ప్రచారంలో దూసుకెళుతున్న తోట రాము..
ప్రచారంలో దూసుకెళుతున్న తోట రాము.. మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తోటరాము 23వ
నేడు హరీశ్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారం
మాజీ మంత్రి హరీశ్ రావు ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
టిడిపి ఎంఎల్ఎ ఇంటి ముందు మంత్రించిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ విసిరేసి
అమరావతి: టిడిపి ఎంఎల్ఎ ఇంటి ముందు మంత్రించిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ , తెల్ల అవాలు విసిరేసి కారులో పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అరవింద్ నగర్లో శింగనమల ఎంఎల్ఎ బండారు శ్రావణి నివసిస్తున్నారు. శనివారం ఉదయం టిడిపి ఎంఎల్ఎ శ్రావణి ఇంటి ముందు మంత్రించిన నిమ్మికాయలు, పసుపు, కుంకుమ, తెల్ల అవాలు విసిరేసి పారిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది కారును పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే కారులో వారు పారిపోయారు. గన్మెన్లు, కార్యాలయ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిసి ఫుటేజీని పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎపి 39 కెఎక్స్ 0986 అనే నంబర్ కారు గుంటూరు జిల్లాకు చెందిన మొగలి ఆదిలక్ష్మీ పేరు ఉంది.
ఈ ఏడాది హోలీ పండగ తేదీపై దేశవ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది.
కౌన్సిలర్ గా గెలిపించండి.. ప్రజలకు రుణపడి ఉంటా..
కౌన్సిలర్ గా గెలిపించండి.. ప్రజలకు రుణపడి ఉంటా.. 2 వ వార్డు కాంగ్రెస్
ఆలేరు 12వ వార్డులో జెట్ట నీరజ సిద్ధులు ప్రచారం..
ఆలేరు 12వ వార్డులో జెట్ట నీరజ సిద్ధులు ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ :
Revanth Reddy : నేడు భూపాలపల్లి జిల్లాకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
ఆలేరు 11వ వార్డులో పంతం కృష్ణ ప్రచారం..
ఆలేరు 11వ వార్డులో పంతం కృష్ణ ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి
కష్టపడి పని చేసేవాడిని… కౌన్సిలర్ గా గెలిపించండి..
కష్టపడి పని చేసేవాడిని… కౌన్సిలర్ గా గెలిపించండి.. మోత్కూర్, ఆంధ్రప్రభ : పేదల
ఆలేరు 12 వార్డు లో మోర్తల సునీత రమణారెడ్డి ప్రచారం..
ఆలేరు 12 వార్డు లో మోర్తల సునీత రమణారెడ్డి ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ
India vs America T20 World Cup : అమెరికా వణికించింది... కానీ ఉత్కంఠ మధ్య భారత్ గట్టెక్కింది
భారత్ - అమెరికాల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆశాజనకంగా సాగలేదు
ఔటర్ రింగ్ రోడ్డుపై గాల్లోకి ఎగిరిపడిన కారు: ఇద్దరు మృతి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పోతారం ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అతి వేగంతో ఓఆర్ఆర్పై నుంచి సర్వీసు రోడ్డు పడడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నడుములకు తీవ్ర గాయాలు కావడంతో వారు నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఏడుగురు ప్రయాణికులు హైదరాబాద్లోని నెహ్రూ జూపార్క్ నుంచి బాచుపల్లికి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆలేరు 1 వార్డు లో సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారం..
ఆలేరు 1 వార్డు లో సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ
సంక్షేమ పథకాలే విజయ సోపానాలు..
సంక్షేమ పథకాలే విజయ సోపానాలు.. ఆలేరు, ఆంధ్రప్రభ : రేవంత్ రెడ్డి సారధ్యంలోని
సాంస్కృతిక కళా ప్రదర్శనలతో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం..
సాంస్కృతిక కళా ప్రదర్శనలతో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం.. ఓటర్లను ఆకర్షిస్తున్న అభ్యర్థి
ఆదరించండి.. అత్యధిక మెజార్టీతో గెలిపించండి..
ఆదరించండి.. అత్యధిక మెజార్టీతో గెలిపించండి.. క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం
మన తెలంగాణ/నాంపల్లి: నాంపల్లిలో ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్నిప్రమా దం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప లు కేసులకు సంబంధించిన కీలక ఫై ళ్లు మంటలకు ఆహుతి కావడం తీవ్ర క లకలం రేపుతోంది. నాంపల్లి పోలీస్ స్టే షన్ పక్కనే ఉన్న రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ భవనంలో శనివారం ఉదయం 10.20గంటలకు భవనంలో మొదటి అంతస్థులో హఠాత్తుగా మంటలు లేచాయి. పొగలు, మంటలు క్షణాల్లో వ్యాపించడంతో ఆఫీస్లో ఉన్న ఉద్యోగులు ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీలక కేసుల డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, హర్డ్ డిస్క్లు, ముఖ్యమైన ఆధారాలు, పెన్ డ్రైవ్లు, రసాయనాల బ్యాట్రీలు, ఫర్నిచర్లు, కరెంట్ వైర్లు, ఫైళ్లు మంటల ధాటికి కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమదం జరిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. నాలుగు వైపుల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. కొందరు అద్దాలు ధ్వంసం చేసి పొగ బయటికి వచ్చేలా చేశారు. ఈ విషయం తెలియగానే ఎసి గార్డ్ విద్యుత్ ఎడీఈ విజయకుమార్, ఇన్ఛార్జీ అసిస్టెంట్ ఇంజినీర్ మోహన్ బాబు తన సిబ్బందితో కలిసి ఫీడర్ లైన్ల నుంచి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సచివాలయం, అసెంబ్లీ, లంగర్హౌస్ పలు చోట్ల నుంచి అదనంగా ఫైరింజిన్లను తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో అనేక కంప్యూటర్లు, కీలక ఫైళ్లు, ధ్రువపత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు, అగ్ని ప్రమాదాలకు సంబంధించిన కీలక ఆధారాలు, రికార్డులు, నేర నియంత్రణ దర్యాప్తు డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయని తెలిసింది. ల్యాబ్లో పరీక్షించిన ఆధారాలు,కోర్టులో ప్రవేశపెట్టాల్సిన కీలక ఆధారాలు ధ్వంసమయ్యాయి. లక్షల రూపాయల సర్కార్ ఆస్తి మంటల్లో తగలబడిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికతో జరిగిందా.. ప్రమాదమా? ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసులకు సంబంధించిన కీలక ఫైళ్లు ఉన్న కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం....ఫైళ్లు దగ్ధం కావడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు చెబుతున్నట్లుగా షార్ట్సర్కూట్తో ప్రమాదం జరిగినా అక్కడున్న సిబ్బంది మంటల ఆర్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు...? ఒక్కసారిగా మంటలు చెలరేగే అవకాశం లేకున్నా ఫైళ్లు ఫైళ్లను, డాక్యుమెంట్లను, ముఖ్యమైన రికార్డులను బయటకు ఎందుకు తీసుకువెళ్లలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కీలక మైన ఫైళ్లు ఉన్న కార్యాలయంలో ఇంత నిర్లక్షంగా ఉంటే ఎలా ? అని పలువురు మండిపడుతున్నారు. విలువైన హార్డ్డిస్క్లు, కంప్యూటర్లు మంటలకు ఆహుతి: దాస్, డిఎఫ్ఓ తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో మంటలు అదుపులోకి వచ్చాయని, మొదటి అంతస్థులో వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగిందని డీఎఫ్వో దాస్ తెలిపారు. విలువైన హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు , కీలక పత్రాలు కాలిపోయాయని .. రెండో అంతస్థులలోకి మంటలు వ్యాపించలేదన్నారు. సెన్సిటివ్గా ఉన్న ప్లాస్టిక్ వష్తువులు దగ్ధం , హార్డ్ డిస్క్లు పూర్తిగా కాలిపోయాయా... పాక్షికంగా దగ్ధమయ్యాయా అనేది పరిశీలించాల్సి ఉందన్నారు. నగర డీసీపీ శిల్పావల్లి సందర్శించి అగ్ని ప్రమాదానికి కారణాలు, ఎలా మంటలు వ్యాపించాయి అనే విషయాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. నష్టం ఎంత జరిగిందో తెలియదని, దర్యాప్తులో తేలుస్తుందన్నారు. వేసవి కాలం సీజన్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా సంబంధిత వ్యక్తులు ముందుస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అగ్ని మాపక శాఖ డీజీ విక్రం సింగ్ మాన్ పేర్కొన్నారు. తమ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. లోపల కంప్యూటర్లు, కీలక పత్రాలు, వస్తువులు, సామగ్రిలు అగ్ని కీలల తాకిడికి బుగ్గిపాలయ్యావని ఆయన పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంపై అబద్ద ప్రచారం ఖండించిన డిజిపి శివధర్ రెడ్డి కీలక ఫైళ్లు భద్రం మన తెలంగాణ/హైదరాబాద్: నాంపల్లిలోని ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్లో సంభవించిన అగ్ని ప్రమాదంపై జరుగుతున్న వదంతులను డిజిపి శివధర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. ఇది కేవలం అగ్ని ప్రమాదం మాత్రమేనని, కీలక ఫైళ్లు దగ్గమయ్యాయన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఏదయినా ఫైలు అగ్ని ప్రమాదంలో కాలిపోయినా వాటికి బ్యాక్అప్ ఉంటుందని ఆయన వివరించారు. ఈ ప్రమాదంపై జరుగుతన్న పుకార్లు నమ్మవద్దని ఆయనే పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక సాక్షాధారాలకు సంబంధించిన ఆధారాలు అగ్నికి ఆహుతయినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డిజిపి స్పందిస్తూ అందులో వాస్తవం లేదని స్పష్టం చేయడం గమనార్హం. ‘ఓటుకు నోటు’ ఆధారాలు చెరిపేందుకే: కెటిఆర్ అనుమానాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరగడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగులను, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేకపోవడాన్ని కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
8thFeb2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
8thFeb2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి
8thFeb2026 |ఆదివారం, నేటి పంచాంగం &ద్వాదశ రాశి ఫలితాలు, శుభయోగాలు–అశుభ హెచ్చరికలు
8thFeb2026 |ఆదివారం, నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు, శుభయోగాలు–అశుభ హెచ్చరికలు
జూన్లోగా యుద్ధానికి ముగింపు పలకాలి
` ఉక్రెయిన్,రష్యాలకు డెడ్లైన్ విధించిన అమెరికా న్యూయార్క్(జనంసాక్షి):ఉక్రెయిన్` రష్యా యుద్ధం ముగింపునకు అమెరికా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో అబుధాబీ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు …
ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్నిప్రమాదం
` కాలిబూడిదైన ఆధారాలు ` మొదటి అంతస్తులో చెలరేగిన అగ్నికీలలు ` మంటలను ఆర్పిన ఐదు ఫైర్ ఇంజన్లు ` మంటల్లో కీలక పత్రాలు, కంప్యూటర్లు ఆగ్నికి …
కేసీఆర్ను అరెస్టు చేస్తే మాకేం అభ్యంతరం లేదు
` చర్యలు తీసుకుంటామంటే మేమెందుకు అడ్డుకుంటాం:కిషన్రెడ్డి హైదరాబాద్,ఫిబ్రవరి(జనంసాక్షి):మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకుంటామంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో …
ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం.. రైతన్న, నేతన్న సేఫ్
వాషింగ్టన్ /న్యూఢిల్లీ : భారత్ అమెరికా మధ్య అ త్యంత కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు అయింది. పూర్తి సమగ్ర స్థాయి వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుకు సంబందించి ఇరుదేశాలూ శనివారం సంయుక్త ప్రకటన వెలువరించాయి. ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకరమైన ట్రేడ్ డీల్ ఫ్రేమ్వర్క్ రూపొందించుకున్నారు. దీని మేరకు రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు ఇనుమడించేందుకు వీలేర్పడుతుంది. ఉభయపక్షాలు దిగుమతి సుంకాలను తగ్గించుకుంటాయి. ఇప్పటి మధ్యంతర వాణిజ్య ఒప్పం దం ఖరారుతో భారతీయ ఎగుమతిదార్లకు 30 ట్రిలియ న్ డాలర్ల మేర మార్కెట్ ఏర్పడుతుంది. ఒప్పందంలో భా గంగా అమెరికా ముందుగా భారతీయ సరుకులపై ఇం తకు ముందటి 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తుంది. ఇక భారతదేశం అమెరికా పారిశ్రామక ఉత్పత్తు లు, ఆ దేశానికి చెందిన పలు ఆహార వ్యవసాయ సరుకులు వంటి వాటిపై దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేయడం లేదా, గణనీయంగా తగ్గించడం జరుగుతుంది. ఆహార ఉత్పత్తుల్లో డ్రైడ్ డిస్టిలరీస్ గింజలు, పశువుల దా ణాకు వినియోగించే ఎర్రజొన్న , ట్రీనట్స్, తాజా, ప్రాసిసిడ్ పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్కు కూడా మినహాయింపులు ఉంటాయి.ఇప్పుడు విడుదల చేసిన సంయుక్త ప్రకటన మేరకు భారతదేశం అమెరికా నుంచి ఈ దేశ ఇంధన ఉత్పత్తులు, విమానాలు, వాటి విడిభాగా లు, విలువైన లోహాలు, సాంకేతిక పరికరాలు, కుకింగ్ కోల్, వంటివి వచ్చే ఐదేండ్లలో 500 బిలియన్ డాలర్ల విలువ మేరకు కొనుగోలు చేస్తుంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం విధివిధానాలను ప్రకటిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇప్పటి ఒప్పందం ఖరారు నేపథ్యంలోనే అ మెరికా అధ్యక్షులు ట్రంప్ భారత్పై విధించిన ప్రతీకార సుంకాల్లో పాతిక శాతం వరకూ తగ్గించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. తాము పేర్కొన్నట్లు భారతదేశం గణనీయంగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తూ వస్తున్నందున ప్రతీకార సుంకాలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ ఫిబ్రవరి 7వ తేదీ , 2026 నుంచి అమలులోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు. రైతుల ప్రయోజనాలకు ప్రాదాన్యత : కేంద్రం ఇప్పుడు కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం పరిధి లో రైతుల ప్రయోజనాలకు హాని జరగకుండా చర్యలు తీ సుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యా లు, నూనెగింజలు, పౌల్ట్రీ, పాలు , జున్ను, ఇథనాల్, కూరగాయలు, మాంసంపై ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని వెల్లడించారు.
ఎవరు అడ్డంపడినా..హైదరాబాద్కు అభివృద్ధి ఆగదు
మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో: రాష్ట్రానికి అప్పులున్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఎవరు ఎంతగా అడ్డంపడినా.. అభివృద్ధి పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చే శారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణపూర్లో ‘ప్రజా పాలన- ప్రగతి బాట’ బహిరంగ సభకు హాజరు అయ్యి ప్రజలను ఉద్దేశించి ముఖ్య మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్, మోదీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గు ప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందాలతో, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని మండి పడ్డా రు. సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాకు నిధులు కేటాయించకుండా తీరని అ న్యాయం చేశారని మర్శించారు. సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వస్తుందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీళ్లు పారిస్తాం రంగారెడ్డి జిల్లాకు నీటి సౌకర్యాన్ని కల్పించే అవసరం ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీటిని ఖచ్చితంగా తీసుకువస్తానని సీఎం హామీ ఇచ్చారు. కాగ్నా నది ప్రాజెక్ట్ ద్వారా తాండూర్ ప్రాంత ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తానని తెలిపారు. ఇక్కడి ప్రాంతానికి ఎన్ని కోట్ల నిధులు కావాలంటే అన్ని నిధులను వెచ్చించి అయిన రోడ్ల నిర్మాణాల పనులను చేపడతామన్నారు. మూసి ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తె దాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే అందరికి రేషన్ కార్డులు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కుటుంబాలకు రేషన్ కార్డులను ఇచ్చి అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ అధికారంలో, 12 సంవతసరాలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి మున్సిపాలిటీలకు నిధులు కేటాయించలేదని అన్నారు. ఏక్కడ కూడా అభివృద్ధి చేయలేదని, ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి ఉంటే ఓట్లకోసం వంగి దండాలు పెట్టే దుస్థితి ఎందుకు వస్తుందని అన్నారు. మోదీకి ఓటు వేస్తే , మున్సిపాలిటీకి వచ్చిన నిధులు ఇస్తారా అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాకు గోదావరి నీళ్లు పారిస్తామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టి, మల్లన సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను కట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ రోజమ్మ చేసిన రొయ్యల పులుసు తిని రాయల సీమను రత్నాల సీమను చేస్తాని చెప్పి రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టాడని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాని, తమ ప్రభుత్వం గ్రూప్ -1 ఉద్యోగాలు ఇస్తే వాటిని కూడా కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు అన్నారు. కేసీఆర్ తన అల్లుని, కొడుకును మంత్రిని చేశాడు. బిడ్డను ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకుని ఎంపీ మాత్రం చేశాడని ఆరోపించారు. అప్పుడే దిగిపో దిగిపో అంటున్నారు. రంజిత్రెడ్డిని మంత్రిని చేస్తా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తాను.. జిల్లాకు ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు మంజూరు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రంజిత్రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొంది ఉంటే కేంద్రం నుంచి ఎన్ని నిధులైనా తెచ్చి ఇక్కడి ప్రాంతానికి కేటాయించి అభివృద్ధి చేసేవారని అన్నారు. చంద్రశేఖర్రావు, కల్వకుంట్ల కిషన్రావు రాసిపెట్టుకోండి.. రాబోయే 8 సంవత్సరాలు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే ఉంటుంది. ఈ పాలనలో రిజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం. మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించుకుంటాం. కృష్ణా రైల్వే నిర్మాణం పూర్తి చేసుకుంటాం. వికారాబాద్ను అంతర్జాతీయ టూరిజం ప్రాజెక్టు చేస్తాం. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ, మన్నెగూడ నుంచి తాండూరు వరకు రోడ్డును పూర్తి చేసుకుంటాం. మీ తాతలు దిగి వచ్చినా.. ఈ పనులు ఆపేదిలేదని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలోని 6650 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి 567.69 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బియ్యని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆగమాగం అవుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ పట్ట ణ కేంద్రంలోని ఇందిరాపార్క్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో హరీశ్ రావు మాట్లాడారు. రెండున్నరేళ కాంగ్రెస్ పాలనలో పాలు, నీళ్లు ఏమిటో ప్రజలకు అర్థమైందని అన్నా రు. ఎవరిని అడిగినా రేవంత్ పాలన ఎలా ఉందో చెబుతారని అన్నారు. గజ్వేల్లో జానెడు సీసీ రోడ్లు కూడా వేయలేదని, మోరీ కూడా కట్టలేదని, రూపాయి పని కూడా జరగలేదని విమర్శించారు. రేవంత్రెడ్డి మహాలక్ష్మిఅంటాడని, పింఛన్లు పెం చుతానని మాటఇచ్చి తప్పాడని ఆరోపించారు. గజ్వేల్లో కేసీఆర్ను ఓడించడానికి రేవంత్రెడ్డి కట్టలు కట్టలుగా డబ్బులు పంపించారని, ఆ డబ్బులు మనల్ని కొట్టి సంపాదించినవేనని అన్నారు. ఎవరు ఎంత ఇచ్చినా అవి మన పైసలేనని, వాటిని తీసుకుని బీఆర్ఎస్కు ఓటు వేసి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పాలనలో ఎస్సీలకు, గౌడలకు, యాదవులకు, క్రిస్టియన్లకు, వైశ్యులకు అందరికీ ఆత్మగౌరవ భవనాలు కట్టామని చెప్పారు. మిషన్ కాకతీయపై పెట్టిన ఖర్చే రూ.5వేల కోట్లు అయితే, బీజేపీ ఎంపీలు మాత్రం రూ.5,0-60 కోట్లు కేసీఆర్ తిన్నారని ఆరోపించారని అన్నారు. బీజేపీ వాళ్లు బట్ట కాల్చి మీద వేసి రకం అని విమర్శించారు. కాళేశ్వరం కట్టాకే బంగారు పంటలు పండుతున్నాయని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కాళేశ్వరం నిర్మించిన తర్వాత భూముల ధరలు పెరిగాయని, భూమికి బరువయ్యే పంట పండిందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి వెళ్లాయని అన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు ఏడాది గడిచినా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, గొర్రెల పంపిణీ, కంటి వెలుగు వంటి పథకాలను నిలిపేశారని ఆరోపించారు. రైతులకు ఎరువులు లేవని, పంట పెట్టుబడి సాయం లేదని అన్నారు. బీజేపీ వాళ్లు ఏం చేశారని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఒక్క పని చేయకుండా ఎలా ఓట్లు అడుగుతారని, కమలం గుర్తుకు ఓటు వేయడం అంటే మోరీలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెలీ వంటిరు యాదవ రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్ ‘ రాధాకృష్ణ శర్మ, బీఆర్ఎస్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్ను అరెస్ట్ చేసే దమ్ముందా?
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈగ, దోమ వాలనీయడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కిషన్ రావు అంటూ తనపై సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, ఇతర నాయకులు టి. వీరేందర్ గౌడ్, జి. వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెసిఆర్ను మరిపించేలా సిఎం డూప్ డైలాగులు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. సిఎం అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ పొందినా హర్డ్-వర్డ్ మానలేదని ఆయన విమర్శించారు. కెసిఆర్, రేవంత్ రెడ్డిని భరించాల్సిన దురదృష్టం రాష్ట్ర ప్రజలకు పట్టిందని ఆయన ఆవేదన చెందారు. అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని చర్లపల్లి జైలుకు పంపిస్తామని, కళ్ళు పీకి గోలీలు ఆడుకుంటామని, పేగులు పీకి మెడలో వేసుకుంటామని, చిప్పకూడు తినిపిస్తామని, అప్పటి బిఆర్ఎస్ మంత్రులపైనా విచారణ జరిపించి, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కెసిఆర్పై ఈగ, దోమ వాలనీయడం లేదన్నారు. ‘కెసిఆర్ కుంభకోణాలపై విచారణ జరిపించవద్దని ఎవరు చెప్పారు.? నేను చెప్పానా, రాహుల్ గాంధీ చెప్పారా? విచారణ జరిపి చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డుపడుతున్నదో సిఎం స్పష్టం చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. తనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిఎం డూప్ డైలాగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డూప్, డమ్మీ డైలాగులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. సినీమాల్లో డూప్ల డైలాగులు ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డూప్ డైలాగులు కొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నేను తిట్టినట్లు, నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లు బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం విమర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్ళూ తాము ఓపిక పడతామని, అధికారంలోకి రాగానే తమ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. ఇరు పార్టీలు అధికారంలో చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శ్వేతపత్రాలు విడుదల చేయాలి.. కేంద్రం నుంచి నిధులు ఏమీ రావడం లేదని ముఖ్యమంత్రి చేసిన విమర్శను ఆయన తోసిపుచ్చారు. మున్సిపాలిటీలకు, ఇతర అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం నుంచి విడుదలైన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఆడ బిడ్డకు తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, సభల్లో ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో మజ్లీస్ను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తున్నాయని ఆయన విమర్శించారు. రావు అయినా రెడ్డి అయినా తమ వద్దకు రావాల్సిందేనని మజ్లీస్ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారని ఆయన చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని గతంలో హైకోర్టు కొట్టివేసినా, మళ్లీ రేవంత్ రెడ్డి మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి, బిజెపిని గెలిపించాలని ఆయన కోరారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై.. రెచ్చగొట్టేలా ప్రసంగించే వారిపై చర్యలు తీసుకునేందుకు అసెంబ్లీలో చట్టం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను విలేకరి ప్రశ్నించగా, అలాంటి కేసు పెట్టాలంటే తొలుత ముఖ్యమంత్రిపైనే పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింలని, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చెప్పి మత రాజకీయం చేశారని ఆయన విమర్శించారు. ఎఫ్ఎస్ఎల్లో మంటలపై అనుమానం ఇదిలాఉండగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో మంటలు చెలరేగి ఫైళ్ళు కాలిపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇందులో ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలకమైన ఫైళ్ళు, విచారణ ఆధారాలు ఉంటాయని ఆయన తెలిపారు.
నకిలీ ట్రేడింగ్ యాప్లతో ఘరానా మోసం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఫారెక్స్ ట్రేడింగ్, ఆన్లైన్ పెట్టుబడి యాప్ల పేరుతో ప్రజలను మోసం చే స్తున్న అంతర్జాతీయ స్థాయి సైబర్ ముఠాను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. నకిలీ యాప్ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ నెట్వర్క్ను ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందా లు ఛేదించాయి. ఈ కేసులో ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బాట్ బ్రో, వైఎఫ్ఎక్స్, మినీ క్రిప్టో, బిట్ నోవా, క్యూఎఫ్ఎక్స్ వంటి పేర్లతో రూపొందించిన యాప్ల ద్వారా ఈ ముఠా ప్రజలను ఆకర్షించింది. నెలకు 9 నుంచి 10 శాతం లాభాలు వస్తాయని నమ్మబలికి పెట్టుబడులు సేకరించారు. వాస్తవానికి ఇవన్నీ ప్రభుత్వ అనుమతి లేని నకిలీ ఎమ్ఎల్ఎం స్కీమ్లని పోలీసుల దర్యాప్తులో తేలింది.పలు మార్కెటింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా అమాయక ప్రజల వద్ద నుండి భారీ స్థాయిలో పెట్టుబడులు సేకరించి భారీ మోసానికి పాల్పడారు. బాట్ కంపెనీ ,దాని ఏజెంట్లు ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో నెలకు ఖచ్చితమైన లాభాలు వస్తాయని హామీ ఇచ్చి వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న ఐదుగురు ప్రధాన ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం నగరంలోని ఖానాపురం కుచెందిన భుక్య శ్రీధర్ నాయక్ (28) ,కైకొండాయిగూడెంకు చెందిన తేజావత్ ఉపేందర్ (37) ,నీలకంఠం సిద్ధు (32), కారేపల్లి మండలానికి చెందిన వంకుడ్యత్ సురేష్ (29) , మరికొందరు మధ్యవర్తులపై చీటింగ్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డిపాజిటర్స్ యాక్ట్ , ఐటీ యాక్ట్ 2008 నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచే కుట్ర ఈ మోసాలకు ప్రధాన సూత్రధారి దుబాయ్ కేంద్రంగా ఉన్న లవిష్ చౌదరి అలియాస్ నవాబ్ అలీ అని పోలీసులు గుర్తించారు. అతనితో పాటు ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్కు చెందిన గజేంద్ర సింగ్, దీపక్ యాదవ్, ప్రిన్స్ గుప్తా, ప్రమోద్ మౌర్య, వికాస్ మౌర్య తదితరులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ఐదుగురు ఏజెంట్లు ఇప్పటివరకు రూ.2,73,43,440 అక్రమంగా సంపాదించినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బుతో వారు తమ కుటుంబ సభ్యుల పేర్లపై స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నెట్వర్క్ లో ఇంకా పలువురు స్థానిక ఏజెంట్లు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు నియమించినట్లు పోలీసులు తెలిపారు దుబాయి కి చెందిన బాట్ వ్యవస్దాపకులు లావిష్ చౌదరి ,ఢిల్లీకి చెందిన గజేంద్ర సింగ్,దీపక్ యాదవ్,ప్రిన్స్ గుప్తా,సందీప్ నర్వాల్, ఉత్తర్ ఫ్రదేశ్ లోని మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన యశ్ దేవ్ శైనీ, పంజాబ్- చండీగఢ్ కు చెందిన ప్రమోద ప్రమోద్ మౌర్య ,వికాస్ మౌర్య,వివేక్ పటాన్ నిందితులను పట్టుకోవాల్సి ఉంది. అయితే సదరు నిందితులు తరచుగా పేర్లు, ప్లాట్ఫారమ్లు మారుస్తూ, దుబాయ్ లో ఉన్న ప్రధాన సూత్రధారులతో కలిసి అక్రమ ఎంఎల్ఎం(మల్టీ లెవల్ మార్కటింగ్ ) స్కీమ్ , అనధికార ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ లను నడిపించి తద్వారా ప్రజల వద్ద నుండి బారి పెట్టుబడులు సేకరిస్తూ మోసం చేస్తున్నారని ఖమ్మం నగర ఏసిపి ఎస్ వి రమణమూర్తి తెలిపారు.ఈ నేరములో ఇతర ఏజెంట్లను గుర్తించి, విదేశాల్లో ఉన్న సూత్రధారులను చట్టపరంగా పట్టుకునేందుకు మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. బాధితుల వివరాలు సేకరించి మరిన్ని కేసులు నమోదు చేస్తామని వారు చెప్పారు. ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ వి రమణ మూర్తి పర్యవేక్షణలో, ఖానాపురం హవేలి ఇన్స్పెక్టర్ భాను ప్రకాశ్ ఆధ్వర్యంలో కేసు ధర్యాప్తు కొనసాగుతుంది ప్రజలంతా అన్ లైన్ ట్రెడింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పెట్టుబడులు పెట్టి ముందు సంబంధిత స్కీమల విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధిక లాబాలు ఇస్తామని చెప్పి ఆఫర్లకు మోసపోవద్దని, అనుమానాస్పద పెట్టుబడి పథకాలను వివరాలు తెలసి ఉంటే అట్టి వివరాలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు
‘జెన్ జీ’ ఈజ్ వాచింగ్ ఇకనైనా మారాలి..!
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని వినమ్రంగా అభ్యర్థించడానికి వచ్చాను, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఈ విషయంలో ఆరు లేఖలు రాసినా స్పందన లేని కారణంగా మీ తలుపులు తట్టాల్సి వచ్చింది. అక్షర దోషాలు ఉన్న కారణంగానో, మరే చిన్న చిన్న పొరపాట్ల వల్లనో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్) పేరుతో కొద్దిమాసాల్లో ఎన్నికలు జరగనున్న తమ రాష్ట్రంలో ఒక కోటి నలభై లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్కి బుధవారం నాడు మొర పెట్టుకొన్నప్పటి మాటలు ఇవి. భారత దేశ చరిత్రలో బహుశా ఒక ముఖ్యమంత్రి ఇట్లా దేశ అత్యున్నత న్యాయస్థానానికి తన సమస్యను విన్నవించుకోడానికి స్వయంగా హాజరయిన సంఘటన ఇదే ప్రథమం. సుప్రీంకోర్టులో నల్లకోటు ధరించి తనకు ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని మమత వేడుకుంటున్న సమయంలోనే రాజ్యసభలో ప్రముఖ నటుడు ఎంఎన్ఎం పార్టీ తరఫున డిఎంకె మద్దతుతో రాజ్యసభ సభ్యుడైన కమలహాసన్ తన తొలి ప్రసంగం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తూర్పారపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ పేరిట ఒక వ్యాధిని దేశమంతా విస్తరింప చూస్తున్నదని, దానిని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉన్నదని అన్నారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో అనేక మంది సజీవ మృతులు ఉన్నారని, తమిళనాడులో కూడా ఒక కోటి మంది పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించి వారిని కూడా సజీవ మృతుల్ని చేసే పనిలో ఎన్నికల సంఘం ఉందని ఆయన సభ దృష్టికి తెచ్చారు. కమలహాసన్ మాట్లాడేందుకు ఆయన పేరు పిలిచేటప్పుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన తొలి ప్రసంగం కాబట్టి పూర్తిగా విందాం అన్నందుకేమో కమలహాసన్ కొద్ది సేపే అయినా తన ప్రసంగంలో చాలా పదునైన భాష వాడినప్పటికీ ఎవరూ అభ్యంతర పెట్టలేదు. శాశ్వతంగా అధికారంలో ఉండాలని ఏ ప్రభుత్వము కోరుకోకూడదు, అది ప్రపంచంలో ఎవరికీ సాధ్యపడలేదు అని కమలహాసన్ హెచ్చరించారు. ఓ పక్క సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని గౌరవ న్యాయమూర్తులను వేడుకుంటున్న సమయంలోనే రాజ్యసభలో కమలహాసన్ మాట్లాడిన మాటలు కాకతాళీయమే అయినా ఇవాళ మన చట్టసభల పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని అనడంలో సందేహం లేదు. చట్ట సభల్లో ఇక న్యాయం దక్కే పరిస్థితి లేదని భావించినందువల్ల మమతా బెనర్జీ న్యాయస్థానం వైపు చూస్తుంటే కమలహాసన్ మాత్రం ఇంకా చివరి ఆశతో పార్లమెంట్ను వేడుకుంటున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమలహాసన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు రాష్ట్రంలో కొద్ది మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరిట పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించే పని జరుగుతున్న ఫిర్యాదు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నది. లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దీన్నొక ఉద్యమంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరం అయిన స్థానాలు లోకసభలో లభించనప్పటికీ మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్న బిజెపి రాష్ట్రాలను కైవసం చేసుకోవడానికి ఈ ఎస్ఐఆర్ను ఎన్నికల సంఘం ద్వారా ప్రయోగిస్తున్నదన్నది ప్రతిపక్షాల అభియోగం. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ముఖ్యంగా బుధవారం నాడు మమతా బెనర్జీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి చూస్తుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకునే భారత దేశంలో చట్టసభల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోతున్నదా అన్న సందేహం కలగక మానదు. మమతా బెనర్జీ మామూలు వ్యక్తి కాదు, ఆమె ఈ దేశంలోనే ఒక బలమైన రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు. 34 సంవత్సరాల వామపక్ష పరిపాలనకు చరమగీతం పాడి 2011 నుండి పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన నాయకురాలు. ఆమె నాయకత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది. 2011లో ముఖ్యమంత్రి కావడాని కంటే ముందు నాలుగు సార్లు ఆమె పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి ముఖ్యమైన శాఖలు నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ను, అటు వామపక్షాలను పశ్చిమబెంగాల్ సరిహద్దులకు పరిమితం చేసిన మమతా బెనర్జీకి ప్రస్తుతం లోకసభలో 28 మంది సభ్యులు, రాజ్యసభలో మరో 13 మంది సభ్యులు ఉన్నారు. ఇంత శక్తిమంతురాలైన మమతా బెనర్జీ ఈ సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ముందటికి ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది. చట్టాలు చేసేది పార్లమెంట్ కదా, ఇటువంటి విషయాలన్నీ అక్కడ చర్చించి పరిష్కారం చేయాలి కదా? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడేది పార్లమెంట్ చేసే చట్టం ద్వారానే, అటువంటి వ్యవస్థలో లోటుపాట్లను సరిదిద్ది దేశ ప్రజలందరికీ న్యాయం చేయవలసిన పార్లమెంటులో అది జరగడం లేదనే కదా మమతా బెనర్జీ న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అయ్యే ప్రజాధనం వ్యయం కాక వివిధ పార్టీల ఎన్నికల ఖర్చు 2024లో రూ. లక్షా 35 వేల కోట్లకు చేరినట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో వెల్లడి అయింది. ఇట్లా ఏర్పాటైన పార్లమెంట్లో పోనీ ప్రజాసమస్యల మీద సజావుగా చర్చ జరుగుతున్నదా, ప్రజోపయోగమైన చట్టాల రూపకల్పన జరుగుతున్నదా అంటే అది కూడా జరగడం లేదని స్వయంగా లోకసభ స్పీకర్ అంగీకరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం చూసినా భారత పార్లమెంట్ నిర్వహణకు నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక గంట సేపు పార్లమెంటు సమావేశం అయితే కోటిన్నర రూపాయల ప్రజాధనం వ్యయం అవుతుంది. ఇక భద్రతకు సంబంధించిన ఖర్చు, సిబ్బంది జీతభత్యాలు మొదలయిన ఖర్చులు వేరు. పార్లమెంట్ సమావేశమయిన సమయంలో అర్థమంతమైన చర్చలు జరిగాయా, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏమైనా జరిగా అనే విషయంతో సంబంధం లేకుండా జరిగే ఖర్చు ఇది. గత సోమవారం నాడు సభను వాయిదా వేస్తూ లోకసభ స్పీకర్ ఓం బిర్లా స్వయంగా ప్రకటించినట్టు 19గంటల సభా సమయం వృథా అయింది. అంటే గంటకు కోటిన్నర రూపాయల చొప్పున 19 గంటలకు సుమారు 30 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్టే కదా. ఇందుకెవరు బాధ్యులు? సభ నిర్వహణలో కీలక సహకారం అందించవలసిన అధికార ఎన్డిఎ, ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న బిజెపి బాధ్యత వహించాలా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు అంటూ సభలో నిరసనలు వ్యక్తం చేసి సభా కార్యక్రమాలను స్తంభింప జేసిన ప్రతిపక్ష యుపిఎ కూటమి, ఆ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయాలా? కోట్లాది రూపాయల వ్యయం జరుగుతున్నా ఫలితం లేదని బాధపడాలా? ఇదిలా ఉంటే బహుశా మన దేశ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భద్రతా కారణాల దృష్ట్యా ప్రధానమంత్రిని పార్లమెంటుకు రావద్దని తాను సూచించినట్టు లోకసభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించడం మన పార్లమెంట్లో పరిస్థితికి అద్దం పడుతున్నది. కాంగ్రెస్ సభ్యులు ప్రధాని స్థానాన్ని చుట్టుముట్టి ఏదైనా ఊహించని చర్యకు పాల్పడే ప్రమాదం ఉందని తనకు కచ్చితంగా సమాచారం ఉన్నందున ఆయనను సభకు రావద్దని తాను కోరినట్టు స్పీకర్ చెప్పారు. అంతకు ముందు బుధవారం నాడు కొందరు మహిళా ప్రతిపక్ష ఎంపిలు బ్యానర్లు పట్టుకొని ప్రధాని స్థానం వైపు దూసుకు రావడంతో సభలో ఆందోళన మొదలైంది, అలాగే స్పీకర్ పోడియం వద్ద కూడా ప్రతిపక్ష సభ్యులు దూసుకు రావడంతో సభ వాయిదా పడింది. సభలో ఇటువంటివి జరగడం సర్వసాధారణం. ప్రతిపక్షంలో ఉన్న మన ప్రజాప్రతినిధులు ప్రధాన మంత్రి మీదనే దాడి చేసేంత స్థితికి దిగజారారని సాక్షాత్తు సభాధ్యక్షుడే నమ్మడం విచారకరం. సభకు అధిపతి అయిన స్పీకర్ ప్రధానమంత్రికి రక్షణ కల్పించలేనని అశక్తత వ్యక్తం చేయడం మన పార్లమెంటు ఎట్లా నడుస్తున్నదో అర్థమైంది. రాజకీయంగా అభిప్రాయ భేదాలు వ్యక్తం కావడం అంశాల వారీగా చర్చించుకోవడం ఒకానొక స్థితిలో అవి కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే విధంగా సాగడం సహజమే కానీ భౌతికంగా, అదీ సభలో హాని చేసే స్థితికి మన గౌరవ ప్రజాప్రతినిధులు వెళ్తారని సభాధ్యక్షుడు స్వయంగా ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. సభలోపలా, వెలుపలా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉండే స్నేహ వైరుధ్యానికి సంబంధించి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా చెప్పిన రెండు సంఘటనలను జ్ఞాపకం చేసుకోవాలి. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో వాజ్పేయి యువ లోకసభ సభ్యుడు. ఒకసారి సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నెహ్రూను ఉద్దేశించి మీలో ఇద్దరు వ్యక్తులున్నారు, ఒకరు చర్చిల్ అయితే మరొకరు చెంబర్లిన్ అన్నారట. సభ ముగిసాక సాయంకాలం ఒక విందులో కలిసినప్పుడు నెహ్రూ వాజ్పేయి భుజంతట్టి సభలో ఈ రోజు జోర్దార్గా మాట్లాడారు మీరు అని ప్రశంసించారట. తరువాత చాలా కాలానికి పివి నరసింహా రావు ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని కశ్మీర్ సమస్య మీద చర్చ జరగనున్న జెనీవా మనవ హక్కుల సదస్సుకు భారత దేశం తరఫున హాజరయ్యే అధికార ప్రతినిధి బృందానికి నాయకుడిని చేసి పంపారట. ఆ సదస్సుకు హాజరయిన ఇతర దేశాల ప్రతినిధులు ఈ అంశాన్ని ఒక విశేషంగా చెప్పుకున్నారని వాజ్పేయి స్వయంగా చాలా చోట్ల చెప్పేవారు. ఇంత సామరస్య వాతావరణం ఉంటే మమత సుప్రీంకోర్టు మెట్లెక్కే అవసరం ఎందుకొచ్చేది? ఇదంతా దేశం చూస్తున్నది. కమలహాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగం చివర్లో చెప్పినట్టు జెన్ జీ ఈజ్ వాచింగ్ అజ్ (భావి భారత పౌరులు మనను గమనిస్తున్నారు). Delete Edit
వార ఫలాలు (08-02-2026 నుండి 14-02-2026 వరకు)
మేష రాశి ఫలితాలు : మేష రాశి వారికి ఈ వారం ఆదాయం తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న పాటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే బాగుంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉంటారు. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీరు చేసే కృషి ఫలిస్తుంది. పదిమందిలో మెప్పు పొందే విధంగా ఉంటుంది. మీరు ఏదైతే మాట్లాడుతారో ముక్కుసూటిగా ఉంటుంది అది అందరికీ నచ్చదు. ఈ రాశి వారు ఏది మాట్లాడినా తప్పు అవుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పై అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించిన విషయాలలో వారి చదువుపట్ల ఆచితూచి అడుగు వేయటం మంచిది. ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఫిబ్రవరి నెల 17 వరకు శుక్ర మౌడ్యమి ఉంది కాబట్టి 18వ తేదీ నుండి శుభముహూర్తాలు ఉన్నాయి చక్కగా వివాహ ప్రయత్నాలు నూతన గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలు చేసుకోవచ్చు. వివాహ సంబంధిత విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా స్ట్రెస్ కు లోన్ అవటం వలన ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. బీపీ షుగర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు వాటి పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ రాశి వారు సంకల్పబలంతో ముందుకు వెళ్ళటం మంచిది. అంతేకానీ ఈ పని అవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉంటే ఏ పని నెరవేరదు. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లు చాలా చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే డాక్టర్ సలహాలు తీసుకొని జాగ్రత్త పడటం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం హనుమాన్ చాలీసా పఠించండి కుదిరితే ఒకరోజు సుందరకాండ పారాయణం ఇంట్లో చేయించుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. ధనం ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటాయి. ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ లభించే అవకాశం గోచరిస్తుంది. పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పదిమంది పలు రకాలుగా చెప్తారు ఏది మంచో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అదేవిధంగా అధికారులతో కొంత ఇబ్బంది ఉండే అవకాశం గొచరిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. శుభకార్య ప్రస్తావన ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన వ్యవహారాలు బాగుంటాయి. అయితే సంతానం ఉద్యోగం పట్ల కొంత నిరాశ ఏర్పడుతుంది. చేతిదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయిన బాధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. కాస్మటిక్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్స్ కి సివిల్ సర్వీసెస్ లో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాల ప్రారంభోత్సవం నూతన వాహనాలకు కొనుగోలు ఎక్కువగా గొచరిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. పేరు ప్రఖ్యాతల విషయంలో ఎలాంటి ఇబ్బంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ కాలం గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఏదైనా సరే కష్టపడి వెళ్లాల్సి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఫ్రెండ్స్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కష్ట కాలంలో మీకు ఎవరూ తోడు ఉండరు కాబట్టి పెద్ద వాళ్ళ మాట విని శ్రద్ధగా చదువుకోవడం మంచిది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారంపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య రీత్య కూడా అన్ని సానుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడంలో మంచి శుభవార్త వింటారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. గృహప్రవేశం చేయాలనే కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఖర్చులు విషయంలో మాత్రం జాగ్రత్త వహించడం మంచిది. ప్రతిరోజు సుబ్రమణ్య స్వామి అష్టకం చదవండి అలాగే సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లు ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి. రావలసి ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చేతికి అందుతాయి. రాహు ప్రభావం వలన మనసు పరిపరి విధాలుగా ఉండటం, ఏ పని చేసినా సరే హడావిడిగా చేయటం, పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తతో మాట్లాడటం చేయాలి. పై అధికారులతోటి జాగ్రత్త పడటం చెప్పదగిన సూచన. చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గడచిన కాలం కంటే కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది . కొన్ని కార్యక్రమాల పట్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఏదైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఖర్చులు అదుపులోకి వస్తాయి భూ సంబంధిత విషయ వ్యవహారాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. మీ స్నేహితుల అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. లాయర్లకి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కాని మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఖర్చులు అదుపులో ఉండవు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయం మనకే తెలుసు ఎవరు చెప్పనవసరం లేదు అనే ధోరణి అవలంబించకండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. మీరు రాసుకు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా గడిచిన వారం కంటే బాగుంటుందని చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సినీ కళా రంగాలలోని వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. సుబ్రహ్మణ్యం పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం కొంత అప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. నూతన కాంట్రాక్టులు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. చార్టెడ్ అకౌంటెంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రావలసిన బెనిఫిట్స్ లభిస్తాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది చదువుపై శ్రద్ధ వహించండి. విదేశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం ఆడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాజు వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడుల నుండి రాబడి రావడం మొదలు అవుతుంది. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి మంచి సంబంధం కుదురుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై తగిన శ్రద్ధ వహించాలి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాజు వారు ప్రతి రోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి వీసా పాస్పోర్ట్ లభిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు గ్రే. తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనయోగం ఉంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. సమాజ సేవలో మీ వంతు సహకారం అందిస్తారు. గో సేవ చేయండి. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయవిక్రయాలలో లాభపడతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి లాయర్లకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి నిత్యవసర సరుకులు అమ్మేవారికి ఈవారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రాజు వారు పెద్ద రోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఇంద్రాణి రూపం మెడలో ధరించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వస్తే రంగు స్కై బ్లూ. ఇదే నా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సహోదరీ సహోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. వ్యవసాయదారులకు ప్రేరేచరంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్స్ నడిపే వారికి ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలువ అనుకూలంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై తగిన శ్రద్ధ వహించాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార పరంగా రొటేషన్సు బాగుంటాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవండి సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసివచ్చ సంచే ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా అధికారుల అండదండలు లభిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది తక్కువగా ఉంది అనే బాధ కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితి ఆసాజనకంగా ఉంటుంది. వ్యాపార పరంగా తొందరపాటు పనిచేయదు. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ధనం సరైన సమయంలో చేతికందక ఇబ్బంది పడతారు. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. కొన్ని వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. ఈ రాశి వారు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతో అమ్మ వారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఇదేనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో తక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉదర సంబంధిత వ్యాధులు గైనకాలజికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శని కళా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. సాహిత్య రంగంలో ఉన్నవారికి అవార్డు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. సంతాన పురోగతి బాగుంటుంది. వివాహ సంబంధమైన విషయాలలో కొంత ఆలస్యం ఏర్పడుతుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
బెల్లంపల్లి గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు భో జనం చేసిన తరువాత అస్వస్థతకు గురికావడంతో పుడ్ పాయిజన్ జ రిగి ఉంటుందనే వాదనలు వినవస్తున్నాయి. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి వసతి గృహాంలో విద్యార్థులు భోజనం చేసిన తరువాత 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థులను బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఆసుపత్రి కి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చి కిత్స అందించారు. గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ గురుకులాలపై ప్రభుత్వ వైఖరీ తెలియజేస్తుందని విద్యార్థుల పేరేంట్స్ అన్నారు. గురుకులాలలపై సక్రమైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే తరచు పుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతుండడం దురధృష్టకరం, ఇప్పటికే పలు ప్రాంతాలలో గురుకులాలలో పుడ్పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చేరిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికి, బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో సంఘటన జరగడం నిర్లక్ష్యానికి దారితీస్తుందనడంలో ఏలాంటి సందేహాం లేదు.ఈ సంఘటన తెలిసిన ఎంఎల్ఎసి మల్క కొంరయ్య శనివారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించారు. పుడ్ పాయిజన్ సంఘటనను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో సంఘటన విషయమై ఛరవాణిలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బెల్లంపల్లి గురుకుల పాఠశాల లో జరిగిన పుడ్ పాయిజన్ విషయమై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేసారు. ప్రతి సారి గురుకుల పాఠశాలలో పుడ్పాయిజన్ ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు, అధికారుల పర్యవేక్షణ ఎందుకు కొరవడుతుందని, ఈ విషయాలపై పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. పుడ్ పాయిజన్ సంఘటనపై రిపోర్టు హెల్త్ డైరెక్టర్ కు పంపాలని ఆయన ఆదేశించారు. గురుకులం ఘటనకు బాద్యులను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. విద్యార్థులకు ఏలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
శ్రీశైలంలో 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సుమారు 30 శాతం మంది భక్తులు ఎక్కువగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 8న ఉదయం శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9 నుంచి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి వివిధ వాహన సేవలు, గ్రామోత్సవం జరుగుతాయి. ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వం తరపున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నేడు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా హాజరుకావాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. 15న మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ : టిటిడి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గంటల నుండి అర్థరాత్రి 12 గం=టల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి ఎండి హబీబ్ ను గెలిపించండి
పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్
నన్ను ఆశీర్వదించి గెలిపించండి బీమా మల్లేష్
క్యాతన్ పల్లి ఫిబ్రవరి 7 ఆంధ్రప్రభ విస్తృతంగా ప్రచారం చేస్తున్న 9 వ
వార్డులో సమస్యలు లేకుండా ప్రజా సేవచేస్తా..
9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అప్పం కిషన్ భూపాలపల్లి, ఫిబ్రవరి 7(ఆంధ్రప్రభ): భూపాలపల్లి
హర్యానాలో జరుగుతున్న సూరజ్కుండ్ మేళాలో విషాదం నెలకొంది. ఉత్సవం జరుగుతుండగా ఓ రంగులరాట్నం కుప్పకూలింది. విధుల్లో ఉన్న ఓ పోలీసు మృతి చెందాడు. 13 మంది గాయపడ్డారు. అంతకు ముందు ఇక్కడనే ఓ ద్వారం విరిగిపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రతి ఏటా ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున సూరజ్కుండ్ హస్తకళల పలు ప్రాంతాల నుంచి జనం తరతివస్తారు. ఉత్సం వద్ద దుర్ఘటన గురించి తెలియగానే జిల్లా ఉన్నతాధికారి ఆయుషు సిన్హా. పర్యాటక శాఖ ఎండి పార్థ్ గుప్తా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రంగుల రాట్నం కూలి అక్కడున్న పోలీసుపై పడింది. ఆయన అక్కడికక్కడనే మృతి చెందారు. ఆపరేటర్ భుజానికి తీవ్రగాయం అయింది.
మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికై కాంగ్రెస్ కు పట్టం కట్టండి
పంచాయతీ రాజ్ మంత్రి, భువనగిరి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ సీతక్క, తుంగతుర్తి
2వ వార్డులో నిచ్చకోల వంశీకృష్ణ ప్రచార ప్రభంజనం
గెలుపే లక్ష్యంగా ‘బ్యాటు’ గుర్తుతో ముందడుగు బెల్లంపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): మున్సిపల్
బెల్లంపల్లి అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం బీఆర్ఎస్ లీడర్లు చెప్పేవన్ని మోసం మాటలే
కాంగ్రెస్ కు ఓటేయండి .. 34 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాంఎమ్మెల్యే గడ్డం
మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి ఆదరణ
ఆలేరు, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల కోసం
రోజంతా సాగిన ఎమ్మెల్యే ప్రచారం
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో శనివారం ఉదయం నుండి
పదవి లేకుండానే అభివృద్ధి ముద్ర…
3వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శ్రీనివాసులుకు ప్రజలు బ్రహ్మరథం మహబూబ్
18వ డివిజన్లో కాంగ్రెస్ జోరు…
అభివృద్ధి అజెండాతో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి జాజిమొగ్గ నరసింహులు మహబూబ్ నగర్, ఫిబ్రవరి
congress l ప్రజా సమస్యల పరిష్కార మే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..
congress l ప్రజా సమస్యల పరిష్కార మే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం.. పదో
కాంగ్రెస్ అబద్ధాలను ఎండగడుతున్నందుకే నాపై దండయాత్ర..
మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావించారు. అయితే ఈ నెల 11న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుండడం, అనంతరం మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక జరగనున్నందున అనుకున్న తేదీ కాకుండా మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలాఉండగా బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏ తేదీలను ఖరారు చేసినా, వెంటనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి శనివారం సంబంధిత అధికారులతో సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు. మరోవైపు నాటి నిజాం కాలం నాటి భవనాన్ని కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు అవసరమైన విధంగా స్వల్ప మార్పులు చేసి, తుది మెరుగులు దిద్దుకుంటున్నది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించే రోజు వరకు సిద్ధం అయ్యేలా అధికారులు పనులు వేగవంతం చేయించారు.
కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి… అభివృద్ధి నా బాధ్యత
గెలుపు దిశగా ..దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న
brs l ప్రజల అండతో మరోసారి విజయం ఖాయం అంటున్న ఆరెపల్లి..
brs l ప్రజల అండతో మరోసారి విజయం ఖాయం అంటున్న ఆరెపల్లి.. మోసపోవద్దు
MLA L ప్రజల్లో ఉండే వాళ్ళకే టికెట్స్ ఇచ్చినం…
MLA L ప్రజల్లో ఉండే వాళ్ళకే టికెట్స్ ఇచ్చినం… మీకు ఎల్లప్పుడూ అందుబాటులో
brs l పదవ డివిజన్లో ‘కారు’ జోరు…
brs l పదవ డివిజన్లో ‘కారు’ జోరు… పాత పాలమూరు,బాలాజీ నగర్లో అభ్యర్థి
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో యుఎస్ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 161 పరుగులు చేస్తుంది. ఈ మ్యాచ్ లో సర్యకుమార్ (84) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తిలక్ వర్మ(25), ఇషాన్ కిషన్(20) పరుగులు చేశారు. యుఎస్ఎ బౌలర్లలో షాడ్లీ 4, హర్మీత్ సింగ్ 2, మొహ్సిన్ అలీ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
vamsi krishna l వార్డు అభివృద్ధి నా లక్ష్యం..
vamsi krishna l వార్డు అభివృద్ధి నా లక్ష్యం.. క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ;
swathi l 7వ వార్డులో గెలుపే లక్ష్యంగా ప్రచార ప్రభంజనం!
swathi l 7వ వార్డులో గెలుపే లక్ష్యంగా ప్రచార ప్రభంజనం!
కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త
జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్ లో కుటుంబ కలహాలతో ఆదరవేని సత్తవ్వ (50) అనే మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. గత కొద్దిరోజులుగా మనస్పర్ధలతో భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మల్లయ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో సత్తవ్వపై గోడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిందితుడు మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
prasanna l గత పాలనకు గుర్తుగా ప్రజల మద్దతు…
prasanna l గత పాలనకు గుర్తుగా ప్రజల మద్దతు… 49వ డివిజన్ లో
Video: Manasa Varanasi Exclusive Interview
The post Video: Manasa Varanasi Exclusive Interview appeared first on Telugu360 .
బి ఆర్ ఎస్ తోనే మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం
కారు గుర్తుకు ఓటు వేస్తే …కాంగ్రెస్ చెంప మీద కొట్టినట్టే
మధురలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున 2.45 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణికుల విరామం కోసం రహదారి పక్కన ఆగింది. ప్రయాణికులు బస్సు దిగి బయట నిల్చుని ఉండగా ఒక కంటైనర్ మితిమీరిన వేగంతో అదుపు తప్పి ప్రయాణికుల పైకి దూసుకు రావడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతగిరి అడవుల్లో స్టే అనుభవాన్ని అందిస్తున్న ది బ్రీస్ #EcoTourism #Ananthagiri #Vikarabad #TGFDC
కొల్లూరు నాయకుల ప్రచారం ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
APPSC l ఏపీపీఎస్సీ పరీక్షలకు స్వరం సిద్ధం..
APPSC l ఏపీపీఎస్సీ పరీక్షలకు స్వరం సిద్ధం.. APPSC l కర్నూలు ఆంధ్ర
ప్రజా సమస్యల పరిష్కార మే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం
-పదో వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేజే
వికారాబాద్ అనంతగిరి హిల్స్లో కర్నాటక తరహా జంగల్ కాటేజెస్
కర్ణాటక రాష్ట్రంలోని ‘జంగల్ లాడ్జిస్‘ తరహాలో తెలంగాణలో తన ఎకో టూరిజం బ్రాండ్కు ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్’ అనే పేరుతో ట్రెక్కింగ్, బర్డ్ వాక్స్, నైట్ క్యాంప్స్, జంగల్ కాటేజెస్లో బస, సఫరీ, అడవిలో ‘బుష్ బ్రేక్ఫాస్ట్’ వంటి వినూత్న కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రారంభించింది. దీనిలో భాగంగా భాగంగా అటవీ అభవృద్ధి సంస్థ - ది బ్రీజ్ అనంతగిరి హిల్స్ - వికారాబాద్లో జంగల్ కాటేజెస్ నిర్మించి, అటవీ విజ్ఞాన శాస్త్రం చదివిన, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వారిని ఈ డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్ - ఎకో టూరిజం విభాగంలో ఒక నెల పాటు అడవులు, వృక్ష వైవిద్యం, జంతు విజ్ఞానం, వాటి సంరక్షణ, హాస్పిటాలిటీ వంటి అంశాల మీద నైపుణ్యం పెంచి వారిని ‘నేచురలిస్ట్’లు గా నియమిస్తారు. ది బ్రీజీ ని ముందుగా గెస్ట్లు - వ్బ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు గాను పలు ప్యాకేజీలతో కూడిన ధరలు అందుబాటులో ఉంచింది. మిగిలిన వివరాలకు అటవీ అభివృద్ధి సంస్థ, డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్ సంస్థలను సంప్రదించాలని సూచించింది.
24వ డివిజన్లో కాంగ్రెస్ గెలుపు దిశగా దూకుడు…
గుమ్ముడాల రాధ గోవర్ధన్ గౌడ్ విజయం దాదాపు ఖాయం 34 ఏళ్ల జర్నలిస్టు
37loves17 |మైనర్ పై మోజు పడ్డ మాతృమూర్తి
37loves17 | మైనర్ పై మోజు పడ్డ మాతృమూర్తి 37loves17 | అత్త,
amarnath l అంబటి కుటుంబాన్ని పరామర్శించిన గుడివాడ అమర్ నాథ్
amarnath l అంబటి కుటుంబాన్ని పరామర్శించిన గుడివాడ అమర్ నాథ్ అంబటి కుటుంబాన్ని
¾ Lady Medicos : డాక్టరమ్మలొస్తున్నారోచ్ Andhra prabha top Story
Lady Medicos : డాక్టరమ్మలొస్తున్నారోచ్ Andhra prabha top Story
తెగని ఎపి, తెలంగాణ ఉద్యోగుల పంచాయితీ? అటకెక్కిన కమల్నాథన్ కమిటీ సూచనలు తెలంగాణలో పనిచేస్తూ ఎపికి వెళ్లడానికి సుముఖంగా లేని 1,300 మంది ఉద్యోగులు ఎపి నుంచి రావడానికి 1,808 మంది ఉద్యోగులు సిద్ధం మిగతా 1,025 మంది ఉద్యోగులకు తెలంగాణ స్థానికత లేదు మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి, తెలంగాణ ఉద్యోగు ల పంచాయితీ తేలడం లేదు. ప్రస్తుతం 1,808ల మంది ఉద్యోగులు ఎపి నుంచి తెలంగాణకు రావాల్సి ఉండగా, తెలంగాణలో పనిచేసే ఎపికి చెందిన 1,300ల మంది ఉ ద్యోగులు ఎపికి వెళ్లాల్సి ఉంది. అయితే, తెలంగాణలో ప నిచేసే 1,300ల మంది ఉద్యోగులు ఎపికి వెళ్లడానికి సు ముఖంగా లేకపోవడం, ఎపి నుంచి వచ్చే వారిలో కొంద రు తెలంగానేతరులు కావడంతో ఈ అంశం ప్రస్తుతం పెండింగ్లో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు ఈ అంశంపై ఇ రు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నా ముం దుకెళ్లడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, తెలంగాణలో పనిచేసే ఎపి ఉద్యోగు లు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని, ఎపి నుంచి తెలంగాణకు రావాల్సిన ఉద్యోగుల్లో చాలామంది తెలంగానేతరులు ఉ న్నారని ఈ విషయంలో అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాతే అధికారులు ఉద్యోగుల పంపకాలు జరపాలని ఉద్యోగ సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఈ 1,808 మంది ఉద్యోగుల్లో చాలామంది తెలంగాణ వా రు కాదని అందరిని తెలంగాణకు తీసుకుంటే తెలంగాణ ఉద్యోగుల సీనియార్టీలో నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతం ఈ అంశాన్ని పక్కన పెట్టినట్టుగా తెలిసింది. ఈ బదిలీల్లో స్పౌస్, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించిన బదిలీలు ఉండడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సచివాలయంలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన 14 మంది ఉద్యోగులు శుక్రవారం ఏపి నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన 14 మంది ఉద్యోగులకు తెలంగాణలోని వివిధ విభాగా ల్లో పోస్టింగ్లను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. ఎపి నుంచి వచ్చిన 14 మంది ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో శుక్రవారం రిపోర్టు చేశారు. 12 ఏళ్ల తరువాత వారిని తెలంగాణకు కేటాయించడంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2024లోనూ 125మంది ఉద్యోగులు ఎపి నుంచి తెలంగాణ కేటాయి ంచడంతో వారికి ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇచ్చింది. 2,314 మంది ఉద్యోగుల పంపకం పూర్తి 2014కు ముందు (ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు) కమల్నాథన్ కమిటీ ఉద్యోగులకు సంబంధించి విధి, విధానాలను రూపొందించింది. రాష్ట్ర స్థాయి పోస్టుకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కమల్నాథ్ క మిటీ ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. మిగతా ఉద్యోగులైన జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలని కమల్నాథ్ కమిటీ సూచించింది. అయితే కమల్నాథన్ కమిటీ సూచనల మేరకు ఈ 12 సంవత్సరాల్లో ఇరు రాష్ట్రాల అంగీకారంతో 2,314 మంది ఉద్యోగుల పంపకం జరిగింది. అయితే 2,300 మందిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లో పనిచేస్తున్న 1,500 మంది ఉద్యోగులు, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు 700ల మంది సైతం ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఎపికి పంపించడానికి లేఖ రాసిన తెలంగాణ అయితే తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం దీనికి సం బంధించి 1896 సర్యులర్ను జారీ చేసింది. ఈ విషయాన్ని అప్పటి ఎపి ప్రభుత్వ సిఎస్కు తెలియచేస్తూ ఒక లేఖ రాసింది. తెలంగాణలో ఎపి స్థానికతతో పనిచేస్తున్న వారి వివరాలను తెలియచేస్తూ వారిని ఎపికి పంపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో తెలిపింది. ఎపిలో పని చేసే 783 మంది తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు అయితే, ఎపి నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో 1,808 ఉద్యోగులు ఉండగా అందులో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు సుమారుగా 783 ఉంటారని, మిగతా 1,025 మంది ఉద్యోగులకు తెలంగాణకు సం బంధం లేదని అయినా వారిని తెలంగాణకు పంపుతామ ని ఎపి ప్రభుత్వం 15128 సర్కులర్ను జారీ చేయడం తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో తెలంగాణకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు దా నిని వ్యతిరేకించారు. తాము తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను మాత్రమే రాష్ట్రానికి రావడానికి సమ్మతిస్తామని వారు అప్పటి ప్రభుత్వంతో తెగేసి చెప్పారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కనబెట్టింది.
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి యస్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె గంగా కూలంకష ! పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్… ఇది ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం. లోకసభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహారం గమనిస్తే ఈ పద్యం గుర్తు రాక తప్పదు. మన పార్లమెంటు అనేక ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పింది. ఈ సంప్రదాయాలను, ఆనవాయితీలను తుంగలో తొక్కడం మోదీ ప్రధానమంత్రి అయిన […] The post స్పీకర్ స్థానానికే అవమానం appeared first on Visalaandhra .
చిన్న రైతుల జీవనోపాధికి ముప్ప్పు
సోమ మర్ల ఫిబ్రవరి 2 వ తేదీ తెల్లవారుజామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఐతే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే ప్రతిఫలంగా భారత ఎగుమతులపై సుంకాలను 50 నుంచి 18 శాతానికి తగ్గిస్తామని,అన్ని అమెరికన్ వస్తువులపై భారత సుంకాలు సున్నా శాతానికి తగ్గుతాయని ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం వరకు మన వాణిజ్య శాఖా మంత్రి పియూష్ గోయల్ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఐతే […] The post చిన్న రైతుల జీవనోపాధికి ముప్ప్పు appeared first on Visalaandhra .
Naga Vamsi’s Satires on Vishwak and Anudeep
Young Producer Naga Vamsi is known to speak out of his heart during the promotions and he even passes satires on himself about his films. His next production Funky is releasing next week and the trailer of the film is out. The film is a hilarious entertainer directed by Anudeep KV and Vishwak Sen, Kayadu […] The post Naga Vamsi’s Satires on Vishwak and Anudeep appeared first on Telugu360 .
కాకినాడ తెలుసు కదా..! ఆ ఊర్లో ఏముంది. సముద్రం ఉంది. నోటిని తీపి చేసే కాకినాడ కాజా ఉంది. ఇప్పుడు కాదు కాని ఒకప్పుడు ఓ ఇరవై సినిమా థియేటర్లు ఒకే వీధిలో ఉండేవి. కెనడాకు ఇంచుమించు సరిసాటి అని ఆ దేశానికి వెళ్లి వచ్చిన వారు కాకినాడని కోకెనడా అనేవారట. అదే ఆ తర్వాత కాకినాడ అయ్యిందని పెద్దలు అంటారు. అలాంటి కాకినాడలో ఓ సాహితీవేత్త ఉన్నారు. పట్టణంలో నాటకానికి నాందీ వాచకం పలికే వీరాభిమాని […] The post ఈయనే…“హార్ని” జానకిరామ చౌదరి appeared first on Visalaandhra .
స్కాట్ల్యాండ్ ఆలౌట్.. విండీస్ ఘన విజయం
కోల్కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ విండీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. ముఖ్యంగా రొమారియో షెపర్డ్ హ్యాట్రిక్తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి.. వెస్టిండీస్ విజయానికి బాటలు వేశాడు. స్కాట్లాండ్ బ్యాటింగ్లో బెర్రింగ్టన్ (42), బ్రూస్ (35) జట్టును గెలిపించేందుకు కృషి చేశారు. కానీ, మిగితా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దీంతో స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగుల చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ ఈ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రామంతపూర్ వాసవి నగర్ లో పట్ట పగలు చోరీ
రామంతపూర్ వాసవి నగర్ లో పట్ట పగలు జరిగిన దొంగతనం కేసులో పురోగతి లభించింది. అప్రమత్తమైన పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే కేసును చేదించి దొంగను పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ. 14.35 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఉప్పల్ జోన్ పరిధిలోని రామంతపూర్ వాసవీ నగర్లో నివసిస్తున్న గుంటి మల్లమ్మ నివాసంలో ఫిబ్రవరి 5న ఉదయం 6 గంటల నుంచి 11-30 గంటల మధ్య ఈ చోరీ జరిగింది. అజ్ఞాత వ్యక్తి అల్మారాను పగలగొట్టి ఇంట్లో ఉన్న 85 గ్రాముల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి వస్తువులను అపహరించాడు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్లు 331(3), 305(ఎ) కింద క్రైమ్ నెంబర్ 180/2026గా ఉప్పల్ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామంతపూర్ వాసవీ నగర్కు చెందిన తాళ్ల రాఘవేందర్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్ అలియాస్ డక్కలి రమేష్ అలియాస్ శ్రీను (36)గా నిందితుడిని గుర్తించారు. నిందితుడు గతంలో కూడా షాబాద్, షాద్నగర్ నార్సింగి, అంబర్ పేట్ ప్రాంతాల్లో ఇలాంటి ఇంటి చోరీ కేసుల్లో నిందితుడుగా అరెస్టు, అనంతరం జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి 6న సాయంత్రం 6 గంటలకు అతని నివాసంలో పోలీసులు అరెస్టు చేసి చోరీ చేసిన మొత్తం బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన ఉప్పల్ పోలీసుల పనితీరుపై ఏసిపి వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Minister l అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..
Minister l అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.. Minister l కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మల్లన్నసాగర్ భూనిర్వాసిత కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్&ఆర్ కాలనీకి వస్తున్న క్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకోవడంతోపాటు చెప్పులు విసురుకున్నారు. తమకు అన్యాయం చేసిన హరీశ్ రావు కాలనీకి రావద్దని భూనిర్వాసితులతోపాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది.
టిజిఎంఎస్ఐడిసిలో అంతులేని అక్రమాలు నాసిరకం ఫర్నిచర్ సరఫరా చేసి కోట్లు దండుకున్న అధికారులు ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు మనతెలంగాణ/హైదరాబాద్: టిజిఎంఎస్ఐడిసి (తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)లో జరుగుతున్న అవినీతి కుంభకోణంపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఈడీ స్థాయి (ఎగ్జిక్యూటివ్ అధికారి) నాలుగేళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తూ కోట్లలో దోచుకుంటున్నారని సిఎంఓకు ఫిర్యాదులు అందాయి. గతంలో జరిగిన టెండర్ల దగ్గరి నుంచి ప్రస్తుతం బిల్లుల చెల్లింపుల వరకు కమీషన్ల దందా ఈ సంస్థలో భారీగా జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలో పనిచేసే ఈడీని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని సిఎంఓ నుంచి ఆదేశాలు అందినా, సంవత్సరకాలంగా ఈడీ ఈ సంస్థ నుంచి వెళ్లకుండా ఆయన అంతులేని అక్రమాలకు తెరతీశారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. గత సంవత్సరం 25 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫర్నీచర్ కొనుగోళ్లు, ఎంఆర్ఐ (11 మిషన్లకు) టెండర్లకు సంబంధించి గోల్మాల్ జరిగిందని, కమీషన్లు ఇచ్చే కంపెనీలకే టెండర్లు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలపై ‘మనతెలంగాణ దినపత్రిక’లో 24, అక్టోబర్ 2024న, ఏప్రిల్ 04వ తేదీ 2025 ఈ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ సమయంలో కొన్నిరోజుల పాటు టెండర్లు, ఒప్పందాలను, చెల్లింపులను పక్కన బెట్టిన ఈ సంస్థ అధికారులు తదనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఎంఆర్ఐ మిషన్లు, ఫర్నీచర్ కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లను అర్హత లేని కంపెనీలకు కట్టబెట్టడంతో పాటు పెద్ద ఎత్తున ఆయా సంస్థలకు చెల్లింపులు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నాసిరకం ఫర్నీచర్ కొనుగోళ్లపై.. ప్రస్తుతం 25 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫర్నీచర్ కొనుగోళ్లకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న మహారాష్ట్రకు చెందిన ఓ సంస్థ నాసిరకం ఫర్నీచర్ను సరఫరా చేయడం ప్ర స్తుతం ఈ అంశం వివాదాస్పదం అయ్యింది. దీంతోపాటు ఈ సంస్థకు ఒకేసారి రూ.15 కోట్ల చెల్లింపుల పై కూడా ప్రభుత్వాని కి ఫిర్యాదు అందినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఎంఆర్ఐ (11 మిషన్లకు) సంబంధించి టెం డర్లలోనూ గోల్మాల్ జరిగినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. ప్ర స్తుతం నాలుగేళ్లుగా ఇక్క డ పనిచేస్తున్న ఒక ఈడీ అధికారి టెం డర్ల వ్యవహారం నుంచి ప్రతి పనిలోనూ కమీషన్ ఆశిస్తారన్న ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఆయన కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని ఈ అవినీతి బాగోతానికి ఈడీ స్థాయి అధికారి తెరతీసినట్టుగా సమాచారం. మొత్తం 11 ఎంఆర్ఐ మిషన్ల.. మొత్తం 11 ఎంఆర్ఐ మిషన్లను కొనుగోళ్లు చేయడానికి టిజిఎంఎస్ఐడిసి అధికారులు టెండర్లను పిలవాల్సి ఉంది. అయితే, కమీషన్ల కోసం ఈ టెండర్లలో సింగిల్ కంపెనీ మాత్రమే పాల్గొనేలా ఆ కంపెనీకి మాత్రమే ఈ టెండర్లు దక్కేలా ఈ సంస్థ అధికారులు చక్రం తిప్పినట్టుగా తెలిసింది. ఈ ఎంఆర్ఐ మిషన్లలో 3 టెస్లా మోడల్కు చెందిన 5 ఎంఆర్ఐ మిషన్ల కోసం (వాటి ధర ఒక్కో మిషన్ రూ.25 కోట్లు), కాగా, 60 బోర్ మోడల్ ఎంఆర్ఐ మిషన్లు నాలుగింటి కోసం (రూ.14 కోట్లు, ఒక్కో మిషన్), 70 బోర్ మోడల్ ఎంఆర్ఐ మిషన్లు రెండింటి కోసం (రూ.ఒక్కో మిషన్ రూ.18 కోట్లు)గా ఉంటుంది. ఇలా, పెద్దమొత్తంలో ఆయా కంపెనీలకు మేలు చేసి కోట్ల రూపాయలను ఈ సంస్థకు చెందిన అధికారులు దండుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రికి పర్నీచర్ కొనుగోళ్లకు.. సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రికి పర్నీచర్ కొనుగోళ్ల టెండర్లకు సంబంధించి ఈ సంస్థ అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు సెంట్రల్ స్పాన్షర్ స్కీంలకు సంబంధించి 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులపై కన్నేసిన ఈ సంస్థ అధికారులు మార్చి 31వ తేదీతో ఈ నిధులను వినియోగించుకోకపోతే నిధులు రిటర్న్ వెళ్లిపోతాయని ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించి టెండర్లు లేకుండానే పాత వారికే ఈ కాంట్రాక్టు కట్టబెట్టడానికి ఫైల్ మూవ్ చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సెంట్రల్ స్పాన్షర్ స్కీంలోనే సుమారుగా రూ.30 కోట్లను కమీషన్లు చేతులు మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం. టిజిఎంఎస్ఐడిసిలో పనిచేసే ఈడీ స్థాయి అధికారిని అక్కడి నుంచి తప్పించకపోతే కోట్లలో ఈ సంస్థకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలిసింది.
Track day l హైదరాబాద్లో RS457 ట్రాక్ డే..
Track day l హైదరాబాద్లో RS457 ట్రాక్ డే.. వాహన చోదకుల నైపుణ్యాభివృద్దిని
ఉరి వేసుకుని ఫిజియోథెరపీ డాక్టర్ ఆత్మహత్య
ఉరి వేసుకుని ఫిజియోథెరపీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సాయిబాబా నగర్ లో నివాసముండే బత్తిని అనిత (29) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అనిత మల్లారెడ్డి ఆసుపత్రిలో ఫిజియోథెరఫిస్ట్ గా పని చేస్తుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాంను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
భారత్తో మ్యాచ్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యుఎస్ఎ
ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో యుఎస్ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు ఇండియా-ఎ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్లో యుఎస్ఎ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్లో మరింత జాగ్రత్తగా ఆడిలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో పూర్తి ఫామ్లో ఉన్న భారత్.. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నమెంట్ని విజయంతో ఆరంభించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు నుంచి వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, బుమ్రా దూరమయ్యారు. బుమ్రా స్థానంలో సిరాజ్ని జట్టులోకి తీసుకున్నారు. యుఎస్ఎ 6 బ్యాటర్లు, 2 ఆల్ రౌండర్లు, 3 బౌలర్లతో బరిలోకి దిగుతోంది. తుది జట్లు: భారత్: ఇషాన్ కిషన్(కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. యుఎస్ఎ: ఆండ్రీస్ గౌస్(కీపర్), సాయితేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్
school l గురుకుల పాఠశాల బాలికల ఖాళీ సీట్లకు బ్రోచర్ విడుదల..
school l గురుకుల పాఠశాల బాలికల ఖాళీ సీట్లకు బ్రోచర్ విడుదల.. నందిగామ,
29వ వార్డులో ప్రచార జోరు-గెలుపే లక్ష్యంగా అడుగులు
కాగజ్ నగర్ టౌన్, ఆంధ్రప్రభ ; కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 29వ
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 4
Environment l పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలి
Environment l పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలి మచిలీపట్నం , ఆంధ్రప్రభః
హస్తం గుర్తుకు ఓటెయ్యండి అందుబాటులో ఉంటా..
మంథని, ఆంధ్రప్రభ : హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అందుబాటులో ఉంటానని కాంగ్రెస్
పోలవరం జిల్లా పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద మొసలి కలకలం. #Polavaram #VRPuram #Godavari
అభయమిస్తున్న హస్తానికి ఓటేయండి..
పాల్వంచ, ఆంధ్రప్రభ : అభయమిస్తున్న అసానికి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించండి
ప్రచారంలో దూసుకుపోతున్న 10వ వార్డు బిజెపి అభ్యర్థి
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ 10వ వార్డు బిజెపి అభ్యర్థి గర్రెపల్లి
school l వార్షికోత్సవ వేడుకలు ఇప్పుడు గొప్ప స్థానాల్లో ఉన్న వారు ఎందరో
స్థానికుడిగా నన్ను ఆదరించండి.. మీ అన్నగా సేవ చేస్తా..
లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; నేను స్థానికుడిని, నిత్యం 9 వ వార్డ్ ప్రజలకు
Funky trailer: Slapstick Comedy and Serious Entertainment
The trailer of Vishwak Sen and Anudeep KV’s FUNKY unveiled today and it sets a lively tone, showcasing a blend of slapstick humour and chaotic storytelling that instantly grabs attention. With its fast-paced comedy and vibrant visuals, the trailer hints at an absolute laugh riot. Vishwak Sen appears energetic and his timing really brings laughs. […] The post Funky trailer: Slapstick Comedy and Serious Entertainment appeared first on Telugu360 .

16 C