నా మాటలను వక్రీకరించారు: ప్రకాశ్ రాజ్
మన తెలంగాణ/హైదరాబాద్: తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించారు. ఇటీవల ఓ సాహితీ కార్యక్రమంలో తాను చేసిన పూర్తి ప్రసంగాన్ని వదిలేసి, అందులోని కొన్ని భాగాలను మాత్రమే తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను శ్రీరాముడిని కించపరిచానని, హిందువుల మనోభావాలను దెబ్బతీశానని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను అన్ని ధర్మాలను సమానంగా గౌరవిస్తానని, ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కొందరు రాజకీయ నాయకులు ‘హిందూ వ్యతిరేకి’ అనే ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే తన గొంతు నొక్కేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తాను పొలం పనులతో తీరిక లేకుండా ఉన్నానని, ఆ పనులు పూర్తయ్యాక ఈ విషయంపై మరింతగా మాట్లాడతానని ప్రకాశ్ రాజ్ తన పోస్ట్లో తెలిపారు.
పవన్ కల్యాణ్కు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. శని వారం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్కు ప్రధాని ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ’ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్తో మాట్లాడి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన చాలా ధైర్యవంతుడు, త్వరలోనే కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను‘ అని తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది : చిరంజీవి తన సోదరుడి ఆరోగ్యంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్ కల్యాణ్కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా, నిలకడగా ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు‘ అని చిరం జీవి తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ తిరిగి సాధారణ కార్యకలాపాల్లోకి రావడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని వైద్యులు సూచిం చినట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రార్థనలు చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ చిరంజీవి ధన్య వాదాలు తెలిపారు.
బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి
విరుద్నగర్: తమిళనాడులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విరుద్నగర్ జిల్లా కట్టనార్పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పరిశ్రమ ధ్వంసం కాగా.. పరిసర ప్రాంతాలు కంపించినట్లు సమాచారం. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. విరుద్నగర్ జిల్లాలోనే సత్తూర్లో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వారం క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికులు మరణించగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా… హేమాక్స్ లైట్ మినీ వాటర్ ట్యాంక్
నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం…
నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ పట్టణ
పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం…
పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం… కొత్త కాలువల నిర్మాణంతో మురుగు సమస్యకు
మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు.
మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు. భవానిపురం, ఆంధ్రప్రభ :
చిట్యాల ఆణిముత్యం కలెక్టర్ నరసింహారెడ్డి
చిట్యాల ఆణిముత్యం కలెక్టర్ నరసింహారెడ్డి చిట్యాల, ఆంధ్రప్రభ : స్వయంకృషి, పట్టుదలతో కష్టాలను
ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి…
ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి… గిట్టుబాటు ధరను పొందాలి..మార్కెట్ చైర్మన్ ఉబ్బు
ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి
రోమ్: ఇటలీలోని బెర్గామో ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. కోవో పట్టణంలో భారతీయ సిక్కులు అక్కడున్న గిడ్డంగిలో ఏర్పాటు చేసుకున్న గురుద్వారా వెలుపల ఈ ఘటన జరిగింది. వైశాఖీ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న దశలో వారిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ సిక్కుల ప్రార్థనా స్థలి వద్ద కాల్పుల్లో మృతి చెందిన వారిని రాగీందర్ సింగ్, గుర్మీత్ సింగ్గా గుర్తించారు, కాల్పులకు దిగింది కూడా భారతీయుడేనని అక్కడున్న ప్రత్యక్ష సాక్షి మాటల ద్వారా వెల్లడైంది.
ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు
ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు పిల్లర్లతో కూడిన ప్లైఓవర్
అదరగొట్టిన రింకూ.. ఈ సీజన్లో కోల్కతా తొలి విజయం
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన కెకెఆర్కు రాజస్థాన్ బౌలర్లు షాక్ల మీద షాక్లు ఇచ్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే సైఫర్ట్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానె కూడా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. అంగ్క్రిష్ రఘువంశీ 10 పరుగులు చేసి ఔట్ కాగా, కామరూన్ గ్రీన్ (27), రోవ్మెన్ పొవెల్ (23) ఫర్వాలేదు అనిపించారు. అయితే 85 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయిన కెకెఆర్కు రింకూ సింగ్ అండగా నిలిచాడు. అనుకూల్ రాయ్తో కలిసి ఆర్ఆర్ బౌలర్లను ఎదురుకుంటూ పరుగులు రాబట్టాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. అనుకూల్ కూడా 16 బంతుల్లో 29 పరుగులు చేసి రింకూకి తగిన సహకారం అందించాడు. దీంతో కోల్కతా ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసి టేబుల్లో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి వచ్చింది.
పీసీ యువసేన మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
పీసీ యువసేన మజ్జిగ చలివేంద్రం ప్రారంభం భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ
కెసిఆర్ తరహాలో రేవంత్ రెడ్డీ మోసాలు.. బండి సంజయ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ః ముఖ్యమంత్రి అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డిలా మారారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్దాల పునాదులపైనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. అబద్దాలతోనే మహిళలను వంచించారని, మహిళలందరికీ ప్రతి నెలా రూ. 2500లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారని ఆయన విమర్శించారు. అబద్దాలు, మోసాలనే ప్రజలు నమ్ముతారని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం రేవంత్ రెడ్డికి ఉన్నట్లుందని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్ తరహాలోనే అబద్దాలు, మోసాలతోనే పాలన కొనసాగిస్తున్నారని, అబద్దాలు, మోసాలనే నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “అభినవ గోబెల్స్”గా మారారని తెలిపారు. అబద్దాలు, మోసాలు చేసే వారినే ప్రజలు నమ్ముతారని బహిరంగంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ అబద్దాల పునాదులపైనే ముఖ్యమంత్రి అయ్యారని, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తరహాలోనే దొంగ హామీలు, పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలనను కొనసాగిస్తున్నారని, నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ఆయనకు అలవాటుగా మారిందని, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో లోక్సభలో బిల్లును ప్రవేశపెడితే ఇండీ కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంలో లేనిపోని విష ప్రచారం చేసి మహిళా బిల్లును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం జరగబోతోందని తప్పుడు ప్రచారాలకు తెరదీసి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగకుండా కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచడం ద్వారా దక్షిణాదికి మేలు చేయాలనుకున్నారని ఆయన తెలిపారు. అందుకే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే, ఇండీ కూటమి పేరుతో అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఇండీ కూటమి నేతలు దక్షిణాదికి ఉన్న అవకాశాలకు గండి కొట్టారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ మహిళలతోపాటు దేశంలోని 70 కోట్ల మహిళలెవరూ ఇండీ కూటమి చేసిన అవమానాన్ని ఎన్నటికీ మరచిపోరని ఆయన హెచ్చరించారు. మహిళలంతా ఏకమై రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దె దించడం తథ్యం అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను తెలంగాణలోని గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వం సిద్ధమవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
బోర్డ్ రూములుగా మారుతున్న MPV లు - పెరుగుతున్న గిరాకీలు #MobileOffice#LuxuryCars#MPVTrend
Breaking : రాయల్స్ కు మళ్లీ ఓటమి.. నైట్ రైడర్స్ కు తొలి విజయం
కోల్ కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది
పేరూరు స్పూర్తి…రాష్ట్రానికి మార్గదర్శి…
పేరూరు స్పూర్తి…రాష్ట్రానికి మార్గదర్శి… 75 ఏళ్ల ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి
South Indian Film Producers’ Crucial Meeting Held
All the producers of South Indian cinema have been meeting to discuss the strict guidelines to be followed for the implementation of the OTT window. A crucial meeting has taken place in Hotel Daspalla, Hyderabad today and the film producers, representatives from the Producers’ Associations and Guilds of Telangana, Andhra Pradesh, Tamil Nadu and Kerala […] The post South Indian Film Producers’ Crucial Meeting Held appeared first on Telugu360 .
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎల్ఎస్జి
ముల్లాన్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మహరాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన లక్నో కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్లో విజయం ఆ జట్టుకు కీలకం కానుంది. మరోవైపు వరుస విజయాలతో జోష్ మీద ఉన్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేష్ రాఠీ స్థానంలో సిద్ధార్త్ని జట్టులోకి తీసుకుంది. మరోవైపు పంజాబ్ అదే జట్టును కొనసాగిస్తోంది. తుది జట్లు: ఎల్ఎస్జి: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్. పిబికెఎస్: ప్రభ్సిమ్రన్ సింగ్(కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోల్లి, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వాదేరా, మార్కస్ స్టోయినస్, మార్క్ యాన్సన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్,.
సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ అభ్యర్థుల ప్రకటన
సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ అభ్యర్థుల ప్రకటన సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సదాశివపేట
మోరంగపల్లిలో సంఘటన… పిడుగు పడి ఎద్దు మృతి… వికారాబాద్, ఆంధ్రప్రభ : ఈదురు
మహిళలపై బీజేపీ కపట ప్రేమ… ఎమ్మెల్యే బొజ్జు పటేల్…బిల్లులు వీగిపోతాయని బిజెపికి ముందే
బుద్ధ వెంకన్నను కలిసిన మాజీ కార్పొరేటర్లు
బుద్ధ వెంకన్నను కలిసిన మాజీ కార్పొరేటర్లు భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గం
సర్దార్ గౌతు లచ్చన్న సేవలు ఎనలేనిది….
సర్దార్ గౌతు లచ్చన్న సేవలు ఎనలేనిది…. పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్లోని
కాలేజీ విద్యార్థులు మజ్జిగ పంపిణీ…
కాలేజీ విద్యార్థులు మజ్జిగ పంపిణీ… పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక పైపుల రోడ్డు,
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం.. వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని
కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ..
కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ.. రాయపర్తి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ
ఎండ నుంచి రిలీఫ్.. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: నగరంలో గత కొద్ది రోజులుగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం ప్రయాణంచే వాళ్లు నానా అవస్తలు పడుతున్నారు. అలాంటి వారికి ఇది నిజంగా మంచి ఉపశమనం కలిగించే వార్త. నగరంలో ఆదివారం ఒఖ్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. చింతల్లోని పద్మానగర్లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షం నేల కూలింది. దీంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. కూకట్పల్లి, మూసాపేట్, జెఎన్టియు, నిజాంపేట్, కెపిహెచ్బి, జీడిమెట్ల ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.
11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి
11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ
తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు
తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు వేములవాడ, ఆంధ్రప్రభ : తెలంగాణ సత్తెమ్మ కు
టేకుమట్లలో ఆహ్లాదకర వాతావరణం టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో
అనాధ చిన్నారులకు అన్నితామైన తండావాసులు
సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : అనాధలైన చిన్నారులకు దిక్కెవరు ఆంధ్రప్రభ లో వచ్చిన
Breaking : బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఇరవై మంది మృతి
తమిళనాడులో భారీ పేలుడు జరిగింది
శివుని మహిమతో రాతిపై వెలసిన నంది
శివుని మహిమతో రాతిపై వెలసిన నంది జుక్కల్, ఆంధ్రప్రభ : అక్షయ తృతీయ
భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ..
భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా
ఘనంగా ఫాదర్ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు……
ఘనంగా ఫాదర్ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు…… పాయకాపురం, ఆంధ్రప్రభ :
హసన్ పర్తి జమా మసీద్ అధ్యక్షులుగా అహ్మద్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా అసంపూర్తి 66 డివిజన్ కేంద్రంలోని
రాణించిన కెకెఆర్ బౌలర్లు.. ఆర్ఆర్ స్కోర్ ఎంతంటే..
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఓపెనర్లు వైభవ్, యశస్వీలు పవర్ప్లేలోనే 63 పరుగులు చేశారు. 81 పరుగుల వద్ద ఆర్ఆర్ తొలి వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి కెకెఆర్ బౌలర్లు ఆర్ఆర్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆర్ఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటింగ్లో వైభవ్ 46, యశస్వీ 39 మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. కెకెఆర్ బౌలింగ్లో కార్తీక్, వరుణ్ చెరి మూడు, నరైన్ 2 వికెట్లు తీశారు.
దరువు జాతర’ను విజయవంతం చేయండి….
దరువు జాతర’ను విజయవంతం చేయండి…. అమరవరపు సతీష్ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ
Crazy Actress to Shake Leg with Ram Charan?
Global Star Ram Charan has to shoot for a pending item song for his upcoming film Peddi. A number of actresses are considered but no actress has been finalized. Names like Mrunal Thakur and others were speculated. The latest buzz is that crazy actress Samyuktha who has a handful of Telugu films is considered for […] The post Crazy Actress to Shake Leg with Ram Charan? appeared first on Telugu360 .
జలధార కింద అన్ని ఆలయాల పుష్కరిణిల్లో నీరు నింపాలి: చంద్రబాబు
అమరావతి: భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ భారం తగ్గుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ భారం తగ్గితే ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు వాడవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా జలధార-హారతి కార్యక్రమంపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ జరిపారు. క్షేత్రస్థాయిలో జలధార-జలహారతి పనులను సిఎంకు అధికారులు వివరించారు. ‘జలధార’ కు అన్నమయ్య కలెక్టర్ ను నోడల్ అధికారిగా నియమించారు. జలధార కింద అన్ని ఆలయాల పుష్కరిణిల్లో నీరు నింపాలని, అర్బన్ మండలాల్లో నోడల్ అధికారులు పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. నీటి సంరక్షణలో అన్నయ్య జిల్లా మోడల్ ప్రతిచోటా అమలు కావాలని, జలధార- జలహారతిలో ప్రజలను భాగస్వాములు చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి
మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ
దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం..
దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం.. జగిత్యాల ధర్మ పరిరక్షణ
అదుపుతప్పి కారు బోల్తా భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని భీమదేవరపల్లి క్రాస్ రోడ్
మానసిక దృఢత్వం.. ఆరోగ్యకర జీవితం..
మానసిక దృఢత్వం.. ఆరోగ్యకర జీవితం.. నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; మనిషి శారీరకంగా
కొంపల్లి బిగ్బాస్కెట్ గోదాంలో బయటపడ్డ పరిశుభ్రత లోపాలు #Kompally#BigBasket#FoodSafety#Warehouse
ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం
ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్
Deepika Padukone Announces Second Pregnancy
Bollywood top actors Deepika Padukone and Ranveer Singh are expecting their second child. The duo posted a beautiful picture featuring Dua with the announcement on their official Instagram page. Dua was born on September 8th, 2024. Deepika Padukone and Ranveer Singh raced to the top and they are now the highest paid actors. Ranveer Singh […] The post Deepika Padukone Announces Second Pregnancy appeared first on Telugu360 .
చెరవులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఉమన్(14) మునీరాబాద్లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు ఇర్ఫాన్(12) డబిల్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. విద్యార్థులు మునిగిపోతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని ఊర్కొండపేట జిల్లా
గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి…
గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి… నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సూర్యాపేట, ఆంధ్రప్రభ : టాక్టర్ బైకు ఢీకొన్న ప్రమాదంలో
మహబూబ్ నగర్ లో.. లారీ వెనుక నుంచి కారు ఢీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి, కుమారుడు మృతి చెందారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన కారు యజమాని ప్రకాష్ రెడ్డి భార్య నందినితో పాటు నాలుగేళ్ల కుమారుడు హైవేపై ఆగి ఉన్న లారీ వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం
గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం చెన్నూర్ ఆంధ్రప్రభ :
Janvi kapoor |వ్యూహం ఫలించేనా..?
Janvi kapoor | వ్యూహం ఫలించేనా..? Janvi kapoor | సౌత్ ఎంట్రీకి
ఓటమి బాధలో ఉన్న సిఎస్కెకి... ఊహించని షాక్
ఐపిఎల్ 19వ సీజన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ .. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచులలో విజయం సాధించింది.జ . ఇక శనివారం నసన్రైజర్స్ చేతిలో మళ్లీ ఓడంది. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న సిఎస్కె మరో షాక్ తగిలింది. . నిన్నటి మ్యాచ్లో గాయపడిన యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే ఈ సీజన్ మొత్తానికి జట్టు నుంచి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరుగుతుండగా.. ఆయుష్ గాయంతో బాధపడ్డాడు. అయితే ఆటను కొనసాగించాడు. అయితే ఔట్ కావడంతో మైదానం వీడాడు. అయితే మాత్రే గాయం చాలా తీవ్రమైందని జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపారు. ఈ ప్రకటనతో మాత్రే ఈ సీజన్ మొత్తానికి దూరం అవుతాడని స్పష్టంగా తెలుస్తోంది. మరి మాత్రే స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారానే విషయం కూడా తర్వాత తెలుస్తుంది.
గురుకుల విద్యార్థిలతో పోలీసుల ఇష్టాగోష్టి..
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్
పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చిన భట్టి విక్రమార్క
ఉట్నూర్, ఆంధ్రప్రభ : పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని ఉప
IPL MATCH |టాస్ ఓడిన కోల్కతా..
IPL MATCH | టాస్ ఓడిన కోల్కతా.. IPL MATCH | ఆంధ్రప్రభ
ఇంద్రవెల్లి ఘటనకు 46 ఏళ్లు అదిలాబాద్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి
Banjara Hills |తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Banjara Hills | తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే Banjara Hills
Miss India |విజేతగా సాధ్వి సతీశ్
Miss India | విజేతగా సాధ్వి సతీశ్ Miss India | ఆంధ్రప్రభ
ఎంపీ సహకారంతో పెద్దజట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పాలమూరు ఎంపీ డీకే అరుణ సహకారంతో గ్రామాన్ని అన్ని
జగిత్యాల, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బహిరంగ
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని
రేవంత్ మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ : హరీష్ రావు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి పోవాలి.. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మాజీ సిఎం కెసిఆర్ రావాలని కోరుకుంటున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ మొనగాడు కాదు..మోసగాడని ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..క్వింటాలు మీద 7 క్వింటాళ్ల తరుగు పెట్టి గోసపెడుతున్నారని రైతులు అంటున్నారని, వడ్లు కొనడం లేదని..5 కిలోల తరుగు పెడుతున్నారని విమర్శించారు. ఢిల్లిలో ముడుపులు కట్టడం..కుర్చి కాపాడుకోవడం రేవంత్ రెడ్డి చేసేదని, రేవంత్ మాటలకు ఎక్కువ..చేతలకు తక్కువని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్ బిసి లో మృతదేహాలను బయటకు తీయని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, రైతుబంధు రూ.15 వేలు, బోనస్ ఇస్తామన్నారని ఇచ్చారా? అని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెదవి మూసుకున్నారని, రుణమాఫీపై మొదటి సంతకం అన్నారని.. దేవుళ్లపై భద్రాద్రి రాములు, యాదాద్రి లక్ష్మినర్సింహ స్వామి, మెదక్ చర్చిలపై ఒట్టు పెట్టారని మండిపడ్డారు. వంద రోజుల్లో రుణమాపీ చేస్తామని చెప్పారని, బ్యాంకుల అకౌంట్లు విలీనం కాకుండా రైతులకు రుణమాఫీలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోయారని, అసెంబ్లీలో రుణమాఫీపై నిలదీస్తే అయిందని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ వచ్చాక 4 రైతుబంధు వచ్చాయని..ఒక్క రైతుబంధే వేశారని.. రెండు విడతల రైతుబంధు ఎగ్గొట్టారని, గత యాసంగికి ఇవ్వలేదని హరీష్ రావు దుయ్యబట్టారు.
Archery|నెలరోజులు ఆర్చరీ క్యాంప్
Archery| నెలరోజులు ఆర్చరీ క్యాంప్ మహబూబాబాద్ (మానుకోట), ఆంధ్రప్రభ : మహబూబాబాద్ (మానుకోట)
ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృతి
ఇటలీలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారయీతీయలు మృత్యువాత పడ్డారు. మృతులను కోవో ప్రాంతానికి చెందిన రాజిందర్ సింగ్(48), అగ్నాడెళ్లకు చెందిన గుర్మిత్ సింగ్(48)గా గుర్తించారు. వైశాఖి పండుగ సందర్భంగా బెర్గామో ప్రావిన్స్లో ఉన్న ఓ గురుద్వారా నుంచి బయటకు వస్తుంటే ఇద్దరిపై కాల్పులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది. అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి కారులో పారిపోయిన్టుల తెలలిపింది.
సురక్షిత ప్రయాణమే లక్ష్యం… ఆర్టీసీ డ్రైవర్ వెంకటేష్కు ఘన సన్మానం కడెం, ఆంధ్రప్రభ
Koratala |ఒకేసారి రెండు సినిమాలు..
Koratala | ఒకేసారి రెండు సినిమాలు.. Koratala | దేవర 2పై అనిశ్చితి..
తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణంలో ఆదివారం శ్రీ రుద్రయాగం–చండీయాగం ఘనంగా నిర్వహించారు.
నేతకాని కులాన్ని గెజిట్లో చేర్చాలి
నేతకాని కులాన్ని గెజిట్లో చేర్చాలి బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నేతకాని
చిత్తూరులోకి చిరుత పులులు రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంకలవరపెడుతున్న జింకల మృతి చిత్తూరు,
బాదంపల్లి గోదావరి రేవులో ఘటన..
బాదంపల్లి గోదావరి రేవులో ఘటన.. పందిగోలీలు కొరికిన మూడు గేదెలకు తీవ్రగాయాలు..వన్యప్రాణుల కోసం
Bollywood |తల్లికాబోతున్నట్లు ప్రకటించిన దీపిక పదుకొనే
Bollywood | తల్లికాబోతున్నట్లు ప్రకటించిన దీపిక పదుకొనే Bollywood | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ ప్రైవేట్ బంగారు గని #AndhraPradesh #Kurnool #Jonnagiri #GoldMine
Womens |అక్షయ తృతీయకు జోరుగా కొనుగోళ్లు
Womens | అక్షయ తృతీయకు జోరుగా కొనుగోళ్లు Womens | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
హయత్ నగర్ లో హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: కాలేజీలో అంటెడెన్స్ ఫీజులు కట్టలేదని యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయతనగర్ మండలంలో జరిగింది. వనస్థలిపురం శ్రీ ఇందు కాలేజీలో మ్యాదరి ప్రణీత్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో అటెండెన్స్ విషయమై కండోనేషన్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో హయత్ నగర్ లో తన ఇంట్లో ఉరివేసుకొని ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కాలేజీ ముందు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆందోళనకు దిగారు.
40 degrees |తెలంగాణలో భానుడు భగభగ
40 degrees | తెలంగాణలో భానుడు భగభగ 40 degrees | ఆంధ్రప్రభ
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన రాహుల్ గాంధీ నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్థం
జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 19తరిగొప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళల అభ్యున్నతికి, సాధికారత కోసం 33శాతం మహిళా …
'మైసా' కోసం బ్యాంకాక్ శిక్షణ నటి రష్మిక #Rashmika #Mysa #Tollywood #ActionFilm #BangkokTraining
HYD | పలు అంశాలపై చర్చలు HYD | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
Revanth Reddy Government Plans Free MMTS Travel in Hyderabad to Ease Traffic and Pollution
The Telangana government led by Revanth Reddy is preparing to introduce free travel in MMTS trains across Hyderabad. The proposal is expected to begin on a pilot basis from Telangana Formation Day, marking a significant shift in urban transport policy. The initiative aims to make suburban rail travel more accessible while reducing the growing burden […] The post Revanth Reddy Government Plans Free MMTS Travel in Hyderabad to Ease Traffic and Pollution appeared first on Telugu360 .
Andhra Pradesh : నియోజకవర్గాలు పెరుగుతాయా? అదే ప్రధాన అడ్డంకి?
ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా?
Chandrababu Naidu to Campaign in Tamil Nadu, Focus on NDA Vision
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is set to begin an election campaign in Tamil Nadu over the next two days. His visit is expected to cover key regions with a significant Telugu population, including Coimbatore, Hosur, Chennai, and Avadi. The campaign is designed to connect with Telugu voters who have a strong presence in […] The post Chandrababu Naidu to Campaign in Tamil Nadu, Focus on NDA Vision appeared first on Telugu360 .
మహిళా బిల్లును అడ్డుకోవడం పట్ల బీజేపీ నిరసన
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ లో నారీ శక్తి మహిళా బిల్లును
మేము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు డీలిమిటేషన్ కు: చామల
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇండియా కూటమిపై బిజెపి దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలని సూచించారు. 2024 తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని చామల ప్రశ్నించారు. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని.. డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకమని తెలియజేశారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా డీలిమేషన్ చేయండని చామల కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిని కోరారు.
Money |కాసుల కోసం వివాదాస్పద చర్యలపై విమర్శలు
Money | కాసుల కోసం వివాదాస్పద చర్యలపై విమర్శలు Money | డబ్బు
హైదరాబాద్: 'మైసా' సినిమాలో రష్మిక మందనా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్ సంస్థ నిర్మిస్తుండగా రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో రష్మిక మెరువనున్నారు. ఆమె ప్రధానపాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం శక్తివంతమైన గోండు గిరిజన అమ్మాయిగా నటించనుంది. ఈ మూవీలో యాక్షన్ కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించేందుకు ఆమె స్టంట్, కాంబాట్ శిక్షణ బ్యాంకాంక్ లో తీసుకుంటుంది. ప్రతీ రోజు రష్మిక ఎనిమిది గంటల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటుంది. అడ్వాన్స్డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హైస్పీడ్ యాక్షన్లో ఆమె మెలకువలు నేర్చుకుంటుంది. కథ తెలిసిన రోజే తనను పూర్తిగా మార్చుకోవాలని ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ శిక్షణ తీసుకున్న అనంతరం కేరళలో 16 రోజుల పాట పైటింగ్ సీన్ షూటింగ్ చేయనున్నట్టు సమాచారం.
దాహార్తిని తీర్చుతున్న కేడీసీసీ..
దాహార్తిని తీర్చుతున్న కేడీసీసీ.. ఆంధ్రప్రభ, విజయవాడ ; వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని

37 C