మొయినాబాద్ డ్రగ్స్ కేసు..విచారణకు సిట్
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రంగారెడ్డి జి ల్లా మొయినాబాద్లోని బీఆర్ఎస్ నేత పైలట్ రో హిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ నే తృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కేసును విచారణ చేయడానికి 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ సుధీర్బాబు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేయనున్నట్లు తెలిపింది. 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ వ్యవహారంపై సిట్ విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ వ్యాపారాలు తదితర అంశాలపై సిట్ విచారణ జరపనుంది. మరోవైపు రోహిత్రెడ్డి ఫాంహౌస్పై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితులను కస్టడీకి ఇవ్వండి : పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సిట్ సిఫారసు చేసింది. ఫామ్హౌస్లో సోదాలకు వెళ్లిన పోలీసులపై రియల్టర్ నమిత్ శర్మ, రితేశ్ రెడ్డి లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. తుపాకీ లైసెన్స్ దుర్వినియోగం చేశారని సిట్ అధికారులు సీపీకి లేఖ రాశారు. మరోవైపు ముగ్గురు నిందితులను 7 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని ఫాంహౌస్లో ఈ నెల 14న రాత్రి జరిగిన విందుపై తెలంగాణ ఈగల్, మొయినాబాద్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్, మద్యం పార్టీకి ప్రధాన సూత్రధారిగా తేలింది. కొన్నిరోజులుగా రోహిత్రెడ్డి తన ఫాంహౌస్లో వారాంతపు పార్టీ చేద్దామనే గట్టి ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి బిజినెస్ మీటింగ్లో భాగంగా శిమ్లా వెళ్లినప్పుడు ఓ వ్యక్తి దగ్గర రూ.15 వేలకు కొకైన్ను కొనుగోలు చేశాడు. పార్టీలో మొత్తం 11 మంది : ఈ విషయం పైలట్ రోహిత్ రెడ్డితో చెప్పగా ఈ నెల 14న సాయంత్రం తన ఫాంహౌస్లో పార్టీ చేద్దామనే ఆలోచనకు వచ్చి నిర్ణయించుకున్నాడు. దీనికి తన స్నేహితుడు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్తో సహా ఇతరుల్ని ఆహ్వానించాడు. కౌశిక్ రవి డ్రగ్స్తో నేరుగా ఫాంహౌస్లో జరిగే పార్టీకి వచ్చాడు. మొత్తం 11 మంది పాల్గొన్న పార్టీలో మహేశ్ కుమార్, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ తదితరులంతా మద్యంలో కొకైన్(డ్రగ్స్) కలిపి సేవించారు. గన్తో శర్మ కాల్పులు : ఈ ఫాంహౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ కేసులో ఒక్కోక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాంహౌస్లోకి పోలీసులు రావడాన్ని చూసిన నమిత్శర్మ తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతోనే గన్తో కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు ఫాంహౌస్లోకి ప్రవేశించే సమయంలోనే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో తాము ఫ్యూచర్సిటీ పోలీసులమని, పక్కా సమాచారంతో సోదాలకు వచ్చామంటూ వారు గట్టిగా చెప్పారు. దీన్ని లెక్క చేయకుండా నమిత్ పోలీసు అధికారిని టార్గెట్గా చేసుకుని ఒక రౌండు కాల్పులు జరిపాడు. పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి ఇద్దరూ వాళ్లను కాల్చెయ్, తర్వాత మొత్తం మేం చూసుకుంటాం అంటూ నమిత్ శర్మను రెచ్చ గొట్టినట్లు సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అప్రమత్తతతో అందర్నీ చుట్టుముట్టడంతో తుపాకీ కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్రెడ్డి, నమిత్ శర్మ, రితేశ్ రెడ్డిపై కొత్తగా అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లను జోడించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు చంచల్గూడ జైలు రిమాండ్లో ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసులో వీటిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? ఈ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులు ఎవరు? వారికి మీకు ఉన్నా లింకులు, దుబాయ్ లింకులు తదితర అంశాలపై పలు కోణాల్లో విషయాలను రాబట్టేందుకు ఈ సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి సిట్ నివేదికను అందించనుంది. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్పై ఆదివారం పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ సమయంలో న్యూఢిల్లీకి చెందిన నమిత్ శర్మ.. కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారిని చుట్టిముట్టారు. ఈ సందర్భంగా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. వారిలో పలువురికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సైతం ఉన్నారు. ఆయనకు కూడా డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అలాగే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి వారి వారి పార్టీల నుంచి నోటీసులు అందాయి. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ వారికి ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. అప్పటి వరకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నాయి. పలు అంశాలపై ఆరా : రోహిత్ రెడ్డి పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేశారు? డ్రగ్స్తో పాటు అసలు ఫాంహౌస్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి? గతంలో ఎవరైనా ప్రముఖులు ఇక్కడికి వచ్చారా? వస్తే వారికి ఎలాంటి పార్టీ ఇచ్చారు? ఇదే తరహాలో ఎన్ని పార్టీలు జరిగాయి? అన్న కోణంలో సిట్ విచారణ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ దందాతో పాటు దుబాయ్కు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అన్న లింకులపైనా సిట్ బృందం ఫోకస్ చేయనుంది. సిట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఈ కేసులో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
మన తెలంగాణ/హైదరాబాద్: హ్యామ్(హెచ్ఎ ఎం) రోడ్ల పేరిట రాష్ట్రంలో సుమారు రూ.18వేల కోట్ల స్కాంకు తెరలేపారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు సంచలన ఆరోపణలు చేశారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్అండ్బి)లో రూ.12వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.6వేల కోట్లు కలిపి భారీ స్థాయి లో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి వద్దు అని గొడవ పెట్టారని, ఇప్పుడు అదే ప్రభుత్వం 10శాతం మొబిలైజేషన్ ఇస్తోందని పేర్కొన్నారు. ఇందులో కమిషన్లు తీసుకుని ఎన్నికల ఖర్చు కోసం పంపబోతున్నారని, ఈ వ్యవహారం పెద్ద స్థాయి స్కాంగా మారే ప్రమాదం ఉందని ఆరోపించారు. అసెంబ్లీలో మంగళవారం మాజీ మంత్రులు హరీష్రావు, వేముల ప్రశాంత్రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయని..కానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయని..తేడా 50 శాతం వస్తోందని తెలిపారు. ఈ టెండర్లకు సిఒటి అనుమతి కూడా అవసరం లేకుండా, శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కుతో 20 నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు టెండర్లు వేయించారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజల డబ్బును కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే... ఇప్పుడు పది శాతం పెట్టారని అన్నారు. మొత్తం 34లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని, ముందే రింగ్ అయ్యారని ఆరోపించారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖలోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు టెండర్ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేదని, ఇప్పుడు హ్యాం రోడ్లకు ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చని చెప్పారు. హ్యాం రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగిందని, నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయని అన్నారు. నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి,ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారని, రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారని తెలిపారు. టెండర్లలో కుమ్మక్కు అయ్యారని, సివేట్, సరళ, బృందా, బి.వి.ఎస్.ఆర్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. పంచాయతీ రాజ్ శాఖలో 7 వర్క్లు సివేట్కు 3 వర్కులు జె ఇన్ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సివేట్,బృందాకు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో టెండర్ యక్సెస్కు 5 శాతం సీలింగ్ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాక్సెస్ ఎత్తివేశారని తెలిపారు. టెండర్లలో అవినీతి జరిగిందని, ఆ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, రిజర్వ్ బ్యాంకుకు, అన్ని విచారణ సంస్ధలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడింంచారు. టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై తమ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేసి, పారదర్శంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిఒటి అనుమతి, ఐదు శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలని, మొబిలైజేషన్ అడ్వాన్స్లు రద్దు చేయాలని అన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి పద్దులు చర్చకు వచ్చినపుడు బిఆర్ఎస్ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతామని, హైకోర్టు విచారణకు పట్టుబడతామని వెల్లడించారు. సింగరేణి శ్రీరాంపూర్ టెండర్ వ్యవహారాన్ని తాము బయటపెట్టిన తర్వాత తక్కువకు పోయిందని పేర్కొన్నారు.
కళ్లల్లో కారం కొట్టి..రూ.కోటి కొట్టేశారు
మన తెలంగాణ/కూకట్పల్లి: కూకట్పల్లిలో సోమవారం ఆర్ధరాత్రి హవాలా డబ్బు కలకలం సృష్టించింది. రూ.కోటి నగదుతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులను నిందితులు సినీ ఫక్కీలో వెంటాడి కూకట్పల్లి పిల్లర్ నెం.837 వద్దకు చేరుకోగానే కళ్లలో కారం కొట్టి కోటి రూపాయల నగదుతో పారిపోయారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది సంఘటను గుర్తించేలోగా నిందితులు పారిపోయారు. బాధితుడు మహమ్మద్ అజీముద్దీన్ను కూకట్పల్లి సిఐ వద్దకు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు బాలానగర్ సిసిఎస్ తో సమన్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఈ కేసులో మొత్తం 9 మంది ఉండగా 24 గంటలు కూడా గడవక ముందే అందులోని ప్రధాన నిందితులైన నలుగురుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదును, విమానం టికెట్లను, సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురిని పట్టుకోగాకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిపి రితిరాజ్ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్లోని బహదూర్పురాలోగల సిద్రా ఎంటర్ప్రైజెస్ యజమాని వివిధ వ్యక్తుల నుంచి నగదు వసూలు చేయడానికి ఖుసృద్ధీన్ అతని సహ ఉద్యోగి అయిన మహమ్మద్ అజీముద్దీన్ (ఫిర్యాదుదారుడు) ను నియమించాడు. టోకెన్ చూపించి రహస్యంగా వసూలు చేసిన సొమ్ముపై కన్నేసిన ఖుసృ ద్దీన్ పలువురితో కమ్మక్కై పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేసిన డబ్బుతో పరారీకి ప్రయత్నించాడు.
ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి..400 మంది మృతి
ఇస్లామాబాద్ : అఫ్గానిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని సోమవారం రాత్రి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే కాబూల్లోని డ్రగ్స్ రిహాబిటేషన్కు సంబంధించిన ఆస్పత్రిపై పాకిస్థాన్ సోమవారం రాత్రి వైమానిక దాడులు సాగించడంతో ఆస్పత్రి భవనం చాలావరకు ధ్వంసమైందని, 400 మంది వరకు మరణించారని, సుమారు 250 మంది గాయపడ్డారని అఫ్గానిస్థాన్ వెల్లడించింది. ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ప్రారంభించిన ఆపరేషన్ ఘజాబ్ లిల్ హక్లో భాగంగానే తాజా వైమానిక దాడులు కొనసాగాయని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వశాఖ వెల్లడించింది. అఫ్గాన్ తాలిబన్ దళాలు సరిహద్దులోని 2600 కిలోమీటర్ల పొడవునా సాగించిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఈ ఆపరేషన్ను ప్రారంభించింది. కాబూల్, నంగర్హర్లోని తాలిబన్ల నిర్వహణలోని మిలిటరీ స్థావరాలపై ఈ దాడులు చేపట్టినట్టు పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తాయుల్లా తరార్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. కాబూల్లోని రెండు ప్రాంతాల్లో సాంకేతిక వ్యవస్థ, పేలుడు పదార్థాల గిడ్డంగులను, నంగర్హర్లోని ఉగ్రవాద శక్తులకు అండగా ఉన్న మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. అయితే అఫ్గాన్ తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాట్ ఈ దాడులపై వివరిస్తూ సోమవారం రాత్రి అఫ్గాన్ రాజధాని కాబూల్లో డ్రగ్ రీహేబిలిటేషన్ సెంటర్పై పాక్ వైమానిక దాడులు కొనసాగాయని, 400 మంది చనిపోయారని, మరో 250 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. శిధిలాల నుంచి మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయని చెప్పారు. ఇంకా శిథిలాల కింద మరో 50 మృతదేహాలు చిక్కుకుని ఉండి ఉండవచ్చని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్ఘాన్పై దాడి పిరికిపంద చర్య: భారత్ న్యూఢిల్లీ : అఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అత్యంత అమానుష ఘటనగా అభివర్ణించింది. ఇది పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటి వరకు చూడని క్లైమాక్స్: నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వృషకర్మ. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నాగచైతన్య చేసిన లేటెస్ట్ కామెంట్స్.. అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని చివరి 25 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన తెలిపారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త అంశాన్ని ఈ క్లైమాక్స్ లో చూపించబోతున్నామని చెప్పారు. దీంతో క్లైమాక్స్ లో బిగ్ సర్ప్రైజ్ ఉంటుందనే చెప్పాలి. వృష కర్మలో నాగచైతన్య ఇప్పటి వరకు చేయని విధంగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల్లో కనిపించబోతున్నారని సమాచారం. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నాగచైతన్య, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ అనే పాత్రలో ఆయన నటిస్తున్నారని, ఇది చైతూ కెరీర్ లోనే అత్యంత పవర్ ఫుల్ క్యారెక్టర్ గా నిలుస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సినిమాలో నాగచైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఆయన సరసన మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ గా కనిపించనున్నారు. జయరామ్, సత్య అక్కళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
నైజీరియా మైడుగురి సిటీపై ఆత్మాహుతి బాంబుల దాడి ..23 మంది మృతి
ఈశాన్య నైజీరియా లోని మైడుగురి సిటీని టార్గెట్ చేస్తూ సోమవారం రాత్రి ఆత్మాహుతి బాంబుల దాడికి 23 మంది ప్రాణాలు కోల్పోవగా, 108 మంది గాయపడ్డారు. సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న ఈ నగరంలో అత్యంత ప్రాణాంతక దాడి ఇదేనని చెబుతున్నారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైడుగురిలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్, యూనివర్శిటీ ఆఫ్ మైడుగురి టీచింగ్ ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద పేలుళ్లు జరిగాయని స్థానికులు చెప్పారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించక పోయినప్పటికీ, బొకో హరామ్ జీహాదీ గ్రూప్ ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇస్లామిక్ సిద్ధాంతాన్ని బలవంతంగా అమలు చేయడానికి బోకో హరామ్ జీహాదీ గ్రూప్ 2009 నుంచి తిరుగుబాటు చేస్తోంది. అందులోని భాగమే ఈ దాడులని అనుమానిస్తున్నారు.
ప్రముఖ నటి నయనతారపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీ ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతపై నిర్వహించిన నిరసన సభలో పాల్గొంటూ నటి నయనతార గురించి ఎంపీ చేసిన అవమానకర వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. తమిళనాడు సిఎం స్టాలిన్పై విమర్శ చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసాయి. “మీ కలలను మాకు చెప్పండి. వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.దీన్ని ఉద్దేశించి అన్నాడీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మాట్లాడుతూ అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమన్నారు. మన కలల్ని తనతో పంచుకోమని ఆయన (స్టాలిన్) అడుగుతున్నారు. నాకు నయనతార కావాలి.. దాన్ని ఆయన నెరవేరుస్తారా? నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది. నాలాగే ఎవరో నయనతారతో పెళ్లి చేయమని స్టాలిన్ను అడిగితే ఆ కలను నెరవేర్చుతారా? అని ఆయన వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. మహిళల భద్రత నిరసన సభలోనే వివాదం ఈ వ్యాఖ్యల వివాదాన్ని మరింత పెంచిన అంశం ఏమిటంటే.. మహిళల భద్రత, గౌరవం కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో షణ్ముగం ఒక మహిళ(నయనతార) గురించి అవమానకరంగా మాట్లాడటం. అక్కడే ఉన్న పార్టీ నాయకులు కూడా ఈ వ్యాఖ్యలపై నవ్వుతూ స్పందించడం విమర్శలకు మరింత కారణమైంది. సోషల్ మీడియాలో ఆగ్రహం షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర ప్రతికూల స్పందనలు వచ్చాయి. రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వినియోగదారులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, కొందరు తమిళనాడు పోలీసులను ఈ అంశంపై కేసు నమోదు చేయాలని కోరగా, ఆ ఎంపీపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.మా విధానాలను విమర్శించండి. కానీ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకండి. నయనతారను అవమానించడం ద్వారా మహిళలందరినీ అవమానించారు. ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమెదయోగ్యం కాదు అని డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది. షణ్ముగం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మహిళల ప్రస్తావన తెచ్చి తీవ్ర విమర్శల పాలయ్యారు.
బైద బాటిల్ పబ్లో అగ్నిప్రమాదం
కిచెన్లోని కట్టెల పొయ్యి నుంచి చెలరేగిన మంటలతో పబ్బులో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన జూబ్లీహిల్స్లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 36లో ఉన్న బైద బాటిల్ పబ్బులో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ కొరతతో పబ్లోని కిచెన్లో కట్టెలతో వంట చేస్తున్నారు. రోజు మాదిరిగానే కట్టెల పొయ్యితో వంట చేస్తుండగా పొయ్యి నుంచి ఎగసిపడిన నిప్పు రవ్వలు పబ్బులోని థర్మకోల్కు అంటు కోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పబ్బు మొత్తం అంటుకోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పివేశారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పబ్బులో తక్కువ మంది ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని […] The post జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా appeared first on Visalaandhra .
మరో 15 రోజుల వరకు ఢోకా లేదుప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాంముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు […] The post సరిపడా గ్యాస్ నిల్వలు appeared first on Visalaandhra .
விமான நிலையத்தில் விஜய் கைப்பையில் மதுபாட்டில் பறிமுதல் செய்யப்பட்டதா?
விமான நிலையத்தில் விஜய் கைப்பையில் மதுபாட்டில் பறிமுதல் செய்யப்பட்டதாக தவறான தகவல் பகிரப்படுகிறது.
కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదుశుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదుఅధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ […] The post శాంతికి సమయం కాదు appeared first on Visalaandhra .
నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం
. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 40 శాతానికిపైగా వైకల్యముంటే వర్తింపు. 12.76 లక్షల మందికి లబ్ధి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం […] The post నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం appeared first on Visalaandhra .
కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన న్యూదిల్లీ: ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్ట్స్టైల్స్, స్కిల్డెవలప్మెంట్పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈపీఎస్ […] The post ఈపీఎఫ్ కనీసపింఛను పెంచాలి appeared first on Visalaandhra .
గల్ఫ్పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్
వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను […] The post గల్ఫ్పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్ appeared first on Visalaandhra .
బీజింగ్: అమెరికాకు చైనా ఓ షరతు పెట్టింది. పశ్చిమాసియాలో యుద్ధం ఆపేస్తే హోర్ముజ్ జల సంధిలో నౌకల రక్షణకు సిద్ధమని ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో తమకు మద్దతుగా యుద్ధనౌకలు పంపాలంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. ప్రపంచ ఇంధన సరఫరా, ప్రాదేశిక శాంతి, సుస్థిరతకు నష్టం కలిగించవద్దని సూచించింది. ఉద్రిక్తతలు పెరిగితే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటనివ్వద్దని […] The post అమెరికాకు చైనా షరతు appeared first on Visalaandhra .
అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు
కాబూల్: అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ మెరుపు దాడి చేసింది. ఆ దేశ రాజధాని కాబూల్పై విరుచుకుపడింది. అక్కడి ఆసుపత్రిపై వైమానిక దాడి చేయగా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్, పాక్ మధ్య సరిహద్దు ఘర్షణ చాలా కాలంగా సాగుతున్నది. కాబూల్లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్లో ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన తాజా […] The post అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు appeared first on Visalaandhra .
టీ20ల్లో అత్యుత్తమ ఆటగాడు బుమ్రానే: డివిలియర్స్
న్యూదిల్లీ: టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు జస్ప్రిత్ బూమ్రాయేనని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ బ్యాటర్లు రేసులో ఉన్నప్పటికీ డివిలియర్స్ ఒక బౌలర్ను ఎంచుకోవడం విశేషం. ఈ ఎంపిక వెనుక ఉన్న కారణాలను డివిలియర్స్ వివరిస్తూ… “కొత్త బంతి అయినా, పాత బంతి అయినా, ఆఖరికి సూపర్ ఓవర్ అయినా సరే.. బుమ్రా చేతికి బంతి ఇస్తే మ్యాచ్ గెలిపిస్తాడు. ఏ […] The post టీ20ల్లో అత్యుత్తమ ఆటగాడు బుమ్రానే: డివిలియర్స్ appeared first on Visalaandhra .
దెబ్బతిన్న పైప్లైన్ పునరుద్ధరించిన థింక్ గ్యాస్
అనంతపురం: అనంతపురంలోని శ్రీ నగర్ కాలనీలో, ఎంజీ షోరూమ్ వెనుక, ఒక దుకాణ యజమాని విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం గుంత తవ్వేందుకు సమాచారం ఇవ్వకుండా చేతితో తవ్వకాలు జరుపుతుండగా, థింక్ గ్యాస్ (గతంలో ఏజీ అండ్ పీ ప్రథమ్) వేసిన నగర గ్యాస్ పైప్లైన్ దెబ్బతింది. థింక్ గ్యాస్ అత్యవసర ప్రతిస్పందన బృదం వెంటనే స్పందించి, ప్రభావిత ప్రాంతాన్ని వేరుచేసి, తక్కువ సమయంలో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. తద్వారా ప్రజల భద్రతను నిర్ధారించి, నివాసితులకు కలిగే […] The post దెబ్బతిన్న పైప్లైన్ పునరుద్ధరించిన థింక్ గ్యాస్ appeared first on Visalaandhra .
దక్షిణాదిన ఈవీలవైపు మొగ్గుః ఫ్లిప్కార్ట అధ్యయనం
బెంగళూరు: భారతదేశానికి చెందిన స్వదేశీ ఈకామర్స్ మార్కెట్ప్లేస్ ఫ్లిప్కార్ట తాజాగా “లాస్ట్మైల్ లీప్: భారతదేశపు ఎలకిక్ మొబిలిటీ పరివర్తనను వేగవంతం చేయడానికి డెలివరీ ఫ్లీట్లను బలోపేతం చేయడం” అనే వైట్పేపర్ను విడుదల చేసింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా 6,000 మందికి పైగా విష్ మాస్టర్స్, అంటే, డెలివరీ భాగస్వాములపై నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందింది. ఈ అధ్యయనం ప్రకారం, దాణ భారతదేశంలోని డెలివరీ భాగస్వాములు ఎలకిక్ వాహనాలకు మారడానికి గట్టి ఆసక్తి చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న దక్షిణ […] The post దక్షిణాదిన ఈవీలవైపు మొగ్గుః ఫ్లిప్కార్ట అధ్యయనం appeared first on Visalaandhra .
మిరపలో నల్ల తామర పురుగు నియంత్రణకు కొర్టేవా
హైదరాబాదః మిరప రైతులు బ్లాక్ త్రిప్స్ తీవ్రమైన ముట్టడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇది దిగుబడి తగ్గించి, నాణ్యత నష్టాలకు దారితీసేందుకు కారణమవుతుంది. ఒకే విధమైన చర్యతో పురుగుమందులను పదేపదే ఉపయోగించడం ద్వారా పేలవమైన నియంత్రణ లభిస్తుండగా, మిరపలో పురుగుమందుల అవశేషాల స్థాయి పెరుగుతోంది. కొర్టేవా అగ్రిసైన్స్ ఈ సవాలును చురుకుగా పరిష్కరిస్తోంది. స్థిరమైన ఉత్పాదకతను, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు సైంటిఫిక్ ఆధారిత, ఇంటిగ్రేటెడ్ తెగులు నిర్వహణ (ఐపీbం) వ్యూహాల ద్వారా రైతులకు సాధికారత కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ […] The post మిరపలో నల్ల తామర పురుగు నియంత్రణకు కొర్టేవా appeared first on Visalaandhra .
women play key role in politics : పదవులు మహిళలవి Andhra Prabha News
women play key role in politics : పదవులు మహిళలవి Andhra
మే 3న పరీక్ష టిజిఆర్జెఎసి సెట్
రాష్ట్రంలో 35 తెలంగాణ గురుకుల(రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియేట్ మొదటి ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఆర్జెసి సెట్కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 3వ తేదీన టిజిఆర్జెఎసి సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’
హైదరాబాద్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు జెమినీ టీవీ సిద్ధమైంది. ‘మాస్ జాతర’ పేరుతో రూపొందించిన ఈ మెగా వీకెండ్ కామెడీ షోను హైదరాబాద్లోని నెక్సస్ మాల్లో సినీ తారలు, కమెడియన్ల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, jట్యూబర్లు, కళాకారులతో కూడిన ఈ వినూత్న స్కిట్ కాంపిటీషన్ ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ […] The post జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’ appeared first on Visalaandhra .
ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు పార్టీ పదవులు, తదితర అంశాల గురించి సిఎం రేవంత్రెడ్డి ఖర్గేతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఏఐసిసి నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కెసి వేణుగోపాల్కు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా సమాచారం.
Jana Nayagan Censor Issue: No Relief
Vijay’s last film Jana Nayagan is packed with hurdles. The Censor officials referred the film to the Revising Committee but the screening for the film was pushed several times. The Revising Committee has pushed the screening for today but it was delayed due to undisclosed reasons. The officials did not watch the film and this […] The post Jana Nayagan Censor Issue: No Relief appeared first on Telugu360 .
సీపీఐ పోరాటాల ఫలితమే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు
ఈ నెల 24న అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు వెల్లడివిశాలాంధ్ర`విజయవాడ: ఉగాదికి టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందజేస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించటాన్ని కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది. ఈ మేరకు సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతత్వంలో సీపీఐ బందం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కపూడి, వేమవరం ప్రాంతంలో లబ్దిదారులకు అందించేందుకు సిద్ధం చేస్తున్న టిడ్కో ఇళ్లను […] The post సీపీఐ పోరాటాల ఫలితమే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు appeared first on Visalaandhra .
రుణ ప్రణాళిక లక్ష్యం రూ.83,500కోట్లు
The post రుణ ప్రణాళిక లక్ష్యం రూ.83,500కోట్లు appeared first on Visalaandhra .
పైలట్ రోహిత్రెడ్డికి బిఆర్ఎస్ షోకాజ్ నోటీసులు
మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణల నేపథ్యంలో తాండూరు మాజీ ఎంఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం మంగళవారం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యులు సోమా భరత్ కుమార్ నోటీసు ఇచ్చారు. ఈ అంశం విస్తృతంగా మీడియాలో ప్రచారం పొందడం వల్ల పార్టీ ప్రతిష్ఠకు, ప్రజల్లో ఆందోళనకు దారితీసిందని నోటీసులో పేర్కొన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం : భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలను పాటించడంలో కట్టుబడి ఉందని సోమా భరత్ కుమార్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్నిపార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రోహిత్ రెడ్డి ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉండటంతో ఈ విషయాన్ని పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు స్పష్టమైన,సమగ్ర లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు. నోటీసు లేకుండానే తగిన క్రమశిక్షణా చర్యలు : ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యకలాపాల్లో రోహిత్రెడ్డి పాల్గొనకుండా ఉండాలని కూడా ఆదేశాలు ఇచ్చామని భరత్ కుమార్ పేర్కొన్నారు. నోటీసుకు గడువులోగా సంతృప్తికరమైన వివరణ సమర్పించకపోతే పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
38000 MT Gas Available : ఏపీలో గ్యాస్ కొరత లేదు Andhra Prabha News
38000 MT Gas Available : ఏపీలో గ్యాస్ కొరత లేదు Andhra
ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్#MoinabadDrugsCase#BreakingNews#Puttamahesh#DrugCase
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ను నియమించింది. ఇక, సిట్ సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ ఎం. రవీందర్, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లు సి. హరీష్చంద్రారెడ్డి, ఎన్. బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్ హెచ్ఓ మల్లికార్జునరెడ్డి, ఎస్సైలు కోటేశ్వరరావు, సదాత్ అలీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొయినాబాద్ ఫాం హౌస్లో కలకలం రేపిన డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు బృందం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫాం హౌస్లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయన, పోలీస్లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో అక్కడే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న సిల్వేరి శరత్ కుమార్గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పాయింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు. సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. నిందితుల్లో 11 మంది వ్యక్తులకు మాదకద్రవ్యాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఫామ్హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
గుజరాత్కు చేరిన భారత్ రెండో ఎల్పీజీ నౌక
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పిజి కొరత వెంటాడుతున్న సమయంలో 46,500 టన్నుల గ్యాస్తో కూడిన నందాదేవి నౌక సురక్షితంగా గుజరాత్లోని వదినార్ పోర్టుకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధిని దాటుకుని భారత్ చేరుకున్న రెండో భారీ ఎల్పిజి నౌక ఇది. మొదటి ఎల్పిజి నౌక శివాలిక్ గుజరాత్ లోని ముండ్రా పోర్టుకు సోమవారం చేరుకుంది. ఈ నౌక నుంచి బిడబ్లు బిర్చ్ అనే మరో చిన్న నౌకకు ఈ ఎల్పీజీని అన్లోడ్ చేస్తారు. అక్కడ నుంచి తమిళనాడు లోని ఎన్నోర్, పశ్చిమబెంగాల్ లోని హాల్డియా, పోర్టులకు ఎల్పీజీ రవాణా అవుతుంది. ఈ బదిలీ ప్రక్రియలో గంటకు 1000 టన్నుల వంతున మొత్తం అన్లోడింగ్ పూర్తవడానికి రెండు రోజులు పడుతుంది.
రిలీజ్ కు సిద్ధమైన 'ధురంధర్2'.. రన్ టైమ్ అన్ని గంటలా..
న్యూఢిల్లీ: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ధురంధర్' సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్టు2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన మొదటి పార్టు ఏకంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా హిందీలోనే విడుదలైంది. రెండో పార్టు మాత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ మార్చి 19న రిలీజ్ కానుంది. 'ధురంధర్: ది రివెంజ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మార్చి 18న సాయంత్రం నుంచి పెయిడ్ ప్రివ్యూలు వేయనున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసేందుకు సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీంతో మూవీ టికెట్ల ధరలు కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 నుండి రూ. 2400 వరకు టికెట్ల ధరలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ మూవీ రన్ టైమ్ పై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా, ఈ సినిమా రన్ టైమ్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇండియాలో ఈమూవీ రన్ టైమ్ సుమారు 3 గంటల 49 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఇక, ఓవర్సీస్లో 3 గంటల 49 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పండోర్, రాకేష్ బేడి, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈనెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 9.30 గంటలకు మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఈ మేరకు ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం ఈ సమావేశం ప్రధాన అజెండా కాగా, దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి. … మచిలీపట్నం, ఆంధ్రప్రభ : బైపాస్ రోడ్
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట ప్రెస్
జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట ప్రెస్
ఎన్నికల హామీకే పరిమితమైన 9 గంటల విద్యుత్తు
ఎన్నికల హామీకే పరిమితమైన 9 గంటల విద్యుత్తు వ్యవసాయానికి 7 గంటల మాత్రమే
జాతీయ భద్రత, పరిశోధనలకు కీలక ఒప్పందం…
జాతీయ భద్రత, పరిశోధనలకు కీలక ఒప్పందం… ఏర్పేడు, ఆంధ్రప్రభ : దేశ రక్షణ,
వారసిగూడలో కల్తీ చికెన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ను విక్రయిస్తున్న ముషీరాబాద్లోని ఒక చికెన్ సెంటర్పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ బాపూజీ నగర్లోని 'ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్' (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్ను స్థానిక ప్రజలకు మరియు చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో వారసిగూడ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. రామచంద్ర రెడ్డి తన సిబ్బంది మరియు స్వతంత్ర సాక్షులతో కలిసి సదరు చికెన్ సెంటర్పై ఆకస్మిక దాడి నిర్వహించారు. తనిఖీ సమయంలో సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. మానవ వినియోగానికి పనికిరాని ఈ కుళ్లిన మాంసాన్ని నిందితుడు తెలిసి కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. సికింద్రాబాద్ జోన్ డిసిపి శ్రీమతి కె. రక్షిత కృష్ణమూర్తి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, చిలకలగూడ ఏసిపి శ్రీ కె. శశాంక్ రెడ్డి గారి పర్యవేక్షణలో వారసిగూడ ఇన్స్పెక్టర్ శ్రీ జి. రాజేందర్ గౌడ్, ఎస్.ఐ శ్రీ కె. రామచంద్ర రెడ్డి మరియు సిబ్బంది ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు.
17marchassembly |సీతక్క సవాల్… ఆరోపణలకు కౌంటర్
17marchassembly |సీతక్క సవాల్… ఆరోపణలకు కౌంటర్ 17marchassembly | సీతక్క ఘాటు వ్యాఖ్యలు…
సొంతిల్లు కల నెరవేర్చిన ప్రభుత్వం…
సొంతిల్లు కల నెరవేర్చిన ప్రభుత్వం… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్
Nara Lokesh’s Surprise School Visit Sends Strong Message on Student Welfare
In a move that caught officials off guard, Andhra Pradesh Education Minister Nara Lokesh carried out a surprise inspection at a government school in Mylavaram. The visit came shortly after the inauguration of a new office at Mayuri Tech Park in Mangalagiri. While the convoy was expected to follow a fixed route, Lokesh suddenly diverted […] The post Nara Lokesh’s Surprise School Visit Sends Strong Message on Student Welfare appeared first on Telugu360 .
కాంగ్రెస్ పార్టీకి షాక్.. రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మంగళవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ కిషన్ గుజ్జర్ తన పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారు. హర్యానా కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న గుజ్జర్.. పార్టీలోని అన్ని బాధ్యతల నుండి తనను విముక్తి చేయాలని కోరుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజీనామా అనంతరం గుజ్జర్ మాట్లాడుతూ.. పార్టీ నాయకురాలు శైలి చౌదరిని అప్రతిష్టపాలు చేయడానికి 'పెద్ద కుట్ర' జరుగుతోందని ఆరోపించారు. శైలి చౌదరి ఒక విధేయ కార్యకర్త. ఆమెను ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని గుజ్జర్ అన్నారు. తప్పుడు ప్రచారం, అంతర్గత దాడికి నిరసనగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. హర్యానాలో మార్చి 16, 2026న జరిగిన నాటకీయ రాజ్యసభ ఎన్నికల నుండి ఈ వివాదం మొదలైంది. ఫిరాయింపుల ప్రయత్నాలను నివారించడానికి కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్కు తరలించింది. అయినప్పటికీ పోలింగ్ లో క్రాస్-ఓటింగ్ జరిగిందని.. బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు అనుమానిస్తున్న వారిలో చౌదరి పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది.
Two Arrested for Online Abuse Targeting Renu Desai
Cyberabad cybercrime police have arrested two men for posting abusive and obscene comments against actress and filmmaker Renu Desai on social media. The arrests follow her complaint that several accounts were harassing her with vulgar language and false narratives. She said the abuse increased after she spoke about social issues, including her views on street […] The post Two Arrested for Online Abuse Targeting Renu Desai appeared first on Telugu360 .
మహిళలంటే కెటిఆర్కు చిన్నచూపు: మంత్రి సీతక్క
మహిళలంటే మాజీ మంత్రి కెటిఆర్కు చిన్నచూపని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిండు సభలో మహిళా సంక్షేమంపై ప్రతిపక్ష నేత కెటిఆర్ ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళా రుణాలపై సభలో చర్చ జరిగిన సందర్భంగా కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కుటుంబ సభ్యులైనా, బయట మహిళలైనా ఎదగనీయాలంటూ కెటిఆర్కు మంత్రి సీతక్క చురకలంటించారు. గులాబీ పార్టీలో డ్రగ్స్ తీసుకునే నాయకులు ఉన్నారని, దానిపై ఆయన ముందు స్పందించాలని సీతక్క సవాల్ విసిరారు. యువతకు ఆ పార్టీ నేతలు ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. ముందుగా గులాబీ పార్టీ నేతలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సభలో ప్రశ్నించారు. ఫ్రీ బస్సుపై కెటిఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. కెటిఆర్ సత్యదూరమైన మాటలు, ఎగతాళి మాటలు బంద్ చేయాలని మంత్రి సీతక్క సూచించారు.
భూదాన్ మోసగాళ్లపై కఠిన చర్యలు… పీడీ యాక్ట్కు సిద్ధం
భూదాన్ మోసగాళ్లపై కఠిన చర్యలు… పీడీ యాక్ట్కు సిద్ధం బాధితులకు ఏసీపీ భరోసా…
పరుష పదజాలం–నిర్లక్ష్యం… ప్రజలకు నరకంగా టౌన్ ప్లానింగ్ఖమ్మం కార్పొరేషన్లో గందరగోళ వాతావరణంకింది స్థాయి
రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం...మరో మూడు రోజులు వర్ష సూచన
కర్ణాటక, తమిళనాడు మీదుగా కొరిమన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురువడంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మార్చి మొదటి వారం నుంచి విపరీతమయిన ఎండ, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు వర్షం వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం కలిగింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సైతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో సైతం పలు ప్రాంతాల్లో వరుణుడు పలుకరించడంతో వాతావరణం చల్లబడింది. ద్రోణి ప్రభావంతో వర్షం కంటే అధికంగా గంటకు సుమారు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బుధవారం అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు వీస్తాయని, రైతులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆఫ్ఘాన్పై దాడి పిరికిపంద చర్య..పాక్పై భారత్ ఆగ్రహం
అఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అత్యంత అమానుష ఘటనగా అభివర్ణించింది. ఇది పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ జరిపిన వాయుదాడిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని అందులో పేర్కొంది. ‘ఇది పిరికిపంద చర్య. దుర్మార్గమైన హింసాత్మక చర్య. భారీ సంఖ్యలో పౌరులు మరణించారు. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడులకు పాల్పడటం మరింత దారుణమని, నమ్మకాలు, చట్టాలు, నైతికత లేకుండా ఆసుపత్రులు, రోగులపై దాడి చేశారని విమర్శించింది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలని భారత్ సూచించింది. మృతులు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ విషాద సమయంలో అఫ్ఘాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నామని, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
Motorcycle |లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి…
Motorcycle | లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి… Motorcycle
sensex76000 | పైపైకి ఎగబాకుతూ… sensex76000 | భారీ పతనం తర్వాత రికవరీమెటల్,
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలోని ఒక షాపులో సిలిండర్ దొంగలించిన వ్యక్తి#Khammam
Hyderabad : కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కోటి రూపాయల దోపిడీని పోలీసులు గంటల వ్యవధితో ఛేదించారు
సివిల్స్ విజేత రాముకు కలెక్టర్ ఘన సత్కారం
సివిల్స్ విజేత రాముకు కలెక్టర్ ఘన సత్కారం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ
అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది:రజినీకాంత్
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని, ఆయనను బెదిరించిందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఆరోపణలపై డీఎంకేతో పాటు రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగునున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రజనీకాంత్ తాజాగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు. ఆయన వ్యాఖ్యలు సత్యదూరం అని, కాలమే ఇలాంటి వాటికి సమాదానం చెబుతుందనారు. ‘టీవీకే పార్టీ నేతగా ఉన్న ఆదవ్ ఆర్జున ఇటీవల నాపై ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన పూర్తిగా సత్యదూరం, అవాస్తవం. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిలిచిన తమిళనాడు విపక్ష నేత ఎడప్పాడి కె.పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్.మురుగున్, మీడియా మిత్రులు, నా అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అని పేర్కొన్నారు.
జీజీహెచ్లో యూత్ టైం బ్యాంక్..
జీజీహెచ్లో యూత్ టైం బ్యాంక్.. వినూత్న కార్యక్రమాల ద్వారా సేవాభావం.సేవలను ప్రారంభించిన జిల్లా
ప్రకృతి వ్యవసాయ అమలు పరిశీలన… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రైతు
టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు పై వెంటనే చర్యలు చేపట్టాలి…
టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు పై వెంటనే చర్యలు చేపట్టాలి… చంద్ర బాబు
రూ.32 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ అభివృద్ధి…
రూ.32 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ అభివృద్ధి… రిటైనింగ్ వాల్ నిర్మాణం
కెటిఆర్ తీరును తప్పు బట్టిన మంత్రి పొంగులేటి
కెటిఆర్ వైఖరిని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తప్పుబట్టారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ను అవమానించడం దురదృష్టకరమని మంత్రి పొంగులేటి కెటిఆర్పై మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం కెటిఆర్ అహంకారానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. గతంలో పార్టీ మారడాన్ని ప్రోత్సహించిన చరిత్ర మీది కాదా అని కెటిఆర్ను మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. బిఆర్ఎస్ నిజాయితీగా ఉంటే ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతుందని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. సీనియర్ నాయకులు కట్టుకథలు అల్లుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు.
Venky Atluri’s Digital Debut on Cards
Venky Atluri made an impressive debut with Tholi Prema but he delivered duds like Mr. Majnu and Rang De. Films like Sir and Lucky Baskhar earned huge respect for Venky Atluri as a director. He is currently working on Vishwanath and Sons featuring Suriya in the lead role. The film is aimed for June release […] The post Venky Atluri’s Digital Debut on Cards appeared first on Telugu360 .
ర్యాగింగ్కు నో చెప్పండి.. ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యాసంస్థల్లో ర్యాగింగ్కు తావులేదని,
Isreal Target 2 Heads : ఇరాన్ అగ్ర నేతలు ఖతం Andhra Prabha Detail Report
Isreal Target 2 Heads : ఇరాన్ అగ్ర నేతలు ఖతం Andhra
యూనివర్సిటీలో అవినీతిపై విద్యార్థి సంఘాల ఆందోళన
యూనివర్సిటీలో అవినీతిపై విద్యార్థి సంఘాల ఆందోళన అవినీతి బకాసురుడి దిష్టిబొమ్మ దహనం కర్నూలు,
నిషేధిత గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లాలో మాదకద్రవ్యాలపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా
All Hurdles Cleared for Dhurandhar: The Revenge
Dhurandhar: The Revenge is all set for a record release with evening paid premieres from March 18th. The film is said to be 3 hours and 50 minutes long. Two paid premieres will be screened from tomorrow evening and the advance bookings for the film are fantastic. The makers are left tensed as the Censor […] The post All Hurdles Cleared for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .
ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు
ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పల్లెల్లో ఆరోగ్య
సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పానాపటార్
ముగిసిన గోవింద్ నాయక్ అంతక్రియలు
ముగిసిన గోవింద్ నాయక్ అంతక్రియలు దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే
పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యం…
పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యం… విజయవాడ, ఆంధ్రప్రభ : దేశంలో
Sitakka |కేటీఆర్ రాజీనామా చేయాలి
Sitakka | కేటీఆర్ రాజీనామా చేయాలి Sitakka | హైదరాబాద్, ఆంధ్రప్రభ :
Little Hearts success gave me hope to make YOUTH: Ken Karunaas
The film Youth, directed by Ken Karunaas, is all set for a grand Telugu release on the 26th. With a lively ensemble cast including Suraj Venjaramoodu and Devadarshini Chetan, the film promises a youthful and entertaining experience. The film is getting released in Telugu by Vineeth and Sandeep under E2C Talkies, the movie has already […] The post Little Hearts success gave me hope to make YOUTH: Ken Karunaas appeared first on Telugu360 .
Video : Art Director Anand Sai Exclusive Interview
The post Video : Art Director Anand Sai Exclusive Interview appeared first on Telugu360 .
Rākāsā Telugu States Rights Bagged by Sri Lakshmi Narasimha Movie Makers in a Big-Ticket Deal
The upcoming fantasy-comedy entertainer Rākāsā has registered a major business milestone ahead of its theatrical release. The Telugu States theatrical rights of the film have been bagged by Sri Lakshmi Narasimha Movie Makers. The development marks a significant step in the film’s release journey. The deal further strengthens the film’s expanding distribution network as the […] The post Rākāsā Telugu States Rights Bagged by Sri Lakshmi Narasimha Movie Makers in a Big-Ticket Deal appeared first on Telugu360 .
పశ్చిమ్ బెంగాల్ ఎన్నికలు.. సిఎం మమత vs సువేందు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) మంగళవారం 291 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కంచుకోట అయిన భబానీపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 52 మంది మహిళా అభ్యర్థులను టిఎంసి బరిలోకి దింపుతోంది. అలాగే, SC/ST వర్గాలకు చెందిన 95 మంది అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఇక, అనిత్ థాపా నేతృత్వంలోని 'భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా' (BGPM) కోసం TMC మూడు స్థానాలు.. కాలింపాంగ్, డార్జిలింగ్, కుర్సియోంగ్ లను కేటాయించింది. కాగా, సిఎం మమతాపై, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి పోటీ చేయనున్నారు. సోమవారం 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బిజెపి ప్రకటించింది.సువేందు అధికారి నందిగ్రామ్ నుండి కూడా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన నందిగ్రామ్లోనే మమతా బెనర్జీని ఓడించారు. ఈసారి నందిగ్రామ్లో ఆయనపై TMC తరపున పవిత్ర కర్ పోటీ చేయనున్నారు.
BRS : ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పాఠాలు నేర్చుకోదా?
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అలసత్వంతో తనకు తాను చిక్కులు కొని తెచ్చుకుంటోంది.
Advance Sales Surge For Pawan Kalyan’s UBS
Power Star Pawan Kalyan’s pakka entertainer Ustaad Bhagat Singh will be hitting theatres on March 19th, and expectations are naturally sky-high. Advance bookings have now opened across regions, and early trends indicate a sharp rise in ticket sales. The buzz generated by the film’s songs, teaser, and the trailer has clearly translated into strong audience […] The post Advance Sales Surge For Pawan Kalyan’s UBS appeared first on Telugu360 .
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో రైతన్న మీ కోసం, రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న సహాయం గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6000 […] The post రైతులకు అండగా కూటమి ప్రభుత్వం appeared first on Visalaandhra .
కార్యకర్తలకు శిక్షణ తరగతులు.. హాజరైన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి
రేణుదేశాయ్ పై ట్రోల్స్... ఇద్దరి అరెస్ట్
రేణుదేశాయ్ ను సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్ చేస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులకు ఆరోగ్య శిబిరం.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల
ఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన కొలతలతో పనులు చేస్తే సరైన వేతనం పొందవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పని దినాలను 150 రోజులకు పెంచిందని గుర్తు చేశారు. కావున గ్రామంలోని కూలీలు అందరూ వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ […] The post ఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు appeared first on Visalaandhra .
పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి
పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులు
కాలమే సమాధానం చెబుతుంది.. టీవీకే పార్టీ నేత వ్యాఖ్యలపై రజనీకాంత్ ఫైర్
చెన్నై: నటుడు విజయ్ TVK పార్టీకి చెందిన నాయకుడు ఆధవ్ అర్జున్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా లెటర్ విడుదల చేశారు. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ చివరికి అదే సమాధానం ఇస్తుంది అని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచి, టివికె నేత వ్యాఖ్యలను ఖండించిన రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, టివికె నాయకుడు అర్జున్ మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించినప్పుడు DMK పార్టీ ఆయన్ను బెదిరించిందని.. అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అర్జున్ వ్యాఖ్యలపై రజనీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలనిరజనీకాంత్ అభిమాన సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Telangana |భార్య పరిస్థితి విషమం…
Telangana | భార్య పరిస్థితి విషమం… Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక
‘‘ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు’’ అంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని తెలిపారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని ఈ మేరకు ఆయన […] The post ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక appeared first on Visalaandhra .
Ys Sharmila : వైఎస్ జగన్ కు షర్మిల మరో సవాల్
వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ కు మరో సవాల్ విసిరారు
Bracelet |భారతీయ పురుషుల రోజువారీ శైలికి స్ఫూర్తి…
Bracelet | భారతీయ పురుషుల రోజువారీ శైలికి స్ఫూర్తి… Bracelet | హైదరాబాద్,

21 C