BC reservations |మహాత్మ జ్యోతిబా ఫూలే వర్ధంతి వేడుకలు
BC reservations | మహాత్మ జ్యోతిబా ఫూలే వర్ధంతి వేడుకలు BC reservations
Sangareddy |ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించొద్దు…
Sangareddy | ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించొద్దు… మీడియా సెంటర్ ప్రారంభోత్సవంలో కలెక్టర్
Mopidevi |శ్రీ వల్లి సన్నిధిలో హైకోర్టు ఏజీ
Mopidevi | శ్రీ వల్లి సన్నిధిలో హైకోర్టు ఏజీ ( మోపిదేవి –
Praja Darbar |ప్రజల వద్దకే నేరుగా పాలన
Praja Darbar | నందిగామ, ఆంధ్రప్రభ : చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో
Crim |భార్యను హత్య చేసిన భర్త…
Crim | భార్యను హత్య చేసిన భర్త… Crim | ఎడపల్లి, ఆంధ్రప్రభ
SCHOOL |బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం
SCHOOL | బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం ప్రారంభోత్సవానికి హాజరైన చిత్తూరు జిల్లా ఎస్పీ
Civil Supply |కొనుగోళ్లను వేగవంతం చేయాలి
Civil Supply | కొనుగోళ్లను వేగవంతం చేయాలి Civil Supply | ప్రతినిధి/
మాజీ మావోయిస్టు బిఆర్ఎస్ నేత సిద్ధన్నహత్య రాజన్నసిరిసిల్ల జిల్లాలో కలకలం.
ఇంటర్వ్యూ ప్రాణాల మీదకు తెచ్చిందా..? జగిత్యాల పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.? రాజన్న సిరిసిల్ల బ్యూరో, నవంబర్ 28, (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ …
Emmiganur |బైక్ ఢీకొని పత్తి రైతు మృతి
Emmiganur | బైక్ ఢీకొని పత్తి రైతు మృతి ఎమ్మిగనూరులో దుర్ఘటన (
Siddipet |ఎస్ఎస్ టి శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
Siddipet | ఎస్ఎస్ టి శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ Siddipet | సిద్దిపేట
Release Trailer of Akhanda 2 Loading
Akhanda 2 is the last biggie from Telugu cinema this year. The songs and the trailer were out sometime ago and the grand pre-release event of Akhanda 2 will take place today in Hyderabad in Kaithalapur Grounds, Kukatpally. The film’s release trailer will be unveiled during the event in the presence of the entire team. […] The post Release Trailer of Akhanda 2 Loading appeared first on Telugu360 .
YSRCP : సజ్జల విషయంలో జగన్ స్టాండ్ ఇదేనా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే ఇప్పుడున్నారు
Tributes|పూలే జీవితం ఆర్శనీయం
Tributes| పూలే జీవితం ఆర్శనీయం Tributes| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మహాత్మా
బిర్యానీ సగర్వంగా టాప్ 10లో స్థానం
హైదరాబాదీ బిర్యానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. మన బిర్యానీ రుచి, సువాసన, ప్రత్యేక వంట విధానం దీన్ని స్పెషల్ గా …
Yadadri |బీఆర్ఎస్లో భారీగా చేరికలు..
Yadadri | బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. Yadadri | ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ
Public Grievance |భారీగా తరలివచ్చిన ఫిర్యాదుదారులు
Public Grievance | పుట్టపర్తి, ఆంధ్రప్రభ : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె
Kolhapur 1902 |మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలి…
Kolhapur 1902 | మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలి… Kolhapur 1902
Suicide| అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : చిన్నారిని హతమార్చి ఆపై తాను ఆత్మహత్య
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: కవిత
హైదరాబాద్: అక్రమ అరెస్టులతో జాగృతి పోరాటాన్ని అడ్డుకోలేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే.. 42 శాతం బిసి రిజర్వేషన్లు కచ్చితంగా అమలవుతాయని అన్నారు. ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో కవిత పర్యటించారు. రైలు పట్టాలపై కవిత, జాగృతి నేతలు రైల్ రోకో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులకు, జాగృతి నేతలకు మధ్య తోపులాట జరిగింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిరసనగా డిమాండ్ చేశారు. బిసిలకు అన్యాయం చేస్తే ఖబర్దార్’ అంటూ ప్లకార్డులను కవిత ప్రదర్శించారు.
Nomination |నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
Nomination | నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు Nomination | వేములవాడ,
Disappear|ఇంటర్ విద్యార్థి అదృశ్యం
Disappear| గోరంట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని మందపల్లి పంచాయతీ కరావులపల్లి గ్రామానికి చెందిన
NBK-Boyapati’s Akhanda 2 Pre-Business Roars
Akhanda 2 is creating a huge buzz even before its release, thanks to the powerful combo of Nandamuri Balakrishna and Boyapati Sreenu, one of the most reliable mass hit pairs in cinema today. From the moment the sequel was announced, the excitement has only grown with every update. The film’s strong spiritual theme is adding […] The post NBK-Boyapati’s Akhanda 2 Pre-Business Roars appeared first on Telugu360 .
Mahatma |జ్యోతిబా పూలేకు ఘన నివాళులు
Mahatma | జ్యోతిబా పూలేకు ఘన నివాళులు Mahatma | అచ్చంపేట ,
ట్రంప్ కీలక ప్రకటన.. ఆ దేశాల నుంచి అమెరికాకు వలసల బంద్
వైట్ హౌస్ సమీపంలో కాల్పుల నేపథ్యంలో వలసలపై ట్రంప్ కీలక నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఓ వలసదారుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో.. మూడవ ప్రపంచ దేశాల (అభివృద్ధి పరంగా వెనుకబడిన పేద దేశాలను గతంలో అలా పిలిచేవారు) నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ నేషనల్ […] The post ట్రంప్ కీలక ప్రకటన.. ఆ దేశాల నుంచి అమెరికాకు వలసల బంద్ appeared first on Visalaandhra .
ఢిల్లీ లోని రైల్వే స్టేషన్ పై దాడి జరగడంతో మంటలు అంటుకున్నాయని, ఎర్రకోట కారు బాంబు పేలుళ్ల ఘటన తర్వాత ఢిల్లీ లోని ఓ రైల్వే స్టేషన్ పై దాడి
స్థానిక ఎన్నికల జీవో 46పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ..
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకులు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రస్తుత దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం […] The post స్థానిక ఎన్నికల జీవో 46పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ.. appeared first on Visalaandhra .
అమరావతి ఆర్థిక భవిష్యత్కు ఇది శుభసూచికం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపనఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎంరాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తోందని అన్నారు. శుక్రవారం అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రూ.1334 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో […] The post అమరావతి ఆర్థిక భవిష్యత్కు ఇది శుభసూచికం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ appeared first on Visalaandhra .
Ganneruvaram |నామినేషన్లు స్వీకరించే క్లస్టర్లు ఇవే…
Ganneruvaram | నామినేషన్లు స్వీకరించే క్లస్టర్లు ఇవే… Ganneruvaram | గన్నేరువరం, ఆంధ్రప్రభ:
దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ విమాన ప్రమాదానికి సంబంధించింది
హైదరాబాదీ బిర్యానీకి 10వ ర్యాంక్ #TeluguPost #telugu #post #news
Nirmala Sitharaman : ఏపీ రాజధాని శరవేగంగా అభివృద్ధి ఖాయం
రాజధాని అమరావతిని తిరిగి ప్రారంభించడం ఒక బృహత్ సంకల్పమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు
Supreme Court Cancels Interim Bail for Pinnelli Brothers in Palnadu Double Murder Case
The Supreme Court has delivered a major blow to senior YSRCP leaders Pinnelli Ramakrishna Reddy, former MLA of Macherla, and his brother Pinnelli Venkatarama Reddy, by cancelling the interim bail earlier granted to them in the Palnadu double murder case. The Court dismissed both of their anticipatory bail petitions and ruled that the two leaders […] The post Supreme Court Cancels Interim Bail for Pinnelli Brothers in Palnadu Double Murder Case appeared first on Telugu360 .
Accident | బస్సు బోల్తా.. Accident | పెద్దారవీడు, ఆంధ్రప్రభ : పెద్దారవీడు
ETELA |విజయోస్తూ.. గెలిచి రండి
ETELA | విజయోస్తూ.. గెలిచి రండి గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు తెప్పిస్తామల్కాజ్గిరి
CONGRESS |అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
CONGRESS | అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి లింగాపూర్ జీపీ సర్పంచ్ అభ్యర్థి ఆకుల
Medak |పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం..
Medak | పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం.. మెదక్ మున్సిపల్ మాజీ
Cinema|మళ్ళీ “పెళ్లి చేసుకుందాం”
Cinema| విక్టరీ వెంకటేష్ నటించగా ఘన విజయం సాధించిన చిత్రాల్లో “పెళ్ళి చేసుకుందాం”
అమరావతిలో బ్యాంకులు –బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన
అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలోని సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నిర్మించిన మొదటి బ్లాక్లో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజధాని రైతులు, వ్యవసాయ కార్మికులు, […] The post అమరావతిలో బ్యాంకులు – బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన appeared first on Visalaandhra .
Kotagiri |నామినేషన్ కేంద్రాల పరిశీలన
Kotagiri | నామినేషన్ కేంద్రాల పరిశీలన ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు డీఎల్పీఓ సూచనలు
Surreder Date Fixed : మావోయిస్టుల ముహూర్తం ఖరారు
Surreder Date Fixed : మావోయిస్టుల ముహూర్తం ఖరారు ( ఆంధ్రప్రభ, ఏపీ
శ్రీలంకలో దిత్వా తుఫాన్ విలయతాండవం.. ఎపి, తమిళనాడుకు ముప్పు
కొలంబో: శ్రీలంకలో దిత్వా తుఫాన్ విలయతాండవం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో శ్రీలంక చిగురటాకుల వణికిపోతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. వరదలలో 56 మంది మృతి చెందాని అధికారులు వెల్లడిచంఆరు. పోలీసులు, అధికారులు, రెస్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నారు. 21 మంది ఆచూకీ గల్లంతు కావడంతో పాటు 600పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. గత 24 గంటలలో వయునియా ప్రాంతంలోని చెడ్డికులం 315 మిమి, ముల్లెతీవు ప్రాంతం అలపల్లిలో 305 మిమి వర్షపాతం నమోదైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలను తిరువనంతపురం, బెంగళూరు వైపు మళ్లిస్తున్నారు. దిత్వా తుఫాన్ ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలోని తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం ప్రాంతాలలో నవంబర్ 30 రాత్రి నుండి డిసెంబర్ 4 రాత్రి వరకు వర్షాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా డిసెంబర్ 1, డిసెంబర్ 2 ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 3, 4 తేదీల్లో తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కొనసాగుతాయి. మొత్తంగా ఈ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి, ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, ఎన్టిఆర్, కోనసీమ, కాకినాడ, ఏలూరు, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 1, డిసెంబర్ 2వ తేదీల్లో వర్షాలు ఉంటాయి, డిసెంబర్ 2 నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, సముద్ర తీరానికి (బంగాళాఖాతం) దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విజయవాడ - గుంటూరు - ఏలూరు ప్రాంతాల్లో కచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి జిల్లాల్లో డిసెంబర్ 2న మాత్రమే వర్షాలు కురువనున్నాయి. డిసెంబర్ 1న వైజాగ్ - అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ ముందస్తు జల్లులు పడవచ్చు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ మేఘావృతమైన ఆకాశం, చల్లని వాతావరణంతో పాటు అప్పుడప్పుడు జల్లులు లేదా తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
PALACE |జగన్.. అహంకారానికి నిదర్శనం..
PALACE | జగన్.. అహంకారానికి నిదర్శనం.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ మోహన్
జై అమరావతి నినాదంతో ముందుకెళ్లాం : లోకేష్
అమరావతి: దేవతల రాజధాని.. రైతుల త్యాగం.. అమరావతి అని ఎపి విద్యాశాఖ మంత్రి లోకేష్ కొనియాడారు. గత వైసిపి ప్రభుత్వం విధ్వంసం చేయాలని చూసిందని అన్నారు. 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదని, ఒక వ్యక్తి నివాసానికి రూ. 700 కోట్లు పెట్టి విశాఖలో ప్యాలెస్ కట్టారని విమర్శలు గుప్పించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి నినాదంతో ముందు కెళ్లామని తెలియజేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అని ఆనాడు పోరాటం చేశామని, జై అమరావతి అన్నందుకు వైసిపి ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. 631 రోజులు అమరావతి ఉద్యమం నడిపించిందని, 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 3 వేల మంది రైతులపై ఆనాడు కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని లోకేష్ పేర్కొన్నారు. స్త్రీశక్తి అంటే తనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి నిర్మలా సీతారామన్ అని ప్రశంసించారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యులకు సరైన సమాధానం చెబుతారని, వరుసగా 8 కేంద్ర బడ్జెట్ లు నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టారని అన్నారు. నిర్మలా సీతారామన్ జీవితం మనకు ఒక పాఠం అని లోకేష్ గుర్తుచేశారు.
Bollywood actor joins NTR and Neel Film
NTR and Prashanth Neel are joining hands to deliver one of the biggest action adventures and the shoot is happening currently. As per the recent development, Bollywood actor Anil Kapoor has joined the cast of the film and he will join the sets of the film in the upcoming schedule. Anil Kapoor is the lead […] The post Bollywood actor joins NTR and Neel Film appeared first on Telugu360 .
Chandrababu : తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాదేమోనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
అమరావతిలో బ్యాంకుల హబ్.. 25 ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ హాజరయ్యారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారి […] The post అమరావతిలో బ్యాంకుల హబ్.. 25 ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన appeared first on Visalaandhra .
ఏపీలో గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై నిషేధం ఎత్తివేత
కొత్త పంచాయతీల ఏర్పాటు, విలీనాలకు మార్గం సుగమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల విభజన, విలీనం, పునర్వ్యవస్థీకరణపై గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్నవాటిని సమీప పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పంచాయతీ ఎన్నికల […] The post ఏపీలో గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై నిషేధం ఎత్తివేత appeared first on Visalaandhra .
Pawan Kalyan : చంద్రబాబుతోనే అమరావతి అభివృద్ధి
అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు
Narsampet |ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో
Narsampet | ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో Narsampet | నర్సంపేట,
వారి కోసమే ఇందిరమ్మ క్యాంటీన్లు: పొన్నం
హైదరాబాద్: తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం కోసం ఇందిరమ్మ క్యాంటీన్ లలో అల్పాహారం, మధ్యాహ్న సమయంలో భోజనం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ ఎన్ టిపిసి వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుందని, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేయడం జరుతుందని వివరించారు.
వధువు వరుడిగా.. వరుడు వధువుగా రెడీ! #telugupost #viralmarriage #latestnews #viralvideo
Collector |పూలే బాటలో నడుద్దాం..
Collector | పూలే బాటలో నడుద్దాం.. మహనీయునికి నివాళిఅనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్
Supreme Court : పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్
పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది
YCP | మహానుభావుడు.. YCP | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ వైసీపీ
తిరుపతిలో నకిలీ సిఐ శివయ్య హల్చల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో నకిలీ సిఐ శివయ్య హల్చల్ చేశాడు. తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సిఐగా పనిచేస్తున్నా అంటూ హడావిడి చేశాడు. చినగొట్టిగల్లు మండలం జంగవాండ్లపల్లిలో ఓ జంట మధ్య రాజీ కేసులో స్టేషన్లో నకిలీ సిఐ శివయ్య హంగామా చేశాడు. అనుమానం రావడంతో శివయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో నకిలీ సిఐ బాగోతం బట్టబయలైంది. అన్నమయ్య జిల్లా కే.వి.పల్లి పోలీస్ స్టేషన్లో గతంలో శివయ్యపై రెడ్ శాండిల్ కేసు కూడా ఉంది. కలకడ మండలం పెద్దకమ్మపల్లి వాసిగా పోలీసులు అతడిని గుర్తించారు. గతంలో సిఐగా చెప్పుకుంటూ సెటిల్మెంట్లు, బెదిరింపులకు దిగాడు. పోలీసులు శివయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
CONGRESS |ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
CONGRESS | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా కొమ్మాయిగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి
Srilanka : శ్రీలంకలో వరదల బీభత్సం.. 56 మంది మృతి
శ్రీలంకలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
Brahmotsavam |అంజన్న బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం
Brahmotsavam | అంజన్న బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం Brahmotsavam | అచ్చంపేట, ఆంధ్రప్రభ
Hanmakonda |ఫూలే సిద్దాంతాలు సమాజానికి అనుసరణీయం
Hanmakonda | ఫూలే సిద్దాంతాలు సమాజానికి అనుసరణీయం ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే,
JOURNEY |పొగ మంచులో ప్రయాణం జాగ్రత్త…
JOURNEY | పొగ మంచులో ప్రయాణం జాగ్రత్త… సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూధన్
Bigg Boss 9 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్... భరణి దెబ్బకు అవుట్
బిగ్ బాస్ 9 సీజన్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
TDP| కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు టీడీపీ నేత సింగం సుబ్రహ్మణ్యం (బాపిచ్చ)
ప్రేమ కోసం లండన్ నుంచి వచ్చాడు... నిజామాబాద్ లో యువకుడు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని పురుగుల మంది తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమించిన అమ్మాయికోసం లండన్ నుంచి నిజామాబాద్ కు వచ్చాడు. అఖిల అనే యువతి మరో వ్యక్తిని పెళ్లిచేసుకోవటంతో శ్రీకాంత్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏర్గట్ల మండలం దొంచందా గ్రామానికి చెందిన ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ అనే యువకుడు ఆసుపత్రిలో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటనపై శ్రీకాంత్ః కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగాళాఖాతంలో దిత్వా తుపాను.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను ఏర్పాటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ాదిత్వా్ణ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ప్రస్తుతం ఈ తుపాను శ్రీలంక తీరానికి సమీపంలో, ట్రింకోమలీకి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో ఉన్న ఈ తుపాను, గడిచిన […] The post బంగాళాఖాతంలో దిత్వా తుపాను.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన appeared first on Visalaandhra .
GHMC లారీని ఢీకొట్టిన DCM #hyderabadnews #latestnews #telugupost #accidentnews #viralvideo
పొలంలో రూ.500 నోట్లను నాటాడు.. ఎందుకంటే? #TeluguPost #telugu #post #news
పసిపిల్లల చర్మం చాలా త్వరగా పొడిబారుతుంది (Dryness). వాళ్ల చర్మంలో సహజంగా ఉండే తేమ (Lipids) తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందుకే మీ బుజ్జాయి చర్మానికి సాధారణ లోషన్లు సరిపోవు. దీనికి ప్రత్యేకమైన సంరక్షణ కావాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిలో సెటాఫిల్ బేబీ లోషన్ (Cetaphil Baby Lotion) అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. మార్కెట్లో పిల్లల కోసం ఎన్నో రకాల లోషన్లు ఉన్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా చర్మ నిపుణులు (Dermatologists), చిన్నపిల్లల వైద్యులు […] The post Cetaphil Baby Daily Lotion: మీ చిన్నారి మృదువైన చర్మానికి 24 గంటల రక్షణ.. తల్లులు మెచ్చిన నంబర్ 1 ఛాయిస్! appeared first on Dear Urban .
రష్యా ఇం‘ధన’మే యుద్ధానికి ఆజ్యమా?
రష్యా నుంచి భారత్ వంటి దేశాలు చమురు కొనుగోలు పూర్తిగా మానేస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని, రష్యా దిగివచ్చి శాంతి ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. చమురు నుంచి వచ్చే పుష్కలమైన ఆదాయ వనరులతోనే ఆర్థికంగా బలం పెంచుకుని రష్యా ఉక్రెయిన్పై ఎడతెగని యుద్ధాన్ని కొనసాగిస్తోందని ట్రంప్ బాహాటంగా వెల్లడిస్తున్నారు. అంతేకాదు రష్యా లోని ప్రముఖ చమురు సంస్థలపై ఆంక్షలు కూడా విధించారు. ఈ ఆంక్షల ప్రభావం ఎంతవరకు యుద్ధాన్ని ఆపగలుగుతుందో చెప్పలేం. కానీ భారత్ మాత్రం ఈ ఆంక్షలతో చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. మాస్కో లోని రోస్నెఫ్ట్, లుకోయిల్ అనే భారీ చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంతో రష్యా నుంచి చవకగా చమురు కొనుగోలు చేయడం భారత్కు కష్టమవుతోంది. రష్యా కన్నా చవకగా మరే దేశం భారత్కు చమురు సరఫరా చేయడం లేదన్నది వాస్తవం. రష్యా నుంచి అందే చమురు సరఫరాలు భారత్ చమురు అవసరాల్లో 36 శాతం తీరుస్తున్నాయి. 2023 నుంచి రోజుకు అయిదు బిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు భారత్కు సరఫరా అవుతోంది. దీనివల్ల భారత్కు అదనపు ఖాతాలపై భారం చాలా వరకు తగ్గుతోంది. అయితే తాజాగా రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు రోజుకు 47 శాతం వంతున తగ్గిపోయాయి. అంటే అక్టోబర్లో రోజుకు 1.86 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి కాగా, ఈ నవంబరులో రోజుకు 9,82,000 బ్యారెళ్ల ముడి చమురు మాత్రమే దిగుమతి అయింది. దీన్ని బట్టి డిసెంబర్ జనవరి నాటికి దిగుమతులు మరింత ఎక్కువగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ స్వంత రిఫైనరీలు, రిలయన్స్ వంటి ప్రైవేట్ రిఫైనరీలు రష్యా నుంచి నేరుగా చమురు కొనుగోళ్లను తగ్గించి వేస్తున్నాయి. రిలయన్స్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని దాదాపు నిలిపివేసిందని చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు అమెరికా ఆంక్షల పరిధి లోకి రాని కంపెనీల నుంచి డిస్కౌంట్ ధరలకు చమురు సరఫరా చేస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో భారతీయ కంపెనీలు రష్యాకు బదులుగా పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాఫ్రికా, అమెరికా, కెనడా తదితర దేశాల వైపు తమ దృష్టిని మరల్చుతున్నాయి. ఏదేమైనా చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడడం మాత్రం మనకు తప్పడం లేదు. ఈ దిశలో రష్యాయేతర ఇంధన వనరుల సంస్థలతో చమురు వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచ చమురు మార్కెట్ ఇంధన నిల్వలతో సమృద్ధిగా ఉండటమే కాక, ధరలు కూడా తగ్గుముఖం పడతాయన్న అంచనా వస్తోంది. బ్రెంట్ ముడి చమురు ధరలు గత జనవరిలో బ్యారెల్కు 79 డాలర్లు ఉండగా, అక్టోబర్ నాటికి 64 డాలర్లకు పడిపోయాయి. అప్పటి నుంచి ధరలు నిలకడగా ఉంటున్నాయి. అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్కు బ్యారెల్కు 62.5 డాలర్లకు, 2026 మొదటి మూడు నెలల్లో 54 డాలర్లకు చమురు ధరలు ఇంకా పడిపోతాయని అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఇఐఎ) ముందస్తు అంచనా వెలువడింది. పెట్రోలు ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ, ఇఐఎ వంటి సంస్థలు ధరలపై వేటికవే అస్పష్టమైన అంచనాలు అందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ధరలు తగ్గితేనే రష్యా దారి లోకి వస్తుందన్న దృఢ నమ్మకంతో ఉంటున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగితే రష్యా చమురు సంస్థలపై మరిన్ని ఆంక్షలు అమెరికా విధించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ చమురు మార్కెట్ మరింత కట్టుదిట్టమై ధరలు అమాంతంగా పెరిగిపోవచ్చు. అలాంటప్పుడు భారత్ పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. అందుకని భారత్ ముందుచూపుతో ఒక్క రష్యాయే కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోక తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి. భౌగోళిక రాజకీయాలు చమురు ధరలపై విపరీత ప్రభావం చూపిస్తాయి. 88 శాతం వరకు పూర్తిగా ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత ఇంధన భద్రతకు ఇదో పెద్ద సవాలు. దేశీయ చమురు ఉత్పత్తిలో వివిధ కారణాల వల్ల ఏర్పడుతున్న క్షీణతను గమనించి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు భారత్ ముమ్మరం చేయవలసిన అగత్యం ఏర్పడుతోంది. చమురు ఉత్పత్తికోసం పెట్టుబడి పెట్టడంలో అవరోధకరమైన నిబంధనలు, అత్యధిక పన్నుల భారం, ఇవన్నీ సహజ చమురు క్షేత్రాలనుంచి ఉత్పత్తికి ఆటంకాలుగా పరిణమిస్తున్నాయి. ఈ అవాంతరాలను తొలగించుకోక తప్పదు. చమురు కోసం సముద్రగర్భ అన్వేషణ సాగించడంలో మనకు తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ప్రపంచ చమురు దిగ్గజం చెవ్రాన్ అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అల్ట్రా హై ప్రెజర్తో చమురు తవ్వకాలను కొనసాగిస్తోంది. ఇదివరకు ఉపయోగించే సామర్థం కన్నా మూడింతలు ఎక్కువతో అన్వేషణలో దూసుకెళ్తోంది. మెక్సికో జలసంధిలో గతంలో చమురు లభ్యం కాని క్షేత్రాలనుంచి ఇప్పుడు సమృద్ధిగా చమురును సేకరించగలుగుతోంది. అలాంటి మార్గదర్శకత్వంతో మనదేశ సముద్ర తీర చమురు పరిపక్వ క్షేత్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చమురు నిల్వలను వెలికి తీయగల ప్రముఖ చమురు సంస్థల దిగ్గజాలను ప్రోత్సహించే ప్రణాళికలను ప్రభుత్వం చేపడితేనే చమురు సంపాదనలో స్వయం సామర్థం పెరుగుతుంది. స్వయం సామర్థం పెరిగితేనే రష్యా వంటి దేశాలపై చమురు కోసం ఆధారపడవలసిన గతి తప్పుతుంది.
Shocker: Raj Tarun’s Film on OTT in a Week
Tollywood actor Raj Tarun has been struggling for success from the past few years. He released several films in the past few months and they ended up as debacles. His recent offering Paanch Minar, a comic entertainer released last Friday and the response has been disastrous. The film opened on a poor note and struggled […] The post Shocker: Raj Tarun’s Film on OTT in a Week appeared first on Telugu360 .
Cyber crime | 8 లక్షలు స్వాహా..
Cyber crime | 8 లక్షలు స్వాహా.. Cyber crime, మచిలీపట్నం, ఆంధ్రప్రభ
దీక్షా దివస్ గొప్ప చరిత్రాత్మకం
ప్రపంచంలో ఎన్నో పోరాటాలు జరిగాయి.. ఎన్నో చరిత్రలో చదువుకునే సాక్ష్యాలుగా ఉన్నాయి. అంతకు మించిన భారతదేశ పోరాట చరిత్రలో నవంబర్ 29 దీక్షా దివాస్ ఓ గొప్ప చారిత్రాత్మక రోజు. శాంతియుతంగా చేసిన పోరాటంలో తెలంగాణ ఉద్యమనేత కెసిఆర్ చావు చివరికి దాకా వెళ్లిన రోజు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ఢిల్లీ మెడలువంచి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడానికి మలుపు తిరిగిన రోజు.. భవిష్యత్తు చరిత్రలో ఎప్పటికీ ఓ గొప్ప రోజుగా సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. కెసిఆర్ ఆనాడు ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధంకాకపోయి ఉంటే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా పోయేది. అంతటి కుట్రలతో తెలంగాణ వాదాన్ని బలహీనపరిచే కుట్రలను పటాపంచలు చేసి గాంధేయ మార్గంలో తెలంగాణ ఆకాంక్ష సాకారం కావడానికి మలుపు తిప్పిన రోజు. దీక్షాదివాస్ ప్రపంచ పోరాటాలైనా.. భారతదేశ పోరాటాల చరిత్రలతో సమానంగా నిలిచిన రోజు. దీక్షా దివస్ లేకుంటే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరింత జాప్యం జరిగి ఉండేది. ఆ జాప్యాన్ని గ్రహించి తాను సచ్చినా... తెలంగాణ ఆకాంక్ష సాకారం కావాలని చరిత్రను మలుపుతిప్పిన రోజు నిజంగా ఎంతో గొప్పది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఓ అతి పెద్ద సవాల్.. ఏ రాజకీయ పార్టీ చేయని గొప్ప సాహసం నేటి బిఆర్ఎస్ చేసింది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకోసం ఎంత మంది రాజకీయ నాయకులు వచ్చినా.. సవాళ్ల ముందు నిలబడలేకపోయారు... అలాగే సావాసమూ చేయలేకపోయారు, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి పదవులను పొందారు. రాజకీయ అధికారాన్ని అనుభవించారే తప్ప తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడలేకపోయారు. దశాబ్దాల తరబడి అణువణువు తెలంగాణ ఆగం అవుతుంటే ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు.. తమ భవిష్యత్తు కోసం చూసుకున్నారే తప్ప తెలంగాణ భవిష్యత్తు తరాలకోసం ఏ మాత్రమూ ఆలోచన చేయలేదు. ఫలితంగా భారతదేశ చరిత్రలోనే భిన్నమైన సంస్కృతి గళ్ల తెలంగాణ.. ఏ స్వార్థం తెలియని తెలంగాణ ప్రజల బతుకులను అంధకారంలో నెట్టేసి తరతరాల సంపదను దోచుకున్నారు.. తెలంగాణ వాదం రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు ఓ అధికార వాదం అయిందే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షకు రూపం ఇవ్వలేకపోయారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో మహామహులమని చెప్పుకొనే రాజకీయ నాయకులు సైతం తెలంగాణ యెథల గడ్డకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేకపోయారు. ఒకవేళ ప్రశ్నిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం ఒకటైతే.. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను, సమైక్యాంధ్ర పాలకుల కుట్రలపై ఏనాడు సావాసం చేయలేకపోయారు. తెలంగాణ, కెసిఆర్ ఈ రెండు పదాలకు భిన్నమైన తేడా ఉండొచ్చు కానీ కెసిఆర్ లేకుంటే మాత్రం తెలంగాణ ఆకాంక్ష ఎప్పటికీ నెరవేరి ఉండేది కాదనడానికి అనేక సాక్ష్యాలు చరిత్రను గమనిస్తే అర్థం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణను పరిచయం అయ్యేలా చేసింది మాత్రం కెసిఆరే. తెలంగాణ నాటి పది జిల్లాలు పడుతున్న అనేక గోసలను ఏ పత్రికలు, ఏ సమైక్య పాలకునికి కళ్లకు కన్పించలేవు. అధికారం కోసం తెలంగాణను అడుక్కునేలా చేసి.. తెలంగాణ వేరు చేస్తే కోలుకోదనేలా తెలంగాణ ప్రకృతి సంపద, భౌగోళిక వ్యవస్థను అంతా ఛిన్నాభిన్నం చేసి ఓ ఎడారిలా మార్చారు. అటువంటి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న తరువాత పరిపాలన అంత సులువు కాదు అనే బెరుపుతో తెలంగాణ రాజకీయ నాయకులు కూడా రాష్ట్ర ఆకాంక్ష కోసం ముందుకు అడుగువేయలేని సవాళ్లు నాటి తెలంగాణలో.. అయినా ఉద్యమ నేత కెసిఆర్ తెలంగాణ ఆకాంక్ష కోసం ఉద్యమం ప్రారంభించిన నాడు అనేక సవాళ్లు.. రాజకీయ ఒత్తిడిలు, కుట్రలు.. అయినా అవేవి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేకపోయాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా కెసిఆర్ అనే మహాశక్తి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఓ వైపు రాజకీయ కుట్రలు అయితే, మరో వైపు విషపు రాతలతో తెలంగాణ ఉద్యమాన్ని ఆగం చేసే చర్యల వంటి ఎన్ని సవాళ్లు ఎదురైనా గులాబీ దళపతి వ్యూహాల ముందు అవేమీ పనిచేయలేకపోయాయి. తెలంగాణ అరవై ఏళ్ల గోసకు 14 ఏళ్ల మడమ తిప్పని పోరాటంతో ఓ పరిష్కారం లభించి రాష్ట్ర ఆకాంక్ష ఏర్పాటు అయింది. కెసిఆర్ ఓ పెద్ద రాజకీయ చాణక్యుడు, రాదనుకొని తెలంగాణ వాదాన్ని ఎందరో విడిచిపెట్టారు.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ అసాధ్యం అని ఉన్న తెలంగాణ సమాజానికి కెసిఆర్ తోనే రాష్ట్ర కల సాధ్యం అనే స్థాయిలో ఆయన పోరాటం నిలిచింది. అంతటి పటిమ, వ్యూహలు కలిగిన నాయకుడు కెసిఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించడమే మా అంతిమ లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడను అని మొండి పట్టుదలతో రాష్ట్రాన్ని సాధించారు కెసిఆర్. కెసిఆర్ తెలంగాణ నినాదాన్ని బలంగా మోయకుంటే రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ కోసం కెసిఆర్ చేసిన త్యాగం చరిత్రలో ఎప్పటికీ సువర్ణ అధ్యాయం. తెలంగాణ సాధించడం కోసమే రాజకీయ పార్టీని స్థాపించిన కెసిఆర్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని, సమైక్యపాలకుల కృత్రిమ కుట్రలను ఎదుర్కొని ఉక్కు మనిషిగా నిలబడ్డారు. దశాబ్దన్నర కాలం అలసిపోకుండా నడిపిన ఉద్యమం వల్ల రాష్ట్ర ఆకాంక్ష కల సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న రాజకీయ ఉద్యమంలో కెసిఆర్ను దెబ్బ కొట్టడానికి ఆనాడు చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావు. గులాబీ జెండాను లేకుండా చేయాలని చేసిన ప్రతీ కుట్రను ఛేదించి రాష్ట్రం సాధించడంలో కెసిఆర్ త్యాగం భవిష్యత్తులో ఎప్పటికీ చరిత్రే. తెలంగాణ వచ్చే వరకూ రాజీనామాలు చేస్తూ ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షను బలంగా తీసుకెళ్లిన పార్టీ నేటి బిఆర్ఎస్. తెలంగాణ కోసమే పుట్టి.. తెలంగాణ సాధించి ఆత్మగౌరవాన్ని పెంచింది. తెలంగాణలోని ప్రజల ఆవేదనలకు రూపమై కొట్లాడింది. అడుగడుగునా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టి సమైక్య పాలకుల కుట్రలను ప్రజలముందు ఉంచింది. తెలంగాణ పడుతున్న గోసను చట్టసభల ద్వారా ఈ భారతదేశానికి గొంతెత్తి విన్పించింది కెసిఆర్ నాయకత్వమే. కెసిఆర్ అనే మూడు అక్షరాల శక్తి తెలంగాణలోని అణువణువుపై అవగాహన పెంచుకొని తెలంగాణ యెథలను ఈ ప్రపంచానికి చాటారు. అప్పటి వరకూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేకపోయింది. ఫలితంగా తెలంగాణ గడ్డ చంటి బిడ్డలను అమ్ముకునే దుస్థితి ఒకవైపు అయితే.. వరకట్న చావులు, గల్ఫ్ వలసలు, ఒకటి రెండు కాదు పుట్టెడు శోకంతో తెలంగాణలోని ప్రతీ పల్లె గొల్లుమని ఏడ్చేది. ఏ మనిషిని కదిలించినా పచ్చికుండ లాంటి దుఃఖం గుండెల్లో దాచుకొని బతికిన దుర్భర పరిస్థితులను చూసింది తెలంగాణ. సంవత్సరాల తరబడి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణ దుఃఖాన్ని దూరం చేయలేకపోయాయి.ఇక సంక్షేమం అనేది తెలంగాణ ప్రజలకు దొరకని పరిస్థితి. అంతటి ఘోరమైన ఆవేదనలను కెసిఆర్ వచ్చే వరకూ ఎవరూ దూరం చేయలేకపోయారు. వాస్తవానికి తెలంగాణ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కనీస అవగాహన లేకపోవడం వల్ల తెలంగాణ ప్రజల యెథలను ఏ ప్రభుత్వం దూరం చేయలేకపోయింది. కెసిఆర్ ఉద్యమ జెండా పట్టుకొని తిరిగి చూసిన తెలంగాణ యెథలపై అవగాహన పెంచుకొని పదేళ్ల కెసిఆర్ పాలనలో పరిష్కారం చూపగలిగారు. తెలంగాణ పడుతున్న గోసలు తీర్చే మానవీయ పథకాలతో పదేళ్లు కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలిచారు. పుట్టిన చంటి బిడ్డ నుంచి పండు ముసలవ్వ దాకా వారి బాగోగులు చూసే సంక్షేమ పథకాలతో యెథలను దూరం చేశారు. విస్తారమైన బంగారం పండే భూములు ఉన్నా.. చుక్కనీరు రాక ఎండి నెర్రలు బారిన భూముల గొంతు తడిపేందుకు 70 వేల చెరువుల పునరుద్ధరణ చేసి భూగర్భ జలాలు పెరిగేలా చేసి తెలంగాణకు తాగు, సాగునీటి కష్టాలు తీర్చారు. తెలంగాణ లో డిగ్రీ విద్యకు కళాశాలలు లేని దుస్థితి నుంచి నేడు జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలతో తెలంగాణ బిడ్డలు పోటీ పడేలా గుణాత్మక మార్పు తీసుకువచ్చారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్కు వచ్చేలా పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారింది. పదేళ్ల కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రపంచంలో అత్యుత్తమమైన అవార్డులను, ప్రశంసలను అందుకుంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అనుసరించాయంటే కెసిఆర్ ప్రజాసంక్షేమ ఆలోచన ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల్లో బలమైన శక్తిగా ఉన్న బిఆర్ఎస్ను ఎదగనీయకుండా రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో కుట్ర పన్నాయనడంలో సందేహం లేదు. ఓ ఇంటికి తండ్రి దూరమైతే ఇల్లు దివాలా తీసినట్లు ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అలా తయారైంది. అణువణువు తెలంగాణ కోసం తెలిసిన కెసిఆర్ పాలనలోనే బాగుండేదని అటు మాట్లాడుతున్నారు. తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు అయిన బతుకమ్మను, తల్లి తెలంగాణ విగ్రహం నుంచి తొలగించడం, తదితర చిహ్నాలను మార్పుచేసి తెలంగాణలో పాశ్చాత్య సంస్కృతికి దారులు వేశారు. ఇటువంటి అనేకమైన ప్రజా అవసరాలకు ఉపయోగపడని నిర్ణయాలతో తెలంగాణ మరింత అప్రతిష్ట పాలుకు కారణం అవుతుంది. వీర చరిత్ర, త్యాగాల చరిత్ర ఉన్న తెలంగాణలో పాశ్చాత్య సంస్కృతికి తెరలేపారు. కెసిఆర్ను పదేపదే ద్వేషిస్తూ ఆయన త్యాగాన్ని చరిత్ర నుంచి కనుమరుగు చేయాలని కాంగ్రెస్ చూస్తున్నది.. కానీ కెసిఆర్ అనే మూడు అక్షరాల పేరు... ఈ భూమి ఉన్నంత వరకూ ప్రపంచ పోరాటాల చరిత్రలో ఆయన ఎప్పటికీ ఓ గొప్ప చరిత్రనే.. కెసిఆర్ తెలంగాణ తల్లి విముక్తి కోసం కన్న బిడ్డ.. ఆయనను ఈ పోరాటాల గడ్డ ఎప్పటికీ మరవదు. భవిష్యత్తులో కెసిఆర్ పాలనను తెచ్చుకోవడానికి ప్రజలు ఇప్పటినుంచే సిద్ధ్దమవుతున్నారు. - సంపత్ గడ్డం 78933 03516
రంగారెడ్డి జిల్లాలో కారును ఢీకొట్టిన బస్సు... దగ్ధం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. వాహనదారులు డ్రైవర్ ను సురక్షితంగా కాపాడారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి కారును బస్సు ఢీకొట్టింది. బస్సుకు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వికారాబాద్ నుండి శంకర్ పల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. శంకర్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.
Makthal | 30న పుష్కరిణి ప్రారంభోత్సవం
Makthal | 30న పుష్కరిణి ప్రారంభోత్సవం పూర్తి కావస్తున్న పనులు పరిశీలించిన మంత్రి
Temple |అయ్యప్ప వార్షికోత్సవ వేడుకలు…
Temple | అయ్యప్ప వార్షికోత్సవ వేడుకలు… అయ్యప్ప ఆలయ వార్షిక సన్నాహక సమస్యలు
Hyderabad : అఖండ ఎఫెక్ట్...నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
Donation|హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు రూ.2 కోట్లు విరాళం
Donation| హైదరాబాద్, ఆంధ్రప్రభ : హరేకృష్ణ మూవ్మెంట్, హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన
Naveen Polishetty |సింగర్ గా రాణించేనా..?
Naveen Polishetty | సింగర్ గా రాణించేనా..? Naveen Polishetty, ఆంధ్రప్రభ వెబ్
మహాత్మ అనే బిరుదు ఎవరికి పూర్తిగా సరిపోతుంది అని వెతికితే ఈ దేశంలో మొట్టమొదట కనిపించే పేరు జ్యోతిరావు ఫూలేది. ఆయన ఎందుకోసం మహాత్ముడయ్యాడు? ఎవరినైతే ఈ సమాజం హీనంగా చూసిందో ఫూలే వారిని అక్కున చేర్చుకున్నాడు. ఎవరికైతే చదువుకునే హక్కులేదని పండితులు గగ్గోలుపెట్టారో ఆ జాతికి చదువు చెప్పాడు. ఎవరినైతే ఇంటినుంచి బయటకు రారాదని శాసించి హింసించారో వాళ్లకు బయట ప్రపంచమేమిటో ఎలా ఉంటుందో చూపించాడు. ఆనాడు ఏ హక్కులూలేని మనుషులను మనుషులుగా చూసాడు. స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు ఉంటాయని భావించటం ఆనాడు ఒక పెద్ద నేరం. అలాంటి సందర్భంలో స్త్రీ హక్కుల కోసం గొంతు విప్పినవాడు ఫూలే. ప్రాచీనకాలంలో బుద్ధుడు, మధ్యయుగాల్లో వేమనల తరువాత ఒక జాతి మరొక జాతిమీద పడితింటూ వారినే అణచిఉంచే దుర్మార్గాన్ని ఎత్తిచూపిన ఆధునిక తొట్టతొలి భారతదేశపు విప్లవకారుడు ఫూలే. ఈ పని ఆయన కాలానికి ఎంత గొప్పదో ఆనాటి చరిత్రను చదివితే తెలుస్తుంది. ఫూలే అసమతుల్యమైన ఆనాటి చరిత్రను మార్చటానికి అనేక వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని పోరాడాడు. ప్రజలజీవితాలను శాసించేవి మతవిశ్వసాలు అని గుర్తించి వాటి మూలాలను అన్వేషించాడు. ఈ అన్వేషణా ఫలితంగానే గులాంగిరి, తృతీయ రత్న లాంటి విలువైన గ్రంథాలు పుట్టాయి. జనాభాలో సగానికిపైగా ఉన్న స్త్రీలు చదువు లేకపోవటం వల్ల, చైతన్యం లేకపోవటం వల్ల వెనుకబడిన సంగతిని గుర్తించి వారికోసం పాఠశాలలు నడిపాడు. ఈ దేశంలో ఆడపిల్లల కోసం మొట్టమొదటిసారిగా 1848 లోనే పాఠశాలలు పెట్టినవాడు ఫూలే. ఆడపిల్లలకు చదువు చెప్పటానికి మహిళా ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. ఎందుకంటే ఆడపిల్లలు చదివితే కుటుంబానికే కాకుండా ఊరికే అరిష్టమని ప్రచారం చేశారు ఆనాటి మతపెద్దలు. అందుకే మొదట తన భార్యకు చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది ఆడపిల్లలకు చదువు చెప్పించాడు. దీంతో ఆగ్రహించిన ఆనాటి పండిత లోకం ఫూలే దంపతులమీద అనేక రకాల దాడులకు తెగబడ్డారు. ఆయన తండ్రి ద్వారానే ఇంట్లో నుంచి గెంటివేయించారు. 1856 లోనయితే ఆయనను చంపే కుట్ర కూడా చేసారు. ఇవేవీ ఆయన దృఢ సంకల్పం ముందు నిలబడలేకపోయాయి. కిందికులాలు అన్ని రకాలుగా పీడింపబడటానికి కారణాలు కనిపెట్టాడు. కులం గురించి ఆనాటికే శాస్త్రీయమైన అవగాహనను ఆయన కలిగి ఉన్నాడు. మతం గురించి కూడా హేతుబద్ధంగా ఆలోచించాడు. సెప్టెంబర్ 24, 1873 నాడు సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు. పండితులు చెప్పే సత్యానికి అసలు సత్యానికి తేడా ఏమిటో ఈ సంఘం ద్వారా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేసాడు. సామాజిక సంస్కరణను ప్రధాన కర్తవ్యంగా స్వీకరించామని చెప్పుకున్న ఆనాటి కొన్ని సంస్థల అసలు స్వరూపాన్ని ఆయన బట్టబయలు చేసాడు. తన‘సత్ సార’ గ్రంథంలో వాళ్ళ మీద సహేతుక విమర్శలను ఎక్కుపెట్టాడు. తాను రాసిన ‘సార్వజనిక్ సత్యధర్మ’ అనే పుస్తకంలో ఆయా సంఘాలలో శూద్రులను, అంటరాని కులాల్ని ఎందుకు భాగం చేయటం లేదన్న ప్రశ్నలు వేసాడు. ఆయన రచనలన్నీ అనేక ప్రశ్నలతో నిండి ఉంటాయి. సంభాషణా శైలిలో రచనలు చేసి తన సమకాలీన ప్రజల హృదయాలలోకి వెళ్లగలిగాడు. భాష కూడా పండిత భాష కాకుండా ఆనాటి ప్రజలభాషను పట్టుకొని రచనలు చేసాడు. సాహిత్య లోకానికి సంబంధించి అది కూడా ఒక విప్లవమే. అంబేద్కర్, ఫూలే వేసిన ఇదే తోవలో మరింత సమర్థవంతంగా పనిచేసి ఈ దేశంలో ప్రజలందరికీ న్యాయం చేయగలిగాడు. సాహిత్య రంగంలోను, సామాజిక రగం లోను ఫూలేకి అసలైన వారసుడు ఈ దేశంలో అంబేద్కర్ మాత్రమే. ఈ క్రమంలోనే అంబేద్కర్ ఫూలేను తన గురుత్రయంలో ఒకనిగా గౌరవించాడు. తాను రాసిన ‘కులనిర్మూలన’ అన్న పరిశోధనాగ్రంథాన్ని ఫూలేకి అంకితమిచ్చాడు. జి.పి.దేశ్పాండే చెప్పినట్టు ఫూలే మొట్టమొదటి శూద్ర మేధావి. శూద్రులలో(బిసి) అతిశూద్రులలో (ఎస్సి) చైతన్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు.అంబేడ్కర్ను కేవలం దళితులకే నాయకుణ్ణి చేయటం ఎంత పొరపాటో, ఫూలేను కేవలం బిసిలకు మాత్రమే అంటగట్టడం అంతే పొరపాటు. ఫూలే ఈ రెండు వర్గాలకోసం పని చేసాడు. ఈ వర్గాలలోని కార్మికులు, రైతుల హక్కుల కోసం ఆలోచించాడు. ఈ నేపధ్యంలో వాళ్ల జీవితాలలో మెరుగుదల కోసం అప్పటి బ్రిటీషు ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేసాడు. అయితే మెజారిటీ ప్రజల జీవితాలు ఇలా ఎందుకు అణగారిపోయాయో అన్నదానిమీద ఆయనకు స్పష్టత ఉంది. బ్రాహ్మనిజం (ఈ పదం ఆయన వాడాడు) దీనికి కారణమని ఆయన అనేక రచనల్లో చెప్పాడు. కార్ల్ మార్క్ పాలకవర్గం, పాలిత వర్గం అని విభజించినట్టుగా ఫూలే కూడా దేశప్రజలను రెండు జాతులుగా విభజించాడు. ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోచుకుతింటున్న క్రమాన్ని గుర్తించి పీడిత వర్గం వైపు నిలబడి జీవితాంతం పోరాటం చేసాడు. ఈ పీడనను ధర్మబద్ధం చేస్తున్న మతవిశ్వాసాల పట్ల, ఆ సాహిత్యం పట్ల శత్రుత్వంతో నిలబడ్డాడు. కానీ అవన్నీ వదిలేసి ఫూలేను బిసి నాయకునిగా మాత్రమే చూడటంవల్ల జరిగే లాభం శూన్యం. ఆనాడు ఆయన ఏ అసమ వ్యవస్థతోనయితే పోరాడాడో అదే అసమ వ్యవస్థ ఈనాడు అనేక కొత్తరూపాల్లో కొనసాగుతూనే ఉంది. అది అలాగే కొనసాగినంత కాలం బిసిలకయినా, ఎస్సిలకయినా ఒనగూరేది శూన్యం. - తోకల రాజేషం, 9676761415 - నేడు మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్థంతి
PEDDUR |అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
PEDDUR | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా పెద్దూర్ జిపి సర్పంచ్ అభ్యర్థి
అతిపెద్ద వర్గం.. హక్కులకు దూరం
భారత రాజకీయ వ్యవస్థలో అతి పెద్ద వర్గం ఎవరు? అనడిగితే క్షణం ఆలస్యం లేకుండా చెప్పాల్సిన సమాధానం -బిసిలు. జనాభాలో 56 శాతం ఉన్నప్పటికీ హక్కుల్లో ఆరు శాతం కూడా రానివ్వని రాజకీయ జాలంలో బిసిలు చిక్కుకున్నది ఏ రోజునో ఎవరికీ గుర్తు లేదు. స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచీ 2025 వరకూ 78 సంవత్సరాలుగా దేశం ఎన్నో మార్పులు చూసింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ప్రవహించాయి, శాసనాలు వచ్చాయి, రాజ్యాంగ సవరణలు జరిగాయి, కానీ బిసి వర్గం మాత్రమే అన్యాయం అనే శబ్దానికి ప్రతీకగా మారిపోయింది. జనాభాపరంగా అతిపెద్ద వర్గమై ఉండటం రాజకీయ పార్టీలకు ఒక వరమైతే, వారి హక్కులు ఇవ్వకపోవడం అదే పార్టీలకు ఒక విధానంగా మారిపోయింది. బిసిల పరిస్థితి గంగలో ఆచమనం చేసినట్టు, గొప్ప మాటలతో ఆశలు చూపిస్తూ, కానీ అసలు హక్కుల వద్దకు రానీయకుండా, ఓట్లను మాత్రం కట్టిపడేసేలా చేస్తున్న అత్యంత వ్యవస్థీకృత రాజకీయ మాయాజాలానికి నిదర్శనం. దేశంలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు బిసిలు. వారు వ్యవసాయంలో పనిచేస్తారు, శిల్పకళల్లో పనిచేస్తారు, వృత్తుల్లో పనిచేస్తారు, పట్టణాల కార్మిక శక్తిలో పనిచేస్తారు. దేశంలోని ఉత్పత్తి వ్యవస్థలో వీరే వెన్నెముక. అయినా దేశపాలనలో వీరి స్థానమేంటి? శూన్యం. ఈ శూన్యం సాదాసీదా సంఖ్య కాదు, ఇది రాజకీయ, సామాజికంగా సద్దుమణిగించిన వర్గం చరిత్ర. ఎవరైనా బిసి నాయకుడు ఎదిగితే అది అతని వ్యక్తిగత పోరాటం, భగవద్గీతలో చెప్పిన స్వధర్మ యుద్ధం వంటిదే తప్ప, వర్గం మొత్తం ఎదిగిన కథ కాదు. ఎందుకంటే రాజకీయం ఈ వర్గాన్ని ఎప్పుడూ వ్యక్తుల వరకు పరిమితం చేసింది, వర్గం వరకు ఎప్పుడూ వెళ్లనీయలేదు. కారణం ఒకటే 56 శాతం వర్గం ఒక్కటైతే దేశ రాజకీయ సమీకరణం మొత్తం తలకిందులవుతుంది. జనగణన విషయంలోనే బిసిలపై ఎంత ఘోరమైన మోసం జరిగిందో భారత చరిత్రలో పెద్ద అధ్యాయమే. 1931లో చివరిసారిగా కులగణన జరిగి, 1941 లో యుద్ధ కారణంగా జరగక, ఆ తర్వాత స్వతంత్ర భారత్ ఒక శతాబ్దం జరిగిన దాకా కులగణన చేయించకుండా అడ్డుపడింది. ఎవరు అడ్డుపడ్డారు? రాజ్యాంగాన్ని కాపాడతామనే మాటలు చెప్పే జాతీయ పార్టీలు, వర్గ అభివృద్ధే తమ సిద్ధాంతమని చెప్పే ప్రాంతీయ పార్టీలు. ఎందుకు అడ్డుపడ్డారు? ఎందుకంటే నిజమైన సంఖ్య బయట పడితే, అంటే బిసిలు నిజంగా 56 శాతమని అధికారిక గణాంకం వెలువడితే వెంటనే రాజకీయ సమానత్వం కోరి ఒక మహాఉద్యమం వస్తుంది. ఇది పార్టీలు భరించలేవు. అందుకే బిసిల అసలు బలం గుప్తంగానే ఉంచారు. పార్లమెంట్లో బిసిల ప్రాతినిధ్యం ఇప్పటికీ 6-7 శాతం చుట్టూ తిరుగడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఎంత పెద్ద అపహాస్యమో చెప్పడానికి మాటలు చాలవు. స్వభావంలో బిసిలను అన్ని పార్టీలూ ఓటు బ్యాంకుగా చూసినప్పటికీ, అధికార పథానికి మాత్రం వీరిని దగ్గరకు రానీయలేదు. ప్రధానమంత్రి పదవి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, హోం మంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక పదవుల్లో బిసిలు అరుదైన అతిథులు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది నిర్మిత వ్యవస్థ. ఎస్సి, ఎస్టిలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు, ఎందుకంటే వారిని ప్రాతినిధ్యం కల్పించకపోతే రాజ్యాంగమే ప్రశ్నార్థకమవుతుంది. కానీ బిసిలకు మాత్రం రాజకీయ రిజర్వేషన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకు? ఎందుకంటే బిసిలకు రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన రోజు దేశ రాజకీయ భూకంపం తప్పదని ప్రతి పార్టీకి తెలుసు. 56 శాతం వర్గానికి సీట్లలో 50 శాతం కూడా వస్తే ఇక పార్టీలు, నాయకులు, పోలిటికల్ ఇంజినీరింగ్ అన్నీ మారిపోతాయి. జాతీయ పార్టీలు తమ తమ విధానాలతో బిసిలను మాయచేశాయి. కాంగ్రెస్ స్వాతంత్య్రం నుంచి 1990 వరకు బిసి అంశాన్ని పక్కనపెట్టింది. మండల్ కమిషన్ను ఏర్పాటు చేసి కూడా దాని సిఫార్సులను అమలు చేయలేక సిగ్గుపడిపోయారు. అది అమలు అయినది కూడా కాంగ్రెస్ వల్ల కాదు, రాజకీయ ఒత్తిడితో, ఓటు సమీకరణాలతో. బిజెపి 2014 తర్వాత బిసిలను పెద్ద వర్గంగా సంకలనం చేసుకున్నా, బిసిలకు రాజ్యాంగ హక్కులు ఇవ్వడంలో, రాజకీయ రిజర్వేషన్ విషయంలో, కులగణన విషయంలో అడుగులు వేయలేదు. బిసిలు పార్టీకి ముఖ్యమైన వర్గం, కానీ నిర్ణయ ప్రక్రియలో ప్రభావం చూపే వర్గం కావడం మాత్రం అనుమతించలేదు. ఇది మరో రూపంలోని మాయాజాలం. ప్రాంతీయ పార్టీల ఆట అయితే మరింత సుతిమెత్తగా, మరింత చురుకుగా సాగింది. ప్రతి రాష్ట్రంలో బిసి అనే నినాదం పెద్దగా వినిపిస్తుంది. టిక్కెట్లు ఇస్తామని, కుర్చీలు ఇస్తామని, కమిషన్లు వేస్తామని పెద్ద ప్రచారం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిసిలు సాధారణంగా మూడో, నాలుగో వరుసలో ఉంటారు. ముఖ్యమంత్రి పదవి బిసికి దక్కడం భారతదేశంలో ఓ అరుదైన సూర్యగ్రహణంలా మారిపోయింది. రాష్ట్రాల్లో కేబినెట్ శాఖల్లో ముఖ్య పదవులు సాధారణంగా ప్రాధాన్యత గల వర్గాలకు మాత్రమే. బిసిలకు లభించేది తక్కువ ప్రాధాన్యత గల శాఖలు, అదీ రాజకీయ అవసరాల కోసం మాత్రమే. ఒకసారి ఎన్నికల వరకు కావలసినట్లుగా బిసిలను పెద్ద ఎత్తున వాడుకుంటారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బిసిల సమస్యలు, వారి అభివృద్ధి, వారి విద్య, వారి ఉద్యోగాలు అన్నీ పార్టీలు మరచిపోతాయి. ఇకపైనా బిసిలకు నినాదాల కంటే హక్కులు కావాలి. మాటల కంటే అవకాశాలు కావాలి. కార్పొరేషన్ రుణాల కంటే రాజ్యాంగ హక్కులు కావాలి. బిసిలు ఈ దేశానికి వెన్నెముక అయితే, దేశ పాలనలో కూడా వెన్నెముకలా ఉండాలి. 56 శాతం వర్గానికి 6 శాతం హక్కులు సరిపోవు, సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి, న్యాయానికి ఇది అవమానం. ఈ అన్యాయాన్ని సరిదిద్దబోయే శక్తి పార్టీలలో లేదు, ఆ శక్తి బిసిలలోనే ఉంది. వారు తమ శక్తిని గుర్తించాలి, తమ హక్కులను స్వయంగా డిమాండ్ చేయాలి, తమను మాయచేసే రాజకీయ భాష్యాలను చీల్చి పారేయాలి. 78 ఏళ్ల మాయాజాలానికి ముగింపు పలకాలంటే బిసిల చేతుల్లో ఉన్న ఓటు శక్తి చైతన్యవంతమవాలి. మాకు హక్కులు ఇవ్వాలి అన్న స్వరం ఒక రాష్ట్రంలో కాదు, దేశమంతటా ఒకటిగా వినిపించాలి. అప్పుడే బిసిల 56 శాతం సంఖ్య కేవలం ఓటు సంఖ్య కాదు, రాజకీయ, సామాజిక ఆర్థిక, సమానత్వానికి బలమైన ఆజ్ఞగా మారుతుంది. ఇక దేశం బిసిలను ఓటుగా కాదు, పాలనా భాగస్వాములుగా గుర్తించాల్సిన కాలం వచ్చింది అనేది నగ్నసత్యం. - మన్నారం నాగరాజు, 9550844433
ఆ కాంగ్రెస్ ఎంఎల్ఎపై అత్యాచారం కేసు నమోదు... సిఎంకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
తిరువనంతపురం: కేరళలోని కాంగ్రెస్ ఎంఎల్ఎ రాహుల్ మామ్కుటత్తిల్పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. రాహుల్ తనపై అత్యాచారం చేయడంతో పాటు గర్భాన్ని తొలగించుకోవాలని బలవంతం చేయడంతో పాటు తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడని ముఖ్యమంత్రి పినరయ్ విజయ్కు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నామని, తనకు బిడ్డకావాలని పలుమార్లు కాంగ్రెస్ ఎంఎల్ఎ రాహుల్ బలవంతం చేశాడన్నారు. గర్భం దాల్చిన తరువాత అబార్షన్ చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని వివరించింది. తాను అబార్షన్ చేసుకోవడానికి వ్యతిరేకించడంతో తనని చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను రికార్డు చేసి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై రాహుల్ స్పందించారు. తాను ఇప్పటివరకు తప్పు చేయలేదని, కావాలని తనని ఇరిక్కిస్తున్నారని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటానని తెలియజేశారు. గతంలో రాహుల్ మామ్కుటత్తిల్ తననిపై లైంగికంగా వేధించాడని ఓ నటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనన లైంగికంగా వేధిస్తున్నాడని నటి రీని జార్జ్ ఇంటర్వూలో ఆరోపణలు చేసిన విషయం విధితమే.
WORKER | పెద్దపల్లిలో ప్రమాదం… పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఎన్
suicide|అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య..
suicide| బిక్కనూర్, ఆంధ్రప్రభ : కుటుంబ పోషణ కోసం చేసిన అప్పుడు తీర్చలేక
Heavy snow|పలు గ్రామాలలో దట్టమైన పోగ మంచు
Heavy snow| వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్
Vijayawada | భక్తుల కోసం.. Vijayawada, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : సామాన్య
Collector |రోడ్లు ఇలా ఉంటే ఎలా?
Collector | రోడ్లు ఇలా ఉంటే ఎలా? కలెక్టర్ మేడం ఈ రహదారి
జనవరి1న అందరం ఒకేసారి లొంగిపోతాం: మావోయిస్టులు
రాయ్పూర్: అందరం కలిసి ఒకేసారి లొంగిపోతామని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్గడ్-మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ ప్రతినిధి పేరుతో అనంత్ లేఖ విడుదల చేశారు. జనవరి-౧న ఆయుధాలను విడిచి లొంగిపోతామని వివరించారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని పేర్కొన్నారు. ఇప్పటికే హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ బలహీనమైంది. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగిపోయిన విషయం తెలిసిందే. మిగిలిన వారు లొంగిపోవాలని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామని, ఆయుధాలు ప్రభుత్వాలకు అప్పగించి పునరావాసాన్ని అంగీకరిస్తామని తెలియజేశారు. అందరం లొంగిపోయే వరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు. జనజీవన స్రవింతిలో కలిసేందుకు సమయం కావాలని గతంలో మావోయిస్టులు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Grain lorrys |జాతీయ రహదారిపై నిలిచిన లారీలు
Grain lorrys | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ జాతీయ రహదారిపై ఉన్న
అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా వానర. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘వానర‘ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ‘వానర‘ సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ అవినాశ్ తిరువీధుల ఆయన టీమ్ కష్టపడి చేసిన ‘వానర‘ సక్సెస్ కావాలి అని అన్నారు. హీరో, డైరెక్టర్ అవినాశ్ తిరువీధుల మాట్లాడుతూ “వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్ను రావణుడి లాంటి విలన్ తీసుకెళ్లిపోతే ఆ బైక్ ను తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడు, ఎలాంటి ఫైట్ చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ థ్రిల్ పంచుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిమాధవ్ బుర్రా, శంతను పత్తి, సుజాత సిద్ధార్థ్, శివాజీ రాజా, విశ్వజిత్, హర్ష ఛోటా కె ప్రసాద్, జానకీరామ్ పాల్గొన్నారు.
India Vs South Africa : వన్డే సిరీస్ ను అయినా కొట్టండి బాసూ
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీన రాంచీ వేదికగా తొలి వన్డే జరగనుంది

28 C