SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

బంగ్లాదేశ్‌లో భూకంపం..కోల్‌కతాలో ప్రభావం

బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రంగా శుక్రవారం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూ కంపం ప్రభావం ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్ ఇతర ప్రాంతాలపై కూడా పడింది. మహానగరం కోల్‌కతా ఇతర బెంగాల్ ప్రాంతాల్లో జనం ఉరుకులు పరుగులతో బయటకు వచ్చారు. మధ్యాహ్నం 1.22 గంటలకు రెక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు రికార్డు అయ్యాయని భారత భూకంపాల పరిశోధనా కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్‌లోని సత్కీరా జిల్లాలో భూమిలోపల పది కిలోమీటర్ల అడుగున భూ కంప ప్రధాన కేంద్రం నెలకొన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతం కోల్‌కతాకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరిహద్దు జిల్లా ప్రాంతం నార్త్ 24 పరగణా జిల్లా లోని టాకీకి ఈ భూకంప కేంద్రం పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ పరిధిలోని పలు చోట్ల జనం ప్రకంపనలు ఎదుర్కొన్నారు. దాదాపు పది సెకండ్ల పాటు భూమి కంపించింది. పశ్చిమ బెంగాల్‌లో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం ఘటనలు జరగలేదు. అయితే పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సర్వం సమాయత్తంగా ఉంది. 

మన తెలంగాణ 27 Feb 2026 9:30 pm

ది కేరళ స్టోరీ2 విడుదలకు హైకోర్టు అనుమతి

వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ విడుదల కానుంది. చిత్ర ప్రదర్శనకు కేరళ హైకోర్టు శుక్రవారం అనుమతిని ఇచ్చింది. పదిహేను రోజులు చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును పూర్తిస్థాయి బెంచ్ నిలిపివేసింది. సినిమా నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిగింది. అంతకు ముందు విడుదల పై స్టేను ఎత్తివేస్తున్నట్లు న్యాయమూర్తులు శుశృత్ ధర్మాధికారి, పివి బాలకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది. సినిమాను పూర్తి స్థాయిలో చూడలేదు. కేవలం కొన్ని సన్నివేశాలను పరిశీలించే సింగిల్ జడ్జి తమ తీర్పును వెలువరించినట్లు ఉందని ధర్మాసనం పేర్కొంది. . సినిమా విడుదలకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. విడుదల తరువాత తలెత్తే పరిణామాలు ఏమైనా ఉంటే సరిగ్గా స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కేరళలో హిందూ మహిళలు ఇస్లాం మతం స్వీకరించిన నిజ సంఘటనల ఆధారంగా సినిమా తీశారు. 

మన తెలంగాణ 27 Feb 2026 9:27 pm

అభిషేక్‌పై అమీర్ విమర్శలు… అశ్విన్ కౌంటర్

నేటి మ్యాచ్శ్రీలంక x పాకిస్తాన్రా త్రి 7 గంటలకు న్యూదిల్లీ: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చేసిన ‘స్లాగర’ విమర్శలను భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పికొట్టాడు. వరుస వైఫల్యాల తర్వాత జింబాబ్వేపై అద్భుత అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన అభిషేక్‌కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా మద్దతుగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో డకౌట్ కావడంతో అభిషేక్ శర్మపై విమర్శలు […] The post అభిషేక్‌పై అమీర్ విమర్శలు… అశ్విన్ కౌంటర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 9:26 pm

డ్రగ్స్ పై దండయాత్ర ఒక పవిత్ర యజ్ఞం

డ్రగ్స్ పై దండయాత్ర ఒక పవిత్ర యజ్ఞం డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్

ప్రభ న్యూస్ 27 Feb 2026 9:21 pm

4spot dead : దేవుడా.. గావుకేక Andhra Prabha Crime News

4spot dead : దేవుడా.. గావుకేక Andhra Prabha Crime News నంద్యాల

ప్రభ న్యూస్ 27 Feb 2026 9:17 pm

కూటమితో పెట్టుబడులు సాధ్యం..

కూటమితో పెట్టుబడులు సాధ్యం.. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలువైసిపి హయాంలో పరిశ్రమలను

ప్రభ న్యూస్ 27 Feb 2026 9:09 pm

న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి అలా మాట్లాడరు: మంత్రి పొన్నం ప్రభాకర్

 హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత ఆ స్థలం ప్రభుత్వం అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న భూమిలో అక్రమంగా ఉన్నవారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాక ర్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు పేపర్లు కేంద్ర మంత్రి కి పంపిస్తామన్నారు. రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా చేయాల్సి ఉంటుందని, వారికి ఆ విషయం పట్ల అవగాహన లేకుండా ఉండవచ్చునన్నారు. జిల్లా కలెక్టర్‌కి కోరుతున్న నివేదిక కోర్టు తీర్పు కేంద్ర మంత్రి కి పంపిస్తే దాని పట్ల అవగాహన వస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసునన్నారు. ఒక కాలేశ్వరానికి సంబంధించిన రుణభారంలో ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో 48 వేల కోట్లు కిస్తీలు కట్టిందన్నారు. రెండు బడ్జెట్లలో కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు. ఫెడరల్ సిస్టంలో తెలంగాణ తీర్చిన వయసు గల రాష్ట్రం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే విధంగా నిధులు కాకపోయినా అందులో సగమైనా తెలంగాణ కు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణను ఆదుకోవాలనే ప్రయత్నం చేయాల్సిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకన్నా దౌర్భాగ్యం లేదన్నారు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బిజెపి మోసంపై ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి మనం కడుతున్న పన్నులు, వచ్చే నిధులపై తెలియచేయాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కేంద్రమంత్రిని కోరుతున్నానన్నారు. రైతు భరోసాతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని హామీలు విఫలం కాకుండా అమలు చేస్తున్నామన్నారు. కోర్టు తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందేనని, అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కవిత రాజకీయ కక్ష సాధింపు ధో రణిలో బిజెపి టాప్ అని విమర్శించారు. కవితకు కోర్టులో పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా ఒక అపవాదు మాత్రం ఉం దని, దానికి సంబంధించి తరువాత ప్రజలు చెబుతారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

మన తెలంగాణ 27 Feb 2026 9:00 pm

అంగన్వాడీలనూ బలోపేతం చేస్తాం..

అంగన్వాడీలనూ బలోపేతం చేస్తాం.. సుపోషణ్ అభియాన్‌లో ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి స్థానంఅంగన్వాడీ

ప్రభ న్యూస్ 27 Feb 2026 8:58 pm

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రభ న్యూస్ 27 Feb 2026 8:51 pm

మారుతి సుజుకి 200వ నెక్సా స్టూడియో ప్రారంభం

న్యూదిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన 200వ నెక్సా స్టూడియో అవుట్లెట్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. మారుతి సుజుకి తన ప్రధాన ‘నెక్సా’ ఛానెల్కింద ప్రీమియం, వ్యక్తిగతీకరించిన కార్ యాజమాన్య అనుభవాన్ని అందించే ప్రయాణంలో ఇది మరో ముందడుగు. భౌగోళికం, అమ్మకాల సామర్థ్యాన్ని బట్టి, నెక్సా ఛానెల్ రెండు ఫార్మాట్లలో భావన చేయబడింది- నెక్సా ప్రధాన అవుట్లెట్లు, నెక్సా స్టూడియో అవుట్లెట్లు. మొత్తం మీద, నెక్సా సేల్స్ నెట్వర్క్ ప్రస్తుతం 530 కంటేఎక్కువ నగరాల్లో 740 కంటే […] The post మారుతి సుజుకి 200వ నెక్సా స్టూడియో ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 8:47 pm

అమేజాన్ బజార్‌లో రూ.299 కంటే తక్కువ ధరలకే హోలీ ఉత్పత్తులు

బెంగళూరు: అతి తక్కువ ధరలకు ప్రతి భారతీయుడు హోలీ పండగను సులభంగా సంబరం చేయడానికి అమేజాన్ బజార్ నాణ్యత, సరసమైన ధరలు రెండిటినీ తెచ్చింది. అత్యంత తక్కువ ధరలకే కస్టమర్లు హోలీ పండగకు అవసరమైనవి. పండగ సమయంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులను విస్తృత శ్రేణి నుండి కొనుగోలు చేయవచ్చు. రూ. 299 కంటే తక్కువ ధరలకే కస్టమర్లు హోలీ వస్తువులను పొందవచ్చు. అదనంగా క్యాష్ బాక్ ను ఆనందించవచ్చు. అన్ని ఆర్డర్స్ పై ఉచిత డెలివరీమెగా డిస్కౌంట్లు […] The post అమేజాన్ బజార్‌లో రూ.299 కంటే తక్కువ ధరలకే హోలీ ఉత్పత్తులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 8:44 pm

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ ఆవిష్కరణ

ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) కింద డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ని ఆవిష్కరించింది. స్థిరంగా డివిడెండ్లు చెల్లించడంలో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉండి, ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడంలో కస్టమర్లకు ఈ ఫండ్ సహాయకరంగా ఉంటుంది. “డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది స్థిరమైన డివిడెండ్ ట్రాక్ రికార్డు కలిగి ఉండి, ఫండమెంటల్గా పటిష్టమైనకంపెనీల్లో […] The post ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ ఆవిష్కరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 8:41 pm

‘మీటికెట్’ యాప్ ద్వారానే బస్‌పాస్‌లు జారీ

 మీసేవ ఆధ్వర్యంలోని ‘మీటికెట్’ యాప్‌లో టిజిఎస్‌ఆర్‌టిసి సేవలను సమగ్రంగా అనుసంధానించడంతో, బస్‌పాస్‌ల కోసం డిపోలు, కౌంటర్ల వద్ద క్యూలు నిలబడే రోజులకు ముగింపు పడనుంది. ప్రభుత్వ మొబైల్ యాప్ ద్వారానే బస్‌పాస్‌లు జారీ చేసే రాష్ట్రంగా తెలంగాణ దేశంలో తొలి రాష్ట్రంగా నిలుస్తోంది. ఆ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఐటీ మంత్రి డి. శ్రీధర్‌బాబు నేతృత్వంలో పౌర సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మీటికెట్ యాప్ ఇప్పటికే రెండు లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు సాధించగా, రూ.2.9 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రాంతాలు, 190 సేవా కేంద్రాల ద్వారా ఈ వ్యవస్థ విస్తరించినట్లు అధికారులు తెలిపారు. మీసేవ ఈ -గవర్నెన్స్ వ్యవస్థలో భాగంగా రూపొందిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు నగర బస్‌పాస్‌లు, అంతర్రాష్ట్ర టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పొందగలుగుతున్నారు. డిపోలకు వెళ్లడం, ఫారమ్‌లు నింపడం, క్యూలో నిలబడడం వంటి ప్రక్రియలు అవసరం లేకుండానే బస్‌పాస్‌లు జారీ కానున్నాయి. దరఖాస్తు, చెల్లింపు, పాస్ జారీ అన్నీ మొబైల్ ఫోన్ ద్వారానే పూర్తవుతున్నాయి. ప్రతి నెల పాస్ కోసం గంటసేపు క్యూలో నిలబడాల్సి వచ్చేదని, ఇప్పుడు రెండు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతోంది అని విద్యార్థులు చెబుతున్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 8:41 pm

నెట్‌ఫ్లెక్స్‌లో సైకాలజికల్ డ్రామా అక్యూస్డ్‌కు అద్భుత రెస్పాన్స్

ముంబై: నిశ్శబ్దం అసహజంగా ఉంది. నిజం అనిశ్చితంగా ఉంది. సమాధానాలు రాకముందే తీర్పు వచ్చేస్తుంది. అక్యూస్డ్ ఇప్పుడు ప్రత్యేకంగా నెట్‌ఫ్లెక్స్‌ స్ట్రీమింగ్ అవుతోంది. అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో, ధర్మా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన అక్యూస్డ్ ఒక సైకాలజికల్గా లోతైన డ్రామా, ఆరోపణల అసౌకర్యంలో ప్రేక్షకులను నేరుగా నిలబెడుతుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర డా. గీతికా సేన్, ఆమె పాత్రను కొంకనా శర్మ పోషించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన ఆమె జీవితంలో లైంగిక దుర్వినియోగ ఆరోపణలు బయటకు […] The post నెట్‌ఫ్లెక్స్‌లో సైకాలజికల్ డ్రామా అక్యూస్డ్‌కు అద్భుత రెస్పాన్స్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 8:39 pm

మారుతి సుజుకి తన రోడ్డు భద్రతా ప్రయత్నాల విస్తరణ

చెన్నై: రోడ్డు భద్రతా ప్రయత్నాలను బలోపేతం చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం రవాణా శాఖతో భాగస్వామ్యంతో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ రాష్ట్రంలో ఏడుఏడీటీటీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి గౌరవనీయులైన తిరువణ్ణామలై, కృష్ణగిరి, మధురై (ఉత్తర), శివగంగై, దిండిగల్, తిరుచిరాపల్లి(పశ్చిమ)లోని ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓలు)లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఏడీటీటీలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది డ్రైవింగ్ టెస్ట్ట్రాక్లను ఆటోమేట్ చేయడానికి మారుతి సుజుకి మరియు తమిళనాడు ప్రభుత్వ రవాణా శాఖ మధ్య సంతకం చేయబడిన […] The post మారుతి సుజుకి తన రోడ్డు భద్రతా ప్రయత్నాల విస్తరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 8:32 pm

లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు

ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో, ఒక వ్యక్తిని అతని భార్య సోదరులే దారుణంగా హత్య చేశారు. గురువారం రాత్రి ఈ ఘోరం జరి గింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లికి చెందిన పివివి సూర్యప్రకాశరావు (41) స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ప్రస్తుతం రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ క్లాస్‌మేట్స్ కావడంతో గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నా రు. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో సంధ్య కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో వారు గురువారం ఉదయం అన్నవరంలో వివాహం చేసుకుని, అనంతరం వేములపల్లిలోని సూర్యప్రకాశ్ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎలాగైనా సరే బావ సూర్యప్రకాశ్ ను చంపాలని ప్లాన్ చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్లిన భార్య సోదరులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరూ కలిసి బండరాయితో ఆయన ముఖంపై బలం గా బాదడంతో తీవ్ర రక్రస్త్రావమై సూర్యప్రకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు నిందితులు చంద్రపాల్, గిరిబా బులను పట్టుకుని చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. మండపేట సీఐ, ఎస్‌ఐ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు చంద్రపాల్, గిరిబాబులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మన తెలంగాణ 27 Feb 2026 8:32 pm

వైసిపి నేత ‘బొత్స’కు బ్రెయిన్ స్ట్రోక్

 వైసిపి మాజీ మంత్రి, ఎపి మండలిలో ప్రతిపక్ష నాయకుడు, బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యా రు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరా బాద్‌కు తరలిం చారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది కూడా ఓసారి బొత్స సత్యనారాయమ అస్వస్థతకు గురుయ్యారు. గతేడాది జూన్‌లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసిపి చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స ఒక్కసారిగా కుప్పకూలిపో యారు. వెంటనే విశాఖపట్నంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా రు. అంతకుముందు 2013 లో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో కూడా బొత్స చికిత్స తీసుకున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టగా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఎపిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మండలిలో వైసిపి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్య నారాయణ పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ మండలిలో తన వాయిస్ ను వినిపిస్తున్నారు. కట్ చేస్తే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో ప్రస్తుతం మండలి సమావేశాలకు దూరమయ్యే అవకాశం ఉంది. బొత్స అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను: పవన్ కల్యాణ్ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను‘ అని తన ప్రకటనలో పేర్కొన్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 8:29 pm

‘స్పిరిట్’లో పవర్ ఫుల్‌రోల్‌లో ఒబెరాయ్

రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్- వరల్డ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు వివేక్ ఒబెరాయ్. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఒబెరాయ్ స్టైలిష్ లుక్‌లో కనిపించి తన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతోందో చూపించారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన రాకతో కథలో కొత్త డైనమిక్ చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో ఐశ్వర్య దేశాయ్ ను పరిచయం చేశారు మేకర్స్. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుంది. యానిమల్ సంచలన విజయం తర్వాత నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి బోల్డ్ క్రియేటివ్ విజన్‌తో స్పిరిట్‌ను రూపొందిస్తున్నారు. ప్రభాస్ కు జోడిగా తృప్తి డిమ్రి కనిపించనున్నారు. భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. 8 భాషల్లో విడుదల కానున్న ఈ పాన్- వరల్డ్ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. గుల్షన్ కుమార్ టి సిరీస్ సమర్పణలో, టి-సిరీస్ ఫిలిమ్స్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, ఎడిటింగ్, దర్శకత్వం మొత్తం సందీప్ రెడ్డి వంగా వహిస్తుండగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మన తెలంగాణ 27 Feb 2026 8:26 pm

అంతర్జాతీయ సైబర్‌క్రైమ్ నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: అంతర్జాతీయ సైబర్‌క్రైమ్ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా.. చెన్నై విమానాశ్రయంలో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు విశాఖకు చెందిన పెదపూడి ప్రసన్నకుమార్‌గా గుర్తించారు. మ్యాట్రిమోనియల్, క్రిప్టో ఇన్వెస్ట్ మోసం కేసులో అతడు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. షాదీ డాట్ కామ్ ద్వారా నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులతో పరిచయం ఏర్పరచుకున్నాడని పోలీసులు తెలిపారు. యువతిగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానన్న హామీతో మోసాలు చేశాడని అన్నారు. నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పెట్టుబడి పెట్టాలని ప్రలోభాలకు గురి చేసినట్లు గుర్తించారు. ఒక బాధితుడి నుంచి రూ.11 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది. విత్‌డ్రాకు ప్రయత్నించే వారిని మరింత పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అక్రమంగా సుమారు 500 సిమ్‌లు సేకరించి నకిలీ ఖాతాలను తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముఠాతో ఈ నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. 

మన తెలంగాణ 27 Feb 2026 8:24 pm

పేదల ఇళ్లు కూల్చడంలో రేవంత్ రెడ్డి పోటీ: మంత్రి బండి సంజయ్

 ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించిందని, మోదీ పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చే విషయంలో పోటీ పడుతుంటే పేదల ఇళ్లను కూల్చడంలో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు నానా కష్టాలు పడుతూ అప్పోసప్పో చేసి బతకడానికి ఇళ్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని చెప్పారు. తక్షణమే పేదల ఇళ్ల కూల్చివేతను ఆపాలని, లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతలు త ప్ప సాధించింది ఏముంది? నానా కష్టాలుపడి పేదలు ఇండ్లు కట్టుకున్నరు. పోనీ ఇల్లు కటే ్టటప్పుడు అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అప్పొసప్పో చేసి బతకడానికి చిన్ని ఇల్లు కట్టుకుంటే ఆ పేదల ఇండ్లను కూల్చడానికి మీకు మనసెలా వచ్చింది? పేదలు ఇండ్లు కట్టుకోవద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టించా మన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేదల ఇండ్లను కూల్చే విషయంలో పోటీ పడుతోందన్నారు. ప్రభుత్వం “రైతు భరోసా” ఇవ్వడం లేదు : రాష్ట్ర ప్రభుత్వం “రైతు భరోసా” ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారన్నారు.మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తామని ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ఇలాంటి హామీలు చాలా ఇచ్చారని మాట తప్పారని, వాస్తవానికి ముఖ్యమంత్రి నోటి నుండి ఏ మాట వచ్చినా శాసనం కావాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారన్నారు. నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేస్తారన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి, రూ.9 వేల కోట్లు రెడీగా ఉన్నాయని పదేపదే చెబుతూ వార్తలు రాయించుకున్నారన్నాని, కానీ ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా ఒక దఫా ఎగ్గొట్టారన్నారు. ఎన్నికలొ స్తే ఏదో ఒక హామీని తూతూ మంత్రంగా అమలు చేసినట్లు నటించి వార్తలు రాయించు కోవడ, ఆ ఎన్నికలైపోగానే వాటిని మర్చిపోవడం వాళ్లకు అలవాటైందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చే సమయంలో మళ్లీ ఏదో ఒక డ్రామాలాడతారన్నారు. తక్షణమే రైతు భరోసాను చె ల్లించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి : రాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా, డీఏలు, ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోయినా ఓట్లేశారన్నారు. దీంతో కాం గ్రెస్ నేతల్లో అహంకారం పెరి గిపోయిందన్నారు. ఏ హామీని అమలు చేయకపోయినా ఓట్లే స్తున్నారని చెబుతున్నారన్నారు. అందుకే ఈసారి ప్రజలంతా కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రైతు భరోసా గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటే : కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేశాయని, కలిసే పదవులు పంచుకున్నాయన్నారు. ఇప్పడు ఒకరికి ఒకరు పడనట్లు డ్రామాలాడుతున్నారన్నారు. మరి వాళ్లిద్దరికి ఎక్కడ చెడిందో వాళ్లే చెప్పాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు గత ఎన్నికల్లో మాట్లాడారని, మేం కూడా అదే చెప్పామన్నారు. ఈ అంశంపై విచారణ జరిపే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే మేం విచారణ చేపట్టేందుకు సిద్ధమని ఆ మేరకు లేఖ రాయాలని సీఎంను కోరుతున్నానన్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 8:21 pm

కోల్‌కతాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం

 బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్ ) వెల్లడించింది. ఇది 35 కిమీ (21.75 మైళ్లు) లోతులో సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. కోల్‌కతా నగరం, పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఎత్తైన నివాస సముదాయాలు, రద్దీగా ఉండే మార్కెట్లలో భూమి కంపించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. స్థానికులు మాత్రం ఇళ్లల్లో సీలింగ్ ఫ్యాన్లు ఊగడం, ఫర్నీచర్ కంపించడం, కిటికీలు కొట్టుకోవడం వంటివి సంభవించాయని చెప్పారు. బహుళ అంతస్తుల భవనాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌గా మారాయి. భారత్‌బంగ్లాదేశ్ సరిహద్దు సమీపం లోని అనేక జిల్లాలపై ఈ భూకంపం ప్రభావం ఉన్నట్టు ఎన్‌సీఎస్ వివరించింది.

మన తెలంగాణ 27 Feb 2026 8:17 pm

నటుడు విజయ్‌కు విడాకుల నోటీసులు

టీవీకే పార్టీ అధినేత ,నటుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినీ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధమే కారణమని విడాకుల పిటిషన్‌లో సంగీత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణకు కోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. విజయ్, సంగీత వివాహం 1999 లో జరిగింది. విజయ్ రెండేళ్ల క్రితం రాజకీయాల్లో అడుగు పెట్టిన తరువాత విజయ్ వివాహేతర సంబంధంపై అనేక ఆరోపణలు వచ్చాయి. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ మాట్లాడుతూ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని వ్యాఖ్యానించడం వివాదాలకు దారి తీసింది. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విజయ్ విమర్శించారు. త్రిష కూడా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదని సూచించింది. దీంతో నాగేంద్రన్ తరువాత క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ వివాదం నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్‌పై కొంతవరకు ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. 

మన తెలంగాణ 27 Feb 2026 8:13 pm

అఫ్ఘన్‌పై ఇక బహిరంగ యుద్ధమే: పాక్ రక్షణ మంత్రి

ఇరుగుపొరుగు దేశాలు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మధ్య పోరు తీవ్రతరం అయింది. తమ దేశం అఫ్ఘనిస్థాన్‌పై బహిరంగ ప్రత్యక్ష యుద్ధానికి దిగిందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా శుక్రవారం ప్రకటించారు. తరచూ దాడులకు దిగుతూ, పౌరుల ప్రాణాలను హరిస్తూ వచ్చిన అఫ్ఘనిస్థాన్ తమ ఓపికను పరీక్షిస్తూ వచ్చిందని, ఇక తమ బహిరంగ యుద్ధాన్ని ఎదుర్కొవాలని ఆయన సవాలు విసిరారు. పాక్ సేనలు ఇప్పటికే 130 మందికి పైగా తాలిబన్ సాయుధులు హతులయ్యారని ఇస్లామాబాద్‌లో అధికార వర్గాలు ధృవీకరించాయి. రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ 2611 కిలోమీటర్ల సరిహద్దును దురంద్ రేఖగా వ్యవహరిస్తారు. అయితే అఫ్ఘన్ అధికారికంగా దీనిని గుర్తించలేదు. ఇప్పుడిక తమది ప్రత్యక్ష యుద్ధమే. ఇప్పుడు ఇక దమా దమ్ మస్త్ కలందర్ అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. పాక్ సైన్యం సముద్ర మార్గం మీదుగా విరుచుకుపడదు. ఎంతైనా పొరుగు దేశం కదా? బలాలు బలహీనతలు అని తెలుసు. వీటిని గుర్తించే తగు విధంగా విరుచుకుపడుతామని ప్రకటించారు. ఇప్పటికే పాక్ సైన్యం ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరిట అఫ్ఘన్‌లోని పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. తమ వైమానిక స్థావరాలు, గ్రామాలపై తాలిబన్ల దాడులకు ప్రతీకారంగానే ఇప్పుడు యుద్థానికి దిగింది. అటువైపు నుంచి కవ్వింపు చర్యలు సాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఏరిపారేస్తామని రక్షణ మంత్రి హెచ్చరించారు. దమా దమ్ మస్త్ కలందర్ సింధ్ సూఫీ ప్రవక్త లాల్ షెబాజ్ కలందర్ ఆధ్మాత్మిక గీతాన్ని ప్రస్తావించారు. రక్షణ మంత్రి ఆసిఫ్ ప్రకటనకు అఫ్ఘన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి నుంచి స్పందన వెలువడింది. సరిహద్దుల వెంబడి తమ సేనల ప్రతీకార దాడుల్లో 55 మంది పాక్ సైనికులు చనిపోయారని తెలిపారు. పాక్ సైన్యపు రెండు ప్రధాన స్థావరాలను,19 చెక్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మరో వైపు పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ టర్కీ , సౌదీ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. పాక్ ..సౌదీ మధ్య గత ఏడాది సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మూడో దేశం దాడులు జరిగితే వెంటనే పరస్పరం సహకరించాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్థాన్‌కు సౌదీ , టర్కీ నుంచి సాయం అందుతుందని వెల్లడైంది. అయితే ఈ రెండు దేశాలూ నేరుగా యుద్ధంలో చేరే అవకాశాలు లేవు. తమ దేశం శాంతి, దేశ ప్రాదేశికత సమగ్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాక్ అధ్యక్షులు అసీఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. తమ భూభాగాలపై దాడులకు దిగి అప్ఘన్ చాలా పెద్ద తప్పు చేసింది. ఇక తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మన తెలంగాణ 27 Feb 2026 8:09 pm

ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, సిసోడియా విడుదల

ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. వారిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు కేసు నుంచి విడుదల చేసింది. కోర్టు 23 మంది నిందితులపై పెట్టిన కేసులను కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలు, కుట్ర ఆరోపణలను స్పష్టంగా నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఎక్సైజ్ విధానం కేసు కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిసోడియా లు జైలు పాలైన విషయం తెలిసిందే. తీవ్రమైన నేరారోపణలు చేసినప్పుడు బలమైన భౌతిక ఆధారాలను కూడా సమర్పించవలసి ఉంటుందని , కుట్రపూరిత పాత్రను ఆపాదించినంత మాత్రాన కేసు నిలబడదని కోర్టు పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఆరోపణలకు ఆధారాలు లేవని తేలితే, ఉన్నత పదవులపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఎక్సైజ్ పాలసీ వెనుక ఎలాంటి విసృ్తతమైన కుట్ర లేదా, నేరపూరిత ఉద్దేశ్యం లేదని కోర్టు పేర్కొంది. నిందితుడిని అప్రూవర్ గా మార్చడం ద్వారా నేరం చేసినవారి సంఖ్యను పెంచడం వంటి దర్యాప్తు పద్ధతుల పట్ల న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. అటువంటి పద్దతులు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కోర్టు పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఇతరులను విడుదల చేస్తూ కోర్టు పది ముఖ్యమైన విషయాలను పేర్కొంది. 1. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవు. కుట్రలో కేజ్రీవాల్ కు ఆపాదించే ఖచ్చితమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు సంస్థ ధ్రువీకరించకుండా, ఒక సాక్షి ఆలస్యంగా ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రధానంగా బయటకు వచ్చింది. 2. సాక్షి బలహీనమైన వాంగ్మూలంపై ఆధారపడడం. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణ ఒకే ఒకవాక్యం ఆధారంగా ఉంది. ఆధారాలు లేకుండా ఇది మాత్రమే కుట్రను నిరూపించబోదని కోర్టు పేర్కొంది. 3. విధాన పరమైన మార్పులు ప్రత్యక్షపాత్రకు ఆధారాలు కావు. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎక్సైజ్ విధానాన్ని మార్చారని, ప్రయోజనాలు పొందారని చూపే ఆధారాలు లేవు, కేబినెట్ నిర్ణయాన్నిఆమోదించడం నేరపూరిత కుట్రగా పరిగణించబడదు. 4. దర్యాప్తులో పలు అంశాలు సరైనవి కావని తేలింది. దర్యాప్తు లోపాలపై న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు. కొన్ని చర్యలు ముందస్తు తారుమారులా కన్పించాయనడం న్యాయమైన దర్యాప్తు కాదని పేర్కొన్నారు. 5. దర్యాప్తు అధికారిపై శాఖ పరమైన చర్యకు సిఫార్సు. ఆధారాలు లేకుండా నిందితుడిని అరెస్ట్ చేసినందుకు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు చేయాలని కూడా కోర్టు సిఫార్సు చేసింది. సాక్ష్యాధారాల ఆధారంగా ప్రాసిక్యూషన్ సాగలేదని కోర్టు ఆందోళన ను ఇది బహిర్గతం చేసింది. 6. దాదాపు 36 పేజీల జిఎంఓ దర్యాప్తు కుప్పకూలింది. కుట్రకు సంబంధించి చూపిన 36 పేజీల ప్రింటవుట్ కీలకమైన ప్రాసిక్యూషన్ వాదన రికార్డులకు విరుద్ధంగా ఉన్నట్లు కన్పించింది. 7.సమావేశాలపై స్వతంత్ర ధ్రువీకరణ లేదు. విధాన చర్చలకు సంబంధించి ప్రధానంగా డాక్యుమెంటరీ లేదా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ లేకుండా ఆమోద ప్రకటనలను చేశారు. 8. పుకార్లు, విరుద్ధ ప్రకటనలు ఈ కేసులో అనేక ఆరోపణలు సాక్ష్యాల వాంగ్మూలాలపై ఆధారపడిఉన్నాయి. అభియోగ దశలో ప్రాసిక్యూషన్ కేసును బలహీనపరచింది. 9. డిమాండ్ లేదా సరైన రుజువు లు లేవు. అవినీతి ఆరోపణలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం కింద అవసరమైన డిమాండ్ రుజువు లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది. 10. స్పష్టమైన ప్రమాణాలను పాటించలేదు.అభియోగాలు మోపే దశలో కోర్టు రికార్డుల్లో ఉన్న విషయాల ఆధారంగా తీవ్రమైన అనుమానంను గుర్తించాలి. సినియర్ రాజకీయ కార్యకర్తలతో సహా నిందితులకు సంబంధించి ప్రాసిక్యూషన్ స్పష్టమైన రుజువులు సమర్పించలేకపోయిందని న్యాయమూర్తి పదేపదే పేర్కొన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కోర్టు సీబీఏ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకోడానికి కోర్టు తిరస్కరించింది.

మన తెలంగాణ 27 Feb 2026 8:02 pm

వెస్టిండీస్‌ని అంత తేలికగా తీసుకోవద్దు: సునీల్ గవాస్కర్

టి-20 ప్రపంచకప్‌లో ఆదివారం భారత్‌కి అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. సెమీస్‌కి చేరుకోవాలంటే.. వెస్టిండీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. మరోవైపు వెస్టిండీస్‌కి కూడా ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యం.. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశారు. వెస్టిండీస్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఆయన పేర్కొన్నారు. ‘‘దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతింది. దీంతో టాప్ ఆర్డర్‌లో కుడి-ఎడమ కాంబినేషన్‌ను అమలు చేుయాల్సిన పరిస్థితి వచ్చింది. గత మ్యాచ్‌ల నుంచి పాఠాలను నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ఇప్పుడు విండీస్‌తో సవాల్ భిన్నమైంది. వారు దేనిని తేలిగ్గా తీసుకోరు. వారి బ్యాటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లూ రిథమ్‌తో బౌలింగ్ చేస్తున్నారు. ఏదైనా పొరపాట్లు చేస్తే శిక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. వారిని కట్టడి చేయాలంటే భారత్‌కు సరైన ప్లాన్ అవసరం. మరీ ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్‌పై ఓ కన్నేయాలి. తొలి బంతి నుంచే భారీ షాట్లకు దిగేస్తారు. ఆదివారం మ్యాచ్ తప్పకుండా సూపర్‌గా ఉండబోతుంది’’ అని గవాస్కర్ అన్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 7:59 pm

ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించిన సిబిఐ

ఎపిలో బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సుదీర్ఘ కాలంగా సిబిఐ ఆధీనంలో ఉన్న ఆయేషా శరీర అవశేషాలను విజయవాడలోని సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో గుండెలు అవిసేలా రోదించిన తల్లిదండ్రులను చూసి అక్కడి వారు చలించిపోయారు. ఆయేషా మీరా హత్య జరిగి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటికీ అసలు హంతకుడెవరో తేలకపోవడం గమనార్హం. గతంలో ఈ కేసులో సత్యంబాబును నిందితుడిగా భావించినప్పటికీ, కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసివేసు ్తన్నట్లు కోర్టుకు వెల్లడించింది. తమ బిడ్డకు న్యాయం జరగలేదని, కనీసం ఆమె అవశేషాలనైనా అప్పగించాలని తల్లిదండ్రులు కోరడంతో కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది. 2019లో ఈ కేసు విచారణలో భాగంగా శాస్త్రీయ ఆధారాల కోసం ఆయేషా మీరా భౌతిక కాయానికి సిబిఐ రీ-పోస్టు మార్టం నిర్వహించింది. ఆ సమయంలో ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఆమె శరీర భాగాలు, అవశేషాలను సేకరించి భద్రపరిచారు. ఇప్పుడు కేసు విచారణ ముగియడంతో ఆ అవశేషాలను తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ భాషాలకు అప్పగించారు. ఈ అవశేషాలను తమ సొంత ఊరు తెనాలికి తీసుకువెళ్లి అక్కడ ఇస్లాం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులకు మద్దతుగా మహి ళా , మానవ హక్కుల సంఘాలు కోర్టు వద్ద ఆందోళన చేపట్టాయి. సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులు, అసలు నిందితులపై ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. 19 ఏళ్ల పోరాటం తర్వాత కూడా హంతకుడిని పట్టుకోలేకపోవడం వ్యవస్థల వైఫల్య మేనని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. డబ్బు, అధికారం ఉన్న వారిపై ఆయేషా తల్లిదండ్రులు ఇన్నేళ్లుగా చేసిన పోరాటం సామాన్యమైనది కాదని బాధితులకు మద్దతుగా నిలిచిన నేతలు కొనియాడారు. ఎన్నో బెదిరింపులు ఎదురైనా, ఏ ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా తమ బిడ్డకు న్యాయం కోసం వారు అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. చివరికి హంతకుడిని శిక్షించలేకపోయినా, తమ బిడ్డ అవశేషాలకైనా గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లభించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆవేదన ఆధారాలు ఉన్నాయని, ఎఫ్‌ఐఆర్‌లో వయస్సు కూడా తప్పుగా నమోదు చేశారని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. నేరం జరిగిన తర్వాత అన్ని తుడిచేశారని, అయేషా కేసులో పోలీసులు పూర్తిగా నిందితులకు సహకరించారని ధ్వజమెత్తారు. ఆయేషా అవశేషాల కోసం కోర్టుల చుట్టూ ఏళ్ల క్రితం నుంచి తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో 2007లో బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 9 నెలల తర్వాత 2008 ఆగస్టులో సత్యంబాబును ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు, అత్యాచారం నేరం కింద 10 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ 2010 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 నవంబర్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేసు మళ్లీ మొదటికే వచ్చినట్ల యింది. ఇప్పుడు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. తమకు న్యాయం జరగలేదంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 7:58 pm

గ్రామపంచాయతీలకు రూ. 389 కోట్లు విడుదల

గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు రూ. 389 కోట్లు విడుదల చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికల తరువాత అభివద్దే లక్షంగా పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిధులు విడుదలతో పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా ముందుకు సాగనుందని నూతనంగా కొలువుదీరిన సర్పంచ్‌లు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 7:55 pm

సౌందరరాజన్ మృతి కలచివేసింది: కెసిఆర్

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మృతి పట్ల మాజీ సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌లు సంతాపం వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, ‘చిలుకూరు సౌందరరాజన్’ గా సుపరిచితులైన ఆయన మృతి తమను ఎంతో కలిచివేసిందని వారు పేర్కొన్నారు. చిలుకూరు క్షేత్ర అభి వృద్ధిలో, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడంలో సౌందరరాజన్ పోషించిన పాత్ర మరువలేనిదని వారు కొని యాడారు. కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాడటం, దళిత గోవిందం వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సమరసతకు ఆయన కృషి చేశారని వారు గుర్తు చేసుకున్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 7:53 pm

కెపిహెచ్‌బిలో గజం భూమి ధర రూ. 2.65 లక్షలు

కెపిహెచ్‌బిలో గజం భూమి ధర రూ. 2.65 లక్షలు పలికింది. 1,400 ఎస్‌ఎఫ్‌టి ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు రూ. 1.10 కోట్ల ధర పలకడంతో మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు, ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. భూములు, ఫ్లాట్ల విక్రయంతో రూ.24.26 కోట్ల మేర ఆదాయం హౌజింగ్‌బోర్డుకు సమకూరింది. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పోటీ పడ్డారు. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది, డిమాండ్ ఉన్న కెపిహెచ్‌బి ప్రాంతంలోని ప్లాట్లు, ఫ్లాట్లను బహిరంగం వేలంలో రికార్డు ధరలకు కొనుగోలు చేశారు. ఫేజ్-1, 2 లోని ధర్మారెడ్డి కాలనీలోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం హౌజింగ్‌బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు మొత్తం 40 మంది కొనుగోలుదారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్‌ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్ధారించగా, చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడుపోయిందని, మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారని ఆయన తెలిపారు. అదే విధంగా సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు రూ .90 లక్షలను అప్‌సెట్ ధరగా నిర్దారించగా వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ విధంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ. 24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్‌చైర్మన్ విపి గౌతం వివరించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల ద్వారా రూ. 8.45 కోట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

మన తెలంగాణ 27 Feb 2026 7:49 pm

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటి సిఎం భట్టి భట్టి విక్రమార్క

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని డిప్యూటి సిఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు భట్టికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు డిప్యూటి సిఎంకు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనం అనంతరం డిప్యూటి సిఎం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 7:44 pm

కేంద్రీయ విద్యాలయం సందర్శన

కేంద్రీయ విద్యాలయంలో సందర్శన విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటుకేంద్ర జాయింట్ సెక్రటరీ దేవేంద్ర

ప్రభ న్యూస్ 27 Feb 2026 7:37 pm

ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన

ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కల్లు సొసైటీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ

ప్రభ న్యూస్ 27 Feb 2026 7:30 pm

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం బరిగల ఎల్లమ్మ కుటుంబానికి ఆర్థిక సాయంమానవత్వం చాటుకున్నచంద్రయ్య,

ప్రభ న్యూస్ 27 Feb 2026 7:25 pm

apcm 5formulae : ఇక 5 సూత్రాల సేధ్యం Andhra Prabha Assembly

apcm 5formulae : ఇక 5 సూత్రాల సేధ్యం Andhra Prabha Assembly

ప్రభ న్యూస్ 27 Feb 2026 7:22 pm

పాక్-ఆఫ్ఘన్ మధ్య యుద్ధం

పాక్-ఆఫ్ఘన్ మధ్య యుద్ధం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భగ్గుమన్న సరిహద్దు వివాదం55 మంది

ప్రభ న్యూస్ 27 Feb 2026 7:18 pm

కెటిఆర్.. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి: కవిత

హైదరాబాద్: తాను చెప్పింది నిజమని ఇవాళ కోర్టు తీర్పుతో తేలిందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. లిక్కర్ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడటంపై ఆమె మాట్లాడారు. తనను ఐదు నెలలు జైలులో ఉంచి మానసికంగా వేధించారని.. తప్పు తేలకుండానే తన వ్యక్తిత్వ హననం చేశారని మండిపడ్డారు. ‘‘ఎక్స్‌లో నా అన్న కెటిఆర్ పెట్టిన పోస్టు చూశాను. నాపై పెట్టిన కేసు వల్లే బిఆర్ఎస్ ఓడిందన్నట్లుగా పోస్టు చేశారు. బిఆర్ఎస్ నేతలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి నేను కారణమా? ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు, ఇవ్వకపోవటం బిఆర్ఎస్ ఓటమికి కారణం. అభ్యర్థులను మార్చకుండా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇవ్వటం కారణం. దోపిడీదారులకే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణే పార్టీ ఓటమికి కారణం. ఇవాళ కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూడటం కరెక్ట్ కాదు. కెటిఆర్.. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి. వాస్తవాలు ఒప్పుకొని మీ లోపాలను సరి చేసుకోవాలి. ఎన్నికలప్పుడు ఏం జరిగిందో మర్చిపోయి నన్ను బ్లేమ్ చేయొద్దు. బిఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఎప్పుడూ మద్ధతు రాలేదు. నాపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నా. మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నా. పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరం. సొంతంగా పార్టీ పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. పిడికెడు మందితోనే రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మారుతా. బిజెపి, బిఆర్ఎష్ రెండు ఒకటే మళ్లీ చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక వ్యక్తి వల్ల ఓడిపోయేంత బలహీనంగా పార్టీ ఉందా? వైఫల్యాలను విస్మరించి ఓటమిని నా మెడలో వేస్తున్నారు. ఆడబిడ్డను అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని కవిత అన్నారు. 

మన తెలంగాణ 27 Feb 2026 7:14 pm

ETV Win announces 9 new Titles

ETV Win is slowly emerging as a prominent digital platform for the Telugu audience. Standing before the wave of digital giants like Netflix, Amazon Prime and others is not so easy. ETV Win has been picking up interesting projects that will appeal to the Telugu households and the family crowds. On the third anniversary of […] The post ETV Win announces 9 new Titles appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 7:06 pm

తొలిసారి ఫైనల్‌కు.. విజయం దిశగా జమ్ముకశ్మీర్

హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన జమ్ము కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ఈ జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జమ్ము కశ్మీర్ జట్టు 584 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక 293 పరుగులకే ఆలౌటై 291 పరుగుల వెనుకంజలో పడిపోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జమ్ము కశ్మీర్ జట్టు 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ పకడ్బందీగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 160 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 94 పరుగులు చేసి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో జమ్ము కశ్మీర్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 477 పరుగల ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో ఇక్బాల్‌తో పాటు సాహిల్ (16) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జమ్ము గెలుపు ఇక లాంఛనమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మన తెలంగాణ 27 Feb 2026 6:53 pm

ఇసుక తోడేళ్లపై పోలీస్ ఫైర్

ఇసుక తోడేళ్లపై పోలీస్ ఫైర్ స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్

ప్రభ న్యూస్ 27 Feb 2026 6:52 pm

సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Feb 2026 6:46 pm

ఉపాధ్యాయ వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు బాధాకరం

ఉపాధ్యాయ వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు బాధాకరం తొర్రూరు, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 27 Feb 2026 6:40 pm

గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలి..

మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని ఎంపీడీవో గంగుల

ప్రభ న్యూస్ 27 Feb 2026 6:35 pm

దక్షిణ భారత చెస్ పోటీలకు ఎంపికైన అనంత మెడికోలు

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : తమిళనాడు భారతిదాసన్ యూనివర్సిటీలో మార్చ నెల 2వ తేది నుంచి 6వ తేది వరకు జరగనున్న దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాలచెస్ పోటీలకు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు బి. దీపక్ మరియు కె. లోకేష్ నాయక్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరుపున ద్వితీయ, తృతీయ స్థానము లో ఎంపికై ఈ పోటీలలో పాల్గొనడం కళాశాలకు గర్వకారణమని, చెస్ లో క్రీడాకారులు అద్భుత ఆటతీరు కనబరచడం […] The post దక్షిణ భారత చెస్ పోటీలకు ఎంపికైన అనంత మెడికోలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 6:34 pm

విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలి

విశాలాంధ్ర – ధర్మవరం : విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, ఇటువంటి అవకాశం కేవలం ఎన్సిసి ద్వారానే సాధ్యమవుతుందని పట్టణ ప్రముఖులు, టిడిపి నాయకుడు సంధ రాఘవ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్సిసి విభాగం రావడం జరిగింది. ఈ ఎన్సిసి లో ప్రభుత్వం 50 మంది ఎన్సిసి నేర్చుకునే విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసే భాగంగా ముఖ్యఅతిథిగా వారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంధ రాఘవ తో పాటు, […] The post విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 6:30 pm

ChilukurTemple |వంశపారంపర్య అర్చకుడిగా విశిష్ట సేవలు

ChilukurTemple | వంశపారంపర్య అర్చకుడిగా విశిష్ట సేవలు ChilukurTemple | చిలుకూరు బాలాజీ

ప్రభ న్యూస్ 27 Feb 2026 6:10 pm

Vivek Oberoi From Spirit: Icy Arrogance

Rebel Star Prabhas’ action entertainer Spirit, directed by Sandeep Reddy Vanga, is fast progressing with its shoot. As recently announced by the makers, the movie will grace the cinemas worldwide in nearly one year on March 5th, 2027. The makers who earlier unveiled first look of Prabhas and actress Tripti Dimri, have now unveiled the […] The post Vivek Oberoi From Spirit: Icy Arrogance appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 6:05 pm

Kavitha : కవిత కుటుంబానికి, పార్టీకి మరింత దూరం అయ్యారా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ లభించింది

తెలుగు పోస్ట్ 27 Feb 2026 6:03 pm

‘స్పిరిట్’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్.. విలన్ ఫస్ట్‌లుక్ విడుదల

హైదరాబాద్:    ప్రభాస్ హీరోగా.. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు సందీప్. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఫస్ట్‌లుక్‌ను ఆయన విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వివేక్ చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తెరపై ఇప్పటివరకూ చూడని సరికొత్త అవతారం ప్రభాస్ మనకు కనిపించనున్నారు. ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పోలీసు కథతో పాటు, మాఫియా నేపథ్యాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. వివేక్ ఓబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటి కాంచన కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొమ్మిది భాషల్లో మార్చి 5, 2027న విడుదల కానుంది. Presenting you all, the antagonist of the film SPIRIT. Mr. Vivek Anand Oberoi. pic.twitter.com/e0imSbSDmm — Sandeep Reddy Vanga (@imvangasandeep) February 27, 2026

మన తెలంగాణ 27 Feb 2026 6:01 pm

రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడలలో సత్తా చాటిన విద్యార్థులు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నైన్ పాక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:52 pm

26yrs |సంగీత నుంచి విడాకుల పిటిషన్..

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్‌కు

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:46 pm

సైన్స్ తోనే మానవ జీవితం..

శావల్యాపురం, ఆంధ్రప్రభ : సైన్స్ తోనే మానవ జీవితం ముడిపడి ఉందని వినుకొండ

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:41 pm

కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టుగ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 27 Feb 2026 5:39 pm

ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..

దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతులు ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:31 pm

ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్‌లో మర్యాదపూర్వక భేటీ..

ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్‌లో మర్యాదపూర్వక భేటీ.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:29 pm

చిలుకూరు బాలాజీ ఆలయ మాజీ పూజారి సౌందర్ రాజన్ మృతి

చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ మరణించారు

తెలుగు పోస్ట్ 27 Feb 2026 5:28 pm

Big Shock for Vijay

Tamil actor Vijay is now a politician and he floated TVK. His political party is aiming to contest in all the Assembly constituencies of Tamil Nadu and the Election notification is due. Vijay is done with the shoot of his last film Jana Nayagan and the film releases soon. Vijay is completely occupied with his […] The post Big Shock for Vijay appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 5:27 pm

బెల్లంపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:27 pm

సీఎం రిలీఫ్ ఫండ్ తో చిన్నారికి ప్రాణాధారం

సీఎం రిలీఫ్ ఫండ్ తో చిన్నారికి ప్రాణాధారం మోకాలి శస్త్రచికిత్సకు రూ.82,669 ఎల్ఓసీ

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:26 pm

ఆజాద్ త్యాగం చిరస్మరణీయం..

ఆజాద్ త్యాగం చిరస్మరణీయం.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:22 pm

నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశానుసారము సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలాగే అనుమతి ఉండాలి, హాస్పిటల్స్ […] The post నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 5:14 pm

పిట్లంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : రేపు పిట్లం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:12 pm

Breaking : టీవీకే చీఫ్ విజయ్ కు షాక్

తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ కుటుంబం నుంచి తగిలింది

తెలుగు పోస్ట్ 27 Feb 2026 5:12 pm

Video : Vishnu Vinyasam Movie Review Analysis

The post Video : Vishnu Vinyasam Movie Review Analysis appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 5:10 pm

రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాలలో రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితులను మొబైల్ స్కానింగ్ డివైస్ ద్వారా వారి యొక్క వేలిముద్రలతో తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు. దీనివలన ఎవరైనా గతంలో నేరాలలో పాల్గొనడం జరిగి ఉంటే వారిని ఈ యొక్క డివైస్ ద్వారా నేరస్థులుగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. ఇది నిరంతరము జరుగుతుందని తెలిపారు. అప్రమత్తమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. The post రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 5:09 pm

క్రీడలతోనే సమాజానికి స్పూర్తి..

క్రీడలతోనే సమాజానికి స్పూర్తి.. విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:08 pm

ఆర్డీవో, ఎంపీడీవో, డీఎస్పీలు బదిలీ

వెంటనే రిలీవ్ కావాలని హైకోర్టు ఆదేశాలువిశాలాంధ్ర ధర్మవరం;; ఆర్డీవో మహేష్ ను, ఎంపీడీవో సాయి మనోహర్, డి.ఎస్.పి హేమంత్ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కోరుతూ బదిలీ వేటు హైకోర్టు వేసింది. వివరాలకు వెళితే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడం జరిగిందని, అమరావతి లోని జిఏడీలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్పీ మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేసుకోవాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు […] The post ఆర్డీవో, ఎంపీడీవో, డీఎస్పీలు బదిలీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 5:05 pm

ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తా..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా అండగా ఉంటామని విద్యార్థులకు

ప్రభ న్యూస్ 27 Feb 2026 5:05 pm

కవితకు న్యాయం జరిగిందంటూ కెటిఆర్ ట్వీట్

హైదరాబాద్: మద్యం స్కామ్ పేరుతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇదే కథ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కారణమైందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై కెటిఆర్ ఎక్స్ లో స్పందించారు. మద్యం కేసులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇవాళ న్యాయం జరిగిందని, తమ లీడర్లపై నమోదైన ప్రతి కేసు రాజకీయ కక్షలో భాగమేనని విమర్శించారు. నిజాలు బయటకు రానంతకాలం కాంగ్రెస్, బిజెపి దుష్ప్రచారాలను చూస్తూనే ఉంటామని తెలియజేశారు. ఏదేమైనా చివరకు న్యాయమే గెలుస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.  

మన తెలంగాణ 27 Feb 2026 5:01 pm

పసుపు రైతులను మోసం చేసే సహించేది లేదు..

వేల్పూర్, ఆంధ్రప్రభ : పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర మరియు

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:58 pm

Dacoit Rubaroo Video Song: Haunting Melody

Dacoit starring Adivi Sesh and Mrunal Thakur has created huge anticipation with regular buzzing updates during production and the teaser has transcended the expectations to next level. Now, the makers have released first single, Rubaroo, and it is a haunting melody. Bheems Ceciroleo, who is on fire in recent times, has yet again delivered a […] The post Dacoit Rubaroo Video Song: Haunting Melody appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 4:56 pm

వైసీపీ తప్పులను వైఎస్సార్‌తో ముడిపెట్టడం సరికాదు

కాంగ్రెస్ నాయకుడు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; వైసీపీ తప్పులను వైయస్సార్ తో ముడి పెట్టడం సరికాదు అని కాంగ్రెస్ నాయకుడు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూఅత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుంది కూటమి తీరు ఇలా ఉందని,తిరుమల పవిత్రతపై పాపం వైసీపీ చేస్తే ,వైఎస్సార్‌కు చుట్టడం చంద్రబాబుకి భావ్యం కాదు అని తెలిపారు.చంద్రబాబు ఆరోపణలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి అని, వైఎస్సార్‌కు చంద్రబాబు క్షమాణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్‌ ఏడు […] The post వైసీపీ తప్పులను వైఎస్సార్‌తో ముడిపెట్టడం సరికాదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:55 pm

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అల్పాహారం పంపిణీ

శ్రీ సత్య సాయి సేవ సమితివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఉదయం 300 మంది రోగులకు పాలు ,బ్రెడ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, వెంకటేశు, వినోద్, రామాంజనేయులు, కాకుమని సాగర్ మాట్లాడుతూ పుట్టపర్తి బాబా ఆశీస్సులతో ఇటువంటి సేవా కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి ఈ సేవ కార్యక్రమానికి పట్టణంలోని రామ్ […] The post ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అల్పాహారం పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:51 pm

పీడీ ప్రమీల అవినీతి అక్రమాలపై అలుపెరగని పోరాటం

తప్పుడు పత్రాలతో ఫిర్యాదులను మూసివేయడంపై సాకే వినయ్ కుమార్ ఆగ్రహoవిశాలాంధ్ర ధర్మవరం;!శ్రీ సత్యసాయి జిల్లా మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి బయటపడే వరకు పోరాటం కొనసాగుతుందని ధర్మవరం నియోజకవర్గ బాధ్యులు సాకే వినయ్ కుమార్ తెలిపారు. ధర్మవరం ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు ఎస్సీ జన సంఘం రాష్ట్ర బాధ్యులు మాల్యావంతం రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పీడీ ప్రమీలపై పోషకాహార పంపిణీ బిల్లుల వ్యవహారాల్లో అవినీతి జరుగుతున్నట్లు […] The post పీడీ ప్రమీల అవినీతి అక్రమాలపై అలుపెరగని పోరాటం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:47 pm

ఎపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్‌ స్ట్రోక్

హైదరాబాద్: ఎపి మాజీ మంత్రి, వైసిపి నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి నుంచి సిటీ న్యూరో సెంటర్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మన తెలంగాణ 27 Feb 2026 4:41 pm

పిఆర్ సి కమిషన్ ను వెంటనే ప్రకటించాలి

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ బి. కే. ముత్యాలప్ప డిమాండ్ విశాలాంధ్ర ధర్మవరం;; పి ఆర్ సి కమిషన్ వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ బి కే ముత్యాలప్ప డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం ఈనెల 26,27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ధర్మవరం తాలూకా కేంద్రం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు.గత […] The post పిఆర్ సి కమిషన్ ను వెంటనే ప్రకటించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:40 pm

మునిసిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించాలి

పట్టణంలో వృధా నీటిని అరికట్టండి ఫ్లెక్సీల నిర్వహణలో మున్సిపల్ అధికారులు నియమ నిబంధనలతో ఆదాయాన్ని పెంచండి మున్సిపల్ పన్నుల వసూలులో వేగవంతాన్ని పెంచండి.. కౌన్సిల్ హాలులో కౌన్సిలర్లు డిమాండ్ విశాలాంధ్ర ధర్మవరం;; పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం పట్టణ సమస్యల పరిష్కారం పై కౌన్సిలర్లు తమదైన శైలిలో వ్యవహరించారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా అధికారుల కృషి ఎంతో అవసరమని, పట్టణములో నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని, ఫ్లెక్సీ నిర్వహణలో నియమ నిబంధనలు పాటించే […] The post మునిసిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:36 pm

24,000 crores |అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ వివ‌ర‌ణ

24,000 crores | అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ వివ‌ర‌ణ ఆంధ్ర‌ప్ర‌భ‌, వెల‌గ‌పూడి ప్ర‌తినిధి

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:29 pm

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…

మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చండూరు మార్కెట్

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:28 pm

బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో కూలీలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాడ్రైవర్ మృతి..

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:27 pm

ఏపీకి మరో భారీ పరిశ్రమ..దేశంలోనే తొలి అమోర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్

ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి అమోర్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. అమెరికా-జపాన్ దేశాలకు చెందిన ప్రొటీరియల్ అనే సంయుక్త సంస్థ ఈ ప్రాజెక్టును తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో స్థాపించనుంది. రూ.1350 కోట్ల భారీ పెట్టుబడితో ‘మెట్‌గ్లాస్‌ ఇండియా్ణ పేరుతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రొటీరియల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక జపాన్ టెక్నాలజీని ఉపయోగించి […] The post ఏపీకి మరో భారీ పరిశ్రమ..దేశంలోనే తొలి అమోర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:23 pm

రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం.. సిరీస్ కైవసం

హోబర్ట్: భారత మహిళ జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ని ఆస్ట్రేలియా మహిళ జట్టు కైవసం చేసుకుంది. హోబర్ట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 36.1 ఓవర్లలో చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో జార్జియా వోల్(101) శతకంతో చెలరేగగా.. లిచ్‌ఫీల్డ్ 80, కీపర్ మూనీ 31 పరుగులతో రాణించారు. భారత బౌలింగ్‌లో కష్వీ గౌతమ్, దీప్తి శర్మ చెరి 2, క్రాంతి గౌడ్ 1 వికెట్ తీశారు. సెంచరీతో ఆసీస్‌ను గెలిపించిన జార్జియా వోల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 27 Feb 2026 4:22 pm

అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్ గా మన రాష్ట్రం: చంద్రబాబు

అమరావతి: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను, రైతులకు ఆధునిక పరికరాలను పరిచయం చేసి..ప్రోత్సహిస్తున్నామని  సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పై అధిక దృష్టి పెట్టామని అన్నారు. ఎపి అసెంబ్లీలో సిఎం ప్రసంగించారు. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని, రాయలసీమలో 20 లక్షల ఎకరాల్లో హర్టీకల్చర్ సాగు అవుతోందని తెలియజేశారు. దేశంలోనే అత్యధిక పండ్లు పండే ప్రాంతంగా రాయలసీమ ఉందని, రాయలసీమలో హార్టీకల్చర్ ను 40 లక్షల ఎకరాలకు పెంచుతామని సిఎం పేర్కొన్నారు. రాయలసీమ హార్టీకల్చర్ కు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఏలూరు దగ్గర అతి పెద్ద కోకో సిటీ వస్తుందని అన్నారు. ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామని, ఏజెన్సీలో కాఫీ పంట విస్తీర్ణం పెరుగుతోందని చెప్పారు. అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్ గా మన రాష్ట్రం తయారవుతోందని, సమర్థ నీటి నిర్వహణ వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అన్నారు. ఒకే రకం పంట వేయడం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారని, రైతులు ముందే మాట్లాడుకుని భిన్నమైన పంటలు వేయాలని సూచించారు. 2029 లోగా అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలనేది తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

మన తెలంగాణ 27 Feb 2026 4:21 pm

చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని బావను దారుణంగా హత్య చేసిన సోదరులు

విశాలాంధ్ర – మండపేట : చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో బావను పాశవికంగా హత్య చేసిన బావమరుదుల ఉదంతమిది. మండపేట మండలం జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ప్రస్తుత రాయవరం డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తుంది. ఆమె ద్వారపూడి కి చెందిన పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావు ప్రేమించుకున్నారు ఈ నేపథ్యంలో వీరు గురువారం అన్నవరంలో వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు జేగురుపాడు కు చెందిన మరొక వ్యక్తి […] The post చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని బావను దారుణంగా హత్య చేసిన సోదరులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:18 pm

ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్..

రేపటితో ముగుస్తున్న విజయానంద్ పదవీ కాలం కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సాయిప్రసాద్సాయిప్రసాద్ 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ పదవీ కాలం రేపటితో (ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ నేపథ్యంలో, విజయానంద్ స్థానంలో సాయిప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం సచివాలయంలో కొత్త […] The post ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:12 pm

జగదుర్తి వద్ద క్రేన్ ను కారు ఢీ: ముగ్గురు మృతి

అమరావతి : నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జగదుర్తి వద్ద క్రేన్ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. బెంగుళూరుకు చెందిన ప్రమోద్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి తిరుపతికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తీవ్రంగా గాయపడిన ప్రమోద్ ను ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రమోద్ భార్య, కుమారుడు, కుమార్తె మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. 

మన తెలంగాణ 27 Feb 2026 4:12 pm

పడవల పునరాగమనం… మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం…

“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్‌తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం…. విశాలాంధ్ర భీమవరం: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ అంచనా వేయడం, పడవను నీటిలోకి నెట్టడం—ఇది వారి దైనందిన జీవితం. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులకు తరతరాలుగా పడవ జీవనాధారమే కాక, వారి జీవన భాగస్వామిగా నిలిచింది. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ఆ బంధాన్ని ఒక్క రాత్రిలో ఛిన్నాభిన్నం చేసింది. అనేక […] The post పడవల పునరాగమనం… మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:05 pm

Puri Jagannadh |సూర్యతో సినిమా ఫిక్స్…?

Puri Jagannadh | సూర్యతో సినిమా ఫిక్స్…? Puri Jagannadh | పూరి

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:05 pm