ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిట్యాల, ఆంధ్రప్రభ : ఈరోజు
Israel - Iran War : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ వైమానిక దాడులు
ఇరాన్పై సోమవారం ఇజ్రాయెల్, అమెరికా వరుస వైమానిక దాడులు చేశాయి
తోటి విద్యార్థులు ఆర్థిక సాయం…
తోటి విద్యార్థులు ఆర్థిక సాయం… చిట్యాల, ఆంధ్రప్రభ : ఇటీవల చిట్యాల పట్టణ
Party Office |హైదరాబాద్లో ఘన వేడుకలు..
Party Office | హైదరాబాద్లో ఘన వేడుకలు.. చంద్రబాబు శుభాకాంక్షలు Party Office
రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
రూ. 15 కోట్లను వెంటనే చెల్లించి న్యాయం చేయాలి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు సంబంధం …
Gold Rates : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు భారీగా తగ్గాయి
ఘనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు….
ఘనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు…. బిక్కనూరు, ఆంధ్రప్రభ : బిక్కనూర్
చెన్నూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
చెన్నూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
Telangana |ఎన్నికల ప్రచారంలో రేవంత్..
Telangana | ఎన్నికల ప్రచారంలో రేవంత్.. Telangana | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి..
స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి.. తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ
Airport |విమాన రాకపోకలకు అంతరాయం..
Airport | విమాన రాకపోకలకు అంతరాయం.. Airport | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
పిఎల్ జిఎ డిప్యూటీ కమాండర్ తో పాటు 30 మంది మావోలు లొంగుబాటు
అమరావతి: మావోయిస్టు పార్టీ పిఎల్ జిఎ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. కేశాలుతో పాటు 30 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఏకే-47, ఎస్ఎల్ఆర్లతో సహా 50 వరకు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. త్వరలో మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియస్ ఆశన్న అలియాస్ రూపేష్ ఉద్య సహచరులు 208 మందితో పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత అసలెవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీకి చెందిన పిఎల్ జిఎ కమిటీకి చెందిన 130 మంది సభ్యులు డిజిపి శివధర్ ఎదుట లొంగిపోయిన విషయం విధితమే.
ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల
ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని […] The post ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి appeared first on Visalaandhra .
పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా అదనపు మార్కుల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లు, అస్పష్టంగా ఉన్న ప్రశ్నల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎస్ఎస్సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.బోర్డు నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, హిందీ సబ్జెక్టులో సందిగ్ధంగా ఉన్న ప్రశ్నల కారణంగా 2 మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో తలెత్తిన లోపాల వల్ల 5 మార్కులు.. మొత్తంగా 7 మార్కులను అదనంగా […] The post పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయం appeared first on Visalaandhra .
Dhruv Vikram all set for Tollywood Debut
Chiyan Vikram’s son Dhruv Vikram has been doing films in Tamil and he is not in a mad rush. He is quite selective and is picking up films wisely. Several Telugu directors narrated scripts for Dhruv Vikram but the projects did not materialize. Top production house Mythri Movie Makers is all set to launch Dhruv […] The post Dhruv Vikram all set for Tollywood Debut appeared first on Telugu360 .
Revanth Reddy : నేడు కేరళం వెళ్లనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళం బయలు దేరి వెళ్లనున్నారు
Hyderabad : గ్యాస్ బాయ్ ను బెదిరించిన యూట్యూబర్లు.. పోలీసుల అరెస్ట్
గ్యాస్ సిలిండర్ కష్టాలను కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు
లోపభూయిష్టంగా ఓఎస్టీల పనితీరు: రాహుల్
న్యూదిల్లీ: గృహహింస, వేధింపులు, దాడులకు గురైన మహిళలకు సహాయం చేసేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఏక పరిష్కార కేంద్రాల(ఓఎస్సీ) పనితీరు లోపభూయిష్ఠంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. భద్రత అనేది పథకం కాదని, అది ప్రభుత్వ ప్రాథమిక భాద్యత అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘ఓ మహిళ హింస నుంచి తప్పించుకుని ఓఎస్సీలను ఆశ్రయించినపుడు కేంద్రాల తలుపులను ప్రభుత్వం ఎందుకు మూసేస్తోంది. సిబ్బంది కొరత సహా దేశవ్యాప్తంగా ఉన్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదు. భద్రతే ముఖ్యమైతే ప్రతి […] The post లోపభూయిష్టంగా ఓఎస్టీల పనితీరు: రాహుల్ appeared first on Visalaandhra .
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై ఆగిన విమానం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం ఆగింది. రాయపూర్ వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా రన్వేపై నిలిచిపోయింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సిన 2 విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టేక్ ఆఫ్ కావాల్సిన మరో మూడు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
25 Dead Iran Airstrike : ఇరాన్పై వైమానిక దాడి Andhra Prabha News
25 Dead Iran Airstrike : ఇరాన్పై వైమానిక దాడి Andhra Prabha
CRIME |కాళ్ల పట్టీల కోసం కిడ్నాప్ !
CRIME | కాళ్ల పట్టీల కోసం కిడ్నాప్ ! CRIME | కాళ్ల
హైదరాబాద్ పై దోమల దాడి #Hyderabad #MosquitoProblem #Dengue #Chikungunya #GHMC #HealthAlert
జమ్మూ శ్రీనగర్ హైవేపై నిలిచిన వాహనాలు
జమ్మూ- శ్రీనగర్ హైవేపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి
ట్రంప్ హెచ్చరికల ప్రభావం… న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా పెట్టిన గడువు నేటితో ముగిసింది. నౌకల రాకపోకలకు వీలుగా హోర్మూజ్ని తెరవకపోతే ఇరాన్లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపాల్లేకుండా చేస్తామని బెదిరించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ఆందోళనల నేపథ్యంలో చమురు […] The post భగ్గుమన్న ముడి చమురు ధరలు appeared first on Visalaandhra .
Orders issued |చర్చనీయాంశమైన అర్చకుల విదేశీయాన కోర్టు తీర్పు
Orders issued | చర్చనీయాంశమైన అర్చకుల విదేశీయాన కోర్టు తీర్పు Orders issued
జామకాయ దొంగతనం... బాలికను కట్టేసి చితకబాదిన జవాన్
సిమ్లా: ఓ మాజీ జవాన్ మానవత్వం మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి మానవ జాతికే మచ్చ తెచ్చాడు. జామ కాయలు దొంగలించిందనే నెపంతో బాలికను కట్టేసి ఓ మాజీ జవాన్ చితకబాదాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వీడియో ప్రకారం.... ఉనా ప్రాంతంలో ఓ మాజీ జవాన్కు జామ తోట ఉంది. ఓ బాలిక తోటిలోనికి వెళ్లి జామకాయను కోసింది. ఇది గమనించిన మాజీ జవాన్ బాలికను పట్టుకొని రెండు తగిలించాడు. అనంతరం బాలికను ఇంట్లో గొలుసులతో కట్టేశాడు. బాలిక ఎంత బతిమిలాడిన కూడా వదిలిపెట్టలేదు. మానవత్వం కోల్పోయి కర్రతో బాలికను చితకబాదాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ జవాన్గా నేర్చుకుంది ఇదేనా అతడి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో వైరల్ కావడంతో సదరు మాజీ జవాన్పై బాలల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.
విడాకుల సందర్భాన్ని కూడా అంత వేడుకగా నిర్వహిస్తున్నారు
న్యాయం కోరుతూ యువతి ధర్నా.. గూడూరు, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం
పిచ్చిమొక్కలు తొలగించారు ఆంధ్రప్రభ వెబ్ కథనానికి స్పందన వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ
Top music composer Rockstar Devi Sri Prasad had plans to make his debut as an actor from a long time. He is finally making his debut with Yellamma, a rooted Telangana film. Balagam fame Venu Yeldandi is the director and DSP is being trained before commencing the shoot. The entire pre-production work of the film […] The post DSP all set for Yellamma appeared first on Telugu360 .
సిస్ ఫిలిమ్స్ బ్యానర్పై సైఫుద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన ‘విచిత్ర’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. ‘మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది. వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని అన్నారు. ప్రముఖ దర్శకులు విఎఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘విచిత్ర సినిమా ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండా విచిత్ర పెద్ద హిట్ అవుతుంది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్ రావ్ ఇలపండ పాల్గొన్నారు.
IPL-19 |ఇవాళ కోల్కతా, పంజాబ్ ఢీ
IPL-19 | ఇవాళ కోల్కతా, పంజాబ్ ఢీ వేదిక: కోల్కతాసమయం : రా।।
సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది
హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ ‘ఇందులో నేను చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా విభిన్నమైనది. అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్ను యాక్టర్కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయి లాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర నా కెరీర్ లో గుర్తుండి పోతుంది. ఈ సినిమాలో రూబారు పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియన్స్ను సర్ ప్రైజ్ చేస్తాయి. ఈ సినిమాని శేష్ కోసం థియేటర్కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో అడివి శేష్ చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ చేశారు. ఇది ఆయన బెస్ట్ ఫిలమ్స్లో ఒకటిగా ఉంటుంది‘ అని అన్నారు.
ఒక కూతురు చివరి సందేశం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నాన్న జాగ్రత్త…”
బాసర ఆలయానికి సరికొత్త రూపు రూ.225 కోట్లతో అభివృద్ధి #BasaraTemple #Telangana #TempleDevelopment
మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీపద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘దర్శకుడు విఘ్నేష్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ నాకు ప్రత్యేకంగా చూపించారు. డబ్బింగ్ గురించి మర్చిపోయి సినిమా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా న్యూ ఏజ్ కంటెంట్తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత ఆధారపడతామో చాలా సృజనాత్మ కంగా చూపించారు. ప్రదీప్ అద్భుతంగా నటించాడు’ అని అన్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం- అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేది వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో.. ఒక అప్లికేషన్ మనకి సరైన జీవిత భాగస్వామి ఎవరో చెబితే? దానిని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివ మాట్లాడుతూ ‘ఇది ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా. ప్రదీప్ ఈ స్క్రిప్ట్ను నమ్మి చేశాడు. అతనికి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కృతి చాలా బాగా నటించింది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, కృత్తిశెట్టి, ఎస్జె సూర్య, శివప్రసాద్ పాల్గొన్నారు.
సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’అసురులు!
సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’ అసురులు! స్టేషన్ ఘన్పూర్ , ఆంధ్రప్రభ :
వైజాగ్ లో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ గొడవ
అమరావతి: క్రికెట్ మ్యాచ్ లో గొడవ యువకుడి ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఆరిలోవ పెద్దగదిలి ప్రాంతంలో కొందరు యువకులు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో అజిత్(23), కిషోర్(26) అనే ఇద్దరు యువకులు గొడవపడ్డారు. పెద్దగదిలి జంక్షన్ వద్ద కోపంతో రగిలిపోయిన కిశోర్ అందరు చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డుపై అజిత్ ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం కిశోర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆందోళనలో రైతులు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు
ప్రకృతే ఆమె ఉక్కపోతలో ఊరట తడి ఆరిన చూపులకు కురిసే చల్లని మేఘం సముద్రమే ఆమె లోతు చెప్పని కెరటాలతో నిత్యం సవ్వడే ఆమె పరిచయం ఒడ్డుపై కవిత్వమైన ఆమే ఏ ఊహ ఐనా సరే మనసుకు హత్తుకుని మెత్తగా మ్రోగే అక్షరం ఆమె - చందలూరి నారాయణరావు
ఐపీఎల్ చూసి వస్తుంటే.. గంగవరం, ఆంధ్రప్రభ : న్యాయస్థానంలో నిత్యం విధినిర్వహణలో తలమునకలై
Hyderabad : ఆసుపత్రులన్నీ కిటకిట.. హైదరాబాద్ పై దోమల దాడి
హైదరాబాద్ లో దోమల బెడద ఎక్కువయింది.
BJP : నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు
నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి.
మందుబాబులపై యుద్ధ బాంబు! #LiquorPrices#BeerRates#PriceHike#AlcoholNews
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : 2026 ఏప్రిల్
మావోయిస్టు పార్టీ కీలక నేత లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు పార్టీ కీలక నేత పోలీసుల ఎదుట లొంగిపోయారు
అమరావతి విజయోత్సాహం.. ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని చట్టభద్దాత కల్పించడం రాష్ట్రపతి
మన అనుకున్న బంధాలన్నీ నామ రూపాల నీడలై ఇసుక రేణువుల్లా జారిపోతాయి కాలం అనే అగాథంలో మనసు కట్టుకున్న పాశాలు నిజమని నమ్మిన రంగులూ ఏదో ఒక నాటికి తెరలు తొలగిన నాటకాలై నిశ్శబ్దంగా కూలిపోతాయి మనం పలకరించిన ముఖాలు మనదనుకున్న బంధాలు కూడా నశ్వరమని తెలిసిన క్షణం రేపటికి అతిథులై మారతాయి మన జీవన గృహంలో ఏమీ లేని ఈ ఖాళీ లోకంలో ప్రశ్నలే మిగులుతాయి ఈ ప్రయాణంలో మనతో పాటు నడిచింది ఎవరు? మన అడుగులకు తోడైనది ఏమిటి? పదవులు కాదు, పేర్ల నీడలు కాదు అనుబంధాల పాశాలు కూడా కాదు మన శ్వాస వెంట నడిచే మన అంతర్ముఖ స్వరం ఒక్కటే అహం కరుగుతున్న వేళ గతం అనే మృగ జలం మన చూపునే మోసం చేస్తుంది నిజం మాత్రం మౌనంగా నిలుస్తుంది అందుకే, వదలడం తెలిసినవారే తమలో తాము తేలిపోతారు తమని తాము దాటి ఉన్నదానిలోనే నిలిచిపోతారు ఆ ఉనికే మనం అదే నిత్య సత్యం, అదే మోక్ష మార్గం - గీతా శ్రీనివాస్
Summer Effect : ఎండల మధ్య వానలు.. ఒకింత రిలీఫ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి
బియ్యం అందజేత.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని 11వ
Pawan kalyan : నేడు తమిళనాడుకు పవన్
పవన్ కల్యాణ్ నేడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు
కొన్ని విషాదభరిత కళారూపాలని మనం చూస్తుప్పుడు అవి మనపై ఒక ముద్ర వేసి, మన నుండి ఏదో బరువు తొలగిపో యి కొంత రిఫ్రెష్ అయినట్టు మనం అనుభూతి పొందుతుంటాం. దాన్ని కెథార్సిస్ అంటారు. నాటక రంగంలో ఈ పదాన్ని వింటూ ఉంటాం. ఇది ఒక గ్రీక్ పదం. ఈ పదాన్ని గ్రీక్ విషాద నాటకం చివరలో ప్రేక్షకులలో కలగజేసే ప్రభావాన్ని వివరించడానికి ఉపయోగించేవారు. అయితే ఆధునిక ఉపయోగంలో, ‘క్యాథర్టిక్’ అనే ది తీవ్ర భావోద్వేగాల చికిత్సా ఉత్సర్గం అని అర్ధం. సాధారణంగా ఈ పదం బలమైన భావోద్వేగ అనుభవాన్ని వివరించడానికి ఉపయోగించబడుతుంది. కెథార్సిస్ గురించి చర్చించుకోవడం ఎందుకు అవసరం అంటే అది కళకి, సమాజానికి మధ్య, ప్రజల భావోద్వేగాల నిర్వహణకి మధ్య ఒక నైరూప్య సంబంధాన్ని తయారు కావాల్సిన అంశం గురించి చర్చిస్తుంది కాబట్టి. సాధారణంగా,ప్రేక్షకులలో భావోద్వేగ ప్రతిస్పందనను కలిగించి విషాద నాటకం ముస్తుం ది. ప్రేక్షకుల భావోద్వేగాలను వెలికి తీసి, వాటిని వదిలింపజేసి, ఆపై మానసికంగా ప్రశాంతత సాధించి, ప్రక్షాళన చేస్తుంది. ఈ పదాన్ని అరిస్టాటిల్ ట్రాజెడీని గురించి నిర్వచిస్తున్నప్పుడు వాడా డు. విషాద నాటకంలో ట్రాజిక్ చర్య చేసే పని ప్రేక్షకులలో జాలిని, భయాన్ని రేకెత్తించడం. దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. పాఠకులు లేదా ప్రేక్షకులు మానసిక, నైతిక శ్రేయస్సు కొరకు, తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అని ప్లేటో చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా అరిస్టాటిల్ కెథార్సిన్ని చెప్పాడు అని మనం నమ్మవచ్చు. పునరుజ్జీవనోద్యమ ఆలోచనాపరులు క్లాసిక్ గ్రీక్ రోమన్ సాహిత్యాలచే ప్రభావం చెందారు. అరిస్టాటిల్ హోరేస్ వంటి వారు వారి కి మార్గ దర్శకులు అయ్యారు. హోరేస్ ప్రకారం కవిత్వం బోధిస్తుం ది, అదే సమయంలో ఆనందపరుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కవి త్వం ఆహ్లాదపరుస్తున్నంది కావున బోధనకి ఉపయోగపడుతుంది. ఉద్వేగ అనుభూతుల నిర్వహణా వ్యాపారంలో కళ ఎంత తీవ్రంగా పాల్గొంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆధునిక కాలంలో పౌర సమాజం అభివృద్ధి చెందిన తర్వాత, ‘హేతుబద్ధమైన’ బూర్జువా సమాజం అభివృద్ధి చెందిన తరువాత, కెథార్సిను మొదట్లో తిరస్కరించిన తరువాత మానసిక ఉద్వేగాల దృష్టి తో పునర్నిర్వచించారు. గోథే దృష్టిలో కెథార్సిస్లో ప్రధాన అంశం సయోధ్య, సామరస్యాలను ప్రేక్షకుల మధ్య కంటే స్టేజిపై ఉన్న పార్టీల మధ్య సాధించడం. అది ఒక సృజనాత్మక ప్రక్రియ. కళాకారుడికి కళా సృజన అనేది కూడా ఒక విధమైన కెథార్టిక్ ప్రాసెస్. జోనాథన్ లియర్ అనే వ్యాఖ్యత, కెథార్సిస్కి ‘ఋతుస్రావం’ అనే అర్ధం వచ్చేటట్టు చెప్పాడు. ఉద్వేగాలని విడుదల చేసే ఒక సహజ ప్రక్రియగా చూశాడు. కెథార్సిస్ను ప్రక్షాళనగా, శుద్దీకరణగా, విద్య గా నిర్వచించారు. అయితే ‘ఫో రం థియేటర్’ సిద్ధాంతకర్త అగస్టో బోల్ అరిస్టాటిల్ కెథార్సిస్ సిద్ధాంతాన్ని ఒక సాంస్కృతిక రక్షణ కవాటంగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఇది ప్రేక్షకుల మనసులని ఖాళీ చేసి సురక్షితంగా ప్రశాంతంగా ఉంచుతుంది రాజకీయపరమైన తిరుగుబాటు చేసే బదులు. అతని వాదన ప్రకారం, విషాద నాటకం తన ప్రేక్షకులను దానిదైన స్వంత భ్రమాన్విత స్థలంలోకి లాక్కుని వెళుతుంది. దైనందిన జీవిత తీర్పులను కాల్పనిక వాటితో భర్తీ చేస్తుంది. అందువల్ల అతను పాసివ్ కెథార్సిస్ని చాలెంజ్ చేస్తాడు. థియేటర్ని మార్పుకి ఒక రిహార్సల్ స్థలంగా ఉండాలి అంటాడు. తరువాత కాలంలో కెధార్సిస్ సిద్ధాంతాన్ని సైకాలజీలో కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మన్ పండితులు కెథార్సిస్ ప్రక్రియని రోగ సంబంధమైన ఆవేశాల బహిష్కరణ అని భావించారు. ఇది నాటకం చూసిన ప్రేక్షునికిలో కలిగే ప్రతిస్పందన కంటే భిన్నమైనది. ఫ్రాయిడ్ బ్రూయర్తో కలసి హిస్టీరిక్స్ అంటే నరాల బలహీనతల గల వ్యక్తులు కోసం ఒక చికిత్సను అభివృద్ధి చేసాడు. దీనిని వారు ‘క్యాథర్టిక్ మెథడ్’ అని పిలిచారు. ఈ కారణంగా సామాజిక సంపర్కంతో సంబంధం లేకుండా, కెథార్సిస్ అనేది వ్యక్తిగత చికిత్సకి సంబంధించిన పదంగా మార్పు చెం దింది. ఈ విధంగా కెథార్సిస్ పని ప్రక్షాళన చేయడమే కాకుండా తీవ్ర భావోద్వేగ అనుభవంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రాచుర్యం పొందడంలో ఒక ముందడుగుగా చెప్పవచ్చు. - గోవింద శివ్వాల
Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్ Andhra Prabha News
Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్ Andhra Prabha News (
ఐపీఎల్ అంటే కేవలం మ్యాచ్ కాదు..
ఐపీఎల్ అంటే కేవలం మ్యాచ్ కాదు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్
Peddi Release Clarity: In Rahman’s Hands?
There is a big confusion on the release of Ram Charan’s Peddi. The shoot except for an item song is wrapped up and the film’s director Buchi Babu is with AR Rahman working on the background score. There is a big pressure mounting on the producers to trash the speculations and the makers will make […] The post Peddi Release Clarity: In Rahman’s Hands? appeared first on Telugu360 .
Five Villages, One Reality: Administrative Balance Over Political Push
The fresh demand from Tummala Nageswara Rao to transfer villages around Bhadrachalam into Telangana has added political weight to an already sensitive issue. His letter to Amit Shah frames the merger as a correction. It highlights distance, administrative access, and coordination concerns. The concerns raised are practical. Access to nearby district centres and flood management […] The post Five Villages, One Reality: Administrative Balance Over Political Push appeared first on Telugu360 .
gold Price Today : తీపికబురు.. బంగారం ధరలు ఇంతగా పడిపోయాయా?
ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
కౌన్సిలర్ పరామర్శ.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
ఒక్క నేనే ఇన్ని ముక్కలు..నేను, నా సాహితీ యాత్ర
సాహిత్య వాసనలేని మధ్యతరగతి ఇంట్లో పుట్టాను . అమ్మ పుట్టిల్లు హైదరాబాద్, నీలోఫర్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. బాల్యం, యవ్వనం విజయవాడలో నే గడిచాయి. చాలామంది కవుల్లా గా ఊరి చెరువు, ఈతలు, రావి చెట్టు ఉయ్యాల లు, అభిరుచి కలిగించే పంతుళ్ళు లాంటి మానసిక స్వాంతనలేవీ నాకు లేవు. విజయవాడ ఇరు కు గల్లీలో మూడు వాటాల పెంకుటింటి చివరి వాటా ఇల్లు, రోడ్డుకి అడ్డంగా పరిగెడుతూ పందు లు, ఇంటిముందు మురిక్కాలవలు, ఆడుకుంటూ అప్పుడప్పుడు అందులో పడిలేవడంతో నా బా ల్యం గడిచింది. ఇంట్లో అమ్మ మీద పెత్తనం చేసే బామ్మా, పిల్లలమైన మా మీద పెత్తనం చేసే బా బాయిలు, వాళ్ళకి ఎదురుతిరిగి, దెబ్బలు తినడం ఇవి కూడా నా స్వభావాన్ని తీర్చిదిద్దాయి. మా నాన్నకి తాత వరసయ్యే కొండేపూడి లక్ష్మి నారాయణ అనే గేయ కవి, కమ్యూనిస్ట్ ఉద్య మం నడిపారని, పెద్దమనుషులు అనే సినిమా తీశారని, వీధి నాటకాలు వేసే రాధ అనే వేరే కు లం అమ్మాయిని వివాహం చేసుకున్నారని గుసగుసలు ఉండేవి. మా మేనత్తల చదువు స్కూలుతోనే ఆగిపోయింది. నా తరంలో కాలేజీ మెట్టు ఎక్కిన మొదటి ఆడపిల్లని నేనే. అంచేత అతి జాగ్రత్త కొద్దీ, దగ్గరగా ఉన్న కో ఎడ్యుకేషన్లో కాకుండా ఎక్కువ ఫీజు కట్టి మరీ ఉమెన్స్ కాలేజీలో చేర్చారు. మారి స్టెల్లా కాలేజీ కొలనులో కలువ పూలు బావుండేవి కానీ, ఆ విపరీత క్రైస్తవ క్రమశిక్షణ నాకు నచ్చేది కాదు. డిగ్రీ మొదటి ఏ డాదికే ఆకాశవాణిలో చిరుద్యోగం రెక్కల్ని ఇచ్చిం ది. ఎకనమిక్స్ టెస్టుల్లో కూడా తిలక్ని, శేషేంద్రనీ గుమ్మరించే నేను, సరళ వాక్యం నేర్చుకుంది అక్క డే. యువవాణిలో కాజువల్ కాంపీరర్గా ఉన్నరోజుల్లో ఒకసారి రావాల్సిన వక్త రికార్డింగుకి రాలే దు. సాయంత్రానికల్లా ప్రోగ్రామ్ లైవ్కి వెళ్ళాలి. కథ ఏదయినా ఉంటే చదివేసి మంగళ వాక్యం పాడవచ్చు కానీ, చేతిలో ఏదీ లేదు. భయపడ్డాను. ఏం చేయాలో తోచక అప్పటికప్పుడు రికార్డింగు రూములో కూచుని కథ రాసేశాను. దానిపేరు పే రు మువ్వ మూగబోయింది. జనం తప్పకుండా తిడతారని, ఉద్యోగం ఊడిపోతుంది అని అనుకున్నాను. చిత్రంగా దానికి భలే పేరొచ్చింది. రేడి యో పత్రిక వాణిలో కూడా అచ్చయింది. నా మొదటి కవిత పేరు దుర్లోచన. దానికి కా రణం కోపం. మా హెడ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్ మెంట్ లాలితాదేవి. జయశ్రీ పత్రికలో వచ్చింది. అచ్చానందం భలే ఉంటుంది. సవ్యసాచి అనే పేరుతో కొన్నాళ్ళు కవిత్వం రాశాను. భారతి పత్రికలో ఇంకో సవ్యసాచి ఎవరో ఉండటం వల్ల, తిరిగి నా పేరుకి మారిపోయాను. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది నాలో ఉన్న ఇంకో కో ణం. అది ఒక్క నేనే ఇన్ని ముక్కలు కవిత రాయించింది. 1988లో ఇల్లు ఖాళీ చేసినప్పుడు.. అనే కవిత రాశాను. మొన్నీ మధ్య మళ్ళీ అదే వస్తువు మీద వ్యాసం రాశాను రెంటి మధ్యా ఎంత వైరుధ్యం ఉందో చెప్పడం నా ఉద్దేశ్యం. అస్తిత్వ వాద ఉద్యమ కవులకి కవితా వస్తువు ఊహాలలోంచి కా దు సందర్భంలో నుంచే పుడుతుందని నా ఉద్దేశ్యం. స్త్రీలు ముట్టకూడని వస్తువులు, ప్రతీకలు ఎన్నో ఉ న్నాయని తెలిసాక పనికట్టుకుని అవే రాశాను. మదర్ సీరియస్, హృదయానికి బహువచనం- లాంటి కవితా శిల్పాల గురించి చేరాతలు చెప్పా యి. సంప్రదాయ వ్యతిరేక ధోరణిగా ముద్రపడి విమర్శలకి గురవుతున్న సమయంలో, స్త్రీవాదానికి చేరా మాస్టారు ఇచ్చిన మోరల్ సపోర్టు చాలా ఉండేది. అప్పటికి ఒకే ఒక్క కవిత రాసిన కవయిత్రి గురించి కూడా చేరాతల్లో వచ్చిన ప్రశంసలు చూసి సీనియర్ కవులు అసూయపడేవారు. ప్రముఖ కవయిత్రి విమల, నేను రాస్తున్న కవి త్వం మీద ఎబికె ప్రసాద్ నీలాల రేవు నిర్మల, పా తాళ గంగ విమల అనే పేరుతో వార్తలో ఒక సం పాదకీయం రాశారు. నేను రాసిన పుస్తకాలలో నడిచే గాయాలుకి వచ్చిన గుర్తింపు కాలానికి, అప్పటి సామాజిక సందర్భానికి వదిలేస్తే నాకు మాత్రం బాధా శప్తనది అంటేనే ఇష్టం. సంధిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధా సప్తనది మూడు పుస్తకాల రోజుల్లోనూ నేను తెలంగాణా మారు మూల గ్రామాల్లో ఉండేదాన్ని, కవిత్వమే నన్ను సభల పేరిట మనుషుల దగ్గరికి తీసుకొచ్చే వాహికగా ఉండేది. సాహితీ వాతావరణం లేనిచోట సాహితీ మిత్రుల లేఖలే గొప్ప ఊరటగా కూడా ఉండేవి. నడిచే గాయాలులో వచ్చిన కవిత్వం పరిశీలిస్తే ఒక బాలిక పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకూ ఉన్న దశలన్నీ రికార్డ్ చేయగలిగాను. బాధా శప్తనది నుంచి రాజకీయ స్పృహ బాగా కనిపిస్తుంది. నాలుగో సంపుటి మల్టీ నేషనల్ ముద్దులో ప్రపంచీకరణ ప్రభావం మానవ జీవితంలోని అన్నీ కోణాల్లో ఎలా ఉం టుందో చెప్పడానికి ప్రయత్నించాను. నివురు కవి తా సంపుటి వచ్చేలోగా నేను అమెరికా వెళ్ళి వ చ్చాను, కాబట్టి అక్కడ ఉన్న తెల్లతోలు రాజకీ యం, భారతీయుల సమస్యలు లాంటివి నా ఊ హకి అందినవి రాశాను. తిరిగి అన్నీ కలిపి నిర్మల కవిత్వంగా ఒక సంపుటి వేశాను. ఇప్పుడు వద్దనుకున్నకొద్దీ ఫాసిజమే రచనకి సంభాషణకి వస్తువు అవుతోంది. ఈ మధ్య వచనం ఎక్కువ రాస్తున్నాను. అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. నేను చెబుతున్న విషయానికి ప్రక్రియాపరమైన అడ్డంకులు ఉండకూడడదనేది, సులువుగా అందరికీ అందాలనేది నా అభిమతం. శత్రుస్పర్శ, ఎచ్చటికిపోతా వీ రాత్రి రెండు కథా సంకలనాలు వేశాను. మృదంగం వ్యాసాల పుస్తకం వచ్చింది. ఇప్పు డు మళ్ళీ వేయాల్సినవి చా లా ఉన్నాయి. ము ఖ్యంగా కవిత్వం అనువాదాలు 50 వరకు ఉన్నాయి. ఫేస్బుక్ లో పోస్టు చేసిన వ్యాసాలు 45వరకు ఉన్నాయి. విలపి త భారత్ పేరుతో వేద్దామని ఉంది. చూడాలి. నా వ్యాసాలకి రంగవల్లి స్మారక అవార్డు, లాడ్లీ మీడియా అ వార్డు వచ్చాయి. కవిత్వానికయితే కేరళ ప్రభుత్వం ఇచ్చిన జాతీయ బహుమతితో పాటు దాదాపు ఇరవై వరకు గుర్తింపులున్నాయి. నేను రాసిన శారీఘర్ అనే కథ గురజాడ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వంద మంచి కథల్లో ఒకటిగా ఎంపికవడం చెప్పుకోదగిన విషయం. ఇక నా ఉద్యోగ జీవితానికి వస్తే ఆంధ్రజ్యోతిలో 1978 నుంచీ నా జర్నలిజం జీవితం మొదలయింది. ఉదయం సుప్రభాతం, ఆంధ్రపభ, ఆకాశవాణి, మాభూమి, వర్తమానం లాంటి పత్రికలన్నీ అయిపోయాక, జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయి. ఏషియా నెట్ చానల్ వారి అంతర్జాలంలో పనిచేశాను. అనుకోకుండా ప్రభు త్వ రంగంలోకి వచ్చి పడ్డాను. అది కూడా చాలా నాటకీయంగా జరిగింది. నేను వలసల రాజ్యం అనే కవిత రాసేనాటికి ఆంధ్రప్రదేశ్ అకాడమీ వాళ్ళు జండర్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ కోసం చూస్తున్నారు. నా గురించి తెలుసుకుని వాకబు చే శారు. వెళ్ళాను. అవకాశం వచ్చింది, దాని తర్వా త రూరల్ వెలుగు, అర్బన్ వెలుగు, యునిసెఫ్, ప్రియాలాంటి ఎన్జీవోల్లో కూడా ట్రయినర్గా చేశాను. జర్నలిస్ట్గా నేను ప్రజల మధ్య నుంచుని చూసిన సమస్యలని, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య నుంచుని దాని అమలులో ఉండే రాజకీయాల్ని తెలుసుకున్నాను. ఈ రెండిటికి మధ్యలో కొన్నాళ్ళు సీరియ ల్స్లో చెప్పడానికి డబ్బింగ్ నేర్చుకున్నాను. ఉద్యోగానికి, ఉద్యోగానికి మధ్య చిన్నచితకా ప్రాజెక్టు లు కొన్ని చేశాను. అందులో ఒకటి జూనియర్ ఆర్టిస్టుల జీవితాల గురించి చేసినది చెప్పుకోవాలి. శ్మశానాల్ని ఆశ్రయించుకుని బతికే బేగరివాళ్ళ ని ఇంటర్వ్యూ చేశాను. జెఎన్టీయూ ఆర్ట్ కాలేజీ లో న్యూడ్ మోడలింగ్ చేసే బిక్కి అనే అమ్మాయి కష్టాల్ని రికార్డు చేశాను. అదీ కవిత్వమయిపోయింది. మెహందీవాడలో ఉండే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నాన్నల్ని కొనాలి కిలో ఎంత కవిత రాశాను. ఏ నిజాయితీ, స్పష్టతలు కవులకి, కళాకారులకి ఉండి తీరాలో అవే ఇప్పుడు నిషిద్ధ మార్గాలవడం ఇప్పటి విషాద వాస్తవికత. దుష్ట రాజకీయాలు మనిషి జీవితంలో పుట్టిస్తున్న ప్రకంపనలు మౌనంగా ఉంచలేకపోతున్నాయి. కానీ అవి రికార్డు చేయడమే ఇప్పటి మన సవాలు. - కొండపూడి నిర్మల
చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..
చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
ఆదిలాబాద్ జిల్లాలో.. రేవంత్ రెడ్డి..
ఆదిలాబాద్ జిల్లాలో.. రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి
టిమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్.... కానీ నోబాల్ తోనే ఓటమి: రుతురాజ్
హైదరాబాద్: ఐపిఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరసగా మూడో మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు పరాజయాలపాలైంది. ఆర్సిబితో జరిగిన మ్యాచ్లో సిఎస్కె జ్టటు 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి జట్టు 251 పరుగుల లక్ష్యాన్ని సిఎస్కె ముందు ఉంచింది. సంజు శామ్సన్పై అధిక అంచనాలను పెట్టుకున్నప్పటికి అతడు వమ్ము చేశాడు. హ్యాట్రిక్ ఓటమికి తానే బాధ్యుడినని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఆర్సిబితో జరిగిన మ్యాచ్లో తాను ఆడి ఉంటే భిన్నంగా ఉండేదని వివరించాడు. ఆర్సిబి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 14 ఓవర్ వరకు మ్యాచ్ చెన్నై చేతిలోనే ఉందని, టిమ్ డేవిడ్ను అన్షుల్ కాంబోజ్ క్లీన్ బౌల్డ్ చేసినప్పటి, అది నో బాల్ కావడంతో అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయిందన్నారు. లక్ష్య చేదనలో కూడా మూడు వికెట్లు త్వరగా పడిపోవడంతో పీకల్లోతు కష్టాల్లో జట్టు పడిందని, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, ఓవర్టన్ మంచి ఆటతీరు ప్రదర్శించారని కొనియాడారు. శివమ్ దూబే దురదృష్టవశాత్తూ పెవిలియన్కు చేరాడని పేర్కొన్నారు. మూడు ఓటములకు తానే బాధ్యత వహిస్తున్నానని రుతురాజ్ స్పష్టం చేశాడు.
కడప జిల్లాలో బస్సు ప్రమాదం.. కడప, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కడప
IPL 2026 : నేడు ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్
ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది
కేంద్రం చెప్పింది ఇదే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాపై
Tirumala : నేడు కూడా తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుం
ట్రాన్సఫార్మర్ టెన్షన్.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ విద్యుత్ శాఖ పరిధిలోని నవాబ్పేట
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో కారులో మంటలు కలకలం#Khairatabad#CarFire#HyderabadNews
45 Days Cease Fire : మళ్లీ వాయిదా ?! .. Andhra Prabha News
45 Days Cease Fire : మళ్లీ వాయిదా ?! .. Andhra
బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే సామేల్
మన తెలంగాణ/మోత్కూర్: బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఆదివారం మోత్కూరులో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రావు జయంతి సభలో ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి జగ్జివన్ రావు అని ఆయన సేవలను కొనియాడారు బాబు జగ్జీవన్ రావు 50 ఏళ్లు పార్లమెంట్ సభ్యుడుగా పనిచేయడంతో పాటు దేశ ఉప ప్రధానిగా సేవలందించారన్నారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జగ్జీవన్ రావు అని పేర్కొన్నారు. తండ్రి సేవలను అనుసరిస్తూ తన కుమార్తె మీరాకుమారి లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, అధ్యక్షతన వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కే సతీష్ కుమార్, కౌన్సిలర్లు కురిమిళ్ల ప్రమీల రాములు, మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి,గనగాని శైలజ నర్సయ్య, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, బీసు శ్రీకాంత్ గౌడ్, నల్ల మధు, కారుపోతుల వెంకన్న గౌడ్, మెంట రమణ నాగేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పైళ్లసోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహ్మరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు, రాచకొండ బాలరాజు, మార్కెట్ డైరెక్టర్ లు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎం డి.సమీర్, నాయకులు జినుకల కనకయ్య, మందుల సురేష్, శేఖర్ ఆచారి, బందెల రవి తదితరులు పాల్గొన్నారు. వివిధసంఘాల ఆధ్వర్యంలో ....... బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్లవీరేందర్ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, గౌరు శ్రీనివాస్, చాడ మంజుల సజ్జన మనోహర్, పోచం సోమయ్య తదితరులు పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో.... బాబు జగ్జీవన్ రావు జయంతి పుష్కరించుకొని బీఆర్ ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ మండల ,పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్,జంగ శ్రీను, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్ర నాథ్, కొనతం యాకూబ్ రెడ్డి , నాయకులు కొండా సోం మల్లు, గజ్జి మల్లేష్ , క్రాంతి కుమార్ రెడ్డి, తిరుమలేష్, రఘుపతి, వెంకన్న, శ్రీను,తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ....... బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కూరెళ్ళ యాకస్వామి,మందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Weekend Box-office: Mixed Reactions
Sharwanand’s Biker and Sangeeth Sobhan’s Rakasa released over the weekend. Both these films received decent response. Biker word of mouth was better but the footfalls and the box-office numbers were quite low over the weekend. Biker was better in the multiplexes while Rakasa performed well in B and C centres. There is a huge impact […] The post Weekend Box-office: Mixed Reactions appeared first on Telugu360 .
కడప జిల్లాలో విషాదం.. పెన్నా నదిలో ముగ్గురు గల్లంతు
కడప జిల్లాలో విషాదం నెలకొంది
లక్నో: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను ప్రియుడితో భార్య చంపించింది. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. టాటూ నిందితులను పట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆగ్రాలోని లోకేంద్ర అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. లోకేంద్ర భార్య మహేశ్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం లోకేంద్రకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. భర్తను అడ్డుతొలగించుకుంటే వివాహేతర సంబంధం కొనసాగించొచ్చని ప్రియుడితో భార్య ప్లాన్ వేసింది. ఏప్రిల్ 1 సాయంత్రం లోకేంద్ర బయటకు వెళ్లాడు. ఈ విషయం తన ప్రియుడు మహేశ్కు తెలిపింది. మార్గం మధ్యలో లోకేంద్రకు మహేష్ కలవడంతో మద్యం తాగుదాముని ఆఫర్ ఇచ్చాడు. మహేష్, లోకేంద్ర, మహేశ్ స్నేహితుడు ధరమ్ వీర్ తో ఫుల్గా మద్యం తాగారు. లోకేంద్ర మద్యం పుల్గా తాగి పడిపోవడంతో ఇద్దరు కలిసి అతడి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతదేహానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేశారు. కాలిపోయిన మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోకేంద్ర సోదరుడు తన అన్న కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం రావడంతో మృతదేహాన్ని లోకేంద్ర సోదరుడుకి చూపించారు. చేతిపై లోకేంద్ర టాటూ ఉండడంతో వెంటనే తమ్ముడు అన్నమృతదేహాన్ని గుర్తు పట్టాడు. లోకేంద్ర భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తొలిసారిగా డిజిటల్ విధానంలో.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో టెన్త్ (SSC)
Pallichattambi Trailer: Tovino Thomas action-packed sensation
After 2018 and ARM, Malayalam star Tovino Thomas continues to strengthen his pan-Indian presence with his prestigious upcoming film “Pallichattambi.” The trailer has been unveiled, offering a peek into an intense period action drama set in the 1950s and 1960s. It opens with a voiceover that introduces the setting, where the head priest of Kunnumpuram’s […] The post Pallichattambi Trailer: Tovino Thomas action-packed sensation appeared first on Telugu360 .
Revanth Reddy : నేడు ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు
పిస్టల్, రైఫిల్ షూటింగ్.. కప్.. గెలిచేది ఎవరు…?
పిస్టల్, రైఫిల్ షూటింగ్.. కప్.. గెలిచేది ఎవరు…? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Chandrababu : నేడు తాడిపత్రికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు
IPL 2026 : రాయల్ ఛాలెంజర్స్ పై సూపర్ కింగ్స్ ఓటమి
ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరసగా రెండో గెలుపును సాధించింది
పోలవరం జిల్లాలో తప్పని డోలీ మోతలు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డోలీ మోతలు తప్పడంలేదు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని తడికోట గ్రామంలో చోళ్ల చిన్న రెడ్డి (20) అనే గిరిజనుడు చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడడంతో అతడిని తీసుకెళ్లడానికి ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కదలలేని స్థితిలో ఉన్న చిన్న రెడ్డిని ఆసుపత్రికి తరలించేందుకు డోలి కట్టి ఐదు కిలోమీటర్లు గిరిజనులు మోసుకెళ్లారు. మధ్యలో ఏడు చోట్ల వాగులను అతి కష్టం మీద దాటాల్సి వచ్చింది., 108 సిబ్బంది సహాయంతో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేశంలో ఎక్కువ పట్టణ ప్రాంతాలలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న గిరిజన్ ప్రాంతాల్లో రోడ్లు, సరైన సదుపాయాలు లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంతో, గ్రామాలకు సమీపంలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. దేశంలో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు కానీ గిరిజన ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం రాకముందు డోలీ మోతలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి జరిగిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
6thApril 2026 |తిరుమల సమాచారం..
6thApril 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : “ఓం నమో
Israel - Iran War : హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ మరోసారి వార్నింగ్.. తెరవకుంటే దాడులే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్ంప్ ఆదివారం ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
హర్మూజ్ తెరుస్తారా? నరకానికి పంపించమంటారా…?
హర్మూజ్ తెరుస్తారా? నరకానికి పంపించమంటారా…? Donald Tramp | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ఇరాన్లో అమెరికా సాహసోపేత ఆపరేషన్ శత్రువు వెంటాడుతున్నా గల్లంతైన పైలట్ను రక్షించిన అమెరికా బలగాలు సిఐఎ కీలక పాత్ర.. అండగా నిలిచిన ఇజ్రాయెల్ శత్రువుకు చిక్కకుండా ఇరాన్ భూభాగంలోనే సొంత విమానాల పేల్చివేత రెండు సి130, బ్లాక్హాక్ హెలికాప్టర్లు నేలకూల్చినట్లు ఇరాన్ ప్రకటన ఆపరేషన్లో ఐదుగురు అమెరికన్ సైనికులు మృతి? ఒక్కడే కదా అని వదిలేయదు. ఆ ఒక్కడి కోసం అమెరికా యంత్రాంగమం తా సర్వశక్తులు ఒడ్డింది. శత్రువు బారిన పడకుండా కాపాడగలిగింది. నిఘా నేత్రాలు.. పక్కా వ్యూహాలతో రంగంలోకి దిగిన డజన్ల కొద్దీ యుద్ధ విమానా లు, వందలాది బలగాలు ఇరాన్లో కుప్పకూలిన యుద్ధ విమానం నుంచి సురక్షితంగా బయటపడిన ఫైటర్ పైలట్ను సురక్షితంగా కాపాడగలిగాయి. ఈ ఆపరేషన్ను నిరంతరం పర్యవేక్షించిన అధ్యక్షుడుడు ట్రంప్ గర్వంగా ‘వి గాట్ హిమ్’ అని ప్రకటించారు. ఏ ఒక్క అమెరికన్ యోధుడిని ఒంటరి గా వదిలివెయ్యబోమని బలగాల్లో భరోసా నింపారు. మరోవైపు ట్రంప్ హర్మూజ్పై ఇరాన్కు విధించిన 48గంటల గడువు కాస్తా 24గంటలకు వచ్చింది. ఆదివారంనాడు మరోసారి హర్మూజ్ అంశంపై ఇరాన్ను లక్షంగా చేసుకుని ట్రంప్ నోరుపారేసుకున్నారు. పరుష, అసభ్య పదజా లంతో దూషణకు దిగారు. హర్మూజ్ను తెరవకపోతే వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులకు దిగుతామని హెచ్చరించారు. న్యూఢిల్లీ: ఇరాన్లో కూలిన ఎఫ్-15 యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన సాహసోపేత ఆపరేషన్పై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వి గాట్హిమ్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ ఆపరేషన్లో డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, వందల సంఖ్యలో ప్రత్యేక దళాలు పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చివేయడంతో, అందులో ఉన్న ఇద్దరు సిబ్బందిలో పైలట్ను తక్షణమే రక్షించారు. అయితే వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో అతని కోసం అమెరికా విసృ్తత శోధనను ప్రారంభించింది. రెండో రోజు రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ మరుసటి రోజు ఉదయం ముగిసింది. అమెరికా సైన్యం ఈ ఆపరేషన్లో అత్యాధునిక యుద్ధ సామగ్రిని వినియోగించింది. హెచ్హెచ్-60 డబ్ల్యూ‘జాలీ గ్రీన్ II’ రక్షణ హెలికాప్టర్లు, ఎ-10 వార్థాగ్ దాడి విమానాలు, హెచ్సి-130 మిడ్ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్స్తో పాటు ప్రత్యేక ‘కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ దళాలు పాల్గొన్నాయి. శత్రు భూభాగంలో మిసైల్, రాడార్ ముప్పు మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, విమానం కూలిన వెంటనే ఇద్దరు సిబ్బంది తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వారి స్థానాన్ని తెలియజేశారు. అమెరికా సైన్యం మొదటి పైలట్ను రక్షించగా, రెండో పైలట్ కోసం సీఐఏ ప్రత్యేక వ్యూహంతో శోధన చేపట్టింది. శత్రువులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, అసలు స్థానం గోప్యంగా ఉంచింది. ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే ప్రత్యేక దళాలను ప్రవేశపెట్టి, తీవ్ర కాల్పుల మధ్య హెలికాప్టర్ల సహాయంతో రెండో పైలట్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్లో కొంత ప్రతిఘటన ఎదురైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ బలగాలు దాడి చేయడానికి ప్రయత్నించగా, అమెరికా యుద్ధవిమానాలు బాంబులు విసురుతూ, కాల్పులు జరిపి శత్రువులను దూరంగా ఉంచాయి. ఈ చర్యల మధ్యే రక్షణ కార్యాచరణ విజయవంతమైంది. రక్షించిన సిబ్బంది గాయపడినప్పటికీ ప్రాణాపాయం లేదని ట్రంప్ తెలిపారు. రెండో పైలట్ను గౌరవనీయ కల్నల్ అని పేర్కొంటూ, శత్రు ప్రాంతంలో ఉన్నప్పటికీ అతను ఒంటరిగా లేడు. 24 గంటలూ అతని కదలికలను మేము పర్యవేక్షించాం అని అన్నారు. అదేవిధంగా, రెండు వేర్వేరు సందర్భాల్లో శత్రు భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను విజయవంతంగా రక్షించడం సైనిక చరిత్రలో అరుదైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిస్పందన మరోవైపు ఈ ఆపరేషన్పై ఇరాన్ విభిన్న వాదనలు చేసింది. అమెరికా రక్షణ చర్య విఫలమైందని, తమ బలగాలు ఒక సి-130 రవాణా విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని, కొందరు మరణించారని కూడా ఇరాన్ ఆరోపించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా తన వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్ తీవ్ర ప్రతిదాడులకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంధన రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది.
న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వాల కృషి భేష్
న్యాయ మౌలిక వసతులు విలాసం కాదు.. అత్యవసరం కోర్టు గది వెనుక మరో ప్రపంచం ఉంటుంది జడ్జిల నివాస సముదాయాల్లోనూ కార్యకలాపాలు: సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ 2027 డిసెంబర్ నాటికి హైకోర్టు భవన నిర్మాణ పనులు పూర్తిచేస్తాం ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పరం గౌరవంతో పనిచేయాలి కోర్టు సముదాయం అన్నివర్గాలకు పవిత్ర ఆలయం లాంటిది: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్2 భవన నిర్మాణ పనులకు న్యాయమూర్తులతో కలిసి శంకుస్థాపన మనతెలంగాణ/హైదరాబాద్ : న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే సంకల్పంతో అడుగులు వేసినప్పుడే రాజ్యాంగం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితంలో సజీవంగా మారుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా, న్యాయ మౌలిక సదుపాయాల కల్పన ఐచ్ఛికం కాదని, అది అత్యవసరమని అన్ని పక్షాల ప్రభుత్వాలు గుర్తించాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హిమాచల్ వరకు, అసోం నుంచి తెలంగాణ వరకు ఇప్పుడు న్యాయవ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. న్యాయ మౌలిక సదుపాయాలు విలాసం కాదు అని, అవి దేశానికి ప్రాణాధారం అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు రెండో జోన్ భవన నిర్మాణ పనులకు ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి, జస్టిస్ అలోక్ ఆరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో పాటు ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసే ప్రదేశానికి చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్కు సిఎం రేవంత్ రెడ్డి సహా న్యాయమూర్తులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సిజెఐ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను పరిశీలించారు. నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేద పండితుల సమక్షంలో జరిపిన శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని కొనియాడారు. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ బలోపేతంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం చారిత్రాత్మకమైనదే అయినప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వసతులు లేవని సిజెఐ అభిప్రాయపడ్డారు. కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అనేవి ప్రజలకు విజిబుల్ జ్యుడీషియరీ అని, కోర్టు గది వెనక మరో ప్రపంచం ఉంటుందని తెలిపారు. కోర్టు కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయని, న్యాయమూర్తుల నివాస సముదాయాల్లో కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ.. వచ్చే వంద సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. 100 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ సముదాయం దేశంలోనే అత్యుత్తమంగా నిలవబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం: సిఎం రేవంత్రెడ్డి హైకోర్టు భవన నిర్మాణ పనులు డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, అది భారత గణతంత్రం ప్రజలకు ఇచ్చిన పవిత్రమైన హామీ అని పేర్కొన్నారు. హైకోర్టు కొత్త భవన సముదాయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోర్టులు, నివాస భవనాల నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 2023 డిసెంబర్లో తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టుకు కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయం ఒకటి అని పేర్కొన్నారు. అందుకోసం రాజేంద్రనగర్లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని తెలిపారు. భవనాల కోసం జోన్-1లో ఇప్పటికే ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పుడు జోన్-2లో నివాస భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. న్యాయవ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడం కార్యనిర్వాహక విభాగం బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ నిర్మించబోయే భవనం దేశంలోనే అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా, ఆధునికత, మౌలిక వసతుల పరంగా ఒక ప్రమాణంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పరం ఆధారపడి, గౌరవంతో పనిచేస్తాయని తెలిపారు. సాధారణ పౌరుడు న్యాయం కోసం చివరగా ఆశ్రయించేది న్యాయస్థానాన్నే అని, అలాంటి న్యాయస్థానానికి కావలసిన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో తనకు లభించిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తానని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే హైకోర్టు సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా నిలుస్తుందని, ఇది పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వారికి వేదికగా నిలుస్తుందని చెప్పారు. రాబోయే వంద సంవత్సరాల పాటు పేదలు, బలహీనులు, అణగారిన వర్గాలు న్యాయం కోసం ఈ మందిరానికి వస్తారని అన్నారు. దేశంలో ఒక దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఒక కోర్టు సముదాయం అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర ఆలయం వంటిదని వ్యాఖ్యానించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా ఉందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవన సముదాయమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు, మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. హైకోర్టు భవన సముదాయం కేవలం నిర్మాణం కాదు.. ఇది తమ ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ పట్ల తమ ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ఇస్తుందని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు.
సోమవారం రాశి ఫలాలు(06-04-2026)
మేషం చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృషభం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. మిధునం వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహమున విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కర్కాటకం చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. సింహం వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. భూ సంబంధిత వ్యాపారస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. తుల వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబమున మీ ఆలోచనలు ఎవ్వరికీ నచ్చవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. వృశ్చికం శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. రాబడి మార్గాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ధనస్సు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహమున కొన్ని సంఘటనలు గందరగోళంగా ఉంటాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. మకరం ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. దైవ సేవాకార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. కుంభం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. మీనం దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ప్రజలపై ధరల భారాన్ని తగ్గించాలి..
ప్రజలపై ధరల భారాన్ని తగ్గించాలి.. ఆలేరు, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ

34 C