సోమవారం రాశి ఫలాలు (13-10-2025)
మేషం - పనులలో కొంత నిదానం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి. సభ్యుల ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోగలుగుతారు. వృషభం - వృత్తి ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు.కొంత ఒత్తిడికి గురైనప్పటికీ అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయం కొంత నిరాశకు గురిచేస్తుంది. మిథునం - వృత్తి- ఉద్యోగాలపరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు కొంత చికాకు కలిగిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు తగదు. కర్కాటకం - వృత్తి ఉద్యోగాలలో కొంత మార్పు కోరుకుంటారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ ఓర్పు సహనం వహించడం చెప్పదగినది. సింహం - సంతానం చేపట్టిన పనులలో విజయం సాధించడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. ప్రత్యర్థి వర్గం వారి చేష్టలు సూటిపోటి మాటలు మీకు విసుగు కలిగిస్తాయి. కన్య - ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అయినవారి అండదండలు మీకు లభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటం మంచిది. తుల - ప్రధానమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన ధనమును వ్యయ ప్రయాలకోర్చి సమకూర్చుకోగలుగుతారు. పదే పదే పదుగురి సలహాలు తీసుకుంటారు కానీ మీకు తోచినదే చేస్తారు. వృశ్చికం - జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. సంతాన క్షేమం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృత్తి ఉద్యోగములకు అవసరమైన ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు. ధనుస్సు - ఎంత శాంతంగా ఉన్నా ఓర్పు సహనాలకు అగ్నిపరీక్ష పెట్టే రీతిలో శత్రువర్గం మిమ్మల్ని రెచ్చగొడతారు. మీ నిర్లక్ష్యం వలన కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొనవలసి వస్తుంది. మకరం - ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూల పరుచుకోవాల్సి రావడం వలన మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు. పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు. కుంభం - మీ పరిధిలో లేని అంశాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగములలో నైపుణ్యమును ఆసక్తిని చూపిస్తారు. సహచరులలో ఒకరు మీ సన్నిహితులు అవుతారు. మీనం - ఏ పని నైనా సరే పూర్తికానంతవరకు బహిర్గతం చేయకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. లీజులు లైసెన్సులను తిరిగి పొందడానికి గాను చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడం, వివాహ వేడుకల కారణంతో హైవేపై వాహనాల రద్దీ తీవ్రమైంది. సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల చిట్యాల, పెద్దకాపర్తి, పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్ దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసే పనిలో పడ్డారు. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను త్వరగా పంపించేందుకు టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ గేట్ల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ట్రాఫిక్లో అంబులెన్స్ సైతం చిక్కుకు పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు.
ప్రపంచకప్: భారత్ పై ఆస్ట్రేలియా రికార్డు విజయం
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వేదికగా ఆతిథ్య భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ మరో ఓవర్ మిగిలివుండగానే ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది మూడో విజయం కావడం విశేషం. ఇక టీమిండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ, లిఛ్పిల్డ్లు శుభారంభం అందించారు. లిచ్ఫిల్డ్ ఆరు ఫోర్లు, సిక్స్తో 40 పరుగులు చేసింది. అష్లే గార్డ్నర్ (45), ఎలిసె పేరి 47 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్ను కనబరిచారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హీలీ 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 142 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా అలవోక విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు ప్రతీక రావల్ (75), స్మృతి మంధాన (80) అండగా నిలిచారు.
ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా
తెలంగాణ ఇవి ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గ్రావ్టన్ మోటార్స్ ఫౌండర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశంస మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పర్శురామ్ పాకను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు. ఒక ఆవిష్కర్తకు ప్రేరణ ఇచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. పర్శురామ్ పాక వంటి ప్రతిభావంతులను పోషించడంలో తెలంగాణలోని ఆవిష్కరణల కేంద్రాలైన టీ- హబ్, టీ- వర్క్ పాత్ర కీలకమని కొనియాడారు. సిరిసిల్లకు చెందిన పర్శురామ్ పాక మన ఇంక్యుబేటర్ల (టి హబ్, టి వర్క్) వద్ద ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావ్టన్ మోటార్స్ను స్థాపించారని తెలిపారు. నేడు ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు. గ్రావ్టన్ మోటార్స్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్ను పూర్తిగా దేశీయంగా రూపొందించి, తయారు చేసిందని తెలిపారు. ఇది నిజమైన మేడ్- ఇన్ -ఇండియా, మేడ్ -ఫర్- ది -వరల్డ్ విజయగాథ అని కెటిఆర్ అభివర్ణించారు. కే2కే ప్రపంచ రికార్డ్, అంతర్జాతీయ విస్తరణ గతంలో గ్రావ్టన్ మోటార్స్ సంస్థ 4,000 కిలోమీటర్ల కశ్మీర్ -టు -కన్యాకుమారి(కె2కె) రైడ్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిందని కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీన్స్, పెరూ వంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని అన్నారు. శుక్రవారం కోయంబత్తూరులో పర్శురామ్ పాకను కలిశానని, ఆయన కంపెనీ ప్రయాణం, విజయాలు తనను ఎంతగానో ప్రేరేపించాయని తెలిపారు. ఇది తనకు నిజంగా అవసరమైన ఎనర్జీ బూస్టర్ అని వ్యాఖ్యానించారు. పర్శురామ్, గ్రావ్టన్ మోటార్స్ ఈవీ బృందానికి అభినందనలు తెలుపుతూ, ఆయన కథ మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిష్కరణల వ్యవస్థ స్థానిక మేధస్సును అంతర్జాతీయ ప్రభావిత శక్తిగా మారుస్తూ, భారతదేశ ఈవీ విప్లవాన్ని ఎలా ముందుకు నడిపిస్తోందో ఈ విజయాలు నిరూపిస్తున్నాయని కెటిఆర్ తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు..!
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఎఐ, ఆటోమేషన్ జోరుతో నిన్న మొన్నటివరకూ సేఫ్ అనుకున్న ఐటి ఉద్యోగాలు కాస్తా ఆవిరవుతున్నాయి. భారత్లో ఎఐ ఉద్యోగాలపై నీతి ఆయోగ్ అంచనాలను వెల్లడించింది. 2030 నాటికి అంటే వచ్చే ఐదేళ్లలోనే భారత్లో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా టెక్, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలను ఎఐ సృష్టించబోతున్నట్లు తెలిపింది. నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రమణ్యం ఈ వివరాలు వెల్లడించారు. నాస్కామ్ బిసిజితో కలిసి ఈ నివేదిక తయారు చేసింది. 2035 నాటికి భారత్ ఎఐ రంగంలో గ్లోబల్ హబ్ గా మారబోతోందని ఈ నివేదికలో తెలిపారు. ఎఐ దూకుడు కారణంగా క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్లు, లెవెల్ 1 సపోర్టింగ్ ఏజెంట్ల వంటి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం వివిధ రంగాల్లో ఎఐ నైపుణ్యాల వృద్ధి, ఆవిష్కర ణలు జరగకపోతే ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇవి జరిగితే మాత్రం జాతీయ స్ధాయిలో ఆయా ఉద్యోగులు ఆస్తులుగా మార తారని తెలిపింది. ఎఐ దూకుడు కారణంగా టెక్నికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో పెనుమార్పులు తథ్యమని చెబుతోంది. ఏఐ కారణంగా ఎఐ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల రాక పెరగనుందని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది. వీటితో పాటు కొత్త ఉద్యోగాలైన ఎఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఎఐ ఎథిక్స్ స్పెషలిస్ట్, ఎఐ ట్రైనర్స్, ఎఐ ప్రొడక్ట్ మేనేజర్స్, ఎఐ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ స్పెషలిస్ట్, ఎఐ లిటరసీ ట్రైనర్స్, స్పెషలిస్ట్, ఎఐ హెల్త్ కేర్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ వంటివి కూడా రాబోతున్నట్లు వెల్లడించింది.
చీరాల బీచ్ లో విషాదం.. ముగ్గురి మృతి, ఇద్దరు గల్లంతు
మన తెలంగాణ/హైదరాబాద్ : బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చీరాల మండలం వాడరేవు బీచ్లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో మునిగి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అనంతరం కొద్దిసేపటికి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శ కులు సూర్యలంక బీచ్తో పాటు వాడరేవు సముద్ర తీరానికి వస్తుంటారు. ఈ క్రమలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థులు బృందంగా వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్కు చెందిన సాకేత్ సాయి, మణిద్వీప్, జీవన్ సాత్విక్లు అలల తాకిడికి కొట్టుకుపోయారు. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపా డేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. గల్లంతైన కాసేపటికి సాకేత్, సాత్విక్, మణిదీప్ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి సోమేష్తో పాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం అగ్నిమాపక, మత్సశాఖ అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని బాపట్ల ఎస్పీ ఉమా మహేశ్వర్ పరిశీలించారు. మంగినపూడి బీచ్ వద్ద యువకులను కాపాడిన మెరైన్ సిబ్బంది.. ఇదిలా ఉండగా, బందరు రూరల్ మండలం మంగినపూడి బీచ్ వద్ద నీళ్లలో కొట్టుకుపోతున్న నలుగురు యువకుల్ని పోలీసులు, మెరైన్ సిబ్బంది రక్షించారు. ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులతో మంగినపూడి బీచ్ రద్దీతో కిటికీటలాడుతోంది. సముద్ర తీరా ప్రాంతంలో అలల తాకిడికి కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన నలుగురు ముస్లిం యువకులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన సబ్ ఇన్స్పెక్టర్ బోస్, మెరైన్ సిబ్బంది సాయంతో నలుగురు యువకుల్ని కాపాడారు. అబ్దుల్ అసిఫ్, ఎస్.కె అర్ఫాద్, ఎస్.కె సికిందర్ షరీఫ్, ఎండి అన్వర్, అనే యువకులను మెరైన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడి నందుకు యువకులు వారికి ధన్యవాదాలు తెలిపారు. యువకులను కాపాడడంలో మెరైన్ పోలీస్ సిబ్బంది చూపించిన ధైర్యసాహసాలను పర్యా టకులు ప్రశంసించారు.
A Laugh Riot Awaits! “Mithra Mandali” to Entertain Audiences with Premieres on October 15
“Mithra Mandali” to Premiere on October 15 — A Feel-Good Buddy Comedy Set to Entertain All Ages. The upcoming entertainer “Mithra Mandali” is gearing up to hit the big screens this festive season. Starring Priyadarshi and Niharika NM in lead roles, the film is directed by Vijayendra and produced by Kalyan Manthena, Bhanu Pratap, and […] The post A Laugh Riot Awaits! “Mithra Mandali” to Entertain Audiences with Premieres on October 15 appeared first on Telugu360 .
మద్యం షాపులకు దరఖాస్తుల జోష్..
రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు 5663 దరఖాస్తులు ఈనెల 18 వరకే గడువు మిగిలింది వారం రోజులే.. చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే చాన్స్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మద్యం షాపులకు దరఖాస్తుల జోష్ కొనసాగుతోందని ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు శనివారం సాయంత్రం వరకు 5663 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 18తో దరఖాస్తుల స్వీకరణ అంకం పూర్తి కానుందని, చివరి మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని అంచనావేస్తున్నామన్నారు. గత రెండేళ్ల క్రితం సైతం చివరి రెండు రోజుల్లో 45 వేల నుంచి 50వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఈసారి చివరి మూడు రోజుల్లో దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయని, సోమవారం నుంచి శనివారం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే అంచనాలు ఉండడంతో ఎక్సైజ్ డివిజన్ల వారిగా, రంగారెడ్డి, హైదరాబాద్ డివిజన్ల లో ను, ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లు ఏర్పాటుతోపాటు దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. గత రెండేళ్ల క్రితం మద్యం షాపులకు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి దరఖాస్తులు గతంలో కంటే మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామన్నారు. ఈ సారి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వేయడానికి మద్యం వ్యాపారులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మరోపక్క మద్యం షాపులకు కేటాయించిన రిజర్వేషన్లు గౌడ్, ఎస్సీ, ఎస్టీ మద్యం షాపులకు దరఖాస్తులు పోటాపోటీగా పడుతున్నాయని వెల్లడించారు. గౌడ షాపులకు 671 దరఖాస్తులు, ఎస్సి రిజర్వేషన్లు 202, ఎస్టి రిజర్వేషన్లు 84, జనరల్ లో 4686 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ లో 142, హైదరాబాదులో 746, కరీంనగర్లో 392, ఖమ్మంలో 260, మహబూబ్ నగర్లో 278, నల్లగొండలో 568, మెదక్లో 411, నిజామాబాద్లో 255, రంగారెడ్డిలో 2353, వరంగల్లో 258 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
బిసి రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బిసి జెఎసి ఏర్పాటు
చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 18న బందు పర్ జస్టిస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర బంద్ 13న రహదారుల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా తెలంగాణ బంధ్ తో బిసిల బలమేంటో చూపిస్తాం బిసిల నిరసనను గల్లి నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తాం ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి బిసి ఐక్య కార్యాచరణ కమిటీ (బిసి జెఎసి) ఏర్పాటయ్యింది. ఆదివారం హైదరాబాద్, లక్డీకాపూల్ లోని ఓ హోటల్లో బిసి సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమయ్యారు. బిసి రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టుల ద్వారా అడ్డుకోవాలని ఇప్పటికే రెడ్డి జాగృతికి చెందిన నేతలు ప్రయత్నిస్తుండడంతో ఉద్యమించే బిసి సంఘాలు తమ తమ సంఘాల ద్వారా కాకుండా ఉమ్మడి ఎజెండాతో జెఎసి ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బిసి జెఎసి చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా విజిఆర్ నారగోని, కో చైర్మన్ లు గా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణ ను ఎన్నుకున్నారు. బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వదాన్ని నిరసిస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 13న ఇచ్చిన జాతీయ రహదారుల దిగ్బంధం, ఆర్ కృష్ణయ్య ఈనెల 14న ఇచ్చిన రాష్ట్ర బందును వాయిదా వేసి ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ను చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించి రాష్ట్రంలోని బిసిలకు అన్యాయం చేసిందని, ఈ అన్యాయాన్ని నిరసిస్తూ బిసిలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బిసి రిజర్వేషన్లు అమలు చేస్తాయని అన్నారు. ప్రస్తుత బిసి రిజర్వేషన్ల ఉద్యమం భవిష్యత్తులో చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించే వరకు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈనెల 14న నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర బందును 18కి వాయిదా వేశామని 18న జరిగే బందును పార్టీలకతంగా బిసిలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బిసిలు ఐక్యంగా లేరని బిసిలకు రావలసిన నోటికాడ ముద్దను పిడికెడు శాతం లేని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పుట్టియడానికి బిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అందుకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన బిసి సంఘాలను, వ్యక్తులను, శక్తులను కలుపుకొని బిసి జెఎసిగా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. ఈనెల 18న జరిగే బంద్ ద్వారా బిసిల బలమేందో, బిసిల శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుచి చూపిస్తామని ఆయన హెచ్చరించారు బిసిల ఐక్యత ద్వారా తెలంగాణలోని బిసి సమాజానికి విశ్వాసం కల్పించి పార్టీలుగా సంఘాలుగా విడిపోయిన బిసి శ్రేణులను ఒక్కటి చేసి తెలంగాణలో బిసిల రాజకీయ అధికారానికి పునాదులు వేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో 40 బిసి సంఘాలు, 110 బిసి కుల సంఘాలతో పాటు ముఖ్యంగా బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య, శేఖర్ సగర, నీల వెంకటేష్, తాటికొండ విక్రం గౌడ్, కనకాల శ్యాం కుర్మా, కేపీ మురళీకృష్ణ, అనంతయ్య, రామకోటి, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్, భూపేష్ సాగర్, గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మధు, గుజ్జ సత్యం, రమాదేవి, లక్ష్మి, భూమన్న యాదవ్, రాజు నేత, దీటి మల్లయ్య, రాజేందర్, పగిల సతీష్, రామ్మూర్తి, బడే సాబ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు
ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో
సౌదీ నుంచి హైదరాబాద్ కు కోమా పెషేంట్..
మన తెలంగాణ / హైదరాబాద్: గత ఎనభై రోజులుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో చికిత్స పొందుతున్న కోమా పెషేంట్ లోకిని క్రిష్ణమూర్తిని హైదరాబాద్ కు తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో స్ట్రెచర్ పై మెడికల్ ఎవాక్యుయేషన్ చేస్తున్న పెషేంట్ తో అతని భార్య తెనుగు అశ్విని ఉన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ కు చేరిన వెంటనే పెషేంట్ ను దక్కన్ హాస్పిటల్ లో చేరుస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎల్కతుర్తి కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లోకిని క్రిష్ణమూర్తి (35) సౌదీలో జూలై 23న అపస్మారక స్థితికి చేరారు. అధిక బిపితో, మెదడులోని రక్తనాళాలు చిట్లి కోమాలోకి జారిపోయిన అతనికి, రియాద్ లోని ఎస్ఎంసీ ఆసుపత్రిలో కోమా స్థితిలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం సౌదీలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదించి పెషేంట్ ను తెప్పించడానికి కృషి చేశారు. సౌదీలోని గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు మహ్మద్ జబ్బార్ సమన్వయం చేశారు. సహాయం కోసం పెషేంట్ తండ్రి సూరయ్య గతనెల 9న ’ సిఎం ప్రవాసీ ప్రజావాణి’ లో వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి మార్గదర్శనం చేశారు.
‘మా’ నుంచి తప్పించండి.. మంచు విష్ణుకు ఎమ్మెల్సీ బల్మూరి ఫిర్యాదు
మన తెలంగాణ/హైదరాబాద్ః జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ను మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ‘మా’ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు. ఆదివారం బల్మూరి వెంకట్ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామని మంచు విష్ణు తనకు హామీ ఇచ్చారని బల్మూరి వెంకట్ తెలిపారు. ఈ అంశంపై సినీ పరిశ్రమ పెద్దలు కూడా స్పందించాలని ఆయన కోరారు.
భారత్లో విద్యావ్యవస్థకు పెను ముప్పు: రాహుల్ గాంధీ
నిలదీస్తేనే నిజాలు, ప్రశ్నిస్తేనే వైవిధ్య భారత్ పదేండ్ల కాలంలో తిరోగమన విధానాలతో యువత అధోగతి చిలీ, పెరూ వర్శిటీలలో విద్యార్థులతో ఇష్టాగోష్టిలో రాహుల్ శాంటియాగో /న్యూఢిల్లీ : భారతదేశంలో స్వతంత్ర ఆలోచనా విధానాలపై , శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధతపై తీవ్రస్థాయి దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శింఒచారు. చిలీ పర్యటనకు వెళ్లిన రాహుల్ అక్కడి యూనివర్శిటీలో విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పరోక్షంగా మోడీ ప్రభుత్వ తీరుతెన్నులపై విరుచుకుపడ్డారు. కుల వ్యవస్థ కుళ్లు, విద్యావ్యవస్థ లోపాలతో భారతదేశం ఏనాటికీ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. నది పంవత్సరాల కాలంలో భారతీయ విద్యావ్యవస్థపై , యువత ఆలోచనలపై అప్రకటిత దాడి జరుగుతోందని, అణచివేత పరాకాష్టకు చేరిందని కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. భారతీయ విద్యా వ్యవస్థ రక్షణ అత్యవసరం, ఇక్కడ అమృత అనే అమ్మాయి లేవనెత్తిన ప్రశ్నకు తాను శాస్త్రీయంగానే సమాధానం ఇస్తానని రాహుల్ తెలిపారు. భారత్లో విద్యావ్యవస్థను పరిరక్షించాల్సి ఉంది. ఇది తనతో పాటు అందరి బాధ్యత అన్నారు. ఇక్కడి విద్యార్థినిలాగా భారత్లోని వారు కూడా ప్రశ్నించే స్వేచ్ఛతో ఉండాలి. వారికి ఈ స్వేచ్ఛ కల్పించేలా చేయాలనేదే తన ఆలోచన అని చెప్పారు. అమృత ఇక్కడ నిలదీసినట్లే భారత్లో కూడా ఏ అమ్మాయి అయినా పౌరుడు అయినా పలు అంశాలను ప్రస్తావించే పరిస్థితి ఉండాల్సిందే. ధైర్యంగా ఆలోచించగలగాలి, ఎటువంటి అవరోధాలకు వీలుండరాదని ఆయన చెప్పారు. పెరూ లోని పాంటిఫికల్ క్యాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ పెరూలో కూడా రాహుల్ ఇటువంటి స్పందన వెలువరించారు. భారత్లో విద్యావ్యవస్థ అక్కడ వైవిధ్యతను ప్రతిఫలించేదిగా ఉండాలి. విద్య అనేది కొందరికే చెందే హక్కు కారాదని తెలిపారు. అప్పుడే స్వేచ్ఛ బలోపేతం అవుతుందన్నారు. భారత్కు ఓ ప్రత్యామ్నాయ ఉత్పత్తి వ్యవస్థ అవసరం. ఈ దిశలో అమెరికా లేదా పెరూతో సరైన భాగస్వామ్యం దేశ పురోగతికి పనికి వస్తుందన్నారు. రాహుల్పై బిజెపి ఆగ్రహం పరాయి దేశానికి వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడటం తగునా అని రాహుల్ గాంధీపై బిజెపి విరుచుకుపడింది. ఏ ఇతర దేశం వెళ్లినా ఏదో సంచలనం కోసం భారత్పై విద్వేషం వ్యక్తం చేయడం ఈ వ్యక్తికి అలవాటు అయిందని బిజెపి అధికారిక ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. అమెరికాలోని కరోలినాలో ఆ మధ్య రాహుల్ భారత్లో కొందరు పెట్టుబడిదార్లకు మేలు చేసేలా మోడీ సర్కారు పనిచేస్తోందని, రాజ్యాంగానికి తూట్లుపొడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చిలీ యూనివర్శిటీలో విద్యార్థుల ఇష్టాగోష్టిలో రాహుల్ భారత్లో కుల వ్యవస్థ, విద్యారంగం గురించి చేసిన వ్యాఖ్యానాలను కాంగ్రెస్ మాజీ నేత అయిన పూనావాలా తప్పుపట్టారు. వేరే దేశంలో మన దేశాన్ని కించపరుస్తున్నారని పూనావాలా స్పందించారు. రాహుల్ దేశ ప్రతిపక్ష నేతనా; విద్వేష ప్రచారాల దూతనా అని బిజెపి మండిపడింది.
నక్సల్స్పై సిఆర్పిఎఫ్ అటవీ అస్త్రం
న్యూఢిల్లీ : చత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అత్యంత దుర్భేధ్యపు కర్రెగుట్ట పర్వత ప్రాంతంలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఓ కమెండో ట్రైనింగ్ స్కూల్ ఆరంభం కానుంది. తమ దళాలకు ప్రత్యేక గెరిల్లా, కమెండో తరహా శిక్షణ కోసం ఈ శిక్షణ సంస్థను ఈ ప్రాంతపు భౌగోళిక పరిస్థితి నేపథ్యంలో ఎంచుకున్నారు. ఈ కర్రెగుట్ట హిల్స్ ప్రాంతం కంచుకోటగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సిఆర్పిఎఫ్కు చెందిన అటవీ యుద్ధ తంత్ర కమెండో విభాగం కోబ్రా, స్థానిక పోలీసు బలగాలు కలిసి మూడు వారాల పాటు విస్తృత స్థాయిలో అనువైన ప్రదేశం కోసం గాలించాయి.ఈ క్రమంలోనే 60 కిలోమీటర్ల పొడవు, 520 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ప్రాంతాన్ని తమ స్థావరంగా ఎంచుకున్నారని అధికార వర్గాలు పిటిఐ వార్తాసంస్థకు తెలిపాయి. కొండలు, కందకాలు, పైగా దట్టమైన అటవీప్రాంతం, గబ్బిలాలు, కందిరీగలు, ఎలుగుబంట్లు ఉండే ఈ ప్రాంతం తమ కదలికలకు అత్యంత రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా ఉంటుందని వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడనే ఎప్రిల్ మే మధ్యలో కోబ్రా ఇతర దళాల తీవ్రస్థాయి గాలింపు చర్యల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ 31 మంది వరకూ మావోయిస్టులు మృతి చెందారు.ఈ దశలోనే ఈ ప్రాంతంలో కమెండో సెంటర్ను పెట్టాలని సిఆర్పిఎఫ్ వర్గాలు ఆలోచించాయి. నక్సల్ ఏరివేత లక్షం వచ్చే ఏడాది మార్చి నాటికి నెరవేరుతుందని అమిత్ షా పదేపదే చెపుతూ వస్తున్న దశలో , మారుమూల అడవుల్లో నక్సల్స్పై పోరును మరింత తీవ్రతరం చేసే తగు శిక్షణ, పటిమను బలగాలకు కల్పించేందుకు నిర్ణయించారు. ఎప్రిల్ మే నెలల్లో జరిఇన కర్రెగుట హిల్స్ ఆపరేషన్ను భద్రతా బలగాలు తమ అత్యంత భారీవిజయంగా భావించుకుంటున్నాయి. సిఆర్పిఎఫ్కు చెందిన అనుభవజ్ఞులైన వారిని , అటవీ , కొండ ప్రాంతాలలో దాడులు, గెరిల్లా తరహా పోరాట పటిమ ఉండే వారిని ఎంచుకుని ఇక్కడ ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. కెజిహెచ్ ఆపరేషన్ తరువాత ఇది సిఆర్పిఎఫ్కు సంబంధించి అత్యంత కీలకమైన వ్యూహాత్మక కార్యాచరణ అని వెల్లడైంది. ఏ విధంగా దీనిని ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే ఖరారు అయింది. ఇక సిఆర్పిఎఫ్ స్కూల్ ద్వారా కమెండో శిక్షణ అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీని వల్ల ఈ ప్రాంతం శత్రువుల కదలికలు, ఉనికికి దూరంగా ఉండేలా చేయడం జరుగుతుందని ఓ అధికారి చెప్పారు. ఈ గుట్టలలో వాతావరణం తీవ్రస్థాయిలో ఎండలు, చలితో ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కువగా ఇతర వ్యక్తులకు చేరుకునే లేదా ఉండేందుకు అవకాశం లేనిది. అందుకే దీనిని చాలా కాలం వరకూ నక్సల్స్ దళాలు తమ స్థావరంగా వాడుకున్నాయి. ఇప్పుడు నక్సల్స్పై అంతిమ విజయం కోసం ఈ ప్రాంతం నుంచే వారిపై సర్వశక్తులతో దెబ్బకొట్టేందుకే ఈ కమెండో స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడైంది.
8 మంది పట్టివేత పెద్దపంజాణి, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం
ప్రజా సమస్యలే మా అజెండా గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలు
పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : మంత్రి
పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : మంత్రి మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్
కానిస్టేబుల్స్ సాహసం.. సముద్రంలోకి వెళ్లి నలుగురు యువకులను కాపాడి! #Machilipatnam #PoliceHero
అతడి రాక కోసం రికార్డుల ఎదురుచూపులు..
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు రంగం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో (ఈ నెల
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: శ్రీధర్ బాబు
మన తెలంగాణ/హైదరాబాద్/గచ్చిబౌలి : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్‘ అనే థీమ్తో నిర్వహించిన ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ఎనిమిదో ఎడిషన్‘ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మందిని కబళిస్తున్న కాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత మనందరి పై ఉందన్నారు. ‘ఆరోగ్య తెలంగాణ ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఆరోగ్యాన్ని మించిన సంపద ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. సమాజంలో క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ‘గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినంధించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. చినబాబు సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు.
పుష్కరిణి పునరుద్ధరణ పనులు.. మక్తల్, (ఆంధ్రప్రభ) : మక్తల్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన
ఆందోళన పడకండి.. బిఆర్ఎస్ అండగా ఉంటుంది: హరీష్ రావు
జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులుకు హరీష్ రావు భరోసా మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు భరోసా ఇచ్చారు. వారి సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని.. వారిని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో హరీష్రావు ఫోన్లో మాట్లాడారు. మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లామని జోర్దాన్లో చిక్కుకుపోయిన వారికి హరీష్ రావు వివరించారు. ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చే కృషి చేస్తున్నామని, అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లిన 12 మంది తెలంగాణ వలస కార్మికులు జోర్డాన్లో చిక్కుకున్నారు. దేశం కాని దేశంలో నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు హరీశ్ రావుకు గోడు వెళ్లబోసుకున్నారు. ఎలాగైనా తమను తెలంగాణలో ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు ఫోన్ చేసి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.
కేంద్ర మంత్రి అయితే.. రిజర్వేషన్లపై నేనేమి చేయలేను?: కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ః కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై ఏమి చేయగలనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నా రిజర్వేషన్లపై ఏమీ చేయలేకపోయామని ఆయన చెప్పారు. గతంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని ఆయన ఉదహరించారు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండరాదని లోగడ సుప్రీం కోర్టు క్యాప్ విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో తాను కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏమి చేయగలనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో, సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బిజెపి ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన చెప్పారు. అయితే బిసి రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రయత్నానికే తాము అభ్యంతరం వ్యక్తం చేశామని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యం గురించి ప్రశ్నించగా, ముగ్గురు ఆశావాహుల పేర్లతో జాబితాను తమ పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు పరిశీలనలో ఉందన్నారు. దీనిపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని వెల్లడించనున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
బీఆర్ ఎస్పై మాజీ సర్పంచ్ మండిపాటు
బీఆర్ ఎస్పై మాజీ సర్పంచ్ మండిపాటు కల్వకుర్తి, ఆంధ్రప్రభ : గత బిఆర్ఎస్
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి: కెటిఆర్
ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుంది రేవంత్రెడ్డి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పంపుతున్నారు కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి రెండేళ్లవుతున్నా ఇంకా కెసిఆర్నే నిందిస్తున్నారు బిజెపి తెలంగాణకు పనికిరాని పార్టీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చుపెడతారని, కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.10 వేలు ఇస్తారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం షేక్పేట్ డివిజన్కు చెందిన బిజెపి సీనియర్ నేత చెర్క మహేష్, ఇతర నేతలు కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సి దాసోజు శ్రవణ్, ఎంఎల్ఎ ముఠా గోపాల్ మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్రెడ్డి,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా సిఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ ప్రతిదానికి కెసిఆర్నే నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సిఎం రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లడుతున్నారని విమర్శించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ దాడి హైదరాబాద్లో గరీబోళ్ల ఇళ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి.. ఆ ఇళ్లని సిఎం రేవంత్రెడ్డి కూలగొట్టిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికలో జూబ్లీహిల్స్ ప్రజలకి కారు కావాలో.. బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదల ఇండ్లపైన కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లను నడిపిస్తున్నదని మండిపడ్డారు. అన్నీ తెలిసి కూడా బిసి రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని సిఎంకు తెలుసు అని పేర్కొన్నారు. ఇచ్చిన జిఒను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బిసి రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశాడని విమర్శించారు. అజారుద్దీన్కు ఇస్తామని చెప్పిన ఎంఎల్సి కూడా ఆయనకు రాదని తెలుసు అని, కానీ ఆయనను కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. ముస్లింలకు ఇస్తామని చెప్పిన స్మశానం విషయంలో కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం హైదరాబాద్ నగరం అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కెసిఆర్ తిరిగి రావాలని, అందుకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన మోసం గురించి కాంగ్రెస్ పార్టీపైన ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4 వేల పెన్షన్లు వస్తాయి.. మిగతా హామీలు అమలవుతాయని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే, ప్రజలను తాము మోసం చేసినా తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని విమర్శించారు. ఈ రెండేళ్లుగా ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. ఒక్క ఇల్లు కట్టలేదు.. ఒక్క ఇటుక పెట్టలేదు.. కానీ 2.30 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసిందని అన్నారు. తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజం అని, ఆయన నిజాయితీగా చెబుతూ మరీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మోసం చేసే వాళ్లనే ప్రజలు నమ్ముతారని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాని పార్టీ అని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మోరీలో వేసినట్లేనని కెటిఆర్ పేర్కొన్నారు.
కదులుతున్న రైలు దిగబోయి జారి పడిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్!.. సీసీటీవీ ఫుటేజ్ #railwaysafety
కొండా X పొంగులేటి: అది పార్టీ అంతర్గత వ్యవహారం.. మేం చూసుకుంటాం
మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదంపై త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో పరిష్కరించుకుంటామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ అన్నారు. మంత్రుల మధ్య సమాచార లోపం వల్ల వివాదం తలెత్తిందని గాంధీభవన్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి మధ్య తలెత్తింది చాలా చిన్న సమస్య అన్నారు. ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం చెప్పారు. త్వరలో ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి వద్ద కూర్చొని పరిష్కరించుకుంటామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై మంత్రి కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంపై ప్రస్తావించగా, తమ పార్టీలో స్వేచ్చ ఎక్కువ అన్నారు. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైనా పార్టీ నాయకత్వానికి చెప్పుకునే స్వేచ్చ తమ పార్టీలో ఉంటుందన్నారు. అధిష్టానం దృష్టికి ఎవరైనా ఆర్జీ పెట్టుకోవచ్చని మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు.
నివారించిన రోడ్డు ప్రమాదాలు వెల్దండ, ఆంధ్రప్రభ : తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road
టీం ఇండియా రికార్డు స్కోర్.. ఆసీస్కు భారీ లక్ష్యం..
విశాఖ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇక్కడి ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళ జట్టుకు మంచి ఆరంభం అందింది. ఓపెనర్లు స్మృతి, ప్రతికాలు కలిసి తొలి వికెట్కి 155 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్థ శతకాలు సాధించారు. స్మృతి మంధన 80 పరుగులు చేసి ఔట్ అయింది. ఆ తర్వాత 192 పరుగుల వద్ద ప్రతీక (75) పెవిలియన్ చేరింది. ఆ తర్వాత బ్యాటింగ్లో హర్లిన్ 38, జెమీమా 33, రిచ ఘోష్ 32, హర్మన్ప్రీత్ 22 పరుగులు చేశారు. వీళ్లు మినహా మిగితా వాళ్లు స్వల్ప స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఐసిసి వన్డే ప్రపంచకప్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆసీస్ బౌలింగ్లో అన్నాబెల్ సదర్లాండ్ 5, సోఫీ మోలినెక్స్ 3, మేగాన్ స్కట్, ఆష్లీ గార్డెనర్ తలో వికెట్ తీశారు.
200 మిలియన్ ఏళ్ల నాటి వృక్షం #FossilDiscovery #Mancherial #SCCL #BirlaScienceCentre #Archaeology
విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ముప్పు
విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. కోకోవెన్ బ్యాటరీ-5లో ఈ ప్రమాదం సంభవిచింది. లాడీల్ నుంచి ఉక్కు ద్రావకాన్ని తలరిస్తుండగా.. అకస్మాత్తుగా అది లీకై నేలపాలైంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబంబంది అక్కడకు వచ్చి మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో యంత్ర సామాగ్రికి గణనీయమైన నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్
నల్లగొండకు గోదావరి నీళ్లు…
నల్లగొండకు గోదావరి నీళ్లు… తుంగతుర్తి, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్
అట్లూరి దంపతుల బహూకరణ గార్ల (మహబూబ బాద్ జిల్లా), ఆంధ్రప్రభ : కోరుకున్నోళ్లకు
క్రమశిక్షణ.. భద్రతే కీలకం ! ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో : దేశ ప్రధాన
1.10 కోట్ల ఏండ్ల నాటి స్టెగోడాన్ ఏనుగు శిలాజాలతో ప్రత్యేక ప్రదర్శన #hyderabad #Stegodon #telangana
కాంగ్రెస్ను ఎండగట్టేందుకే! నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకే బాకీ కార్డుల(Outstanding
భారత్ –వెస్టిండీస్ రెండో టెస్ట్ మూడో రోజు ఇలా..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో
నల్లమల్లలో చెక్ పోస్టులు ఏర్పాటు..
నల్లమల్లలో చెక్ పోస్టులు ఏర్పాటు.. కర్నూలు / నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
సైబరాబాద్లో 534మంది డ్రంక్డ్రైవింగ్ కేసుల్లో బుక్
వీకెండ్ ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసుల చర్య
ముగిసిన మూడో రోజు ఆట.. విండీస్ ఎంత వెనుకంజలో ఉందంటే..
న్యూఢిల్లీ: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత భారత్ 518/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్లు కుల్దీప్ (5 వికెట్లు), జడేజా (3 వికెట్లు) చెలరేగిపోవడంతో వెస్టిండీస్ 248 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్ 270 పరుగులు వెనుకంజలో ఉండి ఫాలోఆన్ నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే రెండో ఇన్నింగ్స్లోనూ వెస్టిండీస్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ చంద్రపాల్ (20) సిరాజ్ బౌలింగ్లో, అలిక్ అతాంజే (7) సుందర్ బౌలింగ్లో పెవిలియన్ చేరారు. దీంతో మూడో రోజే విండీస్ ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ, ఓపెనర్ జాన్ క్యాంప్బెల్, షాయ్ హోలు కలిసి వీరోచితంగా పోరాడారు. వికెట్ కాపాడుకుంటూ స్కోర్ని పెంచుతూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇరువురు అర్థ శతకాలు సాధించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 49 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో క్యాంప్బెల్ (87), హోప్ (66) ఉన్నారు.
సరస్సులో అద్భుత దృశ్యం #odishanews #tornado #river #viralvideo #latestnews #telugupost
కిమ్ చేతిలో బ్రహ్మాస్త్రం! #KimJongUn #Hasang20 #MilitaryParade #DefenseNews #telugupost #viralvideo
ఆసీస్తో మ్యాచ్: అరుదైన రికార్డులు సాధించిన స్మృతి..
విశాఖ: ఐసిసి మహిళ వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖలోని ఎసిఐ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో టీం ఇండియా తలపడుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతీక రావల్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కి 155 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరువురు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. అంతేకాక.. స్మృతి ఈ మ్యాచ్లో వన్డేల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని కూడా చేరుకుంది. అంతేకాక.. ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది. అయితే సోఫీ మోలినెక్స్ వేసిన 24వ ఓవర్ మూడో బంతికి స్మృతి (80) క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగింది. దీంతో 29 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 183 పరుగులు చేసింది. క్రీజ్లో ప్రతీక (73), హర్లిన్ (14) ఉన్నారు.
Panchumarthi Anuradha Hits Back at Roja Over Spurious Liquor Row
The spurious liquor scandal in Mulakalacheruvu, Annamayya district, continues to create tremors across Andhra Pradesh. With the government arresting even leaders from the ruling alliance, the YSR Congress Party (YSRCP) has seized the moment to demand a CBI inquiry. Former minister and YSRCP leader RK Roja held a press meet urging the Centre to intervene, […] The post Panchumarthi Anuradha Hits Back at Roja Over Spurious Liquor Row appeared first on Telugu360 .
హన్మకొండలో భారీ వరి కొనుగోలు మోసం – 12 మంది పేర్లపై ₹1.8 కోట్లు
పంట వేయకుండానే రైతుల ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము
రహదారిని శాశ్వతంగా సరి చేయాలి
రహదారిని శాశ్వతంగా సరి చేయాలి ఎండపల్లి, ఆంధ్రప్రభ : మండలం కొత్తపేట(Kothapet) గ్రామ
హైదరాబాద్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత
సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు పనులు
ప్రతి దానికి ఇంకా కెసిఆర్ నే నిందిస్తున్నారు: కెటిఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఓడిస్తే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి వస్తుందని, ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లవుతున్నా ప్రతిదానికి ఇంకా మాజీ సిఎం కెసిఆర్ నే నిందిస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలుపై రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ఏం చేశారు అంటే.. గరీబ్ వాళ్ల ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి బుల్డోజర్ మాత్రం పంపించారని, హైడ్రా అని కొత్త దుకాణం పెట్టి ఉన్న ఇల్లు కూలగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మీకు కారు కావాలి అంటే బిఆర్ఎస్ గెలవాలని, గోపీనాథ్ భార్య సునీత గెలవాలని కోరుకోండని అన్నారు. మీ ఇంటికి బుల్డోజర్ రావాలి అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని కెటిఆర్ దుయ్యబట్టారు.
రాజన్న ఆలయ అభివృద్ధి వేములవాడ, ఆంధ్రప్రభ : భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు అనుగుణంగా
గాల్లోనే అదుపు తప్పి కుప్పకూలిన హెలికాఫ్టర్
ఆమెరికా: దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ బీచ్ సమీపంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అందరూ చూస్తుండగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. అప్పటివరకూ సాధారణంగా ప్రయాణించిన హెలికాఫ్టర్.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి అదుపు తప్పింది. కాసేపటికే అక్కడ ఉన్న చెట్లలో కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్లో ఉన్న ఇద్దరికి, నేలపై ఉన్న మరో ముగ్గరికి గాయలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
విశాఖ తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కు శంకుస్థాపన..
ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో : విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది.
Andhra Prabha Smart Edition |డేటింగ్ చీటింగ్/ డిజిటల్ గేట్వే/చేయూతలో భాస్కరుడు
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 12-10-2025, 4.00PM* *డేటింగ్ చీటింగ్.. మత్తు వలలో
Nara Lokesh Sets Ambitious Vision to Transform Visakhapatnam into India’s Next Tech Powerhouse
Andhra Pradesh IT Minister Nara Lokesh has set an ambitious goal to create five lakh IT jobs in Visakhapatnam, and his latest initiatives are paving the way for that vision. On Friday, Lokesh laid the foundation stone for the city’s first AI-powered Edge Data Centre and an Open Cable Landing Station, marking a major milestone […] The post Nara Lokesh Sets Ambitious Vision to Transform Visakhapatnam into India’s Next Tech Powerhouse appeared first on Telugu360 .
మాజీ సీఎం కుండకు.. కూటమి ఎసరు మూడు కంపెనీలకు సున్నంలీజుల రద్దుకు ప్లాన్
విధుల్లో నిర్లక్ష్యం.. చెట్ల అక్రమ నరికివేత
జన్నారం, ఆంధ్రప్రభ : విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగంపై ఇద్దరు అటవీ అధికారులను
మరణించిన వ్యక్తి కూతురి వివాహానికి..
మరణించిన వ్యక్తి కూతురి వివాహానికి.. నంద్యాల బ్యూరో అక్టోబర్ 12 ఆంధ్రప్రభ :
గూగుల్ మ్యాప్స్ కు పోటీగా స్వదేశీ యాప్..#ashwinivaishnav #googlemaps #telugupost #latestnews
శ్రీశైలంలో ఒక గేటు ఎత్తిన అధికారులు
శ్రీశైలంలో ఒక గేటు ఎత్తిన అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద
సాయం చేసే చేతులు కావాలి… వెంకటాపుర్, ఆంధ్రప్రభ : కొన్నిసార్లు దేవుడు పరీక్ష
పరుగు తీసిన రైతులు నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణానికి చెందిన పల్నాటి
రూ. పదివేల కోట్లతో తల్లికి వందనం ద్వారా విద్యార్థుల చదువుకు సహకారం
రూ. పదివేల కోట్లతో తల్లికి వందనం ద్వారా విద్యార్థుల చదువుకు సహకారం గుంటూరు,
మెలియోయిడోసిస్ వ్యాధి వ్యాప్తే మరణాలకు కారణం
మెలియోయిడోసిస్ వ్యాధి వ్యాప్తే మరణాలకు కారణం గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు రూరల్ మండలం
మెట్రో రైలులో సైకిల్ పార్క్ చేసిన యువతి | Bicycle in Metro #bicycle #delhimetro #telugupost
ప్రజా సమస్యలపై పోరాటం యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎన్ని అక్రమ కేసులు
నిద్రమత్తులో చెట్టును కారుతో ఢీ..
నిద్రమత్తులో చెట్టును కారుతో ఢీ.. ఒక్కరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉత్సహంగా కరాటే సెలక్షన్లు గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి
రియల్టర్ల పై కేసులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ : బ్యాంకు
ట్రిబుల్ ఐటీలో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెంటర్
ఎచ్చెర్ల(శ్రీకాకుళం), అక్టోబర్ 12 (అంద్రప్రభభ): విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ దృష్టి, సాంకేతిక ప్రతిభను
గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లనే : రేవంత్
హైదరాబాద్: వేల ఎకరాలను నల్గొండ ప్రజల కోసం దామన్న త్యాగం చేశారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దామన్న నిలబెట్టారని అన్నారు. సూర్యా పేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాపసభలో సిఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దామోదర్ రెడ్డి చిత్రపటానికి సిఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జలాలను నల్గొండకు తేవడానికిదామన్న కృషి చేశారని, ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును తీసుకొచ్చారని తెలియజేశారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రజలకోసం పనిచేశారని, తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచింది అంటే రాంరెడ్డి దామోదర్ రెడ్డి వల్లే అని రేవంత్ కొనియాడారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానం అండగా ఉంటుందని సోనియా గాంధీ చెప్పారని అన్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తామని, రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అండగా ఉంటామని ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లేనని, ఎస్ఆర్ఎస్పి కి రాంరెడ్డి దామెదర్ రెడ్డి పేరు పెడతామని ఎస్ఆర్ఎస్పి-2 కి ఆర్ డిఆర్ అని నామకరణం చేస్తామని అన్నారు. ఎస్ఆర్ఎస్పి పేరు ఆర్ డిఆర్ఎస్పి ప్రాజెక్టుగా మారుస్తూ జివో ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Telusu Kada Runtime, A Big Advantage
As the clock ticks down to the October 17th Diwali release of Telusu Kada, the makers of Siddu Jonnalagadda, Srinidhi Shetty and Raashii Khanna starrer are successfully building intrigue with aggressive promotions. Billed as a youthful love entertainer, the film is now rumored to tackle a socially issue beneath its romantic veneer. The movie has […] The post Telusu Kada Runtime, A Big Advantage appeared first on Telugu360 .
బాధితులకు అందజేత.. వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని పెద్దాపూర్ గ్రామానికి
నగర జూకు కొత్త అతిథులు..#hyderabad #zooparkhyderabad #wildlife #telangana #telugupost #latestnews
ఫేక్ చలా ‘మణి’ ఇలా… వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నకిలీ కరెన్సీ(Currency)
Video: Raashi Khanna Exclusive Interview
The post Video: Raashi Khanna Exclusive Interview appeared first on Telugu360 .
‘ఆంధ్ర కింగ్ తాలుకా’.. ఎనర్జిటిక్గా టీజర్..
హైదరాబాద్: రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. అయితే గత ఏడాది విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో డిజాస్టర్ని మూటగట్టుకున్నాడు రామ్. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమాతో తిరిగి ఫామ్లోకి రావాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర ఈ సినిమాలో ఉపేంద్ర స్టార్ హీరోగా నటిస్తుండగా.. అతని అభిమానిగా రామ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తన అభిమాన హీరో కోసం ఎంత దూరమైన వెళ్లే ఫ్యాన్గా రామ్ ఈ టీజర్లో కనిపించాడు. హీరో కోసం ఫైట్లు చేయడం.. థియేటర్ వద్ద గోల చేయడం మనం ఈ టీజర్లో చూడొచ్చు. ఇక హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేతో లవ్ సీన్స్ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. చివర్లో ‘‘ఫ్యాన్.. ఫ్యాన్.. అని నువ్వు గుడ్డలు చించుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకు తెలియదు.. ఏం బతుకులురా మీవీ.. చీచీ’’ అనే చెప్పే డైలాగ్తో టీజర్ ముగుస్తుంది. మొత్తానికి టీజర్ ఎనర్జిటిక్గా ఉంది. ఈ సినిమాతో రామ్ సూపర్హిట్ అంుకోవానలి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు మహేశ్బాబు పి దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై చిత్రాన్ని నిర్మించారు. మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎండపల్లి, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన
ఆ గొప్ప చట్టాలను ఎన్డియే ప్రభుత్వం తూట్లు పొడిచింది: మహేష్ కుమార్
హైదరాబాద్: పాలనలో పారదర్శకతను తీసుకురావడమే సమాచారహక్కు చట్టం ముఖ్య లక్ష్యం అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దూరదృష్టితో యూపిఎ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలనలో ఎవరైనా తప్పు చేస్తే సామాన్యుడు ప్రశ్నించేలా ఆర్టిఐ చట్టం తీసుకొచ్చామని, గొప్ప చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు సంపూర్ణమైన హక్కులను యూపిఎ ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలను ఎన్డియే ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఆర్టిఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీనపరిచారని అన్నారు. ఆర్టిఐ కమిషనర్ పదవీకాలం, జీతభత్యాలను కేంద్రమే నిర్ణయించేలా సవరణలు చేశారని, వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్టిఐని నీరుగార్చేందుకు కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని, కేంద్రంలో 11 మంది ఆర్టిఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
గుజరాత్ లో నకిలీ టూత్పేస్ట్ దందా #FakeColgate # #policeraids #KutchNews #ColgateScam #telugupost
గుంటూరులో కలకలం గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అప్కాస్
డాడీ హండ్రెడ్స్తో ఆగిపోవద్దు.. జైస్వాల్కు గవాస్కర్ సూచన
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అదిరిపోయే ఫామ్లో ఉన్న అతడు సెంచరీ సాధించి తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే దాన్ని డబుల్ సెంచరీగా మార్చడంలో మాత్రం విఫలమయ్యాడు. 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. రెండో రోజు ఆట అనంతరం అతడు మాట్లాడుతూ.. రనౌట్ కావడంలో ఆటలో భాగమే అని.. అందుకు తనకు ఎలాంటి బాధ లేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో జైస్వాల్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా జైస్వాల్ని తనదైన శైలీలో కొనియాడారు. సాధారణంగా టెస్టుల్లో సెంచరీ చేస్తే.. దాన్ని డాడీ హండ్రెడ్స్ అని అంటారు. అయితే జైస్వాల్ చేసిన సెంచరీ తనకు గ్రాండ్డాడీ హండ్రెడ్స్డ్తో సమానమని అన్నారు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జైస్వాల్తో గవాస్కర్ చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా హర్ష భోగ్లే మాట్లాడుతూ ‘‘అద్భుతంగా ఆడావు. నీ బ్యాటింగ్ను మేమంతా ఆస్వాదించాం. ఇన్నింగ్స్ ఎలా ముగిసిందనేది పట్టించుకోవద్దు. నీ ఆటను చూడటం చాలా బాగుంది’’ అని అన్నాడు. అనంతరం గవాస్కర్ స్పందిస్తూ.. ‘‘హర్షా చెప్పిన మాటలకు నేను మరికొంత సమాచారం యాడ్ చేస్తున్నాడు. ఇలాగే ముందుకు సాగాలి. సెంచరీలు చేస్తూనే ఉండు. డాడీ హండ్రెడ్స్తో ఆగిపోవద్దు. వాటిని భారీ ఇన్నింగ్స్లుగా మార్చు. ఇప్పుడు నేను గ్రాండ్ఫాదర్ను. కాబట్టి నువ్వు చేసిన వాటిని గ్రాండ్డాడీ హండ్రెడ్స్గా భావిస్తా’’ అని పేర్కొన్నారు. దీనికి జైస్వాల్ స్పందిస్తూ ‘థాంక్యూ సర్’ అని అన్నాడు.
సినీ పెద్దలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించాలి: బల్మూరి వెంకట్
హైదరాబాద్: పబ్లిసిటీ కోసమే శ్రీకాంత్ అయ్యంగార్ చరిత్రను వక్రీకరించారని ఎమ్మెల్సి బల్మూరి వెంకట్ తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్ ‘మా’ సభ్యత్వం రద్దు చేయాలని బల్మూరి వెంకట్ కోరారు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బల్మూరి మీడియాతో మాట్లాడుతూ... మన జాతి పిత మహాత్మ గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలపై చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలకు విజ్ఞప్తి చేశారు. సినీ పెద్దలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. ‘మా’ నిర్ణయాన్ని త్వరగా తెలియజేయాలని కోరుతున్నామని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు విండీస్ జట్టు 81.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రస్తుతం భారత జట్టు 270 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంలో పడి విండీస్ విలవిలలాడిపోయింది. విండీస్ బ్యాట్స్మెన్లలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. విండీస్ బ్యాట్స్మెన్లలో అలిక్ అతాంజే(41), చంద్రపాల్(34), సాయి హోప్(36), అండర్సన్ ఫిలీప్(24) నాటౌట్, ఖరీ పీరీ(23), టెవిన్ ఇమ్లాచ్(21), జస్టిన్ గ్రీవ్స్(18), జయదీన్ సీల్స్(13) క్యాంప్ బెల్(10) పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. చివరలో టెయిలెండర్లు ఆదుకోవడంతో విండీస్ గౌరవ ప్రదమైన పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవీంద్ర జడేజా మూడు, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు. ఇప్పటికే ఈ సిరీస్లో భారత్ తొలి టెస్టు గెలిచి ముందంజలో ఉంది.
మెదక్ లో మహిళను బండరాయికి కట్టేసి... గ్యాంగ్ రేప్... మృతి
కొల్చారం: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం అత్యాచారానికి గురైన మహిళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. కొల్చారంలో మహిళను పని ఇప్పిస్తామని చెప్పి శివారులోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బండరాయికి కట్టేసి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి తరలిస్తుండగా ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నా కళ్లతో చూడు మిత్రమా! అంధుడైన స్నేహితుడిని తిరుమల కొండకు#tirumala #friends #bhakthi #inspiration
తెలంగాణ సచివాలయంలో కుక్కలను పట్టుకున్న GHMC అధికారులు #straydogs #streetdog #telanganasecretariat
గొడ్డలితో నరికి.. వితంతువు దారుణ హత్య
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11 (ఆంధ్రప్రభ): కొండపల్లి పారిశ్రామికవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది.
మంచు విష్ణుకు కాంగ్రెస్ ఫిర్యాదు
మంచు విష్ణుకు కాంగ్రెస్ ఫిర్యాదు హైదరాబాద్, ఆంధ్రప్రభ : జాతిపిత మహాత్మగాంధీపై (Mahatma
రోడ్డు పై గుంతలు పూడ్చేసిన కానిస్టేబుల్ #telugupost #Pathholes #highway #viralvideo #latestnews
అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం
తిరుచానూరు సీఐ, సునీల్ కుమార్దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద సోదాలు17 బైకులు, 13