SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

పునర్వికకు పునర్జన్మ..విజయవంతమైన నిధుల సేకరణ

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక కోసం కదిలిన తెలుగు ప్రజలు సోషల్ మీడియా ద్వారా విజయవంతమైన క్రౌడ్ ఫండింగ్.. సమకూరిన చికిత్స ఖర్చులుఇకపై విరాళాలు పంపవద్దని, నిధుల సేకరణ ఆపేయాలని కోరిన తండ్రిమానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక మహాయజ్ఞంలా సాగిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో […] The post పునర్వికకు పునర్జన్మ..విజయవంతమైన నిధుల సేకరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:28 am

మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 11:26 am

Sanatnagar |అదే కారణమా?

Sanatnagar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:25 am

డ్రగ్స్ జోలికి పోవద్దు

సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి : సి ఐ సురేష్ – భాష్యం లో అవగాహన సదస్సు విశాలాంధ్ర – మండపేట : యువత ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని టౌన్ సి ఐ సురేష్ అన్నారు. స్థానిక భాష్యం స్కూల్ లో మంగళవారం సి ఐ సురేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో రేపటి తరం కోసం గంజాయి రహిత సమాజం ఇదే మా సంకల్పం పేరిట అవగాహనా సదస్సు నిర్వహించారు. […] The post డ్రగ్స్ జోలికి పోవద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:24 am

OTT Releases: February Last Weekend

A bunch of English titles are available for streaming during the last week of February. There are no notable Telugu releases in the digital space this weekend. Sri Chidambaram Garu, Daughter Of Prasad Rao Kanabadutaledhu, Honey and Paanigrahanam are the Telugu releases. Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi was expected to stream this weekend but the […] The post OTT Releases: February Last Weekend appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 11:23 am

సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట

సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని, […] The post సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:21 am

వేంకటేశ్వర స్వామివారి చక్రస్నానం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన చక్రస్నానం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మన తెలంగాణ 25 Feb 2026 11:18 am

Tragic incident |ఆ బాధతోనేనా…?

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యూట్యూబ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:15 am

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద సందడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. The post తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద సందడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:14 am

ఈమె తల్లేనా? వివాహేతర సంబంధం కోసం చిన్నారిని చిదిమేసిందిగా?

తిరుపతిలో చిన్నారి దుర్గ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 11:08 am

మరోసారి భారత్‌ పై ట్రంప్‌ టార్గెట్

-సోలార్ ఉత్పత్తులపై 126 శాతం డ్యూటీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. మన దగ్గరి నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం డ్యూటీ విధించారు. ఇండోనేసియాపై ప్రాథమిక సుంకాలను 86 శాతం నుంచి 143 శాతానికి పెంచారు. లావోస్‌పై 81 శాతం డ్యూటీ వేశారు. ఫారెన్‌ సబ్సిడీల ఆధారంగా రేటును నిర్ధరించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాల నుంచి అగ్రరాజ్యానికి […] The post మరోసారి భారత్‌ పై ట్రంప్‌ టార్గెట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:08 am

ఉగ్రవాదంపై ఖడ్గప్రహారం

ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమిస్తోంది. ఈ మహమ్మారి బారినపడిన దేశాల జాబితాలో ఒక్క భారత్ మాత్రమే కాదు, అగ్రరాజ్యం అమెరికా సహా అనేక బడా దేశాలూ ఉన్నాయి. అయినప్పటికీ ఉగ్రవాదంపట్ల బాధిత దేశాలన్నీ చేతులు కలిపి మూకుమ్మడి పోరు సలపలేకపోవడానికి ఎవరి కారణాలు వారివి. ఓటు బ్యాంకు రాజకీయాలు, స్వార్థపర ప్రయోజనాలు ఈ మహమ్మారిపై ఉమ్మడి పోరుకు మోకాలడ్డుతున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ కోవలోకే వస్తాయి. ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌పై అమెరికా ఉదాసీన వైఖరి ఇందుకు ఒక ఉదాహరణ. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులపై నిషేధం విధించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తన వీటో అధికారంతో అడ్డుకుంటున్న చైనాను మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రవాదంపై ఒంటరిపోరు చేస్తున్న భారత్, మరో అడుగు ముందుకు వేసి ‘ప్రహార్’ పేరిట కౌంటర్ టెర్రరిజంపై ఒక సమగ్ర విధానాన్ని ఆవిష్కరించడం ఎంతైనా ముదావహం. ఉగ్రవాద ముప్పునుంచి దేశాన్ని రక్షించేందుకు ఏడు మూలస్తంభాల్లాంటి అంశాలతో ప్రహార్ రూపుదిద్దుకుంది. ఉగ్రవాద దాడుల ముప్పును ముందే పసిగట్టి ఉప్పందించే నిఘా వర్గాలను మరింత పటిష్ఠం చేయడం, దాడి జరిగినప్పుడు వేగంగా ప్రతిస్పందించడం, ఉగ్రవాదానికి అనుకూలించే పరిస్థితులను నిర్మూలించడం, అంతర్జాతీయ సహకారంతో ఉగ్రవాద నెట్ వర్కులను దెబ్బతీయడం, ఉగ్రదాడుల బాధితులకు పునరావాసం కల్పించడం, సమాజంలో వారిని భాగస్వాములను చేయడం.. ఇవీ ప్రహార్ లోని ప్రధానాంశాలు. ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా ఇందులో కొన్ని అంశాలు ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ, అన్ని అంశాలనూ స్పృశిస్తూ సమగ్రమైన ఒక విధానాన్ని ఆవిష్కరించడం మాత్రం ఇదే మొదటిసారి. ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి అసలు కారణాలను సైతం పసిగట్టి, వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకునేలా ప్రహార్ రూపుదిద్దుకుంది. నిరుద్యోగ యువతకు, పేదలకు డబ్బు ఆశజూపి, వారు హింసాకాండకు పాల్పడేలా చేయడం ఉగ్రవాదులకు వెన్నతో పెట్టిన విద్య. సంక్షేమ పథకాల ద్వారా ఇలాంటి వాటికి పరిష్కారం చూపవచ్చన్న ప్రభుత్వ అభిప్రాయం సరైనదే. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదం సైతం కొత్తపుంతలు తొక్కుతోంది. తుపాకులు, బాంబులకు పరిమితం కాకుండా కృత్రిమమేధ సాయంతో దాడులకు పాల్పడుతున్నారు. సైబర్ దాడులకూ బరితెగిస్తున్నారు. మరోవైపు కశ్మీర్ లోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ వేర్పాటువాదాన్ని ఎగదోస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటినీ అడ్డుకునేందుకు కృత్రిమ మేధను సమర్థవంతంగా వినియోగించే శక్తిసామర్థ్యాలను పెంపొందించుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మన సైనికులకూ చేరువ చేయాలి. ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య అనేది నిర్వివాదాంశం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పీస్ సంస్థ ఆ మధ్య విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో బుర్కినా ఫాసో, పాకిస్తాన్, సిరియా తొలి మూడు స్థానాల్లో ఉండగా, భారత్ ది ఈ జాబితాలో 14వ స్థానం. భారత్‌ను మించిన ఉగ్రవాద బాధిత దేశంగా రికార్డులకు ఎక్కిన పాకిస్తాన్, తన ఇల్లును చక్కదిద్దుకోకుండా పొరుగింట్లో పొగ పెట్టాలనుకోవడం విచిత్రమే. అంతర్జాతీయ సహకారం లేనిదే ఉగ్రవాదాన్ని తుదముట్టించడం అసాధ్యమే కావచ్చు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరా చేసుకుని వేరే దేశాల్లో తిష్ఠ వేసుకు కూర్చుని, ఆర్థిక వనరులను ఎరగా వేస్తూ, పేలుడు సామగ్రిని అందజేస్తూ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న ముష్కరుల ఆటకట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావలసిన అవసరం ఉంది. అందుకు ఆయా దేశాలు సహకరించడం లేదంటూ చేతులు ముడుచుకు కూర్చోకుండా తనవంతు ప్రయత్నంగా భారత్ సాగిస్తున్న ఒంటరి పోరాటం సాధారణమైనదేం కాదు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ పట్ల మునుపటిలా ఉదాసీన వైఖరిని ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు దీటుగా జవాబిస్తోంది. ఆపరేషన్ సిందూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రయిక్స్‌తో ఉగ్రవాదంపట్ల తన వైఖరేమిటో పాకిస్తాన్‌కే కాదు, ప్రపంచ దేశాలకు సైతం చాటిచెబుతోంది. పార్లమెంట్ పై దాడి, ఢిల్లీ బాంబు పేలుళ్లు, 26/11 ముంబయి పేలుళ్లు, పహల్గాం దాడులు వంటి ఉగ్రవాద దుశ్చర్యల వల్ల భారత్ ఇప్పటికే ఎంతో కోల్పోయింది. ఇకపై ఉగ్రవాదానికి మూల్యం చెల్లించుకోవడానికి భారత సిద్ధంగా లేదన్న స్పష్టమైన వైఖరితో ప్రహార్ పేరిట ఆవిష్కరించిన బహుముఖ వ్యూహం ఫలించాలని, ఉగ్రవాద రహిత దేశంగా భారత్ వర్ధిల్లాలనీ కోరుకుందాం. 

మన తెలంగాణ 25 Feb 2026 11:06 am

తొందరపడి కూస్తున్న రాజకీయ కోయిలలు!

లోక్‌సభ ఎన్నికలకు మరో మూడేళ్లకు పైగా సమయం ఉంది. ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే బొటాబొటీ ఆధిక్యతతో ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి పదవి చేపట్టగలిగారు. అయినా ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నిలదీయడంతో ప్రతిపక్షాలు విఫలం అవుతున్నాయి. ఎవ్వరి దారి వారిదిగా కనిపిస్తున్నది. ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడులతో పాటు వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికలపై దృష్టి సారించకుండా అకస్మాత్తుగా 2029లో జరిగే ఎన్నికలలో ప్రతిపక్షాల ప్రధానమంత్రి ఎవ్వరు? అనే చర్చ బయలుదేరడం ఒక విధంగా విస్మయం కలిగిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ఇండియా కూటమి దాదాపు నిస్తేజంగా మిగిలింది. ఇప్పుడు ఆ కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని అంటూ ఇతర పేర్లను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ బారు మమతా బెనర్జీ పేరును ప్రతిపాదించగా, మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ పేరును తెరపైకి తెచ్చారు. వీరిద్దరూ కూడా గతంలో యుపిఎ హయాంలో కాంగ్రెస్ ప్రాపకంతో ప్రభుత్వంలో కీలక పదవులు పొందినవారే. వారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలగకపోయినా, వారు మంచి గుర్తింపు పొందారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తప్పదనే అంచనాతో ముందుగానే మన్మోహన్ సింగ్‌ను విడిచి వెళ్ళిపోయిన సంజయ్ బారు, ఎన్నికల అనంతరం మళ్ళీ ఆయనే ప్రధాని కావడంతో తిరిగి ప్రభుత్వంలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ప్రాబల్యం పెరుగుతున్నప్పటి నుండే మణిశంకర్ అయ్యర్ తెరమరుగుకాక తప్పలేదు. సహజంగానే, సంజయ్ బారు ప్రతిపాదనను టిఎంసి నుండి ఎంపిగా మారిన జర్నలిస్ట్ సాగరికా ఘోష్ సమర్థించారు. టిఎంసి నాయకులతోపాటు డిఎంకె, ఉద్ధవ్ థాకరే శివసేన (యుబిటి) కూడా ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చాయి. ‘ఒక్క తమిళనాడు సిఎం మాత్రమే 2029 ఎన్నికల్లో కూటమికి విజయాన్ని చేకూర్చగలరు’ అంటూ మణిశంకర్ అయ్యర్ చేసిన ప్రతిపాదనకు ఆ పార్టీలోని వారు తప్ప మరెవ్వరూ స్పందించలేదు. పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా తన తండ్రి ఎంకె స్టాలిన్ కూటమికి నేతృత్వం వహించాలని కోరుతున్నారని ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ, ప్రజాపాలనలోనూ స్టాలిన్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మమత, స్టాలిన్ తమ తమ రాష్ట్రాలలో తిరుగులేని నాయకులు కావచ్చు. అయితే, వారెవ్వరికీ జాతీయ స్థాయిలో ప్రాబల్యం లేదు. ఇతర రాష్ట్రాలలో వారికి ఎటువంటి మద్దతు లేదు. టిఎంసిని జాతీయ పార్టీగా చేసేందుకు మమత ఎంతగా ప్రయత్నించినా గోవా, త్రిపుర, మేఘాలయ వంటి చిన్నచిన్న రాష్ట్రాలలో తాత్కాలికంగా ప్రభావం చూపినా పార్టీని విస్తరింపలేకపోయారు. అట్టడుగు నుండి వీధి పోరాటాల ద్వారా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేదా ‘గాడ్ ఫాదర్’ లేకుండా కీలకమైన నేతగా ఎదిగిన దేశంలో ఏకైక మహిళా నేత మమత అనడంలో సందేహం లేదు. పశ్చిమబెంగాల్ కాంగ్రెస్‌లో ప్రియరంజని దాష్ మున్షీ, ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను ధిక్కరించి, సొంతంగా పార్టీ పెట్టుకొని, 34ఏళ్ళ వామపక్ష పాలనకు చరమగీతం పాడారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉండగలిగారు. బిజెపిని సైతం పదేళ్లుగా ఎదుర్కొంటున్నారు. ఆమెను ప్రధాని అభ్యర్థిగా జాతీయ స్థాయిలో మహిళా ఓటర్లను ఆకట్టుకొనే అవకాశం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆమె మద్దతు పొందటం కష్టమే కాగలదు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో బిజెపికి గట్టి పోటీ ఇవ్వగలిగిన స్థాయిలో కేవలం కాంగ్రెస్ మాత్రమే ఉంది. సుమారు 100 మంది ఎంపిలు ఉన్నారు. సుమారు 300 స్థానాలలో బిజెపికి కీలకమైన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ గెలిచే సీట్లు పెరిగితేనే బిజెపిని గద్దె దించడం సాధ్యం కాగలదు. అందుకనే బిజెపి సైతం కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీల నేతలను అంతగా పట్టించుకోవడం లేదు. విధానపరమైన అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో, బైటా గట్టిగా నిలదీస్తోంది కూడా కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ. అయితే, ఇప్పుడు అనూహ్యంగా 2029లో జరగబోయే ఎన్నికలను ప్రస్తావిస్తూ మమత, స్టాలిన్‌లను ప్రధాని అభ్యర్థులుగా ప్రచారం చేయడం వెనుక రెండు ఉద్దేశాలు ఉండే అవకాశం ఉంది. మొదటగా, మరో రెండు నెలల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మమత, స్టాలిన్‌లకు తమతమ రాష్ట్రాలలో తిరిగి గెలుపొందేందుకు అటువంటి ప్రచారం ఉపయోగపడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీని ఓడించగలిగేది వీరే అనే ప్రచారం ఎన్నికల ముందు జరగడం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అని చెప్పవచ్చు. 15 ఏళ్ళ పరిపాలనలో మమత సహజంగానే కొంత ‘ప్రభుత్వ వ్యతిరేకత’ కు గురయ్యే అవకాశం ఉంది. ‘బెంగాల్ సంస్కృతి’కి తానే ప్రతినిధి అని, బీజేపీ ‘బయటివారి పార్టీ’ అని ఇప్పటివరకు చేస్తున్న ప్రచారం మరోసారి ఏమేరకు ఉపయోగపడుతుంది? అన్నదికూడా ప్రశ్నార్థకం కాగలదు. అందుకనే కొత్తకొత్త ఎత్తుగడలను అనుసరింపక తప్పదు. అందుకనే అటువంటి ప్రచారం పట్ల మమతా మౌనం వహిస్తున్నారు. తమిళనాడులో అధికారంలో భాగస్వామ్యం కోరుతున్న కాంగ్రెస్ నుండి డిఎంకె ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు స్టాలిన్ ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవడం ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరోవంక, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేరుగా ప్రధాన మంత్రి మోడీ లక్ష్యంగా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించడంతో బిజెపి ఇరకాటంలో పడిపోయింది. మాజీ సైన్యాధికారి నరవాణె గ్రంథం విషయంలో గాని, భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంలో గాని, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో గాని రాహుల్ లేవనెత్తిన అంశాలపై అధికార పక్షం నోరు విప్పలేకపోతున్నది. ఈ అంశాలలో నేరుగా ప్రధాని ప్రమేయం ఉండడంతో దేశంలో సైతం ఓ ‘బలమైన నాయకుడు’ గా ఇప్పటివరకు మోడీ చుట్టూ జరుగుతున్న ప్రచారంపై తెరపడింది. ఈ అంశాలపై స్టాలిన్, మమత వంటి ప్రతిపక్ష నేతలు దాదాపు మౌనంగా ఉంటున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఆమోదించిన అవిశ్వాస తీర్మానంపై టిఎంసి సంతకం చేయకపోవడం గమనార్హం. మోడీ ప్రభుత్వ మనుగడకు నితీశ్ కుమార్,చంద్రబాబు నాయుడుల మద్దతు కీలకం అయినప్పటికీ వారిలో ఎవరు మద్దతు ఉపసంహరించుకున్నా తమ అధికారానికి ఢోకా లేదనే ధీమా బిజెపిలో కనిపిస్తున్నది. అందుకు ప్రధాన కారణం సంక్షోభం ఎదురైతే డిఎంకె, టిఎంసి వంటి పార్టీలు అక్కరకు వస్తాయనే నమ్మకం కూడా కావచ్చు. ఈ కారణాలతో మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఓ విధంగా ఒంటరి పోరాటం జరపాల్సి వస్తుంది. ఇదే సమయంలో రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీపై అమెరికాలో 15 నెలల కిందట నమోదైన కేసులో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) నోటీసులను స్వీకరించడానికి అదానీ న్యాయవాదులు అంగీకరించడంతో ఈ కేసు ఇటీవలే చివరి దశకు చేరినట్లయ్యింది. ట్రంప్ విధించిన టారిఫ్‌లపై అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందుగానే ఈ కారణాలతోనే హడావుడిగా భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడంపై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఈ పరిణామాలను గుర్తించిన సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ 2029 ప్రధానమంత్రి అభ్యర్థి గురించి ఇప్పుడు ఆలోచించడం ఏమిటని అంటూ ఈ చర్చకు దూరం జరిగారు. పైగా, ప్రతిపక్షాలు తమ ముందున్న ప్రాధాన్యతలను మరచిపోకూడదని సున్నితంగా మందలించారు. ‘మొదట, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో బిజెపిని ఓడించాలి’ అని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతానికి, మేము వేరే దేని గురించి ఆలోచించడం లేదు. బిజెపియేతర పార్టీలు తమతమ రాష్ట్రాలలో అధికారం చేపట్టకుండా నిరోధించడానికి కొత్త ‘రాజకీయ చిక్కులు’ కోరుకోవడం లేదు’ అని తేల్చి చెప్పారు. ఆ మాత్రం రాజకీయ పరిపక్వత మిగిలిన ప్రతిపక్ష నాయకులలో లోపించిందని చెప్పలేం. వ్యూహాత్మకంగానే, తమ తమ రాజకీయ అవసరాల కోసమే ప్రధాని అభ్యర్థి గురించి చర్చకు ఆజ్యం పోస్తున్నట్లు స్పష్టం అవుతుంది. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను దగ్గరకు చేర్చి ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించింది నితీశ్ కుమార్. ఆయననే ఆ కూటమికి నాయకత్వం వహించాలని దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నుండి కాకుండా మమత నుండి అభ్యంతరం వ్యక్తమైంది. దానితో నితీశ్ తిరిగి ఎన్‌డిఎ గూటికి చేరుకున్నారు. నితీశ్ ఇండియా కూటమిలో కొనసాగి ఉంటే బీహార్‌లో ఆ కూటమికి అత్యధిక స్థానాలు లభించి ఉండేవి. అప్పుడు కేంద్రంలో ఎన్‌డిఎ మెజారిటీ సాధించడం కష్టమై ఉండెడిది. ఇండియా కూటమి కూడా అధికారానికి అందుబాటులోకి వచ్చెడిది.   చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 25 Feb 2026 11:03 am

NTR -AKHIL |ఈ క్రేజీ కాంబో నిజమేనా..?

NTR -AKHIL | ఈ క్రేజీ కాంబో నిజమేనా..? NTR -AKHIL |

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:01 am

ఇంటింటికి తిరిగి వినూత్న విజ్ఞప్తి..

ఇంటింటికి తిరిగి వినూత్న విజ్ఞప్తి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:52 am

విద్యార్థులు భయాందోళన చెందకుండా..

విద్యార్థులు భయాందోళన చెందకుండా.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ విద్యార్థులు భయాందోళన చెందకుండా

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:45 am

ప్రేమ విఫలం... యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

రాయదుర్గం: ప్రేమ విఫలం కావడంతో యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన కోమలి రంగారెడ్డి జిల్లా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తోంది. బిఎస్‌సి చదువుతూనే యూట్యూబర్‌గా వీడియోలు చేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన మరో యూట్యూబర్ నిఖిల్ రెడ్డి పరిచయం కావడంతో అతడితో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో కోమలికి నిఖిల్ దూరంగా ఉండడంతో ఆమె ఆరు నెలల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బంధువుల సర్ధి చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇటీవల మళ్లీ పెళ్లి విషయంలో నిఖిల్ రెడ్డితో కోమలి గొడవ పెట్టుకుంది. దీంతో మనస్థాపంతో కోమలి ఇంట్లో చీరతో ఉరేసుకొని చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 25 Feb 2026 10:32 am

ఆ విషయంలో.. తల్లిదండ్రులు కృషి చేయాలి..

ఆ విషయంలో.. తల్లిదండ్రులు కృషి చేయాలి.. భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : ఈ

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:28 am

Bhogi First Look: Sharwa Arrives As Pure Carnage

Charming Star Sharwa sheds his familiar image and steps into uncharted territory with Bhogi, revealing an intimidating persona. Teaming up with director Sampath Nandi, the film is mounted as a pan-India period action spectacle set in the volatile late 1960s. The makers unveiled the first-look poster today, and it speaks volumes even without words. Sharwa […] The post Bhogi First Look: Sharwa Arrives As Pure Carnage appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 10:22 am

Andhra Pradesh : డేంజర్ మిల్క్.. మీ ఇంటికి వస్తుందా? అయితే కనిపెట్టండిలా

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించిన ఘటన కలకలం రేపింది.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 10:18 am

ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో..

ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో.. మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : ఇంటర్ విద్యార్థి సూసైడ్

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:15 am

ముహుర్తం బాగా లేదని..

ముహుర్తం బాగా లేదని.. ఆలేరు, ఆంధ్రప్రభ: ఆలేరు మున్సిపల్ పరిధిలో గెలుపొంది ఈనెల

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:08 am

Telangana : వచ్చే నెల రెండున తెలంగాణకు రాహుల్

మార్చి నెల 2వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 10:04 am

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు..

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు.. చిట్యాల, ఆంధ్రప్రభ : క్రీడలతో యువత మానసిక

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:59 am

కూతురు నిశ్చితార్థం జరిగిన వెంటనే తండ్రి మృతి

ఆదిలాబాద్: కుమార్తె నిశ్చితార్థం రోజునే తండ్రి మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... బోథ్‌లో పందిరి శంకర్(45) అనే వ్యక్తి తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. కుమార్తెకు ఉట్నూరుకు చెందిన యువకుడి పెళ్లి నిశ్చయం చేశారు. సోమవారం యువకుడితో తన కుమార్తెకు నిశ్చితార్థం ఘనంగా జరిపాడు. బంధువులు, కుటుంబ సభ్యులతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. మంగళవారం ఉదయం నిద్రలో నుంచి లేవకపోవడంతో కుటుంబ సభ్యులు తట్టిలేపడానికి ప్రయత్నించాడు. ఉలుకుపలుకు లేకపోవడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. హార్ట్ ఎటాక్‌తోనే చనిపోయి ఉంటాడని వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మన తెలంగాణ 25 Feb 2026 9:59 am

Nani’s stuns and shakes Social Media with his steps!

Natural Star Nani is renowned for his great performances and cult classic story choices. He never showcased his dancing skills as he did in The Paradise first single, Aaya Sher, released last night, till date. He shocked and shook the Internet to a pleasant surprise to see him pull off floor moves with ease. He […] The post Nani’s stuns and shakes Social Media with his steps! appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 9:59 am

Team India : సెమీస్ చేరాలంటే టీం ఇండియాకు ఆ సెంటిమెంట్ పనిచేస్తుందా?

టీం ఇండియా సౌతాఫ్రికాపై ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:58 am

Srisailam : శ్రీశైలంలో ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నారు.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:54 am

కళ పై మక్కువ ఎక్కువైతే..

కళ పై మక్కువ ఎక్కువైతే.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:52 am

Pradeep Ranganathan turning Producer

Young and successful Tamil actor Pradeep Ranganathan has a heap of films lined up. The actor hiked his fee considering his demand and he is in a mad rush. The actor is now all set to launch his production house very soon and his first production will be a women-centric attempt. The film will feature […] The post Pradeep Ranganathan turning Producer appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 9:48 am

పరీక్ష కేంద్రాలకు అలా రాకూడదు..

పరీక్ష కేంద్రాలకు అలా రాకూడదు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:43 am

Ys Jagan : నేడు నందిపల్లెలో జగన్ పర్యటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:42 am

విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే..

విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:35 am

Weather Report : నేడు ఏపీ, తెలంగాణలో వాతావరణ శాఖ కీలక అప్ డేట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:32 am

Narendra Modi : నేడు ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రధాని మోదీ

నేడు ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:27 am

పర్యవేక్షణ కరవైన ప్రైవేట్ హాస్టళ్లు

ప్రైవేటు విద్యాసంస్థలకు అనుబంధంగా వేలాది హాస్టళ్లు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. వసతి పేరుతో విద్యార్థుల నుంచి అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణ నేటి రోజుల్లో లాభసాటి వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలకు అనుగుణంగానే గాక వర్కింగ్ మెన్, ఉమెన్ హాస్టళ్ల పేరుతో కుప్పలు తెప్పలుగా వసతి గృహాలు పుట్టుకొస్తున్నాయి. అసలు హాస్టళ్ల ఏర్పాటు, నిర్వహణపై పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వపరంగా ఓ శాఖ అంటూ లేకపోవడంతో నిర్వాహకులకు ఆడిందే ఆటగా తయారైంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యత పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ అధికారులపై ఉంటుంది. ఆయా హాస్టళ్లపై అవసరమైతే కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల అజమాయిషీ కూడా ఉంటుంది. దీంతో మెనూ, ఇతర సౌకర్యాల కల్పనపై అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటవుతున్న హాస్టళ్లలో పర్యవేక్షణ బాధ్యతలు అటు విద్యాశాఖకుగానీ, ఇంటర్మీడియట్ అధికారులకుగాని లేవు. దీంతో అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న హాస్టళ్లలో నిర్వాహకులు కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. హాస్టళ్ల పేరిట వేలకు వేలు ఫీజులు దోచుకుంటున్నా అడిగేవారు లేరు. అడ్మిషన్ల సమయంలో చెప్పిన విధంగా ఎక్కడా కూడా మెనూ, ఇతర సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎక్కడ చూసినా దాదాపుగా అనుబంధ హాస్టళ్లు ఏర్పాటు అవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాస్టల్ ఉంటేనే ఆయా విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇంటిపట్టున ఉంటే చదువుపై ఆసక్తి ఉండదనే ఉద్దేశంతో హాస్టళ్లు ఉన్న స్కూళ్లు, కాలేజీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫీజుల విషయం ఆలోచించకుండా తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నా రు. అయితే పోషకుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న హాస్టళ్ల నిర్వాహకులు వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అకాడమిక్ ఫీజులతో పోలిస్తే స్కూళ్లు, కాలేజీల్లో ఉన్న హాస్టళ్ల నిర్వహణ ద్వారానే యజమానులకు భారీ సంపాదన ఉంటుందన్న ప్రచారమూ ఉంది. ప్రైవేటు హాస్టల్ ప్రారంభించేవారు విధిగా సంబంధిత స్థానిక సంస్థల నుంచి ముందస్తు అనుమతులు పొందాలనే నిబంధన ఉంది. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న హాస్టళ్లకు మున్సిపల్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు అనుమతి పత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలు జారీ చేసే అనుమతులు ఉంటేనే హాస్టళ్లు నిర్వహించాలనే నిబంధన ఉంది. హాస్టళ్లలో శానిటేషన్, వెంటిలేషన్, తాగునీరు, టాయ్‌లెట్ల పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించే అధికారం కూడా స్థానికసంస్థల అధికారులకు ఉంటుంది. విద్యాసంస్థలు ప్రారంభించే ముందు ఆయా స్థానిక సంస్థల.. అధికారుల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (సౌండ్‌నెస్ సర్టిఫికేట్) పొందాల్సి ఉంటుంది. దాంతోపాటు అగ్నిమాపకశాఖ అనుమతులు కూడా తీసుకోవాలి. అవే నిబంధనలు హాస్టళ్లకు కూడా వర్తిస్తాయి. అయితే ఆ ఎన్‌ఒసిలు కేవలం విద్యాసంస్థల పర్మిషన్ సమయంలో తయారు చేస్తున్న ఫైళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఒసిలు జారీ చేస్తున్న సంబంధిత అధికారులు ఆ తరువాత పర్యవేక్షణ జరపకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ ఇష్టారీతిన సాగుతోంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాల్లో ఉన్న హాస్టళ్లలో తనిఖీలు చేసేవారు లేకపోవడంతో అక్కడ ఎన్నెన్ని సంఘటనలు జరుగుతాయో ఊహకందని విషయం. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న హాస్టళ్లలో కనీస రక్షణ చర్యలు పాటించడంలేదు. ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కుతున్నా పట్టించుకునేవారు లేరు. ఒక్కో గదిలో కనీసం పదిమంది వరకు విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. బాత్రూంల వద్ద తెల్లవారుజాము నుంచే విద్యార్థులు క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఇక మెనూ అమలు దేవుడెరుగు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గోడు వినే ఓపికా, సమయం తల్లిదండ్రులకు లేకపోగా, ధనార్జనే ధ్యేయంగా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్న యాజమాన్యాలకు వారి బాగోగులే అవసరం లేకుండాపోయాయి. మూడు నాలుగు అంతస్థుల్లో హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు కనీసం లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అగ్నిప్రమాదాలు సంభవించిన పక్షంలో భవనం చుట్టూ ఫైరింజన్ తిరిగేలా ఏర్పాట్లు ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లు ఉండగా, ఎక్కడా ఆ వెసులుబాటు లేదు. దీంతో అనుకోని ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చిన్నపిల్లల హాస్టళ్లల్లో కిటికీలకు గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. గతంలో వివిధ జిల్లాల్లో ఇంటర్ విద్యార్థులు హాస్టల్ నుంచి పడిపోయిన సంఘటనలో కిటికీకి గ్రిల్స్ లేకపోవడం గమనార్హం. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ప్రారంభ సమయంలో ఎన్‌ఒసిలు జారీచేస్తున్న మున్సిపల్, పంచాయతీ అధికారులే పర్యవేక్షణ జరపాలి. కేవలం సర్టిఫికేట్ జారీతోనే సరిపెట్టకుండా నిర్వహణపై కూడా వారు దృష్టి సారిస్తే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు. కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రైవేటు హాస్టళ్లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేని హాస్టళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మన తెలంగాణ 25 Feb 2026 9:21 am

Chandrababu : నేడు మార్కాపురానికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:13 am

Gold Prices Today : మార్చి నెలలో బంగారం ధరలు తగ్గుతాయా? నిపుణులేమంటున్నారు?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:04 am

ఆ హామీతో.. ఆందోళన విరమణ..

ఆ హామీతో.. ఆందోళన విరమణ.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : క్వారీ, క్రషర్ లారీల

ప్రభ న్యూస్ 25 Feb 2026 8:55 am

Tirumala : తిరుమలలో తగ్గని రద్దీ.. అసలు రీజన్ ఇదే

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 25 Feb 2026 8:44 am

అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతారు... అప్పుడు ఏమి చేయాలి?

వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ, మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! అమెరికాలో ప్రతి సంవత్సరం 3,25,000 మంది ఇలా చనిపోతారు. ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన వాటిలో ఉన్నాయి 1. గుర్తించబడని కొరోనరీ ఆర్టరీ జబ్బులు.. గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోవడం 2.  హెచ్ సిఎం హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి, 3. అసమాన సెప్టల్ హైపర్ట్రోఫీ  4. ఎంవిపి మైట్రల్ వాల్వు ప్రొలాప్సు  5. అరిథమిక్ ధోరణి 6. క్యుటిసి పొడిగించే డ్రగ్స్ వినియోగం 7. సొంతవైద్యంతో వాడే మందులు మరియు సప్లిమెంట్లు 8. తీవ్రమైన వ్యాయామం తర్వాత నిర్జలీకరణ స్థితి అనగా డీహైడ్రేషన్ బాధ్యత వహిస్తుంది చాలా మరణాలు అరిథమిక్ విఎఫ్ వెంట్రికులార్ ఫిబ్రిలేషన్ విటి వెంట్రికులార్ టాకీకార్డియా వలన వస్తాయి. కాకపోతే కొన్ని ఎసిఎస్ అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్సు అనగా గుండె రక్తనాళాలలో కొవ్వు చేరుకోవడం వల్ల వచ్చే కొరోనరీ స్పాజమ్ కావచ్చు. కొందరిలో ఆంజైనా నొప్పి వచ్చి పరీక్షలుకు సమయం ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఎక్కువ వ్యాయామం, జిమ్ ప్రోగ్రామ్‌కు వెళ్ళేందుకు నిర్ణయం తీసుకుంటే ముందు సరైన కార్డియాక్ చెకప్ పొందడం వివేకంతో కూడిన చర్య. ఈ పరీక్షలు మీకు రిస్కు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 40 సంవత్సరాలు దాటిన వారు చేసుకోవచ్చు. 1. ఇసిజి 2. (ఎకో) కార్డియో గ్రామ్ 3. టెస్ట్ ట్రెడ్ మిల్ టెస్టు  అధిక ప్రమాదం ఉన్న వారిని పరీక్షించడానికి గుర్తించడానికి సరిపోతుంది. కాని కొరోనరీ ఆర్టరీలో కొవ్వు చేరుకోవడం అదే కొలెస్టెరాల్ చేరుకోవడం వలన ప్లాక్ లు వస్తాయి. ఇవి వంశపారంపర్యంగా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రెలీమియా అంటారు. కొందరు హోమోసిస్టిన్ పెరిగిన వారిలో 20 ఏళ్ళనుంచే హార్ట్ ఎటాక్ లు వస్తాయి. ఈ కొలెస్టెరాల్ ప్లాక్ రప్చర్ అయితే దాని మీద ప్లేట్ లెట్సు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలవతుంది. ఆ ప్లాక్ పుండయితే దానిమీద సడన్ గా ప్లేట్ లెట్లు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలయితే ఓ అరగంటలో బ్లాక్ అయి హార్ట్ అటాక్ వస్తుంది. మనం ఆ క్లాటింగ్ ను అడ్డుకోవాలంటే ఆస్పిరిన్ 375 ఎంజి రెండు టాబ్లెట్లు లేదా ఎకోస్పిరిన్-75 ఎంజి 4 టాబ్లెట్ లు నమలాలి. నోటినుంచే లాలాజలం ద్వారా శరీరంలోకి వెళ్లిపోతుంది. క్లాటింగును ఆపి ప్రాసెస్ ను కొంత సేపు ఆపుతుంది. ధూమపానం, మద్యపానం, మధుమేహం, బిపి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కెలోరీల కార్బోహైడ్రేట్ ఆహారం, విపరీతమైన పని ఒత్తిడి, స్ట్రెస్సు గుండె నొప్పులకు కారణాలు. అపుడపుడు 40 సంవత్సరాలయిన తరవాత పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే మందులు, నియంత్రణ చేసుకోవాలి కొందరు హైరిస్కు ఉన్నవారు సిటి ఎంజియోగ్రామ్ 5 ఏళ్ళకొకసారి చేసుకోవాలి. రక్తనాళములలో బ్లాక్ తో పాటి కాల్షియమ్ స్కోరు తెలుస్తుంది లిపిడ్ప్రొఫైలు, బిపి, షుగరు సంవత్సరానికి ఒకసారైనా 35 ఏళ్ళ తరవాత చేసుకోవాలి. ట్రైగ్లిజరైడ్సు పెరిగితే ఫీనోఫైబ్రేట్ టాబ్లెట్, కొలెస్టురాలు పెరిగితే అటారవోస్టాటిన్ వేసుకోమంటారు. రెండు పెరిగితే కాంబినేషన్ ATOCOR+F వేసుకోమంటారు. దానితో పాటు ఎకోస్పిరిన్ 75ఎంజి వాడాలి. సింకోపాల్ ఎటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు (మూర్ఛ), సింకోప్ చరిత్ర కలిగిన అభ్యర్థులు, ఆకస్మిక మరణం అనేది కుటుంబ చరిత్ర గల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండెనొప్పి వస్తే రెండు ఆస్పిరిన్ టాబ్లెట్ లు నమిలి మింగాలి. దంచి నీళ్ళలో కలిపి తాగించి ఆసుపత్రి కి తీసుకెళ్ళాలి. లేకుంటే ఎంత పెద్దాసుపత్రి అయినా ప్రాణాలను కాపాడలేరు. అర్ధమైందిగా రెండు ఆస్పిరిన్ 375 ఎంజి మాత్రలే ప్రాణాలు కాపాడతాయి. మీ కోట్ల డబ్బు, పదవులు, అధికారాలు, పాపులారటీ, కార్పొరేట్ ఆసుపత్రులు కాదు. మనుషులను బ్రతికించాలంటే తప్పదు 2 ఆస్పిరిన్ గోలీలు, సిపిఆర్ చేయాలి. కారులో ఆసుపత్రికి తీసుకెళితే బతకడు. సిపిఆర్ చేస్తూ 108 పిలవాలి వారు డీపఫిబ్రిలేట్ చేసి సిపిఆర్ కొనసాగిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. రెండు ఆస్పిరిన్ 375 ఎంజి టాబ్లెట్ లు దగ్గర పెట్టుకోవాలి. డాక్టర్ సి ప్రభాకర రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ సిటివిఎస్  గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు ఆంధ్రప్రదేశ్

మన తెలంగాణ 25 Feb 2026 8:37 am

మార్చి 1 నుంచి అందుబాటులోకి రైల్ వన్ యాప్

భారతీయ రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 8:32 am

Telangana : తెలంగాణాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. నిబంధనలివే

తెలంగాణాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 25 Feb 2026 8:17 am

Is Krish back to Aditya 369 Sequel?

Nandamuri Balakrishna has been keen to take up the sequel of his classic film Aditya 369 and the film is reportedly titled Aditya 999. Balakrishna himself announced that he would direct the film and his son Mokshagnya will have a crucial role assigned. Soon, sensible director Krish who shares a great bond with Balayya has […] The post Is Krish back to Aditya 369 Sequel? appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 8:11 am

25 Feb2026 |తిరుమల సమాచారం..

25 Feb2026 | తిరుమల సమాచారం.. 25-02-2026

ప్రభ న్యూస్ 25 Feb 2026 8:11 am

AP Government Transfers Several Deputy Collectors in Major Administrative Reshuffle

The Andhra Pradesh government on Friday carried out a large-scale transfer of Deputy Collectors and Special Deputy Collectors across the state. The reshuffle is part of ongoing administrative changes aimed at strengthening governance and improving efficiency in key departments. According to official sources, the decision was taken after reviewing performance feedback and other administrative factors. […] The post AP Government Transfers Several Deputy Collectors in Major Administrative Reshuffle appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 8:09 am

భారత్–పాక్ ఉద్రిక్తతల ప్రభావం ఇంగ్లండ్ క్రికెట్‌పై ఉండనుందా?

భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్ పోటీలపై కూడా ప్రభావం చూపుతున్నాయనే చర్చ మొదలైంది

తెలుగు పోస్ట్ 25 Feb 2026 8:05 am

ఎఫ్1 కామేష్ బాబు సస్పెన్షన్. ఇంతకీ ఎవరితను..?

ఎఫ్1 కామేష్ బాబు సస్పెన్షన్. ఇంతకీ ఎవరితను..? గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ

ప్రభ న్యూస్ 25 Feb 2026 8:03 am

T20 World Cup : సెమీస్‌కు ఇంగ్లండ్‌… పాక్ ఇక ఇంటికే

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌కు చేరింది

తెలుగు పోస్ట్ 25 Feb 2026 7:52 am

ప్రేమ పెళ్లి కోసం తల్లి, సోదరుడిని కత్తితో పొడిచి చంపి... కాలువలో పడేశారు

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా జయపురం ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పెళ్లికి అంగీకరించడంలేదని తల్లి, సోదరుడిని బాలిక చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బొరి గుమ్మంలో అనుష్క పరిఢా(45) అనే తల్లికి కూతురు(16), కుమారుడి(14)తో కలిసి నివసిస్తోంది. బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో పలుమార్లు హెచ్చరించింది. తన ప్రియుడిని ప్రేమ వివాహం చేసుకుంటానని తల్లికి చెప్పడంతో సోదరుడు, తల్లి అంగీకరించలేదు. ప్రేమపెళ్లి విషయంలో ఇద్దరితో కూతురు పలుమార్లు గొడవకు దిగింది. దీంతో ప్రియడితో కలిసి తల్లి, సోదరుడిని కత్తితో పొడిచి చంపింది. అనంతరం మృతదేహాలను కాలువలో పడేసింది. బాలుడి మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక, ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. అనుష్క మృతదేహం కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 

మన తెలంగాణ 25 Feb 2026 7:30 am

సముద్రంలో పడిన హెలికాప్టర్

మాయాబందర్: హెలికాప్టర్ ల్యాండ్ చేస్తుండగా చివర నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సముద్రంలో పడిపోయిన సంఘటన అండమాన్ ద్వీపంలోని ఉత్తర భాగం తహసీల్ కేంద్రానికి సమీపంలో జరిగింది. పవన్ హాన్స్ హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కలిసి అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్ నుంచి బయలుదేరింది. తహసీల్ ప్రాంతంలోని మాయాబందర్ రన్‌వేకు దాదాపుగా 300 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని పైలట్ సముద్రంలో ల్యాండింగ్ చేశాడు. ఏడుగురిని రక్షించామని పౌర విమానయాన అధికారులు వెల్లడించారు.  

మన తెలంగాణ 25 Feb 2026 7:19 am

నేపాల్‌లో గణపతి?

మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి నేపాల్‌లో తలదాచుకుంటున్నట్లు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వయో భారం, అనారోగ్య కారణాలతో అక్కడ తలదాచుకుంటున్న గణపతిని భారత్‌కు తీసుకుని రావడానికి అక్కడి ప్రభుత్వంతో కేంద్ర హోం శాఖ రాయబారం న డుపుతున్నట్లు కూడా సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి, బడే దామోద ర్, నూనె నర్సింహరెడ్డిలు డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన సందర్భంగా, గణపతి నే పాల్‌తో తలదాచుకుంటున్నట్లు తమకు సమాచా రం ఉందని ఆయన వెల్లడించడంతో ఈ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ నేపథ్యంలో తమ ముందు త్వరలో మావోయిస్టు పార్టీ ముఖ్యులు లొంగిపోనున్నట్లు డిజిపి చెప్పడంతో ఆ లొంగిపో యే అగ్ర నేత గణపతేనా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇలా ఉండగా మావోయిస్టు పార్టీలో ఇంకా కొనసాగుతున్న వారిలో తెలంగాణకు చెం దిన 11మంది ఉన్నట్లు డిజిపి శివధర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. వీరిలో పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. వారిలో గద్వాల్‌కు చెందిన జోడి రత్నాబాయ్ అలియాస్ సుజాత(గణపతి భార్య) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా కొనసాతున్నారు. అలాగే హన్మకొండకు చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ ప్రస్తుతం జార్ఖండ్‌లో మావోయిస్టు పార్టీ టెక్నికల్ డిపార్ట్ మెంట్ ఇన్‌చార్జీగా ఉన్నారు. ఖాజీపేటకు చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్. సికింద్రాబాద్‌కు చెందిన వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, కమ్యూనికేషన్ విభాగానికి ఇంచార్జ్‌గా, , హైదరాబాద్‌కు చెందిన నక్క సుశీల అలియాస్ రేలా డివిజన్ కమిటీ సభ్యురాలిగా, మక్తల్‌కు చెందిన అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ పార్టీ సభ్యుడిగా, దేవ్‌జీ బృందంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా, ధర్మారంకు చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపి ఏరియా కమిటీ సభ్యురాలిగా, కాశిపోగు భవాని అలియాస్ సుగుణ దేవ్‌జీ బృందంలో ఏరియా కమిటీ సభ్యురాలిగా, వెంకటాపురంకు చెందిన కుజం ఇడమల్ ఇల్లందు, నర్సంపేట కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న నేపథ్యంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో బలహీన పడిన పార్టీ బాధ్యతలను హిడ్మాకు అప్పగించగా, ఆయన కూడా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తరువాత పార్టీ బాధ్యతలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటి వరకు దేవ్‌జీనే పార్టీ నడిపించినట్లు పోలీసు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దేవ్‌జీ లొంగిపోవడం ఆయనతో పాటు పార్టీలో కీలక నేతలుగా ఉన్న మల్ల రాజిరెడ్డి, బడే దామోదర్ కూడా లొంగిపోవడంతో ఇక మిగిలిన వారు పార్టీని నడిపిస్తారా, లేదా వారు కూడా పోలీసులకు లొంగిపోతారా అనేది తేలాల్సి ఉంది.

మన తెలంగాణ 25 Feb 2026 5:30 am

రాజ్యసభ అభ్యర్థులపై హస్తినలో కసరత్తు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఖాళీగా ఏర్పడిన రెండు రాజ్యసభ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఒక స్థానానికి రాజ్యసభ పదవీకాలం ముగిసిన పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వికే తి రిగి అవకాశం కల్పించి, మిగిలిన స్థానానికి జ స్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉ న్నట్టు పార్టీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. పార్టీ పెద్దలతో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, పీసీ సీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ఇంచార్జీ మీ నాక్షి నటరాజన్‌తో పాటు మంత్రులు భేటీ అ యిన సందర్భంగా రాజ్యసభకు ఎవరిని ఎం పిక చేయాలన్న ప్రస్తావన వచ్చిన విషయం తె లిసిందే. అయితే ఈ అంశంపై చర్చించడానికి త్వరలో రాష్ట్ర ముఖ్యులను ఢిల్లీకి రప్పించనున్నట్టు అధిష్ఠానంం చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు రేపో, మాపో సీఎం రేవంత్‌రెడ్డితో సహా ఐదుగురు సభ్యుల కమిటీ ఢిల్లీకి వెళ్లబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం. వీరిలో పిసిసి అధ్యక్షుడు మహేశ్కు మార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఏఐసిసి ఎన్నికల కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇలా ఉండగా రాజ్యసభకు పోటి చేయడానికి మార్చి 6వ తేది వరకే నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. ఆ లోగానే ఇద్దరు అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం సూచనప్రాయంగా ఒక అభిప్రాయానికి వచ్చిందని, తమ ప్రతిపాదనకు రాష్ట్ర నాయకత్వం ముందు ఉంచి వారితో మమా అనిపించడమే మిగిలిందని కూడా చెబుతున్నారు. సింఘ్వి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు? ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉండి రిటైర్ కాబోతున్న అభిషేక్ మను సింఘ్వికే తిరిగి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. అభిషేక్ సింఘ్వి ప్రముఖ న్యాయవాది పైగా ఏఐసిసికి సంబంధించిన కోర్టు వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటుండటంతో తిరిగి ఆయనకు అవకాశం కల్పించడానికి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. కాగా మిగిలిన స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపైనే సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకత్వం, ముఖ్యనేతలతో అధిష్ఠానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. స్టిస్ సుదర్శన్ రెడ్డికి అవకాశం? మూడు నెలల క్రితం ఉప రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని యుపిఏ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకత్వం పోటీ చేయించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ తమ మాటను కాదనకుండా బరిలోకి దిగిన ఆయనను రాజ్యసభకు పంపించి గౌరవించాలని అధిష్టాన పెద్దల అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలతో కూడా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలని అధిష్టానం భావిస్తోన్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే పార్టీ పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సూచనప్రాయంగా తెలియజేసినట్టు కూడా ఈ వర్గాల సమాచారం. ఏదైనా బలమైన కారణాల వల్ల జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖారారు కాని పక్షంలో ఇతర పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని ఈ వర్గాలు చెబుతున్నాయి. వారిలో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు సిడబ్లూసికి ప్రత్యేక ఆహఆ్వనితుడు, కేసీ వేణుగోపాల్‌కు సన్నిహితుడు, పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్‌నగర్ నుంచి పోటి చేసి ఓడిపోయిన డాక్టర్ వంశీచంద్ రెడ్డి పేరు కూడా పరిశీలనకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ బీసీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలనుకుంటే మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, వి. హనుమంత రావు పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మన తెలంగాణ 25 Feb 2026 5:00 am

బఫర్ జోన్‌లోనే భూసేకరణ

మన తెలంగాణ/రాజేంద్రనగర్: మూసీ రివర్ బెడ్ 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో 2012వ సంవత్సరం నుంచి ఎలాంటి అనుమతులు ఇచ్చే అవకాశం లేదని రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజనల్ అధికారి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ గండిపేట మండల రెవెన్యూ పరిధిలో ని సుమారు 85.21 ఎకరాల బఫర్ జో న్ సంబంధించిన భూ సేకరణకు గ్రామసభల ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు అభిప్రాయాల సేకరణ తీసుకోవడం జరిగిందన్నారు. మూసి రివర్ ఫ్రం ట్ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చట్ట నిబంధనల మేరకే బఫర్ జోన్లలోని భూమిని తీసుకోవడం జరుగుతుందని, అందుకోసం బాధితులను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన వెల్లడించారు. మంగళవారం రా జేంద్రనగర్ ఆర్డివో కార్యాలయంలో గండిపేట ఎంఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మీడియాకు పలు అంశాలను వి వరించారు. ఈ సందర్భంగా ఆర్డీ వో వెంకట్ రెడ్డి మూసీ సుందరీకరణలో భాగంగా రాజేంద్రనగర్, గండిపేట మండలంలో మూసీ, ఈసా పరివాక ప్రాంతాల్లో చట్ట ప్రకారమే భూసేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కోవలో అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని బాధితులకు సూచించారు. అందరికీ న్యాయం జరిగే విధంగానే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి 

మన తెలంగాణ 25 Feb 2026 4:30 am

త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0

మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ కు శ్రీకారం చుట్టబోతున్నామ ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు పెట్టించే లా, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా అందరితో చర్చించి ఈ కొత్త విధానాన్ని రూ పొందిస్తామన్నారు.జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాం బర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మం త్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గ్రోత్ అంటే యాదృచ్ఛికంగా వచ్చేది కాదని, భావితరాల భవిష్యత్తు కోసం శాస్త్రీయం గా, ప్రణాళికాబద్ధంగా రూ పొందించుకోవాల్సిన అవస రం ఉందన్నారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విజన్ 2047’ను రూపొందించిందన్నారు. నగరం నుంచి గ్రామం వరకు ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు, ప్రముఖ వైద్యులు డా.నాగేశ్వర్ రెడ్డి, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ 2026 కన్వీనర్ పంకజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 25 Feb 2026 4:00 am

జూన్‌లో వరంగల్ విమానాశ్రయానికి శంకుస్థాపన

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌లో మంగళవారం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యా రు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో సమగ్రంగా చర్చించారు.రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భం గా వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి సహా తెలంగాణలో ప్ర తిపాదిత, పనులు జరుగుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులపై విస్తృత చర్చ జరిగింది. వరంగల్ విమానాశ్రయం విషయంలో మొత్తం 953 ఎకరాల భూమి విమానాశ్రయం కోసం అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో 2500 మీటర్ల రన్‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2026 జూన్ నెలలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ ఇం కా ప్రారంభం కాలేదని, అయితే రన్‌వే నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ప్రస్తుత భూమిని వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపల్లిలో విమానాశ్రయం కోసం 980 ఎకరాల భూమిని గుర్తించామని, దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ జరుగుతున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వెల్లడించారు. 

మన తెలంగాణ 25 Feb 2026 3:30 am

కేరళ కాదు..కేరళం

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చుతూ నిర్ణయం తీ సుంది. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. సేవాతీర్థ్‌లో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు. ముడి జనపనారకు మద్దతు ధర మరో రూ.275 పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇ ప్పటి వరకు క్వింటాల్ ముడి జనపనారకు మ ద్దతు ధర రూ.5,925 పలుకుతోందని, తాజా పెంపుతో అది రూ.6200 కానుందన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం రైతులకు ఇది మేలు చేస్తుందన్నారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కూడా మంతివర్గం నిర్ణయించిందన్నారు. దీనికి రూ.1677 కోట్ల అంచనాతో ఎయిర్‌పోర్ట్‌లో సివిల్ ఎన్‌క్లేవ్ నిర్మాణంతో పాటు విస్తరించనున్నట్లు తెలిపారు. కనీసం 15 విమానాలు పార్కింగ్ చేశేలా నిర్మాణం ఉండబోతుందనారు. తద్వారా కశ్మీర్‌లోయతో పాటు మౌలిక వసతుల కల్పనకు ఇది మరింత దోహదపడుతుందన్నారు. అదే విధంగా సేవాతీర్థ్‌తో తొలి సారి మంత్రివర్గం భేటీ జరిగిందని, ఈ భవంతిలో తీసుకునే ప్రతి నిర్ణయం 140కోట్ల మంది భారతీయులకు సేవా ధృక్పథంతోనే తీసుకోవడం జరుగుతంద ని మంత్రివర్గం తీర్మానం చేసిందన్నారు. రా జ్యా ంగ స్ఫూర్తి, విలువలను మరింత పెంచే ది శగా నిర్ణయాలుంటాయని ఈ సందర్భంగా ప్ర ధాని మోడీ వ్యాఖ్యానించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. పని సంస్కృతికి నిదర్శనంగా సేవాతీర్థ్‌ను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆహ్మదాబాద్ మెట్రో ఫేజ్2కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మూడు రైల్వే ప్రాజెక్టులకు కూ డా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్ మీదుగా మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకే.. రాష్ట్రం పేరును సవరించాలని కోరుతూ తీసుకు వచ్చిన తీర్మానానికి ఇటీవల కేరళ శాసనసభ ఆమోదం తెలపడంతో పాటు కేంద్రాకి సిఫారసు చేసింది. తాజాగా కేంద్ర క్యాబినెట్ దీన్ని పరిగణన లోకి తీసుకుంది. కేరళ పేరును కేరళంగా అధికారికంగా మార్చాలని కేరళ అసెంబ్లీ మొదటిసారి 2023లో ఏకగ్రీవంగా తీర్మానించింది.తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘ కేరళం’ అని పిలిచే వారని అనేక సార్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేశారు. కానీ ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన తెలిపారు. పేరు మార్పు విషయమై బీజేపీ కూడా మద్దతు పలికింది. సిపిఐ కూడా స్వాగతించింది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రం అసలు పేరు కేరళం అని, కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారని ముఖ్యమంత్రి వివరించారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అంతకు ముందు కూడా కేరళ అసెంబ్లీ ఈ తీర్మానం ప్రతిపాదించినా హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ కొన్నిసాంకేతిక మార్పులను సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గుర్తింపు పొందిన అన్ని అధికారిక భాషల్లో కేరళ పేరును కేరళంగా మార్చుతారు.  

మన తెలంగాణ 25 Feb 2026 3:20 am

దానం, కడియం అనర్హతపై 27, 28 తేదీల్లో విచారణ

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్‌పై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈ నెల 27న విచారణ చేపట్టనున్నారు. 28న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటీషన్‌పై విచారణ జరుపనున్నారు. దానం నాగేందర్‌పై పిటీషన్ దాఖలు చేసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని నాలుగు రోజుల కిందట దానం నాగేందర్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చే సిన సంగతి తెలిసిందే. 27న జరుగబోయే విచారణలో దానం నాగేందర్ తాను పార్టీ మారలేదు అ నడానికి తగు సాక్షాలను సమర్పించాల్సి ఉంది.

మన తెలంగాణ 25 Feb 2026 3:00 am

అమెరికాను కమ్మేసిన మంచు తుపాను

న్యూయార్క్ : అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని సోమవారం మంచు తుఫాను ముంచెత్తింది. న్యూయార్క్ సహా పలు నగరాల్లో వీధులు దట్టమైన మంచుతో ప్రమాదకరంగా మారాయి. లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్థ స్థంభించింది. దేశీయ విమానాలతో సహా దాదాపు10 వేల విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాలు ఖాళీగా మారాయి. స్కూళ్లు మూతపడ్డాయి. భారీ హిమపాతం, బలమైన చలిగాలులతో జన జీవనం స్థంభించింది. రద్దీగా ఉండే టెర్మినల్స్ నిర్మానుష్యంగా మారాయి. ఈ ప్రాంతం అంతటా విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ముందుగానే విమానయాన సంస్థలు ముందస్తుగా విమాన సేవలను రద్దు చేశాయి. శనివారం, మంగళవారం మధ్య 10 వేల కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. సోమవారం 5 వేలకంటే ఎక్కువ వి మాన సర్వీసులు రద్దు కాగా, మంగళవారం 1, 300 కంటే ఎక్కువ సర్వీసులు రద్దయ్యాయి.న్యూయార్క్ లోని జెఎఫ్ కె , లాగ్వార్డియా విమానాశ్రయాలు, బోస్టన్ లోగన్, న్యూవార్క్ లిబర్టీ వంటి ప్రధాన కేంద్రాలపై తీవ్ర ప్రభావం పడింది. రైళ్లు, బస్సు నెట్ వర్క్ కు బంద్ అయ్యాయి. చాలా స్టేట్ లలో సేవలు నిలిచి పోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. చాలా ప్రాంతాలలో అధికారులు ప్రయాణ ఆంక్షలు విధించారు న్యూయార్క్ నగరం లో సోమవారం మధ్యాహ్నం వరకూ ప్రయాణాలను నిషేధించగా, న్యూయార్క్ స్టేట్, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్ లొన్ని కొన్ని ప్రాంతాలలో ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి. న్యూయార్క్ నగరం లోని రోడ్లపై దట్టంగా మంచు పోగుపడింది. దానిని తొలగించేందుకు నిర్విరామంగా సిబ్బంది కష్టపడుతున్నారని మేయర్ అన్నారు. 15 అడుగులకు పేరుకున్న మంచు న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ లో సోమవారం ఉదయం 15 అంగుళాల కంటే ఎక్కువ మంచు నమోదైంది. లాంగ్ ఐలాండ్, న్యూజెర్సీ లో అంతటా అధికమంచు నమోదైంది. బోస్టన్, ఫిలడెల్ఫియాలోనూ అదే పరిస్థితి. గంటకు 35 మైళ్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయ. డెలావేర్, మసాచుసెట్స్ లో 40- 60ఎంపిహెచ్ వేగంతో గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా 5 లక్షల70 వేల ఇళ్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మాసాచ్యుసెట్స్ , న్యూజెర్సీలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 

మన తెలంగాణ 25 Feb 2026 12:18 am

నిద్రస్తున్న నరికి చంపిన భర్త

కుటుంబ కలహాలతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన మంచాల పోలీస స్టేషన్ పరిధిలోని నోముల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సం బంధించిన వివరాలు మంచాల సిఐ మధు, స్థా నికులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. మంచాల మండల పరిధిలోని నోముల గ్రా మానికి చెందిన మాదరమోని బా బు (55), అమృత (50) దంపతులు లేబర్ పని చేస్తు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడికి వివాహం కాగా చిన్న కుమారుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. గత కొంతకాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు నచ్చజెప్పినప్పటికి అలాగే గొడవ పడుతుండేవాడు. శివరాత్రి పండుగ రోజు మద్యం తాగి పెద్ద గొడవ చేసి అప్పటి నుంచి ఇంటిపై ఉన్న మరో గదిలో బాబు ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యాహ్నం ఇంటిపై నుంచి కిందికి వచ్చిన బాబు నిద్రిస్తున్న అమృతను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేసి, గొడ్డలి అక్కడే వదిలేసి పరారయ్యాడు. అదే సమయంలో ఇంట్లో గదిలో ఉన్న కోడలకు శబ్ధం రావడంతో తన భర్త నవీన్ కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలానికి సిఐ మధు ఆధ్వర్యంలో వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 24 Feb 2026 11:27 pm

తమిళనాడులో చిన్నమ్మ కొత్త పార్టీ

తమిళనాడులో ఎన్నికల ముంగిట మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దివంగత మాజీ సిఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలు అందరూ చిన్నమ్మగా పిలుచుకునే శశికళ నూతన పార్టీని ఏర్పాటు చేశారు. మంగళవారంనాడు రామనాథపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగుల్లో పార్టీ జెండాకు రూపకల్పన చేశారు. దివంగత నేతలు అన్నాదురై, ఎంజిఆర్, జయలలిత చిత్రాలు ఉన్నాయి. అయితే పార్టీ పేరును త్వరలో వెల్లడిస్తానని శశికల ప్రకటించారు. తమ పార్టీ పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేస్తుందన్నారు. అన్నాదురై, ఎంజిఆర్, జయలలిత చూపిన మార్గాన్ని అనుసరిస్తామని, వారి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత మరణం గురించి మాట్లాడుతూ శశికళ ఉద్వేగానికి గురయ్యారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. అంతకుముందు ఉదయం జయలలిత జయంతిని పురస్కరించుకుని సమాధి వద్ద నివాళి అర్పించిన శశికళ త్వరలో ప్రజలు శుభవార్త వింటారని ప్రకటించారు. జయలలిత నెచ్చెలిగా పేరున్న శశికళ ఆమె మరణాంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. ఆ తర్వాత అన్నాడిఎంకే నుంచి బహిష్కృతురాలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత చెన్నై కేంద్రంగా ఉంటున్న శశికళ ఇటీవల రాజకీయ పార్టీ స్థాపనకు వరుస భేటీలు జరుపుతున్నారు. సన్నిహితులతో సమావేశమవుతూ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. అనుచురులు కూడా చిన్నమ్మ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.

మన తెలంగాణ 24 Feb 2026 11:16 pm

సెమీస్‌లో ఇంగ్లండ్

 టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన సూపర్8 సమరంలో ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ గ్రూప్2 నుంచి సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై కూడా ఇంగ్లీష్ టీమ్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్ (63), బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ (23) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హ్యారీ చిరస్మరణీయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ 51 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. విల్ జాక్స్ (28), కరన్ (16) తమవంతు పాత్ర పోషించారు.

మన తెలంగాణ 24 Feb 2026 11:09 pm

వదిన మెడ నరికిన మరిది

భూతగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఇద్దరు మేనల్లుళ్లతో కలిసి ప్లాన్ చేసిన మరిది వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా ఉన్న వదినపై కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మెడపై నరికాడు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితులు, కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. ఈ దారుణ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... పాలడుగు గ్రామానికి చెందిన బొంత వెంకన్న, అశోక్ అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములకు తండ్రి రామయ్య చెరో 8 ఎకరాల చొప్పున 16 ఎకరాల భూమి పంచి ఇచ్చాడు. తమ్ముడు అశోక్ జల్సాలకు అలవాటు పడి తన భాగానికి వచ్చిన భూమిలో సుమారు 5 ఎకరాల వరకు అమ్ముకున్నాడు. దీంతో అన్న వెంకన్న భూమిలో నుంచి కొంత భూమి తనకు ఇవ్వాలంటూ తమ్ముడు అశోక్ గత కొన్నేండ్లుగా గొడవ పడుతున్నాడు. భూతగాదాలతో అనారోగ్యం పాలైన అన్న వెంకన్న సుమారు ఆరు నెలల క్రితం చనిపోయాడు. దీంతో అన్న భూమిపై కన్నేసిన తమ్ముడు వదిన లక్ష్మీని రకరకాలుగా వేదిస్తూ దాడులు, గొడవలకు పాల్పడుతున్నాడు. ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులన్నీ పగులకొట్టి భూమి పట్టాకాగితాలు, బంగారం ఎత్తుకపోయాడని బాధితురాలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతని నుంచి ప్రాణ భయం ఉండటంతో స్వంత ఇంటిని వదిలి కూతురు, ఇద్దరు కొడుకులతో కలిసి అతని ఇంటికి దూరంగా ఓ పెంకుటింట్లో అద్దెకు ఉంటోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ బావి వద్ద పొలం నాటు వేయగా మంగళవారం కూలీలతో యూరియా చల్లించింది. కూలీలు వెళ్లిపోగా పని ఉండటంతో వదిన లక్ష్మీ బావి వద్దే ఉంది. మేనళ్లుళ్లతో కలిసి రెక్కీ నిర్వహిస్తూ మాటువేసిన మరిది అశోక్ వ్యవసాయ బావి వద్ద వదిన లక్ష్మీ ఒంటరిగా ఉన్నట్టు తెలుసుకుని బావి వద్దకు వెళ్లారు. మేనళ్లుల్లు లక్ష్మీని పట్టుకోగా మరిది అశోక్ కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో లక్ష్మీ మెడపై నరికాడు. చేతులతో అడ్డుకోబోగా రెండు చేతివేళ్లు తెగాయి. కత్తి వేటుతో లక్ష్మీ కేకలు వేయడంతో ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. రక్తస్రావం అవుతుండగా మెడకు టవల్ చుట్టుకుని లక్ష్మీ ఊళ్లోకి వచ్చింది. లక్ష్మీని తీవ్ర రక్తస్రావంలో చూసిన గ్రామస్తులు వెంటనే 108కు, పోలీసులకు ఫోన్ చేశారు. 108లో లక్ష్మీని చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. లక్ష్మీ కోమాలోకి వెళ్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మరిది అశోక్‌తో పాటు అతని మేనళ్లుల్లు పరారీలో ఉండగా, అశోక్ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. మోత్కూరు సీఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడికి ఉపయోగించిన కొబ్బరిబోండాలు కొట్టే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. భూతగాదా కారణంగా పెద్ద మనుషుల వద్ద పంచాది నడుస్తోందని, బాధితురాలు లక్ష్మీ పలుమార్లు మోత్కూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. హత్యాయత్నంపై బాధితురాలు లక్ష్మీ అక్క చంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీకి కూతురు రామేశ్వరి, కుమారులు రాంచరణ్, చంద్రశేఖర్ ఉన్నారు.

మన తెలంగాణ 24 Feb 2026 10:17 pm

తొలి వన్డే ఆస్ట్రేలియాదే

ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కంగారూ టీమ్ 38.2 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అలీసా హీలీ, లిచ్‌ఫీల్డ్‌లు ఆస్ట్రేలియాకు శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హీలీ 4 ఫోర్లతో 50 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్ ఆరు బౌండరీలతో 32 పరుగులు సాధించింది. వికెట్ కీపర్ బెథ్ మూనీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మూడీ 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు సాధించింది. అనబెల్ సదర్లాండ్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 48 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (53), రిచా ఘోష్ (23), కాశ్వి గౌతమ్ (43) మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో గార్డ్‌నర్ మూడు, మెగాన్ షుట్ రెండు వికెట్లు తీశారు.

మన తెలంగాణ 24 Feb 2026 10:08 pm

AP DY.CM fIRE : నెయ్యిలో నెయ్యే లేదు Andhra prabha news

AP DY.CM fIRE : నెయ్యిలో నెయ్యే లేదు Andhra prabha news

ప్రభ న్యూస్ 24 Feb 2026 10:01 pm

మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

 తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువు తున్న భువన అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఆమె, సోమవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం తోటి విద్యార్థి నులు ఈ విషయాన్ని గమనించి హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువన మృతి చెందిన విషయాన్ని యాజమాన్యం తమకు చాలా ఆలస్యంగా తెలిపిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము హాస్టల్‌కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే యాజ మాన్యం పోలీసులకు సమాచారం అందించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే భువన ఆత్మహత్య చేసుకునేంత బలహీనరాలు కాదని, ఆమె మృతి వెనుక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం మంగళం పంచాయతీకి చెందిన రైతు సురేందర్ రెడ్డి, జానకి దంపతుల కుమార్తె అయిన భువన, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలన్న ఆశతో డేటా సైన్స్ కోర్సు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో చదువు పూర్తి కావాల్సి ఉండగా, ఇలా విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. చదువుల ఒత్తిడి లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు హాస్టల్ సిబ్బందిని, స్నేహితులను విచారిస్తున్నారు. భువన తండ్రి స్పందన భువన తండ్రి స్పందించారు. తన కుమార్తె ఎందుకు ఇలా చేసిందో తెలియదని రూ. 17 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం వచ్చిందని, తమ కష్టాలు తీరుతాయని అనే ఆనందంలో ఉండగా ఇలాంటి విషాద ఘటన జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. నాకు ఇద్దరు కుమార్తెలున్నారని మొదటి కుమార్తె భువన కాగా రెండో అమ్మాయి హర్షిత అదే కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంబీయూలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు.

మన తెలంగాణ 24 Feb 2026 9:57 pm

రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ పై ఉన్న ధ్యాస..పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీ పై లేదు: హరీష్ రావు

రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ పై ఉన్న ధ్యాస పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీ పై లేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇతర బీఆర్‌ఎస్ నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మా దెబ్బకే సీఎంకు సోయి వచ్చింది మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లలో కేవలం 6 మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తిచూపామన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచామని, ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఇది బీఆర్‌ఎస్ విజయమే కాదు, రైతుల విజయం అన్నారు. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప.. పనులు కావడం లేదని, మంత్రులు దేవాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం అది వారికి చివరి ప్రాధాన్యతగా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారన్నారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదన్నారు. భూసేకరణకు నిధులు విడుదల చేయడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉన్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపోయేలా చేస్తున్నారని, రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? బీఆర్‌ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి, 312 కిలోమీటర్ల మేర గోదావరిని నిండుకుండలా సజీవంగా ఉంచిందన్నారు. 9 ఏళ్లలో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా?.. దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతున్నావో, నల్లమల సాగర్ కు ఎలా సహకరిస్తున్నావో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముందు ఆ 10 శాతం పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లివ్వు. బీఆర్‌ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోంది. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సింది. కేసీఆర్ గారు ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ.. కేసీఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవి. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యం. ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది. కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలి. ఇంత వరకు రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? పేపర్లలో చూస్తే ఓపీ సేవలు ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా? వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలి. వరంగల్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు సోయి ఉందా? ఎంజీఎం పరిస్థితి చూస్తే వార్తలు రాసి రాసి పత్రికా విలేకరులే విసిగిపోయారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వరంగల్ వచ్చినా ఒక్కసారైనా ఎంజీఎంను చూశారా? రెండున్నరేళ్లలో ఆరోగ్య మంత్రి అటువైపు వెళ్లారా? ఎంజీఎం ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులకు నివాసంగా మారింది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మంచాలు లేవు. టెస్టులకు మెటీరియల్ లేదు. ఎక్స్‌రే మిషన్లు పనిచేయవు. ఆయుష్ ఆసుపత్రిలో మందులు లేవు. ఎంజీఎంను తక్షణమే సమీక్షించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి.పాత కబుర్లనే తీపి కబుర్లుగా సీఎం చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పీఆర్సీ అమలు చేసి, బకాయిలు చెల్లించండి రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చారా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సమానంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుందని, కేసీఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 24 Feb 2026 9:02 pm

రెండు నెలల పసికందు ప్రాణాలు తీసిన కన్నతల్లి

రెండు నెలల పసికందు తో నవ్వులతో ఉండాల్సిన ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. తల్లి ప్రేమతో ముద్దాడాల్సిన చేతులే కసాయిగా మారి కన్నబిడ్డ ప్రాణం తీశాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుందిగల్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని స్పీడ్ సానరెల్లి బహుళ అంతస్తుల భవన నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న మమత (మధ్యప్రదేశ్ రాష్ట్రం, సాగర్ జిల్లా, నవగావ్ గ్రామం నివాసి) తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే పనిచేస్తూ అక్కడే నివసిస్తోంది. మంగళవారం ఉదయం మమత భర్త పనిమీద బయటకు వెళ్లగా, మధ్యాహ్నం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్ద అనుమానాస్పద వాతావరణం కనిపించడంతో లోపలికి వెళ్లి చూడగా భార్య మంటల దగ్గర ఉండడం గమనించాడు. అనుమానం వచ్చి ఆమెను పక్కకు నెట్టి చూడగా, రెండు నెలల చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు తెలిసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడనే కారణంతో, బిడ్డను తొలగించాలని భావించిన మమత ముందుగా బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి, అనంతరం ఇంట్లోనే ఉన్న కట్టెల పొయ్యిలో వేసి కాల్చినట్లు పోలీసుల దర్యాప్తు లో తేలింది .ఘటనపై సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఏసీపీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి ఆధారాలతో దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.దుండిగల్ సీఐ సతీష్, ఎస్‌ఐ రంజిత్ తదితరులు విచారణలో చేపడుతున్నారు. ఈ దారుణ ఘటన జరిగిన భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం విషయం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అపార్ట్మెంట్ల విక్రయాలపై ప్రభావం పడుతుందనే కారణంతో మీడియాను అనుమతించలేదని పలువురు మీడియా ప్రతినిధులు వాపోయారు.పసికందుపై జరిగిన ఈ అమానుష ఘటన సమాజాన్ని కలచివేస్తోంది. కన్నతల్లి చేతుల్లోనే శిశువు ప్రాణం కోల్పోవడం హృదయ విదారకం. కుటుంబ కలహాలా...? మానసిక సమస్యలా ? లేక మరేదైనా కారణమా ? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 24 Feb 2026 8:55 pm

Nani’s Aaya Sher From The Paradise: Monster Mad Anthem

Natural Star Nani isn’t just evolving. He’s erupting. With every new project, he leaves behind a version of himself and steps into a fiercer, bolder avatar. The Paradise, his second collaboration with director Srikanth Odela, marks his most untamed transformation yet. Aaya Sher, the first single released on Nani’s birthday, tears open the gates to […] The post Nani’s Aaya Sher From The Paradise: Monster Mad Anthem appeared first on Telugu360 .

తెలుగు 360 24 Feb 2026 8:31 pm

కొణిదెలలో విషాదం..

కొణిదెలలో విషాదం.. మట్టి మీద కూలి వృద్ధురాలు మృతి నందికొట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Feb 2026 8:23 pm

Ranga Reddy |భ‌ర్తే కాల‌య‌ముడు…

Ranga Reddy | భ‌ర్తే కాల‌య‌ముడు… Ranga Reddy | మంచాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 24 Feb 2026 8:17 pm

குருமூர்த்தியுடன் மாணிக்கம் தாகூர் இருக்கும் புகைப்படம் வைரல் - உண்மை என்ன?

குருமூர்த்தியுடன் மாணிக்கம் தாகூர் இருப்பதாக புகைப்படம் தவறான தகவலுடன் வைரலாகி வருகிறது.

తెలుగు పోస్ట్ 24 Feb 2026 8:10 pm

ఇసుక ట్రాక్టర్ సీజ్

ఇసుక ట్రాక్టర్ సీజ్ కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం

ప్రభ న్యూస్ 24 Feb 2026 8:01 pm

వ్యాపారంలో నష్టం..ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

వ్యాపారంలో నష్టం వచ్చిందని తీవ్ర మనస్థాపానికి గురై ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఈ విషాద సంఘటన మంగళవారం అంబర్ పేటలో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట బాపు నగర్ ప్రాంతంలో నివసించే కదేకర్ రామ్ రాజ్(54) పార్ట్నర్ షిప్ లో హోటల్ వ్యాపారం చేసినాడు. అందులో తీవ్ర నష్టం రావడంతో అప్పుల బాధ తట్టుకోలేక రామ్ రాజ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా నిర్ణయించుకుని ఈ ఆత్మహత్యలకు ఎవరికి సంబంధం లేదని లేఖ రాసి పెట్టారు. మంగళవారం ఉదయం ముందుగా భార్య కే. మాధవిని(50) దిండుతో ముఖంపై ఒత్తి చంపాడు. అనంతరం కొడుకు కె.శశాంక్ రాజు(27) తన మిత్రుడు రవికి మేము చనిపోతున్నామని ఫోన్‌లో మెసేజ్ పెట్టి తండ్రి రామ రాజ్ తో కలిసి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రవి ఉదయం 8 గంటలకు అంబర్ పేట లో నివాసానికి చేరుకోగా తలుపు ఓపెన్ ఉండటంతో తెరిచి చూడగా తండ్రి కొడుకులు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతున్నట్లు కనిపించారు. వెంటనే విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యురాలు కె. అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్ళగా ముగ్గురు మృతి చెందిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాలు బంధువులకు అప్పగించారు. సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మన తెలంగాణ 24 Feb 2026 7:59 pm

Minister |వివాహ వేడుకలు…

Minister | వివాహ వేడుకలు… Minister | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో

ప్రభ న్యూస్ 24 Feb 2026 7:48 pm

క్యాతన్ పల్లి ఘటన పై గవర్నర్ స్పందించాలి: కెటిఆర్

 రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, ప్రజా స్వామ్యాన్ని కాపాడి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించి అధికారుల పై, క్యాతన్ పల్లి ఘటనపైన గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారక రామారావు అన్నారు. ఆదిలాబాద్ జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించారు. ఆయన వెంట బి ఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నప్పటికీ వాళ్లను అక్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గమన్నారు. కేతనపల్లిలో ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ శిరసావహించాల్సింది పోయి ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదన్నారు. కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారని ఆరోపించారు. కౌన్సిల్‌కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? రాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజ సమన్నారు.బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలుగా ఉండి కూడా లోపలికి పంపించకుండా కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు,మా కార్యకర్తల పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు స్టేషన్‌కు వచ్చి మరీ కొడుతున్నారని ఆరోపించారు. ఈ రకమైన దాడులు మంచివి కావన్నారు. పోలీస్ కవాతు ప్రజలకు రక్షణ కల్పించాలి. ప్రజల్లో విశ్వాసం నింపాలి. కానీ జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమంగల్, క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్ నాయకులను, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసులు కవాతు చేశారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టినా ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, క్యాతన్‌పల్లి ఇన్సిడెంట్ పైన గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎవరూ మిమ్మల్ని కాపాడలేరని, మీరు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందస్తుగా హెచ్చరించారు.

మన తెలంగాణ 24 Feb 2026 7:45 pm

నవీన్ రాజ్ దంపతులకు పుష్పగుచ్చం అందజేత‌..

నవీన్ రాజ్ దంపతులకు పుష్పగుచ్చం అందజేత‌.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని

ప్రభ న్యూస్ 24 Feb 2026 7:36 pm

20 years |గొడ‌వ‌లే కార‌ణ‌మా…

20 years | గొడ‌వ‌లే కార‌ణ‌మా… 20 years | హసన్ పర్తి,

ప్రభ న్యూస్ 24 Feb 2026 7:29 pm

రాష్ట్రంలోనే రెండో బహుమతి

రాష్ట్రంలోనే రెండో బహుమతి విద్యార్థిని అభినందించిన చైర్మన్ జన్నారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర

ప్రభ న్యూస్ 24 Feb 2026 7:19 pm

పొలం వద్ద విద్యుత్ షాక్ గురై చిన్నారి మృతి

 విద్యుత్ షాక్ కు గురై ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని మిర్జగూడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మిర్జగూడ గ్రామానికి చెందిన ఇబ్రహీంపల్లి యాదయ్య - అనిత దంపతులకు కూతురు వర్షిణి (7), కొడుకు రుత్విక్ ఇద్దరు సంతానం. కాగా మంగళవారం చిన్నారులిద్దరూ తమ పెద్దమ్మ మౌనికతో కలిసి పొలానికి వెళ్లారు. చిన్నారుల పెదనాన్న మల్లేష్ తన పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెను పొలం చుట్టు వేశాడు. చిన్నారులిద్దరు తమ పెద్దమ్మ చేతులను విడిపించుకుని మొక్కజొన్న పంట వేసిన పొలంలోకి పరుగెత్తుకుని వెళ్లారు. అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పెదనాన్న మల్లేష్ వేసిన విద్యుత్ కంచె చిన్నారులిద్దరికి తగిలింది. చిన్నారులిద్దరూ విద్యుత్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన పెద్దమ్మ మౌనిక చుట్టు పక్కల రైతుల సహాయంతో చిన్నారులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ గురై వర్షిణి(7) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. షాక్ గురై తీవ్ర గాయాలైన రుత్విక్ ను మెరుగైన వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారి వర్షిణి చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని నవ చైతన్య హై స్కూల్ లో చదువుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి వరకు తమ కళ్లముందు ఆడుకున్న చిన్నారులిద్దరిలో ఒకరు విద్యుత్ షాక్ గురై వర్షిణి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీరు కార్చారు. గాయాల పాలైన చిన్నారి రుత్విక్ ఆరోగ్యం కుదుట పడి తొందరగా ఇంటికి చేరుకోవాలని గ్రామస్తులు కోరుకున్నారు.

మన తెలంగాణ 24 Feb 2026 7:16 pm

దేశ వ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పివి వ్యాక్సిన్

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల వయసు పైబడిన బాలికలకు ఉచితంగా అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు గార్డాసిల్ ఇంజెక్షన్‌ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించే ఈ వ్యాక్సిన్ ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైప్ 16.18,తోపాటు టైప్ 6,11 రకాల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఒక డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్‌ల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పిస్తుందని దేశీయంగా అంతర్జాతీయంగా జరిపిన శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 15 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గార్డాసిల్ 4 టీకాను రెండు డోసుల్లో తీసుకోవలసి ఉంటుంది. ఒక్కో డోసు ధర రూ.3927, అదే 15 ఏళ్ల వయసు పై బడిన బాలికలు మాత్రం మూడు డోసుల్లో తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటు లోకి రాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్టు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా, వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులో అందిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా, వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నారు. 

మన తెలంగాణ 24 Feb 2026 7:07 pm

ఝార్ఖండ్ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం..ఏడు మృతదేహాలు కుటుంబీకులకు అప్పగింత

ఝార్ఖండ్ లోని చత్రా జిల్లా సిమారియా అడవిలో సోమవారం కూలిపోయిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి సంబంధించి ఏడుగురు మృతుల కుటుంబాలు తీరనిశోకంలో మునిగిపోయాయి. ఏడు మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం ఆయా కుటుంబాలకు అప్పగించారు. మృతుల్లో రోగితోపాఉ అతని కుటుంబ సభ్యులు,పైలట్, కోపైలట్, ఒక వైద్యుడు,పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఛత్రా లోని సాదర్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించామని ఆరోగ్యవిభాగం అధికారి వెల్లడించారు. రాంచీ విమానాశ్రయం నుంచి సోమవారం రాత్రి 7.11 గంటలకు బయలుదేరిన ఈ విమానం రాత్రి 7.30 గంటలకు గల్లంతయ్యింది. బయలుదేరినదాదాపు 20 నిమిషాల తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోవడానికి ప్రతికూల వాతావరణం కారణం కావచ్చని రాంచీ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. కానీ సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే కానీ అసలు కారణం తెలీదన్నారు. మృతుల్లో కెప్టెన్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్,డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, ధురు కుమార్‌లను గుర్తించారు. ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్‌కుమార్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఈ ప్రమాదంలో మృతులైన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. 

మన తెలంగాణ 24 Feb 2026 7:05 pm

cops under cage : ఐపీఎస్ ప‌క్షులు Andhara ptabha Analysis

cops under cage : ఐపీఎస్ ప‌క్షులు Andhara ptabha Analysis (

ప్రభ న్యూస్ 24 Feb 2026 7:02 pm

వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత

వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత నిజామాబాద్, ఆంధ్రప్రభ : రైతులకు

ప్రభ న్యూస్ 24 Feb 2026 6:51 pm

అభివృద్ధికి సహకరించాలి

అభివృద్ధికి సహకరించాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల

ప్రభ న్యూస్ 24 Feb 2026 6:49 pm

ఎసిబి వలలో విద్యుత్ శాఖ ఎఈ

 లంచం తీసుకుంటుండగా ఎస్‌పిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్‌ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మామిడిసెట్టి శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్‌గా టిజిఎస్‌పిడిసిఎల్, మాసబ్‌ట్యాంక్ సెక్షన్‌లో ఎఈ ఆపరేషన్‌గా పనిచేస్తున్నాడు. ఓ విద్యుత్ వినియోగదారుడి మీటర్‌ను సీజ్ చేయకుండా ఉండాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ఎఈని సంప్రదించడంతో రూ.16,000లు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు బాధితుడు ఎఈకి రూ.16,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఎఈని అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో ఎఈ శ్రీనివాస రావును హాజరుపర్చడంతో ఎసిబి స్పెషల్ జడ్జి రిమాండ్ విధించారు. దీంతో ఎఈని ఎసిబి అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మన తెలంగాణ 24 Feb 2026 6:40 pm