SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

Namo Re From Nagabandham: Sacred Symphony

The spiritual aura surrounding Nagabandham intensifies with the arrival of its first single, Namo Re, a track that instantly immerses listeners into the film’s divine heart. From the very first frame, the song radiates an ancient serenity, inviting audiences into a world where devotion, culture, and cinematic artistry blend seamlessly. Composers Juned Kumar and Abhe […] The post Namo Re From Nagabandham: Sacred Symphony appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 11:29 am

అన్నమయ్య జిల్లాలో విషాదం ..ఒకే కుటుంబంలో నలుగురు మృతి

అమరావతి: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందారు. తాత, మనవడు, ఇద్దరు మనమరాళ్లు బైక్ పై వెళ్తుండగా..బైకు పొగ పీల్చి ఊపిరిరాడక  తీవ్ర ఇబ్బంది పడి మృతి చెందారు. ఇంట్లో బైకు ఉంచిన గదిలోనే అందరూ నిద్రించటంతో విషాద చాయలు అలుముకున్నాయి. బైకు సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్ లో ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతులు చందన(8), చరిత(8), కార్తీక్(15), రామచంద్రయ్య(70)గా పోలీసులు గుర్తించారు.  

మన తెలంగాణ 15 Mar 2026 11:22 am

Hyderabad : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ లో కొత్త కోణం

మోయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతుంది.

తెలుగు పోస్ట్ 15 Mar 2026 11:10 am

ఆశా వర్కర్లకు అందని జీతాలు..

ఆశా వర్కర్లకు అందని జీతాలు.. – మూడు నెలలుగా వేతనాలు బకాయి– ఆర్థిక

ప్రభ న్యూస్ 15 Mar 2026 10:50 am

ఐసిసి కంటే ఏ జట్టు గొప్పది కాదు.. ఆ రెండు జట్లకు జై షా చురకలు

ముంబై: టి-20 ప్రపంచకప్ 2026కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్లు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో తమకు భద్రత లేదని.. ఇతర కారణాలు చెబుతూ బంగ్లాదేశ్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసిసిని కోరింది. అయితే ఇందుకు ఐసిసి అంగీకరించకపోవడంతో.. టోర్నీ నుంచి వైదొలగింది. మరోవైపు బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తూ పాక్ కూడా రభస చేసింది. చివరికి ఆర్థికపరమైన ఇబ్బందులను కొనితెచ్చుకోవడం ఎందుకని పాకిస్థాన్ టోర్నీలో పాల్గొంది. సూపర్-8 దశలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ రెండు జట్లకు తాజాగా ఐసిసి ఛైర్మన్ జై షా చురకలు అంటించారు. ముంబైలో ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ జట్టు కూడా ఐసిసి కంటే గొప్పది కాదని పేర్కొన్నారు. ‘‘వరల్డ్‌కప్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసిసి ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగా టోర్నీని నిర్వహించాం. ఐసిసి ఛైర్మన్‌గా నేను ఒకే మాట చెబుతున్నా.. ఐసిసి కంటే కూడా ఏ జట్టు గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. అన్ని జట్ల సమూహంతోనే ఆర్గనైజేషన్ రూపొందింది’’ అని జై షా అన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:46 am

Ustaad Bhagat Singh |సరికొత్త రికార్డ్ సెట్ చేసేనా..?

Ustaad Bhagat Singh | సరికొత్త రికార్డ్ సెట్ చేసేనా..? Ustaad Bhagat

ప్రభ న్యూస్ 15 Mar 2026 10:41 am

Mokshagna debut discussion is Back

Nandamuri fans are left in stress and it has been a long wait for the debut of Nandamuri young scion Mokshagna. Though his debut film was announced, it was shelved. There are a lot of rumors about his film but nothing has taken a strong shape. Whenever Mokshagna is seen in public or when his […] The post Mokshagna debut discussion is Back appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 10:29 am

పసిప్రాయాన్ని కాటేస్తున్న హెచ్‌ఐవి

ఆరోగ్యవంతమైన పిల్లలతో సమాజ పురోగతి సాధ్యపడుతుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన కుటుంబానికి సోపానమవుతుంది. నవ్వుతూ తుళ్లుతూ చదువుకునే పిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ముచ్చట ఎంతోకాలం కాదని తెలియక తల్లడిల్లే కుటుంబసభ్యుల వేదన అంతాఇంతా కాదు. చేయని తప్పులకు చిన్నారులు హెచ్‌ఐవి బారినపడుతూ దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. గర్భధారణ, ప్రసవం తదితర కారణాలతో చాలామంది పిల్లలు హెచ్‌ఐవి బారినపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి సుమారు 14 లక్షల మంది పిల్లలు 15 ఏళ్లలోపు హెచ్‌ఐవికి గురయ్యారు. మన దేశంలో తల్లి నుంచి బిడ్డకు, రక్తం ఎక్కించడం, అసురక్షిత రక్తమార్పిడి ద్వారా 5 శాతం మేరకు హెచ్‌ఐవి కేసులు వెలుగు చూస్తున్నాయి. హెచ్‌ఐవితో జీవిస్తున్న 15 ఏళ్లలోపు పిల్లల్లో సగానికిపైగా ‘యాంటీరెట్రో వైరల్’ మందులు వాడుతున్నారు. చికిత్స కన్నా నివారణ ప్రధానమైనది. రోగం వచ్చాక చికిత్స కోసం పరుగులు తీసేకన్నా ముందే రోగం రాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. నివారించదగ్గ జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు ప్రధానంగా తోడ్పడుతుంటాయి. అదే క్రమంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్ రహిత సమాజంగా మార్చేందుకు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఆధునిక పరిశోధనల ఫలితాల వల్ల ప్రసవించి హెచ్‌ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకు ఆ వ్యాధి సోకకుండా ముందుగానే గుర్తించే అవకాశం కలిగింది. దాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో 21వ శాతాబ్దం తొలినాటి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా మొదలై 25 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హెచ్‌ఐవితో పిల్లలు జన్మిస్తుండడం బాధాకరం. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారింది. రోగులపట్ల సమాజంలో నెలకొన్న వివక్ష ఇందుకు కారణంగా తెలుస్తోంది. హెచ్‌ఐవి గుర్తించిన పిల్లలకు ‘యాంటీ రిట్రో వైరల్’ ద్వారా మందులతో సహాయం చేస్తూ వారి జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్నారు. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ మందుపై అవగాహన కొరవడడం, అందకపోవడంతో చాలా మంది పిల్లలు మరణిస్తున్నారు. రోగనిరోధక శక్తిని బలహీనపరిచే వైరస్ హెచ్‌ఐవి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, కేన్సర్‌తో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చికిత్స అందకపోతే శరీరంలో హెచ్‌ఐవి పునరుత్పత్తి చెందుతూ ఉంటుంది. దీంతో దీర్ఘకాలిక అనారోగ్యానికి గురై చివరకు మరణిస్తారు. ఈ వైరస్ సోకిన పిల్లలు చికిత్సలేకుండా ఐదేళ్ల వయస్సు వరకు జీవించే అవకాశముంటుంది. గర్భిణీనుంచి బిడ్డకు వ్యాపించే హైచ్‌ఐవి వైరస్ వ్యాప్తిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల ద్వారా నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ను అరికట్టడంలో పురోగతి ఉన్నప్పటికీ, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇప్పటికీ అధిక సంఖ్యలో పిల్లలు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. 90 శాతం మేరకు తల్లినుంచి సంక్రమిస్తున్నాయి. కలుషిత సూదుల వాడుక, రక్తమార్పిడిలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరుగుతున్నాయి. 84 శాతంకు పైగా సబ్ సహారా ఆఫ్రికాలోని పిల్లలకు సోకుతున్నాయి. 2024 నాటికి 55 శాతం మంది పిల్లలకు మాత్రమే చికిత్స అందాయి. చికిత్స అందక సగం మంది పిల్లలు రెండేళ్లలోపు వయస్సులోనే మరణిస్తున్నారు. మన దేశంలో తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవి సంక్రమణ 74.6 శాతంకు తగ్గింది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ కావడం ఊరట కలిగించే విషయం. అయినప్పటికీ మిజోరాం, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో హెచ్‌ఐవి వైరస్ వ్యాప్తి రేటు ఒక శాతానికి ఎక్కువగా ఉండటం, అలాగే అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బీహార్ వంటి కొన్ని ప్రాంతాలలో హెచ్‌ఐవి పాజిటివ్ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వైరస్ సంక్రమిస్తున్న కేసులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం బీహర్ రాష్ర్టంలోని సీతామఢి జిల్లాలో ఏకంగా 7,400 హెచ్‌ఐవి కేసులు నమోదుకాగా, అందులో 400 మందికి పైగా చిన్నారులు ఉండడం కలకలం సృష్టించింది. తల్లిదండ్రుల కారణంగానే ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించగా, ఒక్క కేంద్రంలోనే నెలకు 40 నుంచి 60 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైద్య పరీక్షలు చేసుకోకుండానే పెళ్లి చేసుకోవడం, ఉపాధి కోసం వలసలు వెళ్లడం, సామాజిక వివక్ష తదితర కారణాలు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు అధికారులు తేల్చారు. సురక్షిత లైంగిక పద్ధతులు, కలుషిత సూదుల వినియోగం, క్రమం తప్పకుండా హెచ్‌ఐవి పరీక్షలు చేసుకోవడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను అక్కడ ముమ్మరం చేశారు. మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నాలో చోటు చేసుకుంది. చేయని తప్పుకు ఆరుగురు చిన్నారులు హెచ్‌ఐవి బారినపడ్డారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను తల్లిదండ్రులు సత్నా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దాతల నుంచి సేకరించిన రక్తంను ఆ పిల్లలకు ఎక్కించిన కొద్ది రోజులకే అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నతాధికారుల దర్యాప్తులో ఆ పిల్లలకు హెచ్‌ఐవి సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం లో 2024 నాటికి 2,22,338 హెచ్‌ఐవి కేసులు నమోదుకాగా, ఇందులో 90 శాతం 15 49 ఏళ్ల మధ్య వయస్సు వారున్నారు. హెచ్‌ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులను నియంత్రించడం ఆరోగ్య రంగానికి పెను సవాలుగా మారిన సందర్భంలో డెన్మార్క్ ఒక చారిత్రాత్మక విజయాన్ని అక్కునజేర్చుకుంది. తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవి, సిఫిలిస్ వంటి వ్యాధులు సంక్రమించకుండా అడ్డుకోవడంలో ఆ దేశం విజయం సాధించింది. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సమర్థవంతమైన ఆరోగ్య విధానాలు, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఈ విజయానికి కారణమయ్యాయి. ‘యాంటీ రెట్రో వైరల్’ చికిత్సతోపాటు మెరుగైన వైద్యసేవలు అందిస్తే ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) వెల్లడించింది. దీన్ని డెన్మార్క్ అమలు చేయడంతో ఆరోగ్య రంగంలో పెద్ద మైలురాయిగా ఫిబ్రవరి 27, 2026న ఆ సంస్థ విడుదల చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. డెన్మార్క్ సూత్రాన్ని అమలు చేయడంలో క్యూబా, థాయిలాండ్ వంటి దేశాలు పాటు పడుతున్నాయి. భారత్ వంటి దేశాల్లో తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమణను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, డెన్మార్క్ బాటలో నడచినప్పుడే ఫలితాలు అందుతాయని డబ్ల్యూహెచ్‌ఒ స్పష్టం చేసింది. - కోడం పవన్ కుమార్ 9848992825

మన తెలంగాణ 15 Mar 2026 10:28 am

Prabhas and Hombale Films: Multiple Options

Prabhas is the biggest pan-Indian actor of the country and he inked a three-film deal with Hombale Films, the producers of KGF franchise and Salaar. After Prabhas turned close with them during the shoot of Salaar, Prabhas loved their professional approach and he promised to do three films. One among them is Salaar 2 and […] The post Prabhas and Hombale Films: Multiple Options appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 10:27 am

తుక్కాపురం గ్రామంలో దారుణం..

తుక్కాపురం గ్రామంలో దారుణం.. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆంధ్రప్రభ : కన్న కూతురు

ప్రభ న్యూస్ 15 Mar 2026 10:20 am

Drugs Party at Rohith Reddy Farmhouse Turns Serious After Firing During Police Raid

A police raid at former MLA Pilot Rohith Reddy’s farmhouse in Moinabad has sparked a major controversy. The Eagle Team carried out the operation after receiving information about a suspected drug party. What started as a routine raid quickly became serious after gunshots were fired during the search. Several people were present at the farmhouse […] The post Drugs Party at Rohith Reddy Farmhouse Turns Serious After Firing During Police Raid appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 9:47 am

పుంగనూరులో విషాదం..

పుంగనూరులో విషాదం.. పుంగనూరు, ఆంధ్రప్రభ : అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గుండెల్ని

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:45 am

Zodiac signs : నేడు ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. నేటి రాశి ఫలాలు ఇలా

దినఫలాలు చూసుకుని మరీ చాలా మంది పనులు ప్రారంభిస్తారు

తెలుగు పోస్ట్ 15 Mar 2026 9:36 am

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం..

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని సెంట్రల్

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:29 am

Gold Price Today : పరాభవనామ ఉగాదికి పసిడి ధరలు మరింత పడిపోనున్నాయా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది.

తెలుగు పోస్ట్ 15 Mar 2026 9:21 am

తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌కు సుస్థిర స్థానం..

తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌కు సుస్థిర స్థానం.. విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగు

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:18 am

సోషల్ డ్రామా, సస్పెన్స్‌తో..

స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పిన స్టోరీకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కథలోని వైవిధ్యం, ఆమె పాత్రలోని లోతు నచ్చడంతో షూటింగ్ కోసం కాల్షీట్లు కేటాయించినట్లు తెలిసింది. సినిమాలో అనుష్క సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతుందట. సోషల్ డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తారు. అరుంధతి, భాగమతి చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతుంది. నందినీ రెడ్డి ఈ కథను డీల్ చేసే విధానం కొత్తగా ఉండబోతోందట. ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలున్న కథను తెరకెక్కించడం నందిని రెడ్డికి కొత్త అనుభవం అని తెలుస్తోంది. ప్రస్తుతం నందిని రెడ్డి... సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశలో ఉంది. మిగతా పనులు పూర్తి చేసి మేలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 9:07 am

ఒక్క ఇల్లు కూల్చకుండా సుందరీకరణ చేపట్టాం : కేటీఆర్

మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవానికి కేసీఆర్‌ హయాంలో చర్యలు చేపట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు

తెలుగు పోస్ట్ 15 Mar 2026 9:05 am

యాదాద్రిలో దారుణం..కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచిన తల్లి

హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో భువనగిరి మండలం తుక్కపురంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె, కుమారుడిని తల్లి కత్తితో పొడిచింది. గత కొంతకాలంగా భర్త నరేంద్ర రెడ్డి, నీలిమ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు వీరి వివాదం తరాస్థాయికి చేరుకోవడంతో నీలిమ ఆవేశంతో పుట్టింకి వెళ్లిపోయింది. కొన్ని రోజులు అక్కడే ఉండగా.. నరేంద్ర రెడ్డి నీలిమ పుట్టింటికి వెళ్లి తన ఇంటికి రమ్మని పిలిచాడు. పుట్టింటి నుంచి వచ్చిన వెంటనే తన పిల్లలను హత్య చేయడానికి పాల్పడి.. తను ఆత్మహత్యకు యత్నించింది. నీలిమ కత్తితో పొడవడంతో కుమార్తె క్రితి రెడ్డి (14) మృతి చెందింది. కుమారుడు ఆశాంత్ రెడ్డి(11)కి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 15 Mar 2026 8:55 am

బోరుబావి గుంతను పూడ్చివేయించిన సర్పంచ్..

బోరుబావి గుంతను పూడ్చివేయించిన సర్పంచ్.. కుంటాల, ఆంధ్రప్రభ : కస్తూరిబా గాంధీ విద్యానిలయం

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:45 am

Hyderabad : అత్తాపూర్ లో హైడ్రా ప్రభుత్వ స్థలం స్వాధీనం

హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఆక్రమిత స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు

తెలుగు పోస్ట్ 15 Mar 2026 8:35 am

Hyderabad : పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం

మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం రేగింది

తెలుగు పోస్ట్ 15 Mar 2026 8:26 am

కొత్త తరహా కథలతో ..

రొమాంటిక్, కామెడీ, కమర్షియల్ కథలతో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కొత్త తరహా కథలతో సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆయన భావిస్తున్నాడట. సిద్ధు వరుసగా ఇప్పుడు ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మూడు కొత్త ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందులో ఒకటి సోషియో ఫాంటసీ స్టోరీతో రూపొందబోతున్న చిత్రమని సమాచారం. కొత్త దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ చాలా కొత్తగా ఉండబోతుందట. మరో ప్రాజెక్టును స్వరూప్ దర్శకత్వంలో సిద్ధు చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్వరూప్ డైరెక్షన్ లో ఇప్పటికే వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ మంచి ప్రశంసలు అందుకుంది. స్పెషల్ స్టోరీ, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆయన గుర్తింపు పొందగా.. ఇప్పుడు అదే దర్శకుడితో సిద్ధు జొన్నలగడ్డ కలిసి పని చేయబోతున్నట్లు వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. విభిన్నమైన కథాంశంతో సినిమా ఉండబోతుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాకుండా మరో మూవీని టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరితో చేయబోతున్నాడట. కమర్షియల్‌గా బలమైన కథతో ఆ సినిమా స్పెషల్ గా ఉండబోతుందని, సిద్ధు కెరీర్ లో ఇది ఒక కీలక ప్రాజెక్ట్ అవుతుందని తెలిసింది. ప్రస్తుతం సిద్ధు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తుండగా.. ఆ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఆయన కొత్తగా ఓకే చెప్పిన మూడు ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే కొత్త కథలు, కొత్త దర్శకులు, ప్రముఖ డైరెక్టర్స్ తో కలిసి పని చేస్తూ ప్రేక్షకులను మెప్పించేలా ఆయన పెద్ద ప్లానే వేస్తున్నారని చెప్పాలి. 

మన తెలంగాణ 15 Mar 2026 8:22 am

రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు..

రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : టాక్టికల్ అర్బనిజంలో భాగంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:20 am

కోగంటి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వసంత స్ట్రాంగ్ కౌంటర్..

కోగంటి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వసంత స్ట్రాంగ్ కౌంటర్.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : హిస్టరీ

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:11 am

రోడ్డు ప్రమాదం..బొలెరో బోల్తా పడి ఒకరు మృతి

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అశ్వరావు పేట వెళ్లుండగా అదుపుతప్పి బొలెరో బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 8:03 am

Venezuela : ఏడేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు

వెనిజులాలోని అమెరికా రాయబార కార్యాలయంపై అమెరికా జెండా మళ్లీ ఎగిరింది

తెలుగు పోస్ట్ 15 Mar 2026 8:02 am

Iran - Israel War : మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్ హెచ్చరికలు

అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం మూడో వారంలోకి చేరిన నేపథ్యంలో ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 15 Mar 2026 7:49 am

కొరియాలో పాటలు, కీలక సన్నివేశాలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం హార్రర్, కామెడీని మిళితం చేస్తూ తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. టీం ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్‌ను సౌత్ కొరియాలో ప్రారంభించింది. కీలకమైన ఒక వారం రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలోని ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనున్న ఈ షెడ్యూల్ ను కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో ప్రధాన భాగం షూటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు కొరియాలో జరుగుతున్న ఈ ఫైనల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తికానుంది. అనంతరం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వెళ్ళనుంది. 

మన తెలంగాణ 15 Mar 2026 7:31 am

వృద్దుడిని బైక్ ఢీకొట్టడంతో..

వృద్దుడిని బైక్ ఢీకొట్టడంతో.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:50 am

రీజినల్ రింగ్ రైల్ డిపిఆర్ సర్వేకు గ్రీన్ సిగ్నల్

మన తెలంగాణ/హైదరాబాద్: నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారీ కోసం సర్వే నిర్వహించేందు కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చే సింది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని  కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. లోక్‌సభలో తాను రూల్-377 కింద లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఈ మేరకు అధికారిక లేఖ ద్వారా వివరాలు అందజేశారని ఆయన పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ తయారీకి అవసరమైన సర్వేను కేంద్రం మంజూరు చేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తు తం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, రీజినల్ రింగ్ రోడ్డు వెంట రైల్వే లైన్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని ఆయన వివరించారు. డిపిఆర్ సిద్ధమైన త ర్వాత, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతారని ఆయన చెప్పా రు. అనంతరం నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మం త్రిత్వ శాఖల ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టుకు తుది మంజూరు లభిస్తుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి పెద్దపీట పడనుందని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి నియోజకవర్గంతో పాటు తెలంగాణా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక చొరవ చూపినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసినట్లు కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు.

మన తెలంగాణ 15 Mar 2026 6:00 am

15MarSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

15MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:00 am

ఖర్గ్ దీవిపై బాంబుల వర్షం

దుబాయ్/ వాషింగ్టన్ : ఇంధన కేంద్రీకృతంగా పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు మరింత రగులుకుంది. శనివారం తెల్లవారుజామున అమెరికా సేనలు ఇరాన్‌కు చెందిన ఖర్గ్ దీవిపై దాడికి దిగింది. ఇరాన్ ఆధీనంలోని ఈ ఐలాండ్ ఇరాన్‌కు 42 కిలోమీటర్లదూరంలో హర్మూజ్ జలసంధి చమురు రవాణా మార్గానికి అనుసంధానంగా ఉంది. ఈ దీవి ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ దీవి ద్వారానే నిరంతరం ఇరాన్ చమురు ఎగుమతులు జరుగుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రధానమైన ఈ దీవిపై తమ సేనలు వైమానిక దాడులకు దిగాయని, అక్కడి దాదాపు 90 సైనిక స్థావరాలను దెబ్బతీశాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్రమేపీ ఇరాన్ చమురు మౌలిక సాధనాసంపత్తిని, ప్రత్యేకించి సరఫరాల వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఈ కీలక దీవిపై దాడి ద్వారా అక్కడి ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయని ట్రంప్ తెలిపారు. ఇప్పటికైనా ఇరాన్ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు నౌకల రాకపోకలకు ఆటంకాన్ని నిలిపివేయాల్సి ఉంది. లేకపోతే ఇరాన్ చమురు వ్యవస్థ పూర్తిగా దెబ్బతినేలా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఖర్గ్ ఐలాండ్ ఆయువుపట్టు వంటిది. చాలా చిన్నదిగా కేవలం ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ దీవి ఇరాన్ చమురు వ్యాపారానికి అత్యంత కీలకంగా ఉంటూ వస్తోంది. ఇక్కడి నుంచే ఇరాన్‌కు చెందిన చమురు ఉత్పత్తులలో దాదాపు 90 శాతం వరకూ కోటా ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతానికి ఖర్గ్‌లోని సైనిక స్థావరాలను దెబ్బతీశామని, అయితే చమురు ఉత్పత్తి స్థావరాల జోలికి వెళ్లలేదని ట్రంప్ ప్రకటించారు. ఈ దీవిపై అమెరికా దాడిపై ఇరాన్ నిర్థారించింది. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తామని, ఇక్కడి చమురు కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం పడలేదని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి. దాడిని ఇరాన్ సాయుధ బలగాల అధికారుల బృందం సమీక్షించింది. ఇరాన్ చమురు మౌలిక సదుపాయా ఇరాన్‌తో అమెరికా , ఇజ్రాయెల్ యుద్ధం రెండో వారం దాటి తీవ్రతరం అవుతోంది. ఈ దశలోనే అమెరికా గల్ఫ్ ప్రాంతానికి పదివేలకు పైగా డ్రోన్లను రక్షణ కవచంగా తరలించింది. ఈ ప్రాంతానికి 2500 మంది అమెరికా యుద్ధ నావికులు , ఓ ఉభయచర దాడుల యుద్ధనౌకను పంపించింది. గల్ఫ్ ప్రా ంతంలోని సైనిక స్థావరాల భద్రతకు ఈ చర్యలు చేపట్టారు. యుఎఇలో ఫుజేరియా పోర్టుపై ఇరాన్ దాడి షార్జాలో అమెరికా నౌకను దెబ్బతీసిన ఇరాన్ వెనువెంటనే యుఎఇలోని ఫుజైరా రేవుపట్టణంపై దాడికి దిగింది. ఆయిల్ టర్మినల్‌కు నష్టం కల్గించింది. యుఎఇకి ఈ ప్రాంతం అత్యంత కీలకమైన చమురు ఉత్పత్తి కేంద్రంగా ఉంది. ఏడు ఎమిరేట్స్‌లలో ఒకటి అయిన ఈ పట్టణం ఓమన్ గల్ఫ్ తీరంలో పర్వతాలు, సముద్రతీరాలతో ఉంది. చమురు నిల్వలు , ఓడరేవు కేంద్రంతో ఉండే ఈ ప్రాంతంలో పలు వృత్తులలో తెలుగువారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఇరాన్ వైమానిక దాడులతో ఈ ప్రాంతంలోని చమురు నౌకల్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పోర్టు చమురు వ్యాపారానికి కీలకంగా ఉంది. ఎక్కువగా ఎగుమతులు సాగే కేంద్రం కూడా కావడంతో ఎమిరేట్స్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం అయింది. ఇప్పటివరకూ అమెరికా సైనిక స్థావరాలనే ఎంచుకుని దాడులకు దిగుతూ వచ్చిన ఇరాన్ ఇప్పుడు ఈ దిశలో తన పద్ధతి మార్చుకుంది. అమెరికా సైనిక స్థావరాలు ఉండే దేశాల ప్రధాన ఆర్థిక వనరులు, చమురు స్థావరాల విచ్ఛిత్తికి సంకల్పించినట్లు ఇప్పటి ఘటనలతో వెల్లడైంది. అయితే ఇక్కడ జరిగిన డ్రోన్ల దాడిని తాము సమర్థవంతంగాతిప్పికొట్టామని యుఎఇ వర్గాలు తెలిపాయి. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై దాడులు ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీ కాంపౌండ్ శనివారం ఇరాన్ దాడులతో దద్దరిల్లింది. ఈ ప్రాంతంలోని హెలిపాడ్‌పై క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు. ఈ విషయంపై యుఎస్ ఎంబసీ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. మరో వైపు ఇజ్రాయెల్, అమెరికా సైనిక బలగాలు ఇరాన్‌లోని పలు పట్టణాలను ఎంచుకుని దాడులకు దిగాయి. అయితే రెవెల్యూషనరీ గార్డ్ తీసుకుంటున్న చర్యలతో ఇరాన్ లోతట్టు ప్రాంతాలలో పెద్దగా నష్టం జరగలేదని వెల్లడైంది. ఇరాన్ పశ్చిమ ప్రాంత నగరం ఇయావాన్‌లో ఓ భవనంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఇరానీయన్లు బలి అయ్యారు. మృతి చెందిన వారిలో ఆరు నెలల శిశువు కూడా ఉంది. పోరు ఆరంభం నుంచి ఇప్పటివరకూ ఇరాన్‌లో 1230 మంది వరకూ దాడులలో మృతి చెందారు. తమ దేశానికి చెందిన 52 సాంస్కృతిక కేంద్రాలు ధ్వంసం అయ్యాయని ఇరాన్ తెలిపింది. కుర్దిస్థాన్ ప్రాంతంలోని సనన్‌దాజ్ లో ఇజ్రాయెల్ దాడులతో ఈ పరిణామం జరిగింది. ఈ విషయాన్ని దేశ సాంస్కృతిక మంత్రిత్వవశాఖ తెలిపింది. ఇక బహరైన్‌పై ఇరాన్ పది డ్రోన్లతో దాడికి దిగింది. 

మన తెలంగాణ 15 Mar 2026 5:30 am

పెళ్లికి నిరాకరించిందని ఎయిడ్స్ ఇంజెక్షన్

మన తెలంగాణ/ఘట్‌కేసర్: మరదలు పెళ్లి చేసుకోన ని చెప్పడంతో ద్వేషం పెంచుకున్న మేనబావ బలవంతంగా ఎయిడ్స్ రక్తంతో కూడిన ఇంజెక్షన్‌ను ఎక్కించిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పోచారం డివిజన్ అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన కె.మనోహర్ (25) నగరంలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సమీప బంధువైన యువతితో గత ఏడాది సెప్టెంబర్‌లో వివాహం నిశ్చయమైంది. అయితే మనోహర్‌కు ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేశా రు.దీంతో ఆగ్రహం చెందిన మనోహర్ యువతిని పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేశాడు. ఈ క్ర మంలో ఈ నెల 11న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లి మరోసారి పెళ్లి విషయ మై వాగ్వాదానికి దిగాడు. యువతి తిరస్కరించడం తో ఆగ్రహానికి లోనైన మనోహర్ ముందుగా తెచ్చుకు న్న ఎయిడ్స్ సోకిన రక్తంతో ఉన్న ఇంజెక్షన్‌ను ఆమె కు బలవంతంగా ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. తరువాతి రోజు యువతికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించగా చేతిపై ఇంజెక్షన్ గుర్తులు కనిపించడంతో వివరాలు అడగగా యువతి జరిగిన విషయం తెలిపింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా మనోహర్ తల్లిదండ్రులకూ ఎయిడ్స్ ఉన్నట్లు, అదే వ్యాధితో అతని తండ్రి మృతిచెందినట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజు వర్మ తెలిపారు.

మన తెలంగాణ 15 Mar 2026 5:00 am

సుందరీకరణ ముసుగులో భూముల ఆక్రమణ

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అ న్నారు. మూసీ బాధితులు సమిష్టిగా రెండేళ్లు కలిసికట్టుగా ప్రభుత్వంపైన పోరాడితే తమ ప్రభు త్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రా జ్యాన్ని పారదోలి ప్రతి ఒక్కరి ఇళ్లను భూములను కాపాడుతామని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ వేదికగా శనివారం కెటిఆర్ ‘ముసీ పునరుజ్జీవం - పవర్ పాయింట్ ప్రె జెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16,000 కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కిలోమీటర్ల మేర విజయవంతంగా అభివృద్ధి చేశామని వివరించారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ వి ధ్వంసానికి పాల్పడుతోందని విమర్శించారు. ఎ లాంటి డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్టు లేకుండా, సో షల్ ఇంఫాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు, ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా వేలమంది ఇండ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తుంద ని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టాలను, ఇతర నిబంధనలను అన్నింటినీ పాతరేసి వేలకోట్ల అవినీతికి తెగబడుతున్నదని విమర్శించారు. అభివృద్ధికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదు అని, అవినీతికి కాంగ్రెస్ పార్టీ భూదాహాని కి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం అని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు పరంగా పెట్టి వందల ఉద్యమాలు చేసి సాధించుకున్న భూమి పుత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎదుర్కొంటామని తెలిపారు. బాధితుల వెంట బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని, ప్రతి ఒక్క ప్రాంతానికి పార్టీ నేతలు, శ్రేణులు వచ్చి మరి నిలబడతామని భరోసా ఇచ్చారు. మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు అందాల పోటీలకు ఫుట్‌బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ రెడ్డి తీరు తయారైందని కెటిఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలకు అభివృద్ధికి డబ్బులు లేవు, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నారని అన్నారు. లక్షన్నర కోట్ల రూపాయలతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ పిపిటి ప్రజంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పిపిటి ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పిపిటి ఇచ్చారని విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి పిపిటి ఇస్తే, మూసీని ఎలా అభివృద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి బాధితుల పక్షాన తాము వివరిస్తున్నారని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా గత ప్రభుత్వం ఆరు కిలోమీటర్ల మూసిని విజయవంతంగా అభివృద్ధి చేసిందని వ్యాఖ్యానించారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసి సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్‌రెడ్డి పాపాన్ని కడుక్కోవాలని అన్నారు. నమామి గంగేకి ఖర్చు 42 వేల కోట్లు అని, వందల కిలోమీటర్ల నమామి గంగేకి అంత ఖర్చు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే తమ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోమని, కానీ మూసీ పేరుతో వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటామంటే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. ఎవరూ అడ్డుకోవద్దని గాంధీ విగ్రహం పెట్టే కుట్ర రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే మూసీ కోసం కాకుండా, మూసీ పక్కన ఉన్న భూముల కోసం పనిచేస్తున్నట్లు ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేమిటి రేవంత్‌రెడ్డి అంటున్నారని అన్నారు. గాంధీ విగ్రహం పెడతా అంటున్న రేవంత్ రెడ్డి, గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ మూసీలో దోపిడీ చేయవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మూసీ అంశంలో తమ పార్టీది మానవీయ కోణంలో అభివృద్ధి చేసే కార్యక్రమం అని పేర్కొన్నారు. తాము మూసీలో ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా నాగోల్ వద్ద అభివృద్ధి చేశామని, దీంతోపాటు బేగంపేట, గండిపేట వంటి అనేక చోట్ల అభివృద్ధి చేశామని వివరించారు. కానీ, కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామని అన్నారు. ఎలాంటి పని చేయకుండానే మూసీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. ప్రజల ఇళ్లను కూగొట్టాలని తమ పార్టీ ఏనాడు మూసి అభివృద్ధి ప్రణాళికలో భావించలేదని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఇండ్లను కూలగొట్టి మూసి ప్రణాళికను తయారు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఇండ్లను కూల్చి వాటి పునాదుల పైన మూసి ప్రాజెక్టు కట్టడం అన్యాయం అని మండిపడ్డారు. మూసీ అభివృద్ధిలో భాగంగా మూసీకి ఓఆర్‌ఆర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంతో పాటు, మూసీలో మురికిని మొత్తం తీసివేసేలా ఎస్టీపీల నిర్మాణాన్ని కోసం ప్రణాళిక రూపొందించి, ఆ మేరకు 3,800 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని కెటిఆర్ తెలిపారు. వీటి నిర్మాణం పూర్తి అయితే ఒక్క చుక్క కూడా మురికి నీరు మూసిలోకి చేరదు అని పేర్కొన్నారు. దీంతోపాటు గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దానికోసం కేవలం 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తీసుకు వచ్చే అవకాశం ఉందని, కానీ ఇదే కార్యక్రమానికి అనేక రెట్లు అంచనాలు 10 వేల కోట్లకి పెంచి రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా కరప్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరద నీటిని అడ్డుకోవడం కోసం ఎస్‌ఎస్‌డిపిఅనే ఒక ప్రత్యేక పథకాన్ని కూడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు. దీంతోపాటు మూసీలో చెక్ డ్యామ్‌లు, మూసీ పైన బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని, వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్లు పార్కులు ఇలా అన్నింటిని గత ప్రభుత్వ ప్రణాళికలో పొందుపరిచామని వివరించారు. ఇవన్నీ కలిపి సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం కేవలం రూ.16,000 కోట్ల మాత్రమే అని పేర్కొన్నారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి లక్షల కోట్ల రూపాయల ఖర్చు మూసీ పైన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బఫర్ జోన్ పేరు చెప్పి సర్కార్ ఇళ్లను కూలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. కేవలం డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్‌లో ఉన్నది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వాళ్ళ సోదరుడి ఇల్లు హైదరాబాద్‌లో బఫర్ జోన్‌లో ఉందని, మంత్రుల ఫామ్ హౌస్‌లు, ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నా ఎందుకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్‌మెంట్‌లను, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జోన్‌లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్‌మెంట్‌లను మాత్రం ముట్టుకోనని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పుడు బఫర్ జోన్‌లో ఉన్న వాటిని కూలగొట్టి తిరిగి అవే బఫర్ జోన్‌లో భారీ భవనాలు కడతా అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,300 ఎకరాల భూమి పైన కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లు అని, ఆ భూముల కోసమే రేవంత్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్క డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవాలని తెలిపారు. జీరో విలువ మూసీ బాధితుల ఇళ్లకు ఉందని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో ఎవరికైనా జీరో విలువ ఉన్నది అంటే అది ముమ్మాటికీ రేవంత్ రెడ్డికే అని కెటిఆర్ విమర్శించారు. కేవలం ఒకటి రెండు అపార్ట్‌మెంట్ వాసులకు ఇళ్లు కట్టించి తగిన స్థలం ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి, అదే సూత్రం అదే న్యాయం బాధితులందరికీ వర్తింపజేస్తారా.. అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి తన కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంతో అనే అంశం పైన అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎవరికీ నష్టం లేకుండా మూసీని అభివృద్ధి చేసే గత ప్రభుత్వ ప్రణాళిక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నదని, దాన్ని చూసి తక్కువ ఖర్చుతో మూసీని అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. కేవలం రూ.16,000 కోట్లతో 57 కిలోమీటర్ల మూసీని అభివృద్ధి చేయవచ్చని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికను ముందుకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మూసి బాధితులు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల పైన ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సలహాలు సూచనలు ఇచ్చారు. దశాబ్దాల నుంచి స్థిరపడి జీవనం సాగిస్తున్న మా బతుకులను ఆగం చేయవద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్,లక్ష్మారెడ్డి, ఎంఎల్‌సి శంబీపూర్ రాజు, బిఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 4:30 am

అడవిలో ఆయుధాలు..జనంలోకి అన్నలు!

మావోయిస్టు ఉద్యమం అంతం అయిందా? కేంద్రప్రభుత్వం పదేపదే ప్రకటించినట్టుగా ఈనెల 31తో ఆ ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టేనా? దశాబ్దాల తరబడి ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించి, రహస్య ఉద్యమంలో పాల్గొని సాయుధ పోరాటబాట పట్టిన సిపిఐ (మావోయిస్టు) పార్టీ అంతమైనట్టేనా? లేక తన పార్టీని రహస్య ఉద్యమం వైపు నుండి చట్టంబాట పట్టించిందా? అధికారికంగా మావోయిస్టు పార్టీ చట్టబద్ధంగా ఇతర రాజకీయపార్టీల మాదిరిగానే ప్రజలమధ్యకు వచ్చి చట్టానికి లోబడి తమ కార్యాచరణ కొనసాగిస్తామని ప్రకటించలేదు. పార్టీ కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించాక ఆ స్థానంలోకి వచ్చిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మాటల్లోనే కార్యదర్శిగా ఆయన నియామకం ఇంకా అధికారికం కాలేదు. అటువంటప్పుడు ఆయన చేసే విధానప్రకటన ఏదీ పార్టీ తరఫున అధికారికంగా చేసినట్టు ఎలా అవుతుంది? దేవ్‌జీ చెప్తున్నదానికి, అంతకుముందే లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనీ చెబుతున్నదానికి బోలెడు వ్యత్యాసం కనిపిస్తున్నది. సోను తదితరులు పెద్దసంఖ్యలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి తదితరులు తెలంగాణ డిజిపి ఎదుట లొంగిపోయారు. వారు లొంగిపోయారా లేక అరెస్ట్ అయ్యారా అనేది స్పష్టంగా లేదు. ఆయుధాలు మాత్రం అడవుల్లో దాచి వచ్చామని చెప్తున్నారు. శాంతిభద్రతలు రాష్ట్రాల సమస్య. వామపక్ష తీవ్రవాద ఉద్యమాన్ని సమర్ధించేవారు, దానిపట్ల సానుభూతి ప్రకటించేవారు.. ఇది శాంతిభద్రతల సమస్య కాదు, సామాజిక సమస్యగా చూడాలని ఎంత చెప్పినా ప్రభుత్వాలు మొదటినుండి నక్సలైట్ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగానే పరిగణిస్తూ వచ్చాయి. కాబట్టి నక్సలైట్ ఉద్యమాన్ని 2014లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చేవరకు కూడా కేంద్రం దాన్ని శాంతిభద్రతల సమస్యగానే పరిగణించి అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యతను రాష్ట్రాలకే వదిలిపెట్టింది. 2014 తరువాత ఈ అంశాల్లోకి కేంద్రం చొరబాటు పతాకస్థాయికి చేరింది. ఆపరేషన్ కగార్‌తో కర్రెగుట్టలను జల్లెడపట్టి వందలాదిమందిని అంతం చేసి, వందల సంఖ్యలో లొంగుబాట్లకు దారితీసిన ఆపరేషన్ ఇది. దీని కొనసాగింపుగా, వందల సంఖ్యలో మావోయిస్టులు బయటకు రావడం లొంగుబాటా, అరెస్టా అనేది స్పష్టంగా లేదు. తిప్పిరి తిరుపతి రెండురోజుల క్రితం పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టే వారు లొంగకపోతే, అరెస్టయి ఉంటే బయట స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారు? టివి చానళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఎలా వచ్చింది? పోనీ, బెయిల్ మీద ఉన్నారా? అనేవి ఏవీ తెలియదు. తాము ఆయుధాలను అడవిలో ఉంచి వచ్చామనీ, తమను అరెస్ట్ చేసారనీ చెపుతున్నవారు ముఖ్యమంత్రితో సహా ఇతర అధికారులను, రాజకీయ నాయకులను ఎలా కలుసుకోగలుగుతున్నారు? ప్రజాసమస్యల మీద చట్టం పరిధిలో పోరాటం చెయ్యడానికి అజ్ఞాతంనుండి బయటికి వచ్చినవాళ్ళను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని చెప్పడం లేదు కానీ ఈ గందరగోళం ఎందుకు ఉందనేదే ప్రశ్న. పోలీసులు ఇది లొంగుబాటు అంటుంటే, దేవ్‌జీ మాత్రం తాము ఆయుధాలు అడవిలో దాచి ఉంచి ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి వెళుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఆయన ఇంటర్వ్యూలో మొత్తంగా మావోయిస్టు పార్టీ ప్రస్తుత వైఖరి ఏమిటనే దానిపై స్పష్టత లేదు. చాలా ప్రశ్నల్ని ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. దానినిబట్టి పార్టీగా ఒక సమష్టి నిర్ణయం ఉన్నట్టు కనిపించడం లేదు. ఎవరి దారినవారు బయటికి వచ్చారన్న అభిప్రాయం కలుగుతున్నది. ‘కాంగ్రెస్ పార్టీ మీద మీ అభిప్రాయం చెప్పండి’ అన్నప్పుడు ఆయన ‘ఇప్పుడు దాని గురించి మాట్లాడను’ అని ఎందుకు దాటవేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనితీరును విశ్లేషించడానికి ఆయన ఎందుకు జంకాలి? మావోయిస్టు ఉద్యమం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరిలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న తేడానైనా ఎందుకు ఆయన బహిరంగంగా చెప్పలేకపోతున్నారు? ఐదెకరాల భూమి, కోటి రూపాయల పునరావాసం కోరడం పొరపాటనే ఒక మాటతో సరిపెడితే పోతుందా? ఎవరికివారు వారి కారణాలతో బయటకు రావడం, లొంగిపోవడం, అరెస్ట్ కావడం జరిగింది కానీ మొత్తం పార్టీగా ఒక నిర్ణయం అయితే జరగలేదనిపిస్తుంది. అటువంటప్పుడు దేవ్‌జీ చెపుతున్నట్టు ప్రజల సమస్యల మీద చట్టం పరిధిలో పోరాటం చేయ్యడానికయినా అజ్ఞాతంలో ఉన్నప్పటి పార్టీ నిర్మాణం బయట జరగడం అంత సులభమయిన పనేనా? ఇప్పటికే వీరిని తమ పార్టీలలో చేర్చుకోవడానికి కాంగ్రెస్, సిపిఐ వంటి పార్టీలు సుముఖత వ్యక్తం చెయ్యడం, ఆహ్వానం పలకడం కూడా చూసాం. అలా ఎవరికి నచ్చిన పార్టీల్లో వారు చేరిపోతారా? ఇప్పటికే చాలా ప్రాణనష్టం జరిగింది, అటయినా, ఇటయినా. ఇంకా నష్టం జరగకుండా బయటకు వచ్చినవారి భవిష్యత్ కార్యక్రమం వారినే నిర్ణయించుకోనిస్తే సరిపోతుంది.అయితే, ఇప్పటిదాకా వీళ్ళ సిద్ధాంతాలను, కార్యాచరణను సమర్ధిస్తూ బయట పనిచేస్తున్న ప్రజాసంఘాలు, మేధావుల పరిస్థితి ఏమిటి? కేంద్రప్రభుత్వ విధానంలో భాగంగా ఇప్పటికే అర్బన్ నక్సల్స్ గా ముద్రపడి కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయినవారు, ఉన్న ఊరునూ, భార్యాపిల్లలను వదులుకుని వృద్ధాప్యంలో షరతులతో కూడిన బెయిల్ మీద ప్రవాస జీవితం వెళ్ళదీస్తున్నవారు ఉన్నారు.. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఉద్యమంపట్ల ఆకర్షితులై, అజ్ఞాతంలోకి వెళ్లి పోలీసు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు విడిచినవారి కుటుంబాల మాటేమిటి? అటువంటి కుటుంబాల సంఖ్య తక్కువేం ఉండదు. ప్రస్తుతం బయటకొచ్చి చట్టపరిధిలో పార్టీని నిర్మించి పనిచేసే క్రమంలో అటువంటివారిని గురించి కూడా ఆలోచించాలి. కేంద్ర బలగాలు నెలల తరబడి ‘ఆపరేషన్ కగార్’ పేరిట సాగించిన నక్సలైట్ నిర్మూలన కార్యక్రమం కారణంగా ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు, అనారోగ్య కారణాలతో అడవుల్లో ఇంకా తుపాకీ చేతబట్టి పోరాటం చేయలేని స్థితిలో మరికొందరు ఈ లొంగుబాట పట్టినట్టు కనిపిస్తున్నది. పెద్దపెద్దవాళ్ళు చనిపోయారు. కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవరావు, మరో ముఖ్యనేత హిడ్మావంటి ప్రముఖులతోసహా వందలమంది మరణించారు. కడుపులో చల్లకదలకుండా కూర్చుని సిద్ధాంతాలు వల్లేవేస్తూ అందరి గురించి తీర్పులు చెప్పేవాళ్ళను పట్టించుకోవాల్సిన పనిలేదు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉండి కష్టనష్టాలు ఎదుర్కొన్నవారికి తెలుస్తుంది ఆ పరిస్థితి.‘మరో 15 రోజులే గడువు. మేం చెప్పినట్టుగానే తీవ్రవాదాన్ని అంతం చేసాం. మహా ఉంటే ఇంకో ఏడెనిమిదిమంది ఉండి ఉంటారు లోపల’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే ఢంకా బజాయించి చెప్తున్నారు. ‘చర్చలకు వస్తాం.. మాకు సమయం ఇవ్వండి’ అని మావోయిస్టు పార్టీ అధికారికంగా విజ్ఞప్తి చేసినా సరే, కనీస మానవత్వం లేకుండా మొత్తం అందరినీ తుదముట్టించడమే ఈ సమస్యకు పరిష్కారమనేది కేంద్రప్రభుత్వ విధానమైతే, దొరికినవారిని, బయటికి రావడానికి సుముఖత వ్యక్తం చేసినవారిని చంపకుండా అరెస్టు చెయ్యడమో, లొంగదీసుకోవడమో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అధికారికంగా మావోయిస్టులను చర్చలకు పిలవాలని తమ విధానాన్ని ప్రకటించి ఉన్నాయి. గతంలో ఒకసారి చర్చల ప్రక్రియ జరిగింది కూడా. అది కూడా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఆ చర్చలు అప్పటి పౌరస్పందన వేదిక కృషి ఫలితంగా జరిగాయి. చర్చలు విఫలం అయినా, అసలు ఇరువర్గాలనూ చర్చల బల్లదాకా తెచ్చిన ఆ వేదికలోని మేధావులు చాలావరకు ఇప్పుడు లేకపోవడమే కాదు, ఆ వాతావరణం కూడా లేకపోవడం శోచనీయం. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అందుకు భిన్నంగా మొత్తంగా ఉద్యమాన్నే కూకటివేళ్లతో పెకలించివేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూడటంనుండి కొంచెం పక్కకు జరిగింది. అందుకే దొరికినవాళ్లను గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టేసి ఎన్‌కౌంటర్ ముద్ర వేయలేదు ఈసారి. శాంతిభద్రతల సమస్య రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి కేంద్రం జోక్యం కుదరదన్న విషయాన్ని విస్మరించి కేంద్రం చేపట్టిన ‘కగార్’ కార్యక్రమంలో కర్రెగుట్టల చుట్టూ ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణకైతే అధికారికంగా అందులో పాల్గొనే అవకాశం గానీ, దాని గురించిన అభిప్రాయం తెలిపే అవకాశం కానీ ఇవ్వలేదు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఎంతమేరకు తెలుసో మనకు తెలియదు. బహుశా ఈ లొంగిపోయిన లేదా అరెస్టు అయినవారిపట్ల చట్టపరంగా ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం వదిలేస్తుందని ఆశిద్దాం. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ రెండవ తేదీ వరకు కొనసాగవచ్చునని తెలుస్తున్నది. ఈ నెల 31న లేదా ఏప్రిల్ ఒకటిన పార్లమెంట్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పనిసరిగా తమ విజయాన్ని అత్యంత ఆర్భాటంగా ప్రకటిస్తారనడంలో సందేహం అవసరం లేదు.2026 మార్చి 31 తర్వాత ఇక ఈ దేశంలో అసమానతలు, దోపిడీ, దౌర్జన్యాలు అంతరించిపోయినట్టేనా, లేక మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించారు కాబట్టి వాటిమీద పోరాటం చేసే వాళ్ళు ఉండరా? ఇది పాలకుల ఆత్మతృప్తికి ఉపయోగపడుతుందే తప్ప దోపిడీ, పీడన ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది. అది ఏ రూపంలో అనేది అప్రస్తుతం. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు అడవిలోని ఓ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలు భద్రపరచి వెళ్తారు. అలాగే, మావోయిస్టులు కూడా ఇప్పుడు తమ ఆయుధాలను అడవిలో వదిలిపెట్టి వచ్చారు. వాళ్ళు వదిలి వచ్చిన ఆ ఆయుధాలను ఇంకెవరో అందుకుని, అజ్ఞాతంలోకి వెళ్తారు. మావోయిస్టు ఉద్యమానికి ముందుకూడా ప్రజల తిరుగుబాట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఆ ఉద్యమం లేకపోయినా ఇంకో రూపంలో తిరుగుబాట్లు ఉంటాయి. అడవులు ఖాళీ అయ్యాయి కదా అని మైదానాల మీద పడి అర్బన్ నక్సలైట్ల పేరుతో ఆలోచనలను చంపే ప్రయత్నం మానేసి ప్రభుత్వాలు మౌలిక సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తే మంచిది. సమాజంలో హింసను రూపుమాపే పేరిట హింసకు ఎవరు పాల్పడినా అది సరికాదు. Delete Edit

మన తెలంగాణ 15 Mar 2026 12:01 am

మాజీ ఎంఎల్‌ఎ ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా, పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీమ్‌కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా, అక్కడ ఉన్న యువకులు పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న కొందరు యువకులు రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీమ్ రంగంలోకి దిగి ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టింది. పోలీసుల సోదాల్లో ఫామ్ హౌస్‌లో భారీగా కొకైన్ , ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి పోలీసులు ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక ప్రజాప్రతినిధి సహా పలువురు వీఐపీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా, లోతుగా విచారిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ కావడంతో పాటు, పట్టుబడిన వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈగల్ టీమ్ , ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టుబడిన వీఐపీలు ఎవరు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరాసరఫరా అయ్యాయి? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పార్టీలో ఉత్తరాది ఎమ్మెల్యే, ఎపికి చెందిన ఎంపితో సహా ఎనిమిది మంది విఐపిలు ఉన్నట్లు సమాచారం.

మన తెలంగాణ 14 Mar 2026 11:44 pm

వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురు మృతి

 భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో శనివారం ఘోర విశాదం చోటుచేసుకుంది. కొరికిశాల గ్రా మంలో వ్యవసాయ బావిలో పూడికతీస్తుండగా క్రేన్ వైర్ తెగి క్రేన్ బావిలో పడగా క్రేనువద్ద ఉన్న ముగ్గురు మృతి చెందగా ఒక్కరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవా రావు(48) బండారి అభిలాష్(14) అదే మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన సరిగోమ్ముల పైడయ్య (53) ముగ్గురు మృతి చెందగా, సుకినే మోహన్‌రావుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఒకే ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మోహన్‌రావుకు తలకు వెనుక వైపు బలమైన గాయమైంది అలాగే పక్కటెముకలు కూడా విరిగగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి 108 అంబులెన్స్‌లో తరలించారు. మృతి చెందిన దేవరావు, గాయపడిన మోహన్‌రావులకు చెందిన వ్యవసాయబావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవరావు, మోహన్‌రావు, పైడయ్యలు బావి పైనుండి క్రేన్ నడు పుతుండగా అభినాష్‌లనే పదో తరగతి విద్యార్థి అక్కడికి వెల్లగా బరువుకోసం క్రేన్ పై నిలబడగా ఒక్క సారిగా క్రేన్ వైరు తెగగా క్రేన్ బావిలో పడిన సందర్భంలో క్రేన్ తగలి ముగ్గురు మృతిచెందారు. బావిలో ఉన్న మరో ఇద్దరు క్రేన్ ఓనర్లు మహిళ, పురుషుడుకి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పదో తరగతి విద్యార్థి అభిలాష్ శనివారం జరిగిన పరీక్షకు హాజరై బావి దగ్గరు వచ్చి ప్రమాదంలో మరనించాడు. ఈ సపంఘటనతో మొగుళ్లపల్లిలో విశాదచాయలు చోటు చేసుకున్నాయి. ఈసంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 14 Mar 2026 11:30 pm

కిమ్ బలప్రదర్శన..ఒకేసారి 10 క్షిపణుల ప్రయోగం

ప్రపంచ యుద్ధ భయాల వేళ ఉత్తర కొరియా భారీ స్థాయి బలప్రదర్శనకు దిగింది. ఒకేరోజు వరుసగా పది బాలిస్టిక్ క్షిపణులను శనివారం తూర్పు సముద్రం వైపు విజయవంతంగా ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా సైన్యం ప్రకటించింది. ఓ వైపు తమ శత్రుదేశం దక్షిణ కొరియా అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలకు దిగిన దశలో కిమ్ ఈ చర్యకు దిగారు. ఈ ప్రయోగ పరీక్షలను దేశ అధినేత కిమ్ తన 13 ఏండ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి కాన్షరెన్స్ హాల్‌లో కూర్చుని ఉత్సాహంగా తిలకించారు. చప్పట్లు చరిచారు. దేశ రాజధాని ప్యాంగాంగ్‌కు వద్ద ఓ చోటు నుంచి ఈ క్షిపణును పరీక్షించినట్లు దేశ సైనిక బలగాల సంయుక్త అధినేత తెలిపారు. ఈ పరీక్షలపై జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. సముద్రంలో పయనించిన ఈ క్షిపణులు కొన్ని తమ దేశ నిర్ణీత ఆర్థిక వాణిజ్య కేంద్రాల వెలుపలి జలాల్లో వచ్చిపడ్డాయని మండిపడ్డారు.

మన తెలంగాణ 14 Mar 2026 11:20 pm

అరుదైన బాంబే బ్లడ్‌గ్రూప్‌తో ఆమె

 అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌గ్రూప్‌ను ఎయిమ్స్ గోరఖ్‌పూర్ వైద్యుల బృందం గుర్తించింది. తమ వద్దకు చికిత్సకు వచ్చిన ఓ గర్భిణీకి పరీక్షల దశలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఉండే ఎ బ్లడ్ గ్రూప్‌లో అసలు కానరాని, అతి తక్కువగా కన్పించే సబ్ గ్రూప్ రక్తాన్ని ఈ మహిళలో కనుగొన్నారు. 8 నెలల గర్భంతో ఉన్న ఈ మహిళ వైద్య పరీక్షల క్రమంలో తరచూ లోపాలు తలెత్తడం, పరీక్షల ఫలితాలలో తేడాలు ఉండటంతో వైద్య బృందానికి ఈ మహిళ శారీరక స్థితి సవాలుగా మారింది. ఈ మహిళకు డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరీక్షలు జరిపింది. మామూలుగా ఆమెలో ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు తేలింది. అయితే దీని ఉపరకం ఆమె రక్తంలో ఉందని,అందుకే అసాధారణ రీతిలో ఆమె ఆరోగ్యం ఉంటోందని గుర్తించారు. ఈ అరుదైన బ్లడ్ గ్రూప్‌ను బాంబే బ్లడ్‌గ్రూప్‌గా పిలుస్తారు. ఈ మహిళ ఈ బ్లడ్‌గ్రూప్‌తో ఉందని నిర్థారణ అయింది. దీనితో ఈ మహిళకు ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్య చికిత్సలు, పరీక్షలకు సిద్ధం అయినట్లు ఎయిమ్స్ గోరఖ్‌పూర్ సిఇఒ , కార్యనిర్వాహక సంచాలకులు విభా దత్తా తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారిలో ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్‌గ్రూప్ ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 

మన తెలంగాణ 14 Mar 2026 11:00 pm

చొరబాటుదార్ల కోసం సర్‌పై సణుగుడు: ప్రధాని మోడీ

చొరబాటుదార్లకు కొమ్ముకాయడం, రాజకీయ లబ్థికి దిగడం తృణమూల్ కాంగ్రెస్ నిజరూపం అని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అక్రమ వలసదార్లు ఓటుబ్యాంక్‌లు కావడంతోనే ఇప్పుడు టిఎంసి ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తోందని ప్రధాని చెప్పారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. టిఎంసి హయాంలో సరిహద్దులు దాటి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ అయింది. దీనితో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జనాభాపరంగా చాలా అసమతూకత ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో అక్రమ వలసదార్లు ఎక్కువగా ఉన్నారని, ఇది టిఎంసి వారి అక్రమ ఇమిగ్రేషన్ పద్థతితో జరిగిందని విమర్శించారు. ఇక్కడి ప్రభుత్వం రాజ్యాంగ పద్ధతులను పట్టించుకోదు. చొరబాట్లను తమ అధికారపు పలుకుబడితో ప్రోత్సహిస్తుంది. ఇక ఇటువంటి ఈ మమత బెనర్జీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ఆరంభం అయిందని తెలిపారు. సర్ అంటే టిఎంసికి హడల్ పుట్టుకుంది.ఎందుకంటే తమకు ఓటు బ్యాంక్‌లైన చొరబాటుదార్లు ఓటర్ల జాబితాల్లో నుంచి ఎగిరిపోతారు. తమ బలం లేకుండా పోతుంది. దీనిని జరగకుండా చేసేందుకు సర్‌పై కారాలు మిరియాలకు దిగుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియతో ఇప్పటికే 64 లక్షల మంది ఓటర్ల పేర్లు అక్రమదార్ల కారణంగా తొలిగించారు. దీనితో ఇప్పుడు ఇంతకు ముందు 7.66 కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్ర ఓటర్ల సంఖ్య ఇప్పుడు 7.04 కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో హిందువులను కావాలనే మైనార్టీలుగా మలిచేందుకు టిఎంసి పావులు కదిపిందని, అయితే ఈ ఆటలు సాగబోవని హెచ్చరించారు. 

మన తెలంగాణ 14 Mar 2026 10:40 pm

ఒత్తిడినే బలం చేసుకున్న వ్యాపారవేత్త రోహిత్ సేథి

₹100 కోట్ల ఆస్తి మైలురాయి దాటిన వ్యాపార ప్రయాణందేశవ్యాప్తంగా ₹1000 కోట్ల విస్తరణ ప్రణాళిక ప్రకటించిన సేథి

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:24 pm

హాకీ ఛాంపియన్ ఇంగ్లండ్

ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ మహిళా టీమ్ విజేగా నిలిచింది. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 20 గోల్స్ తేడాతో ఆతిథ్య భారత జట్టును ఓడించింది. కాగా, ఈ ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే మహిళా హాకీ ప్రపంచకప్ కోసం అర్హత పోటీలను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు స్కాట్లాండ్, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఇంగ్లండ్ జట్లు పాల్గొన్నాయి. భారత్, ఇంగ్లండ్‌లు ఇప్పటికే వరల్డ్‌కప్ బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. కాగా, టైటిల్ కోసం జరిగిన పోరులో మాత్రం భారత్ ఓటమి పాలైంది. ఆరంభం నుంచే ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. భారత దాడులను సమర్థంగా తిప్పికొడుతూ అలవోక విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది.

మన తెలంగాణ 14 Mar 2026 10:20 pm

వైరల్ గా మారిన రాధికా శరత్ కుమార్ వ్యాఖ్యలు

సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్న అంశంపై ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా తమిళ మూవీ తాయి కళవి సినిమా సక్సెస్ మీట్ లో రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కంటెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్ మీట్‌లో రాధిక మాట్లాడుతూ ‘మా సినిమా కేవలం 150 రూపాయల టికెట్ రేటుతోనే దాదాపు 60 కోట్లు వసూలు చేసింది. కానీ కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ.1500,- రూ.2000 వరకు ఉంటున్నాయి. మీరు కరెక్ట్ గా లెక్కలు వేస్తే మేమే వారికంటే పెద్ద సక్సెస్ సాధించినట్టే అవుతుంది”అని అన్నారు. 

మన తెలంగాణ 14 Mar 2026 10:10 pm

కాకతీయుల కాలపు శిధిల శివాలయం కాపాడాలి

700 ఏళ్ల నాటి శిల్పాలను సంరక్షించాలి అన్న శివనాగిరెడ్డిబొత్తలపాలెం వద్ద నందిబోడుపై పురాతన శివాలయ అవశేషాల పరిశీలన

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:08 pm

వెయ్యేళ్ల చారిత్రక ఆనవాళ్లు కాపాడాలి

నిర్లక్ష్యంలో పొదిలి ఆలయ శిల్పాలు, శాసనాలుపరిరక్షణకు చర్యలు తీసుకోవాలి అన్న శివనాగిరెడ్డి

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:06 pm

10వ శతాబ్ద శివాలయ పునరుద్ధరణకు గ్రామస్తుల నిర్ణయం

సన్నమూరు చారిత్రక ఆనవాళ్లు కాపాడుకోవాలి: శివనాగిరెడ్డి

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:00 pm

మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు: కెటిఆర్

అందాల పోటీలకు, ఫుట్‌బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ రెడ్డి తీరు తయారైందని కెటిఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలకు అభివృద్ధికి డబ్బులు లేవు, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నారని అన్నారు. లక్షన్నర కోట్ల రూపాయలతో మూసిని అభివృద్ధి చేస్తామంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ పిపిటి ప్రజంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పిపిటి ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పిపిటి ఇచ్చారని విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి పిపిటి ఇస్తే, మూసీని ఎలా అభివృద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి బాధితుల పక్షాన తాము వివరిస్తున్నారని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా గత ప్రభుత్వం ఆరు కిలోమీటర్ల మూసిని విజయవంతంగా అభివృద్ధి చేసిందని వ్యాఖ్యానించారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసి సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్‌రెడ్డి పాపాన్ని కడుక్కోవాలని అన్నారు. నమామి గంగేకి ఖర్చు 42 వేల కోట్లు అని, వందల కిలోమీటర్ల నమామి గంగేకి అంత ఖర్చు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే తమ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోమని, కానీ మూసీ పేరుతో వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటామంటే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

మన తెలంగాణ 14 Mar 2026 10:00 pm

ఐరిష్ ట్రయల్ పేరిట రాయల్ ఛాలెంజ్ సరికొత్త వేడుక

వరంగల్: రాయల్ ఛాలెంజ్ తన సరికొత్త విస్కీ బ్లెండ్ ఐరిష్ ట్రయల్‌ను ఒక అద్భుతమైన బార్ అనుభవంతో ప్రారంభించింది. హైదరాబాద్ మాదాపూర్‌లో కాక్ అండ్ బుల్ వేదికగా ఐరిష్ పబ్ అనుభవానికి ప్రతీకగా నిలిచే స్నేహం, అనుబంధం, సంగీతం వంటి అంశాలను ఈ వేడుక ప్రతిబింబించింది. ఈ ప్రారంభ వేడుకలో ఐరిష్ ట్రయల్‌ను వివిధ రకాలుగా ప్రదర్శించారు. ఇంటరాక్టివ్ షోకేస్ జోన్‌లు, బ్రాండెడ్ పబ్ గేమ్‌ల నుండి లైవ్ ఐరిష్ సింగాలాం> ప్రదర్శనలు, ప్రత్యేకమైన కాక్టెయిల్స్ వరకు […] The post ఐరిష్ ట్రయల్ పేరిట రాయల్ ఛాలెంజ్ సరికొత్త వేడుక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 9:55 pm

భట్టి విక్రమార్క కుమారుడు కోడలును ఆశీర్వదించిన ఎపి సిఎం చంద్రబాబు

ఎపి సిఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు.ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు. గత మార్చి 5వ తేదీన సూర్యవిక్రమాదిత్య వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఎపికి వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే, అప్పట్లో ఉన్న అత్యవసర కార్యకలాపాలు, బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు వివాహానికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజా భవన్‌కు విచ్చేసి నూతన దంపతులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబ, వాకిటి శ్రీహరి లు పాల్గొన్నారు.

మన తెలంగాణ 14 Mar 2026 9:50 pm

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 70 డ్రోన్లు పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద సంఖ్యలో డ్రోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సింగపూర్ నుంచి తీసుకొస్తున్న 70 డ్రోన్లను సీజ్ చేశారు. డ్రోన్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్య లో డ్రోన్లను సింగపూర్ నుంచి తీసుకు రావడం వెనక కారణం ఏంటి? అనే కోణంలో విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్ నుంచి ముగ్గురు ప్రయాణికులు తీసుకొచ్చిన 70 డ్రోన్లను కస్టమ్స్ అధికారులు పట్టుకు న్నారు. రెండు వేర్వేరు విమానాల్లో ఈ డ్రోన్లను సింగపూర్ నుంచి శంషాబాద్‌కు తీసుకు వచ్చారు. పట్టుకున్న డ్రోన్ల విలువ దాదాపు రూ.50లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వార్ ఎఫెక్ట్...13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు మరోవైపు, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ముదురుతుండటం వల్ల అక్కడి గగనతలాన్ని మూసివేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ అంతర్జాతీయ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. శనివారం ఒక్కరోజే మొత్తం 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనితో విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలు అస్తవ్యస్తంగా మారడంతో ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు.

మన తెలంగాణ 14 Mar 2026 9:35 pm

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

 తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం కావడంతో స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనారసింహుడి నిత్యరాబడి : శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.34,24,189 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,78,150, బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,88,600, వీఐపీ దర్శనం ద్వారా రూ.4,35,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.5,51,500, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.78,632, ప్రసాద విక్రయం ద్వారా రూ.10,14,030, కల్యాణకట్ట ద్వారా రూ.84,000తో పాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం ద్వారా ఆలయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. యాదగిరీశుడి సేవలో గండ్ర : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.

మన తెలంగాణ 14 Mar 2026 9:29 pm

వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

The post వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 9:21 pm

చిరుతపులి హతం.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

చిరుతపులి హతం.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్ జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 14 Mar 2026 9:21 pm

ఉగాది టిడ్కో ఇళ్లు పంపిణీ

2,256 గహ ప్రవేశాలకు సిద్దం నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి… The post ఉగాది టిడ్కో ఇళ్లు పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 9:17 pm

అక్రమ ఇసుక రవాణా కేసులో ఆరుగురికి జరిమానా

అక్రమ ఇసుక రవాణా కేసులో ఆరుగురికి జరిమానా మొబైల్ కోర్టు ఆదేశాలతో కమ్యూనిటీ

ప్రభ న్యూస్ 14 Mar 2026 9:14 pm

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ శాంతికి పెనుమొప్పు

సీహెచ్ కోటేశ్వరరావు ఆందోళన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా ఇప్పుడు గత 15 రోజులుగా ఇజ్రాయిల్ ను అడ్డు పెట్టుకొని ఇరాన్ పై చేస్తున్న యుద్ధంతో ప్రపంచ శాంతికి పెనుముప్పు వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వరరావు ఆందోళన వెలిబుచ్చారు .యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వామపక్షాలు, ప్రజాస్వామిక పార్టీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మైలవరం నియోజకవర్గం లో సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో యుద్ధం […] The post ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ శాంతికి పెనుమొప్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 9:10 pm

అక్రమ ఇసుక రవాణాపై గుడిపాల పోలీసుల కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై గుడిపాల పోలీసుల కఠిన చర్యలు రెండు ఇసుక లారీల

ప్రభ న్యూస్ 14 Mar 2026 9:06 pm

నకిలీ కలుపు మందుతో వరి పంటకు నష్టం

నకిలీ కలుపు మందుతో వరి పంటకు నష్టం వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించిన

ప్రభ న్యూస్ 14 Mar 2026 9:04 pm

మానవతా విలువలు పెంపొందించుకోవాలి

మానవతా విలువలు పెంపొందించుకోవాలి నబీ సేవలు అభినందనీయంతుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూర్,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:58 pm

వాచ్ మన్ దంపతుల హత్య

 అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్ మన్ దంపతులను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భార్యాభర్తల హత్య అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు చెప్పారు. కాగా మృతులు మహబూబబాద్ జిల్లా, గూడూరు మండలం, దొంగచింత తాండకు చెందిన ధరావత్ సోముల(45), ధరావత్ మంగమ్మ (40) గా పోలీసులు గుర్తించారు. మృతుడు గత మూడున్నర సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి అని బిల్డర్ దగ్గర పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు పెళ్లికాగా, చిన్న కూతురు సానియా పదవ తరగతి పరీక్ష రాస్తోంది.భార్యాభర్తలు హత్యకు గురి అవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్యూస్ టీం, డాగ్ స్క్వాడ్ ల సహాయంతో కీలక ఆధారాలను సేకరించారు. జంట హత్యలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని రామచంద్రాపురం ఏసిపి శ్రీనివాస్ కుమార్ చెప్పారు.

మన తెలంగాణ 14 Mar 2026 8:54 pm

ముందు ఆ పాపాన్ని కడుక్కోండి.. కాంగ్రెస్ పై కెటిఆర్ ఫైర్

కాంగ్రెస్‌ హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ముందు ఆ పాపాన్ని కడుక్కోవాలని.. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకుని కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణలు చెప్పాలని అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మూసీ ప్రాజెక్టుపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. 2016–17 సంవత్సరంలో రూ.16,634 కోట్లతో మూసీ సుందరీకరణ చేసేందుకు, ఆనాడు కేసీఆర్ హయాంలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కానీ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. నిన్న అధికారులు మూసీ సుందరీకరణ వెబ్ సైట్లో కొన్ని ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు కూడా మా ప్రభుత్వంలో చేసిన మూసీ సుందరీకరణ ఫోటోలే.  నేను రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తా తప్పేంటి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా అంటున్నాడు.. మరి మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం చేస్తున్నాడా లేక భూముల కోసం చేస్తున్నాడు అనుకోవాలా?. మూసీ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి. మూసీని ప్రక్షాళణ చేసేందుకు బీఆర్‌ఎస్‌ మంచి ప్రణాళికలు సిద్ధం చేసింది. మంచి రేవుల నుంచి ఘట్కేసర్‌ వరకు 57కి.మీ. పరిధిలో మూసీ రూపం మార్చాలనుకున్నాం. మూసీపై 15 బ్రిడ్జ్‌లు నిర్మించాలని ప్లాన్‌ చేశాం. కానీ, ఈయన లాగా డబ్బా కొట్టుకోలేదు. చేయంది చేసినట్లు.. ఉన్నది లేనట్లు చెప్పుకోలేదు అని అన్నారు.

మన తెలంగాణ 14 Mar 2026 8:53 pm

మృతుల కుటుంబాలకు అందుకుంటాం

మృతుల కుటుంబాలకు అందుకుంటాం మొగుళ్ల పల్లి మృతుల కుటుంబాలను పరామర్శ భూపాలపల్లి ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:53 pm

Dhurandhar 3: Forceful or Planned?

Dhurandhar happens to be a milestone in Indian cinema and the film surpassed the lifetime numbers of several Indian blockbusters. The second part titled Dhurandhar: The Revenge is all set for release on March 19th. The advance sales are extraordinary in all the languages and territories. Bollywood media speculates that Jio Studios, the producers of […] The post Dhurandhar 3: Forceful or Planned? appeared first on Telugu360 .

తెలుగు 360 14 Mar 2026 8:51 pm

త్వరలో 16వేల మందికి ‘మెటా’ షాక్

సాఫ్ట్‌వేర్ రంగంపై కృత్రిమ మేధ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్‌ల దెబ్బకు పేరు మోసిన టెక్ కంపెనీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పని మొదలుపెట్టాయి. త్వరలో మెటా కూడా అదే బాటలో పయనిస్తోందని సమాచారం . ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా త్వరలో 16 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్‌లో మెటా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని మెటా భావిస్తోందట. మెటాలో ప్రస్తుతం 79 వేల మంది పని చేస్తున్నారు. వారిలో 20 శాతం మందిని మెటా తొలగించనుందట. అంటే దాదాపు 16 వేల మంది లేఆఫ్ ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. 

మన తెలంగాణ 14 Mar 2026 8:45 pm

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

 బంగారం, వెండి ధరలు శనివారంనాడు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదారాబాద్ బులియన్ మారెక్ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,660కు చేరుకుంది. శుక్రవారంనాటి ధరతో పోల్చుకుంటే రూ.1030 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 పలుకుతోంది. ఇది రూ.950 మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా శనివారం తగ్గుదల నమోదు చేశాయి. వెండి కిలోకు రూ.4,900 వేల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.75 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 

మన తెలంగాణ 14 Mar 2026 8:42 pm

ఆసుపత్రిలో చికిత్స పొందుతు వ్యక్తి మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతు వ్యక్తి మృతి ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రైవేట్

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:34 pm

పెద్ద కాపర్తి​ పాఠశాల ప్రహరీ గోడని ఢీకొన్న వాహనం

పెద్ద కాపర్తి​ పాఠశాల ప్రహరీ గోడని ఢీకొన్న వాహనం పాఠశాల్లో విద్యార్థులు లేకపోవడంతో

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:30 pm

రేపు ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న సిఎం రేవంత్

ఎల్‌బి స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దావత్ ఎ ఇఫ్తార్ 15వ తేదీ నిర్వహించనున్నారు. దీని దృష్టా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు. ఏ.ఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుండి బి.జె.ఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏ ఆర్ పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుండి ఏ.ఆర్ పెట్రోల్ పంప్ వైపు వచ్చే వాహనాలను బి.జె.ఆర్ విగ్రహం వద్ద ఎస్‌బిఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. సుజాత స్కూల్ లేన్ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు. రద్దీగా ఉండే జంక్షన్లు ... ట్రాఫిక్ ఆంక్షల వల్ల లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, బి.జె.ఆర్ విగ్రహం సర్కిల్, ఎస్.బి.ఐ గన్ ఫౌండ్రీ, ఏ.ఆర్. పెట్రోల్ పంప్, కె.ఎల్.కె బిల్డింగ్ మరియు లిబర్టీ. ఆర్టీసీ బస్సులు... రవీంద్ర భారతి నుండి బి.జె.ఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ట్రాఫిక్‌ను బట్టి ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు.

మన తెలంగాణ 14 Mar 2026 8:28 pm

పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలి

పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలి టిఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:25 pm

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

భర్త మీద కోపంతో తన పిల్లలు భర్తకు కూడా దక్కరాదని తల్లి తన ఇద్దరు కొడుకులతో గార్గేయపురం చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎపిలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలీవిధంగా ఉన్నాయి. అలంపూర్‌కి చెందిన రాజుతో గార్గేయపురానికి చెందిన రాజేశ్వరి(36)కి కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి అబ్రహం (6) సుకుమార్(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలం సంసారం సజావుగానే సాగింది. ఇటీవల భార్యాభర్తల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల భర్త తో ఘర్షణపడ్డ రాజేశ్వరి పుట్టిన ఊరు గార్గేయపురంలో కొన్ని రోజులుగా ఉంటుంది. ఏమైందో ఏమో గానీ శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి చెరువులో దూకేసింది. శనివారం ఉదయం ముగ్గరు మృతదేహాలు బయట పడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 14 Mar 2026 8:23 pm

ఉగాది రోజున సాంతింటిలోకి స‌గ‌ర్వంగా!

ఉగాది రోజున సాంతింటిలోకి స‌గ‌ర్వంగా! గృహ ప్ర‌వేశాల‌కు సిద్ధంగా జ‌క్కంపూడిలో 2,256 టిడ్కో

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:21 pm

ఇసుక టిప్పర్ పట్టివేత… కేసు నమోదు

ఇసుక టిప్పర్ పట్టివేత… కేసు నమోదు ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎలాంటి ప్రభుత్వ

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:19 pm

రేపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న స్వర్ణ

ఇటీవల పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ 15 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులూ పాల్గొంటారు.

మన తెలంగాణ 14 Mar 2026 8:19 pm

పంటల ఉత్పత్తి పై నైపుణ్యం, అభివృద్ధి, మద్దతు సేవలపై శిక్షణ

పంటల ఉత్పత్తి పై నైపుణ్యం, అభివృద్ధి, మద్దతు సేవలపై శిక్షణ పరకాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:11 pm

విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు….

విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు…. కార్పొరేటర్ నేలీ బండ్ల బాల స్వామి… విజయవాడ

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:04 pm

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఐపీఎస్ నెహ్ర మనీషా ట్రేని

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఐపీఎస్ నెహ్ర మనీషా ట్రేని స్టేషన్ ఘన్‌పూర్,

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:01 pm

తప్పిపోయిన ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యం…

తప్పిపోయిన ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యం… కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి

ప్రభ న్యూస్ 14 Mar 2026 8:00 pm

అందెశ్రీ ఉగాది పురస్కారం అందుకున్న రవీందర్

అందెశ్రీ ఉగాది పురస్కారం అందుకున్న రవీందర్ చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జడల్

ప్రభ న్యూస్ 14 Mar 2026 7:58 pm

పొనకల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

పొనకల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : రంజాన్

ప్రభ న్యూస్ 14 Mar 2026 7:54 pm

కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి

ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం... జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావువిశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్ 143వ వర్ధంతిని పుష్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడలోని హనుమాన్‌పేటలో గల మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాలకు ఆయన […] The post కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 7:50 pm

'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ వచ్చేసింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత పవన్ నుంచి మాస్ ఎంటర్ టైన్మెంట్ రాబోతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.

మన తెలంగాణ 14 Mar 2026 7:42 pm

బిజెపి ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు: కూనంనేని సాంబశివరావు

దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధాన వైఫల్యాలే కారణమని కూనంనేని ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ తమపై దాడి చేయకుండా ముందస్తు దాడి చేస్తున్నామనే పొంతనలేని సాకుతో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వాన్ని మార్చాలని కుటిల నీతితో అమెరికా ఆ దేశంపై ఫిబ్రవరి 28న ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపించాయని, పిల్లలు చదుకునే పాఠశాలలపై క్షిపణి దాడుల చేసి 165 మంది చదువుకునే అమ్మాయిలు, టీచర్లను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రమయ్యిందని, బ్యారెల్ ధర రూ.1 00 డాలర్లు దాటిందన్నారు. ఫలితంగా భారతదేశంలో గృహ అవసరాల గ్యాస్ సిలిందర్ ధర రూ. 60 పెరిగిందన్నారు. మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని బైట పరిస్థితి చూస్తే తేలిపోతోందన్నారు. గ్యాస్ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హోటల్స్ ముతపడుతున్నాయని కూనంనేని తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడమే కారణమని ఆయనన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈ నెల 16న తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని సిపిఐ ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించాలని, భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 14 Mar 2026 7:26 pm

అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల‌ పట్టివేత….

అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల‌ పట్టివేత…. కోడూరు – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Mar 2026 7:26 pm