SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

 తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూ రు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోలేమని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని అంశా లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తాము సిబిఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని కోర్టు ఈ సంద ర్భంగా గుర్తు చేసిం ది. ఏదైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే నేరుగా సిబిఐ అధికారులకే తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది. గతంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై సిబిఐ ఎటువంటి విచారణ జరపలేదని పిటిషనర్ పేర్కొనగా దర్యాప్తు సంస్థ తన పని తాను చేస్తోం దని ధర్మాసనం అభిప్రా యపడింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించాయి. ఈ అంశంపై కొందరు రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఇప్పటికే ఈ లడ్డూ వివాదంపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యా ప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని సిజెఐ ధర్మాసనం వెల్లడించింది. సిట్ విచారణ నివేదిక అంశాల పరిశీలన తరువాత తదుపరి నిర్ణయాలు ఉంటాయని కోర్టు తెలిపింది. ఈ విషయంపై ఎపి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి సిట్ నివేదికతో పాటు లడ్డూ వివాదంపై ప్రభుత్వా నికి సమగ్ర నివేదిక అందిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇలాంటి పిటిషన్లను విచారించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

మన తెలంగాణ 13 Mar 2026 9:30 pm

Flex Banner Sparks Fresh Political Tension in Pithapuram

Political tensions have resurfaced in the Pithapuram constituency of Andhra Pradesh after an incident at a municipal training programme triggered controversy. The issue occurred during a sanitation workers’ training session organised by municipal authorities. TDP leader and constituency in-charge SVSN Varma attended the event but walked out midway after expressing strong displeasure over the flex […] The post Flex Banner Sparks Fresh Political Tension in Pithapuram appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 9:27 pm

ఫుట్‌బాల్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిన 25ఏళ్ల ప్లేయర్..

చండీగఢ్: పంజాబ్‌కు చెందిన యువ ఫుట్‌బాల్ అటగాడు రవీందర్ సింగ్ (25) అకాల మరణం చెందాడు. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఐఎఫ్‌ఎల్)లో నాంధారి క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీందర్ స్థానికంగా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ మైదానంలోనే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గుండె నొప్పి రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. రవీందర్ ను పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని ప్రకటించారు. కాగా, రవీందర్‌కు నివాళులు అర్పించేందుకు ఐఎఫ్‌ఎల్‌లో ఆడే ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లు అతని స్వగ్రామం నవాన్‌షహ్రకు చేరుకున్నారు. కాగా, రవీందర్ మృతితో భారత ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది.

మన తెలంగాణ 13 Mar 2026 9:27 pm

ఇరాన్ ఎంబసీకి 45 ఇరాన్ సైనికుల మృతదేహాల అప్పగింత

కొలంబో: శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై అమెరికా సబ్‌మెరైన్ చేసిన దాడిలో మృతులైన ఇరాన్ సైనికులకు సంబంధించి 45 మృతదేహాలను ఇరాన్ దౌత్య కార్యాలయానికి శ్రీలంక శుక్రవారం అప్పగించింది. గాలే హార్బర్ పోలీస్ అభ్యర్థనపై చీఫ్ మెజిస్ట్రేట్ సమీర డొడన్‌గొడ కరపితీయ లోని నేషనల్ హాస్పిటల్ డైరెక్టర్‌కు మార్చి 11న ఇరాన్ సైనికుల మృతదేహాలను అప్పగించాలని ఆదేశించారు. అమెరికా సబ్‌మెరైన్ దాడితో మునిగిపోయిన ఇరాన్ నౌక నుంచి 84 ఇరాన్ సైనికుల మృతదేహాలను వెలికి తీయడమైందని శ్రీలంక వివరించింది. ఈ మృతదేహాలతోపాటు సజీవంగా ఉన్న 32 మందిని గత గురువారం ఆస్పత్రి నుంచి తీసుకు రావడమైందని శ్రీలంక రక్షణ మంత్రిత్వ కార్యదర్శి సంపత్ దులియకొంత విలేకరులకు వెల్లడించారు.

మన తెలంగాణ 13 Mar 2026 9:17 pm

బాసర్ లో అంతఃప్రజ్ఞ 2K-26కు ఘనంగా ప్రారంభం

బాసర్ లో అంతఃప్రజ్ఞ 2K-26కు ఘనంగా ప్రారంభం బాసర , ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:17 pm

‘అల్లు సినిమాస్’.. ప్రపంచంలోనే మూడోది

ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్‌ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించినట్లు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ గర్వంగా ప్రకటించింది. హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్’ రికార్డ్ సృష్టించింది. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే అనుభూతి గురించి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. “రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. ‘అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్‌ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసి నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్ కట్టాలని అనిపించింది. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని అనుభూతి పొందాలని అనుకుంటున్నారు. అప్పుడు నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. లార్జ్ ఫార్మాట్, కొత్త అనుభూతి కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్’ మొదలైంది. సింగిల్ స్క్రీన్లలో వస్తున్న అనుభూతి ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కువగా మల్టీ ప్లెక్స్‌లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని అనుభూతి పొందాలని జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ అనుభూతినివ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. డాల్బీలోకి మారిన సినిమా విజువల్ పరంగా, సౌండ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 2024లో మేం డాల్బీని సంప్రాదించాం. డాల్బీ సినిమాస్ ఇండియా ప్రతినిథి రాజ్ మాకు ఎంతో సహకరించారు. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీం వారు ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమాగా నిలిచింది. ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా కాకుండా మిగిలిన మూడు ఆడిటోరియంలలో బార్కో 4కె లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ ఉన్నాయి. డాల్బీ-బ్రాండెడ్ ప్రీమియం స్పీకర్లు, స్టేడియం సీటింగ్ ఉన్నాయి. నాలుగు స్క్రీన్‌లలో రిక్లైనర్లు, లాంజర్‌లు అమర్చబడి ఉన్నాయి. చివరి వరుస రిక్లైనర్‌లతో స్క్రీన్‌లు 2, 3, 4 అంతటా 717 అదనపు సీట్లు, తదుపరి తరం 3డి సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రతీ స్క్రీన్‌లో ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభవం కలిగేలా సాంకేతికతను అమర్చాము” అని అన్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 9:06 pm

ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి

ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : కర్నూలు

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:04 pm

విశ్వ విద్యాలయాలు .. విద్యార్థులకు దిక్సూచి

విశ్వ విద్యాలయాలు .. విద్యార్థులకు దిక్సూచి కర్నూలు, బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వవిద్యాలయాలు

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:59 pm

Media Left Stunned By Biker Teaser’s Dolby Power

The media attending the Dolby Cinema showcase at Allu Cinemas didn’t expect one film to steal the spotlight, but that’s exactly what happened when Charming Star Sharwa’s Biker teaser appeared on-screen. What started as a general technical demonstration suddenly turned into a moment of surprise for journalists as the hall exploded with the deep, powerful […] The post Media Left Stunned By Biker Teaser’s Dolby Power appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 8:54 pm

పశ్చిమాసియాలో భీకర దాడులు.. టెహరాన్ స్వేర్‌లో భారీ పేలుళ్లు

దుబాయ్‌పై ఇరాన్ భీకర దాడులు గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల ధ్వంసం దుబాయ్ ఇంటర్నేషనల్ సెంటర్‌పై దాడి దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత భీకరం అయింది. గల్ఫ్‌లో ఇరాన్ తీవ్రదాడుల సమయంలోనే శుక్రవారం టెహరాన్‌లోని టెహరాన్ స్కేర్‌లో బారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇక్కడ దాడులకు దిగినట్లు వెల్లడైంది. టెహరాన్ యూనివర్శిటీ దగ్గరిలోని ఇంగెలాబ్ స్ట్రీట్ వద్ద ఉన్న టెహరాన్ ఫిరదౌసి స్వేర్ వద్ద వరుసగా భీకర పేలుళ్లు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు,ప్రత్యేకించి చిన్నారులను చంపివేయడాన్ని నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున గుమికూడిన దశలోనే దాడులు జరిగాయి. వార్షిక క్వాడ్స్ దినం సందర్భంగా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపే ప్రదర్శన దశలోనే జనం పెద్ద ఎత్తున గుమికూడారు. పేలుళ్లు జరుగుతున్నప్పటికీ జనం వస్తూనే ఉన్నారని వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చావు తప్పదని నినదించారు. పేలుళ్లు దాడుల ఈ ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని వెల్లడైంది. అయితే ఎందరు చనిపోయి ఉంటారు? ఎందరికి గాయాలు అయ్యాయి ? తరువాతి పరిస్థితి ఏమిటనేది వెంటనే నిర్థారణ కాలేదు. తమ పతీకార దాడులు తీవ్రతరం అని చెప్పిన ఇరాన్ అత్యంత వ్మూహాత్మకంగా పలు ప్రాంతాల్లో జరిపిన దాడులు పలు కీలక అనంతర పరిణామాలకు దారితీశాయి టెహరాన్ , మరో నగరం ఖజ్విన్‌లోనూ దాడులు తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ముందుగానే ప్రకటించారు. ఇరాన్ సైనిక వ్యవస్థను దెబ్బతీస్తామని వేర్వేరుగా ట్రంప్ , నెతన్యాహు హెచ్చరించారు. అయితే ఈ క్రమంలోనే ఇరాన్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, అక్కడి ఎయిర్‌పోర్టులను. చమురు క్షేత్రాలను లక్షంగా ఎంచుకుని దాడులు ఉధృతం చేసింది. ఇరాన్ సుప్రీంనేత మొజ్తబా ఖమేనీ హెచ్చరికల తరువాత ఇరాన్ శుక్రవారం ఉదయం గల్ఫ్‌లోని అరబ్ దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. సౌదీ అరేబియాలో పలు ప్రాంతాల్లో డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దుబాయ్‌లోని పలు భవనాలపై ఇరాన్ దాడులు జరిగాయి. మరో సారి బుర్జ్ ఖలీఫా వద్ద కూడా డ్రోన్లు పడ్డాయి. అయితే ఇవన్ని చిన్న ఘటనలే అని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో తమ దాడుల ఉధృతి అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల ధ్వంసానికి ఇరాన్ ప్రయోగించిన దాదాపు 50 డ్రోన్లను సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి. ఒమన్‌లోడ్రోన్ల దాడులలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అక్కడి సోహర్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ల దాడితో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక్కడ నేలకూలినడ్రోన్ల శకలాలు ధాటికి ప్రజలు గాయపడ్డారు. బహరైన్‌లో భారీ స్థాయిలో సైరన్లు మోగాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫెనాన్సియల్ సెంటర్‌లోని అమెరికా స్థావరాలను ఎంచుకుని ఇరాన్ దాడులు జరిగాయి. ఈ ప్రాంతాన్ని అత్యంత కీలకమైన డిఐఎప్‌సి జోన్‌గా వ్యవహరిస్తారు. ఇక్కడ బ్యాంకులు, వాణిజ్య కేంద్రాలు, షేర్ల వ్యాపార కార్యాలయాలు ఎక్కువగా ఉంటాయి. రెస్టారెంట్లు, సంపన్నుల నైట్‌క్లబ్‌లతో సందడిగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడి దాడులతో కలవరం చెలరేగింది. పశ్చిమ ఇరాక్‌లో అమెరికా సైన్యానికి చెందిన కెసి 135 రిఫ్యూయలింగ్‌విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికా సిబ్బంది మృతి చెందారని అమెరికా సైన్యం తెలిపింది. ఇరాక్ సేనలుపొరపాటున ఈ నౌకను దెబ్బతీశాయా? లేక ఇరాన్ దాడులు సాగించిందా? అనేది నిర్థారణ కాలేదు. తాము ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. శత్రువు లేదా పొరపాటు దాడులు జరిగి ఉంటాయని తాము అనుకోవడం లేదని, ఇది ప్రమాదం అయి ఉంటుందని తెలిపారు. ఇరాన్‌పై శుక్రవారం దాడులను తీవ్రతరం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహరాన్‌తో పాటు 200కు పైగా చోట్ల ఇరాన్ వైమానిక దాడులు సాగాయి. ఇక ఒమన్‌లో శుక్రవారం ఓ డ్రోన్ కూలిన ఘటనలో ఇద్దరు విదేశీయులు మృతి చెందారు. వీరి గుర్తింపు తెలియలేదు. ఇరాన్ జరిపిన దాడులలో అమెరికాకు చెందిన విమానవాహక నౌక అబ్రహాం లింకన్ గల్ఫ్ జలాల్లో ధ్వంసం అయింది. పనిచేయకుండా పోయిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ తెలిపాయి. అయితే ఈ వాదనను అమెరికా ఖండించింది. తమ బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఈ ఈ నౌకను దెబ్బతీశామని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దీనిని యుఎస్ సైన్యం కొట్టిపారేసింది. హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకల కదలికలు భారతీయ పతాకంతో కూడిన ఓ చమురు రవాణా నౌక శుక్రవారం హర్మూజ్ జలసంధి మీదుగా ఆఫ్రికాకు క్షేమంగా వెళ్లింది. భారతీయ జెండా వల్ల ఇరాన్ దాడుల నుంచి తప్పించుకుంది. ఇక ఈ ఉద్రిక్తతల జలాల్లో ఇప్పటికీ మరో 27 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. వీటిలో అంతా కలిపి 700 మంది వరకూ భారతీయ నావికులు ఉన్నారని నిర్థారించారు. ఈ నౌకలను కూడా ఇక్కడి జల మార్గం ద్వారా వెలుపలికి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటివరకూ హర్మూజ్ ప్రాంతంతో జరిగిన దాడులలో ముగ్గురు భారతీయ నావికుల మృతి చెందారు, ఒకరు గల్లంతు అయ్యారు.

మన తెలంగాణ 13 Mar 2026 8:47 pm

తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల బాసర, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:44 pm

Ken Karunaas’ Youth releasing in Telugu on March 26th

Ken Karunaas’ upcoming film Youth has generated good buzz in Tamil, thanks to chartbuster songs composed by GV Prakash and an impressive trailer. Dhanush attended the film’s pre release event today, raising the buzz to next level. The film is now set to release in Telugu on March 26th. The Telugu theatrical release will be […] The post Ken Karunaas’ Youth releasing in Telugu on March 26th appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 8:38 pm

డొమెస్టిక్ గ్యాస్ కొరతపై అపోహలు వద్దు

డొమెస్టిక్ గ్యాస్ కొరతపై అపోహలు వద్దు వినియోగదారుల రక్షణ చట్టం అమలుపై అవగాహన

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:33 pm

ఎల్‌పీజీ సంక్షోభం...పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన

న్యూఢిల్లీ : ఎల్‌పిజి సంక్షోభంపై శుక్రవారం విపక్ష ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లలో నిరసన పాటించారు. ఈ సంక్షోభానికి కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్‌పురి, ప్రధాని నరేంద్రమోడీ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పార్లమెంట్ భవనం బయట శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో టిఎంసి ఎంపీలు నిరసన ప్రారంభించారు. “ఎల్‌పిజి సంక్షోభం” అని రాసి ఉన్న పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. “గ్యాస్ సిలిండర్లు ఎక్కడకు వెళ్లాయి ” అని ప్రశ్నిస్తూ పాలకవర్గం బీజేపీని నిలదీశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎంపీలు,ఇండియా కూటమికి చెందిన ఇతర ఎంపీలు కలిశారు. గ్యాస్ సిలిండర్లతోపాటు ప్రధాని మోడీ అదృశ్యమయ్యారని, ఆయన పూర్తిగా లొంగిపోయారని ధ్వజమెత్తారు. “దేశంలో ఎల్‌పిజి సంక్షోభం తీవ్రంగా ఉంది.బెంగాల్‌లో కూడా ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరఫరా వ్యవస్థలకు కుప్పకూలడంతో ప్రజలు చాలా బాధపడుతున్నారు. మాన్యువల్ బుకింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. ” అని టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. “ మీకు కుటుంబాలు ఉన్నాయి. వృద్ధులు, తల్లిదండ్రులు, సిలిండర్లను బుక్ చేసుకోవడానికి క్యూల్లో నిరీక్షిస్తున్నారు. రెండున్నర రోజుల్లో సిలిండర్లు లభ్యమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం ఎక్కడ రెండున్నర రోజుల్లో బుకింగ్‌లో సిలిండర్లు లభ్యమవుతున్నాయో ప్రధానిని ,మంత్రులను వెళ్లి చూడాలని సవాలు చేస్తున్నాను” అని ఆమె సవాలు విసిరారు. “దేశంలో 75 రోజులకు సరిపడా నిల్వలున్నాయని పెట్రోలియం మంత్రి దేశానికి అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు అత్యావసరాల చట్టాన్ని కూడా అమలు లోకి తెచ్చారు. కేవలం 25 రోజుల్లో లభ్యమవుతాయని అంటున్నారు. మనకన్నీ అబద్ధాలే చెప్పారు. ప్రధాని ఎక్కడ ?గత ఐదు రోజులుగా ప్రధాని సభకు రావడం లేదు. ఈ సంక్షోభం లో కూడా ఆయన కేరళలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటున్నారు. ఆయన ప్రధానిలా కాకుండా ఎన్నికల యంత్రంలా తయారవుతున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు ” అని మొయిత్రా విరుచుకుపడ్డారు. కొంతమంది విపక్ష ఎంపీలు గ్యాస్ సిలిండర్ల భారీ కటౌట్లు పట్టుకోగా,మరికొందరు సిలిండర్లు, నినాదాలతో ఉన్న పోస్టర్లు పట్టుకున్నారు. “ మోడీ జీ ఎల్‌పీజీ ” అని నినాదాలు చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇండియా కూటమి ఎంపీలు ప్రయత్నించారు. పశ్చిమాసియా సంక్షోభం, భారత్‌పై దాని ప్రభావంపై పూర్తి చర్చ జరగాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందవద్దని, ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కమర్షియల్ ఎల్‌పిజి సరఫరా దెబ్బతిని హోటల్ రంగం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఎల్‌పీజీ సంక్షోభం పరిష్కారం అవుతుందన్న నమ్మకాన్ని ప్రధాని వెలిబుచ్చారు. 

మన తెలంగాణ 13 Mar 2026 8:31 pm

మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు..

మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు.. మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:28 pm

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజలకు

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:24 pm

విషాదం: ఫుట్‌బాల్ ఆడుతూ ప్రాణాలు విడిచేశాడు..

పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ.. ఓ కుర్రాడు ప్రాణాలు విడిచాడు. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌(ఐఎఫ్ఎల్)లోని నాంధారి ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పాతికేళ్ల రవీందర్ సింగ్ మృతి చెందాడు. స్థానికంగా జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నీలో రవీందర్ సింగ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఫుట్‌బాల్ క్లబ్‌లు అతడి మృతికి సంతాపం తెలిపాయి. ఐఎఫ్ఎల్‌లో జరగబోయే మ్యాచ్‌ల సమయంలో ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్వాహకులు ప్రకటించారు. రవీందర్ సింగ్ స్వగ్రామం నవాన్‌షహ్ర జిల్లాలోని బచౌరి. అక్కడే ఆటగాడి అంత్యక్రియలు జరిగాయి. అతడిని చివరిసారిగా చూసేందుకు సహచర ప్లేయర్లు ఫుట్‌బాల్ అభిమానులు భారీగా తరలివచ్చారు. నాంధారి క్లబ్ రవీందర్‌కు నివాళి అర్పిస్తూ.. సోషల్‌మీడియాలో వీడియోని షేర్ చేసింది. మినెర్వా పంజాబ్, గోకులం కేరళ, బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌లు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.

మన తెలంగాణ 13 Mar 2026 8:20 pm

Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha News

Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:12 pm

టిజిఎస్‌ఆర్టీసిలో సమ్మె

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో యాజమాన్యానికి, కార్మిక శాఖ కమిషనర్‌కు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. టిజిఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయడంతో పాటు 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని కార్మిక జెఏసి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లపై గత కొన్ని నెలలుగా కార్మిక సంఘాల జేఏసి యజమానపైనా, ప్రభుత్వంపైనా ఒత్తిడి తెస్తున్నా లెక్క చేయకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సమ్మె తేదీపై 14 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేషీలో నోటీసులు ఇచ్చారు. లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ నోటీసులు అందజేసినట్లు జేఏసి వర్గాలు తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని జేఏసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఈవీ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని సమ్మె నోటీసు ఇచ్చే ముందు బస్ భవన్ వద్ద జేఏసి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

మన తెలంగాణ 13 Mar 2026 8:10 pm

తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ […] The post తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 7:57 pm

సినీనటి అనసూయపై అసభ్య కామెంట్లు..ఇద్దరి అరెస్టు

 సినీనటి అనసూయపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని కడప జిల్లా, పులివెందుల మండలం, పెద్ద జూటూర్ గ్రామానికి చెందిన జనార్దన్ హైదరాబాద్‌లోని ఇందిరా నగర్‌లో ఉంటున్నాడు. సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఆటో డ్రైవర్ కొండాపురం అరుణ్ కుమార్. ఇద్దరు సోషల్ మీడియాలో సినీనటి అనసూయ భరద్వాజ్‌పై గత కొంత కాలం నుంచి అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్రీ టైంలో ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆమె క్యారెక్టర్‌ను దిగార్చే విధంగా కామెంట్ చేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అనసూయపై అసభ్య కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. అనసూయ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:54 pm

పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఏ,ఆర్ పల్లిలో, నాగదేవత విగ్రహం ప్రతిష్టాపన

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:51 pm

భారీ జిఎస్‌టి స్కామ్.. నిందితుడి అరెస్ట్

భారీ జిఎస్‌టి కుంభకోణాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ బట్టబయల్జేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన మోసపూరిత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను పొంది, దానిని బదిలీ చేశాడనే ఆరోపణలపై వాణిజ్య పన్నుల శాఖ ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్‌కెజి ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్ కుమార్ గోయెల్ కార్యకలాపాలపై విశ్వసనీయ నిఘా, వివరణాత్మక డేటా విశ్లేషణ ఆధారంగా అధికారులు దర్యాప్తు నిర్వహించారు. వస్తువుల వాస్తవ సరఫరా లేకుండా జారీ చేసిన ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి అతను ఐటిసిని పొంది, దానిని బదిలీ చేశాడని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) పొందినట్లు గుర్తించారు. సందీప్ కుమార్ గోయె ల్ హెచ్ ఎఫ్‌సి స్టీల్ ట్యూబ్స్ అండ్ వాల్వ్ యజమాని, విజయ్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఎల్‌ఎల్‌పిలో భాగస్వామి అని అధికారులు వెల్లడించారు, ఇక్కడ వస్తువులు, సేవలను వాస్తవంగా స్వీకరించకుండానే ఇలాంటి మోసపూరిత ఐటిసి క్లెయిమ్‌లు కనుగొన్నారు.ఈ క్రమంలో వాటి రిజిస్ట్రేష న్లు అధికారులు రద్దు చేశారు. జిఎస్‌టి చట్టం, 2017 నిబంధనల ప్రకారం సందీప్ కుమార్ గోయల్‌ను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నకిలీ ఇన్‌వాయిస్‌లు, మోసపూరిత ఐటిసి క్లెయిమ్‌లు, ఇతర జిఎస్‌టి చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలంగాణ వాణిజ్య పన్నుల కమిషనర్ వెల్లడించారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:47 pm

పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం…

పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం… కౌకుంట్ల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:45 pm

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు

–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు The post జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 7:43 pm

దొంగతనం జరిగి రెండేళ్లయిన న్యాయం జరగలేదు

దొంగతనం జరిగి రెండేళ్లయిన న్యాయం జరగలేదు ఉట్నూర్, ఆంధ్రప్రభ : తాను అద్దెకు

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:38 pm

16నుండి పది పరీక్షలు

ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు -27,360 మంది విద్యార్థులకు 149 సెంటర్లు -పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు... కలెక్టర్ జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, డీఈవో […] The post 16నుండి పది పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 7:37 pm

ఐదు లీటర్ల గుడుంబా పట్టివేత.. విక్రయదారుడు అరెస్ట్

ఐదు లీటర్ల గుడుంబా పట్టివేత.. విక్రయదారుడు అరెస్ట్ చిట్యాల, ఆంధ్రప్రభ :మండలంలోనీ తిరుమలాపురంలో

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:34 pm

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 7:31 pm

ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు

ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:31 pm

రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిలుపూర్, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:25 pm

నెలసరి సెలవు తప్పనిసరి చేస్తే.. మహిళల కెరీర్‌కు ముగింపే

ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం కొలువుల భర్తీలోనూ ప్రతికూలతలు ఎదురవుతాయి సిజెఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన సిజెఐ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారంనాడు దానిని తిరస్కరించింది. సెలవును తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్ ముగుస్తుందన్నారు. వేతనంతో కూడిన నెలసరి సెలవు అంశంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని సిజెఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు ఇస్తే మహిళలను ఉద్యోగాల్లో తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం ఉందని అన్నారు. తద్వారా వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదని పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. వాలంటరీగా సెలవులు ఇవ్వడమనేది చెప్పుకోవడానికి బాగుటుంది కానీ చట్టం చేసి తప్పనిసరి చేస్తే వివిధ రంగాల్లోని ఉద్యోగాల భర్తీలో కూడా వాళ్లకు ప్రతికూలతలు ఉంటాయన్నారు. అదే విధంగా పురుషుల కన్నా తాము తక్కువ అనే భయ భావన వారిలో కలిగే అవకాశముందనారు. నెలసరి వల్ల ఏదో చెడు జరుగుతోంది అన్న విషయాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదని, అది మహిళలను ఆత్మనూన్యతకు గురిచేసేలా ఉంటుందని సిజెఐ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వాలు స్టేక్‌హోల్డర్లతో చర్చించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేరళ రాష్ట్రంలోని స్కూళ్లలో ఆడపిల్లలకు నెలసరి సెలవు ద్వారా వారికి ఊరటనిస్తున్నారని, కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాలంటరీగా అమలు చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా కూడా తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది షంషద్ వాదనలు వినిపిస్తూ.. 2013లో ప్రభుత్వ విశ్వవిద్యాలాయాల్లో నెలసరి సెలవురు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ప్రైవేటు కంపెనీలు అదే బాటలో పయనిస్తే బాగుంటుందన్నారు. ఈ సమయంలో సిజెఐ కలుగుజేసుకొని.. ఆ సమయంలో వారు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాలనీ, చట్టం చేయాలన్న డిమాండ్ విషయానికి వస్తే అది మహిళ కెరీర్ ముగింపునకు దారులు వేయడమేని అన్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:24 pm

పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘ఉస్తాద్’ బెనిఫిట్ ఫోలకు అనుమతి

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్‌ సినిమాపై ఎంతో క్రేజ్‌ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. ఎపిలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. మార్చి 19న తెల్లవారుజామున 4-5 గంటల మధ్య బెనిఫిట్‌ షోకి అనుమతి ఇవ్వగా.. దీని టికెట్ ధరను రూ.500 (ట్యాక్సులు కలిపి)గా నిర్ణయించారు. అలాగే పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.125 పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్ వచ్చింది. ఇక మూవీ రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా నిర్ణయించారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:24 pm

వంటగ్యాస్‌కు కొరత లేనే లేదు.. అనవసర బుకింగ్‌లు వద్దు

ప్రాధాన్య రంగాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో ఎల్‌పిజి కొరతపై  కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ‘ప్యానిక్ బుకింగ్’ అవసరం లేదని కోరింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రులు, హాస్టళ్లకు ఎల్‌పీజీ సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మార్చి 2026తో పోల్చుకుంటే దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తి 40 శాతం పెరిగిందని, అదనంగా రాష్ట్రాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్ పంపిణీ చేశామని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లకు బొగ్గు సరఫరా చేయాలని కోల్ ఇండియాను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముందు సాధారణంగా 55.7 లక్షల బుకింగ్‌లు ఉంటే మార్చి 12 నాటికి అది 75.7 లక్షలకు పెరిగిందనారు. ఎదో జరుగబోతోందన్న భయాల కారణంగానే బుకింగ్‌లు అనూహ్యంగా పెరిగాయని సుజాతా శర్మ తెలిపారు. ఎల్పీజీపై ఒత్తిడి తగ్గేందుకు పీఎన్‌జీ కనెక్షన్లకు మళ్లాలని ప్రజలను కోరారు. క్రూడాయిల్‌కు సంబంధించి 258 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ కెపాసిటీ ఉందని, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని కలిగి ఉన్నామని వివరించారు. ప్రధానమైన అర్బన్ సిటీలు, కేంద్రాల్లో కమర్షియల్ వినియోగదారుల ఆందోళన, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు.  

మన తెలంగాణ 13 Mar 2026 7:19 pm

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ నాయకుల వినతి

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:13 pm

శశికల ఈజ్ బ్యాక్.. తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికల కొత్త పార్టీని ప్రకటించారు. ఈ పార్టీకి 'అఖిల భారత పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం'గా నామకరణం చేశారు. పార్టీ జెండాతోపాటు చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. జయలలిత స్మారకార్థం రామనాథపురంలో జరిగిన బహిరంగ సభలో శశికల మాట్లాడుతూ.. మాజీ సిఎం, ఐఏడీఎంకే(అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) వ్యవస్థాపకుడు ఎంజిఆర్ స్మరించుకున్నారు. ప్రజలకు సేవ చేయడానికి, ద్రవిడ మున్నేట్ర కజగం(DMK) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా MGR పార్టీని స్థాపించారని చెప్పారు. ముఖ్యంగా పేదల పక్షాన నిలబడాలనే సంకల్పంతోనే ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఎంజిఆర్ తర్వాత జయలలిత ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ప్రజలకు సేవ చేశారన్నారు. ఆమె చనిపోయిన అనంతరం AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. ఆయన నాయకత్వంలో పార్టీ పతనావస్థకు చేరుకుందని శశికల విమర్శించారు. కాగా, జయలలిత మరణం తర్వాత శశికల, AIADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:08 pm

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:07 pm

ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా

ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా మూకమామిడి గ్రామ పంచాయతీ ప్రారంభించిన

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:03 pm

అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల

అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:57 pm

చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం

చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం మురుగునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలిదోమల

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:52 pm

UBS Release: GO issued in Andhra Pradesh

Telugu360 was the first to break the news that the special premieres permission will be granted for Ustaad Bhagat Singh on March 19th and there would be no premieres on March 18th evening. The GO has been issued by the AP government today and one premiere show permission has been granted on March 19th between […] The post UBS Release: GO issued in Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:48 pm

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి హంద్రిక శ్రీ జగద్గురు లింగప్ప తాత

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:48 pm

Is Allu Cinemas a Threat for AMB Cinemas?

Allu Cinemas will open for film lovers and regular patrons starting from tomorrow. The four-screen multiplex is located in Gandipet, one of the costliest and most developing places of Hyderabad. From the past couple of years, most of the celebrities, rich crowds and others residing near to the ORR are rushing to AMB Cinemas for […] The post Is Allu Cinemas a Threat for AMB Cinemas? appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:46 pm

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సర్వ సిద్ధం..

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సర్వ సిద్ధం.. పదవ తరగతి పరీక్షల

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:36 pm

Bangaru Bomma: SP Charan, Chithra’s Classic Charm

Sumanth Prabhas who impressed with his debut flick Mem Famous is coming up with a rural love and family saga Godari Gattupaina, directed by first-timer Subash Chandra, and produced by Red Puppet Productions, with Nidhi Pradeep essaying the heroine. As part of musical promotions, the makers today released third single- Bangaru Bomma. It’s classically-infused romantic […] The post Bangaru Bomma: SP Charan, Chithra’s Classic Charm appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:26 pm

Is Anushka Shetty Getting Married?

Top actress Anushka Shetty hasn’t been seen across the film circles for the past few months. She played the lead role in Ghaati last year and the film ended up as a disappointment. The latest rumors making rounds is that Anushka Shetty is all set to get married very soon. It is an arranged marriage […] The post Is Anushka Shetty Getting Married? appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:21 pm

సమ్మె నోటీసులు ఇచ్చిన టిజిఎస్‌ఆర్‌టిసి జెఎసి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టిసి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టిసి యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ‘‘మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఆర్టిసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి. అన్ని కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులపై ఆధిక పని భారం తగ్గించాలి’’ అని జెఎసి నేతలు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 13 Mar 2026 6:18 pm

పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జడ్పి హెచ్ఎస్

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:17 pm

Breaking : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 6:16 pm

Video : Actress Raashii Khanna Exclusive Interview

The post Video : Actress Raashii Khanna Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:15 pm

నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే

నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:14 pm

LPG Cylinder : గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటున్నా... చేతివాటంతో చుక్కలు కనిపిస్తున్నాయ్ గా

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో ఎల్.పి.జి కొరత ఏర్పడింది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 6:07 pm

మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించం: బిజెపి రాంచందర్ రావు

మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు. మూసీ ప్రాజెక్ట్‌పై తమ పార్టీకి వ్యతిరేకత లేదనీ, అయితే పేదల ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం అని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మూసీపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. మూసీ నది పునరుజ్జీవనం గానీ, మూసీ ప్రాజెక్టును గానీ తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని, అందులో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలని, ఆ నీరు రైతులకు సాగునీటిగా ఉపయోగపడాలని తమ పార్టీ కోరుకుంటోందని తెలిపారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు తమ పార్టీ రకరకాల వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మూసీ నది తప్పకుండా పునరుజ్జీవనం కావాలని ఇప్పటికీ చెబుతున్నామని, కానీ ‘గాంధీ సరోవర్’ పేరుతో అక్కడ నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడం భావ్యం కాదన్నారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని, ఆ ఇళ్లను కూల్చకుండా కూడా మూసీని శుద్ధి చేయవచ్చని ఆయన తెలిపారు. సబర్మతి నదిని ఉదాహరణగా చెబుతూ మాట్లాడేవారు అసలు అక్కడ ప్రాజెక్టు ఎలా జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. ఒకప్పుడు సబర్మతి కూడా మూసీలా కాలుష్యంతో, దుర్వాసనతో ఉండేదని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా నది నుంచి నీటిని సబర్మతికి మళ్లించి, నదుల అనుసంధానం చేసి, ముందుగా నది శుభ్రపరిచారని చెప్పారు. గాంధీ సరోవర్ కోసం భూమి అవసరమైతే ప్రాజెక్టును రీ-అలైన్ చేసి ఒక్క ఇల్లు కూడా దెబ్బతినకుండా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. గాంధీ విగ్రహం నిర్మించాలనుకుంటే వెయ్యి అడుగులైనా, రెండువేల అడుగులైనా ఆకాశాన్ని తాకేలా నిర్మించొచ్చని, దానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. దేశంలో గ్యాస్, ఆయిల్, డీజిల్, పెట్రోల్ దొరకవని ప్రజల్లో భయం సృష్టించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని అన్నారు. రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత దేశాల నాయకులతో మాట్లాడి, భారతదేశానికి రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరాలు హోర్ముజ్ జల సంధి ద్వారా అంతరాయం లేకుండా దేశానికి చేరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మన దేశం ఒకే ప్రాంతంపై ఆధారపడదని, దాదాపు 40 శాతం ముడి చమురు ఇతర దేశాల నుంచీ వస్తోందని చెప్పారు. అందువల్ల దేశంలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని రాంచందర్ రావు చెప్పారు.

మన తెలంగాణ 13 Mar 2026 5:57 pm

ఖమ్మంలో పెన్షనర్ల ఆందోళన

ఖమ్మంలో పెన్షనర్ల ఆందోళన యుద్ధ నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:55 pm

RTC |సమ్మె నోటీసు

RTC | సమ్మె నోటీసు విలీన ప్ర‌క్రియ చేప‌ట్టాలి RTC | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:51 pm

అన్నదాన పథకానికి రూ.2.01 లక్షల విరాళం..

అన్నదాన పథకానికి రూ.2.01 లక్షల విరాళం.. ఆంధ్రప్రభ, ఇంద్రకిలాద్రి : విజయవాడలోని శ్రీ

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:47 pm

మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు

మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అనేక మంది విద్యార్థులకు కడుపు నిండుతుంది. ఈ నేపథ్యంలోనే వారికి పౌష్టికాహారాన్ని కూడా అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చేపల వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించవచ్చని, ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని చేపల చెరువుల నుంచి ఉత్పత్తి అయ్యే చేపలను విద్యార్థులకు మధ్యాహ్నా భోజనంలో అందిస్తే అటు మత్యకారులకు ఇటు విద్యార్థులకు మేలు జరుగుతుందని మత్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆలోచనగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఇప్పటికే విద్యార్థుల మధ్యాహ్నా భోజన పథకంపై సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు కడుపునిండా పౌష్టికాహారం తినేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. అయితే, విద్యార్థులకు చికెన్ స్థానంలో చేపలు పెడితే మరింత పోషకాహారం లభిస్తుందని ఈ నేపథ్యంలోనే వారానికోసారి చికెన్ స్థానంలో ఫిష్ అందించాలని సిఎం రేవంత్‌రెడ్డి కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది. 

మన తెలంగాణ 13 Mar 2026 5:47 pm

నిత్య ఉచిత ప్రసాద వితరణకు విరాళం ..

నిత్య ఉచిత ప్రసాద వితరణకు విరాళం .. ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:45 pm

ఆ వేలంతో మాకేమీ సంబంధం లేదు: బిసిసిఐ

‘ది హండ్రెడ్ లీగ్’ కోసం నిర్వహించిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ సిఇవొ కావ్యా మారన్ స్వయంగా ఈ వేలంలో పాల్గొని పాక్ ఆటగాడిని కొనుగోలు చేసింది. సన్‌ గ్రూప్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థానీ ఆటగాడిని కొనుగోలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎక్స్‌లో కూడా సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు అధికారిక ఖాతాను తొలగించారు. తాజాగా ఈ విషయంపై బిసిసిఐ స్పందించింది. ఆ వేలంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ‘‘ఆ కొనుగోలు వ్యవహారంలో ఐపిఎల్‌లో జరగలేదు. సన్‌రైజర్స్ యాజమాన్యం విదేశీ లీగ్ వేలం బిడ్డింగ్‌లో పాల్గొని పాక్ క్రికెటర్‌ని తీసుకుంది. అది వారి నిర్ణయం. అందులో మేం చేసేదేమీ లేదు. వేరే లీగుల్లో ఏం జరిగినా మాకు సంబంధం లేదు. భారత్ వెలుపల ఆయా ఫ్రాంచైజీల బిడ్డింగ్‌ల్లో మాకు ఏం సంబంధం ఉంటుంది?’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 5:44 pm

గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే

గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే మంథని, ఆంధప్రభ : ప్రపంచంలో

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:43 pm

పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు

రాష్ట్రంలో 810 ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు. తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్ల్లీంచడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకమారు ఎల్‌పిజి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని, ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 13 Mar 2026 5:43 pm

అన్నదాత సుఖీభవ పధకం ఓ దగా

అన్నదాత సుఖీభవ పధకంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీమంత్రి కన్నబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 13 Mar 2026 5:42 pm

జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చ‌లివేంద్రం..

జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చ‌లివేంద్రం.. క‌లెక్ట‌రేట్‌లో కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి చ‌లివేంద్రం..స‌మితి

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:40 pm

మాజీ డీజీపీ హెచ్.జె దొర మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ డీజీపీగా పనిచేసిన హెచ్.జె దొర మృతి చెందారు.

తెలుగు పోస్ట్ 13 Mar 2026 5:29 pm

అభివృద్ధి పనుల నాణ్యత లో రాజీ పడొద్దు..

అభివృద్ధి పనుల నాణ్యత లో రాజీ పడొద్దు.. పనులు జాప్యం చేస్తే కఠిన

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:28 pm

శానిటేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:26 pm

పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం చేయద్దు..

పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం చేయద్దు.. పారిశుధ్య పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి..అధికారులతో

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:23 pm

పశువైద్యశాల ఆకస్మిక తనిఖీ…

పశువైద్యశాల ఆకస్మిక తనిఖీ… నిర్వహణ, మౌళిక వసతులు గురించి వివరాలు.సేకరణ…వసతులు కల్పించాలని ఆదేశాలు

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:18 pm

తిరుమలలో ఇక అక్షర గోవిందం

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 5:16 pm

బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం..

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; పట్టణంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇటీవల

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:12 pm

భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యార్థులు

ప్రభ న్యూస్ 13 Mar 2026 5:05 pm

Alekhya Reddy’s Political Entry Sparks Fresh Debate in Andhra Pradesh

Alekhya Reddy, the wife of the late Nandamuri Taraka Ratna, has sparked fresh political discussion after her recent interview. Her remarks about politics and her family background have led to speculation about whether she might enter public life in the future. Speaking in the interview, Alekhya opened up about her family’s long association with politics. […] The post Alekhya Reddy’s Political Entry Sparks Fresh Debate in Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 5:04 pm

UBS: A Test for Pawan Kalyan’s Stardom

Powerstar Pawan Kalyan’s upcoming film Ustaad Bhagat Singh is all set for a grand release during the Ugadi weekend. Three songs from the film are released and none of them ended up as a chartbuster. Harish Shankar’s last film Mr Bachan was a massive debacle. Ustaad Bhagat Singh relies completely on the stardom of Pawan […] The post UBS: A Test for Pawan Kalyan’s Stardom appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 4:57 pm

జేకే మల్టీకేర్ హాస్పిటల్ లో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు సాంకేతిక పద్ధతులతో శస్త్రచికిత్సలు అందించాలనే

ప్రభ న్యూస్ 13 Mar 2026 4:57 pm

ఉమ్మడి ఎపి మాజీ డిజిపి హెచ్‌జె దొర కన్నుమూత

హైదరాబాద్: ఉమ్మడి ఎపి మాజీ డిజిపి హెచ్‌జె దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం డయాలసిస్ చేయించుకొనేందుకు దొర నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక.. ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో జారి పడినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఎపిలోని శ్రీకాకుళం జిల్లాలో 1943లో హెచ్‌జె దొర జన్మించారు. ఆయన 1965 ఐపిఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్‌కు చెందిన అధికారి. వివిధ హోదాల్లో పని చేసిన ఆయన 1996లో డిజిపిగా పదోన్నతి పొందారు. 2002లో సిఐఎస్ఎఫ్ డిజిగా డిప్యుటేషన్‌పై వెళ్లారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

మన తెలంగాణ 13 Mar 2026 4:57 pm

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి ప్రారంభం

ప్రభ న్యూస్ 13 Mar 2026 4:50 pm

కామఖ్య టు చర్లపల్లి.. ‘అమృత్‌ భారత్’ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన మోడీ

గువాహటి: ఈశాన్య ప్రాంతాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి ఇప్పుడు ప్రయాణం మరింత సులభతరం కానుంది. చర్లపల్లి నుంచి అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య వరకూ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో సేవలు అందించనుంది. దీంతో ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే వారు ఇప్పుడు తక్కువ ఖర్చుతో సులభతరమైన ప్రయాణం చేసే వీలుంది. ఈ రైలు మార్గ మధ్యంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీకాకులం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొంట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌తో పాటు న్యూజల్పాయ్‌గురి నుంచి గువాహటి వరకూ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ని, నారంగి నుంచి త్రిపుర రాజధాని మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌ని కూడా మోడీ ప్రారంభించారు.

మన తెలంగాణ 13 Mar 2026 4:41 pm

జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం

విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా): జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చాలన్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. అనంతపురం రూరల్ సబ్ డివిజన్ అధికారి పర్యవేక్షణలో రాప్తాడు మండలం మైనార్టీ కాలనీలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులందరూ తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు […] The post జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 4:40 pm

Indian 3: Will Shankar land into Legal Trouble?

Director Shankar who delivered several blockbusters in the past has been in a struggling phase. He is one director who never compromises on the budget. Indian 2 was a huge debacle and the makers are not ready to invest more on Indian 3. The film’s pending shoot is yet to be completed. Shankar has moved […] The post Indian 3: Will Shankar land into Legal Trouble? appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 4:38 pm

సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం

విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా):రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను కూటమి నాయకులు అభినందించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీఐ అశోక్ కుమార్ సేవలు అందించినందుకు రాజాం కొండంపేట […] The post సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 4:36 pm

ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు

విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు .ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యలు, గత ప్రభుత్వ కాలంలో ఉపాధి కోల్పోయిన బాధితుల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, అలాగే రీ–సర్వే వల్ల […] The post ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 4:32 pm

జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా.. నలుగురు మృతి

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై అర్థరాత్రి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి 22 మందితో అకోలా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 13 Mar 2026 4:30 pm

Andhrapradesh |నిమ్స్ లో చికిత్స పొందుతూ…

Andhrapradesh | నిమ్స్ లో చికిత్స పొందుతూ… Andhrapradesh | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 13 Mar 2026 4:29 pm

తొలి బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు

తొలి బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు కడియం రాకపై అప్రమత్తమైన పోలీసులుమున్సిపాలిటీ వద్ద

ప్రభ న్యూస్ 13 Mar 2026 4:26 pm

అచ్చంపేటలో ఫుడ్ కమిషన్ ఆకస్మిక దాడులు

అచ్చంపేటలో ఫుడ్ కమిషన్ ఆకస్మిక దాడులు అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్

ప్రభ న్యూస్ 13 Mar 2026 4:22 pm

ప్రతిపక్షాలపై వెస్ట్ ఎమ్మెల్యే నాయిని ఫైర్

ప్రతిపక్షాలపై వెస్ట్ ఎమ్మెల్యే నాయిని ఫైర్ వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : ఓరుగల్లు

ప్రభ న్యూస్ 13 Mar 2026 4:21 pm

పదవ తరగతి పరీక్షల సన్నాహాలను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో పదవ తరగతి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16వ తేదీ నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధర్మవరం పట్టణంలోని కొత్తపేట రామ్‌నగర్ ప్రాంతంలో ఉన్న పురపాలక సంఘ బాలికోన్నత పాఠశాల, ఎస్.పి.సి.ఎస్. మున్సిపల్ హై స్కూల్, జి.వి.ఇ. బాలికోన్నత పాఠశాలలను పదవ తరగతి పబ్లిక్ […] The post పదవ తరగతి పరీక్షల సన్నాహాలను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 4:20 pm