SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

అక్రమాలకు పాల్పడితే చర్యలు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని, తప్పిదాలకు పాల్పడితే మాత్రం చర్యలు కఠినాత్మకంగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా నిబంధనల అమలులో సిబ్బంది కఠినం గా ఉండాలని ఆయన ఉద్బోధించారు. అదే సమయంలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రసక్తే లేదని ,పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనున్నారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి కనుగుణంగా ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మిల్లుల పరిశ్రమను ప్రోత్సహించేలా విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రం ధాన్యం దిగుబడిలోనే కాకుండా ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చెందిన ధాన్యం దేశచరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 25 సంవత్సరాల వ్యవధిలో ఇదే అత్యధిక రికార్డ్ అని ఆయన చెప్పారు. 2025- 26 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం పౌర సరఫరాల శాఖా రూపొందించిన ప్రణాళికలపై గురువారం బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలో అనుసరించిన విధానాల ఫలితమే ధాన్యం దిగుబడి, కొనుగోలులోనూ సంచలనాత్మక రికార్డ్ నమోదు చేసుకుందని చెప్పారు. పౌరసరఫరాల శాఖా,నీటిపారుదల, వ్యవసాయ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోనే ఇంతటి విజయం సాధించామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తెలంగాణా రాష్ట్రానికి దక్కిందన్నారు. 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : దేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేవని అన్నారు. 2020- 21 లో నమోదు అయిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రికార్డును అధిగమించి తాజాగా జరిగిన ఖరీఫ్ సీజన్ లో71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించిందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు మొట్టమొదటి సారిగా తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న బోనస్ తో కలిపి మొత్తం 18,532.98 కోట్ల రూపాయలను 14.20 లక్షల మంది రైతులకు చెల్లించామన్నారు. 

మన తెలంగాణ 23 Jan 2026 4:00 am

కోజీకోడ్‌లో కొలువుదీరిన సాహితీ నక్షత్రాలు

ఆసియాలోనే అతి పెద్దదైన కేరళ లిటరరీ ఫెస్టివల్ (కేఎల్‌ఎఫ్ )కోజికోడ్ సముద్ర తీరాన గురువారం నాడు ప్రారంభం అయింది . 25 వ తేదీ వరకు నా లుగు రోజుల పాటు జరిగే ఈ సాహిత్య ఉత్సవాలను వ్యోమ గామి సునీత విలియమ్స్, స్ప్రింటర్ బెన్ జాన్సన్ , ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ , నటి భావన తదితరులు ప్రారంభించారు. తొలి రోజు ఉదయం నుండే వివిధ అంశా ల మీద సదస్సులు కొనసాగుతున్నప్పటికీ, అధికారిక ప్రారంభోత్సవం సాయంత్రం 6 గంటలకు జ రిగింది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సు నీతా విలియమ్స్ ప్రారంభోత్సవం లో మాట్లాడు తూ ఈ సాహిత్యోత్సవానికి హాజరయిన సాహిత్యకారులను, సాహిత్యాభిమానులను చూ స్తూ ఉంటే అంతరిక్షంలో నక్షత్రాలను చూసిన సంతోషం కలుగుతుందన్నారు. ప్రకాష్ రాజ్ మా ట్లాడుతూ ఆ కాశంలో చుక్కల మధ్య విహరించిన అంతరిక్షం లో ల్యాండ్ అయిన సునీతా విలియ మ్స్‌ను చూడ టం ఎంతో స్పూర్తి కలిగిస్తూ ఉంది. అక్కడ లాండ్ అయిన ఆమె ఇక్కడ ఈ కెఎల్‌ఎఫ్ లో లాండ్ అవుతుందని నేను ఊహించలేదు. ఇక్కడకు ఆమె రావడం అద్భుతం. ఈ ఫెస్టివల్ కి వచ్చి న నటి భావన మనందరికీ స్ఫూర్తి ఫైటర్ అన్నారు . ప్రముఖ స్ప్రింటర్ బెన్ జాన్సన్ ఈ సాహిత్య సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కోజికోడు మేయర్ సదాశివన్, ఫెస్టివల్ డైరెక్టర్ కె. సచ్చితానందన్, ప్రముఖ అంతరిక్ష యాత్రికురాలు సునీత విలియమ్స్, సినీ నటులు భావన, ప్రకాష్ రాజ్ , సన్నాహక కమిటీ చైర్మన్ ఎ. ప్రదీప్ కుమార్, మంత్రులు మొహమ్మద్ రియాస్, పలనివర్ తంగ రాజన్ , గోధే జంత్రం దక్షిణాసియా డైరెక్టర్ డాక్టర్. మార్లా స్టుకెన్ బెర్గ్ తదితరులు పాల్గొన్నారు. హెరిటేజ్ ప్రాంతంగా యునెస్కో భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా గుర్తించిన పోర్ట్ సిటీ, కోజికోడులోని అరేబియా సముద్ర తీరపు ఇసుకతిన్నెల వద్ద జరుగుతున్న ఈ సాహిత్య పండుగకు, దేశ విదేశాల నుండి సుమారు ఐదు లక్షల మంది సాహిత్యం పట్ల అభిలాష ఉన్న ప్రతినిధులు హాజరవుతారని ఒక అంచనా. ఈ కెఎల్‌ఎఫ్. 8వ ఎడిషన్ భారీ సాహిత్య ఫెస్టివల్ కు ప్రముఖ కవి సాహితీ విమర్శకులు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీకి , ప్రస్తుతం కేరళ సాహిత్య అకాడమీకి డైరెక్టర్ గా వున్న ప్రొఫెసర్ కె . సచ్చిదానందన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.రచయితలు, కళాకారులు, ఫిలిం మేకర్స్,చిత్రకారులు, మేధావులు, సైంటిస్ట్ లు, సినీ నటులు ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు.మూడు వందల సెషన్లు సమాంతరంగా ఈ నాలుగు రోజులపాటు జరుగుతాయి. దేశ విదేశాల నుండి వచ్చిన 500 మంది వక్తలు వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు.డిసెంబర్, జనవరి మాసాలు దేశవ్యాప్తంగా సృజన కారుల పండుగ రోజులు. నాట్యం, సంగీతం, చిత్రకళ, శిల్పకళ, సాహిత్యం వంటి అనేక సృజన రంగాల లో నిష్ణాతులైన వారు భాగస్వాములయ్యే అనేక ఫెస్టివల్స్ తో దేశం అంతా కళకళలాడుతూ ఉంటుంది. పూణే, కలకత్తాల్లో అలాగే ఇటీవలే చెన్నైలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన, హిందూ లిటరరీ ఫెస్టివల్స్ జరిగాయి. ప్రసిద్ధి చెందిన జైపూర్ లిటరి ఫెస్టివల్ కూడా ఇటీవలే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదులో జనవరి 22 నుంచి 25 వరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (హెచ్‌ఎల్‌ఎఫ్) జరుగుతున్నది. ఆసియాలోనే అతి పెద్దదైన కె ఎల్ ఎఫ్ .పండుగకు జర్మనీని అతిథి దేశంగా ఆహ్వానించారు. కేఎల్‌ఎఫ్ ప్రాంగణంలోనే జర్మనీ పెవీలియన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా సికెఎల్‌ఎఫ్ పేరుతో కె ఎల్ ఎఫ్ ప్రాంగణంలోనే ప్రత్యెక ఏర్పాటు చేశారు. రచయితలతో సంభాషణలు, సమావేశాలు, సాంసృ్కతిక ప్రదర్శనలు, థియేటర్, సంగీతం, పుస్తక ప్రదర్శనలు, వంటి వాటి కోసం కూడా ప్రత్యేక హాల్స్ ఏర్పాటు చేశారు. 8 ప్రధానమైన ప్రాంగణాలలో సమావేశాలు జరుగుతున్నాయి. అనేక వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నా యి.18 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు సాహిత్యము, అస్తిత్వం ,అనువాదాలు, పర్యావరణ, మానవ హక్కులు ,ఆర్కిటెక్చర్, సినిమా, ఆటలు, సైబర్ సెక్యూరిటీ ,పబ్లిక్ పాలసీ వంటి అనేక విషయాల పైన ప్రసంగించనున్నారు. సునీత విలియమ్స్, కిరణ్ దేశాయ్ , అబ్దుల్ రజాక్, అభిజిత్ బెనర్జీ, గుర్నాహ్, పీకో అయ్యర్, బెన్ జాన్సన్, జిమ్మీ వాల్స్ , కిరణ్ దేశాయ్, రొమిల్లా థాపర్ వంటి ప్రముఖులు ఈ నాలుగు రోజుల సాహిత్యోత్సవం లో పాల్గొంటున్నారు. ప్రతినిధులతో కిక్కిరిసిన ప్రధాన హాల్లో మొదటి రోజు ఉదయం ప్రముఖ నటుడు, ఆలోచనపరుడు ప్రకాష్ రాజ్ అసమ్మతి ని నేరం గా పరిగణించడం (Criminalising Dissent! Who Gets LOCKED Up for Speaking Out ?) అనే అంశంపై కాన్‌ఫ్లూయెన్స్ మీడియా సిఈవో జొసీ జోసెఫ్ తో సంభాషించారు.ప్రజాస్వామిక హక్కులపై, భిన్నాభిప్రాయ పై, బహుళత్వంపై జరుగుతున్న దాడులు, నిర్బంధం గురించి, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసహనం గురించి వారు మాట్లాడారు. చివరగా పౌరసత్వ ఆందోళనలో ఎంతో ప్రాచుర్యం పొందిన హమ్ యాద్ రఖేంగే కవితతో ఆయన ప్రసంగాన్ని ముగించారు.కె . సచ్చిదానందన్,గీతా హరిహరన్ లు సంపాదకత్వం వహించిన సంకలనం The View from Hear: Storia And Poems OF Many Indiyans పుస్తకం పై సబితా సచ్చి ( కవి, సచ్చితానందన్ కూతురు) సంపాదకులు ఇద్దరితోనూ ఆసక్తికరమైన సంభాషణను నిర్వహించారు.వివిధ భాషలు, మతాలు, అస్తిత్వాలు,సంసృ్కతులలో జీవిస్తూ రాసిన రచనలను ఒక దగ్గరకు తెచ్చే ప్రయత్నం ఈసంకలనం చేసిందని వారు అన్నారు. దేశం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటుందని, మాట్లాడుతున్న వాళ్ళని ఇతరులు, బయటివారుగా పరిగణిస్తూ విమర్శిస్తున్నారని ,దేశాన్ని, ప్రజలని ప్రేమించడం వేరు నేషనలిజం పేట్రియాటిజం అనే పేరుతో జాతీయతను ఏకశిలా సదృశ్యకం చేయడం వేరని ఆయన అన్నారు. ఇండియా ఒకటే కానీ ఇండియన్స్ లో అనేక రకాల ఇండియన్లు ఉన్నారు అని గీతా హరిహరన్ చెప్పారు.దక్షిణాది భాషల పై కూడా ఒక సెషన్ జరిగింది. అనేక పుస్తకాలపై రచయితలతో విశ్లేషణాత్మక చర్చలు జరిగాయి.ముఖ్య అతిథి దేశంగా జర్మన్ పెవిలియన్ లో కూడా అనేక అంశాలపై సమావేశాలు జరుగుతున్నాయి.డిప్లమసీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎఐ, రింబరింగ్ యాజ్ రెసిస్టెన్స్: హౌవ్ జర్మనీ తదితర అంశాలపై సమావేశాలతో పాటు, జర్మనీ థియేటర్ లో నాటికలు, అనేక వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నాయి.కన్నడ, మలయాళ, తమిళ దక్షిణాది రచయితలు , బెంగాలీ, అస్సామీ, ఒరియా, కాశ్మీరీ, హిందీ, వంటి అనేక భాషల రచయితను కనపడుతున్నారు తప్ప మచ్చుకి ఒక్క తెలుగు రచయిత కూడా కనపడక పోవడం బాధాకరం. తెలుగు భాషకు కనీస ప్రాధాన్యత కూడా లేకపోవడం కొట్టోచ్చినట్టు కనిపిస్తున్న అంశం. ఈ సాహిత్య ,సాంసృ్కతిక సమ్మేళనం ఎల్లలను చెరిపివేసి, సాహిత్యకారులను కళాకారులను ఏకం చేస్తూ ఉంది.

మన తెలంగాణ 23 Jan 2026 3:30 am

‘వీబీ`జీరాంజీ’కి పాతపేరే కొనసాగించాలి ` రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ(జనంసాక్షి):జాతీయ ఉపాధి హావి పథకంలో గాంధీ పేరు తొలగించి ‘వీబీ`జీరాంజీ’పేరుతో కొత్త చట్టం తేవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పేదల పని హక్కులను హరించడమే …

జనం సాక్షి 23 Jan 2026 1:03 am

ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోండి

` బిల్లులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది ` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హామీ కొమురం భీం(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం …

జనం సాక్షి 23 Jan 2026 1:01 am

కేటీఆర్‌కు సిట్ నోటీసులు

` ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ` నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. …

జనం సాక్షి 23 Jan 2026 12:58 am

దిగుబడేకాదు.. కొనుగోళ్లలోనూ రికార్డు

` 25 సంవత్సరాలలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ` తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం ` బోనస్‌తో కలిపి చెల్లించిన మద్దతు …

జనం సాక్షి 23 Jan 2026 12:57 am

శుక్రవారం రాశి ఫలాలు (23-01-2026)

మేషం సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి. వృషభం ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిధునం అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. కన్య నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తుల ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృశ్చికం కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ధనస్సు వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. మకరం కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు నుండి బయట పడతారు. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. మీనం ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటా.  

మన తెలంగాణ 23 Jan 2026 12:10 am

22nd jan |పురాణపండ శ్రీనివాస్ చేత శ్రీమాలిక గ్రంథ ఆవిష్కరణ

22nd jan | సికింద్రాబాద్‌లో ఘనంగా బ్రహ్మోత్సవాలువేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారి కల్యాణంకళా జనార్ధనమూర్తి

ప్రభ న్యూస్ 22 Jan 2026 11:56 pm

దక్షిణ కొరియా మహిళకు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం

దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళకు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే మహమ్మద్ అఫాన్ అహమద్ ఈ మహిళను భద్రతా తనిఖీల పేరిట లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఈ నిందితుడిని అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లేందుకు టర్మినల్ 2లో ఇమిగ్రేషన్ నిబంధనలు పాటిస్తున్నప్పుడు ఈ మహిళను లైంగికంగా వేధించారు. తనిఖీలు సోదాల పేరిట అసహ్యంగా ప్రవర్తించారని వెల్లడైంది. లగేజీలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని చెప్పి సిబ్బందిలో ఓ వ్యక్తి తనను ఎవరూ లేని చోటికి మగవారి వాష్‌రూం వద్దకు తీసుకువెళ్లేందుకు యత్నించాడని మహిళ తెలిపింది. తనను హత్తుకోవడం, శరీరం తడమడం వంటి పనులకు దిగాడని తెలిపింది. తాను ప్రతిఘటించడంతో ఈ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడని పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది. అక్కడి కెమెరాల పరిశీలన తరువాత కేసు నమోదు చేశారు. వ్యక్తిని విచారిస్తున్నారు.

మన తెలంగాణ 22 Jan 2026 11:25 pm

రైతులకు ద్రోహం.. కూలీలకు అన్యాయం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ఇంతకు ముందు రైతులను మోసం చేసినట్లే, ఇప్పుడు కూలీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామి పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ను ఎత్తివేయడం వెనుక భారీ స్థాయి అన్యాయం ఉందని తెలిపారు. దేశంలో మూడు అక్రమ వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి కేంద్రం దొడ్డిదారిన యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తీసుకువస్తున్న లోపభూయిష్ట విబి జి రామ్‌జి చట్టానికి వ్యతిరేకంగా పేదలు అంతా కలిసికట్టుగా ముందుకు రావల్సి ఉందని పిలుపు నిచ్చారు. రచనాత్మక్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ రోజ్‌గార్ ఉపాధి హామీ పథకం వర్కర్ల సదస్సులో ఖర్గే ఇతరులతో కలిసి రాహుల్ గురువారం మాట్లాడారు. పేదల మేలుకోసం ఇంతకు ముందు రోజ్‌గార్ యోజనను తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు దీనిని మార్చివేశారని విమర్శించారు. ఇంతకు ముందు తీసుకువచ్చిన నల్ల సాగు చట్టాలను రైతుల సంఘటిత పోరుతో వెనకకు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో విధంగా వాటిని తిరిగి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఉపాధి పథకంతో కేంద్రమే నిధులను ఖరారు చేస్తుంది. రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఇందులో అత్యధిక భాగం ఎప్పుడూ బిజెపి పాలిత రాష్ట్రాలకే చెందుతాయని విమర్శించారు. ప్రతిదీ రాజు వంటి ప్రధాని ద్వారానే జరగాలినేదే బిజెపి పాలనలో పావు అని రాహుల్ విమర్శించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ గ్రామీణ ఉపాధి పథకం విషయాన్ని ప్రస్తావిస్తుందని పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. మహాత్మా గాంధీ పేరు లేకుండా చేశారు. పేదలకు అన్యాయం చేస్తారని హెచ్చరించారు. 

మన తెలంగాణ 22 Jan 2026 11:17 pm

Photos : Constable Kanakam Movie Success Meet

The post Photos : Constable Kanakam Movie Success Meet appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 11:17 pm

Coalition Politics or Collapse: Vijayasai Reddy’s Sharp Message to YSRCP

Former MP Vijayasai Reddy has sent a blunt message to YSR Congress Party chief Y. S. Jagan Mohan Reddy. He stated that Jagan has no chance of returning to power unless the present political alliance in Andhra Pradesh is weakened. According to him, padayatras and public campaigns will not deliver results. He said, electoral success […] The post Coalition Politics or Collapse: Vijayasai Reddy’s Sharp Message to YSRCP appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 11:08 pm

అమరావతిలో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్

డబ్ల్యూఈఎఫ్ సదస్సులో మంత్రి నారా లోకేశ్విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. నైపుణ్యాలు, కొలాబరేషన్ ద్వారా క్వాంటం ఆవిష్కరణలను వేగవంతం చేయడం అనే అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిగిన సదస్సులో మంత్రి లోకేశ్ ప్రసంగిస్తూ… క్వాంటం ఇండెక్స్ 2025 ప్రకారం 2018 నుంచి క్వాంటం నైపుణ్య అవసరాలు దాదాపు మూడు రెట్లు […] The post అమరావతిలో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 11:04 pm

పరస్పర సహకారంతోనే… రేవంత్, లోకేశ్ మాటా మంతి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. మంత్రి లోకేశ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కూడా సత్కరించారు. ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి […] The post పరస్పర సహకారంతోనే… రేవంత్, లోకేశ్ మాటా మంతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 11:02 pm

Is Aamir Khan Married Again?

Bollywood Superstar Aamir Khan and Gauri Spratt have been dating each other for a while. Aamir confirmed about his relationship publicly last year. Now, they are poised to progress in their relationship. Allegedly, Aamir and Gauri have settled into a new place together in Mumbai. In an interview, Aamir expressed, “In my heart, I’m already […] The post Is Aamir Khan Married Again? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 11:00 pm

రిపబ్లిక్ డేలో మహిళా అగ్నివీర బాండ్

న్యూఢిల్లీ : ఈసారి గణతంత్ర దినోత్సవంలో తొలిసారిగా అగ్నివీర్ మహిళా దళం ద్వారా వాయుసేన బాండ్ పాల్గొంటుంది. ఇందులో తొమ్మండుగురు మహిళా అగ్నివీరులు పాలుపంచుకుంటారు. ఈ మహిళా బృందం వాయిద్యాలు ఆలాపిస్తూ కర్తవ్యపథ్‌లో ముందుకు సాగుతారు. తరువాత జరిగే సైనిక , ఇతరత్రా ప్రదర్శనలకు ఆరంభం పలుకుతారు. ఐఎఎప్ బాండ్‌కు సెర్జెంట్ ఛార్లెస్ ఆంటోని డేనియల్ నాయకత్వం వహిస్తారు. 144 మందితో కూడిన కవాతు బృందం వాయుసేన తరఫున పాల్గొంటుంది. గణతంత్రం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంబడి నిలిచి జాతీయ పతాకాన్ని ఫ్లెయిట్ లెఫ్టినెంట్ అక్షిత ధన్‌కర్ ఎగురవేస్తారని వాయుసేన తెలిపింది. 

మన తెలంగాణ 22 Jan 2026 10:59 pm

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – 16 మంది మావోయిస్టుల మృతి

మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడువిశాలాంధ్ర-చింతూరు: జార్ఖండ్ అడవుల్లో తుపాకుల మోత మోగింది. ఎన్‌కౌంటర్ పేరుతో మరో 16 మందిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. రాష్ట్రంలోని చోటా నాగపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంభాది సమీపంలోని సారండా అడవుల్లో గురువారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకార్పులు జరిగాయి. మోస్ట్ వాంటెడ్ కేంద్ర కమిటీ సభ్యుడు, పతిరామ్ మాంజి అలియాస్ అనల్ దాదాతో పాటు 16 మంది ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సీఆర్పీఎఫ్ డీఐజీ అనురంజన్ కిస్పోట్టా, […] The post జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – 16 మంది మావోయిస్టుల మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:58 pm

రెండు లైన్ల ప్రసంగం… వాకౌట్

. కర్నాటక గవర్నరు తీరూ అదే. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: సిద్ధరామయ్య బెంగళూరు: కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాత్ రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి చేసిన రెండు లైన్ల ప్రసంగం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం గెహ్లాత్ రాష్ట్ర శాసనసభ ఉమ్మడి సమావేశంలో తన సంప్రదాయ ప్రసంగాన్ని రెండు ప్రారంభ పంక్తులు మాత్రమే చదివి ముగించారు. సభ్యులను పలకరించిన తర్వాత గవర్నర్… ‘ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక, […] The post రెండు లైన్ల ప్రసంగం… వాకౌట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:53 pm

మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైదేశవ్యాప్త ప్రచారోద్యమం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మరో వంద సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చేలా సీపీఐ శతవార్షికోత్సవాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరిగాయని పార్టీ జాతీయ కార్యదర్శి కే రామకష్ణ పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముగింపు వేడుకలపై ఆయన మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గసభ్యులు రావుల వెంకయ్య, ఏపీ కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పాల్గొన్న ఈ సమావేశంలో రామకష్ణ మాట్లాడుతూ […] The post మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైదేశవ్యాప్త ప్రచారోద్యమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:50 pm

కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ గ్లింప్స్ విడుదల

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్‌ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినిదత్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ “కోవెలమూడి సత్య సాయిబాబా తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ చేశారు. ప్రశాంత్ కుమార్ అద్భుతంగా తెరకెక్కిస్తున్న కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. 

మన తెలంగాణ 22 Jan 2026 10:48 pm

ట్రంప్ శాంతి మండలికిభారత్, చైనా, ఫ్రాన్స్ దూరం

నిర్ణయం తీసుకోని ఇటలీ, రష్యా, టర్కీ, ఉక్రెయిన్సభ్యులుగా చేరిన పాక్, యూఏఈ సహా 35 దేశాలు దావోస్/న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి మండలి అధికారికమైంది. దావోస్‌లో ప్రపంచా ఆర్థిక ఫోరం సందర్భంగా ట్రంప్ సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. పాకిస్థాన్, అజర్‌బైజన్, యూఏఈ సహా 35 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. భారత్, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్, జర్మనీ వంటి కీలక దేశాలు ఈ మండలిలో చేర లేదు. సంతకాలకు దూరంగా ఉన్నాయి. ఇటలీ, […] The post ట్రంప్ శాంతి మండలికిభారత్, చైనా, ఫ్రాన్స్ దూరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:44 pm

పారిశ్రామిక ప్రగతి వేదిక దావోస్

. ఆయా రంగాల్లో మార్పులు, ఆలోచనలు పంచుకునే అవకాశం. చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ. ముగిసిన 4 రోజుల పర్యటన`నేడు హైదరాబాద్ రాక విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా నిలిపేందుకు, కొత్త పాలసీలపై మార్కెట్ స్పందన అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 2025 […] The post పారిశ్రామిక ప్రగతి వేదిక దావోస్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:42 pm

ఆస్ట్రేలియా టౌన్ కాల్పుల్లో ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలోని లేక్ కార్గిలిగో పట్టణంలో గురువారం కాల్పుల ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. న్యూ సౌత్ వేల్స్‌లో దాదాపు 1500 మంది జనాభాతో ఉండే చిన్నపట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. కేవలం రెండు వీథులతో ఉండే ఈ టౌన్‌లో ఇప్పుడు భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించుకుని ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఆస్ట్రేలియా జాతీయ సంతాప దినం నాడే కాల్పుల ఘటన జరిగింది. ఆస్ట్రేలియాలో అప్పుడప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. సిడ్నీలో డిసెంబర్ 14వ తేదీన సాయుధులు జరిపిన కాల్పుల్లో కనీసం 15 మంది చనిపోయారు.

మన తెలంగాణ 22 Jan 2026 10:22 pm

నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ పాలన వరకు..వేల ఫోన్లు పోలీసులు వింటూనే ఉన్నారు: కెటిఆర్

దేశానికి ప్రధానిగా నెహ్రూ ఉన్నకాలం నుంచి నేటి ప్రధాని మోడీ పాలన వరకు దేశభద్రత, శాంతి భద్రతలు, ప్రభుత్వాల రక్షణకు పోలీసులు వేల సంఖ్యలో ఇతరుల ఫోన్లు వింటారని, ఇది పోలీసులకు నిత్యకృత్యమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ అన్నారు. గురువారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం సిట్ ముందు హజరు కావాలని గురువారం కెటిఆర్‌కు నోటిసులు ఇచ్చిన అంశంపై కెటిఆర్ స్పందించారు. శుక్రవారం తప్పకుండా సిట్ ముందు హజరవుతానన్నారు. తనను ఎందుకు పిలిచారో తెలియదన్నారు. సిఎం రేవంత్‌రెడ్డికి దావోస్‌లో ఉన్నా ఇక్కడ డిప్యూటి సిఎం తన సీటును కాజేస్తారని, నల్లగొండ బాంబులతో మంత్రులు తన సీటుకు ఎసరు పెడతారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రోజుకొకరికి నోటీసులిచ్చి కాలక్షేపం చేస్తున్నారన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనేదే సిట్ అన్నారు. కార్తీక దీపం సీరియల్‌గా ఇదెంత కాలం సాగుతుందో తెలియదన్నారు. ఇప్పటికే రెండేళ్లలో రేవంత్ రెడ్డి హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలు చేయాలని కోరడంతో బుధవారం హరీష్‌రావుకు, గురువారం తనకు సిట్ నోటీసులిచ్చారన్నారు. రెండేళ్లుగా కాళేశ్వరమని, గొర్రెల స్కామని, ఫోన్ ట్యాపింగని ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారన్నారు. హరీష్‌రావు సింగరేణి బొగ్గు కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్, బిజేపి నాయకులు కుమ్ముక్కై వందల కోట్లు కాజేశారని, అర్హత లేకున్నా సిఎం బావమరిది సృజన్‌రెడ్డికి అమృత్ పథకం కాంట్రాక్ట్ ఇచ్చారని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు భూ ఆక్రమణలపై ఆధారాలతో బయట పెట్టినందుకే సిట్ నోటీసులిచ్చారన్నారు. తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తేనే సిబిఐ విచారణ చేస్తామనడం చూస్తే దొంగ తనపై విచారణ కోరాలననట్టు ఉందన్నారు. కంచె గచ్చిబౌళిలో 10 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని సాక్షాత్తూ సెంట్రల్ ఎంపవర్‌మెంట్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఎందుకు విచారించడం లేదన్నారు. ప్రధాని మోడీ స్వయంగా రాష్ట్రంలో ఆర్‌ఆర్ టాక్స్ (రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ) వసూలవుతుందన్నారని, మరి ఎందుకు విచారించడం లేదన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటిఎంలా మారిందన్నారని.. దానిపై ఎందుకు విచారించడంలేదన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వెంకటరెడ్డిలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని బహిరంగంగా ప్రకటిస్తే.. దానిపై ఎందుకు విచారించడం లేదన్నారు. ఓ సన్నాసి ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి కుట్ర చేస్తున్నాడని, 50 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకుని ఎంఎల్‌ఏలను కొనుగోలు చేస్తున్నాడని తెలిస్తే, ఏ వెధవో ప్రభుత్వాన్ని కూలగొడతానంటే పోలీసులు ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చని, గూఢచర్యం అనేది నిరంతర ప్రక్రియని అంటూ, దానికీ రాజకీయ నాయకులకు ఏం సంబంధం ఉందన్నారు. అవసరమైతే ఆనాడు ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఇప్పటి డిజిపి శివధర్‌రెడ్డిని సిట్ పిలవాలని, లేదంటే అప్పటి డిజిపిలు మహేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రవిగుప్తాలను పిలిచి అడగాలని, తమనెందుకు పిలుస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అధికారంలోఉన్నవారికి ప్రధానంగా సిఎంలకు సమాచారం పోలీసులు గూఢచర్యం చేసి అందిస్తారని, అదేలా వచ్చిందో ఎవరికి చెప్పరన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతలుగా ఉన్న తమ ఫోన్లు ట్యాప్ చేయడం లేదని అధికారులు ప్రమాణ పూర్వకంగా చెప్పగలరా? అని కెటిఆర్ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసనేది లొట్టపీసుకేసు, బక్వాస్ కేసు, ట్రాష్ కేసని, అడిగిందే పలుసార్లు అడుగుతారని మళ్లీ అదే చెపుతామని, ఇది పూర్తిగా రాజకీయ వేధింపుల కుట్ర అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. పోలీసులను బలి పశువులను చేసే చర్య అన్నారు. త్వరలో తమ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సిఎం కాగానే తాము కూడా కాంగ్రెస్ నేతల అక్రమాలపై విచారణ చేపట్టక తప్పదన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి హయాంలో ఫోన్‌ల ట్యాపింగ్ జరగడంలేదా? అన్నారు. తమకు నోటీసులిస్తే రేవంత్‌రెడ్డి దావోస్‌లో రెండుగంటలపాటు శునకానందం పొందుతాడేమో కాని తమకేమీ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని రకాలుగా వేధించాలని చూసినా తాము మాత్రం ప్రజల పక్షాన ఉంటామని, కాంగ్రెస్ బిజేపిల సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని వదలమని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలయ్యేంత వరకూ ఊరుకోమని కెటిఆర్ హెచ్చరించారు.

మన తెలంగాణ 22 Jan 2026 10:20 pm

జార్ఖండ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రక్కును ఢీకొని దూసుకెళ్లిన రైలు

జార్ఖండ్ లో నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం నాడు గోండా - అసన్సోల్ ఎక్స్ ప్రెస్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. కానీ, జసిదిహ్ -అసన్సోల్ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారి తెలిపారు. తూర్పు రైల్వే జోన్ పరిధిలోని అసన్సోల్ రైల్వే డివిజన్ లోని జాసిదిహ్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ట్రక్కు కాస్త దెబ్బతిన్నా, ఆ ప్రాంతంలో ఉన్న రెండు మోటర్ సైకిళ్లు మాత్రం దెబ్బతిన్నాయి.

మన తెలంగాణ 22 Jan 2026 10:19 pm

భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు

గురువారం వెండి ధర కిలోకు సుమారు రూ.19,000 తగ్గి రూ.2.99 లక్షలకు చేరింది. బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.3,099 తగ్గి రూ.1.51 లక్షలకు వచ్చింది. ఇటీవల భారీ పెరుగుదల తర్వాత లాభాల బుకింగ్, స్టాక్ మార్కెట్ ర్యాలీ, భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. కొత్త పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూడాలని సూచిస్తున్నారు. 2025లో బంగారం 75 శాతం, వెండి 167 శాతం పెరిగాయి. 

మన తెలంగాణ 22 Jan 2026 10:14 pm

గీతం యూనివర్శిటీకి హైకోర్టు షాక్

రాష్ట్ర హైకోర్టు సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీకి షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల్లో రూ. 59.65 కోట్లు మూడు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. గీతం యునివర్శిటిపై ఎస్‌పిడిసిఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. యూనివర్శిటీ చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో సగం చెల్లించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, గీతం యునివర్శిటీకి చెందిన విద్యుత్ బకాయిలు రూ. 118.13 కోట్ల రూపాయలు చెల్లించడంలేదంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో ఎస్‌పిడిసిఎల్ నోటీసులు జారీ చేసింది. దీనిపై యునివర్శిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మాదవి దేవి గీతం యూనివర్శిటీకి విద్యుత్ కనెక్షన్ పునరుద్దరించాలని ఎస్‌పిడిసిఎల్‌ను ఆదేశించింది. దీనిపై ఎస్‌పిడిసిఎల్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించడానికి ముందస్తు షరతుగా మూడు వారాల్లోగా మొత్తం విద్యుత్ బకాయిలలో సగం విద్యుత్ సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది.

మన తెలంగాణ 22 Jan 2026 10:10 pm

సింధు అరుదైన రికార్డు

జకార్తా: భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నయా చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా సూపర్ 500 మాస్టర్స్ టోర్నమెంట్‌లో సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 500వ విజయాన్ని అందుకుంది. ఓ భారత షట్లర్ 500 విజయాల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా 500వ విజయం సాధించిన ఆరో షట్లర్‌గా సింధు నిలిచింది. కాగా, గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో సింధు 2119, 2118తో డెన్మార్క్‌కు చెందిన హోజ్‌మార్క్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో లక్షసేన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో సేన్ 2110, 2111తో హాంకాంగ్ ఆటగాడు జాసన్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు.

మన తెలంగాణ 22 Jan 2026 10:09 pm

మనీ లాండరింగ్ కేసులో రవి ప్రకాష్‌కు కోర్టు షాక్

ఓ చానెల్ మాజీ సిఇఓ రవి ప్రకాష్‌కు మనీలాండరింగ్ కేసులో నాంపల్లి సెషన్స్‌కోర్టు షాక్ ఇచ్చింది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఇడి నమోదు చేసిన కేసులో ముద్దాయిగా గుర్తిస్తూ రవి ప్రకాష్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. రవి ప్రకాష్ ఓ చానెల్‌కు సిఇఓగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు చెందిన రూ. 18 కోట్లకు పైగా డబ్బులను కంపెనీ ఖాతా నుండి విత్ డ్రా చేశారని, వాటికి లెక్కలు చూపలేదని ఆరోపిస్తూ ఇడి కేసు నమోదు చేసింది. అయితే తనపై నమోదైన కేసులో ఇడి విచారణకు హాజరుకాకుండా రవి ప్రకాష్ తప్పించుకుని తిరుగుతున్నాడనే కారణంతో మరో కేసు ఇడి నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి సెషన్స్ కోర్టు రవి ప్రకాష్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారం రోజుల పాటు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది.

మన తెలంగాణ 22 Jan 2026 10:00 pm

ఇండియా-పాక్ వార్ నేపథ్యంలో ’బార్డర్ 2’.. ఆ దేశాల్లో విడుదలకు నో

సన్నీడియోల్ హీరోగా నటించిన ‘బార్డర్ 2’ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ వార్ డ్రామాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ’బార్డర్ 2’ మూవీ గల్ఫ్ దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుందని తెలుస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రేన్ వంటి దేశాల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పలు సన్నివేశాలు ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 1971లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ’బార్డర్ 2’ సినిమా మొదటి భాగంతో పోలిస్తే విస్తృతమైన కథాంశంతో వస్తోంది. 

మన తెలంగాణ 22 Jan 2026 9:36 pm

ట్రంప్‌పై నిరసనలు.. సరుకులకు ఉరుకులు

న్యూక్: గ్రీన్‌లాండ్ అమెరికాకు కావల్సిందేనని ట్రంప్ ప్రకటించడంతో గ్రీన్‌లాండ్‌లో కలవరం చెలరేగింది. అక్కడి ప్రభుత్వం పౌరులకు అత్యవసర జాగ్రత్త చర్యలకు సమాయత్తం చేసింది. పౌరులు చాలినంతగా ఆహారం, మంచి నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలతో సిద్ధంగా ఉండాలని ఇంగ్లీషు, స్థానిక గ్రీన్‌ల్యాండిక్ భాషలో కరపత్రం వెలువరించారు. తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిపారు. సంక్షోభం ఏర్పడుతుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో పౌరులు దుకాణాలకు వెళ్లి తమకు అవసరం అయిన వస్తువులు కొనుకుంటున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఏదో విధంగా స్వాధీన పర్చుకోవడమే ట్రంప్ తంతు అన్పిస్తోందని స్దానిక పౌరుడు జాకోబ్‌సెన్ మండిపడ్డారు. ప్రపంచ స్థాయి సదస్సు నుంచి ట్రంప్ ప్రేలాపనలు తమక సహించలేని విధంగా ఉన్నాయని నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్‌వి బెదిరింపులే కావచ్చు. అయితే మనం అంతా సిద్ధంగా ఉండకుండా వ్యవహరించడం కన్నా సిద్ధంగా ఉండటం మంచిదని తెలిపారు. 

మన తెలంగాణ 22 Jan 2026 9:22 pm

సిసి కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

 రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌పై మరింత కట్టుదిట్టమైన నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల జారీ చేయనున్నారు.- ఈ పరీక్షలకు సుమారు 4 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. సిసి కెమెరాలు ఉన్న కాలేజీ ల్యాబ్‌లకే ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు సెంటర్లు కేటాయించనున్నారు. కార్పోరేట్, ప్రైవేట్ కాలేజీలు స్వతహాగా సిసి కెమెరాలు అమర్చుకున్నారు. ప్రభుత్వ కాలేజీలలో అమర్చిన సిసి కెమెరాలతో పాటు ప్రైవేట్ కాలేజీలలో ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయించే ల్యాబ్‌ను కూడా ఇంటర్ బోర్డ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేస్తున్నారు.ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం అయినందున వాటిల్లోనే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణతో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారు. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు కూడా ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షిస్తారు. పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా థీయరీపైనే దృష్టి సారించి, ప్రాక్టికల్స్‌ను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో అవసరమైనా సామాగ్రి లేకపోవడం, మరికొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కొన్ని కాలేజీలు ప్రాక్టికల్ పరీక్షలో తమ విద్యార్థులు పూర్తి మార్కులు కేటాయిస్తుందన్న ఆరోపణల నేసథ్యంలో పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ర్యాంకుల పందేరంలో ప్రాక్టికల్స్ మార్కులే కీలకం. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఎంపిసి వారికి 60 మార్కులు, బైపిసి వారికి 120 మార్కులు ఉన్నాయి. ఒక్క మార్కు తేడాతో కూడా ర్యాంకులు తారుమరవుతుంటాయి. దాంతో ర్యాంకుల పోటీలో ప్రతి మార్కూ కీలకంగానే మారుతుంది.

మన తెలంగాణ 22 Jan 2026 9:20 pm

మేడారంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి సీతక్క

మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ మంత్రి దనసరి అనసూయ పిలుపునిచ్చారు. గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు.. ప్రస్తుతం ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్‌పై రావడానికి సిద్ధమవుతున్నారన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ నిర్వహించనున్న హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధాకాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు, మేడారం నుండి హనుమకొండ కు వెళ్లేందుకు అతి తక్కువ ధరలలో ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించిందన్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ద్వారా పర్యటించడానికి 4 వేల 8 వందల రూపాయల టికెట్‌ను ఖరారు చేశారని వివరించారు. గతంలో మహా జాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతోపాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 251 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. గురువారం నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ నిర్వహిస్తుంది. బుకింగ్ కొరకు మొబైల్ నెంబర్ 9676320139, 8530004309, 7660939509 వెబ్‌సైట్ డబ్లుడబ్లుడబ్లు . హెలితాక్సియ్.కామ్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈద్గా ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క.... జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి సుమారు రూ.15 లక్షలతో నిర్మించిన ఈద్గా ప్లాట్ ఫామ్ మంత్రి సీతక్క ప్రారంభించారు. ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మైనారిటీల కోసం మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ప్రజా ప్రతినిధులు, మైనార్టీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 22 Jan 2026 9:10 pm

వాయిదా పడిన ’స్వయంభు’

పాన్ -ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ’స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. భారతదేశపు వైభవమైన చరిత్రను, మహోన్నతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని ఇంతకు ముందు ప్రకటించారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడినట్టుగా తెలిసింది. స్వయంభూ సినిమాలో గ్రాఫికల్, వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయట. వాటి కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట మేకర్స్. దీంతో ఈ సినిమా వాయిదా పడిందని సమాచారం. అయితే మార్చి చివరన లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.

మన తెలంగాణ 22 Jan 2026 9:02 pm

సింగరేణి తెలంగాణ ప్రజల హక్కు..సంస్థను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం: కొప్పుల ఈశ్వర్

 రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్,కేంద్రంలో ఉన్న బిజెపి ఒక్కటే అని, అందుకే సింగరేణి టెండర్ల వ్యవహారంలో విచారణ చేపట్టడం లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సింగరేణి టెండర్లలో జరిగిన అవినీతిలో ముఖ్యమంత్రి బామ్మర్ది కీలకం అని తెలుస్తుందని, ఈ వ్యవహారంలో సిఎం విచారణకు కోరుతారా..? అని ప్రశ్నించారు.కాంగ్రెస్, బిజెపి కబంధ హస్తాల నుండి సింగరేణిని కాపాడడం కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. సింగరేణి సంస్థ కాంగ్రెస్ పార్టీది కాదు....బిజెపిది కాదు అని, ఆ సంస్థ తెలంగాణ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సింగరేణి బచావో పేరు మీద ఉద్యమం చేస్తామని చెప్పారు. నైని బ్లాక్ ఒక్కటే కాదు...మొత్తం టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు బ్లాకుల కుంభకోణంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని అన్నారు. ఈ కుంభకోణంపై తమ నేత హరీష్ రావు ఆధారాలతో బయట పెట్టడంతో నైని టెండర్లు రద్దు చేశారని పేర్కొన్నారు. మిగతా బ్లాకుల టెండర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సింగరేణి అంటే ఒక్క బొగ్గు బ్లాక్ కాదు అని, అనేక మంది కుటుంబ సభ్యుల భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. స్వయాన ముఖ్యమంత్రి బావమర్ది ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈ కుంభకోణం అని తెలుస్తోందని పేర్కొన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి గురించి ఆలోచించారని అన్నారు. ఈ బొగ్గు కుంభకోణం బయట పెడితే హరీష్ రావును సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెట్టారని మండిడ్డారు. సింగరేణి టెండర్ల విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సైట్ విసిట్ సర్టిఫికేషన్ అనేది ముఖ్యమంత్రి బామ్మర్ది మేలు కొరకే పెట్టారని ఆరోపించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మైనస్‌లలో టెండర్లు జరిగేవి అని, ఇప్పుడు ప్లస్‌లలో టెండర్ల ప్రక్రియ జరుగుతుంది అంటే కుంభకోణం జరిగినట్లే కదా..? అని అడిగారు. మంత్రుల మధ్య వాటాల పంపిణీ తేడాతోనే ఈ కుంభకోణం బయటకు వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

మన తెలంగాణ 22 Jan 2026 9:00 pm

ఆర్మీ వాహనం లోయలో పడి పది మంది సైనికులు మృతి

ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లుతున్న సైనిక బృందం ఘోర ప్రమాదానికి గురైంది. విధి నిర్వహణలో ఉన్న పది మంది సైనికులు చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లా పర్వత ప్రాంతాలలో జరిగింది. సైనిక అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల గాలింపు కోసం సైనిక బృందం కాస్పెర్ సాయుధ శకటంలో వెళ్లుతుండగా, అదుపు తప్పింది. రాహదారి పక్కనే ఉన్న 200 అడుగుల లోతున్న లోయలోకి దూసుకువెళ్లింది. దాదాపు 9000 అడుగుల ఎతైన అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణుల మధ్య ఖన్ని శిఖరంపై వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. ఇక్కడి బదేర్‌వా ఛాంబా అంతరాష్ట్ర రాదారిలో ఈ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ప్రమాదానికి గురయింది. కాస్పెర్ శకటం అత్యంత సురక్షిత ఎంఆర్‌ఎపి వాహనం. మందుపాతరల పేల్లుళ్లు, దాడులను తట్టుకుని నిలబడగలిగే దుర్భేధ్యపు అమరికతో రూపొందింది. వాతావరణ ప్రతికూలతలను తట్టుకుంటూ , ఎటువంటి ఐఇడి పేలుళ్లకు అయినా దుర్భేధ్యంగా నిలుస్తుంది. వాతావరణ ప్రతికూలతతో అత్యంత ఇరుకైన కొండచరియల మధ్య సరైన నేవిగేషన్ వీలుకాకపోవడంతో ఈ శకటం రోడ్డు నుంచి జారిపోయి లోయలో పడిందని జమ్మూ కేంద్రంగా ఉన్న వైట్‌నైట్ కార్ప్ విభాగం తమ ప్రకటనలో తెలిపింది. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని, తోటి జవాన్లు విషాదాంతం చెందడం బాధాకరం అని సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఘటనా స్థలికి సైనికులు, పోలీసుల సంయుక్త దళాలు తరలివచ్చాయి. లోయలో చెల్లాచెదరుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించి వెలికితీసే పని చేపట్టాయి. ముందుగా గాయపడ్డ వారిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారు. వాహనం పూర్తిగా ధ్వంసం అయి ఉండగా వెలికితీశారు. మొత్తం పది మంది జవాన్ల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన తమకు అత్యంత బాధాకరం అని ఇక్కడి పోలీసు అదనపు సహాయ కమిషనర్ సుమిత్ కుమార్ భూట్యాల్ తెలిపారు. ఈ విషాద ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్ ఇతరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండర్ తరఫున ఈ జవాన్ల మృతి పట్ల సంతాప సందేశం వెలువడింది. జనరల్ ఆఫీసరు కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 8:57 pm

ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి

జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్బూమ్ జిల్లాలో గురువారం భారీ స్థాయి ఎన్‌కౌంటర్ జరిగింది. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కోబ్రా దళం దాడిలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. తలపై రూ కోటి పారితోషికం ప్రకటితం అయి ఉన్న అగ్రస్థాయి నక్సల్ పత్రీరామ్ మాజీ అలియాస్ అనల్‌దా కూడా మృతుల్లో ఉన్నాడు. దాదాపు 1500 మందితో కూడిన సుశిక్షిత కోబ్రా దళం నక్సలైట్ల గాలింపు చర్యలలో వెళ్లుతుండగా సరందా అటవీ ప్రాంతంలోని కుమ్దీ వద్ద ఎదురు కాల్పుల ఘటన జరిగిందని , ఇది కిరిబురా పోలీసు స్టేషన్ పరిధిలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. నక్సల్స్ పూర్తి స్థాయి నిర్మూలన లక్షంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో పెద్ద ఎత్తున నక్సల్స్ గాలింపు చర్యలు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ భారీ స్థాయి కోబ్రా చర్య జరిగింది. భారీ పటాలంతో కోబ్రా బలగాలు ఈ ప్రాంతంలో మంగళవారం నుంచే తమ ఆపరేషన్ ఆరంభించాయి. అయితే గురువారం అడవుల్లో పొంచి ఉన్న నక్సలైట్ల వైపు నుంచి ముందుగా కాల్పులు ఎదురయ్యాయని, తమ వైపు నుంచి ప్రతి చర్య జరిగిందని అధికారులు తెలిపారు. ఈ తరువాత ఇక్కడ జరిపిన గాలింపులో 15 మంది మావోయిస్టుల భౌతిక కాయాలను గుర్తించామని వెల్లడించారు. వీరిలో ఒకరిని మావోయిస్టు కీలక నేత అనల్ దా అని గుర్తించామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఆపరేషన్స్) మైకెల్ రాజ్ ఎస్ వార్తా సంస్థలకు తెలిపారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారం ఎక్కువగా ఉందని సమాచారం అందింది. వీరిలో నక్సల్స్ అగ్రనేత కూడా ఉన్నారని నిర్థారణ అయిందని, దీనితో తాము గాలింపులు ఉధృతం చేశామని వివరించారు. గిరిధ్ జిల్లాలోని పిర్తాంద్‌కు చెందిన పత్రీరామ్ మావోయిస్టు దళంలో 1987 నుంచి చురుకుగా పనిచేస్తున్నాడు. ఆయనపై కోటి రూపాయిల రివార్డు ప్రకటించారు. ఆయన కోసం చాలా సంవత్సరాలుగా గాలిస్తున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలియగానే ఈ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తమ బృందంతో ఛాయ్‌బసా ప్రాంతంలో పర్యటించారు. కోబ్రా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో గాలింపు చేపట్టారు. నక్సలైట్లు మరింత ఎక్కువ సంఖ్యలోనే చనిపోయి ఉంటారని , ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో చాలా వరకూ నక్సల్స్ నిర్మూలన జరుగుతోంది. కొల్హాన్, సరందాలు వీరికి మిగిలిన చివరి స్థావరాలు అని వెల్లడైంది. జార్ఖండ్‌లోని బుడా పహాడ్, ఛత్రా , లాటేహర్ , గుమ్లా, రాంచీ , పరాసంత్ ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టుల ఏరివేత దాదాపు పూర్తి అయింది. ఇప్పుడు మిగిలిన కంచుకోట వంటి ఈ ప్రాంతంపై కూడా కోబ్రా దళాలు విరుచుకుపడ్డాయి.ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. 

మన తెలంగాణ 22 Jan 2026 8:52 pm

2022 |అప్పుడు పంపించారు..మళ్ళీ పిలిపించారు..అదే ఐఏఎస్ అధికారికి మళ్లీ కీలక పదవి

2022 | త్యాగరాజ్ స్టేడియం వివాదం: 2022 | సంజీవ్ ఖిర్వార్ పేరు

ప్రభ న్యూస్ 22 Jan 2026 8:46 pm

నైనీ టెండర్లపై రాష్ట్రం కోరితే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధం:బిజెపి రాంచంద్రరావు

సింగరేణి నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. సీబీఐ ద్వారా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలం నుండి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం గురువారంఒ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర కమిటీల పనితీరుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలల ఫలితాలను సమీక్షించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని రాంచందర్ రావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అనుబంధ విభాగాల పనితీరుపై కూడా రాంచందర్ రావు సమీక్ష చేశారు. బిజెపి అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గతంలో దావోస్ పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో, అనే విషయాలు ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికి రెండుసార్లు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 8:40 pm

విజయ్ పార్టీ ఎన్నికల గుర్తు విజిల్!

తమిళనాడులో సినీనటుడు, రాజకీయనాయకుడు విజయ్ ఆధ్వర్యంలోని పార్టీ తమిళగ వెట్రి కజగం ఎన్నికల చిహ్నంగా విజిల్ ను కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నెలకొంది. టివికె కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఉత్సాహం చూపుతున్నారని, సీనియర్ నాయకుడు సిటిఆర్ నిర్మల్ కుమార్ గురువారం తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన 10 చిహ్నాలలో విజయ్ ఎంచుకున్న విజిల్ గుర్తుకే ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపినట్లు తమిళగ వెట్రి కజగం జాయింట్ సెక్రటరీ కుమార్ వివరించారు.విచిత్రం ఏమిటంటే, 2024లో విజయ్ నటించిన గోట్ చిత్రంలో విజయ్ విజిల్ పాడు (విజిల్ వేయి) అనే పాట పాడతాడు. ఆచిత్రం, ఆ పాట సూపర్ హిట్ అయ్యాయి. ఆ పాటలో తాను రాజకీయాలలోకి వస్తానని విజయ్ సూచన ప్రాయంగా తెలిపారు. అంతే కాదు, గతంలో విజయ్ బిజిల్ అనే చిత్రంలో నటించారు. దాని అర్థం విజిల్ అనే.రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్ల తర్వాత 2026 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు విజయ్ ఆధ్వర్యంలోని టివికి పార్టీకి తొలి ఎన్నికల పోరుగా కుమార్ వర్ణించారు. రానున్న ఎన్నికల్లో విజిల్ మారు మోగుతుందని, టివికె ఘనవిజయం సాధించి, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రస్థానం మొదలవుతుందని కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 8:40 pm

Will Prabhas Realize Raja Saab Mistakes?

Raja Saab is one of the costliest mistakes made in Telugu cinema. For the film’s genre and the concept, there is no need to spend hundreds of crores on the film. The shoot was also delayed by years because of other commitments of Prabhas. Even the hardcore fans of Prabhas felt that a big amount […] The post Will Prabhas Realize Raja Saab Mistakes? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 8:34 pm

గ్రూప్ 1 పరీక్షలపై తీర్పు ఇంకా సిద్దం కాలేదు

గ్రూప్ 1 పరీక్షల తుది తీర్పుపై ఇంకా ఉత్కంఠత వీడలేదు. గురువారం వెల్లడించాల్సి ఉండగా, తుది తీర్పు సిద్దంగా లేకపోవడంతో ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మెహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. మొయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం తుది మార్కుల జాబితాతో పాటు ప్రకటించిన ర్యాంకుల జాబితా రద్దు చేస్తూ, పరీక్షా పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని, అది సాధ్యం కాకపోతే మరల పరీక్షలు నిర్వహించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును టిజిపిఎస్‌సితో పాటు గ్రూప్1కు ఎంపికయిన అభ్యర్థులు సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. వీటిపై అత్యున్నత ధర్మాసనం విచారించి తుది తీర్పునకు లోబడే నియామకాలు జరగాలని స్పష్టం చేస్తూ వాదనలు ముగించింది. అయితే తరువాత రాష్ట్ర ప్రభుత్వం 563 మందికి గ్రూప్1 నియామకపత్రాలు అందచేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేయడంతో తుది తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది.

మన తెలంగాణ 22 Jan 2026 8:23 pm

బిఆర్‌ఎస్ బాటలోనే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

 తెలంగాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు సింగరేణి నష్టాల బాట పట్టి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందని, ఇందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం పూర్తిగా సింగరేణిపై అజమాయిషీ చేసిందని, బోర్డు కేవలం నామమాత్రంగా మారిందని విమర్శించారు. టెండర్ల నుంచి చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబ ఆదేశాలే అమలయ్యాయని, రాజకీయ జోక్యంతో సింగరేణిని సమస్యల్లోకి నెట్టారని విమర్శలు దాడి చేశారు. ఈ విషయం తెలంగాణ సమాజానికీ, సింగరేణి కార్మికులకూ బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బిఆర్‌ఎస్ హయాంలోనే కాకుండా గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర అవుతోందని, సింగరేణిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఖర్చు తగ్గింపుపై నివేదిక సిద్ధం చేయించామని వివరించారు. ఆ నివేదికపై సింగరేణి అధికారులతో చర్చించి సంస్థ ఆర్థిక పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. ఈ అంశాలన్నింటినీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లకు వివరించామని అయితే అప్పట్లో నైని కోల్ బ్లాక్ అంశంపై ఎలాంటి చర్చ కూడా జరగలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 8:19 pm

సిట్ విచారణకు ముందే కెటిఆర్ దొరికిపోయారు:ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

సిట్ విచారణకు ముందే కెటిఆర్ దొరికిపోయారని, ఎలాగో దొరికిపోతానని కెటిఆర్‌కు ముందే తెలుసనీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కెటిఆర్ పరోక్షంగా ఒప్పుకున్నారని ఆయన ఆరోపించారు. దేశ భద్రత, అంతర్గత భద్రత, ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లను మాత్రమే పోలీసులు ట్యాప్ చేస్తారని, రాజకీయ కారణాలతో ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదని ఆయన తెలిపారు. తెలంగాణ సమాజం ముందు నిజాలు బట్టబయలు అవుతాయని, కల్వకుంట్ల కుటుంబానికి జైలు శిక్ష తప్పదని ఆయన ఆరోపించారు. కెటిఆర్ మేగపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు.  

మన తెలంగాణ 22 Jan 2026 8:13 pm

Rs. 12 crore |ఎమ్మెల్యేకి పాలాభిషేకం….

Rs. 12 crore | ఎమ్మెల్యేకి పాలాభిషేకం…. Rs. 12 crore |

ప్రభ న్యూస్ 22 Jan 2026 8:09 pm

Subsidy |మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలి

Subsidy | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలి Subsidy |

ప్రభ న్యూస్ 22 Jan 2026 7:44 pm

గ్రీన్‌లాండ్ టారీఫ్‌పై ట్రంప్ వెనుకడుగు

దావోస్ వేదిక నుంచే కీలక నిర్ణయాలు అమెరికా కదలికలపై దీవి ప్రజల ఆగ్రహం తమకు సంబంధం లేని విషయం అన్న పుతిన్ దావోస్ : మిత్రపక్ష ఐరోపాదేశాలపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తమ గ్రీన్‌లాండ్ టారీఫ్‌ను వెనుకకు తీసుకున్నారు. ఎనిమిది యూరప్ దేశాలపై తమ ప్రతిపాదిత పాతిక శాతం తొలిదఫా సుంకాలను నిలిపివేస్తున్నానని దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నేపథ్యంలో ట్రంప్ గురువారం ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా తీసుకుంటుందనే తమ ప్రతిపాదనపై వ్యతిరేకత చూపే మిత్రదేశాలు తమకు శత్రుదేశాల కన్నా ఇబ్బందికరం అని ట్రంప్ భావించారు. అత్యంత కీలకమైన దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా గ్రీన్‌లాండ్ టారీఫ్‌ను గత వారం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయా దేశాలు అర్కిటిక్ దీవికి సంబంధించి దారికి వచ్చాయని ట్రంప్ చెప్పారు. అర్కిటిక్ డీల్ నమూనాపై నాటో దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసిందని, అందుకే టారీఫ్‌లను నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. గ్రీన్‌లాండ్ తమకు కావల్సిందేనని, దీనిపై హక్కులను , భౌగోళిక అధికారాన్ని, చివరికి యాజమాన్యాన్ని పొంది తీరుతామని ట్రంప్ దావోస్ వేదికగానే ప్రకటించారు. ఐరోపా దేశాల వైఖరిపై మండిపడ్డారు. అయితే ఇప్పుడు గ్రీన్‌లాండ్ భద్రతకు తమ ఫార్మూలాకు నాటో అధినేత అంగీకరించారని, దీనితో తాము గ్రీన్‌లాండ్ టారీప్‌ను నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. వారు దారిలోకి రావడం మంచి పరిణామం అయిందన్నారు. అమెరికాకు అత్యంత కీలకమైన రక్షణ వలయం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ, పైగా 175 బిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన తమ ప్లాన్ గురించి కూడా తాను నాటోతో చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ బహుళ స్థాయి వ్యవస్థతో అమెరికా తొలిసారిగా తమ ఖండాంతర క్షిపణులను ఇతర కీలక ఆయుధాలను ఏకంగా అంతరిక్షంలో అమర్చి ఉంచడానికి వీలేర్పడుతుంది. వీటిని అవసరం అయినప్పుడు వాడుతారు. ఐరోపా దేశాలతో జరిపిన చర్చలలో తాను ఆశించిన దాని కంటే ఎక్కువ ఫలితాలు వెలువడ్డాయని, తాము సరికొత్త టారీఫ్ నిర్ణయాన్ని వెనకకు తీసుకుంటున్నానని ట్రంప్ తమ సోషల్ మీడియా ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌లాండ్‌పై ఆధిపత్యాన్ని తాము ఈ ప్రాంత రక్షణకే కాకుండా, అమెరికా ప్రయోజనాల కోణంలోనే చూడకుండా , మొత్తం ప్రపంచ శాంతి పరిరక్షణ దృక్ఫథంతోనే చూస్తున్నామని దావోస్ వేదికగా ట్రంప్ ఘాటైన కీలక ప్రసంగం చేయడంతో ప్రపంచ దేశాల నేతలలో తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. 

మన తెలంగాణ 22 Jan 2026 7:39 pm

Municipal |ఆలేరు మున్సిపల్ కమీషనర్ గా….

Municipal | ఆలేరు మున్సిపల్ కమీషనర్ గా…. Municipal | ఆలేరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Jan 2026 7:38 pm

Friends |స్నేహితునికి అండగా…

Friends | స్నేహితునికిఅండగా… Friends | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్నేహితుని తండ్రి

ప్రభ న్యూస్ 22 Jan 2026 7:35 pm

Video : Exclusive Podcast with Cheekatilo Web Series Team

The post Video : Exclusive Podcast with Cheekatilo Web Series Team appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 7:30 pm

పెద్ద పాలమడలో ఉచిత పశువైద్య శిబిరం

వందల సంఖ్యలో పశువులకు వ్యాధి నివారణ చర్యలు విశాలాంధ్ర, తాడిపత్రి :మండల పరిధిలోని పెద్ద పాలమడ గ్రామంలో గురువారం డాక్టర్, ఏహెచ్ఏ, పశువైద్య సహాయకుల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 17 పశువులకు వ్యాధి నివారణ, 2 పశువులకు గర్భకోశ నివారణ, 1 పశువుకు చూలు పరీక్ష నిర్వహించినట్లు పశువైద్యులు హరికృష్ణ తెలిపారు. అదేవిధంగా 22 పెద్ద పశువులకు, 15 చిన్న దూడలకు, అలాగే 3,252 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు […] The post పెద్ద పాలమడలో ఉచిత పశువైద్య శిబిరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 7:24 pm

ఉచిత వైద్య శిబిరంలో విశ్రాంత ఉద్యోగులకు పరీక్షలు

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విశ్రాంత ఉద్యోగుల కోసం గురువారం అనంతపురం కిమ్స్ సమీరా హాస్పిటల్ మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుండె, కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కళ్యాణదుర్గం విశ్రాంత ఉద్యోగుల భవన్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో సుమారు రూ.2,000 విలువైన వివిధ […] The post ఉచిత వైద్య శిబిరంలో విశ్రాంత ఉద్యోగులకు పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 7:08 pm

రాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటిన టిడిపి ఎమ్మెల్యే

వైసీపీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి మానవత్వానికి పెద్దపీట వేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ను నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు.. గత ఎన్నికల సమయంలో గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబానికే గురువారం అండగా నిలిచిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన మానవీయ కోణాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం గుద్దిళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వడ్డే రాము భార్య అనారోగ్యంతో […] The post రాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటిన టిడిపి ఎమ్మెల్యే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 7:01 pm

2 Brands | ORSL మరియు eRZL ఆవిష్కరణ

2 Brands | డీహైడ్రేషన్ సమస్యకు కెన్వ్యూ డబుల్ పవర్ పరిష్కారంORSL: డయేరియా

ప్రభ న్యూస్ 22 Jan 2026 7:00 pm

Sports |సీఎం కప్ క్రీడలు…

Sports | సీఎం కప్ క్రీడలు… Sports | మేడ్చల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:48 pm

జయనగర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం..

ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి చొరవతో పైపులైన్ పనులు పూర్తి విశాలాంధ్ర–తాడిపత్రి :ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి చొరవతో పట్టణంలోని జయనగర్ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని 21వ వార్డు కౌన్సిలర్ టి. హుస్సేన్ భాష తెలిపారు. గురువారం పట్టణంలోని 21వ వార్డు జయనగర్ కాలనీలో చేపట్టిన త్రాగునీటి సరఫరా పైపులైన్ పనులను కౌన్సిలర్ టి.హుస్సేన్ భాష, మున్సిపల్ ఏఈ నాగేంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయనగర్ కాలనీ 18వ […] The post జయనగర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:48 pm

Rs. 200 crore funds |బాకీ కార్డుల పోస్టర్లు ఆవిష్కర‌ణ‌…

Rs. 200 crore funds | బాకీ కార్డుల పోస్టర్లు ఆవిష్కర‌ణ‌… Rs.

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:43 pm

service |సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి

service | సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి service |

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:31 pm

ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని తేరు బజార్లో గల ఆర్యవైశ్య కొత్త సత్రంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు శ్రీరామ భజన మందిరం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, దేవత కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దైవ ఆశీస్సులు లేనిదే ఏ పని జరగదని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలన్న తలుపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అర్చకులచే తొలుత ఉత్సవ […] The post ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:28 pm

నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు మహాత్మా గాంధీ సందేశ యాత్ర : రఘువీరా రెడ్డి

ఈ నెల 28 నుండి పాదయాత్ర ప్రారంభం. విశాలాంధ్ర గుడిబండ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విద్వేషాలు, యుద్ధ వాతావరణం మధ్య మహాత్మా గాంధీ సూచించిన శాంతి, అహింసా మార్గాన్ని సమాజానికి మళ్లీ గుర్తు చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని సిడబ్ల్యూసీ మెంబర్ శ్రీ ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. గురువారం నీలకంఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28, 29, 30 తేదీల్లో నీలకంఠాపురం నుంచి హిందూపురం గాంధీ చౌక్ వరకు ‘మహాత్మా […] The post నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు మహాత్మా గాంధీ సందేశ యాత్ర : రఘువీరా రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:26 pm

ఇలినాస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ చర్చలు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : అమెరికాలో ఇలినాస్ విశ్వవిద్యాలయం అధికారులు ఆచార్య దేభాసిస్ దత్త , ఆచార్య శిఖాలకన్ పాల్ తో సమగ్రమైన, దీర్గ కాలిక విద్యా సంబంధిత బాగ స్వామ్యం అంశాలపై గురువారం పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య డైరెక్టర్ అడ్మిషన్స్, ఫారిన్ అండ్ అల్యూమిని మేటర్స్ ఆచార్య ఎ. సురేష్ బాబు, డిఏపి డైరెక్టర్ ఆచార్య […] The post ఇలినాస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ చర్చలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:21 pm

Central schemes |గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Central schemes | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి Central schemes | మోత్కూర్,

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:16 pm

Zaynur |సందీరికి రామ్ రామ్..

Zaynur | సందీరికి రామ్ రామ్.. Zaynur | జైనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:13 pm

Alcohol |గ్రామాల్లో మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్ …

Alcohol | గ్రామాల్లో మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్ … Alcohol

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:10 pm

బాధిత మహిళలకు మెరుగైన సేవలు అందించాలి

. వరకట్నం నిషేధ చట్టం పక్కాగా అమలు చెయ్యాలి. బాల్య వివాహాలు జరగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం వన్ స్టాఫ్ సెంటరు & వరకట్న నిషేధ చట్టంపై త్రైమాసిక సమీక్ష, కన్వర్జెన్స్ సమావేశ సలహా బోర్డు మిషన్ శక్తి కింద సమావేశాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వన్ స్టాఫ్ సెంటరు ద్వారా మహిళలు, బాలలకు […] The post బాధిత మహిళలకు మెరుగైన సేవలు అందించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:09 pm

చిన్నారి వైష్ణవికు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులు

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ మల్లీశ్వరి విలేకరులతో మాట్లాడుతూ… ప్రాణ అపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకున్న తొమ్మిది సంవత్సరాల వైష్ణవికి పునర్జన్మను ప్రసాదించారు అని పేర్కొన్నారు కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన 9 సంవత్సరాల వయసు గల వైష్ణవి ను డిసెంబర్ […] The post చిన్నారి వైష్ణవికు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:03 pm

Press conference |ప‌ని తీరు మార‌లేదు..

Press conference | నల్గొండ, ఆంధ్రప్రభ : రేవంత్ రెడ్డి పగటి పూట

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:54 pm

Women’s Hostel |పెండింగ్ పనులు పూర్తి చేయాలి…

Women’s Hostel | పెండింగ్ పనులు పూర్తి చేయాలి… Women’s Hostel |

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:54 pm

30 special buses |చిట్యాల నుంచి మేడారంకు 30 ప్రత్యేక బ‌స్సులు..

30 special buses | చిట్యాల నుంచి మేడారంకు 30 ప్రత్యేక బ‌స్సులు..

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:52 pm

TG |మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..

TG | మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. TG |

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:47 pm

Sarpanch |ఉచిత కంటి వైద్య శిబిరం…

Sarpanch | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కంటి వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:44 pm

Review meeting |నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..

Review meeting | నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.. Review meeting |

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:42 pm

నియంత జగన్ ఇక అధికారంలోకి రావడం కల్ల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 22 Jan 2026 5:40 pm

దావోస్ లో తెలంగాణకు భారీ పెట్టుబడులు

దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు పెరుగుతున్నాయి

తెలుగు పోస్ట్ 22 Jan 2026 5:32 pm

ముదిగుబ్బ మండలంలో మరో రెండు కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ : నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ మండలంలో రైతుల అవసరాల దృష్ట్యా మరో రెండు కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముదిగుబ్బ మండల సిపిఐ పార్టీ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఈ మేరకు మండల కేంద్రమైన ముదిగుబ్బతో పాటు మల్లేపల్లి గ్రామ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని శ్రీనివాసులు కోరారు.జిల్లాలోనే పెద్ద మండలంగా పేరు గాంచి 25 పంచాయతీలు 86 […] The post ముదిగుబ్బ మండలంలో మరో రెండు కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 5:30 pm

Towards 2029 |రాజకీయ పునఃప్రయాణానికి సంకేతమా

Towards 2029 | జగన్ పాదయాత్రపై తాజా ప్రచారం: అధికారిక షెడ్యూల్ ఖరారైందా?గత

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:26 pm

Sports |సృజనాత్మకతను వెలికి తీస్తాయి ..

Sports | సృజనాత్మకతను వెలికి తీస్తాయి .. Sports | వికారాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:26 pm

కృపామణికి అరుదైన గౌరవం

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు దేశమంతా జరుపుకునే భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొనే అరుదైన అవకాశం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన తోట కృపామణికి దక్కింది. ఈ మేరకు జనవరి 26 న జరిగే 77 వ గణతంత్ర వేడుకలకు అతిధిగా హాజరుకావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి వాకటి అరుణ నుంచి ఆమెకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించారు. […] The post కృపామణికి అరుదైనగౌరవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 5:26 pm

Best Award |ఉత్తమ పురస్కారం..

Best Award | ఉత్తమ పురస్కారం.. Best Award | కర్నూల్ ప్రతినిధి,

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:22 pm

రేపు కేటీఆర్ ను విచారించనున్న సిట్

ఫోన్ ట్యాపింగు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు

తెలుగు పోస్ట్ 22 Jan 2026 5:21 pm

E – Crop Survey |రైతుల‌కు డ్రోన్ సేవలు..

E – Crop Survey | రైతుల‌కు డ్రోన్ సేవలు.. E –

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:19 pm

వైద్య రంగంలో నిత్య కృషీవలుడు పద్మశ్రీ నారాయణరావు

విశాలాంధ్ర -భీమవరం టౌన్ ; వై ద్య రంగంలో ఎన్నో మైలురాళ్లను దాటిన నిత్య కృషీవలుడు పద్మశ్రీ అది నారాయణరావు అని ఎల్హెచ్ టౌన్ హాల్ గౌరవాధ్యక్షులు మెంటే పార్ధసారధి, అధ్యక్ష, కార్యదర్శులు కోళ్ల రామచంద్రరావు, బేతు కృష్ణారావు అన్నారు. ఎల్ హెచ్ భీమవరం టౌన్ హాల్లో పద్మశ్రీ డా సుంకర అది నారాయణరావు సంతాప సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ పేద ప్రజలే దైవంగా భావించి, ఎంతోమందికి వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి నారాయణరావు […] The post వైద్య రంగంలో నిత్య కృషీవలుడు పద్మశ్రీ నారాయణరావు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 5:16 pm

whistle |విజ‌య్ పార్టీ గుర్తు విజిల్‌

whistle | విజ‌య్ పార్టీ గుర్తు విజిల్‌ whistle | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:13 pm

జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలి….

విశాలాంధ్ర తణుకు:తణుకు మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరం నందు గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ అమల్లో భాగంగా “ఎం ఎస్ ఎం ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్” సమావేశాన్ని స్థానిక శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణతో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, రియల్ ఎస్టేట్ యజమానులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రైవేట్ పారిశ్రామిక వాడల అభివృద్ధిపై అవగాహన పొంది, పలు ప్రశ్నలకు […] The post జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలి…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 5:12 pm

2026 అసెంబ్లీ ఎన్నికలు.. విజయ్ పార్టీకి ‘విజిల్‌’ గుర్తు కేటాయింపు

చెన్నై: తమిళ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 'విజిల్' గుర్తును కేటాయించినట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. అలాగే, కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి 'బ్యాటరీ టార్చ్'ను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్లు వెల్లడించింది. కాగా, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో పాటు తమిళనాడు శాసనసభకు ఎన్నికలు.. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే..తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే ప్రవేశం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రచార యాత్రను నిర్వహించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

మన తెలంగాణ 22 Jan 2026 5:11 pm