శనివారం రాశి ఫలాలు (14-02-2026)
మేషరాశి ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృషభం దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. మిధునం మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. కర్కాటకం సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. కన్య ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలుంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. తుల ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృశ్చికం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ధనస్సు మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మకరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. కుంభం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. మీనం పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు. కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నెలవారీ సాయం గా మహిళలకు రూ.1,000 అందిస్తోంది. అయితే ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల మొత్తం కలిపి రూ.3,000, సమ్మర్ స్పెషల్గా మరో రూ.2,000 కలిపి ఈ మొత్తాన్ని మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. ఏప్రిల్-మే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే మహిళా లబ్ధిదారులకు ఇస్తున్న నెలవారీ సాయం రూ.2,000కు పెంచుతామని వీడియో సందేశంలో స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయాన్ని అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల కోడ్ పేరిట అడ్డుకునేందుకు బిజెపి, అన్నాడిఎంకె, కుట్ర పన్నుతున్నాయని స్టాలిన్ ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మూడు మాసాల సాయాన్ని ఒకేసారి కలిపి మహిళల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సమ్మర్ స్పెషల్ ఖర్చుల కింద రూ.2,000 అదనంగా ఖాతాలో జమచేసినట్టు చెప్పారు. రాబోయే మూడు నెలలు మీరు పడబోయే ఇబ్బందులతో పాటు అదనంగా మందులు, పరీక్షల సమయంలో పిల్లలకు ఖర్చులు ఎక్కడి నుంచి తెస్తారని ఆలోచించానని, ఆ కారణంగానే తమ అకౌంట్లలో రూ.5,000 జమ చేయాలని ఆదేశించానన్నారు.
ఉత్కంఠగా చేర్యాల మున్సిపాలిటీ ఫలితాలు
చేర్యాల ము న్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం రోజు న ఉత్కంఠ భరితంగా మారాయి. మొత్తం 12 వార్డులు ఉండగా అందులో 7 వార్డు లు బిఆర్ఎస్ కైవసం చేసుకోగా 5 వార్డు లు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. వార్డుల వారీగా ఫలితాలు 1)వ వార్డ్... ఒగ్గు వెంకటమ్మ కాంగ్రెస్ విజయం (140మెజార్టీ) 2)వ వార్డ్... కమలాపురం గీతాంజలి బిఆర్ఎస్ విజయం (223మెజార్టీ) 3)వ వార్డ్... కొమ్ము రాజేశ్వరి కాంగ్రెస్ విజయం (450మెజార్టీ) 4)వ వార్డ్... నిమ్మ సుప్రజ బిఆర్ఎస్ విజయం (391మెజార్టీ) 5)వ వార్డ్...వెలుగల దుర్గయ్య కాంగ్రెస్ విజయం ( 339మెజార్టీ) 6)వ వార్డ్...ముస్తాల అరుణ బిఆర్ఎస్ విజయం (145మెజార్టీ) 7)వ వార్డ్...పోతుగంటి ప్రసాద్ కాంగ్రెస్ విజయం (317మెజార్టీ) 8)వ వార్డ్...బుదారి సురేష్ బిఆర్ఎస్ విజయం (392మెజార్టీ) 9)వ వార్డ్...వీరబత్తిని సదానందం బిఆర్ఎస్ విజయం (337మెజార్టీ) 10)వ వార్డ్... మేడిశెట్టి ఉమా బిఆర్ఎస్ విజయం (153మెజార్టీ) 11)వ వార్డ్... ఎండి ఇజాజ్ బిఆర్ఎస్ విజయం (145మెజార్టీ) 12) వ వార్డ్... ఎండి షరీఫా కాంగ్రెస్ విజయం (52మెజార్టీ) గా ఉన్నాయి. ఫలించిన ఎమ్మెల్యే పల్లా కృషి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని మున్సి పాలిటీలో బిఆర్ఎస్ జండాను ఎగరవేయ డానికి మొక్కవోని దీక్షతో ప్రతిరోజు ప్ర చారాన్ని నిర్వహించారు.తమ అభ్యర్థుల ను గెలిపించు కోవడానికి నిరంతరం కృషి చేసి మొత్తానికి చేర్యాల మున్సిపాలిటీపై బీఆర్ ఎస్ జెండాను ఎగరవేశారు. కార్యకర్తలలో మరోసారి ఉత్సాహాన్ని నింపారు.
తమ పార్టీ టివికె ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం అయిందని పార్టీ అధినేత , హీరో విజయ్ తెలిపారు. తమ పార్టీ తరఫున వెలువరించిన అధికార పంపిణీ ప్రతిపాదన రాజకీయాల్లో బాంబు అయిందని వ్యాఖ్యానించారు. తమ ఫార్మూలా ఇప్పుడు పలు పార్టీల్లో ప్రచారం పొందింది. అన్ని కూటములు, పార్టీలు ఇప్పుడు టివికె వెంటపడేలా ఉన్నాయని , అసెంబ్లీ ఎన్నికలకు ముందే విజయ్ విజిల్ బాగా మోగుతోందని శుక్రవారం తెలిపారు. ఈ కొత్త పరిణామంతో ముఖ్యమంత్రి, డిఎంకె నేత స్టాలిన్ గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయన తరచూ కాంగ్రెస్తో అధికార పంపిణీకి ససేమిరా అంటున్నారు. ఇప్పుడు పద్ధతి మార్చుకోవల్సి వస్తోందని విశ్లేషించారు. సేలం సమీపంలోని బైపాస్లో భారీ సంఖ్యలో హాజరైన సభలో విజయ్ ప్రసంగించారు. తమిళనేల తొలి సైనికుడుగా నిలిచితీరే వ్యక్తిని అని, వెన్నుచూపడం కలలో కూడా లేదని ప్రకటించారు. డిఎంకెకు కూటమి అంటే కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే, అయితే తరువాత పరిపాలన విషయంలో వారి పంథా విడిగా ఇతర విషయాలపై ఉంటుందని స్టాలిన్పై విరుచుకుపడ్డారు. ఈ ఇతరాలను ఆయన డబ్బు అంటూ సంకేతాలతో తెలిపారు. విజయ్ ర్యాలీలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి సేలంలో విజయ్ సభ జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి స్పృహ తప్పిపడిపోయాడు. కిక్కిరిసిన జనం మధ్య పడిపోయిన ఈ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుపుతూ ఉండగా మృతి చెందాడు. ఈ వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన సూరజ్ (37)గా గుర్తించారు. కొద్ది సంవత్సరాల క్రితం సేలంలో జవనోపాధికి వచ్చారు. ఇక్కడ ప్రాణాలొదిలాడు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ప్రజలు పట్టం కట్టారు: మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ప్రజలు పట్టం కట్టారని, ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజానీకానికి రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. శుక్రవారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయమన్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - రెండేళ్ల ఇందిరమ్మ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా ఆయన అభివర్ణించారు. పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు - ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ విజయం కొనసాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారని మున్సిపల్ ఫలితాలు రుజువు చేశాయన్నారు.
Chandrababu Naidu Slams Previous Regime, Outlines Vision for Andhra Pradesh’s Rebuilding
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu launched a strong attack on the previous YSRCP government during his address in the Assembly. Speaking during the discussion on the motion of thanks to the Governor’s speech, he said the state witnessed serious damage in the past regime. He recalled the humiliation he faced in the Assembly […] The post Chandrababu Naidu Slams Previous Regime, Outlines Vision for Andhra Pradesh’s Rebuilding appeared first on Telugu360 .
ఎయిర్ ఇండియాకు డిజిసిఎ రూ. కోటి జరిమానా
ఎయిర్ వర్థీనెస్ రివ్యూ సర్టిఫికెట్ (ఎఆర్సి) పర్మిట్ లేకుండా 8 సార్లు ఎయిర్బస్ను నడిపినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) రూ. కోటి జరిమానా విధించింది. నెలరోజుల్లో ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 24,25 తేదీల్లో తప్పనిసరి ఎయిర్వర్థినెస్ రివ్యూ సర్టిఫికెట్ లేకుండా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మధ్య ఎయిర్బస్ ఏ 320 విమానాన్ని ఎయిర్ ఇండియా ఎనిమిదిసార్లు నడిపింది. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని గత ఏడాది డిసెంబర్లో వెలుగు లోకి తెచ్చింది. దీంతో ఎయిర్ ఇండియా అంతర్గత దర్యాప్తు చేపట్టి వ్యవస్థాగత వైఫల్యాలను గుర్తించింది. ఈ లోపాల వల్లనే ఎయిర్ ఇండియాపై ప్రజల విశ్వాసం దెబ్బతిందని, ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపిందని డీజీసీఎ ఆరోపించింది. ఏటా విమాన భద్రత,ఇతర పరీక్షలు నిర్వహించిన తరువాత ఏఆర్సి సర్టిఫికెట్ డిజిసిఎ జారీ చేయడం పరిపాటిగా వస్తోంది.
సిఎం రేవంత్ రెడ్డిని అభినందించిన ప్రియాంక గాంధీ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేస్తూ సిఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ప్రియాంకగాంధీ హర్షం వ్యక్తం చేయడంతో పాటు సిఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్కు ఘనవిజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియజేశారు.
సన్న బియ్యం పంపిణీతో సంచలన విజయాలు నమోదు: మంత్రి ఉత్తమ్
పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్నబియ్యం పంపిణీ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారిందని ఆయన చెప్పారు. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమలౌతున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభించినట్లయిందని ఆయన అన్నారు. అర్హులయిన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు,అర్హులైన నిరుపేద మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పధకాలు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు. వీటన్నింటిని మించి సాగునీటి రంగంలో సాధించిన విజయాలు, యావత్ భారతదేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు, అదే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతో పాటు రైతులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని తెలిపారు.పురపాలక సంఘం ఎన్నికల్లో ఫలితాలు ముందుగా ఊహించినవేనని, యావత్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికల అద్దం పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పల్లెలతో పాటు పట్టణాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పు గా ఆయన అభివర్ణించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్ నగర్, నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేట పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకీ కంచుకోట అని మరోమారు రుజువైనందన్నారు. ఈ విజయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో సాధించిందని అందుకు తోడ్పాటునందించిన పురపాలక సంఘాల ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయాల వరవడి ఆ తరువాత జరిగిన లోకసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందని ఆయన వెల్లడించారు.
couple victory |ఇద్దరూ.. ఇద్దరే
couple victory | ఇద్దరూ.. ఇద్దరే .. కార్పొరేటర్లుగా గెలిచిన భార్యాభర్తలు గోదావరిఖని
ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా
. నూతన కార్పొరేషన్ కొత్తగూడెం పై సిపిఐ జెండా. మిత్ర ద్రోహానికి తగిన శాస్తి చెప్పిన కార్పొరేషన్ ప్రజలు. 22 డివిజన్లో సిపిఐ విజయం. మేయర్ పీఠం అధిష్టించనున్న సిపిఐసిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తొలి కార్పొరేషన్ కొత్తగూడెం పై ఎర్రజెండా ఎగరేసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని […] The post ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా appeared first on Visalaandhra .
6వ డివిజన్ బీజేపీయే అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి ఘనవిజయం.. నిజామాబాద్, ఫిబ్రవరి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ తగిలింది. మొదటి నుండి బలమైనా క్యాడర్తో ప్రచారంలో దూసుకపోయిన బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ఊహించినదనె చెప్పాలి. పుర పోరులో బిఆర్ఎస్ ముచ్చటగా మూడో సారీ జయకేతనం ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం మొదటి సారీ నగర పంచాయితి, తరువాత రెండు ఎన్నికలలో బిఆర్ఎస్ జెండా ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒకె ఒక మున్సిపల్ స్థానం ఉండడంతో ఎమ్మెల్యే ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయిన అధికార పార్టీకి పలితం దక్కలేదని ఆరోపనులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికి మొత్తం 24 వార్డులకు గాను బిఆర్ఎస్ 13 , కాంగ్రెస్ 8, బిజెపి 2, స్వతంత్ర అభ్యర్థి 1, గెలుపొందారు. ఇబ్రహీంపట్నం పురపోరులో గెలిచిన కౌన్సిలర్ల అభ్యర్థులు ... వార్డు గెలిచిన కౌన్సిలర్లు పార్టీ మెజార్టీ ... పోటోరైటఫ్: 13ఐబిపి1 నుండి 24 వరకు గెలుపొందిన అభ్యర్థులు .. 1) వార్డు ముత్యాల శ్యామల బిజెపి 17 2)వార్డు నీళ్ల బానుబాబు కాంగ్రెస్ 79 3)వార్డు దాసరి మురళి క్రిష్ణ ఇండిపె 86 4)వారు ్డకొండ్రు ప్రవీణ్ బిఆర్ఎస్ 13 5) ” జెర్కోని మమత రాజు బిఆర్ఎస్ 57 6) ” మహామ్మద్ అమీనాబేగం కాంగ్రెస్ 265 7) ” టేకుల సుదర్వన్రెడ్డి బిఆర్ఎస్ 2 8) ” రాందాస్ నాయక్ కాంగ్రెస్ 217 9) ” ధార రాఘవేందర్రావు కాంగ్రెస్ 11 10) ” దొంతరమోని బార్గవి కాంగ్రెస్ 329 11) ” కొండ్రు శ్రీలతా బిఆర్ఎస్ 283 12) ” కొండ్రు త్రిలోక్ బిఆర్ఎస్ 100 13) ” ఇందూరి శ్రీనువాస్ కాంగ్రెస్ 281 14) ” ఎదుల్ల విజయలక్ష్మీ కాంగ్రెస్ 25 15) ” క్యామా శంకర్ బిఆర్ఎస్ 102 16) ” అల్వాల జ్యోతి బిఆర్ఎస్ 348 అత్యదిక మెజార్టీ 17) ” మడుపు లక్ష్మమ్మ బిఆర్ఎస్ 72 18)” సిద్దం బానుప్రియా బిజేపి 83 19)”ఆకుల యాదగిరి బిఆర్ఎస్ 6 20) ” మంద జయ బిఆర్ఎస్ 95 21) ” సిహెచ్.బుగ్గరాములు బిఆర్ఎస్ 24 22)” కప్పరి స్రవంతి కాంగ్రెస్ 46 23) వార్డు నీలం స్వేత బాలు బిఆర్ఎస్ 12 24) వార్డు గుడూరి గిరి బిఆర్ఎస్ 76 ఓట్లతో మెజారిటి సాధించారు.
ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..
8వ డివిజన్ బిజెపి అభ్యర్థి పవన్ కుమార్ ఘన విజయం నిజామాబాద్ ఫిబ్రవరి
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. 60వ డివిజన్లకు గాను 38 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకొని రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు మొత్తం 60 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో నగర పాలక సంస్థను కైవసం చేసుకుంది. పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్: 38 స్థానాలు, బీఆర్ఎస్: 13 స్థానాలు, ఏఐఎఫ్బీ: 06 స్థానాలు, బీజేపీ: 01, సీపీఐ: 01, ఇండిపెండెంట్: 01 స్థానం, 60 స్థానాల విజేతల పూర్తి వివరాలు 1వ డివిజన్ మడిపల్లి విజయ (కాంగ్రెస్ - ఏకగ్రీవం), 2. వెంగల బాపు (కాంగ్రెస్), 3. వడ్లూరి రవి (ఏఐఎఫ్బి), 4. కంకణాల మౌనిక (కాంగ్రెస్), 5. మాతురి సత్యప్రసాద్ (కాంగ్రెస్), 6. ఆవుల శ్యామని (బిఆర్ ఎస్), 7. వేగోలపు రమాదేవి (కాంగ్రెస్), 8. పర్లపల్లి పుష్పలత (ఏఐఎఫ్బి), 9. తాళ్లపల్లి యుగేంధర్ (కాంగ్రెస్), 10. అడ్డాల గట్టయ్య (బిఆర్ ఎస్), 11. కారెంగుల రమ్య (ఏఐఎఫ్బి), 12. షేక్ బాబు మియా (కాంగ్రెస్), 13. చుక్కల లావణ్య (కాంగ్రెస్), 14. బదావత్ శంకర్ నాయక్ (కాంగ్రెస్), 15. బుర్ర శశికళ (బిఆర్ ఎస్), 16. మందల రమ (బిఆర్ ఎస్), 17. అనుము స్వరూప (కాంగ్రెస్), 18. దేవనపల్లి చక్రపాణి (కాంగ్రెస్), 19. మారెల్లి సుశీల (కాంగ్రెస్), 20. తాళ్ల చిన్న రాజయ్య (బిఆర్ ఎస్), 21. కందుల స్వరూప (కాంగ్రెస్), 22. కన్నూరి భాగ్యలక్ష్మి (కాంగ్రెస్), 23. బెంద్రం సునీత (కాంగ్రెస్), 24. కొలని కవిత (కాంగ్రెస్), 25. సిరిశెట్టి సతీష్ (కాంగ్రెస్), 26. బదావత్ నర్సమ్మ (బిఆర్ ఎస్), 27. ఆయేషా ఖానం (ఇండిపెండెంట్), 28. బద్రి రాజన్న (ఏఐఎఫ్బి), 29. నిమ్మ రాజుల రజిని (బిఆర్ ఎస్), 30. ఇస్సంపల్లి అంజయ్య (కాంగ్రెస్), 31. షాహెదా (కాంగ్రెస్), 32. తోట మమత (బీజేపీ), 33. మేరుగు భూలక్ష్మి (కాంగ్రెస్), 34. స్వప్న ప్రియ (కాంగ్రెస్), 35. జంగపల్లి రమాదేవి (కాంగ్రెస్), 36. కల్వల పద్మావతి (కాంగ్రెస్), 37. మీర్జా ఫజల్ బేగ్ (కాంగ్రెస్), 38. నెలకంటి రాము (కాంగ్రెస్), 39. తిప్పారపు మానస (కాంగ్రెస్), 40. కజపురం జయప్రద (బిఆర్ ఎస్), 41. మార్కపురి సూర్య (సీపీఐ), 42. పాతిపల్లి కావ్య (కాంగ్రెస్), 43. దొంత శ్రీనివాస్ (కాంగ్రెస్), 44. కర్రావుల దాడిరాజు (ఏఐఎఫ్బి), 45. కౌటం సతీష్ (కాంగ్రెస్), 46. మహాంకాళి స్వామి (కాంగ్రెస్), 47. దాసరి సాంబమూర్తి (కాంగ్రెస్), 48. రేణుకుంట్ల నిర్మల దేవి (కాంగ్రెస్), 49. సాగి సంతోష్ రావు (కాంగ్రెస్), 50. దూళికట్ట సతీష్ (కాంగ్రెస్), 51. ఆకారపు రజిత (బిఆర్ ఎస్), 52. చీదురాల నాగరాజు (ఏఐఎఫ్బి), 53. గట్ల రమేష్ (కాంగ్రెస్), 54. మహ్మద్ ముస్తాఫా (కాంగ్రెస్), 55. కర్క పద్మజ (బిఆర్ ఎస్), 56. కొమ్ము స్వప్న (కాంగ్రెస్), 57. పాతపల్లి ఎల్లయ్య (కాంగ్రెస్), 58. మేకల సమ్మయ్య (బిఆర్ ఎస్), 59. బాలసాని తిరుపతి (ఏఐఎఫ్బి), 60. మేకల శారద (బిఆర్ఎస్). భార్యాభర్తల గెలుపు.. 2 ఓట్ల మెజారిటీతో ఉత్కంఠ ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. 58 మరియు 60 స్థానాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మేకల సమ్మయ్య, శారద దంపతులు ఇద్దరూ విజయం సాధించి విశేష గుర్తింపు పొందారు. ఇక 59వ స్థానంలో ఏఐఎఫ్బీ అభ్యర్థి బాలసాని తిరుపతి కేవలం 2 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కి నగరంలో అత్యల్ప మెజారిటీ విజేతగా నిలిచారు. బిఆర్ఎస్, బిజెపిలపై ఎమ్మెల్యే నిప్పులు ఫలితాల అనంతరం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ అహంకారానికి, బిజెపి చేస్తున్న మత రాజకీయాలకు రామగుండం ప్రజలు ఈ తీర్పుతో బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. అభివృద్ధిని వదిలేసి మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూసిన బిజెపిని, ప్రలోభాలతో గెలవాలని చూసిన బిఆర్ఎస్ను ఓటర్లు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. రామగుండం లౌకికత్వానికి ప్రతీక అని, ఇక్కడ విభజన రాజకీయాలు సాగవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పోలీసుల పటిష్ట బందోబస్తు కౌంటింగ్, ఫలితాల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగా, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అల్లరిమూకలపై పోలీసులు ముందస్తు నిఘా ఉంచడంతో నగరం ప్రశాంతంగా ఉంది.
మిర్యాలగూడ పుర పోరులో కాంగ్రెస్ ఘన విజయం
మిర్యాలగూడ పురపాలక ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్పార్టీ ఘన విజయం సాధించింది.వాడి వేడిగా రసవత్తరంగా సాగిన ఎన్నికల ప్రక్రియ అనంతరం జయాపజయాలు ఖరారుకాగా,మొత్తం 48 వార్డులకుగాను కాంగ్రెస్పార్టీ 31 వార్డులు కైవసం చేసుకొని మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి బిఆర్ఎస్ పార్టీ 14వార్డుల్లో విజయం సాధించగా,ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డు,బిజెపి ఒక వార్డు,ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ ఒక వార్డును కైవసం చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా 18వ వార్డు ఫలితం అందరి దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థిపై గెలుపొందడం ఉత్కంఠభరితంగా మారింది. ఉదయం 8గంటల నుంచి అవంతిపురం మార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోలీసుల భారీ బందోబస్తు నడుమ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. డిఎస్పీ రాజశేఖర్రాజు ముందుగానే ఆదేశాలు జారీ చేస్తూ, విజయోత్సవ ర్యాలీలు ,డిజెలకు అనుమతి లేదని స్పష్టం చేయడంతో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.మొత్తం మిర్యాలగూడ పురపాలక ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ కాంగ్రెస్పార్టీకి ప్రజలు స్పష్టమైన మద్దతు పలికారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ward9 | రికార్డు మెజారిటీ… -కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ రాజు ఘన విజయం
వార్ వన్ సైడ్ ...చిట్యాల పుర పీఠం కాంగ్రెస్కే
జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల వార్ పూర్తిగా వన్ సైడ్ గా నిలిచి, స్దానిక ఎంఎల్ఏ వేముల వీరేశం రాజకీయ చతురత ఫలించింది , 12 వార్డులకు గాను 9 వార్డులు కాంగ్రెస్ అభ్యర్దులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్దులు అన్ని స్దానాల్లో పోటీ చేసిననప్పటికి కేవలం 2 స్దానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.ఒక వార్డు ట్రాన్స్జెండర్ ఇండిపెండెంట్ కైవసం చేసుకుంది. రెండవ సాధారణ ఎన్నికల్లో నేడు ప్రకటించిన ఫలితాల్లో విజయం సాధించి కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్న అభ్యర్దులు సంబురాల్లో మునిగిపోయారు. ఒకటో వార్డు నాగిల్ల సుధాకర్ ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్ది సిపిఎం కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్ది అయిన జిట్ట నగేష్పై 102 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2వ వార్డులో బిఆర్ఎస్ కు చెందిన షేక్ షబానా అజీమ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది జడల పూలమ్మ పై 96 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. 3 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి గాలి యాదమ్మలింగయ్య బిఆర్ఎస్ అభ్యర్తి శేపూరి జయమ్మ రవీందర్ పై 302 ఓట్ల మెజారిటీ, 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ది కోనేటి ఎల్లయ్య బిఆర్ఎస్ అబ్యర్ది నేనావత్ కృష్ణ నాయక్ పై 181 ఓట్ల మెజారిటీ, 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది గుండెబోయిన శ్రీ లక్ష్మి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ది దయ్యాల శ్రీకాంత్ పై 34 ఓట్ల మెజారిటీ, 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది జెర్రిపోతుల సత్యనారాయణ బిఆర్ఎస్ అభ్యర్ది జడల సంతోషిపై89 ఓట్ల మెజారిటీ, 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది దేశపాక లతరాజేష్ బిఆర్ఎస్ అభ్యర్ది కూరెల జ్యోతి పై11ఓట్ల మెజారిటీ, 8 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అబ్యర్ది కుక్కల మోహన్ బిఆర్ఎస్ అభ్యర్ది కందాటి రమేష్రెడ్డి పై 143 ఓట్ల మెజారిటీ, 9వ వార్డులో కా్ంగరెస్ పార్టీ అభ్యర్ది ఏర్పుల పరమేష్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ది ఆగు అశోక్ పై 253 ఓట్ల మెజార్టీ, 10 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది సిలివేరు శేఖర్ పై బిఆర్ఎస్ అబ్యర్ది నిమ్మనగోటి శ్రీను 97 ఓట్ల మెజారిటీ, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ది బొబ్బలి సందీప బిజెపి అభ్యర్ది దుడ్డు భాగ్యమ్మపై459 ఓట్ల మెజారిటీ, 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అబ్యర్ది పందరిగీతారమేష్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ది మెండె సుజాత సైదులు పై 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కల్వకుర్తి పురపాలకంలో హస్తం కైవసం
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని మూడు ప్రధాన పార్టీలు పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కల్వకుర్తి పురపాలక సంఘం లో హస్తం హవా నడిచింది.గత పాలకమండలి లో పని చేసిన బిఆర్ఎస్ కారు స్పీడు తగ్గి కమలం వికసించింది.ఈ నెల 11 జరిగిన కల్వకుర్తి మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.స్థానిక బిఈడి కళాశాలలో ఉదయం 8 గంటలకు మూడు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు.ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 13 వార్డులలో,కాంగ్రెస్ రెబల్ ఇండిపెండెంట్ ఒక వార్డులో,బిఆర్ఎస్ పార్టీ 3 వార్డులలో,బారతీయ జనతా పార్టీ 5 స్థానాలలో గెలుపొందింది. విజయం పొందిన అభ్యర్దుల వివరాలు ఇలా.. 1 వార్డు లో బాజపా అభ్యర్ది శ్రీరాములు 35 ఓట్ల మెజార్టీతో,2 వార్డు లో బాజపా అభ్యర్ది రేణుక 182 ఓట్ల మెజార్టీతో,3 వ వార్డు లో బిఆర్ఎస్ అభ్యర్ది కేతావత్ రాము 29 ఓట్ల మెజార్టీతో ,4 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది హుమ్లి హనుమా నాయక్ 116 ఓట్ల మెజార్టతో ,5 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది కరుణాకర్ రెడ్డి 201 ఓట్ల మెజార్టీతో,6 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది పుట్ట రేణుక 118 ఓట్ల మెజార్టీతో,7 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ చైర్మెన్ అభ్యర్ది బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ తమ ప్రత్యర్ది 425 ఓట్ల బారీ మెజార్టీతో గెలుపొందారు. అదే విదంగా 8 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్ది కోడెల లలిత గణేష్ 16 ఓట్ల మెజార్టీతో,9 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది చిత్తారి ఎల్లమ్మ 122 ఓట్ల మెజార్టీతో ,10 వార్డు లో బిఆర్ఎస్ అభ్యర్ది ఎజాస్ ఒక ఓటు మెజార్టీతో,11 వ వార్డు లో బాజపా అభ్యర్ది ఎనుగొండ రామకృష్ణ 7 ఓట్ల మెజార్టీతో,12 వ వార్డు లో బాజపా అభ్యర్ది గుర్రాల జ్యోతి రాంభూపాల్ రెడ్డి 65 ఓట్ల మెజార్టీతో,13 వ వార్డులో బాజపా అభ్యర్ది బోడ నర్సింహ్మ 63 ఓట్ల మెజార్టీతో ,14 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్ది బావండ్ల మంజుల 124 ఓట్ల మెజార్టీతో,15 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కుడుముల అస్మిత చంద్రకాంత్రెడ్డి,16 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది పసుల లలిత కిరణ్ కుమార్ రెడ్డి,17 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది షాన్వాజ్ ఖాన్ 119 ఓట్ల మెజార్టీతో ,18 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది నాజియా మక్బుల్ 82 ఓట్ల మెజార్టీతో ,19 వ వార్డు లో బిఆర్ఎస్ అభ్యర్ది షాహెద్ 32 ఓట్ల మెజార్టీతో ,20 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి 510 ఓట్ల బారీ మెజార్టీతో,21 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది మబ్బు రామరాజు 159 ఓట్ల మెజార్టీతో ,22 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కొల్లోజు రాజేష్ 101 ఓట్ల మెజార్టీతో తమ ప్రత్యుర్దు ల పై గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికైనట్లు పత్రాలను అందజేశారు.గెలుపొందిన చైర్మెన్ అభ్యర్ది బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ను కల్వకుర్తి ఎంఎల్ఏ కసిరెడ్డి నారాయణరెడ్డి అభినందించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం నుండి ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ డీజే సౌండ్స్ మద్యన నృత్యాలు చేస్తూ ,స్వీటు మిఠాయిలు తినిపించుకుంటూ శాలువాలతో సన్మానిస్తూ సంబరాలు జరుపుకున్నారు.అదే విదంగా బాజపా ఎప్పుడు లేని విదంగా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చి బిఆర్ఎస్ మూడో స్థానానికి నెట్టి ప్రతి పక్షం రావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.
great police |నేరస్తులకు నో చాన్స్..!
great police | నేరస్తులకు నో చాన్స్..! -స్టేషన్ ఘన్ పూర్ పోలీసుల
తూప్రాన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టికి స్పష్టమైన ఆధిక్యాన్ని సాదించింది. మొత్తం 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 09, కాంగ్రేస్ 04, బీజేపీ 03 స్థానాలు దక్కించుకున్నాయి. 1వ వార్డు బీఆర్ఎస్ బొంది రజని.2వ వార్డు బీజే పీ చందా అశోక్,3వ వార్డులో బీఆర్ఎస్ బైరం సత్యలింగం,4వ వార్డులో బీఆర్ఎస్ జైపాల్ సాథోడ్,5వ వార్డులో బీఆర్ఎస్చెలిమల ప్రి యాంక ,6వ వార్డులో కొక్కొండ సబితా కాశిరెడ్డి,7వ వార్డులో బీజేపీ మన్నె స్వామి,8వ వార్డులో బీఆర్ఎస్ బొడ్డు రాదాకుమారి శ్రీనివా స్,9వ వార్డులో బీఆర్ఎస్ ఐలేష్యాదవ్,10వ వార్డులో బీఆర్ఎస్మునిరాథ్ లక్ష్మి మల్లేశం,11వ వార్డులో బీజేపీ సత్యనారాయణ,12వ వార్డులో కాంగ్రేస్రామునిగారి నాగరాజు, 13వ వార్డులో బీఆర్ఎస్ చెలిమల రాములు,14వ వార్డులో కాంగ్రేస్ దుర్గం సబితా నగేష్,15 వవార్డులో కాంగ్రేస్ కొడిపాక అన్నపూర్ణ నారాయణ,16వ వార్డులలో కాంగ్రేస్ బొడ్డు జ్యోస్న వేణు లు గెలుపొందారు. 3వ వార్డు మా త్రం ఉత్కంటగా సాగింది బీఆర్ఎస్ పార్టి అభ్యర్థి సత్య లింగంకు 320ఇండిపెండింట్ అభ్యర్థి కృష్ణకు 320 ఇద్దరికి సమానంగా రావం డంతో అదికారులు రెండు సార్లు లెక్కించి లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. అది బీఆర్ఎస్ పార్టి ని వరించింది. మొత్తం మీద ఎన్ని కల కైంటింగ్ ప్రశాంతంగా సాగింది, గెలిచిన వారిని క్యాంపులోకి తీసుకెళ్ళారు.
నారాయణపేట మున్సిపాలిటీ లో వికసించిన కమలం
నారాయణపేట పట్టణం బిజెపికి కంచు కోట అని మరోమారు రుజువైంది. పట్టణంలోని 24 వార్డులలో బిజెపి 11 వార్డుల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ 07, టిఆర్ఎస్ 02, ఎంఐఎం 02, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 01, స్వతంత్ర 01 స్థానాలు సొంతమైంది. జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద కౌంటింగ్ నిర్వహించగా ఉదయం నుంచి వార్డుల నుంచి కౌన్సిలర్ అభ్యర్థుల అభిమానులు తరలివచ్చారు. మొత్తం మూడు రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. గెలిచిన అత్తకోడళ్ళు... పేట మున్సిపల్ ఎన్నికల్లో రెండు వేరు వేరు పార్టీలకు చెందిన అత్తకొడల్లు మొదటి సారి కౌన్సిలర్ గా విజయం సాధించారు. 17వ వార్డు నుంచి కర్రే కల్పన బిజెపి నుంచి కౌన్సిలర్ గా గెలుపొందగా ఈమెకు కోడలు వరుస అయిన 20వ వార్డు అభ్యర్థి శ్వేత కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా గెలుపొందింది. అలాగే గతంలో పేట మున్సిపల్ ఎన్నికల్లో గతంలో వైస్ చైర్మన్ గా పనిచేసిన ఇద్దరు అభ్యర్థులు హరి నారాయణ భట్టాడ్, నందునామాజీలు ఓటమి చెందారు. అలాగే కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్న 5 వ వార్డులో బిజెపి అభ్యర్థి ఎరుకలి రఘు విజయం సాధించారు. ఇదిలా ఉండగా 20 వ వార్డు కు సంబంధిన బీజేపీ అభ్యర్థులు 17 వ వార్డు లో కల్పన, 6 వ వార్డు లో మంజుల, 4 వార్డు లో శ్వేత గెలుపొందారు. కానీ ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శ్వేత వెంకటేష్ గౌడ్ గెలుపొందడం విశేషం. 1 సుతారి సత్య రఘుపాల్ (బీజేపీ), 2 కె.సౌజన్య (బీజేపీ), 3 కాకర్ల నారాయణమ్మ (బీఆర్ఎస్), 4 కొండా శ్వేతా సత్య యాదవ్ (బీజేపీ), 5 ఎరుకలి రాఘవేంద్ర (బీజేపీ), 6 ఎన్. మంజుల (బీజేపీ),7 భరత్ (బీ ఆర్ ఎస్), 8 కందేన్ పల్లి సత్యమ్మ(కాంగ్రెస్), 9 యు. మహేష్ (కాంగ్రెస్), 10 జయశ్రీ (స్వతంత్ర), 11 భగవతి (ఏ ఐ ఎఫ్ బీ), 12 అప్పిరెడ్డి పల్లి రాము (బీజేపీ), 13 లక్మప్ప (బీజేపీ), 14 ఎల్. అరుణ (కాంగ్రెస్), 15 బండి రాజేశ్వరి (కాంగ్రెస్), 16 అంబికా శ్రీనివాస్ (బీజేపీ), 17 కర్రే కల్పన (బీజేపీ), 18 రవితేజ (కాంగ్రెస్), 19 బి. నాగమ్మ (బీజేపీ), 20 శ్వేత (కాంగ్రెస్), 21 కమలాపూర్ ప్రభాకర్ (బీజేపీ), 22 రాజు ఘాట్ (కాంగ్రెస్), 23 మహమ్మద్ తాకిచాంద్ (ఏఐఎంఐఎం), 24 మహమ్మద్ తకీ (ఏఐఎంఐఎం) లు ఆయా వార్డు లలో గెలుపొందారు.
తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పాగ
తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ మరోసారి పట్టు సాధించింది. మొత్తం 16 వార్డులుగా ఉన్న తొర్రూరు మున్సిపాలిటీలో 9 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి వరసగా రెండో సారి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొంది రెండవ స్థానానికి పరిమితమైంది. తొర్రూరు మున్సిపాలిటీగా అవిర్భావం చెందిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. మొదటి వార్డు నుండి బీఆర్ఎస్కు చెందిన భూసాని జయమ్మ 610 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి తాళ్లపెల్లి శ్రీలతకు 444 ఓట్లు రావడంతో జయమ్మ 166 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి తూనం శ్రవన్కుమార్కు 669 ఓట్లు రాగా సమీప ప్రత్యర్ధి బీఆర్ఎస్కు చెందిన సర్వి వెంకన్నకు 447 ఓట్లు రాగా శ్రవన్కుమార్ 222 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 3వ వార్డు నుండి బీఆర్ఎస్కు చెందిన తూర్పాటి రవికి 497 రాగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్కు చెందిన తూర్పాటి రాంబాబుకు 308 ఓట్లు రాగా రవి 189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి పేర్ల జంపన్నకు 605 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి జలకం శ్రీనివాస్కు 440 ఓట్లు పోల్ కాగా జంపన్న 165 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ది చాపల బాపురెడ్డికి 668 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్ధి మచ్చ సురేష్కు 495 ఓట్లు పోల్ కావడంతో బాపురెడ్డి 173 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి పెదగాని కళావతికి 675 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ అభ్యర్ధి రాయిశెట్టి మానసకు 514 ఓట్లు రావడంతో కళావతి 161 మెజార్టీతో విజయం సాధించారు. 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి భవాని లతకు 598 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి జిలుకర సురేందర్కు 330 ఓట్లు రావడంతో భవానిలత 268 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి అల్లం శ్యామలకు 695 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి కేతిరెడ్డి సుమలతకు 399 ఓట్లు రాగా శ్యామల 296 ఓట్ల మెజార్టీతో గెలిచింది. 9వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి బీఆర్ఎస్ కిన్నెర కవితకు 451 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి పంజా కల్పనకు 438 ఓట్లు సాధించగా కవిత 13 ఓట్ల మెజార్టీతో గెలుపును సొంతం చేసుకున్నారు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి ముద్దసాని సురేష్కు 714 ఓట్లు రాగా ప్రత్యర్ధి బీఆర్ఎస్ అభ్యర్ధి రుద్రోజు విజయభాస్కర్కు 204 ఓట్లు రావడంతో సురేష్ 510 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి కర్నె నాగరాజుకు 473 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్ది పొనుగోటి సోమేశ్వర్రావుకు 440 ఓట్లు రావడంతో నాగరాజు 33ఓట్ల తేడాతో గెలిచారు. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి ధరావత్ పద్మకు 562 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి కేతావత్ శ్రేయకు 391 ఓట్లు రావడంతో పద్మ 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి బసనబోయిన ఐలమ్మకు 615 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్నమనేని శ్రీదేవికి 420 ఓట్లు రావడంతో ఐలమ్మ 195 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి సోమ రజనీకి 666 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్ది మడిపెద్ది శ్రవంతికి 425 ఓట్లు రావడంతో రజనీ 241 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకుంది. 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి చకిలేల అలివేణికి 383 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి బొమ్మనబోయిన సుజాతకు 357 ఓట్లు రావడంతో అలివేణి 26 ఓట్ల తేడాతో గెలుపొందింది. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి జాటోతు బద్రుకు 443 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్ధి ధరావత్ వెంకన్నకు 339 ఓట్లు పోల్ కావడంతో బద్రు 104 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజేతలైన అభ్యర్థులకు అధికారులు దృవీకరణ పత్రాలను అందజేశారు. క్యాంపులకు తరలిన విజేతలు... ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు ప్రత్యేక క్యాంప్లకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్కు 9, కాంగ్రెస్కు 7 స్థానాలు రావడంతో ఎక్కడ కూడా చైర్మన్ గిరి చేజారకుండా బీఆర్ఎస్ విజేతలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక క్యాంప్లకు తరలించారు. కాంగ్రెస్కు రెండు స్థానాలు తక్కువ ఉన్నప్పటికి ఏదైనా అవకాశం చిక్కితే ప్రత్యర్ధి పార్టీల నుండి విజేతలను తమవైపు తిప్పుకుని చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలకు పదును పెట్టింది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సూచనలతో విజేతలైన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా క్యాంప్కు తరలి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ విజేతలైన అభ్యర్థులను మాజీ మంత్రి దయాకర్రావు తన వెంట ప్రత్యేక బస్సులో ఆర్యభట్ట స్కూల్లోని కౌంటింగ్ కేంద్రానికి తీసుకువచ్చి అధికారుల చేతుల మీదుగా దృవీకరణ పత్రాలను తీసుకుని వెంటనే అదే బస్సులో తరలి వెళ్లారు. కాంగ్రెస్ విజేతలు కూడా ఇదే విధంగా ప్రత్యేక క్యాంప్కు వెళ్లారు. ఈ విషయం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్తేజాన్ని నింపింది. నాంచారిమడూర్ నుండి ఆర్యభట్ట పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రం వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి దయాకర్రావుకు స్వాగతం పలికారు. ఇరు పార్టీల విజేతలైన అభ్యర్థుల అనుచరులు వారి వార్డుల్లో బానాసంచాలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు.
బాన్సువాడ మున్సిపల్పై జెండా ఎగురవేసిన కాంగ్రెస్
బాన్సువాడ మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 19 వార్డులకు గాను 11 వార్డులను కైవసం చేసుకోగా, ఈ సారి బీజెపీ పుంజుకుని 3 స్థానాల్లో విజయం సాధించగా, మరో 3 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాగే స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు గెలుపొందగా, మరో స్థానంలో ఎంఐఎం గెలిచింది.బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థికి సైతం మద్దతు తెలిపి గెలిపించారు. 1వ వార్డులో అభ్యర్థిని నస్రీన్ బేగం (బీఆర్ఎస్), 2వ వార్డులో జంగం రాజశేఖర్ (కాంగ్రెస్), 3వ వార్డులో అబ్దుల్ హకీం (కాంగ్రెస్), 4వ వార్డులో గైక్వాడ్ రుక్మిణి (కాంగ్రెస్), 5వ వార్డులో విజయ కాసులవార్ (కాంగ్రెస్), 6వ వార్డులో అంజుం బేగం (బీఆర్ఎస్), 7వ వార్డులో సామల మానస (బీజెపీ), 8వ వార్డులో శ్యామల దోన్కంటి (కాంగ్రెస్), 9వ వార్డులో పాశం ఆమని (బీజెపీ), 10వ వార్డులో జగన్నాథం నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డులో గదుమల లింగమేశ్వర్ (కాంగ్రెస్), 12వ వార్డులో గడ్డమీది అంజా గౌడ్ (స్వతంత్య్ర అభ్యర్థి), 13వ వార్డులో అబ్దుల్ ఖాలెక్ (కాంగ్రెస్), 14వ వార్డులో నార్ల వసంత (కాంగ్రెస్), 15వ వార్డులో వంకర్ రమేష్ (కాంగ్రెస్), 16వ వార్డులో గజ్జల మహేష్ (బీజెపీ), 17వ వార్డులో మహమ్మద్ ఫర్హానాజ్ (ఎంఐఎం), 18వ వార్డులో రేష్మా బేగం ఎజాజ్ (కాంగ్రెస్), 19వ వార్డులో యం.డి. మక్బూర్ (బీఆర్ఎస్) గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ 11 స్థానాల్లో బీజెపీ 3, బీఆర్ఎస్ 3, స్వతంత్య్ర 1, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింగా, 76 ఓట్లు పోలయ్యాయని, ఆయా వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసినట్లు అధికారులు తెలిపారు.
పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
పరకాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలు హోరాహోరీగా తలపడ్డ విషయం తెలిసిందే. జనరల్కు రిజర్వు అయిన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు పార్టీలు పెద్దయెత్తున ప్రలోభాల పర్వానికి తెర లేపడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు రౌండ్లలో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ.. పట్టణంలోని గణపతి కళాశాలలో శుక్రవారం భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం నాలుగు రౌండ్లలో 22 వార్డుల ఓట్లను లెక్కించారు. నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ 13 వార్డులను గెలుచుకొని స్పష్టమైన మెజార్టీతో మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను ప్రత్యర్థి పార్టీల సాయం లేకుండా కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో తన ఖాతాలో వేసుకుంది. గెలుపొందిన కౌన్సిలర్లు వీరే... ఒకటవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి, 2వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి బొచ్చు శ్యామల, 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పోరండ్ల మౌనిక, 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకు దివ్య, 5వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి గొడుగు రజిత, 6వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల రాణి, 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ కుమార్, 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమార 9వ వార్డులో బిజెపి అభ్యర్థి బెజ్జంకి పూర్ణాచారి, 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పసుల లావణ్య, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గూడెల్లి సదన్ కుమార్, 12వ వార్డులో బిజెపి అభ్యర్థి ఆకుల లావణ్య, 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు మాధవీలత, 14వ వార్డులో బిఆర్ఎస్ పడిదెల దీప్తి, 15వ వార్డులో బిజెపి అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్, 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బండి శ్రీధర్, 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర, 18వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి రేగూరి కరుణ, 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొయ్యడ శ్రీనివాస్, 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాలకుర్తి శ్రీనివాస్, 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుదమళ్ళ రమేష్, 22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అల్లే దశరథం గెలుపొందారు. చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నిక లాంఛనమే! మొత్తం 22 వార్డుల్లో 13 వార్డులు కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడంతో మున్సిపల్ చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నిక లాంఛనం కానున్నది. చైర్మన్ అభ్యర్థిగా సునీల్ కుమార్ను ఇప్పటికే ఎంఎల్ఏ ప్రకాష్రెడ్డి ప్రకటించి ఉండడంతో వేరెవరు పోటీకి వచ్చే పరిస్థితి లేదు. ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో చైర్మన్గా సునీల్ కుమార్తో పాటు వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయబేరి
భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఒక్క భూపాలపల్లి మున్సిపాల్టీ ఎన్నికల్లో 16సీట్లు గెలుచుకొని అధికార కాంగ్రెస్పార్టీ విజయకేతనం ఎగరవేసింది. భూపాలపల్లిలోని మొత్తం 30వార్డులకు గాను కాంగ్రెస్ సిపిఐ, సిపిఎం మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది, సిపిఐ 4. సిపిఎం1 స్థానాల్లో పోటీచేసింది. 16 కాంగ్రెస్ గెలువగా, సిపిఐ ఒక్క స్థానం గెలిచింది. బీఆర్ఎస్ 25 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో గెలిచింది. బిజెపి 20కి పైగా పోటీచేసి రెండు స్థానల్లో గెలిచింది. 23 వార్డు లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గెలిచిన అభ్యర్థులు పార్టీలవారిగా 1 వ వార్డు బౌత్ శోభ రాజేష్. (కాంగ్రెస్), 2 వ వార్డు బుర్ర కొమురయ్య గౌడ్. (కాంగ్రెస్),3 వ వార్డు. ఎరవెల్లి జగపతి. (అరుణ్ రావు) (కాంగ్రెస్), 4 వ వార్డు. కన్నం యుగదీశ్వర్ బిజెపి, 5 వ వార్డు కట్ల పూర్ణ చందర్ బిఆర్ఎస్, 06 వ వార్డు. ఎరుకల రేణుక గణపతిబిజెపి. 7 వ వార్డు. రత్నం సుమాంజలి బిఆర్ఎస్, 8 వ వార్డు బెజ్జాల శ్యామల బిఆర్ఎస్, 9 వ వార్డు అప్పం కిషన్ (కాంగ్రెస్), 10 వ వార్డు. పుల్లూరి మంజుల మాధవరావు (కాంగ్రెస్), 11 వ వార్డు మోతె రాజుబీఆర్ఎస్, 12 వ వార్డు బొంతల సతీష్ బీఆర్ఎస్, 13 వ వార్డు బడితల వెంకటస్వామి (కాంగ్రెస్), 14 వ వార్డు మాకోటి శ్వేత ప్రభాకర్ (కాంగ్రెస్), 15 వ వార్డు. అంబాల శ్రీనివాస్(కాంగ్రెస్), 16 వ వార్డు. జ్యోతుల మంజుల బిఆర్ఎస్, 17 వ వార్డు బీర్తి కమల మధునయ్య. (కాంగ్రెస్),18 వ వార్డు ముంత సహదేవ్ (కాంగ్రెస్), 19 వ వార్డు కురుమిళ్ళ శ్రీనివాస్ (కాంగ్రెస్), 20 వ వార్డు ఇస్లావత్ రాజు నాయక్. (కాంగ్రెస్), 21 వ వార్డు దరావత్ శారద సమ్మయ్య. (కాంగ్రెస్), 22 వ వార్డు బుర్ర రమాదేవి సదానందం బిఆర్ఎస్, 23 వ వార్డు రాజేశ్వరి పద్మారెడ్డి (స్వతంత్ర అభ్యర్థి), 24 వ వార్డు. వేముల జ్యోతి శ్రీకాంత్ సిపిఐ, 25 వ వార్డు. పొనగంటి మేఘన. (కాంగ్రెస్), 26 వ వార్డు. ఓరుగంటి రాధ అయిలయ్య. (కాంగ్రెస్), 27 వ వార్డు. వాసాల ఈశ్వరమ్మ బిఆర్ఎస్, 28 వ వార్డు. భోగం నరేందర్బిఆర్ఎస్, 29 వ వార్డు. గండ్ర హరీష్ రెడ్డి బిఆర్ఎస్, 30 వ వార్డు. బొడ్డు అశోక్ (కాంగ్రెస్) లు గెలుపొందారు. మెజార్టీ స్థానాలు గెలుచుకున్న అధికా పార్టీ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మెన్ పీఠం దక్క నుంది.
cash |పోగొట్టుకున్న నగదు వెంటనే…
cash | పోగొట్టుకున్న నగదు వెంటనే… cash | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ
Traffic |మనస్తాపానికి గురై పిల్లలతో నగరానికి…
Traffic | మనస్తాపానికి గురై పిల్లలతో నగరానికి… Traffic | విజయవాడ, క్రైమ్,
ధర్మపురిలో15కు 15 వార్డులు కాంగ్రెస్ కైవశం..
ఈ నెల 11న జరిగిన రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ధర్మపురిలో 15 వార్డులు ఉండగా 15కు 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని బిఆర్స్, బిజెపి పార్టీలకు షాక్ ఇచ్చింది. పుర పోరులో పట్టణ ప్రజల ఇచ్చిన తీర్పుతో త్రిముఖ పోరు అనుకున్న ధర్మపురి నాయకుల అంచనాలు తారుమారయ్యాయి. ఈ భారీ విజయానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషితో పాటు, ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ది, నిత్యం ప్రజల్లో ఉండే నాయకులను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ ఆశీర్వదించినట్లు పుర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, పుర ప్రజలు కలిసి అభినందనలు తెలిపారు. పుర పోరులో విజయం సాధించిన అభ్యర్థులు వీరే.. 1వ వార్డు అయ్యోరి వేణుగోపాల్(కాంగ్రెస్), 2వ వార్డు సంగనబట్ల సంతోషి(కాంగ్రెస్), 3వ వార్డు ఇందారపు రామయ్య(కాంగ్రెస్), 4వ వార్డు కొమురెల్లి పవన్ కుమార్(కాంగ్రెస్), 5వ వార్డు వేముల నాగలక్ష్మి(కాంగ్రెస్), 6వ వార్డు ముడుసుల ప్రశాంత్(కాంగ్రెస్), 7వ వార్డు వాంకుడోతు విజయబాబు(కాంగ్రెస్), 8వ వార్డు జంజరికాని సువర్ణ(కాంగ్రెస్) 9వ వార్డు వీరవేణి నాగలక్ష్మీ(కాంగ్రెస్), 10వ వార్డు సంగి ఆనంద్(కాంగ్రెస్), 11వ వార్డు జక్కు పద్మ(కాంగ్రెస్), 12వ వార్డు చుక్క సంధ్య(కాంగ్రెస్), 13వ వార్డు చీపిరిశెట్టి రాజేష్(కాంగ్రెస్), 14వ వార్డు వేముల రమదేవి(కాంగ్రెస్), 15వ వార్డు వొజ్జల లక్ష్మణ్(కాంగ్రెస్) అభ్యర్థులు విజయం సాధించారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరిగింది. ఈ కౌంటింగ్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 1,331 వార్డుల్లో విజయం సాధించి 83 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. భారత రాష్ట్ర సమితి 718 వార్డుల్లో గెలుపొంది 15 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బిజెపి 258 వార్డులు, స్వతంత్రులు 250 వార్డుల్లో విజయం సాధించారు. 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం గమనార్హం. జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. 7 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీదే హవా నడిచింది. రామగుండం, మంచిర్యాల, నల్గొండలో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఒకే సంఖ్య స్థానాల్లో గెలిచాయి. రెండు పార్టీలకు చెరి 22 స్థానాలు వచ్చాయి. 8 స్థానాల్లో బిఆర్ఎస్, బిజెపి 1, సిపిఎం 1, ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఛైర్మన్ ఎంపిక రసవత్తరంగా మారింది. కొత్తగూడెంలో సిపిఐకి బిఆర్ఎస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
Vijay | ఉరి వేసుకొని మృతి… Vijay | వర్ని, ఆంధ్రప్రభ :
13 wards |స్టేషన్ ఘన్పూర్లో ఘన విజయం!
13 wards | స్టేషన్ ఘన్పూర్లో ఘన విజయం! 13 wards |
ଫ୍ୟାକ୍ଟଚେକ୍: ମେଟ୍ରୋରେ ନିର୍ବନ୍ଧ ହେଉଥିବା ଭିଡିଓଟି ପ୍ରାୟୋଜିତ ଅଟେ
ଭାଇରାଲ ହେଉଛି ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆ ସାଜିଛି ବାହକ । ପ୍ରାୟ ପ୍ରତ୍ୟେକ ଦିନ ସୋସିଆଲ ମିଡିଆରେ କିଛିନାକିଛି ନୂଆ ଭିଡିଓ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । କେତେବେଳେ କିଏ ରାଜନେତାଙ୍କ ମିଛ ଫଟୋ ଭାଇରାଲ କରୁଛି ତ କେତେବେଳେ କେଉଁ ଅଞ୍ଚଳର ଘଟଣାକୁ ଅନ୍ୟ କେଉଁ ଅଞ୍ଚଳର ଘଟଣା ଲେଖି ସେୟାର କରାଯାଉଛି । ଅଧିକ ଲାଇକ କମେଣ୍ଟ ଆଶାରେ ୟୁଜର୍ସ ମଧ୍ୟ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନପରଖି ସେୟାର କରିବାରେ ଲାଗିଛନ୍ତି । ତେଣୁ ବହୁଳ ମାତ୍ରାରେ ଭୁଲ୍ ସୂଚନା ବ୍ୟପିବାରେ ଲାଗିଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଦୁଇଜଣ ପ୍ରେମୀ ଯୁଗଳ ବସିଥିବା ବେଳେ ସେଠାରେ ଜଣେ ମହିଳା ପହଁଚି ଦୁହେଁଙ୍କୁ ବଡ଼ ପାଟିରେ କିଛି କହୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ମହିଳା ଜଣଙ୍କ ସେଠାରେ ଥିବା ପୁଅର ମା ବୋଲି କୁହାଯାଉଛି । ଉଭୟଙ୍କୁ ପୁଅର ମା ଧରିବା ପରେ ସେହି ସ୍ଥାନରେ ହିଁ ଉଭୟଙ୍କୁ ନିର୍ବନ୍ଧ କରିଦେଉଥିବାର ଉକ୍ତ ଭିଡିଓରେ ଦେଖିବାକୁ ମିଳିଛି । View this post on Instagram A post shared by NextGen Bhartiya (@nextgenbhartiya) Secret meetup quickly turned into a LIFETIME MATCH at a Metro Station when a mother caught her son with his girlfriend. Instead of creating a scene she stunned everyone by handling the situation in the most unexpected way — she treated the moment into an INSTANT ENGAGEMENT!! ❤️❤️ pic.twitter.com/JbJYorH53B — Rosy (@rose_k01) February 7, 2026 ଯାହାର ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରାୟୋଜିତ ଅଟେ । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର ଏକ ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଆରଭ ମାଭି ନାମକ ଜଣେ କଣ୍ଟେଣ୍ଟ କ୍ରିଏଟରଙ୍କ ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲ ଚଲତେ ଫିର୍ତେର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ସର୍ବମୋଟ ୧୮ମିନିଟର ହୋଇଥିବା ବେଳେ ଶୀର୍ଷକରେ ଉଲ୍ଲେଖ ରହିଥିଲା ସିଦ୍ଧାର୍ଥ ଏବଂ ଦୀକ୍ଷାର ବିବାହ ଉତ୍ସବ । ୫ ଫେବୃଆରୀରେ ଉକ୍ତ ଭିଡିଓଟି ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ବେଳେ ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ୪.୭ହଜାର ଲାଇକ ଏବଂ ୧ଲକ୍ଷ ୬୭ ହଜାର ୩୦୮ଭିୟୁ ମିଳିପାରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଭିଡିଓକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ତର୍ଜମା କରି ଦେଖିବାରୁ ଅନ୍ୟୁନ୍ୟ ୧୫ମିନିଟ ସମୟ ମଧ୍ୟରେ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓର ପ୍ରଥମରୁ ହିଁ ଜଣେ ବ୍ୟକ୍ତି କହିଛନ୍ତି ଏହା ଏକା ପ୍ରାୟୋଜିତ ଭିଡିଓ ଅଟେ । ଏଭଳି ବହୁତ କମ୍ ପରିବାର ଅଛନ୍ତି ଯେଉଁଠି ପୁଅ କିମ୍ବା ଝିଅ ଘର ପ୍ରେମ ସମ୍ପର୍କକୁ ସ୍ୱୀକୃତି ଦେଉଛନ୍ତି । ତାହାକୁ ନେଇ ଆମେ ଏହି ସୂଟ ଆଜି କରିବାକୁ ଯାଉଛୁ । ସେହିପରି ଚଲତେ ଫିରତେ ନିଜ ଇନସ୍ଟାଗ୍ରାମ ଆକାଉଣ୍ଟରେ ମଧ୍ୟ ସମାନ ଭିଡିଓ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । View this post on Instagram A post shared by Aarav mavi (@chalte_phirte098) ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ଭିଡିଓଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରାୟୋଜିତ ଅଟେ । କେବଳ ମନୋରଞ୍ଜନ ନିମନ୍ତେ ଉକ୍ତ ଭିଡିଓଟିକୁ ସୁଟ କରି ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରାଯାଇଥିବାର ଜଣାଯାଇଛି । ଯାହାକୁ ମୁଳ ଭିଡିଓରୁ କିଛି ଅଂଶ ଏଡିଟ କରି ଭୁଲ୍ ଦାବି ସହ ସେୟାର କରାଯାଇଛି ।
డయాబెటిస్ ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ రాదా? ఈ 3 నిజాలు మీకు తెలుసా?
డయాబెటిస్ ఉన్నవారికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు లభిస్తాయా? ప్రీమియం ఎంత ఉంటుంది? మధుమేహం ఉన్నవారు బీమా పొందేందుకు పాటించాల్సిన నిబంధనలు, చిట్కాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. భారతదేశాన్ని ‘ప్రపంచ డయాబెటిస్ రాజధాని’ అని పిలుస్తుంటారు. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే, డయాబెటిస్ రాగానే చాలా మంది భయపడే విషయం—”ఇక నాకు లైఫ్ ఇన్సూరెన్స్ లభించదా? నా కుటుంబానికి రక్షణ ఎలా?” అని. నిజానికి, డయాబెటిస్ ఉన్నంత […] The post డయాబెటిస్ ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ రాదా? ఈ 3 నిజాలు మీకు తెలుసా? appeared first on Dear Urban .
The post Photos : Funky Success Meet appeared first on Telugu360 .
Municipal |ఎల్లంపేట మున్సిపల్లో హంగు…
Municipal | ఎల్లంపేట మున్సిపల్లో హంగు… Municipal | మేడ్చల్, ఆంధ్రప్రభ :
16 Wanderers |సంచార కుటుంబాలతో కలెక్టర్….
16 Wanderers | సంచార కుటుంబాలతో కలెక్టర్…. 16 Wanderers | బాపట్ల,
Mahesh Babu and Allu Arjun to Miss 2026
2026 is packed with several films in Telugu cinema. Almost all the actors will test their luck with their respective films. Megastar Chiranjeevi started the year for Telugu cinema on a rampage mode and all the Mega heroes will test their luck in summer this year. All the top stars excluding Mahesh Babu and Allu […] The post Mahesh Babu and Allu Arjun to Miss 2026 appeared first on Telugu360 .
election |ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం..
election | ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం.. election | నిజాంబాద్, ఆంధ్రప్రభ
success |పీసీసీని కలిసిన కాంగ్రెస్ విజేతలు
success | పీసీసీని కలిసిన కాంగ్రెస్ విజేతలు success | భీంగల్ టౌన్,
election | 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి విజయం
election | 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి విజయం election | నిజామాబాద్,
Village |గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలి…
Village | గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలి… Village | మునుగోడు, ఆంధ్రప్రభ :
గజ్వేల్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ విజయ దందుభి
గజ్వేల్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటంగ్ శుక్రవారం జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 83, బిఆర్ఎస్ 15, బిజెపి 2, ఇతరులు 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. అయితే ఈ ఫలితాల్లో గజ్వేల్లో గులాబీ జెండా ఎగిరింది. గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా.. బిఆర్ఎస్ 11 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 7, బిజెపి 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు.
4sides |పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ
4sides |పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ 4sides
Certificates |పోటీ పరీక్షల్లో…
Certificates | పోటీ పరీక్షల్లో… Certificates | వేల్పూర్, ఆంధ్రప్రభ : మండల
Ambulance | ప్రమాదవశాత్తు… Ambulance | ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా
Electricity |విద్యుత్ సరఫరాలో అంతరాయం
Electricity | విద్యుత్ సరఫరాలో అంతరాయం Electricity | జైనూర్, ఆంధ్రప్రభ :
Municipal 2026 |అవును… వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు…
Municipal 2026 | అవును… వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు… Municipal 2026 | ఆంధ్రప్రభ,
Revanth Reddy : వైఎస్ బాటను రేవంత్ ఎంచుకుంటున్నట్లుందిగా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్న మార్గంలో వెళుతున్నారు
ఆస్ట్రేలియాపై జింబాబ్వే అద్భుత విజయం
టి20 ప్రపంచకప్లో పెను సంచనలం నమోదైంది. శుక్రవారం జరిగిన గ్రూప్బి మ్యాచ్లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో పటిష్టమైన ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. జింబాబ్వేకు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లు అసాధారణ బౌలింగ్తో ఆస్ట్రేలియా బ్యాటర్లను హడలెత్తించారు. ఓపెనర్లు జోష్ ఇంగ్లిస్ (8), ట్రావిస్ హెడ్ (17)లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన కామెరూన్ గ్రీన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ వెంటనే టిమ్ డేవిడ్ కూడా వెనుదిరిగాడు. అతను కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో మాక్స్వెల్, మాట్ రెన్షాలు కుదురుగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు జింబాబ్వే బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మాక్స్వెల్, రెన్షాలు కలిసి ఐదో వికెట్ 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కుదరుగా ఆడుతున్న మాక్స్వెల్ (31)ను రియాన్ బుర్ల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. మార్కస్ స్టోయినిస్ (6), నాథన్ ఎల్లిస్ (7), ఆడమ్ జంపా (2), మాథ్యూ కుహ్నెమన్ (0) నిరాశ పరిచారు. ఒంటరి పోరాటం చేసిన రెన్షా 44 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్తో 65 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబ్బాని 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఎవన్స్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, మరుమని శుభారంభం అందించారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. మరుమాని దూకుడుగా ఆడగా, బెన్నెట్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ధాటిగా ఆడిన మరుమాని 21 బంతుల్లోనే 7 ఫోర్లతో 35 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన రియాన్ బుర్ల్ 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. కెప్టెన్ సికందర్ రజా 25 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఇక అద్భుత బ్యాటింగ్ను కనబరిచిన బెన్నెట్ 56 బంతుల్లో ఏడు ఫోర్లతో అజేయంగా 64 పరుగులు సాధించాడు. దీంతో జింబాబ్వే స్కోరు 169 పరుగులకు చేరింది.
Vishnu Vinyasam Modhale Modhale Song: Perfect V’ Day Treat
King of Entertainment Sree Vishnu has earned a huge name and reputation for his pure entertainers that drive audiences to theatres. He is working with writer-director Yedunaath Maruthi Rao for a complete entertainer, Vishnu Vinyasam. The movie has huge anticipation as first single and title glimpse became viral hits. Now, the makers have unveiled second […] The post Vishnu Vinyasam Modhale Modhale Song: Perfect V’ Day Treat appeared first on Telugu360 .
డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటా.. నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజాంబాద్ నగరంలోని 26వ
Bangla Judgment : స్వేచ్ఛ.. శాంతికే పట్టం Andhra Prabha Analysis
Bangla Judgment : స్వేచ్ఛ.. శాంతికే పట్టం Andhra Prabha Analysis మతం
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల
ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో
13thFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
13thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
నిజామాబాద్,ఆంధ్రప్రభ : కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ గెలుపు డివిజన్ ప్రజలదేనని 50వ డివిజన్
ఫలించిన సంజయ్ కృషి.. కరీంనగర్ కార్పొరేషన్లో బిజెపి హవా
కరీంనగర్: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు శుక్రవారం కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అధిపత్యం చూపిస్తుండగా.. బిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా తలపడుతున్నాయి. అయితే కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నేడు కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే పై చేయిగా ఉంది. కానీ, కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ బిజెపిని గట్టెక్కించారు. ఇప్పటివరకూ బిజెపి 31 డివిజన్లలో విజయం సాధించగా.. కాంగ్రెస్ 14, బిఆర్ఎస్ 10, ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో గెలిచారు. ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిషియోతో కరీంగనర్లో బిజెపి జెండా రెపరెపలాడుతోంది. దీంతో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారిగా కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి దక్కింది.
ఘనంగా ఆంగ్లభాషా దినోత్సవ వేడుకలు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
525 communities |మార్చి 19న ఢిల్లీలో ముగింపు
525 communities | మార్చి 19న ఢిల్లీలో ముగింపు 525 communities |
ఘనంగా సద్గురు పులాజీ బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవం
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
municipolls2026 |అత్యధిక మున్సిపాలిటీలు కైవసం – రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విజయం
municipolls2026 | అత్యధిక మున్సిపాలిటీలు కైవసం – రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విజయం
ఆంధ్రప్రభ ఎఫెక్ట్ వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో డ్రైనేజ్
Stock |భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…
Stock | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు… Stock | ఆంధ్రప్రభ, వెబ్
సీపీఐకి అన్ కండిషనల్ ఆఫర్ ఇచ్చిన బీఆర్ఎస్
కొత్త గూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడింది
6 Cr.|‘సేవాతీర్థ్ ‘లో తొలి నిర్ణయాలివే..
6 Cr.| ‘ సేవాతీర్థ్ ‘ లో తొలి నిర్ణయాలివే.. 6 Cr.|
BJP : రెండు కార్పొరేషన్లలో కాషాయ జెండా ముందంజ
బీజేపీ రెండు కార్పొరేషన్లలో ఆధిక్యతతో కొనసాగుతుంది
23వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి విజయ మల్లేష్ యాదవ్ విజయం..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమమే మా ధ్యేయయమని 23 వ డివిజన్
విజయోత్సవ సంబరాలు మోత్కూర్ , ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 7 వ
ఆలేరు నాలుగో వార్డులో బీఆర్ఎస్ విజయం
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 4 వ
లక్ష్మి గ్రామైక్య భవనానికి భూమి పూజ..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
నిజామాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందూర్లో రెండు డివిజన్లో బిజెపి
45వ డివిజన్ బొబ్బిలి సువర్ణ విజయం..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని 45వ డివిజన్
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గెలుపెవరిదంటే?
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా మారిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది
మెదక్ మున్సిపాలిటీలో ఫలితం హంగ్
మెదక్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అత్యధిక శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అయితే మెదక్ మున్సిపాలిటీలో మాత్రం హంగ్ వచ్చింది.. మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్-13+ 1ఏకగ్రీవం సీట్లో గెలవగా.. బిఆర్ఎస్-15 సీట్లలో విజయం సాధించింది. బిజెపి- 2, బిఎస్పి- 1 సీట్లలో విజయం సాధించాయి. మెదక్ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులు: 1.చెప్యాల రాజవ్వ - బిఆర్ఎస్ 2.ఎరుకల నర్సింలు - కాంగ్రెస్ 3.కోటాల లలితమ్మ - బిఆర్ఎస్ 4.ధర్మాశెట్టి స్వరూప - బిఆర్ఎస్ 5.మామిళ్ళ ఆంజనేయులు - బిఆర్ఎష్ 6.కొడకంటి హరిత - కాంగ్రెస్ 7.శంసున్నీసా - కాంగ్రెస్ 8.మాయా గంగామణి - బిఆర్ఎస్ 9.జుబైర్ - బిఆర్ఎస్ 10.చింతల లక్ష్మీ స్వరాగిణి - కాంగ్రెస్ 11.నస్రీన్ బేగం - కాంగ్రెస్ 12.అనీస్ ఫాతిమా - బిఆర్ఎస్ 13.చేదల్ సంధ్య - బిఆర్ఎస్ 14.దొంతి లక్ష్మి - కాంగ్రెస్ 15.దొంతి నరేష్ గౌడ్ - కాంగ్రెస్ 16.అవారి రాజ శేఖర్ - బిఆర్ఎస్ 17.బుజ్రంపేట అరుణ - బిఎస్పి 18.పాఠ శశాంక్ - కాంగ్రెస్ 19.గంటా సంపత్ - కాంగ్రెస్ 20.మహ్మద్ మన్సూర్ అహ్మద్- కాంగ్రెస్ 21.పబ్బా రాజమణి - బిజెపి 22.మహ్మద్ గౌస్ - బిఆర్ఎస్ 23.మద్దిబోయిన శ్రుతి - బిఆర్ఎష్ 24.కానుగు రాధిక - కాంగ్రెస్ 25 ఖాజా సోహెల్ మొహియుద్దీన్ - బిఆర్ఎస్ 26 మ్యాదరి దీపక్ కుమార్ - బిఆర్ఎస్ 27.అస్త్రగళ్ల పల్లెరాణి - బిఆర్ఎస్ 28.బోడికే అఖిల - బిజెపి 29.బట్టి ఉదయ కుమార్ - బిఆర్ఎస్ 30.అరుణార్తి వెంకటరమణ - కాంగ్రెస్ 31.తోడుపునూరి శివరామ కృష్ణ - కాంగ్రెస్ 32.గోదాల మానస - కాంగ్రెస్ (ఏకగ్రీవం) అలాగే మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కూడా బిఆర్ఎస్ విజయ దుంధుభి మోగించింది. మొత్తం 16 వార్డులకు బిఆర్ఎస్ 9, బిజెపి 3, కాంగ్రెస్ 04 వార్డుల్లో విజయం సాధించాయి. గెలిచిన అభ్యర్థులు: 1.బొంది రజిని-బిఆర్ఎస్ 2.అశోక్-బిజెపి 3.సత్యలింగం-బిఆర్ఎస్ 4.రాథోడ్-బిఆర్ఎస్ 5.ప్రియాంక -బిఆర్ఎస్ 6.సమత కాశిరెడ్డి-బిఆర్ఎస్ 7.మన్నే స్వామి-బిజెపి 8.బి.రాధ-బిఆర్ఎస్ 9.ఐలేష్-బిఆర్ఎస్ 10.యం.లక్మి-బిఆర్ఎస్ 11.సత్యనారాయణ-బిజెపి 12.రామునిగారి నాగరాజు-కాంగ్రెస్ 13.రాములు-బిఆర్ఎస్ 14.సబితా-కాంగ్రెస్ 15.అన్నపూర్ణ-కాంగ్రెస్ 16.జోష్ణ-కాంగ్రెస్
After Karur Stampede, Another Fatal Incident at Vijay’s Public Meeting
A man died after collapsing at Tamilaga Vettri Kazhagam chief Vijay’s public rally in Salem, raising fresh questions about crowd management and safety measures at large political gatherings. According to police sources, the victim fainted due to heatstroke and later succumbed. Dehydration was cited as the primary cause, while the man was also said to […] The post After Karur Stampede, Another Fatal Incident at Vijay’s Public Meeting appeared first on Telugu360 .
Jana Sena and Telangana Jagruthi Make Entry as Congress Leads the Race
The Telangana municipal elections have produced a decisive political shift, with Congress emerging as the clear dominant force across urban local bodies. Out of 116 municipalities, Congress has secured control in nearly 90 municipalities. The party has already taken charge of 55 municipalities in the results declared so far. These numbers reflect a strong wave […] The post Jana Sena and Telangana Jagruthi Make Entry as Congress Leads the Race appeared first on Telugu360 .
నేటితో ముగిసిన బడ్జెట్ సెషన్ మొదటి దశ
భారత్-అమెరికా వాణిజ్యం, మాజీ ఆర్మీ అధికారి ఎం.ఎం.నరవణె జ్ఞాపకాలపై చర్చచేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ల మధ్య బడ్జెట్ సెషన్ మొదటి దశ శుక్రవారంతో ముగిసింది. సభ మార్చి 9న తిరిగి సమావేశం కానుంది. మూడు వారాల విరామ సమయంలో బడ్జెట్లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేటాయింపులను స్టాండింగ్ కమిటీలు పరిశీలించనున్నాయి.శుక్రవారం సభ ప్రారంభం కాగానే కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభ గంటసేపు వాయిదా పడింది. భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య […] The post నేటితో ముగిసిన బడ్జెట్ సెషన్ మొదటి దశ appeared first on Visalaandhra .
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి
హైదరాబాద్: తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడుస్తోంది. తనకు తిరుగులేదని మరోసారి కాంగ్రెస్ నిరూపించుకుంది. మెజారిటీ మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు వెలువడిన 47 మున్సిపాలిటీల ఫలితాల్లో 30 మున్సిపాలిటీలు హస్తగతం అయింది. హుజూర్ నగర్, మధిర, హాలియా, చిట్యాల, చండూరు..నందికొండ, నేరేడుచర్ల, బిచ్కుంద, ఎల్లారెడ్డి..పెద్దపల్లి, మంథని, కొల్లాపూర్, నాగర్ కర్నూల్..నారాయణఖేడ్, బాన్సువాడ, కొడంగల్, అశ్వారావుపేట, జుక్కల్..కోదాడ, భూత్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది.
6వ వార్డులో ఎండీ ఖాజా నవాజుద్దీన్ జయకేతనం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ
కల్వకుర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జయకేతనం
కల్వకుర్తి: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధిక శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 77 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా.. బిఆర్ఎస్ 13, బిజెపి 1, ఎంఐఎం 1 స్థానంలో గెలిచాయి. ఇక కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో బృంగి రత్నమాలను కాబోయే మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 13+1=14(1 కాంగ్రెస్ రెబెల్) స్థానంలో విజయం సాధించగా.. బిఆర్ఎస్ 3, బిజెపి 5 స్థానాల్లో గెలిచాయి. గెలిచిన వారి వివరాలు: 1వ వార్డు.. బిజెపి.. శ్రీరామ్ 4వ వార్డు.. కాంగ్రెస్.. హుమ్లి హనుమ నాయక్ 7వ వార్డు.. కాంగ్రెస్.. బృంగి రత్నమాల 10వ వార్డు.. కాంగ్రెస్.. షేక్ ఎజాస్ 13వ వార్డు.. బిజెపి.. బోడ నరసింహ 16వ వార్డు.. కాంగ్రెస్.. పసుల లలిత 19 వ వార్డు.. బిఆర్ఎస్.. ఎండి షాహిద్ 21 వ వార్డు.. కాంగ్రెస్.. మబ్బు రామరాజు 17 వార్డు.. కాంగ్రెస్.. షానవాజ్ ఖాన్ 14 వార్డు.. బిఆర్ఎస్.. భావండ్ల మంజుల మధు 22 వార్డు.. కాంగ్రెస్.. రాజేష్ 8 వార్డు.. కాంగ్రెస్ రెబల్.. లలిత గణేష్ 5 వార్డు.. కాంగ్రెస్.. కరుణాకర్ రెడ్డి 20 వార్డు.. కాంగ్రెస్.. లలిత శ్రీకాంత్ రెడ్డి 11 వార్డు.. బిజేపి.. రామకృష్ణ 3 వార్డు.. బిఆర్ఎస్.. కేతవత్ రాము నాయక్ 9 వ వార్డు.. కాంగ్రెస్.. చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్ 6 వ వార్డు.. కాంగ్రెస్.. రేణుక రాజశేఖర్ 18 వ వార్డు.. కాంగ్రెస్.. నాజియా మగ్బుల్ 15 వ వార్డు.. కాంగ్రెస్.. అస్మిత చంద్రకాంత్ రెడ్డి 12 వ వార్డు.. బిజెపి.. జ్యోతి రాంభూపాల్ రెడ్డి
10వ వార్డునుంచి గర్రెపల్లి శాంత రాణి విజయకేతనం
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ 10వార్డు బిజెపి అభ్యర్థి
4వ వార్డులో బీజేపీ అభ్యర్థి పికె.నర్సింహా గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 1హ4వ వార్డులో
వర్ధన్నపేట మున్సిపాలిటీ ముందు టీఆర్ఎస్ నాయకుల ధర్నా…
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలలో గందరగోళంగా మారింది. 12 వ
4 people | అవి పాలు కావా? 4 people | చిత్తూరు,
7వ వార్డులో గొల్ల వంశీయాదవ్ ఘన విజయం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ
అర్బన్ ఓటర్లు హస్తానికి జై కొట్టడానికి రీజన్ ఇదేనా?#Telangana#MunicipalElections#Congress#Revanth
11వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి వెంకన్న గౌడ్ విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 11 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ
మెగా ట్విన్స్కు నామకరణం..#telugupost #ramcharankonidela #chiranjeevikonidela #TollywoodNews
12వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి రమణ నగేష్ విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 12 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ

22 C