గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్
హిప్ కంపెనీ బేబీ ఫుడ్ అమ్మకాలు నిలిపివేత
హిప్ కంపెనీ బేబీ ఫుడ్ అమ్మకాలు నిలిపివేసింది
Ys Jagan : రేపటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులోనే
రేపటి నుంచి మూడు రోజుల పాటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు.
మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం
మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Gold Price Today : భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. వెండి కూడా అంతే
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.
ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ వేగవంతం
ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ వేగవంతం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలోని
మామిడి సీజన్కు యుద్ధం షాక్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో
Revanth Reddy : నేడు భూపాలపల్లి జిల్లాకు రేవంత్
నేడు భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు
నేడు సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం ప్రారంభమయింది
డ్వాక్రా సభ్యులకు అదనపు రుణ సదుపాయం
డ్వాక్రా సభ్యులకు అదనపు రుణ సదుపాయం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మహిళలను
యువతి ప్రాణం తీసిన సెల్ ఫోన్ పిచ్చి
అమరావతి: సెల్ఫోన్ చూడొద్దని అక్కా, బావ మందలించినందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు మితాజెన్-అజయ్ కుమార్లు రాజంపేటలో నివసిస్తున్నారు. మితాజెన్ చెల్లెలు కూడా ఈ దంపతులతో కలిసి ఉంటుంది. అక్కా-బావ హోటల్లో పని చేస్తుండగా చెల్లెలు మాత్రం సెల్ఫోన్ ఎక్కువ వీక్షిస్తుండడంతో పలుమార్లు మందలించారు. సెల్ఫోన్ మాయ నుంచి ఆమె బయటకు రాకపోవడంతో ఫోన్ను అక్కాబావ పగులగొట్టారు. యువతి మానస్థాపానికి గురై రూమ్లో ఉరి వేసుకుంది. వెంటనే దంపతులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి
అమెరికాలోని లూసియానాలో కాల్పులు జరిగాయి
Fact Check: Viral CSK ‘Black Magic’ Complaint Letter is Fabricated
A video from the IPL 2026 match between Sunrisers Hyderabad and Chennai Super Kings is circulating on social media. It shows a fan in the stands of the Rajiv Gandhi International Stadium in Hyderabad on Saturday appearing to perform a “black magic” act involving a lemon. In the next moment, the camera shifts to the field where SRH bowler Sakib Hussain delivers a fast, full-length ball that goes on to hit the stumps of CSK batter Shivam Dube. Amid this, A letter circulating on social media claims that IPL team Chennai Super Kings (CSK) complained about supernatural practices and black magic during their match against Sunrisers Hyderabad (SRH) on April 18. The match, played at Uppal Stadium, saw SRH defeat CSK by 10 runs after successfully defending a total of 194 runs in a closely fought contest. The letter claims that some people in the crowd used “supernatural” and unfair practices during the April 18 match against SRH. It says these actions, including black magic and disturbing behaviour, affected the players’ performance and well-being. Haha What the Hell is This ? Is this really true? KAALA JADU چنائی نے آفیشل لیٹر لکھ دیا ہے ان پر حیدرآباد کے لوگوں نے کل کے میچ پر کالا جادو کیا ہے @ChennaiIPL pic.twitter.com/jnr8xZEpj6 — Aqsa Farooq (@Aqsa_Farook) April 19, 2026 You can find the screenshot below. Fact Check: The claim is false and the viral letter is fabricated. There is no official evidence or confirmation from CSK or the BCCI. To verify the claim, we conducted an investigation and searched for relevant keywords, but did not find any credible news on any prominent media platform. The letter is dated April 19th, for this date, there are no posts about this letter on Official social media handles of CSK . We examined the viral letter and found several inconsistencies that raise doubts about its authenticity. Wrong parent company name: The letter mentions CSK’s parent company as “Chennai Super Kings Private Limited,” which is incorrect. The correct name is Chennai Super Kings Cricket Limited (CSKCL), as per official company records. Incorrect recipient address: The letter is said to be addressed to the BCCI but only mentions Wankhede Stadium as the office address, which is wrong. The official BCCI address is 4th Floor, Cricket Centre, Wankhede Stadium, ‘D’ Road, Churchgate, Mumbai – 400020, India. Incorrect spelling of name: The CEO’s name is written as “Kasi Viswarathan” at the end of the letter, while the signature appears as “Viswanathan.” The correct spelling is Kasi Viswanathan. These errors make the letter look unprofessional and suggest it may be fake or created to imitate official communication. Hence we found that the claim that CSK wrote to the BCCI alleging “black magic” behind their defeat is completely false. The viral letter circulating on social media is fabricated, and there is no official confirmation or evidence supporting it.
BRS : నేడు జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ
నేడు జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది
IPL 2026 : అవేం సిక్స్ లు రా సామీ.. ఛీర్ గర్ల్స్ కు కూర్చునే టైం లేదుగా?
చండీగఢ్ లో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లోనూ పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాన్ని చూసింది
ముంబైకి సవాల్.. నేడు గుజరాత్తో పోరు
అహ్మదాబాద్: ఐపిఎల్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్ ముంబై ఇండియన్స్కు సవాల్గా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. క్వింటన్ డికాక్ ఫామ్లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. పంజాబ్తో జరిగిన కిందటి మ్యాచ్లో డికాక్ అజేయ శతకంతో కదంతొక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ముంబై భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. బౌలింగ్ వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, తిలక్ వర్మ తదితరుల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య తన పాత్రను సమర్థంగా నిర్వర్తించలేక పోతున్నాడు. ఇలాంటి స్థితిలో ముంబైకి వరుస ఓటములు తప్పడం లేదు. గుజరాత్ ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో గెలిచింది. ఈసారి కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది.
North Korea : ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం.. అధికారిక ప్రకటన
ఉత్తర కొరియా సోమవారం క్లస్టర్ బాంబు వార్హెడ్లతో బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు ప్రకటించింది
America - Iran Talks : రేపు అమెరికా - ఇరాన్ ల మధ్య రెండో దఫా చర్చలు
అమెరికా - ఇరాన్ ల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి
అజహర్, కోదండరాం పేర్లు ఆమోదించండి
గవర్నర్ కోటా ఎంఎల్సిలపై గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసిన సిఎం రేవంత్ సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయినందున ఆమోదముద్ర వేయాలని వినతి మంత్రిగా అజహర్ పదవి చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు మాసాలు గవర్నర్ ఆమోదించకపోతే పదవి కోల్పోయే ప్రమాదం విద్యారంగ సమస్యలపై గవర్నర్తో సిఎం చర్చ మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రికి సూచించిన గవర్నర్ మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు నెలలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గవర్నర్తో సిఎం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ కోటా ఎంఎల్సిలుగా ప్రొఫెసర్.కోదండరామ్, అజారుద్దీన్ పేర్లు ఆమోదించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సిఎం రేవంత్రెడ్డి కోరారు. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ ప్రస్తుతం అజారుద్దీన్ మంత్రి కొనసాగుతున్నారు. ఆయన మంత్రి పదవి చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు నెలలు పూర్తి కానుంది. మంత్రిగా ఉన్నవారు శాసనసభ లేదా శాసనమండలిలో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ పేరును గవర్నర్ ఆమోదించకపోతే ఈ నెల 30 తర్వాత ఆయన మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సిఎం రేవంత్రెడ్డి గవర్నర్ను కలిసినట్లుగా తెలిసింది. గతంలో న్యాయస్థానంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయినందున, తక్షణమే ఆమోదముద్ర వేయాలని సిఎం రేవంత్రెడ్డి గవర్నర్ను కోరారు. కాగా, న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా అనే సందేహాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయ నిపుణులు గవర్నర్ వివరించినట్లు సమాచారం. విద్యారంగానికి సంబంధించిన అంశాలపై చర్చ విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాలపై సిఎంతో గవర్చర్ చర్చించారు. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సిఎంతో భేటీ సందర్భంగా గవర్నర్ సూచించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. జూన్ 12న ఎల్బి స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై గవర్నర్ సిఎంతో చర్చించారు. గవర్నర్ చేసిన ప్రతిపాదనల పట్ల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
నేడు కాటారంలో సిఎం రేవంత్ బహిరంగ సభ..
మధ్యాహ్నం కాళేశ్వరానికి సిఎం రేవంత్ ముక్తీశ్వరస్వామి దర్శనం, ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన తరువాత మేడిగడ్డకు ముఖ్యమంత్రి బ్యారేజీ పరిశీలన, అధికారులతో సమీక్ష రోడ్డు మార్గంలో కాటారం మీదుగా నస్తూర్పల్లి సభకు సభా వేదికపై ‘రైతు భరోసా’ రెండో విడత నిధులు విడుదల బహిరంగ సభలో ప్రసంగం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల, శ్రీధర్బాబు రైతుల ఖాతాల్లో జమకానున్న రూ.15వేల కోట్లు మనతెలంగాణ/ హైదరాబాద్/ జయశంకర్ భూ పాలపల్లి/ కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సిఎం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని, కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డ డ్యామ్ సైట్ను సిఎం పరిశీలించనున్నారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సిఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి నేరుగా కాటారం మండలం నస్తురపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకోనున్నారు. బహిరంగ స భ వేదికగా సిఎం రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం సిఎం రేవంత్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల రైతులకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ సం కల్పం అని, రైతు సమక్షంలో రైతు భరోసా వేసేందుకు కాటారం మండలాన్ని ఎన్నుకోవడం జరిగిందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్ది ళ్ళ శ్రీధర్బాబు అన్నారు. ఈ నెల 2౦న భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్రెడ్డితో కలిసి వీరు మండలంలోని నస్తూర్పల్లిలోని సభాస్థలాన్ని, హెలీప్యాడ్ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం రైతులకు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమచేయడం జరిగిందన్నారు. రేపు రైతుల సమక్షంలో రూ.15 వేల కోట్లు రైతుల ఖా తాలో జమ చేస్తామన్నారు. సిఎం రేవంత్ కాళేశ్వ రం దేవస్థానం ఆలయాభివృద్దికి శంకుస్థాపన చే స్తారని, మేడిగడ్డ సందర్శన అనంతరం రైతు భరో సా విడుదల చేస్తారని తెలిపారు. ఇచ్చిన మాటల కు అనుగుణంగా ప్రతి ఎకరానికి ఏటా రెండు ద ఫాలుగా రూ.12 వేల రైతు భరోసా విడుదల చేసి న రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు తెలిపారు.
నేడు జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు జెఇఇ మెయిన్ 2 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా, సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జెఇఇ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు జరగగా, ఫిబ్రవరి 16న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
యేటా 20 నుంచి 50 శాతం పెంచుతున్న ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజులు ఖరారు చేసిన కొన్ని యాజమాన్యాలు ఆర్థిక భారంతో తల్లిదండ్రుల సతమతం వివిధ కారణాలతో ప్రతి సంవత్సరం వాయిదా పడుతూ వస్తున్న ఫీజుల నియంత్రణ విధానం సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ సిలబస్ పేరిట దండుకుంటున్న యాజమాన్యాలు 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవే ట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా పెంచుతు న్నా కట్టడి చేసేందుకు నియంత్రణ చర్యలు కేవ లం మాటలకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ స్కూ ల్ ఫీజు నియంత్రణపై గత కొన్నేళ్లుగా ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో పె ట్టడం లేదు. దాంతో అధిక ఫీజులు చెల్లించలేక త ల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంజనీరింగ్ ఫీజుల కంటే స్కూల్ ఫీజులే అధికం గా ఉంటున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నా రు. గత ఏడాదిన్నర కాలంగా పాఠశాల ఫీజులు నియంత్రించేందుకు నిబంధనలను అమలులోకి తెచ్చేందుకు బిల్లు సిద్ధమైనప్పటికీ అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. వివిధ కారణాలతో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ఏటా వాయిదా పడుతూనే ఉంది. ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కా నుండగా, మరో నెలన్నరలో కొత్త విద్యా సంవత్స రం ప్రారంభం కానుంది. అయితే కొన్ని పాఠశాల లు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు లు, పుస్తకాల ఖర్చులు ఖరారు చేసి వసూలు చేసేందుకు చర్యలు కూడా చేస్తున్నాయి. ఫీజుల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న తల్లిదండ్రులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆరాటాన్నీ ప్రైవేట్ పాఠశాలలు సొమ్ము చేసుకుంటున్నాయి. స్కూళ్లు కూ డా స్టేటస్ సింబల్గా మారుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లన్నీ కేవలం నిరుపేదలకే పరిమితమయ్యా యి. ప్రస్తుతం దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు కేటగిరీల వారీగా స్కూళ్ల ను ఎంపిక చేసుకునే పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, అర్హులైన ఉపాధ్యాయులు లేకపోయినా తమ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవడమే కనీస గౌరవంగా భావిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఏదో ఒక పేరున్న ప్రైవేట్ స్కూళ్లో చేర్పించాలని భావించిన తల్లిదండ్రులను ప్రస్తుతం సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ సిలబస్ను అనుసరించే పాఠశాలలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రుల బలహీనతలను అడ్డంపెట్టుకుని సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ సిలబస్ను అనుసరించే పాఠశాలలు ఇష్టారీతిన ఫీజులు దండుకుంటున్నారు. ఒకసారి తమ పాఠశాలలో చేర్పించిన తర్వాత ఎక్కడికి వెళ్లరనే ధీమాతో యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నాయి. ఏటా కనీసం 20 నుంచి 50 శాతం ఫీజులు పెరుగుతుండగా, కొన్ని పాఠశాలలు 100 శాతం కూడా పెంచుతున్నాయి. ఇలా ఏటా పెరుగుతున్న ఫీజుల భారం భరించలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 150 నుంచి 200 వరకు సిబిఎస్ఇ స్కూళ్లు ఉండగా, 40 వరకు ఐసిఎస్ఇ స్కూళ్లు ఉన్నాయి. వీటితోపాటు 15 వరకు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఉన్నాయి. తప్పక కొందరు...స్టేటస్ కోసం మరికొందరు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ ఉండాలని భావిస్తూ ఫీజులు ఎక్కువైనా సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ స్కూళ్లకు పంపిస్తున్న తల్లిదండ్రులు కొందరైతే, స్టేటస్ కోసం ఎక్కువ ఫీజులు ఉన్న స్కూళ్లకు ఎంపిక చేసుకుంటున్న తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. తమ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా విశ్లేషించుకోకుండా తొందరపాటుగా పెద్ద స్కూళ్లలో చేర్పించిన మధ్యతరగతి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, స్కూల్ను మార్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఆదాయం పెరిగినా, పెరగకపోయినా ఫీజులు మాత్రం పెరుగుతూనే ఉండటంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. హైదరాబాద్లో ఓ సాధారణ స్కూల్లో ఒకటో తరగతి విద్యారికి వార్షిక ఫీజు రూ. 25 వేల నుంచి 40 వేల వరకు ఉండగా, ప్రముఖ స్కూళ్లలో రూ. 40 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. అదే ఇంటర్నేషనల్ స్కూళ్లలో కనీసం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు అత్యధిక వార్షిక ట్యూషన్ ఫీజు రూ.1.83 లక్షలు ఉండగా, స్కూల్ ఫీజులు మాత్రం రూ.లక్షల్లో ఉంటుండటం తల్లిదండ్రులను ఆందోళన గురి చేస్తోంది. అదనపు బాదుడు తక్కువేం కాదు ఫీజులకు అదనంగా ట్రాన్స్పోర్ట్ సదుపాయం పేరుతో స్కూల్ స్థాయిని బట్టి, బస్సుల్లో సదుపాయాలను బట్టి ఒక్కో విద్యార్థిపై దూరాన్ని బట్టి నెలకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. మొదటిసారి స్కూళ్లో చేరితే తప్పనిసరిగా డొనేషన్ కట్టాలి. ఇది స్కూల్ను బట్టి రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. డొనేషన్ల వసూళ్లో విచిత్ర విధానాలు అమలు చేస్తున్నారు. డొనేషన్లకు రశీదులు ఉండవు, కానీ యాజమాన్యాలు నిర్థేశించిన ఫీజు చెల్లించాల్సిందే. దాంతోపాటు టర్మ్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు కూడా స్కూళ్లోననే కొనుగోలు చేయాలనే నిబంధనలతో తల్లిదండ్రులకు పీల్చి పిప్పి చేస్తున్నారు. వీటితోపాటు టూర్లు, పిక్నిక్ల పేరుతో అప్పుడప్పుడు వ్యాపారం కొనసాగిస్తుంటారు.
సైబర్ మోసాల నెట్వర్క్ గుట్టురట్టు
రూ.150కోట్ల మోసం, 52 మంది అరెస్ట్ నిందితుల్లో 32మంది బ్యాంకు అధికారులు నేరగాళ్లతో కుమ్మక్కు, అక్రమంగా ఖాతాలు తెరిచేందుకు సాయం ౩౫౦ బ్యాంకు ఖాతాల ద్వారా బాధితుల సొమ్ము దారి మళ్లింపు దేశమంతటా 850సైబర్ కేసులతో నిందితులకు సంబంధాలు 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల సోదాలు మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో తొమ్మిది రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో సై బర్ నేరాలు చేస్తున్న 52మంది, వారికి సహకరిస్తున్న 32మంది వివిధ బ్యాంకుల అధికారులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫో న్లు, 14 చెక్బుక్లు, రెండు పెన్డ్రైవ్లు, ల్యాప్టా ప్, 21 షెల్ కంపెనీల స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 850 సైబర్ నేరాల కేసుల్లో రూ.150 కోట్లు కొట్టేశారు. పెట్టుబడి, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను బెదిరించి నిందితులు భారీగా డబ్బులు దోచుకున్నారు. వీరికి బ్యాంకు అధికారులు సహకరించడంతో కొట్టేసిన డబ్బులు సులభంగా ట్రాన్స్ఫర్ చేశారు. 32 మంది బ్యాంకు అధికారుల్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మేనేజర్లు ఇద్దరు, బంధన్ బ్యాంకు మేనేజర్లు ఐదుగురు, బ్యాంక్ ఆఫ్ బరో డా మేనేజర్లు ఐదుగురు, ఫెడరల్ బ్యాంక్ మేనేజ ర్లు నలుగురు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మేనేజర్లు న లుగురు, ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్లు ఆరుగురు, కర్ణాటక బ్యాంక్ మేనేజర్లు ఇద్దరు, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్లు ఇద్దరు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ ఒకరు, హెచ్డీఎఫ్సీ మేనేజర్ ఒకరిని అరెస్టు చేశారు. బ్యాంక్ మేనేజర్లలో కొందరు సైబర్ నేరస్థులతో కుమ్మక్కై మధ్యవర్తులుగా ఉండగా, కొందరు మేనేజర్లు సైబర్ నేరస్థుల కోసం మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. కొట్టేసిన సొమ్మను మళ్లించేందుకు సైబర్ నేరస్థులు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో కొట్టేసిన డబ్బులను సైబర్ నేరస్థులు ఈ బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. 16 బృందాలు.. 9 రాష్ట్రాలు.. సైబర్ నేరస్థులను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 7 రోజుల పాటు 9 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశాయి. గతంలో నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్1లో 16 రాష్ట్రాల్లో ఉన్న 117మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేయగా, ఆపరేషన్2లో 74 మందిని అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులు సైబర్ నేరస్థులతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి కీలక నిందితులను, వారికి సహకరిస్తున్న బ్యాంకు అధికారులను అరెస్టు చేశారు. జీరో టాలరెన్స్ అమలు చేస్తున్నాం: వీసీ సజ్జనార్ (హైదరాబాద్ సీపీ) సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనలను పాటించడంలేదని, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఖాతాలు తెరవడానికి అనుమతించడం వల్లే మ్యూల్ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం నేరగాళ్లకు వరంగా మారుతోందని, బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా దర్యాప్తును ముమ్మరం చేశామని, నేర ముఠాల్లోని కీలక వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అధిక లాభాల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మకూడదని కోరారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడటానికి ఇచ్చి అక్రమాలకు సహకరిస్తే, వారిని కూడా నేరస్థులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.
జగిత్యాలకు నేడు సారు.. గులాబీ దళం హోరు
సుధీర్ఘ విరామం తరువాత నేడు ప్రజల్లోకి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జగిత్యాల ‘ప్రజా ఆశీర్వాద’ సభ వేదికగా బిఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి జీవన్రెడ్డి భారీగా జనసమీకరణకు గులాబీ నేతల ఏర్పాట్లు ఎర్రవల్లి నుంచి సాయంత్రం జగిత్యాల చేరుకోనున్న కెసిఆర్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ ముఖ్యనేతలతో భేటీ సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణానికి బయల్దేరనున్న కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సుధీర్ఘ విరామం తర్వాత ప్రజల్లోకి వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సోమవారం జగిత్యాలలో జరుగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. దాదాపు ఏడాది తర్వాత కెసిఆర్ ప్రజల్లోకి వస్తుండటంతో కెసిఆర్ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల సభలో కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఎంతో ప్రజాదరణ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత బిఆర్ఎస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆయన తగిన గౌరవం కల్పించేందుకే జగిత్యాల సభను బిఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు గులాబీ శ్రేణులు భారీ జనసమీకణ చేయనున్నారు. ఇప్పటికే జగిత్యాల పట్టణం మొత్తం గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. శనివారం, ఆదివారం కెటిఆర్, హరీష్రావు సహా పార్టీ ముఖ్యనేతలు జగిత్యాలకు చేరుకుని సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేలా స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సావం జగిత్యాలలో జరుగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అధిష్టానం భావిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత కెసిఆర్ బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనుండటంతో, ఆయన ఇచ్చే రాజకీయ సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీ బలోపేతంపై భవిష్యత్తు కార్యాచరణను కెసిఆర్ ఈ సభ వేదిక నుంచే ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కెసిఆర్ నేరుగా విమర్శలు గుప్పిస్తారా.. లేదా పాత వ్యూహాన్నే కొనసాగిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. అలాగే దేశరాజకీయాలలో తాజా పరిస్థితిపై కెసిఆర్ ఎలా స్పందిస్తారో అని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కెసిఆర్ స్పందన ఏ విధంగా ఉండబోతుందో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. జగిత్యాల సభ నుంచే పార్టీ పునర్వైభవం కోసం జైత్రయాత్ర- 2.0ను ప్రారంభించాలని కెటిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ పట్టును నిరూపించుకునేలా ఈ సభలో కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇరాన్ తీరు మారకపోతే భీకరదాడులు తప్పవు ఈ సారి ఒప్పందానికి రాకపోతే వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై విరుచుకుపడతాం మా ప్రతినిధులు మరోసారి పాకిస్థాన్ వెళ్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు మా అణు హక్కులు ఎవరూ కాదనలేరు రెండో దశ చర్చలపై నిర్ణయం తీసుకోలేదు ఇరాన్ నేతలు పెజెష్కియాన్, ఘాలిబాఫ్ ప్రకటన ఇస్లామాబాద్లో రెండో దఫా చర్చలకు ఖరారు కాని తేదీలు, మరోవైపు భారీ భద్రతా ఏర్పాట్లు వాషింగ్టన్/దుబాయ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చే శారు. ఇరాన్తో రెండో విడత చర్చల కోసం అమెరికా ప్రతినిధులు సోమవారం పాకిస్థా న్ రాజధాని ఇస్లామాబాద్కు వెళ్లనున్నట్లు తెలిపారు. శాంతి ఒప్పందం కుదరకపోతే గ ల్ఫ్ దేశమైన ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని మరోసారి హెచ్చరించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇ స్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య ప్ర త్యక్ష చర్చలు జరిగినప్పటికీ, అవి ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఈ పరిణామాల తర్వాత వారం రోజుల్లోనే ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నా ప్రతినిధులు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు వెళ్తున్నారు. వారు రేపు సాయంత్రానికి అక్కడ ఉంటారు. మరోసారి చర్చల్లో పాల్గొననున్నారు అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో వెల్లడించారు. అమెరికా చర్చల బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారా లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మొదటి విడత చర్చల సమయంలో వాన్స్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో, ఇరాన్ అణు ఇంధనం సమృద్ధి హక్కును వదులుకోవాలని అమెరికా పట్టుబట్టింది. ఇదిలా ఉండగా, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మధ్యప్రాచ్యానికి వెళ్తున్నట్లు తెలిపారు. వారు సోమవారం బయలుదేరతారు. మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభమవుతుంది. ఇది చాలా సరళమైన ఒప్పందం. దీనిలో ఎక్కువ భాగానికి ఇప్పటికే అంగీకారం లభించింది అని ట్రంప్ పేర్కొన్నారు. ఏప్రిల్ 8న అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియనుంది. ఉపాధ్యక్షుడు వాన్స్ నేతృత్వంలో జరిగిన మొదటి విడత చర్చలు 21 గంటల పాటు కొనసాగినా, శాశ్వత శాంతి ఒప్పందానికి దారితీయలేకపోయాయి. ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు తుది ఒప్పందం సాధించాలనే లక్ష్యంతో, మరో విడత చర్చలు జరగడానికి పాకిస్థాన్ మళ్లీ దౌత్య ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఏప్రిల్ 15 నుంచి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహ్బాజ్ షరీఫ్ సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాలను సందర్శించగా, రక్షణ దళాల ప్రధాన అధికారి ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇరాన్లో మూడు రోజుల పాటు పర్యటించారు. వివాదాస్పద అంశాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ పర్యటనలు చేపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయనే వార్తలు వినిపించాయి. మొదటి విడత చర్చల్లో ప్రధాన విభేదాంశంగా నిలిచిన హార్మూజ్ జలసంధిపై ఉద్రిక్తతలు శనివారం మరింత పెరిగాయి. అమెరికా, ఇరాన్ పోర్టులపై ఆంక్షలను కొనసాగిస్తున్న తరుణంలో, ఇరాన్ ఈ జలసంధిని మూసివేసి దాటేందుకు ప్రయత్నించిన నౌకలపై కాల్పులు జరిపినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యపై తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హార్మూజ్ జలసంధిలో నౌకలపై కాల్పులు జరిపిందని ఇరాన్పై ఆరోపించారు. నిన్న హార్మూజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులు జరపడం మా కాల్పుల విరమణ ఒప్పందానికి పూర్తిగా విరుద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరాన్ దళాలు ఫ్రాన్స్కు చెందిన ఒక నౌకను, బ్రిటన్ జెండా కలిగిన ఒక సరుకు నౌకను లక్ష్యంగా చేసుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. అయితే, అదే రోజున హార్మూజ్ జలసంధిలో దాడికి గురైన రెండు భారత నౌకల గురించి ఆయన ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఆదివారం ట్రంప్ మరింత కఠినంగా స్పందిస్తూ, ఇరాన్ హత్యా యంత్రం ఆగాల్సిన సమయం వచ్చింది అని పేర్కొన్నారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందాన్ని ఇరాన్ అంగీకరించకపోతే, ఆ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మేము చాలా న్యాయమైన ఒప్పందాన్ని అందిస్తున్నాం. వారు దాన్ని అంగీకరించకపోతే, ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుంది. ఇకపై మృదువైన వైఖరి ఉండదు అని ట్రంప్ స్పష్టం చేశారు. గత 47 సంవత్సరాల్లో ఇతర అధ్యక్షులు చేయాల్సిన పనిని తాను చేయడానికి వెనుకాడనని కూడా ఆయన పేర్కొన్నారు. మరోవైపు, హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం విచిత్రం అని వ్యాఖ్యానిస్తూ, అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అది ఇప్పటికే మూసివేసినట్లేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఉదయం ఎండ, మధ్యాహ్నం వాన ఒక్కసారిగా చల్లబడ్డ హైదరాబాద్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ద్రోణి ఆవర్తనంతో పాటు స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఉదయం నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం వేళల్లో మేఘావృతమయి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నా గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, ఆదివారం రాష్ట్రంలో ఆదిలాబాద్లో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదు కాగా, జగిత్యాలలో 42.9, నిర్మల్లో42.5, నిజామాబాద్లో 41.9, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిల్చోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 18 మంది మృతి
ఆరుగురికి తీవ్ర గాయాలు పేలుడు ధాటికి పరిశ్రమ ధ్వంసం కంపించిన పరిసర ప్రాంతాలు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు తమిళనాడులోని విరుద్నగర్ జిల్లా కట్టనార్పట్టి గ్రామంలో ఘోర విషాదం చెన్నై: తమిళనాడులోని విరుదునగర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పటాకుల తయారీ యూనిట్లో జరిగిన భారీ పేలుడు విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు కట్టనార్పట్టి ప్రాంతంలో ఉన్న ‘వనజా’ ఫైర్వర్క్స్ ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. ఈ యూనిట్ ముత్తుమాణిక్యం అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం వచకరపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారికి విరుదునగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా, ఈ యూనిట్కు నాగ్పూర్కు చెందిన పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పేసో) నుంచి అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో కర్మాగారంలో 100 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. పేలుడు ముందు భాగంలోని వరండాలో సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడ కార్మికులు పటాకులకు సంబంధించిన ముడి పదార్థాలను ఉపయోగించి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాదాపు మూడు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోని అనేక నిర్మాణాలు కూడా నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీశాం. వాటిలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి అని ఒక పోలీసు అధికారి తెలిపారు. తమిళనాడులోని విరుదునగర్ సమీపంలో జరిగిన పటాకుల కర్మాగార పేలుడు ఘటనలో గాయపడిన ఆరుగురిలో ముగ్గురు మహిళలే ఉన్నారని, వారికి సుమారు 60 శాతం కాలిన గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వ చ్చింది. ప్రారంభ పేలుడు అనంతరం కూడా పటాకులు వరుసగా పేలుతుండటంతో రక్షణ చర్యలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు అగ్నిమాపక వర్గాలు వెల్లడించాయి. ఇంకా శిథిలాల కిం ద మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆ ప్రాంతంలో జరిగిన అత్యంత ఘోర పారిశ్రామిక ప్రమాదంగా నిలిచింది. ఇదే జిల్లాలోని వెంబకొట్టై ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన పేలు డు ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి ఇద్దరు మంత్రులను ఘటన స్థలానికి పంపినట్లు తెలిపారు. ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఆయన, విరుదునగర్ జిల్లా కట్టనార్పట్టిలో జరిగిన పటాకుల కర్మాగార పేలుడు ఘటనలో పలువురు మరణించిన సంఘటన తీవ్ర వేదన కలిగించిం ది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. అదేవిధంగా, మంత్రులు కేకే ఎస్ఎస్ఆర్ రామచంద్ర న్, తంగం తేనారసులను వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని ఆ దేశించి, సహాయక చర్యలను పర్యవేక్షించాలని, బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్తో మా ట్లాడి, అవసరమైన అన్ని సహాయ చర్యలను సమన్వయం చే యాలని ఆదేశించాను అని సిఎం స్టాలిన్ వెల్లడించారు.
20thApril2026 |సోమవారం నేటి పంచాంగం
20thApril2026 | సోమవారం నేటి పంచాంగం 20thApril2026 | ఈరోజు తిథి, నక్షత్రం
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధురెడ్డి హైదరాబాద్లోని మణికొండలోని నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్గా మధురెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ‘దళం’, ‘దక్ష’, ‘అహ నా పెళ్ళంట’, ‘జగమేమాయ’, ‘వాలెంటైన్స్ నైట్’ వంటి చిత్రాలతో పాటు, త్వరలో విడుదల కానున్న ‘అగ్ని నక్షత్రం’ లాంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్ఫెక్ట్గా చూపించే విధానాన్ని తెలియజేస్తాయి. కేవలం ఫీచర్ ఫిలిమ్స్కు మాత్రమే కాదు.. ఆయన వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్గా కూడా పనిచేశారు. ‘జగడం’, ‘జల్సా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. ఆ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ ఎంతో ఉంది. తన వృత్తి పట్ల ఎంతో అంకితభావం, ఎప్పుడూ ఒదిగి ఉండే మనస్తత్వం మధురెడ్డి సొంతం. మధు రెడ్డి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మరోసారి తల్లి కాబోతున్న దీపిక పదుకొణె
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణెలు ఇప్పుడు పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ ఇటీవల ధురంధర్2 సినిమాతో ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ ని కొట్టాడు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి తల్లి కాబోతున్నారు. తన కుమార్తె దువా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2018లో వివాహం చేసుకున్న దీపికా-రణ్వీర్ దంపతులకు 2024 సెప్టెంబర్లో మొదటి బిడ్డ జన్మించింది. ఇప్పుడు రెండో బిడ్డ రాబోతున్న వార్తతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. త్వరలోనే తమ ఫ్యామిలీలోకి మరో కొత్త సభ్యుడు రాబోతున్నందుకు ఈ జంట ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా, అనన్యా పాండే, సమంత, పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్, కరీనా కపూర్, ప్రియా అట్లీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ఎదురులేని పంజాబ్.. లక్నోపై భారీ విజయం
ముల్లాన్పుర్: ఐపిఎల్లో పంజాబ్ కింగ్స్ తన జోరును కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. ఈ సీజన్లో పంజాబ్కు ఇది ఐదో గెలుపు కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 254 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలిలు అద్భుత బ్యాటింగ్తో చెలరేగి పోయారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంశ్ 37 బంతుల్లోనే 9 సిక్స్లు, 4 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. కనోలి 46 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, 8 బౌండరీలతో 87 పరుగులు సాధించాడు. ద్దరు రెండో వికెట్కు 80 బంతుల్లోనే 182 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మిఛెల్ మార్ష్ (40), బడోని (35), కెప్టెన్ పంత్ (43), మార్క్రమ్ (42) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
400buffaloes బాదంపల్లి గోదావరి రేవులో పేలుడు ఘటన.. గేదెలకు తీవ్ర గాయాలు
400buffaloes బాదంపల్లి గోదావరి రేవులో పేలుడు ఘటన.. గేదెలకు తీవ్ర గాయాలు 400buffaloes
సౌతాఫ్రికా మహిళలకు రెండో విజయం
డర్బన్: భారత్తో ఆదివారం జరిగిన రెండో టి20లో ఆతిథ్య సౌతాఫ్రికా మహిళా టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో ౨-0 ఆధిక్యాన్ని అందుకుది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు లౌరా వల్వర్డ్, సునే లూస్లు జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్కు 106 పరుగులు జోడించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లౌరా 34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 54 పరుగులు చేసింది. లూస్ 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 57 పరుగులు చేసింది. తజ్మిన్ బ్రిస్ట్ 20 (నాటౌట్), డర్క్సెన్ 12 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ షఫాలీ వర్మ ఒక్కటే రాణించింది. ఒంటరి పోరాటం చేసిన షఫాలీ 7 ఫోర్లు, రెండు సిక్స్లతో 57 పరుగులు చేసింది. అనుష్క శర్మ (28) తవనంతు పాత్ర సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ట్రియాన్, టుమి మూడేసి వికెట్లను పడగొట్టారు.
ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి రావాలి: కవిత
ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి రావాలి ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారు కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారు బూర్జువా పార్టీలను వదిలి జాగృతిలో చేరండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎంఎల్ఎ రాథోడ్ బాపూరావు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలేసి కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న జాగృతిలో చేరాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారని చెప్పారు. బోథ్ మాజీ ఎంఎల్ఎ, కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ బాపూరావు ఆదివారం తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. 2007లో కుటుంబంతో సహా తాను బోథ్కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానని గుర్తు చేసుకున్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు, మన్నెం జ్వర పీడితులతో నిండి ఉండేదని.. ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలనే తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉందన్నారు. రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారని చెప్పారు. ఆయన తెలంగాణ జాగృతి నుంచే బిఆర్ఎస్లో చేరి రెండు సార్లు ఎంఎల్ఎ అయ్యారని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతున్నారని తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా నుంచి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు జాగృతిలో చేరారని అన్నారు. ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి జనగణనలో ఆదావాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషన్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జెఎసి జాతీయ అధ్యక్షుడు, ఖమ్మం జెడ్పి మాజీ చైర్మన్, మాజీ ఎంఎల్ఎ చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో జెఎసి నాయకులు ఆదివారం జాగృతి కార్యాలయంలో కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను చందా లింగయ్య దొర ఈ సందర్భంగా వివరించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెసా చట్టానికి తూట్లూ పొడుస్తూ ఆదివాసీల హక్కులను హరిస్తోందని అన్నారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో ఆదివాసీలకు ఉన్న రక్షణలను తొలగిస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని, తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని, దీంతో ఆదివాసీలు తమ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమే అని మండిపడ్డారు. ఆదివాసీలు తమ మతం చెప్పుకునేలా జనగణనలో ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భాష “కోయతూర్”ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులని వారి గౌరవాన్ని కాపాడేలా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ జెఎసి ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు. కవిత సిఎం కావాలి : మాజీ ఎంఎల్ఎ బాపూరావు తెలంగాణ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎంఎల్ఎ రాథోడ్ బాపూరావు ఆకాంక్షించారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎంఎల్ఎ అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని, తనకు మూడోసారి ఎంఎల్ఎ టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్లో చేరినా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని అన్నారు.
in15thdivision |చిత్తూరులోకి చిరుత పులులు
in15thdivision | చిత్తూరులోకి చిరుత పులులు in15thdivision |రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంకలవరపెడుతున్న
మహిళా రిజర్వేషన్ల కోసమే డీ లిమిటేషన్: ఎంపి కొండా
మన తెలంగాణ/హైదరాబాద్: లోకసభ స్థానాల పెంపుతో పాటు మహిళల రిజర్వేషన్లతో డిలిమిటేషన్ బిల్లు సరిసమానంగా ఉంటుందని చేవేళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరుపై ఆయన మండిపడ్డారు. గతంలో ఈ బిల్లును పలుమార్లు ప్రవేశపెట్టారని, 202౩లో మహిళ రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్కు అసదుద్దీన్ ఓవైసీ, మరొకరు మినహా కాంగ్రెస్ పార్టీతో సహ అన్ని పార్టీలు ఏకాభిప్రాయంగా ఆమోదం తెలిపాయని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై కాంగ్రెస్ పార్టీ తొందరపెట్టడంతోనే ప్రధాని నరేంద్రమోడీ మరోసారి చట్టసభ ముందుకు బిల్లును తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. 1963లో రెండవ డీ లిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యూహత్మకంగా వ్యవహరించి బిల్లును అడ్డుకున్నారని విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు.
మహిళల చరిత్రలో చీకటి రోజు.. కాంగ్రెస్ కూటమిపై కేంద్ర మంత్రి ఫైర్
మహిళలను వంచించిన కాంగ్రెస్ కూటమి ఈ నెల 17 మహిళల చరిత్రలో చీకటి రోజు బిల్లు వీగిపోతే ఇండి కూటమి సంబురాలు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మండిపాటు మన తెలంగాణ/హైదరాబాద్ః ఈ నెల 17వ తేదీ దేశ మహిళల చరిత్రలో ఒక చీకటి రోజుగా, బ్లాక్ డేగా మిగిలిపోతుందని, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండియా అలయన్స్ దేశంలోని మహిళలతో పాటు మొత్తం దక్షిణ భారత దేశాన్ని మోసం చేసిందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మండిపడ్డారు. మహిళలు చిరకాలంగా కోరుకుంటున్న 33 శాతం రిజర్వేషన్ బిల్లుతో పాటు, దక్షిణ దేశ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకునివచ్చిందని ఆమె ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు భవిష్యత్తులో జనగణన తర్వాత అన్యాయం జరగకుండా రక్షణ కల్పించడమే ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. అయితే లోక్సభలో ఈ బిల్లులు విఫలమైనప్పుడు కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీల నాయకులు దేశ ప్రయోజనాలను మరిచి, ఆ వైఫల్యాన్ని పండుగలా జరుపుకున్నారని వారి నవ్వులు, హగ్లు దేశాన్ని ఉత్తర-దక్షిణిగా విభజించే కుట్రకు నిదర్శనమని కేంద్ర మంత్రి శోభ మండిపడ్డారు. దక్షిణ భారతానికి న్యాయం చేసే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామని, కేవలం ఒక గంట సమయం ఇస్తే కొత్త బిల్లును తీసుకుని వస్తామని ప్రతిపాదించినప్పటికీ, కాంగ్రెస్, ఇండీ అలయన్స్ పార్టీలు దాన్ని తిరస్కరించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ రాజకీయ లాభాల కోసం, భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలను మరింత పెంచేలా వారు వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లుగా మహిళా సాధికారతకు పెద్ద పీట వేశామని విద్య, స్కాలర్షిప్లు, బీమా పథకాలతో పాటు ముద్ర లోన్లలో 60 శాతం, ఎంఎస్ఎంఇ సబ్సిడీల్లో 53 శాతం మహిళలకే అందించామని పేర్కొన్నారు. ప్రధానిగా ఎబి వాజపేయి ఉన్నప్పుడు స్వయం సహాయక సంఘాల ఆలోచనను విస్తరించి, ఇప్పుడు 3 కోట్లకు పైగా మహిళలను ‘లఖ్ పతి దీదీలు‘గా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, మహిళ చేతిలో డబ్బు ఉంటే కుటుంబానికి, దేశానికి మేలు జరుగుతుందని ఆమె అన్నారు. నేటి మహిళలు రక్షణ రంగంలో ఫైటర్ జెట్లు నడుపుతూ దేశానికి సేవ చేస్తున్నారని, అయినప్పటికీ రాజకీయాల్లో వారికి సరైన అవకాశాలు రాకుండా కాంగ్రెస్ వంటి పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో ముద్ర లోన్లలో 63-64 శాతం మహిళలకే దక్కాయని, ఎంఎస్ఎంఈ సబ్సిడీలు 53 శాతానికి పైగా మహిళలు పొందారని స్పష్టం చేశారు. కర్నాటక కోస్టల్ ప్రాంతంలోని మత్స్యకార మహిళల జీవనశైలిని ఉదాహరణగా చూపుతూ, మహిళల చేతిలో ఆర్థిక శక్తి ఉంటే నిర్ణయాధికారం ఎలా మారుతుందో ఆమె వివరించారు. కాంగ్రెస్లో వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్లో మహిళలకు అవకాశం అంటే అది కేవలం ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీ వంటి ఒకే కుటుంబానికి పరిమితమని విమర్శించారు. దేశంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళలలో సీట్లు పెంచే ప్రతిపాదనను అడ్డుకోవడం ద్వారా ఇండియా కూటమి దక్షిణ భారతాన్ని మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుండి 26కు, ఆంధ్రప్రదేశ్లో 25 నుండి 38కి పెరుగుతాయని, ఈ ప్రయోజనాన్ని ఇండీ కూటమి అడ్డుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వం గురించి మాట్లాడుతూ, ఆ పార్టీలో కేవలం ‘ఖాన్దాన్‘ (వారసత్వ) రాజకీయాలే నడుస్తాయని, జార్కిహోళి కుమార్తెకు టికెట్ ఇవ్వడాన్ని ఆమె ఉదహరించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో తనను తాను ‘జాదూగర్‘ (మాంత్రికుడు) అని సంబోధించుకుంటూ అపరిపక్వంగా ప్రవర్తించారని ఆమె విమర్శించారు. సిఎంపై నిప్పులు చెరిగిన శోభ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజలకు చేసిన అన్యాయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలో మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. చివరగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం హైకమాండ్ను సంతోషపెట్టడానికే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, హామీల అమలులో విఫలమై రాష్ట్ర ప్రజలను ‘పిక్ పాకెట్‘ చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఎంపీ డికె అరుణ తదితరులు పాల్గొన్నారు.
కవిత సిఎం కావాలి: మాజీ ఎంఎల్ఎ బాపూరావు
తెలంగాణ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎంఎల్ఎ రాథోడ్ బాపూరావు ఆకాంక్షించారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎంఎల్ఎ అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని, తనకు మూడోసారి ఎంఎల్ఎ టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్లో చేరినా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని అన్నారు.
పవన్ కల్యాణ్కు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. శని వారం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్కు ప్రధాని ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ’ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్తో మాట్లాడి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన చాలా ధైర్యవంతుడు, త్వరలోనే కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను‘ అని తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది : చిరంజీవి తన సోదరుడి ఆరోగ్యంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్ కల్యాణ్కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా, నిలకడగా ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు‘ అని చిరం జీవి తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ తిరిగి సాధారణ కార్యకలాపాల్లోకి రావడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని వైద్యులు సూచిం చినట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రార్థనలు చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ చిరంజీవి ధన్య వాదాలు తెలిపారు.
బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి
విరుద్నగర్: తమిళనాడులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విరుద్నగర్ జిల్లా కట్టనార్పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పరిశ్రమ ధ్వంసం కాగా.. పరిసర ప్రాంతాలు కంపించినట్లు సమాచారం. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. విరుద్నగర్ జిల్లాలోనే సత్తూర్లో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వారం క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికులు మరణించగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా… హేమాక్స్ లైట్ మినీ వాటర్ ట్యాంక్
నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం…
నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ పట్టణ
పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం…
పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం… కొత్త కాలువల నిర్మాణంతో మురుగు సమస్యకు
బుక్ పేరుతో రాజ్యాంగ విరుద్ధ పాలన…
బుక్ పేరుతో రాజ్యాంగ విరుద్ధ పాలన… రాష్ట్రంలో తిరోగమనంలో ప్రజాస్వామ్యంమాజీ మంత్రి ధర్మాన
మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు.
మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు. భవానిపురం, ఆంధ్రప్రభ :
చిట్యాల ఆణిముత్యం కలెక్టర్ నరసింహారెడ్డి
చిట్యాల ఆణిముత్యం కలెక్టర్ నరసింహారెడ్డి చిట్యాల, ఆంధ్రప్రభ : స్వయంకృషి, పట్టుదలతో కష్టాలను
ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి
రోమ్: ఇటలీలోని బెర్గామో ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. కోవో పట్టణంలో భారతీయ సిక్కులు అక్కడున్న గిడ్డంగిలో ఏర్పాటు చేసుకున్న గురుద్వారా వెలుపల ఈ ఘటన జరిగింది. వైశాఖీ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న దశలో వారిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ సిక్కుల ప్రార్థనా స్థలి వద్ద కాల్పుల్లో మృతి చెందిన వారిని రాగీందర్ సింగ్, గుర్మీత్ సింగ్గా గుర్తించారు, కాల్పులకు దిగింది కూడా భారతీయుడేనని అక్కడున్న ప్రత్యక్ష సాక్షి మాటల ద్వారా వెల్లడైంది.
ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు
ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు పిల్లర్లతో కూడిన ప్లైఓవర్
అదరగొట్టిన రింకూ.. ఈ సీజన్లో కోల్కతా తొలి విజయం
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన కెకెఆర్కు రాజస్థాన్ బౌలర్లు షాక్ల మీద షాక్లు ఇచ్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే సైఫర్ట్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానె కూడా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. అంగ్క్రిష్ రఘువంశీ 10 పరుగులు చేసి ఔట్ కాగా, కామరూన్ గ్రీన్ (27), రోవ్మెన్ పొవెల్ (23) ఫర్వాలేదు అనిపించారు. అయితే 85 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయిన కెకెఆర్కు రింకూ సింగ్ అండగా నిలిచాడు. అనుకూల్ రాయ్తో కలిసి ఆర్ఆర్ బౌలర్లను ఎదురుకుంటూ పరుగులు రాబట్టాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. అనుకూల్ కూడా 16 బంతుల్లో 29 పరుగులు చేసి రింకూకి తగిన సహకారం అందించాడు. దీంతో కోల్కతా ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసి టేబుల్లో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి వచ్చింది.
పీసీ యువసేన మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
పీసీ యువసేన మజ్జిగ చలివేంద్రం ప్రారంభం భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ
కెసిఆర్ తరహాలో రేవంత్ రెడ్డీ మోసాలు.. బండి సంజయ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ః ముఖ్యమంత్రి అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డిలా మారారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్దాల పునాదులపైనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. అబద్దాలతోనే మహిళలను వంచించారని, మహిళలందరికీ ప్రతి నెలా రూ. 2500లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారని ఆయన విమర్శించారు. అబద్దాలు, మోసాలనే ప్రజలు నమ్ముతారని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం రేవంత్ రెడ్డికి ఉన్నట్లుందని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్ తరహాలోనే అబద్దాలు, మోసాలతోనే పాలన కొనసాగిస్తున్నారని, అబద్దాలు, మోసాలనే నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “అభినవ గోబెల్స్”గా మారారని తెలిపారు. అబద్దాలు, మోసాలు చేసే వారినే ప్రజలు నమ్ముతారని బహిరంగంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ అబద్దాల పునాదులపైనే ముఖ్యమంత్రి అయ్యారని, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తరహాలోనే దొంగ హామీలు, పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలనను కొనసాగిస్తున్నారని, నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ఆయనకు అలవాటుగా మారిందని, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో లోక్సభలో బిల్లును ప్రవేశపెడితే ఇండీ కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంలో లేనిపోని విష ప్రచారం చేసి మహిళా బిల్లును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం జరగబోతోందని తప్పుడు ప్రచారాలకు తెరదీసి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగకుండా కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచడం ద్వారా దక్షిణాదికి మేలు చేయాలనుకున్నారని ఆయన తెలిపారు. అందుకే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే, ఇండీ కూటమి పేరుతో అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఇండీ కూటమి నేతలు దక్షిణాదికి ఉన్న అవకాశాలకు గండి కొట్టారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ మహిళలతోపాటు దేశంలోని 70 కోట్ల మహిళలెవరూ ఇండీ కూటమి చేసిన అవమానాన్ని ఎన్నటికీ మరచిపోరని ఆయన హెచ్చరించారు. మహిళలంతా ఏకమై రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దె దించడం తథ్యం అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను తెలంగాణలోని గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వం సిద్ధమవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
పి.ఆర్.టి.యు ధర్నా విజయవంతం చేయాలని పిలుపు…
పి.ఆర్.టి.యు ధర్నా విజయవంతం చేయాలని పిలుపు… చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ
బోర్డ్ రూములుగా మారుతున్న MPV లు - పెరుగుతున్న గిరాకీలు #MobileOffice#LuxuryCars#MPVTrend
Breaking : రాయల్స్ కు మళ్లీ ఓటమి.. నైట్ రైడర్స్ కు తొలి విజయం
కోల్ కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది
South Indian Film Producers’ Crucial Meeting Held
All the producers of South Indian cinema have been meeting to discuss the strict guidelines to be followed for the implementation of the OTT window. A crucial meeting has taken place in Hotel Daspalla, Hyderabad today and the film producers, representatives from the Producers’ Associations and Guilds of Telangana, Andhra Pradesh, Tamil Nadu and Kerala […] The post South Indian Film Producers’ Crucial Meeting Held appeared first on Telugu360 .
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎల్ఎస్జి
ముల్లాన్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మహరాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన లక్నో కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్లో విజయం ఆ జట్టుకు కీలకం కానుంది. మరోవైపు వరుస విజయాలతో జోష్ మీద ఉన్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేష్ రాఠీ స్థానంలో సిద్ధార్త్ని జట్టులోకి తీసుకుంది. మరోవైపు పంజాబ్ అదే జట్టును కొనసాగిస్తోంది. తుది జట్లు: ఎల్ఎస్జి: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్. పిబికెఎస్: ప్రభ్సిమ్రన్ సింగ్(కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోల్లి, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వాదేరా, మార్కస్ స్టోయినస్, మార్క్ యాన్సన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్,.
సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ అభ్యర్థుల ప్రకటన
సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ అభ్యర్థుల ప్రకటన సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సదాశివపేట
మోరంగపల్లిలో సంఘటన… పిడుగు పడి ఎద్దు మృతి… వికారాబాద్, ఆంధ్రప్రభ : ఈదురు
మహిళలపై బీజేపీ కపట ప్రేమ… ఎమ్మెల్యే బొజ్జు పటేల్…బిల్లులు వీగిపోతాయని బిజెపికి ముందే
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
బుద్ధ వెంకన్నను కలిసిన మాజీ కార్పొరేటర్లు
బుద్ధ వెంకన్నను కలిసిన మాజీ కార్పొరేటర్లు భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గం
సర్దార్ గౌతు లచ్చన్న సేవలు ఎనలేనిది….
సర్దార్ గౌతు లచ్చన్న సేవలు ఎనలేనిది…. పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్లోని
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం.. వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని
కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ..
కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ.. రాయపర్తి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ
ఎండ నుంచి రిలీఫ్.. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: నగరంలో గత కొద్ది రోజులుగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం ప్రయాణంచే వాళ్లు నానా అవస్తలు పడుతున్నారు. అలాంటి వారికి ఇది నిజంగా మంచి ఉపశమనం కలిగించే వార్త. నగరంలో ఆదివారం ఒఖ్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. చింతల్లోని పద్మానగర్లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షం నేల కూలింది. దీంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. కూకట్పల్లి, మూసాపేట్, జెఎన్టియు, నిజాంపేట్, కెపిహెచ్బి, జీడిమెట్ల ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.
11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి
11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ
తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు
తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు వేములవాడ, ఆంధ్రప్రభ : తెలంగాణ సత్తెమ్మ కు
Hyderabad : హైదరాబాద్ లో వాన.. నగరవాసులకు ఊరట
హైదరాబాద్ లో వడగళ్ల వాన కురిసింది
టేకుమట్లలో ఆహ్లాదకర వాతావరణం టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో
అనాధ చిన్నారులకు అన్నితామైన తండావాసులు
సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : అనాధలైన చిన్నారులకు దిక్కెవరు ఆంధ్రప్రభ లో వచ్చిన
శివుని మహిమతో రాతిపై వెలసిన నంది
శివుని మహిమతో రాతిపై వెలసిన నంది జుక్కల్, ఆంధ్రప్రభ : అక్షయ తృతీయ
భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ..
భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా
ఘనంగా ఫాదర్ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు……
ఘనంగా ఫాదర్ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు…… పాయకాపురం, ఆంధ్రప్రభ :
హసన్ పర్తి జమా మసీద్ అధ్యక్షులుగా అహ్మద్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా అసంపూర్తి 66 డివిజన్ కేంద్రంలోని
రాణించిన కెకెఆర్ బౌలర్లు.. ఆర్ఆర్ స్కోర్ ఎంతంటే..
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఓపెనర్లు వైభవ్, యశస్వీలు పవర్ప్లేలోనే 63 పరుగులు చేశారు. 81 పరుగుల వద్ద ఆర్ఆర్ తొలి వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి కెకెఆర్ బౌలర్లు ఆర్ఆర్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆర్ఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటింగ్లో వైభవ్ 46, యశస్వీ 39 మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. కెకెఆర్ బౌలింగ్లో కార్తీక్, వరుణ్ చెరి మూడు, నరైన్ 2 వికెట్లు తీశారు.
ఆందోళన చెందకండి.. పవన్ ఆరోగ్యంగానే ఉన్నారు: చిరంజీవి
హైదరాబాద్: ఎపి డిప్యూటీ సిఎం పవన్కళ్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం పాలనా పరమైన అంశాలపై అధికారులతో చర్చిస్తున్న సమయంలో పవన్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు జూబ్లీహిల్స్లోని అపోలో వైద్యులు శనివారం సాయంత్రం శస్త్ర చికిత్స చేశారు. అయితే పవన్కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తాజా అప్డేట్ ఇచ్చారు. పవన్ ఆరోగ్యంగా ఉన్నారని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరు పేర్కొన్నారు. ‘‘కళ్యాణ్ బాబుకు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. బాగా కోలుకుంటున్నాడు. తను సాధారణ స్థితికి వచ్చేందుకు వారం సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. పవన్ కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని చిరంజీవి సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫోన్లో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ నటులు ఎన్టిఆర్, అల్లు అర్జున్, సాయి దుర్గా తేజ్, రచయిత కోనా వెంకట్ తదితరులు పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్మీడియాలో పోస్టులు పెట్టారు.
దరువు జాతర’ను విజయవంతం చేయండి….
దరువు జాతర’ను విజయవంతం చేయండి…. అమరవరపు సతీష్ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ
Crazy Actress to Shake Leg with Ram Charan?
Global Star Ram Charan has to shoot for a pending item song for his upcoming film Peddi. A number of actresses are considered but no actress has been finalized. Names like Mrunal Thakur and others were speculated. The latest buzz is that crazy actress Samyuktha who has a handful of Telugu films is considered for […] The post Crazy Actress to Shake Leg with Ram Charan? appeared first on Telugu360 .
మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి
మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ
దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం..
దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం.. జగిత్యాల ధర్మ పరిరక్షణ
అదుపుతప్పి కారు బోల్తా భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని భీమదేవరపల్లి క్రాస్ రోడ్
మానసిక దృఢత్వం.. ఆరోగ్యకర జీవితం..
మానసిక దృఢత్వం.. ఆరోగ్యకర జీవితం.. నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; మనిషి శారీరకంగా
కొంపల్లి బిగ్బాస్కెట్ గోదాంలో బయటపడ్డ పరిశుభ్రత లోపాలు #Kompally#BigBasket#FoodSafety#Warehouse
మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత..
మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా
ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం
ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్
Deepika Padukone Announces Second Pregnancy
Bollywood top actors Deepika Padukone and Ranveer Singh are expecting their second child. The duo posted a beautiful picture featuring Dua with the announcement on their official Instagram page. Dua was born on September 8th, 2024. Deepika Padukone and Ranveer Singh raced to the top and they are now the highest paid actors. Ranveer Singh […] The post Deepika Padukone Announces Second Pregnancy appeared first on Telugu360 .
చెరవులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఉమన్(14) మునీరాబాద్లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు ఇర్ఫాన్(12) డబిల్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. విద్యార్థులు మునిగిపోతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని ఊర్కొండపేట జిల్లా
గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి…
గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి… నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సూర్యాపేట, ఆంధ్రప్రభ : టాక్టర్ బైకు ఢీకొన్న ప్రమాదంలో

30 C