మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్- ఇండియా మూవీ ఎస్వైజి (సంబరాల ఏటిగట్టు)తో ఇంతకు ముందెన్నడూ చూడని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్- ఇండియా బ్లాక్బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నెక్స్ లెవెల్లో రూపొందుతోంది. టీం ప్రస్తుతం భారీ, హై-ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా 20 కోట్లకు పైగా కేటాయించారు. 35 రోజుల షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్లు ఉన్నాయి. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ కెవిన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. యుద్ధభూమిని తలపించేలా రూపొందించిన క్లైమాక్స్ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం గుర్తు చేసేలా ఉండబోతుంది. ప్రేక్షకులకు విజువల్గా గ్రాండియర్ అనుభూతిని అందించేలా ఈ క్లైమాక్స్ను మలిచారు. సాయి దుర్గా తేజ్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్- ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న సంబరాల ఏటిగట్టు ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్గా నిలుస్తోంది.
01 Mar 2026 | తిరుమల సమాచారం : సర్వదర్శనానికి 12 -15
ఆయుతుల్లా ఆలి ఖమేనీ మృతి : ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడి తర్వాత ప్రకటన
ఇరాన్ సుప్రీం నేత ఆయుతుల్లా ఆలి ఖమేనీ మరణించారు
హార్డ్ హిట్టింగ్ సినిమాలు అందించడంలో పాపులరైన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. వైరల్ అయిన ఉయ్ అమ్మ ట్రాక్తో దేశవ్యాప్తంగా అలరించిన తర్వాత రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి.కిరణ్ నిర్మిస్తున్న శ్రీనివాస మంగాపురం ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో మంచి అంచనాలను సృష్టించింది. శనివారం మే కర్స్ ఈ చిత్రంలో మరో ప్రముఖ పాత్రను పరిచయం చేశారు. వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు ఫెరోషస్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. మోహన్ బాబు ఇప్పటికే టీమ్లో చేరగా, సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.
Iran vs Israel : ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్లో ఉత్కంఠ
ఇరాన్ నుంచి వరుసగా క్షిపణి దాడులు కొనసాగడంతో ఇజ్రాయిల్ ప్రజలు రోజంతా బంకర్లలోనే తలదాచుకోవాల్సి వచ్చింది
T20 World Cup : సెమీస్కు న్యూజిలాండ్.. పాకిస్థాన్కు గెలిచినా ఇంటికే
T20 World Cup : సెమీస్కు న్యూజిలాండ్.. పాకిస్థాన్కు గెలిచినా ఇంటికే
1MarSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
1MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో
1stMarch2026 |ఆదివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
1stMarch2026 | ఆదివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 1stMarch2026 |
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనంలో 21 మంది మృతి చెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాణాసంచా పేలుడు ధాటికి పంటపొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్ పరిశ్రమలో శనివారం సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అడబాల వీరబాబు అనే వ్యక్తి పొలాల్లో చదును చేసి ఈ బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరిపొలాల మధ్య ఎవరూ రాలేని ప్రాంతంలో ఈ బాణసంచా కేంద్రం ఏర్పాటు చేశాడు. తయారీ కేంద్రంలో రోజూ 34 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో అధిక సంఖ్యలో మహిళలు బాణసంచా తయారీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం తర్వాత బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించిందని, దాదాపు గంటకుపైగా పేలుళ్లు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిమితికి మించి బాణసంచా తయారుచేయడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంతగా శబ్ధం విన్నట్లు స్థానికులు చెబుతున్నారు. శబ్ధతీవ్రతకు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పక్క గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాల స్లాబ్కు పగుళ్లు వచ్చాయి. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల దాటికి ఐదు గ్రామాల పరిధిలో దట్టమయిన పొగ అలుముకుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునే సరికి చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించగా, కొందరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనలో 21 మంది చనిపోయినట్లు అధికారుల నిర్దారించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన పలువురు మంత్రులు చేరుకొని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించి అధికారులకు అవసరమయి ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలం వద్ద భీతావహంగా పరిస్థితి.. పేలుళ్ల ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొలాల మధ్య బాణసంచా తయారీ కేంద్రం ఉండటం అక్కడికి ఫైర్ ఇంజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేకపోవడంతో చాలాసేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. ఘటనా స్థలం వద్ద పరిస్థితి బీతావహంగా ఉంది. మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడి బాధితులను అతికష్టం మీద స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్
న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా …
దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్..
` ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది శనివారం రాజస్థాన్లో అజ్మేర్లో ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో …
బెంగాల్లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!
కోల్కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. గతేడాది ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో …
` బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ` ఘటనలో 21మంది మతి…పలువురికి గాయాయాలు ` సామర్లకోట సవిపంలోని వేట్ల పాలెం వద్ద ఘటన ` పేలుడు …
ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం
` మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ` బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత హైదరాబాద్(జనంసాక్షి): ఈ ప్రభుత్వం …
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక పేరుతో’ 99 రోజుల కార్యాచరణ ఉం టుందని, ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగో త యారు చేయించాలని, మార్చి 6వ తేదీ నుంచి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల ప్రణాళిక జరుగబోతుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపా రు. మార్చి 4వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో అందరి పనితీరు గురించి మాట్లాడుతానని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ 99 రోజుల్లో ఫైళ్ల క్లి యరెన్స్ తో పాటు అన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు ప్రతి శాఖ, ప్రతి జిల్లా, ప్రతి అధికారి మిషన్ మోడ్లో పనిచేయాలని సిఎం రేవంత్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఈ 99 రోజుల కార్యక్రమ పురోగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని సిఎం తెలిపారు. అధికారుల పనితీరు లోపాలను సహించబోమని సిఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు జయేష్ రంజన్ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని సిఎం ఆదేశించారు. కరెంట్ మీటర్, తమ ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులకు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని అన్నారు. వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చిందని, ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం ఉండాలని సూచించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు వారాల్లో కమిటీ తమ నివేదికను అందజేయాలని చెప్పారు. ప్రతి విబాగం ఈ ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ను అమలు చేయాలని, అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్ లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్ డేట్ చేసుకోవాలని చెప్పారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులోనూ సాంకేతికత ను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రారంభం రాష్ట్రంలోని వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఏఐ సమ్మిట్ సమావేశం నిర్వహణపై కొన్ని విమర్శలు వచ్చాయని, కానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని ఆయన తెలిపారు. ప్రణాళికా బద్ధంగా జీహెచ్ ఎంసిని మూడు కార్పొరేషన్లుగా విభజించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్లో చేపట్టాల్సిన కార్యాచరణపైన అధికారులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్యూర్ అర్బన్ రీజియన్ 10 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ రంగం విస్తరించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. శాఖలపై ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని, దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. సేవా రంగంలో వస్తున్న పెను మార్పులను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. శాఖలపైన ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదని, ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలో వాటిని చేర్చాలని సిఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపైన ప్రతి శాఖ దృష్టి పెట్టాలని, అధికారులు అప్రమత్తం గా ఉండాలని ఆయన సూచించారు. సర్వీస్ సెక్టార్ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ విధానంలో అన్ని పనులు జరిగేలా చూడాలని, ఈ ఫైల్ విధానం ఉండాలని, నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందేనని ఆయన తెలిపారు. వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని ఆయన సూచించారు. జూన్ 2వతేదీ తెలంగాణకు పండుగ పాత కాలం సర్వర్లను అప్డేట్ చేసుకోవాలని సిఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పైన దృష్టి పెట్టాలని, ఫ్యూచర్ సిటీ దేశ ఆర్ధిక స్థితినిని మార్చబోతోందని ఆయన తెలిపారు. మూసీనది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ వచ్చే మార్పులను ప్రజలకు వివరించాలని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ గవర్నెన్స్ పైన దృష్టి పెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడానికి దృష్టి సారించాలని ఆయన తెలిపారు. వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించుకోబోతున్నామని, ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడాలని, ప్రాంతాల వారీగా మెడికల్ డేటా తయారు చేయాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతి సెక్రటరీ తమ శాఖల్లో బెస్ట్ ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకోవాలన్నారు. మార్చి 6వ తేదీ నుంచి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల ప్రణాళిక జరుగబోతుందని సిఎం రేవంత్ తెలిపారు. జూన్ 2వ తేదీ వరకు ప్రతి ఆఫీస్ పరిశుభ్రం కావాల్సిందేనని ఆయన సూచించారు. జూన్ 2 తెలంగాణకు పండుగ అని, ఆ పండుగ ను అంతా ఘనంగా జరుపుకోవాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి అధికారి పాల్గొనాలన్నారు. దీనికి మినహాయింపులు ఉండవని, శాఖ ల మధ్య సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు తనకు కావాల్సిన బలాన్ని ఇచ్చారని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ప్రజలకు మంచి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
కడియం, దానం అనర్హతపై పది రోజుల్లో స్పీకర్ తీర్పు
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై 2వ తేదీన (సోమవారం) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాదనలు విననున్నారు.వారం, పది రోజుల్లో స్పీకర్ తీర్పు చెప్పే అవకాశం ఉంది. 12వ తేదీన సుప్రీం కోర్టులో స్పీకర్ ధిక్కరణ పిటిషన్పై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ లోగా స్పీకర్ తీర్పు వెలువరిస్తారని కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇదిలాఉండగా శనివారం కడియం శ్రీహరిని పిటిషనర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామ్ చేశారు. “ఇదిగో మీరు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన వీడియోలు..” అని న్యాయవాది వీడియో చూపించారు. అవన్నీ కల్పితాలు, సృష్టించిన వీడియోలు అని కడియం బలంగా చెప్పారని తెలిసింది. గత వారం పిటిషనర్ వివేకానందను కడియం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామ్ చేయగా, శనివారం కడియం శ్రీహరిని పిటిషనర్ తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో న్యాయవాది కొన్ని వీడియోలు చూపించారు. ఆ వీడియోలో కడియం శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తున్న తన కుమార్తె కడియం కావ్యను గెలిపించాలని బహిరంగంగా ఓటర్లను కోరుతున్న దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఆ వీడియోలు కల్పితమని కడియం బలంగా తన వాదన వినిపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేసును సోమవారానికి వాయిదా వేశారు.
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బిసి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే దేవరకొండ భాగంలోని ఔట్ లెట్ సొరంగ మార్గం 20 మీటర్ల దూరం తవ్వకం పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు. ఎస్ఎల్బిసి పునరుద్ధరణ పనుల పురోగతిపై శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నుంచి ఇన్ లెట్ సొరంగ మార్గం పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారని ఆయన వెల్లడించారు. అయితే సొరంగ మార్గం తవ్వకాల్లో భద్రతా చర్యలకే పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. తవ్వకాల సమయంలో అవసరమైన ప్రసరణతో పాటు సొరంగ మార్గం తవ్వేటప్పుడు వచ్చే నీటిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో తవ్వకాలు భూ భౌతిక పరిస్థితిలకనుగుణంగా టన్నెల్ బోర్ మిషన్ (టిబిఎం) విధానాన్ని విరమించుకొని ఆధునిక పరిజ్ఞానంతో తవ్వకాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సురక్షిత మార్గాలు అన్వేషించి అదనంగా వెంటిలేషన్, విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2025 ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్బిసి తవ్వకాల్లో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాద ఘాటనను దృష్టిలో పెట్టుకొని అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బిసిని పూర్తి చేసేందుకు రూపొంచిన ప్రణాళికలననుసరించి 24 గంటలు మూ డు షిఫ్ట్ల్లో పనులు చేపడుతున్నామన్నారు. నిర్ణిత గడువులోపు పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయ కక్ష.. చేయని నేరానికి శిక్ష
విద్యా సంబంధమైన శిక్షణా పరిశోధన నిర్వహించే జాతీయ మండలి (ఎన్ సిఇఆర్టి) ఎనిమిదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన సామాజిక శాస్త్రంలో న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించి పొందుపరచిన ఒక అధ్యాయాన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అధ్యక్షతన ఏర్పాటయిన న్యాయమూర్తుల బెంచి ఈ అధ్యాయం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నంగా అభివర్ణిస్తూ ‘వాళ్లు తుపాకీ పేల్చారు, న్యాయవ్యవస్థ రక్తసిక్తమైంది’ అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య మూలస్తంభాలలో అత్యంత ప్రధానమైన న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ఈ తుపాకీ గుండు పేల్చినవాళ్లు ఆ మరునాడే అదే న్యాయవ్యవస్థ నుంచి వెలువడిన ఒక తీర్పు కారణంగా గాయపడి విలవిలలాడుతున్నారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే అధ్యాయాన్ని ఎనిమిదవ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యాంశంగా చేర్చిన ఎన్సిఇఆర్టి కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేదే. కాబట్టి సుప్రీం కోర్టు బెంచి చేసిన ఈ వ్యాఖ్యానం నేరుగా రాజకీయ నాయకత్వానికి తగులుతుంది. దేశంలో అవినీతి గురించి ఎనిమిదవ తరగతి సామాజిక శాస్త్రం చదువుకునే పిల్లలకు నిజంగానే తెలియాలని ఎన్సిఇఆర్టి అనుకుంటే అన్ని రంగాలలో బ్రహ్మరాక్షసిలా జడలు విరబోసుకున్న అవినీతి గురించి, అందునా ముఖ్యంగా రాజకీయ రంగాన.. మరీ ముఖ్యంగా ఎన్నికల తంతులో వేళ్ళూనుకున్న అవినీతిని గురించి రాయించవలసింది కదా. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వెనుక కుట్ర, నేరపూరిత ఉద్దేశం లేవని తేల్చింది. నిందితులు తప్పు చేసినట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. నిందితుడిని అప్రూవర్గా మార్చి దర్యాప్తు జరపడంపట్ల కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. సదరు నిందితుడు అరెస్ట్ అయిన కొద్ది రోజులకే అప్రూవర్గా మారడమే కాకుండా బెయిల్ మీద బయటికొచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి 45 కోట్ల రూపాయలు ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళం ఇచ్చినట్టు నిన్నటి నుండి గోదీ మీడియా సైతం స్వయంగా కోడై కూస్తున్నది. ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబ్బల్ ఈ తీర్పు వెలువడిన వెంటనే ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య ఇక్కడ గుర్తు చేసుకోవాలి ‘జైల్ భిజావో, సర్కార్ గిరావో, చునావ్ జీతో’ (జైలుకు పంపండి, ప్రభుత్వాన్ని కూలదొయ్యండి, ఎన్నికలు గెలవండి) ఇది ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డిఎకు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నీతి అన్నారాయన. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీకి చెందిన ఐదుగురు ప్రముఖ నాయకులను వెయ్యి రోజులపాటు జైల్లో ఇదే కేసులో నిర్బంధించి, ఢిల్లీ ఎన్నికలు నిర్వహించి బిజెపి గెలుపొందడాన్ని గుర్తుచేస్తూ కపిల్ సిబ్బల్ ఈ వ్యాఖ్య చేశారు. శుక్రవారం నాడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ కొట్టేసిన ఈ మద్యం కుంభకోణం కేసులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా 23 మంది నిందితులు. వారిలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత కూడా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆరు మాసాలు, ఆయన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా దాదాపు రెండు సంవత్సరాలు, కవిత దాదాపు ఆరు మాసాలు ఈ కేసు కారణంగా జైల్లో గడపాల్సి వచ్చింది. కోర్టు ఇప్పుడు ఈ కేసును కొట్టేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలే లేవని చెప్పింది. వీళ్ళందరూ జైలులో గడిపిన రోజులను ఇప్పుడు ఎవరు తిరిగి తీసుకురావాలి? దానిని మించి వారు, వారి కుటుంబాలు, సన్నిహితులు పడ్డ మనోవేదన, క్షోభ, అవమానం సంగతి ఏమిటి? తీర్పు వెలువడిన వెంటనే మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురై చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ‘తప్పుడు కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నేను కనిపించడం లేదని, మొహం చాటేసానని రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. నేను రాజకీయ నాయకుడిని కాదు, నిజాయితీపరుడైన ఒక పౌరుడిని కాబట్టే అవమాన భారంతో ఇంటి నుండి బయటకు రాలేదు. రాజకీయ నాయకుల తోలు మందం కాబట్టి వాళ్లు ఇటువంటివి పట్టించుకోకుండా బయట తిరుగుతారు’ అన్నాడు. ఈ దేశంలోని మొత్తం శాసన వ్యవస్థ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల గురించి తీవ్రంగా ఆలోచించాలి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన నాలుగు వ్యవస్థల్లో అత్యంత ముఖ్యమైనది శాసన వ్యవస్థ. ఎందుకంటే ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుంది కాబట్టి తన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ప్రజలకు తన మీద విశ్వాసం చెదిరిపోకుండా చూసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సిన తరుణంఇది. మరో రెండు స్తంభాలు కార్యనిర్వాహక వర్గం, మీడియా. వీటి విశ్వసనీయత ఎంత ప్రశ్నార్థకం అయిందో చూస్తున్నాం. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కె అద్వానీ అప్పటి పత్రికల మీద చేసిన వ్యాఖ్య ‘వాళ్లను ఒంగి నడవమంటే నేలమీద పాకారు’ అని. ఇన్నేళ్ల తర్వాత ఆయనే ప్రాతినిధ్యం వహించిన పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా మీడియా పాలకవర్గాల ఒళ్లో కులుకుతున్నదన్న (గోది మీడియా) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇక ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న కార్యనిర్వాహక వర్గం గురించి మాట్లాడుకుంటే మొత్తం దేశం ఆలోచించాల్సిన ఒక తీవ్రమైన విషయం నిన్నటి ఈ తీర్పుతో మరింత బలంగా ముందుకు వచ్చింది. కార్యనిర్వాహక వర్గం కోవకు చెందిన దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఇడి వంటి వాటి వ్యవస్థల విశ్వసనీయత మీద పడ్డ ఘోరమైన మచ్చ ఇప్పుడు మరింత చెరపరాని విధంగా మారింది. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర్నుంచి దాదాపు ఈ 12 సంవత్సరాల కాలంలో సిబిఐ, ఇడి పెట్టిన కేసులేవీ ప్రజలను ఇక నమ్మించలేవని నిన్నటి మద్యం కేసు తీర్పుతో మరింత స్పష్టమైంది. చాలా రోజులుగా న్యాయ నిపుణులు, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కక్ష సాధింపు కోసం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం, వారిని లోబర్చుకోవడం కోసం వాడుకుంటున్నట్టు చేస్తున్న బలమైన ప్రచారానికి ఈ తీర్పు మరింత ఊతం ఇచ్చింది. ఈ పన్నెండేళ్ళ కాలంలో అధికార కూటమికి చెందిన.. మళ్ళీ మాట్లాడితే దానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశం మొత్తం మీద ఒక్కరి మీదయినా ఇటువంటి నేరారోపణలు ఎందుకు రాలేదు? అని ప్రశ్నిస్తున్న వారు గతంలో యుపిఎ హయాంలో తమ కూటమిలోని పార్లమెంట్ సభ్యురాలిని, మంత్రిని టూజీ స్పెక్ట్రం ఆరోపణల మీద జైలుకు పంపిన ఉదంతం గుర్తు చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తదితరుల మీద సిబిఐ పెట్టిన ఈ కేసు ప్రాతిపదికనే ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన మనీ లాండరింగ్ కేసు కూడా సహజంగానే నిలువదనే విషయం తెలిసిందే. ఇతర ప్రజాస్వామ్య స్తంభాల మీద వలెనే న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మీద కూడా నీలినీడలు పరుచుకుంటున్నవేళ ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్ట్ ఇచ్చిన తీర్పు వాటిని పారదోలి వెలుగులు నింపినట్టు అయింది. ఇక రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి, ఢిల్లీ, పంజాబ్లలో ఆమ్ఆద్మీ పార్టీకి ఈ తీర్పువల్ల ఏమన్నా లాభం జరుగుతుందా? తీర్పు వెలువడిన వెంటనే భారత రాష్ట్ర సమితి కార్యాధ్యక్షుడు కెటి రామారావు మాట్లాడుతూ ఈ కేసు వల్లనే తమ పార్టీ గత శాసనసభ, లోకసభ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. తమ పరిపాలనలో జరిగిన లోపాల కారణంగా ప్రజలు ఓడించారని ఇప్పటికీ ఆ పార్టీ ఒప్పుకోడానికి సిద్ధంగా లేదని అర్థం అవుతూనే ఉన్నది. అయినా తెలంగాణలో లెక్క ప్రకారం శాసనసభకు ఎన్నికలు జరిగినా ఇంకా దాదాపు మూడేళ్ళ సమయం ఉంది. కేంద్రం ఆలోచిస్తున్న విధంగా జమిలి ఎన్నికలంటూ వస్తే మరో ఆరుమాసాలు ఆలస్యం కాక తప్పదు. అప్పటివరకు ఈ అంశం ఎన్నికలను ప్రభావితం చేసి బిఆర్ఎస్కు అనుకూలంగా ప్రజాతీర్పు మారుతుందని చెప్పలేం. రాజకీయంగా ఎవరికి ఏం లాభం జరుగుతుందో చెప్పలేం కానీ మద్యం కేసులో నిందితురాలిగా జైలుకు వెళ్ళిన కవితకు మాత్రం గొప్ప మనోధైర్యం కలిగించే తీర్పు ఇది. భారత రాష్ట్ర సమితి తనను సస్పెండ్ చేసినప్పుడు పార్టీ మీద ఆమె చేసిన ఫిర్యాదులలో ఒకటి ఈ కేసులో తనను ఇరికించినప్పుడు ఎవరూ సరిగా పట్టించుకోలేదని. ఇప్పుడు వచ్చే మే మాసంలో కొత్త పార్టీ ప్రారంభించే పనిలో ఉండగా ఆమెను నిర్దోషిగా కోర్టు ప్రకటించడం చాలా అనుకూల అంశం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.. మాజీ ముఖ్యమంత్రి, కవిత తండ్రి కెసిఆర్ ఆనాడే చెప్పారు. ఇది తప్పుడు కేసు అని, ఆమె కడిగిన ముత్యంలా బయటికి వస్తారనీ. ఆమ్ఆద్మీ పార్టీని ఖతం చెయ్యాలన్న బిజెపి ప్రయత్నం బెడిసికొట్టి ఇంకో ఏడాది కూడా లేని పంజాబ్ ఎన్నికల్లో ఈ అంశం కేజ్రీవాల్కు సానుభూతి తెచ్చి ఘన విజయం సాధించిపెట్టినా ఆశ్చర్యం లేదు. నిజమే, కేజ్రీవాల్ నిన్న తీర్పును ఆహ్వానిస్తూ మీడియాతో మాట్లాడినప్పుడు అన్నట్టుగా దేశమంతటా మంచి రోడ్లు వేసి, వాడవాడలా మొహోల్లా క్లినిక్లు ప్రారంభించి ప్రజల మన్నన పొంది ఎన్నికలు గెలవాలి కానీ సిబిఐ, ఇడిలను ఉసిగొల్పితే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పులాంటి ఎదురు దెబ్బలు ఇంకొన్ని తప్పవేమో. Delete Edit
వార ఫలాలు (01-03-2026 నుండి 07-03-2026 వరకు)
మేష రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. ఆఫీసులో పై అధికారులు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మనోవేదన ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహ పరుస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షా సమయం. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారాలి అని అనుకునే వారికి కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన గృహం కొనుగోలు చేయాలి అనే కల నెరవేరుతుంది. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. మంగళవారం శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషభ కాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వచ్చినా ఆదాయం కంటే కూడా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనపడడానికి ఎక్కువగా కష్టపడతారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు చదువుపై శ్రద్ధ వహించండి. మీ అంచనాలను అందుకుంటారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చ సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా లాభసాటిగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి డాక్టర్లకి లాయర్లకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రే. కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. నూతన పెట్టబడులు పెట్టడానికి నూతన వ్యాపారం ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. దూర ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళండి. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాంట్రాక్టర్లకు హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి మంచినీళ్ల వ్యాపారం చేసే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మీరు రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటను ఇస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలి అని ఆలోచనలు వస్తాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కావున శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. భూ సంబంధిత వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వివాదాలకు తగాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. శనివారం మరియు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు బాగున్నాయి. ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. విదేశీ సంబంధిత విషయాలు వీసా పాస్పోర్ట్ వంటివి లభిస్తాయి. వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు అనుకోని అవకాశాలు చేతికి అందుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపారంలో మీతో విభేదించినవారే దగ్గరవుతారు. పునర్ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరున్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు. విద్యార్థిని విద్యార్థులకు ఇది పరీక్షా సమయం. కష్టేఫలి అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కొంత చికాకు కలిగిస్తాయి. కుటుంబంలో సహోదరీ సహోదరుల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమతో కూడిన ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార పరంగా నూతన ఆలోచనలను అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. నలుపు వత్తులతో శనివారం రోజున శని గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. మీ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఇదేనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభ రాశి వారికి వారం అనుకూలంగానే ఉంది. వ్యాపారపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు నిరాశ వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. చదువుపై శ్రద్ధ వహించండి. ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు నాగ సింధూరం నుదుటన ధరించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విదేశీ ప్రయాణం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. నూతన వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది శనికి తైలాభిషేకం చేయించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ లాకెట్ మెడలో ధరించండి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
‘పామ్ జుమేరా’పై ఇరాన్ మిసైల్ దాడి #Dubai#PalmJumeirah#DubaiAirport#BurjKhalifa
పశ్చిమాసియాలో ప్రస్తుత పోరుతో ప్రాంతీయ సుస్థిరత, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అంతేకాకుండా విస్తృత స్థాయి ప్రాంతీయ యుద్ధం దశకు చేరుతోంది. ఇక ప్రపంచమార్కెట్లో ఇంధన మార్కెట్ కూడా కుదేలవుతుంది. దీనితో చమురు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి అగమ్యగోచరం అయ్యి, మార్కెట్లో ధరలు విపరీత స్థాయిలో పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం అయింది. ఈ ఘర్షణల ప్రాంతం రవాణా నౌకల సముద్ర యాన పరిధిలో ఉంది. దీనితో ముడిచమురు సరఫరాకు విఘాతం ఏర్పడుతుంది. పలు దేశాలలో తక్షణ అవసరాల ఇంధన కోటాకు గండిపడుతుందని, తద్వారా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ ఇరాన్ అత్యధిక స్థాయి చమురు ఉత్పత్తి దేశంగా ఉంది. అమెరికా, ఒపెక్ ఆంక్షలు ఉన్నప్పటికీ చమురు రంగంలో ఇరాన్ పటిష్ట స్థితిలోనే ఉంది. ఈ దేశంపై జరిగే ఎటువంటి దాడుల ప్రభావం అయినా అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు.
పాకిస్థాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం
చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టి20 ప్రపంచకప్ సూపర్8 మ్యాచ్లో పాకిస్థాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచినా పాకిస్థాన్ సెమీ ఫైనల్కు చేరుకోలేక పోయింది. మెరుగైన రన్రేట్ కలిగిన న్యూజిలాండ్ జట్టు గ్రూప్2 నుంచి సెమీస్కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్ ఇంతకుముందే సెమీస్ బెర్త్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్లు అద్భుత బ్యాటింగ్తో అలరించారు. చెలరేగి ఆడిన ఫర్హాన్ 60 బంతుల్లోనే 9 ఫోర్లు, ఐదు సిక్స్లతో 100 పరుగులు చేశాడు. ఫకర్ 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లతో 84 పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్శనక 31 బంతుల్లోనే 8 సిక్స్లు, రెండు ఫోర్లతో అజేయంగా 76 పరుగులు చేసి లంకను ఆదుకున్నాడు.
ఆకాశంలో దూసుకొస్తున్న క్షిపణులు..వీడియో షేర్ చేసిన మంచు విష్ణు#Dubai#IranMissile#MiddleEastTensions
శంషాబాద్ విమానాశ్రయం నుంచి పది విమానాలు రద్దు
ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన పది విమానాలు శనివారం రద్దయ్యాయి. దేశంలో ఉన్న పలు ఎయిర్ పోర్ట్ల నుంచి ఇరాన్ ఇజ్రాయిల్ వెళ్ళే విమానాలు రద్దు కావడం గమనార్హం. ఈక్రమంలో శంషాబాద్ నుంచి దుబాయ్, కతార్ మీదుగా వెళ్ళాల్సిన పలు విమానాలను రదు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు తెలిపాయి. ఇరాన్లో దాడుల తర్వాత డచ్ క్యారియర్ కెఎల్ఎం ఆమ్స్టర్డ్యాం నుంచి టెల్ అవీవ్కు వెళ్లే విమానాన్ని రద్దు చేసింది. ఢిల్లీ నుంచి -టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని ఎయిర్ ఇండియా దారి మళ్లించింది. ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడంతో ఎయిర్ ఇండియా ఢిల్లీ-టెల్ అవీవ్ విమానాన్ని ముంబైకి మళ్లించడం గమనార్హం. కాగా, ఉద్రిక్తలు కొనసాగితే మరిన్ని విమానాలు రద్దయ్యే అవకావం ఉంటుందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్ దాడుల్లో దుబాయ్ హోటల్ ధ్వంసం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నగరం, ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రం దుబాయ్పై ఇరాన్ శనివారం రాత్రి బాంబుల దాడికి దిగింది. తమ శక్తివంతమైన షహీన్ డ్రోన్తో దుబాయ్ నడిబొడ్డున బాంబులు కురిపించింది. ఈ దశలో పలు బహుళ అంతస్తుల భవనాలకు ముప్పు తలెత్తింది. పామ్ జుమేరియా ప్రాంతంలోని ఫెయిర్మాంట్ హోటల్పై బాంబులు వచ్చి పడ్డాయి. దీనితో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. ప్రాణనష్టం వివరాలు తెలియలేదు. అయితే ఈ ప్రాంతంలోకి వెంటనే అత్యధిక సంఖ్యలో అంబులెన్స్లు తరలివచ్చాయి. నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, వీరికి వెంటనే చికిత్స అందిస్తున్నామని స్థానిక వైద్య అధికారి తెలిపారు. సహాయక బృందాలను రంగంలోకి దింపారు. తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ఇరాన్ తన ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. ఓ వైపు అబూధాబి, దోహా, రియాద్లపై ఇరాన్ దాడులు చేపట్టింది. అక్కడి అమెరికా సైనిక స్థావరాలను లక్షంగా ఎంచుకుంది.ఈ దాడులను ఆయా దేశాలు తీవ్రంగా పరిగణించాయి. ఇది యుద్ధ తీవ్రతకు దారితీస్తుందని హెచ్చరించాయి. దుబాయ్లోఇరాన్ దాడుల్లో ఆసియా జాతీయుడు ఒకరు చనిపోయినట్లు యుఎఇ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే ఈ చనిపోయిన వ్యక్తిని పాకిస్థానీయుడిగా తరువాత గుర్తించారు. క్షిపణుల శకలాలు దుబాయ్లోని కొన్ని నివాసిత ప్రాంతాలపై పడ్డాయని వెల్లడించారు. ఆకాశంలో క్షిపణుల సంచారం చూశామని, భీకర రీతిలో పేలుళ్లు విన్పించాయని దుబాయ్ వాసులు తెలిపారు. ఓ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇళ్ల కిటికీ అద్దాలు పగిలాయి. ఇక ప్రఖ్యాత పర్యాటక స్థలం బూర్జు ఖలీఫా నుంచి సందర్శకులను వెలుపలికి పంపించారు. పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉండటంతో ఆయా ప్రాంతాలను ఎంచుకుని ఇరాన్ దాడులు సాగిస్తోంది. ఇరాన్ మిస్సైల్స్ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్ ప్రకటించింది
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి,గార్డ్స్ అధినేత హతం
ఇరాన్ నాయకత్వాన్ని లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా సేనలు శనివారం జరిపిన దాడులు కీలక పరిణామాలకు దారితీశాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే దుర్మరణం చెందాడు.ఈ దాడుల తీవ్రతలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అధినేత మహమ్మద్ పాక్పోర్ కూడా చనిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది ఇరాన్ నాయకత్వానికి, ప్రత్యేకించి సైన్యానికి పెద్ద ఎదురుదెబ్బ అయింది. దాడుల కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. వీరి ఉనికిని గుర్తించి అత్యంత వ్యూహాత్మక దాడులకు దిగారని వెల్లడైంది. ఇప్పటివరకూ తమ సేనలకు ఆదేశాలు వెలువరిస్తూ వచ్చిన రక్షణ మంత్రి, సైన్యం అధినేత రెండు దేశాల దాడుల దశలో ఇతరులతో పాటు మృతి చెందినట్లు వెల్లడైంది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని, ఇరాన్ దేశాధ్యక్షులు మసౌద్ పెజెషకియాన్ను లక్షంగా ఎంచుకుని దాడులకు దిగుతున్నారు. తమ దాడులు ఇరానీయన్లపై కాదని, అక్కడి పాలకులపై అని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడిఎఫ్) తెలిపాయి.
కూల్చివేతలకే పరిమితమైన రేవంత్ రెడ్డి పాలన
నిరుపేదలకు దానం చేసిన భూమిని దౌర్జన్యంగా లాక్కునే హక్కు కాంగ్రెస్ పాలకులకు ఎవరిచ్చారు?.. కనీస కనికరం లేకుండా నిద్రమత్తులో ఉన్న అభాగ్యుల ఆవాసాలను నేలమట్టం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బిజెపి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ , డాక్టర్ శీలం పాపారావులతో లిసి వెలుగుమట్లలోని భూదాన్ బాధితులను పరామర్శించారు. అనంతరం అంబేద్కర్ భవనంలో తలదాచుకున్న నిరాశ్రయులైనుపరామర్శించారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాcisp 61 ఎకరాల భూదాన్ భూమిలో 31 ఎకరాల్లో పేదలు తలదాచుకుంటుంటే అమానుషంగా లాక్కున్న అధికార పక్షం, మిగతా 30 ఎకరాల భూమిని ఏ బడాబాబులకు కట్టబెట్టిందో, ఆ భూమి ఏమైందో తక్షణమే లెక్క చెప్పాలని ఆయన కోరారు. గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో అమాయక ప్రజల కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లెదుటే గుడిసెలు కూలిపోయి బతుకులు రోడ్డున పడటంతో ఈ ప్రభుత్వం సర్వనాశనం కావాలని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాలను అధికార పక్షానికే కట్టబెట్టారని, కీలక మంత్రి పదవులు కూడా ఈ జిల్లాకే దక్కాయని గుర్తుచేశారు. పలువురు మంత్రులు ఉన్నా తమకు న్యాయం జరుగుతుందని జనం ఎంతో సంబురపడ్డారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దారుణంగా తమ ఇళ్లనే కూల్చివేస్తారని నిరుపేదలు ఏనాడూ ఊహించలేదని విమర్శించారు. మొదట్నుంచీ కాంగ్రెస్ దమననీతినే కొనసాగిస్తోందని మండిపడ్డారు. పెద్దల జోలికి వెళ్లే ధైర్యం లేకనే ఏ దిక్కూ లేని అభాగ్యులపై ప్రతాపం చూపుతున్నారని దుయ్యబట్టారు. అరవై రెండు ఎకరాల భూమిలో ముప్పై రెండు ఎకరాల్లో పేదలు తలదాచుకుంటుంటే దాన్ని అమానుషంగా లాక్కున్నారని, మిగతా ముప్పై ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆ భూమి ఏమైందో చెప్పాలని నిలదీశారు. ఆ ముప్పై ఎకరాల భూమి లెక్క జిల్లా పాలనాధికారి చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదల కళ్లలో మట్టి కొట్టిన అత్యంత దుర్మార్గపు ప్రభుత్వమని విమర్శించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు , దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, కుమిలి శ్రీనివాస్, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి,మనీ , నకిరేకంటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల బాలుడు నీటి తొట్టిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొనడంతో బాలుడి తల్లి నీలమ్మ తన తల్లి ఇంటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో విభేదాల విషయమై మాట్లాడేందుకు భర్త కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి పాలెం గ్రామానికి వచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో బాలుడికి పాలు ఇవ్వడానికి చూసుకున్న తల్లికి బాబు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇంటి పరిసరాల్లో వెతకగా నీటి తొట్టిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతికి తండ్రే కారణమని అనుమానిస్తూ తల్లి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని నాగర్కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వివరాలకు వెళితే జాటోతు ప్రవీణ్ (32) అనే వ్యక్తి హైదరాబాదులో కారు డ్రైవర్ పని చేసుకుంటూ జీవన కొనసాగించేవాడు.పని ముగించుకొని ఆయన స్వగ్రామం మహబూబాద్ జిల్లా నరసింహుల పేట మండలం,పడమటి గూడెం చారి తండా గ్రామం. భార్య పిల్లల వద్దకు వస్తుండగా మార్గమధ్యంలోని తిరుమలగిరి తహసిల్దార్ కార్యాలయం దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం తో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులకు ఫోన్ సమాచారం ద్వారా అందించారు.మృతుడు వాడిన ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది.ఎవరైనా ఢీకొన్నారా లేకపోతే బైక్ స్కిడ్ అయి పడిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రి తరలించారు.
NTR has to transform for Devara2
Young Tiger NTR has taken a break and he lost weight to fit in the role of Prashanth Neel’s Dragon. He is lean with a thick beard and his recent transformation cheered up his fans. The actor will continue to maintain the lean look till he completes the shoot of Dragon and the makers will […] The post NTR has to transform for Devara2 appeared first on Telugu360 .
ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం చేసిన దాతలు
ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం చేసిన దాతలు అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్ మహేందర్
తౌషిక్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ *నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వ యంత్రాంగం తీరు*తౌషిక్ మృతికి ఇద్దరు మహిళలు పాత్ర ఉన్నట్లు ఆరోపణ*రాజకీయ, ఆర్థిక బలంతో కేసును ప్రక్క దారి పట్టిస్తున్న స్కూల్ యజమాన్యం*తౌషిక్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిపిఐ డిమాండ్సింగరాయకొండ : సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానస్పద మరణంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నిజాలను ప్రజలకు వెల్లడించాలని […] The post తౌషిక్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి appeared first on Visalaandhra .
వివాహితను రక్షించిన స్పెషల్ ఫోర్స్ పోలీసులు
వివాహితను రక్షించిన స్పెషల్ ఫోర్స్ పోలీసులు బాసర, ఆంధ్ర ప్రభః గోదావరి నదిలో
పోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతపై మిల్లర్స్ హర్షం
పోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతపై మిల్లర్స్ హర్షం కేదారాజేశ్వర పేట, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి
deadly explosion : అదే సూర్యశ్రీ Andhra Prabha Crime Story
deadly explosion : అదే సూర్యశ్రీ Andhra Prabha Crime St (
డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం అంధకారమే
డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం అంధకారమే యువత అత్యుత్తమ లక్ష్యాలతో ముందుకు
భారత్ పిలుపు మధ్యప్రాచ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ఆంధ్రప్రభ
దోపిడీ దొంగల బీభత్సం కనకాపూర్ లో బంగారం నగదు చోరీ లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ
రూ. 21 వేలకు చేరుకున్న టన్ను పామాయిల్ గెల ధర
పామాయిల్ గెల టన్ను ధర రూ. 21,546- రూపాయాలకు చేరుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పామాయిల్ ధర పెరగడంతో 15,024 మంది రైతులకు రెండు కోట్ల మేర అదనపు లబ్ది చేకూరనుందని మంత్రి వెల్లడించారు. రైతులకు అధిక ధరలు అందించి ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని-, ఆయిల్ ఫెడ్ ఫాక్టరీలలో ఆధునిక యంత్రాల ఏర్పాటు ద్వారా నూనె రికవరీ 20.01శాతానికి పెంచామని- మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున్న చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలియజేసారు. గతంలో టన్ను ధర రూ. 12,534- ఉందని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల టన్ను ధర రూ21,546-కు పెరగడం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో 1992, -93 నుంచి ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాలను (79,113 రైతులు) ఆయిల్ పామ్ సాగుచేస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 1,07,400 ఎకరాలలో 33,500 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టరని 2025, -26 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు కోసం రూ. 456 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. వచ్చే సంవత్సరంలో మరో రెండు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 68,600 ఎకరాల నుండి ఆయిల్ పామ్ గెలల ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తెలిపారు. రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు నాలుగు సంవత్సరాలకు ఏకరాకు రూ 50, 918- రాయితిని ఇస్తున్నామని, దీర్ఘకాలిక లాభాల కోసం రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని మంత్రి తుమ్మల కోరారు.
అడవులపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ
అడవులపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జన్నారం,ఆంధ్రప్రభ: ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డోన్ల ద్వారా
కరెన్సీ తరలించే విమానం కూలి 15 మంది మృతి
సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళ్లున్న కార్గో విమానం రన్వేపై జారి, హైవే పైకి దూసుకెళ్లిన సంఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. లా పాజ్ సమీపంలో ఎల్ఆల్టో నగరంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. బొలీవియా ఎయిర్ఫోర్స్కు చెందిన హెర్కులెస్ విమానం శాంటా క్రూజ్ నుంచి బయలుదేరిన తరువాత ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ సమయంలలో రన్వే నుంచి పక్కకు జారి పోయింది. రద్దీగా ఉన్న రోడ్డు పైకి దూసుకెళ్లి అనేక వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఫైర్ చీఫ్ పావెల్ టోవర్ మృతులు విమానం లోని వారా లేక రన్వేపై ఉన్న కార్ల లోని వారా అన్న విషయాన్ని స్పష్టం చేయడం లేదు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. నేలపై చెల్లా చెదురుగా పడి ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను అక్కడి ప్రజలు తీసుకోవడానికి పోటీ పడుతుండగా, పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.
Apollo |హైదరాబాద్లో ఈ స్టోర్ను ప్రారంభించిన ఉపాసన
Apollo | హైదరాబాద్లో ఈ స్టోర్ను ప్రారంభించిన ఉపాసన తెలంగాణలో 33 జిల్లాల్లో
దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి: భారత్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్పై సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడులు తీవ్ర రూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు నివారించాలని భారత్ సూచించింది. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరింది. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పేర్కొంది. పశ్చిమాసియాలో ఉన్న భారతీయులతో సంప్రదింపులు జరుపుతోంది. అక్కడ ఉండే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
Upto85%Depend |భారత్పై యుధ్ద ప్రభావం…?
Upto85%Depend | భారత్పై యుధ్ద ప్రభావం…? అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలపై
DSP’s Remuneration Shocks Tollywood
Rockstar Devi Sri Prasad is one of the most successful music composers after legendary composers like Keeravani and Ilayaraja. He has delivered many chartbusters but his remuneration has been shocking in Telugu cinema. DSP has been charging Rs 6 crores before Pushpa 2: The Rule. The young composer has now doubled his fee and he […] The post DSP’s Remuneration Shocks Tollywood appeared first on Telugu360 .
దుబాయ్ ఎయిర్ పోర్టులో అల్లకల్లోలం#DubaiAirport#MiddleEast#Israel#FlightCancel#BreakingNews
Aggressive Promotions needed from Pawan Kalyan
Powerstar Pawan Kalyan’s upcoming film Ustaad Bhagat Singh is announced for March 26th release. The film’s shoot was delayed due to the commitments of Pawan Kalyan. The film’s director Harish Shankar was left in waiting mode for years. The first single received decent response but the second song was not accepted by the audience. The […] The post Aggressive Promotions needed from Pawan Kalyan appeared first on Telugu360 .
గాంధీ ఆసుపత్రి వైద్యుడి ద్వారా పోస్టుమార్టం రిపోర్టు ఇప్పించేందుకు బాధితుడి నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ కీసర పోలీస్ స్టేషన్ హోంగార్డ్ ఏసీబీకి చిక్కాడు. హోంగార్డ్ నగేష్తో పాటు గాంధీ ఆసుపత్రి వైద్యుడు సందీప్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఏసీబీ డిఎస్పి జి.శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం అక్టోబర్ 12న భువనగిరికి చెందిన తోటకూర మహేష్ యాదవ్ ఛాతీలో నొప్పితో అస్వస్తతకు గురై కీసర నితిన్ హాస్పిటల్లో మృతి చెందాడు. అతని మృతికి వైద్యుడి నిర్లక్షమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు కోసం మృతుని మేనలుకలడు శరత్ కీసర పోలీస్ స్టేషన్ ద్వారా పోస్టుమార్టం వ్యవహారాలు చూసే హోంగార్డ్ నగేష్ను సంప్రదించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు సందీప్ రిపోర్టు ఇచ్చేందుకు హోంగార్డ్ ద్వారా రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. రిపోర్టు ఇచ్చేందుకు బాధితుడిని గత నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో బాధితుడు చివరకు రూ.40 వేలు లంచంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఈ విషయంపై ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం హోంగార్డు నగేష్కు బాధితుడు మొదటి విడతగా రూ.5 వేలు వైద్యుడికి అందజేశాడు. శనివారం మధ్యాహ్నం చీర్యాల చౌరస్తా సమీపంలోని గ్రీన్ లీప్ దాబా వద్ద బాదితుడి నుంచి హోంగార్డు మిగతా రూ.35 వేలు తీసుకోగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్హ్యాండ్గా పట్టుకున్నారు. అదే సమయంలో గాంధీ హాస్పిటల్ వైద్యుడు సందీప్ను శంషాబాద్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హోంగార్డు నగేష్, వైద్యుడు సందీప్ను కీసర పోలీస్ స్టేషన్కు తరలించి విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Corporation |రోడ్ల శుభ్రత పేరుతో ప్రమాదాలు..
Corporation | రోడ్ల శుభ్రత పేరుతో ప్రమాదాలు.. తక్షణ మార్పులు చేయాలి..రద్దీ వేళల్లో
1000 people |డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ కృషి అభినందనీయం
1000 people | డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ కృషి అభినందనీయం
బాలికల స్కూల్పై దాడుల్లో 40 మంది చిన్నారుల బలి
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు హర్మోగన్ ప్రాంతంలోని మినాబ్లో కనీసం 40 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయ్యారు. దాడుల క్రమంలో అక్కడి బాలికల పాఠశాలపై కూడా బాంబులు విరుచుకుపడటంతో చిన్నారులు మృతి చెందినట్లు ఇర్నా వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడులలో కనీసం 45 మందికి పైగా గాయపడ్డారు. ఈ మినాబ్ నగరంలో ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ సైనిక స్థావరం నెలకొని ఉంది. దీనిని ధ్వంసం చేసేందుకు జరిపిన దాడుల క్రమంలో చిన్నారులు బుగ్గి అయ్యారు. అయితే ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ లేదా అమెరికా సైనిక లేదా అధికార వర్గాలు ఈ ఘటన గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇరాన్పై తమ దాడులను ట్రంప్ ఇప్పుడు తమ అమెరికా ఫస్ట్ నినాదం క్రమంలో సమర్థించుకున్నారు. తాను ఈ స్లోగన్తోనే అధికారంలోకి వచ్చానని, భవిష్య తరాలకు ఇక ఎటువంటి పరాయి దేశ ముప్పులు రాకుండా చేసేందుకు తాను ఈ చర్యలకు దిగుతున్నానని తెలిపారు. ఇక తన కంటే ముందు వచ్చిన అధ్యక్షులు ఈ పనిచేయలేకపోయారని మండిపడ్డారు.
వేట్లపాలెం దుర్ఘటనపై మోడీ దిగ్ర్భాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి భారీ ప్రాణనష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంతో గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకొని 23 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 70 మంది వరకూ ఆ తయారీ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు.
49 divisions |మొబైల్ మెడికల్ క్యాంపునకు విశేష స్పందన..
49 divisions | మొబైల్ మెడికల్ క్యాంపునకు విశేష స్పందన.. క్యాంపులో వైద్య
Rs.8,93,385 |నిరుపేదల ఆరోగ్యానికి కూటమి భరోసా..
Rs.8,93,385 | నిరుపేదల ఆరోగ్యానికి కూటమి భరోసా.. అన్ని విధాలుగా ఆదుకున్న సీఎంఆర్ఎఫ్..ఎమ్మెల్యే
Job |దేవుడిచ్చిన వరమే ప్రభుత్వ ఉద్యోగం
Job | దేవుడిచ్చిన వరమే ప్రభుత్వ ఉద్యోగం Job | రాప్తాడు, ఆంధ్రప్రభ
CM Revanth |భూభారతి కాదు ..భూ… హారతి
CM Revanth | భూభారతి కాదు ..భూ… హారతి రైతులకు ఇచ్చిన నోటీసులు
వేట్లపాలెం ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు #Vetlapalem#ChandrababuNaidu#AndhraPradesh#CMVisit
మావోయిస్టులపై రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి: బండి సంజయ్
మావోయిస్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అర్బన్ నక్సల్స్ను కమిటీల్లో వేస్తున్నారని, లొంగిపోయిన మాజీలను ప్రోత్సహిస్తున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారు. లొంగి పోయిన మావోయిస్టులను పిలిచి ప్రోత్సహిస్తున్నారని, మరోవైపు అర్బన్ నక్సలైట్ భావజాలమున్న వాళ్లను కమిటీలు, కమిషన్లలో వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్ కు విలువేముందని ఆయన ప్రశ్నించారు. విద్యా రంగం అభ్యున్నతి కోసం సిఫారసులు చేయకుండా ఉపాధ్యాయుల జీతాలను తగ్గించాలని చెబుతున్న విద్యా కమిషన్ రిపోర్టును చెత్త బుట్టలో వేయాలని, లేకపోతే మూసీలో పడేయాలని, రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తులకే నైతికత లేదని ఆయన విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన నివేదిక అని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బ తీసి అవమానించడమే అవుతుంది ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు ఏకం కావాలని. ఉపాధ్యాయులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయుల జీతాలను తగ్గించాలని చెప్పడం సిగ్గు చేటని ఆయన అన్నారు. విద్యావేత్తలు లేని విద్యా కమిషన్ ఇదని ఆయన విమర్శించారు. విద్యా శాఖకు మంత్రి లేరనే విషయాన్ని కూడా గుర్తించని కమిషన్ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. చాక్ పీసులకు పైసల్లేక, స్కావెంజర్లు లేక స్కూళ్లు అల్లాడుతుంటే పరిష్కార మార్గాలు చూపడం లేదని ఆయన దుయ్యబట్టారు. కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుండి 45కు పెంచడం దుర్మార్గం అని, పేద విద్యార్థులు స్కూల్ స్థాయిలోనే ఫెయిలై ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోకుండా రూపొందించిన ఏకపక్ష నివేదిక ఇది అని ఆయన విమర్శించారు. ఇండ్ల కూల్చివేతలో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం అని ఆయన అన్నారు. కూల్చి వేతల ప్రభుత్వం అని ఇండ్లు కూలుస్తున్నారని. గుడులను కూలుస్తున్నారని, ఇదేవిదంగా చేసే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వం 4 కోట్ల ఇండ్లను కట్టించి ముందుంటే, కాంగ్రెస్ కూల్చివేతల్లో ముందుంది ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
on8countries|ఇరాన్పై దాడులను సమర్థించుకున్న నెతన్యాహు
on8countries| ఇరాన్పై దాడులను సమర్థించుకున్న నెతన్యాహు on8countries | క్షిపణి స్థావరాలు, రెవల్యూషనరీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ సస్పెండ్
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రాసికూట్ క్యూట్ చేయడానికి కేంద్రం అనుమతించింది. అరవింద్ కుమార్ పై ఈ కార్ రేస్ కు సంబంధించి అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టుగా సమాచారం. విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెండ్ కొనసాగనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో క్రిమినల్ కేసు నమోదు కాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఏసిబి దర్యాప్తు చేస్తోంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వం చేసిన ఐఏఎస్ల బదిలీల్లో అరవింద్ కుమార్ను ప్రభుత్వం వెయిటింగ్ లో ఉంచింది. అరవింద్కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది.
Chandrababu : వేట్లపాలం ప్రమాద ఘటనస్థలికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వేట్లపాలెం పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు.
Gold |గల్ఫ్ యుద్ధ ప్రభావంతో మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
Gold | గల్ఫ్ యుద్ధ ప్రభావంతో మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
పాక్కి చావో-రేవో.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
పల్లెకలె: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీ ఫైనల్కి అర్హత కోల్పోయిన శ్రీలంక ఈ మ్యాచ్లో పాకిస్థాన్కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ ఈ మ్యాచ్లో గెలిస్తేనే సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. లేకపోతే న్యూజిలాండ్ సెమీస్కు చేరుతుంది. అది కూడా కనీసం 160 పరుగులు చేసి.. కనీసం 65 పరుగుల తేడాతో పాక్ ఈ మ్యాచ్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. కాగా, ఈ మ్యాచ్ పాక్ మూడు మార్పులు చేసింది. బాబర్ ఆజామ్, సైమ్ అయుబ్, సల్మాన్ మీర్జాల స్థానంలో నజీం షా, ఖజ్వా నఫే, అబ్రార్ అహ్మద్లను జట్టులోకి తీసుకుంది. శ్రీలంక రెండు మార్పులు చేసింది. కుషల్ మెండీస్, దసున్ హేమంతల స్థానంలో కమిల్ మిషారా, జనిత్లు జట్టులోకి వచ్చారు. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషారా(కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ శనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక. పాకిస్థాన్: షాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.
Drones |డ్రోన్లకు దరఖాస్తుల ఆహ్వానం.
Drones | డ్రోన్లకు దరఖాస్తుల ఆహ్వానం. Drones | దండేపల్లి, ఆంధ్రప్రభ :
ఇరాన్లో బాలికల పాఠశాలపై దాడి.. 40 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో హార్మోజ్గాన్ ప్రావిన్స్లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 40 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 45 మంది గాయపడినట్లు పేర్కొంది. ఇరాన్ పారామిలిటరీ ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్’కు ఈ ప్రాంతంలో స్థావరం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్లు ఈ ఘటనపై స్పందించలేదు.
February 28 |విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తిని గుర్తించవచ్చు
February 28 | విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తిని గుర్తించవచ్చు కార్పొరేటర్ మరుపల్ల
ఇరాన్, ఇజ్రాయెల్లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ #Iran#Israel#IndianEmbassy#Advisory#EmergencyAlert
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం వెల్గనూర్,గుడిరేవు ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లి
మధ్యప్రాచ్యంలో విమాన రాకపోకలకు అంతరాయం… ఎయిర్లైన్స్ సేవల రద్దు
అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్పై చేపట్టిన దాడుల ప్రభావం మధ్యప్రాచ్య దేశాలపై పడింది.
జిల్లాలో జస్టిస్ జువైనల్ బోర్డు ప్రారంభం
జిల్లాలో జస్టిస్ జువైనల్ బోర్డు ప్రారంభం జయశంకర్ భూపాలపల్లి, ఆంధ్రప్రభ ; బాలల
Tirumala |లడ్డు ప్రసాదంపై నిజాలు అంశంపై చర్చ…
Tirumala | లడ్డు ప్రసాదంపై నిజాలు అంశంపై చర్చ… పవర్ పాయింట్ ప్రజెంటేషన్…హాజరైన
విశాలాంధ్ర-రాప్తాడు : హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి.బి.ఆర్. శర్మ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెడుతూ రూపొందించిన పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ మరియు వినూత్నమైన టెక్నికల్ మోడల్స్ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ వేడుకలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం […] The post ఘనంగా సైన్స్ డే వేడుకలు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition|AP|వేట్లపాలెంలో పేలుడు .. 23మంది ఆహుతి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్, ఎపి, 28.02.26 వేట్లపాలెంలో పేలుడు..23మంది ఆహుతిప్రతి ఇంటికి క్యూ
సామర్లకోట పేలుడులో మృతులు వీరే
సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది
శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ
శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ చిలుపూర్, ఆంధ్రప్రభ : చిల్పూర్
‘వీసా’ చిత్రం నుంచి ‘అనగా అనగా అమెరికా’ లిరికల్ సాంగ్
యువ హీరో అశోక్ గల్లా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వీసా’: వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అనగా అనగా అమెరికా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. ఈ పాటకి సనారె సాహిత్యం అందించగా.. సంజిత్ హెగ్డే ఆలపించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా, అమెరికా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మీరు కూడా ‘అనగా అనగా అమెరికా’ పాటను వినేయండి...
Andhra Prabha Smart Edition|TS|మఠాలను కూలుస్తారా/23మంది ఆహుతి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్, తెలంగాణ, 28.02.26 మఠాలను కూలుస్తారా…. హరీశ్ ఆగ్రహంగ్రేటర్ లో
Cyber crimes |మహిళలు, బాలల రక్షణకు పోలీసుల ప్రత్యేక చర్యలు
Cyber crimes | మహిళలు, బాలల రక్షణకు పోలీసుల ప్రత్యేక చర్యలు సైబర్
బస్ స్టాప్ ప్రారంభం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్
గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవు
కల్తీ పాలు మృతులకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలి సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో భాదితులను పరామర్శించిన సీపీఐ బృందం రాజమండ్రి : గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలని అప్పుడే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయినా బాధితులు […] The post గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవు appeared first on Visalaandhra .
Andhra Pradesh : బాణసంచా తయారీ కేంద్రాలు... మృత్యు లోగిళ్లకు నిలయాలు
ఆంధ్రప్రదేశ్ లో బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు ప్రాణాలు తీస్తున్నాయి
ఈడెన్ గార్డెన్స్ పిచ్ను పరిశీలించిన గంగూలీ.. ఎవరికి అనుకూలమంటే..
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్, భారత్ మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకు ముఖ్యమైనదే. ఈ మ్యాచ్లో గెలిచి జట్టు సెమీ ఫైనల్కి.. ఓడిన జట్టుకు ఇంటికి వెళ్తుంది. దీంతో ఈ ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పిచ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్లో పిచ్ అంటే బౌలింగ్కి అనుకూలిస్తుంది. కానీ, ఈసారి బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరిశీలిచారు. ఈ విషయాన్ని క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తెలిపారు. గంగూలీ పిచ్ విషయయంలో హర్షం వ్యక్తం చేశారని ముఖర్జీ పేర్కొన్నారు. బ్యాటర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుందని.. అదే సమయంలో మంచి లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి ఉంటే బౌలింగ్ కూడా బాగానే సహకారం అందుతుందని స్పష్టం చేశారు.
కరుణగిరి వద్ద ట్రాఫిక్ నిబంధనలు..
కరుణగిరి వద్ద ట్రాఫిక్ నిబంధనలు.. కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవాలకు క్రైస్తవ భక్తులువిరామం
Basara | బాసర ఆలయం మూసివేత Basara | బాసర (నిర్మల్ జిల్లా)
పేలుడు ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ లోని బాణాసంచా పేలుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో, షాపుల్లో, ఇళ్లల్లో, పంట పొలాలు గంజాయి, మద్యం, గుట్కాలు, నాటుసారాపై పోలీసులు సోదాలు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ […] The post జాలవాడిలో కార్డన్ సెర్చ్ appeared first on Visalaandhra .
చిన్నారులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు చేపట్టాలి
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు వంద శాతం హాజరయ్యేలా
విద్యార్థులు సైంటిస్టులు గా ఎదగాలి..
విద్యార్థులు సైంటిస్టులు గా ఎదగాలి.. సైంటిస్టులు గా ఎదిగితే ఒక లక్ష రూపాయలు
ఏపీలో భారీ పేలుడు.. 21 మంది మృతి.. మృతదేహాలన్నీ చెల్లాచెదురు
ఆంధ్ర్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు

26 C