حیدرآباد کی نجی ڈگری کالج میں امتحانات میں بڑے پیمانے پر نقل نویسی کے دعوے کے ساتھ وائرل ویڈیو گمراہ کن ہے۔ تحقیقات سے واضح ہوا کہ یہ کاغذات اسٹور روم سے گرے تھے، طلبہ نے کوئی نقل نویسی نہیں کی۔
డాలర్తో పోలిస్తే రూపాయి 89.95కి పతనం న్యూఢిల్లీ : అమెరికా డాలర్తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి ఆల్టైమ్ కనిష్టానికి పడిపోయింది. మంగళవారం నాడు డాలర్తో పోలిస్తే రూపాయి 42 పైసలు క్షీణించి 89.95కి పడిపోయింది. సోమవారం కనిష్టాన్ని కూడా దాటింది. దేశ జిడిపి 8.2 శాతం వృద్ధి నమోదైన వేళ రూపాయి భారీ పతనం ఆందోళన కలిగిస్తోంది. రూపాయి గత నెలలో 90 పైసలు క్షీణించగా, ఆరు నెలల్లో 4.4 శాతం పతనమైంది. అమెరికా సుంకాల ఉద్రిక్తత, వాణిజ్య చర్చలలో పురోగతి లేకపోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది. రూపాయి బలహీనతతో ముడి చమురు, బంగారం, యంత్రాలు, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
అన్నకు మరణ శాసనం రాసిన తమ్ముడు
చేసిన అప్పులు తీర్చడానికి సొంత అన్నను తమ్ముడు అతికిరాతంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేశ్ 3 సంవత్సరాల క్రితం రెండు టిప్పర్ లారీలను కొన్నాడు. వాటిని అద్దెకిస్తుండేవాడు, కాగా కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా నడవక ఈఎంఐలు కట్టడానికి అప్పులు చేశాడు. దీంతో పాటు షేర్ మార్కెట్ లోనూ పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రూ. 1.50 లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఇబ్బంది పెట్టడంతో తన అన్న మామిడి వెంకటేశ్ ను చంపాలని పథకం వేశాడు. తన అన్నను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించబోయి పోలీసులకు దొరికిపోయాడు. రెండు నెలల క్రితం తన అన్న వెంకటేశ్ పేరు మీద రూ.4.14 కోట్లకు బీమా పాలసీ తీసుకున్నాడు. అయితే అదును చూసి అన్నను చంపాలని చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో నముండ్ల రాకేష్ నరేష్ ను తనకు ఇవ్వాల్సిన రూ. 7 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. తన అన్నను చంపడానికి సహకరిస్తే రూ.7 లక్షలకు అదనంగా రూ.13 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షలు ఇసస్తానని రాకేశ్ ను ఒప్పించాడు. ఇందుకోసం టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను ఒప్పించారు. ప్రణాళిక ప్రకారం నవంబర్ 29న రాత్రి 11 గంటలకు గ్రామశివారులోని పెట్రోల్ బంక్ పక్కన రోడ్డుపై టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ప్రదీప్ నరేశ్ కు ఫోన్ చేసి చెప్పాడు. నరేశ్ తన అల్లుడు సాయి బైక్ పై వెంకటేశ్ ను ఎక్కించి టిప్పర్ వద్దకు పంపించాడు.వాళ్ల వెనకాలే నరేశ్ కూడి వెళ్లాడు. అక్కడకు వెళ్లక ప్రదీప్ వెంకటేశ్ ను టైర్ కింద జాకీ పెట్టమని చెప్పాడు. వెంకటేశ్ జాకీ పెడుతుండగా నరేశ్ టిప్పర్ ను ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేశ్ టైర్ కిందపడి సంఘటనా స్ధలంలోనే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమని పోలీసులను నమ్మించాడానికి డ్రైవర్ ప్రదీప్ ను పారిపోమ్మనాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని పోలీసులను నమ్మించాడు. అయితే బీమా సంస్ధకు చెందిన ఉద్యోగులకు నరేశ్ చెప్పె విధానంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నరేశ్ ను విచారించగా అసలు నిజం బయటపడింది. బీమా సోమ్ము కోసమే తన అన్న వెంకటేశ్ ను చంపానని పోలీసుల ఎదుట నరేశ్ ఒప్పుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నరేష్ తో పాటు డ్రైవర్ ప్రదీప్, రాకేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
కోల్కతా: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో బిహార్కు ప్రాతినిథ్యం వహించిన 14 ఏళ్ల సూర్యవంశీ 61 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ముస్తాక్ అలీ ట్రోఫీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నయా రికార్డును నెలకొల్పాడు. వైభవ్ 14 ఏళ్ల 250 రోజుల్లో శతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. విజయ్ 18 ఏళ్ల 118 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. కాగా, బిహార్తో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మాజీ సిఎం యడ్యూరప్పకు సుప్రీంలో ఊరట
కర్ణాటక మాజీ సిఎం , బీజేపీ సీనియర్ నేత బిఎస్యడ్యూరప్పకు సుప్రీం కోర్టు ఊరట నిచ్చింది.న ఆయనపై దాఖలైన పోక్సో కేసు విచారణపై స్టే విధించింది. పోక్సో చట్టం కింద చార్జిషీట్ను ట్రయల్ కోర్టు పరిగణన లోకి తీసుకోవడాన్ని సమర్ధిస్తూ , విచారణకు హాజరుకావాలని ఆదేశించిన కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ యడ్యూరప్ప స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఫిబ్రవరి18న ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టు యడ్యూరప్పతోపాటు ముగ్గురు నిందితులను మార్చి 15న తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలతోపాటు ఫిర్యాదు సైతం కొట్టి వేయాలని యడ్యూరప్ప హైకోర్టులో సవాల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించడంతో యడ్యూరప్ప సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
శ్రీలంకకు కాలం చెల్లిన వస్తువులను పంపిన పాక్
శ్రీలంక తుపాను బాధితులకు గడువు ముగిసిన వస్తువులను పాకిస్తాన్ సాయంగా పంపిందన్న వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ పంపిన ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబర్ లోనే ముగిసినట్టు తెలిసింది. వీటిని గమనించిన శ్రీలంక అధికారులు ఈ విషయాన్ని పాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అసంతృప్తి తెలియజేసినట్టు సమాచారం. 2015లో నేపాల్ భూకంపం సంఘటన సమయంలోనూ కొన్ని ఆహార పదార్థాలను పాకిస్తాన్ పంపించి వివాదానికి కారణమైంది. తాజా పరిణామాలపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఐర్లాండ్తో మంగళవారం జరిగిన మూడో, చివరి టి20లో ఆతిథ్య బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లా మూడు మ్యాచ్ల సిరీస్ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్గా దిగిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్టిర్లింగ్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్తో 38 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టిమ్ టెక్టర్ (17) పరుగులు చేశాడు. మిగతా వారిలో డాక్రెల్ (19), డెలాని (10) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ముస్తఫిజుర్, రిశాద్ మూడేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 13.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ 36 బంతుల్లోనే అజేయంగా 55 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సైఫ్ హసన్ (19) పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన పర్వేజ్ 33 పరుగులు చేసి నాటౌగా నిలిచాడు. దీంతో బంగ్లా అలవోక విజయంతో సిరీస్ను దక్కించుకుంది.
సిఎం వ్యాఖ్యలపై రేపు బిజెపి నిరసన ప్రదర్శనలు
మందు తాగే వారికో దేవుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వారికో దేవుడు ఉన్నారంటూ హిందూ దేవుళ్ళను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అవమానించారని బిజెపి రాష్ట్ర శాఖ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. మహిళా మోర్చా, యువ మోర్చా అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, సిఎం దిష్టి బొమ్మలు దగ్దం చేయనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తాను చెప్పిందే నిజమవుతున్నదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ సమాజం ఆలోచించాలని, విడిపోయి అవమానాన్ని దిగమింగుతారా, ఏకమై సత్తా చాటుతారా? అనేది హిందూ సమాజం ఆలోచించుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళను, హిందువులను అవమానించారని ఆయన మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నదని దీంతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషాన్ని నింపుకున్నదని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఏనాడూ ఇతర మతాలను కించపరచలేదని మంత్రి బండి సంజయ తెలిపారు.
ఇక 'సేవాతీర్థ్'గా ప్రధాన మంత్రి కార్యాలయం..
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఇకనుంచి సేవాతీర్థ్గా పిలవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా సౌత్బ్లాక్ లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండటం పరిపాటిగా వస్తోంది. ఇక ఆ కార్యాలయం కొత్త భవనం లోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే ఏపేరు మార్పుపై ప్రకటన వచ్చింది. రాజ్భవన్ పేరుతో కొనసాగుతోన్న గవర్నర్ల అధికారిక నివాసాలను ఇకపై “లోక్భవన్ ”గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ఇప్పటికే ఒడిశా, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాలను లోక్భవన్గా మార్చారు. మిగతా రాష్ట్రాలు కూడా పేరు మార్చాలని కేంద్రం నుంచి సూచనలు వచ్చాయి. వలసవాదానికి చిహ్నాలుగా ఉన్న పేర్లను తొలగించి ప్రజాస్వామ్య పంథాలో పేర్లను పెడుతున్నట్టు సమాచారం. సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ లోకి మార్చనున్నారు. వాయుభవన్కు పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్1 లో ఒక భవనాన్ని సేవాతీర్థ్1గా పిలవనున్నారు. దానిలో పిఎంవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన రెండు భవనాలు సేవాతీర్థ్ 2, సేవాతీర్థ్ 3 నుంచి క్యాబినెట్ సెక్రటేరియట్ జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం పనిచేయనున్నాయి. ఇప్పటికే ఎన్క్లేవ్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్యే స్వగ్రామమైన గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఏ …
శబరిమల భక్తుల కోసం 10 ప్రత్యేక రైళ్లు
శబరిమల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య 10 శబరిమల ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ నెల 13న సిర్పూర్ కాగజ్నగర్కొల్లం జంక్షన్(07117), ఈ నెల 17, 31 తేదీల్లో చర్లపల్లికొల్లం జంక్షన్(07119), ఈ నెల 20న చర్లపల్లికొల్లం జంక్షన్ (07121)చ 24న హుజూర్ సాహిబ్ నాందేడ్కొల్లం జంక్షన్ (07123), ఈ నెల 15న కొల్లం జంక్షన్చర్లపల్లి(07118), ఈ నెల 19, జనవరి 2 తేదీల్లో కొల్లాం జంక్షన్చర్లపల్లి (07120), ఈ నెల 12న కొల్లాం జంక్షన్చర్లపల్లి (07122), ఈ నెల 26న కొల్లాం జంక్షన్చర్లపల్లి(07124) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే నుండి బయలుదేరే సిర్పూర్ కాగజ్నగర్ కొల్లా జంక్షన్, చర్లపల్లి కొల్లాం జంక్షన్, చర్లపల్లి కొల్లాం జంక్షన్, హజరత్ సాహిబ్ నాందేడ్ కొల్లాం ప్రత్కేక రైళ్ల బుకింగ్ ఈ నెల 3నుండి ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. సిర్పూర్ కాగజ్నగర్ కొల్లా జంక్షన్ ప్రత్యేక రైలు బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోల్, నెల్లూర్, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూర్, కట్పడి, జోలార్ పెట్టాయి, సాలెమ్, ఈ రోడ్, తిరుపూర్, పొడనూర్, పలక్కాడ్, త్రిసూర్, ఆలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెన్గనూర్, కాయన్కులం జంక్షన్ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. చర్లపల్లి కొల్లాం ప్రత్యేక రైళ్లు సికిందరాబాద్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూర్, సేడమ్, యాద్గిర్, క్రిష్ణా, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట, తిరుపతి, చిత్తూర్, కట్పడి, జోలార్పెట్టాయి స్టేషన్లలో ఆగుతాయి.
ఎపిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఓ రివాల్వర్ కలకలం సృష్టించింది. శ్రీశైలం టోల్గేట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తనిఖీల్లో రివాల్వర్ బయటపడటంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఉత్పన్నమైంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 9 ఎమ్ఎమ్ పిస్టల్ రివాల్వర్ ఉండటం గమనించారు. వెంటనే వారు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులకు సమా చారం ఇచ్చారు. దీంతో, పోలీసులు రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తనను మధ్యప్రదేశ్కు చెందిన సైబర్ క్రైమ్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నానని ఆ వ్యక్తి తెలిపాడు. అతని వద్ద ఉన్న రివాల్వర్ లైసెనస్డ్ ఆయుధమని, అధికారిక కారణాలతో ప్రయాణిస్తున్నానని తెలిపాడు. శ్రీశైలం సిఐ ప్రసాద్రావు ఆ వ్యక్తి వద్ద ఉన్న ఐడి కార్డు, రివాల్వర్ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు నిర్వహించారు. మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పితో సంప్రదించి సదరు వ్యక్తి వివరాలు నిర్ధారించుకున్నారు. విచారణలో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు అతని రివాల్వర్, ఐడి కార్డులను తిరిగి అప్పగించారు. కొద్ది సేపు ఆందోళన కలిగించిన ఈ ఘటనలో ఆ రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తి నిజంగానే పోలీసు అధికారి అని తేలడంతో ఆ రివాల్వర్ ఉత్కంఠ వీడింది. దీంతో, భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
భారత్ ఆందోళనలు మాకు తెలుసు.. రష్యా కీలక వ్యాఖ్యలు
మాస్కో: వాణిజ్య లోటు విషయంలో భారత్ ఆందోళనలు తమకు తెలుసని, అందుకే దాన్ని సమతూకం చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన చేశారు. అలాగే ఉగ్రవాదంపై ఉమ్మడిగా కలిసి పోరాటం చేయడానికి సిద్ధమని తెలిపారు. దైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పుతిన్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో భారత్ష్య్రా సంబంధాలపై రష్యా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అమెరికా ఆంక్షల విధింపు ఎలా ఉన్నా భారత్కు రష్యా నుంచి చమురు సరఫరా తగ్గకుండా ప్రయత్నిస్తున్నట్టు పెస్కోవ్ తెలిపారు. భౌగోళిక రాజకీయాలకు అతీతంగా పనిచేసే ఒక వాణిజ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని రష్యా కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ సహకారాన్ని కూడా మరింత విస్తరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా మధ్యవర్తిత్వం చాలా ప్రభావవంతంగా ఉందని , వారి ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఈనెల 4,5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. భారత్పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల 23 వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
Nine out of Ten people loved our AKT – Ram
Energetic Star Ram Pothineni, Bhagyashri Borse, Upendra starrer Andhra King Teluka released recently and it got high critical positive recpetion and word-of-mouth from audienes. Mahesh Babu P has directed the film with Mythri Movie Makers prouducing it. The movie team have conducted Thank You Meet in Hyderabad. Mythri Ravi stated that the team have predicted […] The post Nine out of Ten people loved our AKT – Ram appeared first on Telugu360 .
UNANIMOUS : కొండపల్లి కో –ఆప్షన్ సభ్యులు
UNANIMOUS : కొండపల్లి కో – ఆప్షన్ సభ్యులు ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్
పార్లమెంట్లో ‘సంచార్సాథీ’ రగడ
ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన సెల్ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ : ‘సంచార్ సాథీ’ అంశం మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో సంచార్సాథీ యాప్ను ప్రీఇన్స్టాల్ (డిఫాల్ట్గా) చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలు మండిపడుతున్నాయి.పార్లమెంట్లో మంగళవారం ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రథానంగా కాంగ్రెస్, శివసేన, ఎంబిటి, టిఎంసి దీన్నితీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్ష కాంగ్రెస్ దీని మీద వాయిదా తీర్మానం దాఖలుచేసి సంచార్ సాథీపై విస్తృత చర్చ కావాలని డిమాండ్ చేసింది. సంచార్సాథీయాప్ , ఫోన్ యూజర్ల కదలికలను, మెసేజెస్ , కాల్స్ మానిటర్ చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దీనిని ఇదొక డిస్టోపియన్ టూల్ అని, ఇది ప్రతిభారతీయుడిని మానిటర్ చేయడమే కాకుండా, వారి ఆర్థిక హక్కులపై దాడిగా అభివర్ణించారు. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి దీనిపై వాయిదా తీర్మానం దాఖలు చేశారు. శివసేన యుబిటీ ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఇది ఒక దారుణమైన పరిణామమని, ఇది భవిష్యత్తులో నియంతృత్వానికి దారి తీస్తుందని, ప్రజల గోప్యతను హరిస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వంపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని విమర్శించారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సంచార్ సాథీ యాప్పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్ సాథీ మీద చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ఎజెండా ప్రకారం సెషన్లో 14 బిల్లులపై ఫోకస్ పెడదామని సూచించారు. అటు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కూడా దీనిపై స్పందించింది. సంచార్ సాథీ కేవలం ప్రజల సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదంది. ఈ యాప్ యూజర్ డేటా రక్షిస్తుందని తెలియజేసింది. ‘సంచార్ సాథీ’ యాప్పై కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ ఇచ్చారు. వినియోగదారులు అక్కర్లేదనుకుంటే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి యాప్ను డిలీట్ చేయవచ్చని చెప్పారు. ఇది ఐచ్ఛికమని అన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఈ యాప్ను ప్రవేశ పెట్టడం తన డ్యూటీ అని, డివైస్లో యాప్ ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుని ఇష్టమని తెలిపారు సెల్ఫోన్లో సంచార్ సాథీ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్ఫోన్లో తప్పనిసరిగా ‘సంచార్ సాథీ’ యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్స్టాల్ చేయాలని , మొదటిసారి డివైజ్ సెటప్ సమయం లోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యాపిల్, సామ్సంగ్, గూగుల్, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు భారత్లో హ్యాండ్సెట్లు తయారు చేస్తున్నాయి. వీటికి తాజా ఆదేశాలు వర్తిస్తాయి. సంచార్ సాథీ ఉత్తర్వును ప్రతిఘటించిన యాపిల్ ప్రతిసెల్ఫోన్లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలన్న టెలికాంశాఖ ఆదేశాలను పాటించడానికి యాపిల్ సంస్థ ముందుకు రావడం లేదని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేయడానికి సిద్ధమైంది. దీనివల్ల ప్రపంచం మొత్తం మీద తమ కంపెనీ యొక్క ఇకోసిస్టమ్లో గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు లేవనెత్తుతాయని కేంద్రానికి చెప్పాలనుకుంటోంది. యాపిల్ తన యాప్ స్టోర్ను దాని యాజమాన్య ఐఒఎస్సాఫ్ట్వేర్ను కట్టుదిట్టంగా నియంతిస్తుంటుంది. ఏటా 100 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఈ వ్యవస్థలు చాలా కీలకం. అయితే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడం కానీ లేదా ప్రభుత్వ వైఖరిని అనుసరించడం కానీ యాపిల్ చేయదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. శామ్సంగ్ వంటి సంస్తలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమీక్షిస్తున్నట్టు చెప్పాయి.
checking |ఇసుక టిప్పర్ పై కేసు నమోదు
checking | ఇసుక టిప్పర్ పై కేసు నమోదు Checking | నాగర్
మీతోనే…మేమూ.. ( ఆంధ్రప్రభ మైలవరం) ప్రజల వెతలు తీర్చడానికే నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా
గంజాయి బ్యాచ్ అరెస్ట్ ( గుడ్లవల్లేరు –, ఆంధ్రప్రభ) గుడ్లవల్లేరు పోలీసులు తొమ్మిది
ఇద్దరు దుర్మరణం ఓవర్ టేక్ .. బైక్ స్కిడ్ ( కర్నూలు, ఆంధ్రప్రభ
మందు తాగే వాళ్ళకో దేవుడు..: సిఎం రేవంత్ రెడ్డి
మందు తాగే వాళ్ళకో దేవుడు ఉన్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. మంగళవారం గాంధీ భవన్లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ డిసిసి నూతన అధ్యక్షులకు దిశా నిర్ధేశం చేశారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికే గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టే నిలబడిందని, లేకపోతే జనతా పార్టీలా, మరో పార్టీలా మూతపడేదని అన్నారు. “హిందువులకు ఎంత మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు?, మూడు కోట్ల మంది ఉన్నారా?” అని ఆయన అంటూ ‘పెళ్ళికాని వారికి హనుమంతుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికో దేవుడు, మందు తాగే వారికో దేవుడు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కల్లు పోయాలి, కోడి కోయాలి అనోటోళ్ళకు, పప్పు తినే వారికో దేవుడు ఉన్నారు..అవునా, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేవుళ్ళపైనే ఏకాభిప్రాయం లేదని, అలాగే డిసిసి అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం ఎలా తేగలమని అన్నారు. తాను సిఎం కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా మీరు కూడా కష్టపడాలని, కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమని ఆయన తెలిపారు. కాళ్ళలో కట్టే పెట్టే వారుంటారని ఆయన చెప్పారు. తాను ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేస్తున్నానని, అదిగో ముఖ్యమంత్రి బాల్ను కాలితో తన్నుతున్నారంటే ఎలా?, ఫుట్ బాల్ అంటేనే కాలితో తన్నుతారని ఆయన అన్నారు. ఆటలో బొర్లా పడతామని, పడగానే ఇక లేవరని అనుకోరాదని, పడగానే లేచి నిలబడే వాడే ఆటగాడని ఆయన తెలిపారు. రాజకీయాల్లోనూ అదే విధంగా ఉంటుంది కాబట్టి మీరంతా కష్టపడి పని చేయాలని డిసిసిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిత బోధ చేశారు.
తెలంగాణ రాజ్భవన్.. ఇకపై ‘లోక్భవన్’
తెలంగాణ రాజ్భవన్ పేరును లోక్భవన్గా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్భవన్లను లోక్భవన్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. వలస వాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా, రాజ్భవన్, రాజ్ నివాస్ల పేర్లను లోక్భవన్, లోక్నివాస్లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్భవన్లను లోక్భవన్లుగా మార్చారు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలంలో మంగళవారం తుపాకీ కలకలం సృష్టించింది. కౌటి=సాండ్గాం గ్రామానికి చెందిన ఓ యువకుడు డబ్బుల కోసం ఓ ఫెర్టిలైజర్ యజమాని తమ్ముడిని బెదిరించి తుపాకీతో కాల్పులకు పాల్పడినట్లు జిల్లా ఎస్పి నిఖిత పంత్ తెలిపారు. మంగళవారం కౌటాల సర్కిల్ కార్యాలయంలో కేసుకు సంబందించి వివరాలను ఆయన వెల్లడించారు. కౌటి=సాండ్గాం గ్రామానికి చెందిన కుర్బంకర్ అజయ్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్లో వీడియోలు చూసేవాడు. ఈ క్రమంలో జూన్ 12న రూ.50 లక్షలు తీసుకొని మహారాష్ట్రలోని చంద్రాపూర్ బస్టాండ్కు రావాలని, లేనిపక్షంలో చంపేస్తానని ఓ ఫెర్టిలైజర్ షాపు షట్టర్కు బోర్డు అంటించాడు. అయినా బాధితుడు స్పందించకపోవడంతో యూట్యూబ్లో తుపాకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని జులైలో బీహార్ వెళ్ల్లి రూ.55 వేలు చెల్లించి 1 పిస్తోలు, 2 మ్యాగజైన్లు, 20 బుల్లెట్లు, 1 తపంచాను తీసుకొచ్చాడు. అక్టోబర్ 10న బాధితుడి తమ్ముడు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆ యువకుడు మార్గమధ్యలో ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి ఆగకుండా వెళ్లడంతో బుల్లెట్ ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్ విచారణ జరిపారు. ఈ క్రమంలో మంగళవారం ఫెర్టిలైజర్ యజమాని లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా షాపునకు వస్తారని గ్రహించి వారిని తుపాకీతో కాల్చి చంపాలనే ఉద్దేశంతో పిస్తోలు, 3 బుల్లెట్లు తీసుకొని బైక్పై వెళ్తున్నాడు. అయితే, స్థానిక ఎన్నికల సందర్భంగా మార్గమధ్యలో పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో ఆ యువకుడు పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసును ఛేదించిన కాగజ్నగర్ డిఎస్పి వహీదుద్దిన్, కౌటాల సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసు సబ్బందిని ఎస్పి నిఖిత పంత్ అభినందించారు.
కుక్కల దాడిలో మూగ బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మన్సూరాబాద్ డివిజన్ శివగంగా కాలనీలో చోటు చేసుకుంది. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో తిరుపతిరావు, చంద్రకళ దంపతులకు కూమారుడు ప్రేంచంద్ (8) కి మాటలు రావు. తిరుపతిరావు మేస్త్రి పని చేసుకుంటూ శివగంగా కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు బాలుడిపై మూకుమ్మడిగా వీధి కుక్కలు దాడి చేయగా , బాలుడికి శరీరమంతా గాయాలైయ్యాయి. స్దానికులు గమనించి వెంటనే కుక్కలను అక్కడి నుంచి తరిమి వేశారు. వెంటనే తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
’అఖండ 2’లో కీలకమైన పాత్ర చేశా: సంయుక్త మీనన్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దర్శకుడు బోయపాటి శ్రీను చాలా గ్రేట్ విజన్తో ఈ సినిమా తీశారు. -ఈ సినిమాలో నా క్యారెక్టర్ ముఖ్యమైన సీక్వెన్స్లో చాలా కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ స్టయిలీష్గా ఉంటుంది. -హీరో బాలయ్య డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ లక్షణం నాకు చాలా నచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నింటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో పాటలు శివుడికి నివాళిలా ఉంటాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతలు రామ్, గోపి చాలా మంచి ప్రొడ్యూసర్స్. -ఇక ప్రస్తుతం స్వయంభు సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వా ‘నారి నారి నడుమ మురారి’లో నాది చాలా మంచి క్యారెక్టర్. అలాగే పూరితో వర్క్ చేయడం మంచి అనుభవాన్నిచ్చింది”అని అన్నారు.
Photos : Andhra King Taluka Movie Thanks Meet
The post Photos : Andhra King Taluka Movie Thanks Meet appeared first on Telugu360 .
traffic flow |స్పెషల్ డ్రైవ్..
traffic flow | స్పెషల్ డ్రైవ్.. traffic flow | విజయవాడ (క్రైమ్)ఆంధ్రప్రభ
Akhanda 2 Locks Rs 50 Lakh Deal for 5 Premiere shows
The makers of Akhanda 2 have applied for ticket hike and permissions for special shows along with paid premieres (on Thursday). The government of AP has granted hike and special permissions in AP and the permissions for the same will arrive in Telangana very soon. A record breaking deal for Akhanda 2 has been closed […] The post Akhanda 2 Locks Rs 50 Lakh Deal for 5 Premiere shows appeared first on Telugu360 .
sexual assault |రేపిస్టుకి 20 ఏళ్లు జైలు
sexual assault | రేపిస్టుకి 20 ఏళ్లు జైలు sexual assault |
GPO | ఈ జీపీవో మాకు వద్దు GPO | తాడ్వాయి, ఆంధ్ర
ఇమ్రాన్ సురక్షితంగానే ఉన్నారు.. కానీ: సోదరి ఉజ్మా
మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ కలిశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు. దీంతో పాకిస్తాన్ లోని అడియాలా జైలులో ఇమ్రాన్ ను ఆయన సోదరి ఉజ్మా కలిశారు. అనంతరం జైలు బయట ఆమె మీడియాతో మాట్లాడారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. కానీ ఆయనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. కాగా, జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిదే. ఆయనను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రావిల్పిండిలోని అడియాలా జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఆయనను కలిసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబంలోని ఒకరికి మాత్రమే అనుమతించడంతో ఇమ్రాన్ సోదరి ఉజ్మా జైలులోకి ఆయన వెళ్లి కలిశారు.
Grain | ధాన్యం కాంటా లేదు Grain | కూచిపూడి, ఆంధ్రప్రభ :
Railway Board |ప్రతి రైలు ఆపిస్తాం
Railway Board | ప్రతి రైలు ఆపిస్తాం Railway Board | శావల్యాపురం,
Dropout | చదువులమ్మగా.. Dropout | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో
AP Goes Big on Electric Future: Chandrababu Unveils Massive EV Push
Andhra Pradesh is gearing up for a major electric revolution. Chief Minister N. Chandrababu Naidu has announced an aggressive plan to transform public transport and modernise the state’s power sector. In a key review meeting with the Energy Department, Naidu directed that all APSRTC buses be converted to electric vehicles within five years. As the […] The post AP Goes Big on Electric Future: Chandrababu Unveils Massive EV Push appeared first on Telugu360 .
భూ దందా కోసం ప్రభుత్వం హిల్ట్ పాలసి తెచ్చింది: బండ ప్రకాష్
కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసం హిల్ట్ పాలసి తెచ్చిందని, ఇందుకోసం జిఒ విడుదల చేశారని బిఆర్ఎస్ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పేర్కొన్నారు. దాదాపు పది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే ఈ పాలసీ తెచ్చారని ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎంఎల్సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపి బడుగుల లింగయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ హయాంలో పరిశ్రమల స్థాపనకు టిఎస్ఐపాస్ తెచ్చి 15 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుందని తెలిపారు. పరిశ్రమలకు భూములు ఇచ్చే సమయంలోనే కాదు అమ్మేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయానలి, పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు లీజు భూములకు హిల్ట్ వర్తించదని చెబుతున్నారని, జిఒలో మాత్రం తొమ్మిది వేల ఎకరాలపైనే ప్రస్తావించారని అన్నారు.బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి ఇఒలు ఎపుడూ ఇవ్వలేదని, పారదర్శకమైన విధానం అమలు చేశామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ భాద్యత అని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఎట్లా..? అని ప్రశ్నించారు. ఒఆర్ఆర్ అవతలకు పరిశ్రమలు స్థాపింవే అవకాశం పారిశ్రామిక వేత్తలకు కల్పించాలని, బిడ్డింగ్ ద్వారా ఉపయోగంలో లేని పరిశ్రమల భూములను అమ్మాలని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ పద్దతి అమలవుతోందని చెప్పారు. హిల్ట్ పాలసీ రావడం వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో ఉపాధి కల్పించే పరిశ్రమలు రావడం లేదని అన్నారు. ఫిలిం యూనిట్లపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తప్ప మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం లేదని విమర్శించారు. ఎంఎల్సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విలువైన భూములు ప్రభుత్వ సంపద అని, ఈ సంపదను హిల్ట్ పేరుతో సిఎం, ఆయన ఆత్మీయులు కొల్లగొట్టే ప్రణాళిక వేశారని అన్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి భూ దందాలతో దోచుకో దాచుకో అనే విధానంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మండిపడ్డారు. బిసిలతో సహా అందరిని మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.
Minister | కూరగాయల ధరలపై ఆరా Minister | విజయవాడ (పటమట) ఆంధ్రప్రభ
2007లో రోహిత్ ఆ మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. నేను స్కూల్ లో ఉన్నా: బావుమా
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ ఆడుతున్న సమయంలో తాను స్కూల్ లో చదువుకుంటున్నానని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే బుధవారం రాయ్పూర్లో జరగనుంది. మొదటి వన్డేకు దూరమైన కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశారు. రెండో వన్డేకు ముందు రాయ్పూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బావుమా మాట్లాడుతూ.. 2007 T20 ప్రపంచ కప్ సమయంలో దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతున్నప్పుడు రోహిత్ ఆటను తాను మొదటిసారి చూశానని.. అప్పుడు తాను ఇంకా పాఠశాల విద్యార్థినేనని గుర్తుచేసుకున్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీలు ప్రపంచస్థాయి ఆటగాళ్లు. వీరిద్దరూ తిరిగి రావడంతో భారత జట్టు బలంగా మారింది. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించారు. వీరికి చాలా అనుభవం, నైపుణ్యం ఉంది. అయినా వారిని ఎదుర్కోవడం మాకు కొత్తేమీ కాదు. వారితో చాలా మ్యాచ్ లు ఆడాం. కొన్ని సార్లు పైచేయి కూడా సాధించాం. ఇవన్నీ సిరీస్ను మరింత ఉత్తేజకరంగా చేస్తాయి అని బావుమా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మొదటి వన్డేలో 39 బంతుల్లో 70 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను విజయం అంచుకు తీసుకెళ్లిన మార్కో జాన్సెన్ను బవుమా ప్రశంసించారు. కాగా, తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాగా, రోహిత్ అర్థసెంచరీతో రాణించాడు.
ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీశ్రావు దిట్ట: కడియం శ్రీహరి
బిఆర్ఎస్ అగ్ర నేత హరీశ్రావు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో దిట్ట అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. మంగళవారం మండలంలోని పల్లగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చే ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే హరీశ్రావు, కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఫాం హౌస్లు ఉన్నాయని.. కావాలనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్లకు పెంచారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు హరీశ్రావు సమాధానం చెప్పాలని అన్నారు. కవిత ఆరోపణలు చేస్తున్నా బిఆర్ఎస్ నాయకులంతా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి బిసిలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపిస్తే పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లును ఆమోదించిన 9వ షెడ్యూల్లో చేర్చితేనే రిజర్వేషన్ల అమలు సాధ్యమని తెలిపారు. దీనిని బిసి సంఘాల నాయకులు, ప్రజలు గమనించాలన్నారు. ఇదంతా తెలిసి కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామాలభివృద్ధి కుంటుపడుతుందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తానన్నారు. అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న నియోజకవర్గానికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో చిల్పూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
March fast |ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్..
March fast | ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్.. March fast |
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు
వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎక్సైజ్ సిబ్బంది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నానక్రాంగూడలో గంజాయి డాన్ నీతుబాయి ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమచారం రావడంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 786 గ్రాముల గంజాయి, 110 బీరు, బ్రిజర్, ఒక బైక్, రూ. 60,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్టిఎఫ్ బి టిం లీడర్ ప్రదీప్రావు , సిఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది దాడి నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్ను అరెస్టు చేశారు. ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను, గంజాయి, నగదును శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. కాగా, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మంగూరు బస్తీలో గంజాయి విక్రయిస్తున్న కాంబ్లె పరిమళ, ఎస్. బసంతిని అరెస్టు చేశారు. 1.2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు అక్కడ తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలోని విక్రయిస్తున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న మంగ్లీ నరేష్ అనే వ్యక్తిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 710 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్టిఎఫ్ సిబ్బంది నెహ్రూనగర్లో గంజాయి విక్రయిస్తుండగా ఎస్టిఎఫ్ సి టీం ఎస్సై మంజు, సిబ్బంది పట్టుకున్నారు.
కారు ఇంజన్ లోకి దూరిన నాగుపాము
కారు ఇంజన్ లోకి పాము దూరిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. తాటిపల్లి గ్రామనికి చెందిన చంద్రయ్య బుదేరాలోని ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా నాగుపాము కారు కిందకి వెళ్లి బయటకు రాలేదు. అది గమనించిన చంద్రయ్య వెంటనే కారు స్టార్ట్ చేశాడు. అయినా పాము బయటకు రాక కారు ఇంజన్ లోకి దూరింది. దీంతో చంద్రయ్య పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. పాములు పట్టే వ్యక్తి కారు వద్దకు వచ్చి గంటకు పైగా శ్రమించి కారు ఇంజన్ లోంచి పామును బయటకు తీశాడు.
Model School |ఆర్ధిక అక్షరాష్యతపై విద్యార్థులకు అవగాహన…
Model School | ఆర్ధిక అక్షరాష్యతపై విద్యార్థులకు అవగాహన… Model School |
Talent Test |విద్యార్థులకు టాలెంట్ టెస్ట్
Talent Test | విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ Talent Test | రెంజల్,
CPI |నిజాయితీ పరులను ఎన్నుకోవాలి…
CPI | నిజాయితీ పరులను ఎన్నుకోవాలి… CPI | జనగామ, ఆంధ్రప్రభ :
12 మంది విద్యార్థులకు అస్వస్థత
ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 12 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాలలోని ఎస్టి ప్రభుత్వ వసతి గృహం విద్యార్థులు ఉదయం ఉప్మా తిని పాఠశాలకు బయల్దేరారు. ప్రార్థన సమయంలో విద్యార్థులు ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయారు. గమనించిన పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్యం అందించిన అనంతరం విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందరికీ మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చామని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. హాస్టల్లో ఉదయం ఉప్మా చేయగా విద్యార్థులు టిఫిన్ చేయకపోవడంతోనే సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా హాస్టల్లో నాణ్యమైన భోజనం అందిస్తలేరని, పురుగుల అన్నం, ఉప్మాలో కూడా పురుగులు వస్తున్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు. జడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జి సరిత అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు, వార్డెన్కు సూచించారు.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్: లాభాలు రావాలంటే ఈ తప్పులు చేయొద్దు
స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ లాభాలే ఆశిస్తారు. కానీ, సరైన ప్రణాళిక లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే జాక్పాట్ కాదు. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక ప్రయాణం. మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకునే నేర్పు కూడా ఉండాలి. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ తగ్గించుకుని, సంపద సృష్టించుకోవడానికి పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు, అలాగే చేయకూడని తప్పుల […] The post స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్: లాభాలు రావాలంటే ఈ తప్పులు చేయొద్దు appeared first on Dear Urban .
పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు #Rajasthan #ViralWedding #RoadSafety #Helmets
Nominations |ఓట్లేసేందుకు కాదు…
Nominations | ఓట్లేసేందుకు కాదు… Nominations | నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఫోటోలో వరుసలో
జైల్లో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు సోదరికి అనుమతి..
మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన సోదరికి ఎట్టకేలకు అనుమతి లభించింది. జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాక్ లోని రావిల్పిండి జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారనేందుకు రుజువు కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. అడియాలా జైలు అధికారులు మంగళవారం మాజీ ప్రధానిని కలిసేందుకు ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ను అనుమతించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
Vision @ 2047 |అభివృద్ధిలో కలుద్దాం
Vision @ 2047 | అభివృద్ధిలో కలుద్దాం Vision @ 2047 |
WATER |ధర్మవరం రైతులకు తీపికబురు
WATER | ధర్మవరం రైతులకు తీపికబురు మంత్రి సత్యకుమార్ కీలక నిర్ణయంబత్తలపల్లి–తాడిమర్రి చెరువులకునీరు
GGH |కర్నూలు బ్లడ్ బ్యాంక్ బెస్ట్
GGH | కర్నూలు బ్లడ్ బ్యాంక్ బెస్ట్ ఏడాదిలో 11,531 యూనిట్ల రక్తం
Rs. 2,830 crores |కంట్రోల్ రూమ్ రెడీ
Rs. 2,830 crores | కంట్రోల్ రూమ్ రెడీ Rs. 2,830 crores
Rs.93 crore |ప్రగతికి పన్నులే పునాది
Rs.93 crore | ప్రగతికి పన్నులే పునాది Rs.93 crore | కర్నూలు,
Telangana : రాజకీయ గురువు వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెట్టాలనేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గడం లేదు.
హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజ్ భవన్ల పేరును లోక్ భవన్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచి పెట్టేందుకు రాజ్ భవన్, రాజ్ నివాస్ల పేర్లను లోక్ భవన్, లోక్ నివాస్లుగా మార్చే అంశాన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తే.. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో రాజ్ భవన్లను లోక్ భవన్లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.
POLICE | ఫోక్సో కేసు నమోదు POLICE | బయ్యారం, ఆంధ్రప్రభ :
unanimity |యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నిక
unanimity | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని సుంకెనపళ్లి(Sunkenapally) యూత్
టెస్లా కార్లపై ఆసక్తి చూపని భారతీయులు! #Tesla #IndianMarket #EVSales #Automobile #ElectricCars
Communication Skills |ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్
Communication Skills | ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ Communication Skills |
Perni Nani : చంద్రబాబు చేతులో అమరావతి రైతులు మోసపోయారు
అమరావతి రైతులు ఇప్పుడు జగనే నయమని భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు
Single Screen Theatre Culture Vanishing in India
Post-pandemic, the footfalls of Indian films have seen a steep decline. A section of the movie lovers and audience have turned selective and are watching a majority of the films on digital platforms. The multiplex culture has dominated the urban regions. Over the years, hundreds of multiplexes are launched in towns and semi-urban regions. The […] The post Single Screen Theatre Culture Vanishing in India appeared first on Telugu360 .
ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతాం: సిఎం రేవంత్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సిఎం కెసిఆర్ పై ఫైరయ్యారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందని.. అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ తమకు అప్పగించారని విమర్శించారు. అయినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో.. నేడు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో చర్చ పెట్టాలని సిఎం అన్నారు. డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని.. ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీను కెసిఆర్ కాలగర్భంలో కలిపారని మండిపడ్డారు. ఓయూను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెడతామని.. అంతేకాదు, ప్రపంచస్థాయిలో ఓయూను నిలబెడతాం సిఎం రేవంత్ తెలిపారు.
Revanth Reddy : ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే
దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
బెజ్జంకి రెవెన్యూ సిబ్బందికి యాక్సిడెంట్ #Karimnagar #Accident #RevenueStaff #RoadSafety #Police
Assessment Booklet |చదువుల జాతర..
Assessment Booklet | చదువుల జాతర.. Assessment Booklet | ఎన్టీఆర్ బ్యూరో,
Avanigadda |సకాలంలో ధాన్యం కొనుగోళ్లు
Avanigadda | సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించిన మండలి వెంకట్రామ్ Avanigadda |
Amaravathi : రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయిందిగా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలయింది
‘ది రాజాసాబ్’ లేటెస్ట్ అప్డేట్.. రన్టైం ఎంతంటే..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. రీసెంట్గా సినిమా నుంచి మొదటి సింగిల్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అది ఈ సినిమా రన్టైమ్ గురించి. సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు అన్ని మూడు గంటలపైనే రన్టైమ్ ఉంటున్నాయి. కానీ, మారుతి సినిమాలో అంత నిడివి ఉండవు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా మూడు గంటలపైనే అంటే.. దాదాపు 3 గంటల 14 నిమిషాల నిడివి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హారర్ కామెడీ చిత్రం కావడంతో సినిమా ఓ వైపు భయపెడుతూనే.. మరోవైపు ఆసాంతం నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ డిసెంబర్లోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.
Tributes |గుండెపోటుతో ఒకరు మృతి
Tributes| గుండెపోటుతో ఒకరు మృతి Tributes| చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని
Whatsapp |ఆన్లైన్లో దుర్గమ్మ ఆలయ సేవలు..
Whatsapp | ఆన్లైన్లో దుర్గమ్మ ఆలయ సేవలు.. Whatsapp | ఎన్టీఆర్ బ్యూరో,
Devotees |ఆన్లైన్లో దుర్గమ్మ ఆలయ సేవలు..
Devotees | ఆన్లైన్లో దుర్గమ్మ ఆలయ సేవలు.. ఇక అందుబాటులో వెబ్సైట్..నూతన సంస్కరణలకు
Check post | ములుగు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో
DJ Tillu fame Vimal Krishna’s Anumana Pakshi to release in February
Writer-director Vimal Krishna, who gained widespread acclaim with his blockbuster debut DJ Tillu, is back with his next unique entertainer, Anumana Pakshi. This upcoming film stars the talented young actor Rag Mayur and Merin Philip as the leading lady, promising a blend of humor and quirkiness. The project is produced by Chilaka Productions’ Rajiv Chilaka, […] The post DJ Tillu fame Vimal Krishna’s Anumana Pakshi to release in February appeared first on Telugu360 .
Polling |పూర్తయిన ర్యాండమైజేషన్ ప్రక్రియ
Polling | పూర్తయిన ర్యాండమైజేషన్ ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో జీ.పీ ఎన్నికల పోలింగ్
Triveni Sangha |భక్తికి మరో పేరు..
Triveni Sangha | భక్తికి మరో పేరు.. Triveni Sangha | జుక్కల్,
SPORTS |వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్
SPORTS | వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్ SPORTS | ఉట్నూర్,
ఫ్యూచర్సిటి ఎవరిని అడిగి కడుతున్నారు: రామచందర్రావు
హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే.. బిజెపిని భూస్థాపితం చేస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజమే రేవంత్ రెడ్డి సర్కార్ను భూస్థాపితం చేస్తుందని అన్నారు. ఇప్పటివరకూ కేంద్రం ఏ సిటీకి నిధులు ఆపలేదని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు గురించి రామ చందర్రావు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీం కోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని అన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని తెలిపారు. సంచార్ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమే అని.. ఏ యాప్ తెచ్చినా అది ప్రజల సంక్షేమం కోసమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్.. బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
చెలరేగిన హార్థిక్ పాండ్యా.. కమ్బ్యాక్ అదుర్స్
హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీం ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నమెంట్లో బరోడా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హార్థిక్, పంజాబ్తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (50, 19 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. అన్మోల్ప్రీత్ సింగ్ (69), నమన్ ధీర్(39) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా 19.1 ఓవర్లలో 224 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. హార్థిక్ పాండ్యా (77, 42 బంతుల్లో) అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చాడు. శివలిక్ శర్మ (47), విష్ణు సోలంకి(43) రాణించారు. దీంతో బరోడా ఈ టోర్నమెంట్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హార్థిక్ బ్యాటింగ్ చూస్తే.. సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్కి హార్థిక్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.
Helipad |సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
Helipad | నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం
Andhra Prabha Smart Edition|చిగ్గర్ పంజా/డీకే ఇంటికి/సేమ్ సీన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-12-2025, 4.00PM ఏపీలో చిగ్గర్ పంజా..వణుకుతున్న ప్రజలు బ్రేక్
విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయం ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా విశిష్టంగా భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు.వికాస తరంగాణి లో భాగంగా, చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బొబ్బిలి ఉషారాణి మరియు శ్రీ సాగరిక సమన్వయంతో చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలోని నీతి–మార్గదర్శక సూత్రాలను పిల్లలకు చేరువ చేయడం ఈ […] The post సంఘమిత్ర లో గీతా జయంతి appeared first on Visalaandhra .
Suicide Attempt |అన్న మద్దతు ఇవ్వలేదని…
Suicide Attempt | అన్న మద్దతు ఇవ్వలేదని… Suicide Attempt | నంగునూరు,
RANKS | గుడివాడలో జనసేన నిరసన RANKS | గుడివాడ, ఆంధ్రప్రభ :
ఐ టి డి పి అధ్యక్షులుగా కొత్తపల్లి భరత్
విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి భరత్ నియమితులయ్యారు సందర్భంగా కొత్తపల్లి భరత్ మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో చేసిన సేవలకు పార్టీ ఈ బాధ్యతలు అప్పగించడంతో చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఋణం తీర్చుకుంటానని తెలిపిన భరత్. The post ఐ టి డి పి అధ్యక్షులుగా కొత్తపల్లి భరత్ appeared first on Visalaandhra .
కౌశల్ సైన్స్ క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీలకు చైతన్య నగర్ విద్యార్థి ఎంపిక. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడి పాలెం గ్రామం చైతన్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి యజ్జల వీర వెంకట విజయ వర్ధన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ లో ప్రథమ స్థానం పొంది డిసెంబర్ 27వ తేదీన తిరుపతిలో జరిగే […] The post రాష్ట్ర స్థాయి పోటీలకు వర్ధన్ appeared first on Visalaandhra .
Meeting |పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోండి
Meeting | పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోండి Meeting | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ
Minister |కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి..
Minister | కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి.. Minister | చెన్నూర్,
Cases |స్క్రబ్ టైఫస్ విజృంభణ..
Cases | స్క్రబ్ టైఫస్ విజృంభణ.. ఆంధ్రప్రభ బ్యూరో, కర్నూలు : Cases

20 C