ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట ప్రమాదశాత్తు నిప్పంటుకొని రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకుందామని నిలువ చేయగా ప్రమాద శాత్తు పత్తి దగ్ధం కావడంతో రైతు బోరున విలపించిన ఘటన పలువురు ని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా, బెజ్జంకిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బండి ఐలయ్య తన సొంత 12 ఎకరాల భూమితోపాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. గిట్టుబాటు ధర వచ్చాక అమ్ముకుందామని సుమారు 350 క్వింటాళ్ల పత్తి ఇటీవల కురిసిన వర్షానికి తేమశాతం ఎక్కువ ఉందని ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ఆరబెట్టాడు.ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పత్తి మొత్తం కాలి బూడిదైంది. స్థానికులు ట్యాంకర్ల ద్వారా నీటిని పిచికారీ చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. సంఘటన స్థలానికి రూరల్ సిఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య చేరుకొని సిద్దిపేట నుండి ఫైర్ ఇంజన్ను తెప్పించారు. సిద్దిపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేటప్పటికి పత్తి సగానికి ఎక్కువ కాలి బూడిదయింది. పండించిన పంట మొత్తం కాలి బూడిదయిందని, దీని వల్ల 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందజేయాలని రైతు ఐలయ్య వేడుకున్నాడు. కాగా బాధిత రైతు కుటుంబాన్ని పలువరు బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ప్రమాదవశాత్తు గోదావరిలో పడి యువకుడు గల్లంతు
మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, బాదంపెల్లి సమీపంలో గల గోదావరి నదిలో ఒక యువకుడు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. మృతుడి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పొన్కల్కు చెందిన గుండా శ్రావణ్ కుమార్ (32) శుక్రవారం తన నాన్నమ్మ సంవత్సరీకం కార్యక్రమం జరిపాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గోదావరికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి చేరుకున్నారు. గుండా శ్రావణ్ కుమార్ ఒక్కడే మళ్లీ గోదావరి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసిన అనంతరం అక్కడ స్నానానికి వచ్చిన మరో వ్యక్తికి తన ఫోన్ ఇచ్చి ఫొటో తీయమని చెప్పాడు. గోదావరిలో పారుతున్న నీటి పక్కనే ఉన్న రాయిపై నిల్చొని ఫొటో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వెనుక వైపు ఉన్న గోదావరిలో పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోతున్న శ్రావణ్ను కాపాడటానికి మరో వ్యక్తి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి వెళ్లి పలు ప్రాంతాలను గాలించారు. శ్రావణ్ ఆచూకీ కోసం గజఈతగాళ్లు గోదావరిలో గాలిస్తున్నారు. సంఘటన ప్రాంతాన్ని ఎస్ఐ అనూష సందర్శించి వివరాలను సేకరించారు. సిమెంట్ వ్యాపారి గుండా లచ్చన్నకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గల్లంతైన శ్రావణ్ వారి ద్వితీయ పుత్రుడు. ముగ్గురికి కూడా ఇంకా వివాహం కాలేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పార్టీల జెండాలు, లాఠీలు, ఫైర్ ఆర్మ్, సమావేశాలు, పోలింగ్ స్టేషన్లకు కిలో మీటర్ దూరంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టంను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. ఎన్నికల రోజు, ఓట్ల లెక్కింపు రోజుల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రోడ్లపై, జనవాసాల్లో టపాసులు పేల్చడం నిషేధించామని తెలిపారు. ఎన్నికల ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు.
విజయ్ చివరి సినిమా.. ‘తళపతి కచేరీ’ సాంగ్ అదుర్స్..
తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. చివరిగా ‘జననాయగన్’ అనే సినిమాలో నటించి.. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వినోద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ రోర్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘తళపతి కచేరీ’ అంటూ తొలి సింగిల్ని విడుదల చేశారు. యధావిధిగా అనిరుధ్ ఈ పాటకు మాస్ బీట్ అందించాడు. విజయ్, జనాలతో వేసిన స్టెప్స్ సింపుల్గా ఉన్నా.. అభిమానులకు కను విందు చేసేలా ఉన్నాయి. విజువల్స్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.
కాపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలని పత్తి రైతులు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల జీవితాలను కష్టాల పాలు చేస్తుందని తేమ శాతంతో పాటు కొత్తగా కాపాస్ కిసాన్ ఆప్ ప్రవేశంతో సమస్యలకు తెర లేపిందని పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. నేరడిగొండ రైతుల వద్ద కొనే పత్తి పంట కొనుగోలు లో తేమ శాతాన్ని పెంచి తీసుకోవాలని మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు.రాకపోకలను స్థభింప చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యత రేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉప అధ్యక్షులు ఆడే వసంత్ రావు మాట్లాడుతూ పత్తి లో తేమ శాతాన్ని 12 నుండి 20 శాతానికి పెంచి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయాలని, సోయాబీన్ తేమశాతాన్ని ఎనిమిది శాతం నుండి 18 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కాపాస్ కిసాన్ ఆప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పత్తి రైతులను ఆదుకోవాలని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి,తేమ శాతం పేరుతో సీసీఐ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, కఫాస్ కిషన్ యాప్ సమస్యలు తప్పడం లేదని వెంటనే కపాస్ కిషన్ యాప్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిసిఐ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఈ కార్యక్రమంలో మండల రైతులు నాయకులు పాల్గొన్నారు.
నవీన్ యాదవ్ కు పాస్టర్లు మద్దతు…
జూబ్లీహిల్స్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని
తాళాలు పగలగొట్టి 40 లక్షల బంగారం అపహరణ వీరులపాడులో సంచలనం ( వీరులపాడు,
హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో గంజాయి కలకలం
హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల గంజాయి పార్టీ నగరంలో కలకలం సృష్టించింది. బేగంపేటలోని హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు టెస్ట్ నిర్వహించగా ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు బేగంపేటలోని కులినరి అకాడమీ ఆఫ్ ఇండియాలో విద్యార్థులకు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే కాలేజీలో పార్టీ ఏర్పాటు చేశారని, అందులో విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో ఈగల్ పోలీసులు దాడి చేసి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టిహెచ్సి పరీక్ష నిర్వహించగా సాక్షి ఈమాలియా, మోహిత్ షాహి, శుభం రావత్, కరోలినా సైన్తియా హరీసన్, ఆరిక్ జోనథన్ ఆంటోనీ, లాయ్ బారౌహాకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు రిహ్యాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. మోహిత్ అనే విద్యార్థి గతంలో ఉడిపిలోని మణిపాల్ యూనివర్సిటీలో చదువుతుండగా డ్రగ్స్ తీసుకుంటుండగా, అతడి తండ్రి అక్కడి నుంచి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు. ఇక్కడికి వచ్చినా కూడా గంజాయి తీసుకోవడం ఆగలేదు. ఎస్ఆర్ నగర్కు చెందిన జాసన్ తన స్నేహితులు లాయ్, ఆరిక్ జోనాథన్ కలిసి విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారు.
కారులో గంజాయి తరలిస్తున్న హోంగార్డును ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది రామోజీ ఫిలిం సిటీ వద్ద శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 15.33కిలోల గంజాయి, కారు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రం, మల్కాన్గిరికి చెందిన నీలంబర్ మీర్కన్ పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన ఉమాకాంత్ నాగర్ తన వద్ద ఉన్న గంజాయి 15.33కిలోలను హైదరాబాద్లో ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పడంతో దానికి హోంగార్డు అంగీకరించాడు. గంజాయి తీసుకుని తన కారులో హోంగార్డు నీలంబర్ మీర్కన్, సోనా కాలా బయలుదేరారు. ఈ విషయం ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బందికి తెలియడంతో రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో వస్తున్న నీలంబర్ను ఆపి కారులో తనిఖీ చేయగా గంజాయి లభించలేదు. కారు డిక్కీలో ఉన్న స్టెఫిన్ టైర్పై అనుమానం రావడంతో దానిని బయటికి తీసి తనిఖీ చేయాగా నాలుగు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బందిని కేసు దర్యాప్తు కోసం హయత్నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. డిఎస్పి తులా శ్రీనివాసరావు తదితరులు తనిఖీలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఎర్రగడ్డ డివిజన్
తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ కీలకపాత్ర..
తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డికి పదవీగండం: ఎంఎల్ఎ జగదీష్రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జి.జగదీష్రెడ్డి అన్నారు. సిఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని.. సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు కెసిఆర్ కమాండ్ కంట్రోల్ కట్టారని గతంలో రేవంత్రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని తమ మీద పెడుతున్నారా..? అని ప్రశ్నించారు. ప్రగతిభవన్లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్పై కమీషన్ వేయవచ్చు కదా..? అని అడిగారు. కెసిఆర్ దగ్గర ఉండి పని చేయించారు కాబట్టే.. ఆనాడు శాంతి భద్రతలు అదుపులో ఉండేవి అని పేర్కొన్నారు. కానీ, రేవంత్రెడ్డి చేయరాని పనులు చేస్తున్నారేమో, శాంతి భద్రతలు దెబ్బతిని, క్రైమ్ రేటు పెరిగిందని అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్సార్ను, సోనియా గాంధీని తిట్టింది రేవంత్రెడ్డినే అని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడుతారని ప్రశ్నించారు. ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు అని, రేవంత్ రెడ్డి చేసే తప్పులకు చరిత్ర క్షమించదు అని చెప్పారు.బిహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని వద్దని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి.. ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అని, వారు ఇద్దరూ మోదీ శిష్యులేనని అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి,హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని సూచించారు.మాగంటి గోపీనాథ్ తల్లితో ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసు అని చెప్పారు.
తిరుపతి జిల్లా ఉగ్గుమూడిలో విషాదం ( ఆంధ్రప్రభ, సూళ్లూరుపేట) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట
మామండూరు అటవీ క్షేత్రంలో డిప్యూటీ సీఎం…
మామండూరు అటవీ క్షేత్రంలో డిప్యూటీ సీఎం… తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : చుట్టూ
సహచరుడిపై కత్తితో దాడి (గుడివాడ – ఆంధ్రప్రభ) గుడివాడ రూరల్ మండలం
సిసిఐ సిఎండితో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల చర్చ
హైదరాబాద్: పత్తి కొనుగోళ్లపై సిసిఐ సిఎండి లలిత్కుమార్ గుప్తాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన లలిత్కుమార్కి ఫోన్లో వివరించారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పరిమితిపై చర్చించారు. ఆ నిబంధనను ఎత్తివేసి పాత విధానంలోనే సిసిఐ పత్తి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కపాస్ కిసాన్ యాప్ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని కోరారు. పత్తి మిల్లులన్నీ వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవాలని.. 20 శాతం తేమ ఉన్న పత్తిని సిసిఐ కొనేలా చర్యలు చేపట్టాని విజ్ఞప్తి చేశారు.
Exclusive: Mad Rush for Peddi Theatrical Rights
Ram Charan’s next film Peddi is a hot cake in trade. The makers have closed the non-theatrical deals and the film is on track. The schedules are planned perfectly and the shoot is happening as per the plan. The makers recently reconfirmed that Peddi will hit the screens as per the plan on March 27th, […] The post Exclusive: Mad Rush for Peddi Theatrical Rights appeared first on Telugu360 .
Chandrababu : తిరువూరు వివాదంపై చంద్రబాబు రియాక్షన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గం వివాదంపై స్పందించారు.
ఎర్రచందనం ఎక్కడ దొరికినా ఇవ్వాల్సిందే: పవన్#TeluguPost #telugu #post #news
Visakhapatnam Emerges as India’s Next Big Investment Destination
Visakhapatnam is witnessing a rapid transformation after Google announced plans to set up a $15 billion data centre in the city. Once known mainly as a serene coastal destination, the city is now emerging as a new hub for business and technology. Companies that once viewed Visakhapatnam as a seaside retreat are now recognising it […] The post Visakhapatnam Emerges as India’s Next Big Investment Destination appeared first on Telugu360 .
The Great Pre-Wedding Show: Boost Needed
Along with several Telugu releases, The Great Pre-Wedding Show is a small attempt that released yesterday in a limited number of screens. Masooda fame Thiruveer is the lead actor and the film is a satire on the pre-wedding shoots. The word of mouth is decent and the film needs a big boost. The makers have […] The post The Great Pre-Wedding Show: Boost Needed appeared first on Telugu360 .
ఒటిటిలోకి ‘ది బెంగాల్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వివేక్ అగ్నిహోత్రి.. తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ వంటి వివాదాస్పద చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మరణం వెనుక జరిగిన కుట్రలపై తాష్కెంట్ ఫైల్స్.. 1990లో జమ్మూ కశ్మీర్లో చెలరేగిన తిరుగుబాట్లపై కశ్మీర్ ఫైల్స్ని ఆయన తెరకెక్కించాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. 1946లో బెంగాల్లో చెలరేగిన అల్లర్ల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివేక్ అగ్నిహోత్రి ట్రయాలజీలో ఇది చివరి సినిమా. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివి గల ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్ అంత సక్సెస్ సాధించలేకపోయింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో విడుదలకు సిద్ధమైంది. గత రెండు చిత్రాల్లానే ఈ చిత్రం కూడా జి-5లో నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జి-5 పోస్టర్ని పంచుకుంది.
Jubilee Hills Bye Election : రేవంత్ రెడ్డికే అసలు పరీక్ష.. అందుకే సర్వశక్తులూ ఒడ్డి?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ అని చెప్పాలి
ఆటోలో యువతితో రొమాన్స్ వీడియో వైరల్ #ViralVideo #Hyderabad #Chaderghat #PoliceAction #SocialMedia
India vs Australia : చివరి మ్యాచ్ వర్షార్షణం.. అయినా సిరీస్ భారత్ దే
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది
Premante Pelli Shuru Single: Perfect Wedding Song
Premante starring Priyadarshi, Anandi has made a good impression among audiences with melodious first single, glimpse and teaser. Now, the movie makers have released Pelli Shuru Single from the album composed by Leon James. Famous actress Sreeleela has digitally released it. The song sung by Shreya Ghosal, Deepak Blue presents the vibe of wedding in […] The post Premante Pelli Shuru Single: Perfect Wedding Song appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సజ్జనార్ కీలక ఆదేశాలు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలీంగ్ దృష్ట్యా హైదరాబాద్ కమీషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాలాంధ్ర గుడిబండ.. మండలంలోని తాళ్లకెర పంచాయతీలో గల గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శనివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి ల సమక్షంలో టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన చిత్తనగిరియప్ప, చిత్తయ్య, రంగస్వామి, మురళీధర్,చిత్రలింగప్ప,కరియన్న , కరియప్ప,ఈరన్న,చంద్రశేఖర్,కుమార్, తదితరులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిడిపిలో చేరి పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, మందలపల్లి రైతు సాకార సంఘం అధ్యక్షుడు మద్దనకుట్టప్ప,జిల్లా […] The post వైసీపీ నుండి టీడీపీలో చేరిక.. appeared first on Visalaandhra .
రాజమౌళిని తక్కువ అంచనా వేస్తున్నారా?#TeluguPost #telugu #post #news
విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి..
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు ఏఐఎస్ఎఫ్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు, నియోజకవర్గ కోశాధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెం.77ను రద్దు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పిపిపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ హాస్టళ్లలో […] The post విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి.. appeared first on Visalaandhra .
విజయ్ ని పెళ్లి చేసుకుంటా.. రష్మిక #Cinema #RashmikaMandanna #VijayDeverakonda #Tollywood #Trending
టీడీపీ తోనే బీసీ లకు పెద్దపీట.. భక్త కనకదాస జయంతి సభలో నారా లోకేష్
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని , రాయలసీమలో అధిక శాతం ఉన్న కురుబలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస 538వ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో శనివారం జరిగిన వేడుకల్లో పాల్గొన్న లోకేష్ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసేది టీడీపీనేనని, కురుబ పూజారులకు గౌరవ […] The post టీడీపీ తోనే బీసీ లకు పెద్దపీట.. భక్త కనకదాస జయంతి సభలో నారా లోకేష్ appeared first on Visalaandhra .
దేశంలో బిజెపి అరాచక పాలన కొనసాగిస్తోంది..
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం : దేశంలో బిజెపి పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నేటి బిజెపి పార్టీ అక్రమ ఓట్లతో అధికారం చేపట్టి అరాచక పాలన కొనసాగించడం దారుణమన్నారు. భారతదేశంలో శాశ్వతమైన సంస్కరణల కోసం ,ప్రజల కోసం ,దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని వారు గుర్తు చేశారు. […] The post దేశంలో బిజెపి అరాచక పాలన కొనసాగిస్తోంది.. appeared first on Visalaandhra .
కురుబల విజ్ఞాపనలకు సీఎం ఆమోదం.. భక్త కనకదాస జయంతి సభలో మంత్రి సవిత
త్వరలో బీసీలకు ఆదరణ–3 పథకం అమలు.. విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి బీసీలంతా అండగా నిలవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి సభలో మంత్రి సవిత మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో బీసీల పక్షపాతిగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ కు అభినందనలు. కురుబ కులం నీతి, నిజాయతీకి మారని . లోకేష్ పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారన్నారు. […] The post కురుబల విజ్ఞాపనలకు సీఎం ఆమోదం.. భక్త కనకదాస జయంతి సభలో మంత్రి సవిత appeared first on Visalaandhra .
రోగులకు సేవ చేయుట లోనే సంతృప్తి ఉంది
శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం; రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 200 మంది రోగులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను ఆసుపత్రిలోని వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. నేటి ఈ కార్యక్రమానికి సాయి సేవ (దాతగా) లో బి కే తులసమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారికి ప్రత్యేక […] The post రోగులకు సేవ చేయుట లోనే సంతృప్తి ఉంది appeared first on Visalaandhra .
మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం #TeluguPost #telugu #post #news
CM Chandrababu Naidu Issues Strong Directives to TDP MLAs
Andhra Pradesh Chief Minister and Telugu Desam Party (TDP) National President Nara Chandrababu Naidu has issued firm instructions to party MLAs. On Saturday, the Chief Minister visited the TDP headquarters in Amaravati, where he held an extensive meeting with party leaders and reviewed several key issues. During the review, CM Chandrababu expressed concern over reports […] The post CM Chandrababu Naidu Issues Strong Directives to TDP MLAs appeared first on Telugu360 .
బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పే: కవిత
హైదరాబాద్: వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిపై రోగుల ఒత్తిడి పెరిగిందని అన్నారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని కవిత సందర్శించారు. వరద బాదితులను పరామర్శించారు. తదుపరి హనుమకొండ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు, మంత్రులున్నా ఫలితం లేదని విమర్శించారు. ఆస్పత్రిని బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పేనని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో సమస్యలు తీరక.. ఇప్పుడూ తీరకపోతే ఎలా? అని కవిత ప్రశ్నించారు. తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాజకీయాలు ఎన్నికలు జరిగే చివరి ఏడాదిలో చేసుకుందాం అని తెలియజేశారు. తన పర్యటనల ద్వారా ప్రజలకు పైసా మేలు జరిగినా తన జన్మ ధన్యమైనట్లేనని కవిత పేర్కొన్నారు.
ఐదో టి-20 వర్షార్పణం.. సిరీస్ ఇండియాదే..
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరగాల్సిన ఐదో టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్లు భారత్కు శుభారంభాన్ని అందించారు. 4.5 ఓవర్లలో వీరిద్దరు కలిసి 52 పరుగులు చేశారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ అంతర్జాతీయ టి-20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (528) ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ ఫీట్ని అభిషేక్ 28 ఇన్నింగ్స్లో సాధించాడు. అప్పుడే ఆకాశం మేఘావృతం కావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత భారీగా వర్షం కురవడం మొదలైంది. చాలాసేపు నిరీక్షించిన తర్వాత మ్యాచ్ని రద్దు చేశారు. దీంతో ఈ సిరీస్లో 2-1 తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అభిషేక్ శర్మకే దక్కింది.
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు చూపించిన నేత్ర దాత
విశాలాంధ్ర ధర్మవరం; నేత్రదానముతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్రదాత తమ్మిశెట్టి నాగయ్య అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన తమ్మిశెట్టి నాగయ్య (80) మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు నేత్ర దానమునకు అంగీకరించడంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ కుళ్లాయప్ప, కంటి రెట్రైవల్ సెంటర్ సహకారంతో టెక్నీషియన్ రాఘవేంద్ర […] The post నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు చూపించిన నేత్ర దాత appeared first on Visalaandhra .
రేవంత్ రెడ్డి కుటుంబ వేడుకలో బాలయ్య #CMRevanthReddy #Balakrishna #Hyderabad #Telangana #Wedding
Kavitha Slams Revanth Reddy Over Fee Reimbursement Issue
Telangana Jagruthi President K. Kavitha has launched a strong attack on Chief Minister Revanth Reddy, accusing him of acting like a “street rowdy” towards private college managements. Speaking to the media in Hanamkonda during her Jana Baat padayatra, Kavitha criticized the Chief Minister for his recent remarks threatening private institutions over the delay in the […] The post Kavitha Slams Revanth Reddy Over Fee Reimbursement Issue appeared first on Telugu360 .
ఒలింపిక్స్లో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు లేనట్టే..!
128 ఏళ్ల తర్వాత 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పించిన విషయం తెలిసిందే. 1900లో చివరిసారిగా క్రికెట్ను ఒలింపిక్స్లో నిర్వహించారు. బ్రిటన్కు చెందిన సోమర్సెట్ వండరర్స్ క్లబ్, ఫ్రాన్స్కు చెందిన ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ రెండు రోజుల మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బ్రిటన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఒలింపిక్స్లో క్రికెట్ను జత చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇష్టపడే భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఐసిసి రూపొందించిన కొత్త రూల్స్తో భారత్-పాక్ మ్యాచ్ జరగడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దుబాయ్లో జరిగిన సమావేశంలో ఒలింపిక్స్లో క్రికెట్ గురించి ఐసిసి కొన్ని నిబంధనలు రూపొందించిందని కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్ల చొప్పున పురుషులు, మహిళలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. టి-20 ఫార్మాట్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ప్రాంతీయ అర్హతతో ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో టాప్లో ఉన్న జట్టును ఒలింపిక్స్కి నేరుగా పంపనున్నారు. ఐదో జట్టుగా ఆతిథ్య దేశానికి చోటు దక్కుతుంది. ఆరో జట్టును క్వాలిఫయర్ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఐసిసి ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ ఒలింపిక్స్కి ఆమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. దీంతో ఆ రెండు దేశాల్లో ఒక జట్టుకు ఐదో జట్టుగా చోటు దక్కనుంది. ఇక ఆరో స్థానం కోసం క్వాలిఫయర్ పోటీలపై త్వరలోనే ఐసిసి నుంచి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఒలింపిక్స్ గ్లోబల్ ఈవెంట్ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా ఐసిసి సమాలోచన చేస్తోంది. అందుకు ఒక్కో రీజియన్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్ రౌండ్కు పంపించే అవకాశం ఉంది. అలా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్ ప్రకారం పాక్కు ప్రాతినిథ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువ. అదే జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఉండకపోవచ్చు.
Andhra Prabha Smart Edition |తేజస్వీ ఓ పిల్లాడు/అత్తా కోడళ్ల దొంగా పోలీసు ఆట..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-11-2025, 4.00PM తేజస్వీ ఓ పిల్లాడు.. వదిలేస్తే రౌడీ
వెంకటేశ్వర పురం సెంటర్ లో కోటి సంతకాల సేకరణ
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: నెల్లూరు 53 వ డివిజన్ వెంకటేశ్వర పురం సెంటర్ లో డివిజన్ ఇన్ చార్జ్,వెంగళరెడ్డి కోఆర్డినేటర్పరంధామయ్య ల ఆధ్వర్యంలోరచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమా లు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికివైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరైపార్టీ నేతలకు డివిజన్ స్థాయి కమిటీలపై అవగాహనా కల్పించికమిటీలను త్వరగా పూర్తిచేయాలనిసూచించారు.అనంతరంకోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని గురించి ప్రజలకు వివరించారు.పలు […] The post వెంకటేశ్వర పురం సెంటర్ లో కోటి సంతకాల సేకరణ appeared first on Visalaandhra .
ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం : మహేష్ గౌడ్
హైదరాబాద్: ఇసిని గుప్పిట్లో ఉంచుకొని ఓట్ల అవకతవకలకు బిజెపి పాల్పడుతోందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికల సంఘాన్ని బిజెపి ప్రభావితం చేస్తోంది అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఓట్ల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని, హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని తెలియజేశారు. హరియాణాలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా బిజెపి గెలిచింది అని హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని విమర్శించారు. హరియాణాలో ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉన్నాయని, పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హరియాణాలో ఓటర్లుగా చేర్చారని మండిపడ్డారు. బిహార్ లో తమకు బలం లేని చోట్ల.. ఓట్లను బిజెపి తొలగిస్తోందని, ఇసిని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాధానం లేదు అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన ఇసి.. ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో 5 కోట్ల సంతకాలు సేకరణ జరిగిందని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారు అని ధ్వజమెత్తారు. బిజెపి, బిఆర్ఎస్ లోపాకారి ఒప్పందం వల్లే పక్క నియోజక వర్గాల ఓటర్లను చేర్చారని, సంతకాల సేకరణ పత్రాలను ట్రక్కుల ద్వారా తీసుకెళ్లి రాష్ట్రపతికి అందిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
బీహార్ లో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున నారా లోకేశ్ ప్రచారంరెండు రోజుల పాటు పాట్నాలో పర్యటించనున్న లోకేశ్ జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన ఉనికిని చాటుతోంది. ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అభ్యర్థులకు మద్దతుగా ఆయన రెండు రోజుల పాటు బీహార్లో పర్యటించనున్నారు.వివరాల ప్రకారం, శనివారం (నవంబర్ 8) మధ్యాహ్నం కల్యాణదుర్గం పర్యటన ముగించుకుని లోకేశ్ […] The post బీహార్ లో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం appeared first on Visalaandhra .
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಪಾನಿಪುರಿ ನೀರಿನಲ್ಲಿ ಇಲಿ ಸತ್ತಿರುವುದನ್ನು ನೋಡಬಹುದು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಪಾನಿಪುರಿ ನೀರಿನಲ್ಲಿ ಇಲಿ ಸತ್ತಿರುವುದನ್ನು ನೋಡಬಹುದು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
‘పెద్ది’ పాట సంచలనం.. విడుదలైన 24 గంటల్లోనే..
రామ్చరణ్, జాన్వీ కపూర్లు హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ ప్రాంతంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను రూపొందించారు బుచ్చిబాబు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ‘ఫస్ట్ షాట్’కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ని విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట సంచలనం సృష్టించింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డుల్లోకెక్కింది. 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి సాంగ్గా రికార్డు నెలకొల్పింది. అలాగే కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ సాధించింది. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించిన పాట రికార్డును ఇది బద్దలుకొట్టింది. అస్కార్ అవార్డు విజేత ఎఆర్ రహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ ఈ పాటకు లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఇప్పటికే ఈ పాటలోని స్టెప్స్పై కొందరు నెటిజన్లు రీల్స్ కూడా చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.
దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
ఉర్కొండ నవంబర్ 08, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ …
శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉత్కంఠ చెలరేగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే సమయంలో పలాసలో జీడి వ్యాపారిని కిడ్నాప్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ కార్యకర్త శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పలరాజు, గోపికి మద్దతుగా ఇచ్ఛాపురం వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు […] The post శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు appeared first on Visalaandhra .
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు.. రాష్ట్రపతి ఆమోదం
డిసెంబర్ 1 నుంచి 19 వరకు సెషన్ నిర్వహణ ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంఫలప్రదమైన చర్చ జరగాలని ఆశిస్తున్నట్టు కిరణ్ రిజిజు ట్వీట్పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ తేదీలను సోషల్ మీడియా […] The post పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు.. రాష్ట్రపతి ఆమోదం appeared first on Visalaandhra .
విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
రంగారెడ్డి జిల్లా, నవంబర్ 8 (జనం సాక్షి) మర్రిగూడ మండలం లోని అజిలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్, …
ఆందోళనలో రైతులు జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్
నెల్లూరులో టాప్ కాన్ సెల్ కంపెనీ రూ.1700 కోట్ల పెట్టుబడి .. విస్తరణకు
Ram Charan’s Peddi Chikiri Song creates All-Time Indian Cinema record
Mega Powerstar Ram Charan starrer Peddi has garnered huge anticipation and buzz with the first glimpse shot. Now, doubling it up to next level, the movie team have unveiled Chikiri Chikiri Song, composed by Legendary composer AR Rahman, yesterday. In 24 hours, the song has created All-India sensation with 46 Million plus views across four […] The post Ram Charan’s Peddi Chikiri Song creates All-Time Indian Cinema record appeared first on Telugu360 .
నో హెల్మెట్.. నో ఎంట్రీ వాహనదారులకు మళ్లీ ఆంక్షలు హెల్మెట్ ఉంటేనే బ్యారేజీ
బ్లాంకెట్, బెడ్ షీట్ అడిగిండని..లులో సోల్జర్ హత్య షాక్ #Crime #Rajasthan #Railway #NHRC #Soldier
Chiranjeevi’s MSG Song amasses biggest record views
Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi have come together for the first time for a wholesome entertainer, Mana Shankara Vara Prasad Garu. The movie is creating huge buzz and anticipation across India. Mainly, Meesala Pilla song has become an All-India rage. Showcasing graceful steps of Chiranjeevi in his most stylish avatar in recent times, […] The post Chiranjeevi’s MSG Song amasses biggest record views appeared first on Telugu360 .
వరంగల్ NITలో రికార్డు ప్లేస్మెంట్లు #NITWarangal #Placements #Education #Career #viralvideo
స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి డిగ్రీ మిత్ర బృందం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి
బిక్కనూర్, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం కు మంత్రి వాకిటి శ్రీహరి బర్త్ డే విషెస్
సీఎం కు మంత్రి వాకిటి శ్రీహరి బర్త్ డే విషెస్ మక్తల్, ఆంధ్రప్రభ
ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో దొంగలు రెచ్చిపోయారు. రాజారాంపల్లి
భద్రత కట్టుదిట్టం భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై సమీక్ష అమ్మ శీఘ్రదర్శనానికి అవసరమైన
Ys Jagan : జనంలోనే జగన్.. నిర్ణయం తీసుకుంది అందుకేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలకు మంచి స్పందన లభిస్తుండటంతో ఇక ప్రజల్లో ఉండాలని జగన్ ను నేతలు కోరుతున్నారు
యూట్యూబర్ నిర్మించిన మినీ వంతెన #Vizianagaram #YouTuber #Inspiration #SocialService #viralvideo
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
19 వరకు జరుగనున్న సెషన్స్ ఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. ఐసిసి కీలక నిర్ణయం..
ఆసియాకప్ ఫైనల్ జరిగి నెల రోజులు దాటినా.. టోర్నమెంట్ ట్రోఫీ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన భారత్.. ఎసిసి ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకొనేందుకు భారత క్రికెట్ జట్టు తిరస్కరించింది. నఖ్వీ కూడా ట్రోఫీ తానే ఇస్తానని పట్టుబట్టడంతో వివాదం కాస్త ముదిరింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసిసి ముందుకొచ్చింది. శుక్రవారం జరిగిన ఐసిసి బోర్డు సమావేశంలో బిసిసిఐ ఆసియాకప్ విషయాన్ని ప్రస్తావించింది. ఆసియా కప్ ట్రోఫీ తమకు అందేలా చూడాలని ఐసిసిని కోరింది. దీంతో ఐసిసి ఈ సమస్య పరిష్కారం కోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బిసిసిఐ, పిసిబి రెండింటితోనూ సత్సంబంధాలు కలిగిన ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీని ఈ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. ఐసిసి సమావేశానికి ముందు బిసిసిఐ నఖ్వీకి లేఖ రాసింది. ట్రోఫీ తమకు అందజేయాలని లేఖలో కోరింది. అయితే నవంబర్ 10న దుబాయ్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రోఫీని తానే అందిస్తానని నఖ్వీ సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను బిసిసిఐ తిరస్కరించింది. నఖ్వీ నుంచి నేరగా ట్రోఫీని తీసుకోవడానికి అంగీకరించమని బిసిసిఐ కార్యదర్శి సైకియా స్పష్టం చేశారు. అలా చేయడానికి జట్టు సిద్ధంగా ఉంటే ఫైనల్ జరిగిన వెంటనే ట్రోఫీ తీసుకొనేది కదా అని అన్నారు. ఈ నేపథ్యంలో ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించడానికి ఐసిసి మధ్యవర్తిత్వం చేస్తోంది.
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
జోగి రమేష్ కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శజిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
ఆటకు వర్షం అంతరాయం... టీమిండియా 52/0
బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టి20లో మ్యాచ్లో టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మ్యాచ్ జరుగుతుండగా వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. శుభ్మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు, అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అభిషేర్ శర్మ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 528 బంతుల్లో వెయ్యి పూర్తి పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ శర్మ రికార్డు సృష్టించారు. అభిషేక్ తరువాత వరసగా సూర్యకుమార్ యాదవ్ (573), ఫిల్ సాల్ట్ (599), గ్లెన్ మ్యాక్స్ వెల్(604), అండ్రూ రస్సెల్(609) బంతుల్లో 1000 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 28 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు.
మంగపేట నవంబర్ 08(జనంసాక్షి) గుట్ట రోడ్డు మార్గంలోని మూలమలుపుల వద్ద చెట్లను తొలగించాలి భక్తుల వాహనాలు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని …
అన్ని వర్గాలకు అండగా… కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలో హరితా
ఘనంగా పుట్టినరోజు వేడుకలు ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ రెవెన్యూ, గృహ
Pan-Indian Appreciation for Ram Charan
Global Star Ram Charan’s last film Game Changer was a disappointment. His next film Peddi has high hopes all over and the film has some of the best technicians on board. The first single ‘Chikiri Chikiri’ is winning the hearts all over the nation. AR Rahman has composed a catchy tune and Ram Charan added […] The post Pan-Indian Appreciation for Ram Charan appeared first on Telugu360 .
ఐదో టి-20 మ్యాచ్ టాస్.. మొదటి బ్యాటింగ్ ఎవరంటే..
బ్రిస్బేన్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా ది గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదో టి-20 జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో భారత్ విజయభేరి మోగించింది. దీంతో ఐదో మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ముఖ్యమైంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఒకవేళ ఆసీస్ గెలిస్తే.. సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పు చేసింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఆంధ్రప్రభ ప్రతినిధి ములుగు, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు.
Rashmika getting Wide Appreciation
After scoring several pan-Indian super hits, young beauty Rashmika Mandanna has done a small film The Girlfriend. The film is an emotional drama between two youngsters played by Deekshit Shetty and Rashmika. Rahul Ravindran is the director and Geetha Arts backed the project. The Girlfriend did not open on a strong note but the word […] The post Rashmika getting Wide Appreciation appeared first on Telugu360 .
సన్న బియ్యంతో పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం
సన్న బియ్యంతో పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశంలో
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపం..
నిలిచిపోయిన విమానాలు, ప్రయాణికుల ఆందోళనశంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది.అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్ని పూర్తిగా రద్దు చేయబడ్డాయి.హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దు కాగా,హైదరాబాద్-కౌలాలంపూర్,హైదరాబాద్-వియత్నాం విమానాలను సాంకేతిక లోపాల కారణంగా రద్దు చేశారు.అదనంగా, హైదరాబాద్-గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం కూడా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్బస్ 984 ఫ్లైట్ శుక్రవారం రాత్రి 11 […] The post శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపం.. appeared first on Visalaandhra .
పెద్దమ్మగుడిలో వరంగల్ కాంగ్రెస్ నేతల పూజలు
కరీమాబాద్, ఆంధ్రప్రభ : మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు ఆదేశానుసారం సీఎం
అందుకే నిధులు టంగుటూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. పలువురికి గాయాలు
రిథాల మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగాలీ బస్తీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి సహా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మంటల వేగం కారణంగా గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలిపోవడంతో […] The post దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. పలువురికి గాయాలు appeared first on Visalaandhra .
నెల్లూరు డీఆర్సీ సమావేశం ప్రారంభం
నెల్లూరు డీఆర్సీ సమావేశం ప్రారంభం నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు జెడ్పీ
కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల
నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : భక్త కనకదాసు గురించి నేటి యువత
అందుకే వాళ్లిద్దరూ బ్యాడ్ బ్రదర్స్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: హామీలు ఏం అమలు చేశారో సిఎం రేవంత్ రెడ్డి చెప్పరు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీల గురించి రేవంత్ రెడ్డి ఒక్కమాట మాట్లాడరు అని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీలు అమలులో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని, బిజెపి, బిఆర్ఎస్ కలిసిపోయాయని ప్రజల దృష్టి మళ్లించేందుకు తనపై, బిజెపిపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేశారు అని రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగినా.. భయపడను అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ తనకు అవసరం లేదు అని తెలంగాణ అభివృద్ధికి బిజెపి ఏం చేసిందో ప్రజలకు తెలుసు అని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ మాదిరి బిజెపి అవినీతి కుటుంబ పార్టీ కాదు అని ఇచ్చిన హామీలు అమలు చేయడమే బిజెపికి తెలుసు అని పేర్కొన్నారు. తమ పాలనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు అని ఫేక్ వీడియోలతో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్లు అవినీతిని బయటపెడతానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పారు అని అన్నారు. రూ. లక్ష కోట్లు కాదు కదా.. రూ. లక్ష కూడా వెలికి తీయలేదు అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది అని అన్నారు. రేవంత్ రెడ్డి నోటికి ఎదొస్తే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, భూముల కుంభకోణం కేసులు ఏమయ్యాయి? అని రేవంత్ రెడ్డి మాటలను మంత్రులైనా నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అని హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ దగా చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ. వేల కోట్లు వసూలు చేస్తోంది నిజం కాదా? అని ఇక్కడ వసూలు చేసి.. బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపడం వాస్తవం కాదా? అని నిలదీశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించేందుకు మనసు రాదా? అని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ కు తాను అడ్డుబడుతున్నానని తనపై నిందలు వేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపినప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి అసలు ఆర్ఆర్ఆర్ పై అవగాహన లేదు అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందో వివరించేందుకు తాను సిద్ధం అని సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్దిపై తన వివరణను వినే ధైర్యం మాజీ సిఎం కెసిఆర్, రేవంత్ రెడ్డికి ఉందా? అని కెసిఆర్ ను కాపాడుతుంది కాంగ్రెస్ హైకమండ్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు భయపడి రేవంత్ రెడ్డి..కెసిఆర్ పై చర్యలు తీసుకోవట్లేదు అని రేవంత్ రెడ్డిది ఫేక్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వమని విమర్శించారు. గతంలో కెసిఆర్ ది ఫ్రాడ్, ఫేక్, ఫాల్స్, ఫ్యామిలీ గవర్నమెంట్ అని మిగులు బడ్జెట్ తెలంగాణను కెసిఆర్, రేవంత్ రెడ్డి అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. బ్యాడ్ బ్రదర్స్ కెసిఆర్, రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని, మజ్లిస్ పార్టీని పెంచి పోషించి.. వాళ్ల కనుసైగల్లో నడిచే బ్యాడ్ బ్రదర్స్ కెసిఆర్, రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

23 C