SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
...

Andhra Pradesh : నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. నిబంధనలివే

నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 23 Feb 2026 8:26 am

Vijay and Rashmika names it VIROSH

Actors Vijay Deverakonda and Rashmika Mandanna are set to get married on February 26th in a grand wedding in Udaipur. Despite speculations, the duo has been calm and did not make it official. Finally, on the night of February 22nd, the duo announced about their wedding. They named it ‘VIROSH’ and the duo revealed that […] The post Vijay and Rashmika names it VIROSH appeared first on Telugu360 .

తెలుగు 360 23 Feb 2026 8:13 am

T20 World Cup : దక్షిణాఫ్రికా దెబ్బకు చిత్తుగా ఓడిన టీం ఇండియా

టీం ఇండియా దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది.

తెలుగు పోస్ట్ 23 Feb 2026 8:07 am

ఎవరు లెక్కిస్తారు?

గాయాల అలల మధ్య జీవితం ఛిద్రమైన అద్దం కదలికల్లో ఉశ్చాస నిశ్వాసలు ఎవరు లెక్కిస్తారు? రాల్చిన కన్నీటి బొట్లను ఆడిన అబద్దాలను హింసించిన వ్రణాలను ఎవరు రుచి చూస్తారు? పోనీ- కూలిన జ్ఞాపకాలను కలల భవంతులను ఇళ్ళు కూలిన పునాదులను శిధిలాలను జనావాసాల్లో పేరుకున్న రక్తపు మడుగులను స్పందనల అలలను ఎవరు చూసి ఆనందిస్తారు? దుఃఖిత స్వరాల ఆర్తనాదం బుల్డోజర్ల రణగొణ ధ్వనుల సంగీతం చావు డప్పుల వెనక బతుకు నృత్యం దింపుడు కల్లం ఆశ బతుకుతుందా? అక్కడక్కడ దండు మూగుతున్నది వేల, వేల జులూసులుగా నిద్రలు నటిస్తున్న పిరికి వాళ్ళ చెవులు చిల్లులు పడేవరకు నృత్యం చేయాల్సిందే - హనీఫ్

మన తెలంగాణ 23 Feb 2026 7:55 am

తెలంగాణ శిల్పాల పరిణామం-జైనం

జైన ధర్మానికి సంబంధించిన శిలాశిల్పాలు, లోహ శిల్పాలు, మట్టిబొమ్మలు, వర్ణచిత్రాలు ప్రత్యేక ప్రతిమా లక్షణాలను కలిగివుంటాయి. జైనమతంలో తీర్థంకరులకే ప్రాథమ్యం. 24 మంది తీర్థంకరులు, వారి శాసనదేవతలు (యక్ష, యక్షిణులు), వారి పరివారంలో విద్యాధరులు, గణధరులు, గంధర్వులు, చామర ధారులు, పాదాలు, నిశీథులు కాక చౌముఖ, చౌవీసీ, స్థాపనాచార్య శిల్పాలు గణనీయమైనవి. (జైనరూపమండన) తీర్థంకరులు: జైనతీర్థంకరులు తలపై ముగ్గొడుగుతో (త్రిస్తరచ్ఛత్రాలు), వక్షం మీద శ్రీవత్సలాంఛనంతో, ఆజానుబాహువులతో, యవ్వనులుగా, ధ్యాన నిమగ్నులుగా, కాంతి పరివేషాలతో, నగ్నమూర్తులుగానే చెక్కబడతారు. తీర్థంకరుల లాంఛనాలే వారి గుర్తింపులు. తీర్థంకరులు దేవాదిదేవులుగా ‘దేవుళ్ళు’గా పిలువబడ్డారు. కాని, తీర్థంకరులు అచ్చంగా మానవ మూర్తులే. తెలంగాణాలో జైనాలయాల వాస్తు లక్షణాలు: తెలంగాణలోని జైన ఆర్కిటెక్చర్‌ను తొలి చారిత్రక దశ, మధ్యయుగ దశ, అనంతర దశలని విభజించవచ్చు. తొలి దశలో ఇటికెల గుడులు, గుహాలయాలు, మధ్యయుగ దశలో జైనబసదులు, జైనాలయాలు, అనంతర దశలో మళ్ళీ జైనతీర్థాల పునరుద్ధరణ కనిపిస్తుంది. తెలంగాణాలోని జైనబసదుల వాస్తు ప్రణాళికలలో అధిష్టానం, పాదవర్గం, ప్రస్త రం, శిఖరం, పైన కలశం అగుపిస్తాయి. వీటిలో ఏ కకూట, ద్వికూట, త్రికూటాలున్నాయి. జైనాలయాల విమానాలు ‘కదంబనాగర’ ఫంసానా శైలి లో పిరమిడ్ వలె సోపానాలతో నిర్మితమైనాయి. రాతిచిత్రాలలో జైనతీర్థంకరులు: జనగామ జిల్లా గోపరాజుపల్లి పెద్దగుట్ట రాతి చిత్రాలలో జైనతీర్థంకరుని తొక్కుడు బొమ్మ (Rockbruising) ఉంది. అదే జిల్లా సిద్దెంకి గుట్ట పక్కన రాతిగుండు మీద మహావీరుని పెట్రోగ్లైఫుం ది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి దానయ్య గుట్ట మీద 30 అడుగుల ఎత్తున్న తీర్థంకరుని చెక్కుడుబొమ్మ (Petroglyph) అగుపించింది. హన్మకొండ జిల్లా మెట్టుగుట్ట మీద ధర్మనాథతీర్థంకరుని పెట్రోగ్లైఫ్, వజ్ర చిహ్నం, నామసహితంగా చెక్కి ఉంది. నల్లగొండ జిల్లా అన్నీశ్వరమ్మ గుట్ట మీద ‘జినబ్రహ్మయోగి గురుపాద చారుకీర్తి’ అనే నామ శాసనముంది. సిద్ధిపేట జిల్లా వెల్కటూరు, పాత గూడూరులో రాతిమీద ధర్మనాథతీర్థంకరుని చెక్కుడుబొమ్మ, వజ్రచిహ్నం, పాదాలు, ‘జినబ్రహ్మజోగి’ నామశాస నం లభించాయి. కౌలాసులో ‘జినబ్రహ్మజోగి’ శాసనం లభించింది. ఇటికెల గుడులు: విష్ణుకుండినుల కాలంలో తెలంగాణాలోని కీసరగుట్ట, గుమ్మడం, ఆల్వాన్ ప ల్లిలలో జైనధర్మచైత్యాలు ఇటికెల గుడులుగా నిర్మించబడ్డాయి. వనపర్తి జిల్లా గుమ్మడంలో ఇటికెలగుడి సర్వతోభద్ర జినాలయమని చరిత్రకారుల అభిప్రాయం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల-, కల్వకుర్తి రోడ్డు పక్కన అల్వాన్ పల్లిలోని జైనుల ఇటికెలగుడి గొల్లత్తగుడి. గొల్లత్తగుడి శిల్పాలు మహావీరుడు పిల్లలమర్రి మ్యూజియంలో, పార్శ్వనాథుడు హైద్రాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. రాతి గుహలు-జిన బసదులు: వికారాబాద్ జిల్లా ఎల్లకొండలోని గుట్టమీద సిద్ధుల గుహలు జినుల గుహలే. మొగిలచెర్ల ఏకవీరగుడి ముందర రెండు రాతి గుండ్లలో ఉన్నవి జైనమునులు సల్లేఖవ్రతమాచరించిన గుహలు. ఉల్బణ శిల్పాలు: యాదగిరి గుట్ట- భువనగిరి జిల్లా తుమ్మలగూడెం (ఇంద్రపాల నగరం) గుట్టమీద రణధీరజినాలయం అనే బసదిలో ఎతైన రాతిగుండ్ల మీద జైనతీర్థంకరుల ఉల్బణ శిల్పాలున్నాయి. జగిత్యాల జిల్లాలో కుర్క్యాలవృషభాద్రి వేములవాడ చాళుక్యు ల కాలంనాటి జైనబసది బొమ్మల గుట్టగా ప్రసిద్ధి. ఇక్కడ ఆద్యంత తీర్థంకరులు రుషభనాథుడు, మహావీరుడు, రుషభనాథుని శాసన దేవత చక్రేశ్వరి ఉల్బణ శిల్పాలు చెక్కి ఉన్నాయి. అక్కడే పంప సోదరుడు జినవల్లభుడు రచించిన త్రిభాషాశాసనం చెక్కబడ్డది. జనగామ జిల్లా సిద్దెంకి గుట్ట మీద రుషభనాథుడు, మహావీరులతో పాటు జైనయక్షిణి ఆమ్రకూష్మాండిని, పార్శ్వనాథుని శిల్పా లు చెక్కబడ్డాయి. సిద్ధిపేట జిల్లాలోని శనిగరంలో గొల్లత్తగుడి అనే జైన బసదిలో రాతి గుండుపై పా ర్శ్వనాథ, అంబికల శిల్పాలున్నాయి. కొమురవెల్లి లో మల్లన్న గుట్టకు సుపార్శ్వనాథుని ఉల్బణ శిల్పమున్నది. హన్మకొండ అగ్గలయ్య గుట్టమీద చెక్కిన 30అడుగుల శాంతినాథుని శిల్పముంది. తెలంగాణాలో మొదటి ఎతైన శిల్పం. ఇక్కడే గుహలో జైన మహావీరుని ధ్యానాసన శిల్పం ఉన్నది. అగ్గలయ్య గుట్టపై శాంతినాథ తీర్థంకరుడు: పద్మాక్షి గుట్టమీది గుడిలో నేమినాథ తీర్థంకరుడు, శాసన దేవతలైన సర్వంసహా, ఆమ్రకూష్మాండినుల అర్ధశిల్పాలున్నాయి. కడలాలయబసదిలోని ఆమ్రకూష్మాండినినే మార్చబడి ‘పద్మాక్షి’ అయిందిపుడు. సిద్ధిపేట జిల్లా బైరాంపల్లిలో అంగడి వీరన్న గుడిగా పిలువబడే జైనాలయం లలాటబింబం జినునిశిల్పం. జైనబసదులు: జైనంలోని ‘త్రిషష్టిశలాక పురుషుల’ పేరుమీద నిర్మించిన కొలనుపాకలోని వీరనారాయణ దేవాలయం, బోధన్ దేవల్- మసీదుగా పిలువబడుతున్న ఇంద్రనారాయణ దేవాలయం ప్రసిద్ధమైనవి. వేములవాడలోని శివాలయం 2వ అరికేసరి కొడుకు బద్దెగ గురువు సోమదేవసూరి కొరకు కట్టించిన శుభధామజినాలయం. అక్కడి గుడుల ప్రాంగణాల్లో కుప్పలుగా జైనశిల్పాలు అగుపిస్తాయి. బాసరలోని పాపహరమయ్య దేవర జైనబసది పాపహరేశ్వరాలయంగా మార్పుపొందింది. నారాయణపేట జిల్లా ఉజ్జిలికోటలో బద్దిజినాలయముంది. సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులో జైనశిల్పాల తయా రీ కేంద్రముండేది. పార్శ్వనాథ, మహావీర, చౌము ఖ, చౌవీసీ, రాశిచక్ర జైనశిల్పాలు హైద్రాబాద్ రాష్ట్ర మ్యూజియంలో, గోల్కొండ సమీపంలోని కెబి మ్యూజియంలో పెట్టబడ్డాయి. శైవుడు దేవరదాసమయ్య తాను పొట్ల చెరువులోని 500 జైన బసదులను కూల్చానని, జైనులను వధించానని చెప్పుకున్నట్టు పాల్కురికి సోమనాథుని ‘పండితారాథ్య చరిత్ర’ వల్ల తెలుస్తున్నది. కొలనుపాకలోని ఊబదిబ్బ మీద అక్క(జైన) బసదనే ‘అంబరకులతిలకబసది’ ఉంది. ముందర జైనమాన స్తంభముంది. జోగులాంబ -గద్వాల జిల్లా, పూడూరులో శివాలయం గా మార్చబడ్డ పల్లవజినాలయం ముందరున్న నగ్నజైన విగ్రహాలను ‘బయటిదేవర్లు’, జైనబొమ్మయ్యలంటారట. వరంగల్లు కోట ఆగ్నేయ దిశలో చతుర్వింశతి తీర్థంకరుల గుడి నిర్మాణం కనిపిస్తుంది. నేలశంభునిగుడిలో జైనశిల్పాల అవశేషా లు, పక్కనున్న మేడరాయని గుడిలో రంగ శిలలలో ఒకటి తీర్థంకరుని అభిషేకానికి (సమవసరణ), రెండవది రంగభోగానికని అంటారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. వర్ధమాన మహావీరుని శిల్పమున్న గుడితోనే ఆ వూరికి వర్ధమానపురమని (నాగర్ కర్నూల్ జిల్లా నందివడ్డెమాను) పేరొచ్చిందంటా రు. దేవాలయం బయట జైనశిల్పాలున్నాయి. కరీంనగర్ జిల్లా నగునూరు జంటగుళ్ళలో పార్శ్వనాథ, మహావీరుల శిల్పాలుండేవి. - శ్రీరామోజు హరగోపాల్ 

మన తెలంగాణ 23 Feb 2026 7:38 am

23 Feb2026 |తిరుమల సమాచారం..

23 Feb2026 | తిరుమల సమాచారం.. తిరుమలలో టోకెన్లులేని భక్తులకు

ప్రభ న్యూస్ 23 Feb 2026 7:28 am

70కోట్ల ఓటర్ల తొలగింపు

` తొమ్మిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర’ జాబితా విడుదల ` అత్యధికంగా గుజరాత్.. అత్యల్పంగా కేరళ ` తమిళనాడు, బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో ఇంకా పూర్తిగా …

జనం సాక్షి 23 Feb 2026 7:20 am

రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

` గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకుంది ` నీళ్ల విషయంలో రాజకీయాలొద్దు ` ఏపీతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం ` మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను …

జనం సాక్షి 23 Feb 2026 7:16 am

ഫാക്ട് ചെക്ക്: യുഎസ് ആഗോള തീരുവ, ഇന്ത്യക്ക് 28 ശതമാനം? വസ്തുതയെന്ത്

ഇന്ത്യ ഉൾപ്പെടെ ഏതു രാജ്യത്തുനിന്നും യുഎസിൽ എത്തുന്ന ഉൽപന്നങ്ങൾക്ക് ഇനി അടിസ്ഥാന തീരുവ 15 ശതമാനമായിരിക്കും

తెలుగు పోస్ట్ 23 Feb 2026 6:20 am

జలాలపై దాగుడు మూతల్లేవ్

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణలో నీటి హక్కుల విషయంలో ఎ ట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ములుగు జి ల్లాలోనీ కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం సమ్మక్క సాగర్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సందర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేంద ర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నా యక్‌లతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అనంతరం పంచాయతీ రా జ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించి, దేవాదు ల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ప్రాజె క్ట్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో ఒ క్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను కాపాడటంలో ప్రభు త్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. 2027 నవంబర్,డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నదీ జలాల అంశంపై ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు మానుకోవాలని సీఎం సూచించారు. వరుస ఎన్నికల్లో ప్రజల తీర్పులు చూసి అయినా బిఆర్‌ఎస్ నేతలు మారాలని హితవు పలికారు. పదేళ్లు వాళ్లేం చేశారో, రెండేళ్లుగా మేమేం చేస్తున్నామో.. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చుపెట్టారని, మిగతా వాటిని పట్టించుకోలేదని రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరపాలంటే నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు. సాగునీటి విస్తీర్ణాన్ని పెంచి రైతులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సీఎం పునరుద్ఘాటించారు.దేవాదుల ప్రాజెక్టు కు సంబంధించి జూన్ 2 తేదీ లోగా భూసేకరణకు రూ.600 కోట్ల నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. 2001 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి సీఎం చంద్రబాబు హయాంలో 6వేల కోట్ల అంచనాలతో ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు 2024 వరకు 14.500 కోట్ల వ్యయం అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయగా ,2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును 18.500 కోట్ల అంచనాలతో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.బడ్జెట్ లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకుంటామని ,మార్చి నెలలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలుపుతామని అన్నారు.రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకర కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. గోదావరి నది జలాల వినియోగంపై బడ్జెట్ సమావేశంలో చర్చించుకుందామని, ప్రతిపక్షాలు నది జలాల వినియోగంపై ఆరోపణలు చేయడం సరికాదని, చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం లేదని తెలిపారు. నదీ జలాల విషయంలో ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించినపుడు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కుంభమేళాను తలపించే గిరిజన జాతర మేడారంను విజయవంతంగా నిర్వహించుకున్నామని, మేడారంలో శాశ్వత నిర్మాణాలను చేపట్టుకుందామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయమని, భవిష్యత్‌లో ప్రమాదాలు జరుగకుండా,ప్రజలకు ఉపయోగ పడేలా నిర్మాణాల చేపడతామని అన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ,తెల్లం వెంకటరావు,పల్లా రాజేశ్వరరెడ్డి ,నీటి పారుదల ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 23 Feb 2026 6:00 am

నేడు కేబినెట్ భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సో మవారం సాయంత్రం సచివాలయంలో కీలక మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, రైతు భరోసా నిధులు, ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వాహణ తదితర కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారం ప్రారంభించి, 10 వర్కింగ్ డేస్ సమావేశాలను ని ర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన ట్టు అధికార వర్గాల సమాచారం. మున్సిపల్ ఎన్నికలలో ఉహించని విధం గా 90 శాతానికి పైగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను కైవసం చేసుకున్న ఊపులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ మాత్రం తాత్సారం చేయకుండా జడ్పిటీసీ, ఎంపిటీసీ ఎన్నికలను నిర్వహించాలని కూడా భావిస్తోం ది. పైగా మార్చి నెలాఖరులోగా ఈ  ఎన్నికలను నిర్వహించకపోతే వీటికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఒకవైపు, ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి ఎస్‌ఎస్‌సి పరీక్షలు మరోవైపు ఉండటంతో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జభర్జన పడుతోంది. ఈ అంశాన్ని మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీలో పార్టీ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులంతా సమావేశమైన సందర్భంగా మున్సిపల్ ఎన్నికల విజయపరంపరలో వెంటనే పంచాయతీరాజ్ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తోన్నట్టు చెప్పినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనకు పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. పంచాయతీరాజ్ వ్యవస్థ రద్దు సాధ్యం కాదు ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఇటీవల ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో వాస్తవం లేదని కాంగ్రెస్ వర్గాలు, అధికార వర్గాలు తోసిపుచ్చతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు గుర్తు చేస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో పార్టీపరంగా ఈ వర్గాలకు రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలలో తాము హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువే బీసీలకు అవకాశాలను కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయడం అంత సులభమైన విషయం కాదని, రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం దేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ గ్రామ, మండల, జిల్లా స్థాయిలు అమలులో ఉన్నాయి, దీనిని మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం , పార్లమెంటు ఆమోదం కూడా అవసరమవుతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వస్థాయిలో నిర్ణయం ద్వారా రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలను రద్దు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై కూడా.. పంచాయతీరాజ్ ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులను విడుదల చేయడం వల్ల ఈ ఎన్నికలలో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను వేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఇందిరమ్మ ఇళ్ల రెండవ దశ కార్యక్రమాన్ని కూడా ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందే ప్రారంభించడం కూడా కలిసివస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రిమండలి ఈ పథకంపై కూడా చర్చించి నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేండ్లు పూర్తి కావడంతో మిగతా హామీల అమలుకు కూడా శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోన్నట్టు ఢిల్లీ సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. వీటి అమలుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు కూడా మంత్రిమండలి ఆమోదించనున్నదని సమాచారం. ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్‌పైనా చర్చ ఈ కార్ రేస్ నిర్వహణలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో గత బీఆర్‌ఎ స్ ప్రభుత్వంలో మున్సిపల్‌శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతించడం, అలాగే అప్పటి హెచ్‌ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి అరవింద్ కూమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం (డీవోపిటి) తాజాగా అనుమతించిన తర్వాత జరగబోతున్న మంత్రిమండలి సమావేశం ఈ అంశాన్ని కూడా చర్చించబోతున్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అందరి విచారణలు పూర్తి కావడంతో తదుపరి చర్యలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు సమాచారం.

మన తెలంగాణ 23 Feb 2026 5:00 am

రేవంత్ ప్రతి అడుగులో రియల్ దందా

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుందని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూ ములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. ఎల్‌టిపిఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేశారని మండిపడ్డారు. ఫార్మాసిటీ కోసం కెసిఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూల్చి, భూములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. సిఎం జేబులు నింపుకోవడానికి చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాము పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న హైదర్‌షా కోట టిప్పుఖాన్ బ్రిడ్జి సమీపంలో మధుపార్క్ అపార్ట్‌మెంట్ బాధిత కుటుంబాలను ఆదివారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఇంఛార్జి కార్తీక్ రెడ్డిలతో కలిసి హరీష్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. హైదర్‌షా కోటలో మూసీ బాధిత కుటుంబాలకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు చేపడుతోందని.. అవసరమైతే కెసిఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు వస్తారని తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్క్రు గతంలో కెసిఆర్ మూడుసార్లు వచ్చారని ప్రస్తావించారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక్కడ మంచినీళ్లు లేక అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే, అప్పటికప్పుడు హెచ్‌ఎండబ్లూఎస్ అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేశారని, అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేయించి నీళ్లిచ్చారని గుర్తు చేశారు. సబిత ఇంద్రారెడ్డికి అపార్ట్‌మెంట్ వాసులు ఒక్క ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే రోడ్డు వేయించారని, నాడు మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సుధీర్ రెడ్డి మూసీని క్లీన్ చేయించి దోమల బెడద లేకుండా చేశారని అన్నారు. సిఎం రేవంత్ పేదల బతుకులను కూల్చవద్దని హితవు పలికారు. ఈ అపార్ట్‌మెంట్ వారిని కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెట్టొద్దని కోరారు. పేదలకు అండగా ఉండాలని కెసిఆర్ తమను ఇక్కడకు పంపించారని చెప్పారు. బిఆర్‌ఎస్ పాలసీ డాక్యుమెంట్ కోసం కెసిఆర్ ఇక్కడి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. కెసిఆర్ ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారని.. రేవంత్ మాత్రం కూల్చేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని భరోసా ఇచ్చారు. మూసీ ప్రక్షాళనపై ఒక విధానం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదని, పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ. 3800 కోట్లతో ఎస్‌టిపిలను నిర్మించి ఆ పని ప్రారంభించిందని తెలిపారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డిపిఆర్‌లను కూడా కెసిఆర్ ప్రభుత్వం తయారు చేయించిందని, అప్పుడు తమ ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదని చెప్పారు. హైదరాబాద్‌లో రేవంత్ సర్కార్ కూల్చాడాలు తప్ప ఏ ఒక్క నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు తాము సహకరిస్తామని.. కానీ పేదలను కష్టాల్గోకి నెట్టొద్దని కోరారు. పిల్లలకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని.. ఈ సమయంలో అపార్ట్‌మెంట్‌ను కూలిస్తే.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతారన్నారు. అసెంబ్లీలో అపార్ట్‌మెంట్ వాసుల తరఫున తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధుకు డబ్బుల్లేవని మండిపడ్డారు. గురుకులాల్లో అన్నం పెట్టక 162 మంది విద్యార్థులు చనిపోయారని, అడిగితే రాష్ట్రం దివాలా తీసిందని అంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో రూ. 100 కోట్లతో సిఎం క్యాంపు కార్యాలయం, రూ. 5 కోట్లతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడివి..? అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్లకు 20,000 కోట్లు బిల్లులు ఇచ్చారని, ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని హరీష్‌రావు ప్రశ్నించారు. 

మన తెలంగాణ 23 Feb 2026 4:30 am

రాంచందర్‌రావు అరెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు రో జులుగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళేందుకు యత్నించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ దశలో పోలీసులకు-కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో తార్నాకలోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై అల్లరి మూకలు దాడి చేయడం, ఇంకా రెండు రోజులు గా అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం ఉదయం రాంచందర్ రావు బయలుదేరాలనుకున్నారు. అయితే ఈ వి షయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు తార్నాకలో ని ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసు అధికారులు రాంచంద్రరావు ఇంట్లోకి వెళ్ళి, బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున ఈ సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళడం శ్రేయస్కరం కాదని, మీరు వెళ్ళడం ద్వారా పరిస్థితులు మరింతగా ఉద్రిక్తమయ్యే అవకాశం ఉందని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా రాంచందర్ రావు వినిపించుకోలేదు, ప్రజాస్వామ్యంలో తాను స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళేందుకు అవకాశం ఉందన్నారు. తనను నిలువరించవద్దని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారని టివీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోసాగారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ఇంటి సమీపంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలిపి వేశారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. మరోవైపు ఇంట్లో గృహ నిర్భంధంలో ఉన్న రాంచందర్ రావు పోలీసు అధికారుల నుంచి తప్పించుకుని బయటకు వచ్చి వాహనంలో కామారెడ్డి (బాన్సువాడ) బయలుదేరేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బలవంతంగా రాంచందర్ రావును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళాలనుకున్నారు. ఈ దశలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. చివరకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అడ్డువచ్చిన పలువురు కార్యకర్తలనూ పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయనను విడుదల చేశారు. తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు.. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హిందువులపై, తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరిచారు. తమ పార్టీ ఎమ్మెల్యే నివాసంపై దాడి జరిగినందున సంఘీభావం తెలిపేందుకు తాను ఇంటి నుంచి బయలుదేరుతుండగా, పోలీసులు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. మజ్లీస్ చేతిలో సర్కార్ బందీ అయ్యిందని ఆయన దుయ్యబట్టారు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్లే సర్కారు నడుచుకుంటున్నదని ఆయన విమర్శించారు. తాము శాంతియుతంగా నిరసనకు పిలుపునిస్తే అన్యాయంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అల్లర్లు జరిగిన బాన్సువాడలో కేవలం హిందువులపైనే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహారించరాదని రాంచందర్ రావు సూచించారు. స్పందించిన కేంద్ర మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ బలపడుతుండడంతో భయపడుతున్న కాంగ్రెస్ అక్రమ అరెస్టులతో అణచి వేయాలని ప్రయత్నిస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ అరెస్టులను నిలిపి వేసి, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహంగా ప్రశ్నించారు. నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తు వచ్చేలా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్-మజ్లీస్ పార్టీలు కలిసే అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకోవడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడం అణచి వేయడానికి చేస్తున్న ప్రయత్నమని మహబూబ్‌నగర్ నియోజకవర్గం బిజెపి ఎంపీ డికె అరుణ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. తమ పార్టీ నాయకులను గృహ నిర్భంధం, కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా భయపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ విమర్శించారు. బాన్సువాడ ఘటనపై రాష్ట్ర డిజిపి స్వయంగా విచారణ జరపాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు కూడా సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన కోరారు. న్యాయం అడిగితే హిందువులపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మన తెలంగాణ 23 Feb 2026 4:00 am

భారీ ఉగ్రకుట్ర భగ్నం

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే -తోయిబా తో సంబంధం ఉన్న టెర్రరిస్ట్ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ కు చెందిన 8మంది అనుమానితులను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు పాకిస్తాన్ కేం ద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ -సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఇఎస్‌ఐ) బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ. విదేశీ టెర్రర్ గ్రూప్‌ల ఆదేశాలతో ఈ ముఠా భారతదేశంలో ఒక పెద్ద టెర్రరిస్ట్ దాడికి కుట్ర పన్నుతున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురిని, పశ్చిమ బెం గాల్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారు లు ఆదివారం తెలిపారు. తమిళనాడులో అరెస్ట్ అ యిన వారిలో మిజనూర్ రెహమాన్, మహ్మద్ ష బాత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్ ఉన్నారు. బెంగాల్ లో అరెస్ట్ అయిన వారు బంగ్లాదేశ్ జాతీయులు అని, నకిలీ ఆధార్ కార్డులు సేకరించి, తమ గుర్తింపు ను దాచేందుకు యత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మాడ్యూల్ కు లష్కరే తోయిబాతో లింక్ లు ఉన్నాయి. దాని నిర్వాహకుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి పని చేస్తున్న కశ్మీర్ వ్యక్తి షబ్బీర్ అహ్మద్‌లోన్‌గా గుర్తించారు. షబ్బీర్ అహ్మద్‌లోన్‌కు నేరుగా ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, లష్కరే కమాండర్ లఖ్వీతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అతడు పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ పొందాడని పోలీసులు తెలిపారు. తమిళనాడు, బెంగాల్ లో అరెస్ట్ అయిన 8 మంది అతడి సూచనల మేరకు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీలో రద్దీగా ఉండే కీలక ప్రదేశాలలో ముఖ్యంగా మతపరమైన సంస్థలు, వారసత్వ కట్టడాలలో భీకర పేలుళ్లు సృష్టించేందుకు టెర్రరిస్టు గ్రూప్ కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై, దేశరాజధాని అంతటా హై అలర్ట్ ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ అరెస్ట్ లు జరిగాయి. ముఖ్యంగా చాందీనీ చౌక్ ప్రాంతంలోని ఓ ఆలయంపైదాడి కి కుట్రపన్నే అవకాశం ఉందని హెచ్చరికలు అందాయి. అలాగే ఎర్రకోట సమీపంలో రద్దీప్రాంతాల్లో, సున్నితమైన ప్రదేశాలలో టెర్రరిస్ట్ లు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఐడి) దాడికి కుట్రపన్నుతున్నారని, నిర్దుష్టమైన సమాచారం అందిందని ఈ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సమయంలో అరెస్ట్ అయిన వ్యక్తులనుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డుల స్వాధీనం. వీటి ద్వారా డిజిటల్ ఆధారాలు, వారికి ఇతరులతో ఉన్న లింక్ లను కనిపెట్టేయత్నంలో పోలీసులు బిజీగా ఉన్నారు. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ఆన్ లైన్ పోస్ట్ లపై దర్యాప్తు తర్వాత మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు. ఆదేశాలు అందడంతో తమిళనాడు లోని తిరుప్పూర్ కు స్థానిక పోలీసులు స్థానిక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని చెక్ చేయగా, వారివద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు కనుగొన్నట్లు తమిళనాడులో ఆపరేషన్ పై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వివరించింది. దుండగులను పట్టి ఇచ్చిన ఫ్రీ కశ్మీర్ పోస్టర్! ఈ మధ్య ఢిల్లీ లోని దాదాపు పది ప్రదేశాలలో ఫ్రీ కశ్మీర్ అంటూ రెచ్చగొట్టే పోస్టర్లు చిక్కడంతో డొంక కదిలింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సూచనలతో ఢిల్లీ స్పెషల్ సెల్ ఆపరేషన్ మొదలు పెట్టింది. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్న నెట్ వర్క్ ను ఛేదించింది. ఫ్రీ కశ్మీర్ నినాదంతోపాటు రెచ్చగొట్టే పలు సూచనలు ఈ పోస్టర్లలో కన్పించాయి. దీంతో వీటిని అసలు ఎవరు ప్రచురీంచారని కూపీ లాగుతుండగా, తమిళనాడు నుంచి పని చేస్తున్న నెట్ వర్క్ అచూకీ తెలిసింది. ఫలితంగా అరెస్ట్ లు జరిగాయి.

మన తెలంగాణ 23 Feb 2026 3:30 am

సోమవారం రాశి ఫలాలు (23-02-2026)

మేషం ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. వృషభం చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. మిధునం ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. కర్కాటకం వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. సింహం బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. కన్య చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. తుల దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధు మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధిక ఫలితం తక్కువగా ఉంటుంది. వృశ్చికం నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మకరం వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు. కుంభం కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీనం కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

మన తెలంగాణ 23 Feb 2026 12:20 am

మాస్కో ఎయిర్‌పోర్టుల మూసివేత

ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ఇతర భద్రతా కారణాలతో మాస్కోలో సోమవారం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రాయాలను మూసివేశారు. మూసివేతకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రాజధాని మాస్కో పరిధిలోకి వచ్చే డోమోడెడోవో, వినుకోవో, జుకోవ్‌స్కీ, షెరెమిటైవో ఎయిర్‌పోర్టులలో పూర్తి స్థాయి వైమానిక ప్రయాణ ఆంక్షలు విధించారు. ఈ మేరకు రష్యా పౌర విమానాయాన సంస్థ రోసవియాట్సియా తెలిపింది. గంట వ్యవధిలోనే రష్యా వాయుసేన బలగాలు ఆదివారం మధ్యాహ్నానికి 11 ఉక్రెయిన్ డ్రోన్లను వేర్వేరు ప్రాంతాలలో నేలకూల్చాయి. కొన్ని శత్రు డ్రోన్లు మాస్కో గగనతలం వైపు దూసుకువస్తున్నట్లు తెలియడంతోనే భద్రతా కారణాలతో విమానాశ్రాయాలలో రాకపోకలను తదుపరి ప్రకటన వెలువడే వరకూ నిలిపివేసినట్లు వెల్లడైంది.

మన తెలంగాణ 22 Feb 2026 10:29 pm

మెడికో విద్యార్థిని బలవన్మరణం

మెడికో విద్యార్థినీ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని సురభి వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీ టౌన్ సిఐ టి.లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌బాద్‌కు చెందిన ఈద శ్రీజ (20)కు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామలే ఉన్నత చదువులు చదివించడానికి 2024లో ఎంసెట్ ఎంట్రెన్స్ ద్వారా సురభి వైద్య కళాశాలలో ఫిజియోథెరపీలో ప్రవేశం పొందింది. సురభి వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీజ గత మూడు రోజుల క్రితం పెద్దపల్లికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి మేనమామకు ఫోన్ చేసి మీ కోడలు, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకున్నామని, కానీ ఆమె వేరే ఎవరితో మాట్లాడుతుందని చెప్పినట్లు తెలిపారు. ఆదివారం శ్రీజ సురభి మెడికల్ కళాశాల బాలికల హాస్టల్లో గల రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయిందని సురభి యాజమాన్యం సమాచారం అందించినట్లు తెలిపారు. కోడలు శ్రీజ మృతి పట్ల పెద్దపల్లికి చెందిన శ్రీధర్‌పై అనుమానం ఉన్నట్లు శ్రీజ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మన తెలంగాణ 22 Feb 2026 10:20 pm

ఇంగ్లండ్ ఘన విజయం

టి20 ప్రపంచకప్ సూపర్8 సమరంలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూప్2 మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్ బౌలర్లు ఆరంభం నుంచే అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయారు. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (9), కామిల్ మిశ్రా (6)లను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కుసాల్ మెండిస్ (4), పవర్ రత్నాయకే (0), దునిత్ వెల్లలాగే (10)లు కూడా విఫలమయ్యారు. ఈ మూడు వికెట్లను కూడా విల్ జాక్స్ పడగొట్టాడు. కమిందు మెండిస్ (13) కూడా జట్టును ఆదుకోలేక పోయాడు. కెప్టెన్ శనక 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక టీమ్‌లో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ఇంగ్లీష్ బౌలర్లలో విల్ జాక్స్ మూడు, ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్‌లు రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆదుకున్నాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సాల్ట్ 40 బంతుల్లోనే 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. మిగతా వారిలో విల్ జాక్స్ (21), కెప్టెన్ హ్యారి బ్రూక్ (14), సామ్ కరన్ (11), ఓవర్టన్ (10)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును నమోదు చేశారు. లంక బౌలర్లలో వెల్లలాగే మూడు, దిల్షాన్, తీక్షణ రెండేసి వికెట్లను తీశారు.

మన తెలంగాణ 22 Feb 2026 10:16 pm

ఛాంపియన్ భారత్

మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో ఇండియాఎ టీమ్ 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ఎ టీమ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. ఒక దశలో 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమండియాను తేజాల్ హసబ్‌నీస్ ఆదుకుంది. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తేజాల్ 34 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వారిలో ఓపెనర్ వృందా దినేశ్ (19), కెప్టెన్ రాధా యాదవ్ (36) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా ఖాతున్ 4 వికెట్లను పడగొట్టింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ టీమ్ 19.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని సయితం నిలబెట్టుకుని భారత్‌కు ట్రోఫీ సాధించి పెట్టారు. ప్రేమ రావత్ 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీసింది. సోనియా, తనుజాకు రెండేసి వికెట్లు దక్కాయి. బంగ్లా బ్యాటర్లలో షమీమా సుల్తానా (20), సమ్రీన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాతిమా (14), సాదియా అక్తర్ (10) మాత్రమే కాస్త రాణించారు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు.

మన తెలంగాణ 22 Feb 2026 10:12 pm

చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లను సన్మానించిన నాయకులు…

చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లను సన్మానించిన నాయకులు… భీమ్‌గల్‌ రూరల్,ఆంధ్రప్రభ: ఇటీవల

ప్రభ న్యూస్ 22 Feb 2026 10:10 pm

సాంకేతిక లోపంతో కూలిన తేజాస్ జెట్

భారత వైమానిక దళానికి చెందిన మరో తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ సిఏ) కుప్పకూలింది. సాంకేతిక పరమైన లోపం వల్లే విమానం ప్రమాదం పాలైందని భావిస్తున్నారు. విమానం కుప్పకూలడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలైంది. సాంకేతిక పరమైన తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాదంలో పైలెట్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల ప్రారంభంలో ఒక కీలకమైన వైమానిక స్థావరంలోని ఆపరేషన్ ఏరియాలో పైలెట్ శిక్షణ కార్యక్రమం తర్వాత ల్యాండ్ అవుతుండగా, ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపం, బహుశా ఆన్ బోర్డ్ వ్యవస్థలో వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. భారత వైమానిక దళంలో తేజాస్ విమానాలు చేరిన తర్వాత కుప్పకూలిన మూడో జెట్ ఇది. విమానం తీవ్రంగా ఎయిర్ ఫ్రేమ్ దెబ్బతింది. అందువల్ల తేజాస్ జెట్ లను తాత్కాలికంగా ఉపసంహరించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 22 Feb 2026 10:09 pm

వేడుకగా గోదావరి హారతి..

వేడుకగా గోదావరి హారతి.. బాసర, ఆంధ్రప్రభ: బాసర పుణ్యక్షేత్రం పవిత్రమైన గోదావరి నది

ప్రభ న్యూస్ 22 Feb 2026 10:07 pm

మహిళ సంఘం భవనానికి సర్పంచ్ భూమి పూజ

మహిళ సంఘం భవనానికి సర్పంచ్ భూమి పూజ వెల్దండ, ఆంధ్ర ప్రభః నాగర్

ప్రభ న్యూస్ 22 Feb 2026 10:04 pm

ఇంట్లో మంటలు ..సిలిండర్ పేలుడు

 వాయవ్య ఢిల్లీలోని మజ్లిస్ పార్క్‌లో ఓ ఇంట్లో జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. ఆదివారం ఈ వరుస ఘటనల ముప్పు వాటిల్లింది. ఇక్కడి ఓ ఇంట్లో మంటలు చేలరేగాయి. సమాచారం అందుకుని మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులు యత్నించారు. ఈ సమయంలోనే ఇంట్లోని వంటగ్యాసు సిలిండర్ పేలింది. దీనితో ఆరుగురు పోలీసు, అగ్నిమాపక దళ సిబ్బంది, బిల్డింగ్ బయట నిలిచి ఉన్న ఇతరులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వైపు మంటలు తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ఫైరింజన్లు తరలివచ్చాయి. గాయపడ్డ వారిని ముందుగా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చాలా సేపు శ్రమించిన తరువాత మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ ఈ విపత్కర పరిస్థితి కొనసాగింది. దీనితో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

మన తెలంగాణ 22 Feb 2026 10:02 pm

అచ్చంపేటలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు..

అచ్చంపేటలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు.. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపుఎమ్మెల్యే వంశీకృష్ణ

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:59 pm

operation cannabis మిర్చితోట కాదు.. గంజాయి వ‌నం Andhra Prabha Crime News

operation cannabis మిర్చితోట కాదు.. గంజాయి వ‌నం Andhra Prabha Crime News

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:53 pm

ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష కుంటాల ,ఆంధ్రప్రభ: తెలంగాణ ఆదర్శ పాఠశాల

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:49 pm

గజ్జలమ్మ దేవి ఆలయంలో పూజలు

గజ్జలమ్మ దేవి ఆలయంలో పూజలు ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు కుంటాల, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:46 pm

సాగు నీరు ఇవ్వాలని రైతుల డిమాండ్

సాగు నీరు ఇవ్వాలని రైతుల డిమాండ్ కెనాల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:42 pm

ఆర్.జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఆఫీస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల

ఆర్.జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఆఫీస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల భీమ్‌గల్‌ రూరల్,ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:35 pm

Chintooru Accident : ఒక‌రు దుర్మ‌ర‌ణం.. Andhra Prabha News

Chintooru Accident : ఒక‌రు దుర్మ‌ర‌ణం.. Andhra Prabha News చింతూరులో ఘోర

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:26 pm

కోతులను పట్టించి అడవిలో వదిలేసిన సర్పంచి

కోతులను పట్టించి అడవిలో వదిలేసిన సర్పంచి జన్నారం,ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:23 pm

ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని సాంఘిక

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:19 pm

రోడ్డు భద్రత పై అవగాహన

రోడ్డు భద్రత పై అవగాహన ముధోల్,ఆంధ్రప్రభ : వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:16 pm

Police..Police : నందికొట్కూర్ లో.. పోలీస్ పోలీస్ Andhra Prabha News

Police..Police : నందికొట్కూర్ లో.. పోలీస్ పోలీస్ Andhra Prabha News కార్డన్

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:09 pm

కాంస్య పథకాలను అందుకున్న అక్షిత, శ్రీ గణేష్

కాంస్య పథకాలను అందుకున్న అక్షిత, శ్రీ గణేష్ రాష్ట్రస్థాయి మల్కంబు పోటీలో కాంస్య

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:08 pm

పెరిక కుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్

పెరిక కుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్ కడెం,ఆంధ్రప్రభః కడెం

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:02 pm

మంచినీటిని వృధా చేయరాదు..

మంచినీటిని వృధా చేయరాదు.. మంథని, ఆంధ్రప్రభః మంచినీటిని వృధా చేయరాదని, పట్టణ అభివృద్ధికి

ప్రభ న్యూస్ 22 Feb 2026 8:46 pm

రేవంత్ రెడ్డి తెలంగాణను ఎఐసిసికి ఎటిఎంలా మార్చారు: కెటిఆర్

సిఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను ఎఐసిసికి ఎటిఎంలా మార్చారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఎటిఎంలా మారిందని తాము గతంలో అనేకమార్లు హెచ్చరించిన విషయాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి ధారపోస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రైతన్నలకు, మహిళలకు, యువతకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని విమర్శించారు. అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు, కేవలం రెండేళ్ల కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయల భారీ అప్పులు తెచ్చిందని అన్నారు. కానీ, రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సాగుతున్న భూ దోపిడీపై స్పందిస్తూ, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్‌సియు విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని పేర్కొన్నారు. హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను అనుముల బ్రదర్స్ కలిసి అంబుక్క పడుతున్నారని, ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వనరులను లూటీ చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పాలనను ‘దండుపాళ్యం ముఠా’ తీరుతో పోల్చిన కెటిఆర్, తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం, తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్ రెడ్డి ఏకైక అజెండా అని ధ్వజమెత్తారు. ప్రజల కష్టార్జితాన్ని దారి మళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 22 Feb 2026 8:46 pm

దోపిడీ దొంగల హల్ చల్

దోపిడీ దొంగల హల్ చల్ 10 తులాల బంగారం , రూ :1,

ప్రభ న్యూస్ 22 Feb 2026 8:28 pm

America Cruelty |అమెరికా వీసాకు పత్తికొండ బిడ్డ బ‌లి Andhra Prabha Insight Story

America Cruelty | అమెరికా వీసాకు పత్తికొండ బిడ్డ బ‌లి Andhra Prabha

ప్రభ న్యూస్ 22 Feb 2026 8:20 pm

Bhumana Karunakar Reddy Alleges Political Conspiracy in Tirumala Parakamani and Ghee Adulteration Cases

Former TTD Chairman Bhumana Karunakar Reddy has made sharp allegations over the Tirumala Parakamani theft case and the laddu ghee adulteration controversy. Addressing the media at the YSR Congress Party office in Tirupati, he accused Chief Minister N. Chandrababu Naidu of attempting to reopen the Parakamani case with political motives. Bhumana claimed that the government […] The post Bhumana Karunakar Reddy Alleges Political Conspiracy in Tirumala Parakamani and Ghee Adulteration Cases appeared first on Telugu360 .

తెలుగు 360 22 Feb 2026 8:15 pm

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎసిబి నోటీసులు

మంగళగిరి మాజీ ఎంఎల్‌ఎ, వైసిపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎసిబి అధికారులు నోటీసులు అందజేశారు. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో భాగంగా, విజయ వాడలోని ఎసిబి కోర్టుకు హాజరై తన వాదనలను వినిపించాలని ఈ నోటీసుల్లో వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన కోర్టుకు హాజరు కావాలని అధి కారులు స్పష్టం చేయడంతో ఆ రోజు ఆర్కే కోర్టుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో మంగళ గిరి ఎంఎల్‌ఎ గా ఉన్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైంది. ఎపి సిఎం చంద్ర బాబు, మంత్రు లు నారా లోకేష్, పి. నారాయణ, కొంతమంది పారిశ్రామికవేత్తలు తమకు అనుకూలమైన వారి భూముల విలువ పెంచేలా రింగ్ రోడ్ అలైన్‌మెంట్ ను మార్చారని ఆర్కే ఆరోపించారు. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే, కేసు విచారణలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకు నే అవకాశం ఉందని అధికారులు సంకేతాలిచ్చారు. ఈ కేసులో ప్రధానంగా అలైన్‌మెంట్ మార్పు ద్వారా సుమారు 400 ఎకరాల భూమికి సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తు న్నాయి. తాజాగా ఎసిబి అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో గతంలో సిఐడి సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఇప్పుడు ఎసిబి కోర్టు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుండటంతో, ఫిర్యాదుదారుడిగా లేదా సాక్షిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వాంగ్మూ లం ఈ కేసులో కీలకంగా మారనుంది. రాజధాని అమరావతి భూముల కేటాయింపులు, క్విడ్ ప్రో కో ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం లో 27వ తేదీన జరిగే విచారణ అత్యంత కీలకం కానుంది.

మన తెలంగాణ 22 Feb 2026 8:12 pm

తెల్లవారితే వివాహం... అంతలోనే అక్కచెల్లెళ్లు ఆత్మహత్య

తెల్లవారితే వివాహం. ముస్తాబయిన కల్యాణ మంటపం. కుటుంబం పెళ్లి పనుల హడావుడిలో ఉండగా, ఆ అక్కచెల్లెళ్లు దారుణమైన చర్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చారు. కేవలం 25, 23 ఏళ్ల వయస్సులో ఉన్న అక్కచెల్లెళ్లు తమ పెళ్లికి ముందు రోజు రాత్రి విషాహారం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. జోధ్ పూర్ లోని మానై గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల శోభ, 23 ఏళ్ల విమల శనివారం నాడు ఉదయం వివాహం చేసుకోవలసి ఉంది. ఒకపక్క పెళ్లిపనులు జోరుగా సాగుతుండగా, శుక్రవారం రాత్రి అనూహ్యంగా విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగి పోయారు. అపస్మారక స్థితిలో పడిఉన్న బిడ్డలను గుర్తించిన కుటుంబసభ్యులు వారిని హుటాహుటిన జోధ్ పూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ ఇంట్లో వివాహ వేడుకలు కొనసాగాయని, అర్థరాత్రి సమయంలో అక్కచెల్లెళ్లు నిద్రపోతూ కన్పించారని, తెల్లవారు జామున 4 గంటల సమయంలో వారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు అదనపు పోలీసు కమిషనర్ రోషన్ మీనా తెలిపారు.కల్యాణం జరగాల్సిన ఇంట అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవల్సిన దుస్థితి ఏర్పడడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. వారి ఆత్మహత్యకు కారణం తెలియలేదు. ఇంట్లో ఎక్కడా ఎలాంటి సూసైడ్ నోట్ కన్పించలేదు. పోస్ట్ మార్టం అనంతరం వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారు.

మన తెలంగాణ 22 Feb 2026 8:07 pm

కాంగ్రెస్ నేతల దాడిలో పసికందు బలి.. దుర్మర్గం

కాంగ్రెస్ నేతల దాడిలో పసికందు బలి.. దుర్మర్గం న్యాయం చేయలేని రాష్ట్ర ప్రభుత్వం.మాజీ

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:57 pm

విద్యకు ఊపిరి పోసిన పాఠశాల గౌరవ గాథ..

విద్యకు ఊపిరి పోసిన పాఠశాల గౌరవ గాథ.. పేరూరు జడ్పీహెచ్ఎస్‌కు 75 ఏళ్లు…నాలుగవ

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:52 pm

ఆంధ్ర ప్రభ ఏఫెక్ట్…

ఆంధ్ర ప్రభ ఏఫెక్ట్… పైపు లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించిన అధికారులు కమ్మర్

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:46 pm

రోడ్లపై మిరప పచ్చళ్ళు.. అనార్యోగంతో కాలనీ వాసులు

రోడ్లపై మిరప పచ్చళ్ళు.. అనార్యోగంతో కాలనీ వాసులు పరకాల, ఆంధ్రప్రభ: పట్టణంలో రోడ్లపై

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:41 pm

కవల పిల్లల దినోత్సవం

కవల పిల్లల దినోత్సవం కరీమాబాద్,ఆంధ్రప్రభ; ఒకే ఇంట్లో కవల పిల్లలు ఒక బాలిక

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:33 pm

జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం

జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 45లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరగడంతో మూడు కార్లు దెబ్బతిన్నాయి. రోడ్డు నంబర్ 45లో అతివేగంగా ప్రయాణిస్తున్న ఫెరారీ కారు డివైడర్ అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి...రోడ్డుకు అవతల వైపు వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అవతిలివైపు ఉన్న కారును ఢీకొట్టగా, ఆ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో మూడు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఫెరారీ కార్ ముందు భాగం నుజ్జునుజ్జుఅయింది. కార్లు ఢీకొట్టిన ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాదం జరగడంతో రోడ్డు నంబర్ 45లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు ప్రమాదం వల్ల రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు, అదే విధంగా కేబుల్ బ్రిడ్జి నుంచి రోడ్ నంబర్ 45వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. వాహనదారులు ఈ మార్గాల్లో తప్పించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 22 Feb 2026 7:32 pm

కాంగ్రెస్ సిగ్గులేని మురికి రాజకీయాలు: పిఎం మోడీ

 మురికి రాజకీయాల కోసం గ్లోబల్ వేదికపై గొడవ చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఏఐ సమ్మిట్ సందర్భంగా కొందరు యువజనకాంగ్రెస్ కార్యకర్తలు షర్టులు విప్పేసి నిరసనకు దిగడంపై ప్రధాని మోడీ ఆదివారం స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారత మండపంలో దేశానికి ఖ్యాతి తెచ్చేలా సదస్సు ఏర్పాటు అయింది. అయితే ఇందులో కాంగ్రెస్ బురద రాజకీయాలకు దిగడం దారుణం అన్నారు. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం పరువు మర్యాద తీయడమే అయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యతో తన బురద రాజకీయాల నగ్నస్వరూపం చాటుకుందని మీరట్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దాదాపు రూ 12,930 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన తరువాత జరిగిన సభలో మాట్లాడారు. ఓ వైపు ఈ సదస్సుకు వేలాది మంది అంతర్జాతీయ ప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. ఈ దశలో ఈ వెర్రి చేష్టలు దేశాన్ని ఇరకాటంలోకి నెట్టాయని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు తీవ్ర స్థాయి చురకలు పెట్టారు. మీ నిజ స్వరూపం ప్రజలందరికీ తెలిసిందే. ఈ వికృత రూపం చూపడానికి మీరు బట్టలు విప్పేయాల్సిన అవసరం లేదు కదా? అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే గోతిలో పడి ఉన్న వారు అందరికీ తమ దుస్థితి తెలియచేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు పనికి మాలిన రాజకీయాల కోసం స్వదేశాన్నే దెబ్బతీసే పనిలో తీరిక లేకుండా ఉన్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలు చేసిన పనికి చింతించాల్సింది పోయి, ఈ పార్టీ నాయకులు సిగ్గుపడటానికి బదులు దేశాన్ని అవమానించిన వారిని వెనుకేసుకువస్తున్నారని, వారిని హీరోలుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఈ వేదికపై పనికి కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా చింతిస్తున్నాయని, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఎస్‌పి, టిఎంసి, డిఎంకె ఇతర పార్టీల నుంచి ప్రకటనలు వెలువడ్డాయని గుర్తు చేశారు. మీరట్‌లో ప్రధాని హాజరైన కార్యక్రమాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, పలువురు బిజెపి నేతలు హాజరయ్యారు.  

మన తెలంగాణ 22 Feb 2026 7:30 pm

కౌన్సిలర్ లావణ్య రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నేతలు

కౌన్సిలర్ లావణ్య రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నేతలు లావణ్య సురేందర్ రెడ్డి కౌన్సిలర్

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:29 pm

పాలడుగు యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

పాలడుగు యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక మోత్కూర్, ఆంధ్రప్రభః పాలడుగు యాదవ

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:25 pm

ఆఫ్ఘనిస్తాన్ లోని టెర్రర్ స్థావరాలపై పాక్ దాడులు

ఆఫ్ఘనిస్తాన్ లోని కనీసం ఏడు ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ ఆదివారం దాడులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, దీటుగా ప్రతీకారదాడులు చేయగలమని హెచ్చరించింది. శనివారం ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని బన్ను ప్రాంతంలో ఆఫ్గన్ స్థావరంగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ ఆత్మాహుతి దాడిలో ఓ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ , ఓ సైనికుడు మరణించడంతో పాకిస్తాన్ ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ లోని టెర్రరిస్ట్ శిబిరాలపై విరుచుకు పడింది.ఈ మధ్య ఇస్లామాబాద్ లోని షియా మసీదు, బజౌర్ , బన్నులలో ఒకొక్కటి , శనివారంనాడు తాజాగా బన్నులో టెర్రరిస్ట్ దాడులు జరిగాయి. ఈ దాడులు తామే చేశామని, ఆఫ్ఘనిస్తాన్ లోని ఫిట్నా- అల్ - ఖ్వారిజ్ (ఎఫ్ ఏకె), దాని అనుబంధ సంస్థలు , ఖోర్సాన్ ప్రావిన్స్ లోని పాకిస్తానీ తాలిబన్లు ప్రకటించుకున్నట్లు పాకిస్తాన్ సమాచార ప్రసారాల శాఖ వెల్లడించింది. ఫిత్నా -అల్ -ఖ్వారిజ్ అనేది గతంలో నిషేధించిన తెహ్రీక్ -ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) మారు పేరు గల సంస్థే. పాకిస్తాన్ లో ఉగ్రవాదకార్యకలాపాలు నిర్వహించే టెర్రర్ గ్రూప్ లు ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించుకోకుండా నిరోధించాలని పాకిస్తాన్ గతంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ సర్కార్ కు చెప్పినా, ప్రయోజనం లేకుండా పోయింది. తమ సరిహద్దు శివారుల్లోని టెర్రరిస్ట్ శిబిరాలపై చర్య తీసుకోవడంలో ఆఫ్ఘన్ ప్రభుత్వం విఫలమైందని పాక్ ఆరోపణ. కాగా, ఆదివారం నాడు ఆఫ్ఘనిస్తాన్ లోని పాక్టికా, నంగర్హార్ ప్రావిన్స్ లలో పాక్ చేసిన దాడులకు మున్ముందు తీవ్రస్థాయిలో దీటుగా ప్రతిస్పందన ఉంటుందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం హెచ్చరించింది.

మన తెలంగాణ 22 Feb 2026 7:19 pm

దోస్త్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం

దోస్త్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చెట్టును ఢీకొన్న కారుఅక్కడికక్కడే రెవిన్యూ ఉద్యోగి

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:15 pm

22ndFebCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

22ndFebCartoon| ముందు నుయ్యి.. వెనక గొయ్యి – రైతన్నకు గిట్టుబాటు ధర ఎప్పుడు?

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:11 pm

కుత్బుల్లాపూర్ రాజకీయంలో ఎండాకాలం ముందే మొదలైంది

ఎమ్మెల్యే సొంత బాబాయి కె.ఎం గౌరీష్, కుమారుడు గిరిధర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిక మన తెలంగాణ/జగద్గిరిగుట్ట: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో అనుకోని పరిణామం. బీఆర్‌ఎస్ స్థానిక ఎమ్మెల్యే కే.పీ వివేకానంద సొంత బాబాయి, మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన కుమారుడు గిరిధర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌరీష్ తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కుత్బుల్లాపూర్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు సమక్షంలో గౌరీష్‌కు పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గౌరీష్ వంటి సీనియర్ నాయకుడి చేరికతో కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చిందన్నారు. ఈ చేరికలో గణేష్ నగర్ డివిజన్‌కు చెందిన పలు బస్తీ అధ్యక్షులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 22 Feb 2026 7:10 pm

మహిళా శక్తిని జాగృతం చేస్తూ పథ సంచలన్

మహిళా శక్తిని జాగృతం చేస్తూ పథ సంచలన్ సంస్కారవంతమైన సమాజమే దేశానికి రక్షామహిళలు

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:07 pm

SAAP SPORTS |వావ్‌.. శాప్ సైక్లింగ్ః పంద‌డి Andhra Prabha News

SAAP SPORTS | వావ్‌.. శాప్ సైక్లింగ్ః పంద‌డి Andhra Prabha News

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:06 pm

అబ్బురపరిచిన స్వయం సేవకుల ప్రదర్శనలు

అబ్బురపరిచిన స్వయం సేవకుల ప్రదర్శనలు హిందువులు సంఘ శాఖలో సమయం కేటాయించాలిహిందూ జీవన

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:01 pm

జాయింట్ కలెక్టర్ కీమ్యా నాయక్ ని కలిసి యాకయ్య

జాయింట్ కలెక్టర్ కీమ్యా నాయక్ ని కలిసి యాకయ్య వనపర్తి జాయింట్ కలెక్టర్

ప్రభ న్యూస్ 22 Feb 2026 6:52 pm

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని వివేకానంద విద్యా

ప్రభ న్యూస్ 22 Feb 2026 6:48 pm

AA22: Big Unfold on April 8th

Icon Star Allu Arjun’s next film is a big-budget pan-Indian attempt and it is directed by Atlee. The film is almost half done with the shoot and the upcoming schedule commences tomorrow in Mumbai. In this social media era of leaks and speculations, there is no single leak about the film right from the genre […] The post AA22: Big Unfold on April 8th appeared first on Telugu360 .

తెలుగు 360 22 Feb 2026 6:45 pm

Samantha to entertain with Maa Inti Bangaram: Releasing on May 15th

Star heroine Samantha’s upcoming film Maa Inti Bangaram, the second venture from Tralala Moving Pictures, is gearing up for a grand worldwide theatrical release on May 15, 2026. After the impressive teaser, makers dropped the much-awaited update today. Maa Inti Bangaram is all set to entertain audiences this Summer. Headlined by Samantha alongside Diganth and […] The post Samantha to entertain with Maa Inti Bangaram: Releasing on May 15th appeared first on Telugu360 .

తెలుగు 360 22 Feb 2026 6:44 pm

நடிகை திரிஷாவுடன் தவெக தலைவர் விஜய் கோயிலுக்குச் சென்றாரா?

நடிகை திரிஷாவுடன் தவெக தலைவர் விஜய் கோயிலுக்குச் சென்றதாக பரவும் புகைப்படம் ஏஐ மூலம் உருவாக்கப்பட்டது

తెలుగు పోస్ట్ 22 Feb 2026 6:39 pm

కొడుక్కి హార్థిక్ అత్యంత ఖరీదైన గిఫ్ట్.. పక్కనే మాజీ భార్య

ముంబై: టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఐదేళ్ల అగస్త్యకు సుమారు రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ కారును బహుమానంగా ఇచ్చాడు. ముంబైలోని ఓ కారు షో రూంలో అగస్త్య ఈ కారు కీని అందుకున్నాడు. ఈ బహుమతి తీసుకుంటున్న సమయంలో పక్కనే అగస్త్య తల్లి, హార్థిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ కూడా పక్కనే ఉండటం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, హార్థిక్ 2020లో నటాషాని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు జన్మించాడు. అయితే 2024 వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా మహిక శర్మ‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆమెతో ఉన్న అనుబంధానికి గుర్తుగా హార్థిక్ తన మెడపై ‘ఎం’ అనే అక్షరాన్ని టాటూగా వేయించుకున్నాడు. అయితే ఇప్పుడు అగస్త్యకి హార్థిక్ ఇంత ఖరీదైన కానుక ఇవ్వడంపై కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘రిలేషన్‌షిప్ మహికతో.. కానుకలు మాత్రం నటాషాకా’’ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.

మన తెలంగాణ 22 Feb 2026 6:28 pm

2 Houses Smash |వీఆర్ పురంలో రెండిళ్లు ఆహుతి Andhra Prabha News

2 Houses Smash | వీఆర్ పురంలో రెండిళ్లు ఆహుతి Andhra Prabha

ప్రభ న్యూస్ 22 Feb 2026 6:19 pm

Chay’s Vrushakarma: BEYOND EXPECTATIONS

Vrushakarma is being made on the biggest budget of Chay’s career. Produced by BVSN Prasad under the SVCC banner, the film is mounted on a grand scale and promises a larger-than-life theatrical experience. After the huge success of Thandel, Chay is in top form. With strong confidence and momentum, he has taken up Vrushakarma, which […] The post Chay’s Vrushakarma: BEYOND EXPECTATIONS appeared first on Telugu360 .

తెలుగు 360 22 Feb 2026 6:18 pm

అక్రమంగా అవుల తరలింపు

అక్రమంగా అవుల తరలింపు లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ: ఎలాంటి అనుమతులు లేకుండా ఎద్దులను

ప్రభ న్యూస్ 22 Feb 2026 6:03 pm

చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కుమ్మెర మల్లన్న ఆలయంలో

ప్రభ న్యూస్ 22 Feb 2026 5:54 pm

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురికి తీవ్ర అస్వస్థత

రాజమండ్రి: నగరంలోని లాలాచెరువు ప్రాంతంలో పలువురు ఒకేసారి అనారోగ్యం పాలయ్యారు. స్థానిక చౌడేళ్వర నగర్, స్వరూప్ నగర్‌లలో బాధితులు అనారోగ్యంతో నాలుగు రోజు క్రితమే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారిలో కొందరికీ కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో రోజూ ఓ వ్యక్తి వచ్చి పాలు పోసేవాడని.. ఆ పాలు తాగిన వారంతా ఇలా అనారోగ్యం బారిన పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వైద్య శాఖ అధికారులు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో అనారోగ్యానికి కారణాలు వివరాలు సేకరిస్తున్నారు. కోరుకొండ మండలానికి చెందిన పాలు పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

మన తెలంగాణ 22 Feb 2026 5:53 pm

Sad Sunday |ఇబ్రహీంపట్నంలో విషాదం Andhra Prabha Crime News

Sad Sunday | ఇబ్రహీంపట్నంలో విషాదం Andhra Prabha Crime News Sad

ప్రభ న్యూస్ 22 Feb 2026 5:51 pm

దిల్ సుఖ్ నగర్‌లో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్

దిల్ సుఖ్ నగర్‌లో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్ దిల్

ప్రభ న్యూస్ 22 Feb 2026 5:49 pm

ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు..పదవీ విరమణ వరకూ

ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 22 Feb 2026 5:46 pm

బొగ్గుల శ్రీనివాస్ ది హత్యే

ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది హత్య ని ఖమ్మం పోలీసులు తెలిపారు

తెలుగు పోస్ట్ 22 Feb 2026 5:42 pm

Only Organic Farm ప్ర‌కృతి సాగుతోనే Andhra Prabha News..

Only Organic Farm ప్ర‌కృతి సాగుతోనే Andhra Prabha News.. ఆరోగ్య సిరులు…రైతుల‌కు

ప్రభ న్యూస్ 22 Feb 2026 5:32 pm

New Speculation on Jana Nayagan Release

Jana Nayagan was the most awaited Tamil film and the censor troubles have damaged the film big time. The film missed the Sankranthi holiday season and it was planned for release before the Tamil Nadu Assembly Elections. Jana Nayagan plan was perfectly crafted and the shoot was completed by August 2025. But the censor hurdles […] The post New Speculation on Jana Nayagan Release appeared first on Telugu360 .

తెలుగు 360 22 Feb 2026 5:23 pm

నంద్యాలలో కార్డన్ అండ్ సెర్చ్..

నంద్యాలలో కార్డన్ అండ్ సెర్చ్.. నేర నియంత్రణలో భాగంగా కార్డెన్ అండ్ సర్చ్

ప్రభ న్యూస్ 22 Feb 2026 5:05 pm

ఉయ్యాలవాడ అమ‌ర్ ర‌హే

ఉయ్యాలవాడ అమ‌ర్ ర‌హే సిపాయిల తిరుగుబాటుకు ముందే ..ఆంగ్లేయులపై స‌మ‌ర సింహ‌నాదం1847లోనే శిస్తులకు

ప్రభ న్యూస్ 22 Feb 2026 4:59 pm

ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. లాంఛనంగా ‘జై హనుమాన్’ ప్రారంభం

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జై హనుమాన్’ సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. హంపీ లోని అంజనాద్రి బెట్ట వేదికగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలకు సినిమాలో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న రిషబ్ శెట్టి తన సతీమణితో రాగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇతిహాసంతో కూడా సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలాకాలమే అయినప్పటికీ.. పట్టాలెక్కేందుకు ఇన్ని రోజులు పట్టింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ సినిమా కూడా భాగమే. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? దాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేశాడు.? అన్న నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆంజనేయస్వామిగా రిషబ్ శెట్టి నటిస్తుండగా.. ‘హను-మాన్’ సినిమాలో హనుమంతు పాత్రలో నటించిన తేజా సజ్జా ఈ సినిమాలోనూ అదే పాత్రలో కనిపించనున్నాడు. ఇక హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది.

మన తెలంగాణ 22 Feb 2026 4:59 pm

కుంభం ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ

కుంభం ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ

ప్రభ న్యూస్ 22 Feb 2026 4:57 pm

కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం

కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి

ప్రభ న్యూస్ 22 Feb 2026 4:46 pm

AP Government Extends Suspension of IPS Officer P. V. Sunil Kumar Until Retirement

The Andhra Pradesh government has extended the suspension of senior IPS officer P. V. Sunil Kumar, a 1993 batch officer of the AP cadre. The decision ensures that he will remain under suspension until the completion of the criminal investigation against him or until his retirement on June 30, 2026, whichever comes earlier. Sunil Kumar […] The post AP Government Extends Suspension of IPS Officer P. V. Sunil Kumar Until Retirement appeared first on Telugu360 .

తెలుగు 360 22 Feb 2026 4:33 pm

అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాం..

అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాం.. యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలువెబ్ సైట్

ప్రభ న్యూస్ 22 Feb 2026 4:32 pm

త్రాగునీరు కలుషితం… అధికారుల పర్యవేక్షణ లోపం

త్రాగునీరు కలుషితం… అధికారుల పర్యవేక్షణ లోపం కమ్మర్‌ పల్లి,ఆంధ్ర ప్రభ: కమ్మర్ పల్లి

ప్రభ న్యూస్ 22 Feb 2026 4:26 pm

దేవాదులకు చేరుకున్న సీఎం

దేవాదులకు చేరుకున్న సీఎం తుపాకుల గూడెం ఆంధ్ర ప్రభ: ములుగు జిల్లా కన్నాయి

ప్రభ న్యూస్ 22 Feb 2026 4:22 pm

ఘనంగా కందాల రంగారెడ్డి 41వ వర్ధంతి వేడుకలు..

ఘనంగా కందాల రంగారెడ్డి 41వ వర్ధంతి వేడుకలు.. చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 22 Feb 2026 4:17 pm

Urology PG Seats ఎస్ ఎంసీలో రెండు యూరాలజీ సీట్లు Andhra Prabha News

Urology PG Seats ఎస్ ఎంసీలో రెండు యూరాలజీ సీట్లు Andhra Prabha

ప్రభ న్యూస్ 22 Feb 2026 4:13 pm