ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల నిర్మాణం
ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్హెచ్ 365 బీజీ) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో పాటు మరెన్నో కొత్త అంశాలను ఈ హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఎన్ హెచ్ 65, ఎన్హెచ్ 16ను కలుపుతూ రూ.4451.87 కోట్లతో 162 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు. భారత్ మాల పరియోజన కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో ఐదు ప్యాకేజీలుగా విభజించారు. తెలంగాణ పరిధిలో మూడు ప్యాకేజీలు (105.240 కిలోమీటర్లు), ఏపీలో రెండు ప్యాకేజీలు (56.890 కి.మీ.) ఉంది.2022లో పనులు ప్రారంభం కాగా, వేర్వేరు కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు మున్నేరు మీద బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకోగా, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి, మే మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు హైవే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గనున్న దూరం, ప్రయాణ సమయం! ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు సూర్యాపేట, విజయవాడ మీదుగా 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త హైవే వల్ల హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం మీదుగా వైజాగ్ వెళ్లేందుకు 56 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 3 నుంచి 4 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. మొత్తం స్లోప్ కలుపుకొని 30 మీటర్ల వెడల్పుతో ఈ హైవే నిర్మాణం జరుగుతోంది. ఒక వైపు 9 మీటర్ల చొప్పున రోడ్లు, మధ్యలో నాలుగున్నర మీటర్ల మీడియన్ ఉంటాయి.18 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో ప్రయాణించిన దూరాన్ని బట్టి ఎగ్జిట్ పాయింట్ దగ్గర టోల్ కట్ అవుతుంది. హైవేపైకి పశువులు రాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ల దగ్గర వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు రెస్ట్ తీసుకునేందుకు 6 ట్రక్బేలు సిద్ధం చేస్తున్నారు. డొంకదారులు, అంతర్గత రహదారుల దగ్గర అండర్ పాస్ లు, సాగునీటి కాల్వల దగ్గర 10 మేజర్ బ్రిడ్జిలు, 49 మైనర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒక వైపు రెండు లేన్లకు గాను 80, 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ గా నిర్ణయించారు. విల్లు ఆకారంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి! ఖమ్మం నగరాన్ని ఆనుకొని వెళ్తున్న రైల్వే ట్రాక్ పై నుంచి ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని విల్లు ఆకారంలో నిర్మిస్తున్నారు. బౌ స్ట్రింగ్ గిర్డర్ బ్రిడ్జిగా దీన్ని వ్యవహరిస్తున్నారు. 52 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి 360 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. దీన్ని పూర్తిగా ఛత్తీస్గఢ్లోని భిలాయ్లో హైగ్రేడ్ స్టీల్ తో నాలుగు నెలల పాటు తయారుచేశారు. తర్వాత విడిభాగాలుగా తీసుకువచ్చి మళ్లీ ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు. జాకీల సాయంతో క్రమంగా పైకి ఎత్తుతున్నారు. 11 మీటర్ల ఎత్తుండే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని కంప్లీట్ చేసేందుకు ఇంకా రెండు నెలలు పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. మార్చి నెలాఖరుకు ఒకవైపు నిర్మాణాన్ని కంప్లీట్ చేసి, రాకపోకలకు అనుమతి ఇస్తామంటున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా రైల్వే అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. ప్రతి దశలో రైల్వే సేఫ్టీ టీమ్ తనిఖీలు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పనులు ముందుకెళ్తున్నాయి. రూల్స్ బ్రేక్ చేయకుండా సీసీ కెమెరాలతో చెక్! 162 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిపై ప్రతి రెండు కిలోమీటర్లకు 360 డిగ్రీలు కవర్ చేసే ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రతి కెమెరా ఒక కిలోమీటర్ దూరం వరకు వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్తో ఈ కెమెరాలు 24 గంటలు పని చేస్తాయి. వాహనాలు ఓవర్ స్పీడ్ వెళ్లినా, బాగా నెమ్మదిగా వెళ్లినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, సీటు బెల్ట్ పెట్టకపోయినా, హైవేపై వాహనం నిలిపి ఉంచినా ఆ వాహనాల ఫొటోలు తీస్తాయి. జూమ్ చేసినా వీడియో క్లారిటీ దెబ్బతినకుండా, వాహనాలు స్పీడ్ గా వెళ్తున్నా నెంబర్ ప్లేట్ కూడా రికార్డ్ అయ్యేలా హై రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలతో పాటు హైవే మధ్యలో ఏర్పాటు చేస్తున్న లైట్లకు కూడా పూర్తిగా సోలార్ ప్యానల్స్ బిగించారు. బయటి నుంచి విద్యుత్ అవసరం లేకుండా, సోలార్తోనే నడిచేలా వాటికి రీచార్జబుల్ బ్యాటరీలను బిగించారు. వేరియేబుల్ మెసేజ్ సైన్(వీఎంఎస్) బోర్డులను అక్కడక్కడ ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్, వెదర్, ట్రాఫిక్ డైవర్షన్ ఇన్ఫర్మేషన్, అలర్ట్ మెసేజ్లను ఈ సైన్ బోర్డుల్లో ప్రదర్శిస్తారు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్! ఐదు ప్యాకేజీల్లోనూ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఏటీఎంఎస్) సెంటర్ ను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో ఉండే సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి రియల్ టైమ్ ట్రాఫిక్ మూమెంట్ ను పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై మానిటర్ చేస్తారు. వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తే సీసీ కెమెరాలు ఆటోమెటిక్గా రికార్డు చేసి, ఫొటోల రూపంలో ఏటీఎంఎస్ సెంటర్ కు పంపిస్తాయి. ప్రమాదం జరిగినా, వాహనం అనుకోకుండా ఆగిపోయినా ఈ సెంటర్ లోని ఎల్ఈడీ స్క్రీన్లపై అలర్ట్ చేసేందుకు పాప్ అప్ మెసేజ్ వస్తుంది.హైవే ప్రారంభం తర్వాత అన్ని కెమెరాలు అన్ని చోట్లా కనిపించేలా చూడడంతో పాటు రాష్ట్ర పోలీసులకు వీటిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీంతో నేరుగా ట్రాఫిక్ చలానా జనరేట్ అయ్యేలా ఉపయోగించనున్నారు. ఇక యాక్సిడెంట్లు లేదా ట్రాఫిక్ మళ్లింపు సమయంలో ఉపయోగపడేలా ప్రతి 5 కిలోమీటర్లకు ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ను ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేస్తాం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇదే. సంప్రదాయ హైవేల తరహాలో కాకుండా స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ హైవే నిర్మిస్తున్నాం. రోడ్ సేఫ్టీని క్లోజ్గా మానిటర్ చేసేలా చర్యలు తీసుకున్నాం. సీసీ కెమెరాలు, ఏటీఎంఎస్లు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ వాయిలేషన్స్ తగ్గుతాయి. రెండు నెలల్లో పనులన్నీ కంప్లీట్ చేసి, మే నెలలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నాం.
విమాన టికెట్ రద్దుపై కొత్త రూల్స్
డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) టికెట్ రద్దు, మార్పులపై కొత్త నిబంధనలు జారీ చేసింది. బుకింగ్ చేసిన 48 గంటలలోపు రద్దు చేస్తే అదనపు రుసుము ఉండదు. అయితే ప్రయాణ తేదీకి కనీసం 7 రోజుల ముందు టికెట్ బుక్ చేసి ఉండాలి. 14 పని దినాల్లోపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. వైద్య అత్యవసర పరిస్థితుల్లో పూర్తి వాపసు లేదా క్రెడిట్ సదుపాయం కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటామని డిజిసిఎ స్పష్టం చేసింది.
విండీస్పై సౌతాఫ్రికా ఘన విజయం
టి20 ప్రపంచకప్ సూపర్8 గ్రూప్1లో సౌతాఫ్రికా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సఫారీ టీమ్ 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. సఫారీ గెలుపు టీమిండియాకు అతి పెద్ద ఊరటగా మారింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన విండీస్ను హోల్డర్, షెఫర్డ్ ఆదుకున్నారు. ఇద్దరు సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోల్డర్ 31 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 49పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన రొమారియో షెఫర్డ్ 37బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఎంగిడి మూడు, బోస్చ్, రబడా రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 16.1 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, ఐడెన్ మార్క్రమ్ జట్టుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన డికాక్ 24 బంతుల్లోనే 4 సిక్స్లు, 4 బౌండరీలతో 47 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తొలి వికెట్కు 48 బంతుల్లోనే 95 పరుగులు జోడించాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అలరించిన మార్క్రమ్ 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. అతనికి రియాన్ రికెల్టన్ 45 (నాటౌట్) అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్కు అభేద్యంగా 82 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
అలనాడు ఓ వ్యాపార సంస్థగా వెలిసి, ఆనక భారతదేశంలో పాలనా పగ్గాల దశకు చేరిన వైభవ ఈస్ట్ ఇండియా కంపెనీ మూతపడింది. ఈ విధంగా ఈ కంపెనీ మూసుకోవడం చరిత్రలో ఇది రెండోసారి అయింది. ఒకనాడు శక్తివంతమైన బ్రిటిష్ వ్యాపార సంస్థగా ఉన్న కంపెనీ దారుణస్థితికి చేరింది. నిజానికి మునుపటి ఈ కంపెనీ దాదాపుగా 152 ఏండ్ల క్రితమే బోర్డు తిప్పేసింది. అయితే దీనిపై ఉన్న ఆసక్తితో 2010లో బ్రిటిష్ ఇండియన్ వ్యాపారవేత్త కంపెనీ హక్కులు కొన్నారు. 1857లో ఈ కంపెనీ భారతీయ పగ్గాలను భారతీయ తిరుగుబాటు క్రమంలో బ్రిటన్ రాజరిక ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. అప్పటి నుంచి భారతదేశంలో బ్రిటిష్ రాజరిక వ్యవస్థ ఏర్పాటు అయింది. ఈస్ట్ ఇండియా హయాంలో భారత్కు అనేక కష్టాలు ఎదురయ్యాయి. ప్రపంచ వాణిజ్య వ్యవస్థను మలుపు తిప్పిన ఈ కంపెనీ భారత్లో తన దమననీతితో ప్రజలను వేధించుకుతింది. అప్పట్లో ఈ కంపెనీ దోపిడి హయాంలో దారుణ రీతిలో బెంగాల్ కరువు ఏర్పడింది. మూడు కోట్ల మంది వరకూ ఆకలిదప్పులతో మృతి చెందారు. భారతీయ సంతతికి చెందిన సంజీవ్ మెహతా ఈ కంపెనీ హక్కులను ఈ కంపెనీ కర్కశత్వానికి ప్రతీకారంగా తీసుకున్నాడు . పలు ఆర్థిక కారణాలతో ఈ అపఖ్యాతి పేరున్న కంపెనీ చివరికి స్టాల్స్, ఇతర చిన్న వ్యాపారాల షోరూంలతో సాగి మూత పడిందని, కోట్లాది రూపాయిలలో నష్టాలు అప్పుల ఊబితో మూసివేశారని లండన్ పత్రికలు రాశాయి. అయితే తాను ఈస్ట్ ఇండియా కంపెనీపై పగ తీర్చుకున్నానని తరచూ సంజీవ్ మెహతా మీసం వేలేసేవాడు. బోర్డు తిప్పినా, తన పూర్వపు భారతీయ పౌరుషం మిగిలిందని ప్రకటించాడు.
ఘనంగా ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ పుట్టినరోజు వేడుకలు
ఘనంగా ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం,ఆంధ్రప్రభః ఆంధ్రప్రభ గ్రూప్ సంస్థల
తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, జగన్
తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, జగన్ నేడు లేని దేవాలయాల అభివృద్ధి, ధార్మిక
షేక్ పల్లిలో కార్డెన్ అండ్ సర్చ్
షేక్ పల్లిలో కార్డెన్ అండ్ సర్చ్ టాక్టర్లు 2, ఆటోలు 6, కార్లు
టాటా మోటార్స్ –చిదంబరనార్ పోర్ట్ అథారిటీ ఒప్పందం
టుటికోరిన్: నికరసున్నా ఉద్గారాల దిశగా దేశం ప్రయాణంలో కీలకమైన అడుగుగా, భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్, తమిళనాడులోని టుటికోరిన్లోని వీ.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (వీఓసీపీఏ)తో 40 గ్రీన్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్శక్తితో కూడిన (హెచ2 ఐసీఈ) పైమ్ వవర్లను పోర్టులో మోహరించడానికి ఒక అవగాహన ఒప్పందం (bంఓj)పై సంతకం చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పిం>, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒడంబడికలో […] The post టాటా మోటార్స్ – చిదంబరనార్ పోర్ట్ అథారిటీ ఒప్పందం appeared first on Visalaandhra .
చెట్లతో నిండిపోయిన కెనాల్ కాల్వలు
చెట్లతో నిండిపోయిన కెనాల్ కాల్వలు సాగు నీళ్లు రాక రైతుల ఆవేదననర్సంపేట డివిజన్
సనోఫీ కన్స్యూమర్ హెల్త్కేర్ ఇండియా స్థిరమైన వృద్ధి
ముంబై: సనోఫీ కన్స్యూమర్ హెల్త్కేర్ ఇండియా లిమిటెడ్ నాల్గవ తైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఇది కీలక వ్యాపార విభాగాలలో స్థిరమైన వృద్ధి ఊపును ప్రదర్శిస్తుంది. ఈ తైమాసికంలో ఆదాయ వృద్ధి సంవత్సరానికి 47% వద్ద ఉంది. దేశీయ అమ్మకాలు 23% పెరిగాయి. రీకాల్ చేయబడిన ఉత్పత్తులను మార్కెట్కు తిరిగి ప్రారంభించడం ద్వారా ఇది జరిగింది. క్యూ4లో పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ.665 మిలియన్లకు చేరుకుంది, ఇది సంవత్సరానికి 50% పెరుగుదల. 2025 […] The post సనోఫీ కన్స్యూమర్ హెల్త్కేర్ ఇండియా స్థిరమైన వృద్ధి appeared first on Visalaandhra .
నీటి ఆదాకు నెటాఫిమ్తో కలిసి పనిచేస్తున్న అమెజాన్
బెంగళూరుః సుస్థిరమైన నీటిపారుదలలో ప్రపంచ అగ్రగామి ఆర్బియా ప్రెసిషన్ అగ్రికల్చర్లో భాగమైన నెటాఫిమ్తో కలిసి అమెజాన్ ఇండియా నేడు బెంగళూరు, హైదరాబాద్లలో కొత్త నీటి పొదుపు ప్రాజెక్టులను ప్రకటించింది. సంప్రదాయ వరద నీటిపారుదలని బిందు సేద్యంతో భర్తీ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి 325 మిలియన్ లీటర్లకు పైగా నీటిని ఆదా చేస్తాయని భావిస్తున్నారు. బిందు సేద్యం నీటిని నేరుగా మొక్కల వేళ్ళకు అందిస్తుంది, పంట దిగుబడిని కొనసాగిస్తూ వథాను గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశంలోని నీటి […] The post నీటి ఆదాకు నెటాఫిమ్తో కలిసి పనిచేస్తున్న అమెజాన్ appeared first on Visalaandhra .
దార్శనికతకు అనుగుణంగా ఎన్హెచ్-65 విస్తరణ..
దార్శనికతకు అనుగుణంగా ఎన్హెచ్-65 విస్తరణ.. భవిష్యత్తు అవసరాల మేరకు రహదారి అభివృద్ధివిజయవాడ నగర
చర్లగూడెం రిజర్వాయర్.. నల్లగొండ ప్రజల చిరకాల కోరిక
చర్లగూడెం రిజర్వాయర్.. నల్లగొండ ప్రజల చిరకాల కోరిక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి
చెన్నైలో జింబాబ్వేతో జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్లో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీ చేయగా, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా(50: 23 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్స్ లు) అర్థశతకం చేశాడు. తిలక్ వర్మ(44: 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లు), ఇషాన్ కిషన్(38) ,సూర్య కుమార్ యాదవ్(33), సంజు శాంసన్(22) పరుగులు చేశారు.
ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ
ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ
ఆలేరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఆలేరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఆలేరు, ఆంధ్రప్రభ: ఆలేరు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి…
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి… కుంటాల, ఆంధ్రప్రభః విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన
మార్చి ఒకటి నుంచి రహదారి భద్రత పన్ను
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రహదారి భద్రత పన్ను (రోడ్డు సేఫ్టీ సెస్)ను విధించేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారిపై ఈ పన్నును విధించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరిపై ఈ కొత్త పన్ను విధింపు ఉంటుందని పేర్కొంది. కార్లు, ప్రయాణీకులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర రవాణాయేతర వాహనాలపై ఈ పన్నును విధించనుంది. ద్విచక్రవాహనానికి రూ.2 వేలు, లైట్ మోటారు వాహనాలకు రూ.5 వేలు, ఇతర వాహనాలకు రూ.10 వేల చొప్పున సెస్ విధించేందుకు ఈ కొత్త ఉత్తర్వులను విడుదల చేస్తోంది. వాహనాల రిజిష్ర్టేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోడ్డు భద్రత పన్ను విధింపు ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ.270 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఇప్పటి వరకు ఉన్న వాహన రిజిష్ర్టేషన్ చార్జీలకు ఇది అదనంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులకు అదనంగా ఈ పన్ను చెల్లింపు వాహన వినియోగదారులకు భారం కానుంది.
ఇసుక డంపులపై రైడ్ చేసిన పోలీసులు
ఇసుక డంపులపై రైడ్ చేసిన పోలీసులు కరీమాబాద్,ఆంధ్రప్రభః వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన రష్మిక, విజయ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య విజయ్... -రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇక గురువారం సాయంత్రం 4:30 గంటలకు కడువ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం కన్నులపండువగా జరగడం విశేషం. ఇక పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. ఈ వేడుకలో ప్రత్యేకంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. వివాహ బంధంతో జీవిత భాగస్వాములుగా మారిన విజయ్ దేవరకొండ, - రష్మిక మందన్న జోడీకి సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ఇక మార్చి 4న హైదరాబాద్లో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. నోరూరించే రుచులతో విందు... విరోష్ దంపతులు వివాహ వేడుకకు వచ్చిన అతిథుల కోసం పసందైన వంటకాలను వడ్డించారు. రాయల్ వెడ్డింగ్లో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ స్పెషల్స్ తో పాటు కర్నాటక స్పెషల్ బిసిబేళా బాత్, కూర్గ్ స్పెషల్ వంటకాలతో పాటు కొడువ సంప్రదాయ వంటకాలను అతిథులకు తినిపించారు. తెలంగాణ, ఆంధ్ర సంప్రదాయ వంటలు అయిన నాటుకోడి పులుసు, హైదరాబాద్ దమ్ బిర్యానీ, గారెలు, పప్పు, పచ్చి పులుసు, కీమా సమోసాలు కూడా మెనూలో ఉన్నాయి.
చిట్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ చిట్యాల ,ఆంధ్రప్రభ: నాగర్ కర్నూలు జిల్లా బమ్మెర లో
ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి… కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు #TaskForceRaid
Video : Actor Sree Vishnu Exclusive Interview
The post Video : Actor Sree Vishnu Exclusive Interview appeared first on Telugu360 .
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జైనూర్, ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
మావోయిస్టు కీలక నాయకురాలు లొంగుబాటు
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. గురువారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, కాంకేర్ జిల్లాలో ఏడు లక్షల రూపాయల రివార్డు కలిగిన మావోయిస్టు పార్టీకి చెందిన డి వి సి ఎం ( డివిజనల్ కమిటీ మెంబర్ ) సభ్యురాలు మాసే భార్ష కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేషా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టు 2003వ సంవత్సరం నుండి బస్తర్ దండకారణ్యం, అబూజ్మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలలో వివిధ హింసాత్మక సంఘటనలో చురుగ్గా పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ముందుగా ఈమె దండకారణ్యం నుండి చిద్బాంధర్ గ్రామానికి చేరుకొని అక్కడి నుండి నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి జిల్లా ఎస్పీకి ఏకే 47 రైఫిల్ అందించి లొంగిపోయింది.
మహిళలలో క్యాన్సర్ లు నివారించే కార్యక్రమం
దేశవ్యాప్తంగా మహిళలలో క్యాన్సర్ లను నివారించే కార్యక్రమం మొదలు కానున్నది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 28న రాజస్థాన్ లోని అజ్మీర్ లో 14 ఏళ్ల లోపు బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పివి) టీకా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇది మహిళలలో నివారించగల క్యాన్సర్ లను తొలగించేందుకు భారతదేశం సాగించనున్న పోరాటానికి ఆరంభం కాగలదు. గర్భాశయ కేన్సర్ తో పాటు 6,11 రకాలకు కారణమయ్యే హెచ్ పివి రకాలు, 16,18 నుంచి రక్షణకల్పించే వాక్సిన్ ఇది. ప్రభుత్వం పెద్దఎత్తున చేపడుతున్న ఈ ప్రచారం లో భాగంగా క్వాడ్రివాలెంట్ హెచ్ పివి అయిన సింగిల్ షాట్ గార్డసిల్ 4 వాక్సిన్ (టీకా) ను ఇస్తారు.అజ్మీర్ లో ప్రధాని మోదీ హెచ్ పివి టీకా ప్రచారం ప్రారంభించే సమయంలోనే 14 ఏళ్లలోపు వయస్సుగల బాలికలందరికీ హెచ్ పివి టీకా ప్రచారాన్ని ఫిబ్రవరి 28నే ఉదయం 11.30 గంటలకు తాత్కాలికంగా ప్రారంభించాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 25 నే లేఖలు పంపింది. ప్రధాని మోదీ అజ్మీర్ నుంచి హెచ్ పివి వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా అనుసంధానం చేస్తారు.మహిళలలో గర్భాశయ క్యాన్సర్ దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఆరోగ్యసమస్య. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పివి) వల్ల వస్తుంది. టీకా ద్వారా నివారించగల ఏకైక క్యాన్సర్ ఇదే. గర్భాశయ క్యాన్సర్ నివారణకు బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సహించడానికి తాము కట్టుబడిఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 14 సంవత్సరాల లోపు వయస్సుగల బాలికలందరికీ ఒకే మోతాదులో గార్డిసిల్ 4 వాక్సిన్ వేయబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో, (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్- ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యునిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ఉపజిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు అస్పత్రులలో ఈ వ్యాక్సిన్ అందజేస్తారు. హెచ్ పివి టీకా స్వచ్ఛందంగా అందజేస్తారు. బాలికలు టీకాలు వేసే ముందు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది.
Chief Minister A. Revanth Reddy has directed officials to launch 100 “Telangana Public Schools” this year, one each in 100 Assembly constituencies outside Hyderabad, in a major push to upgrade government education infrastructure. Reviewing the Education Department at the Command Control Centre, the Chief Minister said the new schools should be developed on the lines […] The post CM Revanth Orders 100 ‘Telangana Public Schools’ Across State, Pushes AI, Breakfast Scheme and Fee Regulation appeared first on Telugu360 .
నా భర్త విజయ్ దేవరకొండ.. పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక #VijayDeverakonda #Rashmika
గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి
గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చిట్యాల, ఆంధ్రప్రభ : గురువారం తెల్లవారుజామున
సాగు నీళ్లు రాక రైతుల ఆవేదన నర్సంపేట, రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట
Collectorate |ఐటీడీఏ ఏర్పాటు కోరుతూ ధర్నా…
Collectorate | ఐటీడీఏ ఏర్పాటు కోరుతూ ధర్నా… Collectorate | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ
తిరువూరు అభివృద్ధి పనులపై సమీక్ష..
తిరువూరు అభివృద్ధి పనులపై సమీక్ష.. సీఎంతో జరగనున్న సమావేశానికి ముందస్తు చర్చలు..కలెక్టర్ కార్యాలయంలో
ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.
ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు కేంద్ర
ఎడమ కాలువ సాగర్ జలాలను పరిశీలన
ఎడమ కాలువ సాగర్ జలాలను పరిశీలన నీటి ఎద్దడి నివారణకు సాగర జలాలే
బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్...ఇద్దరు మావోయిస్టుల మృతి
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్రయాదవ్ తెలిపారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజాపూర్ జిల్లా, ఇంద్రావతి నది ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం ఉదయం భద్రతా బలగాలు, డిఆర్ జి, సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా బలగాలకు తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాల పైకి కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించినట్టు, కాల్పుల అనంతరం సంఘటన ప్రదేశాన్ని పరిశీలించగా పురుష మావోయిస్టు మృతదేహం, మరొక మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు బహిరంగడ్ ఏరియా కమిటీకి చెందిన హిచామీ మద్ద, మంకీ పోడియంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. అలాగే సంఘటన ప్రాంతం నుండి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్ఆర్ రైఫిల్స్, ఇన్సస్ రైఫిల్స్, 12 బోర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు చెందిన నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు బస్తర్ రేంజ్ ఐజి పి సుందర్ రాజ్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ పరకాల, ఆంధ్రప్రభ : పరకాల
కుష్బూ గుప్తకు బదిలీ ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వారం రోజుల్లో శశికళ పార్టీ ఏర్పాటు కానుంది. ఓ వారం రోజుల్లో ఈ పార్టీ పేరు , ఇతర వివరాలను వెల్లడిస్తానని అన్నాడిఎంకె బహిష్కృత నాయకురాలు, జయలలిత నెచ్చెలి వికె శశికళ గురువారం చెన్నైలో తెలిపారు. ఇది ఆషామాషీ పార్టీ కాబోదని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర వహించే పార్టీ కాగలదని స్పష్టం చేశారు. పార్టీని పెడుతానని ఇంతకు ముందే ఆమె ప్రకటించారు. తొమ్దిది సంవత్సరాల రాజకీయ అజాతం వీడారు. రెండు రోజుల క్రితం దివంగత జయలలిత 78వ జయంతి సందర్భంగా రామంతాపురం జిల్లాలోని కమూతి లో జరిగిన బహిరంగ సభలో కొత్త పార్టీ జెండా ఎగురేశారు. అక్కడి నుంచి గురువారం ఇక్కడికి వచ్చిన శశికళ చెన్నై ఎయిర్పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నా, తమిళులే తన బలం అని, తాము ముందుకు వెళ్లుతానని స్పష్టం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన… బొట్ల సంపత్
ప్రమాణ స్వీకారం చేసిన… బొట్ల సంపత్ ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
ప్రధాని మోడీ ఈ ఎగ్జిబిషన్లో పలు ఉపయుక్త సాధనాలను శ్రద్ధగా తిలకించారు. వాటి వివరాలను ఆసక్తితో తెలుసుకున్నారు. ప్రత్యేకించి రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు రూపొందించిన మొబైల్ ఐ వివరాలను ఆరా తీశారు. ఇక వాటర్ జెన్ ద్వారా రూపొందించిన పరికరంతో గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే సాంకేతిక కీలకమైంది. గ్రావిటి ప్రాతిపదికన పనిచేసే ఎన్ డ్రిప్ ఇరిగేషన్ ప్రక్రియ, మైనోరా బయో కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాల సరైన నిర్వహణ మార్గాలను రూపొందించింది. ఇక సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ సాంకేతికత పలు వినూత్న రీతుల్లో సాగింది. లాబ్లో ఉత్పత్తి అయ్యే మిల్క్ ప్రొటిన్స్ , పలు రకాల పుట్టగొడుగుల తయారీ సాధనాలు ప్రధాని మోడీతో పాటు అందరినీ ఆకట్టుకున్నాయి. పంటనూర్పిళ్ల దశలో వృధాలు జరుగకుండా చేసే ప్రక్రియలు రైతాంగానికి ఉపయోగం కానున్నాయి.
కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం వేంసూరు, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్యాన్ని
శ్రీనివాసరెడ్డి కుటుంబానికి గండ్ర దంపతుల పరామర్శ,
శ్రీనివాసరెడ్డి కుటుంబానికి గండ్ర దంపతుల పరామర్శ, చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని, నవాబ్పేట
బోనాలతో మహిళల ఊరేగింపు జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం,పొనకల్
Vishnu Vinyasam is relatable and a comical treat – Sree Vishnu
Sree Vishnu became King of Entertainment for Telugu Cinema with his known relatable characters and impeccable comic timing. His upcoming film, Vishnu Vinyasam has created good anticipation among audiences with songs and teaser. The bookings have been appreciable and the actor interacted with press today. He stated that he is extremely happy and confident with […] The post Vishnu Vinyasam is relatable and a comical treat – Sree Vishnu appeared first on Telugu360 .
Venky, Kalyan Ram, Anil Ravipudi’s Film Announced
Director Anil Ravipudi continues to redefine consistency in commercial cinema, standing tall with an unbeaten record of nine back-to-back blockbusters. His next movie will feature two prominent stars, Victory Venkatesh and Nandamuri Kalyan Ram, in the lead roles. Venkatesh and Anil Ravipudi form a blockbuster combination, having delivered four successful films together, while the director […] The post Venky, Kalyan Ram, Anil Ravipudi’s Film Announced appeared first on Telugu360 .
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన
ఐదు సంవత్సరాలుగా తాము ఇద్దరం ప్రేమించుకున్నామని, ఈ నెల ఫిబ్రవరి 3 వ తేదీన సికింద్రాబాద్లో ఒక గుడిలో తనను పెళ్ళి సైతం చేసుకుని, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల చెప్పుడు మాటలు విని తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడని ఒక యువతి తన ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ తాలూకా దౌల్తాబాద్ మండల పరిదిలోని గోకపస్లావాద్ గ్రామంలో గురువారం రోజు చోటు చేసుకుంది. బాధిత యువతి మరియు యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకపస్లావాద్ గ్రామానికి చెందిన తుప్పుడు బాస్కర్, తుప్పుడు సాయమ్మల కూతురు అశ్విని(23) అదే గ్రామానికి చెందిన కొంగ నర్సప్ప, కొంగ వెంకటమ్మల కుమారుడు కొంగ బుగ్గప్ప(24)లు గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. యువతి గత కొన్ని రోజులుగా హైద్రాబాద్లో బ్యూటీపార్లర్లో పని చేస్తుంది. యువకుడు బుగ్గప్ప సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కాగా 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఇరువురు పిబ్రవరి నెల 3న సికింద్రాబాద్లోని ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహన్ని యువకుడి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన తమ్ముడు తప్పిపోయినట్లు యువకుడి అన్న శేఖర్ దౌల్తాబాద్ పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకి తెలుసుకుని వివాహం చేసుకున్నట్లు గుర్తించి యువతి, యువకుడిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాల వారికి పోలీసులు సర్ది చెప్పి పంపించారు. ఈ క్రమంలో యువతిని తీసుకు వెళ్ళిన యువకుడు గత వారం రోజులుగా హైద్రాబాద్లో ఒక గదిలో ఉన్నాడు. మంగళవారం రోజు గదిలో యువతిని ఒక్క దాన్నే ఉంచి భయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో దిక్కు తోచని యువతి తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి వెళ్ళిన వారు యువకుడు తమ అమ్మాయిని మోసం చేసి పారి పోయినట్లుగా అనుమానించి స్థానిక నార్సింగి పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. కాని బుగ్గప్ప సెల్ఫోన్ స్విచ్చాప్ రావడంతో ఏం చేయాలో తెలియక గ్రామంలోని వారి ఇంటి దగ్గరకి వచ్చిన అశ్వినిని వారి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ప్రేమ పేరుతో తనను పెళ్ళి చేసుకుని ఇంట్లోకి రానివ్వకుండా మోసం చేశారని వారి ఇంటి ముందు నిరసనకు దిగింది. కాగా అశ్విని ఇంటి ముందు నిరసనకు దిగడంతో బుగ్గప్ప కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్ళి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా గ్రామానికి చేరుకుని పోలీస్స్టేషన్కు వచ్చి పిర్యాదు చేయమని తాము వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి తమ అమ్మాయికి న్యాయం చేయాలని పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. తాము గత ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్ళి సైతం చేసుకున్నామని, కాని ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల మాటలు విని తన భర్త తనను మోసం చేస్తున్నాడని, తన భర్త తనకు కావాలని తనకు న్యాయం చేయాలని ఈ సందర్బంగా అశ్విని డిమాండ్ చేస్తుంది.
భయం వీడి పరీక్షలు నిర్భయంగా రాయాలి..
భయం వీడి పరీక్షలు నిర్భయంగా రాయాలి.. ప్రతి పరీక్షల్లో నువ్వే ఫస్ట్ అనుకో..ప్రముఖ
Reservoir |ఆ దృశ్యం వెనుక దుఃఖం..
Reservoir | ఆ దృశ్యం వెనుక దుఃఖం.. Reservoir | స్టేషన్ ఘన్పూర్,
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శుభ ముహుర్తాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం భక్తుల సందడి నెలకొంది. శుభముహుర్తాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అదిక సంఖ్యలో విచ్చేశారు. ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నది ఒడ్డున గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. భారీగా భక్తులు రావడంతో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. అనంతరం అమ్మవారి సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయ రామరావు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
102 cases |అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండండి
102 cases | అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండండి కేంద్ర మంత్రి కింజరాపు
ఆరు నెలల్లో చెత్త రహిత మక్తల్ –ప్రజలందరి భాద్యత
ఆరు నెలల్లో చెత్త రహిత మక్తల్ – ప్రజలందరి భాద్యత మక్తల్ ,
Telangana : మంత్రి పదవులు భర్తీ ఇప్పట్లో లేనట్లేనా? హైకమాండ్ అదే చెప్పిందా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది
‘పెద్ది’ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్.. రెండో సింగిల్ వచ్చేది అప్పుడే..
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం వచ్చి ‘చికిరి చికిరి’ అంటూ సాగే పాట తెగ వైరల్ అయింది. ఈ పాటలోని హుక్ స్టెప్ ఎంతమంది రీక్రియేట్ చేశారో లెక్కే లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమా నుంచి త్వరలో రెండో సింగిల్ రాబోతుంది. ‘‘నీ అయ్య వడ్డీ.. నీ బిడ్డ కడితే.. నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… ’’ అంటూ సాగే పాటని మార్చి 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివ రాజ్కుమార్, దివ్యేందు, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇంకా కొంత భాగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఏప్రిల్ 30కి సినిమా విడుదలను వాయిదా వేశారు. This song fuels the fire within #Peddi second single #RaiRaiRaaRaa will be a blast Full Song on 2nd March. #PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani … pic.twitter.com/dXANh0eXjQ — Ram Charan (@AlwaysRamCharan) February 26, 2026
Milk Union |పాడి రైతు కుటుంబానికి ఆర్థిక సాయం..
Milk Union | పాడి రైతు కుటుంబానికి ఆర్థిక సాయం.. పాల రైతులకు
Rs.13.85 cr |సీఎంఆర్ఎఫ్రూ 13.85 కోట్లు మంజూరు
Rs.13.85 cr | సీఎంఆర్ఎఫ్రూ 13.85 కోట్లు మంజూరు Rs.13.85 cr |
13 lakhs |ఆశయ సాధనలో కార్యకర్తలే బలం
13 lakhs | ఆశయ సాధనలో కార్యకర్తలే బలం మంత్రి నాదెండ్ల మనోహర్మార్చి
Hero Nani |వైరలైన నాని స్టెప్..
Hero Nani | వైరలైన నాని స్టెప్.. Hero Nani | ‘దసరా’
కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ సురేష్
కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ సురేష్ నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
ఆలయాలు ఐక్యతకు కేంద్రబిందువులు
ఆలయాలు ఐక్యతకు కేంద్రబిందువులు శతాబ్దాల చరిత్రకు ప్రతీక వాసవి అమ్మవారి ఆలయందేవాలయాల పునర్
Pradeep ranganathan |అలా చేస్తున్నాడా..?
Pradeep ranganathan | అలా చేస్తున్నాడా..? Pradeep ranganathan | ‘లవ్ టుడే’తో
వేడుకగా హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మంథన వివాహం జరిగింది
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. లయన్స్ క్లబ్
విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు బండి ఆంజనేయులు వారి జ్ఞాపకార్థం కుమారుడు బండి వేణుగోపాల్ వ్యవహరించడం జరిగిందన్నారు. మొత్తం 65 మంది కంటి రోగులు పాల్గొనగా […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. లయన్స్ క్లబ్ appeared first on Visalaandhra .
Venky | అసలు ప్లాన్ మారిందా..? Venky | దసరాకి ‘ఆదర్శ కుటుంబం’
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 6,722 మంది పెన్షన్ దారులకు 2 కోట్ల 96 లక్షల 79 వేల 500 రూపాయలను 14 సచివాలయాలలోని ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారని […] The post 28వ తేదీనే పెన్షన్ పంపిణీ appeared first on Visalaandhra .
వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షలో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ
విశాలాంధ్ర ధర్మవరం;;రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించి పాఠశాలకు గర్వకారణమని డి భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పరీక్షలునిర్వహించిన మూడు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి తమ ప్రతిభ, కృషి, పట్టుదలను చాటుకున్నారు అని తెలిపారు.6వ తరగతి నుండి జతిన్ కుమార్, కె. గగన్ గీత్, నిఖిల్ సాయి , 7వ తరగతి నుండి ఆదిత్య సాయి, హర్షవర్ధన్ నాయక్, మధు విద్యార్థులు […] The post వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షలో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ appeared first on Visalaandhra .
MPTC,ZPTC ఎన్నికలపై కసరత్తు ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః తెలంగాణ ప్రభుత్వం ఎంపీటీసీ,
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
బాపట్ల: జిల్లాలోని వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళ్తున్న సహస్ర(20) ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో సహస్ర మృతి చెందగా.. అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్ని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సహస్ర గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది.
మాజీ ఎంపీని కలసిన బీజేపీ నేతలు
మాజీ ఎంపీని కలసిన బీజేపీ నేతలు చల్లపల్లి – ఆంధ్రప్రభ : అరకు
ఘనంగా రోటరీ 121 వజన్మదిన ఉత్సవాలు.. రోటరీ క్లబ్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాంస్కృతిక మండలి లో రోటరీ క్లబ్ 121వ జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ ప్రతినిధులు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తొలుత కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి నరేందర్ రెడ్డి, తదితర సీనియర్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ 1905 ఫిబ్రవరి 27న అమెరికాలోని చికాగోలో యూనిటీ బిల్డింగ్స్ లో నలుగురు వ్యక్తులు సమాజసేవయే దృక్పతంగా స్థాపించిన సంస్థ ఇది […] The post ఘనంగా రోటరీ 121 వజన్మదిన ఉత్సవాలు.. రోటరీ క్లబ్ appeared first on Visalaandhra .
ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు
వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో షాప్ జిల్లా సాయి సైక్లింగ్ ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వచ్చిన వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ,స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపికలు కాలేజీ సర్కిల్ నుంచి ప్రియదర్శిని స్కూల్ వరకు నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 28 […] The post ఘనంగా ప్రారంభమైన షాప్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు appeared first on Visalaandhra .
హేతుబద్దీకరణ జీవో 25ను సవరించాలి
హేతుబద్దీకరణ జీవో 25ను సవరించాలి భైంసా, ఆంధ్రప్రభ ; విద్యారంగ సంక్షేమం కోసం
సైకిల్ రేస్ పోటీలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం:: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు ఇటీవల నిర్వహించినటువంటి సైకిల్ రేసులో జిల్లా స్థాయికి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాణించి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు గాను ఫిబ్రవరి 28 నుండి మార్చి ఒకటి వరకు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తారని […] The post సైకిల్ రేస్ పోటీలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక appeared first on Visalaandhra .
నష్ట పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్న..
భైంసా, ఆంధ్రప్రభ ; రెండు రోజుల క్రితం ఈదురు గాలుల తో భారీ
అజ్మీరా ట్రెండ్స్ డ్రెస్సెస్ షాప్ ప్రారంభం..
అజ్మీరా ట్రెండ్స్ డ్రెస్సెస్ షాప్ ప్రారంభం.. కరిమాబాద్, ఆంధ్రప్రభ ; వరంగల్ తూర్పు
ఆఖర్లో ఆదుకున్న రొమారియో,హోలర్డ్.. విండీస్ స్కోర్ ఎంతంటే
అహ్మదాబాద్: టి-20 ప్రపంచకప్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా వెస్టిండీస్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి విండీస్.. సఫారీ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయారు. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డారు. ఈ నేపథ్యంలో జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ల జోడి జట్టుకు అండగా నిలిచింది. ఇద్దరు కలిసి 89 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలో హోల్డర్ 49 పరుగుల వద్ద ఔట్ కాగా, రొమారియో(52) అర్థ శతకం సాధించాడు. ఫలితంగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి.. 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలింగ్లో ఎంగిడి 3, రబాడా, బోష్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇందిరమ్మ ఇళ్లపై వివాదం.. భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి మున్సిపాలిటీ నాలుగో
Station Ghanpur |రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు..
Station Ghanpur | రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు.. Station Ghanpur | స్టేషన్
కుమ్మెర ఘటనను ఖండించిన రజక సంఘం నేతలు..
నార్సింగ్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో గుడిలోకి ప్రవేశించారనే కారణంతో
Former Minister |కేటీఆర్ హామీ..
Former Minister | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ ; ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో
కుమ్మేర మల్లన్న జాతర ఘటనపై నిరసన..
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ జిల్లా తాండూర్ మండలం కుమ్మేర మల్లన్న జాతరలో
2manythings |డా. జయప్రకాశ్ నారాయణ్ తో andhraprabha digital స్పెషల్ ఇంటర్వ్యూ
2manythings | డా. జయప్రకాశ్ నారాయణ్ తో andhraprabha digital స్పెషల్ ఇంటర్వ్యూ
Etala Rajender |పేదల ఇళ్లను కూల్చుతున్నారు..
Etala Rajender | పేదల ఇళ్లను కూల్చుతున్నారు.. Etala Rajender | ఆంధ్రప్రభ
Rai Rai Raa Raa Gears Up To Ignite Peddi Buzz
The buzz around Peddi continues to snowball, and the makers are now ready to add fresh fuel to the fire with its second single, Rai Rai Raa Raa, slated for release on March 2nd. Starring Mega Power Star Ram Charan in a fiercely raw avatar, the rustic action drama being helmed by Buchi Babu Sana […] The post Rai Rai Raa Raa Gears Up To Ignite Peddi Buzz appeared first on Telugu360 .
Jaggareddy |రాజకీయ పరిణామాలపై చర్చ…
Jaggareddy | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్
కేరళ సెన్సార్ బోర్డుకు హైకోర్టు చురకలు
కేరళ సెన్సార్ బోర్డుకు హైకోర్టు చురకలు ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః కేరళ
అవినీతి రహిత పాలన అందిస్తాం మంథని, ఆంధ్రప్రభ : మంథని మునిసిపల్ లో
చంద్రబాబుతోనే గ్రామాలు అభివృద్ధి
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న టీడీపీ నాయకులు విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) :ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్, సిద్దప్ప ధని అన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో గ్రామ సర్పంచ్ బసమ్మ, శివ ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్జీఎస్ కింద మెటీరియల్ పనుల ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయలతో 4 సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […] The post చంద్రబాబుతోనే గ్రామాలు అభివృద్ధి appeared first on Visalaandhra .
ఎంపీ చామలకు కృతజ్ఞతలు.. మోత్కూర్, ఆంధ్రప్రభ ; ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
మీరు దేవుడి గూరించి చెప్పడం హస్యాస్పదం..
మీరు దేవుడి గూరించి చెప్పడం హస్యాస్పదం.. భక్తి కంటే టీడీపీకి రాజకీయమే ఎక్కవమీకు
పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పిఎసిఎస్( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ) చైర్మన్ పదవి కల్పించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు మరియు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు నూతన చైర్మన్ గా ఎన్నికైన ప్యారం కేశవానంద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్యారం కేశవానంద మాట్లాడుతూ, […] The post పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు appeared first on Visalaandhra .

25 C