SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
...

Telangana : తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్..రేషన్ కార్డు కావాలంటే?

తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 24 Feb 2026 10:23 am

Telangana : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి

తెలుగు పోస్ట్ 24 Feb 2026 10:19 am

సత్తా చాటిన గురుకుల విద్యార్థులు..

సత్తా చాటిన గురుకుల విద్యార్థులు.. మంథని టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక

ప్రభ న్యూస్ 24 Feb 2026 10:18 am

Delhi : నేడు ఎన్నికల సంఘం కీలక భేటీ

నేడు ఢిల్లీలో ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు

తెలుగు పోస్ట్ 24 Feb 2026 10:13 am

Inside the Wedding of Vijay Deverakonda and Rashmika Mandanna

Tollywood actors Vijay Deverakonda and Rashmika Mandanna are all set to tie the knot on February 26th in a grand destination wedding in Udaipur. The duo is majorly concerned about the security and a three-tier security system is hired so that the guests would not be uncomfortable. They want nothing to be leaked out from […] The post Inside the Wedding of Vijay Deverakonda and Rashmika Mandanna appeared first on Telugu360 .

తెలుగు 360 24 Feb 2026 10:12 am

శభాష్.. సర్పంచ్..

శభాష్.. సర్పంచ్.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలో పెద్దవెంకటాపురం గ్రామపంచాయతీలో ఇటీవల

ప్రభ న్యూస్ 24 Feb 2026 10:10 am

T20 World Cup : టీమిండియా ను గంభీర్ ప్రశాంతంగా ఉంచేటట్లు లేడుగా.. ప్రయోగాలు చేసే వేదికగా మార్చాడా?

అహ్మదాబాద్ లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ లో టీమిండియా చిత్తుగా ఓటమి పాలయింది.

తెలుగు పోస్ట్ 24 Feb 2026 10:07 am

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 24 Feb 2026 10:02 am

కర్నూలులో అర్ధరాత్రి రక్తపాతం..

కర్నూలులో అర్ధరాత్రి రక్తపాతం.. పాత బస్టాండ్ బారు వద్ద ఘర్షణ..కండేరు వద్ద కత్తిపోటు..

ప్రభ న్యూస్ 24 Feb 2026 9:59 am

నేడు ఛలో విజయవాడ

నేడు ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికుల పిలుపు ఇచ్చారు

తెలుగు పోస్ట్ 24 Feb 2026 9:55 am

మార్వాడి గోబ్యాక్ కాదు.. బైకాట్ చేయాలి..

మార్వాడి గోబ్యాక్ కాదు.. బైకాట్ చేయాలి.. -స్టేషన్ ఘన్‌పూర్‌లో మార్వాడీల అరాచకం అతి

ప్రభ న్యూస్ 24 Feb 2026 9:52 am

Ys Jagan : మూడు రోజుల పాటు కడపలో జగన్‌ పర్యటన

నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో జగన్‌ పర్యటన సాగుతుంది

తెలుగు పోస్ట్ 24 Feb 2026 9:48 am

1970 నేపథ్య కథ

మెగాస్టార్ చిరంజీవి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామా ‘మన శంకరవరప్రసాద్ గారు’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా అందించిన సక్సెస్ ఉత్సాహంతో ఉన్న మెగాస్టార్ నెక్స్ ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఫాంటసీ యాక్షన్ డ్రామా. యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా నేచురల్ స్టార్ నానితో ‘ది ప్యారడైజ్’ని తెరకెక్కిస్తున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నెక్స్ చిరంజీవితో ఓ మూవీని రూపొందించనున్నాడు. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ భారీ మూవీని నిర్మించనున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్కు బ్లడ్ షేడ్‌తో సాగే ఈ సినిమాలో చిరు క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా 1970 నేపథ్యంలో సాగే కథగా దీన్ని శ్రీకాంత్ ఓదెల తెరపైకి తీసుకురానున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరు నుంచి ఓ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాని ప్రేక్షకులు, అభిమానులు చాలా కాలంగా ఆశిస్తున్నారు. ఆ కోరికని యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీతో తీర్చనున్నాడని సమాచారం. 

మన తెలంగాణ 24 Feb 2026 9:46 am

Weather Report : ఒక్కసారిగా కూల్ అయిన తెలుగు రాష్ట్రాలు.. ఎప్పటి వరకూ అంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం నెలకొంది.

తెలుగు పోస్ట్ 24 Feb 2026 9:41 am

యూత్ ఎంటర్‌టైనర్‌లో..?

ఘాటీ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ లు ఏమీ ప్రకటించలేదు. అయితే ఘాటీ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ అమ్మడు మాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్లు తేలింది. ‘కథనార్: ది వైల్డ్ సార్సర్’ అనే భారీ చిత్రంలో అవకాశం అందుకుంది. జయసూర్య, మోహన్ లాల్, ప్రభుదేవా లాంటి స్టార్లు మెయిన్ లీడ్ పోషించగా, ఫీమేల్ లీడ్ లో అనుష్క కనిపించనుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్రమిది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా రోజీని థామస్ తెరకెక్కిస్తున్నారు. అనుష్కకు మాలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. ఏడాది కాలంగా సినిమా సెట్స్ లోనే ఉంది. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే అనుష్క మరో ఛాన్స్ అందుకుందని ప్రచారం జరుగుతోంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు షైజు ఖలీద్ అమ్మడిని ఓ సినిమాకు ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇదొక యూత్ ఎంటర్‌టైనర్. ఇందులో అనుష్క మెయిన్ లీడ్ పోషిస్తోంది. సినిమా అంతా అనుష్క పాత్ర చుట్టూ తిరుగుతుందట. కథనార్ రిలీజ్‌కు ముందే అనుష్కకు రెండవ సినిమా అవకాశం రావడం విశేషం. మొత్తానికి తెలుగు, తమిళ సినిమాలకు దూరమైనా మాలీవుడ్‌లో మాత్రం కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.

మన తెలంగాణ 24 Feb 2026 9:32 am

ఏడుస్తూ నిద్రపోయిన రోజులు చాలానే ఉన్నాయి: మృణాల్ ఠాకూర్

హైదరాబాద్: గతంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పిన మాటాలతోనే తనలో చాలా మార్పు వచ్చిందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. సినిమా పాత్ర కోసం సన్నగా మారాల్సి వస్తే మారాలని అక్షయ్ సూచించారన్నారు. వేల మంది ట్రోల్ చేసిన పట్టించుకోవద్దన్నారు. తనకు ఇంకా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, శరీర బరువు కోసం తనని ట్రోలింగ్ చేయడంతో తనపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. శరీరాకృతి విషయంలో తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని, ఏడుస్తూ నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయని, మార్నాడు ఉబ్బిన కళ్లతో మేల్కొన్న రోజులు కూడా చాలానే ఉన్నాయన్నారు. వాటిని పట్టించుకోవడం మానేసిన తరువాతనే తాను ముందుకు వెళ్తున్నానని చెప్పారు. 'ఒక రోజు నేను జిమ్ కు వెళ్లినప్పుడు ఒక అమ్మాయి నా వద్దకు వచ్చి నేను మీలా మారాలంటే నేను ఏం చేయాలని నన్ను అడిగింది' అని గుర్తు చేశారు. మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతామని, మనం మనల్ని గౌరవించుకుంటే ఇతరులు మనని గౌరవిస్తారని మృణాలు తెలియజేశారు. 

మన తెలంగాణ 24 Feb 2026 9:30 am

Gold Prices Today : మళ్లీ పరుగు అందుకున్న పసిడి.. అందనంత దూరంలో వెండి

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగింది

తెలుగు పోస్ట్ 24 Feb 2026 9:27 am

ఫ్యాక్ట్ చెక్: భారతదేశం నుండి మణిపూర్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

భారతదేశం నుండి మణిపూర్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుందంటూ

తెలుగు పోస్ట్ 24 Feb 2026 9:27 am

The Journey of Nani to Natural Star

Tollywood has seen the rise of several young and new talents who came without any support. Starting his journey as an Assistant Director, Nani made his debut as a lead actor and went on to become the Natural Star of Telugu cinema. Cementing his position amid stiff competition is not something easy for any actor […] The post The Journey of Nani to Natural Star appeared first on Telugu360 .

తెలుగు 360 24 Feb 2026 9:14 am

Andhra Pradesh : నేడు అసెంబ్లీలో లడ్డూ అంశంపై చర్చ

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో లడ్డూ కల్తీపై నేడు చర్చించనుంది

తెలుగు పోస్ట్ 24 Feb 2026 9:13 am

బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం?

బెంగళూరు: బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన కర్నాటక రాష్ట్రం కంప్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కంప్లి ప్రాంతంలోని ఓ గ్రామంలో పాఠశాలకు అతిథిగా ఉపాధ్యాయుడు వచ్చాడు. తన ఇల్లును శుభ్రం చేయాలని ఓ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేశాడని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామస్థులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్ద అళ్లళ్లి వీరేశ్ మాట్లాడారు. సక్రమంగా విధులు నిర్వహించని ఉపాధ్యాయులను బదిలీచేయడంతో పాటు అతిథి ఉాపాధ్యాయులకు బదులుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 

మన తెలంగాణ 24 Feb 2026 9:10 am

Nara Lokesh : ఆత్మీయ విందు.. నవ్వుల విందు

మంత్రి నారా లోకేశ్ ఏర్పాటుచేసిన ఆత్మీయ కలయిక కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 24 Feb 2026 9:06 am

నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం..

నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై

ప్రభ న్యూస్ 24 Feb 2026 9:00 am

KTR : నా పేరుతో ఎలాంటి సంస్థలు లేవు

తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు

తెలుగు పోస్ట్ 24 Feb 2026 9:00 am

పెళ్లి బరాత్.... కారులో వెళ్తుండగా వధువును ఎత్తుకెళ్లిన దుండగులు

భువనేశ్వర్: పెళ్లి జరిగిన తరువాత వధువుతో వరుడు తన ఇంటికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యతో పెళ్లి కుమార్తెను కిడ్నాప్ చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొలంగీర్ లోని కామాక్షినగర్ కు చెందిన రింకు అనే యువకుడు, బౌద్ధ్ జిల్లాకు చెందిన ఓ యువతిని ఆదివారం పెళ్లిచేసుకున్నాడు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెళ్లి కుమార్తె, కుమారుడు కారులో వరుడు ఇంటికి బయలు దేరారు.తర్బాపట్టణ శివారులోకి రాగానే కారును కొందరు దుండగులు ఆపి వాహనంలో ఉన్నవారిని బెదిరించి వధువును ఎత్తుకెళ్లారు. వెంటనే వరుడు రింకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో వధువుకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు స్థానికులు ఆరోపణలు చేశారు. ఆమె ప్రియుడే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 24 Feb 2026 8:52 am

వాళ్లకి అడ్డంకులు ఉండవు –సుజనా చౌదరి

వాళ్లకి అడ్డంకులు ఉండవు – సుజనా చౌదరి భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడలోని

ప్రభ న్యూస్ 24 Feb 2026 8:51 am

Tirumala : నేడు తిరుమలకు వెళ్లేవారికి అలెర్ట్.. దర్శనం కోసం?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 24 Feb 2026 8:50 am

అలా చేస్తేనే.. సురక్షిత భవిష్యత్తు..

అలా చేస్తేనే.. సురక్షిత భవిష్యత్తు.. నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఆర్థిక అక్షరాస్యత పై

ప్రభ న్యూస్ 24 Feb 2026 8:41 am

హోలీ ఎప్పుడు?.. మార్చి 3 లేక 4వ తేదీనా?

ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి డ్రిక్ పంచాంగం తెరదించింది.

తెలుగు పోస్ట్ 24 Feb 2026 8:39 am

చదువుకొమ్మని చెప్పినందుకు....తండ్రిని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేశాడు

లక్నో: చదువుకొమ్మని ఒత్తిడి తీసుకరావడంతో కన్నతండ్రిని కుమారుడు తుపాకీతో కాల్చి చంపి అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మన్వేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి వర్ధమాన్ పాథాలజీ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ప్రతాప్ సింగ్ కు అక్షత్ అనే కుమారుడు ఉన్నాడు. అక్షత్ పై గత కొన్ని రోజుల నుంచి చదువుకొమ్మని కన్నతండ్రి ఒత్తిడితీసుకొస్తున్నాడు. దీంతో చదువు విషయంలో తండ్రి, కుమారుడు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫిభ్రవరి 20న తెల్లవారుజామును కుమారుడిని చదువుకొమ్మని నిద్ర నుంచి లేపాడు. ఇద్దరు మద్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కోపంతో రగిలిపోయిన కుమారుడు తుపాకీ తీసుకొని తండ్రిని కాల్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేశాడు. ప్రతాప్ సింగ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుమారుడిపై అనుమానం ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

మన తెలంగాణ 24 Feb 2026 8:33 am

Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.

తెలుగు పోస్ట్ 24 Feb 2026 8:28 am

24 Feb2026 |తిరుమల సమాచారం..

24 Feb2026 | తిరుమల సమాచారం.. 24-02-2026

ప్రభ న్యూస్ 24 Feb 2026 8:27 am

మార్నింగ్ వాక్ లో..

మార్నింగ్ వాక్ లో.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్

ప్రభ న్యూస్ 24 Feb 2026 8:21 am

Mega Fans waiting for Ugadi

Megastar Chiranjeevi is done with the shoot of Vishwambara last year and the delay in the VFX work has pushed the film’s release multiple times. There are frequent speculations about the film’s new release date and Mega fans are eagerly waiting with patience about the film’s release. Megastar and his team have decided to make […] The post Mega Fans waiting for Ugadi appeared first on Telugu360 .

తెలుగు 360 24 Feb 2026 8:13 am

Summer 2026 Bet: Biggest in the Recent Times

The summer season in 2024 and 2025 did not witness the films of stars of Telugu cinema. The seasons looked dull because of the absence of stars. This year, it is predicted to be a grand summer with some of the biggest bets. Actors like Pawan Kalyan, Ram Charan, Sharwanand, Adivi Sesh, Nikhil, Varun Tej […] The post Summer 2026 Bet: Biggest in the Recent Times appeared first on Telugu360 .

తెలుగు 360 24 Feb 2026 8:10 am

Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే.. ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 24 Feb 2026 8:03 am

Mexico : మెక్సికో డ్రగ్ మాఫియా నేత ఎల్ మెంచో ఎన్‌కౌంటర్‌.. చెలరేగిన హింస..70 మంది మృతి

మెక్సికోలో డ్రగ్స్ మాఫియా నేత నెమెసియో ఒసెగువేరా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచో ఎన్ కౌంటర్ తో హింస చెలరేగింది.

తెలుగు పోస్ట్ 24 Feb 2026 7:41 am

మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం

` స్పెషల్ ఆపరేషన్‌లో మట్టుబెట్టిన మెక్సికో ఆర్మీ ` నిరసనగా మెక్సికోలో చెలరేగిన హింసాకాండ ` ఆ దేశంలోని భారతీయులకు అడ్వైజరీ మెక్సికోసిటీ(జనంసాక్షి):మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా …

జనం సాక్షి 24 Feb 2026 7:12 am

రాజమండ్రిలో పాలకల్తీతో ఘటనలో నలుగురు మతి..

` మరో నలుగురి పరిస్థితి విషమం ` పాలవ్యాపారి గణెళిశ్ అరెస్ట్.. పరీక్షలకు పాల నమూనాలు ` పాలకల్తీ మరణాలపై చంద్రబాబు ఆరా ` అధికారులతో సవిక్షించి …

జనం సాక్షి 24 Feb 2026 7:10 am

వికసిత బెంగాల్ బాధ్యత నాది

ఆందోళన కలిగించేలా బెంగాల్‌లో చొరబాట్లు బంగారు బంగ్లా కలలు సాకారం చేసుకుందాం బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ న్యూఢిల్లీ(జనంసాక్షి): పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో …

జనం సాక్షి 24 Feb 2026 7:06 am

రాహుల్‌ను ప్రధాని చేసేందుకు సిద్ధం కండి

` దేశ సమస్యలకు అదొక్కటే పరిష్కారం ` రానున్న ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు దక్కేలా కషి ` డీసీసీ అధ్యక్షుల శిక్షణాశిబిరంలో డిప్యూటి సిఎం భట్టి …

జనం సాక్షి 24 Feb 2026 7:05 am

ఎయిర్ అంబులెన్స్ కూలి ఏడుగురు మృతి

రాంఛీ: ఎయిర్ అంబులెన్స్ లో రోగిని తరిలిస్తుండగా  కుప్పకూలిపోవడంతో ఏడుగురు మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం చత్రా జిల్లా సిమారియా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అగ్ని ప్రమాదంలో గాయపడిన 41 ఏళ్ల సంజయ్ కుమార్ ను ఎయిర్ అంబులెన్స్ లో తరలిస్తుండగా 7.34 నిమిషాలకు కు ఎయిర్ అంబులెన్స్ తో ఎటిసికి సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ అంబులెన్స్ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు ఫైలట్లు ఉన్నారు.

మన తెలంగాణ 24 Feb 2026 7:05 am

దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత

` సుప్రీం తీర్పుతో దారికొచ్చిన అమెరికా ప్రభుత్వం ` మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటన ` అమెరికా కస్టమ్స్ శాఖ ప్రకటన విడుదల వాషింగ్టన్(జనంసాక్షి): దిగుమతులపై సుంకాల …

జనం సాక్షి 24 Feb 2026 7:04 am

ఇక మెట్రో బాధ్యత తెలంగాణ సర్కారుదే..

` ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ` ఈ ప్రక్రియ పర్యవేక్షణకు భట్టి ఆధ్వర్యంలో ఉపసంఘం ` మార్చి …

జనం సాక్షి 24 Feb 2026 7:02 am

చిన్నారిని తొక్కిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి

మోపాల్, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన దారుణ ఘటనపై నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామ యువత ఆగ్రహం …

జనం సాక్షి 24 Feb 2026 6:10 am

24feb2026 |మంగళవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

24feb2026 |ఈ రోజు శుభప్రదమైన సమయాలు, జాగ్రత్తలు తెలుసుకోండి 24feb2026 | నేటి

ప్రభ న్యూస్ 24 Feb 2026 6:00 am

మార్చి 16నుంచి అసెంబ్లీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మార్చి 16 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మార్చి 16న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని తెలిపారు. మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంద నిన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సిఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా సాగింది. అనంతరం మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై స హచర మంత్రులతో కలిసి మంత్రి పొంగులేటి వెల్లడించారు.  

మన తెలంగాణ 24 Feb 2026 5:30 am

మే 11నుంచి జూన్ 9వరకు రాష్ట్రంలో జనగణన

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జనగణన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజా కేబినెట్ భేటీలో కీలక ఆమోదం కల్పించింది. తెలంగాణ లో జనగణను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతం గా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ సర్వసన్నద్ధం అవుతోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జనగణన ప్రక్రియలో జరగాల్సిన తొలి విడత ఇళ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై ఈ మంత్రి వర్గ సమావేశంలోనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఈ ఇండ్ల గణన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రివర్గానికి వివరించారు. మే 11వ తేదీన ఈ ఇండ్ల గణన ప్రక్రియను ప్రారంభించి జూన్ 9వ తేదీ వరకు పూర్తి చేసేలా ప్లాన్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ ఇళ్ల గణన (హౌజ్ లిస్టింగ్) ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేసిన 34 ప్రశ్నలతో కూడిన నమూనా పత్రాన్ని ప్రభుత్వం ఉపయోగించనుంది. ఈ ఇళ్ల గణనలో సుమారు 84 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించను న్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రతీ ఇంటికి వెళ్లి వారి వివరాలు సేకరించనున్నారు. ఈ ఎన్యూమరేటర్లకు దిశా నిర్దేశం చేసేందుకు 5 వేల మం ది నోడల్ ఆఫీసర్లను కూడా నియమించనున్నారు. దీంతో మొత్తంగా ఈ ఇళ్ల గణన ప్రక్రియలో 89 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాము లు కానున్నారు. ఇక తొలి దశ ఇళ్ల గణన సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయిన తర్వాత.. అసలైన రెండో దశ ప్రారంభం కానుంది. జనగణన ప్రక్రియను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో చేపట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంచనాకు.. ఈ గణన ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈ జనగణన ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

మన తెలంగాణ 24 Feb 2026 5:00 am

జంట జలాశయాల కాలుష్యంపై 4వారాల్లో నివేదిక

మన తెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు తాగునీటి సరఫరాకు ప్రధా న వనరులుగా పనిచేస్తున్న జంట జలాశయాలయిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా ఉండటం పై హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి కీ లక ఆదేశాలు జారీ చేసింది. జలాశయాల్లో మ రుగునీరు, పారిశ్రామిక వ్యర్ధాలు ప్రవహించకుండా ఉండడానికి తీసుకున్న చర్యల వివరా లు నాలుగు వారాల్లో తెలపాలని ఆదేశించింది. జంట జలాశయాల కలుషితమవుతున్నట్లు ప త్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సుమోటో గా స్వీకరించింది. దీనిపై విచారణ జరిపిన ధ ర్మాసనం జలాశయాలలోకి మురుగునీరు, పా రిశ్రామిక వ్యర్థాలు ప్రవహించడాన్ని తీవ్రంగా పరిగణించింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్ శాఖల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, గ్రేటర్ హై దరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబా ద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, హై దరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డులను ప్రతివాదులుగా చే ర్చిన ధర్మాసనం అధికారులకు నోటిసులు జారీ ఇచ్చింది. విచారణ సందర్భంగా పత్రికల్లో వ చ్చిన కథనాలను ధర్మాసనం ప్రస్తావించింది, ఇ ది మురుగునీరు, పారిశ్రామిక కాలుష్య కారకాలను నిరంతరం విడుదల చేయడం వల్ల రెండు జలాశయాలలో నీటి నాణ్యత గణనీయంగా క్షీ ణిస్తుందని పేర్కొంది. నీటిలో విషపూరిత పదార్థాలతో ప్రజలు తీవ్రమయిన ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతాయని, కలుషితమైన నీరు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని గమనించిన ధర్మాసనం, జ లాశయాలలోని నీటి నాణ్యత బ్యూరో ఆఫ్ ఇం డియన్ స్టాండర్డ్ (బిఐఎస్) సూచించిన ప్ర మాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. 

మన తెలంగాణ 24 Feb 2026 4:30 am

కాంగ్రెస్‌పై కమలం కుట్రలు

మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలోనే రు గ్మతలకు పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయనను ప్రధానమంత్రిగా చేసే వరకు రెండు రాష్ట్రాల జిల్లా కాం గ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని, రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలని కోరారు. సోమవారం వికారాబా ద్ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్టులో నిర్వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరం లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. అంతకు ముం దు జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ స్నేహమెహ్రా, ము న్సిపల్ ఛైర్ పర్సన్ అనన్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్ వాదిగా కుల వివక్ష నిర్మూలనకు ఎలా పోరాటం చేయాలి అన్న అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. దేశంలో అంటరానితనం, వివక్ష సమ స్య ఎక్కడ ఎదురైనా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్య క్షం అవుతారు అని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కుల వివక్షను భరించలేక బలవన్మరణానికి పాల్పడితే రాహుల్ గాంధీ నేరుగా యూనివర్సిటీకి చేరుకొని విద్యార్థులతో చర్చించి పోరాట విధానాన్ని ఖరారు చేశారని తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకు లు కార్యకర్తలను ఎవరిని కూడా యూనివర్సిటీలోకి రానివ్వలేదు అంటరానితనం సమస్యను సమస్యగా చూడాలి తప్ప రాజకీ య జోక్యం ఉండకూడదు అన్నది రాహుల్ ఆలోచన అని వివరించారు. ఆయన ఆలోచన మేరకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం రాగా నే వనరులు సంపద సమానంగా పంచుతామని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ప్ర కటించారు ఆయన ప్రకటించినట్టుగా అధికారంలోకి రాగానే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ స్వా తంత్రం అనంతరం ఎక్కడా జరగని కుల గణనను ప్రజా ప్రభుత్వం 50 రోజుల్లో పూర్తి చేసి శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందాలని వివరించారు. దేశానికి స్వాతంత్రం సాధించడంతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధించేందుకు అనేక విప్లవాత్మక చట్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని తెలిపారు. స్వాతంత్రం ముందు నుంచి దేశంలోని రుగ్మతల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు బిజెపి కాంగ్రెస్ ముక్తభారత్ చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అంటుంది అన్నారు. ఈ సమాజం సామాజికంగా, ఆర్థికంగా విభజన జరిగి ఇలాగే ఉండాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు. కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవం అని, తాను కుల వివక్షను ఎదుర్కొన్నానని వివరించారు. ఈ సమాజంలో కుల వివక్ష ఉంటుందన్న వాస్తవాన్ని మదిలో పెట్టుకుని బలమైన సంకల్పంతో అనుకున్న లక్ష్య సాధనకు ముందుకు పోతున్న క్రమంలో వివక్ష ఎదురైనా అది మన లక్ష్యాలను దెబ్బతీయలేదని వివరించారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా దేశంలో అంటరానితనం, బాల్య వివాహం, వితంతు వివాహం వంటి అనేక రుగ్మతలపై దశాబ్దాలుగా ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు పోతుందని తెలిపారు. దేశ స్వాతంత్ర సంగ్రామం ఒకవైపు, సామాజిక అంశాలపై ఆందోళనలో మరోవైపు ఈ దేశంలో రెండు అంశాలను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లిందని వివరించారు. కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అంటరానితనం పూర్తిగా నిర్మూలించాలని, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించాలని టి.కె మాధవన్ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేరళలో వైకాం సత్యాగ్రహ, మహారాష్ట్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో చౌదర్ సత్యాగ్రహం వంటి కార్యక్రమాలను అఖిలభారత కాంగ్రెస్ కమిటీ చేపట్టిందన్నారు. హరిజనోద్దరణ పేరిట పెద్ద యాత్ర అప్పట్లో గాంధీజీ ఆధ్వర్యంలో హరిజనోద్ధరణ పేరిట పెద్ద యాత్ర చేపట్టారని దళితుల దేవాలయల ప్రవేశం, దళిత వాడల్లో పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు ఈ దేశంలో అంటరానితనాన్ని తొలగిస్తారని గాంధీ ఓ నమ్మకాన్ని ఏర్పరిచారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో దేశంలో అంటరాని తనం నిర్మూలనకు 1049లో ఆర్టికల్ 17 ద్వారా అవకాశం కల్పించారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పూర్తిగా అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమైంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయ కరణ ద్వారా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం లభించిందని తద్వారా సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకు చేయూత లభించిందని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ సమావేశంలో సంఘటన సృజన్ ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్ రావ్ ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా వంశీ చందర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో శిబిరం సమర్థవంతంగా కొనసాగుతోంది. ఈ పది రోజుల శిక్షణా శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా, మీడియా నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలు వంటి కీలక అంశాలపై నిపుణుల ద్వారా సవివరంగా శిక్షణ అందిస్తున్నారు. జిల్లాల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ సిద్ధాంతాలను తీసుకెళ్లడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు వెల్లడించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డాక్టర్ వంశీ చందర్ రెడ్డి, ఏ ఐ సి సి నాయకులు విశ్వనాథన్, సావంత్, సచిన్ రావు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 24 Feb 2026 4:00 am

ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలకు 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు కనీసం అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అయితే, ఉదయం 9 తరువాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా కూడా అనుమతిస్తామని వెల్లడించారు. తాము ఇచ్చే 5 నిమిషాల గ్రేస్ పిరియడ్‌ను సానుకూల దృక్పథంతో చూడాలని అన్నారు. విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవడం వల్ల ప్రశాంతంగా పరీక్షలు రాయగలుగుతాయని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ రద్ధీ ఉండే ప్రాంతాలలో విద్యార్థులు పరీక్షా సమయం కంటే ముందే చేరుకోవాలని, తద్వారా ఒఎంఆర్ షీట్ ప్రశాంతంగా నింపుకోవచ్చని, హడావుడి ఉండదని చెప్పారు. అందుకే పరీక్షా సమయానికి అరగంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇంటర్మీడియేట్ పరీక్షల నేపథ్యంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రద భాయి, ఇతర అధికారులతో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది, రెండో సంవత్సరం ప్రైవేటు 54,017 మంది కలిపి మొత్తం 5,07,949 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డ్యుయల్ డెస్క్ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ కేంద్రంలో తాగునీటితో విద్యార్థులు అవసరమైతే వైద్య సహాయం అందించేందుకు అవసరమైన మందులు మెడికల్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. దాంతోపాటు విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్లు పంపించినట్లు తెలిపారు. విద్యార్థులు ఎస్‌ఎంఎస్ లింకుపై క్లిక్ చేసి విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కృష్ణ ఆదిత్య తెలిపారు. ప్రశ్నపత్రం కూర్పు మొదలు కొని, పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్ల వరకూ జాగ్రత్తలు పాటించామన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షల కోసం 1,495 ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయగా, 1,495 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 1,495 డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు విధుల్లో ఉంటారని తెలిపారు. మొత్తం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 సిట్టింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్‌టిసి అధికారులతో, పోలీస్ అధికారులు, పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ మానసిక సమస్యలు, పరీక్షల ఒత్తిడితో ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు కోసం 24*7 అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు టెలీ మానస్ నెంబర్ : 14416 లేదా 91 8069391416 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. హాల్ టికెట్, ఇతర సమస్యలతో పాటు మానసిక నిపుణులు, ఆరోగ్య సంక్షేమ శాఖ విభాగానికి చెందిన నిపుణులు అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తారని తెలిపారు. అవసరమైన విద్యార్థులకు నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత మానసిక ఆరోగ్య సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆందోళన చెందే విద్యార్థులు టెలీ మానస్‌కు కాల్ చేసి, మానసిక ధైర్యం పొందాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కృష్ణ ఆదిత్య సూచించారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9,97,075 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,53,932 మంది ద్వితీయ సంవత్సరం ప్రైవేట్ విద్యార్థులు 54,017 మంది పరీక్షా కేంద్రాలు 1,495 ఇన్విలేటర్లు 28,500 ఫ్లైయింగ్ స్కాడ్లు 75 సిట్టింగ్ స్కాడ్లు 200

మన తెలంగాణ 24 Feb 2026 3:30 am

ఈదురుగాలుల బీభత్సం

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలు లు భీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఈదురు గాలుల తో కూడిన వర్షానికి యాసంగి పంటలు గోధు మ, మొక్కజొన్న పంటలు నేలకొరిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డా యి. అర్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జోరుగా కురిసిన వర్షానికి అర్లి, అంతర్గావ్, గోమూత్రి, గుబిడి గ్రామాల్లో కోతకు వచ్చిన యాసంగి పంటలు చేతికి అందకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అకాల వర్షంతో జన జీవనం ఒక్కసారిగా స్తంభించింది. ఉరుములు మెరుపులతో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కాళేశ్వరంలో గాలి వానకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో తీగలు తెగిపడ్డాయి. ఊహించని వర్షం కారణంగా మిర్చి పంట సాగు చేస్తున్న రైతులు పంట నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు.మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లోని చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పట్టణమంతా విద్యుత్ నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపుల హోరుతో ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉష్టోగ్రతలు పడిపోయాయి. నగరంలోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, గాంధీనగర్, అంబర్‌పేట్, బర్కత్‌పురా, చంపాపేట్, సైదాబాద్, కర్మన్‌ఘాట్, అబిడ్స్, బషీర్‌బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులు మేడ్చల్ జిల్లాలో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. వేగంగా ఈదురు గాలులు వీచి భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ పరిసరాలైన హయత్‌నగర్,పెద్ద అంబర్‌పేట్ లాంటి పలు చోట్ల వాన చినుకులు నేలను తాకాయి. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిర్మల్‌లో వడగళ్ల వాన జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. మెట్‌పల్లి, మల్లాపూర్ మండలాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో మామిడి కాయలు రాలాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో వడగళ్ల వాన కురిసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోనూ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ ఈదురు గాలులతో వాన కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులు జలమయం కావడంతో వాహదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మరాత్వాడ వరకు ద్రోణి ఒకటి సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం వరకు ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో మరొక ద్రోణి ఈరోజు ఏర్పడినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం ఆదివారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలోని తీవ్ర అల్పపీడన ప్రాంతం నుంచి మధ్య తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు బలహీన పడినట్లు తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్ధపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులతో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలలతో భారీ వర్షం కురవడంతో మంచిర్యాల జిల్లా తడిచి ముద్దయ్యింది. కురిసిన అకాల వర్షంతో మామిడి చెట్లకు ఉన్న పూత ఒక్క సారిగా రాలి పోవడంతో ఇక మామిడి కాయల పరిస్థితి కష్టంగా మారింది. అలాగే మండలంలో తెల్లబంగారం పండించిన రైతులకు ఇంకా కొందరు పత్తి ని చెట్టు మీద నుండి తెంపక పోవడంతో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచిపోయి రైతులకు నష్టాన్ని చవి చూపించింది.

మన తెలంగాణ 24 Feb 2026 3:00 am

Producer Venkat Boyanapalli heartfelt wishes to Nani

Natural Star Nani has earned a great name for his friendly and respectful nature. While he has earned the image of being a versatile actor, more than that, he proved to be a man with character of gold. On his birthday, producer Venkat Boyanapally of Niharika Entertainment, specially wished him with a touching note. It […] The post Producer Venkat Boyanapalli heartfelt wishes to Nani appeared first on Telugu360 .

తెలుగు 360 24 Feb 2026 12:35 am

ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరవకముందే ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది.సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పరిధిలోని సురభి ప్రైవేటు మెడికల్ కాలేజీ లో ఇటీవల కాలంలో జరిగిన వరుస సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత కొంత కాలంగా సురభి ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో జరుగుతున్న సంఘటనలపై యాజమాన్యం తీరు చర్చానీయాంశంగా మారింది.రెండు రోజుల క్రితం కాలేజీ హాస్టల్లో ఫిజియోథెరపి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ శ్రీజ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన శవాన్ని మార్చురికి తరలించి చేతులు దులుపుకోవడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ శ్రీజను చదివిస్తుండగా హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడిన అందుకు కారణాల పై కళాశాల యాజమాన్యం నోరు మెదపక పోవడం అనుమనాలకు తావిస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే శ్రీజ ఆత్మహత్యకు పాల్పడిందనే కళాశాల యాజమాన్యం పేర్కొంటూ పోలీసులు విచారిస్తున్నారని చెప్పడాన్ని విద్యార్థి సంఘాలు మృతురాలి బందువులు తప్పు బడుతున్నారు.గతంలోనే ఒక మెడికో కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైతం సంచలనం సృష్టించినా యాజమాన్యం మాత్రం పట్టిపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. సురభీ మెడికల్ కాలేజీపై హెచ్చార్సీ ఆగ్రహం : సిద్ధిపేటలోని సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యా సంస్థ పై హెచ్ ఆర్సీ ఛైర్మెన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన నాలుగు నెలల క్రితమే చోటుచేసుకుంది. సిద్ధిపేటలోని సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో విద్యను అభ్యసించిన సమయంలో తాను సమర్పించిన ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లను కాలేజి యాజమాన్యం నిలిపివేయడంతో, తాను పీజీ ప్రవేశానికి గడువులోపు ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయలేకపోయానని డాక్టర్ మెరుగు కార్తిక్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ అతనికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అదేశించినప్పటికి, ఇవ్వకపోవడమే కాకుండా, కమిషన్ సమన్లకు కూడా హాజరు కానందన కాలేజ్ ఛైర్మన్, ప్రిన్సిపల్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ కి ఆదేశించింది. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం : కొద్ది నెలల క్రితం సురభి మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయికృష్ణ అనే విద్యార్థిని అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ర్యాగింగ్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.మెడికో సాయికృష్ణ దేవుడి మొక్కు కోసం గడ్డం పెంచుకోవడం పై ర్యాగింగ్ చేస్తూ గడ్డం తీయించారు. ఈ విషయమై యాంటీ ర్యాగింగ్ కమిటీకి విద్యార్థి సాయికృష్ణ ఫిర్యాదుచేసిన యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థి ఏకంగా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై యాజమాన్యం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని కొందరు విద్యార్థులపై కొద్ది కాలంపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంది.. అనుమతులు లేకుండా నిర్మాణాలు : సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇరవై ఎకరాల్లో నిర్వహిస్తున్న సురభీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరపడంపై సామాజిక కార్యకర్త జి.చక్రధర్ గౌడ్ హై కోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఆర్డర్ ను జారీ చేసింది. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అనధికార నిర్మాణాలపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత ఉన్నతాధికారులకు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజకీయ అండదండలే కారణం...? : రాజకీయ అండదండలతోనే సురభీ మెడికల్ కాలేజీ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ విద్యార్థుల ఆత్మహత్యలైనా, ర్యాగింగ్ , అక్రమ నిర్మాణాల పై ఆరోపణలు వచ్చినా ఎలాంటీ చర్యలు లేక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఆరు నెలలుగా వరుస సంఘటలను చూస్తుంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షకులను తయారు చేసే మెడికల్ కాలేజీలో నిబందనలకు తూట్లు పోడుస్తున్నా అధికారులు చోద్యం చూడటం పట్ల పులువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘటనలపై మీడియాలో వార్తలు వచ్చినా అధికారులు చర్యలు చేపట్టక పోవడం రాజకీయ అండదండలే కారణమని భావిస్తున్నారు. ఏది ఏమైనా వరుస సంఘటనలపై అధికారులు విచారణ జరపాలనే డిమాండ్ విసృ్తతమవుతోంది. ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు : మెడికల్ కళాశాల డిఎన్ డాక్టర్ రఫీ సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని కళాశాల డిఎన్ మహమ్మద్ రఫీ తెలిపారు. విద్యార్థిని శ్రీజ ఆత్మహత్యకు సంబంధించిన వివరణ కోరగా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు.

మన తెలంగాణ 23 Feb 2026 11:30 pm

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంఏకసభ్య కమిషన్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత. ఒక విచారణ మరో దానిపై ప్రభావం చూపదని స్పష్టీకరణ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక విచారణ మరో కమిటీ విచారణపై ప్రభావం చూపబోదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు […] The post తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంఏకసభ్య కమిషన్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 11:29 pm

ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామకష్ణరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ నిమిత్తం అనేక […] The post ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 11:25 pm

ట్రంప్ దూకుడుకు బ్రేక్

నేటి నుంచి నిలిచిపోనున్న సుంకాల వసూళ్లు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల […] The post ట్రంప్ దూకుడుకు బ్రేక్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 11:21 pm

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా ఒకరికి గాయాలైన సంఘటన షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు .షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామానికి చెందిన దాసరి అజయ్ (19), ఉదయ్‌కిరణ్(19) అజాన్(19)  ముగ్గురు కలిసి ఆదివారం సాయంత్రం చేవెళ్ల కు వెళ్లి అర్థరాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నాగర్‌గూడ చౌరస్తా వద్ద లారీ కంటైనర్ ఢీ కొనడంతో అజయ్, ఉదయ్‌ కిరణ్ అక్కడిక్కడే మృతి చెందారు. అజాన్‌కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చూసి వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం అజాన్‌ను నగరంలోని ఫ్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉదయ్‌ కిరణ్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 23 Feb 2026 11:20 pm

కాటేసిన కల్తీ పాలు

ఐదుకు చేరిన మృతులు ఆసుపత్రిలో 12 మందికి చికిత్స . నలుగురు చిన్నారుల ఆరోగ్యం విషమం. అనుమానితులు వైద్యులను సంప్రదించాలన్న అధికారులు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరంలో కల్తీ పాల ఘటన కుటుంబాల్లో భయాందోళన రేకిత్తిస్తోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యా ప్తులో తేలింది. తాజాగా సోమవారం దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన […] The post కాటేసిన కల్తీ పాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 11:19 pm

ఇందాపూర్ ప్రకంపనలు

. మండలిలో అధికార, ప్రతిపక్ష పోటాపోటీ నిరసనలు. తిరుమలకు నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ పట్టు. గందరగోళం…వాయిదాల పర్వం. 26న చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:శాసన మండలి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. మండలిలో చైర్మన్ పోడియం వద్ద, మండలి వాయిదా అనంతరం చైర్మన్ చాంబర్ ఎదుట వైసీపీ సభ్యులు నిరసనలతో మండలి కార్యకలాపాలకు అడుగడుగునా అవాంతరం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయం ముందుకు కొనసాగలేదు. మండలి సమావేశం సోమవారం చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రారంభం కాగా… […] The post ఇందాపూర్ ప్రకంపనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 11:12 pm

ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లో రూ. 590 కోట్ల మోసం

ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లో రూ.590 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్లు ఆదివారం నాడు బ్యాంక్ ప్రకటించింది. హరియాణా ప్రభుత్వ ఖాతాల్లో సిబ్బంది రూ. 590 కోట్ల మేరకు మోసం చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది. చండీగఢ్ లోని బ్యాంక్ ప్రత్యేక శాఖలోని కొంతమంది ఉద్యోగులు హరియాణా రాష్ట్రప్రభుత్వ ఖాతాలనుంచి మోసపూరితంగా, అనధికారికంగా నగదు మళ్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో ఇతర వ్యక్తులు, సంస్థలు, ఇతర పక్షాల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. హరియాణా ప్రభుత్వం లోని ఒక విభాగం ఈ బ్యాంక్ లోని తన ఖాతాను మూసివేసి, ఆ ఖాతాలోని నిధులను మరో బ్యాంక్ కు మళ్లించవలసిందిగా కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ప్రస్తుతానికి వేసిన అంచనా ప్రకారం జరిగిన మోసం రూ. 590 కోట్లు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. క్లెయిమ్ ల ధ్రువీకరణ, ఏఏ విధమైన రికవరీలు జరిగాయో తేలిన తర్వాత తుది మొత్తాన్ని నిర్ణయిస్తారని బ్యాంక్ పేర్కొంది. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లో పని చేస్తున్న నలుగురు అధికారులను తక్షణం సస్పెండ్ చేసి, దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మోసానికి పాల్పడిన ఉద్యోగులు ఇతర వ్యక్తులు కఠిన మైన క్రమశిక్షణ చర్యలు, సివిల్, క్రమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంక్ హామీ ఇచ్చింది.ఈ మోసం బయటపడగానే, ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఫిబ్రవరి 20 న బ్యాంక్ కు సంబంధించిన మోసాల కేసుల పర్యవేక్షిణ, ఫాలో - అప్ కోసం బోర్డు ప్రత్యేక కమిటీ దృష్టికి తీసుకువెళ్లింది. ఒక రోజు తర్వాత ఆడిట్ కమిటీ, బోర్డుకు తెలియజేసింది.

మన తెలంగాణ 23 Feb 2026 11:10 pm

వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్‌లో నిధులు పెంచాలి

. 62 శాతం జనాభాకు 4.31శాతం దారుణం: కేవీవీ ప్రసాద్. నూతన కౌలు చట్టం తీసుకురావాలి: జమలయ్య. రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘం ఆందోళనలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అదనపు నిధులు కేటాయించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్వర్యాన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొనగా, ఉండిలో కౌలు రైతులసంఘ రాష్ట్ర […] The post వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్‌లో నిధులు పెంచాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 11:03 pm

జింబాబ్వేపై విండీస్ ఘన విజయం

టి20 ప్రపంచకప్ సూపర్8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 107 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. బ్రాడ్ ఎవన్స్ (43), డియాన్ మేయర్స్ (28), కెప్టెన్ సికందర్ రజా (27) మాత్రమే కాస్త రాణించారు. విండీస్ బౌలర్లలో మోటి నాలుగు, అకీల్ హుస్సేన్ మూడు, మాథ్యూ ఫోర్డ్ రెండు వికెట్లు తీశారు. హెట్‌మెయిర్ వీర విధ్వంసం అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (12), షాయ్ హోప్ (14)లు విఫలమయ్యారు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షిమ్రోన్ హెట్‌మెయిర్, రొమన్ పొవెల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు దూకుడుగా ఆడి స్కోరు పరిగెత్తించారు. హెట్‌మెయిర్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. జింబాబ్వే బౌలర్లను హడలెత్తించిన షిమ్రోన్ వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే రికార్డు అర్ధ సెంచరీని నమోదు చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హెట్‌మెయిర్ 34 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 85 పరుగులు చేశాడు. పొవెల్ 35 బంతుల్లోనే 4 సిక్స్‌లు, మరో నాలుగు బౌండరీలతో 59 పరుగులు సాధించాడు. రూథర్ ఫోర్డ్ 13 బంతుల్లోనే అజేయంగా 31 పరుగులు చేశాడు. షెఫర్డ్ (21), హోల్డర్ (13) కూడా దూకుడుగా ఆడడంతో విండీస్ రికార్డు స్కోరును నమోదు చేసింది.

మన తెలంగాణ 23 Feb 2026 10:59 pm

కాజీపేట రైల్వే కోచ్ యూనిట్ నుంచి రైలు పరుగులు

తెలంగాణ లోని కాజీపేటలో 160 ఎకాల విస్తీర్ణంలో ఉన్న రైల్వే కోచ్ తయారీ యూనిట్ ను అభివృద్ధి చేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ మధ్య ఫ్యాక్టరీని భారతీయ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం చేసేందుకు 13.15 కిలోమీటర్ల ట్రాక్ పై డీజిల్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. డీజిల్ రైలు ట్రయిల్ రన్ కోసం ఫ్యాక్టరీ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ కు ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్ ద్వారా ఇక ముందు ఫ్యాక్టరీలో తయారు చేసిన కోచ్ లను స్టేషన్ కు తీసుకువచ్చి, వివిధ రైల్వే జోన్ లు, డివిజన్ లకు పంపే అవకాసం ఉందని అధికారులు తెలిపారు. ఈ ట్రయిల్ రన్ తో రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కాంప్లెక్స్ నుంచి ప్రధాన రైల్వే నెట్ వర్క్ కు ట్రాక్ కనెక్టివిటీ పూర్తయినట్లు స్పష్టమైంది. మార్చిలో అధికారికంగా ప్రారంభానికి ముందు ఇది సన్నాహక కార్యక్రమం. భారతీయ రైల్వేల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ ను ఓ ప్రధాన రోలింగ్ స్టాక్ తయారీ, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ యూనిట్ ను ప్రాజెక్టు అమలు సంస్థగా ఆర్ విఎన్ ఎల్ అమలు చేస్తోందని కూడా సంస్థ పేర్కొంది. ఢిల్లీ - చెన్నై కారిడార్ లో భాగమైన బల్హార్షా- సికింద్రాబాద్ మార్గంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కాజీ పేట ప్రధాన రైల్వే జంక్షన్ వ్యూహాత్మకంగా కీలకమైనది. సమీపంలోనే రైల్ మ్యాన్యు ఫ్యాక్చరింగ్ యునిట్ ఏర్పాటయింది. దేశవ్యాప్తంగా రోలింగ్ స్టాక్ ను సమర్థంగా పంపించేందుకు జాతీయ రోలింగ్ స్టాక్ తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఉత్తర -దక్షిణ, తూర్పు, పశ్చిమ కనెక్టివిటీ సులభతరం కాగలదని అధికారులు అంటున్నారు. కాజీపేట లోని రైల్వే తయారీ యూనిట్ లో విజయవంతమైన ట్రయల్ రన్ , ప్రధాన రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం ఈ ప్రాజెక్టు అమలులో మైలురాయి వంటిదని ఆర్ విఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సలీం అహ్మద్ అన్నారు. దీని వల్ల భారతదేశ రైల్వే తయారీ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రధానయూనిట్, పెయింట్ విభాగం, టెస్ట్ యూనిలోని యంత్రాలు, ప్లాంట్ ఇన్ స్టలేషన్ లు పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి అధికారికంగా ప్రారంభానికి సర్వం సిద్ధమవుతున్నదని ఆర్ విఎన్ ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

మన తెలంగాణ 23 Feb 2026 10:50 pm

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ర్యాన్ గ్రూప్ భాగస్వామ్యం

హైదరాబాద్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐbఫ్bఫ్)తో విజయవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, రయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్‌లోని ఫిఫా టాలెంట్ అకాడమీలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు విద్యాపరమైన మద్దతును అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (bసఏటీజీ)తో సమగ్ర ఒప్పందంపై సంతకం చేసింది. ఈరోజు హైదరాబాద్‌లో సంతకం చేయబడిన ఈ వడు సంవత్సరాల అవగాహన ఒప్పందం, అథ్లెటిక్ bక్సలెన్స్‌ను విద్యా సాధనతో సమతుల్యం చేసే సమగ్ర అభివద్ధి ద్వారా భారతదేశ భవిష్యత్ ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడానికి […] The post తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ర్యాన్ గ్రూప్ భాగస్వామ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 10:33 pm

తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్

హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ పైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన bస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొత్తగా వడు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకుంది. బీమాను అందరికీ అందుబాటులోకి తేవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాల అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పరిష్కార మార్గాలను అందించడంపై కంపెనీకి గల చిత్తశుద్ధికి ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది. కొత్తగా భూపాలపల్లి, ఖమ్మం జిల్లా బుర్హాన్‌పురం, నాగర్‌కర్నూల్‌లలో […] The post తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 10:16 pm

فیکٹ چیک: پاکستانی ٹک ٹاکر کا ویڈیو نئی دہلی کے اے آئی اجلاس سے جوڑکر فرضی دعوے کے ساتھ وائرل

وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ نئی دہلی اے آئی سمٹ میں ایک نوجوان روبوٹ کو گالی دے رہا ہے۔ تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو دوبئی کے میوزیم آف دی فیوچر کا ہے اور اس میں پاکستانی ٹک ٹاکر کاشف ضمیر کو دکھایا گیا ہے

తెలుగు పోస్ట్ 23 Feb 2026 10:13 pm

లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా అరంగేట్రం

న్యూదిల్లీ: మారియట్ బోన్వోjŽT 30కి పైగా అసాధారణ హోటల్ బ్రాండ్‌ల గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో భాగమైన లె మెరిడియన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, తాజా లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. హిమాలయాల దిగువన ఉన్న ప్రశాంతమైన నన్ నది వెంబడి ఉన్న ఈ రిసార్ట, డెహ్రాడూన్‌లో బ్రాండ్ రాకను సూచిస్తుంది, ఇది అభివద్ధి చెందుతున్న విశ్రాంతి కేంద్రం మరియు ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అత్యంత కోరుకునే కొన్ని కొండ […] The post లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా అరంగేట్రం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 10:08 pm

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇద్దరు పోలీసు అధికారులు

ఎపిలో ఎసిబి అధికారులు దూకుడు పెంచారు. లంచం తీసుకుంటున్న పోలీస్ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే రూ.3 లక్షలు లంచం తీసుకుంటున్న ఇద్దరు పోలీసు అధికారులను సోమ వారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పులివెందుల రూరల్ సిఐ ఎన్.వి. రమణ, సింహాద్రిపురం ఎస్‌ఐ దాసరి అనిల్ కుమార్ చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి నుంచి రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దొంగిలించిన బైకులతో నేరాలకు పాల్పడుతున్న ఈ కేసులో అనుకూలంగా వ్యవహరిస్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు మొదట కొంత మొత్తం చెల్లించాడు. మిగిలిన డబ్బు కోసం పోలీసులు ఒత్తిడి చేయడంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగం లోకి దిగిన ఎసిబి అధికారులు, సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో పక్కా ప్రణాళికతో వలపన్నారు. బాధితుడు రూ.3 లక్షలను ఎస్‌ఐ అనిల్ కుమార్ కు అందజేస్తుండగా, అక్కడే మాటువేసిన ఎసిబి అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సిఐ రమణను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శ్రీకాకుళంలో ఎంఇఒ, విజయనగరంలో విఆర్‌ఒ పట్టివేత అదే విధంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటున్న మండల విద్యాధికారి (ఎంఇఒ) కుర్మాన అప్పారావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉప్పాడ కామేశ్వరరావును ఎసిబి అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ) ఆర్. చిట్టిబాబు కూడా లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు.

మన తెలంగాణ 23 Feb 2026 10:08 pm

తెలంగాణలో 300 ప్రిజం కంపెనీ సర్వీస్డ్ హోటళ్ల జోడింపు

హైదరాబాద్: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలపై వ్యూహాత్మకంగా దష్టి సారించటం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 300 కంపెనీ సర్వీస్డ్ హోటళ్లను జోడించాలని ప్రిజం (ఓయో యొక్క మాతసంస్థ) యోచిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన హైఇంపాక్ట్ హోటల్ పార్టనర్ సమ్మిట్‌లో ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది, ఇది అధికవద్ధి చెందుతున్న పట్టణ కేంద్రాలు, అభివద్ధి చెందుతున్న టైర్`2 మార్కెట్లలో తమ కార్యకలాపాలను బలోపేతం చేయాలనే ప్రిజం నిబద్ధతను నొక్కి చెబుతుంది. హైదరాబాద్‌లోని అభివద్ధి చెందుతున్న వైద్య, వ్యాపార […] The post తెలంగాణలో 300 ప్రిజం కంపెనీ సర్వీస్డ్ హోటళ్ల జోడింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 10:04 pm

6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వ మెడలు వంచుతాం: మంత్రి బండి సంజయ్

ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే అమలు చేసేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. డూప్లికేట్ గాంధీ కుటుంబానికి మూటలు పంపి పదవులు కాపాడుకోవాలనే తాపత్రయమే తప్ప 6 గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో ఎప్పుడైనా చర్చించారా? అని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.డూప్లికేట్ గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలు పంపించాలన్న శ్రద్ధే తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టవా? అని ఆయన ముఖ్యమంత్రిని ఉద్ధేశించి ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2500లు ఇస్తామని చెప్పి రెండేళ్ళు దాటినా ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. అవ్వాతాతలకు ప్రతి నెలా రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇవ్వడంపై, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డును ఎందుకు ఇవ్వలేకపోతున్నామని, నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలుపై ఎన్నడైనా మంత్రివర్గంలో ఎప్పుడైనా చర్చించారా ? అని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది యాజమాన్యాలు అల్లాడుతున్న సంగతి మర్చిపోయారా?, ఆరోగ్యశ్రీ బకాయిలివ్వకపోవడంతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందక పేదల బాధలు మీకు పట్టవా? అని ఆయన ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు సాధ్యాసాధ్యాలపై ఎందుకు చర్చించడం లేదని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తమ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఆధ్వర్యంలో 6 గ్యారంటీల అమలుపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

మన తెలంగాణ 23 Feb 2026 10:02 pm

కోల్గేట్ టోటల్ ప్రచారకర్తగా రాహుల్ ద్రవిడ్

ముంబయి: నోటి సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కోల్గేట్`పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఒక కీలకమైన అడుగు వేసింది. క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను తమ ‘కోల్గేట్ టోటల’ బ్రాండ్ కొత్త అంబాసిడర్‌గా నియమించింది. ఈ భాగస్వామ్యం నోటి ఆరోగ్యం పట్ల ఉన్న పాత ఆలోచనలను మారుస్తోంది. నోటిని కేవలం శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా, అది మన దైనందిన పనితీరులో ఒక ముఖ్యమైన భాగమని ఈ ప్రచారం ద్వారా చెబుతున్నారు. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి శారీరక […] The post కోల్గేట్ టోటల్ ప్రచారకర్తగా రాహుల్ ద్రవిడ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 9:58 pm

విమానయాన రంగంలో అనాథ యువతకు శిక్షణ: మంత్రి సీతక్క

విమానయాన రంగంలో అనాథ యువతకు శిక్షణ ఇచ్చి వారి జీవితానికి భరోసా కల్పిస్తూ మంచి భవిష్యత్తు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనాథ పిల్లల నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనతో పాటు అంగన్వాడీ టీచర్ల వృత్తి నైపుణ్యాభివృద్ధి దిశగా పలు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ సంరక్షణలో, శక్తి సదన్‌లో ఉంటున్న ఉన్న అనాథ యువతకు విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందుకు జిఎంఆర్ ఎయిరో అకాడమి తో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం 2026 మార్చి నెల నుంచి శంషాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇచ్చి, ప్రైవేట్, అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొదటి విడతలో 20 మంది అనాథ యువతకు శిక్షణ అందించనున్నారని, ఆ తర్వాత బ్యాచ్‌ల వారీగా అర్హులందరికి శిక్షణ ఇస్తారని వివరించారు. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ ఎయిర్పోర్ట్ అథారిటీ హెడ్ కే.అనంతరామన్, ఆపరేషన్స్ హెడ్ ప్రీతి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా హాజరయ్యారు.

మన తెలంగాణ 23 Feb 2026 9:49 pm

టిజిఎస్ ఆర్‌టిసికి 1085 ఎలక్ట్రిక్ ఒలెక్ట్రా బస్సులు

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్‌టిసి)కి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజిఎల్ ) 1085 బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఒలెక్ట్రా సంస్థకు టిజిఎస్ ఆర్‌టిసి లెటర్ అఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) జారీ చేసింది. పిఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఈఎస్‌ఎల్ ) ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఓజిఎల్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ వాణిజ్య వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ సంస్థ తయారు చేసే బస్సులను ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఓజిఎల్ సరఫరా చేసే బస్సుల ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు సుస్థిర, పర్యావరణ హితమైన, సమర్ధవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను ఆర్‌టిసి అందించనుంది. పట్టణాలలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పిఎం ఈ డ్రైవ్ పథకం హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ రవాణా వ్యవస్థ దిశగా మరింత ముందుకు తీసుకెళ్ళనుంది. ఆర్‌టిసికి ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు ఉన్న లో ఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులో ఎసి , నాన్ -ఎసి బస్సులున్నాయి. స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించారు. బస్సు ముందు , వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తాయి. సుమారు 45 నిమిషాల్లో ఆపర్చునిటీ ఛార్జింగ్ సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. బస్సులో వీల్ చైర్ వినియోగదారులకు ప్రత్యేక స్థలం కేటాయించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓలెక్ట్రా దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ విభాగంలో ఈ ఆర్ధిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం లోనూ తొలిస్థానంలో నిలిచింది. సంస్థ కేవలం ఎలక్ట్రిక్ బస్సులే కాకుండా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడే ఎలక్ట్రిక్ టిప్పర్లను కూడా తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా 3,600కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఓలెక్ట్రా చేతిలో ప్రస్తుతం 10 వేల విద్యుత్ వాహనాల ఆర్డర్ ఉంది. సంస్థ వాహనాలు ఇప్పటివరకు 500 మిలియన్ గ్రీన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, కర్బన ఉద్గారాల తగ్గింపులో విశేష పాత్ర పోషిస్తున్నాయి. స్థానిక ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆపరేషనల్ విశ్వసనీయత, నిరంతర సాంకేతిక ఆవిష్కరణలతో ఒలెక్ట్రా దేశాన్ని కర్బన ఉద్గార రహితంగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా ఎండీ మహేష్ బాబు మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని, దేశ విద్యుత్ వాహన రంగంలో మా ప్రయాణానికి ఇది ఒక కీలక మైలురాయి అని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ దృష్టితో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలనే మా కట్టుబాటుకు పిఎం ఈ-డ్రైవ్ కార్యక్రమం కింద వచ్చిన ఈ ప్రతిష్టాత్మక ఆర్డర్ మరింత బలం చేకూర్చిందన్నారు. హైదరాబాద్ మా సంస్థ స్వస్థలం మాత్రమే కాదు, ఆవిష్కరణలకు ప్రతీక అని, టిజిఎస్ ఆర్‌టిసితో కలిసి సమర్థవంతమైన, సౌకర్యవంతమైన సుస్థిర ప్రజా రవాణా సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇది దేశం పర్యావరణ హితంగా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు.

మన తెలంగాణ 23 Feb 2026 9:42 pm

కాకతీయ యూనివర్సిటీలో చికెన్ కోసం గొడవ..కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు

 హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆదివారం లంచ్ తర్వాత చికెన్ మిగిలిపోయింది. ఈ చికెన్ పంపకాలలో రెండు గ్రూపుల మధ్య గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంబిఎ ఫస్టియర్, ఎకనమిక్స్ ఫస్టియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాటా మాటా పెరిగి కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కొందరు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం.

మన తెలంగాణ 23 Feb 2026 9:39 pm

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం..హోంగార్డు, యువతి మృతి

గరంలోని బంజారాహిల్స్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు, యువతి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం...సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సయ్యద్ హుస్సేన్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. విధులు ముగిసిన తర్వాత ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎపికి చెందిన యువతి అక్షిత ర్యాడ్ బూక్ చేయడంతో ఆమెను తీసుకుని బైక్‌పై బయలు దేరాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అక్షిత ఎపిలోని విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 23 Feb 2026 8:53 pm

fisheries strikes నిషేదిత అలివి వలలకు చెక్ Andhra Prabha News

fisheries strikes నిషేదిత అలివి వలలకు చెక్ Andhra Prabha News శ్రీశైలం

ప్రభ న్యూస్ 23 Feb 2026 8:44 pm

నో హెల్మెట్ … నో పెట్రోల్…

నో హెల్మెట్ … నో పెట్రోల్… టేకుమట్ల, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలు

ప్రభ న్యూస్ 23 Feb 2026 8:27 pm

Will Summer Biggies get Ticket Hike in Telangana?

Summer 2026 will witness the release of several biggies of Telugu cinema like Ustaad Bhagat Singh and Peddi. The High Court of Telangana made it clear that the permission for the ticket hikes in the state have to be applied 90 days prior to the release date of the respective film. This has been a […] The post Will Summer Biggies get Ticket Hike in Telangana? appeared first on Telugu360 .

తెలుగు 360 23 Feb 2026 8:24 pm

నిధులు మంజూరు చూయండి…

నిధులు మంజూరు చూయండి… కుంటాల, ఆంధ్రప్రభ : అభివృద్ధికి నిధులు మంజూరు చేసే

ప్రభ న్యూస్ 23 Feb 2026 8:23 pm

cbn bc spark : బీసీకి క‌త్తికి సాన‌ Amdhra Prabha insight Story

cbn bc spark : బీసీకి క‌త్తికి సాన‌ Amdhra Prabha insight

ప్రభ న్యూస్ 23 Feb 2026 8:22 pm

అకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగం

రెండు రోజులుగా వేసవి ఎండ రుచి చూసిన ప్రజలు సోమవారం ఒక్క సారిగా మారినఅకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగమయ్యారు. సోమవారం మద్యాహ్నాం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేసుకొని భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలలతో భారీ వర్షం కురవడంతో జిల్లా తడిచి ముద్దయ్యింది. కురిసిన అకాల వర్షంతో మామిడి చెట్లకు ఉన్న పూత రాలి పోయింది. అలాగే మండలంలో తెల్లబంగారం పండించిన రైతులకు ఇంకా కొందరు పత్తిని చెట్టు మీద నుండి తెంపక పోవడంతో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచిపోయి రైతులకు నష్టాన్ని చవి చూపించింది. గంట పాటు ఈదురు గాలులు వీస్తు వర్షకాలాన్ని తలపించే విధంగా ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం కురవడంతో ప్రయాణికులు, ప్రజలు తడిచి ముద్దయ్యారు. నీడలో నిలబడిన అన్ని ప్రక్కల నుండి వర్షం కురవడంతో ఒక్కసారిగా వర్షకాలం వాతావరణం ను తలిపించింది. ఈ అకాల వర్షం వల్ల కొందరు పత్తి పంట నష్టపోయో అవకాశాలు ఉన్నాయని, అలాగే మామిడి కాయల కాతకు కూడా ఇబ్బందులు తప్పవని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కోన్నారు. రెండు గంటల అనంతరం ఒక్క సారిగా వాతావరణంలో మళ్లీ మార్పులు చోటు చేసుకొని వేసవి వాతావరణాన్ని తలపింప చేయడం విశేషం.

మన తెలంగాణ 23 Feb 2026 8:22 pm

Nirmala Sitharaman and RBI Assure Stability as Gold and Silver Prices Climb

Finance Minister Nirmala Sitharaman and RBI Governor Sanjay Malhotra have sought to calm concerns over the recent surge in gold and silver prices. Both leaders said the government and the central bank are closely monitoring developments. They stressed that there is no immediate threat to economic stability. Speaking after the customary post Budget meeting with […] The post Nirmala Sitharaman and RBI Assure Stability as Gold and Silver Prices Climb appeared first on Telugu360 .

తెలుగు 360 23 Feb 2026 8:22 pm

మానకొండూర్ లో బిజెపి రాస్తారోకో

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.రామచంద్రరావు,కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అరెస్టులను నిరసిస్తూ మానకొండూర్ లో బిజెపి మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్,వరంగల్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మానకొండూర్ సిఐ సంజీవ్,పోలీస్ సిబ్బంది రాస్తారోకో చేస్తున్న పల్లె చౌరస్తాకు చేరుకుని బిజెపి నాయకులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మీస రమణయ్య, సొన్నాకుల శ్రీనివాస్, శీలం కుమార్ యాదవ్, మిరాల హరీష్ యాదవ్, మార్కొండ రమేష్, బలరాం, తిరుపతి, శ్రీనివాస్, అశ్విన్, రాజు, రాజయ్య, చందు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

మన తెలంగాణ 23 Feb 2026 8:14 pm

కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి

పిలోని రాజమండ్రిలో కల్తీ పాలు పెను విషాదాన్ని నింపాయి. నగరంలోని లాలాచెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగిన మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ళ శేషగిరిరావు, తాడి రమణి, తాడి కృష్ణవేణి, కనక రత్నం చనిపో యారు. అలాగే, మరో నలుగురు చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో స్థానికుల అస్వస్థత, మరణాలపై ఎపి సిఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. చౌడేశ్వరి నగర్‌లో ప్రజలు అనారోగ్యం పాలవ్వడం, పలువురు మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని అధికారులు సిఎం చంద్రబాబుకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిం చాలని చంద్రబాబు సూచించారు. ఇక, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని సిఎం చంద్రబాబుకి అధికారులు వివరించారు. పాలు వినియోగిం చిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. మిగి లిన అందరి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పాల నమూనాల్లో ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు.

మన తెలంగాణ 23 Feb 2026 8:06 pm

రాష్ట్ర స్థాయిలో నిలపాలి

రాష్ట్ర స్థాయిలో నిలపాలి ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలిప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై వాకబునిర్లక్ష్యం చేయద్దని

ప్రభ న్యూస్ 23 Feb 2026 7:59 pm

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్‌లో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సిఎం డైరీని ఆవిష్కరించిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 23 Feb 2026 7:57 pm

పసి పాపను చంపిన వారిపై చర్య తీసుకోవాలి…

పసి పాపను చంపిన వారిపై చర్య తీసుకోవాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : రెండు

ప్రభ న్యూస్ 23 Feb 2026 7:55 pm