్యేకించి హోం మంత్రి అమిత్ షా పదేపదే చేస్తున్న ప్రకటనల క్రమంలో నెలరోజులుగా తెరవెనుక సాగిన మంతనాలు, క్షేత్రస్థాయిలో పరిణామాల నేపథ్యంలో ఇక మరో మార్గం లేదని గుర్తించే మల్లోజుల సరెండర్ అయ్యాడా? లేక మరేదైనా వ్యూహాత్మక అంశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. 69 సంవత్సరాల ఈ భూపతి మావోయిస్టుల సెంట్రల్ కమిటీ, పొలిట్బ్యూరో సభ్యులు కూడా. ఆయన తన బృందంతో సరెండర్ కావడం, ఇప్పుడు సాగుతున్న నక్సల్ బలహీనత సంకేతాలకు ప్రధాన అంశం అయింది .ఒక ధైర్యసాహసాల తుపాకీ యోధుడి కోణం, ఇప్పుడు అటువంటి వ్యక్తిలో నెలకొన్న ఆత్మనూన్యత భావం, క్రమేపీ రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం సరెండర్కు దారితీసిందని ఈ విషయాలపై అవగావహన గల సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గత నెలలోనే ఆయన వామపక్ష తీవ్రవాదం తన చివరి దశలో ఉందనే విషయం గుర్తించాడని ఈ అధికారి పేరు చెప్పకుండా తెలిపారు. తాను సరెండర్ అవుతానని, తనతో కలిసి లొంగిపోయే వారు కలిసి రావచ్చునని చాలా రోజులుగా ఆయన అంతర్గతంగా కరపత్రాలు సందేశాలు, చివరికి ప్రెస్నోట్లు వెలువరించిన విషయాన్ని ఈ పోలీసు అధికారి గుర్తు చేశారు. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజులకు కేడర్లో అనేక మారుపేర్లు ఉన్నాయి. సోనూ , అభయ్,వ వివేక్గా కూడా పేరుమోశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి మల్లోజుల వెంకటయ్య నుంచి స్ఫూర్తి పొందే కొడుకు ఈ అడవిబాట పట్టినట్లు , ఎన్నో ఏళ్లుగా తన ఊరివారికి కూడా అజ్ఞాతుడై, అడవిచుక్క అయ్యాడని కరీంనగర్ వ్యక్తి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలోనే భార్య తారక్క సరెండర్ తనతో పాటు కేడర్లో పనిచేసిన భూపతి భార్య తారక్క ఈ ఏడాది ఆరంభంలోనే సరెండర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇక ఆయన సరెండర్ సూచనలు బలోపేతం అయ్యాయి. సాయుధ పోరాటం అనేది ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడిందని, ఇప్పుడు ఈ విప్లవ సిద్ధాంత విఫల అధ్యాయం అని ఆయన తరచూ భావించారని, ఈ మేరకు తమకు నిర్థిష్ట సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ఇకపై ఏం చేయగలం? ఏం సాధిస్తాం? ఏం సాధించామనే ఆలోచనలు ఆయనలో మిక్కుటం అయ్యాయి. ఇవన్నీ కూడా ఆయన సరెండర్ నిర్ణయానికి దారితీశాయి. ముందుగా భార్యను జనజీవితంలోకి పంపించాడని, ఇప్పుడు తాను సరెండర్ అయ్యాడని, ఇది కీలక పరిణామమే అని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. సరెండర్ సంకేతాలు రాగానే ఆయన డోలాయమాన పిరిస్థితిని పసిగట్టామని, దీనితో ఇక ఆయన కోసం గాలించకుండా , మర్యాదపూర్వకంగా సరెండర్ అయ్యేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించామని,ఈ మేరకు తమ ఇంటలిజెన్స్ నెట్వర్క్ను సిద్ధం చేశామని పోలీసు బాస్ వెల్లడించారు. ఈ దిశలో నమ్మకస్తులైన వారి ద్వారా ముందుగా ఆయననుఏ భమార్గఢ్ ప్రాంతంలో సంప్రదించడం జరిగిందని వివరించారు. ఇంతకాలం చట్టానికి అతీతంగా వ్యవహరించిన వ్యక్తి చట్టం ముందు లొంగిపోతే ఇకపై ఎటువంటి ముప్పు ఉండకుండా చూస్తామనే భద్రతను క్రమేపీ కల్పించామని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన లొంగుబాటు జరిగిందని వివరించారు. 10 రోజుల క్రితమే పల్లెజనం ముందు వెల్లడి పదిరోజుల క్రితమే భూపతి కొందరు నక్సల్స్తో కలిసి ఫోడేవాడా ప్రాంతంలో గ్రామస్తులతో ముచ్చటించి వెళ్లారు. ఇక తాను అడవుల్లో నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చిందని చెప్పినట్లు తమకు రూఢిగా తెలిసిందని వివరించారు. ఇంతకాలపు హింసాత్మక మార్గాన్ని వీడి ఇప్పుడు తమ ముందుకు వచ్చాడని పోలీసు అధికారి చెప్పారు. దీనితో 40 సంవత్సరాల ఆయన ఈ సుదీర్ఘ ప్రస్థానం ముగిసిందని ఆయన గురించి తెలిసిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఈ నెల 13వ తేదీన తెరవెనుక మంతనాలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నేతతో ఓ పోలీసు అధికారి కలిశారు. అంతకు ముందు చాలా కాలంగా భూపతి కదలికలను గమనిస్తూ, ఆయన సరెండర్కు యత్నించిన ఈ పోలీసు అధికారి అదే రోజు ఆయన సరెండర్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఆయన చెప్పినట్లే భామర్గఢ్ తాలూకలోని హోదారి కుగ్రామం వెలుపల ఆయన ఆయన భారీ బృందంతో సరెండర్ అయ్యారు. దీనితో ఇక నక్సల్స్ ఉద్యమంలో సంధ్యకాలం ఏర్పడింది. ఈ భూపతి, తన నక్సల్స్ బృందంతో సరెండర్ అయిన తరువాత ప్రత్యేకించి ఇప్పుడు మిగిలిన వామపక్ష తీవ్రవాదం దిశ దశ దిక్సూచి ఏమిటనేది అటు నక్సల్స్, ఇటు పౌర సమాజం, మేధావుల్లో పలు ఆలోచనలకు దారితీసింది. ఈ భూపతి బృందం పది మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు ఆత్మసమర్ఫణకు దిగారు. ఈ క్రమంలో 54 ఆయుధాలు కూడా అప్పగించారు. సాయుధ పోరాట లక్షం గతితప్పిందనే మల్లోజుల మనోగతం తరువాతి క్రమంలో ఈ అడవిదారుల ఉద్యమ పంథా ఏమిటనేది అడవుల్లో చప్పుడు అయింది.
నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మూడోరోజు కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె రెండు నామినేషన్ సెట్లను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. భారీ ర్యాలీకి, రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసినందున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి 100 మీటర్ల వరకు ఆంక్షలను ఆర్ఓ సాయిబాబా అమలు చేస్తున్నారు. షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసిన సందర్భంలో మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థితో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్లు, శ్రీధర్రెడ్డి, వెంగళరావు నగర్ కార్పోరేటర్ దేదీప్య ఉన్నారు. నామినేషన్ రెండో సెట్ దాఖలు చేయు సందర్భంలో మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటి రామారావు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్రెడ్డి, యూసుఫ్గూడ కార్పోరేటర్ రాజ్పటేల్లు పాల్గొన్నారు. 10 మంది 13 నామినేషన్లు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు మూడో రోజు 10 మంది 13 సెట్లుగా తమతమ నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజుల్లో 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 30 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈ నెల 17న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
లైమ్ లైట్ లోకి వెటరన్ ప్లేయర్స్…
లైమ్ లైట్ లోకి వెటరన్ ప్లేయర్స్… వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్
బిసి బంద్కు బిజెపి మద్దతు: రాంచందర్ రావు
బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడాన్ని నిరసిస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపునకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మద్దతు పలికారు. బుధవారం బిసి జెఎసి నాయకుడు, బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ తదితరులు పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును కలిసి తమ బంద్కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బంద్కు మద్దతు పలికారు. బిసిలకు న్యాయం జరగాలని డిమాండ్తో బిసి జెఎసి చేపట్టిన ఉద్యమానికి పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. బిసిల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు. బిసి సమాజ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు.బిజెపి మాత్రమే బిసిలకు న్యాయం చేయగలదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బిసిలను మోసం చేసిందని, రిజర్వేషన్లు అమలు చేయలేక ఇతరులపై నెపం వేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలకు గౌరవం ఇచ్చిన పార్టీ తమదేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బిసిలు ఉన్నారని ఆయన వివరించారు. బిసిలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగించాలని ఆయన బిసి సంఘాలను కోరారు. బిసి సంఘాలు ఇచ్చిన బంద్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాంచందర్ రావు కోరారు.
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గద్దల ఆగన్ (భరత్ కుమార్)కు, ఆదిలాబాద్కు చెందిన జాశ్విన్ (25)తో 2020లో వివాహం జరిగింది. వారికి జోయల్ (4), జాట్సన్ (4 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 8వ తేదీన పిల్లలిద్దరిని తీసుకొని జాశ్విన్ నిద్ర చేసేందుకు పుట్టింటికి వెళ్లింది. ఆమె తండ్రి కిషన్ కామారెడ్డి చర్చి పాస్టర్గా పనిచేస్తున్నారు. దీంతో ఆ కుటుంబం ఆదిలాబాద్ నుండి కామారెడ్డి వచ్చింది. జాశ్విన్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డిలోని తండ్రి వద్దకు వచ్చింది. బుధవారం చిన్న బాబుకు టీకా వేయించేందుకు సమీప బంధవు అయిన ఆశా వర్కర్ జంగంపల్లిలో ఉండటంతో అక్కడకు జాశ్విన్ స్కూటీపై ఇద్దరు పిల్లలతోపాటు తండ్రితో కలిసి వెళ్తోంది. అదే సమయంలో కామారెడ్డి జిల్లా 44వ నెంబర్ జాతీయ రహదారి బిక్కనూర్ మండలం, జంగంపల్లి శివారు వద్ద రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కిషన్ (50), అతని కూతురు జాశ్విన్, మనవడు జోయల్ అక్కడిక్కక్కడే మృతి చెందగా 4 నెలల బాబు జాట్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతురాలు జాశ్విన్ భర్త ఆగన్.. చింతకాని మండలం, చిన్నమండల గ్రామంలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో విషాదఛాయలు అలుముకొన్నాయి. కాగా, జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరగడంతో గ్రామస్థులు, వాహనదారులు గుమిగూడడంతో, కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. మృతదేహాలపు మార్చురీకి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
రాలిపోతున్న స్టార్లింక్ ఉపగ్రహాలు
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్ ఉండే అవకాశం ఉందని స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు ఒకటి నుంచి రెండు స్టార్లింక్ ఉపగ్రహాలు భూ వాతావరణం లోకి ప్రవేశిస్తున్నాయని, ముందుముందు భూమిపై రాలిపోతున్న స్టార్లింక్ ఉపగ్రహాల సంఖ్య రోజుకు 5 వరకు పెరగవచ్చని తెలిపారు. భవిష్యత్తులో స్పేస్ఎక్స్, అమెజాన్ చేపట్టిన ప్రాజెక్టు కైపర్, చైనాకు చెందిన మరిన్ని ఉపగ్రహాలు కక్ష లోకి ప్రవేశించడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కక్షలో 8 వేలకు పైగా స్టార్లింక్ ఉపగ్రహాలు ఉన్నాయని, చైనా మరో 20 వేల ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెడుతుందనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు. స్టార్లింక్ ఉపగ్రహ జీవితకాలం దాదాపు ఐదునుంచి ఏడేళ్లు ఉంటుందని, అనంతరం వాటంతట అవే కక్ష నుంచి తొలగి భూమిపై రాలిపోతాయన్నారు. ఒక్కోసారి ఉపగ్రహాల్లోని వ్యవస్థల్లో తలెత్తే వైఫల్యాలు లేదా సౌర కార్యకలాపాల వల్ల కూడా అవి పడిపోతాయన్నారు. అయితే ఖగోళంలో ఇలాంటి ఉపగ్రహాలు , రాకెట్ శకలాల సంఖ్య పెరగడం వల్ల అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువై , కెస్లర్ సిండ్రోమ్ అనే చైన్ రియాక్షన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కక్షలో ఉన్న ఇతర ఉపగ్రహాలు ఢీకొనే అవకాశం ఉంటుందని , ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్, సౌర కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు స్టార్లింక్ తరచూ కక్ష లోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడం వల్ల అంతరిక్ష ట్రాఫిక్ ఏర్పడి, మానవాళికి పెద్ద సవాల్గా మారుతుందన్నారు. రాబోయే పదేళ్లలోమస్క్ సంస్థ మరో పదివేల ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేశారు. కెస్లర్ సిండ్రోమ్ అంటే ? కెస్లర్ సిండ్రోమ్ అనేది ఖగోళ వ్యర్థాలకు సంబంధించిన చైన్ రియాక్షన్ . ఇక్కడ భూ కక్షలో శిథిలాల సంఖ్య పెరిగినప్పుడు ,అవి ఒకదానికొకటి ఢీకొని మరిన్ని శిథిలాలను సృష్టిస్తాయి. దీనివల్ల ఉపగ్రహాలకు , భవిష్యత్ అంతరిక్షపరిశోధనలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.
టపాకులు కాల్చండి.. పర్యావరణాన్ని కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి దీపావళికి పర్యావరణ హిత బాణసంచా ( గ్రీన్క్రాకరీ) కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తి వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తమ రూలింగ్ వెలువరించింది. ఢిల్లీ, ఎన్సిఆర్ పరిధిలో ఈ నెల 18 నుంచి 21 వ తేదీ వరకూ పటాకులు కాల్చడానికి కొన్ని షరతులను విధించింది. దివాలీ వేడుకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే ఖచ్చితంగా గ్రీన్క్రాకరీస్ను కాల్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్ణీత వేళలను కూడా ఖరారు చేశారు. ఢిల్లీ, పరిసరాలలో వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలతో ఇప్పటివరకూ ఎటువంటి పటాకులు పేల్చడాన్ని అనుమతించడం లేదు. వీటిపై ఉన్న నిషేధాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సడలించింది. తాము ఈ విషయంలో మధ్యస్థ సమతూకతను పాటించి ఆదేశాలను వెలువరించామని, ఒక పరిమిత మోతాదులో బాణాసంచ కాల్చడానికి అనుమతిని కల్పించాం. ఇక ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీకి రావడం లేదని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ తెలిపారు. దివాళి రోజు తరువాతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాల్సి ఉంటుంది. ఇక దుకాణాలలో అనుమతించిన సరుకు క్యూఆర్ కోడ్ ఉన్నవే విక్రయించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు విభాగంపై ఉంటుంది. ఇందుకోసం తగు విధంగా పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలి. నిబందనలను అంతా పాటించేలా చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం: మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో లక్షల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఓటు చోరీ ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి దేశవ్యాప్తంగా ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని దేశవ్యాప్తంగా తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉద్యమిస్తూ.. ప్రజలను చైతన్యం చేస్తూ ఆధారాలతో సహా బయటపెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాలలో దొంగ ఓట్లను నమోదు చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని విమర్శించారు. ఓట్చోరీపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడుతూ స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఇంట్లో ఓటు ఉందో లేదో చూడాలని హితవు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ కేడం లింగమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బోలిశెట్టి శివయ్య, అక్కు శ్రీనివాస్, కోమటి సత్యనారాయణ, బంక చందు, చిత్తారి రవీందర్తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో తెలియదు: ట్రంప్
వాషింగ్టన్ : ఉక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వివాదంగా ఈ యుద్ధాన్ని పేర్కొన్నారు. పుతిన్తో తనకు చాలా మంచి సంబంధాలున్నాయని, బహుశా ఇప్పటికే అలాగే ఉన్నాయని చెప్పుకొచ్చారు. పుతిన్ ఈ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో నాకు తెలియదని, కానీ యుద్ధం అంతమంచిది కాదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశానికి ముందు ట్రంప్ వైట్హౌస్లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గత నాలుగేళ్లుగాజరుగుతోందని ఈ యుద్ధం వారం లోనే పూర్తి కావలసి ఉందని, రష్యా 1.50 లక్షల మంది సైనికులను కోల్పోయిందన్నారు. ఇది భయంకరమైన యుద్ధమని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన మరణాల పరంగా అతి పెద్ద సంఘటనగా పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, ఈ యుద్ధాన్ని పూర్తిగా రష్యా, ఉక్రెయిన్ పరిష్కరించుకోవాలన్నారు. అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ట్రంప్ 20 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఉక్రెయిన్కు టొమాహాక్ క్షిపణులను ఇవ్వడానికి అమెరికా ఆలోచిస్తుందన్నారు.
వరంగల్ జిల్లా, నర్సంపేట ఎంఎల్ఎ దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం బుధవారం మధ్యాహ్నం హన్మకొండ జిల్లా కేంద్రంలోని పిడిఆర్ గార్డెన్కు చేరుకున్నారు. ఎంఎల్ఎ తల్లి స్మాకర దినం కార్యక్రమానికి సిఎం వస్తున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి పలువురు తన మంత్రివర్గ సహచరులతో కలిసి దొంతి కాంతమ్మకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంతమ్మ మృతికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులతో వేదికపైనే వారితో మాటాడారు. అనంతరం ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాధవరెడ్డి కుటుంబ సభ్యులతో ప్రజలు, కార్యకర్తల ముందుకు చేరుకొని అభివాదం చేశారు. కార్యక్రమం మొత్తం 45 నిమిషాల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి పర్యటన ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ధనసరి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపిలు కడియం కావ్య, బలరాంనాయక్, ఎంఎల్ఎలు కడియం శ్రీహరి, కెఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. * గ్రూపులకు చెక్ పెట్టిన సిఎం పర్యటన సిఎం రేవంత్రెడ్డికి నర్సంపేట ఎంఎల్ఎ దొంతి మాధవరెడ్డి మధ్య గ్రూపుల తగాదాలు ఉండేవి. కొన్ని కారణాల వల్ల మాధవరెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కలిసే పరిస్థితి లేకుండా ఉండేది. ప్రస్తుతం మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ మృతి చెందడంతో ఆమె స్మారక దినం రోజు సిఎం రేవంత్రెడ్డి స్వయంగా వరంగల్కు చేరుకొని ఆయనను, వారి కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించడం కాంగ్రెస్ శ్రేణులకు గ్రూపు తగాదాలు లేవని సంకేతం ఇచ్చినట్లు ఉంది. మాధవరెడ్డి తల్లి మృతి చెందినప్పటి నుంచి పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులతో పాటు మంత్రులు, ఎంఎల్ఎలు ప్రతీ రోజు దొంతిని కలిసి పరామర్శలు కొనసాగించారు. రేవంత్రెడ్డి ఎంఎల్ఎ దొంతి తల్లి మృతి చెందిన రోజే ఫోన్ ద్వారా పరామర్శించి పెద్దకర్మ రోజు వస్తానని, అదే రోజు ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి సిఎం రాకపోవచ్చని పార్టీ వర్గాల్లో కొంతమంది చర్చించుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్రెడ్డి సహచర ఎంఎల్ఎ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడానికి ఒక మెట్టు దిగి స్వయంగా దశదినకర్మలో పాల్గొనడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొన్న తరుణంలో రేవంత్రెడ్డి అన్నింటినీ పక్కనపెట్టి పార్టీ ముఖ్యమన్న రీతిలో సిఎం స్థాయిలో ఎంఎల్ఎ తల్లి పెద్దకర్మకు హాజరుకావడం అన్ని వర్గాలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాలోని అందరు ఎంఎల్ఎలతో పాటు దొంతికి కూడా సిఎంతో నేరుగా సంబంధాలు ఇప్పటినుంచి ఉంటాయని నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ మహిళా జట్టుకు మరో దెబ్బ#TeluguPost #telugu #post #news
2025కు న్యూఢిల్లీలో శ్రీకారం హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో
Bunny Vas about Fake Mafia in Tollywood
A couple of days ago, young producer Bunny Vas expressed his frustration about the negative trend on social media against his upcoming production Mithra Mandali. He lost his cool, expressed his anger and filed a complaint with the Cybercrime cops. Today during the press interaction, Bunny Vas exposed the fake mafia in telugu cinema which […] The post Bunny Vas about Fake Mafia in Tollywood appeared first on Telugu360 .
Dude Promises An Emotional Ride For All
Mythri Movie Makers is now gearing up for the Diwali release of their next venture, Dude, starring Pradeep Ranganathan and Mmitha Baiju. Scheduled to hit screens on October 17, the film marks the directorial debut of Keerthiswaran and is already drawing attention for its unique blend of emotion and entertainment, promised through promos. Producers Naveen […] The post Dude Promises An Emotional Ride For All appeared first on Telugu360 .
భూములు, ఇండ్లు, ఫ్లాట్లకు భారీ నష్టం..
భూములు, ఇండ్లు, ఫ్లాట్లకు భారీ నష్టం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : త్రిబుల్ ఆర్
ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు.
ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని
మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్గాన్ సరిహద్దు.. డజన్ల మంది సైనికులు మృతి
కాబూల్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ సంఘర్షణలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వైపులా డజన్ల మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. అయితే ముందుగా ఎవరు కాల్పులు జరిపారనే విషయమై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణపై మాట్లాడటం కోసం అఫ్గన్ వెళ్లేందుకు పాకిస్థాన్ మంత్రులు ప్రయత్నించారు. కానీ అఫ్గాన్ వారిని అడ్డుకుంది. దాంతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియాలను సంప్రదించింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ బుధవారం ఉదయం పాకిస్థానే తాజాగా కాందహార్ ప్రావిన్స్లో స్పిన్బోల్డక్ జిల్లాలో దాడులకు పాల్పడిందని,15 మంది పౌరులు మృతి చెందారని, వందమందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. అదే ప్రాంతంలోని ఆస్పత్రి వర్గాలు గాయపడిన వారిలో 80 మంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని వెల్లడించాయి. అఫ్గాన్ దళాలు ప్రతీకార దాడులకు పాల్పడ్డాయని, భారీ సంఖ్యలో పాక్సైనికులు హతమయ్యారని పాకిస్థాన్ ఆయుధాలను, ట్యాంకులను స్వాధీనం చేసుకోవడమైందని తాలిబన్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. అఫ్గాన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను , సైనిక పోస్ట్లను దెబ్బతీశామని స్థానిక మీడియాతో పాక్ భద్రతాధికారులు పేర్కొన్నారు. తాలిబన్లు వాయువ్య, నైరుతి ప్రాంతాల్లో సరిహద్దు పోస్టులను కూల్చివేశారని ఆరోపించారు. దాదాపు 30 మంది అఫ్గాన్ సైనికులు హతమయ్యారన్నారు. స్పిన్బోల్డాక్లో మరో 20 మంది చనిపోయారన్నారు. కాందహార్లో పాక్ జెట్ విమానాలు దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అఫ్గాన్లో ఖోస్ట్ ప్రావిన్స్ లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్అహ్రర్ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించారు. చమన్ జిల్లాలో తాలిబన్ల దాడులకు నలుగురు పౌరులు గాయపడ్డారని పాక్ ఆరోపించింది. పాక్ ప్రభుత్వం మీడియా ప్రకారం , ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ దళాలు, తెహ్రీక్ ఇతాలిబన్ పాకిస్థాన్ సంయుక్తంగా తమ భూభాగం లోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాలు బలంగా స్పందించాయని, టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘర్షణలతో సరిహద్దుల్లో వేలాది మంది నిర్వాసితులయ్యారు. మధ్యవర్తిత్వానికి సిద్ధం: జేయూఐఎఫ్ చీఫ్ పాక్ అఫ్గాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై ‘జమైత్ ఉలేమా ఈఇస్లాం ఫ్లజ్ పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. గతంలో పాక్అఫ్గాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలకపాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను అది చేయగలనని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అఫ్గాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025‘లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్బయోటెక్‘, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ‘గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్టెక్‘ ఆవిష్కరణ హబ్ గా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆస్ట్రేలియా - తెలంగాణ‘ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. ‘ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలో కొత్తగా రూ.63వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది‘ అని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మస్కాపూర్ బీట్ అటవీలో ట్రైనింగ్
మస్కాపూర్ బీట్ అటవీలో ట్రైనింగ్ ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్
అస్త్రాలు వదిలి లొంగిపోండి: బండి సంజయ్
మావోయిస్టులు అస్త్రాలు వదిలి లొంగిపోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. గడ్చిరోలి ప్రాంతంలో వారి ఉనికికి గట్టి దెబ్బగా మావోయిస్టుల సీనియర్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అరవై మంది దళ సభ్యులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారని ఆయన తెలిపారు. ఈ పరిణామం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృఢమైన, ఫలితాలపై దృష్టి పెట్టిన కాలపరిమితికి ప్రతిబింబం అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా నిర్మూలించాలన్నది కేంద్ర మంత్రి అమిత్ షా లక్షమని ఆయన తెలిపారు. అంతర్గత భద్రత పట్ల ఆయన రాజీ లేని వైఖరి దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలో ఎన్టీయే ప్రభుత్వం శాంతి-భద్రత, అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఈ సమయంలో మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ==++==
వైరా మున్సిపాలిటిలో 54 లక్షలు స్వాహ...?
జనరల్ ఫండ్ను కాజేసిన అధికారులు జేఏవో ఫిర్యాదుతో అవినీతి బహిర్గతం విచారణ చేపట్టిన అధికారులు మన తెలంగాణ/వైరా: అనేక అవినితి ఆరోపణలకు నిలయంగా మారిన వైరా మున్సిపాలిటి కార్యాలయంలో అతి పెద్ద కుంభకోణం బయటపడింది. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు ఏకంగా సుమారు 54 లక్షల రూపాయలు అధికారులు కాజేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటిలోని ఇంజనీరింగ్ శాఖ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కేంద్రంగా ఈ అవినితి వ్యవహరం కొనసాగింది. మున్సిపాలిటి జనరల్ ఫండ్ రూ.2 కొట్ల నిధులలో సుమారు 54 లక్షల రూపాయలు గోల్మాల్ జరగడం ప్రకంపనలకు దారితీస్తుంది. జేఏఓ కిరణ్ మున్సిపాలిటి అవినితిపై రాష్ట్ర, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారుల బాగోతం బహిర్గతమైంది. గత రెండు నెలల క్రితం వరకు వైరా మున్సిపాలిటి కమిషనర్గా పని చేసిన చింతా వేణు, అకౌంటెట్గా పని చేసిన జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ఈ అవినితికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మున్సిపాలిటిలోని జనరల్ ఫండ్ సుమారు 54 లక్షల రూపాయలు ఈ ఇద్దరు ఉద్యోగులు బ్యాంకుల నుంచి తమ ఇష్టారాజ్యంగా డ్రా చేశారు. తమ నిధులకు నిరంతరం డుమ్మా కొట్టే ఇంజనిరింగ్ విభాగం జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ సెల్ప్ చెక్కులు రాసుకొని 54 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు.ఈ చెక్కులపై అప్పటి మున్సిపాలిటి కమీషనర్ చింతా వేణు సంతకాలు చేశారు. నిభందనల ప్రకారం ఏదైనా పని జరిగితే ఆ పనికి సంబందించిన ఏజెన్సి పేరుతో చెక్కును మంజూరు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇస్టానుసారంగా వెంకటేశ్వర్లు తన పేరుపై చెక్కులు రాసుకొని నిధుల కాజేశారు. ఈ వ్యవహరం అంతా అప్పటి మున్సిపల్ కమీషనర్ చింతా వేణు కనుసన్నల్లో కొనసాగిందని, చిన్న చిన్న పనులను చూపిస్తూ ఆ నిధులను ఖ్చు చేసినట్లు రికార్డుల్లో చూపించటం విశేషం. జేఏఓ కిరణ్ ఫిర్యాదుతో ఆర్డిఏంఏ షాహిద్ మంగళవారం విచారణ చేపట్టారు.కిరణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రెండు నెలలు గడుస్తున్న అకౌంటెంట్ వెంకటేశ్వర్లు పూర్తిస్ధాయిలో బాధ్యతలు అప్పజేప్పలేదు.దీంతో అనుమానం వచ్చిన జేఏఒ కిరణ్ ఖాతాలను పరిశీలించగా ఈ అవినితి అంతా భయటపడటంతో ఉన్నతాదికారులకు కిరణ్ ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటి ఏర్పడినప్పటి నుండి ట్రేడ్ లైసెన్స్ పన్నును ముక్కపిండి వసూలు చేస్తున్నారని ఆ డబ్బును జమ చేయకుండా ఆధికారులు వారి జేబులోనే వేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఆవినితిపై జిల్లా ఉన్నతాదికారులు సిరియస్గా తీసుకొని చిచారణ చేపడుతారా లేదా అనేది ఇప్పుడు వైరా తీవ్ర చర్చాంశనియంగా మారింది.అయితే వైరాలో ప్రతిసారి అనినితి జరగటం,అదికారులు విచారణ నిర్వహించి వదిలేయటం పరిపాటిగా మారింది.ఇప్పటికైనా సిడిఎంఏ అధికారులు స్పందించి వైరా మున్సిపాలిటిలో జరిగిన అవినితిపై తగు చర్యలు తీసుకొవాలని మున్సిపాలిటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్లూస్ టీంతో దర్యాప్తు లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా(Nirmal District) లక్ష్మణచాంద
భారీ సంఖ్యలో లొంగిపోయిన మవోయిస్టులు..
ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మవోయిస్టులు లొంగిపోయారు. కేంద్రం ఆదేశాలతో భద్రతా దళాల ఆపరేషన్ తో మనుగడ సాధించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు మావోయిస్టులు. ఇప్పటికే చాలా మంది మావోలు.. బలగాల ఎన్ కౌంటర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది లొంగిపోగా.. వందల మంది మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం తమ ఆపరేషన్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులకు మావోలు లొంగిపోయారు. బుధవారం కాంకేర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు లొంగిపోగా.. బీఎస్ఎఫ్ క్యాంపులో మరో 50 మంది, సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే, లొంగిపోయిన మావోయిస్టులపై గతంలో రూ. 50 లక్షల రివార్డు ప్రకటన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుముందు మరికొంతమంది మావోలు లొంగిపోయే అవకాశం ఉంది. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. 2026 మార్చి నాటికి దేశంలో మావోలను పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయండి..
ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకుంటాం :- బంజారా నాయకులు.. విశాలాంధ్ర పుట్టపర్తి: – సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి నాయక్ పేర్కొన్నారు. బుధవారం ప్రశాంతి గ్రామంలో ఆంజనేయులునాయక్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి ఎటువంటి […] The post సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయండి.. appeared first on Visalaandhra .
ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి..
ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి.. వేములవాడ, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన
రేపటి కర్నూల్ పర్యటనపై మోదీ ట్వీట్..
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు, (అక్టోబర్ 16 – గురువారం) ఆంధ్రప్రదేశ్లో
కార్తీక మాసం వచ్చేసింది! సిద్ధమా శివారాధనకు? #devotional #karthikamasam #shivaradhana #telangana
ఓటు చోరీతో ఫలితాలను తారుమారు
ఓటు చోరీతో ఫలితాలను తారుమారు హుస్నాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
పి.వి.కె.కె. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకురాలికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ:పీ.వి.కె.కె. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. సి. వీణా కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు – 2025ను అందుకున్నారు.ఈ అవార్డు సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ – సీఈఓ , ఏఐసిటి ఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ డా.వీణా కి అందజేశారు. ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు, వినూత్న […] The post పి.వి.కె.కె. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకురాలికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.. appeared first on Visalaandhra .
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం..
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో
కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు
కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు హుస్నాబాద్, ఆంధ్రప్రభ : హుస్నాబాద్
మెగా బిందుసేద్యం ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.. సిపిఐ
బిందు సేద్యం పరికరాలను పరిశీలిస్తున్న సిపిఐ నాయకులు విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ నియోజకవర్గం లో 842 కోట్ల రూపాయల వ్యయంతో 22 గ్రామాలకు 50వేల ఎకరాలకు13వేలు మంది రైతులకు ఉపయోగపడే సామూహిక మెగా బిందు సేద్యం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో సామూహిక బిందు సేద్యం ప్రాజెక్టుకు సంబంధించిన నిరుపయోగంగా పడి ఉన్న పరికరాలను జిల్లా […] The post మెగా బిందుసేద్యం ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.. సిపిఐ appeared first on Visalaandhra .
పిఎం మోడీ గో బ్యాక్ అంటూ నిరసన ర్యాలీ వామపక్షాల నేతలు అరెస్టు
విశాలాంధ్ర – నంద్యాల : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రధాన మంత్రి మోడీ ఎలా వస్తారని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను వ్యతిరేకిస్తూ పీఎం నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ పద్మావతినగర్ నుంచి గాంధీచౌక్ వరకు నిరసన […] The post పిఎం మోడీ గో బ్యాక్ అంటూ నిరసన ర్యాలీ వామపక్షాల నేతలు అరెస్టు appeared first on Visalaandhra .
సెలెక్టర్లకు సవాల్ భారత క్రికెట్ జట్టులో తన ఫిట్నెస్పై వ్యక్తమవుతున్న అనుమానాలను వెటరన్
ముత్యంపేటలో మెగా పశువైద్య శిబిరం
ముత్యంపేటలో మెగా పశువైద్య శిబిరం దండేపల్లి, అక్టోబర్ 15(ఆంధ్రప్రభ) : పశు సంవర్ధక
పోలీస్ కమిషనర్ కు జోగి రమేష్ ఫిర్యాదు
వైసీపీ నేత జోగి రమేష్ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు
పీఏబీఆర్ కాలువ ద్వారా చెరువులకు నీరు అందించాలి..సిపిఐ
విశాలాంధ్ర – అనంతపురం రూరల్… జిల్లాలో ఈ సంవత్సరం సరైన వర్షాలు కురవకపోవడంతో అనేక గ్రామాల్లో త్రాగనీటితో పాటు, బోరుబావులు భూగర్భ జలాలు తగ్గిపోయాయని, రైతులకు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు సమస్య ఏర్పడిందని పీఏబీఆర్ కాలువ ద్వారా 49 చెరువులకు నీరు అందించాలని చిరుతల మల్లికార్జున సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పేర్కొన్నారు. బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో హెచ్ ఎల్ సి యస్ ఈ కి వినతి పత్రాన్ని అందజేశారు. పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న […] The post పీఏబీఆర్ కాలువ ద్వారా చెరువులకు నీరు అందించాలి..సిపిఐ appeared first on Visalaandhra .
“One State, One Capital, One Vision”: Nara Lokesh on Andhra Pradesh’s New Era of Growth
Andhra Pradesh IT and Industries Minister Nara Lokesh has painted a bold picture of the state’s future, one built on investment and innovation. Speaking at a press conference in Amaravati, Lokesh said Andhra Pradesh is entering a transformative phase, with Google’s massive USD 15 billion investment in Visakhapatnam marking the beginning of a new industrial […] The post “One State, One Capital, One Vision”: Nara Lokesh on Andhra Pradesh’s New Era of Growth appeared first on Telugu360 .
రూ. 75 వేల విరాళాలు అందజేత కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : విధి
వేరుశనగ పంటలు పరిశీలన చేపట్టిన సిపీఐ ఏపీ రైతు సంఘం బృందం విశాలాంధ్ర – గుమ్మగట్ట: మండలంలోని 75 వీరాపురం, పూలకుంట, వెంకటంపల్లి, కలుగోడు,రంగచేడు గ్రామాలలో బుధవారం ఏపీ రైతు సంఘం వేరుశనగ పంటలను పరిశీలించారు.నియోజకవర్గ తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ వేరుశనగ వర్షాధార భూములను చదును చేసే సేద్యానికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.సకాలంలో వేరుశనగ పంటలపై వర్షాలు రాకపోవడంతో నిట్ట నిలువున భూముల్లోనే ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం పెట్టి కేవలం […] The post వేరుశనగ రైతులను ఆదుకోండి.. appeared first on Visalaandhra .
తాత వారసత్వం... చీరలో తిరిగొచ్చింది! #vanaparthi #aditiraohydari #heritage #handloom #telangana
ట్రాక్టర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణం నుండి పలు ట్రాక్టర్లతో ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం వద్దకు తమ నిరసనను తెలుపుతూ చేరుకున్నారు. అనంతరం మధు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో ట్రాక్టర్స్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. గతంలో ఇసుక మట్టిని ప్రభుత్వమే అందించడంతో కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం […] The post ట్రాక్టర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Visalaandhra .
భోజనంలో 100 శాతం నాణ్యత ఉండాలి..
భోజనంలో 100 శాతం నాణ్యత ఉండాలి.. మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా
ఇద్దరు చిన్నారులను చంపి… ఆపై… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో
మద్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అధికారులు
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ బి. రామమోహన రెడ్డి మరియు అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్ఫోర్స్మెంట్) ఎం. శ్రీరామ్ మాట్లాడుతూ మద్యం దుకాణాల యందు “ఏపి ఎక్సైజ్ సురక్ష” మొబైల్ యాప్ ద్వారా జరుగుతున్న మద్యం బాటిళ్ల విక్రయ చర్యలను పరిశీలించి, బాటిళ్ల విక్రయాలు పూర్తిగా […] The post మద్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అధికారులు appeared first on Visalaandhra .
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్
చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయండి..
ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి ప్రధాన జిల్లా కార్యదర్శి వెంకటనారాయణవిశాలాంధ్ర ధర్మవరం ; చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నేతన్న భరోసా 25వేల రూపాయల పథకాలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హామీ ఇచ్చి 2 నెలలు […] The post చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయండి.. appeared first on Visalaandhra .
కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన రూపా రాజా పిసీఎంఆర్ పాఠశాల విద్యార్థులు..
పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : కుస్తీ పోటీలలో పట్టణములోని నాగులు గ్రామం వద్ద గల రూపా రాజా పి సి ఎం ఆర్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్, పాఠశాల డైరెక్టర్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరెస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో ఈ […] The post కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన రూపా రాజా పిసీఎంఆర్ పాఠశాల విద్యార్థులు.. appeared first on Visalaandhra .
Viral Dog Saving Family from Fire Video Is AI-Generated, Not Real
సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ కిషన్
రంజీ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నమెంట్ని సెంచరీతో ప్రారంభించాడు యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్లో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జార్ఖండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఐదో స్థానంలో బరిలోకి దిగిన కిషన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో సెంచరీ (101) చేశాడు. ఇషాన్తో పాటు బ్యాటింగ్ చేస్తున్న మరో ఆటగాడు సాహిల్ రాజ్ కూడా అర్థశతకం సాధించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ 90 ఓవర్లలో 307 పరుగులు చేసింది. క్రీజ్లో కిషన్ (125), రాజ్ (64) ఉణ్నారు. అంతకు ముందు జార్ఖండ్ ఇన్నింగ్స్లో శిఖర్ మోహన్ 10, శరన్దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలింగ్లో గుర్జప్నీత్ సింగ్ 3, డిటి చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ 1 వికెట్ తీశారు.
Parakala Prabhakar : చంద్రబాబుకు పరకాల ఇలా స్ట్రోక్ ఇచ్చారేమిటో?
ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి