కోపరేటివ్ శాఖ అవగాహన సదస్సు.. వికారాబాద్, ఆంధ్రప్రభ : సహకార శాఖ ఆధ్వర్యంలో
నేడు ముంబైతో పోరు గౌహతి: ఐపిఎల్లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న రాజస్థాన్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇందులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ అద్భుత విజయం సాధించింది. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మ్యాచ్ను సొంతం చేసుకుంది. దీంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ముంబైలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. రెండు విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న ముంబై కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధహైంది.
మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు..
మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు.. వికారాబాద్, ఆంధ్రప్రభ
విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
నేడు విజయవాడలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 2026లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) టీమ్ వరుస ఓటములతో నిరాశ పరుస్తోంది. చెన్నై ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది.బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో అభిమానులు నిరాకు గురవుతున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అతని కెప్టెన్సీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆర్సిబి బ్యాటర్లు చెలరేగిపోతున్నా రుతురాజ్ పెద్దగా స్పందించలేదు. ఫీల్డింగ్, బౌలింగ్లో మార్పులు చేయడంలో విఫలం కావడంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ విధ్వంసక బ్యాటింగ్తో చెన్నై బౌలింగ్ను చిన్నాభిన్నం చేశాడు. అతన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక బౌలర్లు పూర్తిగా చతికిల పడిపోయారు. అంతకుముందు జరిగిన తొలి రెండు మ్యాచుల్లో కూడా చెన్నైకి పరాజయాలు తప్పలేదు. వరుస ఓటములు ఎదురవుతున్నా లోపాలను సరిదిద్దు కోవడంలో కెప్టెన్తో పాటు ఇతర ఆటగాళ్లు ఘోర వైఫల్యం చవిచూస్తున్నారు. ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో కెప్టెన్తో పాటు, జట్టు సభ్యులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుతురాజ్ బ్యాట్తోనే కాకుండా కెప్టెన్సీలోనూ తేలిపోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ ఆటగాడు సంజు శాంసన్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. మూడు మ్యాచుల్లోనూ శాంసన్ విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్లో కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. పేలవమైన బ్యాటింగ్తో నిరాశ పరుస్తున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. అయూష్ మాత్రె, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, ఓవర్టన్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ వంటి స్టార్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. రానున్న మ్యాచుల్లోనైనా చెన్నై తన ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారడం ఖాయం.
మండు వేసవిలో మంచు వాసనలు.. నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : నల్లగొండ మండలంలో
Revanth Reddy : నేడు కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం
నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు
అడవిలో రాత్రంతా తండ్రి మృతదేహంతో గడిపిన బాలుడు... ప్రియుడితో పారిపోయిన తల్లి
అమరావతి: ఓ బాలుడు ఏడుస్తూ గ్రామానికి వచ్చి తన తండ్రిని రాళ్లతో కొట్టి చంపేశారని చెప్పడంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా ఓ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తమిళనాడు రాష్ట్రానికి చెందిన గాంధీ(45), రాసాతి అనే దంపతులు చౌడేపల్లి మండలంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు సందీప్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రాసాతికి నరిసింహులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె భర్త, కుమారుడిని వదిలేసి ప్రియుడితో పారిపోయింది. వారు బోయకొండ యానాదిపాళ్యంలో ఉన్నట్లు తెలియడంతో గాంధీ తన కుమారుడితో కలిసి వారు వద్దకు వెళ్లాడు. భార్య నీ వెంట పంపిస్తామని గాంధీకి కొందరు నమ్మబలికారు. గాంధీ, అతడి కుమారుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అతడిని రాళ్లతో కొట్టి చంపారు. చీకటి కావడంతో తండ్రి మృతదేహం వద్దే కుమారుడు ఉండిపోయాడు. తెల్లవారుజామున మృతదేహం నుంచి రెండు కిలో మీటర్లు నడిచి గ్రామానికి చేరుకొని తన తండ్రిని చంపేశారని చెప్పాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
IPL 2026 : వర్షంతో నిలిచిన మ్యాచ్
కోల్ కతాలో ప్రారంభమయిన మ్యాచ్ వర్షంతో నిలిచిపోయింది
కర్నూలులో తహశీల్దార్ కేడర్లో తాత్కాలిక పదోన్నతులు..
కర్నూలులో తహశీల్దార్ కేడర్లో తాత్కాలిక పదోన్నతులు.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి
Amaravathi : అమరావతికి రాజముద్ర
అమరావతికి చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ఆమోదం లభించింది
Israel -Iran War : ఇరాన్పై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు…కాల్పుల విరమణకు ఇరాన్ ససేమిరా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్పై మరింత కఠిన హెచ్చరికలు జారీ చేశారు
విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలి..
విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలి.. రేగొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ,
Israel -Iran War : ఇరాన్ ప్రయాణంలో యుద్ధపు ముద్రలు.. అయినా సాధారణ జీవితం
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఆరోవారంలోకి ప్రవేశించింది.
డంపింగ్ యార్డ్లో భారీ అగ్నిప్రమాదం..
డంపింగ్ యార్డ్లో భారీ అగ్నిప్రమాదం.. చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకిరేకల్
హత్య కేసు ఛేదించిన పోలీసులు.. రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ పోలీస్ స్టేషన్
సర్పంచ్ సహా పలువురి పై కేసులు నమోదు..
సర్పంచ్ సహా పలువురి పై కేసులు నమోదు.. చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండలంలోని
7thAprilchintana |మంచీ–చెడు నాలుగు రకాల ప్రవర్తనలు..
7thAprilchintana | మంచీ–చెడు నాలుగు రకాల ప్రవర్తనలు.. 7thAprilchintana | వ్యక్తిత్వ అభ్యుదయానికి
7thAprileditorial |ట్రంప్ హెచ్చరికల పై ఇరాన్ తీవ్ర స్పందన..
7thAprileditorial | ట్రంప్ హెచ్చరికల పై ఇరాన్ తీవ్ర స్పందన.. 7thAprileditorial |
దుబాయి: పశ్చిమాసియా పరిణామాలు సోమవారంనాడు గంటగంటకూ మారుతూ ఉత్కంఠకు తెరలేపాయి. తాత్కాలిక యుద్ధ విరమణ ప్రతిపాదనలు.. తిరస్కారాలు.. పరస్పర హెచ్చరికలతో పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయోనని ఆసక్తిని రేపింది. కాల్పుల విరమణ, హర్మూజ్ను తెరవడం తదితర ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించినట్లు ప్రకటన వెలువడగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. సోమవారంనాడు ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇరాన్ను మంగళవారంనాడు ఆక్రమించుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. యావత్ ఇరాన్ తుడిచిపెట్టుకు పో యే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. ఒక్క రాత్రిలోనే ఆ దేశాన్ని మట్టుబెట్టగలమనారు. ఇరాన్పై ఇప్పటి వరకు వేలాది విమానాలను ప్రయోగించామని, అందులో ఒక్కటి మాత్రమే (ఎఫ్ 15) కూలిపోయిందని గుర్తు చేశారు. ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి తమ పైలట్ను కాపాడుకోగలిగామని, ఈ విజయాన్ని ఎవ్వరూ కాదలేరన్నారు. అత్యంత ప్రమాదకర గాలింపు చర్యల్లో తమ బలగాలు సత్తాచాటాయన్నారు. ప్రపంచంలో ఏదేశానికి లేని ఆయుధ సంపత్తి అమెరికాకు ఉందన్న విషయం మ రువొద్దన్నారు. హర్మూజ్పై డెడ్లైన్ ఒకసారి విధించిన తర్వాత మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని, మంగళవారంనాడు ఇరాన్పై దాడులు భారీగా ఉంటాయన్నారు. అంతకుముందు ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన వెంటనే ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ వైఖరి తమను నిరాశకు గురిచేసిందని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ నిర్వహించాల్సిన కర్తవ్యాలను నిర్వహిస్తే త్వరితగతిన యుద్ధం ముగిసిపోతుందని, కొన్ని నిర్దిష్టంగా చేయాల్సిన పనులేంటో వాళ్లకు తెలిసినవేనని వైట్హౌస్ వెలుపల మీడియాతో వ్యాఖ్యానించారు. మునుపటి పాలకుల కన్నా ప్రస్తుతం ఉన్నవాళ్లు చాలా విజ్ఞతతో ఆలోచిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు యుద్ధ విరమణ ప్రతిపాదనలపై వైట్హౌస్ కూడా స్పందించింది. ఎన్నో రకాల ఆచోచనల్లో అది ఒకటి అని పేర్కొంది. శాంతి ప్రతిపాదనలతో ముసాయిదా... మధ్యప్రాచ్య యుద్ధ విరమణ దిశలో సోమవారం అత్యంత కీలకమైన ముసాయిదా శాంతిప్రతిపాదన వెలువడింది. మధ్యవర్తిత్వ దేశాలు ఈజిప్టు, పాకిస్థాన్, టర్కీలు రూపొందించి ఈ ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్లకు పంపించాయి. 45 రోజుల పాటు యుద్ధ విరమణ, వెంటనే హర్మూజ్ జలసంధి తిరిగి తెరవడం వంటి కీలక అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాల అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియా సంస్థలకు వెల్లడించారు. తాత్కాలిక కాల్పుల విరమణతో ఇకపై శాశ్వత శాంతికి మార్గం ఏర్పుతుందని, ఈ 45 రోజుల సామరస్య ద్వారం మున్ముందు మంచి పరిణామాలకు దారితీస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్లకు పంపించామని నిర్థారించారు. అయితే తాత్కాలిక యుద్ధ విరమణకు తాము అంగీకరించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తిత దేశం పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తమ వైఖరిని తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ సోమవారంనాడు రాత్రి ప్రకటించింది. తాత్కాలిక యుద్ధ విరమణకు సిద్ధంగా లేమని, శాశ్వత యుద్ధ విరమణకే మొగ్గు చూపుతున్నట్లు ఇరాన్ కుండబద్ధలు కొట్టింది. ‘తాత్కాలిక కాల్పుల విరమణకు మేం సిద్ధంగా లేము. అందుకు ఒప్పుకోం’ అని కైరోలోని ఇరాన్ దౌత్యవేత్త మొజ్తాబా ఫిరదౌసి పౌర్ ‘అసోసియేటెడ్ ప్రెస్’తో వ్యాఖ్యానించారు. భవిష్యత్లో తమపై ఎలాంటి దాడులు జరగబోవనే షరతు సహా తదితర పటిష్టమైన హామీలతోనే తాము శాశ్వతంగా యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం యుద్ధం కొనసాగుతుందని చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు హర్మూజ్పై డెడ్లైన్ను బుధవారంనాటి వరకు పెంచుతూ ట్రంప్ ప్రకటించారు. అప్పటి వరకు ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు నిలిపివేస్తామని తెలిపారు. తాజాగా ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణ, హర్మూజ్ను తెరిచేందుకు ఒప్పుకోకపోవడంతో అమెరికా వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారింది.
7thApril2026 |మంగళవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
7thApril2026 | మంగళవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 7thApril2026 |
2029 వరకు జిల్లాల్లో మార్పుల్లేవ్
మన తెలంగాణ/ ఆదిలాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో 2029 వరకు జిల్లాలు, రెవె న్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చేయవద్దని కేంద్రం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలియజేశారు. అప్పటి వరకు జిల్లాల్లో ఎ లాంటి మార్పులు చేయలేమని స్పష్టం చేశారు. కేంద్రం ఆంక్షలు ఎత్తివేసిన తరువాత ప్రజల ఆకాంక్షల మేరకు హ ద్దులు నిర్ణయిస్తామని ప్రకటించారు. బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ‘ప్రజా పాలనప్రగతి బాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. విపక్ష ఎంఎల్ఎలను శత్రువులుగా చూసే ప్రభుత్వం మాది కాదని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలను సైతం ఆహ్వానిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ఎంఎల్ఎలు లేని నియోజకవర్గాలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నామ ని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశా రు. రాజకీయాలు కేవలం ఎన్నికల వర కే పరిమితం కావాలని, అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా అందరినీ క లుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అ భివృద్ధిపై ప్రభుత్వ ఉక్కు సంకల్పాన్ని చాటారు. కొమురం భీమ్ పోరాటస్ఫూ ర్తి ఉన్న ఈ నేలను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వా లు చేయని పలు వినూత్న నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలుచేస్తోందని ము ఖ్యమంత్రి వెల్లడించారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీనిపై ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్లు వ్యయం చేశామన్నారు. మహిళలను ప్రయాణికులుగానే కాకుండా బస్సుల యజమానులుగా మారుస్తున్నామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ వారికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయానికి హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రత్యేక విక్రయకేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పేదల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.5,400 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని 3.17 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, పేదల ఆహారభద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ను అభివృద్ధి హబ్గా తీర్చిదిద్దుతాం జిల్లా అభివృద్ధి దిశగా పలు కీలక ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి, ఆదిలాబాద్లో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర అనుమతులు సాధించామని తెలిపారు. వీలైతే జూన్ 2న శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాలో యూనివర్సిటీ స్థాపనకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని, భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని వెల్లడించారు. ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద పునఃప్రారంభించి, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాధాన్యం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అదేవిధంగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల సేవే ధ్యేయం తాము పాలకులం కాదని, ప్రజల సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి రెండు నెలలకోసారి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి అభివృద్ధి పనులను స్వయంగా సమీక్షిస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ప్రజల ఆశయాలకనుగుణంగా ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తదితరులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 30,149 స్వయం సహాయక సంఘాలకు ఎస్హెచ్జీ రూ.53.50 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. ఎంపిక చేసిన ఐదుగురు లబ్ధిదారులకు (కిష్టయ్య, రాధ, భాగ్య, పద్మ, సుబ్బ) ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఉత్తమ పాలన కనబరిచిన 5 గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ ఐఎస్వో సర్టిఫికేషన్లను అందజేశారు. సీఎం కప్ స్టేట్ ఛాంపియన్షిప్ ఆదిలాబాద్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏపీఓ యువరాజ్ మర్మట్, అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, శాసనసభ్యులు పాయల శంకర్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దళారులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట్ నియోజకవర్గ శాసనసభ్యులు తన్నీరు హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ సర్వేనెంబర్ 507, 508, 548లలో గత ప్రభుత్వం పండ్ల మార్కెట్ కోసం సుమారు 200 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి టీజీఐఐసీ పేరుతో కొన్ని బడా కంపేనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేయడంతో సోమవారం హరీష్రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్లతో కలిసి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి కోహెడ ప్రూట్ మార్కెట్ పరిరక్షణ భూ బాధితుల సమావేశంలో హరీష్రావు ప్రసంగించారు. రైతులు, ప్రజల మేలుకోరుతూ వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం పనులు చేయాలి కానీ దళారులు, వ్యాపారుల కోసం పనులు చేపట్టవద్దని మండిపడ్డారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం, ప్రజల ఆరోగ్యం దృష్టా, దూరదృష్టితో కొత్తపేట్లో ఉన్నటువంటి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను అంతర్జాతీయ హంగులతో ప్రణాళికాబద్ధంగా కోహెడలో ఏర్పాటుచేయాలనే ఉద్ధేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిని కేటాయించారన్నారు. జీవో 11 ద్వారా మార్కెట్ను నోటిఫై చేయడంతో పాటు డీపీఆర్ సిద్ధం చేసి 2023లో జీవో 216తో రూ.350 కోట్లను మార్కెటింగ్ శాఖ నుంచి కేటాయించినట్లు గుర్తుచేశారు. ఇదీ కాక గతంలో మార్కెట్ కోసం భూములు కోల్పోతున్న 150 మంది రైతులకు సుమారు రూ.10 కోట్లను నష్టపరిహారం అందజేశామన్నారు. మార్కెట్ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ దాహంతో ప్రాసింగ్ యూనిట్లు పెడతామని కల్లబొల్లి మాటలు చెప్పి, వివాదాల్లో ఉన్న దిల్ (దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) అనే సంస్థకు చెందిన భూములలో పండ్ల మార్కెట్ను ఏర్పాటుచేస్తున్నామని, రైతులను మభ్యపెడుతున్నారు. ఇదే దిల్ భూములపై హైకోర్టులో కేసున్నది. అదే భూములలో తమకు వాటా ఉన్నదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇన్ని సమస్యలున్న భూముల్లో మార్కెట్ ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్ల 6 నెలలు దాటినా ఎలాంటి కార్యరూపం దాల్చలేదని విరుచుకుపడ్డారు. టీజీఐఐసీ పేరుతో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని దళారులకు ధారాదత్తం చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు. అంతేగాక ఇటీవల కేరళ, చెన్నైలకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు ఈ భూములను సందర్శించినట్లు సమచారం ఉందన్నారు. ఏదేమైనప్పటికీ గతంలో కేటాయించిన పండ్ల మార్కెట్ స్థలంలో మార్కెట్ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ సహించదని, రైతులకు అండగా ఉంటూ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, వంగేటి లకా్ష్మరెడ్డి, సత్తు వెంకట రమణారెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, దండెం రాంరెడ్డి, రాం నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పన్ను ఎగవేత కట్టడికి రేవన్ పోర్టల్
మన తెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ శాఖలో డిజిటల్ సంస్కరణలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం యూనిఫైడ్ రెవె న్యూ పోర్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు స్టీరింగ్ కమిటీని నియమించింది. పన్నుల ఎగవేతను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. సిఎస్ నేతృత్వంలోని రెవెన్యూ శాఖ విభాగాల కార్యదర్శులతో ఈ అధ్యయన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆదాయం తెచ్చే శాఖలను కలిపి ‘రెవన్’ పోర్టల్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాఖల మధ్య డేటా మార్పిడి, పోర్టల్ రూపకల్పనపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. స్థానిక సంస్థలు, వినోదపు పన్ను వసూళ్లు, యూ పిఐ, పిఓఎస్ లావాదేవీలపై నిఘా పెట్టేలా కొత్త చట్టం ఏర్పాటు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. 30 రోజుల్లో ప్రాథమిక, 60 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఈ క మిటీని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జిఓ 81ని ప్రభుత్వ తరువాయి 9లో మొదటిపేజీ తరువాయి ఏరియా అండ్ అర్భన్ డెవలప్మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రవాణా అండ్ బిల్డింగ్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీల ప్రిన్సిపల్ సెక్రటరీ, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పురపాలక శాఖ సెక్రటరీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ, లేజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్ నుంచి న్యాయ శాఖ సెక్రటరీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కన్సల్టెంట్ల ఖర్చును భరించనున్న కమర్షియల్ టాక్స్ శాఖ ఈ స్టీరింగ్ కమిటీ సాష్ట్వేర్ వెండర్ ఎంపిక, డేటా భద్రత, ప్రైవసీని పరిశీలించనుంది. దీంతోపాటు పోర్టల్ గో-లైవ్ కోసం టైమ్లైన్ సిద్ధం చేయనుంది. ఇతర రాష్ట్రాల్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అమలుపై అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అవసరమైతే నిపుణుల కన్సల్టెంట్లను నియమించుకునే అధికారాన్ని కమిటీకి ప్రభుత్వం కట్టబెట్టింది. కన్సల్టెంట్ల ఖర్చును కమర్షియల్ టాక్స్ శాఖ భరించనుంది.
రొహింగ్యాలకు కాంగ్రెస్, బిఆర్ఎస్ రెడ్కార్పెట్
మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో దేశ భక్తులకు-దేశ ద్రోహులకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బెంగాల్లోని తమ బంధు, మిత్రులకు ఫోన్లు చేసి బిజెపికి ఓట్లు వేయించాలని హైదరాబాద్లోని బెంగాళీలకు ఆయన పిలుపునిచ్చారు. పాత నగరంలోని హైకోర్టు సమీపంలో గల మురళీధర్ ఆలయాన్ని సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు. ఆ తర్వాత బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో దాదాపు 60 వేల మంది బెంగాలీలు నివసిస్తున్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడున్న వాళ్ల బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి బిజెపికి ఓట్లు ఓటేయించాలని కోరుతున్నానని అన్నారు. బిజెపికి ఓట్లు వేయిస్తామని హైదరాబాద్లోని బెంగాలీ సమాజమంతా తనకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బెంగాల్లో మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘా తం కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రెడ్ కార్పేట్ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. బెంగాల్లో ఉండలేక అనేక బెంగాలీ కుటుంబీకులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారని ఆయన తెలిపారు. పాతబస్తీలోనూ బెంగాలీ కుటుంబాలు ఉండలేని విధంగా పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాలీ పిల్లలకు మజ్లీస్ డ్రగ్స్ ఎర పాతబస్తీలో కొంత మంది బెంగాలీ కుటుంబాల పిల్లలను మజ్లిస్ గూండాలు డ్రగ్స్ ఎరవేసి లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మజ్లిస్ గూండాల అరాచకాలకు పోలీసులూ వత్తాసు పలకడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు వెళ్లిన జిహెచ్ఎంసి అధికారులు, పోలీసులపై మజ్లిస్ ఎమ్మెల్సీ, నాయకులు అడ్డుకుని దౌర్జన్యం చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని ఆయన విమర్శించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఏప్రిల్ నెల రాష్ట్రం లో విచిత్రమయిన వాతావరణ పరిస్థితులకు బిం దువుగా మారింది. మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో చాలా ప్రాంతా ల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా చేరుకున్నా యి. పలు ప్రాంతాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో గా లులతో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎండ ల వేడికి ఆదివారం 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యధికంగా ఖమ్మం జిల్లా ల్లో 41.4 డిగ్రీలు నమోదయ్యింది. దీంతో పాటు రాబోయే మూడు రోజులు పా టు పలు జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుందని ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఇదే వాతావరణ శాఖ రాబో యే మూడు రోజుల పాటు ప లు జిల్లాల్లో అక్కడక్కడ వర్షా లు కురుస్తాయని వెల్లడించిం ది. గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉరుములతో కూడిన వర్షాలతో వాతావరణం చల్లబడింది. అయితే ఎండల తీవ్రత పెరగనుందని, ఏప్రిల్ 10 తర్వాత వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్’ హెచ్చరించారు. ఏప్రిల్ 10 తర్వాత ఉత్త ర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయని పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా వేడి పెరగనుందని, ఇక్కడ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని వెల్లడించారు. ఎండల తీవ్రత, వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ నిపుణులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తపడాలని కోరారు. మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం రెండు నుంచి మూడు డిగ్రీల మేర క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు
న్యూఢిల్లీ: ‘వన్ నేషన్, వన్ ఎలెక్షన్’, యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు దిశగా కేంద్ర ప్రభు త్వం చేపట్టిన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఈ అంశాలపై దేశవ్యాప్తంగా గంభీరమైన చర్చలు జ రుగుతూ సానుకూల పురోగతి సాధిస్తున్నామని ప్ర ధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు. బీజేపీ 47వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘వన్ నేషన్, వన్ ఎలెక్షన్’ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని మోదీ పేర్కొన్నారు. అలాగే వివాహం, దత్తత వంటి అంశాల్లో మత భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమలు చేయడమే యూసీసీ లక్ష్యమని వివరించారు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని 1994 లోనే బీజేపీ ముందుకు తీసుకువచ్చిందని గుర్తుచేసిన మోదీ, ప్రస్తుతం అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల్లో అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ చట్టాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన మోదీ, ఆ పార్టీ పాలనలో ఎమర్జెన్సీ వం టి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నామని, బీజేపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా ప్రాణత్యాగాలు కూడా చేశారని పేర్కొన్నారు.
మంగళవారం రాశి ఫలాలు (07-04-2026)
మేషం నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిధునం ఇంటాబయటా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటకం కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బుఅందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. కన్య నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తుల చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ధనస్సు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంబందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. మకరం కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. కుంభం నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
Trump Warning : ఒక్క రాత్రి చాలు Andhra Prabha News
Trump Warning : ఒక్క రాత్రి చాలు Andhra Prabha News (
బయటకు భోజనం చెద్దామని నమ్మబలికి యువకుడిని ఇంట్లో నుండి తీసుకువెళ్లిన అతని స్నేహితులు పాత కక్షలను మనసులో పెట్టుకొని యువకుడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పొలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.ఇన్స్పెక్టర్ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకా రం.. షాహీన్నగర్లో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్గా జీవనం కొనసాగిస్తున్న మహ్మద్ నసీర్(22)ను ఈనెల 5వ తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయంలో హోటల్లో భోజనం చెద్దాం అంటూ అతని స్నేహితులు మహ్మద్ దస్తగిరి,మహ్మద్ సుభానుద్దీన్లు హోండా యాక్టివా ద్విచక్రవాహనంపై ఇంటి నుండి తీసుకువెళ్లారు.కాగా అదేరోజు అర్ధరాత్రి సుమారు 12:45 గంటల సమయంలో షాహీన్నగర్లోనే నివసించే మరో యువకుడు నసీర్ మేనమామ మహ్మద్ ఆరిఫ్ వద్దకు వచ్చి వాదే హీ సాలెహీన్ ప్రధానరోడ్డుపై గల హబీబ్ హోటల్ వద్ద గల ఖాళీస్ధలంలో నసీర్ మరణించి ఉన్నాడని సమాచారం ఇచ్చాడు,దీంతో హుటాహుటిన సంఘటనస్ధలానికి చేరుకున్న ఆరిఫ్ అతని మేనల్లుడు నసీర్ మెడ,నడుంలపై 5,6 కత్తిపోట్లకు గురికావడంతో పాటు తలపై సిమెంట్ రాయితో బలంగా మోదడంతో రక్తం మడుగులో పడి మృతిచెందినట్లుగా గుర్తించాడు.అనంత రం 6 న మధ్యాహ్నం మహ్మ ద్ దస్తగిరి,మహ్మద్ సుభానుద్దీన్,మహ్మద్ ఇలియాస్, మ హ్మద్ నదీంఖాన్లు తన మేనల్లుడితో ఉన్న పాతకక్షలను మనసులో పెట్టుకొని అతనిని హత్యం చేశారని పేర్కొంటూ ఆరిఫ్ తమకు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Irgc Chief Killed : మజీద్ ఖాదేమి ఖతం Andhra Prabha News
Irgc Chief Killed : మజీద్ ఖాదేమి ఖతం Andhra Prabha News
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క
కేరళలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్కి ఓటువేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ఇంటింటి ప్రచారం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మంత్రి సీతక్క వెంట కేరళ ఎన్నికల ప్రచారంలో ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఆయా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, తదితరులు ఉన్నారు.
మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం రెండు నుంచి మూడు డిగ్రీల మేర క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఎంటర్ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 2026 కు ముఖ్యఅతిథిగా కెటిఆర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్కు అరుదైన ఆహ్వానం లభించింది. బెంగళూరు వేదికగా అత్యంత వైభవంగా జరగనున్న ‘’ఎంటర్ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 2026” వేడుకకు ఆయనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. నవ కల్పనలు, పారిశ్రామిక వృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. వచ్చే ఏప్రిల్ 16వ తేదీన బెంగళూరు వైట్ఫీల్డ్ని షెరటన్ గ్రాండ్ హోటల్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్లో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 300 మందికి పైగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, అంకుర సంస్థల (స్టార్టప్) వ్యవస్థాపకులు, వ్యాపార రంగ నిపుణులు ఒకే వేదిక పైకి రానున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న దార్శనిక నాయకులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. సాంకేతికత, ఆవిష్క రణలు, ఆర్థికాభివృద్ధి రంగాల్లో కెటిఆర్ చూపిన డైనమిక్ నాయకత్వాన్ని నిర్వాహకులు ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ఐటి, పరిశ్ర మల శాఖ మంత్రిగా ఆయన హయాంలో తీసుకువచ్చిన ప్రగతిశీల విధానాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి దేశవ్యాప్తం గా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చాయని ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించాలని, ఆయన మాటలు భావి పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని నిర్వాహక ప్రతినిధులు కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను ఇన్నోవేషన్ హబ్గా మార్చడంలో కెటిఆర్ పోషించిన కీలక పాత్రకు, పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన కృషి నేపధ్యంలో ఈ ఆహ్వానం దక్కింది.
Us Rejects Ceasefire : అమెరికా సైతం.. Andhra Prabha News
Us Rejects Ceasefire : అమెరికా సైతం.. Andhra Prabha News (
కోల్కతా, పంజాబ్ మ్యాచ్కు వరుణుడి ఆటంకం
ఐపిఎల్ సీజన్ 2026లో భాగంగా సోమవారం కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించాడు. టాస్ గెలిచిన కోల్కతా టాస్ ఎంచుకుంది. అయితే కోల్కతా స్కోరు 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు ఉన్నప్పుడు వర్షం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా మారింది. అంతేగాక వర్షం తగ్గక పోవడంతో ఆటను నిలిపి వేశారు. పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారు. ఒకవేళ వర్షం తగ్గితే కనీసం ఐదు ఓవర్ల పాటు ఆటను కొనసాగించాలని భావిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఆట ప్రారంభమవుతుందా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఒకవేళ వర్షం ఆగిపోయి మైదానం ఆటకు అనుకూలంగా మారితే ఇరు జట్లకు ఐదేసి ఓవర్ల మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది.
Big Discussion: Trisha to Quit Films?
It is a long career for actress Trisha. Apart from Tamil, the actress has done films in Telugu. Her second innings has been going extremely well and Trisha is even demanding big remuneration. She is recently in news for wrong reasons and she is linked up with actor Vijay. After Vijay’s wife filed for divorce, […] The post Big Discussion: Trisha to Quit Films? appeared first on Telugu360 .
బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల మంది పేర్లు తొలగింపు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన విస్తృత సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి దాదాపు 90 లక్షల పేర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. తొలగించిన మొత్తం పేర్లలో, ఫిబ్రవరి 28న ప్రచురించిన తుది జాబితా నుంచి సుమారు 63 లక్షల పేర్లను తీసివేయగా.. విచారణ అనంతరం అదనంగా 27 లక్షల పేర్లను తొలగించారు. పరిశీలన తర్వాత న్యాయాధికారులు ఆమోదించిన కేసులను మాత్రమే ఓటర్ల జాబితాలో ఉంచినట్లు లేదా తిరిగి చేర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు పెండింగ్లో ఉన్న కేసులను ఈ ఎన్నికల జాబితాలో చేర్చబోమని, వాటిని తదుపరి ఎన్నికలలో చేర్చేందుకు పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
Investment Scam: రూ.9.6 లక్షలు మోసం.. పెట్టుబడి పేరుతో మహిళకు టోపీ
యాప్ రుణాలు తీసుకుని పంపించిన బాధితురాలుడబ్బు అడిగితే స్పందించని ఇద్దరు వ్యక్తులు
భారత్ కు రెండు వంటగ్యాసు నౌకలు
ఉద్రిక్తతల నెలవైన హర్మూజ్ జలసంధి నుంచి సోమవారం రెండు భారతీయ పతాక ఎల్పిజి ట్యాంకరు నౌకలు సురక్షితంగా ఈ కీలక మార్గాన్ని దాటాయి. భారత్ మరికొన్ని మిత్రదేశాలకు హర్మూజ్ ప్రవేశానికి ఇరాన్ సమ్మతించిన దశలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వంటగ్యాసుతో బయలుదేరిన గ్రీన్ సాన్వి నౌక 46650 టన్నుల ఎల్పిజితో ఈ నెల 7వ తేదీన భారతీయ రేవుకు చేరుకుంటుంది. ఇక 15500 టన్నుల వంటగ్యాసు సరుకుతో ఉన్న గ్రీన్ ఆశా ట్యాంకర్ నౌక ఈ నెల 9న ఇక్కడి పోర్టుకు వస్తుంది. ఈ విషయాలను కేంద్ర రేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగల్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నౌకల రాకతో దేశంలో వంటగ్యాసు కొరత కొంత మేర తీరే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ జలసంధి మీదుగా భారతీయ పతాకలతో మరో 16 నౌకలతో పాటు మొత్తం 433 మంది నావికులు ఈ ప్రాంతంలో ప్రయాణం కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత గల్ఫ్ యుద్ధ భయాల దశలో భారతీయ సముద్ర మార్గ కార్యకలాపాలు సురక్షితంగా, అవిచ్ఛిన్నంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
మాజీ సిఎం కుమారుడికి యావజ్జీవ ఖైదు
చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగికి 2003 నాటి హత్యకేసులో యావజ్జీవ ఖైదు శిక్ష వెలువడింది. ఎన్సిపి ప్రముఖ నేత రామావతార్ జగ్గి హత్యోదంతంలో రాష్ట్ర హైకోర్టు సోమవారం ఈ తీర్పు ప్రకటించింది. అంతకు ముందు ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. అయితే కేసు పూర్వాపరాల విచారణ తరువాత హైకోర్టు 2007 నాటి ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసింది. రు. జీవిత ఖైదు విధించిన తరువాత అజిత్ జోగి మూడువారాలలో సరెండర్ కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి, రాజకీయాల్లోకి వచ్చిన వ్యాపారి రామావతార్ జోగిని 2003 జూన్ 4వ తేదీన రాయ్పూర్లో కాల్చి చంపారు. అప్పుడు అజిత్ జోగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయ కుట్రతోనే ఈ హత్య జరిగిందని పేర్కొంటూ ఈ కేసులో జోగితో పాటు పలువురిని నిందితులుగా చేర్చారు. 2007లో సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 28 మందిని దోషులుగా ఖరారు చేసింది. వారికి యావజ్జీవ శిక్షలు విధించారు. అయితే అమిత్ జోగిని నిర్దోషిగా ప్రకటించారు. ఈ తీర్పును సిబిఐ ఉన్నసవాలు చేసింది. దీర్ఘకాలిక వాద ప్రతివాదాలు, విచారణ తరువాత ఇప్పుడు రెండు దశాబ్దాలపై దశలో హైకోర్టు తీర్పు వెలువడింది.హైకోర్టు తీర్పు పట్ల రామావతార్ జగ్గి కుమారుడు సతీష్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా వేచిచూసిన న్యాయం ఇప్పటికి దక్కిందని , ఇప్పుడు తన తండ్రికి నిజమైన నివాళి అందిందని స్పందించారు. తీర్పును స్వాగతించారు.
45 Days Iran Rejects : కాల్పుల విరమణకు నో .. Andhra Prabha News
45 Days Iran Rejects : కాల్పుల విరమణకు నో .. Andhra
బెంగళూరు నుంచి సికింద్రాబాద్ ఊపిరితిత్తులు
ఓ వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా అవసరమయిన ఊపిరితిత్తులను అత్యవసరం పరిస్థితుల్లో సోమవారం బెంగళూరు నుంచి సికింద్రాబాద్కు తీసుకొచ్చారు. దీని కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి రవాణాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంది. రవాణా కోసం ఎయిర్ అంబులెన్స్లో ప్రత్యేక వైద్య బృందం ఊపిరితిత్తులతో బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడి నుంచి సికింద్రాబాద్లోని కిమ్స్ వైద్యశాలకు ఊపిరితిత్తులను తరలించారు. అయితే ఉపిరితిత్తులను తరలిచేందుకు ప్రత్యేకమయిన అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పోలీసులు శంషాబాద్ విమనాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో గ్రీన్ చానల్ను ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వెళ్లే ప్రయాణ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టడంతో కేవలం 25 నిమిషాల్లోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ వైద్యశాలకు ఊపిరితిత్తులు సురక్షితంగా చేరుకున్నాయి.
గ్యాస్ లేదు... పండ్లతో బతుకుతున్నాం : సిపిఐ నారాయణ
వంటగ్యాస్ కొరత, పెరుగుతున్న ధరలపై సిపిఐ జాతీయ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గంభీరమైన రాజకీయాలను చమత్కారంతో మేళవించడంలో పేరుగాంచిన నారాయణ, ఒక వ్యంగ్య వ్యాఖ్య ద్వారా సామాన్యుల కష్టాలను ఎత్తి చూపారు. ఇంట్లో వంటగ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల తాను వంట చేసుకోలేకపోతున్నానని, ‘పండ్లతోనే బతకాల్సి వస్తోందని‘ ఆయన అన్నారు. ‘లంకలోని బాపనయ్యలా‘ హాస్యభరితంగా ప్రారంభిస్తూ,నారాయణ ‘గ్యాస్ లేదు... పరిస్థితి లంకలోని బాపనయ్యలా తయారైంది‘ అని వ్యాఖ్యానించారు. గ్యాస్ లేకుండా టీ, కాఫీ చేసుకోవడం కూడా అసాధ్యంగా మారిందని, పండ్లపై ఆధారపడటం తప్ప మరో మార్గం లేదని ఆయన వివరించారు. ఇది కేవలం తన పరిస్థితి మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు.
పలు రాష్ట్రాల్లో ఉగ్ర దాడులకు కుట్ర.. ముగ్గురు అరెస్ట్
చండీగఢ్: పంజాబ్ లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో లింక్ ఉన్న ఓ ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఛేదించింది. ఈ ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రెండు హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు ఒక పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పట్టుబడిన గ్రెనేడ్లపై పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (పీఓఎఫ్) గుర్తులు ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ చెప్పారు. అరెస్టు అయిన వారిని తార్న్ తారన్లోని అమ్మిషా గ్రామానికి చెందిన సరబ్జిత్ సింగ్, అమృత్సర్లోని నంగల్ పన్నువాన్ గ్రామానికి చెందిన బిక్రమ్జిత్ సింగ్, అమృత్సర్లోని ఇంద్ర కాలనీకి చెందిన అమన్దీప్ సింగ్గా గుర్తించారు. పోలీసుల ప్రకారం.. ఐఎస్ఐతో సంబంధమున్న ఈ ముఠా పలు రాష్ట్రాల్లోని పోలీసు సంస్థలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మూఠాలోని మిగత వారిని గుర్తించి, వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఆర్టెమిస్2 చంద్రయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నలుగురు వ్యోమగాములు ‘ఒరాయన్ ’వ్యోమనౌకలో చంద్రుడి గురుత్వాకర్షణ పరిధి లోకి ప్రవేశించారు. ప్రత్యేకంగా తయారు చేసిన నాలుగు అద్దాల కిటికీల్లోంచి బయటికి అంతరిక్షం లోకి తొంగి చూస్తుంటే చంద్రుడు మెలమెల్లగా చేరువవుతున్నట్టు, భూమి దూరంగా జరిగిపోతున్నట్టు వీరికి కనిపిస్తోంది. వ్యోమగాములు జాబిల్లిని చేరుకునే క్రమంలో మూడింట రెండొంతుల ప్రయాణం పూర్తయింది. వీరిని తీసుకెళ్లిన ఒరాయన్ వ్యోమనౌక 4,06,773 కి.మీ దూరం ప్రయాణించి అత్యంత సుదూర మానవ అంతరిక్షయాత్రగా రికార్డు సృష్టించింది. నలుగురు వ్యోమగాములు సోమవారం రాత్రి 23.47 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువ జామున 4.17 గంటలకు చంద్రుడి వెనుక వైపునకు వెళ్తారు. గతంలో 1970లో అపోలో 13 ప్రయాణించిన దూరం కంటే ఇది 2500 కిమీ అదనం కావడం గమనార్హం. ఈ క్రమంలోనే “లూనార్ ఫ్లైబై” దశ చోటు చేసుకోనుంది. ఆ విన్యాసంతో ఒరాయన్, చందమామను దాటి 6400 కిమీ దూరం వెళుతుంది. ఈ సమయంలో మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుడి రెండో పార్శాన్ని వ్యోమగాములు క్లిక్మనిపిస్తారు. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తి చేశాక ఈ వ్యోమనౌక భూమి వైపు మళ్లుతుంది. ఈనెల 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ ఉండవచ్చు.
జోగినపల్లి సంతోష్ కుమార్కు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ నిర్వాహకులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్కు ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం దక్కింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్లో ఏప్రిల్ 17న ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో ’ఇగ్నైటింగ్ మైండ్స్’ నిరంతర కృషి చేస్తున్నది. ముఖ్యంగా సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘హరా హై తో భరా హై‘ (ఆకుపచ్చగా ఉంటేనే సిరిసంపదలు) నినాదంతో ముందుకొచ్చిన ’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ దేశవ్యాప్తంగా పర్యావరణ బాధ్యతను ఒక సత్సంప్రదాయంగా మార్చింది. విద్యార్థులు, యువత, రైతులు, సామాన్యుల నుంచి జాతీయ స్థాయి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ ఉద్యమంలో భాగస్వాములై మిలియన్ల కొద్దీ మొక్కలు నాటారు. లండన్లో వేడుక పర్యావరణ పరిరక్షణ,సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై పోరాడుతున్న ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించి వారికి పురస్కారాలు అంది స్తున్న బ్రిటన్ సంస్థ హెలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్ ఏప్రిల్ 17న అంతర్జాతీయ కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ లారడ్స్ లో సంతోష్ కుమార్ కు ’గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ పురస్కారాన్ని అందజేస్తారు. సమిష్టి కృషికి దక్కిన గౌరవమిది ఈ గౌరవం పట్ల జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తన ఒక్కడికి దక్కిన గౌరవం కాదని, పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపుపై ’ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్’ స్పందిస్తూ డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ఆదర్శాలతో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి భావితరాలకు పచ్చని భూమిని అందించడమే తమప్రధాన లక్ష్యమని పేర్కొన్నది.
అమీర్పేట్లో స్క్రాప్ వ్యాపారి ఆత్మహత్య
ఇంటి కొనుగోలు విషయంలో మోసపోయానని మనస్థాపం చెందిన స్క్రాప్ వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీర్పేట్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సారపాకకు చెందిన ప్రవీణ్కుమార్ రెడ్డి(42) నగరంలోని అమీర్పేట్లో భార్య, పిల్లలతో కలిసి ఉంటూ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితుడు ఇటీవల వనస్థలిపురంలో రూ.3.5కోట్లకు ఇంటిని కొనుగోలు చేశాడు. డబ్బులు చెల్లించి, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నకిలీ పత్రాలతో ఇంటిని విక్రయించినట్లు బాధితుడికి తెలిసింది. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్కుమార్ రెడ్డి భార్యకు సూసైడ్ నోట్ రాశాడు, తనకు వ్యాపారంలో రూ.6.8కోట్లు రావాల్సి ఉందని అందులో పేర్కొన్నాడు. బేగంపేటలోని రెనెక్సా టవర్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఉన్న చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకునే కంటే ముందే భార్యకు లొకేషన్ పంపించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.
Dacoit is a romantic thriller with great emotional core – Adivi Sesh
Adivi Sesh is bringing a pan-India action-romantic thriller titled Dacoit to the theaters on April 10. Directed by debutant Shaneil Deo, the film features Mrunal Thakur as the leading lady and includes Anurag Kashyap in a key role. The movie is presented by Annapurna Studios, produced by Supriya Yarlagadda, and co-produced by Sunil Narang. Sesh […] The post Dacoit is a romantic thriller with great emotional core – Adivi Sesh appeared first on Telugu360 .
Photos : Bad Boy Karthik Movie Trailer Launch Event
The post Photos : Bad Boy Karthik Movie Trailer Launch Event appeared first on Telugu360 .
మదురై కోర్టు సంచలన తీర్పు… 9 పోలీసులకు మరణశిక్ష #MaduraiCourt#CustodialDeath#JayrajBeniks
Janhvi |జాన్వీ కపూర్ అమాయక చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు
Janhvi | జాన్వీ కపూర్ అమాయక చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు Janhvi
అమ్మవారికి బంగారు డైమండ్ సూత్రాల విరాళం..
అమ్మవారికి బంగారు డైమండ్ సూత్రాల విరాళం.. 22 గ్రాముల బంగారు ఆభరణం సమర్పణరూ
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం: సిఎం రేవంత్
ఆదిలాబాద్ జిల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వం మీద పోరాడిన వీరులు అంటూ సిఎం రేవంత్ పొగిడారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” భహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. జల్ జంగల్ నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీమ్ గడ్డ ఇది అని, అలాంటి ఆదివాసీ వీరులు.. నిజాం నిరంకుశత్వంపై పోరాడారని అన్నారు. అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్ ను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయాలని ప్రేం సాగర్ రావు అనేవారని చెప్పారు. ఆదిలాబాద్ కు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈ వేదికగా మాట ఇస్తున్నా.. పెండింగ్ లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో కేంద్రంతో మాట్లాడి ఎయిర్ పోర్ట్ మంజూరు చేయించాం. త్వరలోనే.. వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆదిలాబాద్ లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తాం. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. ప్రేం సాగర్ రావు గారి అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతీ రెండు నెలలకోసారి ఈ జిల్లాకు వస్తూనే ఉంటా.. నిధులు తెస్తూనే ఉంటాం.పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనేది మా ప్రయత్నం. మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం అని సిఎం రేవంత్ అన్నారు.
యడ్లపాడులో నాటికల మహోత్సవం ఘన ముగింపు…
యడ్లపాడులో నాటికల మహోత్సవం ఘన ముగింపు… పోటాపోటీ ప్రదర్శనలు – అందరికీ న్యాయం
పోలీస్ గ్రీవెన్స్కు 101 ఫిర్యాదులు…
పోలీస్ గ్రీవెన్స్కు 101 ఫిర్యాదులు… విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం :
YSRCP’s 2029 Chances Depend on Alliance Dynamics, Says Undavalli Arun Kuma
Two years after the Andhra Pradesh Assembly elections, the coalition government continues to hold power. Public opinion across the state shows a mixed response to its performance so far. At the same time, a key political question is gaining traction. Can the opposition YSR Congress Party stage a comeback in 2029? Former MP Undavalli Arun […] The post YSRCP’s 2029 Chances Depend on Alliance Dynamics, Says Undavalli Arun Kuma appeared first on Telugu360 .
రైతుల రహదారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే…
రైతుల రహదారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే… రోలుపాడు రైతుల వినతికి వెంటనే స్పందనసురవరం–రోలుపాడు
భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత…
భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Breaking : మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. పోలీసులకు మరణశిక్ష
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది
ఈ నెల 10న లేబర్ కమిషనర్ కార్యాలయ ముట్టడి
ఆర్టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి ఆర్టిసి జెఎసి పిలుపు నిచ్చింది. కార్మిక సంఘాల జెఎసి అత్యవసర సమావేశం సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జెఎసి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టిసిలో గత 7 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలిపారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆర్టిసి జాయింట్ యాక్షన్ కమిటీ అభిప్రాయపడింది. ఒకపక్కన ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టిసి స్థలాలను ప్రైవేట్ యాజమాన్యానికి తాకట్టు పెడుతూ, మరోపక్క రీ ఆర్గనేజషన్ యాక్ట్ 2014 కు తూట్లు పొడుస్తూ బస్ భవన్ లో సగభాగాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించే ప్రయత్నం చేయడంపై జాయింట్ యాక్షన్ కమిటీ నిప్పులు కక్కింది. ఒకపక్క గ్రేటర్ హైదరాబాద్ జోనలో ఉన్న కార్మికులను కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బదిలీలు చేసే ప్రక్రియ చేపడుతూనే మరోప్రక్క మల్టీ ట్రేడ్ సిస్టమ్ ని తీసుకువచ్చి ఆర్టిసి కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని జాయింట్ యాక్షన్ కమిటి ప్రభుత్వం, యాజమాన్యాలపై విరుచుకుపడింది. జాయిoట్ యాక్షన్ కమిటీ సమ్మె నోటీసు ఇచ్చిన కారణంగా లేని సమస్యలను కార్మికుల ముందుకు తీసుకువచ్చి, కార్మికుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ప్రభుత్వం, యాజమాన్యాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించింది. వారు ఆడుతున్న మైండ్ గేమ్ ని కార్మికవర్గం తిప్పికొట్టి గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొంది. కార్మికుల హక్కులను హరించటానికి ప్రభుత్వ, యాజమాన్యాలు చీకటి బోనులో సింహాల్లా ఎదురు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన సమ్మె నోటీసులో ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయట, ట్రేడ్ యూనియన్లను రిస్టోర్ చేయడం, వేతన సవరణలు జరపడం, తదితర సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెలోకి వెళ్ళటం ఖాయమని జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి అన్నారు. కార్మికుల ఆవేదనను ‘కార్మిక గర్జన‘ రూపంలో వినిపిస్తామని హెచ్చరించారు .ఇప్పటికైనా లేబర్ కమిషనర్ కన్సిలేషన్ ప్రక్రియ ప్రారంభించి జాయింట్ యాక్షన్ కమిటీతో సమావేశం నిర్వహించాలని, సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని జెఎసి నాయకత్వం మరొక లేఖ ద్వారా జాయింట్ లేబర్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ను కోరింది. ఆర్టిసి జెఎసి పిలుపు మేరకు ఈ నెల 7న మంగళవారం చేపట్టనున్న బస్భవన్ బచావో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆర్టిసి జెఎసి ప్రకటించింది. సోమవారం కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఆర్టిసి ఉమ్మడి ఆస్తి అయిన బస్ భవన్ లోని ఎపికి చెందిన ఎ బ్లాక్ ను జిఎస్టి, ఇన్కమ్ టాక్స్ వారికి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడం, జెఎసి ఏప్రిల్ 7న బస్ భవన్ బచావో కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఎ బ్లాక్ మొత్తం ఎపి సిబ్బంది స్వాధీనం చేసుకొని అన్ని ఫ్లోర్లకు తాళాలు వేసుకుని సీల్ చేశారు. ఇదంతా కార్మికుల ఉద్యమ సెగతో అక్కడ ఎపి ప్రభుత్వం అప్రమత్తం కావడంతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పక్కకు పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎ బ్లాక్ ను తిరిగి ఆర్టిసి సంస్థ స్వాధీనం చేసుకోవడం కార్మిక విజయంగా భావిస్తూ మంగళవారం తలపెట్టిన బస్ భవన్ బచావో కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు జెఎసి నేతలు ఈదురు వెంకన్న , ఎం. థామస్ రెడి. ఎండి మౌలానా, కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి తెలిపారు.
రామేశ్వర స్వామి ఆలయ దోపిడీ కేసు ఛేదన….
రామేశ్వర స్వామి ఆలయ దోపిడీ కేసు ఛేదన…. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అరెస్ట్
నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలి..
నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలి.. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జల మట్టాలను
హైదరాబాద్-రాయ్పూర్ విమానంలో సాంకేతిక లోపం..
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చార్టర్ విమానం సాంకేతిక లోపానికి గురైంది. ఆదివారం(ఏప్రిల్ 5) హైదరాబాద్ నుండి రాయ్పూర్కు వెళ్తున్న VT-REM చార్టర్ విమానం.. ఎయిర్ పోర్టు ప్రధాన రన్వే నుండి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేపై నిలిచిపోవడంతో, ఆర్జీఐ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొన్ని నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు స్పందించారు. నిన్న రాయపూర్కు బయలుదేరాల్సిన VT-REM చార్టర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది కొద్దిసేపు టాక్సీవేపై నిలిచింది. పరిస్థితిని గుర్తించిన మా ఎయిర్సైడ్ బృందం వెంటనే స్పందించి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని తక్షణమే సురక్షితంగా తరలించింది. ఈ కారణంగా ఒక విమానం గో-అరౌండ్ చేయాల్సి వచ్చినప్పటికీ, ఎటువంటి అంతరాయం లేకుండా విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగాయి అని ఆర్జీఐ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఆసుపత్రిలో సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించినట్లుగా
మొగ్ధూంపూర్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం….
మొగ్ధూంపూర్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా
రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం…
రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం… విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు…15
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు,ఏప్రిల్
Donald Trump : ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాడుగా?
ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్
Dhurandhar Composer for Nani’s Film?
Young music composer Shashwat Sachdev scored music for Dhurandhar and his work is one of the major highlights of the spy thriller. The songs are instant hits and the background score composed by Shashwat Sachdev is an asset for the film. He is rushed with several offers. Rumours say that Sukumar is considering him for […] The post Dhurandhar Composer for Nani’s Film? appeared first on Telugu360 .
బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని పెరికేడు
బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత
బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రాయపర్తి,
మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం..
మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వేసవికాలంలో ప్రజల దాహం
చిట్యాల తహసీల్దార్గా ఎం. విజయ్ కుమార్
చిట్యాల తహసీల్దార్గా ఎం. విజయ్ కుమార్ చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలాని
ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత
ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత బాసర (నిర్మల్ జిల్లా) : ఆంధ్రప్రభ
Earth Quake : ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది
Tirumala : తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు
తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు కనిపించాయి
కన్నుల పండుగగా జేఎన్టీయూ15 వ స్నాతకోత్సవ వేడుకలు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం)15 వ స్నాతకోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం కన్నుల పండుగగా వేడుకలను నిర్వహించారు. గౌరవ డాక్టరేట్’మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ టెస్సీ థామస్కుకుఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అందజేశారు, అనంతరం గవర్నర్ 24 మంది గోల్డ్ మెడలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధిపై వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ […] The post కన్నుల పండుగగా జేఎన్టీయూ15 వ స్నాతకోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
కేంద్రం కొత్త నిబంధన.. టోల్ గేట్ దాటాలంటే?
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ప్రజావాణి కార్యక్రమంలో రీల్స్ చూస్తున్న ఏఎస్ఐ #telugupost #jagitial #policeofficer #reels
అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు…
అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు… ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : ఖిలావరంగల్ తూర్పు
రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమేనా?
ఆచరణ సాధ్యం కాని అమరావతి కన్నా మావిగన్ తో సులువైన అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు
అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి నివాళులు తెలిపిన విద్యార్థినీ విద్యార్థులు తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ
ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం..
ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం
Naga Shaurya’s BBK Trailer: Mass Entertainer
Naga Shaurya will next be seen in an intense and mass character in Bad Boy Karthik. Directed by newcomer Raam Desina and produced by Srinivasa Rao Chintalapudi, the film promises a power-packed blend of mass, fun, and emotion. The trailer of the movie has been released just a while ago. The trailer presents Karthik as […] The post Naga Shaurya’s BBK Trailer: Mass Entertainer appeared first on Telugu360 .
ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి
–ఎంఈఓ తిరుమలరావు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన […] The post ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .
బాసరలో సీఎం రేవంత్ రెడ్డి మనవడికి అక్షరాభ్యాసం #RevanthReddy #Basara #SaraswatiTemple #Telangana
యువత తప్పు చేస్తున్నారు: సిఎం రేవంత్
యువత నెమ్మదిగా క్రీడలకు దూరం అవుతున్నారని.. క్రీడా మైదానాలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పబ్, డ్రగ్ కల్చర్ లోకి వెళ్తున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు... మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవకాశం కల్పించామన్నారు. భారత ఫుట్ బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని.. 1950 నుంచి 60 వరకు నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా హైదరాబాద్ ను పిలిచేవారని చెప్పారు. దేశంలోనే ఫుట్ బాల్ ఆటను ఆదరించి అగ్రశేణి క్రీడాకారులను హైదరాబాద్ అందించిందన్నారు. బీఎన్ మల్లిక్ ఒక స్పై మాస్టర్ అని.. నిఘా వ్యవస్థను తీర్చిదిద్దడంలో బీఎన్ మల్లిక్ ది కీలక పాత్ర అని సిఎం చెప్పారు. టోర్నమెంట్ లో 34 జట్లు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారన్న సిఎం.. దేశం నలుమూల నుంచి క్రీడాకారులు తరలివచ్చి మంచి ప్రదర్శనను కనపర్చిన వారందరికి అభినందనలు తెలిపారు. సౌత్ కొరియాలో స్పోర్స్ యూనివర్సిటీ ని నేను సందర్శించాను. 30 ఎకరాల్లో ఉన్న స్పోర్స్ యూనివర్సిటీ అనేక బంగారు పతకాలు సాధించింది. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒక్కరు కూడా బంగారు పతకం సాధించలేకపోయాం. 4 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా దేశం 30 కి పైగా పతకాలు సాధించింది. సౌత్ కొరియాలో ఒక్క అమ్మాయి 2 బంగారు పతకాలు సాధిస్తే ఇంత పెద్ద దేశం ఒక్క పతకాన్ని తెచ్చుకోలేకపోయింది. అంతర్జాయతీ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్,పబ్లిక్ భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ యూనివర్సిటీలో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు బోర్డు మెంబర్స్ గా ఉన్నారు. యువతకు మార్గదర్శనం చేయాలనే హైదరాబాద్ కు మెస్సీని తీసుకువచ్చాను. ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవకాశం కల్పించాం. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం తో పాటు 2 కోట్ల నగదు పురస్కారం అందించాం. 10వ తరగతి ఫెయిల్ క్రికెటర్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడానికి అర్హత లేకపోయినా అన్ని నిబంధనలు సడలించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఫారా ఒలింపిక్స్ లో రాణించిన దీప్తి జురాంజి కి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. క్రీడల్లో రాణించే తెలంగాణ యువతకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి.. నాది హామీ అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి….
బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి…. బీజేపీలో పని చేసిన ప్రతి కార్యకర్తకు

27 C