మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలు లు భీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఈదురు గాలుల తో కూడిన వర్షానికి యాసంగి పంటలు గోధు మ, మొక్కజొన్న పంటలు నేలకొరిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డా యి. అర్లి సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జోరుగా కురిసిన వర్షానికి అర్లి, అంతర్గావ్, గోమూత్రి, గుబిడి గ్రామాల్లో కోతకు వచ్చిన యాసంగి పంటలు చేతికి అందకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అకాల వర్షంతో జన జీవనం ఒక్కసారిగా స్తంభించింది. ఉరుములు మెరుపులతో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కాళేశ్వరంలో గాలి వానకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో తీగలు తెగిపడ్డాయి. ఊహించని వర్షం కారణంగా మిర్చి పంట సాగు చేస్తున్న రైతులు పంట నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు.మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లోని చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పట్టణమంతా విద్యుత్ నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపుల హోరుతో ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉష్టోగ్రతలు పడిపోయాయి. నగరంలోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, గాంధీనగర్, అంబర్పేట్, బర్కత్పురా, చంపాపేట్, సైదాబాద్, కర్మన్ఘాట్, అబిడ్స్, బషీర్బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులు మేడ్చల్ జిల్లాలో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. వేగంగా ఈదురు గాలులు వీచి భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ పరిసరాలైన హయత్నగర్,పెద్ద అంబర్పేట్ లాంటి పలు చోట్ల వాన చినుకులు నేలను తాకాయి. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిర్మల్లో వడగళ్ల వాన జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో మామిడి కాయలు రాలాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో వడగళ్ల వాన కురిసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోనూ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ ఈదురు గాలులతో వాన కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులు జలమయం కావడంతో వాహదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మరాత్వాడ వరకు ద్రోణి ఒకటి సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం వరకు ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో మరొక ద్రోణి ఈరోజు ఏర్పడినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం ఆదివారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలోని తీవ్ర అల్పపీడన ప్రాంతం నుంచి మధ్య తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు బలహీన పడినట్లు తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్ధపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులతో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలలతో భారీ వర్షం కురవడంతో మంచిర్యాల జిల్లా తడిచి ముద్దయ్యింది. కురిసిన అకాల వర్షంతో మామిడి చెట్లకు ఉన్న పూత ఒక్క సారిగా రాలి పోవడంతో ఇక మామిడి కాయల పరిస్థితి కష్టంగా మారింది. అలాగే మండలంలో తెల్లబంగారం పండించిన రైతులకు ఇంకా కొందరు పత్తి ని చెట్టు మీద నుండి తెంపక పోవడంతో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచిపోయి రైతులకు నష్టాన్ని చవి చూపించింది.
Producer Venkat Boyanapalli heartfelt wishes to Nani
Natural Star Nani has earned a great name for his friendly and respectful nature. While he has earned the image of being a versatile actor, more than that, he proved to be a man with character of gold. On his birthday, producer Venkat Boyanapally of Niharika Entertainment, specially wished him with a touching note. It […] The post Producer Venkat Boyanapalli heartfelt wishes to Nani appeared first on Telugu360 .
మంగళవారం రాశి ఫలాలు (24-02-2026)
మేషం చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృషభం కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు. మిధునం నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కర్కాటకం దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. _ సింహం దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కన్య సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. తుల నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృశ్చికం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు. ధనస్సు ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు. మకరం నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. కుంభం దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మీనం వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరవకముందే ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది.సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పరిధిలోని సురభి ప్రైవేటు మెడికల్ కాలేజీ లో ఇటీవల కాలంలో జరిగిన వరుస సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత కొంత కాలంగా సురభి ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో జరుగుతున్న సంఘటనలపై యాజమాన్యం తీరు చర్చానీయాంశంగా మారింది.రెండు రోజుల క్రితం కాలేజీ హాస్టల్లో ఫిజియోథెరపి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ శ్రీజ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన శవాన్ని మార్చురికి తరలించి చేతులు దులుపుకోవడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ శ్రీజను చదివిస్తుండగా హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడిన అందుకు కారణాల పై కళాశాల యాజమాన్యం నోరు మెదపక పోవడం అనుమనాలకు తావిస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే శ్రీజ ఆత్మహత్యకు పాల్పడిందనే కళాశాల యాజమాన్యం పేర్కొంటూ పోలీసులు విచారిస్తున్నారని చెప్పడాన్ని విద్యార్థి సంఘాలు మృతురాలి బందువులు తప్పు బడుతున్నారు.గతంలోనే ఒక మెడికో కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైతం సంచలనం సృష్టించినా యాజమాన్యం మాత్రం పట్టిపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. సురభీ మెడికల్ కాలేజీపై హెచ్చార్సీ ఆగ్రహం : సిద్ధిపేటలోని సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యా సంస్థ పై హెచ్ ఆర్సీ ఛైర్మెన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన నాలుగు నెలల క్రితమే చోటుచేసుకుంది. సిద్ధిపేటలోని సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో విద్యను అభ్యసించిన సమయంలో తాను సమర్పించిన ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లను కాలేజి యాజమాన్యం నిలిపివేయడంతో, తాను పీజీ ప్రవేశానికి గడువులోపు ఆన్లైన్ అప్లోడ్ చేయలేకపోయానని డాక్టర్ మెరుగు కార్తిక్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ అతనికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అదేశించినప్పటికి, ఇవ్వకపోవడమే కాకుండా, కమిషన్ సమన్లకు కూడా హాజరు కానందన కాలేజ్ ఛైర్మన్, ప్రిన్సిపల్పై బెయిలబుల్ వారెంట్ జారీ కి ఆదేశించింది. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం : కొద్ది నెలల క్రితం సురభి మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయికృష్ణ అనే విద్యార్థిని అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ర్యాగింగ్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.మెడికో సాయికృష్ణ దేవుడి మొక్కు కోసం గడ్డం పెంచుకోవడం పై ర్యాగింగ్ చేస్తూ గడ్డం తీయించారు. ఈ విషయమై యాంటీ ర్యాగింగ్ కమిటీకి విద్యార్థి సాయికృష్ణ ఫిర్యాదుచేసిన యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థి ఏకంగా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై యాజమాన్యం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని కొందరు విద్యార్థులపై కొద్ది కాలంపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంది.. అనుమతులు లేకుండా నిర్మాణాలు : సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇరవై ఎకరాల్లో నిర్వహిస్తున్న సురభీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరపడంపై సామాజిక కార్యకర్త జి.చక్రధర్ గౌడ్ హై కోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఆర్డర్ ను జారీ చేసింది. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అనధికార నిర్మాణాలపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత ఉన్నతాధికారులకు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజకీయ అండదండలే కారణం...? : రాజకీయ అండదండలతోనే సురభీ మెడికల్ కాలేజీ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ విద్యార్థుల ఆత్మహత్యలైనా, ర్యాగింగ్ , అక్రమ నిర్మాణాల పై ఆరోపణలు వచ్చినా ఎలాంటీ చర్యలు లేక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఆరు నెలలుగా వరుస సంఘటలను చూస్తుంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షకులను తయారు చేసే మెడికల్ కాలేజీలో నిబందనలకు తూట్లు పోడుస్తున్నా అధికారులు చోద్యం చూడటం పట్ల పులువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘటనలపై మీడియాలో వార్తలు వచ్చినా అధికారులు చర్యలు చేపట్టక పోవడం రాజకీయ అండదండలే కారణమని భావిస్తున్నారు. ఏది ఏమైనా వరుస సంఘటనలపై అధికారులు విచారణ జరపాలనే డిమాండ్ విసృ్తతమవుతోంది. ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు : మెడికల్ కళాశాల డిఎన్ డాక్టర్ రఫీ సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని కళాశాల డిఎన్ మహమ్మద్ రఫీ తెలిపారు. విద్యార్థిని శ్రీజ ఆత్మహత్యకు సంబంధించిన వివరణ కోరగా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంఏకసభ్య కమిషన్కు సుప్రీం గ్రీన్సిగ్నల్
. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత. ఒక విచారణ మరో దానిపై ప్రభావం చూపదని స్పష్టీకరణ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక విచారణ మరో కమిటీ విచారణపై ప్రభావం చూపబోదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు […] The post తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంఏకసభ్య కమిషన్కు సుప్రీం గ్రీన్సిగ్నల్ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామకష్ణరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ నిమిత్తం అనేక […] The post ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ appeared first on Visalaandhra .
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా ఒకరికి గాయాలైన సంఘటన షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు .షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామానికి చెందిన దాసరి అజయ్ (19), ఉదయ్కిరణ్(19) అజాన్(19) ముగ్గురు కలిసి ఆదివారం సాయంత్రం చేవెళ్ల కు వెళ్లి అర్థరాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నాగర్గూడ చౌరస్తా వద్ద లారీ కంటైనర్ ఢీ కొనడంతో అజయ్, ఉదయ్ కిరణ్ అక్కడిక్కడే మృతి చెందారు. అజాన్కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చూసి వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం అజాన్ను నగరంలోని ఫ్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉదయ్ కిరణ్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐదుకు చేరిన మృతులు ఆసుపత్రిలో 12 మందికి చికిత్స . నలుగురు చిన్నారుల ఆరోగ్యం విషమం. అనుమానితులు వైద్యులను సంప్రదించాలన్న అధికారులు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరంలో కల్తీ పాల ఘటన కుటుంబాల్లో భయాందోళన రేకిత్తిస్తోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యా ప్తులో తేలింది. తాజాగా సోమవారం దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన […] The post కాటేసిన కల్తీ పాలు appeared first on Visalaandhra .
. మండలిలో అధికార, ప్రతిపక్ష పోటాపోటీ నిరసనలు. తిరుమలకు నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ పట్టు. గందరగోళం…వాయిదాల పర్వం. 26న చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:శాసన మండలి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. మండలిలో చైర్మన్ పోడియం వద్ద, మండలి వాయిదా అనంతరం చైర్మన్ చాంబర్ ఎదుట వైసీపీ సభ్యులు నిరసనలతో మండలి కార్యకలాపాలకు అడుగడుగునా అవాంతరం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయం ముందుకు కొనసాగలేదు. మండలి సమావేశం సోమవారం చైర్మన్ కొయ్యే మోషెన్రాజు అధ్యక్షతన ప్రారంభం కాగా… […] The post ఇందాపూర్ ప్రకంపనలు appeared first on Visalaandhra .
ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లో రూ. 590 కోట్ల మోసం
ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లో రూ.590 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్లు ఆదివారం నాడు బ్యాంక్ ప్రకటించింది. హరియాణా ప్రభుత్వ ఖాతాల్లో సిబ్బంది రూ. 590 కోట్ల మేరకు మోసం చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది. చండీగఢ్ లోని బ్యాంక్ ప్రత్యేక శాఖలోని కొంతమంది ఉద్యోగులు హరియాణా రాష్ట్రప్రభుత్వ ఖాతాలనుంచి మోసపూరితంగా, అనధికారికంగా నగదు మళ్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో ఇతర వ్యక్తులు, సంస్థలు, ఇతర పక్షాల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. హరియాణా ప్రభుత్వం లోని ఒక విభాగం ఈ బ్యాంక్ లోని తన ఖాతాను మూసివేసి, ఆ ఖాతాలోని నిధులను మరో బ్యాంక్ కు మళ్లించవలసిందిగా కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ప్రస్తుతానికి వేసిన అంచనా ప్రకారం జరిగిన మోసం రూ. 590 కోట్లు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. క్లెయిమ్ ల ధ్రువీకరణ, ఏఏ విధమైన రికవరీలు జరిగాయో తేలిన తర్వాత తుది మొత్తాన్ని నిర్ణయిస్తారని బ్యాంక్ పేర్కొంది. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లో పని చేస్తున్న నలుగురు అధికారులను తక్షణం సస్పెండ్ చేసి, దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మోసానికి పాల్పడిన ఉద్యోగులు ఇతర వ్యక్తులు కఠిన మైన క్రమశిక్షణ చర్యలు, సివిల్, క్రమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంక్ హామీ ఇచ్చింది.ఈ మోసం బయటపడగానే, ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఫిబ్రవరి 20 న బ్యాంక్ కు సంబంధించిన మోసాల కేసుల పర్యవేక్షిణ, ఫాలో - అప్ కోసం బోర్డు ప్రత్యేక కమిటీ దృష్టికి తీసుకువెళ్లింది. ఒక రోజు తర్వాత ఆడిట్ కమిటీ, బోర్డుకు తెలియజేసింది.
స్థానిక ఎన్నికలకు ముందేబీసీ రిజర్వేషన్ల పెంపు
. పీ`4తో అసమానతలు తగ్గింపునకు కృషి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక కేటాయింపులు. సామాజిక సమానత్వమే లక్ష్యం. సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సామాజిక సమానత్వమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలు అన్నిటా ప్రాతినిధ్యం వహించేలా సామాజిక సాధికారత సాధించేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. బడ్జెట్లో […] The post స్థానిక ఎన్నికలకు ముందేబీసీ రిజర్వేషన్ల పెంపు appeared first on Visalaandhra .
వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్లో నిధులు పెంచాలి
. 62 శాతం జనాభాకు 4.31శాతం దారుణం: కేవీవీ ప్రసాద్. నూతన కౌలు చట్టం తీసుకురావాలి: జమలయ్య. రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘం ఆందోళనలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అదనపు నిధులు కేటాయించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్వర్యాన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొనగా, ఉండిలో కౌలు రైతులసంఘ రాష్ట్ర […] The post వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్లో నిధులు పెంచాలి appeared first on Visalaandhra .
టి20 ప్రపంచకప్ సూపర్8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో విండీస్ 107 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. బ్రాడ్ ఎవన్స్ (43), డియాన్ మేయర్స్ (28), కెప్టెన్ సికందర్ రజా (27) మాత్రమే కాస్త రాణించారు. విండీస్ బౌలర్లలో మోటి నాలుగు, అకీల్ హుస్సేన్ మూడు, మాథ్యూ ఫోర్డ్ రెండు వికెట్లు తీశారు. హెట్మెయిర్ వీర విధ్వంసం అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన విండీస్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (12), షాయ్ హోప్ (14)లు విఫలమయ్యారు. ఈ దశలో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షిమ్రోన్ హెట్మెయిర్, రొమన్ పొవెల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు దూకుడుగా ఆడి స్కోరు పరిగెత్తించారు. హెట్మెయిర్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. జింబాబ్వే బౌలర్లను హడలెత్తించిన షిమ్రోన్ వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే రికార్డు అర్ధ సెంచరీని నమోదు చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హెట్మెయిర్ 34 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 85 పరుగులు చేశాడు. పొవెల్ 35 బంతుల్లోనే 4 సిక్స్లు, మరో నాలుగు బౌండరీలతో 59 పరుగులు సాధించాడు. రూథర్ ఫోర్డ్ 13 బంతుల్లోనే అజేయంగా 31 పరుగులు చేశాడు. షెఫర్డ్ (21), హోల్డర్ (13) కూడా దూకుడుగా ఆడడంతో విండీస్ రికార్డు స్కోరును నమోదు చేసింది.
కాజీపేట రైల్వే కోచ్ యూనిట్ నుంచి రైలు పరుగులు
తెలంగాణ లోని కాజీపేటలో 160 ఎకాల విస్తీర్ణంలో ఉన్న రైల్వే కోచ్ తయారీ యూనిట్ ను అభివృద్ధి చేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ మధ్య ఫ్యాక్టరీని భారతీయ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం చేసేందుకు 13.15 కిలోమీటర్ల ట్రాక్ పై డీజిల్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. డీజిల్ రైలు ట్రయిల్ రన్ కోసం ఫ్యాక్టరీ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ కు ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్ ద్వారా ఇక ముందు ఫ్యాక్టరీలో తయారు చేసిన కోచ్ లను స్టేషన్ కు తీసుకువచ్చి, వివిధ రైల్వే జోన్ లు, డివిజన్ లకు పంపే అవకాసం ఉందని అధికారులు తెలిపారు. ఈ ట్రయిల్ రన్ తో రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కాంప్లెక్స్ నుంచి ప్రధాన రైల్వే నెట్ వర్క్ కు ట్రాక్ కనెక్టివిటీ పూర్తయినట్లు స్పష్టమైంది. మార్చిలో అధికారికంగా ప్రారంభానికి ముందు ఇది సన్నాహక కార్యక్రమం. భారతీయ రైల్వేల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ ను ఓ ప్రధాన రోలింగ్ స్టాక్ తయారీ, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ యూనిట్ ను ప్రాజెక్టు అమలు సంస్థగా ఆర్ విఎన్ ఎల్ అమలు చేస్తోందని కూడా సంస్థ పేర్కొంది. ఢిల్లీ - చెన్నై కారిడార్ లో భాగమైన బల్హార్షా- సికింద్రాబాద్ మార్గంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కాజీ పేట ప్రధాన రైల్వే జంక్షన్ వ్యూహాత్మకంగా కీలకమైనది. సమీపంలోనే రైల్ మ్యాన్యు ఫ్యాక్చరింగ్ యునిట్ ఏర్పాటయింది. దేశవ్యాప్తంగా రోలింగ్ స్టాక్ ను సమర్థంగా పంపించేందుకు జాతీయ రోలింగ్ స్టాక్ తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఉత్తర -దక్షిణ, తూర్పు, పశ్చిమ కనెక్టివిటీ సులభతరం కాగలదని అధికారులు అంటున్నారు. కాజీపేట లోని రైల్వే తయారీ యూనిట్ లో విజయవంతమైన ట్రయల్ రన్ , ప్రధాన రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం ఈ ప్రాజెక్టు అమలులో మైలురాయి వంటిదని ఆర్ విఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సలీం అహ్మద్ అన్నారు. దీని వల్ల భారతదేశ రైల్వే తయారీ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రధానయూనిట్, పెయింట్ విభాగం, టెస్ట్ యూనిలోని యంత్రాలు, ప్లాంట్ ఇన్ స్టలేషన్ లు పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి అధికారికంగా ప్రారంభానికి సర్వం సిద్ధమవుతున్నదని ఆర్ విఎన్ ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్
హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ పైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన bస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో కొత్తగా వడు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకుంది. బీమాను అందరికీ అందుబాటులోకి తేవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాల అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పరిష్కార మార్గాలను అందించడంపై కంపెనీకి గల చిత్తశుద్ధికి ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది. కొత్తగా భూపాలపల్లి, ఖమ్మం జిల్లా బుర్హాన్పురం, నాగర్కర్నూల్లలో […] The post తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్ appeared first on Visalaandhra .
فیکٹ چیک: پاکستانی ٹک ٹاکر کا ویڈیو نئی دہلی کے اے آئی اجلاس سے جوڑکر فرضی دعوے کے ساتھ وائرل
وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ نئی دہلی اے آئی سمٹ میں ایک نوجوان روبوٹ کو گالی دے رہا ہے۔ تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو دوبئی کے میوزیم آف دی فیوچر کا ہے اور اس میں پاکستانی ٹک ٹاکر کاشف ضمیر کو دکھایا گیا ہے
లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా అరంగేట్రం
న్యూదిల్లీ: మారియట్ బోన్వోjŽT 30కి పైగా అసాధారణ హోటల్ బ్రాండ్ల గ్లోబల్ పోర్ట్ఫోలియోలో భాగమైన లె మెరిడియన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, తాజా లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. హిమాలయాల దిగువన ఉన్న ప్రశాంతమైన నన్ నది వెంబడి ఉన్న ఈ రిసార్ట, డెహ్రాడూన్లో బ్రాండ్ రాకను సూచిస్తుంది, ఇది అభివద్ధి చెందుతున్న విశ్రాంతి కేంద్రం మరియు ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్తో సహా ఉత్తర భారతదేశంలోని అత్యంత కోరుకునే కొన్ని కొండ […] The post లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా అరంగేట్రం appeared first on Visalaandhra .
లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇద్దరు పోలీసు అధికారులు
ఎపిలో ఎసిబి అధికారులు దూకుడు పెంచారు. లంచం తీసుకుంటున్న పోలీస్ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఏకంగా పోలీస్స్టేషన్లోనే రూ.3 లక్షలు లంచం తీసుకుంటున్న ఇద్దరు పోలీసు అధికారులను సోమ వారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పులివెందుల రూరల్ సిఐ ఎన్.వి. రమణ, సింహాద్రిపురం ఎస్ఐ దాసరి అనిల్ కుమార్ చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి నుంచి రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దొంగిలించిన బైకులతో నేరాలకు పాల్పడుతున్న ఈ కేసులో అనుకూలంగా వ్యవహరిస్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు మొదట కొంత మొత్తం చెల్లించాడు. మిగిలిన డబ్బు కోసం పోలీసులు ఒత్తిడి చేయడంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగం లోకి దిగిన ఎసిబి అధికారులు, సింహాద్రిపురం పోలీస్స్టేషన్లో పక్కా ప్రణాళికతో వలపన్నారు. బాధితుడు రూ.3 లక్షలను ఎస్ఐ అనిల్ కుమార్ కు అందజేస్తుండగా, అక్కడే మాటువేసిన ఎసిబి అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సిఐ రమణను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శ్రీకాకుళంలో ఎంఇఒ, విజయనగరంలో విఆర్ఒ పట్టివేత అదే విధంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటున్న మండల విద్యాధికారి (ఎంఇఒ) కుర్మాన అప్పారావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉప్పాడ కామేశ్వరరావును ఎసిబి అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్ఒ) ఆర్. చిట్టిబాబు కూడా లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు.
బెంగళూరులో ఆసియాలోనే రెండవ అతిపెద్ద అమెజాన్ కార్యాలయం
బెంగళూరు: ఆసియాలోనే తమ రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించినట్లు అమెజాన్ సోమవారం ప్రకటించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో, 12 అంతస్తుల్లో నిర్మించిన ఈ క్యాంపస్.. ఈకామర్స్, ఆపరేషన్స్, పేమెంట్స్, టెక్నాలజీ, సెల్లర్ సర్వీసెస్ (విక్రేతల సేవలు) వంటి వివిధ విభాగాలకు చెందిన 7,000 మందికి పైగా ఉద్యోగులకు వసతి కల్పిస్తుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, ఐదు bకరాల స్థలంలో నిర్మించిన ఈ కార్పొరేట్ భవనాన్ని.. కర్ణాటక […] The post బెంగళూరులో ఆసియాలోనే రెండవ అతిపెద్ద అమెజాన్ కార్యాలయం appeared first on Visalaandhra .
తెలంగాణలో 300 ప్రిజం కంపెనీ సర్వీస్డ్ హోటళ్ల జోడింపు
హైదరాబాద్: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలపై వ్యూహాత్మకంగా దష్టి సారించటం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 300 కంపెనీ సర్వీస్డ్ హోటళ్లను జోడించాలని ప్రిజం (ఓయో యొక్క మాతసంస్థ) యోచిస్తోంది. హైదరాబాద్లో జరిగిన హైఇంపాక్ట్ హోటల్ పార్టనర్ సమ్మిట్లో ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది, ఇది అధికవద్ధి చెందుతున్న పట్టణ కేంద్రాలు, అభివద్ధి చెందుతున్న టైర్`2 మార్కెట్లలో తమ కార్యకలాపాలను బలోపేతం చేయాలనే ప్రిజం నిబద్ధతను నొక్కి చెబుతుంది. హైదరాబాద్లోని అభివద్ధి చెందుతున్న వైద్య, వ్యాపార […] The post తెలంగాణలో 300 ప్రిజం కంపెనీ సర్వీస్డ్ హోటళ్ల జోడింపు appeared first on Visalaandhra .
6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వ మెడలు వంచుతాం: మంత్రి బండి సంజయ్
ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే అమలు చేసేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. డూప్లికేట్ గాంధీ కుటుంబానికి మూటలు పంపి పదవులు కాపాడుకోవాలనే తాపత్రయమే తప్ప 6 గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో ఎప్పుడైనా చర్చించారా? అని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.డూప్లికేట్ గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలు పంపించాలన్న శ్రద్ధే తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టవా? అని ఆయన ముఖ్యమంత్రిని ఉద్ధేశించి ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2500లు ఇస్తామని చెప్పి రెండేళ్ళు దాటినా ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. అవ్వాతాతలకు ప్రతి నెలా రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇవ్వడంపై, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డును ఎందుకు ఇవ్వలేకపోతున్నామని, నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలుపై ఎన్నడైనా మంత్రివర్గంలో ఎప్పుడైనా చర్చించారా ? అని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది యాజమాన్యాలు అల్లాడుతున్న సంగతి మర్చిపోయారా?, ఆరోగ్యశ్రీ బకాయిలివ్వకపోవడంతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందక పేదల బాధలు మీకు పట్టవా? అని ఆయన ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు సాధ్యాసాధ్యాలపై ఎందుకు చర్చించడం లేదని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తమ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఆధ్వర్యంలో 6 గ్యారంటీల అమలుపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
కోల్గేట్ టోటల్ ప్రచారకర్తగా రాహుల్ ద్రవిడ్
ముంబయి: నోటి సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కోల్గేట్`పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఒక కీలకమైన అడుగు వేసింది. క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ను తమ ‘కోల్గేట్ టోటల’ బ్రాండ్ కొత్త అంబాసిడర్గా నియమించింది. ఈ భాగస్వామ్యం నోటి ఆరోగ్యం పట్ల ఉన్న పాత ఆలోచనలను మారుస్తోంది. నోటిని కేవలం శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా, అది మన దైనందిన పనితీరులో ఒక ముఖ్యమైన భాగమని ఈ ప్రచారం ద్వారా చెబుతున్నారు. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి శారీరక […] The post కోల్గేట్ టోటల్ ప్రచారకర్తగా రాహుల్ ద్రవిడ్ appeared first on Visalaandhra .
టిజిఎస్ ఆర్టిసికి 1085 ఎలక్ట్రిక్ ఒలెక్ట్రా బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్టిసి)కి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజిఎల్ ) 1085 బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఒలెక్ట్రా సంస్థకు టిజిఎస్ ఆర్టిసి లెటర్ అఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) జారీ చేసింది. పిఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఈఎస్ఎల్ ) ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఓజిఎల్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ వాణిజ్య వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ సంస్థ తయారు చేసే బస్సులను ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఓజిఎల్ సరఫరా చేసే బస్సుల ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు సుస్థిర, పర్యావరణ హితమైన, సమర్ధవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను ఆర్టిసి అందించనుంది. పట్టణాలలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పిఎం ఈ డ్రైవ్ పథకం హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ రవాణా వ్యవస్థ దిశగా మరింత ముందుకు తీసుకెళ్ళనుంది. ఆర్టిసికి ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు ఉన్న లో ఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులో ఎసి , నాన్ -ఎసి బస్సులున్నాయి. స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించారు. బస్సు ముందు , వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తాయి. సుమారు 45 నిమిషాల్లో ఆపర్చునిటీ ఛార్జింగ్ సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. బస్సులో వీల్ చైర్ వినియోగదారులకు ప్రత్యేక స్థలం కేటాయించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓలెక్ట్రా దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ విభాగంలో ఈ ఆర్ధిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం లోనూ తొలిస్థానంలో నిలిచింది. సంస్థ కేవలం ఎలక్ట్రిక్ బస్సులే కాకుండా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడే ఎలక్ట్రిక్ టిప్పర్లను కూడా తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా 3,600కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఓలెక్ట్రా చేతిలో ప్రస్తుతం 10 వేల విద్యుత్ వాహనాల ఆర్డర్ ఉంది. సంస్థ వాహనాలు ఇప్పటివరకు 500 మిలియన్ గ్రీన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, కర్బన ఉద్గారాల తగ్గింపులో విశేష పాత్ర పోషిస్తున్నాయి. స్థానిక ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆపరేషనల్ విశ్వసనీయత, నిరంతర సాంకేతిక ఆవిష్కరణలతో ఒలెక్ట్రా దేశాన్ని కర్బన ఉద్గార రహితంగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా ఎండీ మహేష్ బాబు మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని, దేశ విద్యుత్ వాహన రంగంలో మా ప్రయాణానికి ఇది ఒక కీలక మైలురాయి అని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ దృష్టితో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలనే మా కట్టుబాటుకు పిఎం ఈ-డ్రైవ్ కార్యక్రమం కింద వచ్చిన ఈ ప్రతిష్టాత్మక ఆర్డర్ మరింత బలం చేకూర్చిందన్నారు. హైదరాబాద్ మా సంస్థ స్వస్థలం మాత్రమే కాదు, ఆవిష్కరణలకు ప్రతీక అని, టిజిఎస్ ఆర్టిసితో కలిసి సమర్థవంతమైన, సౌకర్యవంతమైన సుస్థిర ప్రజా రవాణా సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇది దేశం పర్యావరణ హితంగా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు.
కాకతీయ యూనివర్సిటీలో చికెన్ కోసం గొడవ..కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు
హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆదివారం లంచ్ తర్వాత చికెన్ మిగిలిపోయింది. ఈ చికెన్ పంపకాలలో రెండు గ్రూపుల మధ్య గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎంబిఎ ఫస్టియర్, ఎకనమిక్స్ ఫస్టియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాటా మాటా పెరిగి కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కొందరు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం.
బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం..హోంగార్డు, యువతి మృతి
గరంలోని బంజారాహిల్స్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు, యువతి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం...సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో సయ్యద్ హుస్సేన్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. విధులు ముగిసిన తర్వాత ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎపికి చెందిన యువతి అక్షిత ర్యాడ్ బూక్ చేయడంతో ఆమెను తీసుకుని బైక్పై బయలు దేరాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్ను ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అక్షిత ఎపిలోని విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
fisheries strikes నిషేదిత అలివి వలలకు చెక్ Andhra Prabha News
fisheries strikes నిషేదిత అలివి వలలకు చెక్ Andhra Prabha News శ్రీశైలం
ఐటి పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం
మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలంలోని వేంపల్లి లో ఐటి పార్కు భూసేకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని మాడుగుల నర్సయ్య అనే రైతు సోమవారం జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు.తమ వద్ద వాస్తవంగా (మోక ప్రకారం)ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నప్పటికి అధికారుల నిర్లక్షంతో కేవలం ఒక ఎకరానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెం:159/37లో తమ కుటుంబం సంవత్సరాలుగా నిరంతరంగా భూమిని సాగు చేస్తోందని,వాస్తవ స్వాధీనంలో ఉన్న మొత్తం విస్తీర్ణం 5ఎకరాలు ౦౨ గుంటలుగా ఉందని తెలిపారు. కాగా పాస్బుక్లో ఒక్క ఎకరం ౦౧ గుంట మాత్రమే నమోదై ఉండటాన్ని కారణంగా చూపి, మిగతా భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని తెలిపారు. భూసేకరణకు సంబందించి నోటిఫికేషన్ తమకు వ్యక్తిగతంగా అందలేదని, గ్రామ స్దాయిలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. కేవలం పత్రిక ప్రకటనకే పరిమితం కావడంతో అభ్యంతరాలు తెలిపే అవకాశం కోల్పోయామని తెలిపారు. ప్రాధమిక విచారణ నివేదికలో కూడా వాస్తవ స్తితిని పక్కన పెట్టి యాంత్రికంగా ఒక ఎకరం మాత్రమే చూపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే భూసేకరణలో తమ లాంటి పరిస్దితిలో ఉన్న ఇతర రైతులకు మోకా ఆధారంగా పూర్తి నష్టపరిహారం చెల్లించగా, తన విషయంలో మాత్రం వివక్ష చూపారని ఆరోపించారు. భూసేకరణకు కాన్సెంట్ అవార్డు పేరిట జరిగిందని చెప్తున్నా తన నుంచి స్వచ్చంద సమ్మతి తీసుకోలేదని ఒత్తిడితో సంతకాలు సేకరించారని ఆరోపించారు. మిగిలిన భూమికి కూడా నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో స్పష్టమైన కారణాలతో రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు బాధిత రైతు నర్సయ్య తెలిపారు. ఈ విషయంపై జిల్లా స్దాయిలో స్వతంత్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.
నో హెల్మెట్ … నో పెట్రోల్… టేకుమట్ల, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలు
Will Summer Biggies get Ticket Hike in Telangana?
Summer 2026 will witness the release of several biggies of Telugu cinema like Ustaad Bhagat Singh and Peddi. The High Court of Telangana made it clear that the permission for the ticket hikes in the state have to be applied 90 days prior to the release date of the respective film. This has been a […] The post Will Summer Biggies get Ticket Hike in Telangana? appeared first on Telugu360 .
నిధులు మంజూరు చూయండి… కుంటాల, ఆంధ్రప్రభ : అభివృద్ధికి నిధులు మంజూరు చేసే
రెండు రోజులుగా వేసవి ఎండ రుచి చూసిన ప్రజలు సోమవారం ఒక్క సారిగా మారినఅకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగమయ్యారు. సోమవారం మద్యాహ్నాం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేసుకొని భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలలతో భారీ వర్షం కురవడంతో జిల్లా తడిచి ముద్దయ్యింది. కురిసిన అకాల వర్షంతో మామిడి చెట్లకు ఉన్న పూత రాలి పోయింది. అలాగే మండలంలో తెల్లబంగారం పండించిన రైతులకు ఇంకా కొందరు పత్తిని చెట్టు మీద నుండి తెంపక పోవడంతో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచిపోయి రైతులకు నష్టాన్ని చవి చూపించింది. గంట పాటు ఈదురు గాలులు వీస్తు వర్షకాలాన్ని తలపించే విధంగా ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం కురవడంతో ప్రయాణికులు, ప్రజలు తడిచి ముద్దయ్యారు. నీడలో నిలబడిన అన్ని ప్రక్కల నుండి వర్షం కురవడంతో ఒక్కసారిగా వర్షకాలం వాతావరణం ను తలిపించింది. ఈ అకాల వర్షం వల్ల కొందరు పత్తి పంట నష్టపోయో అవకాశాలు ఉన్నాయని, అలాగే మామిడి కాయల కాతకు కూడా ఇబ్బందులు తప్పవని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కోన్నారు. రెండు గంటల అనంతరం ఒక్క సారిగా వాతావరణంలో మళ్లీ మార్పులు చోటు చేసుకొని వేసవి వాతావరణాన్ని తలపింప చేయడం విశేషం.
Nirmala Sitharaman and RBI Assure Stability as Gold and Silver Prices Climb
Finance Minister Nirmala Sitharaman and RBI Governor Sanjay Malhotra have sought to calm concerns over the recent surge in gold and silver prices. Both leaders said the government and the central bank are closely monitoring developments. They stressed that there is no immediate threat to economic stability. Speaking after the customary post Budget meeting with […] The post Nirmala Sitharaman and RBI Assure Stability as Gold and Silver Prices Climb appeared first on Telugu360 .
మానకొండూర్ లో బిజెపి రాస్తారోకో
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.రామచంద్రరావు,కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అరెస్టులను నిరసిస్తూ మానకొండూర్ లో బిజెపి మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్,వరంగల్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మానకొండూర్ సిఐ సంజీవ్,పోలీస్ సిబ్బంది రాస్తారోకో చేస్తున్న పల్లె చౌరస్తాకు చేరుకుని బిజెపి నాయకులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మీస రమణయ్య, సొన్నాకుల శ్రీనివాస్, శీలం కుమార్ యాదవ్, మిరాల హరీష్ యాదవ్, మార్కొండ రమేష్, బలరాం, తిరుపతి, శ్రీనివాస్, అశ్విన్, రాజు, రాజయ్య, చందు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
పిలోని రాజమండ్రిలో కల్తీ పాలు పెను విషాదాన్ని నింపాయి. నగరంలోని లాలాచెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగిన మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ళ శేషగిరిరావు, తాడి రమణి, తాడి కృష్ణవేణి, కనక రత్నం చనిపో యారు. అలాగే, మరో నలుగురు చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికుల అస్వస్థత, మరణాలపై ఎపి సిఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. చౌడేశ్వరి నగర్లో ప్రజలు అనారోగ్యం పాలవ్వడం, పలువురు మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని అధికారులు సిఎం చంద్రబాబుకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిం చాలని చంద్రబాబు సూచించారు. ఇక, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని సిఎం చంద్రబాబుకి అధికారులు వివరించారు. పాలు వినియోగిం చిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. మిగి లిన అందరి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పాల నమూనాల్లో ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు.
టీనేజర్లు, వాళ్ల తల్లిదండ్రులు తప్పక చూడాలి #euphoria #movie #gunashekar #latestnews #viralvideo
రాష్ట్ర స్థాయిలో నిలపాలి ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలిప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై వాకబునిర్లక్ష్యం చేయద్దని
మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సిఎం డైరీని ఆవిష్కరించిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.
పసి పాపను చంపిన వారిపై చర్య తీసుకోవాలి…
పసి పాపను చంపిన వారిపై చర్య తీసుకోవాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : రెండు
Short circuitతో ఇల్లు దగ్ధం రూ. 6 లక్షల ఆస్తి నష్టం బెల్లంపల్లి,
చిన్నారి మృతి సంఘటన సీఎం దృష్టికి తీసుకెళ్తాం
చిన్నారి మృతి సంఘటన సీఎం దృష్టికి తీసుకెళ్తాం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,
తిరుమల క్యూలైన్లో పాముకాటుపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ #Tirumala #TTD #FactCheck #APNews
మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలి…
మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలి… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర
వంజరీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి….
వంజరీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి…. కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : వంజరి
ఆర్గాన్ పంట ఆరోగ్యానికి అమృతం…
ఆర్గాన్ పంట ఆరోగ్యానికి అమృతం… ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. బూర్గంపాడు, ఆంధ్రప్రభ :
నేను గర్భిణిని.. నన్ను అరెస్ట్ చేయకండి…
నేను గర్భిణిని.. నన్ను అరెస్ట్ చేయకండి… ఆశా వర్కర్ కన్నీటి పర్యంతం… మోర్తాడ్,
జిల్లా అధ్యక్షుడిగా సోమగాని నరేందర్
జిల్లా అధ్యక్షుడిగా సోమగాని నరేందర్ హుజూర్నగర్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ పట్టణానికి చెందిన
రాష్ట్రస్థాయిలో విద్యార్థులు రాణించడం గర్వకారణం..
రాష్ట్రస్థాయిలో విద్యార్థులు రాణించడం గర్వకారణం.. విద్యార్థులకు, పీడీలకు కలెక్టర్ సన్మానం ఉట్నూర్, ఆంధ్రప్రభ
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన వినయ్
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన వినయ్ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు
ఘటనపై బెల్లంపల్లి ఎంహెచ్డీ లీడర్ల నిరసన
ఘటనపై బెల్లంపల్లి ఎంహెచ్డీ లీడర్ల నిరసన పసిపాప మృతికి కారణమైన నిందితులను కఠినంగా
నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు : కెటిఆర్
తన పేరుతో ఎలాంటి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కొంతమంది ‘కెటిఆర్ సేవా సమితి’, ‘కెటిఆర్ సేన’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయాన్ని పలువురు కెటిఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటితోపాటు కెటిఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కూడా కెటిఆర్కి తెలియజేశారు. తన పేరుతో నిర్వహిస్తున్న సంస్థలపై ఆయన స్పందిస్తూ తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని... అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని తేల్చిచెప్పారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను నిలిపివేయాలని, తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా బిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు.
బీజేపీ నేత సురేందర్ రెడ్డికి మాతృవియోగం
బీజేపీ నేత సురేందర్ రెడ్డికి మాతృవియోగం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
మెక్సికో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతం
మెక్సికోలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సిజెఎన్ జి ) నాయకుడు నెమెసియో రూబోన్ ఒసేగురా సెర్వాంటెస్ , అకా ఎల్ మెంచో సైన్యం దాడిలో చనిపోయాడు. దీంతో ప్రతీకార దాడుల నేపథ్యంలో హైవేలను దిగ్బంధం చేశారు. పలు విమానాలను రద్దు చేశారు. అమెరికా కూడా మెక్సికో లోని పలు పట్టణాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. అమెరికా, కెనడాలలో సెక్యూరిటీ అలర్ట్ లను ప్రకటించారు. మెక్సికో డ్రగ్ మాఫియా ఎంత బలమైనదంటే, వారు సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నారు. అలాంటి ముఠా అగ్రనాయకుడు హతమైతే, అల్లకల్లోలం జరగవచ్చునన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి.మెక్సికో లోని జాలిస్కో స్టేట్ లో టపాల్పా పట్టణంలో ఆదివారం మెక్సికన్ సైన్యం ఎల్ మెంచో ముఠాకు చెందిన దుండగులతో సాయుధ ఘర్షణకు దిగింది. కాల్పుల్లో ఒసేగురా గాయపడ్డాడు. చికిత్స కోసం మెక్సికో నగరానికి విమానంలో తలరిస్తుండగా, అతడు చనిపోయినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అతడి తలపై 15 మిలియన్ అమెరికా డాలర్ల బహుమతి ఉంది. 59 ఏళ్ల జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ నాయకుడు ఇటు మెక్సికో లోను, అటు అమెరికాలోనూ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకడు. ఎల్. మెంచో తోపాటు అతడి ముఠాకు చెందిన ఆరుగురు ఈ ఆపరేషన్ లో చనిపోయినట్లు సైన్యం తెలిపింది. ఆపరేషన్ లో ముగ్గురు మెక్సికన్ సైనికులు గాయపడ్డారు. ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు ముఠా సభ్యులనుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో విమానాలను కూల్చివేయగల రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి.ఎల్. మెంచో మరణం తర్వాత కార్టెల్ ముఠా సభ్యులు తీవ్ర హింసా, దౌర్జన్య కాండకు పూనుకున్నారు. జాలిస్కో, మిచోకాన్ స్టేట్ లలో వాహనాలకు నిప్పుపెట్టారు. రహదారులను దిగ్బంధం చేశారు. సైనిక ఆపరేషన్ లో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రదేశం ప్యూర్టో వల్లర్టా పై హెలికాప్టర్ల రాకపోకలు దాదాపు నిలిచి పోయినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చూపాయి. మెక్సికన్ డ్రగ్ కార్టెల్ బాస్ లలో అత్యంత శక్తివంతుడైన ఎల్.మెంచో ను ఒకప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేర్చింది అంటే అతడిని అంచనా వేయవచ్చు. మెక్సికోలో శక్తివంతమైన మాదక ద్రవ్య సామ్రాజ్యం విస్తరించడం వెనుక చైనా సంబంధాలు కూడా కీలకం. ఒసేగురా మరణం, తర్వాత సినాలోవా కార్టెల్ బాస్ జోక్విన్ ఎల్ . చాపో గుజ్మాన్ వంటి వారిని తొలగించే ఆపరేషన్ సాగవచ్చు. ఎల్. చాపో, ఎల్. మెంచో వంటి వారి కథనాలతో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మెక్సికోను ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవచ్చు.
ద్వారక పాఠశాలలో క్విజ్ పోటీలు….
ద్వారక పాఠశాలలో క్విజ్ పోటీలు…. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని ద్వారక
మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
పోలీస్ స్టేషన్లో ప్రజలకు సేవలపై అవగాహన
విశాలాంధ్ర-రాప్తాడు : పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాప్ ద్వారా 87 రకాల సేవలు అందిస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గోళ్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులకు సోమవారం సీఐ శ్రీహర్ష అవగాహన కల్పించారు.గ్రామాల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎఫ్.ఐ.ఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తుల ఆచూకీ, వివిధ రకాల ధృవీకరణ పత్రాలు తదితర సేవలు ఉంటాయన్నారు.నేరాలకు సంబంధించిన […] The post పోలీస్ స్టేషన్లో ప్రజలకు సేవలపై అవగాహన appeared first on Visalaandhra .
సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం
జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని 100 శాతం అక్షరాస్యులుగా మార్చడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో అక్షర ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం అని, ఈ […] The post సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం appeared first on Visalaandhra .
ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా న్యాయం జరుగుతుంది
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా తప్పక న్యాయం జరుగుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు పాల్గొని రెవెన్యూ, భూవివాదాలు, సంక్షేమ పథకాలు, ప్రాథమిక సౌకర్యాలు ,ఇతర పరిపాలనా సమస్యలకు సంబంధించిన 11 వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది అన్నారు. ప్రతి వినతిని ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత […] The post ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా న్యాయం జరుగుతుంది appeared first on Visalaandhra .
విద్యార్థులకు అయోడిన్ వైద్య పరీక్షలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవివిశాలాంధ్ర – అనంతపురం టౌన్అ యోడిన్ ఉన్న ఉప్పును వాడాలని నీరసంగా ఉన్న విద్యార్థులను గుర్తించి వైద్యం అందించేలా చర్యలు తీసుకోమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు.ప్రిన్స్ ఆఫ్ పీస్ స్కూల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అమాలి కాలనీ యందు, విద్యార్థులకు అయోడిన్ లోపంపై వైద్యులు సోమవారం పరీక్షలు నిర్వహించారు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. […] The post విద్యార్థులకు అయోడిన్ వైద్య పరీక్షలు appeared first on Visalaandhra .
‘డెకాయిట్’ నుంచి తొలి సింగిల్ వచ్చేది ఎప్పుడంటే..
విలక్షణమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరోల్లో అడివి శేష్ ముందుంటాడు. అడివి శేష్ నుంచి సినిమా వస్తుందంటే.. అందులో ఏదో ఒక మిస్టరీ దాగి ఉంటుంది. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయినా.. అప్డేట్స్ మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. డెకాయిట్ నుంచి తొలి సింగిల్ వచ్చేస్తోందని చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా డెకాయిట్ కాక ముందు తన ప్రేమ కథ ఎలా సాగిందో తెలిపేలా.. ‘రుబారో’ అనే పాటను ఫిబ్రవరి 27న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ‘అతడు ఆమెను ప్రేమించాడు. ఆమె అతడిని మోసం చేసింది’ ‘మీకు అతడికి ఏం జరిగిందో తెలుస్తుంది.. మీరు అతడు ఏం ఫీల్ అయ్యాడో వింటారు’ అంటూ శేష్ ఈ అప్డేట్కి రాసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలోకి రానుంది. He LOVED her. She BETRAYED him. #Rubaroo Before he became a #DACOIT On Feb 27th … You Will Know What Happened to Him. You Will Hear What He Felt. @mrunal0801 pic.twitter.com/6Q0gj5rVg0 — Adivi Sesh (@AdiviSesh) February 23, 2026
STUDENTS FIRE కళ్లకు గంతలతో నిరసన Andhra prabha news
STUDENTS FIRE కళ్లకు గంతలతో నిరసన Andhra prabha news రూసా నిధులు,
ప్రజాపాలన ప్రభుత్వంలో.. సొంతింటి కల నెరవేరిన వేళ..ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం…
రాష్ట్ర సీఎం కప్, వాలీబాల్ పోటీల్లో మూడో స్థానం
రాష్ట్ర సీఎం కప్, వాలీబాల్ పోటీల్లో మూడో స్థానం క్రీడాకారులను అభినందించిన మంత్రి
డీజీపీని కలిసిన టీఅర్ ఎస్ పార్టీ నాయకులు
డీజీపీని కలిసిన టీఅర్ ఎస్ పార్టీ నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిది,
బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్, ఉద్యోగులు…
బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్, ఉద్యోగులు… చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు జైనూర్, ఆంధ్రప్రభ : వాహనదారులు రోడ్డు నిబంధనలు
Acb Raids : ఇచ్ఛాపురం లో ఎసిబి కలకలం Andhra Prabha News
Acb Raids : ఇచ్ఛాపురం లో ఎసిబి కలకలం Andhra Prabha News
మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం…
మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం… మోత్కూర్, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ
Kavitha : కవిత అసలు లక్ష్యం అదేనా? అసలు ఏం జరుగుతుంది?
తెలంగాణలో కవిత తన సొంత పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
Samantha about her Relationship with Raj Nidimoru
It was not a smooth sail for Samantha right from the start of her career. After she achieved stardom, the actress got married to actor Naga Chaitanya. The actors parted ways and soon Samantha suffered from Myositis. The actress now married Bollywood filmmaker Raj Nidimoru. Speaking to a top magazine, the actress opened about her […] The post Samantha about her Relationship with Raj Nidimoru appeared first on Telugu360 .
Harish Shankar clarifies about political satires in UBS
Power Star Pawan Kalyan and Harish Shankar combination has delivered a huge blockbuster, Gabbar Singh. Now, they are back together for highly anticipated Ustaad Bhagat Singh. The movie second single, Aura of Ustaad, released yesterday and it received high appreciation from all corners. But few people raised concerns about the film having numerous political comments […] The post Harish Shankar clarifies about political satires in UBS appeared first on Telugu360 .
Andhra Pradesh Minister Nara Lokesh has issued a strong rebuttal to the political storm surrounding the alleged adulterated ghee controversy. Speaking with the media, he addressed allegations raised by YSRCP leaders about business links between Indapur Dairy and Heritage Foods. He dismissed the claims as baseless and politically motivated. Lokesh made it clear that Indapur […] The post Lokesh Slams Ghee Adulteration Claims, Challenges YSRCP Over Heritage Allegations and Council Disruptions appeared first on Telugu360 .
Andhra Pradesh : పింఛనుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
పింఛను దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Top Production Houses Exit from Ajith’s Film
Tamil actor Ajith Kumar is on a break after the release of Good Bad Ugly directed by Adhik Ravichandran. Telugu production house Mythri Movie Makers bankrolled the film and they had plans to repeat the combination after Good Bad Ugly. But Mythri Movie Makers have decided to take an exit. A couple of Tamil producers […] The post Top Production Houses Exit from Ajith’s Film appeared first on Telugu360 .
Andhra Pradesh :కల్తీపాలు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది.
నా పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదు: కెటిఆర్
హైదరాబాద్: తన పేరుతో కొందరు సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా పని చేయాలనుకుంటే బిఆర్ఎస్తో కలిసి పని చేయాలని.. తన పేరుతో సంస్థలు ఏర్పాటు చేసేందుకు మాత్రం అనుమతి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదన్నారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలు వెంటనే ఆపాలని తెలిపారు. తనపై అభిమానం ఉంటే బిఆర్ఎస్తో కలిసి పని చేయవచ్చని పిలుపునిచ్చారు.
ఆకలి తీర్చడమే లక్ష్యం.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా
ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించడం అత్యంత బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు
Rs.3 lakhs | ఎక్కడంటే… Rs.3 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఫ్యాక్ట్ చెక్: తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న టీటీడీ
తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు అంటూ
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి…
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : వార్డు సభ్యులు గ్రామాల
సీసీ కెమెరాలు ఏర్పాటు దాత మెరుగు శ్రీనివాస్ కు సన్మానంసర్పంచ్ వసంత నాగేష్
గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధిసాధ్యం
గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధిసాధ్యం జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి
IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report
IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report
చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు..
చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు, […] The post చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు.. appeared first on Visalaandhra .
Tirumala |ఆ తరహా చట్టం యోచనలో ఏపీ సర్కార్
Tirumala | ఆ తరహా చట్టం యోచనలో ఏపీ సర్కార్ Tirumala |
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివాలయములో గల ఐదవ సచివాలయం పార్కులో పురపాలక సంఘం పరిధిలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ వంతుగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీ మానస నృత్య కళా కేంద్రం గురువు మానస వారి శిష్య బృందంతే నృత్య కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. మానస శిష్య బృందం నిర్వహించిన భరతనాట్యం, జానపద గేయాల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య గురువు మానస తో పాటు శిష్య […] The post ఆకట్టుకున్న నృత్య కార్యక్రమం appeared first on Visalaandhra .
ఐఎఫ్సీఎన్ సస్టైన్–2025కు తెలుగు పోస్ట్ ఎంపిక
ప్రపంచవ్యాప్తంగా 25 ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థల్లో చోటు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మారం నుండి యాదగిరి వెళ్ళుటకు బందు వర్గములతో కలిసి లాతూర్ ఎక్స్ప్రెస్ ను ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన శారద కుటుంబం రైలులో బయలుదేరింది. రైలు కదులుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి శారదా మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దొంగలించుకుని పారిపోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. లాతూరు ఎక్స్ప్రెస్ కల్లూరు గ్రామానికి చేరే సమయంలో ఎస్-5 లోని 72 బెర్త్ వద్ద ఉన్న శారద వెనుక వైపు […] The post రైలులో మహిళ గొలుసు చోరీ appeared first on Visalaandhra .
విద్యా వాలంటీర్ల వేతనాల వెతలు…
విద్యా వాలంటీర్ల వేతనాల వెతలు… భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : రెండేళ్లు గడిచినా
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం #HeavyRain #APRain #TelanganaRain #Paderu

22 C