టి20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గ్రూప్డిలో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కివీస్ 15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్లు విధ్వంసక బ్యాటింగ్తో జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. ఆరంభం నుంచే ఇద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. సిఫర్ట్ తన మార్క్ బ్యాటింగ్తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సిఫర్ట్ 42 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా బ్యాటింగ్ చేసిన అలెన్ 50 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, మరో 5 ఫోర్లతో 84 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో కివీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే జయకేతనం ఎగుర వేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యుఎఇని కెప్టెన్ మహ్మద్ వసీం, అలీషాన్ షరఫు ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వసీం 45 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. షరఫు 5 ఫోర్లు, రెండు సిక్స్లతో 55 పరుగులు సాధించాడు. మయాంక్ (21) తనవంతు సహకారం అందించాడు.
కాంగ్రెస్ ఎంపిల ప్రవర్తనపై వీడియో బయటపెట్టిన మంత్రి కిరెణ్ రిజిజు
లోక్సభలో ఏదో జరగరాని సంఘటన జరగబోతోందని తనకు విశ్వసనీయ సమాచారం ఉన్నందునే సభకు హాజరుకావద్దని స్వయంగా ప్రధాని మోడీకి తాను తెలియజేసినట్లు ఈ నెల 4న లోక్సభలో జరిగిన పరిణామాలపై స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రకటన ఇటీవల చర్చనీయాశమైంది. దానికి మద్దతుగా ఆ రోజు సభలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారల మంత్రి కిరెణ్ రిజిజు బయటపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు బ్యానర్ చేతిలో పట్టుకుని తొలుత వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. కాసేపటికే ప్రధానమంత్రి సీటును చుట్టుముట్టి బ్యానర్ ప్రదర్శిస్తూ నినాదాలు అందుకున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రెజరీ బెంచ్ సభ్యులు, కేంద్రమంత్రులు గిరిరాజ్, అశ్విని వైష్ణవ్ వారిని వారిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తదుపరి కార్యాచరణపై వారు చర్చించుకుంటున్న తీరు కూడా అందులో ఉంది. ఆ రోజు పార్లమెంట్ గౌరవ మర్యాదలను కాపాడేందుకు తమ సభ్యులు సహనం వహించారని రిజిజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపిల ప్రవర్తనను చూసి ఆ పార్టీ నాయకత్వం గర్వపడడం సిగ్గుచేటన్నారు.
17న భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 17 నుంచి 19వరకు ఆయన ఇక్కడ పర్యటించనున్నారని విదేశాంగ శాఖ మంగళవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారని తెలిపింది. ప్రాంతీయ అంశాలతో ప్రపంచంలోని తాజా పరిస్థితులపై మోడీ, మేక్రాన్ చర్చలు జరుపుతారని పేర్కొంది. అదే విధంగా ఢిల్లీలో జరనున్న ‘కృత్రిమ మేధప్రభావం’ సదస్సులో ఇరువుకు కలిసి పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ముంబయిలో జరగనున్న ‘ఇండియాఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమాన్ని కూడా ఉమ్మడిగా ప్రారంభించనున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది.
Students |పేద విద్యార్థుల చదువుకు బాబు, లోకేష్ భరోసా..
Students |పేద విద్యార్థుల చదువుకు బాబు, లోకేష్ భరోసా.. రూ.1200 కోట్ల ఫీజు
పిచ్చికుక్క కాటుకుతో చికిత్స పొందుతూ ఐదేళ్ల చిన్నారి మృతి
అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి పిచ్చి కుక్క కాటుకు బలైన సంఘటన షాబాద్ మండలం చర్లగూడ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చర్లగూడ గ్రామానికి చెందిన సిద్దూలూరు కుమార్ దంపతులకు బాబు, కూతురు ఉన్నారు. కూతురు నక్షత్ర (5) గత పది రోజుల క్రితం ఇంటిముందు ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న ఒక పిచ్చికుక్క చిన్నారిని కాటు వేసింది. చేతికి ముఖానికి గాయాలయ్యాయి. అది గమనించిన కుమార్ దంపతులు చిన్నారిని హుటాహుటినా ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా రేబీస్ వ్యాధి ముదిరిందని చికిత్స చేయాలనే డాక్టర్లు తెలుపగా పది రోజులుగా అక్కడే ఉండి చికిత్స చేస్తున్నారు. సోమవారం రోజు రాత్రి పరిస్ధితి విషమించి చిన్నారి మృతి చెందింది. దీంతో ఆ పేద కుటుంబంలో విషాదం మిగిలింది.
తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం జరిగిన హుండీ ఆదాయం లెక్కింపులో భాగంగా నగదుతో పాటు 136 గ్రాముల బంగారం, మూడు కిలోల ఆరు వందల గ్రాముల వెండిని హుండీలో భక్తులు సమర్పించుకున్నట్లు ఈవో తెలిపారు. అమెరికా 1,605 డాలర్లు, సింగపూర్ 71 డాలర్లు, కెనడా 25 డాలర్లు, యూరప్ 40 యూరోలు, చైనా 110 యువన్, 39 రియల్, 100 ఒమన్, 2 కువైట్, 1000 జపాన్, 140 థాయిలాండ్, 165 ఇంగ్లాండ్ పౌండ్స్, 225 ఆస్ట్రేలియా, 550 మయన్మార్, 2600 శ్రీలంక, 2000 యుగాండా, 5000 ఇండోనేషియా, 110 సౌతాఫ్రికా, 20 నేపాల్, 15 భూటాన్, 20 పోలాండ్ను హుండీలో సమర్పించుకున్నట్లు తెలిపారు. నిత్యరాబడి.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి మంగళవారం వివిధ శాఖల నుంచి భారీగా ఆదాయం వచ్చింది. నిత్యరాబడిలో భాగంగా స్వామి, అమ్మవార్లకు రూ.15,55,606 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,03,556, బ్రేక్ దర్శనం ద్వారా రూ.90,000, శ్రీసత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.27,000, రూ.150 వీఐపీ దర్శనం ద్వారా రూ.1,50,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.1,68,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.39,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.8,41,080, కల్యాణకట్ట ద్వారా రూ.28,500తోపాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం ద్వారా ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి సేవలో.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తమిళనాడు ఆళ్వార్ తిరునగరి పీఠం శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా ఈవో స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాన్ని అందజేశారు.
బిఆర్ఎస్ ఇప్పటికీ మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తుంది: మంత్రి పొంగులేటి
ఒక ప్రక్క ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతున్నప్పటికి బి ఆర్ ఎస్ పార్టీ నేతలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, వాళ్ళ వద్ద ఇంకా ట్యాపింగ్ పరికరాలు ఉన్నట్లు అనుమానం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉందని దీనిపై పూర్తి స్దాయిలో విచారణ చేస్తామన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ (పరికరాలు) అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని, తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. అసలు తాను ఉద్యోగులతో చేసిన సంభాషణకు సంబంధించిన ‘వాయిస్ కాల్ రికార్డ్’ బీఆర్ఎస్ నాయకులకు ఎలా లభ్యమైందని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తనకు అనుమానం కలుగుతోందన్నారు. ఏ మామిడితోటల్లో, మరే ఫాం హౌజ్ లలో, ఎవరి ఇళ్లలో ఉండి ఇంకా ఎంత మంది దొంగతనంగా మాటలు వింటున్నారో, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయం తేలాల్సిన అవసరముందన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి స్పష్టం చేశారు. తానో మంత్రినని, మంత్రిగా తనకున్న అవకాశాన్ని బట్టి అధికారులతో ,ఉద్యోగులతో అనేక సమీక్షలు జరుపుతుంటానని ఇందులో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. నా పార్టీకోసం ఓట్లు అడగడం తప్పా? అని కూడా ఆయన అన్నారు. ఉద్యోగులు కూడా ఓటర్లేనని, సామాన్యుడు వినియోగించుకున్న తరహాలోనే ఉద్యోగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారని, వారిని తాను ఓట్లు అడగడంలో తప్పేమిటని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికి కూడా అదే ఓటు ఉంటుందని, ఓటర్లుగా ఉన్నటువంటి ఉద్యోగులను తన పార్టీ కోసం అభ్యర్థించడంలో ‘వాట్ ఈజ్ రాంగ్?’ అని పొంగులేటి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ డబుల్ బెడ్ రూం ఇళ్ళ గురించి పార్టీ కండువ కప్పుకున్న వారికే సంక్షేమ పథకాలు ఇవ్వాలని, డ్రాలు, లిస్టులు లేవని అంటూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన వాయిస్ రికార్డును విలేఖర్లకు విన్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు కాంగ్రెస్వే రాష్ట్రంలో బుధవారం జరగనున్న116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం పైగా సీట్లను కైవసం చేసుకోబోతుందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజలకు చేరువయ్యాం. అందుకే ఈ పుర ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విసిరిన రెఫరెండమ్ సవాళ్లను ప్రజలు తిప్పికొట్టారు.. అదే ఫలితం రేపు పునరావృతం కాబోతుందని అన్నారు. మొన్నటి వరకు రెఫరెండమ్, సెమీఫైనల్ అంటూ ప్రగల్భాలు పలికిన నాయకులు ఇప్పడు ఎందుకు సైలెంట్ అయ్యారని ఆయన ప్రశ్నించారు. మున్సిపాల్టీలో అధికార కాంగ్రెస్ పార్టీకి వస్తున్న స్పందనను చూసి, రిఫరెండమనే నాయకులు ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించ లేదన్నారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు సిపిఐతో ప్రెండ్లి కాంటేస్ట్తోనే ఉన్నామని సిపిఐ కాంగ్రెస్తోనే ఉంటుందన్నారు. తాను సిఎం రేసులో లేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓట్ల కోసం దౌర్జన్యాలకు, దందాలకు , అక్రమాలకు పాల్పడితే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని తాను ఎవ్వరిని బెదిరించలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. నెలకు రూ. 6,300 కోట్లు కేవలం అప్పులకే కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదు. గత దొరల పాలనలో పేదలను విస్మరించారు. 62 వేల డబుల్ బెడ్ రూంలను మొండిగోడలుగా మిగిల్చారు. కానీ మేం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. వరి వేస్తే ఉరి అన్న కాలం పోయి, ఇప్పుడు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం అని వివరించారు. ఆరు గ్యారెంటీలో కొన్ని బాకీ ఉన్న విషయం వాస్తవమేని వాటిని కూడా దశలవారీగా అమలు చేస్తామని ప్రజలకు నచ్చజెప్పుతున్నామని తమ మాటలను ప్రజలు విశ్వసిస్తున్నారు అనేదానికి గ్రామ పంచాయతీ ఎన్నికలో వచ్చిన తీర్పే నిదర్శనమన్నారు. ఇందిరమ్మఇళ్ళ పథకంలో అర్బన్ ప్రాంతాల్లో సొంత జాగా లేని వారికి రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేసి ప్రణాళికను రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. జి+3 విధానంలో మూడంతస్ధుల అపార్టెమెంట్ను నిర్మించి సొంత ఇంటి స్ధలం లేని వారికి నిర్మించి అందజేస్తామన్నారు. గత బి ఆర్ ఎస్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 63 వేల డబుల్ బెడ్ రూం గదులను పూర్తి చేసి వాటిని పట్టణాల్లోని అత్యంత పేదలను గుర్తించి వారికి కేటాయిస్తామని ఇప్పటికే 31వేల ఇళ్ళను పూర్తి చేసి సొంత ఇంటి స్ధలం లేని వారికి అందజేశాం, ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే వాటిని కూడా పేదలకు పంపిణి చేస్తామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రజలంతా గడిచిన రెండేళ్ళుగా చెప్పటిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించాలని ఆయన కోరారు.
గోషామహల్లో భారీ ఎత్తున పట్టుబడ్డ నగదు
రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చే సి, వారి నుంచి రూ.76, 87, 650 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల క థనం ప్రకారం...గోషామహల్ గ్యాన్బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో మంగళవారం ఉదయం ముగ్గురు అనుమాని త వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తచ్చాడుతుండటం గమనించిన గోషామహల్ పోలీసులు వారి ద్విచక్ర వాహనాలను ని లిచి, తనిఖీ చేయగా, వారి వద్ద గల మూడు సంచీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో పాటు సగం చించివేసిన రూ.10 నోటుతో పాటు మ రో రూ.20 నోటు లభించాయి. పట్టుబడిన ముగ్గురు అనుమానితులను పోలీసులు నగదు గురించి ఆరా తీయగా, ముగ్గురూ వ్యక్తులు భయంతో తడ బడటంలో అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద లభించిన రూ.76, 87, 650 స్వాధీనం చేసుకుని, పోలీస్స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో అనుమానిత ముగ్గురు వ్యక్తులు రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన గజరామ్ అధికారి జో టార్మ్, బెహ్రామ్ అధికారి గణపతి రామ్, రాకేష్ దేవాసి అధికారి మసు రారామ్ అధికారి మహేందర్లుగా తేలింది. వీరంతా బతుకు తెరువు కోసం న గరానికి వచ్చి ఉస్మాన్గంజ్, చాక్నావాడీ, గ్యాన్బాగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో వేర్వేరుగా గదులు అద్దెకు తీసుకుని, నివసిస్తున్నారని గోషామ హల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పకపోగా, పొంతన లేకుండా సమాధానాలు చెబుతున్నారని, వా రి వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేక పోవడంతో నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ కోసం ఇన్కమ్ టాక్స్ అధికారుల కు అప్పగించనున్నట్లు తెలిపారు. భారీ మొత్తంలో పట్టుబడిన నగదును ప్రస్తుతానికి హవాలా డబ్బుగానే భావిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ మేర కు కేసు నమోదు చేసి, ఈ డబ్బును ఎవరికి ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి పంపిస్తున్నారు? ఇక్కడ హవాలా రాకెట్ నడుపుతున్న వారు ఎవ రు? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బి శ్రవణ్కుమార్ పేర్కొన్నారు.
Ghantasala |ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవం…
Ghantasala | ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవం… ఇది తెలుగు జాతికి శ్రీకృష్ణ
డికెకు మద్దతుగా 90మంది ఎంఎల్ఎల లేఖ!
శివకుమార్కు సిఎంగా ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి వినతి ఎంఎల్ఎ ఇక్బాల్ వ్యాఖ్యలతో చర్చనీయాంశమైన కర్నాటక పరిణామాలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: సిద్ధరామయ్య హైకమాండ్కు అన్నీ తెలుసు: డికె శివకుమార్ బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో డిప్యూటీ సిఎం శివకుమార్ను నియమించాలని కోరుతూ 80 మంది ఎంఎల్ఎలు హైకమాండ్కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎంఎల్ఎ, డికె మద్దతుదారుడు ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఆయన తాజా ప్రకటనలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ‘అవును. నిజమే 80 నుంచి 90 మంది శాసనసభ్యులం డికెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాశాం. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పలుమార్లు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా మేం క్రమశిక్షణగా మెలగాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటించాల్సి ఉంటుంది’ అని ఇక్బాల్ మీడియాతో వ్యాఖ్యానించారు. కర్నాటకలో నాయకత్వ అంశంపై సిఎం సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, వారు ఏ నిర్ణయం వెలువరిస్తే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తాను ఢిల్లీకి వెళ్లబోనని, ఒకవేళ హైకమాండ్ను పిలుపు వస్తేనే వెళ్తానని అన్నారు. ఇక దీనిపై అనవసరమైన ప్రశ్నలు అక్కర్లేదని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య అన్నారు. తాను పదేపదే ఢిల్లీకి ఎందుకు వెళ్లాలని, తనకు ఇక్కడ బడ్జెట్ సిద్ధం చేసుకునే పనులతో పాటు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు డికె శివకుమార్ మాట్లాడుతూ... తమ మధ్య ఏం చర్చ జరిగిందనేది మొత్తం పార్టీ పెద్దలకు తెలుసని, అంతా వారిముందే జరిగిందని అన్నారు. అధిష్టానం ముందే సిద్ధరామయ్య మాట్లాడారని, అందులో గందరగోళానికి తావెక్కడిదని ప్రశ్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.
6Benefits |అరటి పండు తింటే దూరమయ్యే నీరసం, గుండెకు అద్భుత రక్షణ
6Benefits | అరటి పండు తింటే దూరమయ్యే నీరసం, గుండెకు అద్భుత రక్షణ
praja dharbar |రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్..
praja dharbar | రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్.. praja dharbar
రైజ్తో మహిళలకు ఆర్థిక సాధికారత
కలెక్టర్ జి. లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ (రైజ్) కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు విశేషంగా తోడ్పాటు లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు రైజ్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న […] The post రైజ్తో మహిళలకు ఆర్థిక సాధికారత appeared first on Visalaandhra .
The post ఆర్థిక అక్షరాస్యత కీలకం appeared first on Visalaandhra .
Sp |ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు
Sp | ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు అన్ని కోణాల్లో దర్యాప్తువెల్లడించిన
Municipal Results May Set Stage for a Fresh Assembly By Election in Telangana
For all three major parties, Municipal elections have turned into a prestige battle. For Chief Minister Revanth Reddy, the results carry even greater weight. They are being seen as a direct measure of his government’s performance and political grip after coming to power.Strong indications suggest that Telangana may soon head towards another Assembly by-election. Sources […] The post Municipal Results May Set Stage for a Fresh Assembly By Election in Telangana appeared first on Telugu360 .
Fire |టైల్స్ షోరూమ్ మంటలు ..ఫర్నిచర్ దహనం
Fire | టైల్స్ షోరూమ్ మంటలు ..ఫర్నిచర్ దహనం రూ. 6 లక్షల
Collector |మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
Collector | మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం పోలింగ్ ప్రక్రియను
అర్జున్-సానియా పెళ్లి.. ప్రధాని మోడీకి ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియాను అర్జున్ వివాహం చేసుకోబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఈక్రమంలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి.. అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించారు. ప్రధాని మోడీతో దిగిన ఫోటోలను సచిన్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఖాతాల్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించడం మాకు గౌరవంగా ఉంది. యువ జంటకు మీ ఆశీర్వాదాలు, ఆలోచనాత్మక సలహాలకు ధన్యవాదాలు అని టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అర్జున్-సానియా చాందోక్ ల నిశ్చితార్థ వేడుక జరిగింది. అర్జున్, సానియా మార్చిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. ఆల్ రౌండర్ అయిన అర్జున్, దేశీయ సర్క్యూట్లో గోవా తరపున ఆడుతున్నాడు. అర్జున్ 22 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 23 లిస్ట్ A గేమ్లు, 29 T20 మ్యాచ్లు ఆడాడు. 2020/21 సీజన్లో ముంబై తరపున టీ20లో అరంగేట్రం చేశాడు. 2022/23 సీజన్లో గోవా తరుపున లిస్ట్ A, FC కెరీర్ను ప్రారంభించాడు. సానియా ఎవరు? సానియా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, గ్రావిస్ గ్రూప్ అధినేత రవి ఘాయ్ మనవరాలు. పెంపుడు జంతువుల సంరక్షణ సేవలపై దృష్టి సారించిన ముంబై వెంచర్ అయిన Mr Paws Pet Spa & Store LLPలో భాగస్వామి, డైరెక్టర్గా సానియా ఉంది.
Ranveer Singh receives threatening WhatsApp Voice Notes
Bollywood Superstar Ranveer Singh has been riding high with the super success of Dhurandhar. The actor today received a threatening Whatsapp Voice Note as per the reports coming from the Bollywood media. The voice note was sent demanding crores of money from the actor. Ranveer Singh has approached the Mumbai police soon after he received […] The post Ranveer Singh receives threatening WhatsApp Voice Notes appeared first on Telugu360 .
Ration |మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్
Ration | మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్ Ration |
Brs| 4వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం …
Brs| 4వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం … ఆదరించి గెలిపించండి అభివృద్ధి
Govt |బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి
Govt | బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి Govt | మోత్కూర్,
కరెంటు షాక్తో అత్తను చంపిన అల్లుడు
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట పంచాయతీ మంగళి తండా (బడి తండా)లో సోమవారం రాత్రి అత్యంత పాశవిక ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అల్లుడే కాల యముడిగా మారి, అత్తకు విద్యుత్ షాక్ పెట్టి హత మార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం లేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... భద్రాద్రి కొత్తగుడెం జిల్లా జులూరుపాడుకు చెందిన దారావత్ కౌసల్య (50) తన అల్లుడైన రాజేష్ పిలుపు మేరకు సీతంపేట మంగళి తండా (బడి తండా) వారి ఇంటిలోకి వచ్చారు. అయితే సోమవారం రాత్రి సమయంలో రాజేష్ ఆమెకు కరెంటు షాక్ ఇచ్చి అతి కిరాతకంగా చంపాడు. సొంత భార్య తల్లిదండ్రులు అని కూడ చూడకుండా వారిపై ఈ ఘాతుకానికి పాల్పాడ్డారు. ఇందులో అత్త మరణించగా మామ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆయనను ఆస్పత్రికి తరలించాలని గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Spirit l స్పిరిట్ నుంచి బయటపడ్డారా?
Spirit l స్పిరిట్ నుంచి బయటపడ్డారా? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్
ఖైరతాబాద్ లో రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. తరుణ్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన తరుణ్ హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2017 లో హైదరాబాద్ కు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. వీరికి ఒ కూతురు ఉంది. కాగా గత సంవత్సరం కాలంగా తరుణ్ మతిస్థిమితం బాగాలేక చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళలవారం ఉదయం ఇంటి నుండి బయలకు వెళ్లాడు. మధ్యహ్నం సమయంలో ఖైరతాబాద్ రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై తలపెట్టి పడుకున్నా డు. ఆ సమయంలో నాంపల్లి వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తరుణ్ తల,మొండెం వేరయ్యాయి. లైన్ మేన్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న ఫోన్ రింగు అవ్వడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి మృతుని కుటుంబసభ్యుల సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Allu Arjun Initiates Legal Action
Icon Star Allu Arjun emerged as the Biggest Star of the country and he is busy with some of the biggest films and is working with top directors. A controversy erupted after brand manager Kaveri Baruah spoke against the actor on Sweekriti Talks podcast and the video went viral in no time. Kaveri Baruah said […] The post Allu Arjun Initiates Legal Action appeared first on Telugu360 .
Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి పాకల బీచ్
Training |ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం
Training | ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం Training |
mla |వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఎపీ లక్ష్యం…
mla |వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఎపీ లక్ష్యం… నరేంద్ర మోడీ నాయకత్వంలో
Ballot boxes |ఎన్నికలకు సర్వం సిద్ధం
Ballot boxes | ఎన్నికలకు సర్వం సిద్ధం Ballot boxes | స్టేషన్ఘన్పూర్,
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్
అతి వేగంతో అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ ఢీకొట్టిన సంఘటన వనస్థలిపురం ఆటో నగర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబులెన్స్ లో ఇద్దరు రోగులను ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
protest |వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద మైనార్టీ నేతలతో నిరసన
protest | వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద మైనార్టీ నేతలతో నిరసన
Adulteration to Hawala Links: ED Enters Tirupati Laddu Case
The Tirupati laddu adulteration case has taken an unexpected turn with the Enforcement Directorate formally launching a money laundering investigation. On Tuesday, February 10, the ED registered an Enforcement Case Information Report under the Prevention of Money Laundering Act, widening the scope of the probe far beyond food safety violations. The central agency stepped in […] The post Adulteration to Hawala Links: ED Enters Tirupati Laddu Case appeared first on Telugu360 .
Railway |పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష
Railway | పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష Railway |
లంచం తీసుకుంటూఎసిబికి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ..
హైదరాబాద్: అవినీతి నిరోదక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. మంగళవారం నగరంలోని మాదాపూర్ ఎస్ఐ వినయ్కుమార్ 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చేందుకు ఎస్ఐ వినయ్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎసిబి అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేపట్టిన ఎసిబి అధికారులు.. వినయ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వినయ్ ని ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లో పులి అవయవాలు స్వాధీనం #WildlifeCrime #Hyderabad #DRI #TelanganaForest
mla |ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ..
mla |ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ.. mla | భవానిపురం, ఆంధ్రప్రభ:
Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..
Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం.. ఈనెల 16 వరకు
Ballot boxes |నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
Ballot boxes | నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి Ballot boxes |
paritala |పరిటాల వారి కొబ్బరి తోటలో భారీ దిగుబడులు..
paritala | పరిటాల వారి కొబ్బరి తోటలో భారీ దిగుబడులు.. పరిటాల రవి
నేను రాను.. సభకు: అవిశ్వాసంపై స్పీకర్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి.ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై తుది నిర్ణయం తీసుకునే వరకు లోక్సభ కార్యకలాపాలకు హాజరు కాకూడదని.. స్పీకర్ చైర్ లో కూర్చోకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో అధికార ఎన్డిఎ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ను సమర్పించినప్పటి నుంచి లోక్ సభలో ఇరుపక్షాల మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో సభ సజావుగా సాగడంలేదు. ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ ఓం బిర్లాను ఆయన పదవి నుండి తొలగించాలని కోరుతూ లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసు సమర్పించాయి. ఈ నోటీసుపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ను తన తొలగింపుకు సంబంధించి ప్రతిపక్షం దాఖలు చేసిన నోటీసును పరిశీలించాలని ఆదేశించారు. నోటీసును క్షుణ్ణంగా సమీక్షించి, అవసరమైన విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సెక్రటరీ జనరల్ను కోరినట్లు సమాచారం.
Real estate |కనుమరుగవుతున్న ప్రకృతి సంపద,
Real estate | కనుమరుగవుతున్న ప్రకృతి సంపద, Real estate | చిట్యాల,
Polling centers |పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన…
Polling centers | పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన… Polling centers
కాంగ్రెస్ నేతలపై రూ.500కోట్ల పరువనష్టం దావా
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 1200 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం చేసిన హిమంత తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ నేతలు నాపై తప్పుడు, దురుద్దేశపూర్వకంగా, పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారు. జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగొయ్ల నుంచి రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేశాను’ అని అస్సాం సీఎం శర్మ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: సిఎం యోగి
అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదును తిరిగి నిర్మించడం అసాధ్యమని స్పష్టం చేశారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారంనాడు జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, కొందరు అవకాశవాదులకు ఇబ్బందుల్లోనే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమాయాల్లో తలచుకోవడం కూడా ఉందని, అందువల్లే రాముడు కూడా వాళ్లను మరిచిపోతాడని చెప్పారు. రాముని భక్తులపై బుల్లెట్లు కురిపించి, రాముడి సేవకు అవాంతరాలు కల్పించే రామద్రోహులకు ఇక్కడ చోటులేదన్నారు. బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని కలలు కంటున్న వారికి ఒకటే చెప్పదలచుకున్నానని, అలాంటి రోజు ఎప్పటికీ రాదన్నారు. ‘ఖయామత్ రోజు ఒకటి వస్తుందంటూ ఎదురుచూపులు చూడొద్దు. హిందూస్థాన్లో కలిసి జీవించడం నేర్చుకోవాలన్నారు. ఇక్కడి చట్టాలను గౌరవిస్తూ జీవించాలని, చట్టాన్ని ధిక్కరించి ముందుకు వెళ్లే వాళ్లు నరకానికే వెళ్తారన్నారు. చట్టాన్ని ధిక్కరించగలమని ఎవరైనా అనుకున్నా, స్వర్గానికి వెళ్తామని అనుకున్నా వారి కలలు ఎప్పటికీ కల్లలుగానే మిగిలిపోతాయని జోస్యం చెప్పారు.
mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..!
mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..! బడ్జెట్ సమావేశాల్లో విజయవాడ సెంట్రల్ సమస్యలపై
బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యాపారి హత్య
బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో హిందువు హత్యకు గురికావడం సంచలనం కలిగిస్తోంది.మిమెన్సింగ్ జిల్లాలో సోమవారం సుసేన్ చంద్రశేఖర్ (62) అనే హిందూ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. సోమవారం రాత్రి చంద్రశేఖర్ తన బియ్యం దుకాణంలోఉండగా,దుండగులు చొరబడి కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాపారి మృతి చెందాడని నిర్ధారించుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దుకాణం షట్టర్ మూసివేసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత దుకాణానికి వచ్చిన చంద్రశేఖర్ కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగు లోకి వచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నికలు జరగనున్న తరుణంలో హిందూ వ్యాపారి హత్యకు గురికావడంతో బంగ్లాదేశ్లో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Congress : మీనాక్షి తెలంగాణ ఇన్ ఛార్జిగా ఉన్నారా? లేదా? పెద్ద డౌటే
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవడం లేదనిపిస్తోంది
Dandepally |ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు
Dandepally | ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ
police |ప్రజల భద్రతే లక్ష్యం. కర్నూల్ జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్…సాంకేతికతతో నేరాల కట్టడి.డ్రోన్
Lok Sabha |స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం
Lok Sabha | స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం Lok Sabha |
Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా
Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా కలెక్టర్ స్వప్నిల్ దినకర్
Finishing |మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు లక్ష్యం
Finishing | మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు లక్ష్యం Finishing | చిట్యాల,
Tollywood Actors working on Web Projects
Apart from films, actors are inking deals with the digital platforms for Originals which is earning them big remunerations. Bollywood actors are balancing their careers between films and web series. Now, several Telugu actors are making their waves and are testing their luck in the digital space. The number of actors signing web films and […] The post Tollywood Actors working on Web Projects appeared first on Telugu360 .
రాయదుర్గంలో దోపిడీ దొంగల బీభత్సం #CrimeNews #Rayadurgam #JewelleryTheft #PoliceInvestigation
Mantralayam l శ్రీ రాఘవుడి హుండీ ఆదాయం 3కోట్ల,8లక్షలు
Mantralayam l శ్రీ రాఘవుడి హుండీ ఆదాయం 3కోట్ల,8లక్షలు Mantralayam l మంత్రాలయం,
10th Ward |నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు…
10th Ward | నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు… 10th Ward |
Counting |పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి
Counting | పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి Counting | భీమ్గల్ టౌన్,
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సభకు రాను
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు
ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. వాహనం కొనుగోలు చేస్తే?
వాహనాలు కొనుగోలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి
Media |ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి
Media | ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి Media | మక్తల్, ఆంధ్రప్రభ
minister |ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా కృషి చేస్తాం..
minister | ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా కృషి చేస్తాం.. minister |
తెలంగాణకు రేవంత్ శాపంగా మారారు : హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
CrPC 41 |ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ..
CrPC 41 | ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ.. CrPC 41 | ఆంధ్రప్రభ,
3reasons |బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు
3reasons | బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు 3reasons
విశాలాంధ్ర ` శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేయు లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు.దేవస్థానం ప్రారంభ ద్వారం నుండి భక్తుల క్యూ లైన్లు, క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన […] The post మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీశ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి appeared first on Visalaandhra .
Collector|నడకదారిలో శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా…
Collector|నడకదారిలో శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా… Collector|నంద్యాల బ్యూరో ,ఆంధ్రప్రభ: నంద్యాల
కుమార్తెపై తల్లి ప్రేమ గొప్పదని చెప్పే సినిమా
హీరోయిన్ కారుణ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఎర్రచీర మూవీ టీమ్ ఘనంగా ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేసింది. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. కారుణ్య చౌదరికి దర్శకుడు సుమన్ బాబు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నెక్స్ మూవీలో కూడా ఓ ముఖ్యమైన పాత్రకు కారుణ్యను అనుకుంటున్నట్లు చెప్పారు. కారుణ్య మాట్లాడుతూ “ఎర్రచీర క్లైమాక్స్ సీన్కి ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సుమన్ బాబు వన్ మ్యాన్ షో లాగా అన్నీ తానే అయి ఇంత మంచి సినిమా తీశారు. నేను ఇందులో రెండు క్యారెక్టర్స్ చేశాను. అందులో పార్వతి పాత్రను బాగా ఎంజాయ్ చేశా. భర్త ప్రేమ కంటే కుమార్తెపై తల్లి ప్రేమ గొప్పదని చెప్పే ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే థియేటర్లకు వెళ్లి చూడండి”అని అన్నారు.
Ravindhar |పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం.. సైకిళ్లతో సాధ్యం
Ravindhar |పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం.. సైకిళ్లతో సాధ్యం బైకులు, కార్ల బదులు సైకిళ్ల
Heroine Imanvi l క్రేజీ స్టార్తో హీరోయిన్ ఇమాన్వి సినిమా?
Heroine Imanvi l క్రేజీ స్టార్తో హీరోయిన్ ఇమాన్వి సినిమా? Heroine Imanvi
7th Ward |సేవలు చేసేందుకు మీ ముందుకు వస్తున్నా ..
7th Ward | సేవలు చేసేందుకు మీ ముందుకు వస్తున్నా .. 7th
Audiences of all sections can watch Couple Friendly comfortably: Dheeraj Mogilineni
Santosh Soban is playing the lead in the film Couple Friendly, with Manasa Varanasi as the female lead. The film is being grandly produced in Telugu and Tamil by UV Concepts and presented by the reputed production house UV Creations. Ajay Kumar Raju P. is the co-producer. The film is directed by Ashwin Chandrasekhar. Made […] The post Audiences of all sections can watch Couple Friendly comfortably: Dheeraj Mogilineni appeared first on Telugu360 .
డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఎస్పీ విక్రాంత్ పాటిల్
వివాలాంద్ర బ్యూరో ` కర్నూలు : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళ వారం తెలిపారు. మంగళవారం ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. డే విజన్, నైట్ విజన్ డ్రోన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళల భద్రతకు […] The post డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఎస్పీ విక్రాంత్ పాటిల్ appeared first on Visalaandhra .
AR Rahman turning Busy in Tollywood
Legendary music composer and Oscar winner AR Rahman has been away from straight Telugu films from a long time. He is making his comeback with Ram Charan’s pan-Indian film titled Peddi. Buchi Babu Sana is the director and Janhvi Kapoor is the leading lady. The first single Chikiri Chikiri is a resounding chartbuster and the […] The post AR Rahman turning Busy in Tollywood appeared first on Telugu360 .
MLA |ఈ ఒక్కసారి కౌన్సిలర్గా గెలిపించండి…
MLA | ఈ ఒక్కసారి కౌన్సిలర్గా గెలిపించండి… MLA | జనగామ, ఆంధ్రప్రభ
1100 people |ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
1100 people | ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు 1100 people |
home l కుటుంబ గొడవలతో ఇంటి నుండి వెళ్లి పోయిన గాలిమరల కంపెనీ ఉద్యోగి..
home l కుటుంబ గొడవలతో ఇంటి నుండి వెళ్లి పోయిన గాలిమరల కంపెనీ
Supreme Court |పునర్ నిర్మాణం సాధ్యం కాదు..
Supreme Court | పునర్ నిర్మాణం సాధ్యం కాదు.. Supreme Court |
హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు #Hyderabad #EarthTremors #Gajularamaram
Bjp l శ్రీశైలంలో మల్లన్న భక్తులపై లాఠీఛార్జ్ సంఘటన తగదు..
Bjp l శ్రీశైలంలో మల్లన్న భక్తులపై లాఠీఛార్జ్ సంఘటన తగదు.. Bjp l
cable wire |హెడ్మాస్టర్ మృతి..
cable wire | హెడ్మాస్టర్ మృతి.. cable wire | ఆంధ్రప్రభ, వెబ్
Price |బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి? జ్యోతిష్య కారణాల విశ్లేషణ
Price | బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి? జ్యోతిష్య కారణాల విశ్లేషణ
minister l మన మిత్ర వాట్సాప్ .. రైతులకి ఎంతో మేలు..
minister l మన మిత్ర వాట్సాప్ .. రైతులకి ఎంతో మేలు.. మన
School |వంటశాల షెడ్డు నిర్మాణం
School | వంటశాల షెడ్డు నిర్మాణం School | జైనూర్, ఆంధ్రప్రభ :
Video : Hero Santhosh Sobhan Exclusive Interview
The post Video : Hero Santhosh Sobhan Exclusive Interview appeared first on Telugu360 .
మున్సిపాలిటీలకు మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? : కిషన్ రెడ్డి
హైదరాబాద్: బిఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి మోరీలు శుభ్రం చేస్తారా? అని సిఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న సిఎం మోరీలు శుభ్రం చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అవుతోంది, మున్సిపాలిటీలకు మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? అని నిలదీశారు. తన పేరు మార్చే అధికారం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు ఇస్తోందని కిషన్ రెడ్డి తెలియజేశారు. సిఎం పేరే కాదు ఆయన మతం మార్చుకున్నా, తమకు అభ్యంతరం లేదని, పార్టీలు మారినట్టు రేవంత్ ఖాన్ అని పేరు కూడా మార్చుకోండి అని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధమా? అని.. సచివాలయం, ప్రెస్ క్లబ్ ఎక్కడైనా మీతో చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. మాజీ సిఎం కెసిఆర్ తో ఏదైనా ఉంటే, మీరు తేల్చుకోండి అని.. నన్నెందుకు లాగుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
temple |ఎల్లమ్మ ఆలయానికి 10 కే.వి సింగిల్ ఫేస్ బుడ్డి…
temple | ఎల్లమ్మ ఆలయానికి 10 కే.వి సింగిల్ ఫేస్ బుడ్డి… temple
bus stand l కలెక్టర్ తనిఖీలు..
bus stand l కలెక్టర్ తనిఖీలు.. బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలిప్రయాణికులకు ఎలాంటి

25 C