SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

కేడీసీసీ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్‌ల పాత్ర కీలకం

కేడీసీసీ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్‌ల పాత్ర కీలకం – కేడీసీసీ బ్యాంక్ చైర్మన్,

ప్రభ న్యూస్ 28 Mar 2026 9:49 pm

అమరావతికి చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేయడం హర్షణీయం

అమరావతికి చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేయడం హర్షణీయం విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్

ప్రభ న్యూస్ 28 Mar 2026 9:44 pm

Just-18Hrs : నేపాలీ​ పీఎం తొలి షాక్​ Andhra Prabha Latest News

Just-18Hrs : నేపాలీ​ పీఎం తొలి షాక్​ Andhra Prabha Latest News

ప్రభ న్యూస్ 28 Mar 2026 9:43 pm

గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి -రఘునాథపల్లి ఎస్ఐఐ డి.నరేష్ రఘునాథపల్లి,

ప్రభ న్యూస్ 28 Mar 2026 9:23 pm

జైశెట్టి రమణయ్య మృతి తీరనిలోటు

జైశెట్టి రమణయ్య మృతి తీరనిలోటు చరిత్ర పితామహుడు మృతి పై చరిత్రకారులకు తీరనిలోటుఅస్మక

ప్రభ న్యూస్ 28 Mar 2026 9:20 pm

‘బరి’ సినిమా షురూ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ “నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో స్పెషల్‌గా అనిపిస్తుంది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ టీం మీద ఉన్న నమ్మకంతోనే సినిమాకి ఓకే చెప్పాను. ఇదివరకే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం” అని అన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ “విలేజ్ డ్రామాగా, స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతోన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది”అని తెలిపారు. యదు వంశీ మాట్లాడుతూ “వాలీబాల్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ ఐడియా రాగానే నాకు వరుణ్ గుర్తుకువచ్చారు. అలా కొంత కథ అయ్యాక నిహారిక వద్దకే వెళ్లాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను సిద్ధంచేసి వరుణ్‌కి వినిపించగా ఆయనకి కథ చాలా నచ్చింది. షూటింగ్ త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనుదీప్ దేవ్, చిన్నా పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 9:20 pm

విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన

ప్రభ న్యూస్ 28 Mar 2026 9:02 pm

దేశంలో ప్రసూతి మరణాలు తగ్గుముఖం

భారతదేశంలో ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1990 నుంచి 2023 మధ్యకాలంలో అత్యంత విషాదకర ఈ కాన్పుచావుల రేటు దాదాపు 80 శాతం మేర తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ది లాన్సెట్ అబ్‌స్టట్రిక్స్ గైనకాలజీ, ఉమెన్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ప్రపంచవ్యాప్త విశ్లేషణల క్రమంలో భారతదేశంలో ఈ అత్యంత కీలక శుభ పరిణామం తలెత్తిన విషయాన్ని ఈ నేపథ్యంలో వెల్లడించారు. అంతకు ముందు లక్ష కాన్పుల్లో 508 మరణాలు ఉండేవి. అవి ఇప్పుడు లక్షకు 116కు తగ్గాయని ఈ విశ్లేషణలో తెలిపారు. 2023లో దేశంలో మొత్తం 24700 వరకూ ప్రసూతి మరణాలు రికార్డు అయ్యాయి. ఇది లక్షకు 116 శాతంగా నిలిచింది. ఈ ఏడాదే పాకిస్థాన్‌లో 10300 ప్రసూతి మరణాలు సంభవించాయి. ఆఫ్రికా దేశాలైన ఈథియోపియా,నైజీరియా ఇతర చోట్ల కూడా ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. పేదరికం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, ప్రత్యేకించి నిరక్షరాస్యత వంటి పరిణామాలతో, మహిళల పట్ల నిరాదరణ వంటి కారణాలతో ప్రసూతి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటూ వచ్చింది. అయితే భారతదేశంలో మార్పులతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటికీ ఈ అకాల మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఆరోగ్య గణాంకాలు, విశ్లేషణ విభాగం (ఐహెచ్‌ఎంఇ) పరిశోధకులు తమ అధ్యయనంలో ఈ సామాజిక ఆందోళనకర పరిణామంపై సర్వే జరిపారు. దేశాలవారిగా చూస్తే ఈ ప్రసూతి మరణాలు ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటున్నాయి. వెనుకబాటుతనం, కుటుంబ కట్టుబాట్లు వంటివి ఇందుకు కారణం అని అధ్యయనంలో తేల్చారు. 204 దేశాలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత పరిణామం బట్టి దేశంలో ప్రసూతి మరణాలు తగ్గడం కీలక విషయం అని, దీనిని మరింతగా మెరుగుపర్చుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.

మన తెలంగాణ 28 Mar 2026 9:00 pm

యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి…

యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి… ఈగల్ చీఫ్ ఐజీ రవికృష్ణ కర్నూలు

ప్రభ న్యూస్ 28 Mar 2026 8:55 pm

రైతుల త్యాగాలకు గౌరవం…

రైతుల త్యాగాలకు గౌరవం… అమరావతి తీర్మానం చారిత్రాత్మకంమహిళల ధైర్యానికి గుర్తింపుప్రజా ఉద్యమానికి అసెంబ్లీ

ప్రభ న్యూస్ 28 Mar 2026 8:48 pm

అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మకం

అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మకం వైసీపీ గైర్హాజరు ద్వారా కుట్రకోణం బహిర్గతం:

ప్రభ న్యూస్ 28 Mar 2026 8:45 pm

32 లక్షల మంది సభ్యులకు రూ.23 వేల కోట్ల రుణాలు

స్త్రీనిధి రుణాలను 2011 నుంచి సుమారు 32 లక్షల సభ్యులకు రూ.23 వేల కోట్లు అందించగా, 2025 మార్చి 31 నాటికి రుణ నిల్వ రూ.5,107 కోట్లుగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. 2025.26లో రూ.2,350 కోట్ల ప్రణాళికలో రూ.2,125 కోట్లు (దాదాపు 90%) అమలు చేసి, ఆ ఏడాది 2026-.27 రూ.2,530 కోట్ల ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అలాగే 2024-.25లో రూ.154 కోట్ల నికర లాభంతో 14 శాతం డివిడెండ్ ప్రకటించడం స్త్రీనిధి విజయాన్ని ప్రతిబింభిస్తుందని తెలిపారు. సెర్ప్, మెప్మా సమన్వయంతో మరిన్ని సేవలు అందించేందుకు స్త్రీనిధి కట్టుబడి ఉంది అని అన్నారు. మారుమూల గ్రామాల సంఘాలకు మన స్త్రీనిధి యాప్ ద్వారా స్వయంగా రుణాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించి, తక్కువ ఖర్చుతో సరైన సమయంలో రుణాలు పొందే విధంగా స్త్రీనిధి చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో పోస్టాఫీసులు ద్వారా నగదు చెల్లింపులకు అవకాశం ఉందని చెప్పారు. స్త్రీనిధిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు 163 మంది నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదేవిధంగా సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ ఏడాది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మన తెలంగాణ 28 Mar 2026 8:43 pm

కష్టాల్లో ఎస్ఆర్ హెచ్…

కష్టాల్లో ఎస్ఆర్ హెచ్… ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్ : 19వ సీజన్ IPLలో, చినస్వామి

ప్రభ న్యూస్ 28 Mar 2026 8:39 pm

అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీష్ రావు

అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు విమర్శించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు అని పేర్కొన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డి అని చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి హరీష్‌రావు అసెంబ్లీ లాబీలో నిరసనకు దిగారు . మైనింగ్ స్కాం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు నినాదాలు చేశారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని అన్నారు. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా..? అని అడిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయం అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 8:30 pm

Dacoit: Adivi Sesh Fires Up Chicchubuddi

With just days left for the arrival of Adivi Sesh’s Dacoit, directed by Shaniel Deo, the buzz around the film is soaring. The glimpse, teaser and first single from the movie received superb response. Meanwhile, they released the electrifying second single, Chicchubuddi. This track turns the spotlight onto Adivi Sesh in a never-before-seen avatar, as […] The post Dacoit: Adivi Sesh Fires Up Chicchubuddi appeared first on Telugu360 .

తెలుగు 360 28 Mar 2026 8:23 pm

తండ్రిని హతమార్చిన కుమారుడు

 మద్యానికి బానిసై నిత్యం తల్లి, చెల్లిని వేధిస్తున్నాడనే ఆక్రోశంతో తండ్రిని హతమార్చాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని బాయిమీది తండాలో జరిగింది. శనివారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాయిమీది తండాకు చెందిన రాథోడ్ లోక్యనాయక్(50), బిక్కిబాయి దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో మద్యం చిచ్చురేపింది. మద్యానికి మద్యానికి బానిసైన లోక్యనాయక్ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. మద్యానికి బానిసైన లోక్యనాయక్ తరుచుగా మద్యం సేవించి భార్య బిక్కిబాయి, చిన్నకుమార్తె సుప్రియను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన భార్య బిక్కిబాయి, కుమార్తె సుప్రియను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని తల్లి బిక్కిబాయి తక్షణమే హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటు జీవనం సాగిస్తున్న కుమారుడు రాథోడ్ సునీల్(34)కు ఫోన్‌లో సమాచారం చేరవేశారు. దీంతో సునీల్ నాయక్ ఆక్రోశంతో స్వగ్రామం బాయిమీది తండాకు చేరుకున్నాడు. తన తల్లి బిక్కిబాయి, చెల్లెలు సుప్రియను వేధిస్తున్న విషయంపై తండ్రి లోక్యనాయక్‌ను మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరుగడంతో ఆగ్రహానికి గురైన రాథోడ్ సునీల్ నాయక్ తన ఇంట్లో ఉన్నటువంటి గొడ్డలితో తండ్రి లోక్యనాయక్ మెడ, దవడ, తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో లోక్యనాయక్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తల్లి హేమ్లీబాయి ఫిర్యాదు మేరుకు పోలీసులు 58/2026 యూ/ఎస్ 103(1) బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుడు రాథోడ్ సునీల్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 28 Mar 2026 8:15 pm

జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ

జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ చెన్నూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Mar 2026 8:09 pm

ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సన్‌రైజర్స్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 19వ సీజన్‌లో భాగంగా.. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుగున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్‌కు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. డఫీ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ (7) జితేశ్ శర్మ‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్(11) ఔట్ అయ్యాడు. మళ్లీ డఫీ ఓవర్‌లోనే నితీశ్ రెడ్డి (1) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ మూడు వికెట్లు నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్ కిషన్(23), క్లాసెన్(3) ఉన్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 8:08 pm

తాగి మెట్రో ఎక్కితే రూ. 2500 ఫైన్

మెట్రో ప్రయాణికులకు కేంద్రం షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వేసేలా శుక్రవారం లోక్‌సభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. మద్యం తాగి రైలెక్కడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, ఉమ్మి వేయడం వంటి వాటికి ఇప్పటివరకు విధిస్తున్న రూ. 500 జరిమానాను రూ. 2,500కు పెంచింది. అలాగే రైల్లో అసభ్య రాతలు రాయడం, పోస్టర్లు అతికిస్తే విధించే ఫైన్ వెయ్యి రూపాయల నుంచి రూ. 10 వేలకు పెంచింది. మహిళా కోచ్‌లలోకి ప్రవేశించే పురుషులకు ఫైన్‌ను రూ. 250 నుంచి ఏకంగా రూ. 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జన విశ్వాస (సవరణ) బిల్లు 2026ను వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.

మన తెలంగాణ 28 Mar 2026 8:08 pm

అక్రమంగా సిలిండర్లు స్వాధీనం.. ఎర్రమట్టి తవ్వకాలకు బ్రేక్

అక్రమంగా సిలిండర్లు స్వాధీనం.. ఎర్రమట్టి తవ్వకాలకు బ్రేక్ వికారాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్

ప్రభ న్యూస్ 28 Mar 2026 8:06 pm

వేడెక్కిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరింత వేడెక్కాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం బిజెపి తరఫున రాష్ట్రంలోని మమత బెనర్జీ సారధ్య టిఎంసి ప్రభుత్వంపై ఛార్జీషీట్ విడుదల చేశారు. బెంగాల్ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం అయినవి కావు. ఇది దేశ భద్రత సమగ్రతకు సంబంధించిన విషయం అయిందని తెలిపారు. ఎన్నికల దశలో బిజెపి తరఫున ఆయన జోరు పెంచారు. ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్ షా మమత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 15 సంవత్సరాలుగా సాగుతున్న టిఎంసి సర్కారు హయాంలో పలు అక్రమాలు జరిగాయని విమర్శించారు. ప్రత్యేకించి టిఎంసి ప్రభుత్వ వైఖరితో దేశంలోకి అక్రమ వలసలు ముమ్మరం అయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు ఈ ప్రాంతం చొరబాట్ల ముఖద్వారం అయిందని విమర్శించారు. బిజెపి ఛార్జీషీట్‌లో సంబంధిత విషయాలను ప్రస్తావించామని వివరించారు. టిఎంసి ప్రభుత్వ బుజ్జగింపుల రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసాకాండతో పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. ప్రత్యేకించి దేశ భద్రతకు సవాలు విసిరేలా చొరబాట్ల వ్యవహారం మారిందని అమిత్ షా చెప్పారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారశైలి చివరికి అరాచక వీధిరౌడి స్థాయికి మారింది. ఇటువంటి ధోరణిని వెంటనే నీరుగార్చి తీరాల్సి ఉందన్నారు. పైగా మమత దీదీ ఎప్పుడూ తాను దాడులకు దిగుతూ , రాజకీయ బాధితురాలు డ్రామాలకు దిగుతారు. ఒక్కోసారి ఆమె తనకు తగలని గాయాలను చూపుతూ సానుభూతికి ప్రయత్నిస్తారు. ఎన్నికల సంఘంపై తిట్లకు దిగుతారు. ఇప్పుడు ఈ మహానుభావురాలి కపట నీతి గురించి బెంగాలీలందరికీ తెలిసిపోయింది. ఆమె తరచూ బాధితురాలనే డ్రామాలో ప్రధాన పాత్రధారి అని గుర్తించారని చెప్పారు. టిఎంసి మైనార్టీ ఓటుబ్యాంకు రక్షణకు ఆమె ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ను వ్యతిరేకించారని చెప్పారు.

మన తెలంగాణ 28 Mar 2026 8:00 pm

లక్షేట్టిపేట మున్సిపల్ బడ్జెట్ రూ.2574.89 లక్షలు

లక్షేట్టిపేట మున్సిపల్ బడ్జెట్ రూ.2574.89 లక్షలు లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 28 Mar 2026 7:54 pm

మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రోను విస్తరించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఫేజ్‌-2ఎ 76.4 కి.మీ., ఫేజ్‌-2బి 86.1 కి.మీ విస్తరణకు తీర్మానం జరిగింది. మెట్రో విస్తరణలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం చేసుకునే నిర్ణయానికి సభ ఆమోదం తెలిపింది. మెట్రో ఫేజ్-2కు కేంద్ర ఆమోదం త్వరగా లభించేలా కృషి చేయాలని తీర్మానం చేశారు. 

మన తెలంగాణ 28 Mar 2026 7:51 pm

కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా..

కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా.. ఎల్ పి హెచ్ ఎస్

ప్రభ న్యూస్ 28 Mar 2026 7:51 pm

మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళలు

ప్రభ న్యూస్ 28 Mar 2026 7:45 pm

నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..!

నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..! స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్

ప్రభ న్యూస్ 28 Mar 2026 7:45 pm

సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ

సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ కరీమాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Mar 2026 7:40 pm

నేపాల్‌లో మాజీ ప్రధాని ఓలి అరెస్టు

నేపాల్‌లో దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలిని శనివారం అరెస్టు చేశారు. కొత్తగా ఏర్పడ్డ బాలేంద్ర షా ప్రభుత్వం ఈ తీవ్ర చర్యకు దిగింది. 2025 జన్ జడ్ నిరసనల అణచివేతల అంశంపై దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా మాజీ ప్రధాని, సిపిఎన్‌యుఎంఎల్ ఛైర్మన్ కూడా అయిన ఓలిని అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయననుఖాట్మాండుకు సమీపంలోని భక్త్‌పూర్ జిల్లాలోని గుండూ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. కటుంజెలోని ఆయన నివాసం నుంచి మాజీ హోం మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత రమేష్ లేఖక్‌కు నూడా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో యువతరం నుంచి అధికార పక్షానికి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇది జన్‌జడ్ ఉద్యమంగా మార్మోగింది. అప్పుడు అధికారంలో ఉన్న ఓలి , లేఖక్‌ల ప్రోద్బలంతో ఉద్యమం అణచివేతకు దమననీతిని ప్రదర్శించారనే అభియోగాలపై దర్యాప్తు జరిగింది. కమిటీ నివేదిక వెలువరించింది. వీరిపైనా ఇతరులపైనా నేరపూరిత చర్యల కేసులు దాఖలు అయ్యాయి. ఇటీవలే పగ్గాలు చేపట్టిన బాలేంద్ర షా ఆధ్వర్యంలో శుక్రవారమే నూతన మంత్రి మండలి సమావేశం జరిగింది. దర్యాప్తు కమిటీ నివేదికను తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పుడు పోలీసు చర్యకుదిగారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఇప్పటి అరెస్టులపై నూతన హోం మంత్రి సుధాన్ గురుంగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

మన తెలంగాణ 28 Mar 2026 7:40 pm

ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News

ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News (

ప్రభ న్యూస్ 28 Mar 2026 7:38 pm

ప్రపంచశాంతికి బౌద్ధమే మార్గం: సునీల్ సెనేవి

యుద్ధాల నేపథ్యంలో శాంతికి బుద్ధ బోధనలు అవసరమన్న మంత్రిబుద్ధవనాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న జూపల్లి

తెలుగు పోస్ట్ 28 Mar 2026 7:33 pm

కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి

కల్తీ బేకరీ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్‌ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 12,54,280 విలువైన మైదాపిండి, చెక్కెర బస్తాలు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, కేడి కాలనీకి చెందిన అహ్మద్ రజా బేకరీ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు అహ్మద్ రజా ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు,బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్‌లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు తయారీ కేంద్రంపై దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, గుడిమల్కాపూర్ ఇన్స్‌స్పెక్టర్ రామయ్య, ఎస్సైలు కె. వెంకటరమణ, సురేష్, సిబ్బంది దాడులు చేశారు.

మన తెలంగాణ 28 Mar 2026 7:29 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్‌సిబి జట్టు సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడటం ఇది ఏడోసారి. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది రెండోసారి. తుది జట్లు: ఆర్‌సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకడ్ డఫీ, సుయాశ్ శర్మ. ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగా.

మన తెలంగాణ 28 Mar 2026 7:13 pm

హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలోనే: సిఎం రేవంత్‌రెడ్డి

మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మూసీనది పునరుజ్జీవిం గురించి చాలా మంది ప్రయత్నించారని, కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని, ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తారని, తెలంగాణ పౌరులకు తన విజ్ఞప్తి ఒక్కటేనని, చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందని, సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని సిఎం అన్నారు. దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదని, మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్య కారకంగా మారింది గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 7:07 pm

ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం…

ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర

ప్రభ న్యూస్ 28 Mar 2026 7:04 pm

ఈనెల 30న అసెంబ్లీలో సన్నబియ్యంతో విందు భోజనం

సన్నబియ్యంతో విందు భోజనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30వ తేదీన అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో సన్నంబియ్యంతో వండిన విందు భోజనాన్ని వడ్డించనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 3.39 కోట్ల మందికి దీనిద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీన మధ్యాహ్నాం ఒంటిగంటకు ఈ విందు భోజనం నిర్వహించనుండగా ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 7:04 pm

Sri Rama Navami |ఘనంగా శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం

Sri Rama Navami | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భక్తి, వేడుకలు, సంగీతం,

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:55 pm

లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ…

లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ… విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ మున్సిపల్

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:54 pm

ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:45 pm

BJP : తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్లాన్ సిద్ధం చేసిందటగా?

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 6:45 pm

వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం

వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తజనం ఉరవకొండ రూరల్,

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:44 pm

ఎయిర్‌పోర్ట్ కోసం ల్యాండ్ ఇచ్చి.. రూ.15 కోట్లు దక్కించుకున్నాడు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తర‌ప్రదేశ్‌కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీ పరిహారం అందినట్లు తెలుస్తోంది. తద్వారా ఆ భూమల రైతుల జీవితాలు రాత్రికి రాత్రే బంగారు మయం అయ్యాయని పలు నివేదికల సమాచారం. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతుకు దాదాపు రూ.15 కోట్లు పరిహారం లభించింది. ఈ భారీ సొమ్ము ఆయన ఏకంగా ఒక హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేయడమే కాకుండా, విహార యాత్ర కోసం థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ముఖ చిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. 

మన తెలంగాణ 28 Mar 2026 6:43 pm

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ . డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:41 pm

శిక్షణ పూర్తి చేసిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్ల పంపిణీ

బాసర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీలలో వార్డుల అభివృద్ధికి వార్డు సభ్యులు కీలక పాత్ర

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:39 pm

పెరిగిన టివిలు, ఎసిల ధరలు

మార్కెట్లో అన్ని సైజుల టీవీల ధరలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్, రాగి ధరలు పెరగడం వల్ల ఏసీల రేట్లు కూడా ప్రియం కానున్నాయి. గతంలో రూ.28,000 లభించే 65 అంగుళాల టీవీ ధర ఇప్పుడు రూ.32 వేలకు చేరిందని సమాచారం. అలాగే 32 అంగుళాల టీవీ ధర రూ. 5,700 నుండి రూ.6,400 కు పెరిగింది. ధరలు పెరగడంతో సగానికి పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, సిలిండర్ల కొరత కూడా వేధిస్తోంది.

మన తెలంగాణ 28 Mar 2026 6:36 pm

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి సాగు–తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంఏపీ రైతు సంఘం

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:31 pm

తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్

తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్ ప్లాట్లు కొని మోసపోవద్దు.. కమిషనర్ హెచ్చరిక

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:26 pm

నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి

నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి: కలెక్టర్ డా.ఏ.సిరి.

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:20 pm

Lenin Team Breaks Silence on Release

Akhil Akkineni has been completely occupied with the shoot of Lenin from a long time. The last schedule is currently happening and there were strong speculations that the film releases on May 1st. There is a debate on social media that the team is tight-lipped about the release. With Ram Charan’s Peddi slated for April […] The post Lenin Team Breaks Silence on Release appeared first on Telugu360 .

తెలుగు 360 28 Mar 2026 6:19 pm

పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు

పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు రవీంద్ర రావు అదనపు కమిషనర్ విజయవాడ కార్పోరేషన్,

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:17 pm

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు జిల్లా క్రీడాకారులు ఎంపిక

నిజామాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు శనివారం

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:15 pm

Change of Plan from Anudeep KV

Anudeep KV made an impressive debut with Jathi Ratnalu. The comic timing in the film was hilarious and all the actors from the film are quite busy now. Anudeep did films like Prince and Funky. Prince ended up as a below average film while Funky brought him a lot of criticism. Anudeep KV was trolled […] The post Change of Plan from Anudeep KV appeared first on Telugu360 .

తెలుగు 360 28 Mar 2026 6:14 pm

Revanth Reddy : మైనింగ్ అక్రమాలకు సీఐడీ విచారణకు సిద్ధం

మైనింగ్ పై జరిగిన అక్రమాలన్నింటిపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 28 Mar 2026 6:13 pm

Bjp Support : 2024 లో ఆ వైర‌స్ ను త‌రిమేశాం Andhra Prabha Assembly News

Bjp Support : 2024 లో ఆ వైర‌స్ ను త‌రిమేశాం Andhra

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:05 pm

అక్రమ మైనింగ్ పై హరీశ్ మండిపాటు

రాఘవ కనస్ట్రక్షన్స్ పైన ఎందుకు కేసులు పెట్టరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

తెలుగు పోస్ట్ 28 Mar 2026 6:03 pm

విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి

విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : గిరిరాజ్

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:02 pm

ఆరో తరగతి బాలికపై దారుణం

ఆరో తరగతి బాలికపై దారుణం ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ : ఎన్టీఆర్

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:57 pm

దళిత హక్కుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ..

కరిమాబాద్, ఆంధ్రప్రభ ; దళిత కుల పోరాట సమితి రెండవ మహాసభ వాల్పోస్టర్

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:52 pm

జీజీహెచ్‌లో ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం

జీజీహెచ్‌లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం కర్నూలు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:49 pm

Pawan Kalyan : వైసీపీ అధికారంలోకి రావడం జరగని పని

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా

తెలుగు పోస్ట్ 28 Mar 2026 5:48 pm

Amaravathi : అమరావతి అందరిదీ.. అందుకే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేశాం

అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించేలా కేంద్రానికి పంపే తీర్మానంపై శాసనసభలో కొనసాగుతున్న చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు

తెలుగు పోస్ట్ 28 Mar 2026 5:34 pm

పాడి రైతులకు భారీ లాభం…

పాడి రైతులకు భారీ లాభం… కృష్ణా మిల్క్ యూనియన్ కీలక నిర్ణయంపాల సేకరణ

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:25 pm

నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాలకు రాష్ట్ర అవార్డు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్ర

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:24 pm

Gas cylinders | 30సిలిండర్లతో…

Gas cylinders | 30సిలిండర్లతో… Gas cylinders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:21 pm

రైతాంగ సంక్షేమమే లక్ష్యం…

ఆలేరు, ఆంధ్రప్రభ : రైతాంగ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:19 pm

టీడీపీ కుటుంబానికి సహాయం…

టీడీపీ కుటుంబానికి సహాయం… రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు మండలంలోని మారూరు గ్రామనికి

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:15 pm

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష….

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష…. అప్పట్లో మూడు రాజధానులను వ్యతిరేకించాను.అసెంబ్లీలో ఎమ్మెల్యే వసంత

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:11 pm

అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది..

అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి..అమరావతి సీఎం

ప్రభ న్యూస్ 28 Mar 2026 5:07 pm

ముందస్తు అడ్మిషన్ల‌ను అరికట్టండి…

ముందస్తు అడ్మిషన్ల‌ను అరికట్టండి… కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలి.పి.డి.ఎస్.యు

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:56 pm

జనవరిలో భర్త మరణం.. పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య

సంగారెడ్డి: కంది మండలం జూలకల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులు చనిపోయిన తర్వాత ఉరేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు తల్లి మమత (28), మణికంఠ(5), ప్రళయ(4)గా గుర్తించారు. జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడనే మనస్తాపంతో పిల్లలతో సహా మమత ఆత్మహత్య చేసుకుంది. ఈ ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మన తెలంగాణ 28 Mar 2026 4:32 pm

పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుంది: రేవంత్

హైదరాబాద్: బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయటం వెనుక సహేతుక కారణం ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ పౌష్టికాహారం అందట్లేదు అని అన్నారు. అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా ‘తొలి ముద్ద’ పథకాన్ని సిఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కొండా సురేఖ, సీతాదయాకర్ రెడ్డి పాల్గొన్నారు. రెడీ టూ కుక్ ఫుడ్ ( ఉప్మా, కిచిడీ మిక్స్) ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీ వర్కర్స్ కు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నాం అని..పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుందని రేవంత్ తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందని, అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు అని..అంగన్వాడీ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించే చర్యలు చేపట్టామని అన్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

మన తెలంగాణ 28 Mar 2026 4:30 pm

అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి..

అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి.. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:25 pm

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:20 pm

IPL betting apps |బలి పశువులుగా మారుతున్న యువత..

IPL betting apps | బలి పశువులుగా మారుతున్న యువత.. IPL betting

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:16 pm

పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు

పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయంలో

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:15 pm

నిత్య అన్నదాన పథకానికి విరాళం…

నిత్య అన్నదాన పథకానికి విరాళం… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:12 pm

Assembly |సభ ఏకగ్రీవ ఆమోదం…

Assembly | సభ ఏకగ్రీవ ఆమోదం… Assembly | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ :

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:09 pm

tirumala|కొండ‌పై కొన‌సాగుతున్న ర‌ద్దీ

tirumala| కొండ‌పై కొన‌సాగుతున్న ర‌ద్దీ ఏడుకొండ‌ల‌వాడి ద‌ర్శ‌నానికి భారీ క్యూ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:06 pm

11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha Assembly News

11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:04 pm

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం..

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం.. శ్రీరామనవమి ఉత్సవాల్లో నేత్రపర్వంగా మహోత్సవంపాలకమండలి సభ్యుల సమక్షంలో

ప్రభ న్యూస్ 28 Mar 2026 4:01 pm

Andhra Prabha Smart Edition |TS |శివతాండవమే/డిప్రెష్​ మొదలైంది

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 28-03-2026, 4.00PM ts మూసీని అడ్డుకుంటే శివతాండవమే

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:57 pm

నగరం నడిబొడ్డునే అక్రమంగా మైనింగ్ జరుగుతోంది: హరీశ్ రావు

హైదరాబాద్: మైనింగ్ నుంచి వచ్చే నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా కీలకం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తీర్మానాలను ఏకపక్షంగా పాస్ చేయడం సరికాదు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మైనింగ్ శాఖపై హరీశ్ రావు మాట్లాడారు. తాను ఎప్పుడూ ఆధారాలతోనే మాట్లాడతానని తెలియజేశారు. మైనింగ్ శాఖలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, నగరం నడిబొడ్డునే అక్రమంగా మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. తన మాటలను రాజకీయాలు, విమర్శలుగా తీసుకోవద్దు అని సూచించారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయినీ కాపాడే బాధ్యత మనదేనని, ఖనిజాలపై ఆదాయం ఏటా పెరుగుతోందని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డునే జివొ 111 ను ఉల్లంఘిస్తున్నారని, స్టోన్ క్రషర్లకు నిబంధనలు కూడా మీ ప్రభుత్వమే పెట్టిందని మండిపడ్డారు. మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలని, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. స్టోన్ క్రషర్ కు పిసిబి నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి అని.. స్టోన్ క్రషర్ యజమాని.. మైనింగ్ అధికారికి ప్రతి నెలా వివరాలు ఇవ్వాలని సూచించారు. డీజిల్ జనరేటర్లతో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు.   

మన తెలంగాణ 28 Mar 2026 3:44 pm

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత..

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రతినెల 30న పౌర హక్కుల ( సివిల్ రైట్స్

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:27 pm

ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలు నారాయణపేటజిల్లాఊట్కూర్

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:23 pm

రాయపర్తిలో 20 కిలోల గంజాయి స్వాధీనం

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎండు

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:20 pm

చెన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా రవీందర్

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:16 pm

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి..

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి.. దుర్గమ్మ ఆలయంలో భారీ పారిశుధ్య కార్యక్రమంప్లాస్టిక్ రహిత

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:16 pm

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లాలో పదన తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:13 pm

పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి..

పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి.. శావల్యాపురం, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రతి ఒక్కరూ

ప్రభ న్యూస్ 28 Mar 2026 3:12 pm