SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలకు మెరుగైన పాలన…

ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలకు మెరుగైన పాలన… సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్..

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:29 pm

రఘురామ దాస భజన కీర్తనల పుస్తక ఆవిష్కరణ..

రఘురామ దాస భజన కీర్తనల పుస్తక ఆవిష్కరణ.. నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:27 pm

కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల పొలిటికల్ బ్రేక్‌ఫాస్ట్

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నార్సింగి సర్కిల్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న జయభేరి టెంపుల్ ట్రీ విల్లాలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ కీలక నేతలు వెళ్లారు. కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ ఃబ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ః ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, […] The post కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల పొలిటికల్ బ్రేక్‌ఫాస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 12:26 pm

శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక..

శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక.. శ్రీశైలం పుణ్యక్షేత్రములో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు… నంద్యాల

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:22 pm

యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి..యూఏఈకి అమెరికన్ ఆర్థికవేత్త తీవ్ర హెచ్చరిక

ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ యూఏఈ యుద్ధంలో పాలుపంచుకుంటే, పర్యాటక స్వర్గధామాలైన దుబాయ్, అబుదాబి నగరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నగరాలు కేవలం విలాసవంతమైన పర్యాటక కేంద్రాలే తప్ప, పటిష్ఠమైన సైనిక రక్షణ వ్యవస్థలు కలిగిన ప్రాంతాలు కావని గుర్తుచేశారు. యూఏఈ అనవసరంగా ఓ చిక్కుముడిలో పడిందని సాక్స్ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో జతకట్టడం ద్వారా ఆ […] The post యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి..యూఏఈకి అమెరికన్ ఆర్థికవేత్త తీవ్ర హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 12:18 pm

రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని భూములు లాక్కుంటున్నారు: కెటిఆర్

హైదరాబాద్: ఔటరింగ్ రోడ్డులో సతీష్ షా ల్యాండ్ పోయిందని బెదిరింపులకు గురిచేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేదని షా కుటుంబం తెలిపింది అని అన్నారు. గౌలిదొడ్డిలోని భూమిని బిఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబం 60 ఏళ్లుగా ఉంటున్నారని రూ.1400 కోట్ల విలువ చేసే భూమిపై కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడిందని విమర్శించారు. ఓ అక్రమార్కుని అడ్డం పెట్టుకుని 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని, సతీష్ షా ను ఇక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించారని మండిపడ్డారు. అబీబుల్లా ఖాన్ అనే సిన్సియర్ అధికారి వీరికి రక్షణ కల్పించారని, తెల్లారే ఆ నిజాయితీ పోలీసు అధికారిని ట్రాన్స్ ఫర్ చేశారని కెటిఆర్ తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని, భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని, అధికారులను అడ్డు పెట్టుకుని అరాచకత్వం చేపడుతున్నారని దుయ్యబట్టారు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని, సతీష్ షా లాంటి ఎందరో బాధితులు ఇంకా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేనే రాజు.. నేనే మంత్రి మా రాజ్యం ఇష్టమున్నట్లు చేస్తాం అనేలా..ధిక్కార ధోరణితో రాష్ట్రంలో గూండాగిరి రాజ్యం కొనసాగుతుందని అన్నారు. పొంగులేటి అక్రమాలపై సభా సంఘం వేయమని కోరుతున్నామని సూచించారు. వందల క్రషర్లు కొనసాగుతున్నాయని సభా సంఘం వేయమని కోరుతుతన్నామని కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంపై గవర్నర్ వద్దకు వెళ్తామని అన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్తాం.. న్యాయం జరిగేలా చూస్తామని, తమకు పోలీసు అధికారి గతి పడుతుందేమోనని పోలీసులు భయపడుతున్నారు అని పేర్కొన్నారు. పోలీసులు ప్రజల వైపు నిలబడాలని..అక్రమాలకు అండగా నిలబడొద్దని కోరుతున్నామని, నిజాం కాలం నుంచి ఉన్న భూములను నిషేధిత జాబితాలో పెట్టారని పలువురు బాధపడుతున్నారని అన్నారు. తమ పేర్లు బయట పెట్టవద్దని వారు అంటున్నారని చెప్పారు. తమ పేర్లు బయటపెట్టకుండా చూస్తామని, తమ లీగల్ సెల్ ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కోటి ఎకరాల భూమి అక్రమంగా గుంజుకోవాలనుకునే యత్నాన్ని అడ్డుకుంటామని, సిబిసిఐడి ఎంక్వయిరీ వేసి పొంగులేటిని కాపాడాలని చూస్తున్నారని అన్నారు. మంత్రి రాజీనామా చేస్తేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేస్తుందని, భూకుంభకోణాలు, మైనింగ్ కుంభకోణాలను బయటపెడతామని కెటిఆర్ సవాల్ విసిరారు.  

మన తెలంగాణ 30 Mar 2026 12:14 pm

ఫ్యాక్ట్ చెక్: మొస్సాద్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత ఇంజనీర్‌ను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేయలేదు

మొస్సాద్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత ఇంజనీర్‌ను బహ్రెయిన్ లో అదుపులోకి తీసుకున్నా

తెలుగు పోస్ట్ 30 Mar 2026 12:03 pm

Nani in Talks to Produce a New Film?

Natural Star Nani has delivered a huge blockbuster with Court as a producer. This small-budget courtroom drama has left Nani and his team in big profits. Nani is not in a hurry and he is lining up new films as producer. He signed the second film of Court director Ram Jagadeesh and the team is […] The post Nani in Talks to Produce a New Film? appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 12:03 pm

అసోంలో 5 గ్యారంటీలు

ఎన్నికల హామీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ప్రకటన నావోబోయిచా(అసోం): ఎన్నికల హామీల్లో భాగంగా అసోం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను ప్రకటించింది. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ… తాజా ఎన్నికల్లో అసోంలో ఐదు గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే వీటిని ఆదివారం నావోబోయిచాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విడుదల చేశారు. ఇవీ ఐదు గ్యారంటీలు… The post అసోంలో 5 గ్యారంటీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 12:02 pm

Attack |యువకుడు మృతి

Attack | యువకుడు మృతి Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:00 pm

ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 11:58 am

మోకిలాలో డ్రగ్స్ పట్టివేత... నలుగురు అరెస్టు

మోకిలా: రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి 33 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోకిలా నుంచి కొల్లూరుకు డ్రగ్స్ తరలిస్తుండగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా 33 గ్రాముల కోకైన్ లభించింది. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

మన తెలంగాణ 30 Mar 2026 11:55 am

కౌశిక్ రెడ్డిపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి

కౌశిక్ రెడ్డిపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:53 am

730000bbl Russia Oil : క్యూబా ఖుషీఖషీ Andhta Prabha SPL Story

730000bbl Russia Oil : క్యూబా ఖుషీఖషీ Andhta Prabha SPL Story

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:52 am

శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..

తెలంగాణ శాసనమండలి వేదికగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన ఃరాఘవ కన్‌స్ట్రక్షన్స్ః శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్‌ను నడుపుతోందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలి భవనం వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో మండలి వద్ద […] The post శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 11:46 am

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ అనిశ్చితి, పెరుగుతున్న ముడిచమురు ధరలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి.సోమవారం ఉదయం 9:21 గంటల సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 1,066.36 పాయింట్లు కోల్పోయి 72,516.86 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 316.30 పాయింట్లు క్షీణించి 22,503.30 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ […] The post కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 11:45 am

మల్లాయి చిట్టూరులో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం

ఘంటసాల, ఆంధ్రప్రభ ; ఘంటసాల మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:44 am

2 Young Men |పాత కక్షల కోణంలో దర్యాప్తు

2 Young Men | పాత కక్షల కోణంలో దర్యాప్తు 2 Young

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:43 am

ఘంటసాలలో చలివేంద్రం ప్రారంభం

ఘంటసాల, ఆంధ్రప్రభ ; వేసవికాలంలో బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయమని శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:40 am

cskvsrr|ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్‌

cskvsrr| ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్‌ గౌహతి వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:40 am

Israel - Iran War : యుద్ధం మరింత విస్తృతం.. నెల రోజులయినా ఆగని దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు చెందిన ఖార్గ్‌ దీవి చమురు టెర్మినల్‌ను స్వాధీనం చేసుకునే అంశంపై బహిరంగంగా వ్యాఖ్యానించారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 11:37 am

మునుగోడులో మార్చి 31న ప్రత్యేక వైద్య శిబిరం

మునుగోడు, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్యాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:27 am

Biker changed my perspective about life and health – Sharwa

Charming Star Sharwanand is gearing up to meet audiences as Biker, in theatres. The movie directed by Abhilash Reddy Kankara and produced by UV Creations, is the first-of-its-kind Motor Racing film in Indian Cinema. As the movie is releasing on 3rd April, the actor attended Delhi Public School’s Marathon, as chief guest. He stated that […] The post Biker changed my perspective about life and health – Sharwa appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 11:24 am

ట్రంప్‌కి ఊహించని ఎదురు దెబ్బ!

తల్లకిందులైన అంచనాలు…దిక్కు తోచని స్థితిలో అగ్ర రాజ్యం తెహ్రాన్: ఎలాగైనా ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అమెరికా తలపెట్టింది. అక్కడ వివిధ జాతుల వారిని వాడుకుని ఇరాన్‌ను దెబ్బతీయాలని అగ్రరాజ్యం ఎత్తుగడ వేసింది. కానీ, అవి వికటించడంతో ఎదురుదెబ్బలే మిగిలాయి. తప్ప్పుడు అంచనాల ఫలితంగా తాను సృష్టించిన సంక్షోభంలో తానే చిక్కుకుపోయింది. నష్టాలను తగ్గించుకోవడానికి ఇప్ప్పుడు నానా తంటాలు పడుతోంది. అమెరికా వ్యూహం ఇరాన్‌కే కలిసి వచ్చినట్లైంది. సుప్రీంలీడర్ ఖామేనీ మరణంతో ఇరాన్ విచ్ఛిన్నమవుతుందని అమెరికా భావించింది. స్థానిక […] The post ట్రంప్‌కి ఊహించని ఎదురు దెబ్బ! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 11:23 am

విద్యార్థుల చేతిలో ఆర్గానిక్ కార్న్

విద్యార్థుల చేతిలో ఆర్గానిక్ కార్న్ ఆంధ్రప్రభ, విజయవాడ ; విజయవాడలోని మారిస్ స్టెల్లా

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:23 am

సరికొత్త కథ, కథనాలతో..

సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం ‘మిరాకిల్’లో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.. సీనియర్ హీరోలు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరో. ‘సత్య గ్యాంగ్, ‘ఫైటర్ శివ’ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన ‘కొండమడుగు’లో పూర్తిచేసుకున్న సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్ సభ్యులందరి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించింది ‘మిరాకిల్‘ చిత్రబృందం. తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్‌గా ‘మిరాకిల్‘ నిలిచిపోతుందని ప్రకటించడం ద్వారా ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది హీరోయిన్ హెబ్బా పటేల్. ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు మన ఇండియన్ స్క్రీన్‌పై రాని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతోంది ఈ చిత్రం’ అని తెలిపారు.

మన తెలంగాణ 30 Mar 2026 11:19 am

ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు లక్ష్యం

ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు లక్ష్యం పెడన, ఆంధ్రప్రభ : ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:15 am

Bihar |ఎమ్మెల్సీ పదవికి…

Bihar | ఎమ్మెల్సీ పదవికి… త్వరలో సీఎం పదవికి కూడా గుడ్‌బై? Bihar

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:14 am

Telangana: హిస్టరీ బ్రేక్.. మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 11:10 am

Custody | 40 గ్రాముల కొకైన్ సీజ్..

Custody | 40 గ్రాముల కొకైన్ సీజ్.. రైల్వే ఉద్యోగితో పాటు ముగ్గురు

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:08 am

Peddi |వస్తుందా..? వాయిదా పడనుందా..?

Peddi | వస్తుందా..? వాయిదా పడనుందా..? Peddi | పెద్ది రిలీజ్ ఎందుకు

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:04 am

Mega star |వినాయక్ సంచలన వ్యాఖ్యలు..

Mega star | వినాయక్ సంచలన వ్యాఖ్యలు.. Mega star | నంది

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:02 am

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... ఇవి వాహనాలకు రాయితీ

హైదరాబాద్: కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఇవి పాలసీ తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవి వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్ నుండి అసెంబ్లీకి ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి ఎలక్ట్రిక్ కారులో ప్రయణం చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి వాహనాలకు 10 నుంచి 20 శాతం ప్రోత్సాహానికి ముందుకు వచ్చిన టాటా మోటార్స్ ను మంత్రి పొన్నం అభినందించారు. మినిస్టర్ క్వార్టర్స్ నుండి అసెంబ్లీ కి ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి వాహనాల కంపెనీలు 10-20 శాతం రాయితులు కల్పిస్తున్నాయని వివరించారు. ఇవి పాలసీలో భాగంగా ప్రభుత్వం వంద శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ మినహాయింపు ఇచ్చిందని, ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లు మినహాయింపు ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇవి వాహనాల ప్రోత్సాహంలో భాగంగా చార్జింగ్ స్టేషన్ లు, మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు రాయితీ ప్రకటించడం జరిగిందన్నారు.  https://www.facebook.com/share/r/1AkyA7KRcL/

మన తెలంగాణ 30 Mar 2026 11:00 am

Telangana |శానసమండలి వద్ద ఉద్రిక్తత..

Telangana | శానసమండలి వద్ద ఉద్రిక్తత.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:00 am

Nayanatara |రేటు బాగా పెంచేసిందా..?

Nayanatara | రేటు బాగా పెంచేసిందా..? Nayanatara | బాలీవుడ్‌లో నయనతార క్రేజ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 10:53 am

గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం

మార్చి 30:( జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింటింగ్‌ షాపులో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో …

జనం సాక్షి 30 Mar 2026 10:51 am

పిల్లాయిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

భూదాన్ పోచంపల్లి, మార్చి 30 (జనం సాక్షి): మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ పెరుమండ్ల మహాలక్ష్మి దానయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు …

జనం సాక్షి 30 Mar 2026 10:43 am

Hyderabad : గ్యాస్ బుకింగ్ పేరిట ఘరానా మోసం

గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:32 am

Hyderabad : హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు

హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:29 am

రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలి: బిఆర్ఎస్ ఎంఎల్ సిలు

హైదరాబాద్: మండల సమవేశాలు ప్రారంభకాగానే బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు నిరసన తెలిపారు. శాసన మండలి వెల్‌లోకి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు దూసుకొచ్చారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని బిఆర్‌ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు నిరసన తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రసంగిస్తుండగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి నిరసన తెలపడంతో సభకు అంతరాయం ఏర్పడింది. దీంతో బిఆర్ఎస్ ఎంఎల్ సిలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం గన్ పార్కు చేరుకొని నినాదాలు చేశారు.  అక్రమ మైనింగ్ కు పాల్పడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కనస్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ, హైకోర్ట్ సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. 

మన తెలంగాణ 30 Mar 2026 10:29 am

రెండు సంవత్సరాల కష్టం, పట్టుదలతో..

చార్మింగ్ స్టార్ శర్వా బైకర్ సినిమా కోసం అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఇందులో అతను 18 ఏళ్ల రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం అతను తన శరీరాన్ని, మనసును పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. శర్వాకు ఉదయం సూర్యోదయం కంటే ముందే మొదలయ్యే రోజు, అలసటతో ముగిసేది. ఎక్కువ దూరం పరుగులు, కఠినమైన వ్యాయామాలు చేసేవాడు. ఈ ప్రయాణంలో యోగా అతనికి కీలకంగా నిలిచింది. జిమ్ అతనికి బలం, సహనం ఇచ్చినప్పుడు, యోగా అతని ఆలోచనలను ప్రశాంతం చేసి, ఫోకస్‌ను పెంచింది.దీంతో అతను బరువు తగ్గి కొత్త లుక్‌ను పొందారు. శర్వా కొత్త అవతార్‌కి అద్భుత స్పందన వస్తోంది. శర్వా మాట్లాడుతూ..‘షూటింగ్ మొదటి రోజు అద్దంలో చూసుకున్నప్పుడు, నేను సిద్ధంగా ఉన్న, క్రమశిక్షణతో ఉన్న, అప్‌డేటెడ్ వ్యక్తిని చూశాను. ఈ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పింది. ఎంత నిరాశలో ఉన్నా.. ఒక నిర్ణయం తీసుకుంటే పూర్తిగా మారిపోవచ్చు. ఏప్రిల్ 3న మీరు స్క్రీన్‌పై విక్కీని చూస్తే, అది కేవలం నటన కాదు- రెండు సంవత్సరాల కష్టం, మారాలనే పట్టుదల ఫలితాన్నిని చూస్తారు”అని అన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 10:27 am

Andhra Pradesh : ఏపీలో కొనసాగుతున్న ట్రావెల్స్ బస్సుల తనిఖీలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:26 am

పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం..

పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : పేద కుటుంబాలకు ప్రభుత్వం

ప్రభ న్యూస్ 30 Mar 2026 10:25 am

గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బాగారెడ్డి..

గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బాగారెడ్డి.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద

ప్రభ న్యూస్ 30 Mar 2026 10:15 am

విశాఖలో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి.. ముక్కలుగా నరికి?

విశాఖపట్నంలో దారుణం జరిగింది. గాజువాకలో ఒక యువతి హత్య సంచలనం కలిగించింది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:13 am

మానవత్వం చాటుకున్న పోలీసులు..

మానవత్వం చాటుకున్న పోలీసులు.. నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాలపేటలో

ప్రభ న్యూస్ 30 Mar 2026 10:06 am

Real Facts: Rajamouli considering two-part Release for Varanasi

SS Rajamouli is completely busy with Varanasi, a high-voltage actioner which has a mythological touch. Mahesh Babu, Priyanka Chopra and Prithviraj Sukumaran will be seen in the lead roles and the film’s shoot is planned to be wrapped up before September this year. The film was announced for April 7th release across the globe. For […] The post Real Facts: Rajamouli considering two-part Release for Varanasi appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 9:59 am

శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని, మోహన్ మాతే..

శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని, మోహన్ మాతే.. గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:57 am

నగర నిద్ర మేల్కొలుపు

చీకటి దుప్పటిని తొలగిస్తూ, సూర్యుడు అపార్ట్మెంట్ కిటికీల సందుల్లోంచి నగరపు ముఖంపై నీడలువిసిరాడు పల్లెలోలాగా నెమ్మదిగా కాదు ఒక అలారం గంటలా! నగరం ఉలిక్కిపడి మేల్కొంది కాంక్రీట్ వనంలో, కిలకిలలకంటే ముందే కంట్రీ యార్డ్ పాల బండ్ల చప్పుడు న్యూస్ పేపర్ల విసిరివేత నిశ్శబ్దాన్ని ముక్కలు చేశాయి మెట్రో పట్టాలు, సిల్వర్ పాముల్లా మెరుస్తూ వేగాన్ని ఆహ్వానించాయి పార్కుల్లో, చెమట చుక్కలు రేపటి లక్ష్యాల కోసం రహదారులపై రాలాయి టీ కొట్టు దగ్గర, పొగలు కక్కే గ్లాసుల్లో రాజకీయాలు, వార్తలు వేడివేడిగా చర్చకు వచ్చాయి దేవాలయపు గంటల కంటే ట్రాఫిక్ సిగ్నళ్ళ వెలుగులే ఇక్కడ మార్గాన్ని చూపుతాయి అపార్ట్‌మెంట్ ఇరుకు గదుల నుండి ఒత్తిడిని తరిమే డికాషన్ ఘాటు మొక్కుబడిగా ముగిసే అగరొత్తి ధూపం.. కలుషిత గాలిలో తమ ఉనికి కోసం వెతుకులాడుతున్నాయి ఇక్కడ ప్రతి ఇల్లు ఒక చిన్న గుడి కావాలని తపిస్తుంది కానీ, కాలపు వేగంలో ఆ ప్రశాంత పరిమళం.. మెషీన్ల శబ్దాల మధ్య మౌనంగా మిగిలిపోతుంది ఆలయ వంటశాల నేతి వాసన బదులు హోటళ్ల నుండి వచ్చే కాఫీ పరిమళం గాలిలో ఆధునికతను నింపింది ప్రతి మనిషి, ఒక సెకనుతో యుద్ధం చేస్తూ కదిలే యంత్రమై, పరుగు మొదలుపెట్టాడు పట్టణపు ఉదయం, ఇది ఒక నిరీక్షణ కాదు.. అంతులేని ప్రయాణంలో ఒక విరామం లేని ఆరంభం! - విజయ రామ రాజు (ప్రవిరారా)

మన తెలంగాణ 30 Mar 2026 9:56 am

Summer Effect : వామ్మో ఏప్రిల్, మే నెలల్లో ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతాయో తెలిస్తే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి

తెలుగు పోస్ట్ 30 Mar 2026 9:55 am

YSRCP : నేడు వైసీపీ చలో మూలా పేట

వైసీపీ నేతలు నేడు మూలాపేట పోర్టు కు వెళ్లనున్నారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 9:50 am

సముద్రం-ఒక నీలి సత్యం

నింపాదిగా నిలబడి ఉంటాను ఏ శబ్దమూ నేర్పకుండానే, నన్నుచదివేస్తున్న నిశ్శబ్ద విస్తృతిని ఎదుర్కొని.. ఇక్కడ కాలానికి గడియారం లేదు దూరానికి అంచులు లేవు మనసులో పేరుకుపోయిన అనవసర బరువులన్నీ స్వయంగా వదిలిపోతాయి ఒకే రంగులో, వేల భావాల్ని దాచుకున్న ఈ అగాధం బోధించదు, భయపెట్టదు కేవలం మనలోకి మనల్నే చూడమంటుంది ఎన్ని శ్రమల్ని మోసుకొచ్చినా తన ముఖంపై ఒక్క చిన్న మడత కూడా పడనివ్వని, ఆ స్థైర్యమే నాకు నిత్యపాఠం ఇక్కడ, ఆక్రమణ లేదు, అంగీకారమే ఉంది ఓటమి లేదు, విస్తరణ మాత్రమే ఉంది నేను మాట్లాడితే చిన్నబోతానని ఇది నన్ను మౌనంలోకి తీసుకెళ్తుంది మౌనమే పెద్దగా మాట్లాడుతుందని నాకు అర్థమయ్యేలా.. ఇది దృశ్యం కాదు, ఉపమానమూ కాదు.. మనిషి ఎంత చిన్నవాడూ, అదే సమయంలో ఎంత విస్తరించగలడో, నిర్భయంగా గుర్తు చేసే ఒక నీలి సత్యం.. - డాక్టర్ పెరుగు రామకృష్ణ

మన తెలంగాణ 30 Mar 2026 9:48 am

TVK Vijay |నేటి నుంచి TVK పార్టీ ఎన్నికల ప్రచారం..

TVK Vijay | నేటి నుంచి TVK పార్టీ ఎన్నికల ప్రచారం.. TVK

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:42 am

ప్రమాదంలో పర్యావరణం

చదవాల్సిన పుస్తకం:  అరతి కుమార్ రావ్, ఒక పర్యావరణ ఫోటోగ్రాఫర్, రచయిత, కళాకారిణి. నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్పో్ల రర్‌గా పర్యావరణ క్షీణత తాలుకు ప్రభావాలను నమోదు చేస్తున్నారు. ప్రధానంగా భారత ఉపఖండంలో పనిచేస్తూ, ఆమె ప్రకృతి దృశ్యాలలో మనుషులు తెచ్చిన, తెస్తున్న మార్పులు, వాటి కారణంగా జీవనో పాధి, సంస్కృతి జీవవైవిధ్యంలో వచ్చే మార్పులను నమోదు చేస్తుంటారు. 2023 సంవత్సరపు BBC 100 మహిళల జాబితా లో ఆమెకు చోటు దక్కింది. సామాన్యంగా మనం ఏ పుస్తకం చదివినా ఏదో రకంగా అది మన అనుభవాల్ని కదిలిస్తుంది. దీనికి కూడా స్థాయి, భేదం ఉంటుంది. ఉపశమించిన ఒక ఘర్షణ, అశాంతి, ఆగ్రహం, నిస్పృహ వంటి గాఢమైన అనుభవాలు రక్తనిష్ఠం అవుతాయి.ఒక తీవ్రత చొచ్చుకుని మనలోకి చొరబడినప్పుడు. రచయిత్రి, గంగ, బ్రహ్మపుత్ర, సుందరవనాల గురించి, ప్రధానంగా దూరదృష్టి లేని ఫరక్కా బేరేజి నిర్మాణం చర్చించినప్పుడు నాకు పాత గాయం రేగినట్టయింది. వేలాది మత్స్యకార కుటుంబాలు ఫరక్కా వల్ల మట్టిలో కలిసిపోయాయి. గంగ ప్రవాహ దిశను మార్చుకుంది. గంగలో నివసించే డాల్ఫిన్లు అంతరించాయి. మూడు నదుల్లో చేపలు తగ్గిపోయాయి. అనుభవజ్ఞులైన ఇంజినీర్లు తయారు చేసిన ఈ పథకాలు ఎందుకు వికటిస్తాయి? ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఎవరు? ప్రజల చితికిపోయిన జీవితాలకు పూచీ ఎవరిది? విద్యావంతులైన సాంకేతిక నిపుణులకీ, ఇంజినీర్లకీ, ప్లానర్‌లకి, రాజకీయ నాయకులకీ, డాక్టర్లకీ జ్ఞానం లేక కాదు. వారి జ్ఞానానికి పరిమితులు ఉంటాయనే జ్ఞానం లేకపోవడం, వివేకం లోపించడం. వివేచనా శక్తిలేని జ్ఞానం వినాశానికి దారి తీస్తుంది. జీవావరణ వ్యవస్థల్ని పట్టించుకోకపోవడం, వాటి గురించి తెలియకపోవడం, వాటికి హాని కలిగించే అభివృద్ధి పథకాలు ఎక్కువ కాలం మనలేవు. అదే ఉత్తరాఖండ్‌లో జరుగుతోంది. కొన్ని వందల ఉదాహరణలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇంక రాజకీయ నాయకులకి దురహంకారం, అజ్ఞానం వల్ల ఏర్పడ్డ సంకుచిత దృష్టి. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే ఒకే ఒక జీవితాశయం వారి సహజ వివేచనా శక్తిని ఆవిరి చేస్తుంది. అధిక శాతం ప్రజానీకానికి ఆసక్తి లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్లా, మధ్య తరగతి స్వార్థం వల్లా, ప్రజాస్వామిక చైతన్యం లేకపోవడం వల్లా, దురదృష్టకరమైన దాస్య ప్రవృత్తి వల్లా ప్రభుత్వాల్ని ప్రశ్నించే శక్తి క్షీణించింది. ఈ పుస్తకంలో భూమి గురించి ప్రస్తావన చాలా ఉంది. మన పూర్వజులు జీవావరణ వ్యవస్థల్ని గమనించి, వారున్న భూ స్వభావాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా తమ జీవన విధానాల్ని నిర్మించుకుని ఈ ప్రాణికోటిలో తాము కూడా ఒక భాగమనే వినమ్ర భావంతో జీవించారు. ఇతర జీవరాశుల కంటే తాము ముఖ్యమని గానీ, ఉన్నతులమని గానీ అనుకోలేదు. ఇది మన ప్రాచీనుల నైతికత. ఇటువంటి నీతి అభివృద్ధికి ఆటంకమనుకునే ప్రబలమైన అజ్ఞానం ఇవాళ అనేక ప్రభుత్వాల్ని నడిపిస్తోంది. ప్రాచీనులు జీవించినట్టు మనం జీవించలేం. కానీ వారి నైతిక స్పృహతో జీవించినప్పుడు స్వార్థపూరితమైన విధ్వంసం జరగదు. ప్రపంచ నాగరికతల్ని నిర్మించినది నేల. మడ అడవుల పరిస్థితి గురించి రచయిత్రి సుందరవనాల లంక గ్రామాల్లో జీవిస్తున్న మత్స్యకారుల జీవితాల్ని స్వయంగా చూసి వారితో ఉండి మనకి తెలియచేసింది. సముద్రపు కోతకి గ్రామాలు ములిగిపోతున్నాయి. సముద్రపు కోత ఎందుకు ఎలా జరుగుతుందో స్పష్టంగా చెప్తోందామె. మడ అడవులు విధ్వంసం కథ, ముంబై విమానాశ్రయం. సముద్రంమీది వంతెన నిర్మాణం చాలా కాలం నుంచీ పత్రికల్లో నానుతూనే ఉంది. నగరాన్ని కాపాడే మడ అడవులు, మత్స్య సంతతి వృద్ధి చేసే మడ అడవుల్ని ఎవరి సౌకర్యం కోసం ధ్వంసం చేశారు? అసలు మన దేశంలో పర్యావరణ చట్టాల్ని ఎవరి కోసం కత్తిరించారు? ప్రస్తుతం కేరళ తీరం 60 శాతం సముద్రంలో కలిసిపోయింది. బెంగుళూరులో చెరువులను పూడ్చి టెక్ పార్కులూ, పెద్ద భవనాలూ నిర్మించిన తరువాత ఏ దుస్థితిలో ఉన్నదిప్పుడు? రియల్ ఎస్టేట్‌కి, సంపద వృద్ధి చెయ్యడానికీ ఇప్పుడు భేదం లేదిక్కడ. మనం ఏదేనా నమ్ముతాం. ఈ పుస్తకంలో అదానీ గారి సిమెంటు కంపెనీ కేరళ తీరం కోతకు ఎట్లా కారణం అయిందో రచయిత్రి సశాస్త్రీయంగా వివరించింది. అనేక సందర్భాలలో ఇంజినీరింగ్ సొల్యూషన్స్ విఫలమౌతాయి. నదిని గానీ, సముద్రాన్ని గానీ మనం నియంత్రించి వాటి ప్రవాహమార్గాల్ని మార్చాలనుకోవడం పొరపాటు. ఇప్పుడున్న సాంకేతిక శక్తి వల్ల అటువంటిది చెయ్యడం కష్టం కాదు. రచయిత్రి తిరువనంతపురం దిగువ తీరంలో జరిగిన పెద్ద పొరపాటు చర్చించింది. Arati Kumar థార్ ఎడారి అనుభవాలు అందరకీ తెలియాలి. ఎడారిలో శతాబ్దాల నుంచీ సుఖంగా జీవిస్తున్న ఎడారివాసుల జీవితాల్ని ఒక అభివృద్ధి ప్రణాళిక ఎలా తలకిందులు చేసిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యేటికేడాది శుభ్రమైన మంచినీరు, పాలు, పెరుగు, నెయ్యి, గొర్రెలకీ ఒంటెలకీ అవసరమైన పచ్చిక సమృద్ధిగా దొరికే ఎడారిలో ఇందిరాగాంధీ నహర్ అనే ఒక కాలువని పంజాబు నుంచి తవ్వేరు. దీనివల్ల ఎడారి వాసుల నీటి వనరులు పోయాయి. పచ్చిక అంతరించింది. అనారోగ్యం ఎరుగని, దోమ అనే జీవి ఉంటుందని తెలీని ఈ దురదృష్టవంతులు రోగాల పాలయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఇంజినీర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏ ఒక్కరూ థార్ ఎడారి వాసులని మీకు మంచినీళ్లు ఎక్కణ్నించి వస్తాయని అడగలేదు. స్థానిక జీవావరణ వ్యవస్థల్ని అర్థం చేసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు రచించకూడదు. ఇప్పుడు కాకినాడ సమీపంలో ఉప్పాడ దగ్గిర 300 కోట్ల రూపాయలు వెచ్చించి సముద్రాన్ని నిలవరించడానికి గోడకట్టే ప్రయత్నంలో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పర్యావరణశాఖ సలహా సంప్రదింపులు జరిగాయో లేదో తెలీదు. మన పర్యావరణ చట్టాల ప్రాణం, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పార్టీలకి రాజ్యసభలో ఎంతమంది సభ్యులున్నారనే దానిమీద ఆధారపడి ఉంటుందంటున్నారు. - పతంజలి శాస్త్రి

మన తెలంగాణ 30 Mar 2026 9:41 am

అశ్వ వాహనం పై లక్ష్మీనర్సింహాస్వామి..

అశ్వ వాహనం పై లక్ష్మీనర్సింహాస్వామి.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:34 am

రచయితలు రాసేది, మాట్లాడేది, చేసేది ఒకటై ఉండాలి

నేను, నా సాహితీ యాత్ర: జ్వలిత కలం పేరు. ఇది సోకు కోసం పెట్టుకున్నది కాదు. వివక్షను ఎదుర్కోడానికి అవసరార్థం ఎంచుకున్నది. అమ్మానాన్నలు పెట్టింది విజయ కుమారి దెంచనాల. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా, గార్ల మండలం, పెద్ద కిష్టాపురం గ్రామం. చేతివృత్తుల కుటుంబం. నాన్న దెంచనాల బ్రహ్మయ్య పంచదాయిల పనులు చేసిన నిరుపేద నిపుణుడు. నాన్న పట్టుదల వల్లనే నేను, అక్కా చదువుకోగలిగాము. మా సామాజిక వర్గం లో మా కుటుంబాల్లో మేము మొదటి తరం అక్షరాస్యులం. మా అమ్మ ఈశ్వరమ్మ ఆడపిల్లల చదువు కు వ్యతిరేకి కాదు. పెళ్లయిన తర్వాత, ఇద్దరు పిల్ల లు పుట్టిన తర్వాత, హైదరాబాద్‌లో ఇంటర్మీడియ ట్ లేకుండానే చదివిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సెకండ్ బ్యాచ్ మాది. 1987 డీగ్రీ చేశాను. తర్వాత M.A (తెలుగు), M.Sc (సైకాలజీ), M.Ed, L.L.B పూర్తిచేసి 15 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసాను. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినే! బిఈడి, ఎల్.ఎల్.బీ ఒకే విద్యా సంవత్సరంలో చేశాను. ఎంఏ తెలుగు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండే. 1994 డీఎస్సీ ద్వారా ప్రభుత్వ టీచరుగా సత్తుపల్లిలో ఉద్యోగం మొదలుపెట్టి 2017లో ఖమ్మంలో రిటైర్ అయ్యాను. తెలంగాణ ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో, తెలంగాణ విద్యావంతుల వేదికలో, తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం లో, మట్టిపూలు, రుంజ, టీమాస్ వంటి సంస్థలలో బాధ్యురాలిగా పనిచేసాను. ఇప్పుడు నేను ‘బహుళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక పత్రిక (2021)ను నడుపుతున్నాను. జేడీ పబ్లికేషన్స్ పేరుతో 2020 నుండి ప్రచురణలు చేస్తున్నాను. ‘సాహితీ వనం మిద్దెతోట’ పేరుతో టెర్రస్ గార్డెన్ సాగు 2018నుండి చేస్తున్నాను. రసాయన ఎరువులు వాడను. సేంద్రియ ఎరువుల ను నేనే తయారు చేసి వాడతాను. మిద్దెతోట సాగు గురించి, సేంద్రియ ఎరువుల తయారీ గురించి అవసరమైన వారికి సలహాలు, కౌన్సెలింగ్ ఇస్తుంటాను. కథా సాగరం యూట్యూబ్ ఛానల్ 2019లో మొదలుపెట్టాను. (కథయిత్రుల కథాపఠనం వీడియోలను భద్రపరిచే ప్రాజెక్టు) చేస్తున్నాను. 202223 తెలంగాణ కథల సేకరణ చేశాము. తెలంగాణ అకాడమీ ఈ కథల్ని ప్రచురిస్తోంది. రస్కిన్ బాండ్ షార్ట్ స్టోరీస్ ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. ఇప్పటి వరకు పన్నెండు స్వీయ రచనలు ప్రచురించాను. నాలుగు కవితా సంపుటులు, మూడు కథల పుస్తకాలు, ఒక వ్యాసాల పుస్తకం, రెండు నవల లు, ఒక అనువాద కథల పుస్తకం.కవిత్వ సంపుటాలు కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి (తెలంగాణ ఉద్యమ కవి త్వం), సంగడి ముంత వచ్చాయి. కథా సంపుటాలు ఆత్మాన్వేషణ, రూపాంతరం, ఎన్నెల, ఇవే కాకుండా నాల్గవ కథల పుస్తకం కూడా వస్తున్నది. వ్యాస సంపుటి జ్వలితార్ణవాలు (సాహిత్య సామాజిక వ్యాసాలు) వచ్చాయి. ఎర్ర రంగు బుర ద, నవల- గతంలో తరుణిలో సీరియల్‌గా వచ్చిం ది. ఒడిపిళ్ళు నవల తరుణి అంతర్జాల పత్రికలో సీరియల్‌గా వస్తోంది. అనువాద కథలు, ముజఫర్ నగర్‌లో దీపావళి (తనూజ్ సోలంకి కథలు ఇంగ్లీష్ నుండి తెలుగు, అనువాద కథల సంపుటిని అన్వేక్షికి వారు ప్రచురించారు. నా రచనలు ఆంగ్లంలోకి సైతం అనువాదమయ్యా యి. Murder prolongare - 2008, (‘సుదీర్ఘ హత్య’ ఆంగ్లానువాదం ప్రముఖ వైద్యులు డా.ఎల్. ఎస్.ఆర్.ప్రసాద్ గారు కొన్ని, మెట్టు రవీందర్ గారు మరికొన్ని అనువాదం చేశారు. Wounded Lives-2021లో ‘సంగడిముంత’ ఆంగ్లానువాదం స్వాతి శ్రీపాద గారు చేశారు. Blue Roses publications వారు ప్రచురించారు. Redmire- 2024లో వచ్చిన ‘ఎర్ర రంగు బురద’ ఆంగ్లానువాదం స్వాతి శ్రీపాద గారు చేశారు. అలాగే ‘ఎర్రరంగు బురద’ నవల కన్నడ అనువాదం ఎస్.డి.కుమార్ గారు చేశారు. సప్తగిరి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. సంఘటిత కన్నడ అనువాదం ఎస్.డి కుమార్ గారు చేశారు. నేను సంపాదకత్వం వహించిన సంకలనాలు పదిహేను ఉన్నాయి. అవి పరివ్యాప్త (స్త్రీవాద కవిత్వం), గాయాలే గేయాలై -సహసంపాదకీ యం - తెలంగాణ స్త్రీల కవిత్వం, రుంజ విశ్వకర్మ కవుల కవిత్వం, ఖమ్మం కథలు (1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104మంది రచయితల 104 కథలు), అక్షర పుష్పాలు - భావ సౌరభాలు, ఖమ్మం బాల కవుల రచనల సంకల నం, పోరు-జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన, పూల సింగిడి, బతుకమ్మ కవిత్వంకి సహ సంపాదకత్వం, అవలోకనం, కరోనా డైరీ (126మంది రచయితల డైరీ) 2020 గల్పికాతరువు (104 ఒక పేజీ గల్పికలు), లేఖావలోకనం (పసి పిల్లలపై లైంగిక హింసను ఖండిస్తూ 65మంది లేఖల సంకలనం), విముక్తి, సిస్టర్ అనసూయ- నవల, సంఘటిత(201021 స్త్రీవాద కవిత్వం) మల్లెసాల- (శతాధిక చేతవృత్తి కథల సంకలనం), కొత్త చూపు- మహిళా కథల సంకలనం. బీసీలు అణచి వేయబడుతున్నారు. అంబేడ్కర్ మనుస్మృతి చదివితేనే కదా దాన్ని తగలబెట్టగలిగాడు. రచయితతో పాఠకుడు ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ రచనల్లో జ్ఞానాన్ని సమర్జించుకోవడానికి పాఠకుడు నిజాయితీగా, నిష్పక్షపాతంగా చదవాలి.. రచయితలు రాసేది, కూసేది, చేసేది ఒకటే ఉండాలి కానీ ప్రస్తుతం అలా లేదు. రచయితను చంపేసేటటువంటి విమర్శ ఉండకూడదు. అస్తిత్వ వాదాలను కెరియజం మింగేసింది. ఉన్నదంతా డొల్లతనమే. పిచ్చి రాతలు రాయడం కంటే పెన్ను మూయడమే సరైనది. -  జ్వలిత  

మన తెలంగాణ 30 Mar 2026 9:27 am

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ పేరు “బండారి రాజిరెడ్డి కారిడార్”

మన తెలంగాణ/ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచే ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మితమవుతున్న ఎలివేటెడ్ కారిడార్‌కు “ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కారిడార్”గా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.104పై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఈ నామకరణం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.  ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో దాదాపు 50 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు. తమ తల్లి మల్లాపూర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ తరఫున వార్డ్ సభ్యురాలిగా పనిచేసి ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. తమ అన్నగారు కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి కాప్రా మున్సిపల్ చైర్మన్‌గా, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున దీర్ఘకాలం సేవలందించారని తెలిపారు. 2019లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం కోసం బండారి రాజిరెడ్డి అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. 2014లో తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో బిఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని ఆ పార్టీ తరఫున తనకు టికెట్ లభించిందని తెలిపారు. తమ అన్న కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి అందించిన సేవలను గుర్తించి, ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆయన పేరు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి తమ కుటుంబ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:16 am

IPL 2026 :ఐపీఎల్ లో నేడు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్

. చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 9:16 am

నగరంలో జనం కవి మఖ్దూమ్

నతున్నీసా సాజిదా బానోగా రాయచూరులో పుట్టిన జీనత్ సాజిదా ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూలో డాక్టరేట్ పొంది అక్కడే మూడు దశాబ్దాలు పాఠాలు చెప్పారు. తెలుగు సాహిత్య చరిత్ర గురించి ఉర్దూలో సంపుటి ప్రచురించారు. రంగనాయకమ్మ ‘పేక మేడలు’ ని ఉర్దూలోకి అనువదించారు. హాస్యం, వ్యంగ్యం, సునిశితమైన పరిశీలనా కలిసి వుండే తన కొన్ని కథలు, వ్యాసాల తోనే ఉర్దూ సాహిత్యంపై తనదయిన ముద్ర వేశారు. ఉర్దూ పర్షియన్ ప్రక్రియ ఖాకిలో గాలిబ్, రాజ్ బహదూర్ గౌర్, మఖ్దూమ్ వంటి ప్రముఖుల గురించిన వ్యగ్యం, హాస్యం కలిపిన - కలం చిత్రాలు రాశారు. ‘అసూయతో నిండిన గొంతుక’తో రాసినట్లుండే ఈ వ్యాసం హైద్రాబాదు నగరానికి, మఖ్దూమ్‌కి గల అవినాభావ సంబంధం గురించి మనం ఊహించని రీతిలో చిత్రీకరిస్తుంది. ఈ మఖ్దూమ్ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ అయన గురించి పెద్ద స్తోత్రాలు వల్లిస్తుంటే చూసి అసూయతో నా గుండె రగిలి కబాబ్ అయిపో యింది. అవ్వదా మరి? మామూలు రోజుల్లోనే ఆయనంటే సహజంగానే అసూయ కలుగుతుంది. ముఘల్ పురాలోని నవాబుల నుండి, చిక్కడపల్లిలోని కూలీల వరకూ అందరూ ఆయనతో ప్రేమలో పడేవాళ్ళే. సంవత్సరం మొత్తంలో, ఒక్క నజమ్ లేక ఒక్క ఘజల్ రాసినా సరే, నగరమంతా దాన్ని కంఠస్థం చేసేస్తుందయ్యే. అసలు హైదరాబాదీలందరికీ ఆయన ఒక పెద్ద బలహీనత. గంజాయికి లాగా ఒక వ్యసనమయ్యి కూర్చున్నాడు. ఇప్పుడిప్పుడే ఆంధ్రా నుండి దిగిన వాళ్ళు కూడా మేం కూడా ఉర్దూ నేర్చుకున్నాం అని గొప్ప లుపోతూ (మున్షి అమీరుల్లా తస్లీమ్ రాసిన) ఘజల్ కూని రాగాలు తీసుకుంటూ తిరుగుతున్నారు. మఖ్దూమ్‌కి ఇదంతా తలకెక్కి, ఇంకా చెడిపోయాడు. కవి ననే బడాయి, పైగా ఈ పొగడ్తలు ఆయన్ని ఇంకా చెడ గొట్టాయి. అసలే ఆయన ఒక చేదు మాత్ర లాంటి వాడు. ఇప్పుడు అది పరాకాష్ట కెళ్ళి ఒక పెద్ద వేప చెట్టు చిటారు కొమ్మ మీద కూర్చున్నాడు. దీనికి మంచి విరుగుడు ఆయన్ని అపహాస్యం చెయ్యటం. అందరిళ్ళల్లో లాగే మా ఇంట్లో కూడా అయనకి ఫాన్స్ ఉండబట్టి నాకు ఇంట్లో కూడా ఆయన్ని వ్యతిరేకించటం కష్టసాధ్యం అయిపొయింది. కానీ ఈ స్టేజీ మీద అనేక మంది ముఖ్య అతిథులు ఉన్నారు గనుక, నేను ఆయన్ని గేలి చేసినా, నా జీవితానికి, ఆస్తికి భరోసా వుంది. మఖ్దూమ్ ఒక దుర్మార్గుడు. ఎన్నో రోజుల నుండి నా కోసం ఒక ఘజల్ రాయమని ఆయన్ని అడుగుతున్నాను. ఒక ముషాయిరాలో దాన్ని చదివి దానికి స్పందనగా కరతాళ ధ్వనులు వినాలనుకున్నాను. కవులకి ‘వాహ్‌వా’లు, ‘సుభాన్ అల్లా’లు, ‘ఇర్షా ద్, ఇర్షాద్’లు, ఇంకా చప్పట్లు, ప్రశంసలు ధారాళంగా దొరుకుతాయి. సహజంగానే నా చిన్ని గుండెక్కూడా అవి కావాలనే ఆశ కలిగింది. తాను రాయబోయే కొత్త కవిత నాకు ఇవ్వటానికి మఖ్దూమ్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. విషయం ఏమిటంటే, కవిత రాస్తున్న క్రమంలో ఆయన ఎవరో ఒకరికి దాన్ని వల్లిస్తాడు. వాక్యంలో పావు భాగం, అర భాగం, ముప్పావు వంతు, చివరికి మొత్తం కవిత ఎవరో ఒకరికి వినిపిస్తాడు. చుట్టు పక్కల ఎవరూ లేకపోతే, ఫోన్ చేసి మరీ వినిపిస్తాడు. ఫోన్‌లో ఎవరూ దొరక్కపోతే, వాళ్ళ ఇళ్లకెళ్లి మరీ వినిపిస్తాడు. శ్రోతలు దొరక్కపోతే, రిక్షా ఎక్కి వెళ్ళటానికని వేరే వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకుని మరీ వాళ్ళని దొరక బట్టుకుంటాడు. ఆ డబ్బుని స్వాహా చేసేసి, ఆ కవితని వల్లిస్తాడు. మంచి శ్రోత దొరక్కపోతే, రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఆపి వాళ్లకి వినిపిస్తాడు. మఖ్దూమ్ ని చూసి, దారినపొయ్యేవాళ్ళు కూడా ఆగి వింటారులెండి. తన కవితని రిక్షావాళ్లకి, హోటళ్లలో సర్వర్లకి, చిన్నపిల్లలకి అందరికీ వినిపిస్తాడు. ఆ నజమ్ లేదా ఘజల్ రాయటం పూర్తయ్యేటప్పటికీ, వందలాది మందికి దాన్ని పదేపదే వినిపించేస్తాడు. ఆయన కవిత్వం ఒక అంటువ్యాధి లాంటిది. విన్న శ్రోతలు వెంటనే దాన్ని వేరే వాళ్ళకి వినిపిస్తారు. ఇలా హైదరాబాదీ పబ్లిక్ అంతా చిలకల్లాగా అయన కవిత్వాన్ని కంఠతా పట్టేస్తుంది. నా దగ్గరికొచ్చేసరికి ప్రతి ఒక్కరికీ ఆ కవిత కంఠస్థం అయిపోయి ఉంటుంది. మరి ఆయన్ని దుష్టుడు అనకుండా ఏమనాలి చెప్పండి? మీర్ (ప్రముఖ కవి) కవితలు దొంగిలించటం తేలిక. అందరికీ ఆ కవితలు తెలియవు కాబట్టి ఎవరూ పట్టుకోలేరు. కానీ మఖ్దూమ్ కవితలో చిన్న భాగాన్ని ఎవరికయినా వినిపిస్తే, వాళ్ళు మిగతా భాగం మనకి వినిపించేసి, ‘మఖ్దూమ్ కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా’ అంటారు. ఆల్ ఇండియా రేడియో ఆయన కవిత్వాన్ని పక్కన పెట్టి ఏం సాధించింది? ఆయనకి దానితో ఏ నష్టం కలగలేదు. పనికిమాలిన చేష్టలతో వాళ్ళే ఎక్కడా మొహం చూపించుకోలేకుండా ఉన్నారు. ఆయనే స్వభావ రీత్యా ఒక రేడియో స్టేషన్. తన ప్రోగ్రాములని ఎన్ని సార్లు ప్రసారం చేస్తాడంటే, దగ్గరున్న వాళ్ళూ, దూరంగా ఉండేవాళ్ళూ ఆయన కవిత్వాన్ని కంఠస్థం చెయ్యటం తప్పనిసరి అవుతుంది. కవి సమ్మేళనాలలో కవిత్వాన్ని చదవమంటే మాత్రం, నానా వేషాలు వేసి, తన కవితల్ని తానే మర్చిపోయినట్లు నటిస్తాడు. జనాలు తప్పకుండా చదవాలని పట్టుబడితే తడబడినట్లు నాటకాలేస్తాడు. చివరికి వాళ్ళే ముక్త కంఠంతో అయన కవిత్వం వల్లె వేస్తే, జాతి పుంజు లాగా ఛాతీ ఎగేసి, గర్వంగా చుట్టూ చూస్తుంటాడు. - సునీత

మన తెలంగాణ 30 Mar 2026 9:09 am

Chandrababu :తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 9:08 am

Tollywood has Big Hopes on April

After Sankranthi movies, none of the Telugu films released in January, February and March performed on a decent note. All the big and medium-budget attempts ended up as disappointments. February and March have been disastrous for the distributors and exhibitors of Telugu states. The theatre owners are struggling to screen films with low footfalls. April […] The post Tollywood has Big Hopes on April appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 9:04 am

1 Indian Dead : కువైట్​లో భారతీయుడు…​ Andhra Prabha Latest News

1 Indian Dead : కువైట్​లో భారతీయుడు…​ Andhra Prabha Latest News

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:03 am

ఆసిఫ్ నగర్‌లో అగ్ని ప్రమాదం..

ఆసిఫ్ నగర్‌లో అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్‌ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:00 am

Gold Prices Today : పది రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయా?

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

తెలుగు పోస్ట్ 30 Mar 2026 8:58 am

బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం..

బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఐడీఏ

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:47 am

Tirumala : తిరుమల నేడు వెళ్లే వారికి గుడ్ న్యూస్...సులువు దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 8:46 am

వచ్చే నెల ఏప్రిల్ 3న బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 3వ తేదీన బ్యాంకులకు సెలవులున్నాయి

తెలుగు పోస్ట్ 30 Mar 2026 8:35 am

అత్తాపూర్ లో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం

హైదరాబాద్: మతిస్థిమితంలేని యువతిపై అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ ప్రాంతంలో జరిగింది. హాసన్‌నగర్‌లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓ మతిస్థిమితం లేని యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో సభ్యులు గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 30 Mar 2026 8:32 am

కడియం శ్రీహరికి.. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..

కడియం శ్రీహరికి.. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ శాసనసభలో

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:26 am

నిర్మల్ జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు మృతి

నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 8:18 am

తిరుమలలో వసంతోత్సవాలు..

తిరుమలలో వసంతోత్సవాలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:14 am

Pic: Nani’s Candid Moment With Son Junnu

Hero Nani’s son Junnu celebrates his birthday yesterday .The young boy turns 9.On the special occasion, Nani wished his son, and shared a candid moment. Junnu, with the most infectious, ear-to-ear smile sits on a wooden indoor swing, while his dad Nani rests his head lovingly on the boy’s lap, eyes closed in a peaceful, […] The post Pic: Nani’s Candid Moment With Son Junnu appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 8:04 am

స్నేహితురాలిని ఇంటికి పిలిచి... ముక్కలు ముక్కలుగా నరికిన నేవీ అధికారి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచి అనంతరం ఆమెను ముక్కలు ముక్కలు నరికి ప్రీజులో శరీర భాగాలను దాచిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయనగరం జిల్లా రాజాముకు చెందిన చింతాడ రవీంద్ర(35) నేవీలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వైజాగ్‌లోని ఎల్ వి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రవీంద్ర భార్య తన పుట్టింటికి పోవడంతో తన స్నేహితులు మౌనికను(29) ఇంటికి రమ్మని కబురు పంపాడు. మౌనికను చంపేసి అనంతరం ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు సదరు అపార్ట్‌మెంట్ చేరుకొని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తల భాగం కనిపించలేదని సమాచారం. డబ్బుల కోసం యువతి వేధించడంతో తాను హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 30 Mar 2026 8:03 am

IPL 2026 : ముంబయిదే విజయం.. సులువుగా అతి పెద్ద టార్గెట్ ఛేదన

ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించింది.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 7:53 am

రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు..

రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాయలసీమ జిలాల్లో

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:42 am

America - Iran war : అమెరికా - ఇరాన్ మధ్య చర్యలు పాకిస్తాన్ లో?

అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు త్వరలో తాము వేదిక కానున్నామని పాకిస్థాన్ ఆదివారం ప్రకటించింది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 7:34 am

North Korea : కిమ్ ఆయుధ పరీక్షలు... అప్రమత్తంగా ఉండాల్సిందేనా?

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా లక్ష్యంతో ఆయుధ పరీక్షలను నిర్వహిస్తున్నారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 7:09 am

రాఘవపై రచ్చరచ్చ.. బిఆర్‌ఎస్ సభ్యులపై వేటు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ నుంచి బిఆర్‌ఎస్ శాసన సభ్యులను స్పీకర్ ప్రసాద్‌కుమార్ రెండు రోజుల పాటు లేదా బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. బడ్జెట్ పై చర్చకు పదే పదే అడ్డుపడుతున్నారన్న కారణం తో సస్పెండ్ చేశారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యా దవ్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు, ప ద్మారావు, పల్లా  రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజ య్, కాలేరు వెంకటేశ్, విజయుడు, కె.పి.వివేకానంద్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి ఉన్నారు. శాసనసభలో రెండో రోజు ఆదివారం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ ప్రారంభం నుంచి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైఖరితో తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ సభ్యులు తీరు మార్చుకొని బిల్లులపై చర్చకు సహకరించాలని లేదంటే సస్పెన్షన్ ఎదుర్కొవాలని సూచించారు. అయినప్పటికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టేందుకు వెళ్లేందుఎకు ప్రయత్నించి గందరగోళం సృష్టించారు. అప్రమత్తమైన మార్షల్స్ బీఆర్‌ఎస్ సభ్యులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. దాదాపు అర్ధగంట ఇదే పరిస్థితి కొనసాగగా బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్‌ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్ బడ్జెట్ పై చర్చకు అడ్డు పడుతున్నందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆధారాలు ఉంటే సిబిసిఐడికి ఇవ్వండి బిఆర్‌ఎస్ శాసనసభ్యులను సస్పెండ్ చేయకముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష బిఆర్‌ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమ మైనింగ్ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి కుటుంబమైనా ఇందులో ఎవరున్నా ఆధారాలు ఉంటే సిబిసిఐడి ముందుకు వచ్చి ఇవ్వండి విచారించి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఆధారాలుంటే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ సభ్యులు పదే పదే డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడుతూ మీరు చెప్పింది వినకపోతే పొంగులేటి రాజీనామా చేయాలా? అంటూ ప్రశ్నించారు. మీ తాతలు దిగొచ్చినా అది జరగదని గట్టిగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే పదేళ్ల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఖనిజ సంపద దోపిడీ, అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సీబీసీఐడీ అధికారులకు అందించాలని హరీష్ రావు, కేటీఆర్, ఇతర సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుందని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని సిఎం చెబుతూ హౌస్ కమిటీ వల్ల జరిగేది ఏముంటుందని అన్నారు. కమిటీ నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని మళ్లీ పోలీస్ శాఖనే ఆదేశించాల్సి ఉంటుందని అన్నారు. అదే పని ఇప్పుడు సిబిసిఐడికి ఇచ్చామని, అక్కడ మీ దగ్గర ఆధారాలు ఇవ్వాలని చెబుతున్పప్పుడు ఇక హౌస్ కమిటీ ఎందుకని సిఎం ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి రాజీనామా ప్రసక్తే లేదు హౌస్ కమిటీ వేస్తే మంత్రిని బెదిరించి లొంగదీసుకుని తమ అక్రమాలను బయటపడకుండా చూడాలని ప్రయత్నించడం తప్ప మరేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూడు హౌస్ కమిటీలు వేసి బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజకీయ లబ్ది పొందారని సిఎం గుర్తు చేశారు. అలా తాము హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ది పొందాలని చూడడం లేదని అన్నారు. ఒకవేళ సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణ అప్పగించాలా చెప్పాలని సిఎం తెలిపారు. బ్లాక్ మెయిల్ చేయడానికే హౌస్ కమిటీ కోరుతున్నారని, ఇక్కడ మీ పప్పులు ఉడకవని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీరు చెప్పింది వినకపోతే రాజీనామా చేయాలా? మీ తాతలు దిగొచ్చినా అది జరగదని సిఎం తేల్చి చెప్పారు.

మన తెలంగాణ 30 Mar 2026 6:00 am

30thMarch2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

30thMarch2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 30thMarch2026 |

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:00 am

ధరణి కుంభకోణాలపై హౌస్ కమిటీ వేస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్ర భుత్వం ధరణిని అడ్డం పెట్టుకుని తెరలేపిన భూ కుంభ కోణాలపై హౌస్ కమిటీ వేస్తామని, వాటికి ఒప్పుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. ఆదివారం శాసన సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా బా లానగర్ లో ప్రయివేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారని ఆరోపించారు. హరీ శ్‌రావు ఒప్పుకుంటే దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని సిఎం స్పష్టం చేశారు. భూ కుంభ కోణంలో సొంత బంధువు ను తప్పించాలని సంబంధిత మంత్రిని హరీశ్ రావు కోరారని, వాటికి మంత్రి ఒప్పుకోకపోవడంతో ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలపై కూడా సిబిసిఐడి విచారణ చేయిస్తామని చెప్పడంతో సభ అయిపోయిన తరువాత హరీ శ్‌రావును ఆ కుంభకోణంలో ఉన్న బంధువులు తిట్టారని, హరీష్ రావు పరిస్థితి కుడితిలోపడ్డ ఎ లుకలా తయారయ్యిందని సిఎం ఎద్దేవా చేశా రు. మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై బురద చల్లడానికే బిఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని, భూ కుం భకోణంపై నిర్ధష్టమయిన ఆరోపణలు చేస్తున్నా ని, దీనిపై హౌస్  కమిటీకి సిద్ధమా అని హరీశ్‌రావుకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అంతకుముందు కామారెడ్డి ఎంఎల్‌ఏ కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ప్రభుత్వానికి సూచనలు చేయడం పట్ల సిఎం ఆక్షేపించారు. బిజెపి నేతలకు సూచలు ఇవ్వడం, పారిపోవడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో కెసిఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని సాక్షాత్తు దేశ ప్రధాని, హోం శాఖ మంత్రి అమిత్ షా అన్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో కెసిఆర్, హరీష్ రావును జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి మాటలు నమ్మి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించామని, ఎనిమిది నెలలు గడిచినా ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకున్నారని సిఎం ఆరోపించారు. కాళేశ్వరం కేసులో కెసిఆర్, హరీష్‌రావు ను జైల్లో పెట్టిన తరువాత బిజెపి నేతలు సూచనలు చేస్తే బాగుంటుందని సిఎం స్పష్టం చేశారు. హరీష్ రావు నిజాయితీపరుడని కెటిఆర్, వెంకటరమణా రెడ్డి నమ్మితే హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోవాలన్నారు. సభా సాంప్రదాయాలు పట్టించుకోని బిఆర్‌ఎస్ : డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రజల అవసరాలు తీర్చేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు రాద్ధాంతం చేయడం సరైనది కాదని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సభా సాంప్రదాయాలను గాలికి వదిలేసి బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న చేష్టలు రాష్ట్రం మొత్తం గమనిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఏలుగా 2014 నుంచి 2023 వరకు ఈ సభలో ఉన్నామని, బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడూ బడ్జెట్ కాపీలను చింపి చెవిలో పెట్టుకుని వెళ్లడం కానీ, డిమాండ్లపై చర్చ జరిగినప్పుడు అల్లరి చేయడం కానీ జరగలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం మానవీయ కోణంలో బిల్లు ప్రవేశపెట్టి చర్చకు పెడితే, ఆ చర్చ జరగనీయకుండా, సభా సంప్రదాయాలు, పార్లమెంటరీ భాష, సభ నిబంధనలు తెలిసిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం సరైనది కాదన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా సభలో మంత్రి పేరును వెల్లడించకూడదని తెలిపారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు మంత్రిపై లేవనెత్తిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014 నుంచి 2026 మార్చి 28 వరకు మైనింగ్ రంగంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సిబి సిఐడితో విచారణ జరిపిస్తానని ప్రకటించినట్లు డిప్యూటి సిఎం గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు స్వాగతించకుండా, కావాలనే సభను నడవనీయకుండా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ హయాంలో మూడు హౌస్ కమిటీలు ఏర్పాటు చేశారని, వాటి ద్వారా ఏమి సాధించారు? ఆ హౌస్ కమిటీలలో సభ్యుడిగా ఉండి సమావేశాలు నిర్వహించాలని కోరినప్పటికీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని డిప్యూటి సిఎం వివరించారు. హౌస్ కమిటీలను అడ్డంగా పెట్టుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఎల్‌ఏలను బ్లాక్‌మెయిల్ చేసి బిఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడం తప్ప ఒక్క కమిటీ నివేదికను కూడా బయట పెట్టలేదని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగకుండా కుట్రపూరిత కార్యక్రమాలకు తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం బిఆర్‌ఎస్‌కు తగదని హితవు పలికారు. బిజెపి శాసనసభ్యులు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తామని అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ వారు ఏమి చేస్తున్నారని , బిజపి, బిఆర్‌ఎస్ ఎప్పుడో కలిసిపోయాయని ఆరోపించారు. సభ సజావుగా నడవకూడదు, ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వెల్ఫేర్ పథకాలపై చర్చ జరగకూడదు, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకంపై చర్చ జరగకూడదు, బిఆర్‌ఎస్‌కు తప్ప ఎవరికి మేలు జరగకూడదనే ఆలోచనతోనే బిఆర్‌ఎస్ సభ్యులు సభకు వచ్చినట్టుగా కనిపిస్తోందని భట్టి ధ్వజమెత్తారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి పార్ట్- బిలో పెట్టి తమకు అనుకూలమైన వ్యక్తుల పేరిట పట్టాలు ఇచ్చిందనే విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలు, బాలానగర్‌లో అక్రమ పద్ధతిలో జరిగిన భూ బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌస్ కమిటీ వేయాలని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు . బిఆర్‌ఎస్ శాసనసభ్యులకు హౌస్ కమిటీపై పూర్తి విశ్వాసం ఉంటే సిఎం ప్రకటించిన హౌస్ కమిటీ కి అంగీకరించాలని సవాల్ చేశారు. నా కుటుంబ సభ్యుల భూములు కెటిఆర్ లాక్కున్నారు: దానం కెటిఆర్ నా కుటుంభ సభ్యుల భూములు లాక్కున్నారని ఎంఎల్‌ఏ దానం నాగేందర్ ఆరోపించారు. శాసన సభలో మాట్లాడిన దానం నాగేందర్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కెటిఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బిఆర్‌ఎస్ హాయంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని దానం ఆరోపించారు. మా సొంత భూమిని సైతం కెటిఆర్ వదల్లేదని ఆయన చేసిన పనికి మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ రోజు నోరు మూసుకు కూర్చున్నామని తీవ్ర ఆరోపణలు చేశారు. నా తండ్రి కష్టార్జితమయిన మా సొంత భూమిని కెటిఆర్ ఓ ప్రయివేట్ కంపెనికీ అప్పగించారని, హైదరాబాద్‌లో పుట్టి పెరిగి మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని కావాలంటే రికార్డులు చూపిస్తానన్నారు. ఎంత నష్టపోయామో మా కుటుంబానికి తెలుసని, బాధలు ఎవరికి చెప్పుకోలేకపోయామని వాపోయారు. దొంగతనం చేసిన వారు దొంగ అంటూ అరుస్తున్నారని, తప్పు చేయకపోతే నిజాయతీయిగా హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, దోపిడి జరిగింది: కడియం కడియంపై కౌశిక్ రెడ్డి అసభ్యకర సంజ్ఞలు మండిపడ్డ సభ్యులు గత ప్రభుత్వంలో ధరణిని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు, దోపిడిలు జరిగాయని, వాటిపై విచారణ చేయించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తులు సిగ్గులేకుండా అరుస్తున్నారని, నిజాయితీ ఉంటే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇవి సభా సాంప్రదానికి విరుద్దమని అన్నారు. ఈ దశలో కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎంఎల్‌ఏ పాడి కౌషిక్ రెడ్డి చేసిన సంజ్ఞలు తీవ్ర దుమారం రేపాయి. కడియం మాట్లాడుతున్న సమయంలో బిఆర్‌ఎస్ నేతలు చోర్ చోర్ అంటూ నినదించారు. కౌశిక్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు ఏ పార్టీ ఎంఎల్‌వి, ఏ పార్టీ నుంచి గెలిచావో చెప్పాలంటే నినాదాలు చేశారు. ఈ దశలో కౌశిక్ రెడ్డి ఆవేశంతో బెదిరించారని, గన్ తో కాల్చిపడేస్తాననే, ఇతర చెప్పడానికి వీలు లేని సైగలు చేశారని కాంగ్రెస్ సభ్యులు కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. వీడియోలు పరిశీలించి ఆయన సభత్వాన్ని శాశ్వతంగా తొలగించాలని స్పీకర్‌ను కోరారు.

మన తెలంగాణ 30 Mar 2026 5:30 am

ప్రతిపక్షం లేకుండానే నేడు బడ్జెట్‌కు ఆమోదం

మన తెలంగాణ/హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ స మావేశాలను అక్రమ మైనింగ్ అంశం సభను కుదుపేసింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థ అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీకి డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సభా కార్యకలాపాలను అడ్డుకుంది. రెండు రోజులుగా ఇదే అంశం తో సభ ను బీఆర్‌ఎస్ సభ్యులు స్తంబింబిం చేయడంతో వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు (సోమవారం వరకు) సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఆమోదించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండానే సోమవారం ప్రవేశపెట్టనున్న ద్రవ్యవిబిల్లు ఆమోదం పొందనున్నది.ఇలా ఉండగా ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేసిన హౌస్ కమిటీకి ససేమిరా అంగీకరించని ప్రభుత్వం, ధరణి చట్టం పేరిట గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై హౌస్ కమిటీకి అంగీకరిస్తారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్ విసిరి రెండు రోజులుగా సభలో జరిగిన చర్చను మరో మలుపు తిప్పారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి సంజ్ఞలతో చేసిన అనుచిత ప్రవర్తన చివరకు ఎథిక్స్‌కు కమిటికి సిఫారసుకు దారితీసింది. ఈ కమిటీ పాడి కౌశిక్‌రెడ్డి శాసనసభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుకు సిఫారసు చేస్తుందా? లేక మరేదైన చర్యకు సిఫారసు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీ చేయబోయే సిఫారసు భవిష్యత్‌లో మరే సభ్యుడు కూడా పాడి కౌశిక్‌రెడ్డి మాదిరిగా ప్రవర్తించకుండా కఠినంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. దీంతో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిన మాదిరిగానే చర్యలు ఉండే అవకాశం ఉంది. కాగా అక్రమ మైనింగ్ వ్యవహారం సభలో చివరకు దళిత సామాజిక వర్గం సభ్యుడికి జరిగిన అవమానంగా కొత్త రంగు పులుముకుంది.

మన తెలంగాణ 30 Mar 2026 5:00 am

తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఓకే..

మన తెలంగాణ/హైదరాబాద్ : తల్లిదండ్రులను చూసుకోలేని వా రిని సమాజం బహిష్కరిం చాలని, ఇది ఒక సామా జిక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనం నుంచి.. రూ.10 వేల వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ య్యేలా సభలో బిల్లు పెట్టి చట్టం తీసుకవస్తున్నామని సీఎం వివరించారు. తల్లి దండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు ఆమోదం తెలుపాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్ని పక్షాలకు పిలుపుఇచ్చారు. అసెంబ్లీలో ఆదివారం ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆ మోదించింది. ఇది కేవలం ప్రభు త్వ ఉద్యోగులకే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా దీని పరిధిలోకి తీసుకవస్తున్నామని సీఎం తెలిపారు. పిల్లల హక్కుల కోసం, మహి ళల భద్రత కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోం దని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదని అన్నారు. తల్లిదం డ్రులను చూసుకోని పిల్లల్లో భయం కలిగించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. తల్లిదండ్రుల బాగోగులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరిం చాలని, ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, ఒక సామా జిక బాధ్యత అని సీఎం పిలుపు నిచ్చారు. అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు. అనే సామెత నిజం కాకూడదని, బతికున్నప్పుడు గుప్పె డు మెతుకులు పెట్టని బిడ్డలు చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం కన్నా ఘోరం మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురాణాలలో మాతృ పితృ భక్తికి శ్రవణ కుమారుడి కథ అద్దం పడుతోందని, అయితే ప్రఖ్యాత ‘రేమండ్స్’ బ్రాండ్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా (87) మరణంపై స్పందిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన, చివరి రోజుల్లో అనామికుడిగా తనువు చాలిం చడం అత్యంత విషాదకరమన్నారు. తన ఆస్తి మొత్తాన్ని గిఫ్ట్ డీడ్ ద్వారా కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత, కన్న తండ్రి ని ఇంటి నుండి బయటకు పంపేయడం, కారు, డ్రైవర్ సౌకర్యాలను కూడా తొలగిం చడం ఆధునిక సమాజపు క్రూరత్వానికి అద్దం పడు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశానని ఆయన తన ఆత్మకథలో రాసుకోవడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక హెచ్చరిక అని వెల్లడిం చారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఈరోజుల్లో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. కుటుంబ నియంత్రణతో ఒక్కరో ఇద్దరికో పరిమితం అయ్యామని అన్నారు. ఆడ బిడ్డలకు తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారని వివరి ంచారు. తనకు తెలిసిన ఒక ప్రజాప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే ఆయనను చూసుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇటీవలే ఆ తండ్రి మరణిం చారని విచారించారు. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూ డదన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగు లకే కాదని, ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తల్లిదం డ్రులను చూసు కోలేనోడు - సమాజంలో బతకడానికి వీల్లేదని అన్నారు. సామాజిక బాధ్యతగా ఈ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కాదు, ఈచట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే తమ ప్రయత్నం అని చెప్పారు.

మన తెలంగాణ 30 Mar 2026 4:30 am

రెండేళ్లలో ఎస్‌ఎల్‌బిసి పూర్తి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎండాకాలం లో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌ ర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన ప్రకటించారు. 2028 జూన్ మాసాంతానికి ఎస్.ఎల్. బి.సి పాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు పో తుందని ఆయన తెలిపారు. ఆదివారం శాసనసభలో నీటిపారుదల శాఖపై కాంగ్రెస్‌కు చెంది న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంఐఎం సభ్యు లు బల్లాల తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ ఎస్‌ఎల్‌బిసి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని ఇది పూర్తి అయితే ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో సమృద్ధిగా సాగునీటి సరఫరాతో పాటు ఫ్లోరోసిస్ రహిత సురక్షిత మైన త్రాగు నీటిని అందించవచ్చని ఆయన వివరించారు. అయితే 2025, ఫిబ్రవరిలో దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో కార్మికులు దుర్మరణం పాలు కావ డం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గాను అత్యధునాతన సాంకేతిక పద్ధతులతో అంతర్జాతీయ ప్రమా ణాల కనుగుణంగా పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అయితే అదే సమయంలో కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అంతకు ముందు జరిగిన ఘటన పునరావృతం కాకుండా శాస్త్రీయ పద్దతిలో పర్యవేక్షణతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు పరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన బిఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల రంగం మీద 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం సాధించ లేకపోయారని ఆయన విమర్శించారు. అందులో పెద్దఎత్తున నిధులు వెచ్చించి కాలేస్వరం ప్రాజెక్టును నిర్మించినా అది కూలిపోయిన విషయం సభకు విదితమేనన్నారు. వారి పాలన లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినా కొత్తగా ఎకరాకు సాగు నీరు అందించలేక పోయారని ఆయన ఎద్దేవా చేశారు. నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేకించి కొత్తగా రెండు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి అధిక వడ్డీతో 97,000 వేల కోట్లు స్వల్పకాలిక ఋణాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రస్తుత ప్రభుత్వం మీద 54 వేల కోట్ల మూల ధనం,27 వేల కోట్ల వడ్డీతో కలుపుకొని 82,000 వేల కోట్ల భారం పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 41,000 కోట్ల మూలధనంతో పాటు 16,000 వేల కోట్ల వడ్డీ మొత్తాలను చెల్లించి నట్లు ఆయన సభకు వివరించారు. అంతే గాకుండా బిఆర్‌ఎస్ పాలనలో చేసిన స్వల్ప కాలిక రుణాలను దీర్ఘకాలిక ఋణలుగా మార్చి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరగడానికి గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోటే అని తెలంగాణ ప్రజలు ఈ గణాంకాలను గుర్తించాలని ఆయన కోరారు. కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ లో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అందుకు అవసరమైన భూసేకరణకోసం ప్రభుత్వం 5,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజిని మంజూరు చేసిందని ఆయన సభకు వివరించారు. జూన్,2026 నాటికి ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పధకంపై 5000 కోట్లు ఖర్చు చేసి కుడా ప్రయోజనం లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18,000 కొట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించిందని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 30 Mar 2026 4:00 am

హౌస్ కమిటీ కాదు..సిబిసిఐడి కాదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సై

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి కి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. త న బావమరిది, తమ్ముడిపై సిఎం ఆరోపణలు చేశారని, అయితే, సిఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. తన బావమరిది, తమ్ముడిపై వచ్చిన ఆరోపణలపై వి చారణకు సిద్ధం అని ప్రకటించారు. సిఎం తమ్ము ళ్లు, బావమరిదిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. హౌస్ కమిటీ కాదు, సిబిసిఐడి కాదు, నేరుగా హైకోర్టు సి ట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధం అని, సిఎం సిద్ధమా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. 20 అంశాలపై విచారణ చేయించాలని తాము స్పీకర్‌కు లేఖ ఇచ్చామని, వీటిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలి సి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి సిఎం రేవంత్ రెడ్డి దొరికిపోయారని పేర్కొన్నారు. ఏ పని కోసం తానెప్పుడూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేయలేదని స్ప ష్టం చేశారు. పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందని చెప్పారు. తప్పు జరిగిందని సిఎం, మైనింగ్ శాఖ మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని తెలిపారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది కాబట్టి ముఖ్యమంత్రి ఎదురు దాడి చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. సమాధా నం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. పొంగులేటి మంత్రిగా ఉంటే విచారణ సజావుగా సాగదు అని, అందుకే మంత్రికి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రికి రూ.28 లక్షల జరిమానా వేశారని, ఆ జరిమానా కట్టలేదని, అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సభలో ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి పది తప్పులు చేశారని విమర్శించారు. మీటర్లు లేకపోవడంతో డీజిల్ జనరేటర్లతో నడుపుకోమని అనుమతి ఇచ్చామని అన్నారని పేర్కొన్నారు. ప్రశ్నిస్తున్నందుకే మాపై కక్షగట్టారు హుజూరాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డిపై పగబట్టి సిఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్‌రెడ్డిపై కక్ష గట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి ముందు నిలబెట్టాలని ఘాటు విమర్శించారు. ప్రశ్నించే గొంతుకైన కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. మొదటి నుంచే కౌశిక్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిగ్గు తేల్చుతూ ప్రశ్నిస్తున్నారని, గట్టిగా మాట్లాడుతున్నందుకే ఆయనపై కక్షతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి ఇంటిపై దాడులు చేయించారని, సిబిసిఐడి విచారణలు పెట్టారు, అనేక అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. కానీ, కోర్టులే ఆ కేసుల్లో నిజం లేదని గుర్తించి పలుమార్లు బెయిల్ ఇచ్చాయని గుర్తు చేశారు. ఇది కౌశిక్ రెడ్డి మీద దాడి కాదు..ప్రశ్నించే గొంతుల మీద దాడి..ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 3:40 am

మంత్రుల నియోజకవర్గాలకేనా నిధులు?

మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వ డం లేదని, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని, ఎమ్మెల్యేలు కూడా భాగమని ఆయన తెలిపారు. తాము నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగాలా? అని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ము గ్గురు మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం ఏం చేసినా, నిధులైనా ఖమ్మం జిల్లాకే వెళుతున్నాయని బయట టాక్ నడుస్తోందని అన్నారు. మంత్రులు, సిఎం నియోజకవర్గాల్లోనే పనులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్‌లకు డబ్బులు అందుతున్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్ల కోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డి మాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లిఫ్ట్‌లన్నీ హుజూర్‌నగర్‌కే.. మరోవైపు లిఫ్ట్‌లన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌కు తరలిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. నిర్ణయాలు, క్రమశిక్షణలో కరెక్ట్‌గా ఉందని ఆయన అన్నారు. అలాగే, నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేస్తే మనకు చుక్క నీరు రాలేదన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు ప్రజాధనం వృధా చేసిందన్నారు. కెసిఆర్ ఓ నియంతలా పాలించారని, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ పేరుతో వివక్ష చూపారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ఎన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసిందని ఆయన అన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పిన వినకుండా కెసిఆర్ ఇంజనీర్‌గా మారి మేడిగడ్డకు బ్యారేజీను మార్చారన్నారు. ఇది కూలిపోయే స్థితికి వచ్చిందన్నారు. కాలువలు పూర్తి చేసి పొలాలకు నీరు అందించాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రూ.714 కోట్లతో లక్ష ఎకరాల నీటిని అందించే విధంగా బ్రాహ్మణ వెల్లెంలా ప్రాజెక్టును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 2004 నుంచి 2014ల మధ్య 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. 2014 నుంచి బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక పని కూడా చేయలేద న్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగతా పనులు పూర్తి చేసి బ్రాహ్మణ వెల్లెంలా రిజర్వాయర్‌లోకి నీటిని నింపామని ఆయన తెలిపారు. అయితే, కాలువలు పూర్తికాకపోవడంతో పొలాలకు నీరు రావడం లేదని, తొందరగా కాలువలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యార్థులు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విద్య, వైద్యాన్ని గాలికి వదిలేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరిపడా మౌలిక సదుపాయాలు లేవని, ఒక విద్యార్థి ఉన్నచోట ఎక్కువ మంది టీచర్లు ఉన్నారని, 100 విద్యార్థులు ఉన్నచోట ఒక టీచరే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యా ర్థులు చదువుతున్నారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 శాతం మెస్ చార్జీలు పెంచినప్పటికీ ఆహారంలో నాణ్యత లేదని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 30 Mar 2026 3:20 am

ఇక భూతల పోరు?

దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్‌పై భీకర భూతల దాడులకు అమెరికా రం గం సిద్ధం చేసుకొంటోంది. ఇందులో భాగంగా ఆదివారం అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక యుఎస్‌ఎస్ ట్రిపోలీ పశ్చిమాసియాకు చేరింది. అయితే ఇది ఏ ప్రాంతంలో ఉందనేది వెల్లడికాలేదు. ఈ యుద్ధ నౌకలో 2,500 మంది వరకూ మెరైన్ సైనికులు ఉన్నారు. ఇ ప్పటికే ఇక్కడున్న సైన్యంతో కలిపితే ఇప్పుడు ఇక్కడ అమెరికా నావికాదళం బలం 3,500కు చేరుకుంది. ఇక్కడికి అమెరికా మెరైన్స్ చేరుకున్న విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ సోషల్ మీడియా ద్వారా ప్ర కటించింది. ఇక్కడికి చేరిన ట్రిపోలీ అధునాతన ఉభయచర దాడుల సా మర్థపు యుద్ధనౌకగా పేరొందింది. అంతకు ముందు చైనాకు సవాలు విసురుతూ కొంతకాలం జపాన్ తీరంలో మొహరించుకుని ఉంది. అతి కొద్దిరోజుల్లోనే పశ్చిమాసియాకు అత్యంత సుశిక్షితులైన పదివేల మంది వివిధ స్థాయిల సైనికులను పంపిస్తుందని ట్రంప్ ఇటీవల తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందని చెపుతూనే ఇరాన్‌పై ఇకపై దాడి తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తూ వస్తున్నారు. గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా సేనలు ఇప్పుడు అత్యధిక సంఖ్యలో పశ్చిమాసియాకు చేరాయి. ఇంతవరకూ వైమానిక,క్షిపణుల దాడులలో ఇరాన్ సైన్యం ఎప్పటికప్పుడు శక్తివంతంగా ఉండటం, మరో వైపు అమెరికా సైనిక స్థావరాల ఉన్నాయనే కారణంతో అత్యంత కీలకమైన గల్ఫ్ దేశాలను దెబ్బతీస్తూ ఉండటంతో వెంటనే తీవ్ర కార్యాచరణలో భాగంగా ట్రంప్ ఆదేశాలతోనే భూతలపోరుకు అమెరికా సేనలు సిద్ధం అయినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న బలగాలతోనే ఇరాన్ లోని అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లోకి ఇరాన్ సైనికులు చేరుకుని దాడులకు ,స్వాధీనప్రక్రియకు దిగుతారని వెల్లడైంది. అయితే తక్షణ రీతిలో భూతల దాడులకు అమెరికా దిగుతుందా? లేక మరింత అదును కోసం వేచి చూస్తుందా? అనే విషయంపై స్పష్టత రాలేదు. అమెరికా సేనలొస్తే తగులబెట్టేస్తాం శవపేటికలే భూతల దాడుల హెచ్చరికలపై ఇరాన్ స్పీకర్ స్పందన అమెరికా భూతల దాడులకు సిద్ధం అవుతుందనే వార్తలపై ఇరాన్ స్పీకర్ మెహమ్మద్ బఘెర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరిక సేనలు ఇరాన్ నేలపైకి వచ్చే ఘడియల కోసం చూస్తున్నాం. వారు చేరుకోగానే మా మంటల్లో వారు మాడిపోవల్సిందే. వారినే కాకుండా వారి ప్రాంతీయ స్థాయి వాటాదార్లను కూడా తగు విధంగా శిక్షిస్తామని ఆయన ఘాటైన పదజాలంతో మండిపడ్డారు. అమెరికాకు ధైర్యముంటే ఇరాన్‌పై పదాతిదళ దాడులకు దిగమనండి చూద్దాం అని సవాలు విసిరారు. వారు ఇక్కడికి వస్తే తమ ప్రతీకారం ఎంతతీవ్రంగా ఉంటుందనేది వారికే కాకుండా వారి మిత్ర దేశాల వారికి కూడా తెలిసివస్తుందన్నారు. ఇక అమెరికా నుంచి వెలువడుతున్న చర్చల ప్రతిపాదన గురించి మాట్లాడుతూ వారి షరతులకు తలొగ్గేది లేదన్నారు. అమెరికా నుంచి 15 అంశాల ఫార్మూలా అందింది. దీనిని పాకిస్థాన్ ద్వారా పంపించారు. బలప్రయోగం ద్వారా ఏదో చేయాలనుకున్న ట్రంప్ విఫలం చెంది, ఇప్పుడు ఇటువంటి ప్రతిపాదనలతో లాభం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. అమెరికా ఎప్పటివరకైతే ఇరాన్ సరెండర్‌ను కోరుతూ ఉంటుందో అప్పటివరకూ తమ చేతిలో చావు దెబ్బలు తప్పవని కూడా ఇరాన్ స్పీకర్ వ్యాఖ్యానించారు. ఇక టెహరాన్ టైమ్స్‌లో తొలిపేజీలో అమెరికా సైనికులను ఉద్ధేశించి వెల్‌కమ్ టు హెల్ అని పెద్ద ప్రకటన వెలువరించారు. ఇక్కడ భూతల దాడులకు వచ్చే అమెరికా సైనికుడు ప్రతి ఒక్కరూ శవపేటికలలో తిరిగి వెళ్లేలా చేస్తామని వ్యాఖ్యానిస్తూ వార్తలు వెలువరించారు. సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణిదాడులు అమెరికా నిఘా విమానం అవాక్స్ ధ్వంసం దుబాయ్ ః సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్‌బేస్‌ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్‌ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు. అబూధాబిలో దాడులలో భారతీయులకు గాయాలు అరబ్ ఏమిరేట్స్‌పై ఇరాన్ ఆదివారం క్షిపణిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం అబూధాబిలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని నిర్థారణ అయింది. ఇరాన్ క్షిపణి దాడులను తిప్పికొట్టినట్లు యుఎఇ రక్షణ శాఖ తెలిపింది. శకలాల ధాటిలో ఈ ప్రాంతంలోని కెజాద్‌లో కొందరుగాయపడ్డారని వివరించారు.భారతీయులు కూడా గాయపడ్డ వారిలో ఉన్నారని వారిని చికిత్సకు ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. ఇరాన్‌కు మద్దతుగా హౌతి మిలిటెంట్లు కూడా రంగలంలోకి దిగారు. వీరికి అత్యంత శక్తివంతమైన క్షిపణులు సమకూరుతున్నాయి. యెమెన్ నుంచి హౌతీ బలగాలు తమ సైన్యంపై దాడులకు దిగిన విషయాన్ని ఇజ్రాయెల్ ఆదివారం నిర్థారించింది. .ఇస్లామాబాద్‌లో ఆశ ..గల్ఫ్ చర్చలు ఆరంభం ఇరాన్ నుంచి షరతులతో తాజా ప్రతిపాదన? గల్ఫ్ యుద్ధం నివారణ దిశలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఆదివారం ఈజిప్టు, టర్కీ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఇక్కడ ఈజిప్టు, పాకిస్థాన్ మధ్యవర్తులుగా చర్చలు వేగవంతం అయ్యాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు ముందు ఈజిప్టు , టర్కీ విదేశాంగ మంత్రులతో డార్ మాట్లాడారు. సౌదీ అరేబియా , ఈజిప్టు విదేశాంగ మంత్రులు కూడా ఈ చర్చలలో పాల్గొంటారు. అమెరికా ఫార్మూలాను ఇప్పటికే పాకిస్థాన్ ఇరాన్‌కు పంపించింది. అయితే దీనిని ఇరాన్ తోసిపుచ్చింది. తాజాగా ఇరాన్ నుంచి అతి కొద్ది షరతులతో కూడిన ప్రతిపాదనను పాకిస్థాన్‌కు పంపించినట్లు వెల్లడైంది. వీటిపై ఇస్లామాబాద్‌లో విదేశాంగ మంత్రుల సమావేశంలో సమీక్షించుకుని తరువాతి కార్యాచరణకు దిగుతారని వెల్లడైంది. అయితే ఇరాన్ తాజా ప్రతిపాదనలోని అంశాలు వెంటనే వెలుగులోకి రాలేదు . 

మన తెలంగాణ 30 Mar 2026 3:00 am

సోమవారం రాశి ఫలాలు (30-03-2026)

మేషం గడిచిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృషభం బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. మిధునం బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కర్కాటకం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది. కన్య ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. తుల సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చికం భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి. ధనస్సు స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు. మకరం చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. కుంభం భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంకాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల తో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.  

మన తెలంగాణ 30 Mar 2026 12:10 am

కోల్‌కతాపై ముంబై ఘన విజయం

 ఐపిఎల్ సీజన్ 2026లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం కోల్‌తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మలు అద్భుత బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 38 బంతుల్లోనే ఆరు సిక్సర్‌లు, మరో 6 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. చెలరేగి బ్యాటింగ్ చేసిన రికెల్టన్ 8 సిక్స్‌లు, 4 బౌండరీలతో 43 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. దీంతో ముంబై అలవోక విజయం అందుకుంది. శుభారంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు అజింక్య రహానె, ఫిన్ అలెన్‌లు శుభారంభం అందించారు. అలెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రహానె కూడా మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. ఇటు రహానె అటు అలెన్‌లు జోరుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ముంబై బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అలెన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. అయితే 17 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 18 పరుగులు చేసిన అతన్ని శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. దీంతో 69 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వేలం పాట కింగ్ కామెరూన్ గ్రీన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 40 బంతుల్లో ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అంగ్‌క్రిస్ రఘువంశీ 29 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. రింకు సింగ్ 4 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మన తెలంగాణ 29 Mar 2026 11:27 pm