SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

19    C
... ...View News by News Source

వాణిజ్య యుద్ధంలో ఎవరిది పైచేయి?

భారత్- అమెరికా మధ్య గత కొన్ని నెలలుగా సన్నగిల్లుతున్న ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యేలా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ముందడుగు పడటం హర్షించదగిన పరిణామం. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఆ దేశం ఉక్రెయిన్‌పై యుద్ధం సాగించడానికి పరోక్షంగా సాయపడుతోందన్న అక్కసుతో భారత్‌పై అధిక సుంకాలు విధించిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తూ, తాము విధించిన ప్రతీకార సుంకాలను తగ్గించుకుంటున్నామంటూ తాజాగా చేసిన ప్రకటన ఒక విధంగా భారత్‌కు కాస్త ఊరట కలిగించే అంశమే. ఒకవైపు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకుంటూనే, మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలలో దృఢమైన వైఖరిని కనబరిచినందుకు ఇది భారత్‌కు దక్కిన విజయంగా అభివర్ణించవచ్చు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకూ భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలు ఇకపై 18 శాతానికి తగ్గుతాయి. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన 25 శాతం అదనపు సుంకాలను సైతం ఉపసంహరించుకుంటామన్న ట్రంప్ హామీతో, ఇండో -పసిఫిక్ ప్రాంతంలో అమెరికా అతి తక్కువ పన్నులు విధించే దేశాల జాబితాలో ఇండియా చేరినట్లయింది. పదిరోజుల క్రితం భారత్- ఐరోపా యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక విధంగా ట్రంప్‌ను పునరాలోచనలోకి నెట్టిందని చెప్పవచ్చు. ప్రపంచ జిడిపిలో 25 శాతానికి, వాణిజ్యంలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ గా దేశదేశాలన్నీ ప్రస్తుతిస్తున్నాయి. ఇది అమలులోకి వస్తే అమెరికా అధిక సుంకాల ప్రభావం భారత్‌పై అంతగా ఉండకపోవచ్చు. అమెరికా సుంకాల వల్ల భారత్‌కు కలిగే నష్టాలను భర్తీ చేసే స్థాయిలో ఈ ఒప్పందం ఉండటమే ఇందుకు కారణం. పైపెచ్చు మరో రెండు నెలల్లో కెనడాతో భారత్ కుదుర్చుకోబోయే పాతిక వేల కోట్ల రూపాయల విలువైన యురేనియం ఒప్పందం సైతం ట్రంప్‌ను కంగారు పెట్టి ఉండవచ్చు. ఇవి చాలవన్నట్లు పలు దక్షిణ అమెరికా దేశాలతోనూ భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇవన్నీ కార్యరూపం దాల్చితే, భారత్‌పై తాము విధించిన అధిక సుంకాల ప్రభావం ఉండకపోగా, ఆసియాలో కీలక మిత్రదేశమైన భారత్.. అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఆసియాలో చైనా ప్రాబల్యానికి ముకుతాడు వేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించిన మీదట ట్రంప్ దిగిరాక తప్పలేదు. ఐరోపా యూనియన్‌తో చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా తిరుగులేని దౌత్యనీతిని కనబరచిన భారత్, అగ్రరాజ్యంతో కోరి తగవు కొనితెచ్చుకోకుండా చివరివరకూ సంయమనం పాటించింది. రష్యా చమురు కొనుగోలు చేయొద్దన్న అమెరికా హూంకరింపులకు తలవంచినట్లే వంచిన భారత్, ఇప్పుడు వెనెజువెలా చమురును చౌకగా కొనుగోలు చేసేందుకు అమెరికాతో బేరసారాలు ఆడబోతోంది. వెనెజువెలాను తన గుప్పిట్లో పెట్టుకున్న అమెరికాకు ఆ దేశ చమురును విక్రయించడం తలనొప్పిగా మారింది. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వెనెజువెలా చమురును భారత్‌కు విక్రయించవచ్చన్నది ట్రంప్ ఆలోచన కాగా, వీలైనంత చౌకగా కొనుగోలు చేయాలన్నది భారత్ ఎత్తుగడ. అయితే తాజా వాణిజ్య ఒప్పందం పూర్తిగా భారత్‌కు అనుకూలమా అంటే కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ ఒప్పందంలోని వివరాలేమీ ఇంకా వెల్లడికాకపోయినా, అమెరికా దిగుమతులపై సుంకాలేమీ విధించకూడదన్న షరతుకు భారత్ అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించడం, దీనిపై ప్రధాని మోడీ స్పందించకపోవడం కొంతమేరకు ఆందోళన కలిగించే అంశం. ఏటా 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా ట్రంప్ చెబుతున్నారు. అదే జరిగితే, వ్యవసాయం, ఇంధనం, టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో దేశీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యం గా అమెరికా వ్యవసాయోత్పత్తులు ముంచెత్తితే గ్రామీణ భారతం అతలాకుతలమయ్యే ప్రమాదం లేకపోలేదు. దేశ జనాభాలో 50% ప్రజానీకానికి వ్యవసాయమే జీవనాధారమనే సంగతి గమనార్హం. తన దౌత్యనీతి ద్వారా వాణిజ్య ఒప్పందానికి అమెరికా దిగివచ్చేలా చేయడం భారత్ విజయమయితే, తమ ఉత్పత్తులపై సుంకాలు విధించకుండా భారత్ తలవొగ్గేలా చేయడం అమెరికా సాధించిన విజయమని చెప్పాలి.  

మన తెలంగాణ 4 Feb 2026 12:50 am

బుధవారం రాశి ఫలాలు (04-02-2026)

మేషం ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృషభం శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురి కావల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. మిధునం నూతన వస్తు, వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కర్కాటకం ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సింహం ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కన్య ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. తుల నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. వృశ్చికం ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి. ధనస్సు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. మకరం చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయమై చెయ్యను పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు. కుంభం బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. మీనం ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు. వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  

మన తెలంగాణ 4 Feb 2026 12:20 am

డబ్లూపిఎల్ 2026.. ఫైనల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్

వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ టీమ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ బేథ్ మూనీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 6 ఫోర్లతో 62 పరుగులు సాధించింది. జార్జియా వరెహమ్ (35) తనవంతు పాత్ర పోషించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 15.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఢిల్లీకి ఓపెనర్లు లిజెల్లి లీ, షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని అందించారు.లీ 24 బంతుల్లోనే 43, షఫాలీ 21 బంతుల్లో 31 పరుగుల చేశారు. లౌరా వాల్వర్డ్ 32 (నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్ 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. గురువారం జరిగే ఫైనల్లో బెంగళూరుతో ఢిల్లీ తలపడుతుంది.

మన తెలంగాణ 3 Feb 2026 11:54 pm

ఫైనల్లో ఇంగ్లండ్

 పురుషుల అండర్19 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా యువ జట్టును ఓడించి తుది పోరుకు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన థామస్ 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 110 పరుగులు చేశాడు. కాలెబ్ ఫాల్కనర్ (40), ఫర్హాన్ అహ్మద్ (28), జోసెఫ్ (25), మేయ్స్ (24) పరుగులు చేసి తమవంతు సహకారం అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఒలివర్ పీక్ అద్భుత సెంచరీ సాధించినా ఫలితంలేకుండా పోయింది. దూకుడుగా ఆడిన ఒలివర్ 88 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. సమన్వయంతో ఆడిన ఓపెనర్ నితేశ్ శామ్యూల్ (47) పరుగులు సాధించాడు. మిగతా వారిలో ఆర్యన్ శర్మ (34) ఒక్కడే కాస్త రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మోర్గాన్, జేమ్స్, అల్బర్ట్ తలో రెండేసివికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 3 Feb 2026 11:39 pm

రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: కల్వకుంట్ల కవిత

 మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థిని అశ్మిత పాము కాటుకు గురవడం కలచివేసిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో నిత్యం కలుషిత ఆహారం, విద్యార్థుల ఆత్మహత్యలు, పాము కాట్లు వంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మొద్దు నిద్ర వీడి అస్తవ్యస్తంగా మారిన గురుకులాలను, సంక్షేమ హాస్టళ్లను గాడినపెట్టాలని, పాము కాటుకు గురైన అస్మితకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 3 Feb 2026 11:35 pm

రెండు విమానాలకు తప్పిన పెను ప్రమాదం..

ముంబయి: తృటిలో విమాన ప్రమాదాలు తప్పిపోయాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా, ఇండిగో విమానాల రెక్కలు ఒకదానికొకటి తాకాయి. ఈ సంఘటనను రెండు విమానయాన సంస్థలు ధృవీకరించాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ అపాయం కలగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించాయి. మంగళవారం ముంబై నుండి కోయంబత్తూరుకు వెళ్లాల్సిన ఎఐ2732 విమానం టేకాఫ్ కావడానికి ముందు టాక్సీవేలో వేచి ఉండగా ఇండిగోకు చెందిన విమానాన్ని తాకడంతో ఆలస్యం అయిందని, రెండు విమానాల రెక్కలు తాకడంతో తమ విమానం రెక్క దెబ్బతిందని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా, తదుపరి సాంకేతిక పరీక్షల కోసం విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగిపోయారు. వీలైనంత త్వరగా వారిని వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 

మన తెలంగాణ 3 Feb 2026 11:27 pm

సముద్రంలో కుటుంబాన్ని కాపాడిన బాలుడి సాహసం..

ఆస్ట్రేలియాకు చెందిన 13 ఏళ్ల ఆస్టిన్ ఆపిల్‌బీ , సముద్రంలో కొట్టుకుపోతున్న తన తల్లి, ఇద్దరు తోబుట్టువులను రక్షించడానికి ఎంతో సాహసం చేయడం సంచలనం కలిగించింది. రాష్ట్ర రాజధాని పెర్త్ నుంచి వచ్చిన ఆస్టిన్ అతని తల్లి జోనె ఆపిల్‌బీ (47), తమ్ముడు బియయు (12), చెల్లి గ్రేస్ (8) కలిసి చిన్న పడవలు(కయాక్), ఫెడల్‌బోర్డ్‌ల సాయంతో సముద్రం లో విహారానికి వెళ్లారు. అంతలోనే సముద్రంలో వాతావరణం మారిపోయింది. వారంతా దూరంగా తీరానికి కొట్టుకుపోయారు. సాయం కోసం తల్లి సూచనతో కయాక్‌పై ఆస్టిన్ బయలుదేరినా, కయాక్‌లో నీరు చేరింది. ఈతకు లైఫ్‌జాకెట్ కూడా పనికి రాకపోవడంతో దాన్ని తీసివేశాడు. భారీ అలల మధ్య నాలుగు కిలోమీటర్ల దూరం ఈది ఒడ్డుకు చేరుకున్నాడు. అధికారులకు సమాచారం ఇవ్వగా వారు హెలికాప్టర్‌తో గాలింపు మొదలెట్టారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారులు తల్లిని, ఇద్దరు పిల్లలను గుర్తించారు. ఆ సమయంలో వారు తీరానికి 14 కిలో మీటర్ల దూరంలో పెడల్ బోర్డులను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. బాలుడి ధైర్యసాహసాలను అధికారులు ప్రశంసించారు. నలుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలను వదిలేసి తాను వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఆస్టిన్‌ను ఒడ్డుకు పంపడం తాను తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయమని తల్లి జోవాన్ మంగళవారం తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు మొదట్లో తాము ధైర్యంగానే ఉన్నా చీకటవుతున్న కొద్దీ అలల ఉధృతి పెరగడంతో భయంతో చలితో వణికిపోయామని ఆమె చెప్పారు. 

మన తెలంగాణ 3 Feb 2026 10:49 pm

డీఆర్‌డీవో మరో ఘనత..'ఎస్‌ఎఫ్‌డీఆర్' పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ : దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివొ)మంగళవారం ఒడిశా తీరంలో చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (ఎస్‌ఎఫ్‌డిఆర్) టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయవంతమైన ప్రదర్శనతో భారతదేశం ఈ సాంకేతికతను కలిగి ఉన్న ఎంపికైన దేశాల సమూహంలో చేరింది. ఇది దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల అభివృద్ధిని అనుమతిస్తుంది. ప్రత్యర్థులపై వ్యూహాత్మక విజయాన్ని అందిస్తుంది. ఈ పరీక్షలో భాగంగా నాజిల్ లెస్ బూస్టర్ , సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ మోటార్,ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఐటీఆర్ ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ పరీక్ష విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఎస్‌ఎఫ్‌డిఆర్ ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం కావడంతో శత్రుదేశాల లక్షాలను అత్యంత దూరం నుంచే అడ్డుకోగల క్షిపణుల తయారీ దిశగా భారత్ ముందడుగు వేసినట్టయింది. ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ , హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ(హెచ్‌ఇఎంఆర్‌ఎల్), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ), ఐటీఆర్ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. ఎస్‌ఎఫ్‌డిఆర్ సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవోను అభినందించారు. ఈ పరీక్షలో పాల్గొన్న అన్ని బృందాలను రక్షణ పరిశోధన , అభివృద్ధి శాఖ కార్యదర్శి డిఆర్‌డివో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు. 

మన తెలంగాణ 3 Feb 2026 10:47 pm

మాజీ ఎంఎల్ఎ పాషాఖాద్రి మృతి

మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి(71) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఖాద్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతిచెందారు. అహ్మద్ పాషా ఖాద్రి ఎంఐఎం పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మూడు సార్లు చార్మినార్ నియోజకవర్గం నుంచి, ఒకసారి యాకత్‌పుర నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఖాద్రి ఎంఐఎం అధినేత దివంగత సుల్తాన్ సలావుద్దిన్ ఓవైసీ, ఎంపి అసదుద్దిన్‌లకు అత్యంత సన్నిహితుడు. మాజీ ఎమ్మెల్యే ఖాద్రి మృతికి పలువురు సంతాపం తెలిపారు. 

మన తెలంగాణ 3 Feb 2026 10:39 pm

పారిశుద్ధ కార్మికురాలికి సూపర్ స్టార్ బహుమానం

చెన్నై: నిజాయితీకి నిలువుటద్దం అనిపించుకున్న పారిశుద్ధ కార్మికురాలు పద్మకు సూపర్‌స్టార్ రజనీకాంత్ బంగారు గొలుసును బహుమతిగా ఇవ్వడం అందరినీ ఆకట్టుకొంటోంది. పద్మ తన కుటుంబీకులతో కలిసి మంగళవారం పొయస్ గార్డెన్ లోని రజనీ కాంత్ నివాసానికి వెళ్లి ఈ బహుమతిని అందుకున్నారు. శాలువాతోపాటు, ఓం అనే డాలరుతో ఉన్న రెండు సవరల బంగారు హారాన్ని ఆమెకు బహూకరించి సత్కరించారు. ఇటీవల రోడ్డుపై తనకు లభించిన రూ.45 లక్షల విలువైన బంగారాన్ని పారిశుద్ధ కార్మికురాలు పద్మ అసలైన యజమానికి పోలీసుల ద్వారా అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ తాను సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని భావోద్వేగంతో అన్నారు. పద్మతోపాటు ఇద్దరు కుమార్తెలు, భర్త వచ్చారు. సద్మ నిజాయితీని అభినందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవలనే పద్మ నిజాయితీని ప్రశంసిస్తూ సత్కరించి రూ. లక్ష చెక్కును బహుమతిగా అందజేశారు. టి నగర్‌లో పారిశుద్ధ విధులు నిర్వహిస్తుండగా పద్మకు రోడ్డుపై ఒక సంచి కనిపించింది. అది విప్పి చూడగా అందులో 45 సవరల బంగారు ఆభరణాలు కనిపించాయి. పై అధికారులకు ఈ సంగతి తెలియజేసి ఆ ఆభరణాల సంచిని పాండీ బజార్‌పోలీసులకు అప్పగించింది. వారు దర్యాప్తు చేసి అసలు యజమానికి ఆ నగలు అప్పగించగలిగారు. పద్మకు రజనీకాంత్ సత్కరించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మన తెలంగాణ 3 Feb 2026 10:28 pm

మోహన్‌బాబు యూనివర్సిటీలో కిడ్నాప్ కలకలం

తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారంపై తిరుపతి పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం యూనివర్సిటీలో అధిక ఫీజులపై నిరసన తెలపడానికి విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినో ద్‌లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు వాహనంలో బలవంతంగా ఎక్కించి, కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి..కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసిఅడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్‌కు పాల్ప డినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. విద్యార్థి సంఘ నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదుతో... విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు యూనివర్సిటీకి చెందిన వీఆర్వో సతీష్‌తో పా టు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్ల డిం చారు. నిందితులపై 191(2), 115(2), 140(1), 126(2), 351(2), r/w 190, 61(2) బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద (క్రైం నెంబర్: 23/2026)కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఎ1గా సతీష్, ఎ2గా మోహన్ బాబు, ఎ3గా మంచు విష్ణుబాబుపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితు లతో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతల ఆరోపణ మోహన్ బాబు యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే అమలు చేయా లని విద్యార్థి సంఘాలు గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తు న్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై ఎంబీయూ నుంచి ఎవరూ ఇంకా స్పందించలేదు.

మన తెలంగాణ 3 Feb 2026 10:12 pm

దేశానికి ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్: మంత్రి కిషన్ రెడ్డి

బీబీనగర్ మండల పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రిని అన్ని హంగులతో తీర్చిదిద్ధి యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుపనున్నట్లు కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిని మంగళవారం డైరెక్టర్ అమిత అగర్వాల్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆసుపత్రిలో కల్పిస్తున్న వైద్య సదుపాయాలు,భవన నిర్మాణ పనులు పురోగతిపై ఎయిమ్స్ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో ఎయిమ్స్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయామని ఆయన అన్నారు.గతంలో భవన నిర్మాణాలను ఇష్టానుసారంగా నిర్మించారని వాటిని రీ మార్కింగ్ చేసి మరల నిర్మాణ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణాలతోపాటు వైద్య విద్యార్థుల వసతి గృహాలు సరికొత్తగా నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 86% పనులు పూర్తయ్యాయని అత్యంత ప్రతిష్టాత్మకంగా 24 అంతస్థుల భవనాలను నిర్మించి వైద్య విద్యార్థుల వసతి గృహాలకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో 15 లక్షల మంది వైద్యసేవలు పొందారని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రక్కన ఆసుపత్రి నిర్మాణం జరుగుతూనే మరోపక్క వైద్య సేవలు అందిస్తూ రోజుకు 1800 మంది ఓపికి చికిత్స పొందే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యం కోసం వచ్చే పేషంట్లకు సౌకర్యాలను మరింత మెరుగుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతం సెమి రూరల్ కాకుండా సెమి అర్బన్ లా ఉంటుంది కాబట్టి పేషంట్లతో వచ్చే సహాయకులకు సరైన ఆకామినేషన్ అందుబాటులో లేదు కాబట్టి ప్రయివేట్ సంస్థలు ముందుకు వచ్చి భవనాలను నిర్మించి మెయింటైన్ చేస్తామంటే ప్రభుత్వం తరుపున ఆలోచిస్తామని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ లో ఇప్పటికే రెండు బ్యాచ్ లు ఎంబీబీఎస్ విద్యార్థులు పూర్తిస్థాయిలో ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని పట్టాలు తీసుకొని బయటకు వెళ్లారని బిఎస్సి నర్సింగ్,ఎమెస్సి నర్సింగ్ విద్యార్థులు సుమారు 800 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి హైద్రాబాద్ సిటి ఔటర్ రింగ్ రోడ్డు కు బయట రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికి ఎయిమ్స్ ఆసుపత్రి సౌకర్యంగా ఉపయోగకరంగ ఉంటుందని అయన అన్నారు.హైదరాబాద్ నగరంలో అనేక రకాల ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ రోజు గ్రామీణ ప్రాంతాల ప్రజానీకానికి హైదరాబాద్ నగరంతో సహా అందుబాటులో ఉండే విధంగా ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. త్వరలోనే బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి,బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి,బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, బీజేపీ బీబీనగర్ మండల అధ్యక్షులు భువనగిరి సదానంద్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి,కాసుల శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఇంజమూరి ప్రభాకర్, బోయపల్లి గోపాల్ రెడ్డి,పశులాది రాంచందర్,కొలను లక్ష్మ రెడ్డి, పొట్ట నవీన్, దాసమోని వెంకటేష్, పంజాల ప్రవీణ్, నక్కీర్తి శ్రీకాంత్, జల్లి సాయి దత్త,బాను తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 3 Feb 2026 10:08 pm

యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్న ఆనంద్ దేవరకొండ.. 'తక్షకుడు' టీజర్ రిలీజ్

బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ మరోసారి డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్, డైరెక్టర్ వినోద్ అనంతోజు కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తక్షకుడు అనే డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఫ్రెష్ గా, ఆసక్తికరంగా ఉంది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ను రూపొందించారు. అయితే, థియేటర్లలో కాకుడా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  లాపతా లేడీస్ మూవీ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు. కాగా, ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బేబి తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యతో కలిసి మరోసారి ఆనంద్ నటిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఎపిక్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మన తెలంగాణ 3 Feb 2026 9:50 pm

12th ward |ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తాను: కూరపాటి కవిత యాదగిరి

12th ward | ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తాను: కూరపాటి కవిత యాదగిరి

ప్రభ న్యూస్ 3 Feb 2026 9:44 pm

2students |మోహన్ బాబుపై కిడ్నాప్ కేసు నమోదు

2students | మోహన్ బాబుపై కిడ్నాప్ కేసు నమోదు 2students | మోహన్

ప్రభ న్యూస్ 3 Feb 2026 9:20 pm

రైతుల అంశంలో రాజీపడేది లేదు: కేంద్రం

ఆంక్షలు ఎత్తివేస్తే వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లు అమెరికాతో ట్రేడ్ డీల్‌పై విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టారని విపక్షం నుంచి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ సందర్భంగా రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భగం వాటిల్లలేదని, పైగా మరింత పరిరక్షించబడ్డాయని మంగళవారం ఒక ప్రకటలో కేంద్రం వెల్లడించింది. సున్నితమైన రంగాలైన వ్యవసాయం, డెయిరీ తదితర అనుబంధ రంగాలకు ఎలాంటి ఢోకా ఉండబోదని, సంప్రదింపుల సమయంలోనూ ఎలాంటి రాజీ కుదుర్చుకోలేదని తెలిపాయి. వివిధ రంగాల్లో ప్రభుత్వ స్థిరత్వానికి చర్చలు అద్దం పట్టాయని, ఇంధన రంగంలో కూడా భారత్ ప్రయోజనాలే కీలకంగా సంప్రదింపులు జరిగాయని ఆ ప్రకటనలో వెలువరించారు. వెనెజువెలా సహా ఆంక్షలు ఉన్న ఏ దేశం నుంచి కూడా చమురు కొనుగోళ్లు ఉండబోవని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఒకవేళ ఆంక్షలను ఎత్తివేసే తప్పకుండా చమురు దిగుమతి చేసుకుంటామని తెలిపింది.

మన తెలంగాణ 3 Feb 2026 8:56 pm

అక్టోబర్ నుంచి ‘దేవర 2’?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో-హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ’దేవర’ పార్ట్-1 పాన్-ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో పెరుగుతున్న వేళ ‘దేవర’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ఇటీవల ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర పార్ట్-2 షూట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభించడానికి కొరటాల శివ కసరత్తులు చేస్తున్నాడట. దేవర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ పార్ట్-2 కోసం మ్యూజిక్ పై వర్క్ చేస్తున్నాడట. అన్నట్టు కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ దేవర 1 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో అందుకుంటుందో చూడాలి.

మన తెలంగాణ 3 Feb 2026 8:38 pm

మణిపూర్ సిఎంగా ఖేమ్‌చంద్

మణిపూర్‌లో దాదాపు ఏడాదిగా అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనకు తెరపడింది. నూతన ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన ఖేమ్‌చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం అయ్యింది. మంగళవారంనాడు సమావేశమైన బిజెపి శాసనసభాపక్షం ఆయనను నాయకుడిగా ఎన్నుకుంది. డిప్యూటీ సిఎంగా మహిళ నాయకురాలు నెమ్చా కిప్జెన్‌కు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మణిపూర్ అసెంబ్లీ కాలపరమితి 2027వరకు ఉంది. అంటే కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వం ఏడాది పాటు పాలన సాగిస్తుంది. కొంత కాలంగా జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో గత ఏడాది బీరేన్ సింగ్ సిఎం పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. తాజాగా ఖేమ్‌చంద్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

మన తెలంగాణ 3 Feb 2026 8:35 pm

అనారోగ్యంతో మంథని మాజీ ఎంఎల్ఎ రాంరెడ్డి మృతి

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (80) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి. గ్రామస్థాయి నుండి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. 1994లో టిడిపి నుంచి రాంరెడ్డి మొదటిసారిగా మంథని నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికై 1999 వరకు పనిచేశారు. ప్రజా సమస్యలను తనవిగా భావించి పని చేశారు. రైతుల కష్టాలు, గ్రామీణ అభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. రామన్నగా పేరు తెచ్చుకున్న రాంరెడ్డి రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైంది. రాంరెడ్డికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. రాంరెడ్డి మృతి పట్ల పలువరు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు.

మన తెలంగాణ 3 Feb 2026 8:16 pm

after6months |మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్

after6months | మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్ after6months | మణిపూర్‌లో ముగియనున్న

ప్రభ న్యూస్ 3 Feb 2026 8:08 pm

Video : Actress DIVI VADTHYA Interview PROMO

The post Video : Actress DIVI VADTHYA Interview PROMO appeared first on Telugu360 .

తెలుగు 360 3 Feb 2026 8:07 pm

హన్మకొండ జూపార్క్‌లో తెల్లపులి మృతి

హన్మకొండ హంటర్ రోడ్డులోని జూలజికల్ పార్క్‌లో తెల్ల పులి(శరణ్) మంగళవారం తెల్లవారుజామున ఎక్లోజర్‌లో మృతి చెందింది. వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్‌తో తెల్ల పులి మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు. శరణ్ అంతక్రియలు మంగళవారం చేసినట్లు జూ పార్క్ పర్యవేక్షణ అధికారి తెలిపారు. శరణ్‌ను హైదరాబాద్ జూ పార్క్ నుండి జులైలో తీసుకువచ్చామని అన్నారు. జూ పార్కులో పులి సంరక్షణ సరిగ్గా లేకనే అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తుంది. కానీ జూ అధికారులు సిబ్బంది మాత్రం అనారోగ్యంతో గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారు.

మన తెలంగాణ 3 Feb 2026 8:06 pm

Venky Doubles his Remuneration

Victory Venkatesh has delivered super hits in his career and he is one of the most successful actors. Venkatesh is not very strict on his remuneration and he keeps his producers comfortable. The actor has been charging close to Rs 10 crores as remuneration for years. His last film Sankranthiki Vastunnam is a blockbuster hit […] The post Venky Doubles his Remuneration appeared first on Telugu360 .

తెలుగు 360 3 Feb 2026 7:59 pm

Nominations |మోత్కూర్ మున్సిపల్ బరిలో 49 మంది అభ్యర్థులు

Nominations | మోత్కూర్ మున్సిపల్ బరిలో 49 మంది అభ్యర్థులు Nominations |

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:57 pm

రైతుల రక్తాన్ని, దేశాన్ని మోడీ అమ్మకానికి పెట్టారు: రాహుల్ గాంధీ

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అకస్మాత్తుగా జరగడంపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒప్పందానికి సంబంధించిన సమగ్ర వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని, రైతుల రకాన్ని, వాళ్లు చిందించే చెమటను, దేశాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపణ చేశారు. తన ప్రాబల్యం ఎక్కడ దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారని మండిపడ్డారు. మంగళవారంనాడు పార్లమెంటు బయట రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ వణికిపోతున్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నాలుగు నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోడీ అనూహ్యంగా సంతకం చేశారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ట్రేడ్ డీల్ విషయంలో రాజీపడ్డారు. ఇంతవరకూ కాపడుకుంటూ వస్తున్న తన ఇమేజ్ ఇప్పుడు దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీపై అమెరికాలో కేసు ఉందని, నిజానికి ఒకరకంగా ఇది మోడీపై కేసు అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చాలా విషయాలున్నాయని, దానిని అమెరికా ఇప్పటికీ విడుదల చేయలేదని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. ఆ ఒత్తిడి కూడా ఉందని, ఒత్తిడికి కారణమవుతున్న రెండు పాయింట్లు ఇవేనని అన్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవరణే అంశాన్ని సైడ్ చేయడానికి ఇదో కొత్త డ్రామా అని అన్నారు. రైతులు ఇలాంటి ఒప్పందాలపై ఓ కన్నేయాలని, వాటిని అర్థం చేసుకోవాలన్నారు. 

మన తెలంగాణ 3 Feb 2026 7:56 pm

Reserve |ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు

Reserve | ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు Reserve | జన్నారం,

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:53 pm

భారత్ నుంచి మాకు సమాచారం లేదు

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ఆచితూచి స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారంనాడు స్పందించారు. తమకైతే ఈ అంశంలో భారత్‌న నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. భారత్‌తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తామని, అదే సమయంలో రష్యా-ఇండియా మధ్య కీలక రంగాల్లో అత్యంత లోతైన, విస్తృతమైన సహకారం కూడా ఏమాత్రం తక్కువ కాదన్నారు. భారత్ మాకు అత్యంత ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారీ డిస్కౌంట్‌తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కీలకంగా ఉంది. ఇది పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది. 

మన తెలంగాణ 3 Feb 2026 7:52 pm

supervisor |అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి,

supervisor | అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి, supervisor | చిట్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:46 pm

అమెరికాతో చర్చలకు ఇరాన్ సుముఖత

దుబాయ్ : ఇన్నాళ్లూ అమెరికాతో ఎలాంటి చర్చలకు ఇష్టపడని ఇరాన్ ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో అమెరికాతో న్యాయమైన రీతిలో సమాన స్థాయిలో చర్చలు జరిగేలా చూడాలని ఇరాన్ విదేశాంగ మంత్రిని ఆదేశించానని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మంగళవారం వెల్లడించారు. గతనెల ఇరాన్ దేశం అంతా ఆందోళనలతో అట్టుడికిన ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికాతో చర్చలకు ఇరాన్ సిద్ధం కావడం విశేషం. ఆందోళన సాగిస్తున్న ఇరాన్ ప్రజలను కొన్ని వారాల పాటు హెచ్చరిస్తూ వచ్చిన అధ్యక్షుడు ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో చర్చలకు సంకేతాలు అందించారు. అంతేకాదు ఇరాన్ సుప్రీం అయతుల్లా అలి ఖమేనీ కూడా ఈ విషయంలో తనకు మద్దతు ఇచ్చినట్టు మసూద్ వెల్లడించారు. ఇదివరకు ఖమేనీ చర్చలన్న ప్రసక్తి లేకుండా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా ఒప్పందానికి పెట్టిన డిమాండ్ల మేరకు ఎంతవరకు ఇరాన్ ఒక ఒప్పందానికి వస్తుందో వేచి చూడాల్సిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణుఒప్పందంపై ఇరాన్ దిగిరావాలన్న పట్టుదలతో ఉన్నారు. గత జూన్‌లో ఇరాన్ కు వ్యతిరేకంగా 12 రోజుల పాటు ఇజ్రాయెల్ యుద్ధం సాగించగా, ఇరాన్ లోని మూడు అణుస్థావరాలపై బాంబు దాడులకు ట్రంప్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మధ్యప్రాచ్య రీజియన్‌లో మిత్రదేశాలు అమెరికాతో ఇరాన్ చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ వెల్లడించారు. అయితే ఇరాన్ చర్చలకు సుముఖత చూపిస్తున్న విషయం అమెరికా ఇంకా నిర్ధారించవలసి ఉంది. 

మన తెలంగాణ 3 Feb 2026 7:46 pm

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని మల్లాపూర్ మండలంలోని ముగిలిపేట వద్ద చోటుచేసుకుంది. కొందరు వ్యవసాయ కూలీలు.. పసుపు కోతకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 3 Feb 2026 7:41 pm

Bypass road |రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

Bypass road | రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన… Bypass road

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:38 pm

హార్వర్డ్‌లో సిఎం కాస్ట్లీ చదువు..గురుకుల విద్యార్థులకు పాము కాట్లు

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోందని -మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా.. లేక విషసర్పాలకు ఆవాసాలా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా..? అని నిలదీశారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తున్న సిఎం గురుకులాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదు...చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడు అని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిశుభ్రత కారణంగా నేడు గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదని వాపోయారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తే...ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. తమ పిల్లలు గురుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా.. లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా..? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి... విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని కోరారు. అశ్మితకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షసాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 3 Feb 2026 7:33 pm

Teacher |తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీల‌న‌…

Teacher | తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీల‌న‌… Teacher |

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:33 pm

కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్న బిఆర్‌ఎస్: ఎంపి చామల

తమ పార్టీపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నోటిసు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయించడం దేనికని ఆయన ప్రశ్నించారు. విచారణకు పిలిస్తేనే ఇంత రాద్ధాంతమా? అని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. కెసిఆర్ జాతిపిత అంటూ కెటిఆర్, హరీష్ రావు పిట్టకథలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో రకంగా ప్రజలను మాయ చేసి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. తన కుటుంబంలో అందరూ సెటిల్ అయ్యారని, కుమారుడు కెటిఆర్ అమెరికాలో ఉన్నాడని, అమ్మాయి పెళ్ళి చేసానని, ఎవరికీ పదవుల మీద ఆశ లేదని ఉద్యమం సమయంలో కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎంపీ చామల విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచాచమని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఎంపీ చామల తెలిపారు.

మన తెలంగాణ 3 Feb 2026 7:28 pm

market |త‌గ్గేదెలా….

market | త‌గ్గేదెలా…. market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:25 pm

market |తగ్గేదేలా….

market | తగ్గేదేలా…. market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:25 pm

Collector |రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…

Collector | రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… Collector | ఆసిఫాబాద్,

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:21 pm

Tickets |మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల..

Tickets | మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల.. Tickets | మెదక్ ప్రతినిధి,

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:18 pm

30k Above |బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనం అయ్యాయి? ఇప్పుడు కొనవచ్చా?

30k Above | బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనం అయ్యాయి? ఇప్పుడు

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:14 pm

Funding |కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా

Funding | కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా Funding | నిర్మల్

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:14 pm

Electricity |విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్…

Electricity | విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్… Electricity

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:10 pm

ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ : భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాలు మంగళవారం రాజ్యసభలో డిమాండ్ చేశాయి. తరువాత వాకౌట్ చేశాయి. జీరో అవర్ పూర్తి కాగానే కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వాణిజ్య ఒప్పందం అంశాన్ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఈ సమాచారం వాషింగ్టన్ నుంచి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. సభలో విపక్షాలు అసమ్మతి తెలియజేయగానే సభా నాయకుడు జెపి నడ్డా భారత ఎగుమతులపై సుంకాలు తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారని, తరువాత ప్రధాని నరేంద్రతో కూడా ఆయన మాట్లాడారని వివరించారు. మంచి విషయాల్లో కూడా చెడుగా చూడడం ప్రారంభం కావడంతో విపక్షం అసమ్మతి బయటపడిందని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,సుమోటో ప్రకటనతో ప్రభుత్వం ముందుకు వస్తుందని సభకు హామీ ఇచ్చారు. కానీ ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, ఇది భారత కాంగ్రెస్, ఇండియా కూటమి బాధ్యతారాహిత్యమని నడ్డా విమర్శించారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తూ విపక్షం నినాదాలు కొనసాగిస్తుండడంపై చైర్మన్ సిపి రాధాక్రిష్ణన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ప్రకటన చేస్తామని చెప్పినప్పుడు వినాలని సూచించారు. అయినా సరే విపక్షాలు వెనక్కు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు చొచ్చుకుని వెళ్లారు. నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం ఈరోజే దీనిపై సుమోటో స్టేట్‌మెంట్ ఇస్తుందని దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీదీ రాజకీయం చేయడం వారికి ఆసక్తి అని, దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నదేనని నడ్డా విపక్షాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చకు దూరంగా ఉంటుందని దేశంలో వాతావరణం సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. “చర్చించడానికి ఎలాంటి అంశాలు లేని పార్టీ మీది. ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. ఒకవిధంగా దేశ వ్యతిరేక ప్రవర్తన ” అని నడ్డా విపక్షంపై ధ్వజమెత్తారు. టిఎంసి తప్ప మిగతా విపక్షాలన్నీ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాయి. టిఎంసి సభ్యుడు సాకేత్ గోఖలే కూడా సభలో కొంతసేపు కూర్చుని వాకౌట్ తరువాత బయటకు వెళ్లారు. “సర్‌” బాధిత కుటుంబాలపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తాము వేరేగా వాకౌట్ చేశామని టిఎంసి వెల్లడించింది. 

మన తెలంగాణ 3 Feb 2026 7:03 pm

Lift irrigation |ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు

Lift irrigation | ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు Lift irrigation |జూపాడు

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:02 pm

Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు

Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు Tax |కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:55 pm

Sharwa’s Biker Releasing On April 3rd

Charming Star Sharwa is set to shift gears once again, this time with his sports-driven emotional entertainer Biker. After the roaring success of Nari Nari Naduma Murari, the actor is riding into a new zone, and the team has confirmed the film’s arrival on April 3rd. This striking release poster that highlights Sharwa’s lean, athletic […] The post Sharwa’s Biker Releasing On April 3rd appeared first on Telugu360 .

తెలుగు 360 3 Feb 2026 6:50 pm

భారత్ చట్టాలను పాటించాల్సిందే.. లేదంటే దేశం విడిచి వెళ్లిపొండి

న్యూఢిల్లీ : ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. “ మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించము’ అని అమెరికాకు చెందిన మెటాను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాట్సాప్ 2021ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశం లోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్‌లో కనిపించాయన్నారు. ఇక దేశం లోని లక్షలాది మంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. కాగా, మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్‌లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు హెచ్చరికలు మెటాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రైవసీ పాలసీ 2021 జనవరిలో వాట్సప్ తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం యూజర్లు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని తొలుత హెచ్చరించింది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అభ్యంతరాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది.ఐటీ చట్టం లోని నిబంధనలకు ఈ కొత్త పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ పాలసీపై దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. 

మన తెలంగాణ 3 Feb 2026 6:49 pm

suspend |మోదీ ట్రంప్ కు ఎందుకు భయపడుతున్నారు?

suspend | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:44 pm

Drugs |డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలి….

Drugs | డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలి…. Drugs |

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:26 pm

రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారు: పీయూష్ గోయెల్

న్యూఢిల్లీ: భారత్‌పై గతంలో అమెరికా 50 శాతం సుంకాలు విధించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలపై గోయెల్ కౌంటర్ ఇచ్చారు. మెరైన్, సీఫుడ్, వస్త్ర ఎగుమతిదారులు సుంకాలు తగ్గాలని ఆశించారని తెలిపారు. ఇటీవల వరకు అమెరికా ఒప్పందం ఎప్పుడని విపక్ష నేతలు ప్రశ్నించారని అన్నారు. రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. 2011లో చైనాతో ఎఫ్‌టిఎ కుదుర్చుకునే పాపం రాహుల్ చేశారని గోయెల్ ధ్వజమెత్తారు. చైనాతో ఎఫ్‌టిఎ నుంచి భారత్‌ను మోదీ కాపాడారని తెలిపారు. వ్యవసాయం, డెయిరీ రంగాల్లో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని గోయెల్ అన్నారు. వ్యవసాయం, డెయిరీ రంగాలను ప్రధాని మోదీ అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు. భారత్ ఎదుగుదలను రాహుల్ గాంధీ ఎందుకు సహించట్లేదని ప్రశ్నించారు. ప్రతికూల ఆలోచనలతో దేశ ప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీకి వాస్తవాలు రుచించట్లేదని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 3 Feb 2026 6:26 pm

Jeevan Reddy |తీవ్ర ఆగ్రహం..

Jeevan Reddy | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నాపై కోపం ఉంటే

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:22 pm

Development |కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Development | కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు Development | కర్నూలు బ్యూరో,

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:17 pm

Rs. 100 crore |రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

Rs. 100 crore | రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు Rs. 100

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:12 pm

Bhimgal Town |బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా…

Bhimgal Town | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ చైర్మన్

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:10 pm

Atmospheric |వాతావరణ పర్యవేక్షణకు ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు

Atmospheric | వాతావరణ పర్యవేక్షణకు ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు Atmospheric | కర్నూలు

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:08 pm

TG |ఈ నెల 5 నుండి సీఎం కప్ క్రీడా పోటీలు

TG | ఈ నెల 5 నుండి సీఎం కప్ క్రీడా పోటీలు

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:01 pm

MLA |ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం….

MLA | ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం…. MLA | తుగ్గలి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:00 pm

Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు టెన్షన్.. మున్సిపల్ ఎన్నికలు ముప్పు తెస్తాయా?

తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి

తెలుగు పోస్ట్ 3 Feb 2026 5:58 pm

TG |గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుంది…

TG | గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుంది… TG | నర్సంపేట,

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:57 pm

ఆత్మ నిర్బార్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు అవకాశం

విశాలాంధ్ర ధర్మవరం;;కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఆత్మనిర్భార్ కార్యక్రమంలొ భాగంగా, దేశంలో తయారగు చేనేత , హస్త కళాకారులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్-న్యూఢిల్లీ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత జాతీయ అవార్డు గ్రహీత అయిన జూ జారే నాగరాజుకు ప్రత్యేకంగా ఆహ్వానందినట్లు వారు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 16 రోజులపాటు నిర్వహించడం […] The post ఆత్మ నిర్బార్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు అవకాశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 5:29 pm

Crime |అక్రమ బొగ్గు తవ్వకం..

Crime | అక్రమ బొగ్గు తవ్వకం.. Crime | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:29 pm

భారత్‌, పాక్‌తో మ్యాచ్ జరగకపోయినా.. నష్టం లేదు: మాజీ క్రికెటర్

టి-20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఈ నెల 15న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అందుకు కారణాలు మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ జరగకపోయిన నష్టం లేదని ఆయన అన్నారు. టీం ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేంత బలంగా పాకిస్థాన్ జట్టు ఇప్పుడు లేదని ఆయన పేర్కొన్నారు. దానికి బదులుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో తలపడుంటే మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగకున్నా ఏం కాదు. చాలా కాలంగా భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడం లేదు. పూర్తి ఫలితాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. కారణం.. పాక్ 90 దశకంలో ఉన్నట్లు ఇప్పుడు బలంగా లేదు. ఇప్పుడు టీం చాలా బలహీనంగా ఉంది. అసలు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. భారత్ ఆ టీమ్‌తో తలపడుతుంటే.. ఏదో చిన్న జట్టుతో తలపడినట్లు ఉంటోంది’’ అని తెలిపారు.

మన తెలంగాణ 3 Feb 2026 5:28 pm

DEAD |పురుగు మందు తాగి మహిళ మృతి

DEAD | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని నంబాల గ్రామ పంచాయితీ

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:27 pm

తెలంగాణలో భూముల ధరల పెంపు?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

తెలుగు పోస్ట్ 3 Feb 2026 5:26 pm

కాపులంతా ఐక్యతగా వుండాలి

విశాలాంధ్ర – తాళ్లపూడి : కాపులంతా ఐక్యతగా ఉండి, టీడీపీ ప్రభుత్వం కాపులపై చేస్తున్న దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని కాపు జెఏసి మెంబర్, పేద్దెవం ఉప సర్పంచ్ తోట రామకృష్ణ పిలుపు నిచ్చారు. ఆ నాటి రంగ హత్య, మొన్న ముద్రగడ కుటుంభం పై దాడి, నిన్నటి అంబటి పై దాడి వరుస గా రాష్ట్రం లో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ రాజకీయ వైరుధ్యం నడుస్తూనే, దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన గుర్తు […] The post కాపులంతా ఐక్యతగా వుండాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 5:25 pm

Election Officer |బి- ఫామ్‌ల అందజేత…

Election Officer | పాల్వంచ, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:24 pm

రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు చేపట్టాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలోని రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు తీసుకోవాలని మంగళవారం ఇరిగేషన్ ఈఈకి వైసీపీ రైతు విభాగం తాలూకా అధ్యక్షులు కేపీ యల్లప్ప, నాయకులు బ్రహ్మయ్య ఆచారి, లింగన్న గౌడ్, బోయ కడబూరి ఆదోనిలో ఇరిగేషన్ ఈఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలచెరువు నుంచి దాదాపు 1000 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. చెరువు గట్టుపై ముళ్లకంపలు, పిచ్చి […] The post రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు చేపట్టాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 5:21 pm

Collector |మార్కుక్‌లో పర్యటించిన జిల్లా పాలనాధికారి

Collector | మార్కుక్‌లో పర్యటించిన జిల్లా పాలనాధికారి Collector | మార్కుక్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:19 pm

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు

విశాలాంధ్ర-రాప్తాడు : సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాప్తాడు సీఐ టీవీ శ్రీహర్ష హెచ్చరించారు. కొంతమంది మైనర్ బాలురు స్కూటర్లలో రాప్తాడు 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయంపై ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పూర్తి విచారణ చేసి మంగళవారం పిల్లల తల్లిదండ్రులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతపురం రాణినగర్ కు చెందిన 6 మంది విద్యార్థులు మూడు […] The post సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 5:16 pm

Remunerations Correction Coming in Telugu Cinema

Gone are the days where producers used to recover their major investment through the non-theatrical deals. The OTT players have slashed down the deals and the Hindi market reached rock bottom for the Telugu actors. The satellite deals almost vanished and there is a huge decline in the non-theatrical rights. The situations have changed completely […] The post Remunerations Correction Coming in Telugu Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 3 Feb 2026 5:14 pm

Aler |సీనియర్ నేత విష్ణుమూర్తి చేరిక

Aler | సీనియర్ నేత విష్ణుమూర్తి చేరిక Aler | ఆలేరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:14 pm

Kodad |బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు

Kodad | బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు పోలీస్ స్టేషన్‌లో

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:12 pm

parakala |మొక్కలు నాటిన ప్రిన్సిపల్, అధ్యాపకులు

parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:10 pm

రెవెన్యూ క్లినిక్‌లో సత్వర పరిష్కారాలతో రైతుల ఆనందం

విశాలాంధ్ర ధర్మవరం; రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా రైతుల భూ సంబంధిత సమస్యలకు సత్వరంగా పరిష్కారం లభిస్తూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం – పుల్లేటిపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 369-బి,విస్తీర్ణం 4.60 ఎకరముల భూమి నలుగురు అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కార వివాదం కారణంగా కొంతకాలంగా నోషనల్ ఖాతాగా కొనసాగుతూ ఉండేది అని తెలిపారు..ఈ నేపథ్యంలో […] The post రెవెన్యూ క్లినిక్‌లో సత్వర పరిష్కారాలతో రైతుల ఆనందం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 5:08 pm

Mothkur |ప్రజా ప్రతినిధిగా కొనసాగా…ప్రజా సేవకే అంకితమౌతా..!

Mothkur | ప్రజా ప్రతినిధిగా కొనసాగా…ప్రజా సేవకే అంకితమౌతా..! 7వ వార్డు అభివృద్ధి

ప్రభ న్యూస్ 3 Feb 2026 5:08 pm

సొంత ఊరి పాఠశాల అభివృద్ధి కోసం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన పీడి. S.జబీ సలాం

విశాలాంధ్ర – ​శెట్టూరు (అనంతపురం జిల్లా) : ​శెట్టూరుమండలం మాకొడికి ఉన్నత పాఠశాల పాఠశాల స్థలం సేకరణ కోసం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు తన వంతుగా రూ. 5లక్షలు విరాళాన్ని అందించి గ్రామస్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు స్పందించిన అదే గ్రామానికి చెందిన శెట్టూరు ఏపీ మోడల్ స్కూల్ పీడీ S. జబీ సలాం తన ఉదారతను చాటుకున్నారు. మాకోడికి ఉన్నత పాఠశాల స్థల సేకరణ కోసం మేము సైతం శాసనసభ్యులు అమిలినేని […] The post సొంత ఊరి పాఠశాల అభివృద్ధి కోసం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన పీడి. S.జబీ సలాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 5:02 pm

దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలి…

సిఐటియు.. విశాలాంధ్ర- డుంబ్రిగుడ : ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి ఎస్ బి పోతురాజు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల యజమానులకు కార్మికులు బానిసలుగా మార్చే కుట్ర అని, అనేక పోరాటాలు చేసి సాధించుకొన్న ఎనిమిది గంటల పని దినాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల వరకు పెంచడం ఎంతవరకు సమంజసం అని చెప్పారు. […] The post దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 4:58 pm

రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్‌కు రిషి విద్యాలయ పాఠశాల ఆరుగురు విద్యార్థులు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్‌లో సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించారు అని,ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు అని తెలిపారు.ఉత్కంఠభరితంగా సాగిన పోటీల అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర […] The post రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్‌కు రిషి విద్యాలయ పాఠశాల ఆరుగురు విద్యార్థులు ఎంపిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 4:54 pm

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు

విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదాత సవారు లక్ష్మణ్ రావు అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరంచంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పాండురంగస్వామి గుడి వీధి కి చెందిన అంబాభవాని దేవాలయం మాజీ అధ్యక్షులు కీ,శే సఫారు లక్ష్మణ రావు ఉదయం మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతపురం రెడ్ […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 4:51 pm

ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలు కాపాడండి

కే హెచ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలను కాపాడాలని కే హెచ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలకు వారు డిగ్రీ కళాశాలలో చేయవలసిన వాటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల లో చదవడం వలన తల్లి తండ్రులకు ఫీజుల బెడద ఉండదని, ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్నత […] The post ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలు కాపాడండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 4:45 pm

Parakala | 17వ వార్డులో కొన‌సాగుతున్న‌ ప్రచారం …

Parakala | 17వ వార్డులో కొన‌సాగుతున్న‌ ప్రచారం … Parakala | పరకాల,

ప్రభ న్యూస్ 3 Feb 2026 4:27 pm

ఈనెల 4న ప్రత్యేక విద్యుత్ అదాలత్..

ఏడి లక్ష్మీనరసింహారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం పుట్టపర్తి లోని గణేష్ సర్కిల్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ధర్మవరం విద్యుత్ ఏడి లక్ష్మీనరసింహ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ రిటైర్డ్ జడ్జ్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి, ఆర్థిక సభ్యులు మధు కుమార్, సాంకేతిక సభ్యులు శ్రీనివాస్ బాబు, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. ధర్మవరం డివిజన్ పరిధిలోని […] The post ఈనెల 4న ప్రత్యేక విద్యుత్ అదాలత్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 4:27 pm

Nursery |ఇది పెంట కుప్ప కాదు.. నర్సరీ

Nursery | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని పీచర గ్రామంలో లక్షలు వెచ్చించి

ప్రభ న్యూస్ 3 Feb 2026 4:26 pm

Wanaparthy | 33వ వార్డులో జోరుగా ప్రచారం…

Wanaparthy | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలలో

ప్రభ న్యూస్ 3 Feb 2026 4:23 pm