Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
India vs South Africa : సొంత గడ్డపై ఘోర అవమానం.. చెత్త బ్యాటింగ్
కోల్ కత్తా లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ సౌతాఫ్రికాపై దారుణంగా ఓటమి పాలయింది.
వచ్చే నెలలో ప్రక్రియ ప్రారంభం ప్రజాపాలన విజయోత్సవాల తరువాతే ఎన్నికల నిర్వహణ పార్టీపరంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలు, గిగ్ వర్కర్ల ముసాయిదా, ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళిక ఖరారు చేసే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినె ట్ నేడు భేటీ కానుంది. మధ్యాహ్నాం 3గంటలకు సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రా రంభంకానుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు బిసి రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో భాగంగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుం ది. రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా అమలు చేయటం ఇబ్బందికరం గా మారడంతో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే, ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సం స్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మంత్రులతో సిఎం చర్చించనున్నారు. ఈ ఎన్నికలపై మంత్రుల అభిప్రాయాలతో పాటు న్యాయనిపుణుల సలహాలను తీసుకోనున్నారు. అందుబాటులో పూర్తి సమాచారం మంత్రివర్గం సమావేశం ఎజెండాకు సంబంధించి న సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సిఎ స్ రామకృష్ణారావు ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయగా హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్లో జరగాల్సిన ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తి కానుం ది. దీంతో డిసెంబర్ రెండో వారంలో ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహించనుంది. అందుకే ఈ ఉత్సవాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం కోరే అవకాశం ఉందని సమాచారం. ఉత్సవాల సందర్భంలో షెడ్యూల్ వెలువడితే ప్రజలు, పార్టీ గ్రామీణ క్యాడర్ మొత్తం ఎన్నికల్లో తలమునకలవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం డిసెంబర్ 8,9వ తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్2025ను నిర్వహించనుంది. దీనికి దేశ, విదేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. 9వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఈ సదస్సులో ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రత, ఏర్పాట్లపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తికావడంతో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో ఇన్ని రోజులపాటు పెండింగ్లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. గిగ్ వర్కర్ల ముసాయిదాపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Chess | ప్రతిభకు పట్టం.. Chadarangam, అశ్వారావుపేట రూరల్, (ఆంధ్రప్రభ) : వ్యవసాయ
మన తెలంగాణ/హైదరాబాద్ః జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరింత పట్టు బిగించినట్లైంది. జూబ్లీ ఉత్సాహంతో తన బలాన్ని పెంచుకోవాలనుకంటున్నది. ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఇదే అదనుగా తీసుకుని ప్రతిపక్షాలను ఎండగడుతూ, తమ బలాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీరియస్గా భావిస్తున్నది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు, జిహెచ్ఎంసి ఎన్నికలకు వెళ్ళడమే కాకుండా అసెంబ్లీలోనూ సంఖ్యా బలం పెంచుకోవాలనుకుంటున్నది. ఈ మేరకు ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి చేత శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించి తిరిగి ప్రజా తీర్పుకు వెళ్ళి అసెంబ్లీలో బలాన్ని పెంచుకోవాలనుకంటున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా తమ పార్టీ నుంచి ఎన్నికై కాంగ్రెస్లోకి ఫిరాయించిన పది మంది ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ను కోరుతూ బిఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్ పంపించిన నోటీసులకు ఎనిమిది మంది ఎంఎల్ఏలు స్పందించి కౌంటర్ దాఖలు చేశారు. వారిపై దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం స్పీకర్ వద్ద వాదనలు కొనసాగుతున్నాయి. కాగా మిగతా ఇద్దరు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమకు సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇదిలాఉండగా కడియం శ్రీహరి ఆదివారం ‘మన తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ సమాధానం ఇచ్చేందుకు తనకు గడువు కావాలని స్పీకర్ను కోరానని చెప్పారు. తాను న్యాయవాదులతో సంప్రదించి సమాధానం పంపిస్తానని ఆయన తెలిపారు. దానం నాగేందర్ తనకు ఎటువంటి నోటీసు రాలేదని చెప్పారు. తమ పార్టీ నుంచి ఎన్నికై కాంగ్రెస్లో చేరిన వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్ఎస్ ఎంఎల్ఏలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాము ‘కారు’లోనే ఉన్నామంటూ ఫిరాయింపు ఎంఎల్ఏలు స్పీకర్ ఎదుట తమ వాదన బలంగా వినిపిస్తున్నారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దానం నాగేందర్ ఆరు నెలలకే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో తాను పార్టీ మారలేదనడానికి ఛాన్సే లేకుండా పోయింది. కాంగ్రెస్ నుంచి ‘బి-ఫారమ్’ తీసుకుని లోక్సభకు పోటీ చేసినందున తాను పార్టీ ఫిరాయించ లేదనడానికి అవకాశమే లేకుండా పోయింది. పొంచి ఉన్న ప్రమాదం.. తాజాగా పశ్చిమ బెంగాల్ హైకోర్టు అనర్హత పిటిషన్పై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కోల్కత్తా హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి టిక్కెట్పై గెలుపొందిన ముకుల్ రాయ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయించారని బిజెపి నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ముకుల్ రాయ్ శాసనభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎంఎల్ఏలకూ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రమాదకరంగా పొంచి ఉందన్న ఆందోళన కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేయించి తిరిగి ప్రజా తీర్పుకు వెళ్ళడం మంచిదన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే ఫిరాయింపు ఎంఎల్ఏల అందరితో రాజీనామా చేయించకుండా, వాటిపై స్పీకర్ నిర్ణయానికి వదిలేసి, ప్రస్తుతానికి దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళితే బాగుంటుందని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారుః జీవన్ రెడ్డి ఇదిలాఉండగా ఫిరాయింపు ఎంఎల్ఏలపై మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ ఎంఎల్ఏ టి. జీవన్ రెడ్డి అన్నారు. ఆ రాష్ట్ర స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోనందుకే అక్కడి హైకోర్టు అనర్హత వేటు వేసిందని ఆయన తెలిపారు. మన స్పీకర్ అలా చేయకుండా సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. జూబ్లీ జోష్ ఖైరతాబాద్లోనూ.. ‘జూబ్లీ’ జోష్తో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. దానం నాగేందర్నే కాకుండా కడియం శ్రీహరితో కూడా రాజీనామా చేయించి తిరిగి ఎన్నుకుంటే హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని నిరూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నది పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. రాజీనామానా? మరో పది మందిని లాగడమా? ఒకవైపు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు దానం, కడియంతో రాజీనామా చేయించి తిరిగి పోటీ చేయించి గెలిపించుకోవడమా? లేక బిఆర్ఎస్ నుంచి మరి కొంత మంది ఎంఎల్ఏలను లాగడమా? అనే చర్చ జరుగుతున్నది. మరో పది మంది బిఆర్ఎస్ ఎంఎల్ఏలను చేర్చుకోవడం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా రెండింట మూడో వంతు మందిని చేర్చుకుంటే మంచిదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రెండింట మూడో వంతు మందిని చేర్చుకున్నట్లయితే బిఆర్ఎస్-ఎల్పిని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందన్నది కాంగ్రెస్లో మరి కొందరి నేతలు అంటున్నారు. జూబ్లీ ఫలితం తర్వాత బిఆర్ఎస్, బిజెపి నేతలు షాక్లో ఉన్నందున, ఇదే సరైన సమయమని, ఇలా వెంట వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసి ఎన్నికలు, ఇంకా ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల ఎన్నికలకూ వెళ్ళి శాసనసభలో బలాన్ని పెంచుకుంటూ ఎదురులేని శక్తిగా నిలబడాలని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల కథనం.
Telangana : నేడు సుప్రీంకోర్టులో అనర్హత పిటీషన్ల విచారణ
తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటీషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
కోల్కతా: సౌతాఫ్రికాతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. దక్షిణాఫ్రికా ఉంచిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. సఫారీ బౌలర్లు అసాధారణ బౌలింగ్తో భారత్ను 93 పరుగులకే పరిమితం చేసి తమ జట్టుకు 30 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ చిన్న లక్ష్యాన్ని కూడా అందుకోలేక పోయింది. గాయం వల్ల కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగలేదు. ఇక ఊరిస్తున్న లక్షంతో ఆదివారం మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. సఫారీ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను తీస్తూ టీమిండియా బ్యాటర్లకు కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబ బవుమా (55), కార్బిన్ బోస్చ్ (25)లు మెరుగైన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో జడేజా నాలుగు, కుల్దీప్, సిరాజ్ రెండేసి వికెట్లను పడగొట్టారు. కాగా, సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 159 పరుగులు చేయగా, భారత్ 189 పరుగులకు ఆలౌటైంది. ఇక స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), రాహుల్ (1) విఫలమయ్యారు. ధ్రువ్ జురెల్ (13), రిషబ్ పంత్ (2) కూడా నిరాశ పరిచారు. జడేజా (18), అక్షర్ పటేల్ (26) పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ (31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో భారత ఇన్నింగ్స్ 33 ఓవర్లలో 93 పరుగుల వద్దే ముగిసింది. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హార్మర్ నాలుగు, జాన్సన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
కుమారుడు, కుమార్తె నడుమ తీవ్ర వాగ్వాదం ఓటమి నీ టీమే కారణం అన్న రోహిణి, కాదు నువ్వే కారణం అంటూ మండిపడ్డ తేజస్వీ సహనం కోల్పోయి సోదరిపై చెప్పు విసిరివేత నాన్నకు కిడ్నీ ఇస్తే దాన్ని మురికిది అని అవమానించారు కోట్ల డబ్బు, పార్టీ టికెట్ తీసుకున్నానని నాపై నిందలు లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన నన్నంటే ఊరుకుంటా.. అక్కను అగౌరవపరిస్తే ఊరుకోను: తేజ్ ప్రతాప్ పాట్నా : ఆర్జెడి సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుబంలో విభేదాలు మరింత ముదిరాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబంలో గొడవలు భగ్గుమన్నాయి. ఫలితాల విషయంలో ఆర్జెడి నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్, కుమార్తె రోహిణి ఆచార్య నడుమ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. శనివారంనాడు ఇక్కడి నివాసంలో వాదన జరిగిందని, ఈ క్రమంలో ‘ఓటమికి నువ్వే కారణం. నీ వల్ల మేం తీవ్రంగా నష్టపోయాం’ అని రోహిణిపై తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆ పార్టీ వర్గాల సమాచారం. అంతటితో ఆగకుండా రోహిణిపై చెప్పు విసిరి తీవ్రంగా దూషించినట్లు తెలిసింది. అంతకుముందు రోహిణి కూడా తీవ్రంగా బదులిలిచ్చినట్లు సమాచారం. తేజస్వీ టీమ్ అనుసరించిన ప్రచార సరళే ఓటమికి కారణమని, పరోక్షంగా తేజస్వీకి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలు సంజయ్ యాదవ్, రమీజ్పై ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. ఇదే తేజస్వీకి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని, కారణం వాళ్లు కాదు నువ్వేనని రోహిణిపై తేజస్వీ ఒంటికాలిపై లేచినట్లు సమాచారం. దీనిపై లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ కూడా తీవ్రంగా స్పందించారు. తనను అంటే ఊరుకుంటానని, కానీ అక్కను అగౌరవపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తేజ్ ప్రతాప్, తేజస్వీ నడుమ ఎప్పటి నుంచో విభేదాలు నెలకొన్నాయి. దీంతో తేజస్వీ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత లోక్సభ ఎన్నికల్లో రోహిణి కూడా సరన్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి చెందారు.
నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్
నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్ పత్తి కొనుగోళ్లపై పడనున్న ప్రబావం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నిబంధనలతో ఆలస్యమయిన పత్తి కొనుగోళ్లు వర్షాలు, తేమ శాతాలతో అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఈ క్రమంలో జిన్నింగ్ మిల్లుల బంద్ ప్రకటనలతో సోమవారం నుండి పూర్తిగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. సిసిఐ, జిన్నింగ్ మిల్లులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 గ్రేడులుగా విభజించి కొనుగోళ్లు చేస్తుండడం, కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం లాంటి నిబంధనలను విధించడంపై మిల్లర్లు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్లులకు పని కల్పించే విధంగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ నిబంధనలపై అసోసియేషన్ చేసిన డిమాండ్ను ప్రభుత్వం పరిశీలించక పోవడంతో ఈనెల 17 (సోమవారం) నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని మిల్లర్ల సంఘ నిర్ణయించింది. నిలిచిపోనున్న సిసిఐ కొనుగోళ్లు కాటన్ మిల్లర్ల అసోసియేషన్ ఈనెల 6 నుంచి బంద్ చేపట్టాలని నిర్ణయించినా మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమ్మెను 17వ తేదీకి వాయిదా వేశారు. ప్రతి ఏడాది అక్టోబరు మొదటి వారంలో సిసిఐ కొనుగోళ్లను ప్రారంభిస్తుంది. నిబంధనలు, టెండర్ల ఆలస్యంతో అక్టోబర్ చివరి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, కొన్ని రోజులకే కురిసిన అకాల వర్షాల కారణంగా పత్తిలో తేమ అధికంగా ఉండడంతో కొంత సమయం బ్రేక్ పడింది. మరల నవంబరులో కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ క్రమంలో జిన్నింగ్ మిల్లుల బంద్తో పత్తి కొనుగోళ్లపై తీవ్ర ప్రబావం పడనుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయి ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులకు భారీ నష్టం ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి దిక్కులేని పరిస్థితి నెలకొనడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యమేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపంగా మారిందని అన్నారు. దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చొరవ చూపించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చించి రాష్ట్ర రైతన్నల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు నిబంధనలతో, కుంటి సాకులతో కొనుగోలు ఆపివేసిన సిసిఐ వైఖరిని కెటిఆర్ ఎండగట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రైతన్నకు కనీస మద్దతు ధర కూడా దొరకడం లేదని, తీవ్రమైన వర్షాల వలన ఇప్పటికే పంట నష్టం వలన ఇబ్బందులు పడుతున్న రైతన్నలు మిగిలిన పంటను కూడా అమ్ముకోలేక నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న రైతన్నలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కెటిఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ కూడా తెలంగాణ పత్తి రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలోని లక్షల మంది రైతన్నలు తమ పత్తిని కొనుగోలు చేసే దిక్కులేక ఆందోళన చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాల్కు రూ. 8,110 కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో రైతులు కేవలం రూ. 6 వేల నుండి రూ. 7 వేలు మాత్రమే రైతులకు దక్కడం అత్యంత కష్టంగా మారిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి క్వింటాల్పై రైతులు దాదాపు రూ. 2,000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన ఎడతెగని వర్షాల కారణంగా పత్తి తడిసిపోయి, తేమ శాతం పెరిగి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు ఇదే సాకును చూపించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తేమ ఎక్కువగా ఉన్న పత్తి కొనుగోలును చేయకుండా కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కేంద్రం కొర్రీలు పెడుతోంది పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని కెటిఆర్ ఆరోపించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి ఉండగా, దాన్ని ఏకంగా 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందన్నారు. జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులు చెబుతూ కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే, మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వలన జిన్నింగ్ మిల్లులు ఒకేసారి ప్రారంభం కాకపోవడం కూడా రైతుల విక్రయాలకు ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికీ పలు జిల్లాల్లో పత్తి కొనుగోలు ఆగిపోయింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిన్నింగ్ మిల్లుల కేటగిరీల విభజనను నిరసిస్తూ సోమవారం నుంచి జిన్నింగ్ మిల్లులు మరోసారి బంద్కు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నెల రోజుల్లో సిసిఐ కేవలం 1.12 లక్షల టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసిందని, ఈ సీజన్లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది అత్యంత స్వల్పమని చెప్పారు. కేవలం రాజకీయాలపైనే దృష్టి సారించకుండా, రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం 325 జిన్నింగ్ మిల్లులకు గాను 256 మిల్లులు మాత్రమే ఓపెన్ చేసి, మిగిలిన వాటిని కూడా తెరవకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వాల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మరోవైపు రైతులు తమ పత్తిని అమ్ముకునేందుకు కపస్ మొబైల్ యాప్ కచ్చితంగా వినియోగించాలన్న నిబంధన సడలించాలని, రైతులు పత్తి ఎప్పుడు తీసుకువస్తే అప్పుడు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని పత్తి రైతన్నల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండికి వేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్తో పాటు మంత్రుల బృందం ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపిన విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే కేంద్రంపైన ఒత్తిడి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
Telangana | చలి గజ గజ.. Telangana, ఉమ్మది ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో
ఢిల్లీ పేలుడు ఘటన ఆత్మాహుతి దాడే
డాక్టర్ ఉమర్ నబీయే తనను తాను పేల్చివేసుకున్నాడు సహాయకుడు, కశ్మీర్కు చెందిన సన్నిహితుడు అమీర్ సహకారం అతడి పేరిటే కారు రిజిస్ట్రేషన్ ఐఇడిలు అమర్చేందుకు వీలుగా కారులో మార్పులు ఎన్ఐఎ దర్యాప్తులో సంచలన విషయాలు హర్యానాలో మరో మహిళా డాక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఎర్రకోట వద్ద జరిగింది పూర్తి స్థాయి ఆత్మాహుతి దాడి పేలుడు ఘటన అని జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) దర్యాప్తులో తేటతెల్లం అయిం ది. ఈ నివేదిక కీలక విషయాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట వద్ద ఓ కారు లో అమర్చి ఉన్న అత్యంత శక్తివంతమైన, అ త్యధిక మోతాదు పేలుడు పదార్థం (ఐఇడి)ని అమర్చుకుని సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తనను తాను పేల్చేసుకున్నాడని తే ల్చారు. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు తీ శాడు. పలువురు తీవ్రగాయాల పాలయ్యి, ఆసుపత్రిలో జీవన్మరణ దశలో ఉండేలా చేశాడు. అరెస్టు అయిన ఉమర్ సహాయకుడు అమీర్ రషీద్ అలీ విచారణలో ఈ ఆత్మాహుతి దాడి పూర్వాపరాలు వెలుగులోకి వచ్చాయి. ఐఇడి అమర్చుకుని సంచరించేందుకు అవసరం అయిన కారును అమీర్ ఉమర్ నబీకి సమకూర్చినట్లు వెల్లడైంది. ఈ మృత్యు శకటాన్ని ఆరోజు అంటే పేలుడు జరిగిన ఈ నెల 10వ తేదీన ఢిల్లీ వీధులలో నడిపింది స్వయంగా డాక్టర్ ఉమర్ ఉన్ నబీనే అని నిర్థారణ అయింది. దర్యాప్తు క్రమంలో ఇది అత్యంత ప్రధానమైన తొలి ముందడుగు అని ఎన్ఐఎ తెలిపింది. జమ్మూ కశ్మీర్లోని పంపారే సమీపంలోని సంబూరా నివాసిగా అమీర్ రషీద్ అలీని గుర్తించారు. ఈ వ్యక్తి తన ప్రయోజనాల కోసం ఆత్మాహుతి టెర్రర్ బాంబర్ ఉమర్కు సహకరించాడు. కుట్రకు కారుకు అమీర్ సహకారం దాడి కుట్రకు ఆ వ్యక్తికి సహకరించాడని వెల్లడైంది. అమీర్ పేరిటనే దాడికి ఉపయోగించిన కారు రిజిస్టర్ అయి ఉందని ఎన్ఐఎ పరిశీలనలో వెల్లడైంది. ఈ వ్యక్తి ఢిల్లీకి ముందుగానే వచ్చి ఈ వాహనాన్ని కొనుగోలు చేసుకుని తరువాత ఐఇడి అమరే విధంగా తగు విధంగా మార్పులు చేర్పులు చేసినట్లు నిర్థారణ అయింది. మందుగుండు అమర్చిన వాహనాన్ని విబిఐఇడి వాహనంగా పిలుస్తారు. మృతుడు అయిన బాంబర్ ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. జనరల్ మెడిసిన్ విభాగంలో ఉద్యోగంలో ఉన్నాడు. డాక్టర్ వృత్తి చేస్తూ ఉగ్రవాదిగా జీవించాడు. ఉమర్ స్వస్థలం జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా. నబీకే చెందిన మరో వాహనాన్ని కూడా నియా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. తగు సాక్షాధారాల కోసం దీనిని పరిశీలిస్తున్నారు. ఎర్రకోట దాడి ఘటనపై నియా వర్గాలు తమ దర్యాప్తును తీవ్రతరం చేశాయి. పలు ప్రాంతాలలో అనుమానితులను పట్టుకుని విచారిస్తున్నాయి. బాంబర్గా మారాలని జాసిర్పై ఒత్తిడి ఇప్పుడు బాంబర్గా మారిన ఉమర్ ఏడాదిగా తనకు బదులుగా వేరే ఎవరైనా ఆత్మాహుతి బాంబర్గా మారితే బాధ్యత అప్పగిస్తానని నెట్వర్క్ నిర్వాహకులకు ఏడాదిగా చెపుతున్నాడు. ఇందు కోసం చాలా నెలలుగా మరో వ్యక్తి కోసం యత్నించాడు. అయితే పలితం లేకపోవడంతో తానే బాంబర్ అయ్యి పేల్చుకున్నాడు. తనను ఆత్మాహుతి బాంబర్గా చేయాలని ఉమర్ యత్నించాడని కేసులో పట్టుబడ్డ జాసిర్ అలియాస్ డానిష్ ఇంటరాటగేషన్లో తెలిపాడు.
ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి ఎనిమిది నెలలైనా అందని ప్రోసీడింగ్స్ ...! ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల లాగిన్లో దరఖాస్తులు పెండింగ్ ముడుపులు ముట్టచెబితే వారంరోజుల్లో క్లియర్ పురపాలక, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయ లోపం దరఖాస్తుదారుడికి వివరాలు చెప్పని అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినా ప్రోసీడింగ్స్ మాత్రం వారికి అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నెలకొంది. పురపాలక శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఫీజులు చెల్లించిన తర్వాత దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తర్వాతే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ దశలోనూ నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ఉంటే ప్రొసీడింగ్స్ ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిబంధనలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుసుము చెల్లించిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తొలుత క్షేత్రస్థాయిలో (ఎల్1 క్లియరెన్సు) పరిశీలిస్తారు. ప్రారంభంలో రెవెన్యూ శాఖ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ నుంచి ఏఈ, తర్వాత హెచ్ఎండిఏ నుంచి జేపిఓ లేదా ఏపిఓ పరిశీలించి అనుమతులకు ఇస్తారు. అయితే ఇప్పటికే ఎల్1 తనిఖీలు పూర్తయినా ఎల్2, ఎల్3 దరఖాస్తులు ముందుకు కదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 20,00,493 మంది దరఖాస్తుదారులకు నోటీసులు అక్రమ లే ఔట్లు లేదా లే ఔట్లు లేని ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానుల నుంచి 2020లో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 25,67,107 దరఖాస్తులు రాగా, అందులో సుమారుగా 5 లక్షల పైచిలుకు దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. (పురపాలక శాఖ నుంచి 15,37,159 దరఖాస్తులు గ్రామ పంచాయతీల నుంచి మరో 9లక్షల దరఖాస్తులు వచ్చాయి.) సుమారుగా 20,00,493 మంది దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ అధికారులు ఏప్రిల్ నోటీసులు జారీ చేయగా, సుమారుగా మే నెలలో 3,25,538 దరఖాస్తులదారులు మాత్రమే ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా ఫీజును చెల్లించారు. అయితే, పురపాలక శాఖ అధికారులు ఈ దరఖాస్తులను స్క్రూటీని చేసి ఈ ఫీజును వసూల్ చేశారు. తరువాత ప్రోసీడింగ్స్ ఇవ్వాల్సిన అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం దరఖాస్తుదారులకే ప్రోసీడింగ్స్ ప్రస్తుతం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎనిమిది నెలలుగా ఈ దరఖాస్తులను తమ లాగిన్లో అలాగే పెట్టుకొని ఉంటున్నారు. ఇదేమని అడిగితే దరఖాస్తుదారుడు తమ దగ్గరకు రాలేదని వారు పేర్కొంటున్నారు. అయితే, డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారుడికి ఈవిషయం తెలియకపోవడంతో ఇంకా ప్రోసీడింగ్ రావడానికి సమయం పడుతుందన్న ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫీజును చెల్లించిన దరఖాస్తు దారులు పురపాలక శాఖ అధికారుల దగ్గరకు వెళ్లి వాకబు చేస్తే ఇరిగేషన్, రెవెన్యూ లాగిన్ నుంచి క్లియర్ అయితేనే ప్రోసిడింగ్స్ ఇస్తామని వారు పేర్కొంటుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం దరఖాస్తుదారులకే ప్రోసీడింగ్ అందినట్టుగా తెలిసింది. రూ.10 వేలు ఇస్తే వారంరోజుల్లో ప్రోసీడింగ్స్ ప్రస్తుతం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను దరఖాస్తుదారులు కలిసి డబ్బులు ఇస్తేనే క్లియర్ అవుతున్నాయని లేకపోతే దళారుల ద్వారా వెళితేనే ప్రోసీడింగ్స్ అందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో కొందరు దళారులు ఎల్2, ఎల్3లో దరఖాస్తులు పెండింగ్ ఉంటే సుమారుగా రూ.10 వేలు ఇస్తే వారంరోజుల్లో ప్రోసీడింగ్స్ ఉత్తర్వులను దరఖాస్తుదారులకు అందచేసినట్టుగా తెలిసింది. హెచ్ఎండిఏ పరిధిలోని 1,200 గ్రామాల పరిధిలోని 3.60 లక్షల దరఖాస్తులకు గాను 70 వేల దరఖాస్తులు మాత్రమే ఫీజులు చెల్లించగా అందులో కనీసం 20శాతం దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్లు అందకపోవడం విశేషం. ఇప్పటివరకు హెచ్ఎండిఏ అధికారులు 8,706 ప్రొసీడింగ్స్ను మాత్రమే జారీ చేసినట్టుగా తెలిసింది. అయితే ఫీజులు చెల్లించిన వారికి నిర్ణీత గడువు లోగా ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా కనీసం వాటి గురించి పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 8 వేల మందికే.... గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 72,196 మంది ఫీజును చెల్లించగా కనీసం 8 వేల మంది దరఖాస్తుదారులకు మాత్రమే ప్రోసీడింగ్స్ అందాయని తెలిసింది. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 40,881 మంది ఫీజును చెల్లించగా 3వేల మంది దరఖాస్తుదారులకు మాత్రమే ప్రోసీడింగ్స్ అందాయని, ఇక, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 34,776 మంది ఫీజును చెల్లించగా సుమారుగా 2 వేల మందికే ప్రోసీడింగ్స్ అందాయని అధికారులు పేర్కొంటున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 29,321 మంది ఫీజులను చెల్లించగా 2,800ల మందికి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24,020 మంది ఫీజును చెల్లించగా 2,500ల మందికి, సూర్యాపేట్ మున్సిపల్ మున్సిపల్ పరిధిలో 31,940 మంది ఫీజును చెల్లించగా 3,925 మంది దరఖాస్తుదారులకు ప్రోసీడింగ్స్ అందాయని, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 10 శాతం మందికి మాత్రమే ప్రోసీడింగ్స్ అందాయని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖ, గ్రామపంచాయతీల్లో ప్రోసీడింగ్స్లను ఇవ్వడానికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కొర్రీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పైరసీకి పాతర.. ఐ బొమ్మ, బప్పం టివి క్లోజ్
సవాల్ విసిరిన నిందితుడు రవితోనే వెబ్సైట్లు మూసివేయించిన పోలీసులు హార్డ్డిస్క్ల్లో వేలాది సినిమాలు గ్లోబల్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన నిందితుడు సర్వర్లు హ్యాక్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్, హెచ్డి వీడియోలను డౌన్లోడ్ చేసినట్టు గుర్తింపు నిందితుడి కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్ మన తెలంగాణ/సిటీబ్యూరో: పైరసీ సినిమాల ను అప్లోడ్ చేస్తున్న ఐ బొమ్మ, బప్పం టివి వె బ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మూసివేయించారు. కరేబియన్ దీవుల్లోని సర్వ ర్ల నుంచి ఐ బొమ్మను నిర్వహిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన రవి ముంబాయిలో ఎంబిఏ చేశా డు. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వి డిగా ఉంటున్నారు. 2018 నుంచి రెయిన్బో విస్టాలో ఉంటున్న రవి అక్కడ ఉంటున్న వారికి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లు చెప్పేవాడని తెలిసింది. రవి గెట్టింగ్ యాప్, ఈ ఆర్ ఇన్ఫోటెక్లకు సిఈఓగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కోర్టులో హాజరు పరిచే ముం దే రవి తో ఐ బొమ్మ, బప్పం టీవీల వెబ్సైట్లను వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో మూసివేయించారు. గతంలో దమ్ముంటే తనను పట్టుకోవాల ని పోలీసులకు సవాల్ విసిరిన రవితోనే వెబ్సైట్లను పోలీసులు మూసివేయించారు. రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు చంచల్గూడ జైలుకు రిమాండ్కు పంపారు. రవిని కస్టడీకి కోరుతు పోలీసులు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశారు. రవిని కస్టడీకి తీసుకుని విచారిస్తే సినిమాల పైరసీకి సంబంధించిన నెట్వర్క్, వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. తెలుగు సినీ నిర్మాతలు, పలువురు ఫిర్యాదు చేయడతో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. సర్వర్లు హ్యాక్... ఐ బొమ్మ నిర్వాహకుడు రవి సినిమా నిర్మాణ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసి కొత్త సినిమాలు, వెబ్సిరీస్ల హెచ్డి వీడియోలను డౌన్లోడ్ చేసినట్లు గుర్తించారు. కొన్ని సార్లు ఆయా నిర్మాణ సంస్థలకు చెందిన క్లౌడ్ డేటాలో కూడా చొరబడి చోరీ చేసేవాడిని తెలిసింది. కొన్ని సమయాల్లో థియేటర్లలోకి తన మనుషులను పంపించి సినిమాను రికార్డు చేసి విడుదల అయిన రోజే తన ఐ బొమ్మలో పెట్టేవాడు. నిర్మాణ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసేందుకు ఏకంగా హ్యాకర్లను నియమించుకుని వారికి లక్షలాది రూపాయలు ఇస్తున్నాడు. వేలాది సినిమాలను రవి తన టీంతో కలిసి సర్వర్లను హ్యాక్ చేసి వెబ్సైట్లో పెట్టాడు. దీని కోసం రవి గ్లోబల్లో పెద్ద నెట్ వర్క్ను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను అభినందించినః హోం శాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు, కమిషనర్ విసి సజ్జనార్ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ అభినందించారు. ఈ మేరకు రవి అరెస్ట్పై సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. ఇమ్మడి రవిని పట్టుకోవడానికి జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీం రేయింబవళ్లు కష్టపడిందని ప్రశంసించారు. రవిని తప్పా ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని గుర్తుచేశారు. దమ్ముంటే పట్టుకోండని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేశారని కొనియాడారు. డీసీపీ కవిత, హైదరాబాద్ సీపీ సజ్జనార్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీవీ ఆనంద్.
ఆర్ఎఫ్సిలో జరిగిన కార్యక్రమంలో పక్కపక్కనే ఆసీనులైన తెలుగు రాష్ట్రాల సిఎంలు ముసిముసి నవ్వులతో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రులు హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై కలిశారు. ఇరువురు ముఖ్యమంత్రులు కరచాలనం అనంతరం పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. మధ్యమధ్యలో ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత చంద్రబాబు, రేవంత్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఇరువురి చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లు వారికి నచ్చిన కామెంట్లు, క్యాప్షన్లతో పోస్టులు పెడుతున్నారు.
స్పీకర్పై కోర్టు ధిక్కార పిటిషన్.. నేడు విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్ గ డ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెట్ కెటిఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కర ణ పిటిషన్పై సోమవారం విచారణ జరుగనున్నది. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణ యం తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవై పు, ఎంఎల్ఎలపై విచారణకు సంబంధించి త మకు మరింత గడువు కావాలని కోరుతూ స్పీక ర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కెటిఆర్ పిటిషన్తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్పై కూడా సోమవారం విచారణ జరుగనున్నది.
సోమవారం రాశి ఫలాలు(17-11-2025)
మేషం నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. బంధువర్గం నుండి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. వృషభం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తప్పవు. ఆస్తి వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. పనులలో జాప్యం కలుగుతుంది. మిధునం వ్యాపార విషయంలో ఆకస్మిక నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన పనులు శ్రమతో గాని పూర్తి కావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కర్కాటకం స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సింహం వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువర్గంతో వివాదాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తుల వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృశ్చికం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ధనస్సు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సోదరులతో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయటం మంచిది. దైవచింతన పెరుగుతుంది. మకరం చిన్ననాటి మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కుంభం చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి. మీనం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినప్పటికి నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ఒక మహిళ తన ఇంటి బయట చిమ్ముతూ ఉండగా దొంగలు ఆమె మెడలోని గొలుసును దొంగిలించిన సీసీటీవీ విజువల్ వైరల్
వర్తక సంఘం ఎన్నికల్లో.. వైశ్యులదే హవా..!
ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : చారిత్రక నేపథ్యం కలిగిన ఖమ్మం వర్తక
టోక్యో డెఫ్లింపిక్స్ 2025లో పసిడి.. శ్రీకాంత్కు భారీ నజరానా
మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో డెఫ్లింపిక్స్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్కు శుభాకాంక్షలు తెలుపుతూ స్పోర్ట్ పాలసీలో భాగంగా షూటర్ ధనుష్కు ప్రభుత్వం తరుపున 1కోటి 20 లక్షల రూపాయల ప్రోత్సాహం అందచేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్ నూతన స్కూల్ ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.క్రీడల్లో క్రమశిక్షణ చాలా అవసరమని,ఏకాగ్రత ఉంటేనే క్రీడల్లో రాణించగలమని విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కన్నా చిన్న దేశమైన సౌత్ కొరియా ఒలంపిక్స్ లో 36 స్వర్ణ పథకాలు గెలిచిందని, కానీ మనం ఒలంపిక్స్ లో ఎందుకు పథకాలు గెలవలేక పోతున్నామో విద్యార్థులు ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్ హబ్ ఆఫ్ ఇండియాగా ఎదగడమే స్పోర్ట్ పాలసీ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోరట్స్ యూనివర్సిటీని స్థాపిస్తుందని ఈ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోరట్స్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటికే కోచ్ కోసం గురు వందనం పథకం కింద తెలంగాణ క్రీడా శాఖ కోచ్ల కోసం మొదటిసారిగా సంక్షేమ పథకం ప్రారంభించిందన్నారు. ఈ పథకం ద్వారా కోచ్ లకు 15 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని స్టేడియాల్లో వేసవి శిక్షణ శిబిరాలు, శిక్షణ కార్యక్రమాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,కడియం శ్రీహరి,నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,మేయర్ గుండు సుధారాణి,సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక లోక్ అదాలత్ సక్సెస్..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్కు ప్రజలు విశేషంగా
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది, ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత నాలుగు రోజుల నుండి సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి గుప్పిట్లో బందీ అయ్యారు. ఆదివారం తొమ్మిది జిల్లాలో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. ఆదివారం ఉదయం వరకు కుమురం భీం ఆసిఫాబాద్లో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు పేర్కొంది. పొగ మంచు, శీతల గాలుల కారణంగా రాత్రి పూట చలి ఎక్కువగా ఉంటుందని, రానున్న మూడు రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు వెల్లడించారు. నవంబర్ నెల నివేదిక ప్రకారం పగటి పూట ఉష్ణగ్రతలు తీవ్రత తగ్గి రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాత్రి కంటే ఉదయం 4 గంటల ప్రాంతంలో చలి ఎక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తుందని, వాతావరణ శాఖ వెల్లడించింది. నమోదయిన ఉష్ణోగ్రతలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు నమోదయిన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్లో 7.4 డిగ్రీలు కాగా, వరుసగా సంగారెడ్డిలో 8.1, ఆదిలాబాద్లో 8.4, రాజన్న సిరిసిల్లలో 8.6, వికారాబాద్లో 9.1, కామారెడ్డిలో 9.4, సిద్దిపేటలో 9.6, జగిత్యాలలో 9.7, నిజామాబాద్లో 9.9, మెదక్, రంగారెడ్డిలో 10, నిర్మల్లో 10.1, కరీంగనర్లో 10.6, పెద్దపల్లిల్లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. హైదరాబాద్లో 12.7 డిగ్రీలు నమోదయినట్లు టిజిపిడిఎస్ వెల్లడించింది.
బిసిలను మోసం చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే
రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్లొద్దు తక్షణమే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి బిసి రిజర్వేషన్లు పార్టీ పరంగా ఒప్పుకోం.. చట్టబద్దంగా ఇవ్వాల్సిందే బిసి రిజర్వేషన్లపై డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ ముట్టడి రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీలో బిసి నేతల వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని బిసి నేతలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బిసిల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిసి జెఎసి ఇచ్చిన అష్టంగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో బిసిలు పెద్ద ఎత్తున రన్ నిర్వహించారు. హైదరాబాద్లో బషీర్బాగ్ కూడలి లో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రన్ లో వందలాది మంది బిసి ఉద్యమకారులు పాల్గొన్నారు. బిసి రిజర్వేషన్ రక్షించాలని, రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని, బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాని ఉద్యమకారుల నినాదాలతో రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీ మారుమోగింది. ఈ రన్లో మాజీ ఎంపి వి హనుమంతరావు, మాజి మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, చీప్ కో ఆర్డినేటర్ గజ్జ కృష్ణ, కో ఆర్డినేటర్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి ఒక రాజకీయ కార్యచరణ తీసుకుని వచ్చే పార్లమెంటు సమావేశాల దృష్టా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి ద్వారా పార్లమెంటును స్తంభింప చేయాలని కోరారు. అఖిలపక్షంతో సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానితో కలిసి ఒత్తిడి పెంచాలన్నారు. ఇవేమి చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళతామంటే బిసిలను నమ్మించి మోసం చేయడమే అవుతుందన్నారు. బిసి రిజర్వేషన్లపై బిజెపి ద్వంద వైఖరి విడనాడి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిసి రిజర్వేషన్ల చట్టాన్ని తేవాలని లేని పక్షంలో వేలాది మందితో పార్లమెంటు ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మాజి ఎంపి వి హనుమంతరావు మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు ఇప్పుడు అమలు కాకుంటే భవిష్యత్తులో ఇంకెప్పుడు అమలు జరిగే పరిస్థితి లేదని అన్నారు. బిసి రిజర్వేషన్ల పై బిజెపి తో కాంగ్రెస్ తరపున పోరాడుతామని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై స్పష్టత రాకుండా స్థాని ఎన్నికలు నిర్వహించ వద్దని ఆయన సిఎం రేవంత్ రెడి,్డ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లకు విజ్ఞప్తి చేశారు. మాజి మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు ఆగిపోతే కేంద్రం నుండి రావలసిన నిధులు రావడం లేదని చెబుతున్న ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్లో రూ. 3 వేల కోట్లు ఆగిపోతే వచ్చే నష్టం ఏందని ప్రశ్నించారు, రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతే, బిఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. బిసిలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిసిలు వదిలిపెట్టే ప్రశ్న లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి జెఎసి చీప్ కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కో ఆర్డినేటర్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, సంచార జాతుల సంఘం అధ్యక్షులు వీరస్వామి, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బిసి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మ, సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిటి మల్లయ్య, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, బిసి సంఘాల నేతలు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, వరికుప్పల మధు, ఇ. నిరంజన్, కవుల జగన్నాథం, పాలకూరి కిరణ్ గౌడ్, మాదేశి రాజేందర్, తారకేశ్వరి, సంధ్యారాణి, గౌతమి, స్వామి గౌడ్, ఇంద్ర ం, మహేష్ మీరు,భరత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలి: బండి సంజయ్ పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ః హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కూకట్పల్లిలో కాపు కులస్తుల ‘కార్తీక వన భోజనాల’ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు. కొన్ని పార్టీలు ముస్లింలకు కొమ్ము కాసే పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హిందువులు కొందరు వివిధ కారణాలతో ఇతర మతాల్లో చేరిన వారంతా తిరిగి వెనక్కి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆయన తెలిపారు. మతాలను మార్చుకుంటే దేవుళ్ళను మోసం చేసినట్లేనని ఆయన హెచ్చరికగా అన్నారు. హిందూ సనాతన ధర్మం గొప్పదని, హిందువుగా పుట్టడమే గర్వకారణమని ఆయన తెలిపారు. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూ హిందూ ధర్మం కోసం పని చేయాలని, హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్షమని ఆయనతెలిపారు. ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు.
Ramoji Excellence Awards |చంద్రబాబు, రేవంత్ సరదా నవ్వులు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చాలా రోజుల తర్వాత ఒకేచోట
నయా చరిత్ర సృష్టించిన పారా షూటర్ శ్రీకాంత్
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్లో భారత్కు చెందిన పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్కు చెందిన ధనుష్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు క్వాలిఫికేషన్లోనే రికార్డును తిరగరాసిన తెలుగుతేజం ధనుష్ ఫైనల్లో అసాధారణ ఆటను కనబరిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ధనుష్ 251.7 పాయింట్లతో పసిడి పతకాన్ని గెలిచి అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. మరోవైపు భారత్కే చెందిన మహ్మద్ వానియాకు రజతం లభించింది. ఇక డెఫ్లింపిక్స్లో స్వర్ణం గెలిచి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేసిన ధనుష్కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ధనుష్ శ్రీకాంత్ కోటి 20 లక్షల రూపాయల నగదును ఇస్తున్నట్టు రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం హనుమకొండలో ప్రకటించారు.
ప్రపంచబ్యాంక్ నిధులు దారిమళ్లింపు.. బిజెపి గెలుపుపై ప్రశాంత్ కిషోర్
పాట్నా: బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బిజెపి ఏకంగా రూ.14000 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులను దారిమళ్లించిందని జన్సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. మహిళల ఖాతాల్లోకి రూ.10000ల్లోకి నగదు బదిలీగా చేశారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు పాల్పడ్డ అత్యంత తీవ్రస్థాయి అనైతిక చర్య ఇదే అని విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన చెప్పారు. ప్రతి కుటుంబంలో మహిళ ఖాతాకు రూ పదివేలు పంపిస్తామని మోడీ ఎన్నికల కోడ్కు ముందు చెప్పారని, ఇందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్ నిధులను బిజెపి తన ఇష్టారాజ్యంగా వాడుకుందని చెప్పారు. బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంక్ రూ 14000 కోట్లు మంజూరు చేసింది. వీటిని మోడీ తన డబుల్ ఇంజిన్ అధికారంతో దారిమళ్లించాడని, ఈ క్రమంలో భారీ మెజార్టీ సాదించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు నితీశ్ కుమార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిధిలో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళా ఓటర్ల ఖాతాలకు ఈ డబ్బు పంపించిందని లెక్కలు తేల్చారు.
Thalaivar173: Dhanush to Direct the Project?
Thalaivar173 is one of the most prestigious films in Tamil Cinema. Legendary actor Kamal Haasan has decided to produce the film featuring Superstar Rajinikanth in the lead role. After Sundar C’s exit, there are a lot of names speculated to take up the direction hat. But nothing has been finalized told Kamal Haasan. As per […] The post Thalaivar173: Dhanush to Direct the Project? appeared first on Telugu360 .
Egg Carts |ఇక వీధుల్లో ఎగ్ కార్ట్స్
టంగుటూరు (ప్రకాశం జిల్లా) , ఆంధ్రప్రభ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక
కొన్ని గంటల్లో పెళ్లి.. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
భావ్నగర్: పెళ్లి జరగాల్సిన రోజే గుజరాత్ భావ్నగర్కు చెందిన యువతి సోనీ రాథోడ్ ప్రియుడు, కాబోయే భర్త చేతిలో హత్యకు గురైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట శనివారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సోనీ ఇంట్లో కలుసుకున్నారు. చీర గురించి కొన్ని ఖర్చుల గురించి ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీనితో ప్రేమికుడు సాజన్ బరాయియా రాక్షసుడై అత్యంత పాశవికంగా చంపివేశాడు. పరారైన ఈ వ్యక్తి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సోనీ ఈ విధంగా పెళ్లి రోజు నాడు , పెళ్లికి ముందే అంతం కావడంపై ఆవేదన వ్యక్తం అయింది.
Less NPA |ఎన్పీఏ తగ్గితేనే.. బ్యాంకు పురోభివృద్ధి
ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : మొండి బకాయిలు తగ్గిస్తేనే బ్యాంకు పురోభివృద్ధి సాధ్యం
Paanch Minar Trailer: Raj Tharun is Back
Raj Tharun starrer Paanch Minar trailer has been launched today by director Sai Rajesh. The trailer promises a neat, fun out and out comedy entertainer. Directed by Ram Kadumula and produced by Madhavi, MSM Reddy, movir is presented by Govinda Raju. Raj Tharun is playing a cab driver who wishes to become a business magnate […] The post Paanch Minar Trailer: Raj Tharun is Back appeared first on Telugu360 .
త్రికూట ఆలయంలో కార్తీకదీపోత్సవం..
రఘునాథపల్లి, (ఆంధ్రప్రభ) : జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ గ్రామంలో కార్తీక
బీహార్ ఫలితం ప్రకంపనలు.. ఇండియా కూటమిలో బీటలు?
లక్నో: బిజెపి అత్యంత బలోపేతంగా ఉన్న ప్రధాన హిందీబెల్ట్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఇక ఇండియా కూటమి పరిస్థితి ఏమిటనేది కీలక ప్రశ్న అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాల ఐక్యత, ప్రత్యేకించి , ఇతర పార్టీలు కాంగ్రెస్తో కూటమి కట్టడం వంటి వాటిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి భవితవ్యం ఏమిటనేది కీలక ప్రశ్నగా మారింది. రాజకీయంగా అత్యంత కీలకమైన యుపిలో అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరుగుతాయి. 2024లోక్సభ ఎన్నికల దశలో కాంగ్రెస్, ఎస్పి ఇతర పార్టీల ఎన్నికల సర్దుబాట్లతో ఇండియా కూటమి రంగంలోకి దిగింది. ఈ దశలో బిజెపి ఆధిపత్యానికి సవాలు విసిరింది. ఎన్డిఎకు వ్యతిరేకంగా నిలిచి తగు సీట్లు పొందింది. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలలో మహాఘట్బంధన్ ఫార్మూలా పనిచేయలేదు. మరింత బలోపేతం అయిన బిజెపి ఇప్పటి నుంచే యుపిపై ఎక్కువగా తన శక్తియుక్తులను కేంద్రీకృతం చేసుకుంటోంది. మరో వైపు ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో రాజకీయ దాడికి దిగుతున్నారు. పార్టీని ముస్లిం లీగ్, మావోయిస్టు పార్టీ అని, త్వరలోనే పార్టీలో చీలిక వస్తుందని చెప్పడం అత్యంత వ్యూహాత్మక రాజకీయ పరిణామం అయింది. ప్రత్యేకించి కాంగ్రెస్లో అంతర్గతంగానే కాకుండా, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలోనూ కాంగ్రెస్తో కలిసి ముందుకు సాగాలా? వద్దా అనే రాజకీయ ధర్మసందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకూ ఇండియా కూటమి వైపు మొగ్గుచూపుతూ వస్తున్న కొన్ని ప్రాంతీయ బలీయ పార్టీల నాయకులు ఇండియా కూటమిలో సాగాలా? వీడాలా? అనే సందిగ్ధంలో పడుతున్నారని రాజకీయ వర్గాలు తెలిపాయి. అయితే బీహార్ ఎన్నికల ఫలితాలు యుపిపై పడబోవని సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చెప్పారు. బిజెపి ఓ పార్టీ కాదు, ఓ ఫ్రాడ్ అని, బీహార్ ఫలితంపై సమీక్షించుకుని ఇక్కడ తగు వ్యూహాలు రూపొందించుకుంటామని చెప్పారు. ఇప్పటికిప్పుడు యుపిలో పరిస్థితిపై చెప్పడానికి ఏమి లేదని, పరిస్థితిని సమీక్షించుకుంటామని యుపి పిసిసి అధ్యక్షులు అజయ్ రాయ్ తెలిపారు.
టెర్రర్ లింక్తో కశ్మీర్లో లేడీ డాక్టర్ అరెస్ట్..
శ్రీనగర్ : పలు రాష్ట్రాలకు విస్తరించుకున్న వైట్కాలర్ టెర్రర్ వ్యవస్థ ఛేదన దశలో జమ్మూ కశ్మీర్లో ఆదివారం ఓ లేడీ డాక్టర్ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కీలక మూలాలున్న హర్యానాలోని రొహతక్కు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అనంత్నాగ్లో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంత్నాగ్లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా విధులలో ఉన్న లేడీ డాక్టర్ను ఆమె నివాసం ఉంటున్న వసతి గృహంపై దాడి చేసి అరెస్టు చేశారు. ఎర్రకోట ఉగ్రపేలుడు తరువాత టెర్రర్ ముఠా ప్రత్యేకించి డాక్టర్లుగా పనిచేస్తున్న వారే ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయింది. దీనితో బహుళస్థాయి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కశ్మీర్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో అనుమానిత ప్రాంతాలలో సోదాలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అనంత్నాగ్లో ఈ డాక్టర్ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తు వేగవంతం అయింది. ఈ క్రమంలోనే దీని వెనుక పలు స్థాయిల్లో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ ఉగ్ర సంస్థలతో ఈ వైట్కాలర్ టెర్రర్ గ్యాంగ్కు లింక్లు ఉన్నట్లు వెల్లడైంది. పైగా టర్కీనుంచి కూడా ఎప్పటికప్పుడు ఫరీదాబాద్లోని టెర్రర్ లింక్ల అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి సాయం అందుతోందని సూచనప్రాయంగా తెలిసింది. అదుపులోకి తీసుకున్న వైద్యురాలిని భద్రతా సంస్థలు వెంటనే తరలించి కీలక విషయాలను రాబట్టుకునేందుకు విచారిస్తున్నాయి. అరెస్టు తదుపరి ప్రక్రియ గురించి అనంత్నాగ్ పోలీసులుమీడియాకు సంక్షిప్తంగా తెలిపారు. అనంత్నాగ్లోని మలక్నాగ్ ప్రాంతంలో ఓ హాస్టల్లో ఈ డాక్టర్ ఉంటోంది. అక్కడి నుంచి స్వాధీనపర్చుకున్న మొబైల్ ఫోన్, సిమ్కార్డులోని సమాచారాన్ని ఫోరెన్సిక్ పరీక్షలతో రాబట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఇంతకు ముందు పనిచేసిన అదీల్ అనే వ్యక్తిని పట్టుకుని జరిపిన విచారణ క్రమంలో ఈ లేడీడాక్టర్ పాత్ర గురించి తెలిసింది. అదీల్ ఫోన్ కాల్స్ సమాచారంతో డాక్టర్ చిరునామాను నిర్థారించారు. ఈ టెర్రర్ మాడ్యూల్ ప్రకంపనలు ఉత్తరప్రదేశ్లోనూ చోటుచేసుకున్నాయి. అక్కడ చదివే దాదాపు 200 మంది కశ్మీరీలైన మెడికల్ కాలేజీ విద్యార్థుల కదలికలను కూడా స్థానిక పోలీసు సహకారంతో నిఘా సంస్థలు ఆరాతీస్తున్నాయి. కాన్పూర్, లక్నో, మీరట్, సహ్రాన్పూర్ ఇతర చోట్ల ఉన్న మెడికల్ కాలేజీలు, అక్కడి విద్యార్థుల మూలాలు, పూర్వాపరాలపై నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.
Global Summit ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం..
Global Summit ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం.. ఆంధ్రప్రభ , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, కందుకూరు
Nallagonda |మట్టి రోడ్డుకు మోక్షం…
Nallagonda | మట్టి రోడ్డుకు మోక్షం… మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ
కవిత వ్యాఖ్యలు ఎవరి కోసం?: వివేకానంద గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ సర్కారు హయాంలో పదేళ్లు ఎంపి, ఎంఎల్సి పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని బిఆర్ఎస్ శాసనసభ విప్ కెపి వివేకానంద గౌడ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి, ఆ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత బిఆర్ఎస్ పార్టీపై, మాజీ మంత్రులపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటీ..? అని అడిగారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరి కోసం...ఎవరి ప్రయోజనాల కోసం..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంతో కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భవన్లో ఆదివారం కెపి వివేకానంద మీడియాతో మాటాడుతూ, బిఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుని కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్కు ప్రయోజకరంగా ఉన్నట్టుగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు, రౌడీయిజం, ఈ ఎన్నికలో గెలిచిన తీరు తెన్నులు ఆమెకు కనబడలేదా..? అని ప్రశ్నించారు. పార్టీ పెడితే పెట్టుకోవాలి, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి ప్రయోజన కరంగా ఉండే విధంగా కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ ట్రాప్లో కవిత.. ఎంఎల్సి కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడ్డారని వివేకానంద గౌడ్ ఆరోపించారు. అందుకే బిఆర్ఎస్ మాజీ మంత్రులను విమర్శిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కూతురిగా బిఆర్ఎస్ పార్టీలో, నాయకులు, కార్యకర్తలలో ఆమెకు చాలా గౌరవం ఉందని, పార్టీలో సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. ఇంటి బిడ్డగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో గౌరవించారని తెలిపారు. ఆమె ఇలాంటి వ్యాఖ్యల వల్ల సభ్యసమాజం ఏమనుకుంటుందో అర్థం చేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బిఆర్ఎస్ కార్యకర్తలను పోరాటాలు చిన్నగా చేసి మాట్లాడారని, కానీ అధికార దుర్వినియోగం చేసి, రౌడీయిజంతో అరాచకాలు చేస్తే, అలాంటివి కనబడలేదా..? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్రావులను ఉద్దేశిస్తూ కృష్ణార్జునులు అని సంభోధిస్తూ, సెటైర్లు వేయడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ వల్లనే సిఎం రేవంత్రెడ్డి గల్లీగల్లీ తిరిగారని అన్నారు. కెసిఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ఆయనే తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని తెలంగాణ ప్రజానీకం ముక్తకంఠంతో కోరుకుంటుందని వివేకానంద స్పష్టం చేశారు.
నేడు కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
గిగ్ వర్కర్ల ముసాయిదా, ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్లపై చర్చ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుంది. మధ్యాహ్నాం మూడు గంటలకు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు బిసి రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో భాగంగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా అమలు చేయటం ఇబ్బందికరంగా మారడంతో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే, ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మంత్రులతో సిఎం చర్చించనున్నారు. ఈ ఎన్నికలపై మంత్రుల అభిప్రాయాలతో పాటు న్యాయనిపుణుల సలహాలను తీసుకోనున్నారు. పూర్తి సమాచారాన్ని అందుబాటులో..... మంత్రివర్గం సమావేశం ఎజెండాకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సిఎస్ రామకృష్ణారావు ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయగా హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్లో జరగాల్సిన ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ప్రజా పాలన విజయోత్సవాలపై.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఈ డిసెంబర్ 07వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తి కానుంది. దీంతో డిసెంబర్ రెండో వారంలో ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహించనుంది. అందుకే ఈ ఉత్సవాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం కోరే అవకాశం ఉందని సమాచారం. ఉత్సవాల సందర్భంలో షెడ్యూల్ వెలువడితే ప్రజలు, పార్టీ గ్రామీణ క్యాడర్ మొత్తం ఎన్నికల్లో తలమునకలవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం డిసెంబర్ 8,9వ తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్2025ను నిర్వహించనుంది. దీనికి దేశ, విదేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. 9వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఈ సదస్సులో ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రత, ఏర్పాట్లపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తికావడంతో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో ఇన్ని రోజులపాటు పెండింగ్లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. గిగ్ వర్కర్ల ముసాయిదాపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
DRUSHYAM 3 : వీడిన కుప్పం మర్డర్ మిస్టరీ
DRUSHYAM 3 : వీడిన కుప్పం మర్డర్ మిస్టరీ ( చిత్తూరు, ఆంధ్రప్రభ
రాజ్యాంగం వల్లే చాయ్వాలా ప్రధాని అయ్యారు: సిఎం చంద్రబాబు
బీఆర్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని సీఎం చంద్రబాబు అన్నారు. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయన్నారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరామన్నారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యమని అన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందని తెలిపారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయని, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే, ప్రతి ఒక్కరూ ఎడిటరే అన్నారు. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేడ్కర్ మనకు అందించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదన్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో భారత్ అన్నిరంగాల్లో నిపుణులను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047కల్లా ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా భారత్ మారుతుందని సీఎం వ్యాఖ్యానించారు.
రాణించిన రుతురాజ్.. వన్డే సిరీస్ భారత్-ఎదే
రాజ్కోట్: దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన రెండు అధికారిక వన్డే మ్యాచ్లో భారత్-ఎ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్ని 2-0 తేడాతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో 132 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్-ఎ 27.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి చేధించింది. భారత బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ 68 పరుగులతో కదం తొక్కాడు. అభిషేక్ శర్మ 32, తిలక్ వర్మ 29 పరుగులతో రాణించాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయానికి తొడ్పడిన రుతురాజ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది.
సింగం రెండు చోట్ల ఓటమి #Bihar #Elections #ShivdeepLande #AssemblyPolls #PoliticalNews
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. భారీ వర్షాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రెండు అల్పపీడనాలు ఉన్నాయని, దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎపి వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ . అదే సమయంలో, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరుసటి రోజు, మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రస్తుత అల్పపీడనం నుంచి కోలుకునేలోపే ఏపీపై మరో అల్పపీడనం ప్రభావం చూపనుంది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమా చారం ప్రకారం, ఈ రెండవ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Q2FY26 ఫలితాలు ప్రకటించిన LG ఎలక్ట్రానిక్స్
FY26 రెండవ త్రైమాసికం కోసం - ప్రధానమైన గృహోపకరణాల్లో మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ లో నంబర్ వన్ భాగస్వామిగా ఉన్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ (LGEIL) ఈ రోజు ఫలితాలు ప్రకటించింది. వేసవి కాలం చల్లగా ఉండటం + భౌగోళిక రాజకీయ పరిస్థితిలు మరియు ఫోరెక్స్ సవాళ్లు కారణంగా Q2-FY26 గణనీయంగా ప్రభావానికి గురైంది. అయినప్పటికీ వార్షిక ప్రాతిపదికన LG ఎలక్ట్రానిక్స్ ఇండియా రెవిన్యూ మరియు మార్కెట్-వాటా రెండిటిని పెంచింది. మార్కెట్-వాటా వృద్ధి: · TV 27% వృద్ధి (1.45 పెంపుదల) · రిఫ్రిజిరేటర్లు 29.9% (1% పెరుగుదల) · ACలు 17.3% (0.5% పెరుగుదల) · వాషింగ్ మెషీన్లు 33.4% (ఫ్లాట్- క్షీణత లేదు లేదా పెంపుదల లేదు) · మైక్రోవేవ్ ఓవెన్స్ 45$% (ఫ్లాట్- క్షీణత లేదు లేదా పెంపుదల లేదు) పైన చెప్పిన డేటా ఆఫ్ లైన్ ఛానల్స్ లో మా మార్కెట్-వాటాకి నిర్దిష్టమైనది, ఇది పరిశ్రమ యొక్క ప్రాథమిక వృద్ధి ప్రేరేపక శక్తి మరియు దీని కోసం డేటా ఉపలబ్దం. ఆసక్తికరంగా, రెండు ముఖ్యమైన విభాగాల్లో నంబర్ 2 భాగస్వామితో పోల్చినప్పుడు LG వారి నాయకత్వ అంతరం ఎప్పటి కంటే అధికంగా ఉంది: · TV - 6.7% · రిఫ్రిజిరేటర్లు - 6.2% Q2FY26లో 8.9% లాభంతో Q2FY25 లో రూ. 61.14 బిలియన్స్ కార్యకలాపాలు ద్వారా కంపెనీ ఆదాయాన్ని అందించింది, ఇది Q2FY26లో రూ.61.74 బిలియన్స్ కార్యకలాపాలు ద్వారా వచ్చింది. సవాలుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ, LGEIL స్థిరమైన ఉన్నతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ లో కంపెనీ వారి అంతర్లీన శక్తి మరియు వినియోగదారు ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. కఠినమైన మార్కెట్ పరిస్థితులలో కంపెనీ పంపిణీదారులకు సహాయం చేయడానికి పెరుగుతున్న వస్తువుల ధరలు మరియు పండుగల సమయాల్లో గో-టు-మార్కెట్ కార్యక్రమాల్లో పెరుగుతున్న పెట్టుబడుల మిశ్రమ ప్రభావం ఫలితంగా EBITDA లాభం తగ్గుదల ఏర్పడింది. LGEILకి రెండు వ్యాపార వర్గాలు ఉన్నాయి-హోమ్ అప్లయెన్సెస్ & ఎయిర్ సొల్యూషన్స్ (H&A) విభాగం మరియు హోమ్ ఎంటర్టైన్మెంట్ (HE) విభాగం. H&Aలో ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్స్, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, కంప్రెసర్స్, HVAC, వాటర్ ప్యూరిఫైర్లు మరియు ఎయిర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి. HE విభాగంలో టెలివిజన్లు (ఫ్లాట్ ప్యానల్, సైనేజీ, ప్రొజెక్టర్లు, మానిటర్ TV), ఆడియో విజువల్, మానిటర్లు మరియు వ్యక్తిగత కంప్యూటర్లు ఉన్నాయి. H&A విభాగం Q2FY26లో తమ మార్కెట్ నాయకత్వాన్ని నిర్వహించింది, కీలకమైన శ్రేణుల్లో వృద్ధిని నమోదు చేసింది. GST సవరించబడిన రేటు ప్రకటన వినియోగదారు కొనుగోలును తాత్కాలికంగా వాయిదావేసింది, LGEIL వారి శక్తివంతమైన బ్రాండ్ ఈక్విటీ మరియు తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ దాని ప్రీమియం మార్కెట్ వాటాను శక్తివంతం చేయడంలో సహాయపడింది. అక్టోబర్ లో పరిచయం చేయబడిన కొత్తగా ప్రారంభించబడిన LG ఎసన్షియల్ సీరీస్ కీలకమైన మార్కెట్లలో శక్తివంతంగా ప్రారంభపు ఆదరణను సంపాదిస్తున్నాయి. ఈ శ్రేణితో, LGEIL తమ ధరల శ్రేణిని మరింత విస్తరించింది మరియు ప్రవేశించని మార్కెట్లలో మొదటిసారి కొనుగోళ్లు చేస్తున్న వారితో శక్తివంతమైన సంబంధాలను రూపొందిస్తోంది. మరింత అభివృద్ధి సాధిస్తూ, ఇటీవలి GST రేటు తగ్గింపు మరియు పండగలు మరియు వివాహాల సమయంలో సీజనల్ డిమాండ్ లతో మద్దతు చేయబడిన, LGEIL అన్ని ఉత్పత్తి శ్రేణుల్లో భవిష్యత్తు వృద్ధి గురించి ఆత్మవిశ్వాసంతో ఉంది. శ్రేణి యొక్క ఆదాయం Q2FY25లో 39.53తో పోల్చినప్పుడు Q2FY26లో రూ.39.48 బిలియన్ లు ఆదాయంగా నిలిచింది. HE శ్రేణి ఆదాయం Q2FY26తో పోల్చినప్పుడు వార్షికంగా 3% పెరిగింది, TV శ్రేణిలో పెరిగిన పండగ సీజన్ డిమాండ్ ద్వారా ప్రాథమికంగా మద్దతు చేయబడింది. భవిష్యత్తులో, LGEIL ఆవిష్కరణలను మరింత ముందుకు ప్రోత్సహించడం మరియు QNED మరియు OLED శ్రేణులతో సహా ప్రీమియం ఉత్పత్తి పోర్ట్ ఫోలియోలో దాని మార్కెట్ స్థానాన్ని పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్య, ఆతిధ్యం, వైద్య మరియు సంస్థాపరమైన పరిశ్రమలు వంటి రంగాల్లో భారతదేశపు పెరుగుతున్న మౌళిక సదుపాయాల నుండి పెరుగుతున్న అవకాశాలను సమన్వయం చేయడం ద్వారా తమ B2B ఉనికిని విస్తరించే ఉద్దేశ్యం కూడా కంపెనీకి ఉంది. శ్రేణి యొక్క ఆదాయాన్ని Q2FY25లో రూ.21.61 బిలియన్ లతో పోల్చినప్పుడు Q2FY26లో 22.26 బిలియన్ లుగా నిలిచింది. అభివృద్ధి చెందే మార్గాన్ని పేర్కొంటూ, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ. హాంగ్ జు జియాన్ ఇలా అన్నారు, “2026 మొదటి త్రైమాసికంలో చల్లని వేసవి, భౌగోళిక రాజకీయ సవాళ్లు, సుంకాలు మరియు ఫారెక్స్ హెచ్చుతగ్గులు వంటి కొన్ని స్థూల ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ, భారతదేశంలో మా టీమ్ సహనశీలత కలిగిన సేల్స్ వృద్ధిని ప్రదర్శించింది, మార్కెట్ వాటాను సంపాదిస్తోంది మరియు స్థిరమైన లాభాన్ని నిర్వహిస్తోంది. ఈ పెర్ఫార్మెన్స్ మా కార్యకలాపాలు అమలు శక్తిని మరియు మా బ్రాండ్ లో వినియోగదారులు ఉంచిన లోతైన నమ్మకాన్ని సూచిస్తోంది. ఇది మా శక్తివంతమైన ప్రాధమికాంశాలను సూచిస్తోంది మరియు భారతదేశపు మా వృద్ధి కథకు మా నిరంతర నిబద్ధతను బలవర్ధకం చేస్తోంది. ప్రపంచ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు ఎగుమతులను పెంచడంపై దృష్టిసారించి మా డొమేస్టిక్ ఉనికిని విస్తరించడం ద్వారా మేము ఇప్పుడు మా భవిష్య వృద్ధిని వ్యూహాత్మకంగా పెంచుతున్నాము. మా మూడవ ప్లాంట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది మరియు మా కొత్త ఉత్పత్తి శ్రేణి, LG ఎసన్షియల్ సీరీస్ టియర్ 2 మరియు 3 మార్కెట్లలో మా వృద్ధిని మద్దతు చేస్తోంది. మా కేంద్రీకరణ స్పష్టంగా ఉంది: మా కస్టమర్ల జీవితాలను సుసంపన్నం చేసే ఆధునిక టెక్నాలజీని అందచేయడం మరియు భారతదేశం అత్యంత అభిమానించే బ్రాండ్ గా మా స్థానాన్ని దృఢతరం చేయడం.” ‘మేక్ ఫర్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇండియా గ్లోబల్’కి తమ నిబద్ధత ద్వారా, LGEIL తమ భారతదేశం-కేంద్రీయమైన పోర్ట్ ఫోలియోను విస్తరించడం కొనసాగిస్తోంది మరియు అంతర్జాతీయ ఆర్థిక నాయకునిగా తమ తలెత్తడానికి మద్దతును ఇస్తోంది. ‘మేక్ ఫర్ ఇండియా’ విషయంలో, భారతదేశపు జీవనశైలులకు ఉత్తమంగా సరిపోయే తయారీ ఉత్పత్తులకు విస్తృతమైన స్థానిక అంశాలతో అంతర్జాతీయ టెక్నాలజీని కంపెనీ కలుపుతోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ విషయంలో, తమ తయారీ ఉనికిని విస్తరించడానికి LGEIL తమ మార్గంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తమ మూడవ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. ‘మేక్ ఇండియా గ్లోబల్’ ద్వారా, కంపెనీ తమ మాతృ సంస్థ యొక్క గ్లోబల్ సౌత్ వ్యూహంలో భాగంగా హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ లలో భారతదేశపు ఉత్పాదకతను పెంచుకునే మార్గాలను పరిశీలిస్తోంది.
బాలికలు స్నానం చేస్తుండగా చిత్రీకరణ.. వార్డెన్పై పోక్సో కేసు
ఆదిలాబాద్: ఆశ్రమ పాఠశాలలో బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్ని అధికారులు సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్పల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో వార్డెన్గా విధులు నిర్వర్తిస్తున్న జి.ఆనందరావు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఇటీవల షీ టీమ్ అవగాహన కార్యక్రమం పాఠశాలలో జరిగింది. అప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు సేకరించిన సిటీ పోలీసులు .. బేల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం రాత్రి ఆనందరావుపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం అతడిని రిమాండ్కు తరలించారు. తాజాగా అతడిని విధుల నుంచి బహిష్కరిస్తూ.. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంజాజీ ఉత్తర్వులు జారీ చేశారు.
మహేశ్-రాజమౌళి మూవీ ‘వారణాసి’.. విడుదల ఎప్పుడంటే?#telugupost #viralvideo #varanasi #ssrajamouli
పత్తి కొనుగోళ్లపై ఉద్దేశపూర్వకంగా కేంద్రం కొర్రీలు పెడుతోంది: కెటిఆర్
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి ఉండగా, దాన్ని ఏకంగా 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందన్నారు. జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులు చెబుతూ కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే, మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల పైన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వలన జిన్నింగ్ మిల్లులు ఒకేసారి ప్రారంభం కాకపోవడం కూడా రైతుల విక్రయాలకు ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికీ పలు జిల్లాల్లో పత్తి కొనుగోలు ఆగిపోయింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిన్నింగ్ మిల్లుల కేటగిరీల విభజనను నిరసిస్తూ సోమవారం నుంచి జిన్నింగ్ మిల్లులు మరోసారి బంద్కు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నెల రోజుల్లో సిసిఐ కేవలం 1.12 లక్షల టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసిందని, ఈ సీజన్లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది అత్యంత స్వల్పమని చెప్పారు. కేవలం రాజకీయాలపైనే దృష్టి సారించకుండా, రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం 325 జిన్నింగ్ మిల్లులకు గాను 256 మిల్లులు మాత్రమే ఓపెన్ చేసి, మిగిలిన వాటిని కూడా తెరవకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వాల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మరోవైపు రైతులు తమ పత్తిని అమ్ముకునేందుకు కపస్ మొబైల్ యాప్ కచ్చితంగా వినియోగించాలన్న నిబంధన సడలించాలని, రైతులు పత్తి ఎప్పుడు తీసుకువస్తే అప్పుడు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని పత్తి రైతన్నల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండికి వేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్తో పాటు మంత్రుల బృందం ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపిన విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే కేంద్రంపైన ఒత్తిడి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్తో తమకెలాంటి విభేదాల్లేవు: అసదుద్దీన్ ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే నవీన్ యాదవ్కు మద్దతిచ్చామని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు భావించడం సరికాదన్నారు. బిఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అసదుద్దీన్ స్పష్టం చేశారు. కెసిఆర్ అయినా, తానైనా తమ పార్టీలకు ఏది మంచిదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తామని తెలిపారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంచల్కు వెళ్లనున్న ఓవైసీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలు కైవసం చేసుకున్న మజ్లిస్ పార్టీలో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 23 స్థానాల్లో పోటీ చేసింది. ఐదు స్థానాల్లో విజయం సాధించడం ద్వారా తమ సిట్టింగ్ స్థానాలను నిలుపుకుంది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ అక్కడి ప్రజలను కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ నెల 21, 22 తేదీల్లో బీహార్లోని సీమాంచల్ వెళుతున్నారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఎక్స్ వేదికగా తెలిపారు.
షూటర్ ధనుష్కు సర్కార్ భారీ నజరానా
హైదరాబాద్: టోక్కో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్కి చెందిన ధనుష్ శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ స్వర్ణపతకం సాధించాడు. ఫైనల్స్లో 252.2 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన ధనుష్.. తద్వారా డెఫ్లంపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్ల సాధించిన షూటర్గా రికార్డు సృష్టించాడు. సూరత్కు చెందిన షూటర్ మహ్మద్ వానియా 250.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతాకం సొంతం చేసుకున్నాడు. తద్వారా రెండు పతకాలు భారత్నే వరించాయి. ఈ నేపథ్యంలో ధనుష్ శ్రీకాంత్కు తెలంగాణ సర్కార్ భారీ సజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ.1.20 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీధర్ ప్రకటించారు. ఆదివారం (నవంబర్ 16) హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CJI గావాయ్ పై జరిగిన దాడిని
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన వివిధ క్రీడా
HYD |ప్రజలపై హనుమంతుని ఆశీస్సులు.. –ఎమ్మెల్యే గణేష్
తాడుబందు హనుమాన్ దేవాలయంలో అన్నకూట మహోత్సవం, దివ్య జ్యోతి సందర్శన కార్యక్రమాలు భక్తి
HYD |అయ్యప్ప పూజలో ఎమ్మెల్యే గణేష్..
కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బొల్లారం నల్ల పోచమ్మ తల్లి
Naveen Yadav |మంత్రులతో నవ ఎమ్మెల్యే భేటీ..
Naveen Yadav | మంత్రులతో నవ ఎమ్మెల్యే భేటీ.. హైదరాబాద్, ఆంధ్రప్రభ :
HYD |మంత్రి తుమ్మల.. నవీన్ భేటీ..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఈరోజు రాష్ట్ర
ఫ్యాక్ట్ చెక్: మహేంద్ర సింగ్ ధోనిని యూకే పోలీసులు అరెస్ట్ చేయలేదు
ముసుగు ధరించిన ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు ఎస్కార్ట్ చేస్తూ తీసుకెళ్తుండగా
Jubilee Hills |నవీన్ గెలుపుతో తలనీలాలు సమర్పించిన కాంగ్రెస్ నేత…
Jubilee Hills | నవీన్ గెలుపుతో తలనీలాలు సమర్పించిన కాంగ్రెస్ నేత… Warangal
HYD |సీఎం రేవంత్ పోరాట పటిమ అన్ని వర్గాలకు ఆదర్శం : డాక్టర్ కోట నీలిమ
సనత్ నగర్ : బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్
Temple | శివనామ స్మరణతో… Kamareddy | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ :
Narayanpet |కేంద్ర ప్రభుత్వం విధానాలే అడ్డంకి…
Narayanpet | కేంద్ర ప్రభుత్వం విధానాలే అడ్డంకి… Narayanpet | నారాయణపేట ప్రతినిధి,
Basara |బాసర క్షేత్రంలో భక్తజన సంద్రం
Basara | బాసర క్షేత్రంలో భక్తజన సంద్రం Basara | బాసర, ఆంధ్రప్రభ
MBA నుంచి పైరసీ వరకూ ఐ బొమ్మ రవి కథ బయటకు #iBOMMAArrest #PiracyKingpin #SoftwareEngineerRavi
Temple | సొంత నిధులతో… Yadadri | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి
Govt Hospital |పొలం పనులకు వెళ్లి…
Govt Hospital | పొలం పనులకు వెళ్లి… Karimnagar | కాల్వ శ్రీరాంపూర్,
House |ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం…
House | ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం… Jagityala |ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి
Andhra Prabha Smart Edition|ఆశాకిరణం/లెక్కిద్దాం/దోపిడీ
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 16-11-2025, 4.00PM* *రాజకీయాల్లో ఆశాకిరణం* *పులులను
Sports |యువత క్రీడల్లో రాణించాలి…
Sports | యువత క్రీడల్లో రాణించాలి… Warangal | వేలేరు, ఆంధ్రప్రభ :
భారత బౌలర్ల వీరవిహారం.. సౌతాఫ్రికా-ఎ స్కోర్ ఎంతంటే..
రాజ్కోట్: భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా-ఎ జట్టు, భారత-ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేల సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో భారత-ఎ జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో సఫారీ ఆటగాళ్లకి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా సఫారీలను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా-ఎ జట్టు 30.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటింగ్లో రివాల్డో మూన్సామి (33) టాప్ స్కోరర్గా నిలవగా.. డెలానో పోట్గీటర్ 23, డయాన్ ఫారెస్టర్ 22, లువాన్-డ్రే ప్రిటోరియస్ 21, ప్రేనేలన్ సుబ్రాయోన్ 15 పరుగులు చేశారు. భారత బౌలింగ్లో నిషాంత్ సింధు నాలుగు వికెట్లు, హర్షిత్ రాణా 3 తీసి సఫారీలను కుప్పకూల్చారు. వీరికి ప్రసిద్ధ్ కృష్ణ 2, తిలక్ వర్మ 1 వికెట్తో తమ వొంతు సహకారం అందించారు. ప్రస్తుతం ఇండియా 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. క్రీజ్లో అభిషేక్ శర్మ (12), రుతురాజ్ గైక్వాడ్ (3) ఉన్నారు.
Delhi |బీసీ రిజర్వేషన్లపై రన్ ఫర్ జస్టిస్…
Delhi | బీసీ రిజర్వేషన్లపై రన్ ఫర్ జస్టిస్… Nagar Kurnool |
దేశంలో ఎన్నో పాలసీలు చూశాను : చంద్రబాబు
అమరావతి: ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. మన రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. చాయ్ వాలా నరేంద్రమోడీ ప్రధాని అయ్యారంటే అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని కొనియాడారు. దేశంలో ఎన్నో పాలసీలు చూశానని, ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2014లో.. 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 4వస్థానానికి చేరిందని చంద్రబాబు తెలియజేశారు. వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతోందని, 2038 నాటికి ప్రపంచంలో భారత్.. రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోందని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. మంటలు వ్యాప్తి చెందడంతో మరో కారు కూడా పాక్షికంగా కాలిపోయింది. భారీగా పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాంధీనగర్, దోమలగూడ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొమ్ముకోనాం వేట.. కాసుల పంట #Fisheries #Kakinada #CoastalUpdates #MarketPrice #AndhraPradesh
Adilabad |సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం
Adilabad | సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ
Adilabad |సోయా కొనుగో్లు కేంద్రం ప్రారంభం
Adilabad | సోయా కొనుగో్లు కేంద్రం ప్రారంభం Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ
Ram’s Andhra King Taluka to release a day early
The overwhelming hype for Andhra King Taluka, starring Ram Pothineni and Bhagyashri Borse, has led producers Mythri Movie Makers to advance its release date to November 27th. The decision was made to reward the audience enthusiasm following a string of highly successful and trending promotional materials. Under the direction of Mahesh Babu P, the film […] The post Ram’s Andhra King Taluka to release a day early appeared first on Telugu360 .
India Collapses at Eden Gardens
India suffered a shocking defeat at the Eden Gardens as South Africa claimed a memorable 30-run win in the opening Test of the two-match series. Chasing only 124, India were bundled out for 93 on a pitch that turned unpredictable. The result not only handed South Africa a rare Test victory on Indian soil but […] The post India Collapses at Eden Gardens appeared first on Telugu360 .
Srisailam |ఉమామహేశ్వర స్వామిని దర్శంచుకున్న ప్రిన్స్ మహేశ్ సోదరి
Srisailam | ఉమామహేశ్వర స్వామిని దర్శంచుకున్న ప్రిన్స్ మహేశ్ సోదరి Srisailam |
CBI to grill BRS leader Putta Madhu
The Central Bureau of Investigation (CBI) issued notices to BRS senior leader and former MLA Putta Madhu to attend for inquiry on Monday. The CBI will grill controversial leader in the High Court advocates couple murder case. Former MLA of Manthani Putta Madhu is set to attend for inquiry to be conducted by CBI sleuths […] The post CBI to grill BRS leader Putta Madhu appeared first on Telugu360 .
EAG CARTS |ఎగ్ కార్ట్స్ తోపుడు బండ్ల పంపిణీ
EAG CARTS | టంగుటూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక
Warangal |స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
Warangal | స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి Warangal | పాలకుర్తి,
Boyapati Srinu promises immersive 3D experience with Akhanda 2
The sequel to the blockbuster hit, Akhanda 2, featuring the celebrated God of Masses, Nandamuri Balakrishna, under the direction of Boyapati Srinu, has escalated its anticipation. At a recent Hyderabad gathering, producers disclosed the monumental decision to launch the feature in 3D format, on 5th December worldwide. Attendees, including press personnel and enthusiasts, were captivated […] The post Boyapati Srinu promises immersive 3D experience with Akhanda 2 appeared first on Telugu360 .
MLA |పాడె మోసిన ఎమ్మెల్యే మదన్
MLA | పాడె మోసిన ఎమ్మెల్యే మదన్ Kamareddy | కామారెడ్డి, తాడ్వాయి,
GUDIVADA |ఘనంగా కార్తీక వన సమారాధన
GUDIVADA | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో
Gurukula School |ఇక్కడ ఉండం సార్!
Gurukula School | ఇక్కడ ఉండం సార్! Asifabad | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ
TEMPLE |భక్త మార్కెండేయ ఆలయంలో మహాన్నదానం
TEMPLE | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు శ్రీశివ పార్వతి సహిత భక్త
అమెరికాలో పూజారులకు బంపర్ డిమాండ్” #USA #HinduTemples #Priests #Dallas #Trending
CM Revanth |నాణ్యత ప్రమాణాలు పాటించాలి
CM Revanth | నాణ్యత ప్రమాణాలు పాటించాలి Medaram | గణపురంభూపాలపల్లి జిల్లా
Dial your CMD |రేపు డయల్ యువర్ సీఎండీ
Dial your CMD | తిరుపతి, ఆంధ్రప్రభ : విద్యుత్ వినియోగదారుల సమస్యల
డెఫ్లెంపిక్స్లో అదరగొట్టిన హైదరాబాద్ షూటర్
టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్లో హైదరాబాద్కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ అరదగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. సూరత్కు చెందిన మరో షూటర్ మహ్మద్ వానియా రతజ పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్లో భారత్కు రెండు పతకాలు దక్కినట్లైంది.

16 C