శుక్రవారం రాశి ఫలాలు (13-03-2026)
మేషం స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిధునం దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. కర్కాటకం ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సింహం అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కన్య ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. తుల ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. వృశ్చికం వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ధనస్సు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. మకరం గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. కుంభం వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి. మీనం ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.
ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో అయతుల్లా ఖమేనీ భార్య మన్సోరేష్ ఖోజసెహ్ మరణించలేదు. ఆమె సజీవంగానే ఉన్నారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా గురువారం అధికారికంగా తెలిపింది. గత నెల 27 రాత్రి జరిపిన దాడిలో అక్కడికక్కడే ఖమేనీ హతులయ్యారని, ఆయన భార్య మరుసటి రోజు చికిత్స దశలో చనిపోయారని ఇంతకు ముందు వార్తలు వెలువడ్డాయి. ఇవి నిజం కావని ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. ఆమె ఓ రహస్య ప్రాంతంలో క్షేమంగా, ఆరోగ్యంగా, భద్రంగా ఉన్నారని వివరించారు. కాగా ఇరాన్ నూతన నేత మొజ్తాబా ఖమేనీ అధికార పగ్గాల తరువాత తమ తొలి ప్రసంగంలో ఎక్కువగా తండ్రి ఖమేనీ గురించి ప్రస్తావించారు. సీనియర్ ఖమేనీ వీరోచిత పోరు తనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం అన్నారు. అయితే తల్లి గురించి మాట్లాడలేదు.
మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ దేశంలోనే ప్రముఖ హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం చిన […] The post హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ appeared first on Visalaandhra .
. దేశ గౌరవం ట్రంప్కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న […] The post బలహీన ప్రధాని మోదీ appeared first on Visalaandhra .
జాబ్ కన్సల్టెన్సీ యజమాని హత్య..
జాబ్ కన్సల్టెన్సీ యజమాని హత్య చేసిన నిందితుడిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. కత్తితో పాటు ఐఫోన్-15, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్స్పెక్టర్ ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. తేదీ 10-03-2026 సాయంత్రం సుమారు 17:30 గంటలకు, హైదరాబాద్లోని ఇంజనీర్స్ కాలనీలోని బెస్ట్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ జాబ్ కన్సల్టెన్సీ జగ్గవరపు శశికిరణ్ రెడ్డి నిర్వహిస్తున్నాడు. ఇందులో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న దులిపాడు అక్షయ అలియాస్ సాయి శృతి పనిచేస్తోంది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఎపిలోని విశాఖపట్నం జిల్లా, మునగపాక మండలం, గణపర్తి గ్రామానికి చెందిన సుమారుపొల్లమారి శెట్టి ప్రభు కుమార్ అలియాస్ షాను(19) ప్రైవేట్ ఉద్యోగి. ఉద్యోగం కోసం కొంత కాలం క్రితం కన్సల్టెన్సీలో ఉద్యోగం కావాలని సంప్రదించాడు, రూ.2,500 చెల్లించాడు. ఓ హోటల్లో ఉద్యోగంలో చేరిన ప్రభు కుమార్ ఉద్యోగం నచ్చకపోవడంతో రెండు రోజులకే మానివేశాడు. తర్వాత కన్సల్టెన్సీ కార్యాలయానికి వచ్చిన నిందితుడు కన్సల్టెన్సీ ద్వారా ఇప్పించిన ఉద్యోగం నచ్చలేదని, తాను చెల్లించిన డబ్బును , పని చేసిన రోజుల జీతాన్ని తిరిగి ఇవ్వాలని గొడవపడ్డాడు. అక్షయ నిందితుడిని కౌన్సెలింగ్ గదిలో కూర్చోబెట్టి, యజమాని జగ్గవరపు శశి కిరణ్ రెడ్డి కి సమాచారం ఇచ్చింది. తర్వాత శశికిరణ్ గదిలోకి వెళ్లిన ప్రభు కుమార్ ఆయనతో గొడవపడ్డాడు. గది నుండి పెద్దగా అరుపులు రావడంతో అక్షయ శశికిరణ్ గదిలోకి వెళ్లగా కత్తితో బయటికి వచ్చిన నిందితుడు అక్షయ ఎడమ భుజంపై పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. నిందితుడు వెళ్లిన తర్వాత సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా, జగ్గవరపు శశి కిరణ్ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు. అతడి శరీరంపై సుమారు 23 కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై 103(1), 109, 329(4), 127(2), 351(2), 305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఇన్స్స్పెక్టర్ హెచ్. ప్రభాకర్, డిటెక్టివ్ ఇన్స్స్పెక్టర్ , సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.
. మంత్రి తుమ్మల హామీ. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు […] The post మోడల్ కాలనీగా వెలుగుమట్ల appeared first on Visalaandhra .
స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం
న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. […] The post స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం appeared first on Visalaandhra .
మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమ య్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారందరినీ దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులతో అసెంబ్లీలో […] The post మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు appeared first on Visalaandhra .
సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు
విశాలాంధ్ర – విశాఖపట్నం: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) రికార్డు సృష్టించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసింది. తద్వారా చరిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. 92 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ఈ స్థాయి సరకు రవాణా ఎప్ప్పుడు జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 90 ఎంఎంటీ సరకు నిర్వహణ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉన్నట్లు పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ […] The post సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు appeared first on Visalaandhra .
స్మార్ట్ మీటర్ల బిగింపువేగవంతం
విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే బిల్లింగ్, డేటా గోప్యత, ఆర్డిఎసఎస్ లక్ష్యాలపై ఆందోళనలు లేవనెత్తింది. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్మాణాత్మకంగా, సమయానుకూల పద్ధతిలో వేగవంతం చేయడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘విద్యుత్ మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్ల(2026-27)’పై కమిటీ 11వ నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు […] The post స్మార్ట్ మీటర్ల బిగింపువేగవంతం appeared first on Visalaandhra .
అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించండి
. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. వామపక్ష నేతల పిలుపు. ఇరాన్పై అమెరికా`ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదంతో అనేక దేశాలపై దాడులకు పాల్పడుతున్న అమెరికా దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు ఎగుమతులు చేస్తున్నాయని, అణుబాంబులు ఉన్నాయనే కుంటిసాకులతో స్వప్రయోజనాల కోసం అమెరికా విచక్షణారహితంగా చిన్న చిన్న దేశాలపై దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఇరాన్పై అమెరికా, […] The post అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించండి appeared first on Visalaandhra .
. అమెరికా, ఇజ్రాయిల్కు ఇరాన్ స్పష్టీకరణ. యుద్ధం ఆగాలంటే… మూడు షరతులు. అప్ప్పుడే శాంతి స్థాపన: పెజెష్కియాన్ తెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం గురువారం 13వ రోజుకు చేరుకుంది. అమెరికాఇజ్రాయిల్ సంయుక్త దాడులతో భీకర పోరులో కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని తెహ్రాన్తో పాటు అనేక నగరాలు వరుస దాడులతో దద్దరిల్లాయి. రెండు విదేశీ ట్యాంకర్లపై దాడులతో చమురు పోర్ట్ కార్యకలాపాలను ఇరాక్ నిలిపివేసింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను గల్ఫ్ దేశాలు ఎదుర్కొన్నాయి. తాను ఎప్ప్పుడంటే అప్ప్పుడే యుద్ధానికి తెర […] The post దిగిరావాల్సిందే appeared first on Visalaandhra .
. కాంట్రాక్టర్ల నుంచి పన్నుల వసూళ్లు పెరగాలి. రాష్ట్రంలోనే పన్నులు చెల్లించాలి. లబ్ధిదారులకు సంక్షేమ లేఖలు. విద్యార్థులకు గుర్తుండేలా స్నాతకోత్సవాలు జరగాలి. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో పని చేస్తూ, వేరే రాష్ట్రాల్లో కార్యాలయాలు పెట్టుకున్న కాంట్రాక్టర్ల విషయంలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చందబ్రాబు ఆదేశించారు. ‘కొందరు కాంట్రాక్టర్లు తమ కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. పనులు మాత్రం మన రాష్ట్రంలో చేస్తున్నారు. టెండర్లు, వర్క్ ఆర్డర్లలోని […] The post పని ఇక్కడ, పన్ను అక్కడ? appeared first on Visalaandhra .
. పార్లమెంటు మకర ద్వారం వద్ద ధర్నా. మార్మోగిని ‘మోదీజీ`ఎల్పీజీ’ నినాదం. పేరు నరేంద్రుడు… పని లొంగిపోవడమని ఎంపీల చురకలు. విదేశాంగ విధానంతో రాజీ: రాహుల్ విమర్శ పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతూ, చమురు క్షేత్రాలపైనా దాడులు జరుగుతూ, కీలక హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడం ఇంధన కొరతకు దారితీసింది. ఈ పరిణామాల క్రమంలో ప్రతిపక్ష సభ్యులు గురువారం పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి […] The post గ్యాస్ కొరతపై విపక్షాల ఆగ్రహం appeared first on Visalaandhra .
అమెరికా వాణిజ్య భాగస్వాములపై ‘సెక్షన్ 301’
వాషింగ్టన్: భారత్, చైనా, బంగ్లాదేశ్ సహా 16 కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా వాణిజ్య చట్టం1974లోని ‘సెక్షన్ 301’ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. టారిఫ్లు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి క్రమంలో ఆయా దేశాలపై సుంకాలతో ఒత్తిడి పెంచేలా వాణిజ్య విధానాల దర్యాప్తులు ప్రారంభించింది. సెక్షన్ 301... వాణిజ్య భాగస్వాములపై సుంకాలు లేదా ఇతర ప్రతీకార చర్యలను చేపట్టే అధికారాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధికి ఇస్తుంది. ఇతర దేశాలు అనుసరిస్తున్న చట్టవిరుద్ధమైన వాణిజ్య విధానాలను సవాలు చేయడమే ఈ […] The post అమెరికా వాణిజ్య భాగస్వాములపై ‘సెక్షన్ 301’ appeared first on Visalaandhra .
యుద్ధానికి బాధ్యులను నిలదీయాలి
పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడుతెహ్రాన్/ ఇస్లామాబాద్: ఇరుగు`పొరుగు దేశాలపై దాడులు చేయడం, సరిహద్దుల్లో ఘర్షణ పడటం తమ ఉద్దేశం కాదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న పరిస్థితుల్లో ఇద్దరు నాయకులు ఫోన్ చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై చర్చించారు. యుద్ధానికి బాధ్యులైన వారి నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైతే ప్రపంచ క్రమం, భద్రతకు ముప్ప్పు ఏర్పడుతుందని పెజష్కియాన్ హెచ్చరించారు. యుద్ధానికి కారకులను […] The post యుద్ధానికి బాధ్యులను నిలదీయాలి appeared first on Visalaandhra .
అమెరికా ఇంటెలిజెన్స్వాషింగ్టన్: పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారినప్పటికీ ఇరాన్ పాలనకు ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదని అమెరికా ఇంటెలిజెన్స్ తేల్చింది. ఇరాన్లో పాలన మార్పు కోసమే తాము యుద్ధం చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయిల్ ప్రకటించాయి. ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక సంచలనంగా మారింది. ఇరాన్ నాయకత్వం పదిలమని తేల్చిచెప్పింది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ నివేదిక ఇచ్చింది. ఇరాన్ ప్రజలపై ప్రభుత్వానికి పట్టు ఉన్నట్లు పేర్కొంది. చమురు […] The post ఇరాన్ ప్రభుత్వానికి ఢోకా లేదు appeared first on Visalaandhra .
మెగాస్టార్కు ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు’
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ (టిజిఎఫ్ఎ) వేడుకల్లో భాగంగా, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టిజిఎఫ్డిసి) చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక గురువారం మెగాస్టార్ డా.చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు’ ను స్వీకరించాల్సిందిగా వారు చిరంజీవిని సాదరంగా ఆహ్వానించారు. మార్చి 19న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరగనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఈ గౌరవాన్ని అందుకోవాలని వారు కోరారు.
హోర్ముజ్ మార్గంలో భారత్కు అనుమతి
తెహ్రాన్: అమెరికా`ఇజ్రాయిల్ భీకర పోరు క్రమంలో కీలకమైన హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. అటుగా వచ్చే వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తామని హెచ్చరించడమే కాకుండా కొన్ని నౌకలపై దాడులు సైతం చేసింది. అనేక దేశాల ఓడలను నిలిపివేసింది. దీంతో అంతర్జాతీయ చమురు సంక్షోభం నెలకొంది. ఇలాంటి పరిణామాల క్రమంలో హర్మూజ్ మార్గంలో భారతీయ నౌకల రవాణాకు ఇరాన్ అనుమతిచ్చింది. దౌత్య చర్చలు ఫలించడంతో పుష్పక్, పరిమల్ అనే రెండు నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించినట్లు […] The post హోర్ముజ్ మార్గంలో భారత్కు అనుమతి appeared first on Visalaandhra .
Iran Supreme Ready హార్ముజ్ లో నో ఎంట్రీ Andhra Prabha News
Iran Supreme Ready హార్ముజ్ లో నో ఎంట్రీ Andhra Prabha News
ఇరాక్ జలాల్లో నౌకపై దాడి: భారతీయుడి మృతి
బాగ్దాద్: ఇరాక్ సముద్ర జలాల సమీపంలో అమెరికా ఆయిల్ ట్యాంకర్ను సూసైడ్ బోట్తో ఇరాన్ దాడి చేసింది. అండర్ వాటర్ డ్రోన్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. ఇరాన్ జలాల్లో ఉన్న ఖోర్ అల్ జుబైర్ పోర్టు వద్ద ఈ దాడి జరిగింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి ఇంధన ట్యాంకర్ను పేల్చివేస్తామని ఇరాన్ ముందే హెచ్చరించింది. ఆ నౌకలో ఉన్న 15 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తరలించారు. బాగ్దాద్లోని భారతీయ ఎంబసీ ఈ […] The post ఇరాక్ జలాల్లో నౌకపై దాడి: భారతీయుడి మృతి appeared first on Visalaandhra .
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలరే ఎత్తరా’ పాట విడుదల
హైదరాబాద్: ‘గబ్బర్ సింగ’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ […] The post ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలరే ఎత్తరా’ పాట విడుదల appeared first on Visalaandhra .
‘బైకర’ కోసం పూర్తిగా మారిపోయిన శర్వానంద్
హైదరాబాద్: ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో చాలాకాలం తర్వాత హీరో శర్వానంద్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్ నటించిన మరో తాజా చిత్రం ‘బైకర’ విడుదలకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు ‘అఖండ’ దెబ్బకు వాయిదా పడిన ఈ సినిమా… ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇండియాలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి […] The post ‘బైకర’ కోసం పూర్తిగా మారిపోయిన శర్వానంద్ appeared first on Visalaandhra .
సవాళ్లకు ఎదురెళ్లడమే నాకిష్టం: బుమ్రా
న్యూదిల్లీ: భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీ20 ప్రపంచకప్ విజయం గురించి మాట్లాడుతూ… తనకు ఆటలో కఠిన సవాళ్లు ఎదుర్కోవడమంటే ఇష్టమని స్పష్టం చేశాడు. సంబంధిత వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ‘నాకు కఠిన సవాళ్లు ఎదుర్కోవడం అంటేనే ఇష్టం. మంచి ప్రదర్శన చేసి, సత్తా చాటినప్పుడు.. అది నాలో చాలా ఆనందాన్ని నింపుతుంది. దానికి మించిన సంతోషం మరోటి లేదు. నేను గుజరాత్లోనే క్రికెట్ ఆడటం ప్రారంభించా. వరల్డ్ కప్ కూడా ఇక్కడే గెలిచాం. ఫైనల్లో […] The post సవాళ్లకు ఎదురెళ్లడమే నాకిష్టం: బుమ్రా appeared first on Visalaandhra .
పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి…
పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: అడవి పాత్రలు
రెండో వివాహం చేసుకోవడానికి భార్య ఒప్పుకోలేదని దారుణంగా కొట్టిన భర్త
ఓ భర్త కట్టుకున్న భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదన్న కోపంతో నడిరోడ్డుపై ఆమెను కిందపడేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ అమానుష ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీ వేమవరంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పి వేమవరానికి చెందిన మణికంఠ, దేవి 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. అయితే, తన మేనకోడలిని రెండో పెళ్లి చేసుకోవాలని మణికంఠ నిర్ణయించుకున్నాడు.ఈ విషయంపై భార్యా భర్తల మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నా యి. ఇదే క్రమంలో తాజాగా మరోసారి వాగ్వాదం జరగడంతో మణికంఠ కోపంతో ఊగిపోయాడు. భార్య దేవిని రోడ్డుపై కిందపడేసి దారుణంగా చితకబాదాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాట్సాప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు…
వాట్సాప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు… గుంటూరు జీజీహెచ్లో కొత్త విధానం.. గుంటూరు,
గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత
గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల
Iran-Israel War: One More Worry for the Common Man After LPG Crisis
The ongoing Iran-Israel conflict is beginning to affect India’s economy in multiple ways. Shortages of key commodities and rising fuel costs are already creating pressure in the market. After concerns over LPG supply and possible petrol price hikes, another major worry is emerging. Medicine prices in India may soon increase if the global situation continues. […] The post Iran-Israel War: One More Worry for the Common Man After LPG Crisis appeared first on Telugu360 .
మల్యాల గిరిజనులకు అండగా ఉంటా..
మల్యాల గిరిజనులకు అండగా ఉంటా.. అసెంబ్లీలో సమస్యను ప్రస్తావిస్తా..ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఎస్ టీ ఓ సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ అవినీతిపై ఏసీబీ సోదాలు
ఎస్ టీ ఓ సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ అవినీతిపై ఏసీబీ సోదాలు భువనగిరి
గ్యాస్ కొరతకు మోడీ ప్రభుత్వమే కారణం: రాహుల్ గాంధీ
ఇరాన్, అమెరికా - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో భారతదేశం అల్లాడుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి మోడీ పభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. గురువారం లోక్సభలో దేశంలో వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందన్నారు. అమెరికా ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు హార్ముజ్ జల సంధి నుంచి వస్తుందని వివరించారు. ప్రస్తుతం ఆ జల సంధిని మూసివేశారని పేర్కొన్నారు. గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు మూతపడ్డాయని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. దేశానికి పునాది ఇంధన భద్రత అని అభివర్ణించారు. భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని మండిపడ్డారు. రష్యా ఆయిల్ను కొనడానికి ఎవరి అనుమతి కావాలి? అంటూ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. యూఎస్ అనుమతి లేకుంటే ముడి చమురు కొనుగోలు చేయ్యారా? అంటూ వ్యంగ్యంగా కేంద్రాన్ని నిలదీశారు. భారత్ వంటి పెద్ద దేశానికి మరో దేశం అనుమతి అవసరమా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. తన ప్రశ్నకు సమాధానం ఎప్స్టీన్ ఫైల్స్ రూపంలో దొరికిందన్నారు. ఎప్స్టీన్తో పరిచయం ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. పెట్రోలియం మంత్రికి ఎప్స్టీన్తో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే రాహుల్ మైక్ను స్పీకర్ ఓం బిర్లా కట్ చేశారు. అంతలో సభలోని హర్దీప్ సింగ్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హర్దీప్సింగ్ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. అంతే కాకుండా ఎప్స్టీన్ అంటూ సభలో విపక్ష పార్టీల సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
మర్యాదలకన్నా ఎన్నికలే ఎక్కువ !
ప్రధానమంత్రి మోదీ తన ముఖం తాను అద్దంలో చూసుకున్నా ఎన్నికలే కనిపిస్తాయేమో! లేకపోతే ఇటీవల బెంగాల్లో జరిగిన సంథాల్ తెగవారి తొమ్మిదవ అంతర్జాతీయ మహాసభకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి మమత స్వాగతం చెప్పకపోవడం వివాదానికి దారి తీసేదే కాదు. నిజానికి ఈ మహాసభ ప్రభుత్వ అధ్వర్యంలో జరిగింది కాదు. అదొక ప్రైవేటు వ్యవహారం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతిని విమానాశ్రయంలో ఆహ్వానించలేదని, ఇది అధికార మర్యాదలను ఉల్లంఘించడమేనని రచ్చ జరుగుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, […] The post మర్యాదలకన్నా ఎన్నికలే ఎక్కువ ! appeared first on Visalaandhra .
ద్రవ్యోల్బణం కోరల్లో సామాన్యుడు
డా.సూర్యదేవర రామకృష్ణ ప్రతి రోజూ ఉదయం కాఫీ కప్పుతో వార్తాపత్రికను తిరగేస్తున్నప్పుడు, ఆర్థిక పేజీల్లో కనిపించే సంఖ్యలు సగటు మధ్యతరగతి మనిషి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ద్రవ్యోల్బణం 6 శాతం వద్ద స్థిరంగా ఉంది అని గణాంకాలు చెబుతుంటే, మార్కెట్కు వెళ్లిన గృహిణికి మాత్రం అది 20 శాతంగా కనిపిస్తోంది. అధికారిక లెక్కలకు సామాన్యుడి సంచికి మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసమే నేటి మధ్యతరగతి ఎదుర్కొంటున్న అతిపెద్ద మౌన సంక్షోభం ప్రభుత్వాలు విడుదల చేసే వినియోగదారుల […] The post ద్రవ్యోల్బణం కోరల్లో సామాన్యుడు appeared first on Visalaandhra .
ముల్కనూర్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంగా అక్రమంగా తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ముల్కనూర్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో పేలుడు సామాగ్రి బయటపడింది. పోలీసుల తనిఖీల్లో సుమారు 180 పెట్టెల జిలేటిన్ స్టిక్స్, 1950 డిటోనేటర్లు, రెండు తూటాల వైర్ బండిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రవాణాకు ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఈ పేలుడు పదార్థాల మొత్తం విలువ సుమారు రూ.7,07,500లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.ఆటోలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఒకరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకోగా, మరొకరు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని, నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం ముల్కనూర్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. పరారైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
పేరు, ప్రతిష్టలకు ప్రతిమలు ప్రతీకలా ?
సంగిరెడ్డి హనుమంతరెడ్డి మన దేశంలో వైదికవాద మూర్తి పూజ విగ్రహ నిర్మాణాలకు మూలం. విగ్రహారాధన మౌర్య శకం అనగా ప్రస్తుత శకం 300లలో జైన, బౌద్ధ మతాల ప్రభావంతో మొదలయ్యింది. రాజుల విజయ చిహ్నాల స్థాపనగా మారింది. విగ్రహ స్థాపన ఆచారం వలస పాలనలో ఎక్కువయింది. ఐరోపా రాచరిక ఆరాధనకు సంకేతమయింది. అంబేద్కర్ భారత విగ్రహ భూమిని విమర్శించారు. అయితే ఓట్ల కోసం, దళితులను దువ్వడం కోసం ఆయన విగ్రహ స్థాపన విస్తృతంగా జరుగుతోంది. విప్లవాలకు నాయకత్వం […] The post పేరు, ప్రతిష్టలకు ప్రతిమలు ప్రతీకలా ? appeared first on Visalaandhra .
గిరిజన మహిళల వారసత్వహక్కులపై పునరాలోచించాలి
బి.రామారావు గిరిజన సమాజాల్లో మహిళల వారసత్వ హక్కుల అంశం ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారానికి నోచుకోలేదు. ఎక్కువ గిరిజన సమాజాల్లో అమలులో ఉన్న సంప్రదాయ చట్టాలు మహిళలకు సంపూర్ణ ఆస్తి హక్కులు కల్పించడం లేదు. హిందూ వారసత్వ చట్టం 1956 కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిపై హక్కులు ఇస్తున్నప్పటికీ, గిరిజన మహిళలను ఆ చట్ట పరిధి నుంచి మినహాయిస్తోంది. ఇటీవలి కాలంలో హిందూ సంప్రదాయాలను స్వీకరించిన గిరిజన మహిళలకు మాత్రమే కొన్నిసార్లు వారసత్వ హక్కులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే […] The post గిరిజన మహిళల వారసత్వహక్కులపై పునరాలోచించాలి appeared first on Visalaandhra .
ఐక్యూ జెడ11ఎక్స్ స్మార్ట్ఫోన్ విడుదల
విశాలాంధ్ర/గుంటూరు: అధిక పనితీరు గల స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ గురువారం భారతదేశంలో ఐక్యూ జెడ11ఎక్స్ ప్రారంభించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందిన ఐక్యూ జెడ11ఎక్స్, సెగ్మెంట్-లీడింగ్ బ్యాటరీ, అతుకులు లేని మల్టీ టాస్కింగ్ కోసం శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యాలను, మెరుగైన మన్నికను కలిపిస్తుంది. నేటి విద్యార్థుల వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా రూపొందినన ఈ పరికరం, వారు రోజంతా ఉత్పాదకంగా, వినోదాత్మకంగా, కనెక్ట్ అయి ఉండటానికి వీలు కల్పిస్తుంది. ఐక్యూ జెడ్-సిరీస్ లైనప్ను బలోపేతం చేస్తూ, ఐక్యూ జెడ11ఎక్స్, […] The post ఐక్యూ జెడ11ఎక్స్ స్మార్ట్ఫోన్ విడుదల appeared first on Visalaandhra .
సరికొత్త ‘క్లాసిక్స్ మోనెటా మూన్ఫేజ’ వాచీ విడుదల
ముంబయిః ఫ్రెడెరిక్ కాన్స్టాంట్ తన ‘క్లాసిక్స్ మోనెటా మూన్ఫేజ’ వాచీని ఆవిష్కరించింది. ఈ వాచీలో సాంప్రదాయ ఫ్లూటెడ్ బెజెల్ డిజైన్ను వాచీ ఫ్లాంజ్ కు మార్చారు. దీనివల్ల వాచీ కేసు అచ్చం ఒక నాణెం లాగా కనిపిస్తుంది, అందుకే దీనికి ‘మోనెటా’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు జెనీవాకు చెందిన ఈ తయారీ సంస్థ దీనికి మరింత స్టైల్ను జోడించి, బ్లూ లేదా సిల్వర్ డయల్స్తో ఉన్న రెండు ఒరిజినల్ మోడళ్లకు సరికొత్త రూపాన్ని ఇచ్చి, వాటిని […] The post సరికొత్త ‘క్లాసిక్స్ మోనెటా మూన్ఫేజ’ వాచీ విడుదల appeared first on Visalaandhra .
2025లో అమెజాన్ బిజినెస్ భారతీయ వ్యాపారం రూ.2,000 కోట్లు
బెంగళూరు: భారతదేశం అంతటా వ్యాపారాలు 2025లో రూ.2,000 కోట్లకు పైగా ఆర్థిక విలువను సాధించడానికి వీలు కల్పించినట్లు అమెజాన్ బిజినెస్ వెల్లడించింది. సూక్ష్మ సంస్థలు, చిన్న, మధ్య తరహా సంస్థల నుండి పెద్ద కార్పొరేషన్ల వరకు, అన్ని పరిమాణాల సంస్థలు అమెజాన్ బిజినెస్లో క్యాష్బ్యాక్ రివార్డులు, బల్క్ డిస్కౌంట్లు మరియు ప్రత్యేక డీల్ల ద్వారా ప్రయోజనం పొందాయి. ఈ విలువలో గణనీయమైన భాగం అమెజాన్ బిజినెస్లో సజావుగా జీఎస్టీ-కంప్లైంట్ ఇన్వాయిస్ల ద్వారా కూడా నడపబడింది, ఇది వ్యాపార […] The post 2025లో అమెజాన్ బిజినెస్ భారతీయ వ్యాపారం రూ.2,000 కోట్లు appeared first on Visalaandhra .
ఎర్రగా పండిన ఆశలు… మట్టిలో కలిసిన కష్టం
ఎర్రగా పండిన ఆశలు… మట్టిలో కలిసిన కష్టం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఎసిబి సోదాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ ఎస్టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఖదీర్ నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. భువనగిరి పట్టణంలో ఉన్న ఆయన ఇంటిపై గురువారం ఆకస్మికంగా దాడులు చేసి పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలించారు. ఎసిబి అధికారులు ఏకకాలంలో మోత్కూరులోని ఎస్టీఓ కార్యాలయంలో, భువనగిరి పట్టణంలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు.
హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండి
హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండి మైలవరం, ఆంధ్రప్రభ: ద్విచక్ర వాహనదారులు ప్రయాణం
Nagabandham’s Namo Re Promo: Spiritual Grandeur
The musical odyssey of Nagabandham takes a divine leap with the release of the promo for its first single, Namo Re. Opening with a mesmerizing view of the Lord Padmanabha Swamy idol through the three doors of the world’s richest temple in Thiruvananthapuram, the promo immediately transports viewers into a realm of spiritual grandeur. The […] The post Nagabandham’s Namo Re Promo: Spiritual Grandeur appeared first on Telugu360 .
ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలే: హరీశ్రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అంతా అబద్ధమని, క్షేత్రస్థాయిలో రైతులకు కేవలం 12 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహిర్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింత ప్రభాకర్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్లోని లాంగ్ బుక్కులను స్వయంగా పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ సబ్స్టేషన్ రికార్డులు మరోలా ఉన్నాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సాయంత్రం 4 గంటలకు త్రీ ఫేజ్ కరెంటు తీసేసి, తిరిగి తెల్లవారుజామున 3 గంటలకు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇచ్చిన కొద్దిపాటి సమయంలోనూ లైన్ బ్రేకింగ్, ఎల్ ల పేరుతో గంటల తరబడి కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై అదనపు భారం బీఆర్ఎస్ హయాంలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం డిడి ధర రూ. 4,900 ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ. 9,700కు పెంచిందని హరీష్ రావు విమర్శించారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. కాలిన ట్రాన్స్ఫార్మర్ల భారాన్ని రైతులపైనే వేస్తున్నారు. వేలాది కనెక్షన్లు పెండింగ్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.‘ ఉన్న రెండు డిస్కమ్లను రూ. 55 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టి, ఇప్పుడు బ్యాంకులను, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికే కొత్త డిస్కమ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఆర్టిజాన్ల సమ్మెకు మద్దతు సమ్మె చేస్తున్న 19,647 మంది ఆర్టిజాన్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టిజాన్ల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్టిజాన్ల పిల్లలకు వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యుత్ సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
Revanth Reddy Inaugurates Allu Cinemas
Allu family’s prestigious multiplex Allu Cinemas has been in construction from the past one and a half years. The new multiplex was inaugurated by Telangana Chief Minister A Revanth Reddy this evening at 6 PM in Kokapet. Located in the costliest location, Allu Cinemas will serve the patrons of Kokapet, Financial District, Gandipet, Narsingi and […] The post Revanth Reddy Inaugurates Allu Cinemas appeared first on Telugu360 .
నటుడు విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమాకు మరో షాక్ #Vijay#Jananayagan#OTTDeal#AmazonPrime
రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు
రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే కూర్చుని కాంగ్రెస్ నాయకుల నిరసన… ఎయిర్-టె-ల్
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు (హాఫ్డే స్కూల్స్) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. అయితే, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కేంద్రాలు కూడా 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. అయితే, మార్చి 15 ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం కాగా, ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
వంటగ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువు 45 రోజులకు పెంపు
ప్రజలకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. వంటగ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువును మరోసారి పెంచింది. ఇప్పటికే పట్టణాల్లో సిలిండర్కు సిలిండర్కు మధ్య కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచగా, తాజాగా, గ్రామాల్లోనూ కొత్తగా నిబంధనలు విధించారు. గ్రామాల్లో కూడా సిలిండర్కు, సిలిండర్కు మధ్య కనీస గడువును 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. ఈ కొత్త నిబంధన వల్ల అక్రమ నిల్వలను అరికట్టేందుకు, సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
ఈ నెల 25న దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిఎస్ఆర్ సమ్మిట్
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్ ) సమ్మిట్ 2026కు సంబంధించిన అధికారిక పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమ్మిట్ జూలై 25న హైదరాబాద్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది సమ్మిట్ థీమ్ చేంజ్ టు లెగసి గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమాజంపై సానుకూల ప్రభావం చూపే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమ్మిట్ నిర్వాహకులను అభినందించారు. ఈ సమ్మిట్ ద్వారా కార్పొరేట్ సంస్థలు, ఎన్జీఓలు, సోషల్ ఇన్నోవేటర్లు, స్టార్టప్లు ఒకే వేదికపైకి వచ్చి సామాజిక అభివృద్ధికి కలిసి పనిచేసే అవకాశం కల్పించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వినిల్ రెడ్డి ఎదుడొడ్ల (లైసెన్సీ), వంశీ ముత్యపు (మేనేజింగ్ డైరెక్టర్), ఆదిత్య వేదాంతం (డైరెక్టర్), సుమంత్ వల్లాల (డైరెక్టర్)పాల్గొన్నారు. సమ్మిట్కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
చిరుత పిల్లను ఢీకొన్న వాహనం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా
వంట గ్యాస్ సిలండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు
. గృహ ఎల్పీజీ సిలండర్లకు ఎటువంటి కొరతా లేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ The post వంట గ్యాస్ సిలండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు appeared first on Visalaandhra .
జిల్లాలో పరిశ్రమలు, ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు
జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి విశాలాంధ్ర – ఏలూరు : ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ . చంద్రబాబునాయుడుకు తెలియజేసారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు గురువారం ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు. ఈ సందర్భంగా […] The post జిల్లాలో పరిశ్రమలు, ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు appeared first on Visalaandhra .
మా జట్టులో బుమ్రా ఉంటే మేమే వరల్డ్కప్ గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఐసిసి టి-20 ప్రపంచకప్-2026ని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంలో టీం ఇండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సెమీస్లో ఇంగ్లండ్పై, ఫైనల్స్లో న్యూజిలాండ్పై బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో బుమ్రా తమ జట్టులో ఉంటే.. తమ జట్టే ట్రోఫీని సొంతం చేసుకొనేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. తాను చూసి బౌలర్లలో బుమ్రానే ది బెస్ట్ అని కితాబిచ్చాడు. బుమ్రా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ప్రపంచకప్ గెలిచేదని పేర్కొన్నాడు. ‘‘ఇంగ్లండ్ జట్టులో బుమ్రా ఉండుంటే.. తప్పకుండా వరల్డ్కప్ నెగ్గేదే. ప్రపంచ క్రీడాకారుల్లో బుమ్రాను లియోనిల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డోతో పోలుస్తా. ఏ టీమ్లో బుమ్రాను పెడితే ఆ జట్టుదే విజయం’’ అని వాన్ అభిప్రాయపడ్డాడు. దీనికి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లూయిడ్ స్పందిస్తూ.. ‘‘అంటే, మీరు చూసిన బౌలర్లలో అతడే అత్యుత్తమం అని చెబుతారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును. అతడే బెస్ట్ నేను 1985 నుంచి క్రికెట్ చూడటం, నేర్చుకోవడం మొదలైంది. ఇప్పటివరకూ నేను చూసిన బౌలర్లలో అతడే అత్యుత్తమం’’ అని వాన్ స్పష్టం చేశాడు.
ఎపీకి త్వరలో ఆరు వరుసల జాతీయ రహదారి
ఎపీకి త్వరలో ఆరు వరుసల జాతీయ రహదారి నితిన్ గడ్కారితో రామ్మోహన్ నాయుడు
Iran Action Attribution : చిక్కొద్దు.. దొరకొద్దు Andhra Prabha Analysis
Iran Action Attribution : చిక్కొద్దు.. దొరకొద్దు Andhra Prabha Analysis (
ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో.. విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడలో నిర్వహించనున్న ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో–2026ను
18న ఇఫ్తార్ విందు ఏర్పాటు… హాజరు కానున్న మాజీ ముఖ్య మంత్రి వై
కేంద్రమంత్రి మనసుఖ్ మాండవ్యను కలిసిన ఎంపీ కేశినేని
కేంద్రమంత్రి మనసుఖ్ మాండవ్యను కలిసిన ఎంపీ కేశినేని ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధి
నేడు రైతులఖాతాలో పీయం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు జమ
విశాలాంధ్ర – వలేటివారిపాలెం : పీయం కిసాన్ మరియు మరియు అన్నదాత సుఖీభవ నిధులు 2025-2026సంవత్సరానికి గాను మూడవ విడత నిధులు పంపిణీ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ( 13 వ తేదీన ) 4 గంటలకు నిధులు రైతుల ఖాతా లో జమ చేయునున్నట్లు మండలవ్యవసాయశాఖ అధికారి కె వి శేషారెడ్డి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పీ యం. కిసాన్ నిది పధకంలో భాగంగా భారత ప్రధానమంత్రి […] The post నేడు రైతులఖాతాలో పీయం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు జమ appeared first on Visalaandhra .
ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న 17వ వార్డు కౌన్సిలర్
ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న 17వ వార్డు కౌన్సిలర్ -పేద కుటుంబానికి తోడుగా
వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబళం, కంబళదిన్నె, కల్లుకుంట, బాపులదొడ్డి, జాలవాడి, హెచ్ మురవణి తదితర గ్రామాల్లో 16వ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తన స్వగృహం నుంచి కార్యకర్తలతో బస్టాండ్ ఆవరణం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, వైసీపీ బూత్ కమిటీ […] The post వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం
గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు
ఎర్రబెల్లి దంపతుల గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ వేడుకలు
ఎర్రబెల్లి దంపతుల గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ వేడుకలు రాయపర్తి, ఆంధ్రప్రభ :
గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దు: ఉత్తమ్
సూర్యాపేట: రాష్ట్రంలో ఏర్పడిన గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సూర్యాపేటలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని తెలిపారు. కమర్షియల్ గ్యాస్కు మాత్రమే కొంత సరఫరా ఆగిందని అన్నారు. గ్యాస్ కొరతపై శుక్రవారం ఆయిల్ కంపెనీలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సిఎస్, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. జన జీవనానికి ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని.. ఎల్పిజి విషయంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
మెదక్ లో కారు బీభత్సం.. రాంగ్ రూట్లో వెళ్లి రెండు బైక్లు, ఆటోను ఢీకొన్న వాహనం #AutoAccident
ఆంధ్రప్రభ ఇంపాక్ట్ మిషన్ భగీరథ మరమ్మతులు పూర్తి చేశాంఏఈ అస్మిత దండేపల్లి, ఆంధ్రప్రభ
30yrs |అవయవాల వైఫల్యం ..కోరి తెచ్చుకుంటున్న యువతరం
30yrs | అవయవాల వైఫల్యం ..కోరి తెచ్చుకుంటున్న యువతరం 30yrs | యువతలో
విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు విద్యార్థులు చట్టాల పై అవగాహన పెంచుకోవాలిసీఐ
గ్యాస్ సిలిండర్ల కోసం స్థానికుల తిప్పలు
గ్యాస్ సిలిండర్ల కోసం స్థానికుల తిప్పలు తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకొరతతో
అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు….
రూ.894 కోట్ల విలువైన పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు కేంద్రం ఆమోదం
తెలంగాణ రైతులు పండించిన 1,25,855 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను రూ.894 కోట్లకు పైగా కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లించి కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర వ్యయసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం రైతుల మీద పడకుండా వారికి నిరంతరం అండగా ఉంటూనే ఇప్పుడు పెద్ద ఎత్తున పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు ఆమోదం తెలుపడం మోడీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. 2026 పంట కాలానికి సంబంధించి రాష్ట్ర రైతులు పండించిన 29,860 మెట్రిక్ టన్నుల శనగలు, 37,020 మెట్రిక్ టన్నుల మినుములు, 55,285 మెట్రిక్ టన్నుల వేరుశనగ, 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు విత్తనాలను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి సానుకూల చర్యల వల్ల తెలంగాణ రైతులకు తగిన ఆదాయం రావడంతోపాటుగా వాణిజ్య పంటలు పండించడానికి తగిన ప్రోత్సాహం కూడా లభిస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఈ చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో భూసార పరీక్షలు మొదలుకొని సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు వంటి అనేక ప్రయోజనాలను రైతులకు కల్పిస్తోందని పేర్కొన్నారు. దీంతోపాటుగా పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించడంతోపాటుగా, పండించేందుకు అయ్యే ఖర్చుకు కనీసం 50 శాతం నుంచి 100 శాతం అధికంగా కనీస మద్దతు ధరను అందిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 2014 నుంచి నేటి వరకు తెలంగాణ రైతులు పండించిన దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వరి ధాన్యాన్ని, రూ.70 వేల కోట్ల విలువైన పత్తిని కనీస మద్దతు ధర చెల్లించి కేంద్రం సేకరించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించాలి
యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించాలి కర్నూలు, ఆంధ్రప్రభ : రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న
జీపీ భవనాని ప్రారంభించిన ఎమ్మెల్యే
జీపీ భవనాని ప్రారంభించిన ఎమ్మెల్యే రూ.40 లక్షలతో నిర్మించిన జీపీ భవనాలను ప్రారంభించిన
రాష్ట్రంపై జగన్ కక్ష కట్టారు : పయ్యావుల
జగన్.. రాష్ట్రంపైనా, ప్రజలపైనా కక్ష కట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు
వసంత నవరాత్రులకు విస్తృత ఏర్పాట్లు..
వసంత నవరాత్రులకు విస్తృత ఏర్పాట్లు.. వైభవంగా మార్చి 19 నుంచి ఉగాది, శ్రీరామనవమి
‘ధురంధర్’ రీ-రిలీజ్.. ఎన్ని థియేటర్లలో అంటే..
గతేడాది చివర్లో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై.. సూపర్ హిట్గా నిలిచిన చిత్రం ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా 2025 డిసెంబర్-5న విడుదలై.. దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ మార్చి-19న ఈ సినిమా సీక్వెల్ ‘దురంధర్: ది రివేంజ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ధురంధర్’ని థియేటర్లలో మిస్ అయిన వాళ్ల కోసం మరోసారి రీ-రిలీజ్ చేస్తున్నారు. గురువారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం పెద్దగా సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒటిటిలో విడుదలైన ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో ‘ధురంధర్’ని విడుదల చేస్తున్నారు. భారత్లోనే ఏకంగా 250 థియేటర్లలో తీసుకురావడంతో పాటు నార్త్ అమెరికాలో 185 సినిమాస్లో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకూ అటు థియేటర్లో ఇటు ఒటిటిలో చూడలేని వారికి ఇదొక సరికొత్త అనుభూతి అనే చెప్పుకోవాలి.
పోలీస్స్టేషన్లో అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పోలీస్స్టేషన్ ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గతంలో పోలీసులు సీజ్ చేసిన దాదాపు 50 బైకులు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయి. చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: కెటిఆర్
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అన్ని సంక్షేమ పథకాలకు స్వస్థి పలికిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కెసిఆర్ పాలనలో ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని గుర్తు చేశారు. మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, మళ్లీ రంజాన్ తోఫా ప్రతి ముస్లింలకు అందజేస్తామని తెలిపారు. రంజాన్ సందర్భంగా సోమాజిగూడలో మాజీ ఎంఎల్సి సలీం ఆధ్వర్యంలో గురువారం రేషన్ కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కెటిఆర్ పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్లను అందజేశారు. కెసిఆర్ హయాంలో ప్రతి పేద ముస్లిం అమ్మాయి పెళ్లి అయితే షాది ముబారక్ పథకంతో లక్షా నూట పదహారు ఇచ్చామని అన్నారు. కేవలం పేదల ఇండ్లపై బుల్డోజర్ పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పకుండా మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎంఎల్ఎ దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలకు మోసం చేసి పార్టీ ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లా దయతో అందురు రంజాన్ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరికీ కెటిఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్, మాజీ ఎంఎల్సి కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన సిఎన్జీ,ఎల్పిజి ధరలు..
అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్యజరుగుతున్న యుద్దాల ప్రభావం ఎల్పిజి,ఎన్జిల పై పడటంతో ఆటో డ్రైవర్ల్లు ఇబ్బందుల పాలువుతున్నారని ఆటో డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 1 వరకు ఎల్పిజి లీటర్కు రూ. 63 ఉండగా ప్రస్తుతం .100 చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా ఫ్రీ బస్సు ద్వారా కూడా తమ జీవనోపాధి దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్పిజి, సీఎన్జి ధరలు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసిందని పేర్కొంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ ఒక ప్రటనలో విజ్ఞప్తి చేసింది.
టమాటా పంట…రైతుల కళ్లలో కన్నీళ్లు
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. అనంతపురం జిల్లా రైతులకు టమాటా పంట ఈసారి ఆశల కంటే ఎక్కువ బాధను మిగిల్చింది. వేల ఎకరాల్లో ఎంతో కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి చెమటోడ్చి పండించిన టమాటా ఇప్పుడు కిలోకు రెండు నుంచి మూడు రూపాయలకే పడిపోవడం రైతులను కలచివేస్తోంది. పంట కోయడానికి వచ్చే ఖర్చు కూడా రాకపోవడంతో చాలామంది […] The post టమాటా పంట… రైతుల కళ్లలో కన్నీళ్లు appeared first on Visalaandhra .
Viral Now: Hardik Pandya Lands into Legal Trouble
Indian Star All-rounder Hardik Pandya has landed into a legal trouble after the final of the T20 World Cup that took place in Narendra Modi Stadium, Ahmedabad. An advocate based in Pune has filed a complaint against Hardik Pandya for insulting the national flag during the success celebrations of the T20 World Cup. The cops […] The post Viral Now: Hardik Pandya Lands into Legal Trouble appeared first on Telugu360 .
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని అపర సంజీవని 108
ఫ్యాన్స్కి మరో సర్ప్రైజ్.. ‘ఉస్తాద్’ నుంచి ‘కాలరే ఎత్తర’ ఫుల్ సాంగ్
పవర్స్టార్ పవన్కల్యాణ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పోలీస్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్సింద్’. ‘గబ్బర్సింగ్’ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇద కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అప్డేట్స్ అన్ని అభిమానులను వివరీంతంగా నచ్చేశాయి. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘కాలరే ఎత్తర’ అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. తాజా ఫుల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాటకి దేవిశ్రీ ప్రదసాద్ సంగీతం అందించగా.. రామ్ మిర్యాల పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇఖ శ్రీలీల హీరోయిగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.
ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… కృష్ణలంక విజయవాడ, ఆంధ్ర ప్రభ
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలి: కెటిఆర్
వాణిజ్య, గృహ అవసరాల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఎల్పిజి సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం వల్ల హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, పిజి హాస్టళ్లు, చిన్న చిన్న ఆహార వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని కెటిఆర్ తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించకపోతే వేలాది వ్యాపార సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో లక్షలాది మంది కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కెటిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పలు ఆచరణాత్మక సూచనలు చేశారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను రక్షించే విధంగా స్థాయిలవారీ ఎల్పిజి కేటాయింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు.అలాగే ఎల్పిజి సిలిండర్ల లభ్యతపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేలా రియల్ టైమ్ పబ్లిక్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచకుండా తాత్కాలిక ధరల స్థిరీకరణ చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అదనంగా గృహ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లిస్తూ జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఆధారపడే పిజి హాస్టళ్లకు ప్రత్యేక రక్షణ కేటగిరీ కింద గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు. గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికల్లో కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాటిని అత్యవసర సేవలుగా గుర్తించి ప్రాధాన్య కేటాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. హోటల్, ఆహార రంగంపై ఆధారపడిన లక్షలాది మంది దినసరి కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడకుండా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి సాధారణ సమస్య కాదని, ఇది లక్షలాది మంది ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేసే సంక్షోభమని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే సమన్వయంతో చర్యలు చేపట్టి ఎల్పిజి సరఫరాను పునరుద్ధరించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
ఘనంగా వైఎస్ ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు….
ఘనంగా వైఎస్ ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు…. కృష్ణలంక విజయవాడ తూర్పు, ఆంధ్ర ప్రభ
నిషేధిత గంజాయి పట్టివేత చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల
Hyderabad : గ్యాస్ కొరత ఎఫెక్ట్....హైదరాబాద్ లో పడకేసిన పర్యాటక రంగం
హైదరాబాద్ కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు.

27 C