మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: సిరుల గని సింగరేణిని సిఎం రేవంత్రెడ్డి స్కామ్ల మయంగా మార్చారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్ పి ఉప నేత హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గం మం దమర్రి మున్సిపాలిటీలోని క్యాతన్పల్లిలో జరిగిన ప్రచార సభలో హరీశ్ పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ను చీరి చింతకు క ట్టాలని పిలుపునిచ్చారు. లేదంటే ఐదారేళ్లలో సిం గరేణిని ఆయన ఖతం పట్టిస్తారని ఆందోళన వ్య క్తం చేశారు. బ్యాంకుల్లో అప్పు తెస్తే గాని జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. సైట్ విజిట్ పద్ధతి తెచ్చి ఓబీ కాంట్రాక్టుల్లో వేల కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. అనుయాయులకు టెండర్లు ఇచ్చి, కమీషన్లు పంచుకున్నారని, సైట్ విజిట్ వచ్చాక మొదటి టెండర్ రేవంతు బామ్మర్ది సృజన్ రెడ్డికి దక్కిందని, మొత్తం ఆరువేల కోట్ల టెండర్ దక్కించుకున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలో అయిన టెండర్లు రద్దు చేసి 20 శాతం అదనం కలిపి టెండర్లు ఇచ్చారని తెలియజేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరపరని నిలదీశారు. సిట్టింగ్ జడ్జితో కానీ, సిబిఐతో కానీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి, ఫైనాన్స్ టెండర్ 7 సార్లు తేదీలు మార్చారు. లెక్కలు కుదరడం లేదని వాయిదా వేసారు. డీజిల్ స్కాం, జిలిటెన్ స్టిక్స్ స్కాం, నైనీ కోల్ స్కాం, సోలార్ పవర్ స్కాం చేసారు. బంగారు బాతును కోసుకుతింటున్నరు. ఇట్లనే పోతే ఐదు, పదేండ్లలో సింగరేణిని ఖతం చేస్తారు. చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే కేసీఆర్ పునరుద్దరించారు. నెల నెలా మెడికల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి 16,500 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక మెడికల్ బోర్డు బంద్, డిపెండెంట్ ఉద్యోగాలు బంద్, నడవలేని వారిని గుండెకు బై పాస్ సర్జరీ చేసుకున్న వాళ్లను అన్ ఫిట్ చేయడం లేదు. కార్మిక మంత్రిగా ఉన్న వివేక్.. కార్మికులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడడు అని ప్రశ్నించారు. ఏఐటీయూసీ నాయకులు, సీపీఐ నాయకులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్తో గళం కలిపేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కార్మికులు ఇచ్చే బోనస్ కూడా బోగస్ చేసిండు రేవంత్ రెడ్డి. నిమ్స్కు తప్ప కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు వైద్యం అందకుండా చేసిండు. రెండేళ్లుగా సింగరేణి సీఎండీని కూడా నియమించలేదు. సింగరేణి స్కాం బయట పెడితే తెల్లారి నాకు రేవంత్ రెడ్డి ప్రేమ లేఖ పంపిండు. నన్ను విచారణకు పిలిచిండు, నోటీసులు పంపిండు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ గురించి ఆయన మాట్లాడుతున్న భాషను ఒప్పుకుంటరా? ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? అని నిలదీశారు. స్కాంల గురించి అడిగితే డైవర్షన్ స్కీంలు తెస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు డైవర్షన్ పెడుతరు అని జోస్యం చెప్పారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కేసు ను సుప్రీం కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. తమ ఈ ఆదేశాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాటిస్తారని ఆశిస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు ధర్మాసనం వి చారణకు చేపట్టింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ తరపున న్యాయవాది అ భిషేక్ సింఘ్వి కేసుపై తన వాదన వినిపిస్తూ మొత్తం పది మంది ఎ మ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో స్పీకర్ ఇప్పటికే ఎనిమిది పిటిషన్లపై స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. మరో రెండు పిటిషన్ల పై విచారణ పూర్తి చేసేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలని సింఘ్వి కోరారు. ఈ దశలో బిఆర్ఎస్ తరఫు న్యాయవాది మో హిత్రావు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే నాలుగు వారాల గడువు తీసుకున్నారని, మళ్ళీ గడువు కోరుతున్నారని అన్నారు. ఎనిమిది మంది ఎమ్మెలపై స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత మిగిలిన ఇద్దరికి నాలుగు వారాల గడువు ఎందుకంటూ అభ్యంతరం చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని, ఇంత కంటే ప్రధాన సాక్షం అవసరం లేదన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసినప్పుడు బహిరంగంగా ఆ పార్టీకి ప్రచారం చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు. న్యాయవాది సింఘ్వి కల్పించుకుని రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున గడువు కోరానని చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని మూడు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. తమ ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో తాము ధిక్కరణ పిటిషన్పై విచారణ చేపడతామని చెప్పారు.
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నేపాలీ ముఠా మరోసారి హైదరాబాద్లో భారీ చోరీ చేసింది. వాచ్మెన్కు మత్తుమందు ఇచ్చి యజమాని ఇంట్లోని రూ.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను ఎత్తుకుని వెళ్లారు. ఈ సంఘటన గురువారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్లో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం... నందగిరిహిల్స్లోని ఓ ఇంట్లో నేపాల్కు చెందిన భువన్ అనే వ్యక్తి 15 రోజుల క్రితం వంటమనిషిగా చేరాడు. ఇంట్లో పనిచేస్తూనే యజమానికి సంబంధించిన ఆభరణాలు, వజ్రాలు, విలువైన వస్తువులు ఎక్కడ పెడుతున్నాడో గమనించాడు. ఈ క్రమంలోనే ఇంటి యజమానులు లేని సమయం చూసి మరో ముగ్గురు నేపాలీలతో కలిసి భారీ చోరీ చేశాడు. గురువారం ఇంటి యజమానులు ఫంక్షన్కు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన భువన్ ఇంట్లో పనిచేస్తున్న వారికి తన పుట్టిన రోజు అని చెప్పి స్వీట్లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఇది తిన్న వాచ్మెన్తోపాటు మిగతా పనివారు నిద్రలోకి జారుకోవడంతో మరో ముగ్గురు నేపాలీలను ఇంట్లోకి చొరబడి లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు, వజ్రాలను ఎత్తుకుని పారిపోయారు. మత్తులో నుంచి పనివారు తేరుకున్న తర్వాత విషయం గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చెరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నందగిరి హిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు సిసి టివిల ఫుటేజ్ను పరిశీలించారు. నలుగురు నేపాలీలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన నేపాలీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
శనివారం రాశి ఫలాలు (07-02-2026)
మేషం వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వృషభం నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మిధునం విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కర్కాటకం వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. సింహం ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. కన్య నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది. తుల ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృశ్చికం నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. ధనస్సు ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. మకరం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. కుంభం చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. మీనం ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.
USA జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ లోకి అడుగు పెట్టగానే పానీ పూరీ
కొత్తగూడెం అభివృద్ధి సీపీఐకే సాధ్యం
నిబద్ధత గల అభ్యర్థులను గెలిపించండికమ్యూనిస్టులది అక్రమాలకు తావులేని పాత్రప్రలోభాలకు లొంగొద్దు: ప్రచార సభల్లో కూనంనేని విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్ అభివద్ధి చెందాలంటే అది ఒక్క సీపీఐ వల్లనే సాధ్యమౌతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పొరేషన్ పరిధిలో 20, 57, 49, 10, 58. 59. 60 డివిజన్లలో శుక్రవారం భారీ రోడ్ షోలు, సభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కూనంనేని […] The post కొత్తగూడెం అభివృద్ధి సీపీఐకే సాధ్యం appeared first on Visalaandhra .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కపిపుచ్చుకోవడానికి మున్సిపల్ ఎన్నికల సమయంలో తిట్ల దండకం అందుకున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్లో పడవద్దని తెలంగాణ సమాజానికి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై ప్రస్తుతం ఒక వికృతమైన రాజకీయ క్రీడ నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కెసిఆర్ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి కెసిఆర్ అని కొనియాడారు. కెసిఆర్ ఎప్పుడూ బిరుదుల కోసం, సన్మానాల కోసం పాకులాడలేదని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని తెలిపారు. నేడు అధికార గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కెసిఆర్ వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద జరుగుతున్న దాడి అని అభివర్ణించారు. రేవంత్ రెడ్డి పన్నుతున్న తిట్ల ట్రాప్లో పార్టీ శ్రేణులు ఎవరూ పడకూడదని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది వార్డుల్లోని మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ అందాల్సిన పథకాల మీదనే కానీ, రేవంత్ రెడ్డి తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ ఒక ధ్రువతార ప్రజల కన్నీటిని తుడిచే దిశగా మన పోరాటం సాగాలని, అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల కష్టాల గురించి గొంతెత్తాలని సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనకు, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఆయనను గల్లా పట్టి అడగాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, డి.ఎలు, పిఆర్సి లేక నలిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడాలని కోరారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, మన నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి కోవర్టు ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల తీర్పే కెసిఆర్కి ఇచ్చే అసలైన గౌరవం అని, పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ ఒక ధ్రువతార అని, ఆయన కీర్తి నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఇది ఒక గ్రహణ కాలం అని, రేవంత్ అనే రాహువు నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందామని కెటిఆర్ పిలుపునిచ్చారు.
ప్రగతిశీల శక్తుల ఐక్యతకు దోహదం
న్యూదిల్లీ: మార్క్సిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తమిళనాడులోని లౌకిక ప్రగతిశీల ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక కతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై, ఎగ్మోర్లో కొన్నెమరా ప్రజా గ్రంథాలయంలో మార్క్స్ విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆవిష్కరించారు. దీనిని స్వాగతిస్తూ… ఈ చర్య ప్రగతి శీలశక్తుల ఐక్యతకు దోహదమని డి.రాజా అన్నారు. మానవ చరిత్రలోని మహనీయులను గౌరవించే […] The post ప్రగతిశీల శక్తుల ఐక్యతకు దోహదం appeared first on Visalaandhra .
పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రాహుల్ గాంధీ గొడవ
టీటీడీ ఈవో రవిచంద్ర బాధ్యతల స్వీకరణ
విశాలాంధ్ర – తిరుమల: శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమల ఆలయంలో ఆయన శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. టీటీడీ బోర్డు ఎక్సఅఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు సంప్రదాయం ప్రకారం వరాహ స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. నూతన ఈవోకు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరణ […] The post టీటీడీ ఈవో రవిచంద్ర బాధ్యతల స్వీకరణ appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: ప్రధాని మోదీ దురుసుతనం తగ్గిందని, ఆయన నైతికత దెబ్బతిన్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే శుక్రవారం వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగాన్ని విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నల కు సమాధానం ఇవ్వడానికి మోదీ భయపడిపోయారని, అందుకోసమే దిగువ సభలో ప్రసంగించకుండా తప్పించుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల మాటలు, ప్రకటనలను మోదీ వక్రీకరిస్తున్నా రని ఆయనకు సమాధి తవ్వుతామన్న వ్యాఖ్యలనుద్దేశించి ఖడ్గే అన్నారు. వారి సిద్ధాంతానికి పాతేస్తామని చెబుతున్నామేగానీ వ్యక్తిని కాదని […] The post దెబ్బతిన్న మోదీ నైతికత: ఖడ్గే appeared first on Visalaandhra .
అండర్-19 ప్రపంచకప్ మనదే . ఫైనల్ పోరులో ఇంగ్లాండ్పై ఘన విజయం. ఆరోసారి జగజ్జేతగా యువభారత్. వైభవ్ విధ్వంసక శతకం…80 బంతుల్లో 175 హరారే: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ పోరులో కెప్టెన్ ఆయుష్మాత్రే నేతత్వంలోని యవభారతజట్టు 100 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ అండర్-19 ప్రపంచకప్ను ఆరోసారి గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. జింబాబ్వే రాజధాని హరారేలో శుక్రవారం భారత్`ఇంగ్లాండ్ జట్ల […] The post జయహో భారత్ appeared first on Visalaandhra .
9 మంది మావోయిస్టులు, కమాండో మృతి విశాలాంధ్ర(చింతూరు): మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది. చత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు అగ్రనేత ఉదమిసింగ్ మృతి చెందిన 24 గంటల్లోనే మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పాడెవాడ అభయారణ్యంలో భద్రతాబలగాలుమావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి – నారాయణపూర్ జిల్లాల సరిహద్దున పాదెవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో పోలీసులు, సీ-60 […] The post గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ appeared first on Visalaandhra .
. దేశంలోనే తొలి అధునాతన సాంకేతిక వ్యవస్థ. నేడు క్వాంటం భవనానికి శంకుస్థాపన విశాలాంధ్ర – సచివాలయం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అధ్వర్యంలో “అమరా వతి క్వాంటం వ్యాలీ” ఏర్పాటుకు శనివారం కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, […] The post అమరావతిలో ‘క్వాంటం’ విప్లవం appeared first on Visalaandhra .
భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశా లోని చాందీపూర్లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజిలో ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్షాలు అన్నిటినీ ఈ క్షిపణి సాధించిందని పేర్కొంది. ఈ పరీక్షతో భారత దళాల సామర్థం, యుద్ధ సన్నద్ధత, మరింత పెరిగిందని పేర్కొంది. అగ్ని సిరీస్కు సంబంధించి భారత్ వద్ద వివిధ రకాల క్షిపణులు ఉన్న విషయం తెలిసిందే. అగ్ని1 క్షిపణి 700కిమీ దూరంలో లక్షాలను, అగ్ని2 క్షిపణి 2 వేల కిమీ, అగ్ని3 క్షిపణి 3 వేల కిమీ దూరం లోని లక్షాలను సాధించగలవు. అగ్ని 4 నాలుగువేలకిమీ, అగ్ని 5 అత్యధికంగా 5 వేల కిమీ దూరంలో లక్షాలు సాధిస్తాయి. ఇక అగ్ని1 క్షిపణితో 220కిమీ కనిష్ఠ దూరం లోని లక్షాలను కూడా ధ్వంసం చేస్తాయని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 150300 కిమీ దూరం లోని లక్షాలను ఛేదించే పృద్వి సిరీస్ క్షిపణులకు అనుబంధంగా అగ్ని1 క్షిపణిని వినియోగించుకోవచ్చని పేర్కొన్నాయి. మరోవైపు వివిధ దేశాలు అగ్ని క్షిపణులపై ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటికోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి.
69 మంది మృతి – 170 మందికి గాయాలు ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఇస్లామాబాద్, తర్లాయ్ ప్రాంతంలోగల ఖతీజాతుల్ కుర్బా మసీదు`ఇమాంబార్గా కిక్కిరిసిన సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 69 మంది ప్రాణాలు కోల్పోగా, 170 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తిని ఇమాంబార్గ ప్రవేశం వద్ద అడ్డుకోగా అతను అక్కడికక్కడే ఆత్మాహుతికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మతుల సంఖ్య 31కు […] The post పాక్ మసీదులో ఆత్మాహుతి appeared first on Visalaandhra .
మణిపూర్లో బంద్...కుకీల ఆగ్రహంతో ఉద్రిక్తత
మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో శుక్రవారం పూర్తి స్థాయిలో హర్తాళ్ జరిగింది. దీనితో సాదారణ జనజీవితం స్తంభించింది. కుకీ జో ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాలో రెండు ఆదివాసీ సంస్థలు బంద్కు పిలుపు నిచ్చాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఇద్దరు ఈ ప్రాంతపు ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదానికి దారితీసింది. శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో నిరసనకారులు చేతుల్లో లాఠీలు పట్టుకుని జిల్లా ప్రదాన కేంద్రంలో వచ్చిపోయే వాహనాలను నిలిపివేశారు. మార్కెట్లు మూతపడ్డాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరీ తక్కువగా ఉంది. తుయిబాంగ్ ప్రాంతంలో బంద్ ప్రబావం తీవ్రంగా కన్పించింది.
లాభాల బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, శుక్రవారం వెండి ధర కిలోకు రూ.13,155 తగ్గి రూ.24184కు చేరుకుంది. గత రెండు రోజుల్లో వెండి మొత్తం రూ.41,278 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,013 తగ్గి రూ.1,51,489గా నమోదైంది. రెండు రోజుల్లో బంగారం ధర రూ.6,669 తగ్గింది. జనవరిలో పసిడి, వెండి ఆల్టైమ్ హైని తాకాయి.
ప్రశ్నలు అడగడం కోసం ఓ వ్యక్తిని పోలీసు అధికారి అరెస్ట్ చేయకూడదు: సుప్రీంకోర్టు
కేవలం ప్రశ్నలు అడగడం కోసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకూడదని, పోలీసు అధికారి అరెస్ట్ చేశారు అంటే చట్టబద్ధమైన వివక్షత తోనే చేయాలని, అది తప్పనిసరి అని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు పేర్కొంది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ ఎస్ ఎస్) 2023 నిబంధనల ప్రకారం పోలీసు అధికారి అధికారాలను కేవలం సౌకర్యం కోసం కాకుండా, స్పష్టమైన అవసరంగా భావించాలని జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్ కె సింగ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అంటే, పోలీసు అధికారి కేవలం ప్రశ్నలు అడగడానికి అరెస్ట్ చేయవచ్చని దీని అర్థంకాదని ధర్మాసనం తెలిపింది.ఓ వ్యక్తి కనీసం ఏడు సంవత్సరాల శిక్ష పడే కేసుకు సంబంధించి నేరంలో ప్రశ్నించాల్సినప్పుడు అతడిని అరెస్ట్ చేస్తే తప్ప, కేసు ముందుకు సాగదని పోలీసు అధికారి సంతృప్తి పడినప్పుడే, అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందుకు విరుద్ధంగా ఏదైనా వివరణ ఇస్తే, బిఎన్ఎస్ఎస్ 2023 లోని సెక్షన్లు 35(1)(బి), సెక్షన్లు 35(3)నుంచి 36(6) వరకూ ఉన్న ఉద్దేశ్యాలకు భిన్నంగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్ ను విచారిస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఏడు సంవత్సరాలవరకూ శిక్ష విధించదగిన నేరానికి సంబంధించిన అన్ని కేసులలో బిఎన్ఎస్ఎస్ 2023 లోని సెక్షన్ 35(3) కింద నోటీసులు తప్పనిసరిగా జారీ చేయాలా వద్దా అన్న ప్రశ్నను నిర్ణయిస్తున్నది. సెక్షన్ 35(3) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం నిబంధనల ప్రకారంఅరెస్ట్ చేసే అధికారం పోలీసు అధికారి అధికారాల వినియోగంలో ఆయన వివక్షతపై ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
అండర్19 వన్డే ప్రపంచకప్లో భారత యువ జట్టు అదరగొట్టింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి తన ఖాతాలో ఆరో ప్రపంచకప్ ట్రోఫీని జత చేసుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ టీమ్కు ఓపెనర్ బెన్ డాకిన్స్ శుభారంభం అందించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బెన్ స్కోరును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ జోసెఫ్ 4 ఫోర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. చెలరేగి ఆడిన బెన్ 56 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. వన్డౌన్లో వచ్చిన బెన్ మెయిస్ విధ్వంసక ఇన్నింగ్స్తో అలరించాడు. చెలరేగి ఆడిన మెయిస్ 28 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ థామ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రాల్ఫి అల్బర్ట్ (0), ఫర్హాన్ అహ్మద్ (1), సెబాస్టియన్ మోర్గాన్ (0) విఫలమయ్యారు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన కలెబ్ ఫాల్కనర్ విధ్వంసక శతకం సాధించాడు. భారత బౌలర్లను హడలెత్తించిన ఫాల్కనర్ 67 బంతుల్లోనే 9 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి ఔటయ్యాడు. జేమ్స్ (28) అతనికి అండగా నిలిచాడు. మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో అంబ్రిష్ మూడు, దీపేశ్, కనిష్క్ చౌహాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. వైభవ్ సునామీ.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అండగా నిలిచాడు. ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన వైభవ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రె అతనికి సహకారం అందించాడు. ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేసిన వైభవ్ ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను ఊచకోత కోశాడు. అతన్ని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దూకుడుగా ఆడిన వైభవ్ 55 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత చెలరేగి పోయాడు. మరో 75 పరుగులను 25 బంతుల్లోనే అందుకున్నాడు. దీన్ని బట్టి వైభవ్ విధ్వంసం ఏ రీతిలో సాగిందో ఊహించు కోవచ్చు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 80 బంతుల్లోనే 15 ఫోర్లు, మరో 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. కెప్టెన్ మాత్రె (53), వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30), అభిజ్ఞాన్ కుందు (40)లు కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ స్కోరు 411 పరుగులకు చేరింది. వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్ అవార్డును సొతం చేసుకున్నాడు. కాగా, భారత్కు అండర్19 వరల్డ్కప్లో ఇది ఆరో ట్రోఫీ కావడం విశేషం.
ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి
నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో చర్చించాలిజి. కోటేశ్వరరావు.విశాలాంధ్ర`విజయవాడ: కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. నగరంలోని దాసరిభవన్లో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు కంచర్ల భార్గవ్ అధ్యక్షతన శుక్రవారం నగర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోటేశ్వరరావు మాట్లాడుతూ నెలకు రూ 3వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి […] The post ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి appeared first on Visalaandhra .
తూర్పుగోదావరి జిల్లాలో ఎట్టకేలకు చిక్కిన పులి#TigerCaptured#EastGodavari#ForestDepartment#Wildlife
కిందటి సార్వత్రిక ఎన్నికలలో మోదీ నాయకత్వంలో బీజేపీ 240 స్థానాల దగ్గరే ఆగిపోయి ఉండొచ్చు. మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ మోదీ మెజారిటీ గణనీయంగా తగ్గి ఉండొచ్చు. కానీ ఆయనను ప్రధానిగా ఎన్నుకున్నది లోకసభ సభ్యులే. ఆయనా లోకసభ సభ్యులే. గురువారం మోదీ లోకసభకు రాకుండా తప్పించుకున్నారు. మాజీ సైన్యాధిపతి జనరల్ నర్వణే రాసిన “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ” గ్రంథంలోని అంశాలను ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ సోమవారం చదివి వినిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వపక్ష తాబేదారుగా […] The post లోకసభ నుంచిమోదీ పలాయనం appeared first on Visalaandhra .
బీజని బాలమణి ప్రచారం ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
‘బ్లాక్ బుక’ ఒక వ్యవస్థ చీకటి చరిత్ర
నంబూరి చంద్రశేఖర్ నైతికత అనే సన్నని గీతను చెరిపేసినప్ప్పుడు, మనిషి నిర్మించుకునే సామ్రాజ్యాలు కేవలం బాహ్య ప్రపంచానికి కాంతిమంతంగా కనిపిస్తాయి. కానీ, లోపల కుళ్లిపోయిన శవాల వాసన వస్తూనే ఉంటుంది. జెఫ్రీ ఎప్స్టీన్ కథ ఒక నేరగాడి చరిత్ర కాదు, అది మానవ నైతికత పతనానికి పరాకాష్ట. సమాజంలో అత్యున్నత శిఖరాల్లో ఉన్నామని చెప్పుకునే మేధావులు, రాజకీయవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు ఒక వ్యక్తి పంచన చేరి తమ విచక్షణను ఎలా తాకట్టు పెట్టారో చూస్తుంటే, అసలు నాగరికత […] The post ‘బ్లాక్ బుక’ ఒక వ్యవస్థ చీకటి చరిత్ర appeared first on Visalaandhra .
మానవాళికి స్వేచ్ఛాయుత పలస్తీనా అవసరం
వినీత్ తివారి ఇజ్రాయెల్ పలస్తీనియన్ల పరిస్థితి ఎలా ఉంటుందో నేను కళ్లారా చూసిన, విన్న మాటలను ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. వాస్తవాలను అన్వేషించే ఒక బృందంతో కలిసి హింస, మత ఘర్షణలు, నర్మదా బచావో ఆందోళన, గిరిజన సంస్థల ఉద్యమాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లాను. పలస్తీనా ప్రయాణం పెద్ద సవాలే. మొదట భయపడ్డాను. అక్కడ మన శరీరాన్ని, మెదడుని స్కాన్ చేసేంత పెద్దపెద్ద సిసి టీవీ కెమెరాలుంటాయి. ఇజ్రాయిల్ తన ఆయుధ శక్తితో న్యాయాన్ని బంధించగల […] The post మానవాళికి స్వేచ్ఛాయుత పలస్తీనా అవసరం appeared first on Visalaandhra .
శబరిమల బంగారం చోరీ, సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు ముమ్మరం అయ్యింది. శుక్రవారం ఈ కేసులో ప్రముఖ నటుడు జయరామ్కు ఇడి సమన్లు పంపించింది. విచారణకు రావాలని తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిని కూడా ఇడి వర్గాలు విచారిస్తాయి. ఆలయ ద్వారం బంగారు తాపడం మాయం ఉదంతం కేరళలో సంచలనానికి దారితీసింది. పొట్టి ఈ కేసుకు సంబంధించే జైలులో ఉన్నారు. కొల్లాం న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో విడుదల అయ్యాడు. మొత్తం వ్యవహారంపై కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కూడా కొనసాగుతోంది. తాము సమన్లు వెలువరించడంతో మలయాళ నటుడు జయరామ్ వచ్చే కొద్దిరోజుల్లోనే తమ ముందుకు విచారణకు వస్తారని ఇడి వర్గాలు తెలిపాయి. ఆలయ బంగారం మాయం ఉదంతంలో ఇడి ఇప్పటికే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) మాజీ కార్యనిర్వాహక అధికారి మురారీ బాబును, ఉద్యోగి ఎస్ శ్రీకుమార్ను విచారించింది. శ్రీ కుమార్ పాత్ర కీలకం కావడంతో ఆయన తిరిగి విచారణకు రావాలని ఇడి ఆదేశించింది.
రాజుల పాలనో, బ్రిటీషు వారి పాలనో నయం. అసలు ప్రజాస్వామ్యం ఇందుకేనా ? ఇంతకంటే నీచ రాజకీయాలు ఇక ముందు చూడం. ఏంటి బావ ఈరోజు ఉదయమే ప్రజాస్వామ్యం వద్దంటూ బయలుదేరావు. కాకపోతే ఏంటయ్యా మనల్ని మనమే మన అవసరాలు తీర్చుకొని మనల్ని మనమే పాలన చేసుకోమని ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నాం. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వపడుతున్నాం. ఒకరకంగా చెప్పాలంటే ఇతర దేశాలు మన ప్రజాస్వామ్య పాలన చూసి ఈర్ష్య పడుతుంటే మనమేంటి […] The post ప్రజాస్వామ్యం ఇందుకేనా? appeared first on Visalaandhra .
ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి గ్యాందంగి తిరుపతి ప్రచారంలో అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ
ఎన్కౌంటర్ లో ముగ్గురు నక్సల్స్, జవాను మృతి
గడ్చిరోలి ః మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. దీనితో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య మూడుకు చేరింది. పరస్పర కాల్పుల్లో అంతకు ముందు తీవ్రంగా గాయపడ్డ పోలీసు అధికారి ఒకరు చికిత్స దశలో ఆసుపత్రిలో చనిపోయాడు. మూడు రోజుల క్రితం ఆపరేషన్ ఆరంభమైంది. ఇప్పటివరకూ మొత్తం ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. గడ్చిరోలి నారాయణ్పూర్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఫోడేవాడ గ్రామం వద్ద ఎన్కౌంటర్ తీవ్రస్థాయిలో సాగుతోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కేడర్ ఉందని సమాచారం అందడంతో ఏరివేతకు జవాన్ల బృందం ఇక్కడికి వచ్చింది. గడ్చిరోలి, గోండా జిల్లాల్లో నక్సలైట్ల ఏరివేతకు మహారాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక సి 60 పోరాట దళం ఇక్కడ రంగంలోకి దిగింది. ఈ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున మరిన్ని దళాలను తరలించి, పూర్తి స్థాయిలో మావోయిస్టుల నిర్మూలనకు దిగాలని సంకల్పించారు. ఇప్పటి ఎన్కౌంటర్లో మృతి చెందిన నక్సలైట్లు ఎవరనేది గుర్తించలేదు. ఇక చనిపోయిన పోలీసుజవానును దీపక్ చిన్నా మాధవిగా గుర్తించారు. గాయపడ్డ మరో జవాను జోగా మాధవిని కూడా ఇసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి ఈ జవాను బయటపడ్డారని అధికారులు తెలిపారు.
ఢిల్లీ షాంఘై మధ్య ఇండిగో విమానం
ఢిల్లీ షాంఘై మధ్య నేరుగా విమానాల నిర్వహణకు విమానయాన సంస్థ ఇండిగో యోచిస్తోంది. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత భారత్, చైనాలు పరస్పరం విమానయాన పునరుద్ధరణకు నిర్ణయించాయి. ఈ క్రమంలో షాంఘైకి నేరుగా ఎక్కువ విమానాలు నిర్వహిస్తే ఈ ఘనత దక్కించుకునే విమానయాన సంస్థల్లో ఇండిగో మూడవది అవుతుంది. షాంఘైకి విమాన సర్వీసులకు ఆమోద ముద్ర దక్కితే ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష విమానయాన సౌకర్యాల్లో ఇది మూడవది అవుతుందని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ శుక్రవారం తెలిపింది. ఇక చైనా ఈస్టర్న్ విమానయాన సంస్థ షాంఘై ఢిల్లీల మధ్య విమానాలను గత ఏడాది నవంబర్లో ఆరంభించింది. ఇక ఢిల్లీ బీజింగ్ మధ్య కూడా నేరుగా విమానాలను నడిపించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. మొత్తం మీద చైనాలోని నగరాల నుంచి భారత్లోని ప్రధాన కేంద్రాలకు క్రమేపీ విమాన సర్వీసులు నిర్వహణ వేగవంతం అయింది. ఇరుదేశాల మధ్య ప్రజల పరస్పర కదలిక ప్రక్రియకు , తద్వారా సాదారణ సంబంధాల పునరుద్ధరణకు దారి ఏర్పడిందని చైనా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తస్లీమ్ సుల్తానా ప్రచార ప్రభంజనం
భారీ మెజార్టీతో గెలిపించాలని విన్నపం బెల్లంపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల
10వ వార్డులో డీకొండ పద్మ ప్రచార జోరు
గెలుపే లక్ష్యంగా అడుగులు బెల్లంపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో
పదేళ్లు పాలించిని ‘దొర’ రేషన్ కార్డు ఇవ్వకపాయే: మంత్రి పొంగులేటి
గత పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా ఆనాటి దొరకు లేకుండాపోయిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ఏదులాపురం మున్సిపాల్టీ,కొత్తగూడెం కార్పోరేషన్ లో పాల్వంచ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడ్తూ తమ రెండేళ్ళ కాలంలోనే అడిగిన వారందరికిరేషన్ కార్డులను ఇచ్చామని,అంతేగాక అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు ఎన్నికలు రాగానే చుట్టాల్లా వస్తారు.. రంగు రంగుల కండువాలు మార్చి మాయమాటలు చెబుతారు వారి మాలను నమ్మవద్దన్నారు.. పదేళ్లు అధికారంలో ఉండి పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేని ఆ దొరలు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రిగా మీ శీనన్న మీ వారు. కత్తి ఒకరి చేతికి ఇచ్చి, యుద్ధం నన్ను చేయమంటే నేను చేయలేను. ప్రభుత్వం మనదైనప్పుడే అభివృద్ధి సాధ్యం. ఓట్ల కోసం వచ్చే రకరకాల వ్యక్తుల ‘సొల్లు పురాణం’ నమ్మకండి. అధికారం లేని వారికి ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. హస్తం గుర్తును గెలిపిస్తేనే మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను‘ అని ఆయన అన్నారుపదేళ్లుగా నా పేద చెల్లెమ్మలు ఇందిరమ్మ ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆనాడు పట్టించుకోని వారు, నేడు మీ ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన బ్రిడ్జిలు, అస్తవ్యస్తమైన రోడ్లే వారి అసమర్థతకు సాక్ష్యం. సర్వే నంబర్ 727 భూ సమస్యను ఏళ్ల తరబడి ఎందుకు గాలికొదిలేశారు? మీ ఇంటి పెద్ద కొడుకుగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, సాగులో ఉన్న ప్రతి నిరుపేదకు పట్టా ఇచ్చే బాధ్యత నాది.అని అన్నారు ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. 25 ఏళ్లుగా ఎన్నికల్లేక వెనుకబడ్డ పాల్వంచకు నిధుల ప్రవాహం రావాలన్నా, ఇళ్ల పట్టాలు అందాలన్నా కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన సీపీఎం పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి అని మంత్రి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,టిపిసిసి కార్యదర్శి మద్దినేని బేబి స్వర్ణకుమారి,సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ,పలు వార్డుల,డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు పాల్గొన్నారు.
8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మార్కెట్ చైర్మన్,మున్సిపల్ మాజీ చైర్మన్ ల ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి మోత్కూర్, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ) మోత్కూర్ మున్సిపాలిటీ లో
ప్రజా సేవకులు అగల్ డ్యూటీ రాజు, రాణి
నస్పూర్’ ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ )ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అగల్ డ్యూటీ
మీ బిడ్డగా ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా..
15వ వార్డు బీజేపీ అభ్యర్థి పెద్దారి విందు కల్వకుర్తి: ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ):
అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టి20 వరల్డ్కప్ టోర్నమెంట్కు శనివారం తెరలేవనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీ పడుతున్నాయి. బరిలో ఉన్న జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ఎలో భారత్తో పాటు పాకిస్థాన్, యుఎస్ఎ, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్బిలో ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లకు చోటు దక్కింది. గ్రూప్సిలో వెస్టిండీస్, ఇంగ్లండ్, స్కాట్లాంట్, నేపాల్, ఇటలీలకు స్థానం కల్పించారు. గ్రూప్డిలో అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యుఎఇ, కెనడా జట్లు ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు సూపర్8కు అర్హత సాధిస్తాయి. శనివారం ఉదయం పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య కొలంబోలో జరిగే మ్యాచ్తో వరల్డ్కప్ టోర్నీకి తెరలేస్తోంది. మధ్యాహ్నం కోల్కతాలో స్కాట్లాండ్తో వెస్టిండీస్ తలపడుతుంది. ఇక రాత్రి ఏడు గంటల నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మూడో మ్యాచ్లో పసికూన యుఎస్ఎతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తలపడనుంది. లీగ్ దశలో మొత్తం 40 మ్యాచ్లు జరుగనున్నాయి. చివరి లీగ్ మ్యాచ్లో ఒమన్తో ఆస్ట్రేలియా తలపడుతుంది. ఇక సూపర్8 దశకు ఫిబ్రవరి 21న తెరలేస్తోంది. సూపర్8లో అగ్రస్థానంలో నిలిచే నాలుగు జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. మార్చి 4న తొలి సెమీ ఫైనల్, ఐదున రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక మార్చి 8న ఫైనల్ పోరు జరుగుతుంది. శనివారం ముంబై వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్లో యుఎస్ఎ(అమెరికా)తో ఆతిథ్య భారత జట్టు తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఆరంభ మ్యాచ్లో భారీ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ అభిషేక్ శర్మలు ఫామ్లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. తిలక్వర్మ చేరికతో బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. ఇక పెద్దగా అనుభవం లేని పసికూన అమెరికా టీమ్ భారత్కు ఏ మేరకు పోటీ ఇస్తుందో చెప్పలేం. అయితే యుఎస్ఎ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.
హైదరాబాద్లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు
మల్లాపూర్ భవానీనగర్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ క్లినిక్ పై మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి సహకారంతో నాచారం పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన వైద్య అర్హతలు లేకుండా అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న నకిలీ డాక్టర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సబ్ ఇన్స్పెక్టర్ పి. ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల మల్లాపూర్ భవానీ నగర్లోని “అక్షయ ఫస్ట్ ఎయిడ్ సెంటర్” అనే క్లినిక్లో ఒక వ్యక్తి సరైన వైద్య అర్హతలు లేకుండా డాక్టర్గా నటిస్తూ చికిత్స అందిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది.ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీం ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సైలు మల్లేష్, వాసుదేవ్, సిబ్బంది సహకారంతో నాచారం సబ్ ఇన్స్పెక్టర్ పి. ప్రభాకర్ రెడ్డి తమ సిబ్బందితో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ కానిస్టేబుల్ రాహుల్ ఆదిత్య (10719) మఫ్టీలో రోగిగా క్లినిక్కు వెళ్లి కడుపు నొప్పి ఉందని చెప్పగా అక్కడ ఉన్న వ్యక్తి డాక్టర్లా నటిస్తూ పరీక్షించి మందులు సూచించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టగా అతను తన పేరు సురే వెంకట కృష్ణ అని తెలిపాడు. గత మూడేళ్లుగా ఎటువంటి వైద్య అనుమతులు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు అతను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గతంలో గుంటూరు జిల్లా ఎస్ఐఎం కాలేజీలో ఇంటర్మీడియట్ బిఎస్సీ నర్సింగ్ చదువును ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే వదిలివేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మాచర్లలో రిటైర్డ్ డాక్టర్ వద్ద కంపౌండర్గా పని చేస్తూ వైద్య పరిజ్ఞానం సంపాదించినట్లు తెలిపాడు. ఆ అనుభవంతోనే 2022 సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చి అక్రమంగా క్లినిక్ ప్రారంభించినట్లు వెల్లడించాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి సురేష్ పై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఇష్టంలేని బిడ్డను కనేలా మహిళను బలవంతం చేయలేం: సుప్రీంకోర్టు
ఆమె మైనర్ బాలిక. 17 ఏళ్లలో గర్భందాల్చింది. ప్రస్తుతం 18ఏళ్ల 4 నెలలు. ప్రస్తుతం గర్భందాల్చి 30 వారాలుయ ఆమె తన గర్భస్థ శిశువు వద్దను కుంటోంది. దీంతో సుప్రీంకోర్టు శుక్రవారం ఒక టీనేజర్ తన 30 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతినిచ్చింది. ఒక మహిళ తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్భం కొనసాగించవలసిందిగా బలవంతం చేయలేమని, అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటిపి)కి అనుమతి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులను జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పక్కన పెట్టింది. ఆ మహిళ కోరిన పక్షంలో బిడ్డను దత్తత ఇచ్చే షరతుపై గర్భధారణ కొనసాగించవచ్చని పేర్కొంది. ఆమె శిశువు వద్దనుకున్న పక్షంలో బిడ్డను కనాలని ఆమెను బలవంతం చేయలేమని పేర్కొన్నారు. మైనర్ బాలిక స్నేహితుడి వల్లనే గర్భందాల్చిందని,గర్భం కొనసాగడం వల్ల ఆ అమ్మాయి మానసికంగా, శారీరకంగా కూడా చాలా బాధకు లోనయ్యే అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది. మెడికల్ బోర్డు రిపోర్ట్ ను పరిశీలించిన తర్వాత ఆమెకు గర్భస్రావం చేసేందుకు అనుమతిస్తే, బాలిక ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు మాత్రం, ఆమె బిడ్డను కన్నతర్వాత దత్తతకు ఇవ్వవచ్చని అభిప్రాయపడింది.అక్రమ సంతానం వల్ల బాలిక సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందని, ఆమెకు ఇష్టం లేకపోయినా బిడ్డను కనాలని ఆదేశిస్తే, ఆమె మానసికంగా కుంగిపోతుందని ఆమె తరుపు న్యాయవాది పేర్కొన్నారు. అపీలు చేయడంలో ఆలస్యం అయినా అపీలుదారి హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అపీలును అనుమతిస్తూ, గర్భాన్ని వైద్యపరంగా ముగించడానికి జస్టిస్ నాగరత్న ఆధ్వర్యంలోని ధర్మాసనం అనుమతినిచ్చింది. ఈ ప్రక్రియకు ముందు లిఖితపూర్వక హామీ సమర్పించాలని అపీలుదారును ఆదేశించింది.
రోజూ ₹17 పొదుపు చేస్తే 20 ఏళ్ల తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి షాక్ అవుతారు!
₹500 నెలవారీ SIP 20 సంవత్సరాల్లో ఎంత అవుతుందో నిజమైన మ్యూచువల్ ఫండ్ డేటాతో తెలుసుకోండి. కాంపౌండింగ్ మేజిక్, టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. మనం ప్రతిరోజూ టీకో, కాఫీకో లేదా అనవసరమైన చిన్న చిన్న ఖర్చులకో కనీసం ₹20 ఖర్చు చేస్తాం. నెలకు లెక్కేస్తే అది సుమారు ₹600 అవుతుంది. అదే ₹500 ను మీరు ఒక క్రమపద్ధతిలో (SIP) మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే, 20 సంవత్సరాల […] The post రోజూ ₹17 పొదుపు చేస్తే 20 ఏళ్ల తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి షాక్ అవుతారు! appeared first on Dear Urban .
పులిని బంధించారు.. హమ్మయ్య అనుకున్న ప్రజలు
తూర్పుగోదావరి: అంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ప్రజలకు భయభాంతులకు గురి చేస్తున్న పెద్దపులిని అటవీ శాఖ అధికారులు బంధించారు. కూర్మాపురంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు. పులిని పట్టుకోవడానికి పూణెకు చెందిన ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేసి పులిని పట్టుకున్నారు. కాగా, గత వారం రోజులుగా ఎక్కడ చూసిన పులి జాడ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రోజుకో, పూటకో రూటు మారుస్తూ.. అటవీ శాఖ అధికారులకు దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టింది. ఆరు రోజుల కిందట సీతా నగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి చంపిన పులి రఘునాథపురంలో ఓ గేదెను చంపింది. అనంతరం మర్రపాలెంలో మూడు లేగదూడలను బలిగొంది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు నేషనల్ ఎక్స్పర్ట్ టీమ్ను తెప్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పులిని బంధించేందుకు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఉదయం రాయవరం మండలంలోకి ప్రవేశించిన పులి జి.ఎర్రపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. తాజాగా అక్కడే రెస్క్యూ బృందాలు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పులిని బంధించారు. దీంతో ప్రజలు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
அரசியலில் இருந்து விலகுவதாக அண்ணாமலை அறிவித்தாரா? - உண்மை இதுதான்
அரசியலில் இருந்து பாஜக முன்னாள் மாநிலத் தலைவர் அண்ணாமலை விலகுவதாக பரவும் தகவல் பொய்யானது
బి ఆర్ ఎస్ భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి
బి ఆర్ ఎస్ భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి మోత్కూర్, ఆంధ్రప్రభ
గెలుపు దిశగా 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత
గెలుపు దిశగా 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత బెల్లంపల్లి, ఫిబ్రవరి
కర్రెం చెన్నమ్మ గెలుపు అభివృద్ధికి మలుపు
కర్రెం చెన్నమ్మ గెలుపు అభివృద్ధికి మలుపు మక్తల్ , ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ)
అంబులెన్స్లో కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి
పోలీసులు దాఖలు చేసిన కేసు కోర్టులో విచారణకు రాగా వృద్ధురాలి అణువోజు రాజేశ్వరికి (70) పక్షవాతం రావడంతో ఆమెను శుక్రవారం అంబులెన్స్లో కోర్టుకు తీసుకొని రాగా ఆమె వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ భానోత్ రాజేశ్వర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది సమక్షంలో అంబులెన్సులో స్వీకరించటం జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. ఈ కేసు వివరాలు లోకి వెళితే చిగురు మామిడికి చెందిన అను వోజు రాజేశ్వరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావటంతోపాటు ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిదైంది. ఉద్యోగి అయిన కొడుకు అణువోజు వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆమె ఆర్డిఓ వద్ద కొడుకుపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు విచారించిన ఆర్డీవో వెంకటేశ్వర్లు నెలకు 4 వేల రూపాయలు పోషణ నిమిత్తం తల్లికి చెల్లించాలని తీర్పునిచ్చారు. కొడుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆమె చిగురుమామిడి పోలీసులకు కొడుకుపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కొడుకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాగా ఫిర్యాదుదారు రాజేశ్వరి సాక్ష్యం కోర్టు స్వీకరించాల్సి ఉంది. పక్షవాతం వచ్చి ఆమె రాలేని పరిస్థితిలో ఉండగా అంబులెన్స్లో ఆమెను కోర్టుకు తీసుకొని వచ్చారు. అంబులెన్స్లో ఉన్న ఆమె వద్దకు మెజిస్ట్రేట్ వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని ప్రాసి క్యూటరు వీరస్వామి, న్యాయవాది వేణుగోపాల్ సమక్షంలో అంబులెన్స్ లోనే రికార్డ్ చేశారు. ఫిర్యాది రాజేశ్వరి కొడుకు వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా సాక్షం చెప్పడం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు…పార్టీల జోరు
మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు…పార్టీల జోరు మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ
వైభవ్ సూర్య వంశీ వీరవిహారం#FinalMatch#RunsRain#MassiveScore#411Runs#VaibhavSuryavanshi#Suryavanshi
తీవ్ర ఫ్లూతోనూ ఫైనల్ ఆడిన స్మృతి మందాన…#smritimandhana #wpl2026 #rcbforever #cricketnewsdaily
రంగంలో రెండు పార్టీలు ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ
దీపిక మరణం దురదృష్టకరం ఆమె ప్రతిభావంతురాలు ఆత్మహత్య అనుమానం ఆధారాలతో నిగ్గుతేలుస్తాం ఆమె
Video : Exclusive Interview With Actor Arjun & Aishwarya Arjun
The post Video : Exclusive Interview With Actor Arjun & Aishwarya Arjun appeared first on Telugu360 .
A Sad Pattern That Refuses to End During Jagan’s Public Visits
What a disturbing pattern this has become for Jagan. Almost every time Y. S. Jagan Mohan Reddy steps out in the name of public visits or sympathy tours, tragedy seems to follow his own supporters. Jagan visited the residence of former minister Ambati Rambabu to console his family and after that, he travelled to Ibrahimpatnam […] The post A Sad Pattern That Refuses to End During Jagan’s Public Visits appeared first on Telugu360 .
రాణిస్తున్న భారత బౌలర్లు.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
హరారే: అండర్-19 వరల్డ్ కప్లో భాగంగా భారత్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో తొలుతు బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. అయితే ఈ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడుతోంది. ఓపెనర్ బెన్ డాకిన్స్ (66), బెన్ మెయిస్(45) కెప్టెన్ థామస్ రేవ్(31) పరుగులతో ఫర్వాలేదు అనిపించినా.. మిగితా బ్యాటర్లు భారత బౌలింగ్ ధాటికి పెవిలియన్ బాట పట్టారు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే.. ఇంగ్లండ్ ఇంకా 214 పరుగులు చేయాల్సి ఉంది.
8వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతా
8వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతా జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మున్సిపాలిటీలోని 30
బాధ్యతగా అభివృద్ధి చేసుకుందాం ఆదరించండి
బాధ్యతగా అభివృద్ధి చేసుకుందాం ఆదరించండి మక్తల్, ఆంధ్రప్రభ : బాధ్యతగా మన వార్డును
కౌన్సిలర్ గా గెలిపించండి.. అభివృద్ధి చేస్తా..
కౌన్సిలర్ గా గెలిపించండి.. అభివృద్ధి చేస్తా.. కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ తోనే మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ తోనే మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం మోత్కూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
నిరసనల మధ్య లోక్ సభ సోమవారానికి వాయిదా
వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నిర్విరామంగా నిరసనలు వ్యక్తం చేయడంతో శుక్రవారం నాడు లోక్ సభ కార్యకలాపాలు శనివారం నాటికి వాయిదా పడ్డాయి.ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినా.. నేడు వరుసగా రెండోరోజున కూడా చర్చ జరగలేదు. ఉదయం నిరసనల మధ్య సభ వాయిదా పడి, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యుల నిరసనలు కొనసాగాయి. స్పీకర్ వేదిక వద్దకు దూసుకువచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ స్థానంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెన్నేటి కృష్ణ ప్రసాద్ ప్రతిపక్ష సభ్యులను వారివారి స్థానాల్లో కూర్చుని, ప్లకార్డులు ప్రదర్శించుకోవచ్చని అన్నారు. అయినా, సభ్యుల తమ ఆందోళనను విరమించలేదు. దీంతో కృష్ణప్రసాద్ సమావేశాలను సోమవారం ఉదయం వరకూ వాయిదా వేశారు. అంతకుముందు ప్రతిపక్షాల నిరసనలు, నినాదాలతో విసిగిపోయిన స్పీకర్ ఓం బిర్లా తాను ఇలాంటి సభను నిర్వహించలేనని వాపోయారు. అంతరాయం కారణంగా బడ్జెట్ సమావేశాలలో ఇంతవరకూ 19 గంటల 12 నిముషాలు వృథా అయ్యాయని స్పీకర్ పేర్కొన్నారు. సభ్యులు సభను అగౌరవపరచడం సబబుకాదని హితవు చెప్పారు. శుక్రవారం సభసమావేశం అయిన వెంటనే ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, వెల్ లోకి దూసుకువచ్చారు. వారిని వారిస్తూ స్పీకర్ ... ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు ప్రజలు సభ్యులను ఎన్నుకున్నారని, సభ సజావుగా సాగాలని తాను కోరుతున్నానని, అందువల్ల సభ్యులు నినాదాలు మాని, సభా కార్యక్రమాలు జరిగేలా సహకరించారని విజ్ఞప్తి చేశారు.మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రాసిన ప్రచురితంకాని జ్ఞాపకాలు ఆధారంగా రాసిన కథనాన్ని సభలో చదివి వినిపించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నించగా సోమవారం స్పీకర్ అందుకు నుమతించకపోవడంతో సభలో గందరగోళం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభ సజావుగా సాగలేదు. సభను సజావుగా నిర్వహించేందుకు అనుమతించాలని, నిరసన తెలుపుతున్న సభ్యులను స్పీకర్ కోరారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఓ ప్రశ్న వేయదలచినట్లు తెలిపారు. కానీ, సభ్యుల నిరసన ఆగలేదు. ప్రభుత్వం, ప్రతిపక్షం వివిధ అంశాలపై విభేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగించకుండానే లోక్ సభ ఆమోదించడం అపూర్వమైన పరిణామం.
పాకలో దూరిన పులి... ఎట్టకేలకు బంధించిన అధికారులు
తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది.
కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించండి.
కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించండి. లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం జనగామ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న
No Power Tariff Hike in Andhra Pradesh, Assures Energy Minister Gottipati Ravi Kumar
The coalition government in Andhra Pradesh has not increased electricity charges by even a single rupee since coming to power and will not do so in the future, Energy Minister Gottipati Ravi Kumar has said. He made this clear during his visit to Giddalur in Markapuram district on Friday. The Minister inaugurated a newly constructed […] The post No Power Tariff Hike in Andhra Pradesh, Assures Energy Minister Gottipati Ravi Kumar appeared first on Telugu360 .
ఆడబిడ్డని ఆదరించండి.. వార్డును అభివృద్ధి చేస్తా …
ఆడబిడ్డని ఆదరించండి.. వార్డును అభివృద్ధి చేస్తా … జనగామ, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ)
విశ్వక్సేన్ ‘ఫంకీ’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..
మాస్ కా దాస్ విశ్వక్సేన్ గతేడాది ‘లైలా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కాన్సప్ట్ సినిమా అయినప్పటికీ.. అది ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేకపోయింది. దీంతో సరైన హిట్ కోసం విశ్వక్ ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ దర్శకుడు కెవి అనుదీప్ డైరెక్షన్లో విశ్వక్ ‘ఫంకీ’ అనే సినిమా చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలకు టైమ్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీరాములు థియేటర్లో ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. The Key for FUN with #FUNKY unlocks tomorrow Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS In cinemas from FEB 13 #FunkyFrom13thFeb Mass Ka Das @VishwakSenActor @11Lohar … pic.twitter.com/g2UyiUjsLL — Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026
కర్మన్ఘాట్ లో మాంగళ్య పాపింగ్ మాల్ ను ప్రారంభించిన నటీ శ్రీలీల
కర్మన్ఘాట ప్రాంత ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్ను ఆదరిస్తారని తనకు ఎంతో నమ్మకుం ఉందని ప్రముఖ సినీ నటి శ్రీలీల అన్నారు. శుక్రవారం ఆమె కర్మన్ఘాట్లో మాంగళ్యషాపింగ్ మాల్ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాల్లోని పలు కలెక్షన్లను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజక వర్గంలో ఈ మాల్ను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, దీని ప్రారంభంతో పలువురు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి వర్గానికి ,ప్రతి సందర్భరానికి అనువైన ,నాణ్యమైన వస్త్రాలను అందుబాటులో ధరల్లో అందిండమే మా విజయరహస్యమని సంస్థ నిర్వహకులు పేర్కొన్నారు.అంతే కాకుండా తమ సొంత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్కు అనుగుణంగా డిజైన్ చేస్తూ వస్త్రవ్యాపారంలో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. రూ ః 99 నుంచి ప్రారంభమై రూ. లక్ష వరకు విస్తరించిన ధరలో శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉండటంతో మాంగళ్య సంసూర్ణ ఫ్యామిలీ షాపింగ్ మాల్గా ప్రత్యేక గుర్తింపు పొందినట్లు తెలిపారు..2012లో వరంగల్లో ప్రారంభమైన తమ సంస్థ నూతన ఒరవడిని సృష్టిస్తూ తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్న తమ సంస్థను ఆయా రాష్ట్రాల్లో 9 నుంచి 10 ప్రాజెక్టులను ప్రారంభించనున్నామని, భవిష్యత్తుల్లో తమిళ నాడులో కూడా తమ ప్రాజెక్టులను ప్రారంభించనన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరక్టర్లు పుల్లూరి నరసింహమూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లిఖార్జున్, కాసం శివ ప్రసాద్, పుల్లూరు అరుణ్కుమార్, పాషింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ ఒక ధ్రువతార: కెటిఆర్
ప్రజల కన్నీటిని తుడిచే దిశగా మన పోరాటం సాగాలని, అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల కష్టాల గురించి గొంతెత్తాలని సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనకు, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఆయనను గల్లా పట్టి అడగాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, డి.ఎలు, పిఆర్సి లేక నలిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడాలని కోరారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, మన నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి కోవర్టు ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల తీర్పే కెసిఆర్కి ఇచ్చే అసలైన గౌరవం అని, పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ ఒక ధ్రువతార అని, ఆయన కీర్తి నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఇది ఒక గ్రహణ కాలం అని, రేవంత్ అనే రాహువు నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందామని కెటిఆర్ పిలుపునిచ్చారు.
KCR : బీఆర్ఎస్ నేతలకు ఈసారి కూడా కేసీఆర్ షాకిచ్చారుగా?
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ బయటకు రావడం లేదు.
Strike |దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
Strike | దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి Strike | కుంటాల, ఆంధ్రప్రభ
13వ వార్డులో మామిడి కుమార్ ప్రచార జోరు …
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : ఆదరించండి అండగా నిలవండి మన 13 వార్డుని మనం
Indiramma’s house |సకాలంలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేయాలి
Indiramma’s house | సకాలంలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేయాలి Indiramma’s house |
7వ డివిజన్ నుంచి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
7వ డివిజన్ నుంచి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా నిజామాబాద్, ఆంధ్రప్రభ :
Rishabh’s Nagabandham 1st Look: Menacing
Abhishek Nama’s mystical adventure Nagabandham, led by Virat Karrna, has already stirred curiosity with its thematic blend of mythology, mystery, and ancient Indian lore. After unveiling the first look of the lead cast, the makers today released first look of Bollywood actor Rishabh Sawhney. Rishabh looks menacing, charging through a snowstorm, gripping a massive axe. […] The post Rishabh’s Nagabandham 1st Look: Menacing appeared first on Telugu360 .
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు మోత్కూర్, ఆంధ్రప్రభ : ఎన్నికల
Ys Jagan : తిరుమల ప్రసాదాన్ని కలుషితం చేసింది చంద్రబాబు కాదా?
పక్కా పథకం ప్రకారమే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారని వైఎస్ జగన్ అన్నారు.
గెలిపించండి అభివృద్ధికి బాటలు వేద్దాం
గెలిపించండి అభివృద్ధికి బాటలు వేద్దాం మక్తల్ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీలో 11వ వార్డు
17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థికి మహిళల ఆదరణ..
17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థికి మహిళల ఆదరణ.. పరకాల, ఆంధ్రప్రభ : పరకాల
ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా..
ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా.. కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు తనను కౌన్సిలర్
జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్లో తృతీయ స్థానం సాధించిన విడపనకల్ విద్యార్థిని
విశాలాంధ్ర – విడపనకల్లు.. విడపనకల్లు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవి) విద్యార్థిని యు. వెంకటలక్ష్మి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో సత్తా చాటి గ్రామ కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. విడపనకల్లు గ్రామానికి చెందిన రైతు యు. హనుమంతు కుమార్తె వెంకటలక్ష్మి ప్రస్తుతం స్థానిక కేజీబీవి లో 10వ తరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ఆమె, బాల్ బ్యాడ్మింటన్లో తన ప్రతిభను చాటుతూ జిల్లా మరియు […] The post జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్లో తృతీయ స్థానం సాధించిన విడపనకల్ విద్యార్థిని appeared first on Visalaandhra .
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 30 మందికి పైగా మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఇస్లామాబాద్లోని షియాలకు చెందిన ఓ ప్రార్థన మందిరం దగ్గర భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 160 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఇస్లామాబాద్లోని షెహబాద్ ప్రాంతంలోని ప్రార్థనా మందిరంలో సూసైడ్ బాంబర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ.. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్తో సంబంధం ఉన్న ఓ విదేశీ పౌరుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియేయెవ్ పాకిస్థాన్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత సంచలనంగా మారింది.
Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం
బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ ఒక్కటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
పొలాల్లో పెద్దపులి పరుగులు..#News #TeluguNews #Wildlife #Koramilli #ForestDepartment #PublicAlert
1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం #Proddatur#CoffeeControvery
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీలు.. వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ అంటేనే యువ క్రికెటర్లకు అత్యంత ఒత్తిడితో కూడిన పరీక్ష. అలాంటి కీలక మ్యాచ్లో సెంచరీ చేయడం అనేది అసాధారణ ప్రతిభకు నిదర్శనం.అయితే కొందరు కుర్రాళ్లు ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా బ్యాట్తో చరిత్ర లిఖించారు. అలాంటి ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో తాజాగా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా చేరాడు.2026 అండర్-19 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో అతడు కేవలం 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసి అందరి దృష్టిని తనవైపు […] The post అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీలు.. వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత appeared first on Visalaandhra .
జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లారు
అభివృద్ధి పథకాలే విజయ సోపానాలు
ఆలేరు,ఆంధ్రప్రభ : గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ
వామ్మో పులి… రాయవరంలో భయం భయం ఊళ్లోనే పులి మకాం ఆపరేషన్ కాప్చర్
భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణ పట్ల హర్షం
– పాయకరావుపేట, తుని తాపీ పనివారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు విశాలాంధ్ర – పాయకరావుపేట : భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పాయకరావుపేట, తుని తాపీ పనివారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జూరి నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. సంఘం కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ. 40 వేలు, మరణానికి రూ. […] The post భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణ పట్ల హర్షం appeared first on Visalaandhra .
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో హస్తం జోరు

17 C