Vijay Faces Heat Over Affidavit Discrepancies Ahead of Tamil Nadu Polls
Actor-turned-politician Vijay has landed in controversy after inconsistencies were found in his election affidavits, just weeks before the Tamil Nadu Assembly elections. The issue has sparked debate over the accuracy of candidate disclosures and compliance with election norms. Documents reveal that Vijay submitted differing information in two nominations. His affidavit from Perambur stated that there […] The post Vijay Faces Heat Over Affidavit Discrepancies Ahead of Tamil Nadu Polls appeared first on Telugu360 .
వరి పంటలకు సాగునీరు కరువు.. ఖానాపురం ఏప్రిల్ 3 (జనం సాక్షి):ఖానాపురం మండలం కొత్తూరు గ్రామం తుంగబంధం ఆయకట్టు అన్నదాతలకు పాకాల సాగునీరు అందకపోవడంతో వరి పండిస్తున్న …
Gas Supply |ఉత్పత్తి పెంపుకు కేంద్రం చర్యలు
Gas Supply | ఉత్పత్తి పెంపుకు కేంద్రం చర్యలు Gas Supply |
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన పాలకవర్గం సభ్యులు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖమంత్రి
Actresses Hiking Fee despite Flops
When was the last time Pooja Hegde was seen in a Telugu film featuring a star. The actress is receiving offers despite flops but the remuneration quote is forcing the filmmakers to think of other options. The actress lost close to ten Telugu films in the past two years because of the remuneration demand. Telugu […] The post Actresses Hiking Fee despite Flops appeared first on Telugu360 .
ధోనీ, కపిల్ దేవ్కు యువరాజ్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
టీం ఇండియా మాజీ ఆల్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారథులు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణ చెప్పాలంటూ యవీ అన్నాడు. కపిల్ హయాంలో తనకు, ధోనీ హయాంలో తన కుమారుడు యువీకి అన్యాయం జరిగిందని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఇటీవల ఓ చోట వ్యాఖ్యానించారు. భారత్కు ప్రపంచకప్లు అందించిన కెప్టెన్లపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సోషల్మీడియాలో అభిమానులు మండిపడ్డారు. తాజాగా దీనిపై యువరాజ్ సింగ ఓ పాడ్క్యాస్ట్లో ఇరువురు కెప్టెన్లకు క్షమాపణలు కోరాడు. ‘‘ఈ సందర్భంగా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీకి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. మా నాన్న ఇచ్చిన ఇంటర్వ్యూలన చూశా. అలాంటివి నేనూ విన్నా. ఇప్పటికే పలుమార్లు ‘ఇది సరైంది కాదు’ అని చెప్పా. అందుకే, ఆయన తరఫున నేను వారిద్దరకీ క్షమాపణలు చెబుతున్నా’’ అని యువరాజ్ తెలిపాడు.
కల్వరి చర్చిలో మిన్నంటిన ‘గుడ్ ఫ్రైడే’ వేడుకలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మానవాళి పాప విముక్తి కోసం లోకరక్షకుడైన యేసుక్రీస్తు తన
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 03 జనం సాక్షి :తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని …
అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 3: (జనం సాక్షి)ఐపీఎల్ క్రికెట్ అంటే ఇష్టపడని అభిమానులు ఉండరు. పట్టణాలలోని స్టేడియంలోకి వెళ్లి చూసి ఆనందించే అవకాశం తక్కువ మందికే …
‘స్వచ్ఛాయుధం’తో ప్లాస్టిక్ రహిత మచిలీపట్నం వైపు అడుగులు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో
Kavitha |నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్
Kavitha | నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్ Kavitha | ఆంధ్రప్రభ, వెబ్
నా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది: కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పాత పేరు..కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? అని ప్రశ్నించింది. తమ పార్టీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని, తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని, పునర్విభజన అయినా.. కాకపోయినా తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుందని కవిత పేర్కొన్నారు. సిద్ధిపేట స్థానం మహిళలకు రిజర్వు కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గుంటనక్క మధ్య అవగాహనతో ఏం చేస్తారో? అని ప్రశ్నించారు. సిఎం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ను ఆగం చేసేలా ఉన్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి గురించి తమకు అవసరం లేదని, తాను కేసు కొట్టి వేశారంటేనే ప్రకృతి తనకు సహకరిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ అజెండా ప్రకటించాక.. చాలా మంది పార్టీలోకి వస్తారని అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి కేరళలో రేవంత్ రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయని, మహారాష్ట్ర, బీహార్ లో కూడా ఇలాగే చెప్పారని..కాంగ్రెస్ ను ఓడించారని దుయ్యబట్టారు. ప్రైవేట్ పాఠశాలలు 25 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచాయని, నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ సిఎం వద్దే ఉన్నా.. ఫీజుల విషయంలో, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు.
అవనిగడ్డలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్
తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు చేర్యాల(జనంసాక్షి) ఏప్రిల్ 03 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట …
AP CM |బిల్లు ఆమోదం ప్రజారాజధానికి దక్కిన గౌరవం
AP CM | బిల్లు ఆమోదం ప్రజారాజధానికి దక్కిన గౌరవం AP CM
Telangana : హాయ్ అని మెసేజ్ చేస్తే.. సేవలన్నీమీ అరచేతిలో
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది
పోలీసులపై పేర్ని నాని మాస్ ర్యాగింగ్
పోలీసులపై పేర్ని నాని మాస్ ర్యాగింగ్ చేశారు
India : రష్యాతో భారత్ కొత్త వ్యూహం
భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి
Iran : భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది
సర్పంచ్ లహరిక ఆత్మహత్యాయత్నం..
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ గ్రామ సర్పంచ్
గుడ్ ఫ్రైడే, ప్రత్యేక ప్రార్థనలు..
గుడ్ ఫ్రైడే, ప్రత్యేక ప్రార్థనలు.. అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ గ్రామ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి
అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం ప్రజా విజయం: చంద్రబాబు
అమరావతి: దేశంలో అన్ని పార్టిలది ఒక దారైతే.. వైసిపి మరో దారని, అమరావతి బిల్లుకు వైసిపి మినహా అన్ని పార్టీలు మద్దతిచ్చారని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యవహరించిందని, వైసిపి నేతలు, ఎపికి, ప్రజలకు ద్రోహం చేశారని, ఎపి నాశనమైనా పర్వాలేదని వైసిపి పట్టుదలతో ముందుకెళ్లిందని విమర్శించారు. అమరావతిని నాశనం చేయాలని వైసిపి చూస్తే.. తాము శాసనం చేశామని అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం ప్రజా విజయమని కొనియాడారు. అమరావతికి చట్టబద్దత బిల్లు ఆమోదించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ధన్యవాదాలు తెలియజేశారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలు కూడా బిల్లు ఆమోదించిందని, రాజధాని లేకుండా ఎపిని విభజించారని, రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. పరిపాలన చేసేందుకు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాలను ఎపిలో విలీనం చేయించానని, తన అనుభవంతో తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేయించానని చంద్రబాబు అన్నారు. పోలవరం ముంపు మండలాలను ఎపిలో కలిపితేనే ప్రమాణం చేస్తానని చెప్పానని, విజయవాడకు వచ్చినప్పుడు ఇరిగేషన్ ఎస్ఇ కార్యాలయమే తన క్యాంపు ఆఫీసని పేర్కొన్నారు. విడిపోయిన ఎపికి రాజధానిని నిర్మించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, దేశ ప్రయోజనాల కోసం అమరావతికి రాజధానిగా ఉండాలని చాలా పార్టీలు ఆలోచించాయని, తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
3 Us Officials Dismissed : అమెరికా ఆర్మీ చీఫ్ ఔట్ Andhra Prabha Insight Story
3 Us Officials Dismissed : అమెరికా ఆర్మీ చీఫ్ ఔట్ Andhra
బేతానియా ఫెలో షిప్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రం లో గల బేతానియా ఫెలో
3aprilgold |బంగారం షాక్… వెండి స్థిరంగా మార్కెట్ ట్రెండ్
3aprilgold | బంగారం షాక్… వెండి స్థిరంగా మార్కెట్ ట్రెండ్ 3aprilgold |
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం
మేడ్చల్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన వెంకట్ రెడ్డి,
Yv Subba Reddy : అమరావతికి వ్యతిరేకం కాదు.. అవినీతికి మాత్రమే
అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
AP | విద్యార్థి ఆత్మహత్య.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్ద
క్యాచ్ వివాదం.. అభిషేక్ శర్మకు భారీ జరిమానా
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కాస్త వివాదాస్పదమైంది. అభిషేక్ 48 పరుగుల వద్ద ఉండగా.. బ్లెస్సింగ్ ముజర్బాని వేసిన తొమ్మిదో ఓవర్లో ఓ బంతిని అభిషేక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వరుణ్ చక్రవర్తి ఆ బంతిని క్యాచ్ పట్టాడు. అయితే అది నేలకు తగిలిందో.. లేదో.. తెలుసుకునేందుకు థర్డ్ అంపైర్ని ఆశ్రయించాడు. క్యాచ్ని నిశితంగా పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి చేతిలోనే పడిందని గుర్తించి దాన్ని ఔట్గా ప్రకటించారు. అయితే హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో అభిషేక్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. అయితే అసలే నిరుత్సాహంలో ఉన్న అభిషేక్కి మరో షాక్ తగిలింది. అతడికి భారీ జరిమానా పడింది. అభిషేక్ మ్యాచ్ ఫీజు నుంచి 25 శాతం కోత విధిస్తున్నట్లు ఐపిఎల్ గవర్నింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 2.3 కింద లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు వెల్లడించింది. మ్యాచ్ ఫీజులో కోతనే కాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ను జత చేసింది. ‘‘సన్రైజర్స్ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మపై 25 శాతం మ్యాచ్ ఫీజులో జరిమానా విధించాం. ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ని జత చేశాం. ఆర్టికల్ 2.3 కిందకు వచ్చే లెవల్ 1 నేరాన్ని అతడు అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన దానిని స్వీకరించాడు. ఇక్కడ మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్’’ అని ఐపిఎల్ స్పష్టం చేశారు. అయితే ఏ తప్పిదానికి ఈ జరిమానా విధించిందో ఐపిఎల్ వెల్లడించలేదు.
CM Revanth Reddy |సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం
CM Revanth Reddy | సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం CM Revanth
మళ్లీ ఆడపిల్లేనని..! #Hanumakonda #CrimeNews #Shocking #Telangana #MurderCase #BreakingNews #Police
రూ. 2లక్షలతో మురికి కాల్వ నిర్మాణ పనులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారం పంచాయతీలో గల
Chandrababu : అమరావతి కోసం దేశం నిలబడ్డా.. వైసీపీ నిలబడలేదు
దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ
నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; గత పది రోజుల క్రితం మేడపల్లి గ్రామానికి చెందిన
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్ సంగారెడ్డి, ఏప్రిల్ 03( జనం సాక్షి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తి చిరస్మరణీయమని మునిపల్లి …
TDP : ఉత్తుత్తి హెచ్చరికలేగా.. మన పని మనం చేసుకుపోదాం
చంద్రబాబు మంచితనాన్ని కొందరు ఎమ్మెల్యేలు చేతకానితనంగా తీసుకుంటున్నారు
భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
మునుగోడు, ఆంధ్రప్రభ : యేసుక్రీస్తు సిలువపై చేసిన మహత్యాగాన్ని స్మరించుకుంటూ నల్లగొండ జిల్లా
HYD |రిజల్ట్ ఏం వచ్చిందంటే..!
HYD | రిజల్ట్ ఏం వచ్చిందంటే..! HYD | ఆంధ్రప్రభ, వెబె డెస్క్
ప్రేమ శాంతి త్యాగానికి మరో పేరు యేసుక్రీస్తు
జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రేమ శాంతి త్యాగానికి మరో పేరు యేసుక్రీస్తుఅని,జుక్కల్ ఎమ్మెల్యే
మరో వివాదంలో టీవీకే చీఫ్ విజయ్
టీవీకే చీఫ్ విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు
Sai Durgha Tej, who has been consciously curating diverse and ambitious projects, is now set for another leap with his newly announced film #SDT19. The star has locked his next collaboration with the talented director duo Sujith & Sandeep, the visionaries behind KA, for an epic new saga. With a reputation for consistent hits and […] The post #SDT19: An Epic New Saga appeared first on Telugu360 .
aishwaryaphotogalley |అందం, అభినయం కలబోసిన ఐశ్వర్యం..
aishwaryaphotogalley | అందం, అభినయం కలబోసిన ఐశ్వర్యం.. సంక్రాంతికి వస్తున్నాం అంటూ పండగ
చెన్నై మెరీనా బీచ్లో ప్లాస్టిక్కు చెక్ సీసా వేయండి… ఈకో సంచి తీసుకోండి #MarinaBeach #PlasticFree
తెలంగాణను దక్షిణాసియా టెక్స్ టైల్స్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతాం: రేవంత్
హైదరాబాద్: ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదు.. చేనేతలకు జీవితమని అన్నారు. హెచ్ఐసిసి లో ఆసియా టెక్స్ టైల్స్ కాన్పరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎం, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదని.. చేనేత జీవితమని అన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామని అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని తెలియజేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమని, దక్షిణాసియా టెక్స్ టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కట్టడాలు, ముత్యాలకు ప్రసిద్ధని, తెలంగాణ కాటన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని అన్నారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్ గా హైదరాబాద్ మారిందని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని, పర్యావరణ పరిరక్షణే తాను తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు
అసోం ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కాలియాబోర్(అసోం): తమ పార్టీ స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదని, చొరబాటుదారులను సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అసోం గణపరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా తరఫున గురువారం కాలియాబోర్లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగించారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అసోంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించాయని బీజేపీ అగ్రనేత ఆరోపించారు. అసోం స్థానిక ముస్లింలకు బీజేపీ ఎంత మాత్రం వ్యతిరేకం […] The post స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు appeared first on Visalaandhra .
3rdAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
3rdAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
గ్రామాల అభివృధి దిశగా ప్రజాపాలన :సర్పంచ్ గద్దల నవీన్
ఏటూరునాగారం,మార్చి 03(జనంసాక్షి).మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ లో గురువారం గ్రామ సర్పంచ్ గద్దల నవీన్ అధ్యక్షతన “మన ఊరు మన భాధ్యత” -99 రోజుల గ్రామ ప్రణాళిక …
నేత్ర పర్వంగ గరుడ రథోత్సవం..గరుడ వాహనంపై.. సీతారాముడు
స్వామి వారిని దర్శించుకున్న కొండూరి రవీందర్ రావు.. గంభీరావుపేట ఏప్రిల్ 03 (జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా …
మధిరలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు..
మధిర, ఆంధ్రప్రభ ; పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు పలు
వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర
వరంగల్ బ్యూరో ,ఏప్రిల్ 02 (జనం సాక్షి)వీర హనుమాన్ జన్మదినం సందర్భంగా గురువారం సాయంత్రం వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ మహంకాళి దేవాలయ రంగం నుండి వీర …
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : గుడ్ ఫ్రైడే సందర్భంగా మండల కేంద్రంలో క్రైస్తవ సోదరులు
ప్రజల కోసం పనిచేసిన సర్పంచ్లకు అండగా ఉంటాను
ప్రజల కోసం పనిచేసిన సర్పంచ్లకు అండగా ఉంటాను దర్శి, ఆంధ్రప్రభ ; ప్రజల
డ్రగ్స్ కేసులో నటి హేమకు నెగెటివ్ #Hema #DrugsCase #Hyderabad #EagleTeam
Abhishek Sharma |ఒక డీమెరిట్ పాయింట్ నమోదు..
Abhishek Sharma | ఒక డీమెరిట్ పాయింట్ నమోదు.. Abhishek Sharma |
ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా
అసోం ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ బొకాజన్: అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టు కోవడానికి అనేక హామీలను గుప్తిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టీల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది. ఎలాగైనా ఈ సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఉన్న దారులన్నీ వెతుకుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆరోగ్యసంరక్షణ, […] The post ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా appeared first on Visalaandhra .
Rajasekhar getting Big Appreciation for Biker
Veteran actor Rajasekhar hasn’t been seen in films in the recent years. He played father to Sharwanand in Biker. Rajasekhar’s role, characterization and his performance are getting wide appreciation from the audience. The actor has been subtle in the role and he emoted well in the role of a caring, struggling father who wants to […] The post Rajasekhar getting Big Appreciation for Biker appeared first on Telugu360 .
కొండాపూర్ లో ఎరినా పబ్ పై ఈగల్ టీమ్ దాడులు.... 8 మందికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్: మహానగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్ లపై ఈగల్ టీమ్ పోలీసులు దాడులు చేశారు. కొండాపుర్ లోని క్వాక్ ఎరినా పబ్ లో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. గురువారం రాత్రి సౌతాఫ్రికా కు చెందిన ప్రముఖ డిజె బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ ను పబ్ నిర్వాహకులు నిర్వహించారు. ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించడంతో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sudden |కార్యాలయం, ఇళ్లల్లో తనిఖీలు..
Sudden | కార్యాలయం, ఇళ్లల్లో తనిఖీలు.. Sudden | ఆంధ్రప్రభ, వెబె డెస్క్
పరకాలలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు..
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.పరకాల
గ్రామసభలో శాఖల నివేదికల వినిపింపు…
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని 12 గ్రామపంచాయతీలలో సర్పంచులు, ఉపసర్పంచులు, పాలకవర్గ సభ్యుల
ఒరాకిల్ డేటా సెంటర్పై దాడి చేశాం
ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి తెహ్రాన్: ఇరాన్ తన ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. అమెరికాకి సాంకేతిక సహకారం అందిస్తోన్న టెక్ కంపెనీలపై దష్టి సారించింది. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇంత వరకు దాడులు చేసిన ఇరాన్ ఇప్ప్పుడు సాంకేతిక సంస్థలపై గురిపెట్టింది. ఈ క్రమంలో అమెరికా టెక్ సంస్థలే లక్ష్యంగా గురువారం దుబాయ్లోని ఒరాకిల్, బహ్రెయిన్లోని అమెజాన్ సంస్థల డేటా సెంటర్లపై ఐఆర్జీసీ దాడులు చేసింది. ఈ […] The post ఒరాకిల్ డేటా సెంటర్పై దాడి చేశాం appeared first on Visalaandhra .
మతసామరస్యానికి నిదర్శనం….ముస్లిం యువకుడి హనుమాన్ దీక్ష #latestnews #telugupost #hanumandeekha #news
Balakrishna |అసలు ప్లాన్ ఏంటి..?
Balakrishna | అసలు ప్లాన్ ఏంటి..? Balakrishna | బాలయ్య కోసం దర్శకుల
క్రీస్తు త్యాగాల జ్ఞాపకం గుడ్ ఫ్రై డే..
క్రీస్తు త్యాగాల జ్ఞాపకం గుడ్ ఫ్రై డే.. ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ :
నక్సలిజం నిర్మూలనకు ప్రభుత్వం విధించిన డెడ్లైన్ మార్చి 31, 2026 ముగిసింది. ఇది రెడ్ కారిడార్గా పిలవబడే తొమ్మిది రాష్ట్రాల్లో కొండలు, అడవుల్లో విస్తరించి ఉన్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో దశాబ్దాలపాటు సాగిన మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగింపు దశకు చేరిన చారిత్రక ఘట్టాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు దేశం లోని సుమారు 120 కి పైగా జిల్లాలను ప్రభావితం చేసిన మావోయిస్టులపై భద్రతా దళాలు నిరంతరం సాగించిన పోరుతో 2025 నాటికి నక్సలిజం గణనీయంగా క్షీణించింది. ఇప్పుడు మధ్య, తూర్పు భారతం లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. కొన్ని దశాబ్దాల హింసలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పౌరులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అయినప్పటికీ సాయుధ మావోయిస్టుల నిర్మూలనతో సమస్యలు ముగిసినట్టు కాదు. నక్సల్స్ బృందాలను భద్రతా బలగాలు ఎంత దెబ్బతీసినా, వారి వెనుక ఉన్న భావజాలం (ఐడియాలజీ) లేదా మూలకారణాలు ఇంకా సాక్షాలుగా మిగిలే ఉన్నాయి. చత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం, టెలికమ్ నెట్వర్క్ విస్తరణ, బ్యాంకింగ్ సౌకర్యాలు, స్కూళ్లు, స్కిల్ సెంటర్లు వంటివి ఏర్పాటు కావడంతో భద్రతా బలగాలు ఆయా గ్రామాల్లోకి చేరుకుని భద్రత కల్పిస్తుండడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగి నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇదంతా అభివృద్ధియే అని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ అభివృద్ధి అంటే కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. మానవాభివృద్ధి, జీవన ప్రమాణాలు ఏమాత్రం విస్తరించాయో పరిశీలించాల్సి ఉంది. మావోయిజం వర్ధిల్లడానికి గిరిజన సామాజిక వర్గాల్లో పేదరికం, సామాజిక బహిష్కరణ, విచ్ఛిన్నమైన విశ్వాసం తదితర కొన్ని కఠోర వాస్తవాలే ప్రధాన కారణాలు. గిరిజన వర్గాలు కొన్ని తమ భూములను, అటవీ హక్కులను కోల్పోతున్నాయి. బలమైన పెత్తందార్ల దోపిడీని ఎదుర్కొంటున్నాయి. వీటికి తోడు అధికార యంత్రాంగం నిర్లక్షం వెంటాడుతోంది. ఇవన్నీ పరిష్కారం కాకుంటే మళ్లీ క్షేత్రస్థాయిలో మావోయిజం లేదా అలాంటి ఇతర ఉద్యమాలు పుట్టుకు రాక తప్పదు. భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో అటవీ హక్కుల చట్టం, పంచాయతీ రాజ్ చట్టాల ద్వారా ఆయా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులకు రక్షణ, స్థానిక స్వపరిపాలన కల్పించబడ్డాయి. ఈ ప్రాంతాల ప్రజల హక్కులను కాపాడటమే కాకుండా వారి బాగోగులను చూసుకునే ప్రత్యేక అధికారాలు గవర్నర్లకు ఉన్నాయి. అయితే ఇవి పేలవమైన అమలు కారణంగా విఫలమవుతున్నాయి తప్ప చట్టాల్లో లోపాలు ఉన్నందువల్ల కాదు. ఈ పరిస్థితుల్లో గవర్నర్లే గిరిజన ప్రయోజనాలను కాపాడే బాధ్యత వహించాలి. అలాగే పునరావాసం అనేది కేవలం ఒక చర్యగా మాత్రమే ఉండకూడదు. విద్య, ఆరోగ్యభద్రత, ఉద్యోగాలు, గౌరవం, ప్రతి కుటుంబానికి చేరువ కావాలి. మార్చి 31 వరకు ప్రభుత్వం ప్రధానంగా భద్రతా పరమైన అంశాల పైన, మావోయిస్టుల అంతం పైనే దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు గిరిజన బతుకుల్లో భద్రతతోపాటు ఉపాధి, ఉద్యోగాలు, అటవీ భూముల హక్కుల కల్పన వంటి సంఘర్షణకు దారితీసిన అంశాల పైనే ప్రభుత్వం దృష్టి మళ్లించవలసి ఉంది. వామపక్ష తీవ్రవాదం నిర్మూలన అనేది ఆ ప్రాంతాల అభివృద్ధికి శాంతి భద్రతల పునరుద్ధరణకు మంచి పరిణామం అయినప్పటికీ ఆ పేరుతో కార్పొరేట్ శక్తులు, క్రోనీ కేపిటలిస్టులు, గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేసే అవకాశం ఇవ్వకూడదు. దీనికి బదులు గిరిజనులకు కల్పించవలసిన హక్కుల కల్పనకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వారికి భాగస్వామ్యం కల్పించడానికి కృషి సాగించాలి. నక్సల్స్ విముక్తికి డెడ్లైన్ మార్చి 30కి ముందు లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మూడేళ్ల పాటు పారామిలిటరీ ఆపరేషన్లు ముమ్మరంగా చేపట్టడం వల్ల 4839 మావోయిస్టులు లొంగిపోయారని, 2218 మంది అరెస్టు అయ్యారని, 706 మంది ఎన్కౌంటర్లలో తటస్థం అయ్యారని లెక్కలు వల్లించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్స్పట్ల సానుభూతి చూపించడం వల్లనే నక్సలిజం విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. కానీ వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు పెనుసవాలుగా గుర్తించి 200910 లో ఆపరేషన్ గ్రీన్హంట్ పేరుతో నక్సల్స్ నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. ఆనాడు ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న బీహార్, జార్ఖండ్, చత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని 180 జిల్లాల్లో నక్సలిజం తీవ్రంగా ఉండేది. కానీ నక్సల్ నివారణ చర్యలు చేపడితే పారామిలిటరీ నిర్వహణకు విపరీతంగా ఖర్చు చేయవలసి వస్తుందని, అనేక మంది ప్రాణాలు బలిగొనాల్సి వస్తుందని తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వంద్వ విధానం పాటించారు. ఒకవైపు లొంగిపోయిన నక్సల్స్కు చర్చలద్వారా పునరావాసం కల్పిస్తామని, దీనిని వ్యతిరేకించిన వారిని హతం చేస్తామని హెచ్చరించారు. నక్సల్స్ను నిర్మూలించడం మారణహోమంగా పరిగణించే మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తల, మేధావుల అసంతృప్తిని లెక్కలోకి తీసుకోలేదు. పైగా వారిని అర్బన్ నక్సల్స్గా ముద్రవేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నక్సల్స్ భావజాలం వ్యతిరేకమని, అభివృద్ధికి వారు దోహదం చేయరని గిరిజనుల్లో ప్రచారం చేయించారు. మొత్తం మీద వామపక్ష ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విజయం సాధించారు. ఇప్పుడు సయోధ్య రాజకీయాల ద్వారా యుద్ధ గాయాలను మాన్పడమే తక్షణ కర్తవ్యం.
Perni Nani |అధికారులపై బెదిరింపులు
Perni Nani | అధికారులపై బెదిరింపులు Perni Nani | ఆంధ్రప్రభ, వెబె
ధవీకరించిన పెంటగాన్ వర్గాలు వాషింగ్టన్: ఒక వైపు ఇరాన్పై యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధ్యుక్షునిపై వేటు పడింది. ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరగా, ఆయన వెంటనే వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆర్మీలోని అత్యున్నతస్థాయి అధికారిని పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ కోరినట్లు తెలిపాయి. రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు హెగ్సెత్ వేగంగా […] The post అమెరికా ఆర్మీ చీఫ్పై వేటు appeared first on Visalaandhra .
సర్పంచ్ లకు అండగా ఉంటాను –ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి..
సర్పంచ్ లకు అండగా ఉంటాను – ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.. దర్శి, ఆంధ్రప్రభ
సమస్యల పరిష్కారానికి గ్రామసభలు
భీమదేవరపల్లి:ఏప్రిల్ 03 (జనం సాక్షి)రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా భీమదేవరపల్లిమండలంలోని గ్రామాల్లో గ్రామసభలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా …
అమెరికా సాంకేతికతపై ఇరాన్ సవాలు
పశ్చిమాసియాలో 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాక, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఏకధ్రువ ప్రపంచ క్రమం కుప్పకూలుతున్న ఒక చారిత్రక ఘట్టంగా పరిణమించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ప్రారంభంలో కొన్ని విజయాలను సాధించినప్పటికీ, ఇరాన్ పటిష్టమైన యుద్ధతంత్రం, అసిమెట్రిక్ యుద్ధ నైపుణ్యం ముందు ఆ అగ్రరాజ్యాల సాంకేతిక గర్వం నీరుగారిపోయింది. ముఖ్యంగా, అమెరికా గర్వపడే గగనతల నిఘా వ్యవస్థలకు వెన్నెముకవంటి అవాక్స్ విమానాన్ని ఇరాన్ కూల్చివేయడం,ఆ దేశపు రక్షణ వ్యవస్థలోని లొసుగులను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ యుద్ధం కేవలం సైనికపరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా అమెరికాను దివాలా అంచుకు నెట్టివేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ ఒక పరాన్న దేశంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతగా అమెరికాపై ఆధారపడి ఉందో స్పష్టమైంది. రష్యా, చైనా, ఇండియా వంటి ఎదుగుతున్న శక్తులు ఇప్పుడు ఏకమై ఒక చిన్న తోపు తోస్తే, పాత ప్రపంచ క్రమం అంతమై ఒక నూతన బహుధ్రువ ప్రపంచం ఆవిర్భవించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026 చివరి వారంలో జరిగిన ఒక కీలక పరిణామం యుద్ధగమనాన్ని పూర్తిగా మార్చివేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్మీద ఇరాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడిలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఇ-3 సెంట్రీ(అవాక్స్) విమానం ధ్వంసమైంది. ఈ విమానం కేవలం ఒక వాహనం కాదు. అది గగనతలంలో కదిలే ఒక కమాండ్ సెంటర్. ఇది సుమారు 250 మైళ్ల (375 కిలోమీటర్లు) పరిధిలోని ప్రతి చిన్న కదలికను -అవి డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, యుద్ధవిమానాలు కావచ్చు- అన్నింటినీ గుర్తించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతోనే అమెరికా ప్రపంచ దేశాలపై ఇన్నాళ్లూ తన పెత్తనాన్ని చలాయించింది. అయితే ఇరాన్ తన పటిష్టమైన యుద్ధతంత్రంతో ఈ ‘కదిలే రాడార్’ను మట్టుబెట్టడం ద్వారా అమెరికా గగనతల ఆధిపత్యాన్ని సవాలు చేసింది. అవాక్స్ను కోల్పోవడంవల్ల అమెరికా సైన్యానికి యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో తెలియని ‘అంధత్వం’ ఏర్పడింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఉన్న రాడార్లపై ఆధారపడాల్సి రావడం, అవి కూడా ఇరాన్ దాడులకు గురవుతుండడంతో అమెరికా రక్షణ వ్యవస్థలో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడింది. నిఘా విమానమైన ఇ-3 సెంట్రీ (అవాక్స్) పూర్తిగా ధ్వంసం కావడంతో 270 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. కెసి-135 స్ట్రాటోట్యాంకర్ యుద్ధ విమానాల్లో ఒకటి కూలిపోగా, ఐదు ధ్వంసమయ్యాయి. ఇవి ఒక్కో విమానం 165 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఎఫ్-15 ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు మూడు కూలిపోయాయి. ఇవి ఒక్కోటి 100 మిలియన్ డాలర్లు ఉంటుంది. అత్యాధునిక జెట్ అయిన ఎఫ్-35ఎ లైట్నింగ్ II అత్యవసర ల్యాండింగ్ అయి ధ్వంసమైంది. దీనికి 82.5 మిలియన్ డాలర్లు ఉంటుంది. దాదాపు పన్నెండుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూలిపోయాయి. వీటితో 30- 40 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. రక్షణ రాడార్ ఎఎన్/ టిపివై-2 (థాడ్) ధ్వంసం కావడంతో 500 మిలియన్ డాలర్ల నష్టం జరిగింది. దీనిని విశ్లేషిస్తే, అమెరికా తన అత్యాధునిక సాంకేతికతను ఇరాన్ వంటి దేశం ఎదురుదాడులనుంచి కాపాడుకోవడంలో విఫలమైందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎఫ్-15ఇ విమానాలు కువైట్ విమానాల ద్వారా పొరపాటున కూల్చివేయబడడం, అమెరికా నాయకత్వంలోని కూటమిలో సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. అమెరికా తన అత్యంత ఖరీదైన క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన థాడ్ (టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్), దాని రాడార్ ఎఎన్/టివివై-2పై అమితమైన విశ్వాసాన్ని ఉంచింది. ఈ వ్యవస్థ అంతరిక్షం నుంచి వచ్చే హైపర్సోనిక్ క్షిపణులను కూడా గుర్తించగలదు. కానీ ఇరాన్ యుద్ధం ఒక ‘సాంకేతిక వైరుధ్యాన్ని’ బయటపెట్టింది. కోట్లాది డాలర్ల విలువైన ఈ రాడార్ వ్యవస్థలు కేవలం 35,000 డాలర్ల విలువ చేసే చిన్న డ్రోన్ల దాడికి ఛిద్రమైపోయాయి. జోర్డాన్లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఎఎన్/టిపివై-2 రాడార్ ఇరాన్ దాడుల్లో ధ్వంసం కావడం అమెరికాకు కోలుకోలేని దెబ్బ. ఈ రాడార్లు ఒకచోట స్థిరంగా ఉండడంవల్ల శత్రువులకు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. అత్యాధునిక రాడార్ అరేలు ఎంత సున్నితంగా ఉంటాయంటే, ఒక చిన్న పేలుడు కూడా ఆ వ్యవస్థను పూర్తిగా పనికిరాకుండా చేయగలదు. ఈ వైఫల్యం వల్ల ఇరాన్నుంచి వచ్చే క్షిపణులను గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇది ఇజ్రాయెల్, ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న అమెరికా, ఈ యుద్ధం కోసం అదనంగా 200 బిలియన్ డాలర్ల అత్యవసర నిధుల కోసం పెంటగాన్ ద్వారా వైట్ హౌస్ను కోరింది. యుద్ధం మొదలైన మొదటి మూడు వారాల్లోనే సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలు ధ్వంసమయ్యాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల మార్కెట్, సాధారణంగా యుద్ధ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించబడుతుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్టుబడిదారులు అమెరికా ప్రభుత్వం తన అప్పులను తీర్చగలదా అనే అనుమానంతో బాండ్లను విక్రయిస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ బాండ్ మార్కెట్ నుంచి మార్చి నెలలోనే 2.5 ట్రిలియన్ డాలర్ల విలువ ఆవిరైపోయింది. ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరగడం, పెట్రోల్ ధరలు గ్యాలన్కు 4 డాలర్లకు చేరువ కావడం అమెరికా సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఈ గణాంకాలు అమెరికా ఆర్థికంగా ఎంత పటిష్టమైన దేశమో నిరూపిస్తున్నాయి. ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం తగ్గిపోతుండడం ఈ పతనానికి ప్రధాన సంకేతం. ఇజ్రాయెల్ తన సాంకేతిక నైపుణ్యంతో ఇరాన్పై దాడులు చేస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఆ దేశం అమెరికా ఇచ్చే ‘సైనిక ప్రాణవాయువు’ (స్ట్రాటజిక్ ఆక్సిజన్ పైపులైన్) మీద పూర్తిగా ఆధారపడి ఉందని అర్థమవుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో తాము స్వయం సమృద్ధి సాధిస్తామని ప్రగల్భాలు పలికినప్పటికీ, యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే ఆ దేశ మందుగుండు సామాగ్రి నిల్వలు నిండుకున్నాయి. అమెరికా సరఫరా చేసే మందుగుండు లేకపోతే ఇజ్రాయెల్ ఒక్క వారం కూడా యుద్ధం చేయలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ‘గా (వార్ఎకానమీ) మారిపోయింది. పౌర రంగాలు, పర్యాటకం, వ్యవసాయం పూర్తిగా కుప్పకూలిపోయాయి. కేవలం సైనిక ఎగుమతులు మాత్రమే ఆ దేశాన్ని కాపాడుతున్నాయి. 2024లో 15బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులు చేసిన ఇజ్రాయెల్, ఇప్పుడు తన ఉనికి కోసం ప్రతి వనరును యుద్ధానికే మళ్లిస్తోంది. ఇది ఇజ్రాయెల్ను ఒక ‘సూపర్ స్పార్టా’ దేశంగా మార్చేసింది. అంటే నిరంతరం యుద్ధం మీదనే ఆధారపడే స్థితి. మార్చి 4, 2026న ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒక అణుబాంబు వంటి ప్రభావాన్ని చూపింది. ప్రపంచంలోని 20% చమురు సరఫరా, గణనీయమైన గ్యాస్ సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఇప్పుడు ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకొని, చమురు రవాణా చేసే నౌకల నుంచి సుంకాలను కేవలం చైనీస్ యువాన్లో మాత్రమే వసూలు చేస్తోంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి పడిన అతిపెద్ద దెబ్బ. చైనా క్రాస్-బోర్డర్ పేమెంట్ సిస్టమ్ద్వారా లావాదేవీలు జరగడం వల్ల అమెరికా ఆంక్షలు నిర్వీర్యమయ్యాయి. గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికా రక్షణ కవచం బలహీనపడడంతో తమ ఆర్థిక మార్గాలను చైనా వైపు మళ్లిస్తున్నాయి. ప్రస్తుత యుద్ధం ఒక సరికొత్త భౌగోళిక రాజకీయ మార్పును తెచ్చినట్టు కనిపిస్తోంది. అమెరికా అస్థిరమైన నాయకత్వాన్ని చూసిన జపాన్, జర్మనీ వంటి దేశాలు కూడా ఇప్పుడు తమ భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. రష్యా బహిరంగంగా అమెరికా దాడులను ఖండిస్తూనే, తెరవెనుక ఇరాన్కు ఉపగ్రహ సమాచారాన్ని, డ్రోన్ యుద్ధతంత్రాలను అందిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్నప్పటికీ, ఇరాన్ను అమెరికా పతనానికి ఒక ఆయుధంగా రష్యా వాడుకుంటోంది. చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే ఆర్థికంగా అమెరికాను దెబ్బతీస్తోంది. ఇరాన్కు ఆర్థిక అండగా నిలుస్తూ, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమి ద్వారా ప్రత్యామ్నాయ ప్రపంచ క్రమాన్ని నిర్మిస్తోంది. భారతదేశం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూనే, తన ఇంధన భద్రత కోసం రష్యా, ఇరాన్లతో సంబంధాలను కొనసాగిస్తోంది. అమెరికా బలహీనపడడంవల్ల దానికి సాగిలపడకపోతే ఇండియా వంటి దేశాలకు ప్రపంచ స్థాయిలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం పెరుగుతుందనుకోవచ్చు. జపాన్, జర్మనీ దేశాలు ఇన్నేండ్లూ అమెరికా రక్షణ గొడుగు కింద ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా స్వయంగా యుద్ధంలో చిక్కుకోవడంతో, అవి తమ రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూ సొంత వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఇరాన్ యుద్ధం అమెరికా అజేయత అనే భ్రమను తొలగించింది. ప్రపంచ పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికా, ఇప్పుడు తన సొంత ఆర్థిక సమస్యలు, సైనిక వైఫల్యాలతో సతమతమవుతోంది. ఇజ్రాయెల్ తన మనుగడకోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడే బలహీన దేశంగా మిగిలిపోయింది. ఇరాన్ చూపిన పటిష్టమైన యుద్ధతంత్రం, ఆధునిక సాంకేతికత కంటే వ్యూహాత్మక ధైర్యం గొప్పదని నిరూపించింది. ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా వంటి శక్తులు ఏకమై ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని కొనసాగిస్తే, పాత సామ్రాజ్యాల పతనం పూర్తి కావడం ఖాయం. ప్రపంచం ఇప్పుడు ఏకధ్రువ ఆధిపత్యం నుంచి బహుళ ధ్రువ సహకారంవైపు అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక యుద్ధం ముగింపు కాదు. ఒక నూతన శకానికి ఆరంభం. అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ గమనాన్ని శాసించలేదు. - మేకల ఎల్లయ్య -99121 78129
మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు
అంబర్పేట్లో విషాదం – అవయవ దానం ద్వారా ముగ్గురికి కొత్త జీవితం అంబర్పేట్, ఏప్రిల్ 03 (జనం …
పెనుగంచిప్రోలులో అద్భుతం.. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలులో వెలసిన శ్రీ
Hyderabad : హైదరాబాదీలూ.. అలెర్ట్.. కల్తీ ఆహారం తినే వారికి హెచ్చరిక
హైదరాబాద్ లో ఇటీవల కల్తీ ఆహార పదార్థాలు బయటపడుతున్నాయి
చరిత్ర బాటసారి జైశెట్టి రమణయ్య
కరీంనగర్ చరిత్ర కన్నీరు పెట్టిన రోజు 27 మార్చి, 2026. ఆ రోజు డా. జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. 17వ ఏటనే ఉపాధ్యాయ కొలువు చేపట్టి జగిత్యాలలో పురాతన ఖిల్లా దారిలో వెళుతుంటే ఆయన చూపు, మనసు అంతా ఆ దుర్గమ కట్టడం వైపే ఉండేది. తాను చదివిన పుస్తకాల్లో దీని ప్రస్తావనే లేకపోవడం ఆయనను కలచివేసేది. అలా రమణయ్య శోధన చరిత్ర వైపు మళ్లింది. మరింత లోతైన విజ్ఞానం కోసం చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అంతటితో ఆగకుండా పురాతన దేవాలయాలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు. అలా ఆయన 87ఏళ్ల జీవితకాలం కరీంనగర్ ప్రాంత పురా విశేషాలను, ప్రత్యేకతలను వెదుకులాటకే అంకితమైంది. శాతవాహనుల కాలం నుండి అసఫ్ జాహీల దాకా సాగిన పరిపాలన విశేషాలెన్నో ఆయన పరిశోధనద్వారా వెలుగు చూశాయి. తమ పరిశోధనా ఫలితాలను కరీంనగర్ జిల్లా చరిత్ర, సంస్కృతిగా గ్రంథస్తం చేశారు. ఎంతో విలువైన సమాచారాన్ని క్రోడీకరించి తన తర్వాతి తరం పరిశోధకులకు ఆయన మార్గదర్శకులయ్యారు. పూర్వ కరీంనగర్ జిల్లా పురాతన కట్టడాలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. ఎన్నో గ్రామాల్లో ఆదరణకు నోచుకోని శిల్పాలు, శిలా శిథిలాలు చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయాయి. గుట్టల ప్రాంతమైన ఈ జిల్లాలో రాళ్లపై విగ్రహాలు, శాసనాల చెక్కడాలు విరివిగా కనిపిస్తాయి. రాజుల ప్రాశస్త్యమంతా రాళ్లమీదే మిగిలినట్లు చరిత్రకారుల దృష్టి వీటిపైకి మళ్లలేదు. వ్యవసాయ ప్రధానమైన కరీంనగర్ ప్రాంతం చారిత్రక పరిశోధనల విషయంలో నిరాదరణకు గురైందని చెప్పవచ్చు. అలాంటి సందర్భంలో స్థానికుడిగా, చరిత్ర అధ్యయనం చేసిన వ్యక్తిగా రమణయ్య స్వీయ ఆసక్తితో జగిత్యాల, ఎలగందుల ఖిల్లాల చరిత్రను వెలికి తీశారు. శాతవాహనుల రాజధాని కోటిలింగాలపై తమ పరిశోధనలను పుస్తకంగా తెచ్చారు. జిల్లాలోని గ్రామాల, పట్టణాల పేర్ల వెనుక ఉన్న కారణాలను వెదికి, వాటిలోని చారిత్రకాంశాలను వివరించారు. ఆయన రాసిన ‘కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి’ ఒక ప్రామాణిక గ్రంథం. పరిశోధకులకు మార్గదర్శిగా, పలు పునర్ముద్రణలు పొందిన రచనగా ఇది నిలుస్తుంది. తెలంగాణ సుప్రసిద్ధ దేవాలయాలు, తెలంగాణ సుప్రసిద్ధ కోటలు, శ్రీవేములవాడ క్షేత్ర చరిత్ర, తెలంగాణ తేజోవంతులు, కాలగమనంలో కోనసముద్రం తదితర పుస్తకాలు రమణయ్య ఇతర రచనలు. 2018 లో వీరు ‘సొంత ఎదుగుదల’ అనే స్వీయ చరిత్రను రాసుకున్నారు. 1939లో జగిత్యాలలోని వైశ్య కుటుంబంలో పుట్టిన ఆయన పల్లెటూరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఒంటరి ప్రయాణం ఆరంభించి చరిత్రకారుడిగా ఎదిగిన క్రమం ఈ ఆత్మకథలో చూడవచ్చు. అధ్యాపక వృత్తిని ఎంచుకున్న వారికి వీరి జీవన గమనం స్ఫూర్తిగా నిలుస్తుంది. వీరి తాత జైశెట్టి రాజయ్య పద్యకవి. 1933 లో ఆయన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం, మనస్సంబోధ కీర్తనలు రాశారు. రమణయ్య వాటిని 1992లో పునర్ముద్రించారు. టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ది చాళుక్యాస్ అండ్ కాకతీయ టెంపుల్స్ -ఏ స్టడీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనే పుస్తకాలు ఇంగ్లీషులో వెలువరించారు. చరిత్ర అధ్యాపకులైనా.. రమణయ్యకు ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉంది. ఆ రోజుల్లో పదవ, ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా ఇంగ్లిష్లో ఫెయిల్ అవడంతో వారి కోసం సులభంగా అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ అనే పుస్తకం రాశారు. ఆ పరీక్షల్లో వచ్చే వ్యాకరణాంశాలను అందులో వివరించి ఎందరో విద్యార్థులు ఆ తరగతులు గట్టెక్కేలా తోడ్పడ్డారు. అధ్యాపకుడు, చరిత్ర పరిశోధకుడే కాకుండా రమణయ్య మంచి వక్త. ఏ విషయం పైనైనా సాధికారికంగా మాట్లాడగల ప్రజ్ఞాశాలి. కాలేజీల్లో ఏ సాహితీ, సాంస్కృతిక, వార్షిక సభలు, సమావేశాలు జరిగినా నిర్వహణ బాధ్యత తనపై వేసుకునేవారు. స్పష్టమైన గొంతుతో, చక్కని భాషలో, లోతైన పరిజ్ఞానంతో సాగే ఆయన సభా పరిచయ వాక్యాలు, ప్రసంగాలు సభికులను మంత్రముగ్ధుల్ని చేసేవి. విద్యార్థులంటే ఎంత ప్రేమనో, వృత్తిపట్ల అంతే నిబద్ధత కనబరచేవారు. కాలేజీ సెలవుల్లో విజ్ఞానయాత్రలు ఏర్పాటు చేసి విద్యార్థులను దేశంలోని చారిత్రక ప్రాంతాలకు తీసుకెళ్ళేవారు. కరీంనగర్కు సమీపంలోని ఎలగందుల ఖిలాలో పదేళ్ల క్రితం ఏర్పాటు చేరిన సౌండ్ అండ్ లైట్ షో కి అవసరమైన వ్యాఖ్యానాన్ని రమణయ్య అందించారు. 1971లో రమణయ్య సిద్దిపేట జూనియర్ కాలేజీలో పని చేశారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన విద్యార్థి. 2024 లో రాజకీయ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో కెసిఆర్ ఓ రోజు బస చేసినపుడు రమణయ్య ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్న కెసిఆర్ గురువుకు పాదాభివందనం చేశారు. వ్యక్తిగా, అధ్యాపకుడిగా పరిపూర్ణ జీవితాన్ని అందుకొని, దానిని ఎందరికో ఉపయోగపడేలా మలుచుకున్న రమణయ్య మాస్టారు సదా ఆదర్శప్రాయులు. - బి.నర్సన్ - 9440128169
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు..
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు.. వర్ని, ఆంధ్రప్రభ : వర్ని
సిద్దిపేటలో ప్రేమపెళ్లి... ప్రియుడు పురుగుల మందు తాగి... ప్రియురాలు ఉరేసుకొని ఆత్మహత్య
సిద్దిపేట: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బలవంతంగా ప్రేమజంటను పెద్దలు విడదీయడంతో ప్రియుడు పురుగులు మందు తాగి చనిపోవడంతో ప్రియురాలు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముస్త్యాల గ్రామంలో అనుముల రాకేష్ రెడ్డి(25), తరిగొప్పుల హారిక(22) యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. రాకేష్ రెడ్డి ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్ లో నివసిస్తున్నారు. పెళ్లైన మూడు నెలలకు ప్రేమజంటను స్వగ్రామానికి తీసుకువచ్చారు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి రాకేష్ రెడ్డి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఇటీవల హారిక ఆత్మహత్యాయత్నం చేసుకోవగా రాకేష్ రెడ్డి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం పెళ్లి చేస్తామని చెప్పినా కూడా కావాలనే ఆలస్యం చేస్తున్నారని వీళ్లు పెళ్లి చేయరని మనస్తాపంతో పురుగుల మందు తాగి రాకేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణ వార్త విని తట్టుకోలేక హారిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అన్యాయమే అధికారమై రాజ్యమేలుతుంటే.. / అణగారిన వర్గాలపై అహంకారం విజృంభిస్తుంటే.. / వెట్టిచాకిరితో జీవితాలను బుగ్గిమయం చేస్తుంటే.. / ఆ నియంత పోకడలను ఎదురించిన యోధుడు దొడ్డి కొమురయ్య.’ నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్న మిలిటరీ పాలనకు ఎదురొడ్డి 4000 మంది కార్యకర్తలు అమరులయ్యారు. ఆ కోవలో అమరుడై, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చిన యోధుడు ‘దొడ్డి కొమురయ్య’. భూసమస్యను దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా చేసింది తెలంగాణ ప్రజలను చైతన్య పరిచింది ‘బాంచెన్ దొరా నీ కాళ్లు మొక్కుతా’ అన్న బడుగు జీవులతో ఆయుధాలు పట్టించింది అప్పటి నల్లగొండ జిల్లా జనగామ తాలూకాలోని విస్నూరు గ్రామంలో రాక్షతత్వానికి నిలువెత్తు నిదర్శనం అయినా విస్నూర్ దేశుముఖ్ రామచంద్రారెడ్డి, అతని కొడుకు బాబు దొర. వీరి ఆగడాలు అంతాఇంతా కాదు. 60 గ్రామాలకు అధిపతి ఈ నరరూప రాక్షసుడు నిజాంకు తొత్తులుగా ఉన్న దొరలు, పటేళ్లు, పట్వారీలు గ్రామాల్లో ప్రజలపై చేయని అఘాయిత్యం లేదు. విస్నూరు దగ్గరలో ఉన్న కడవెండి గ్రామాల రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ జాగీర్దార్ కడవెండి ఊరులో దొరసాని చేసిన ఆగడాలు తక్కువ ఏమీ కాదు. 20 ఎకరాలు కూడా లేని జానమ్మ దొరసాని అనతికాలంలో ఊరును అంత తన గుప్పిట్లో పెట్టుకుంది. జానమ్మ దొరసాని ప్రజలచేత దొర అని పిలిపించుకునేది. ఈ అణచివేత నుండి 1944 ఆంధ్ర మహాసభ ఏర్పాటు తెలంగాణ ప్రాంతం అంతా ఆంధ్రమహాసభ నాయకత్వంలో గుండెలు మండి గ్రామాల్లో ప్రజలు ఒడిసెల, గుప్తలు, మహిళలు కారంపొడి సంఘాన్ని ఏర్పరుచుకున్నారు. సంఘం అండతో గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దుకోసం ఉద్యమ బాటపట్టారు. పన్నులు కట్టేది లేదని తిరుగుబాటు చేశారు. ఇది చూసిన దొరలు ఉద్యమాన్ని అణచడం కోసం అనేక ప్రయత్నాలు చేసేవారు. కడవెండి గ్రామస్థులు అయినా దొడ్డి కొమురయ్య, అన్నదొడ్డి మల్లయ్య గ్రామంలో గొల్ల, కురుమల నాయకుడు. దొరసాని వెట్టికి గొర్రెలను ఇవ్వద్దని గొర్ల కాపర్లును చైతన్యపరిచాడు. దొడ్డి మల్లయ్యతోపాటు అదే గ్రామానికి చెందిన మంగలి కొండయ్య, నరసయ్య ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి, నల్లనరసింహులు అప్పుడున్న సంఘంలో చేరి గ్రామ నాయకులు అయ్యారు. ఇది మింగుడుపడని జానమ్మ దొరసాని వీళ్లను హతమార్చాలని పన్నాగం పన్నింది. ఈ కార్యక్రమంలో దొరసాని ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు అంతా నిరసన ప్రదర్శన చేయాలని సంఘం నిర్ణయించింది. 1946 జులై 4 సంఘం పిలుపు అందుకొని కడవెండి గ్రామంలో ప్రజలుఅంతా వీధుల గుండా ప్రదర్శన చేశారు. అప్పటికి దొరసానికి అండగా వచ్చిన విస్నూరు రామచంద్రారెడ్డి రౌడీలు కోడూరు దొర నరసింహారెడ్డి నాయకత్వం గడి నుండి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. కడుపులోకి తూట దిగడంతో కొమురయ్య అక్కడికక్కడే నేలకొరిగాడు. కొమురయ్య అన్న మల్లయ్య కాలుకు తూట దూసుకుపోయింది. లక్ష్మీనరసయ్య కొండయ్యలకు గాయాలయ్యాయి. కొమురయ్య మరణం చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ సంఘం అండతో గ్రామాలలో దొర గుండాలను తరిమికొట్టారు. కొమురయ్య బలిదానం తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడుపోసింది. సంఘం పిలుపుతో ప్రజలు సాయుధ మార్గం పట్టారు. కొన్ని ప్రాంతాలకు దేశ్ముఖ్లుగా ఉంటూ ప్రజలను రాచిరంపాన పెట్టిన నరరూప రాక్షసులైన దొరలను, వారి ఆధిపత్యాన్ని కూలదోశారు. మహోత్తర పోరాటంలో 4000 నుంచి5000 మంది అమరులయ్యారు. దొడ్డి కొమురయ్య త్యాగం కేవలం ఒక వ్యక్తి బలిదానం మాత్రమే కాదు. అది తెలంగాణ మట్టిలో న్యాయం కోసం పోరాడే ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన ప్రాణత్యాగం తరువాత గ్రామీణ ప్రాంతాల్లో అణచివేతకు గురైన కూలీలు, రైతులు, దళితులు, గిరిజనులు తమ హక్కులకోసం సంఘటితమై పోరాట పథంలో అడుగులు వేసారు. ఈ పోరాటం ప్రజల్లో స్వాభిమానాన్ని రగిలించి, భూమి రైతుకే అనే నినాదాన్ని గ్రామాలనుంచి దేశవ్యాప్తంగా వినిపించేలా చేసింది. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం ప్రాంతీయ ఉద్యమం మాత్రమే కాదు, సామాజిక న్యాయంకోసం జరిగిన గొప్ప ప్రజావిప్లవం.దీనిలో పాల్గొన్న వేలాదిమంది అమరుల కథలు పాఠ్యపుస్తకాలలో స్థానం పొందితేనే యువతలో చరిత్రపట్ల అవగాహన పెరుగుతుంది. ప్రజల హక్కులకోసం ప్రాణాలు అర్పించిన వీరుల స్ఫూర్తిని కొనసాగించడం అంటే వారి ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న అసమానతలు, భూవివాదాలు, సామాజిక వివక్షలను నిర్మూలించేందుకు పాలకులు కట్టుబడి పనిచేయాలి. అదే నిజమైన నివాళి. అలాగే ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా సామాజిక సంస్థలు, మేధావులు, యువత ముందుకు రావాలి. వీరుల త్యాగాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా మేధావులు కవులు, కళాకారులు, సామాజిక శక్తులు, ప్రగతిశీల శక్తులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొడ్డి కొమురయ్యతోపాటు సాయుధ పోరాట అమరుల అందరికీ నిజమైన నివాళి.- - దయ్యాల అశోక్ 95508 89907 ( నేడు దొడ్డి కొమురయ్య జయంతి)
ప్రేమ, క్షమాగుణం మన జీవన మార్గం కావాలి..
ప్రేమ, క్షమాగుణం మన జీవన మార్గం కావాలి.. తిరువూరు, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని
Road Accident : అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి స్పాట్ డెడ్
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
Missed DRIP Opportunities Under the Previous Government Now Haunt Andhra Pradesh
The delay in taking up key dam rehabilitation works in Andhra Pradesh under the DRIP Phase II program is not an isolated administrative issue. It reflects a pattern that began during the previous government’s tenure. The issue is a direct consequence of opportunities that were not utilised when they were available. The Dam Rehabilitation and […] The post Missed DRIP Opportunities Under the Previous Government Now Haunt Andhra Pradesh appeared first on Telugu360 .
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ లో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ - పెద్దపల్లి బైపాస్ లోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.
మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలో డీసీఎంను ఢీ కొట్టిన టూరిస్ట్ బస్సు #BusAccident#RoadCrash
Telangana : తీరని గ్యాస్ కష్టాలు.. ఎంత పొడవు క్యూ అంటే?
తెలంగాణలో ఎల్.పి.జి గ్యాస్ కష్టాలు తీరడం లేదు.
సీనియర్ కాంగ్రెస్ నేతను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే..
సీనియర్ కాంగ్రెస్ నేతను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే.. నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి
ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా ‘రాకాస’
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల... ఉమేష్ కుమార్ బన్సల్తో కలిసి ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ మ్యాడ్ నెన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ “క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా, ఎంటర్టైన్ అయ్యేలా మా ‘రాకాస’ ఉంటుంది. పూర్తిగా హారర్, థ్రిల్లర్ అని కాకుండా.. కామెడీ, ఫాంటసీ, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల అంశాలతో ఉంటుంది”అని అన్నారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ “రాకాస’ గురించి రామ్ చరణ్ చాలా గొప్పగా మాట్లాడారు. ఈ చిత్రం ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది”అని తెలిపారు. మానస శర్మ మాట్లాడుతూ “రాకాస’లో కథ చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మన జానపదాలు, కల్చర్ అనేవి ఈ తరానికి అర్థమయ్యేలా, నచ్చేలా ఈ మూవీని తీశాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నయన్ సారిక, మన్యం రమేష్, జీ స్టూడియో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య పాల్గొన్నారు.
Narendra Modi : నేడు పుదుచ్చేరికి ప్రధాని
నేడు పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

34 C