SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
...

కేరళ బాలిక మృతిలో కొరియన్ ఫ్రెండ్ ప్రభావం

న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ విద్యార్థిని మృతి వెనుక కొరియన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రభావం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేరళ లోని కొచ్చికి చెందిన విద్యార్థిని (16) జనవరి 17న పాఠశాలకు వెళ్తున్నట్టు చెప్పి బయటకు వెళ్లిన తరువాత క్వారీలో శవమై కనిపించడం సంచలనం కలిగించింది. పోలీసులు బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖను గుర్తించారు. అందులో తన కొరియన్ ఫ్రెండ్ మరణంతో తీవ్ర వేదనకు గురయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బాలిక పేర్కొంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లాక్ వెనమ్ అని ఉన్న కొరియన్ ఇన్‌స్టా గ్రామ్ ఖాతా లోని ఫాలోవర్లను పట్టుకోడానికి ఆరా తీశారు. కానీ ఈ సంఘటన తరువాత ఆ ఫాలోవర్లు అదృశ్యమయ్యారని బయటపడింది. మృతురాలి ఫోన్‌ను పరీక్షించగా, ఒకే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పదుల సంఖ్యలో లాగిన్‌లు ఉన్నట్టు గుర్తించారు. చివరకు నకిలీ పేర్లతో లాగిన్ కావడంతో దోషులు ఎవరో తేలలేదు. టీనేజర్లను మానసికంగా ప్రభావితం చేసే ఖాతాలను విద్యార్థులు అనుసరించి ఉండవచ్చని భావిస్తున్నారు.

మన తెలంగాణ 15 Feb 2026 12:07 am

వార ఫలాలు (15-02-2026 నుండి 21-02-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగపరంగా విద్యాపరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీరు ఆత్మవిశ్వాసంతో మనోబలంతో మొదలుపెట్టిన ప్రతి పని పూర్తి అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి పొదుపు పైన దృష్టి పెట్టండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన కాంట్రాక్టులు ప్రాజెక్టులు లభిస్తాయి. తల్లిదండ్రులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో పై అధికారులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సమాజ సేవలో పాల్గొంటారు. గో సేవ చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు కాలభైరవ రూపు మెడలో ధరించండి. అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈరోజు వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి వారం చాలా బాగుంది. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో కాలం ఆనందంగా గడిచిపోతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి శ్రద్ధ చూపుతారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభాలు మీరు ఆశించిన విధంగా ఉంటాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి వారం చాలా బాగుందని చెప్పవచ్చు. పూల ప్రాంతం ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. విహారయాత్రలలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వాయిదా వేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వైద్యవృత్తుల వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. నూతన గృహప్రవేశం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంటా బయట చిన్నచిన్న సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతాయి. ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు పెరుగుతాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. నడిచిన వారం కంటే వారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. లాభాలు బాగుంటాయి. కొరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సహోదరీ సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువుపై శ్రద్ధ వహించండి మీరు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. నడిపించే ప్రయత్నం వ్యాపారాన్ని నూతన మార్గంలో నడిపించడానికి ఆలోచనలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మీకు కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. పై అధికారుల అండదండలు లభిస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది పదిమంది మెచ్చుకోలుగా ఉంటుంది వ్యాపారపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వారికి, డేటా సైన్స్, డాక్యుమెంట్ రైటర్స్ కి, లాయర్లకి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగం వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు చిన్న చిన్న అవకాశాలు వచ్చి చేజారి పోతుంటాయి అయినా దిగులు పడాల్సిన పనిలేదు. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయవలసి ఉంటుంది. వచ్చిన అవకాశం వీరు చక్కగా ఉపయోగించుకుంటారు. పదిమందిలో తనకంటూ ఒక మంచి స్థానం ఉండాలని కోరుకుంటారు అది నెరవేరుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. సంతానాభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఒక శుభవార్తను వింటారు. సంతానానికి సంబంధించిన వివాహ విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షల సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఐదుసార్లు లేదా 11 సార్లు పఠించండి. అలాగే దక్షిణామూర్తి రూపు కూడా మెడలో ధరించండి. సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న వారికి అవకాశాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు షార్ట్ టర్మ్ వెళ్లి వచ్చేవారికి కాలం చక్కగా కలిసి వస్తుంది. సొంతింటి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవడం అలాగే సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించటం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనుస్సు రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉంది. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పై అధికారులు అండదండలు లభిస్తాయి. మన కిందిస్థాయి ఉద్యోగులు మనల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసిన వారికి కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి భవిష్యత్తు కోసం చేసుకున్న ప్రణాళికలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కొంతవరకే అనుకూలంగా ఉంటుంది. సిని కళా రంగం వారికి బ్యూటీషియన్స్ కి టెక్నికల్ వారికి కాస్త మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసివచ్చే సంఖ్య ఏడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారికి వారం చాలు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చాలా లాభసాటిగా ఉంటాయి. కుటుంబ పరంగా చిన్నచిన్న విభేదాలు తలెత్తుతాయి జాగ్రత్త వహించండి. మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి కానీ సమయానికి రావు. ఆరోగ్యానికి సంబంధించి స్కిన్ ఎలర్జీ ఎసిడిటీ గ్యాస్టిక్ సంబంధిత జబ్బులతో ఇబ్బంది పడతారు వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు చేతిదాకా వచ్చి చేజారి పోతాయి. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. అదేవిధంగా కుటుంబంలోని తల్లిదండ్రుల సహాయ సహకారాలు వీరికి చక్కగా లభిస్తాయి. కుటుంబంలోని అందరి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఉన్నతంగా ఎదగాలనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనులలో నిజాయితీగా నీతిగా ఉండగలుగుతారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా పక్క వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి తోటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పదిమంది సలహాలు తీసుకొని ఏది మంచిదో నిర్ణయించుకొని ముందుకు వెళ్ళండి తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులకు గురి కావొద్దు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా పిఆర్ కోసం హెచ్ వన్ బి వీసా కోసం గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా లాభసాటి గానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమని చెప్పవచ్చు. మంచి శుభవార్తలు వింటారు. సంతనానికి సంబంధించిన విషయాలు వివరాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఒక శుభవార్త వింటారు. ఈ రాశి వారు ప్రతి రోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం కాలభైరవ రూపు మెడలో ధరించడం చెప్పదగిన సూచన. శనివారం నాడు శని కి తైలాభిషేకం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 4 కలిసివచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఏలినాటి శని నడుస్తుంది. ఉద్యోగరీత్యా బదిలీలు కలిసి వస్తాయి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం మారే అవకాశం గోచరిస్తుంది. పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు ఏ పని చేసినా అధికారుల మెప్పు పొందకపోవటమే కాకుండా వారి నుంచి అధిక ఒత్తిడి ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలము లభించదు. ఉద్యోగం మారాలనుకునే ఆలోచనలు వస్తాయి కానీ అవి సరైనవి కావు ఏది ఏమైనా సరే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండటం మంచిది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. లాభాలు మాత్రం కొంతవరకే ఉంటాయి. కానీ పేరు ప్రఖ్యాతలు కలిసి వస్తాయి. ఒకసారి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మనమే నష్టపోతామని తెలుస్తుంది. వివాహాది శుభకార్యాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన అవకాశాన్ని జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబంలోని వాతావరం చాలా అశాంతిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనాప్పటికీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటే మంచిది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు వీరికి కలిసి వస్తాయి. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేవారికి సివిల్స్ కి పి హెచ్ డి చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. కళ రంగంలో ఉన్న వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అందరికీ అనుకూలంగా ఉంది. ఫార్మా రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. సోదర సోదరీమణుల పట్ల విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. డబ్బు పరంగా వీరికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితిలో అశ్రద్ధ చేయకండి. ఈ రాశి వారు ప్రతి రోజు శని స్తోత్రం చదవండి అలాగే హనుమాన్ చాలీసా చదవటం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి వారం చాలా అనుకూలంగానే ఉంటుంది. జన్మరాశిలో శని బలంగానే ఉన్నారు. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది. సలాం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరుతుంది. ఒక చోట స్థిరాస్తిని అమ్మి మరొకచోట పెట్టుబడి పెడతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా కొంతవరకు అభివృద్ధి సాధించగలుగుతారు. రుణాలు తీరుస్తారు. విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు పిఆర్ లభిస్తుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. కోర్టు తీర్పులు కొంత ఇబ్బంది పడతాయి. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకైనా లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదవవలసిన సమయం. ముఖ్యమైన విషయాలలో సంత నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  

మన తెలంగాణ 15 Feb 2026 12:00 am

అన్యాయంపై సుప్రీం కోర్టులో వాదించిన 19 ఏళ్ల విద్యార్థి

న్యూఢిల్లీ : ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన ఓ 19 ఏళ్ల కుర్రాడు తాను రెండుసార్లు నీట్ పాస్ అయినప్పటికీ సీటు రాకపోయే పరిస్థితిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చి చివరకు విజయం సాధించగలిగాడు. ఈ విషయంలో తానే సొంతంగా సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం విశేషం. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌కు చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు 19 ఏళ్లఅధర్వ్ చతుర్వేది రెండుసార్లు నీట్ రాసి పాస్ అయ్యాడు. 530 స్కోరు చేశాడు. ఈడబ్లుఎస్ కోటా కింద ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీటు కచ్చితంగా వస్తుందని ధీమా పడ్డాడు. లాస్ట్‌రౌండ్ కౌన్సెలింగ్‌లోనూ అతడికి సీటు రాలేదు. తమ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్లుఎస్ కోటాను అమలు చేయకపోవడం వల్లనే తనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందాడు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు సీట్లు అందుబాటులో ఉన్నాయని గుర్తించాడు. ఈ నేపథ్యంలో జనవరి 6న తానే సొంతంగా స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) తయారు చేసి దాఖలు చేశాడు. విధానపరమైన లోపాలే అతడికి సీటు రాకపోవడానికి కారణాలుగా కోర్టు గమనించింది. ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్లుఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయనందున అతని అడ్మిషన్‌ను తిరస్కరించకూడదని కోర్టు పేర్కొంది. 202526 సెషన్‌లో అతడికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈమేరకు నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలల ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని కోరిన అధర్వ తానే సొంతంగా వాదనలు వినిపించి విజయం సాధించాడు. 

మన తెలంగాణ 14 Feb 2026 11:57 pm

సోషల్‌మీడియాతో మందబుద్ధి..

లండన్ : సామాజిక మాధ్యమానికి ఎక్కువగా అలవాటుపడితే అది మనిషిలో అల్జీమీర్స్‌కు దారితీస్తుంది. సగటు మనిషి తనను తాను మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందని జీవనశైలి అధ్యయనకర్త ల్యూక్ కౌటినో తమ విశ్లేషణతో తెలిపారు. కోవిడ్ మహమ్మారి తరువాతి క్రమంలో మనిషి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇతర మాధ్యమాలతో ఎక్కువగా ఇతరులతో అనుసంధానం లేకుండా ఒంటరితనానికి అలవాటుపడ్డాడు. ఈ విధంగా మారిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. ప్రత్యేకించి పలు సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న సమాచారం, తప్పుడు వార్తలు మనిషిని విచిత్ర మానసిక స్థితికి మారుస్తున్నాయి. ఇది ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదకరమైన అల్జీమిర్స్‌కు దారితీస్తోందని తమ శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైందని ప్రకటించారు. డిజిటల్ ప్రపంచం అందించే సమాచారంలోని నిజానిజాలను నిర్థారించుకునే క్రమంలో ఎక్కువ మంది తమ ఉనికిని తామే మరిచిపోయే విచిత్ర డోలాయమాన స్థితికి చేరుతున్నారు. వైద్యుల పరీక్షల వరకూ వెళ్లితే ఇది నయం కాని అల్జీమిర్స్ ప్రమాద ఘంటికగా నిర్థారణ అవుతోంది. దాదాపుగా ప్రతి వ్యక్తి వద్ద ఉండే స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు ఇతరత్రా హైటెక్ సాధనాలు చివరికి మనిషి అంతర్గత మేధ శక్తిని హరించి వేస్తున్నాయని తేల్చారు. ప్రత్యేకించి జన్మతః ఉండే స్వతహసిద్ధ ఆలోచనా విధానానికి విఘాతం ఏర్పడుతోంది. ఒంటరితనంలో తోడుగా ఉండే సోషల్ మీడియానే మిగిలిన ప్రపంచం అయ్యి వాస్తవికతకు దూరం అవుతున్నారని తేల్చారు. తాను ఇటీవలే ఓ వ్యక్తి మస్తిష్కం ఆలోచనలను పరిశీలించానని కేవలం 9 నెలల కాలంలోనే ఈ వ్యక్తికి అల్జీమీర్స్ వచ్చిందని ఈ అధ్యయనకర్త తెలిపారు. ఇది వయస్సుపరంగా వచ్చింది కాదు. దైనందిన జీవితంలో చోటుచేసుకున్న మార్పు క్రమంలో తలెత్తిన అవలక్షణం అని విశ్లేషించారు. ఓ 50 సంవత్సరాల వ్యక్తి అంతకు ముందటి వరకూ విజయాలు సాధిస్తూ వచ్చాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తెలివితేటలను సమయస్ఫూర్తితో చాటుకున్నాడు. అయితే ఈ వ్యక్తికి ఇటీవల తనను తాను మర్చిపోయే జబ్బు వచ్చిందని తెలిపారు. జ్ఞాపకశక్తి నిద్రాణం అవుతూ వస్తోంది. అయోమయం, చిరాకు, తప్పుడు ప్రేలాపనలకు దిగుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ప్రత్యేకించి పలు గంటలు సామాజిక మాధ్యమంతో గడిపే వారికి ఎక్కువగా ఇటువంటి అవలక్షణం ఏర్పడుతోంది. దీనితో ఇంతకు ముందటివరకూ ఆరోగ్యవంతుడు అయిన వ్యక్తి కూడా అవలక్షణంతో తనకు తాను అపరిచితుడు అయి కుంగిపోతున్నాడని తేల్చారు. 

మన తెలంగాణ 14 Feb 2026 11:47 pm

స్కాట్లాండ్‌తో ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు

 టి20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ మరో గెలుపు నమాదు చేసింది. రెండో మ్యాచ్‌లో వెప్టిండీస చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు.. శనివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది సూపర్ 8లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లోనూ స్కాట్లాండ్ నుంచి సవాల్ ఎదుర్కొంది. స్టార్ ఆటగాళ్లు విఫమైనా టామ్ బ్యాంటన్(63 నాటౌట్) అద్భుత న్నింగ్స్‌తో గెట్టెకింది. ఇక చివరి 19వ ఓవర్లో విల్ జాక్స్ (16 నాటౌట్) 4, 6 బాదడంతో 5 వికెట్ల తేడాతో గెలిచింది. లీగ్ దశలో రెండోవిజయంతో సూపర్ 8 అవకాశాల్ని మెరుగు పరుచుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వగా.. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌కు గట్టిపోటినిచ్చింది స్కాట్లాండ్. కానీ, టామ్ బ్యాంటన్ విరోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ గెలుపులో కీలకభూమిక పోషించాడు. 153 పరుగుల ఛేదనలో తొలి ఓవర్లోనే మెక్‌ముల్లెన్ డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(2)ను ఔట్ చేసి ఇంగ్లంగ్ పతనాన్ని శాసించాడు. రెండో ఓవర్లో జోస్ బట్లర్(3) సైతం డగౌట్ చేరగా.. బ్యాంటన్, జాకబ్ బెథెల్(32) మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇరువురిని అద్భుత డెలివరీతో డేవిడ్సన్ విడదీశాడు. బెథెల్ ఔటయ్యాక.. హ్యారీ బ్రూక్(4), సామ్ కరన్(28) సాయంతో బ్యాంటన్ పోరాడి స్కాట్లాండ్ ఆశలపైనీళ్లు చల్లాడు. 17 బంతుల్లో 15 పరుగులు అవసరమైన దశలో విల్ జాక్స్(16 నాటౌట్) ఇంగ్లండ్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు.

మన తెలంగాణ 14 Feb 2026 11:33 pm

ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం

భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలకు అరుదైన గౌరవం దక్కింది. చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్లకు ఈ క్రికెట్ లెజండరీల పేర్లు పెట్టనున్నారు.మాజీ మహిళా క్రికెటర్ శాంత రంగస్వామి పేరిట మరో స్టాండ్ సయితం ఏర్పాటు చేసేందు స్టేడియం న్విహాకులు సన్నహాలు చేస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కెఎస్‌సిఎ) శనివారం ఓ ప్రకటన విడుత చేసింది. ద్రవిడ్ టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో 605 ఇన్నింగ్స్‌లో 24,208 రన్స్ చేసింది. టెస్టుల్లో సచిన్ తర్వాత అత్యధిక రన్స్ చేసిన రెండో భారత క్రికెటర్ ద్రవిడ్. మరోవైపు, కుంబ్లే 501 మ్యాచ్ల్లో 956 వికెట్లు తీశాడు. టెస్టుల్లో, వన్డేల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసింది కుంబ్లేనే. Chinnaswamy Stadiumఈ ఆఫ్ స్పిన్నర్ 2016-17 వరకు, ద్రవిడ్ 2021-24 వరకు భారత జట్టుకు హెడ్ కోచ్ వ్యవహరించారు. శాంత రంగస్వామి మహిళల క్రికెట్‌లో దిగ్గజంగా గుర్తింపు పొందింది. భారత మహిళల క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ ఆమెనే. జూలన్ గోస్వామి, మిథాలీ రాజ్, అంజుమ్ చోప్రా తర్వాత స్టేడియంలో స్టాండ్స్‌కు పేరు పెట్టిన నాలుగో మహిళా క్రికెటర్‌గా రంగస్వామి కొత్త గౌరవాన్ని పొందనున్నారు. కాగా, గతేడాది ఐసిఎల్‌లో ఆర్‌సిబి టైటిల్ నెగ్గడంతో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే, అక్కడికి పెద్ద ఎత్తును అభిమానులు తరలిరావడంతో నియంత్రణ కోల్పోడంతో తొక్కిసలాటకు దారితీసింది. దీంతో స్టేడియంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

మన తెలంగాణ 14 Feb 2026 11:30 pm

సరికొత్త ప్రేమ కథగా ‘ఏమో ఏమో ఇది’ .. గ్లింప్స్ రిలీజ్

దర్శకుడు డా. శైలేష్ కొలను, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సరికొత్త రొమాంటిక్ కామెడీ సినిమా కోసం చేతులు కలిపారు. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే అందమైన టైటిల్ ను ఖరారు చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా టైటిల్ తో పాటు గ్లింప్స్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు శైలేష్ కొలను... హృద్యమైన, హాయిగా సాగే, సరదాగా నవ్వించే సరికొత్త ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో అభయ్ పాత్రలో రోషన్ మేకా నటిస్తున్నారు. అపూర్వ పాత్రలో ప్రీతి ముకుందన్ కనిపించనున్నారు. 2026 ఆరంభంలో అనగనగా ఒక రాజుతో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. 2026 దసరా కానుకగా చిత్రo విడుదలవుతుంది. ఏమో ఏమో ఇది చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.

మన తెలంగాణ 14 Feb 2026 11:00 pm

గుడబెళ్లూరు- మహబూబ్ నగర్ నాలుగు లేన్ల రహదారికి గ్రీన్ సిగ్నల్

మనతెలంగాణ/హైదరాబాద్:మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వరకు (ఎన్‌హెచ్-167) ర హదారి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. అందు లో భాగంగా హైదరాబాద్ టు -పనాజీ జాతీయ రహదారి పరిధిలోని ఈ మార్గానికి త్వరలోనే మహర్దశ రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో గుడబెళ్లూరు- టు మహబూబ్‌నగర్ నాలు గు లైన్ల హైవే నిర్మాణానికి శనివారం రూ.3,175 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల హైదరాబాద్ నుంచి రాయచూర్, మంత్రా లయం, గోవా వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. మహబూబ్‌నగర్- టు గుడబెళ్లూరు ప్రాజెక్టు హైదరాబాద్- గోవా ఎకనామిక్ కారిడార్‌లో ఉంది. అయితే, రూ.3,175 కోట్ల వ్యయంతో 80.01 కిలోమీటర్లు హ్యామ్ విధానంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మహబూబ్‌నగర్- టు గుడబెళ్లూరు రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనుంది. లేన్లతో తగ్గనున్న గంట 50 నిమిషాల ప్రయాణం ఈ రహదారి మహబూబ్‌నగర్ నుంచి మొదలై దేవరకద్ర, మరికల్, మఖ్తల్, మాగనూరు మీదుగా గుడబెళ్లూరు (రాయ చూర్ సరిహద్దు) వరకు సాగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మరికల్, మఖ్తల్, మాగనూరు పట్టణాల వద్ద ప్రత్యేకంగా బైపాస్ రో డ్లను నిర్మిస్తున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట్, రాయచూర్, దేవరకద్ర, మక్తల్, హైదరాబాద్ జిల్లాల మీదుగా ప్రయాణం సాగుతుంది. ప్రస్తు తం ఉన్న రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్లుగా మార్చడం వల్ల ప్రయాణ సమయం దాదాపు గంట 50 నిమిషాల తగ్గనుంది. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడనుంది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి ఇది అత్యంత వేగవంతమైన మార్గంగా మారనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో త్వరలోనే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులు కూడా జరుగుతుండడం విశేషం. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఫార్మా, మెడికల్ సెజ్ రంగాల అభివృద్ధితో పాటు 14.4 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు నాలుగు రైల్వేస్టేషన్‌లు, ఒక ఎయిర్‌పోర్టు, రెండు మల్టీమోడల్ లాగిస్టిక్ పార్కులకు ఈ రహదారి మీదుగా ఈజీగా ప్రయాణం చేయవచ్చు. బాధితులకు పరిహారం రూ.100 కోట్లు జమ ఈ పద్ధతిలో నిర్మాణ వ్యయం కోసం ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా, మిగతా మొత్తాన్ని టోల్ గేట్ల ద్వారా వాహనదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న బాధితుల కు పరిహారం కింద సుమారు రూ.100కోట్ల వరకు వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి గోవా, రాయచూరు, మంత్రాలయం, అలాగే కర్ణాటకలోని పలు పట్టణాలకు ప్రయాణించే వారు సాధారణంగా జడ్చర్ల-, మహబూబ్‌నగర్ మార్గా న్ని ఉపయోగిస్తారు. ఈ రహదారి నాలుగు వరుసలుగా విస్తరించాక ప్రయాణం మరింత సులభం, వేగవంతం కానుంది.

మన తెలంగాణ 14 Feb 2026 10:58 pm

జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం ‘బ్యాండ్ మేళం’..

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. ఈ మూవీని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ గ్లింప్స్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌కి దర్శకుడు బాబీ, రచయిత బీవీఎస్ రవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. “భవిష్యత్తులో రోషన్ పెద్ద స్టార్ అవుతాడు. ఎంతో కూల్‌గా నటించేశాడు. నా లవ్ స్టోరీ అంటే సుకుమార్‌కి చాలా ఇష్టం. ‘నీ కథని నువ్వు తీస్తావా? నేను తీయాలా?’ అని సుకుమార్ అంటుంటారు. ‘సార్ నేనే తీస్తాను అని’ ఆయనతో చెబుతుంటాను. నేను లవ్ స్టోరీ తీస్తే కచ్చితంగా రోషన్‌తోనే తీస్తాను. శ్రీదేవీ ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది”అని అన్నారు. నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ “ఈ కథ విన్నప్పుడే నాకు రోషన్, శ్రీదేవీ కనిపించారు. ఆ ఇద్దరినీ ఒప్పిస్తేనే సినిమా తీస్తాను అని సతీష్‌కి చెప్పాను. ఇక జీవితాంతం గుర్తుండిపోయే సినిమాగా ‘బ్యాండ్ మేళం’ నిలుస్తుంది”అని తెలియజేశారు. దర్శకుడు సతీష్ జవ్వాజీ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను ప్రతీ సీన్‌ను ఎంతో ఎమోషన్‌తో రాశాను. అంతే ఎమోషన్‌తో ప్రతీ సీన్‌ను తెరకెక్కించాను. రోషన్, శ్రీదేవి నటనలతో ఆ ఎమోషన్స్ మరింత పండాయి”అని తెలిపారు. ఈ సమావేశంలో బీవీఎస్ రవి, హర్ష్ రోషన్, శ్రీదేవి, బెక్కెం వేణుగోపాల్, విజయ్ బుల్గానిన్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 14 Feb 2026 10:55 pm

మున్సిపల్ ఫలితాలతో బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల పొత్తుకు తొలి అడుగు పడింది: కల్వకుంట్ల కవిత

తమ సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుందని ప్రకటించగానే బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు తమను ట్రోలింగ్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తమను లక్ష్యంగా చేసుకున్న వారికి ఒకటే విషయం చెబుతున్నా.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే..అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. ఇప్పుడే తొందరపడి మాట జారవద్దని, తమపై కారుకూతలు కూయవద్దని బిఆర్‌ఎస్ శ్రేణులను హెచ్చరించారు. ఇప్పటికైనా మీ తప్పులను సరిదిద్దుకోవాలని బిఆర్‌ఎస్ పార్టీకి సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు వారు ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ తమ కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి పోటీ చేశామని, ప్రజలు మమ్మల్ని 40 స్థానాల్లో గెలిపించారని వెల్లడించారు. తాము అధికారికంగా 33 స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారని, మరో 7 చోట్ల సాంకేతిక కారణాల వల్ల స్వతంత్రులుగా గెలిచారని చెప్పారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందని తెలిపారు. తంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బిఆర్‌ఎస్ ఈసారి 16 స్థానాలకే పరిమితమైందని గుర్తు చేశారు. తమకు 17 స్థానాలు రావడమే చాలా ఎక్కువ అన్నట్లుగా కెటిఆర్ మాట్లాడటం విచిత్రమని అన్నారు. ప్రజల మద్దతును ఎందుకు కోల్పోయామో బిఆర్‌ఎస్ ఆలోచించాలని సూచించారు.ఉత్తర తెలంగాణలో బిజెపి గెలుపు కోసం బిఆర్‌ఎస్ పనిచేసిందని,ఆ రెండు పార్టీల పొత్తుకు ఇది తొలి మెట్టు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయిన సిసిఐకి కొత్తగూడంలో బిఆర్‌ఎస్ పార్టీ మద్దతివ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. అడగకుండానే.. కొత్తగూడెంలో సిపిఐకి కెటిఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వటం దిగజారుడే అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్‌పై సాంబశివరావు చేసిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా..? అని బిఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. కార్మికుల కోసం సిపిఐకు మద్దతు అంటోన్న కెటిఆర్ నయ వంచన చేసుకుంటున్నారని అన్నారు. అవసరం వచ్చినప్పుడు.. బిఆర్‌ఎస్‌కు కార్మికులు గుర్తొస్తారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైందని మున్సిపల్ ఫలితాలు చెప్తున్నాయన్నారు. మున్సిపాలిటీలను తీర్చిదిద్దానని చెప్పుకుంటోన్న కెటిఆర్.. ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారని, ఆ లోటును తెలంగాణ జాగృతి భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. బిజెపి కరీంనగర్‌లో తప్ప ఎక్కడా గెలవలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ రూ.30 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ప్రజలు తమకు 40 సీట్లు ఇచ్చారని చెప్పారు. తాము కూడా బిజెపి మాదిరిగా రూ. 30 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఎన్నో సీట్లు వచ్చేవి అని, డబ్బులతో కాకుండా సుభాషిజంతో రావాలని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ అదేవిధంగా ముందుకు వెళ్తామని తెలిపారు. తమలాంటి వాళ్లను ప్రజలు స్వాగతిస్తారని నమ్మకం ఉందని అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.ఈ ముఖ్యమంత్రి నేనే రాజు, నేనే మంత్రి అంటున్నారని, మంత్రి పదవి ఇవ్వకపోతే సిఎం కుర్చీ లాక్కుంటానని రాజ్ గోపాల్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. సిఎం ముందు రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 14 Feb 2026 10:49 pm

‘విష్ణు విన్యాసం’ విడుదల అప్పుడే

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు.జి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీ విష్ణు ఫంకీ ప్రింటెడ్ షార్ట్, కలర్ ఫుల్ చొక్కా, షేడ్స్ ధరించి క్లాసిక్ బైక్‌పై విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది.

మన తెలంగాణ 14 Feb 2026 10:36 pm

మాజీ ఎమ్మెల్యే గుమ్మడికి గౌరవ డాక్టరేట్

ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు గౌరవ డాక్టరేట్ లభించింది. శనివారం చెన్నై మైలాపూర్ భారతీయ విద్యా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా,నిబద్ధతైన సేవలు అందించినందుకు యూనివర్సిటీ కమిటీ గుమ్మడి నరసయ్యను ఈ అవార్డుకు ఎంపిక చేసి సత్కరించినట్లు పేర్కొంది. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ గౌని నర్సింహ గౌడ్, నామినేషన్ కమిటీ మెంబర్ ఎండీ.అరిఫుద్దీన్ చేతుల మీదుగా గుమ్మడి నరసయ్య ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. గుమ్మడి నర్సయ్య ఇల్లెందు నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. సిపిఐ ఎంఎల్ పార్టీలో ఆయన సుదీర్ధంగా సేవలు అందిస్తున్నారు. తాడిత పిడిత గిరిజన ప్రజల కోసం తన జీవితాన్నిత్యాగం చేసి నిరండబరం జీవితాన్ని గడుపుతున్న నర్సయ్యకు గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

మన తెలంగాణ 14 Feb 2026 10:33 pm

పాలేరు రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు .. వ్యక్తి మృతి

వేగంగా వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకెళ్లి నీట మునిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ ఖమ్మం- సూర్యాపేట రహదారి పై శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట నుండి ఖమ్మం వైపు వెళుతున్న కారు ఉదయం 7 గంటల సమయంలో వేగంగా దూసుకెళ్లి నీట మునిగింది.  ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. కారు వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి నీట మునిగాడా లేక బయటకి వచ్చాడా అని గజ ఇతగాళ్ల సహాయంతో గాలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా, అనుమానాస్పదం అనే కోణంలో స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న కూసుమంచి ఎస్‌ఐ నాగరాజు ట్రాఫిక్ అంతరాయం లేకుండా సహాయక చర్యలు చేపట్టి క్రేన్ సహాయంతో కారును బయటకి లాగారు. కారులో మృతదేహాన్ని గుర్తించి పోస్ట్ మార్టం నిమిత్తం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూసుమంచి ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 14 Feb 2026 10:29 pm

న్యాయవాది దారుణ హత్య

ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యాడు. మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్న అతన్ని సొంత బావమర్దులే దాడి చేసి అంతమొందించినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో తేలింది. శనివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. చింతల్ మెట్ సులేమాన్ నగర్ వద్ద వి కేర్ మీసేవ పేరిట ఖదీర్ అనే అడ్వకేట్ తన కార్యాలయాన్ని కొనసాగిస్తున్నాడు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఖదీర్ ఆఫీసులోకి కొంత మంది కర్రలు, కత్తులతో చొరబడ్డారు. అనంతరం అతని పై కర్రలతో దాడి చేసి కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఖదీర్ మృతి చెందినట్లు గుర్తించారు. శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. సంఘటన స్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్ క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరించారు. ప్రాధమిక విచారణలో ఖదీర్ కొద్ది రోజుల క్రితం మరో మహిళను రెండో వివాహం చేసుకున్నట్లు స్థానికులు, బంధువుల ద్వారా తెలిసిందని ఏసీపీ వెల్లడించారు. దాంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తి ఉంటుందని, మృతుడు ఖదీర్ మొదటి భార్య తమ్ముళ్లు అయిన వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఏసీపీ వివరించారు. ఈ మేరకు అత్తాపూర్ పోలీసులు హత్య కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 14 Feb 2026 10:27 pm

కొత్తగూడెంపై వీడిన ఉత్కంఠ... సిపిఐకి మేయర్ పదవి

కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పదవి సిపిఐకి వరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు శనివారం కలిసి చర్చించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నర్సింహా ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించారు. మేయర్ పదవి సిపిఐకి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి ఖరారయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో అత్యధిక వార్డుల్లో సిపిఐ విజయం సాధించింది. మెజారిటీకి అవసరమైన స్థానాలు రాకపోవడంతో సిపిఐకి ఇతర పార్టీల మద్దతు అవసరం అయ్యింది. ఇప్పటికే బిఆర్‌ఎస్ మద్దతు పలికగా కాంగ్రెస్ మద్దతు కోసం సిపిఐ నేతలు సిఎంను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా పిసిపి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు.

మన తెలంగాణ 14 Feb 2026 10:18 pm

పుల్వామా దాడిలో అమరులకు ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాళులు

న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో అమరవీరులకు ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాళులు అర్పించారు. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్‌సిఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే .ఈ దుర్ఘటన జరిగి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం మీద ప్రముఖులు నివాళులు అర్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టే మన భద్రతా దళాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని మోడీ ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జవాన్ల త్యాగం దేశం చిరకాలం గుర్తుంచుకుంటుందని, బలమైన భారత దేశ నిర్మాణానికి స్ఫూర్తి కలిగిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలన తక్షణ అవసరం: అమిత్‌షా దేశానికి, మానవతకు, ఉగ్రవాదం పెద్దశత్రువని పుల్వామా ఉగ్రదాడి చెబుతోందని, దీనిని కూకటివేళ్లతో నిర్మూలించవలసిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. భద్రతా దళాల ధైర్యసాహసాలు, త్యాగాలకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాహుల్, ఖర్గే నివాళులు పుల్వామా ఉగ్రదాడిలో మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన సీఆర్‌పిఎఫ్ త్యాగాలను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాళులు అర్పించారు. పుల్వామాదాడి జరిగిన రోజు సైనికులు, వారి కుటుంబాల త్యాగాలకు గుర్తుగా మిగిలి ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా వీర జవాన్లకు నివాళులు అర్పించారు. 

మన తెలంగాణ 14 Feb 2026 10:11 pm

నవల్నీకి విషమిచ్చి చంపారు.. పుతిన్ ప్రభుత్వంపై యూరప్ విమర్శ

లండన్ : రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని విషమిచ్చి చంపేశారని ఐదు యూరోపియన్ దేశాలు పేర్కొన్నాయి. ఆయనకు అత్యంత ప్రమాదకర ప్రాణాంతక టాక్సిన్ శరీరంలోకి పంపించారని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు ఆరోపించారు. ఈ దారుణ చర్యకు దిగింది రష్యా ప్రభుత్వమే అని వారు తమ ప్రకటనలో తెలిపారు. రష్యా అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి అధ్యక్షులు పుతిన్‌కు నిరసనగా ఈ ప్రతిపక్ష నేత ఉద్యమించారు. ఈ క్రమంలో జైలుపాలయ్యి, అక్కడనే మృతి చెందారు. నవన్లీ మృతదేహం అవశేషాల నమూనాలను విశ్లేషించగా ఆయనకు దక్షిణ అమెరికాలో దొరికే టాక్సిన్ ఎక్కించినట్లు వెల్లడైందని ఈ నేతలు తమ ప్రకటనలో తెలిపారు. ఇది రష్యా ప్రభుత్వం చేసిన దారుణ హత్య, రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసే కుట్రలో భాగం అని పుతిన్‌పై తీవ్రస్థాయి విమర్శలకు దిగారు. అంతర్జాతీయ చట్టాలంటే రష్యా ప్రభుత్వానికి మంట, అందుకే ఈ హక్కుల నేత పట్ల క్రూరంగా వ్యవహరించి, గుట్టుచప్పుడు కాకుండా తుదముట్టించి, జైలులో సహజ మరణంగా చిత్రీకరించారని వారు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 14 Feb 2026 10:07 pm

పత్తిరైతులు, వ్యాపారులను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోంది: రాహుల్

న్యూఢిల్లీ : భారత్‌అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో సుంకాల భారంతో మోడీ ప్రభుత్వం పత్తిరైతులను, వస్త్ర వ్యాపారులను మోసగిస్తోందని, ఈ ఒప్పందం ఈ రెండు రంగాలకు తీరని నష్టం కలిగించే ప్రమాదం ఉందని లోక్‌సభలో విపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎక్స్ ఖాతా ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. విజన్ కలిగిన ప్రభుత్వంగా పత్తి రైతుల, వస్త్ర వ్యాపారుల ప్రయోజనాలను రక్షించేలా ఒప్పందంలో చర్చలు జరిగి ఉండాల్సిందని పేర్కొన్నారు. అమెరికా మనకు 18 శాతం టారిఫ్ విధిస్తుండగా, అమెరికాకు మన నుంచి జీరో శాతం ఉంటున్నట్టు ప్రభుత్వం చెబుతోందని, ప్రధాని మోడీ, ఆయన క్యాబినెట్ ఈ అంశంపై ఏ విధంగా గందరగోళం వ్యాపింప చేస్తోందో తాను వివరిస్తానని పేర్కొన్నారు. అమెరికాకు వస్త్రాల ఎగుమతులపై బంగ్లాదేశ్‌కు సున్నా శాతం టారిఫ్ ప్రయోజనం లభిస్తోందని, అయితే బంగ్లాదేశ్ అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకునే షరతుపై ఇది లభిస్తోందని గుర్తు చేశారు. “ భారతీయ వస్త్రాలపై 18 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటన రాగానే బంగ్లాదేశ్‌కు అమెరికా కల్పించిన ప్రత్యేక రాయితీపై పార్లమెంట్‌లో ప్రశ్నించాను. దీనికి అమెరికా నుంచి మనం కూడా పత్తిని దిగుమతి చేసుకుంటే ఆ ప్రత్యేక రాయితీ లభిస్తుందని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు ఈ వాస్తవాన్ని ఎందుకు దాచిపెట్టారు ? ఈ విధానం ఎటువంటిది ? దీనివల్ల నిజంగా ఏదైనా మేలు జరిగే అవకాశం ఉందా? లేక మనల్ని ముందుకు నుయ్యి, వెనక్కు గొయ్యిలో తోసేయడానికి ఏదైనా పన్నాగం పన్నారా ? అని రాహుల్ ప్రశ్నించారు. “ మనం కానీ అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటే మన పత్తిరైతులు నాశనమౌతారు. మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకోలేకుంటే మన వస్త్ర పరిశ్రమ వెనకబడి, నాశనానికి దారి తీస్తుంది ”అని రాహుల్ ఆందోళన వెలిబుచ్చారు. “ఇంతేకాదు భారత్ నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం తగ్గించడం లేదా ఆపివేయడం చేస్తామని బంగ్లాదేశ్ కూడా సంకేతాలిస్తోంది. భారత దేశ జీవనానికి వస్త్రపరిశ్రమ, పత్తిసాగు వెన్నెముక వంటివి. ఈ రంగాలపై కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాలపై దాడి చేయడమంటే కోట్ల మంది కుటుంబాలను నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం లోకి నెట్టివేయడమే అవుతుంది” అని రాహుల్ తూర్పారపట్టారు. దేశ ప్రయోజనాలకు పత్తిరైతుల , వస్త్రవ్యాపారుల ప్రయోజనాలకు ఒప్పందం వల్ల రక్షణ కలుగుతుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. కానీ వాస్తవంగా చూస్తే రెండు రంగాలకూ తీరని నష్టమే కలుగుతుందని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా రైతు సంఘాల నాయకులతో శుక్రవారం రాహుల్ భేటీ అయి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా, రైతులు,వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని కాపాడటం కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకతపై చర్చించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 

మన తెలంగాణ 14 Feb 2026 9:33 pm

బంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం... మోడీకి ఆహ్వానం

బంగ్లాదేశ్ నూతన ప్రధాన మంత్రిగా మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు , బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ సహా పలు దేశాల నేతలను ఆహ్వానించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మోడీ ఈ కార్యక్రమానికి హాజరైతే భారత్‌బంగ్లా సంబంధాల్లో ఇదో కీలకమైన పరిణామంగా మారనుంది. బీఎన్‌పీ విజయంపై రెహమాన్‌కు మోడీ ఫోన్ చేసి అభినందించారు. ఆయన నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికలు నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై మోడీకి బీఎన్‌పీ ధన్యవాదాలు తెలిపింది. 

మన తెలంగాణ 14 Feb 2026 9:23 pm

Maktal |మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఉమామహేశ్వరాలయం..

Maktal | మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఉమామహేశ్వరాలయం.. నేడు మహాశివరాత్రి శ్రీ

ప్రభ న్యూస్ 14 Feb 2026 9:17 pm

అస్సాం మొదటి ఈఎల్‌ఎఫ్‌పై మోడీ చారిత్రాత్మక ల్యాండింగ్

న్యూఢిల్లీ: అస్సాంలోని దిబ్రుఘర్‌లో నిర్మించిన మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ఈఎల్‌ఎఫ్)పై ప్రధాని మోడీ శనివారం ఉదయం చారిత్రాత్మక ల్యాండింగ్ చేయడం ద్వారా ఆ ఫెసిలిటీని ప్రారంభించారు. ఇదే సమయంలో రూ. 5500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.సైనిక దళాలకు చెందిన సీ130 జే విమానంలో చబువా నుంచి బయలుదేరి దిబ్రుఘర్ లోని మోరాన్ బైపాస్‌లో ఈఎల్‌ఎఫ్‌పై ల్యాండ్ అయ్యారు. ఈశాన్యభారతంలో ఈఎల్‌ఎఫ్‌ను నిర్మించడం ఇదే మొదటిసారి. భారత్ చైనా సరిహద్దుకు దగ్గరగా ఈ రన్‌వే ఉండడంతో కీలక, వ్యూహాత్మక ప్రదేశంగా మారింది. ఇక్కడ జరిగిన వైమానిక దళ విన్యాసాలను మోడీ 40 నిమిషాల సేపు వీక్షించారు. ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విన్యాసాల్లో సుఖోయి సు 30 ఎంకె1, రఫేల్ జెట్ విమానాలు పాలుపంచుకున్నాయి. సరకుల రవాణాకు, ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడేలా రూపొందించే ఎఎన్3 అనే ఐఎఎఫ్ విమానం కూడా విన్యాసాలు ప్రదర్శించింది. చబువా వద్ద ప్రధాని మోడీకి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ , కేంద్ర మంత్రులు సర్వానంద సోనోవాయి,రాష్ట్ర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. అస్సాం లోని చబువా వైమానిక స్థావరానికి సమీపంలలో ఉన్న ఈ రన్‌వే చైనా సరిహద్దుకు దాదాపు 300 కిమీ దూరంలో, మయన్మార్‌కు 200 కిమీ దూరంలలో ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారింది. ఈ 4.2 కిమీ ఈఎల్‌ఎఫ్ నిర్మాణానికి దాదాపు రూ. 100 కోట్లు వ్యయమైంది. అత్యవసర సమయాల్లో భారత్ యుద్ధవిమానాలు ఇక్కడ నుంచి బయలుదేరడానికి అలాగే విపత్తులు సంభవించేటప్పుడు సహాయక కార్యక్రమాలను నిర్వహించడానికి ఇది ఎంతో కీలకం అవుతుంది. 40 టన్నుల బరువు వరకు ఉన్న విమానాలను ఇక్కడ ల్యాండింగ్ చేయడానికి, గరిష్ఠంగా70 టన్నుల బరువు రవాణాతో టేకాఫ్ చేయడానికి వీలవుతుంది.

మన తెలంగాణ 14 Feb 2026 9:12 pm

Tribute |పుల్వామా అమరవీరులకు పేరూరులో దీపాల నివాళి…

Tribute | పుల్వామా అమరవీరులకు పేరూరులో దీపాల నివాళి… జోహార్ నినాదాలతో మారుమోగిన

ప్రభ న్యూస్ 14 Feb 2026 9:06 pm

త్వరలో ఇరాన్ పాలనలో మార్పు: ట్రంప్

వాషింగ్టన్ : ఇరాన్‌లో పాలనలో మార్పు జరిగితేనే అక్కడి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయన్న అభిప్రాయం ఉత్తమమనిపిస్తోందని, ఆమేరకు త్వరలో జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.47 ఏళ్లుగా చర్చల పేరుతో వారు అణు ఒప్పందంపై మాట్లాడుతున్నారని, ఈలోగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇకపై ఈ విషయంలో ఆలస్యం చేయదలచుకోలేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా సైన్యం ఇప్పటికే ఇరాన్‌ను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణుఒప్పందంపై ఇరాన్‌తో చర్చలు విజయవంతమవుతాయని తాను భావిస్తున్నానని, అవి విఫలమైన రోజు ఇరాన్ చరిత్రలో ఓ చెడు రోజుగా నిలిచిపోతుందని ట్రంప్ హెచ్చరించారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సూచించినట్టు చెప్పారు. 

మన తెలంగాణ 14 Feb 2026 9:01 pm

Shivanagar |విద్యుత్తు దీపాలంకరణలో మార్కండేయ..

Shivanagar | విద్యుత్తు దీపాలంకరణలో మార్కండేయ.. విద్యుదీపాలంకరణలో శివనగర్ మార్కండేయ దేవాలయంసర్వాంగ సుందరంగా

ప్రభ న్యూస్ 14 Feb 2026 8:59 pm

హీరో ధనుష్‌తో వివాహం.. రూమర్స్ పై స్పందించిన మృణాల్ ఠాకూర్

అందాల తార మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉండగా గత రెండు నెలలుగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఏకంగా ఫిబ్రవరి 14వ తేదీన వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ కూడా సృష్టించారు. ఈ వార్తలపై ఆమె మాట్లాడుతూ.. “ఫిబ్రవరి 14 కాస్త నాకు ఏప్రిల్ ఒకటిగా మారినట్టు అనిపించింది. ఎందుకంటే ఏప్రిల్ ఒకటి ఫూల్ డే కదా. పైగా నేను ఈ డేట్ ను అధిరికంగా చెప్పినట్లు కొంతమంది ఇలాంటి గాసిప్స్ కూడా వ్యాపింప చేస్తున్నారు. ఇలాంటి రూమర్స్ ని నమ్మకండి”అని పేర్కొంది.

మన తెలంగాణ 14 Feb 2026 8:55 pm

School |మురికి కూపంలో అక్షర దేవాలయం..

School | మురికి కూపంలో అక్షర దేవాలయం.. అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం మురికి

ప్రభ న్యూస్ 14 Feb 2026 8:53 pm

యాప్ ద్వారా 46 .13లక్షల బస్తాల యూరియా కొనుగోలు

నిజమయిన సాగుదారులకు సమయానికి యూరియా అందించాలనే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం మ్బైల్ ఎరువుల బుకింగ్ యాప్‌ను ప్రవేశ పెట్టిందని దీని ద్వారా ఇప్పటి వరకు 46,13,158 బస్తాల యూరియాను రైతులు కొనుగోలు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. డీలర్ దుఖాణాల వద్ద నిల్వల కారణంగా ఏర్పడే భారీ రద్దీ పరిస్థితులను నివారించేందుకు ఐటి ఆధారిత యాప్‌ను వ్యవసాయ శాఖ ప్రవేశ పెట్టింది. ఈ యాప్ ద్వారా పట్టాదార్ పాస్ బుక్, అటవీ హక్కుల చట్టం, లబ్దిదారులు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే విధంగా నిబంధనలు అమలు చేసింది. రైతులు బుక్ చేసుకునే యూరియా సంచుల సంఖ్య పంటరకం, సాగు విస్తీర్ణ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా యాప్ నిర్ణయిస్తుంది.అర్హత ఆధారంగా రైతులకు యూరియా కొనుగోలుకు అవకాశం కల్పిస్తుంది. యాప్‌ను మొదటగా వ్యవసాయ శాఖ ఐదు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి తరువాత రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో అమలు చేసింది. ఈ క్రమంలో శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12.73 లక్షల మంది రైతులు 50.48 లక్షల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా, వాటిలోమ 46.13 లక్షల బస్తాల యూరియా రైతులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్షంగా క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమయిన సవరణలు చేస్తూ యూరియా యాప్‌ను అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.

మన తెలంగాణ 14 Feb 2026 8:49 pm

Shivratri |విభూతి భస్మం తో శివలింగ అలంకరణ

Shivratri |విభూతి భస్మం తో శివలింగ అలంకరణ

ప్రభ న్యూస్ 14 Feb 2026 8:46 pm

మజ్లీస్‌తో మాకు పొత్తు లేదు: ఎమ్మెల్సీ అద్దంకి

మున్సిపల్ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీతో తమకు పొత్తు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. కొన్ని స్థానాల్లో మజ్లీస్‌తో ముఖా-ముఖి తలపడ్డామని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్-బిఆర్‌ఎస్-మజ్లీస్‌ల అక్రమ సంబంధమని, వాలంటైన్స్-డే శుభాకాంక్షలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని బిజెపికి రాకుండా అడ్డుకుంటే కాంగ్రెస్-బిఆర్‌ఎస్ నేతలను రోడ్లపై తిరగనీయం అని బండి సంజయ్ మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగునా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపికి స్పష్టమైన తీర్పు రాలేదని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఉందన్నారు. రాజకీయాల్లో ఎన్నికల సమయాల్లో పొత్తులు పెట్టుకోవడం, ఫలితాలు వెలువడిన తర్వాత అవగాహన కుదుర్చుకోవడం సహజమేనని ఆయన చెప్పారు. కరీంనగర్‌లో కాంగ్రెస్-మజ్లీస్ నేతలు కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ చెప్పడంలో అర్థం లేదన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సహకారం తీసుకున్నా ఒక్క మున్సిపాలిటీని బిజెపి గెలుపొందలేదని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకో జోకర్‌లా మారారని ఆయన విమర్శించారు. మున్సిపాలిటీల్లో బిఆర్‌ఎస్‌కు బాగా సీట్లు వచ్చాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పుకుంటున్నారని, కింద పడినా పైచేయి తనదేనని అంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు మరోసారి తమ పార్టీని ఆశీర్వదించారని అద్దంకి దయాకర్ తెలిపారు.

మన తెలంగాణ 14 Feb 2026 8:42 pm

Brahmotsavams |శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Brahmotsavams | శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ముక్కంటిని ముద్దాడుతున్న

ప్రభ న్యూస్ 14 Feb 2026 8:41 pm

wrestling |కుస్తీ పోటీలకు సిద్దం..

wrestling |కుస్తీ పోటీలకు సిద్దం.. సూర్యాపూర్ లో 16, 17 తేదీల్లో బరిలోకి

ప్రభ న్యూస్ 14 Feb 2026 8:34 pm

జైలులో పెట్టినా భయపడేది లేదు: కెటిఆర్

ఫార్ములా ఈ కేసు అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తున్నదని కెటిఆర్ అన్నారు. మరోసారి తనను విచారణకు పిలవబోతున్నారన్న సమాచారం ఉందని చెప్పారు. ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా పోతామని, ఉన్న సత్యం స్పష్టంగా చెబుతామని తెలిపారు. ఎన్ని సార్లు విచారణ చేసినా తమకేమీ ఇబ్బంది లేదని, చివరికి జైలులో పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్ అధికారులు, ఎసిబి అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారని అన్నారు. సింగరేణి కార్మికులకు సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసిందని కెటిఆర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా తమ పార్టీ కార్యకర్తుల గట్టిగా కొట్లాడారని చెప్పారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం అని పేర్కొన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగు మాత్రమే గెలిచిందని అన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జిహెచ్‌ఎంసిలో ఎన్ని గెలిచారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని, సాధారణంగా ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్లకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని కెటిఆర్ ఆరోపించారు.

మన తెలంగాణ 14 Feb 2026 8:31 pm

Photos : Couple Friendly Movie Success Celebrations

The post Photos : Couple Friendly Movie Success Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 14 Feb 2026 8:30 pm

అభిషేక్ ఫైనల్ టీమ్‌లో ఉంటాడు.. ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చిన సూర్య

టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రేపటి మ్యాచ్‌ గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఇందులో. మ్యాచ్‌ కోసం రచించిన వ్యూహాలు, పాక్ ప్లేయర్లకు కరచాలనం, తారిఖ్ బౌలింగ్‌ని ఎదురుకొనే విషయాలను సూర్య వెల్లడించాడు. ముఖ్యంగా ఫ్యాన్స్‌కి ఊరట కలిగిస్తూ.. అభిషేక్ శర్మ రేపటి మ్యాచ్‌లో ఆడుతాడని సూర్య తెలిపాడు. ‘‘అభిషేక్ శర్మ తప్పకుండా ఆడతాడు. అతడి ఆరోగ్యం బాగా ఉంది. తుది జట్టులో అతడు ఉంటాడు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను ఎదుర్కొనడంపై మేం కసరత్తు చేశాం. అతడి శైలి భిన్నమైందే. అలాగని మేం వదిలిపెట్టలేదు. అతడి బౌలింగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పాక్ ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వడంపై 24 గంటలు మీరు (మీడియా) వెయిట్ చేయాలి. టాస్ సమయంలో ఆలోచిస్తాం. కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులో ఉండాలని మీరు కోరుకుంటే తప్పకుండా ఉంటాడు. అయితే, మా బలాలపైనే మేం దృష్టి పెడతాం. ప్రత్యర్థి ఎలా ఆడతారనేది అవసరం లేదు. ఎవరు ఉత్తమ ఆటతీరు ప్రదర్శిస్తారో వారిదే విజయం’’ అని సూర్య పేర్కొన్నాడు.

మన తెలంగాణ 14 Feb 2026 8:27 pm

Congress |చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్..

Congress | చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్.. 20 వార్డులలో అధికార

ప్రభ న్యూస్ 14 Feb 2026 8:17 pm

Video : Actress Shivani Nagaram Exclusive Interview Promo

The post Video : Actress Shivani Nagaram Exclusive Interview Promo appeared first on Telugu360 .

తెలుగు 360 14 Feb 2026 8:11 pm

6 hours |మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు

6 hours | మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు 6 hours | అచ్చంపేట,

ప్రభ న్యూస్ 14 Feb 2026 8:09 pm

కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం

వాషింగ్టన్ : ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు అంటూ అమెరికాకు తరలి వెళ్తున్న విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. మరో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. బర్కిలీ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయోమాలిక్యూలర్ ఇంజనీరింగ్ చదువుతున్న కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు. శనివారం నగర వ్యాప్తంగా గాలింపు చర్యలు ఐదో రోజుకు చేరాయి. ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాక అధికారుల్లోను, కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. శ్రీనివాసయ్య చివరిసారిగా క్యాంపస్ నుండి ఒక కిలోమీటరు దూరంలో కనిపించాడని, అధికారులు చెబుతున్నారు. పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాక్‌ప్యాక్, క్యాంపస్ సమీపం లోని టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలోని నివాసం దగ్గరగా గుర్తించారు. లేక్ అంజా, చుట్టుపక్కల బర్కిలీ హిల్స్ ప్రాంతాలపై దృష్టి సారించి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు. మరోవైపు శాన్‌ఫ్రానిస్కో లోని భారత కాన్సులేట్ శ్రీనివాసయ్య అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. సాకేత్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని,వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. 2025 ఐఐటి మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన శ్రీనివాసయ్య బర్కిలీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతను బెంగళూరు లోని శ్రీవాణి ఎడ్యుకేషన్ సెంటర్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం శ్రీనివాసయ్య , మరో ఐదుగురితో కలిసి , “హైపర్‌లూప్ మైక్రోచానెల్ కూలింగ్‌సిస్టమ్ , ఫర్ హైపర్‌లూప్ అండ్ ఏ మెథడ్ డేర్‌ఆఫ్‌”కనిపెట్టినందుకు పేటెంట్ కలిగి ఉన్నారు.  

మన తెలంగాణ 14 Feb 2026 8:02 pm

CM Cup |సీఎం కప్ పోటీల్లో….

CM Cup | సీఎం కప్ పోటీల్లో…. CM Cup | ఉట్నూర్,

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:59 pm

Warangal |దేశవ్యాప్త సమ్మెను విజయవంతం…

Warangal | దేశవ్యాప్త సమ్మెను విజయవంతం… Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:56 pm

రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజునే రైతు భరోసా నిధులు విడుదల

రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పనుంది. యాసంగి రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనుకూల ఫలితాలను సాధించింది. మెజార్టీ మున్సిపాల్టీలను దక్కుకుని జోష్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రైతు భరోసాకు కావాల్సిన రూ.9వేల కోట్లను దాదాపు సమకూర్చుకుందని.. ఈ నెల 17న రైతుల ఖాతాల్లో ఆ నిధులను జమ చేయనుందని తెలుస్తోంది. కాగా, సిఎం రేవంత్ రెడ్డి కూడా.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో 17న రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.

మన తెలంగాణ 14 Feb 2026 7:52 pm

Shiva temple |పార్వతి–పరమేశ్వరుల దివ్య కల్యాణం

Shiva temple | పార్వతి–పరమేశ్వరుల దివ్య కల్యాణం Shiva temple | అచ్చంపేట,

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:51 pm

టి-20 ప్రపంచకప్: నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్

అహ్మదాబాద్: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 33 పరుగులు జోడించారు. అయితే మార్కో జెన్సన్ బౌలింగ్‌లో టిమ్ సీఫర్ట్(13) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రచిన్ రవీంద్ర (13) కూడా జెన్సన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ వెంటనే మంచి ఫామ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఫిన్ అలెన్(31)ని కూడా జెన్సన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్(1) పెవిలియన్ చేరాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజ్‌లో డరెల్ మిచెల్(7), మార్క్ ఛాప్‌మన్(11) ఉన్నారు.

మన తెలంగాణ 14 Feb 2026 7:46 pm

student |డీఎస్పీ ఉదారత…

student | డీఎస్పీ ఉదారత… student | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:43 pm

రూ 11000 కోట్ల రోడ్ల ప్రాజెక్టులు

తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో రూ 11000 కోట్లకు పైగా విలువైన రహదారుల నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సంబంధిత ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశం జరిగింది. ఇందులో రోడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మహారాష్ట్రలో రోడ్ల నిర్మాణ పనులకు రూ 3320.38 కోట్లు మంజూరు అవుతాయి. అక్కడ ఘోటి త్రయంబక్ (మెకాడా) జాహ్వర్ మనోర్ పల్ఘార్ సెక్షన్ జాతీయ రహదారి 160ఎ రోడ్ల మరమ్మత్తులు, ఆధునీకరణ జరుగుతుంది. ఇక తెలంగాణలో రూ 3175,08 కోట్ల నిర్మాణ వ్యయ అంచనాలతో రహదారుల నిర్మాణం చేపడుతారు. ఇందులో భాగంగా గుడెబల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకూ హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్‌ను నాలుగు లేన్లుగా మారుస్తారు. దీని వల్ల ఈ ప్రాంతానికి రాదారి సౌకర్యం మరింత సౌలభ్యం అవుతుంది. సరుకుల రవాణా మెరుగుపడుతుంది. నేషనల్ హైవేల ఒరిజినల్ స్కీం పరిధిలో ఈ నిర్మాణ ప్రక్రియ సాగుతుంది. ప్రత్యేకించి తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు మారుమూల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని అదికారులు తెలిపారు. నాలుగు లేన్ల ప్రామాణికతతో రోడ్లు వేయడం వల్ల ప్రయాణాలు వేగవంతం అవుతాయి. గుజరాత్‌లోని ధమసియా బిటాడా/ మోవి, నసర్‌పోర్ మలోతా మధ్య నాలుగులేన్ల సెక్షన్ల రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు రహదారులు , రవాణా మంత్రిత్వశాఖ (మోర్త్) తమ ప్రకటనలో తెలిపింది. పిఎం గతిశక్తి నథకం పరిధిలో ఈ రహదారుల పనులకు ఆమోదం తెలిపారని అధికార వర్గాలు తెలిపాయి. 

మన తెలంగాణ 14 Feb 2026 7:39 pm

Driving |ఓవర్‌టేక్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లే…

Driving | ఓవర్‌టేక్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లే… Driving | స్టేషన్ ఘన్

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:34 pm

దేశంలోనే తొలిసారిగా బహ్మపుత్ర నది పై రోడ్ కమ్ రైల్ టన్నెల్‌

కేంద్ర ప్రభుత్వం దేశంలోనే తొట్టతొలి రోడ్ కమ్ రైల్ టన్నెల్‌ను బ్రహ్మపుత్ర నది కింద నిర్మిస్తారు. సంబంధిత నిర్ణయానికి కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. నది కింద సొరంగ మార్గం , ఎగువన రైలు మార్గం ఉండే ఈ ప్రత్యేక రాదారిని గోహ్‌పూర్ , నుమాలిఘర్ మధ్య రూ 18,662 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మిస్తారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రైల్వే వ్యవహారాలను కూడా చూస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఇక కోల్‌కతాలో హుగ్లీ నది అడుగున నది సొరంగ మార్గం నిర్మించారు. ఇక సముద్రం అడుగున సొరంగ మార్గం అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. దీనిపై పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గతం భవిష్యత్తు అనుసంధాన ప్రతీకగా సేవాతీర్థ్ ప్రధాన మంత్రి కార్యాలయం ఏర్పాటు జరిగిందని , పరిపాలనా సమర్థత మెరుగుదలకు నూతన పిఎంఒ ఉపయుక్తం అవుతందని మంత్రి తెలిపారు. సేవాతీర్థ్‌లోనికి పిఎంఒ తరలింపును ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం వెలువరించింది. 

మన తెలంగాణ 14 Feb 2026 7:33 pm

26th Ward |గులాబీ గూటికి ముగ్గురు కౌన్సిలర్లు…

26th Ward | గులాబీ గూటికి ముగ్గురు కౌన్సిలర్లు… 26th Ward |

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:30 pm

మెట్రో పిల్లర్ కూలి.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

ముంబైలో మెట్రో పిల్లర్ కూలింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ముంబైలోని ములుండ్ ప్రాంతంలో జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌లో ఒక భాగం కూలిపోయి.. కింద వెళ్తున్న ఆటో, కారుపై పడింది. దంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ముంబై అగ్నిమాపక దళం (ఎంఎఫ్‌బి) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అధికారులు తెలిపిన ప్రకారం.. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ములుండ్ వెస్ట్‌లోని ఎల్‌బిఎస్ రోడ్‌లోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు నలుగురు వ్యక్తులు ఆటోలో ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, వారికి అవసరమైన సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, మృతి చెందిన వ్యక్తిని రామ్‌ధన్ యాదవ్‌గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని రాజ్‌కుమార్ ఇంద్రజీత్ యాదవ్ (45), మహేంద్ర ప్రతాప్ యాదవ్ (52), దీపా రుహియా(40)గా గుర్తించారు. వీరిలో రాజ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియుకి తరలించామని.. మహేంద్ర, రుహియా ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని అధికారులు చెప్పారు.

మన తెలంగాణ 14 Feb 2026 7:26 pm

Treatment |“నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడు?”

Treatment | “నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడు?” Treatment | పాలకుర్తి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:24 pm

Fact Check: Viral image claiming a bus got stuck on the Mira–Bhayandar flyover is AI-generated.

Social media posts alleges that even a bus was unable to pass through the newly constructed Mira–Bhayandar flyover in Mumbai.

తెలుగు పోస్ట్ 14 Feb 2026 7:22 pm

Shivratri |ఓం శివోహం…. శివోహం

Shivratri | ఓం శివోహం…. శివోహం Shivratri | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:18 pm

మున్సిపల్ ఎన్నికలు.. పార్టీల్లో చేరుతున్న స్వతంత్రులు

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నా.. కొన్ని స్థానాల్లో మాత్రం హంగ్ ఏర్పడింది. అలాంటి చోట్లలో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఇప్పటికే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, బిజెపికు చెందిన ఒకరు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అక్కడ మొత్తం 34 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌కు 14, బిఆర్ఎస్‌కు 14, స్వతంత్రులకు 5, బిజెపికి 1 స్థానం దక్కాయి. తాజా చేరికతో ఆ పార్టీ బలం 17కు చేరింది. ఇక ఇంద్రేశం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ లావణ్య, ఇస్నాపూర్ 10వ వార్డు కౌన్సిలర్ రాహుల్ రెడ్డి బిఆర్ఎస్‌లో చేరారు. మరోవైపు నారాయణపేట పదో వార్డు స్వతంత్ర కౌన్సిలర్ జయశ్రీ బిజెపిలో చేరారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. నారాయణపేటలో మొత్తం 24 స్థానాలకు 11 స్థానాల్లో బిజెపి గెలిచింది. ఇప్పుడు ఈ చేరికతో ఆ సంఖ్య 12కు చేరింది. దీంతో మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో ఓటు కీలకం కానుంది.

మన తెలంగాణ 14 Feb 2026 7:16 pm

Award |ఘనంగా సర్వజన వికాస్ మంచ్ ప్రథమ వార్షికోత్సవం

Award | ఘనంగా సర్వజన వికాస్ మంచ్ ప్రథమ వార్షికోత్సవం Award |

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:14 pm

1990 Vinayaka |లింగ‌రూపంలో ద‌ర్శ‌నం…

1990 Vinayaka | లింగ‌రూపంలో ద‌ర్శ‌నం… 1990 Vinayaka | తిర్యాణి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:04 pm

14thFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

14thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 14thFebCartoon |మూడో తరగతి నుంచే

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:04 pm

Municipal Elections |తెలంగాణలో క్యాంపు రాజకీయాలు

Municipal Elections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:59 pm

శ్రీశైలం యాత్రలో విషాదం

 దైవ దర్శనానికి వెళ్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం, విజయపురి (బీజాపూర్) జిల్లా, తాళికోట ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది భక్తులు రెండు క్రూజర్ వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయలుదేరారు. జడ్చర్ల-కోదాడ 167 జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామ శివారులో ఒక క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును అత్యంత వేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ముందు సీట్లలో కూర్చున్న వారు వాహనంలోనే ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో రాంరెడ్డి (52), ఆయన భార్య మేఘనరెడ్డి (45), మహాదేవి (55) అక్కడికక్కడే మృతి చెందారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ప్రమాదంలో కన్నుమూయడం స్థానికులను కలచివేసింది. మరో రెండు గంటల్లో క్షేత్రానికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరగడం వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతదేహాలు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయని తెలిపారు. రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. సిఐ నాగార్జున, ఎస్సై కృష్ణదేవ తమ సిబ్బందితో అక్కడ ఉన్న లారీ డ్రైవర్, జెసిబి సహాయంతో వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం వెల్దండలోని ఎన్నం హాస్పిటల్‌కు, స్వల్ప గాయాలైన మిగిలిన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తు, అలసట కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

మన తెలంగాణ 14 Feb 2026 6:54 pm

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ నుంచి టాలీవుడ్‌లో హీరోయిన్‌గా..

సోషల్‌మీడియాలో రీల్స్ చేస్తూ.. సినిమాల్లో, టివి షోల్లో చాలా మందే అవకాశాలు పొందారు. వీరిలో కొందరు ఏకంగా హీరోయిన్లు కూడా అయ్యారు. అలా ఇన్‌స్టా ఇన్‌ప్లుయెన్సర్‌గా తెలుగులో మంచి గుర్తింపు పొందిన యామినీ ఇఆర్.. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె నటిస్తున్న తొలి చిత్రానికి ‘క్వీన్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి రతన్ రిషి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇది చూస్తుంటే.. ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ప్రేమకథ అని తెలుస్తోంది. ‘‘రాళ్ల మీద పేర్లతో మిగిలిన ప్రేమ కథలు కొన్ని.. తాజ్‌మహల్ గుర్తులుగా వెలిగిన కథలు కొన్ని.. కానీ.. ఈసారి దేశపు మనుగడను మార్చే దారిలో, కొత్త శాసనంగా.. ఈ ప్రేమ కథ’’ అని గ్లింప్స్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. సినిమా ఆసక్తికరమైన డ్రామాగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 14 Feb 2026 6:49 pm

13 seats |సత్తా చాటుతాం…

13 seats | సత్తా చాటుతాం… 13 seats | నిర్మల్ ప్రతినిధి,

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:48 pm

temples |శివరాత్రి …శోభ

temples | శివరాత్రి …శోభ temples | కుంటాల, ఆంధ్రప్రభ : శివరాత్రి

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:42 pm

Chandrababu: మూడేళ్లలో అమరావతి రూపురేఖలే మారనున్నాయి : చంద్రబాబు

ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 14 Feb 2026 6:34 pm

Centuries |విశ్వాసానికి ప్ర‌తీక‌గా…

Centuries | విశ్వాసానికి ప్ర‌తీక‌గా… Centuries | తీర్యాణి, ఆంధ్రప్రభ : దట్టమైన

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:33 pm

Students |విద్య‌తోనే అభివృద్ధి…

Students | విద్య‌తోనే అభివృద్ధి… Students | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:26 pm

10th Ward |చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో…?

10th Ward | చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో…? 10th Ward |

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:21 pm

Rs.50 thousand |ఆర్థిక సహయం

Rs.50 thousand | ఆర్థిక సహయం Rs. 50 thousand | హసన్

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:16 pm

feb14th |ఒకే రంగు చీరల్లో మహిళాఎమ్మెల్యేలు.. సీఎం ఆశ్చర్యం

feb14th | ఒకే రంగు చీరల్లో మహిళాఎమ్మెల్యేలు.. సీఎం ఆశ్చర్యం అసెంబ్లీలో మహిళా

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:14 pm

G.O. No.153 |నిధులు కేటాయించాలి…

G.O. No.153 | నిధులు కేటాయించాలి… G.O. No.153 | కర్నూల్ బ్యూరో,

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:12 pm

Telangana : కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పెర్ ఫార్మెన్స్ అంత బాగాలేదా? సీనియర్లు ఏమంటున్నారంటే?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తెలుగు పోస్ట్ 14 Feb 2026 6:12 pm

market |మానవతా దృక్పథంతో…

market | మానవతా దృక్పథంతో… market | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:00 pm

‘దురంధర్’లో కీలక పాత్ర.. నాగార్జున రియాక్షన్ ఇదే..

ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నా కింగ్ నాగార్జున. ‘కూలీ’ సినిమాలో విలన్ సైమన్ పాత్రలో తన నటనతో అందరినీ మెప్పించారు నాగార్జున. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో 100వ సినిమాలో నటిస్తున్నారు. ‘KING100’ అనే వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే రీసెంట్ సూపర్ హిట్ సినిమా ‘దురంధర్’లో నాగార్జునకు విలన్ పాత్ర ఆఫర్ వచ్చిందంటూ.. సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై నాగార్జున స్పందించారు. ‘దురంధర్’ మంచి సినిమానే కానీ, తనకు మాత్రం ఎలాంటి ఆఫర్ రాలేదని నాగార్జున స్పష్టం చేశారు. ‘దురంధర్ మంచి సినిమా, అదిత్యధర్ అద్భుతంగా దర్శకత్వం వహించారు. ఆయన తీసిన ‘ఉరి’ సినిమా కూడా నాకు ఇష్టమే. ఆ సినిమాలో అందరూ చక్కగా నటించారు. అక్షయ్ ఖన్నా నటన సినిమాకే హైలైట్. సీక్వెల్ కోసం నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నా. అది కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని నాగార్జున తెలిపారు.

మన తెలంగాణ 14 Feb 2026 5:56 pm

AP |శివరాత్రి హై అలర్ట్..!

AP | శివరాత్రి హై అలర్ట్..! AP | శ్రీ సత్య సాయి

ప్రభ న్యూస్ 14 Feb 2026 5:56 pm

2024 Budget |సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా…

2024 Budget | సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా… 2024 Budget | గుంటూరు

ప్రభ న్యూస్ 14 Feb 2026 5:52 pm

Road |ఇద్దరు మృతి

Road | ఇద్దరు మృతి Road | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 14 Feb 2026 5:48 pm

Hospital |వీర సైనికులకు నివాళులు…

Hospital | వీర సైనికులకు నివాళులు… Hospital | డోన్ టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Feb 2026 5:48 pm

బీఆర్ఎస్ బీజేపీ తోకపార్టీగా మారుతుంది : కవిత

బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో అపజయంపై కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు

తెలుగు పోస్ట్ 14 Feb 2026 5:36 pm

పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టూ టౌన్ సిఐ రెడ్డప్ప పోక్సోచట్టము, బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ధర్మవరం సబ్‌డివిజన్ శక్తి టీమ్–1, తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టం , దాని శిక్షలు, బాల్య వివాహాలు ,వాటి చట్టపరమైన పరిణామాలు, ఈవ్‌ టీజింగ్, అలాగే 18 సంవత్సరాల లోపు వయస్సులో ప్రేమ సంబంధాల వల్ల […] The post పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 5:30 pm

అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి

సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ సరిగా లేదని, ఆ వ్యవస్థను చక్కపరచాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి విజయవాడ ఆర్జేడి అధికారిని రోహిణికు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో సిడిపిఓ గా పనిచేసిన లక్ష్మి తో పాటు ఇతర సిబ్బంది ఎన్నో అవకతవకలకు పాల్పడి అంగన్వాడీ వ్యవస్థకు […] The post అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 5:26 pm

Chiru Chaithu Nikhil |ఆ మూడు సినిమాలకు విఎఫ్ఎక్స్ కష్టాలు..

Chiru Chaithu Nikhil | ఆ మూడు సినిమాలకు విఎఫ్ఎక్స్ కష్టాలు.. Chiru

ప్రభ న్యూస్ 14 Feb 2026 5:21 pm

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక

విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన ఎం అఖిల్ శ్రీ వర్మ అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈనెల24 నుంచి కలకత్తాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ శ్రీ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా అఖిల్ శ్రీ వర్మ శనివారం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకు వస్తానన్నారు. ఈ గెలుపుకు కారణం అయిన పీడీ పద్మావతి […] The post జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 5:20 pm

Chaatu From Purushaha: Breezy Valentine’s Treat

The team behind Purushaha, directed by Veeru Vulavala and produced by Battula Koteswara Rao under Kalyan Productions, unveiled a breezy Valentine’s Day treat with Chaatu Chaatu, a track that instantly nudges you into a warm, romantic mood. Unlike the quirky teaser and the impactful first single sung by MM Keeravani, this new number shifts the […] The post Chaatu From Purushaha: Breezy Valentine’s Treat appeared first on Telugu360 .

తెలుగు 360 14 Feb 2026 5:19 pm

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల రాంనగర్లో ఉన్న శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ […] The post ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 5:15 pm

థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు

విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్యోగులు […] The post థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 5:08 pm

AP |భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు…

AP | భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు… AP | నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 14 Feb 2026 5:03 pm

ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే..

ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు దీపం 2.0 – రూ.2,601 కోట్లు వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు తల్లికి వందనం ఉ రూ.9,668 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం ఉ రూ.4,581 కోట్లు ఉపకార వేతనాలు ఉ రూ.3,836 కోట్లు సమగ్ర శిక్ష ఉ రూ.2,946 […] The post ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 5:01 pm

ఆ చరిత్ర గురించి మాకు తెలుసు.. కానీ ప్రయత్నిస్తాం: పాక్ కెప్టెన్

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే టి-20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఎనిమిది మ్యాచుల్లో తలపడితే.. భారత్ 7 మ్యాచుల్లో విజయం సాధించగా.. పాక్ కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచింది. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాబర్ ఆజామ్ ఫామ్, ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ గురించి అతడు వివరించాడు. ‘‘ప్రపంచకప్‌లో భారత్‌పై మా రికార్డు మంచిగా లేదు. అయితే ఆ చరిత్ర గురించి తెలుసు.. దాన్ని మార్చలేం. కానీ, ఈసారి తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. జట్టులోకి ప్రతి ఒక్కరిదీ కీలక పాత్రే. తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై వచ్చే విమర్శలను పట్టించుకోం. ఇప్పటికే అతడి బౌలింగ్‌ యాక్షన్‌కి ఐసిసి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఇక మా సీనియర్ బాబర్ ఆజామ్ ఫామ్ గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు. తప్పకుండా అతడు పరుగులు సాధిస్తాడని అశిస్తున్నాం. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కువగా మార్పులు చేయం. భారత ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. వారు ఇస్తే మేము తప్పకుండా ఇస్తాం. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకొని మ్యాచ్ ఆడుతాడని భావిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటున్నా. టాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్‌లో ఎవరు మంచిగా ఆడితే వాళ్లే గెలుస్తారు. ఆట ముఖ్యం.. టాస్ కాదు’’ అని సల్మాన్ అఘా అన్నాడు.

మన తెలంగాణ 14 Feb 2026 5:01 pm

21st century |నాయకా.. మరీ ఇంత వల్గరా..

21st century | నాయకా.. మరీ ఇంత వల్గరా.. 21st century |

ప్రభ న్యూస్ 14 Feb 2026 4:57 pm

ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నాం : చంద్రబాబు

అమరావతి: వైసిపి విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నామని, ఇంకా చాలా సమస్యలున్నాయని తెలియజేశారు. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వస్తోందని, కేంద్రం సహకారంతో మేనేజ్ చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని..సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని అన్నారు. రెండు, మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని, అమరావతి దారులను జాతీయ రహదారికి అనుసంధానిస్తామని చెప్పారు. అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమమూ వస్తుందని, అమరావతికి పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగిందని అన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ వల్ల యాక్సిస్ మరింత పెరుగుతుందని, రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని అన్నారు. హార్టికల్చర్ హబ్ కు రూ.30 కోట్లు కేటాయించడం బాగుందని, రాయలసీమలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసం, నీళ్లను రైళ్లలో తరలించిన సందర్భాలు ఉన్నాయని, 2014-19 మధ్య కూడా రైన్ గన్స్ తో పంటలు కాపాడే పరిస్థితి ఉండేదని అన్నారు. అప్పుడే హంద్రీనీవాను సీరియస్ గా తీసుకున్నామని, దేశంలోనే నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని అన్నారు. రాయలసీమలో పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని, ఎమ్మెల్యేలకు స్టీల్ కవర్ లో ఇచ్చే నివేదిక వారి పనితీరుకు నిలువుటద్దం అని..సూచించారు. తాను గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగానే ఉంటానని..మారకపోతే వాళ్లకు నష్టం అని..మొత్తం 9 పేరా మీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నామని అన్నారు.వారికి తెలియని ఇంకొన్ని పేరా మీటర్లు కూడా తన వద్ద ఉన్నాయని, మంత్రి లోకేష్ తన పని తాను చేస్తున్నాడని.. నా పని నేను చేస్తున్నానని అన్నారు. నేతలతో మానవీయ సంబంధం, మోటివేషన్ భయం-భక్తిలా ఉండాలని తెలిపారు. మంగళగిరి చీరలకు బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని, ఎల్లుండి బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నారని అన్నారు. బిల్ గేట్స్ ను 3 సార్లు ఎపికి తీసుకొచ్చిన ఘనత తనదేనని, తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారని చెప్పారు. ఇప్పుడు సంజీవిని పథకం కోసం వస్తున్నారని, సంజీవిని పథకానికి ఆర్టిజిఎస్ లో కార్యక్రమం రూపొందించామని అన్నారు. 1982 హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ దాటితే అడవిలా ఉండేదని, నాలుగేళ్లలోనే అక్కడి పరిస్థితులన్నీ మారిపోయాయని,అమరావతి అభివృద్ధి లోనూ అలాంటి మార్పులే ఉంటాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.   

మన తెలంగాణ 14 Feb 2026 4:54 pm