Dimple Hayathi|రవితేజ హీరోయిన్ గ్లామర్ అదుర్స్
Dimple Hayathi| రవితేజ హీరోయిన్ గ్లామర్ అదుర్స్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : డింపుల్
జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక….
జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక…. దండేపల్లి,
Outpost |ఏసీబీ ఉచ్చులో ఇన్స్పెక్టర్, ఎస్సై..
Outpost | ఏసీబీ ఉచ్చులో ఇన్స్పెక్టర్, ఎస్సై.. Outpost | ఆంధ్రప్రభ, వెబ్
నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి..
నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కా మహబూబ్
మా ఓటమికి కారణం వాళ్లే.. హార్థిక్ కీలక వ్యాఖ్యలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేయగా.. ముంబై 9 వికెట్లు కోల్పోయి 123 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో తమ ఓటమి గురించి కెప్టెన్ హార్థిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటమికి తమ బౌలింగ్ యూనిటే కారణమని హార్థిక్ అన్నాడు. ‘‘మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి నుంచి మా భారీ షాట్లు ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మేం బౌలింగ్లోనే సరిగ్గా రాణించలేదు. నాతో సహా మా బౌలింగ్ బృందం మొత్తం విఫలమైంది. ఈ ఓటమికి బౌలింగ్ యూనిట్దే బాధ్యత. కనీసం ఐదు బంతులైనా.. సిక్సర్లు వెళ్లకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడు ముంబైకి పోరాడే అవకాశం లభించేది’’ అని హార్థిక్ తెలిపాడు. రాజస్థాన్ జట్టుపై హార్థిక్ ప్రశంసలు కురిపించాడు. ‘‘రాజస్థాన్ జట్టు గొప్పగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించినా.. వెనేకబడిపోయాం’’ అని అన్నాడు.
Dhurandhar Director is Clueless about his Next Project
Aditya Dhar is the new sensational director of India. With Dhurandhar and Dhurandhar: The Revenge ending up as huge money spinners, the entire nation is eager about his next film. Aditya Dhar is one director who is never in a hurry. Rumors say that he would team up with Tollywood actors like Ram Charan, Allu […] The post Dhurandhar Director is Clueless about his Next Project appeared first on Telugu360 .
నామినేషన్ దాఖలు.. సిఎం మమత ఎమోషనల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ను దాఖలు చేశారు. అంతకుముందు, కాళీఘాట్లోని తన నివాసం నుంచి అలీపూర్ సర్వే భవనం వరకు ఆమె రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత దీదీ.. భవానిపూర్ నియోజకవర్గంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నేను ఇక్కడే, భవానిపూర్లోనే పుట్టి పెరిగాను. నా జీవితంలో ప్రతీదీ ఇక్కడి నుంచి మొదలైంది అని మమత అన్నారు. భవానిపూర్ తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 294 స్థానాల్లోని తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆమె బావోద్వేగంతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాల నుండి అనేక పేర్లను తొలగించారని, అందులో అవకతవకలు జరిగాయని బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాల నుంచి ఇన్ని పేర్లను తొలగించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఓటర్ల జాబితాలను ఎందుకు స్తంభింపజేశారో నాకు అర్థం కావడం లేదు. దీనిపై మేము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామం అని బెనర్జీ అన్నారు. కాగా, భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై బిజెపి అభ్యర్థి సువేందు అధికారి మరసారి పోటీ చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో క్రీడాకారులకు
Leave Iran : ఇండియా అలెర్ట్ Andhra Prabha Mews
Leave Iran : ఇండియా అలెర్ట్ Andhra Prabha Mews ( ఆంధ్రప్రభ,
అన్నదానం కోసం విరాళాలు అందచేత…
అన్నదానం కోసం విరాళాలు అందచేత… బిక్కనూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గల
రంజని తండా ప్రజల 20 ఏళ్ల నిరీక్షణకు తెర
రంజని తండా ప్రజల 20 ఏళ్ల నిరీక్షణకు తెర కుబీర్, ఆంధ్రప్రభ :
ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు: ట్రంప్
న్యూయార్క్: ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్తో పాటు ఇతర దేశాలు కూడా శాంతి కోరుకుంటున్నాయని ట్రూత్ లో ట్రంప్ పోస్టు చేశారు. హర్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ క్లియరెన్స్కు అమెరికా సహకరిస్తుందని, ఇరాన్ తో చాలా సానుకూల చర్యలు కనిపిస్తున్నాయని ట్రంప్ వివరించారు. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. ఇరాన్పై దాడులకు ట్రంప్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాల పాటు దాడులు ఉండవన్న ట్రంప్ స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్ అంగీకారించడంతో 10 పాయింట్లతో ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఇరాన్ నియంత్రణలోనే హర్మూజ్ జలసంధి ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. టోల్ వ్యవస్థ ఏర్పాటు చేసి హర్మూజ్లో షిప్పుల నుంచి టోల్ వసూలు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. టోల్ ఫీజుతో వచ్చిన ఆదాయాన్ని ఇరాన్ పునర్నిర్మాణానికి ఖర్చు చేస్తామని ప్రకటించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.. ఇరాన్ శాంతి ఒప్పందం లెబనాన్, హెజ్బొల్లాకు వర్తించదని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. తక్షణమే ఇరాన్ను విడిచి వెళ్లిపోవాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. వీలైనంత త్వరగా బయటకు రావాలని విజ్ఞప్తి చేసింది. ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే ప్రయాణించాలని, అంతర్జాతీయ సరిహద్దులకు వెళ్లొద్దని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచనలు చేసింది.
వరుస ఓటములతో ఉన్న సిఎస్కెకి.. అనుకోకుండా మరో సమస్య..
ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే ప్రత్యర్థుల గుండల్లో గుబులు పుట్టేది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు గత సీజన్ నుంచి అత్యంత చెత్తగా ఆడుతుంది. 2025 సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే టేబుల్ చివరిస్థానంలో నిలిచింది. ఇక ఈ సీజన్ కూడా వరుస ఓటములతో సిఎస్కె సతమతమవుతుంది. గత సీజన్లో రుతురాత్కు గాయం కావడంతో ధోనీని కెప్టెన్ చేశారు. కెప్టెన్గా సుదీర్ఘ అనుభవం ఉన్న ధోనీ కూడా సిఎస్కెని గట్టెుక్కించలేకపోయాడు. అయితే ఈ సీజన్ల ఆరంభానికి ముందే సిఎస్కెకి షాక్ తగిలింది. గాయాల కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైన ధోనీ శనివారం ఢిల్లీతో సొంత మైదానం చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో తిరిగి జట్టులోకి వస్తాడని అంతా భావించారు. అతడు ఫిట్నెస్ టెస్టుకు హాజరుకాబోతున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఢిల్లీతో మ్యాచ్కి కూడా ధోనీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓ క్రీడా వెబ్సైట్ కథనం ప్రకారం.. ధోనీ కోలుకొని ఫిట్నెస్ సాధించడానాకి ఇంకావారం రోజులు సమయం పడుతుందిని తెలుస్తోంది. కెకెఆర్తో ఏప్రిల్ 14న జరిగే మ్యాచ్తో ధోనీ జట్టులోకి వస్తాడని సమాచారం.
ఆడబిడ్డ పెళ్లికి చేయూత.. సర్పంచ్ గున్నెళ్ళ శ్రీనునివాసులు వెల్దండ, ఆంధ్రప్రభ : మండల
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమాధాన పత్రాలు..
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమాధాన పత్రాలు.. మార్కుల కేటాయింపులో అవకతవకలు వద్దు..మూల్యాంకనంలో ఎలాంటి
Ys Jagan : జగన్ ప్రమాదకారి...భ్రమల్లో ఉంటే బాక్సులు గల్లంతేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ అనుభవం తక్కువయినప్పటికీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి
YSR Congress |‘మావిగన్’ ప్లాన్ బి ప్రతిపాదన
YSR Congress | ‘మావిగన్’ ప్లాన్ బి ప్రతిపాదన YSR Congress |
చిత్తూరులో వినతులు స్వీకరించిన చైర్మన్ జహార్
చిత్తూరులో వినతులు స్వీకరించిన చైర్మన్ జహార్ చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : షెడ్యూల్డ్
ఎండల్లో ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఎండల్లో ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కూలీలకు నీడ, నీరు, మెడికల్
సింగ్ నగర్లో ఆర్టీసీ కార్గో పార్శిల్ బుకింగ్ కౌంటర్..
సింగ్ నగర్లో ఆర్టీసీ కార్గో పార్శిల్ బుకింగ్ కౌంటర్.. పాయకాపురం, ఆంధ్రప్రభ :
AP |సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్న తల్లి-కూతురు
AP | సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్న తల్లి-కూతురు AP |
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట…
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట… గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి… బిక్కనూర్,
సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు..
సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు.. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం
Pawan Kalyan : మీరు లైట్ తీసుకుంటే.. వారు కూడా లైట్ తీసుకుంటారు సామీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా అంతు చిక్కడం లేదు
Kaleshwaram Row: Telangana HC Puts Verdict on Hold
The Telangana High Court has postponed its verdict in a set of writ petitions challenging the Justice PC Ghose Commission report. The matter, which includes a petition filed by former Chief Minister K Chandrashekar Rao, will now be taken up on April 22. The petitions seek to set aside the findings of the commission that […] The post Kaleshwaram Row: Telangana HC Puts Verdict on Hold appeared first on Telugu360 .
కర్నూలులో యువకుడి దారుణ హత్య… స్నేహితుల మధ్య మద్యం మత్తులో ఘర్షణ– ప్రాణాలు
: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ ఇరాన్ దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పోస్టును పంచుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని కోరింది.ఇరాన్లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా లేదా వారితో సమన్వయం చేసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రావొద్దని హెచ్చరించింది. ఈ […] The post ఇరాన్ను వెంటనే వీడండి appeared first on Visalaandhra .
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక పూజలు..
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక పూజలు.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Assault | కేసు నమోదు.. Assault | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Police Station |గరిటెతో దాడి చేసి హత్య
Police Station | గరిటెతో దాడి చేసి హత్య Police Station |
స్వామిపై అపార విశ్వాసం… మోకాళ్లపై 3,500 మెట్లు ఎక్కిన భక్తురాలు #Tirumala#LordVenkateswara#Bhakti
కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల కేసును విచారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమిషన్ భవితవ్యం ఏమిటన్నది తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం మరికొంత సమయం తీసుకుంది. ఈరోజు ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం, తుది తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం 2024 మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 6తో […] The post కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు appeared first on Visalaandhra .
కాంగ్రెస్లో మళ్లీ కలహాలా..? బస్సు సెంటర్ ప్రారంభోత్సవంలో చిచ్చు..వనపర్తిలో రాజకీయ వేడి ఇంకా
లాకప్ గదుల గోడలకే గనుక కళ్లుండి ఉంటే, నిందితులపట్ల కొందరు పోలీసులు ఎంతటి అమానుషంగా ప్రవర్తిస్తారో చూసి కంటనీరు పెట్టేవి. వాటికే గనుక శ్రవణశక్తి ఉంటే పోలీసుల చిత్రహింసలకు నిందితులు చేసే ఆర్తనాదాలు వినలేక చెవులు మూసుకుని ఉండేవి. నేరాభియోగంపై, కొండకచొ నిరపరాధులను సైతం నిర్బంధించి, విచారణ పేరిట హింసించి, పైశాచిక ఆనందం పొందే పోలీసుల సంఖ్య మన సమాజంలో తక్కువేమీ కాదు. ఇలాంటివారి వల్ల వృత్తికి అంకితమై, చట్టానికి బద్ధులై పనిచేసే పోలీసులు తలదించుకోవలసి వస్తోంది. ఓ లాకప్ డెత్ కేసుకు సంబంధించి మదురై అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తాజాగా వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోవిడ్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి దుకాణం తెరిచారన్న అభియోగంపై తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన సాత్తాంకుళం పోలీసులు వారిద్దరినీ వేధించి, వారి చావుకు కారణమైన వైనం ఎంతటి పాషాణ హృదయులనైనా కరిగించకమానదు. ఈ ఘటనకు కారణమైన తొమ్మిదిమంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం ద్వారా మదురై కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. హింసించి చంపడమే కాదు, తమ అమానుష కాండను మసిపూసి మారేడుకాయ చేసి, సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించిన తీరును గమనించి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారంటే సదరు పోలీసులు ఎంతటి ఆరితేరిన బంట్లో అర్థం చేసుకోవచ్చు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి, బట్టలూడదీసి, పైశాచికంగా దాడి చేశారనీ, లాకప్ గోడలకు అంటిన రక్తపు మరకలను నెత్తురోడుతున్న బాధితులతోనే కడిగించారని సదరు పోలీసుల అకృత్యాలను సిబిఐ తన 1500 పేజీల చార్జిషీట్ లో సవివరంగా కళ్లకు కట్టింది. దీనిని అరుదైన కేసులలో అత్యంత అరుదైనదిగా పేర్కొన్న న్యాయమూర్తి, యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడితే ఇలాంటి నేరగాళ్లకు భయం లేకుండా పోతుందని పేర్కొనడం ముమ్మాటికీ సత్యం. లాకప్ డెత్ అనే మాట నేటి సమాజంలో సర్వసాధారణమైపోయింది. దేశంలో ఎక్కడో ఒక చోట తరచూ లాకప్ మరణాలు సంభవిస్తూనే ఉన్నా, శిక్ష పడుతున్న దృష్టాంతాలు చాలా తక్కువ. శాంతిభద్రతల పరిరక్షణకు చట్టాలను ఎంత పటుతరంగా రూపొందించినా, వాటిని అమలు చేసే పోలీసు వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నేతల జోక్యం వంటి పలు కారణాల పుణ్యమాని, ఇప్పటికీ సామాన్యుడు పోలీసు స్టేషన్ గడప తొక్కేందుకు భయపడుతూనే ఉన్నాడు. సాత్తాంకుళం కేసును సిబిఐకి అప్పగించడం, స్టేషన్లో జరిగిన అరాచకపర్వంపై ఓ మహిళా కానిస్టేబుల్ కోర్టులో కళ్లకు కట్టినట్లుగా సాక్ష్యం చెప్పడం వంటివాటి కారణంగా ఈ కేసు నిలబడగలిగింది. సాధారణంగా ఇలాంటి కేసులలో పోలీసులు ‘ముందుజాగ్రత్తలు’ తీసుకుంటారు. సాత్తాంకుళం కేసులోనూ సిసి కెమెరాల ఫుటేజీని మాయం చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు మండిపడుతూ, సిసి కెమెరాల ఫుటేజీని భద్రపరచవలసిందిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తీర్పు వెలువడిన రోజే సర్వోన్నత న్యాయస్థానం పోలీస్ స్టేషన్లలో సిసి కెమెరాల ఏర్పాటు విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శిని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం యాదృచ్ఛికం కావచ్చు. కానీ, ఠాణాలలో జరిగే అరాచకాలను కళ్లకు కట్టేవి సిసి కెమెరాలే అనడంలో సందేహం లేదు. పోలీస్ కస్టడీలో హింసను అరికట్టేందుకు సుప్రీంకోర్టు 30 ఏళ్ల క్రితమే పోలీసులకు 11 మార్గదర్శకాలను జారీ చేసింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికి కూడా ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులు ఉంటాయని గుర్తు చేసింది. కానీ, అనేక సందర్భాలలో నిందితుడిని అదుపులోకి తీసుకునే పోలీసులు, అతని అరెస్టును చూపించరనేది జగమెరిగిన సత్యం. సాత్తాంకుళం కేసు తీర్పుతో అయినా ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు పాలకులు నడుం బిగించాలి. పోలీసులు మార్చలేని, సాక్ష్యాలను ఏమార్చలేని విధంగా ఠాణాల్లో సిసి కెమెరాల నిఘా పెట్టాలి. దీనిని అతిక్రమించే అధికారులకు భారీ జరిమానాలు విధించాలి. పోలీస్ స్టేషన్లలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు పౌర సమాజంలోని ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. అన్నింటికీ మించి, పోలీసుల మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చేలా, వారిలో మానవతావాద విలువలను ప్రోది చేస్తూ, బాధ్యతాయుతంగా మసలుకునేలా శిక్షణ గరపాలి. పోలీస్ కస్టడీలో హింస కొనసాగుతోందంటే కారణం చట్టాలు లేకపోవడం కాదు. వాటిని అమలు చేసే అధికారులలో చిత్తశుద్ధి లోపించడమే. సాత్తాంకుళం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిఉండవచ్చు గాక, కానీ, సామాన్య పౌరుడు నిర్భయంగా, నిస్సంకోచంగా పోలీస్ స్టేషన్ గడప తొక్కే రోజు వచ్చినప్పుడే ఈ కేసులో మృతులైన జయరాజ్, బెన్సిక్స్ల ఆత్మకు శాంతి కలుగుతుంది.
యుద్ధం చాలు అని ఇరాన్కు అనిపించింది: ట్రంప్
ఇరాన్, అమెరికా దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ప్రపంచ శాంతికి ఇది గొప్పరోజని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోందని పేర్కొన్నారు. ఇరాన్కు ఇక చాలు అనిపించిందని యుద్ధాన్ని ఉద్దేశించి అన్నారు. టెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చని సూచించారు.ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు అమెరికా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ జలసంధి మీదుగా అంతా సజావుగా […] The post యుద్ధం చాలు అని ఇరాన్కు అనిపించింది: ట్రంప్ appeared first on Visalaandhra .
అబద్ధం తెచ్చిన ఆర్థిక సంక్షోభం
పశ్చిమాసియా సంఘర్షణను కరోనాతో పోలుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భరోసా ఇచ్చే ఉద్దేశంతో చేసినవే కావచ్చు. కానీ అవి ప్రస్తుత ఆర్థిక ఒత్తిడి తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రమాదం ఉంది. స్పష్టమైన దేశీయ విధాన ప్రతిస్పందనతో కూడిన ప్రజారోగ్య సంక్షోభమైన మహమ్మారిలా కాకుండా, ఇది ముఖ్యంగా చమురు, వాణిజ్యం, వలసల ద్వారా లోతైన ఆర్థిక సంబంధాలున్న ఒక బాహ్య భౌగోళిక రాజకీయ సంక్షోభంగా గుర్తించాలి. పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగ నష్టాలను ఎదుర్కొంటున్న కార్మికులు, చిన్న వ్యాపారాలు, కుటుంబాల వాస్తవ జీవితాలకు, ‘అంతా బాగుంది’ అనే ప్రభుత్వ సందేశం అంతకంతకూ సంబంధం లేకుండా పోతున్నట్లు కనిపిస్తున్నది. చమురు, గ్యాస్ సంక్షోభం పర్యవసాన ప్రభావమే అత్యంత తక్షణ ఆందోళనకరంగా మారింది. ముడి చమురు, ఎల్పిజి దిగుమతులలో అధిక భాగం పశ్చిమాసియా నుండే వస్తున్నందున, భారతదేశం దానిపై ఎక్కువగా ఆధారపడటం నిర్మాణాత్మక బలహీనతలను బయటపెట్టింది. సరఫరా గొలుసులలో అంతరాయాలు ఇప్పటికే కర్మాగారాల మూసివేతకు దారితీశాయి. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ వంటి అధిక ఇంధన వినియోగం గల రంగాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. సూరత్లో దాదాపు సగం యూనిట్లు మూతపడటం, లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం అనేవి విడివిడి సంఘటనలు కావు. ఇవి విస్తృత పారిశ్రామిక మందగమనానికి ముందస్తు హెచ్చరిక సంకేతాలు. దీనికి తోడు ఎల్పిజి కొరత, ఉత్పత్తి దైనందిన జీవితంపై ప్రభావం చూపుతూ, గృహాలు, సంస్థలను ఖరీదైన లేదా కాలుష్య కారక ప్రత్యామ్నాయాలపై ఆధారపడేలా బలవంతం చేస్తున్నది. స్థూల ఆర్థిక సూచికలు ఈ పెళుసుదనాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. బలహీనపడుతున్న రూపాయి, తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఒక పెను సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. మూడీస్ రేటింగ్స్, ఇతర ఏజెన్సీల నివేదికలు, అధిక ఉత్పాదక వ్యయాలు, మందగించిన వినియోగం కారణంగా జిడిపి వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి విషయాలను సూచిస్తున్నాయి. ఈ ఒత్తిడి కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు. ఇది స్తంభించిపోయిన వేతనాలు, అధిక గృహ రుణాలు, అసమాన ప్రైవేట్ పెట్టుబడులు వంటి దేశీయ బలహీనతలను కూడా బయటపెడుతోంది. జిఎస్టి వంటి పరోక్ష పన్నులపై ఆధారపడటం కూడా ఆర్థిక సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ ఆదాయాలను మరింత అస్థిరంగా మారుస్తుంది. ఇది అత్యంత అవసరమైన తరుణంలో ద్రవ్యపరమైన వెసులుబాటును పరిమితం చేస్తుంది. అంతే ఆందోళనకరంగా, మానవ సంబంధిత అంశం కూడా వెలుగులోకి వస్తుంది. ఉద్యోగాలు కోల్పోవడం, పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిపోవడానికి కనిపిస్తున్న తొలి సంకేతాలు, మహమ్మారి సమయంలో చూసిన దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. దీనిని ముందుగానే పరిష్కరించకపోతే, ఇది కీలకమైన పట్టణ పరిశ్రమలను దెబ్బతీయడంతోపాటు గ్రామీణ దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అదే సమయంలో, గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలలో ఏ విధమైన మందగమనం అయినా, లక్షలాది భారతీయ కుటుంబాలకు కీలకమైన, జీవనాధారమైన, విదేశీ మారకపు ఖాతాకు స్థిరత్వాన్ని ఇచ్చే కారకమైన విదేశాల నుండి పంపే డబ్బు (రెమిటెన్స్) ప్రవాహాలకు ముప్పు కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే, ఈ సంక్షోభం కేవలం తాత్కాలిక అంతరాయం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక స్థితిస్థాపకతకు, విధాన సంసిద్ధతకు ఒక ఒత్తిడి పరీక్ష కూడా అని స్పష్టం అవుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లను విసురుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా పని చేస్తున్న తరుణంలో భారత్ బాహ్య, అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణల కారణంగా ప్రాంతీయ భద్రతా సమస్యలు తలెత్తాయని, దీంతో భారత్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత క్లిష్టంగా ఉండే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంఘర్షణను ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ముప్పుగా పరిణమించిన ఒక వ్యవస్థాగత ప్రకంపనగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత, అస్పష్టతను ఎదుర్కొంటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రభుత్వ అప్పులు పెరిగాయని మంత్రి చెప్పారు. గతేడాది ఆర్థికవృద్ధి 6.8శాతంగా ఉన్న మూడీస్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో వృద్ధి వేగం మందగిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందని మూడీస్ పేర్కొంది. యుద్ధం కారణంగా దీర్ఘకాలిక అంతరాయాలు ముఖ్యంగా ఎల్పిజి రవాణా కారణంగా భవిష్యత్తులో గృహాలకు ఎల్పిజి కొరత, అధిక ఇంధన, రవాణా ఖర్చులకు అలాగే దిగుమతి చేసుకున్న ఎరువులపై భారత్ ఆధారపడటంతో ఆహార ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అధిక ధరలు, పెరిగిన ముడి సరుకుల వ్యయాల మధ్య ప్రైవేట్ వినియోగం క్షీణించడం, స్థూల స్థిర మూలధన నిర్మాణం బలహీనం కావడం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం దృష్ట్యా 2026 -27లో వాస్తవ జిడిపి వృద్ధి రేటు గతంలో 6.8 స్థాయి నుండి తగ్గి 6 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేస్తున్నాం అని మూడీస్ నేవిక తెలిపింది. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణ్యం హెచ్చరించారు. యుద్ధం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా నిలిచిపోవడం వల్ల దేశ జిడిపి 1 శాతం పైగా పడిపోయి, ద్రవ్యోల్బణం 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఎంతో కాలం కొనసాగవని, చివరికి సామాన్యుడిపై ధరల భారం పడక తప్పదని విశ్లేషించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన స్తబ్దత ముప్పులో ఉందని పేర్కొన్నారు. భారీ అప్పుల కారణంగా ప్రభుత్వాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే శక్తి తగ్గిపోవడం ఈ సంక్షోభంలో మరో ప్రధాన ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉంది. రూపాయి విలువ పతనం కావడం కూడా విధానకర్తలకు ఒక గట్టి సవాలే కాగలదు. ఒక వంక దిగుమతుల బిల్లు గణనీయంగా పెరుగుతుండగా, దేశ ఆర్థిక పటిష్టతకు సూచికగా భావించే విదేశీ మారకం నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. మార్చి 27తో ముగిసిన వారం వ్యవధిలోనే భారత విదేశీ మారక నిల్వలు 10.29 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 95 వేల కోట్లు) తగ్గి 688.06 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వెల్లడించింది. అంతకుముందు వారంలో కూడా ఇవి 11.41 బిలియన్ డాలర్లు తగ్గడం ఆందోళనకరం. పశ్చిమాసియాలో చెలరేగిన ఉద్రిక్తతల ప్రభావం భారత రూపాయిపై తీవ్రంగా పడుతోంది. విదేశీ మారకం నిల్వలు అమాంతం కరిగిపోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ వేగంగా క్షీణిస్తుంది. దీనివల్ల విదేశాల నుండి మనం కొనుగోలు చేసే వస్తువులు ఖరీదవుతాయి. తద్వారా ముడి చమురు దిగుమతి ఖరీదు కావడంతో రవాణా ఖర్చులు పెరిగి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. యంత్రాల దిగుమతికి అవసరమైన విదేశీ కరెన్సీ లేక దేశ పారిశ్రామిక వృద్ధి మందగిస్తుంది. అంతిమంగా భారత రుణ పరపతి సామర్థ్యం దెబ్బతిని ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ పాతాళానికి పడిపోవడం, చమురు ధరలు అమాంతం పెరగడం భారతదేశ దిగుమతి బిల్లును తడిసిమోపెడు చేయనుంది. ప్రస్తుతం దిగుమతి బిల్లు ప్రస్తుతం రెండు వైపుల నుండి ముప్పును ఎదుర్కొంటోంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, మరోవైపు అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఓ దశలో 95 కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఈ రెండింటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభాన్ని ఒక గుణపాఠంగా భావించి, భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిందే. ప్రభుత్వం ఇంధన పన్నులను తగ్గించడం, సరఫరాలను దారి మళ్లించడం వంటి కొన్ని స్వల్పకాలిక చర్యలు తీసుకున్నప్పటికీ, ఇవి వ్యూహాత్మకంగా కాకుండా ప్రతి చర్యాత్మకంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభం నుండి గట్టెక్కడానికి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ నుండి తక్కువ ధరకే ఇంధన, ఎరువుల నిల్వలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాల్సి ఉంది. దేశీయంగా ఎక్సైజ్ సుంకాల కోత, సబ్సిడీల వంటి చర్యలు స్వల్పకాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ సుదీర్ఘ కాలం పాటు పెరిగిన భారాలను ప్రభుత్వం మోయలేదని గ్రహించాలి. చివరికి ఆ భారం సామాన్య వినియోగదారుడిపైనే వేయక తప్పదు. పారదర్శకమైన సమాచార మార్పిడి, బలహీన వర్గాలకు, కార్మికులకు లక్షిత ఉపశమనం, అస్థిరమైన బాహ్య వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక మధ్యకాలిక ప్రణాళిక అవసరం. ఇవి లేకుండా, వృద్ధి మందగించడమే కాకుండా, అధికారిక ఆశావాదానికి, ఆర్థిక వాస్తవికతకు మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉంది.
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. సులువుగా రైలు సదుపాయం
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ సామాజిక ముఖచిత్రంపై కొన్ని పేర్లు, ఇంటి పేర్లు అక్షరాలా పచ్చబొడిచిన అవమానాలు. ఒక వ్యక్తి పుట్టకతోనే ‘దొంగ’ అని, ‘ముష్టి’వాడని, ‘పశువు’ అని లేదా ‘అంటరానివాడని’ ముద్రవేయడం ఆధునిక నాగరికతకే సిగ్గుచేటు. శతాబ్దాల నాటి కుల అహంకారం, వర్ణ వివక్ష పెంచి పోషించిన ఈ ‘భాషా హింస’ను ఇంకా మోయడం అంటే మన ప్రజాస్వామ్య వైఫల్యమే. భారతీయ సమాజంలో మనం ఎన్నో సామాజిక సంస్కరణల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, ఇప్పటికీ కొన్ని వేల కుటుంబాలు తాము ధరిస్తున్న ‘ఇంటిపేర్ల’ కారణంగా అనుక్షణం మానసిక వేదనను, అవమానాన్ని అనుభవిస్తున్నాయి. కుక్కల, పందుల, లంజపెళ్లి, ముష్టి, వెలి వంటి అసభ్యకరమైన, వివక్ష పూరితమైన ఇంటిపేర్లు కేవలం పేర్లు మాత్రమే కాదు.. అవి ఒకనాటి అణచివేతకు మిగిలిన ఆనవాళ్లు. ‘పేరు’ అనేది కేవలం ఒక సంబోధన కాదు, అది ఒక మనిషి ఆత్మగౌరవ నినాదం. కానీ మన సమాజంలో కొన్ని ఇంటి పేర్లు ఆ వ్యక్తిని నిరంతరం కించపరిచేలా రూపొందించబడ్డాయి. జంతువుల పేర్లతో (కుక్కల, పందుల, గొర్ల, మందుల) మనిషిని పశువుగా చూడాలనే హీనమైన ఆలోచన నుంచి ఇవి పుట్టాయి. వృత్తిపరమైన అవమానం (ముష్టి, చాకలి, మంగలి)తో వృత్తినే కించపరిచేలా ఇంటిపేర్లుగా మార్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఆ వ్యక్తిని సమాజంలో నిరంతరం తక్కువ స్థాయిలోనే ఉంచడం. ఇంటి పేర్లు కొన్ని అసభ్యకరమైన పదజాలం (లంజపెళ్లి, గుద్దల, బరిబద్దల)తో వుండి అవమానకరంగా వుంటున్నాయి. ఇవి కేవలం పేర్లు కావు, ఆ కుటుంబాల స్త్రీ పురుషుల గౌరవాన్ని నిలువునా దహించే నిప్పుకణికలు. చారిత్రక కోణంలో చూస్తే, ఈ ఇంటిపేర్లు యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. ఒక వర్గాన్ని మానసికంగా దెబ్బతీయడానికి, వారిలో ఆత్మన్యూనతా భావాన్ని (Inferiority Complex) నరనరాల్లో నింపడానికి అప్పట్లో పెత్తందారీ శక్తులు చేసిన కుట్ర ఇది. చదువుకున్న మేధావులు, బుద్ధిజీవులు గుర్తించాల్సింది ఏంటంటే, భాష ద్వారా జరుగుతున్న ఈ హింస, శారీరక హింస కంటే భయంకరమైనది. ఒక విద్యార్థి తరగతి గదిలో తన ఇంటిపేరు చెప్పడానికి తడబడుతున్నాడంటే, అది ఆ పిల్లాడి బలహీనత కాదు, ఈ వ్యవస్థ రుద్దిన వైకల్యం. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ ‘గౌరవంగా జీవించే హక్కు’ (Article 21) ఉంది. కేవలం తాకకపోవడం మాత్రమే అంటరానితనం కాదు, ఒక వ్యక్తిని కులం పేరుతోనో, హీనమైన ఇంటిపేరుతోనో పిలవడం కూడా అంటరానితనమే. అయినప్పటికీ చట్టంగాని, అధికారులు గాని నామమాత్రంగానైనా ఆ వైపుగా ఆలోచన చేయకపోవడం అవమానకరమైన పేర్లను, ఇంటి పేర్లను కొనసాగాలని కోరుకోవడమే కాక మరొకటి కాదు. ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఎవరైనా తమ అగౌరవ ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటే, ఎలాంటి రుసుము లేకుండా, వారం రోజుల్లోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా డిజిటల్ వ్యవస్థను తీసుకురావాలి. కుల చిహ్నాలు లేని, ప్రకృతికి సంబంధించిన లేదా ఆదర్శనీయమైన పదాలను పేర్లుగా, ఇంటిపేర్లుగా ఎంచుకునే హక్కును పౌరులకు కల్పించాలి. ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం ‘నీ పేరులో గౌరవం ఉండాలి’ అనే నినాదంతో పౌరసమాజం పెద్ద ఎత్తున ఉద్యమించాలి. చదువుకున్న సమాజంలో కూడా ఇటువంటి పేర్ల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు హేళనకు గురవుతూ తమ ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు. ఈ సున్నితమైన అంశంపై సామాజిక చైతన్యాన్ని రగిలించే ఉద్దేశంతో, ప్రభుత్వాలు, మేధావులు ఈ సమస్యపై స్పందించి ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు పరచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలి. తక్షణమే ‘ఆత్మగౌరవ నామకరణ చట్టాన్ని’ తీసుకు రావాలి. అగౌరవకరంగా ఉన్న పేర్లను, ఇంటిపేర్లను మార్చుకోవడం కోసం ప్రత్యేక ‘నామకరణ సంస్కరణల బోర్డు’ ను ఏర్పాటు చేయాలి. అగౌరవకరమైన, అసభ్యకరమైన, కుల వివక్షతో కూడిన ఇంటిపేర్లు ఉన్నవారికి ఎటువంటి కోర్టు ఫీజులు, గెజిట్ జాప్యం లేకుండా కేవలం ఒక డిక్లరేషన్ ద్వారా తమకు నచ్చిన గౌరవప్రదమైన పేరును ఎంచుకునే హక్కును కల్పించాలి. ఆధార్ నుండి విద్యా ధ్రువపత్రాల వరకు అన్నింటిలోనూ ఉచితంగా మార్పులు చేసే వెసులుబాటు ఉండాలి. ఇంటి పేరు అనేది పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వమే కావచ్చు, కానీ అది అవమాన భారమైతే ఆ వారసత్వాన్ని వదిలేయడమే ధర్మం. గౌరవం లేని చోట సంప్రదాయానికి విలువ లేదు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి డబ్బో, భూమో కాదు.. సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేసే ఒక ‘గౌరవ ప్రదమైన పేరు’. ఈ అక్షర యుద్ధం ఆ ఇంటి పేర్ల వెనుక ఉన్న వివక్ష గోడలు కూలే వరకు సాగాలి. మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులారా.. మేల్కొనండి! మన అస్తిత్వం మన చేతుల్లోనే ఉండాలి. అగౌరవ పేర్ల సంకెళ్లను తెంచుకుందాం.. రేపటి తరం తన పేరును గర్వంగా ఉచ్ఛరించేలా నేడే ఈ అక్షర యుద్ధాన్ని ప్రారంభిద్దాం! మనిషిని మనిషిగా గౌరవించే, కుల చిహ్నాలు లేని ఒక నూతన ఆత్మగౌరవ సమాజాన్ని నిర్మించుకుందాం. విశ్వజంపాల 77939 68907
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడం వల్లే…కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
అత్యవసర ద్వారాన్ని మూసేశారు.. అందుకే 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు ప్రయాణికుల ప్రాణాల మీదకు ఎలా వస్తున్నాయో వివరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సంచలన నివేదికను వెల్లడించింది. గతేడాది అక్టోబరులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో అగ్నిప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవదహనమైన ఘటనపై రవాణాశాఖ ఆదేశాల మేరకు ఆస్కీ సమగ్ర […] The post Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడం వల్లే… కర్నూలు బస్సు ప్రమాదంపై ASCIనివేదిక appeared first on Visalaandhra .
చరిత్రలో కొన్ని తేదీలు ముగింపులను సూచిస్తాయి.. మరి కొన్ని తేదీలు ప్రశ్నలను మిగులుస్తాయి. మార్చి 31, 2026.. మావోయిజం అంతమవుతుందన్న ప్రభుత్వ ఆశయానికి గడువు. కానీ అదే తేదీ, ఒక వ్యక్తి నిర్ణయంతో మరోసారి ఆ ఆలోచనను ప్రశ్నార్థకం చేసింది. అడవుల్లో నిశ్శబ్దంగా ఉన్న ఒక గళం, ఇంకా ముగియలేదు అని వినిపించినట్లైంది. ఆ గళం.. ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి. ఇది కేవలం ఒక వ్యక్తి లొంగిపోలేదనే వార్త కాదు. ఇది ఒక సిద్ధాంతం ఇంకా శ్వాసిస్తోందని చెప్పే సంకేతం. ఒక గన్ ఇంకా నేలపై పడలేదనే నిజం. ఒక మనిషి తన నమ్మకాన్ని చివరి వరకు వదలకపోవడంలో ఉన్న మౌన గర్జన. గణపతి కథను మనం చదివితే, అది ఒక విప్లవ నాయకుడి చరిత్ర మాత్రమే కాదు.. ఒక గురువు మనసులో జరిగిన విరుద్ధాల సంగ్రామం. ఒకప్పుడు బ్లాక్బోర్డ్ ముందు నిలబడి జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అని చెప్పిన వ్యక్తి, తర్వాత అడవిలో తుపాకీతో సమాజాన్ని ఎలా మార్చాలి అని నమ్మడం.. ఇది సాధారణ మార్పు కాదు. ఆ మార్పుకు కారణం కాలమే. 1970లలో గ్రామీణ తెలంగాణలో ఉన్న అన్యాయం, అసమానతలు, అణచివేత.. అవి ఒక ఉపాధ్యాయుడి హృదయంలో గాయాలుగా మిగిలాయి. పుస్తకాలలో చెప్పే న్యాయం, వాస్తవ జీవితంలో కనిపించకపోవడం ఆయనను కలచివేసింది. చివరకు, అక్షరాల మీదున్న విశ్వాసం ఆయుధాల మీదికి మళ్లింది. అక్కడే ‘లక్ష్మణ్ రావు’ చరిత్ర ముగిసింది.. ‘గణపతి’ యుగం ప్రారంభమైంది. మావోయిస్టు ఉద్యమం ఒక శక్తిగా నిలబడటంలో గణపతి పాత్ర అసాధారణం. పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసిసి విలీనంతో ఏర్పడిన సిపిఐ (మావోయిస్ట్) పార్టీకి ఆయన ఆత్మవిశ్వాసం, వ్యూహం, దిశ ఇచ్చారు. గెరిల్లా యుద్ధంలో ఆయన చూపిన పటిమ, అడవుల్లో ఆయన నిర్మించిన వ్యవస్థ, ఇవి కేవలం ఒక నాయకుడి ప్రతిభ కాదు, ఒక ఉద్యమానికి వెన్నెముక. కానీ ప్రతి శిఖరం తర్వాత పతనం తప్పదు. కాలం మారింది. ప్రభుత్వ వ్యూహాలు కఠినమయ్యాయి. అభివృద్ధి అడవుల్లోకి చేరింది. గన్స్ కంటే రోడ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు ప్రజల జీవితాల్లో స్థానం సంపాదించాయి. మార్చి 31.. ప్రభుత్వం నిర్ణయించిన గడువు. ఆ తేదీతో చాలామంది ఆయుధాలు కిందపెట్టి కొత్త జీవితాన్ని ఎంచుకున్నారు. కొందరు మార్పును అంగీకరించారు, కాలంతో కలిసిపోయారు. కానీ గణపతి మాత్రం మౌనంగా నిలిచిపోయారు. ఆ మౌనం సాధారణ నిరాకరణ కాదు... అది ఒక లోతైన అంతర్గత సంఘర్షణ. ఒక వైపు జీవితం.. లొంగిపోతే ప్రాణం నిలుస్తుంది, కొత్త దారులు తెరుచుకుంటాయి. మరో వైపు సిద్ధాంతం.. లొంగిపోకపోతే ఆశయం నిలుస్తుంది, నమ్మకం బతుకుతుంది. ఈ రెండింటి మధ్య నిలబడి, తన గమ్యాన్ని తానే ఎంచుకోవాల్సిన ఆ క్షణం.. అదే గణపతి కథలో కీలక మలుపు. ఇది కేవలం ఒక నిర్ణయం కాదు.. ఒక మనిషి తన ఆత్మతో చేసుకున్న తీర్పు. గణపతికి లొంగిపోవడం అంటే కేవలం తుపాకీని నేలన పడివేయడం కాదు.. అది తన జీవితాన్నే, తన ప్రయాణాన్నే ప్రశ్నించడం. దశాబ్దాలుగా తనను నమ్మి అడవుల్లో అడుగులు వేసిన, ప్రాణాలను పణంగా పెట్టిన వేలాది మంది కేడర్కు ఆయన ఏమి సమాధానం చెబుతారు? నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం ఆయనకు కేవలం మాట కాదు.. అది ఒక యుగాన్ని తిరస్కరించడమే. అక్కడే ఆయన ఆగిపోయాడు. ఆ ఆగిపోవడంలో మొండితనం కనిపించవచ్చు... కానీ అదే సమయంలో అది ఒక అచంచల నిబద్ధతగా కూడా కనిపిస్తుంది. అది తప్పు కావచ్చు... కానీ అదే సమయంలో అది ఒక త్యాగస్ఫూర్తి ప్రతిబింబం కూడా కావచ్చు. గణపతి వ్యక్తిత్వం లోపల నిజానికి రెండు ప్రపంచాలు సహజీవనం చేస్తున్నాయి. ఒకవైపు, పిల్లల భవిష్యత్తు కోసం కలలు కనే, అక్షరాలతో జీవితాలను వెలిగించాలని ఆశించిన ఉపాధ్యాయుడు. మరోవైపు, అసమానతలను చెరిపేయాలంటే ఆయుధమే మార్గమని నమ్మిన విప్లవకారుడు. నేడు ఆయన తీసుకున్న నిర్ణయం చూస్తే, ఆ విప్లవకారుడే పైచేయి సాధించినట్లు అనిపిస్తుంది. అయినా, ఆ గురువు ఆలోచించే మనసు ఆయనలో ఎక్కడో మౌనంగా ఇంకా జీవిస్తూనే ఉందనే భావన మనసును విడిచిపెట్టదు. గణపతి గన్ వదలకపోవడం వల్ల ఉద్యమం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటుందా అన్నది సందేహమే. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఒక లోతైన సత్యాన్ని మన ముందుంచుతోంది.. సిద్ధాంతాలను శక్తితో అణచివేయవచ్చు, కానీ పూర్తిగా అంతమొందించలేం. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి అనే ఆయుధంతో అడవిని, అక్కడి మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు గణపతి తన అచంచల నమ్మకంతో, తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రెండింటి మధ్య జరుగుతున్నది కేవలం ఒక పోరాటం కాదు.. ఒక దార్శనిక ఘర్షణ. ఒకటి మార్పును నిర్మించాలనుకునే శక్తి.. మరొకటి మార్పు కోసం పోరాడిన ఆత్మ. ఈ సంఘర్షణ ఇంకా ముగియలేదు.. అది ముగిసే వరకు, ఈ ప్రశ్న కూడా సమాధానం కోసం సమాజాన్ని వెంటాడుతూనే ఉంటుంది. అడవిలో ఎక్కడో నిశ్శబ్దంగా నిలిచిన తుపాకీ, శబ్దం చేయకపోయినా ఒక అర్థాన్ని చెబుతోంది.. ఓటమి కాదు, ఇంకా ముగియని కథ. ఆ నిశ్శబ్దంలో వినిపిస్తున్నది గర్జనే.. అది ఒక వ్యక్తి మొండితనం కాదు, ఒక నమ్మకం చివరి శ్వాస వరకు నిలబడాలనే సంకల్పం. మార్పు అంటే ఏమిటి? అనే ప్రశ్న అక్కడ గాలిలో తేలుతోంది. అది లొంగిపోవడమా? లేక అంతిమ క్షణం వరకు ఆశయాన్ని గట్టిగా పట్టుకోవడమా? ఈ ప్రశ్నకు సమాధానం గణపతి ఒక్కడి చేతుల్లో లేదు. అది సమాజం ఆలోచనల్లో ఉంది. అభివృద్ధి దారిలో నడుస్తున్న ప్రపంచం ఒక వైపు ఉంటే, అసమానతలతో పోరాడే ఆలోచన మరో వైపు నిలబడి ఉంది. చివరికి, గన్ మౌనంగా మారవచ్చు.. కానీ ఆలోచనలు ఎప్పటికీ మౌనమవ్వవు. అడవిలో వినిపిస్తున్న ఆ గర్జన.. మన సమాజం ఇంకా పూర్తి సమాధానాన్ని కనుగొనలేదని గుర్తు చేస్తూనే ఉంటుంది. కాలగిరి శ్రీనివాస్ రెడ్డి
Indian Courts Not Bound by Foreign Orders, Rules AP High Court
The Andhra Pradesh High Court has stated that foreign court orders do not have binding authority over Indian courts, especially in matters involving child custody. The court emphasized that India’s judicial system operates independently and cannot be influenced by observations made by courts in other countries. The case involved a software engineer from Guntur district […] The post Indian Courts Not Bound by Foreign Orders, Rules AP High Court appeared first on Telugu360 .
ఏసీబీకి పట్టుబడ్డ మండల ఇన్చార్జి విద్యాధికారి…
ఏసీబీకి పట్టుబడ్డ మండల ఇన్చార్జి విద్యాధికారి… మహబూబాబాద్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా
మద్యం ప్రియులకు షాక్… మే నుంచి మద్యం, ధరలు పెరిగే అవకాశం #LiquorPrices #BeerPriceHike #AlcoholRates
యువకుని ఆత్మహత్య చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల
Harish Rao |కాళేశ్వరం నిర్వహణపై తీవ్ర విమర్శలు
Harish Rao | కాళేశ్వరం నిర్వహణపై తీవ్ర విమర్శలు Harish Rao |
Amarvathi : దీపం వెలిగించగానే సరిపోదు.. హైదరాబాద్ తో పోల్చుకోవడం వృధానే...?
అమరావతి నిర్మాణం అంత సులువు కాదు
ఆడుదాం ఆంధ్ర లో అవినీతి.. నిర్ధారణ
ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి… సిపిఎం నాయకులు లావేరు, ఆంధ్రప్రభభ : అకాల
Gold |పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold | పెరిగిన బంగారం, వెండి ధరలు Gold | ఆంధ్రప్రభ, వెబ్
dd vs gt| గెలుపెవరిదో? ఢిల్లీ వర్సెస్ గుజరాత్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటును మార్చడం లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనూహ్య సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురు […] The post వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్ appeared first on Visalaandhra .
ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు అలెర్ట్
ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులకు అలెర్ట్ జారీ చేశారు
నేరడి నోటిఫికేషన్ చరిత్రాత్మకం ..
నేరడి నోటిఫికేషన్ చరిత్రాత్మకం .. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు…ముఖ్యమంత్రితో భేటీ అయిన
విశాఖ మౌనిక హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
జాగృతి నాయకుడు కూర సురేష్ గంభీరావుపేట ఏప్రిల్ 08 (జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లక్ష్మిపూర్ తండా. నాగంపేట దమ్మన్నపేట తో పాటు పలు …
Deputy CM |బొట్టు తుడిచేశారన్న ఆరోపణలు..
Deputy CM | బొట్టు తుడిచేశారన్న ఆరోపణలు.. Deputy CM | ఆంధ్రప్రభ,
First Look: Allu Arjun as Raaka
Icon Star Allu Arjun is shooting for Atlee’s film and nothing from the film (genre or title) has been leaked. The film’s first look title poster is released today. The film is titled Raaka and Allu Arjun’s look from the film is sensational. With his half face unveiled, Allu Arjun sports a bald look for […] The post First Look: Allu Arjun as Raaka appeared first on Telugu360 .
Repo Rate Unchanged : రెపో రేటు యథాతథం Andhra Prabha News
Repo Rate Unchanged : రెపో రేటు యథాతథం Andhra Prabha News
ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి
బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ డిమాండ్ గంభీరావుపేట ఏప్రిల్ 08 (జనం సాక్షి)భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల పార్టీ …
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.. సరోజినీ ఏజెన్సీ కార్మికులు.. గంభీరావుపేట ఏప్రిల్ 08(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో …
గట్టుప్పల, ఏప్రిల్8 (ఆంధ్రప్రభ): గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన పగిళ్ల స్వామి ఇటీవల
ఎమ్మెల్యే ను కలిసిన అల్లిపూర్ పాలకవర్గ సభ్యులు
జనం సాక్షి రాయికల్ :జగిత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసిన అల్లిపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు అల్లిపూర్ గ్రామంలో సిసి …
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు ఉర్దూ పాఠశాలలో ఆకట్టుకున్న వార్షికోత్సవ వేడుకలు ఊట్కూర్,
గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర
గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం
అంతరిక్షంలో అరుదైన దృశ్యాలు తొలిసారిగా భూ అస్తమయం! #Artemis2 #Space #NASA #Moon #Eclipse #Astronomy
Telangana : కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు వాయిదా
కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ను వాయిదా వేసింది.
Amaravathi : అమరావతి పనుల పురోగతిపై సమీక్ష
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు
Hastinapuram | ముగ్గురు మృతి.. Hastinapuram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Iran - America War : ఇరాన్ - అమెరికా చర్చలు సఫలమవుతాయా? ట్రంప్ ఏమంటున్నారు?
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణపై ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి.
Nani’s Mass Anthem Aaya Sher Fastest 100 M Milestone
Natural Star Nani’s upcoming mass period drama The Paradise is gearing up for its theatrical release on August 21st. The film, directed by Srikanth Odela, has been in the spotlight ever since the glimpse was released. But the first single Aaya Sher has further intensified the buzz. The number has now smashed a remarkable milestone […] The post Nani’s Mass Anthem Aaya Sher Fastest 100 M Milestone appeared first on Telugu360 .
ఇంటికి చేరగానే.. కంపెనీపై డ్రోన్ దాడి #GulfWorkers #Telangana #WarImpact #IndianWorkers
మెహదీపట్నంలో గరిటతో కొట్టడంతో బాలుడు మృతి
హైదరాబాద్: భాగ్యనగరంలోని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకి లో నైస్ జ్యూస్ సెంటర్ లో ఓ బాలుడు హత్యకు గురయ్యాడు. నైస్ జ్యూస్ సెంటర్ లో బీహార్ కు చెందిన మోఫిల్ (19), దుర్వేశ్ (16) పని చేస్తున్నారు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన మోఫిల్ ఒక గరిట తీసుకొని దుర్వేశ్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.
టిప్పర్లకు అనుమతి లేదు.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
Dalal Street Rally : దలాల్ స్ట్రీట్ … సందదే సందడి Andhra Prabha News
Dalal Street Rally : దలాల్ స్ట్రీట్ … సందదే సందడి Andhra
Peddi Team Holding Talks with Netflix
It is almost official that Ram Charan’s upcoming film Peddi will not hit the screens as per the plan on April 30th. The team will announce the news about the postponement soon so that other Telugu films can utilize the long weekend of May day and plan a proper summer release. But what is stopping […] The post Peddi Team Holding Talks with Netflix appeared first on Telugu360 .
యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తాబా ఖామేనీ
తెహ్రాన్: అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం మొజ్తాబా కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం మొజ్తాబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెళ్లడించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే… పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తాం’ […] The post యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తాబా ఖామేనీ appeared first on Visalaandhra .
Telangana : కల్యాణ మస్తుకి అర్హతలివే.. తులం బంగారం.. లక్ష నగదు ఎవరికో తెలుసా?
తెలంగాణలో కల్యాణమస్తు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది
ఏకలవ్య హాస్టల్ పై ఎమ్మార్వో బాలయ్య అకస్మిక తనిఖీ.
మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం.. ఏప్రిల్ 7 (జనం సాక్షి ) : ఇందల్వాయిఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్ను …
Telangana : రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొంటాం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
Telangana : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
ఎన్నికల బరిలో సంపన్నురాలు లీమారోస్
లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్ధి కుటుంబ ఆస్తుల విలువ రూ.ఆరు వేల కోట్లు ఆర్కేనగర్ (చెన్నై): రాజకీయాలు చాలా ప్రియం అవుతున్నాయి. సామాన్యులు అందుకోలేనంత స్థాయికి చేరాయి. దేశంలోని రాజకీయ పార్టీలు ధనవంతులవైపే మొగ్గు చూపుతున్నాయి. బయటకి చెప్పకపోయినా నీ ఆస్థి ఎంత, నీవెంత ఖర్చు చేయగలవు అనే అంటున్నాయి దాదాపు అన్ని పార్టీలు… ఒక్క వామపక్ష పార్టీలు తప్పా. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్లు, సంపన్నులే రాజకీయాల్లోకి వస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి […] The post ఎన్నికల బరిలో సంపన్నురాలు లీమారోస్ appeared first on Visalaandhra .
హస్తినాపురంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు బీటెక్ విద్యార్థులతో మరో వ్యక్తి మృతి
ఎల్ బి నగర్: రంగారెడ్డి జిల్లా ఎల్ బినగర్ ప్రాంతం సాగర్ రింగ్ రోడ్డుకు సమీపంలో హస్తినాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇద్దరు బీటెక్ విద్యార్థులతో పాటు మరో వ్యక్తిగా గుర్తించారు. కారు అతివేగంగా దూసుకొచ్చి బైకును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహావీర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
గచ్చిబౌలిలో హైడ్రా భారీ ఆపరేషన్
గచ్చిబౌలిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది
ఐ ద్వారా సృష్టించిన వీడియోను చిరుత ట్రైన్ లో నిద్రపోతున్న వారిపై దాడి చేసిందంటూ
“మీ అందరికీ అందమైన అల్లుడిని తీసుకొచ్చాను” రష్మిక #RashmikaMandanna #VijayDeverakonda
తమిళనాడులో అత్యంత సంపన్న అభ్యర్థి ఎవరంటే?
తమిళనాడులో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది
గ్యాస్ దొంగతనం.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆర్ వీఎస్ కాంప్లెక్స్
Road Accident : మద్యం తాగి.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాడుగా?
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
10 Point Iran Plan : ఇరాన్ 10 కమాండ్మెంట్స్ Andhra Prabha News
10 Point Iran Plan : ఇరాన్ 10 కమాండ్మెంట్స్ Andhra Prabha
బేగంపేటలో పైలట్ శిక్షణ విద్యార్థినిపై సహోద్యోగి అత్యాచారం
హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. పైలట్ శిక్షణ విద్యార్ధినిపై సహోద్యోగి అత్యాచారం చేశాడు. కేరళకు చెందిన యువకుడు పైలట్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. అదే విభాగంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై అతడు అత్యాచారం చేశాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

36 C