గురువారం రాశి ఫలాలు (16-10-2025)
మేషం - ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు. సాంస్కృతి కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ విషయాలలోనూ గృహది విషయాలలోనూ ఆసక్తి చూపుతారు. వృషభం - చేస్తున్న వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మిథునం - గృహ విషయాలకు అతిధి మర్యాదలకు ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. మానసిక ఉద్వేగాన్ని సాధ్యమైనంతగా అదుపు చేసుకోవడం మంచిది. కర్కాటకం - ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.ఉద్యోగాలలో ఏర్పడిన అవంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. సింహం - సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు సాగిస్తారు. వివాదాస్పద అంశాల విషయంలో చేసేది లేక కలిసొచ్చే కాలం వస్తే అన్ని సద్దుమడుగుతాయని భారం భగవంతుడి మీద వేసి మిన్నకుంటారు. కన్య - పెట్టుబడులకు తగిన సహాయ సహకారాలు అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో అవి ఉపకరిస్తాయి. మానసిక ఆనందం కలుగుతుంది. తుల - ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది. వృశ్చికం - వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతనమైన ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలు ముఖ్యం. మీ ప్రమయం వల్ల ఒక శుభకార్యం సానుకూలపడే సూచనలు ఉన్నాయి. ధనుస్సు - అనుభవాలు నేర్పిన పాఠాలు దృష్టిలో ఉంచుకొని అడుగులు జాగ్రత్తగా వేస్తారు. ఎదుటివారి మనసును నొప్పించకుండా పనులను చక్కబెట్టుకోవడం ఎలా అన్నది మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపచేస్తుంది. మకరం - చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించి తమ అనుకున్న లబ్ధిని పొందగలుగుతారు. కుంభం - సమస్యల నుండి ఎప్పటికప్పుడు బయటపడే విషయం మీదనే దృష్టిని కేంద్రీకరిస్తారు. గాని శాశ్వతమైన పరిష్కారాలను అన్వేషించరు. శుభకార్యాలు ముడి పడతాయి. మీనం - దూర ప్రాంతంలో ఉన్న మీవారికి ఇక్కడి స్థితిగతులను వివరించి వారిని ఆర్థిక సహాయం అర్థిస్తారు. సాంకేతిక విద్యా సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది.
Women Are The Most Beautiful Species Ever: Siddu Jonnalagadda
Siddu Jonnalagadda’s youthful musical and love entertainer Telusu Kada will be hitting the screens on the 17th of this month. The team celebrated the pre-release event. Siddu made an interesting statement, expressing his sadness about saying goodbye to the character Varun, whom he portrayed in the film. “As you know, for almost a year, I’ve […] The post Women Are The Most Beautiful Species Ever: Siddu Jonnalagadda appeared first on Telugu360 .
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 16-10-2025
45 కేసుల్లో నిందితుడు రోడ్డు ప్రమాదం తో పట్టుబడి జైలు బాట! #InterstateThief #crime #apnews
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గను: మంత్రి జూపల్లి
బ్లాక్ మెయిల్ రాజకీయాల కు తాను లొంగనని, తప్పుడు వార్తలు, ఆరోపణలపై స్పం దించాల్సిన అవసరం లేదని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తన మేనల్లు డు సతీశ్ రావు కనపర్తి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కుట్రపూరిత ఆరోపణల వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పుఒప్పులు అందరి దగ్గర జరుగుతాయన్నారు. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటానని ఆయన తెలిపారు. లిక్కర్ టెండర్లు చివరి మూడు రోజుల్లో భారీ సంఖ్యలో వస్తాయ ని గతేడాది చివరి మూడు రోజుల్లో 96 వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పేరుతో వ్యాపారం అమెరికాలో ఉండే మంత్రి జూపల్లి కృష్ణారావు మేనల్లుడు సతీశ్ రావు కనపర్తి తన మేనమామ మంత్రి జూపల్లి కావటంతో ఆయన ఇండియాకు వచ్చి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పే రుతో వ్యాపారం మొదలు పెట్టారని, అందులో భాగంగా హైదరాబాద్లో 4 స్టోర్లు ప్రారంభించిన సతీశ్ రావు నేచురల్గా పండిన వ్యవసాయ ఉత్పత్తులు అందించి ఆరో గ్యం కాపాడుతానని ప్రజలను నమ్మించి వారి వద్ద కోట్లు వసూలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను నమ్మి అనేక మంది సీనియర్ సిటిజన్లు పెట్టబడులు పెట్టా రు. కొంతకాలం వారికి నెల నెల వడ్డీలు కడుతూ వారిలో నమ్మకం కలిగించిన సతీశ్ కోట్లాది రుపాయలు వసూలు చేశారని అనంతరం ఆ సొమ్ముతో అమెరికా పారిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ డబ్బులేవని అడిగినందుకు సతీశ్ రావు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తుండడంతో ఈ అంశంపై మంత్రి జూపల్లి స్పందించారు.
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో అఫ్గాన్ ప్లేయర్ల హవా..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ బౌలింగ్ను కనబరిచి అఫ్గాన్కు సిరీస్ను సాధించి పెట్టిన రషీద్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. తాజా ర్యాంకింగ్స్లో రషీద్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన సౌతాఫ్రికా స్టార్ కేశవ్ మహరాజ్ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. మహీశ్ తీక్షణ (శ్రీలంక) మూడో, జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) నాలుగో ర్యాంక్ను సాధించారు. భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక ర్యాంక్ను కోల్పోయి ఐదో స్థానంలో నిలిచాడు. మరో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా పదో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్మన్ గిల్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గిల్ 784 పాయింట్లతో టాప్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. అఫ్గాన్ స్టార్ ఇబ్రహీం జద్రాన్ తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 8 ర్యాంక్లు ఎగబాకి ఏకంగా రెండో ర్యాంక్ను దక్కించుకున్నాడు. బంగ్లా సిరీస్లో రాణించడంతో ఇబ్రహీం ర్యాంక్ గణనీయంగా పెరిగింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ మూడో, విరాట్ కోహ్లి ఐదో, శ్రేయస్ తొమ్మిదో ర్యాంక్లో కొనసాగుతున్నారు.
మంత్రి ఓఎస్డీ అరెస్టుకు యత్నం..
హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం
అంతరిక్షానికి 80 వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు
అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారు చేయడం , 2026 లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షం లోకి పంపడం , 2035 నాటికి జాతీయ అంతరిక్షకేంద్రం ,చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ ఏర్పాటు , వంటి లక్షాలను ఏర్పర్చుకున్నామన్నారు. అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ బిగ్ డేటా వంటివాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వికసిత భారత్కు దూతగా 2040 లో భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని నారాయణన్ పేర్కొన్నారు. 2027 లో చేపట్టబోయే మానవ సహిత గగనయాత్ర మిషన్ ట్రాక్లో ఉందని వెల్లడించారు. 2040 నాటికి తొలి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు.పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో ఇస్రో ప్రణాళికలను పంచుకున్న వి. నారాయణను గగన్యాన్లో భాగంగా తాము మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టుతెలిపారు. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో రెండు లేక మూడు స్టార్టప్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై అధ్యయనం కోసం 300 కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ అన్నారు. వ్యవసాయం, విపత్తు ప్రతిస్పందన , నిర్వహణ, టెలికమ్యూనికేషన్, రియల్ టైమ్రైలు , వాహన పర్యవేక్షణలో ఉపగ్రహ ఆధారిత అనువర్తనాల అధ్యయనానికి ఇవి ఉపయోగపడతాయన్నారు.
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో సంచలనం సృష్టించిన ఆఫ్రికా దేశం కేప్ వెర్డె
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఆఫ్రికా దేశం కేప్ వెర్డె పెను సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, కెనడా వేదికగా జరుగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి కేప్ వెర్డె అర్హత సాధించింది. కేవలం ఐదు లక్షల 25 వేల జనాభా మాత్రమే కలిగిన కేప్ వెర్డె ఆఫ్రికా జోన్ గ్రూప్డి పోటీల్లో అద్భుత ఆటను కనబరిచిన మెగా టోర్నీకి దూసుకెళ్లింది. కీలకమైన మ్యాచ్లో కేప్ వెర్డె త్రీ-0 గోల్స్ తేడాతో ఈశ్వతిని టీమ్ను చిత్తు చేసింది. ఐస్లాండ్ తర్వాత ప్రపంచకప్కు అర్హత సాధించిన అతి తక్కువ జనాభా కలిగిన రెండో దేశంగా కేప్ వెర్డె అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్కప్లో 48 దేశాలు పోటీ పడనున్నాయి. ఆఫ్రికా జోన్కు 9 బెర్త్లు కేటాయించగా ఆరు జట్లు ఇప్పటికే వరల్డ్కప్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి.
ఖైదీలకు ఉరిశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణం?
దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారణ జరిపింది. అయితే, మరణశిక్ష అమలుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం అభిప్రాయం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఉరి ద్వారా మరణశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేయాలని లేదా, దోషి ఏ విధంగా తనకు మరణశిక్ష అమలు చేయాలో ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు.ఉరి ద్వారా మరణం క్రూరమైనది, అనాగరికమైనదని, ఉరి వేసిన తర్వాత దోషి మరణానికి చాలా సమయం పడుతుందని. అందువల్ల దాని బదులు నవీన పద్ధతుల్లో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి శిక్ష అమలు చేయవచ్చునని పిటిషనర్ తరుపు న్యాయవాది రిషి మల్హోత్రా అన్నారు. సైన్యంలో దోషి అలాంటి ఆప్షన్ ఎన్నుకునే వీలు ఉందన్నారు. అమెరికా లోని 50 స్టేట్ లలో కనీసం 40 స్టెట్ లలో ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు అవుతున్నదని ,దీని వల్ల ఉరి తీసిన తర్వాత ఆ జీవి చాలా సేపు అనుభవించే వేదన నుంచి విముక్తి లభించవచ్చు నని పిటిషనర్ తరుపు న్యాయవాది వివరించారు.ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో దోషికి అలాంటి ఆప్షన్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చుకునేందుకు సిద్ధంగా లేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఉరి తీయడం ద్వారా మరణశిక్ష అమలు చాలా పాత విధానం. కొద్ది కాలంగా పరిస్థితులు మారిపోయాయి. సమస్య ఏమిటంటే, ప్రభుత్వం మార్పును అంగీకరించేందుకు సిద్ధంగా లేదు అని ధర్మాసనం పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్ మాట్లాడుతూ, ఖైదీలకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడంలో విధానపరమైన నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసు విచారణ నవంబర్ 11 కు వాయిదా పడింది.
కామన్వెల్త్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం
2030లో అహ్మదాబాద్ వేదికగా మెగా పోటీలు లండన్: ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్త్ క్రీడలకు భారత్ రెండో ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా 2030లో కామన్వెల్త్త్ పోటీలు జరుగనున్నాయి. ఇంతకుముందు 2010లో రాజధానిఢిల్లీలో కామన్వెల్త్త్ పోటీలను నిర్వహించారు. తాజాగా రెండోసారి మెగా పోటీలకు భారత్ వేదికగా నిలువనుంది. ఒలింపిక్స్ తర్వాత ప్రపంచ క్రీడల్లో రెండో అతి పెద్ద క్రీడా సంగ్రామంగా కామన్వెల్త్ గేమ్స్ పేరు తెచ్చుకున్నాయి. మరో ఐదేళ్ల తర్వాత జరిగే పోటీలను అహ్మదాబాద్లో నిర్వహించేందుకు కామన్వెల్త్ స్పోర్ట్ బాడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రీడా మైదానం ఈ పోటీలకు వేదికగా ఎంపికైంది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీ పడి అహ్మదాబాద్ మెగా క్రీడలను నిర్వహించే ఛాన్స్ను దక్కించుకుంది. నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రత్యేక వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఢిల్లీ తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా అహ్మదాబాద్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్, కెనడా, భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాలతో సహా గతంలో ఆంగ్లేయుల పాలనలో ఉన్న దేశాలు ఈ పోటీల్లో పాల్గొనడం అనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అసాధారణ ఆటతో పతకాల పంట పండిస్తోంది. ఇక సొంత గడ్డపై జరిగే క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయం.
Somireddy’s Sharp Jabs at Jagan: “Google Has Exposed His Secrets — No Wonder He’s Angry!”
Telugu Desam Party senior leader and Sarvepalli MLA Somireddy Chandramohan Reddy has taken a swipe at former chief minister Y.S. Jagan Mohan Reddy, delivering his signature dose of sarcasm on social media. In a post through a video that’s now doing rounds on X, Somireddy quipped that while the entire state is celebrating Google’s mega […] The post Somireddy’s Sharp Jabs at Jagan: “Google Has Exposed His Secrets — No Wonder He’s Angry!” appeared first on Telugu360 .
మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ కన్నుమూత
మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఈ విఖ్యాత ధారావాహికంలో పంకజ్ ధీరజ్ మహారధి కర్ణుడి పాత్రకు జీవం పోయడం ద్వారా విశేష అభిమానులను పొందారు. 68 సంవత్సరాల ఆయనకు క్యాన్సర్ కబళించివేసింది. ఆయన మృతి వార్తను సినిమా , టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ సిన్టా నిర్థారించింది. తమ సంస్థకు పూర్వపు ఛైర్మన్, తరువాత ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపి , నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రమే ఆయనకు విలే పార్లే సమీపంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. మహాభారతం సీరియల్లో నటించిన పలువురు నటులు , సాంకేతిక నిపుణులు అనేకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సీరియల్లో అర్జున పాత్రధారి అయిన అర్జున్ సామాజిక మాధ్యమం ద్వారా తమ సంతాపం తెలిపారు. ఆయనతో ఈ సీరియల్లో నటించినప్పటి అనుభవాలతో కూడిన ఫోటోలను జతచేశారు. ధీరజ్ కుమారుడు , నటుడు అయిన నికితిన్ ధీరజ్ తన తండ్రి ఓ సందర్భంలో పేర్కొన్న మాటలను తుది అంకంగా అందరికి వెల్లడించారు. జీవితంలో ఏది వచ్చినా రానివ్వండి, ఎవరేమి చెప్పినా చెప్పనివ్వండి, ఏది జరిగినా జరగనివ్వండి, అంతా శివార్పణం అనుకుని ముందుకు సాగండి అనే తండ్రి సందేశాన్ని అభిమానులకు అందించారు.
డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభం
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ -గూగుల్తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని క్యాంపస్లో నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది. దీని ద్వారా 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో ్ సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు అందించబడతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూగుల్ సంస్థ నుండి వైభవ్ కుమార్ శ్రీవాస్తవ (ఇండియా హెడ్ - ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్స్), సిద్ధార్థ్ దల్వాడి (దక్షిణ భారత హెడ్ - ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్స్), మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో 50,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని గూగుల్ లోగోతో ఉన్న 50,000 బెలూన్లు ఆకాశంలోకి ఎగురవేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, మల్లారెడ్డి డీమ్ డ్ టు బీ యూనివర్సిటీ లతో కూడిన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్య ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విద్యా ప్రపంచం, డిజిటల్ ఇండస్ట్రీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే కాకుండా, విద్యార్థులు ప్రపంచ టెక్నాలజీ మార్పులకు సన్నద్ధంగా ఉండేలా చేస్తుంది. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ భద్రా రెడ్డి మాట్లాడుతూ గూగుల్తో ఈ భాగస్వామ్యం కేవలం సాంకేతికతను అనుసంధానించడం మాత్రమే కాదని, ఇది మొత్తంగా విద్యా వ్యవస్థను మార్చగలిగే ఒక విప్లవాత్మక అడుగు అన్నారు. ప్రతి మల్లారెడ్డి విద్యార్థిని ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడం పై దృష్టి కేంద్రీకరించామని, విద్యా ప్రావీణ్యాన్ని డిజిటల్ ఆవిష్కరణతో మేళవించడం ద్వారా ‘గూగుల్ క్లౌడ్పై డిజిటల్ క్యాంపస్’ తమ విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో సాధికారులను చేస్తుందన్నారు.మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం హైదరాబాద్ వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న ప్రీతి రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యా రంగంలో ఈ మార్పు దిశలో ముందంజలో నిలవడం మా గర్వకారణంగా ఉంది. గూగుల్ సాంకేతికతను మా విద్యా బలంతో కలిపి, డిజిటల్ లెర్నింగ్కి కొత్త నిర్వచనాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఇంజినీరింగ్ నుండి హెల్త్కేర్ వరకు ప్రతి విద్యార్థి ఈ ప్లాట్ఫాం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆవిష్కరణ, సమగ్రత, ప్రతిభను ప్రోత్సహించే తమ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు.
సిక్కోలు సమీకృత కలెక్టరేట్ పనులు చకచక…
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ డిసెంబరు నాటికి పూర్తి
క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను వినేందుకు ఈ నెల 25 నుంచి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు ‘జాగృతి జనం బాట’ పేరుతో జిల్లాల్లో పర్యటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని, అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటామన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న మనం సామాజిక తెలంగాణ ఇంకా సాధించుకోలేదని మాట్లాడితే తనను బీఆర్ఎస్ నుంచి కుట్రపూరితంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. నాడు చెప్పిందే నేడు తాను మళ్లీ చెబుతున్నానని సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి తెలంగాణ జాగృతి కట్టుబడి పని చేస్తుందన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదని ఇది విధానపరమైన నిర్ణయం అని దీనికోసం జాగృతి పని చేస్తుందన్నారు. కేసీఆర్ పేరు చెప్పి బతకాలని లేదు : కేసీఆర్ ఫొటో లేకుండానే ఈ యాత్ర నిర్వహించబోతున్నామని కవిత క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ సభ్యురాలిని కూడా కాదని అందుకే నైతికంగా కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేయబోతున్నామని, అంత మాత్రాన కేసీఆర్ను అవమానించినట్లు కాదన్నారు. కేసీఆర్ అనే చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడటానికి తాను చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. ఆ చెట్టు నీడ నాది కానప్పుడూ ఆ చెట్టుపేరు చెప్పి బతకాలనే ఉద్దేశం నాకు లేదన్నారు. తాను తన దారి వెతుక్కుంటున్నానన్నారు. కేసీఆర్ కూతురుగా పుట్టడం జన్మజన్మలకు తాను చేసుకున్న అదృష్టం అని అయితే దారులు వేరవుతున్నప్పుడు తాను ఇంకా వారి పేరు చెప్పుకోవడం నైతికంగా మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు. పరిష్కారాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుందన్నదని విమర్శించారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా ఒక్క రూపాయి కూడా కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా ఉందన్నారు. జిల్లాల వారీగా టూర్ షెడ్యూల్ : నిజామాబాద్ - అక్టోబర్ 25, 26. మహబూబ్నగర్ - అక్టోబర్ 28, 29, కరీంనగర్ - అక్టోబర్ 31, నవంబర్ 1, ఆదిలాబాద్ - నవంబర్ 3, 4, వరంగల్ / హన్మకొండ - నవంబర్ 8, 9, నల్గొండ - నవంబర్ 11, 12, మెదక్ - నవంబర్ 14, 15, ఖమ్మం - నవంబర్ 17, 18, రంగారెడ్డి - నవంబర్ 20, 21, నారాయణపేట - నవంబర్ 23, 24, కామారెడ్డి - నవంబర్ 27, 28, గద్వాల్ - నవంబర్ 30, డిసెంబర్ 1, పెద్దపల్లి - డిసెంబర్ 3, 4, యాదాద్రి భువనగిరి - డిసెంబర్ 6, 7, భూపాలపల్లి - డిసెంబర్ 9, 10, మంచిర్యాల - డిసెంబర్ 12, 13, సిద్దిపేట - డిసెంబర్ 15, 16, భద్రాద్రి కొత్తగూడెం - డిసెంబర్ 18, 19, మెద్చల్ - మల్కాజిగిరి - డిసెంబర్ 21, 22, నాగర్కర్నూల్ - డిసెంబర్ 27, 28, రాజన్న సిరిసిల్ల - జనవరి 3, 4, సూర్యాపేట - జనవరి 6, 7, జనగామ - జనవరి 10, 11, ఆసిఫాబాద్ - జనవరి 17, 18, సంగారెడ్డి - జనవరి 20, 21, వికారాబాద్ - జనవరి 24, 25, ములుగు - జనవరి 27, 28, జగిత్యాల - జనవరి 30, 31, మహబూబాబాద్ - ఫిబ్రవరి 2, 3, నిర్మల్ - ఫిబ్రవరి 5, 6, వనపర్తి - ఫిబ్రవరి 8, 9, హైదరాబాద్ - ఫిబ్రవరి 12, 13.
Fact-check: PM Modi Was not Invited to Gaza Peace Summit? Viral Claim Is Misleading
Gaza Peace Summit held in Sharm El-Sheikh, Egypt endorsed the newly agreed ceasefire and peace plan aimed at ending the conflict in Gaza
అఫ్గాన్-పాక్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య తాత్కాలికంగా 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమలు లోకి వచ్చింది. ఉభయ దేశాల మధ్య తాజాగా సంఘర్షణలు చెలరేగి ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ ఒప్పందంపై ప్రకటించింది. సానుకూల పరిష్కారం కోసం ఉభయ దేశాలు విశ్వసనీయమైన ప్రయత్నాలు చేయడానికి అంగీకరించాయి. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ వల్ల దౌత్యపరమైన చర్చలకు వీలవడమే కాక, తదుపరి ప్రాణనష్టం జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని పాక్ విదేశీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
త్వరలో విధివిధానాలు : మంత్రి పొంగులేటి
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమం, గౌరవాన్ని కాపాడే దిశగా అక్రిడిటేషన్ పాలసీపై ప్రభుత్వం వేగంగా
త్వరలో వందేభారత్ 4.0: అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ : భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్ రానుంది. వందే భారత్ 4.0 ను అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయిర్గా మార్చే దిశగా ఇది కీలక అడుగు కానుందని వెల్లడించారు. సీఐఐ ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై బలంగా దృష్టి సాధించిందని వెల్లడించారు. 11 ఏళ్లలో 35,000 కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. జపాన్ బుల్లెట్ రైల్ నెట్వర్క్ మాదిరిగానే హైస్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్పారు. గరిష్ఠంగా గంటకు 350 కిమీ వేగంతో రైలు ప్రయాణించేలా వాటి డిజైన్ ఉంటుందని తెలిపారు.
ఇప్పుడు 3 జిల్లాలకే నక్సలిజం పరిమితం: కేంద్రం
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఆరు జిల్లాలో ప్రాబల్యం చాటుకున్న నక్సలిజం ఇప్పుడు కేవలం మూడు జిల్లాలకు పరిమితం అయిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. మల్లోజుల, ఆయన బృందం సరెండర్ తరువాత బుధవారం ఈ స్పందన వెలువడింది. ఇప్పుడు కేవలం బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్ జిల్లాలో నక్సల్స్ ఉనికి ఉందని ప్రకటనలో తెలిపారు. ఎల్డబ్లుఇ కథ ముగిసేదశకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. నక్సల్స్ రహిత భారత్ రూపొందించాలనే మోడీ ప్రభుత్వ విజన్ దిశలో ఇది భారీ ముందడుగు అని, తమ 2026 లక్షం ముందే దీనిని చేరుకుంటామని అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో తాము 2026 మార్చి 31కు ముందే అనుకున్న లక్షం చేరుకుంటామని ప్రకటనలో వివరించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 312 కేడర్స్ నిర్మూలన జరిగింది. ఇందులో మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి, 8 మంది వరకూ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. దాదాపుగా 836 మంది అరెస్టు అయ్యారు. 1639 మంది సరెండర్ అయ్యారని లెక్కలు తెలిపారు. ఇప్పుడు మల్లోజుల లొంగుబాటుతో ఇది కీలకమ లుపు తిరిగిందన్నారు. భూపతి సరెండర్తో సరికొత్త అధ్యాయం: ఫడ్నవిస్ మల్లోజుల సరెండర్, వెంట భారీ స్థాయిలో నక్సల్స్ లొంగుబాట కీలక పరిణామం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం తెలిపారు. ఈ పరిణామంతో మహారాష్ట్రలో నక్సల్స్ కదలికలు ఉండబోవని ఆయన విశ్లేషించారు. ఇక కొద్దిరోజుల్లోనే చత్తీస్గఢ్, తెలంగాణాల్లోని మొత్తం ఈ ఎర్ర ప్రాంగణం లేదా రెడ్ కారిడార్ కథ కంచికి అని వ్యాఖ్యానించారు. నిషేథిత వర్గాలపై పోరులో తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రధాన పాత్ర వహించడం తమ ప్రాంతానికి గర్వకారణం అని కూడా తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చే నక్సల్స్కు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఆశ్రమం, పునరావాసం కల్పిస్తాయని, నాయకత్వం లేని తమ ఉద్యమం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటకి రావాలని కూడా ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. సీనియర్ మావోయిస్టు నేత భూపతి తమ దళం సభ్యులు దాదాపుగా 60 మందితో కలిసి బుధవారం మహారాష్ట్ర సిఎం ముందు లొంగిపోయారు. ఈ దశలో ఏర్పాటు అయిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తమ ముందు నక్సల్స్ లొంగిపోయారని, వారికి చెందిన ఎకె 47లు ఇతర మొత్తం 54 మారణాయుధాలను స్వాధీనపర్చుకున్నామని ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో నక్సలిజం పూర్తి స్థాయి అంతానికి తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఆరంభం జరిగిందని, ఇది దేశ చరిత్రలో మైలురాయి అవుతుందని ఫడ్నవిస్ గర్వగా తెలిపారు. ఇప్పుడు ఇక చత్తీస్గఢ్, కొంతలో కొంత తెలంగాణలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కేవలం వారి ఉనికి పరిమితం అయింది. ఇది కూడా అంతరిస్తుందన్నారు. ఇది పోలీసు, భద్రతా సిబ్బంది, ప్రత్యేకించి ఇంటలిజెన్స్ వర్గాల ఘనత అన్నారు.
పెద్దపల్లి పులి ఎందుకు లొంగినట్లు?.. సంచలనంగా మావో అగ్రనేత సరెండర్
అంతర్మథనంతోనే ఆత్మార్పణం ..ఆయుధ త్యాగం సాయుధ పోరాట యోధుడు భూపతి సరండర్ సంచలనం చాలారోజులుగా లొంగుబాటు మంతనాలు.. భవితపై సందిగ్థాలు గడ్చిరోలి (మహారాష్ట్ర): నక్సల్స్ వర్గాల్లో తీవ్ర సంచలనానికి దారితీసిన పేరు మోసిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు, అలియాస్ భూపతి సరెండర్ ఎందుకు జరిగింది? ఇది ఇప్పుడు సామాజిక రాజకీయ, పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలలో కూడా కీలక చర్చనీయాంశం అయింది. ఈ అజ్ఞాతపు , లోగుట్టు ఎవరికీ అంతుపట్టని నక్సల్ భూపతి నిషేధిత పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్లుజి) వ్యవస్థాపక సభ్యుల కేడర్లోని వాడు. నక్సల్స్ ఉద్యమానికి కీలక వ్యూహకర్త. దశాబ్దాలుగా మహారాష్ట్ర , చత్తీస్గఢ్ సరిహద్దులలో మావోయిస్టు ప్రాబల్యం పెరగడంలో ప్రధాన భూమిక వహించాడు. ఆయన ప్రభావం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో కూడా నక్సలైట్ల ఉద్యమంపై బలీయంగానే ఉంది. ఆయనను పట్టిస్తే రూ 6 కోట్ల నజారానాను ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకాలం రెండురోజుల క్రితం వరకూ దట్టమైన అరణ్యంలో దళాల మధ్య నాయకత్వంతో గడిపి, సాయుధ పోరాటమే జీవితం అని నిర్ధేశితంగా గడిపిన వ్యక్తి ఇప్పుడు తనతో పాటు 60 మంది నక్సల్స్తో సహా పోలీసులకు లొంగిపొయ్యారు. ఇప్పుడు గడ్చిరోలి పోలీసు కస్టడీకి తరలివెళ్లారు. నక్సల్ సమస్య లేకుండా చేస్తామనే కేంద్ర ప్రభుత్వ, ప్రత్యేకించి హోం మంత్రి అమిత్ షా పదేపదే చేస్తున్న ప్రకటనల క్రమంలో నెలరోజులుగా తెరవెనుక సాగిన మంతనాలు, క్షేత్రస్థాయిలో పరిణామాల నేపథ్యంలో ఇక మరో మార్గం లేదని గుర్తించే మల్లోజుల సరెండర్ అయ్యాడా? లేక మరేదైనా వ్యూహాత్మక అంశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. 69 సంవత్సరాల ఈ భూపతి మావోయిస్టుల సెంట్రల్ కమిటీ, పొలిట్బ్యూరో సభ్యులు కూడా. ఆయన తన బృందంతో సరెండర్ కావడం, ఇప్పుడు సాగుతున్న నక్సల్ బలహీనత సంకేతాలకు ప్రధాన అంశం అయింది .ఒక ధైర్యసాహసాల తుపాకీ యోధుడి కోణం, ఇప్పుడు అటువంటి వ్యక్తిలో నెలకొన్న ఆత్మనూన్యత భావం, క్రమేపీ రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం సరెండర్కు దారితీసిందని ఈ విషయాలపై అవగావహన గల సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గత నెలలోనే ఆయన వామపక్ష తీవ్రవాదం తన చివరి దశలో ఉందనే విషయం గుర్తించాడని ఈ అధికారి పేరు చెప్పకుండా తెలిపారు. తాను సరెండర్ అవుతానని, తనతో కలిసి లొంగిపోయే వారు కలిసి రావచ్చునని చాలా రోజులుగా ఆయన అంతర్గతంగా కరపత్రాలు సందేశాలు, చివరికి ప్రెస్నోట్లు వెలువరించిన విషయాన్ని ఈ పోలీసు అధికారి గుర్తు చేశారు. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజులకు కేడర్లో అనేక మారుపేర్లు ఉన్నాయి. సోనూ , అభయ్,వ వివేక్గా కూడా పేరుమోశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి మల్లోజుల వెంకటయ్య నుంచి స్ఫూర్తి పొందే కొడుకు ఈ అడవిబాట పట్టినట్లు , ఎన్నో ఏళ్లుగా తన ఊరివారికి కూడా అజ్ఞాతుడై, అడవిచుక్క అయ్యాడని కరీంనగర్ వ్యక్తి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలోనే భార్య తారక్క సరెండర్ తనతో పాటు కేడర్లో పనిచేసిన భూపతి భార్య తారక్క ఈ ఏడాది ఆరంభంలోనే సరెండర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇక ఆయన సరెండర్ సూచనలు బలోపేతం అయ్యాయి. సాయుధ పోరాటం అనేది ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడిందని, ఇప్పుడు ఈ విప్లవ సిద్ధాంత విఫల అధ్యాయం అని ఆయన తరచూ భావించారని, ఈ మేరకు తమకు నిర్థిష్ట సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ఇకపై ఏం చేయగలం? ఏం సాధిస్తాం? ఏం సాధించామనే ఆలోచనలు ఆయనలో మిక్కుటం అయ్యాయి. ఇవన్నీ కూడా ఆయన సరెండర్ నిర్ణయానికి దారితీశాయి. ముందుగా భార్యను జనజీవితంలోకి పంపించాడని, ఇప్పుడు తాను సరెండర్ అయ్యాడని, ఇది కీలక పరిణామమే అని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. సరెండర్ సంకేతాలు రాగానే ఆయన డోలాయమాన పిరిస్థితిని పసిగట్టామని, దీనితో ఇక ఆయన కోసం గాలించకుండా , మర్యాదపూర్వకంగా సరెండర్ అయ్యేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించామని,ఈ మేరకు తమ ఇంటలిజెన్స్ నెట్వర్క్ను సిద్ధం చేశామని పోలీసు బాస్ వెల్లడించారు. ఈ దిశలో నమ్మకస్తులైన వారి ద్వారా ముందుగా ఆయననుఏ భమార్గఢ్ ప్రాంతంలో సంప్రదించడం జరిగిందని వివరించారు. ఇంతకాలం చట్టానికి అతీతంగా వ్యవహరించిన వ్యక్తి చట్టం ముందు లొంగిపోతే ఇకపై ఎటువంటి ముప్పు ఉండకుండా చూస్తామనే భద్రతను క్రమేపీ కల్పించామని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన లొంగుబాటు జరిగిందని వివరించారు. 10 రోజుల క్రితమే పల్లెజనం ముందు వెల్లడి పదిరోజుల క్రితమే భూపతి కొందరు నక్సల్స్తో కలిసి ఫోడేవాడా ప్రాంతంలో గ్రామస్తులతో ముచ్చటించి వెళ్లారు. ఇక తాను అడవుల్లో నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చిందని చెప్పినట్లు తమకు రూఢిగా తెలిసిందని వివరించారు. ఇంతకాలపు హింసాత్మక మార్గాన్ని వీడి ఇప్పుడు తమ ముందుకు వచ్చాడని పోలీసు అధికారి చెప్పారు. దీనితో 40 సంవత్సరాల ఆయన ఈ సుదీర్ఘ ప్రస్థానం ముగిసిందని ఆయన గురించి తెలిసిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఈ నెల 13వ తేదీన తెరవెనుక మంతనాలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నేతతో ఓ పోలీసు అధికారి కలిశారు. అంతకు ముందు చాలా కాలంగా భూపతి కదలికలను గమనిస్తూ, ఆయన సరెండర్కు యత్నించిన ఈ పోలీసు అధికారి అదే రోజు ఆయన సరెండర్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఆయన చెప్పినట్లే భామర్గఢ్ తాలూకలోని హోదారి కుగ్రామం వెలుపల ఆయన ఆయన భారీ బృందంతో సరెండర్ అయ్యారు. దీనితో ఇక నక్సల్స్ ఉద్యమంలో సంధ్యకాలం ఏర్పడింది. ఈ భూపతి, తన నక్సల్స్ బృందంతో సరెండర్ అయిన తరువాత ప్రత్యేకించి ఇప్పుడు మిగిలిన వామపక్ష తీవ్రవాదం దిశ దశ దిక్సూచి ఏమిటనేది అటు నక్సల్స్, ఇటు పౌర సమాజం, మేధావుల్లో పలు ఆలోచనలకు దారితీసింది. ఈ భూపతి బృందం పది మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు ఆత్మసమర్ఫణకు దిగారు. ఈ క్రమంలో 54 ఆయుధాలు కూడా అప్పగించారు. సాయుధ పోరాట లక్షం గతితప్పిందనే మల్లోజుల మనోగతం తరువాతి క్రమంలో ఈ అడవిదారుల ఉద్యమ పంథా ఏమిటనేది అడవుల్లో చప్పుడు అయింది.
లైమ్ లైట్ లోకి వెటరన్ ప్లేయర్స్…
లైమ్ లైట్ లోకి వెటరన్ ప్లేయర్స్… వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్
బిసి బంద్కు బిజెపి మద్దతు: రాంచందర్ రావు
బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడాన్ని నిరసిస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపునకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మద్దతు పలికారు. బుధవారం బిసి జెఎసి నాయకుడు, బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ తదితరులు పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును కలిసి తమ బంద్కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బంద్కు మద్దతు పలికారు. బిసిలకు న్యాయం జరగాలని డిమాండ్తో బిసి జెఎసి చేపట్టిన ఉద్యమానికి పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. బిసిల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు. బిసి సమాజ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు.బిజెపి మాత్రమే బిసిలకు న్యాయం చేయగలదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బిసిలను మోసం చేసిందని, రిజర్వేషన్లు అమలు చేయలేక ఇతరులపై నెపం వేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలకు గౌరవం ఇచ్చిన పార్టీ తమదేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బిసిలు ఉన్నారని ఆయన వివరించారు. బిసిలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగించాలని ఆయన బిసి సంఘాలను కోరారు. బిసి సంఘాలు ఇచ్చిన బంద్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాంచందర్ రావు కోరారు.
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గద్దల ఆగన్ (భరత్ కుమార్)కు, ఆదిలాబాద్కు చెందిన జాశ్విన్ (25)తో 2020లో వివాహం జరిగింది. వారికి జోయల్ (4), జాట్సన్ (4 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 8వ తేదీన పిల్లలిద్దరిని తీసుకొని జాశ్విన్ నిద్ర చేసేందుకు పుట్టింటికి వెళ్లింది. ఆమె తండ్రి కిషన్ కామారెడ్డి చర్చి పాస్టర్గా పనిచేస్తున్నారు. దీంతో ఆ కుటుంబం ఆదిలాబాద్ నుండి కామారెడ్డి వచ్చింది. జాశ్విన్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డిలోని తండ్రి వద్దకు వచ్చింది. బుధవారం చిన్న బాబుకు టీకా వేయించేందుకు సమీప బంధవు అయిన ఆశా వర్కర్ జంగంపల్లిలో ఉండటంతో అక్కడకు జాశ్విన్ స్కూటీపై ఇద్దరు పిల్లలతోపాటు తండ్రితో కలిసి వెళ్తోంది. అదే సమయంలో కామారెడ్డి జిల్లా 44వ నెంబర్ జాతీయ రహదారి బిక్కనూర్ మండలం, జంగంపల్లి శివారు వద్ద రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కిషన్ (50), అతని కూతురు జాశ్విన్, మనవడు జోయల్ అక్కడిక్కక్కడే మృతి చెందగా 4 నెలల బాబు జాట్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతురాలు జాశ్విన్ భర్త ఆగన్.. చింతకాని మండలం, చిన్నమండల గ్రామంలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో విషాదఛాయలు అలుముకొన్నాయి. కాగా, జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరగడంతో గ్రామస్థులు, వాహనదారులు గుమిగూడడంతో, కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. మృతదేహాలపు మార్చురీకి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
రాలిపోతున్న స్టార్లింక్ ఉపగ్రహాలు
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్ ఉండే అవకాశం ఉందని స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు ఒకటి నుంచి రెండు స్టార్లింక్ ఉపగ్రహాలు భూ వాతావరణం లోకి ప్రవేశిస్తున్నాయని, ముందుముందు భూమిపై రాలిపోతున్న స్టార్లింక్ ఉపగ్రహాల సంఖ్య రోజుకు 5 వరకు పెరగవచ్చని తెలిపారు. భవిష్యత్తులో స్పేస్ఎక్స్, అమెజాన్ చేపట్టిన ప్రాజెక్టు కైపర్, చైనాకు చెందిన మరిన్ని ఉపగ్రహాలు కక్ష లోకి ప్రవేశించడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కక్షలో 8 వేలకు పైగా స్టార్లింక్ ఉపగ్రహాలు ఉన్నాయని, చైనా మరో 20 వేల ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెడుతుందనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు. స్టార్లింక్ ఉపగ్రహ జీవితకాలం దాదాపు ఐదునుంచి ఏడేళ్లు ఉంటుందని, అనంతరం వాటంతట అవే కక్ష నుంచి తొలగి భూమిపై రాలిపోతాయన్నారు. ఒక్కోసారి ఉపగ్రహాల్లోని వ్యవస్థల్లో తలెత్తే వైఫల్యాలు లేదా సౌర కార్యకలాపాల వల్ల కూడా అవి పడిపోతాయన్నారు. అయితే ఖగోళంలో ఇలాంటి ఉపగ్రహాలు , రాకెట్ శకలాల సంఖ్య పెరగడం వల్ల అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువై , కెస్లర్ సిండ్రోమ్ అనే చైన్ రియాక్షన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కక్షలో ఉన్న ఇతర ఉపగ్రహాలు ఢీకొనే అవకాశం ఉంటుందని , ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్, సౌర కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు స్టార్లింక్ తరచూ కక్ష లోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడం వల్ల అంతరిక్ష ట్రాఫిక్ ఏర్పడి, మానవాళికి పెద్ద సవాల్గా మారుతుందన్నారు. రాబోయే పదేళ్లలోమస్క్ సంస్థ మరో పదివేల ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేశారు. కెస్లర్ సిండ్రోమ్ అంటే ? కెస్లర్ సిండ్రోమ్ అనేది ఖగోళ వ్యర్థాలకు సంబంధించిన చైన్ రియాక్షన్ . ఇక్కడ భూ కక్షలో శిథిలాల సంఖ్య పెరిగినప్పుడు ,అవి ఒకదానికొకటి ఢీకొని మరిన్ని శిథిలాలను సృష్టిస్తాయి. దీనివల్ల ఉపగ్రహాలకు , భవిష్యత్ అంతరిక్షపరిశోధనలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.
టపాకులు కాల్చండి.. పర్యావరణాన్ని కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి దీపావళికి పర్యావరణ హిత బాణసంచా ( గ్రీన్క్రాకరీ) కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తి వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తమ రూలింగ్ వెలువరించింది. ఢిల్లీ, ఎన్సిఆర్ పరిధిలో ఈ నెల 18 నుంచి 21 వ తేదీ వరకూ పటాకులు కాల్చడానికి కొన్ని షరతులను విధించింది. దివాలీ వేడుకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే ఖచ్చితంగా గ్రీన్క్రాకరీస్ను కాల్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్ణీత వేళలను కూడా ఖరారు చేశారు. ఢిల్లీ, పరిసరాలలో వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలతో ఇప్పటివరకూ ఎటువంటి పటాకులు పేల్చడాన్ని అనుమతించడం లేదు. వీటిపై ఉన్న నిషేధాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సడలించింది. తాము ఈ విషయంలో మధ్యస్థ సమతూకతను పాటించి ఆదేశాలను వెలువరించామని, ఒక పరిమిత మోతాదులో బాణాసంచ కాల్చడానికి అనుమతిని కల్పించాం. ఇక ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీకి రావడం లేదని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ తెలిపారు. దివాళి రోజు తరువాతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాల్సి ఉంటుంది. ఇక దుకాణాలలో అనుమతించిన సరుకు క్యూఆర్ కోడ్ ఉన్నవే విక్రయించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు విభాగంపై ఉంటుంది. ఇందుకోసం తగు విధంగా పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలి. నిబందనలను అంతా పాటించేలా చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.
అడ్డుకున్న పోలీసులు.. ఉట్నూర్, ఆంధ్రప్రభ: గిరిజన సంక్షేమ శాఖ అశ్రమ వసతి గృహాల్లో
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం: మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో లక్షల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఓటు చోరీ ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి దేశవ్యాప్తంగా ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని దేశవ్యాప్తంగా తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉద్యమిస్తూ.. ప్రజలను చైతన్యం చేస్తూ ఆధారాలతో సహా బయటపెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాలలో దొంగ ఓట్లను నమోదు చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని విమర్శించారు. ఓట్చోరీపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడుతూ స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఇంట్లో ఓటు ఉందో లేదో చూడాలని హితవు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ కేడం లింగమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బోలిశెట్టి శివయ్య, అక్కు శ్రీనివాస్, కోమటి సత్యనారాయణ, బంక చందు, చిత్తారి రవీందర్తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో తెలియదు: ట్రంప్
వాషింగ్టన్ : ఉక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వివాదంగా ఈ యుద్ధాన్ని పేర్కొన్నారు. పుతిన్తో తనకు చాలా మంచి సంబంధాలున్నాయని, బహుశా ఇప్పటికే అలాగే ఉన్నాయని చెప్పుకొచ్చారు. పుతిన్ ఈ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో నాకు తెలియదని, కానీ యుద్ధం అంతమంచిది కాదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశానికి ముందు ట్రంప్ వైట్హౌస్లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గత నాలుగేళ్లుగాజరుగుతోందని ఈ యుద్ధం వారం లోనే పూర్తి కావలసి ఉందని, రష్యా 1.50 లక్షల మంది సైనికులను కోల్పోయిందన్నారు. ఇది భయంకరమైన యుద్ధమని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన మరణాల పరంగా అతి పెద్ద సంఘటనగా పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, ఈ యుద్ధాన్ని పూర్తిగా రష్యా, ఉక్రెయిన్ పరిష్కరించుకోవాలన్నారు. అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ట్రంప్ 20 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఉక్రెయిన్కు టొమాహాక్ క్షిపణులను ఇవ్వడానికి అమెరికా ఆలోచిస్తుందన్నారు.
భారత్ మహిళా జట్టుకు మరో దెబ్బ#TeluguPost #telugu #post #news
2025కు న్యూఢిల్లీలో శ్రీకారం హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో
Bunny Vas about Fake Mafia in Tollywood
A couple of days ago, young producer Bunny Vas expressed his frustration about the negative trend on social media against his upcoming production Mithra Mandali. He lost his cool, expressed his anger and filed a complaint with the Cybercrime cops. Today during the press interaction, Bunny Vas exposed the fake mafia in telugu cinema which […] The post Bunny Vas about Fake Mafia in Tollywood appeared first on Telugu360 .
Dude Promises An Emotional Ride For All
Mythri Movie Makers is now gearing up for the Diwali release of their next venture, Dude, starring Pradeep Ranganathan and Mmitha Baiju. Scheduled to hit screens on October 17, the film marks the directorial debut of Keerthiswaran and is already drawing attention for its unique blend of emotion and entertainment, promised through promos. Producers Naveen […] The post Dude Promises An Emotional Ride For All appeared first on Telugu360 .
భూములు, ఇండ్లు, ఫ్లాట్లకు భారీ నష్టం..
భూములు, ఇండ్లు, ఫ్లాట్లకు భారీ నష్టం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : త్రిబుల్ ఆర్
భారత్ తో వన్డే సిరీస్.. వారిపై డౌటే !!
టీమిండియా యువ సెన్సేషన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం
ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు.
ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని
మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్గాన్ సరిహద్దు.. డజన్ల మంది సైనికులు మృతి
కాబూల్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ సంఘర్షణలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వైపులా డజన్ల మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. అయితే ముందుగా ఎవరు కాల్పులు జరిపారనే విషయమై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణపై మాట్లాడటం కోసం అఫ్గన్ వెళ్లేందుకు పాకిస్థాన్ మంత్రులు ప్రయత్నించారు. కానీ అఫ్గాన్ వారిని అడ్డుకుంది. దాంతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియాలను సంప్రదించింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ బుధవారం ఉదయం పాకిస్థానే తాజాగా కాందహార్ ప్రావిన్స్లో స్పిన్బోల్డక్ జిల్లాలో దాడులకు పాల్పడిందని,15 మంది పౌరులు మృతి చెందారని, వందమందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. అదే ప్రాంతంలోని ఆస్పత్రి వర్గాలు గాయపడిన వారిలో 80 మంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని వెల్లడించాయి. అఫ్గాన్ దళాలు ప్రతీకార దాడులకు పాల్పడ్డాయని, భారీ సంఖ్యలో పాక్సైనికులు హతమయ్యారని పాకిస్థాన్ ఆయుధాలను, ట్యాంకులను స్వాధీనం చేసుకోవడమైందని తాలిబన్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. అఫ్గాన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను , సైనిక పోస్ట్లను దెబ్బతీశామని స్థానిక మీడియాతో పాక్ భద్రతాధికారులు పేర్కొన్నారు. తాలిబన్లు వాయువ్య, నైరుతి ప్రాంతాల్లో సరిహద్దు పోస్టులను కూల్చివేశారని ఆరోపించారు. దాదాపు 30 మంది అఫ్గాన్ సైనికులు హతమయ్యారన్నారు. స్పిన్బోల్డాక్లో మరో 20 మంది చనిపోయారన్నారు. కాందహార్లో పాక్ జెట్ విమానాలు దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అఫ్గాన్లో ఖోస్ట్ ప్రావిన్స్ లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్అహ్రర్ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించారు. చమన్ జిల్లాలో తాలిబన్ల దాడులకు నలుగురు పౌరులు గాయపడ్డారని పాక్ ఆరోపించింది. పాక్ ప్రభుత్వం మీడియా ప్రకారం , ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ దళాలు, తెహ్రీక్ ఇతాలిబన్ పాకిస్థాన్ సంయుక్తంగా తమ భూభాగం లోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాలు బలంగా స్పందించాయని, టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘర్షణలతో సరిహద్దుల్లో వేలాది మంది నిర్వాసితులయ్యారు. మధ్యవర్తిత్వానికి సిద్ధం: జేయూఐఎఫ్ చీఫ్ పాక్ అఫ్గాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై ‘జమైత్ ఉలేమా ఈఇస్లాం ఫ్లజ్ పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. గతంలో పాక్అఫ్గాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలకపాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను అది చేయగలనని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అఫ్గాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
మస్కాపూర్ బీట్ అటవీలో ట్రైనింగ్
మస్కాపూర్ బీట్ అటవీలో ట్రైనింగ్ ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్
అస్త్రాలు వదిలి లొంగిపోండి: బండి సంజయ్
మావోయిస్టులు అస్త్రాలు వదిలి లొంగిపోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. గడ్చిరోలి ప్రాంతంలో వారి ఉనికికి గట్టి దెబ్బగా మావోయిస్టుల సీనియర్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అరవై మంది దళ సభ్యులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారని ఆయన తెలిపారు. ఈ పరిణామం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృఢమైన, ఫలితాలపై దృష్టి పెట్టిన కాలపరిమితికి ప్రతిబింబం అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా నిర్మూలించాలన్నది కేంద్ర మంత్రి అమిత్ షా లక్షమని ఆయన తెలిపారు. అంతర్గత భద్రత పట్ల ఆయన రాజీ లేని వైఖరి దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలో ఎన్టీయే ప్రభుత్వం శాంతి-భద్రత, అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఈ సమయంలో మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ==++==
వైరా మున్సిపాలిటిలో 54 లక్షలు స్వాహ...?
జనరల్ ఫండ్ను కాజేసిన అధికారులు జేఏవో ఫిర్యాదుతో అవినీతి బహిర్గతం విచారణ చేపట్టిన అధికారులు మన తెలంగాణ/వైరా: అనేక అవినితి ఆరోపణలకు నిలయంగా మారిన వైరా మున్సిపాలిటి కార్యాలయంలో అతి పెద్ద కుంభకోణం బయటపడింది. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు ఏకంగా సుమారు 54 లక్షల రూపాయలు అధికారులు కాజేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటిలోని ఇంజనీరింగ్ శాఖ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కేంద్రంగా ఈ అవినితి వ్యవహరం కొనసాగింది. మున్సిపాలిటి జనరల్ ఫండ్ రూ.2 కొట్ల నిధులలో సుమారు 54 లక్షల రూపాయలు గోల్మాల్ జరగడం ప్రకంపనలకు దారితీస్తుంది. జేఏఓ కిరణ్ మున్సిపాలిటి అవినితిపై రాష్ట్ర, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారుల బాగోతం బహిర్గతమైంది. గత రెండు నెలల క్రితం వరకు వైరా మున్సిపాలిటి కమిషనర్గా పని చేసిన చింతా వేణు, అకౌంటెట్గా పని చేసిన జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ఈ అవినితికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మున్సిపాలిటిలోని జనరల్ ఫండ్ సుమారు 54 లక్షల రూపాయలు ఈ ఇద్దరు ఉద్యోగులు బ్యాంకుల నుంచి తమ ఇష్టారాజ్యంగా డ్రా చేశారు. తమ నిధులకు నిరంతరం డుమ్మా కొట్టే ఇంజనిరింగ్ విభాగం జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ సెల్ప్ చెక్కులు రాసుకొని 54 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు.ఈ చెక్కులపై అప్పటి మున్సిపాలిటి కమీషనర్ చింతా వేణు సంతకాలు చేశారు. నిభందనల ప్రకారం ఏదైనా పని జరిగితే ఆ పనికి సంబందించిన ఏజెన్సి పేరుతో చెక్కును మంజూరు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇస్టానుసారంగా వెంకటేశ్వర్లు తన పేరుపై చెక్కులు రాసుకొని నిధుల కాజేశారు. ఈ వ్యవహరం అంతా అప్పటి మున్సిపల్ కమీషనర్ చింతా వేణు కనుసన్నల్లో కొనసాగిందని, చిన్న చిన్న పనులను చూపిస్తూ ఆ నిధులను ఖ్చు చేసినట్లు రికార్డుల్లో చూపించటం విశేషం. జేఏఓ కిరణ్ ఫిర్యాదుతో ఆర్డిఏంఏ షాహిద్ మంగళవారం విచారణ చేపట్టారు.కిరణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రెండు నెలలు గడుస్తున్న అకౌంటెంట్ వెంకటేశ్వర్లు పూర్తిస్ధాయిలో బాధ్యతలు అప్పజేప్పలేదు.దీంతో అనుమానం వచ్చిన జేఏఒ కిరణ్ ఖాతాలను పరిశీలించగా ఈ అవినితి అంతా భయటపడటంతో ఉన్నతాదికారులకు కిరణ్ ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటి ఏర్పడినప్పటి నుండి ట్రేడ్ లైసెన్స్ పన్నును ముక్కపిండి వసూలు చేస్తున్నారని ఆ డబ్బును జమ చేయకుండా ఆధికారులు వారి జేబులోనే వేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఆవినితిపై జిల్లా ఉన్నతాదికారులు సిరియస్గా తీసుకొని చిచారణ చేపడుతారా లేదా అనేది ఇప్పుడు వైరా తీవ్ర చర్చాంశనియంగా మారింది.అయితే వైరాలో ప్రతిసారి అనినితి జరగటం,అదికారులు విచారణ నిర్వహించి వదిలేయటం పరిపాటిగా మారింది.ఇప్పటికైనా సిడిఎంఏ అధికారులు స్పందించి వైరా మున్సిపాలిటిలో జరిగిన అవినితిపై తగు చర్యలు తీసుకొవాలని మున్సిపాలిటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్లూస్ టీంతో దర్యాప్తు లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా(Nirmal District) లక్ష్మణచాంద
భారీ సంఖ్యలో లొంగిపోయిన మవోయిస్టులు..
ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మవోయిస్టులు లొంగిపోయారు. కేంద్రం ఆదేశాలతో భద్రతా దళాల ఆపరేషన్ తో మనుగడ సాధించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు మావోయిస్టులు. ఇప్పటికే చాలా మంది మావోలు.. బలగాల ఎన్ కౌంటర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది లొంగిపోగా.. వందల మంది మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం తమ ఆపరేషన్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులకు మావోలు లొంగిపోయారు. బుధవారం కాంకేర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు లొంగిపోగా.. బీఎస్ఎఫ్ క్యాంపులో మరో 50 మంది, సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే, లొంగిపోయిన మావోయిస్టులపై గతంలో రూ. 50 లక్షల రివార్డు ప్రకటన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుముందు మరికొంతమంది మావోలు లొంగిపోయే అవకాశం ఉంది. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. 2026 మార్చి నాటికి దేశంలో మావోలను పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
పల్నాడు జిల్లాలో కలవరం పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా –
సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయండి..
ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకుంటాం :- బంజారా నాయకులు.. విశాలాంధ్ర పుట్టపర్తి: – సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి నాయక్ పేర్కొన్నారు. బుధవారం ప్రశాంతి గ్రామంలో ఆంజనేయులునాయక్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి ఎటువంటి […] The post సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయండి.. appeared first on Visalaandhra .
ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి..
ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి.. వేములవాడ, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన
కార్తీక మాసం వచ్చేసింది! సిద్ధమా శివారాధనకు? #devotional #karthikamasam #shivaradhana #telangana
ఓటు చోరీతో ఫలితాలను తారుమారు
ఓటు చోరీతో ఫలితాలను తారుమారు హుస్నాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
పి.వి.కె.కె. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకురాలికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ:పీ.వి.కె.కె. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. సి. వీణా కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు – 2025ను అందుకున్నారు.ఈ అవార్డు సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ – సీఈఓ , ఏఐసిటి ఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ డా.వీణా కి అందజేశారు. ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు, వినూత్న […] The post పి.వి.కె.కె. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకురాలికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.. appeared first on Visalaandhra .
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం..
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో
కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు
కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు హుస్నాబాద్, ఆంధ్రప్రభ : హుస్నాబాద్
కూరగాయల వ్యాపారి దాదా ఖలంధర్ మృతి..
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కూరగాయల మండి మర్చంట్ దాదా ఖలంధర్ (52) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. పట్టణంలో సుపరిచితుడుగా ఉంటూ సౌమ్యుడిగా పేరుంది. వ్యాపారంలో ఆర్థిక ఒడుదుడుకులు కారణంగా కొంత ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసింది. దాదా ఖలందర్ కి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మంగళవారం రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న దాదా ఖలందర్ బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. దాదా ఖలందర్ మృతి పట్ల పట్టణ ప్రముఖులు సంతాపం […] The post కూరగాయల వ్యాపారి దాదా ఖలంధర్ మృతి.. appeared first on Visalaandhra .
మెగా బిందుసేద్యం ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.. సిపిఐ
బిందు సేద్యం పరికరాలను పరిశీలిస్తున్న సిపిఐ నాయకులు విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ నియోజకవర్గం లో 842 కోట్ల రూపాయల వ్యయంతో 22 గ్రామాలకు 50వేల ఎకరాలకు13వేలు మంది రైతులకు ఉపయోగపడే సామూహిక మెగా బిందు సేద్యం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో సామూహిక బిందు సేద్యం ప్రాజెక్టుకు సంబంధించిన నిరుపయోగంగా పడి ఉన్న పరికరాలను జిల్లా […] The post మెగా బిందుసేద్యం ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.. సిపిఐ appeared first on Visalaandhra .
పిఎం మోడీ గో బ్యాక్ అంటూ నిరసన ర్యాలీ వామపక్షాల నేతలు అరెస్టు
విశాలాంధ్ర – నంద్యాల : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రధాన మంత్రి మోడీ ఎలా వస్తారని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను వ్యతిరేకిస్తూ పీఎం నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ పద్మావతినగర్ నుంచి గాంధీచౌక్ వరకు నిరసన […] The post పిఎం మోడీ గో బ్యాక్ అంటూ నిరసన ర్యాలీ వామపక్షాల నేతలు అరెస్టు appeared first on Visalaandhra .
ముత్యంపేటలో మెగా పశువైద్య శిబిరం
ముత్యంపేటలో మెగా పశువైద్య శిబిరం దండేపల్లి, అక్టోబర్ 15(ఆంధ్రప్రభ) : పశు సంవర్ధక
పోలీస్ కమిషనర్ కు జోగి రమేష్ ఫిర్యాదు
వైసీపీ నేత జోగి రమేష్ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు
పీఏబీఆర్ కాలువ ద్వారా చెరువులకు నీరు అందించాలి..సిపిఐ
విశాలాంధ్ర – అనంతపురం రూరల్… జిల్లాలో ఈ సంవత్సరం సరైన వర్షాలు కురవకపోవడంతో అనేక గ్రామాల్లో త్రాగనీటితో పాటు, బోరుబావులు భూగర్భ జలాలు తగ్గిపోయాయని, రైతులకు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు సమస్య ఏర్పడిందని పీఏబీఆర్ కాలువ ద్వారా 49 చెరువులకు నీరు అందించాలని చిరుతల మల్లికార్జున సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పేర్కొన్నారు. బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో హెచ్ ఎల్ సి యస్ ఈ కి వినతి పత్రాన్ని అందజేశారు. పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న […] The post పీఏబీఆర్ కాలువ ద్వారా చెరువులకు నీరు అందించాలి..సిపిఐ appeared first on Visalaandhra .
“One State, One Capital, One Vision”: Nara Lokesh on Andhra Pradesh’s New Era of Growth
Andhra Pradesh IT and Industries Minister Nara Lokesh has painted a bold picture of the state’s future, one built on investment and innovation. Speaking at a press conference in Amaravati, Lokesh said Andhra Pradesh is entering a transformative phase, with Google’s massive USD 15 billion investment in Visakhapatnam marking the beginning of a new industrial […] The post “One State, One Capital, One Vision”: Nara Lokesh on Andhra Pradesh’s New Era of Growth appeared first on Telugu360 .
రూ. 75 వేల విరాళాలు అందజేత కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : విధి
రేపు సుప్రీంకోర్టుకు బీసీ రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్ల పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
వేరుశనగ పంటలు పరిశీలన చేపట్టిన సిపీఐ ఏపీ రైతు సంఘం బృందం విశాలాంధ్ర – గుమ్మగట్ట: మండలంలోని 75 వీరాపురం, పూలకుంట, వెంకటంపల్లి, కలుగోడు,రంగచేడు గ్రామాలలో బుధవారం ఏపీ రైతు సంఘం వేరుశనగ పంటలను పరిశీలించారు.నియోజకవర్గ తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ వేరుశనగ వర్షాధార భూములను చదును చేసే సేద్యానికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.సకాలంలో వేరుశనగ పంటలపై వర్షాలు రాకపోవడంతో నిట్ట నిలువున భూముల్లోనే ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం పెట్టి కేవలం […] The post వేరుశనగ రైతులను ఆదుకోండి.. appeared first on Visalaandhra .
తాత వారసత్వం... చీరలో తిరిగొచ్చింది! #vanaparthi #aditiraohydari #heritage #handloom #telangana
భోజనంలో 100 శాతం నాణ్యత ఉండాలి..
భోజనంలో 100 శాతం నాణ్యత ఉండాలి.. మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా
ఇద్దరు చిన్నారులను చంపి… ఆపై… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో
మద్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అధికారులు
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ బి. రామమోహన రెడ్డి మరియు అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్ఫోర్స్మెంట్) ఎం. శ్రీరామ్ మాట్లాడుతూ మద్యం దుకాణాల యందు “ఏపి ఎక్సైజ్ సురక్ష” మొబైల్ యాప్ ద్వారా జరుగుతున్న మద్యం బాటిళ్ల విక్రయ చర్యలను పరిశీలించి, బాటిళ్ల విక్రయాలు పూర్తిగా […] The post మద్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అధికారులు appeared first on Visalaandhra .
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్
చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయండి..
ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి ప్రధాన జిల్లా కార్యదర్శి వెంకటనారాయణవిశాలాంధ్ర ధర్మవరం ; చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నేతన్న భరోసా 25వేల రూపాయల పథకాలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హామీ ఇచ్చి 2 నెలలు […] The post చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయండి.. appeared first on Visalaandhra .
కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన రూపా రాజా పిసీఎంఆర్ పాఠశాల విద్యార్థులు..
పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : కుస్తీ పోటీలలో పట్టణములోని నాగులు గ్రామం వద్ద గల రూపా రాజా పి సి ఎం ఆర్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్, పాఠశాల డైరెక్టర్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరెస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో ఈ […] The post కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన రూపా రాజా పిసీఎంఆర్ పాఠశాల విద్యార్థులు.. appeared first on Visalaandhra .
Viral Dog Saving Family from Fire Video Is AI-Generated, Not Real
సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ కిషన్
రంజీ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నమెంట్ని సెంచరీతో ప్రారంభించాడు యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్లో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జార్ఖండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఐదో స్థానంలో బరిలోకి దిగిన కిషన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో సెంచరీ (101) చేశాడు. ఇషాన్తో పాటు బ్యాటింగ్ చేస్తున్న మరో ఆటగాడు సాహిల్ రాజ్ కూడా అర్థశతకం సాధించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ 90 ఓవర్లలో 307 పరుగులు చేసింది. క్రీజ్లో కిషన్ (125), రాజ్ (64) ఉణ్నారు. అంతకు ముందు జార్ఖండ్ ఇన్నింగ్స్లో శిఖర్ మోహన్ 10, శరన్దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలింగ్లో గుర్జప్నీత్ సింగ్ 3, డిటి చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ 1 వికెట్ తీశారు.
భవన నిర్మాణ కార్మికునికి ఆర్థిక సహాయం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని గౌరీ శంకర్ అనే భవన నిర్మాణ కార్మికునికి అనుకోకుండా ఇటీవల కరెంటు షాక్ తో ఓ చేయి పూర్తిగా కాలిపోవడం జరిగింది. సమాచారాన్ని అందుకున్న సందా రాఘవ ఆ భవన కార్మికున్ని ఆదుకునేందుకు మరోసారి తన మానవతను చాటుకొని తనవంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారు అందించారు. పట్టణములో కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తన దాతృత్వాన్ని చాటుకుంటూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మంచి గుర్తింపు పొందుతున్నారు.తదుపరి బాధిత కుటుంబ సభ్యులు […] The post భవన నిర్మాణ కార్మికునికి ఆర్థిక సహాయం appeared first on Visalaandhra .
షాపింగ్ స్కామ్లకు బలి కాకండి.. ఫోన్ పే
షాపింగ్ స్కామ్లకు బలి కాకండి.. ఫోన్ పే హైదరాబాద్ : ఆన్లైన్ షాపింగ్
వనదేవతలను దర్శించుకున్న సింగర్
వనదేవతలను దర్శించుకున్న సింగర్ తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన
కేంద్ర ప్రభుత్వ పథకాలపై యూనియన్ బ్యాంక్ వారు గ్రామ ప్రజలకు అవగాహన..
ఆర్బిఐ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలు పీఎం ఎస్బి వై, పి ఎం జె జె బి వై అనే పథకాలపై మండల పరిధిలోని పోతుల నాగేపల్లి గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఆర్.పి.ఐ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి ఎం ఎస్ బి వై అనే పతకంలో వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలకే రెండు […] The post కేంద్ర ప్రభుత్వ పథకాలపై యూనియన్ బ్యాంక్ వారు గ్రామ ప్రజలకు అవగాహన.. appeared first on Visalaandhra .
విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు కారణం: స్టాలిన్ #TeluguPost #telugu #post #news
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TG BIE) 2025-2026 ఇంటర్ పరీక్షలకు
మద్యం నాణ్యత తనిఖీ కోసం మొబైల్ యాప్
విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా ): విజయనగరంజిల్లా రాజాం ఎక్సైజ్ పరిధిలో గల మద్యం వినియోగదారులకు ముఖ్య విజ్ఞప్తి మీరు మీ సమీపంలో కొనుగోలు చేసిన మద్యం ప్రభుత్వం సరఫరా చేసినదా కాదా అని సులువుగా తెలుసుకోవడానికి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సులభంగా వినియోగించగలిగే మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే మొబైల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని కన్జ్యూమర్ అనే టాబ్ పై ఉత్తినట్లయితే […] The post మద్యం నాణ్యత తనిఖీ కోసం మొబైల్ యాప్ appeared first on Visalaandhra .
Fact Check: Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet
Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేయాలి….అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం..ఎంపి అంబికా లక్ష్మీనారాయణవిశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ ఆసుపత్రులకు వివిధ రకాల వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోగ్య సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం […] The post ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి appeared first on Visalaandhra .
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలేని మోదీ గో బ్యాక్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వని నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ బుధవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, సిఐటియు మండల కార్యదర్శి ఈరన్న మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, […] The post రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలేని మోదీ గో బ్యాక్ appeared first on Visalaandhra .
ప్రతీ ఒక్కరికి అబ్దుల్ కలాం జీవితం ఆదర్శం
విశాలాంధ్ర-రాజాం (.విజయనగరం జిల్లా) : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజాం పట్టణంలో అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయిప్రశాంత్, మాట్లాడుతూ, పేదరికం కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ, విలువలతో కూడిన విద్యను అభ్యసించి శ్రమిస్తే విజయం మనల్ని వరిస్తుందని నిరూపించిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగారని, పేపర్ బాయ్ గా జీవితాన్ని ప్రారంభించి దేశం గర్వించేలా అత్యంత గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి […] The post ప్రతీ ఒక్కరికి అబ్దుల్ కలాం జీవితం ఆదర్శం appeared first on Visalaandhra .
సీఎం చంద్రబాబు కృషి, దూరదృష్టే టెక్ హబ్గా విశాఖ: కొల్ల అప్పలనాయుడు
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నం నగరంలో అడుగుపెట్టడం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రక మలుపు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు అభివర్ణించారు.మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నిరంతర కృషి వల్లే గూగుల్ లాంటి అంతర్జాతీయ టెక్ సంస్థ విశాఖలోకి రావడానికి ముందడుగు వేసింది. దీని ఫలితంగా విశాఖ త్వరలోనే […] The post సీఎం చంద్రబాబు కృషి, దూరదృష్టే టెక్ హబ్గా విశాఖ: కొల్ల అప్పలనాయుడు appeared first on Visalaandhra .
‘రాక్షసుల ఆగమనం’.. ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ అదిరిపోయిందిగా..
మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’. ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాల తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తేజ్ నటిస్తున్న చిత్రం ఇది కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బుధవారం తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ని విడుదల చేశారు. ‘అసుర ఆగమనం’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరో లెవల్కి తీసుకెళ్లింది. ఈ గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. గ్లింప్స్లోని ప్రతీ షాట్ అదిరిపోయిందిని ఫ్యాన్స్ అంటున్నారు. చివర్లో ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ నెలలోనే విడుదల చేస్తామంటూ చాలాసార్లు ప్రకటించారు. కానీ, ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. మరి సినిమాను ఈ ఏడాది తీసుకొస్తారా..? లేదా వచ్చే ఏడాదికి వాయిదా..? పడుతుందో చూడాలి.
అరట్టై పాపులారిటీ వేళ.. సోషల్ మీడియాకు శ్రీధర్ వెంబు విరామం..
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకునే నిర్ణయం తీసుకున్నారు.ఆయన కొన్ని పెండింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఇకపై ఇతర బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని కూడా తెలిపారు.సామాజిక మాధ్యమం ఎక్స్ లో తరచూ చురుగ్గా ఉండే శ్రీధర్ వెంబు, తన ఈ నిర్ణయాన్ని అదే వేదిక ద్వారా వెల్లడించారు.ఈ వారం తరువాత సోషల్ మీడియా విరామం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.అంత కఠినమైన నియమాలు తనపై తానే విధించుకోవాల్సి వచ్చినందుకు […] The post అరట్టై పాపులారిటీ వేళ.. సోషల్ మీడియాకు శ్రీధర్ వెంబు విరామం.. appeared first on Visalaandhra .
కేసీఆర్ ఫొటో లేకుండా జాగృతి జనం బాట పోస్టర్ను ఆవిష్కరించిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు.కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల మధ్యకు వెళ్ళుతున్నానని ఆమె చెప్పారు.జాగృతి జనం బాట పేరుతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో యాత్రకు కవిత సిద్ధమయ్యారు.బుధవారం మీడియా సమావేశంలో ఆమె యాత్ర వివరాలను పంచుకున్నారు.సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ జాగృతి జనం బాట యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.కవిత మాట్లాడుతూ,నేను ప్రజల దగ్గరకు వెళ్ళి వారు ఏం అనుకుంటున్నారో,వారి సమస్యలు ఏమిటో తెలుసుకుంటాను.కేసీఆర్కు బీఆర్ఎస్,తెలంగాణ జాగృతి రెండు కళ్లలా పనిచేశాయి.ఇటీవల […] The post కేసీఆర్ ఫొటో లేకుండా జాగృతి జనం బాట పోస్టర్ను ఆవిష్కరించిన కవిత appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |ఏఐ లోడింగ్ /మోదీ.. అంతా రెడీ/సునీతక్క నామినేషన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 15-10-2025, 4.00PM ఏఐ బాస్ లోడింగ్.. ఇండియా లీడర్
హృతిక్కు హైకోర్టులో ఊరట.. ఇకపై ఫోటోలు వాడితే..
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుతున్నారని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆయనకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇకపై అనుమతి లేకుండా హృతిక్ ఫోటోలు వాడడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. వెంటనే హృతిక్ ఫోటోలను తొలగించాలని ఇ-కామర్స్ వెబ్సైట్లకు సూచించింది. అయితే అనుమతి లేకుండా తన వాయిస్, ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఫ్యాన్స్ పేజీలలో ఉపయోగించుకుంటున్నారని హృతిక్ చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. అభిమానుల పేజీలలో వాడుకునేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇచ్చింది. హృతిక్ పేరు, డ్యాన్స్ వీడియోలతో ట్యూటోరియల్స్ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నటుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వారు ప్రజలకు నేర్పించడం కోసం ఆ డ్యాన్స్ వీడియోలను ఉపయోగిస్తున్నారని తెలిపింది. అందులో వాణిజ్య ప్రయోజనం ఏమాత్రం లేదని.. ఎవరైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
మెలోనీ అందానికి ట్రంప్ ఫిదా! #worldpolitics #MeloniBeauty #donaldtrump #erdoğan #macron
ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం: సీఎం చంద్రబాబు
రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటనశ్రీశైలం, కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధానిరూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న మోదీ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం, కర్నూలు పర్యటనలను అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి ఎంతో […] The post ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం: సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
పల్నాడు జిల్లా గుంటూరు- పెద్దకూరపాడు మధ్య ఘటనసికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితురాలి ఫిర్యాదునిందితుడి