AP | బిల్లుకు కాంగ్రెస్ మద్దతు AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఎలగడప గ్రామం నుంచి హనుమాన్ దీక్షపరుల పాదయాత్ర..
ఎలగడప గ్రామం నుంచి హనుమాన్ దీక్షపరుల పాదయాత్ర.. కొండగట్టు అంజన్న ఆలయానికి పాదయాత్రగా
పేదల వైద్యం నిలిపి వేస్తే ఉద్యమం తప్పదు…
పేదల వైద్యం నిలిపి వేస్తే ఉద్యమం తప్పదు… ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలా
Loksabha : పార్లమెంటులో అమరావతి బిల్లు
ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశేపెట్టారు. ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరగనుంది. చర్చ అనంతరం లోక్ సభ ఆమోదించి అనంతరం రాజ్యసభకు ఈ బిల్లును పంపనుంది. రేపు రాజ్యసభ ముందుకు... రేపు రాజ్యసభ ముందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలోనూ చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందుతుంది. ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లును పంపుతారు. రాష్ట్రపతి రాజధాని అమరావతి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు.
అకాల వర్షంతో రైతులు ఆగమాగం.. నేల వాలిన వరి, మొక్క జొన్న,రైతులను ప్రభుత్వం
పింఛన్లను పంపిణీ… పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు మండలం జుజ్జవరం గ్రామంలో
Jagan |చంద్రబాబు సీఎంగా ఉండడం దురదృష్టకరం..
Jagan | చంద్రబాబు సీఎంగా ఉండడం దురదృష్టకరం.. Jagan | ఆంధ్రప్రభ, వెబ్
వాణిజ్య గ్యాస్పై భారీ వాత.. రూ.195 పెరిగిన సిలిండర్ ధర
వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ. 195.50 మేర పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు బుధవారం, ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణమని చమురు సంస్థలు వెల్లడించాయి. […] The post వాణిజ్య గ్యాస్పై భారీ వాత.. రూ.195 పెరిగిన సిలిండర్ ధర appeared first on Visalaandhra .
ఒరాకిల్ ఊచకోత 30 వేల మంది ఉద్యోగులపై వేటు #Oracle #Layoffs #TechJobs #AIInvestments #JobCuts
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు
భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది. ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే […] The post భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు appeared first on Visalaandhra .
Telangana |పింఛన్ డబ్బుల కోసమేనా.. ?
Telangana | పింఛన్ డబ్బుల కోసమేనా.. ? Telangana | ఆంధ్రప్రభ, వెబ్
అయ్యప్ప స్వామికి అభిషేకాలు.. భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ ఆంధ్రప్రభ, చిట్టినగర్ :
అమరావతికి పార్లమెంట్ ముద్ర.. రాజధాని భవిష్యత్తుకు బలమైన భరోసా2028 నాటికి నిర్మాణం పూర్తి
లక్షన్నర దాటిన ధరబులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాటి జోరు కొనసాగింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,51,500కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ. 5,000 పెరిగి రూ. 2,37,000కి ఎగబాకింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కొనుగోళ్ల ఆసక్తి పెరగడం ధరల పెరుగుదలకు దోహదపడింది. ఇరాన్తో యుద్ధం […] The post బంగారం, వెండి ధరలు పరుగులు… appeared first on Visalaandhra .
రాజకీయ లబ్ధికోసం ప్రజలను రెచ్చగొడుతోన్న కాంగ్రెస్: ప్రధాని మోదీ
థరద్(గుజరాత్): పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను వాడుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి పెట్రోల్ పంపుల వద్ద బారులుతీరి నిలబడేలా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తోందన్నారు. దేశమంతా ఐక్యంగా నిలవాల్సిన సమయంలో కాంగ్రెస్ నేతలు విభజన రాజకీయాల్లో నిమగ్నమయ్యారని, రాజకీయ రాబందుల్లా కాచుకుని ఉన్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్లోని వావ్-థరాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ […] The post రాజకీయ లబ్ధికోసం ప్రజలను రెచ్చగొడుతోన్న కాంగ్రెస్: ప్రధాని మోదీ appeared first on Visalaandhra .
కూలికోసం, కూటికోసం పట్టణంలో బతుకుదామని పొట్ట చేతపట్టుకుని వచ్చే గిగ్ వర్కర్లకు అనుదినం కష్టాలే. ఎంత ఎదిగినా గొర్రె తోక బెత్తెడే అన్న చందంగా ఎంత కష్టపడినా చాలీచాలని వేతనం, ఒత్తిడితో కూడిన పని విధానం వారిని కుంగదీస్తున్నాయి. గిగ్ ఎకానమీ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నా, ఆ రంగానికి చెందిన కార్మికుల పట్ల యాజమాన్యాలదీ, ప్రభుత్వాలదీ చిన్నచూపే. వారి పరిస్థితి రోజువారీ కూలీల కంటే హీనంగా, దీనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చే దిశగా, రాష్ట్రంలో పనిచేస్తున్న నాలుగు లక్షలమంది గిగ్ వర్కర్ల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం రూపుదిద్దిన గిగ్ వర్కర్ల నమోదు, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు స్వాగతించదగినది. త్వరలో చట్టరూపం దాల్చనున్న ఈ బిల్లు అమలులోకి వస్తే, ఇకపై నమోదు చేసుకున్న కార్మికులకు ఐడి కార్డుతోపాటు పింఛను, బీమా, ప్రసూతి ప్రయోజనాలు లభిస్తాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సంక్షేమ బోర్డు గిగ్ వర్కర్లకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. కార్మికులకు వేతనాలు చెల్లించని అగ్రిగేటర్లపై కొరడా ఝళిపిస్తుంది. సమస్యల పరిష్కారంలో కార్మికులకు సహకరించడంతోపాటు అపిలేట్ అథారిటీని సైతం నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయడం హర్షణీయం. భారత ఆర్థిక వ్యవస్థకు గిగ్ కార్మికులు ‘కనిపించని చక్రాలు’ (ఇన్విజిబుల్ వీల్స్)గా అభివర్ణించడం కద్దు. కానీ వారి జీవితం మాత్రం చుక్కాని లేని పడవ లాంటిది. ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, వేతనంతో కూడిన సెలవులు, పనివేళలు లేకపోవడంతోపాటు పని ప్రదేశాల్లో వివక్ష, ఒత్తిడి గిగ్ వర్కర్లను కుంగదీస్తున్నాయి. పని లేని రోజున పస్తులు ఉండక తప్పడం లేదు. ఈ రంగంలో పనిచేస్తున్నవారిలో అధిక శాతం అవివాహితులే. పైగా ఇతర ప్రాంతాలనుంచి పట్టణాలకు వలస రావడంతో రేషన్ కార్డులకు సైతం నోచుకోవడం లేదు. గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళా కార్మికులకు భద్రత కరవైంది. మన దేశంలో గిగ్ వర్కర్ల పరిస్థితిలో ఎదుగూబొదుగూ లేదంటూ తాజా ఆర్థిక సర్వే సైతం కళ్లకు కట్టిన సంగతి గమనార్హం. నలభై శాతం మంది ఆన్లైన్ డెలివరీ వర్కర్ల వేతనం నెలకు 15వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువేనని ఆందోళన వ్యక్తం చేస్తూ, వీరికి న్యాయమైన వేతనాలు, వెయిటింగ్ పీరియడ్ లో పరిహారంతోపాటు గంటకు లేదా ప్రతి పనికీ కనీస ఆదాయం ఉండాలంటూ పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. గత పదేళ్లుగా గిగ్ ఎకానమీ దినదినాభివృద్ధి చెందుతోంది. గత ఏడాది ప్రపంచ గిగ్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 47 లక్షల కోట్ల రూపాయలని అంచనా. కానీ, ఇందుకు మూలకారకులైన గిగ్ వర్కర్ల సంక్షేమంపట్ల పాలకులు కనబరుస్తున్న చిత్తశుద్ధి చాలా తక్కువ. ఈ దిశగా ముందుగా కళ్లు తెరిచిన ఘనత రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుంది. మూడేళ్ల క్రితమే గిగ్ వర్కర్ల కోసం పటుతరమైన చట్టాన్ని రూపొందించి, అమలు చేస్తోంది. ఆ తర్వాత కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రాలలోను చట్టాలు రూపొందాయి. ఈ జాబితాలో తాజాగా తెలంగాణ చేరడం ముదావహం. సంఘటిత, అసంఘటిత రంగాలలో ఉద్యోగి- యజమాని సంబంధం లేకుండా స్వయంగా ఆదాయార్జన చేసేవారే గిగ్ వర్కర్లు అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సందర్భంలో నిర్వచనం ఘనంగానే చెప్పినా, వారి సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు ఎంతమాత్రం చాలవనే చెప్పాలి. ఆ మధ్య గిగ్ కార్మికులు జరిపిన మెరుపు సమ్మె అనంతరం నాలుక కరచుకుని, ముసాయిదా నిబంధనలకు రూపకల్పన చేసిన కేంద్రం వాటి అమలులో నత్తనడకన నడుస్తూండటం క్షమించరానిది. 2047 నాటికి మన దేశంలో ఆరుకోట్ల మంది గిగ్ కార్మికులు పనిచేస్తారని వీవీ గిరి కార్మిక కేంద్రం జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో అలరారుతున్న భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి రానున్న కాలంలో గిగ్ వర్కర్లే కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలు సైతం రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలు చూపిన బాటలో నడుస్తూ, గిగ్ వర్కర్ల సంక్షేమంకోసం పటుతరమైన చట్టాలు రూపొందించి, అమలు చేయాలి. అంతకుమించి, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దదిక్కుగా గిగ్ వర్కర్ల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకత్వం నెరపాలి. ఇంటర్మీడియెట్ విద్యార్హతతోనే ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న కార్మికులకు సామాజిక భద్రతతోపాటు నైపుణ్య శిక్షణ, డిజిటల్ అక్షరాస్యత కల్పించాలి. పది నిమిషాలలోపు డెలివరీ వంటి నిబంధనలను రూపుమాపి, కార్మికులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.
Dhurandhar Director’s Cut is Coming
Dhurandhar is the biggest hit in Indian cinema. The spy thriller released in two parts and both the installments are massive hits. Now, Aditya Dhar is coming with a ‘Director’s Cut’ and it will release in theatres soon. Both the parts will release as a single film and it lasts for 7.5 hours. This exclusive […] The post Dhurandhar Director’s Cut is Coming appeared first on Telugu360 .
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీలలో అసోంలో మాత్రమే బిజెపి సొంతంగా అధికారంలో ఉంది. పుదుచ్చేరిలో అధికార కూటమిలో భాగస్వామి అయినప్పటికీ అక్కడ సొంతబలంపై నిలబడే అవకాశం లేదు. అసోంలో అధికారం నిలబెట్టుకొని, వరుసగా మూడోసారి అధికారం పొందేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో మొదటిసారి ఏదిఏమైన్నప్పటికీ అధికారం చేపట్టాలని బిజెపి నాయకత్వం పట్టుదలతో పనిచేస్తున్నది. తమిళనాడు, కేరళలలో సైతం సొంతంగా అధికారం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో తన ప్రాబల్యం ఆ రాష్ట్రాలలో పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, బిజెపి నాయకత్వం ప్రస్తుతం తన దృష్టిని రాజకీయ ప్రత్యర్థులపైకన్నా సొంతపార్టీ నేతలు కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా చేయడంపైనే సారించాల్సి వస్తుంది. ఈ రాష్ట్రాలలో దశాబ్దాలనుండి సమీప భవిష్యత్తులో అధికారం దక్కే అవకాశాలు కనిపించకపోయినా పార్టీకోసం పనిచేస్తున్న నాయకులు, కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చేస్తున్న నాయకుల మధ్య ఘర్షణలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. నాలుగు రాష్ట్రాలలో కూడా పార్టీకి నేతృత్వం వహిస్తున్నది కొద్దికాలం క్రితం పార్టీలో చేరిన నాయకులే కావడం గమనార్హం. అసోంలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ చుట్టూ పార్టీ తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఎన్నికలు జరుగుతుంది బిజెపి- కాంగ్రెస్ మధ్య కాదని, శర్మ నేతృత్వంలోని బిజెపి, తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్య అంటూ రాజకీయ వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. తనను బిజెపిలోకి తీసుకొచ్చిన నాయకుడితో సహా దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందిన 15 మంది సిట్టింగ్ ఎంఎల్ఎలకు ఈ సారి బిజెపి సీట్లు లభించలేదు. పైగా, ఇటీవల పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులను అందలం ఎక్కిస్తున్నారు. 36 మంది కాంగ్రెస్ నాయకులు బిజెపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దానితో ఓ మహిళా మంత్రితో సహా పలువురు కాంగ్రెస్లో చేరారు. ఓ సీనియర్ బిజెపి నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండడంతో అవినీతి, నిరుద్యోగం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎక్కువగా గౌహతి చుట్టూ కేంద్రీకృతం అవుతుందనే విమర్శలు సైతం కొన్ని ప్రాంతాలలో సమస్యలు సృష్టిస్తున్నాయి. దేశం మొత్తం బిజెపి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుసన్నలలో బిజెపి నడుస్తుండగా, అసోంలో మాత్రం సిఎం శర్మ ‘సూపర్ బాస్’గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర నాయకులు సైతం జోక్యం చేసుకోలేని పరిస్థితులు ఏర్పరచుకున్నారు. ఇక పశ్చిమబెంగాల్లో సైతం ఒకప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కుడిభుజంగా వ్యవహరించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ సైతం పార్టీ సీనియర్ నాయకులు పలువురికి సీట్లు లభించకపోవడంతో పలు చోట్ల పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. విధ్వంసం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ సీట్లను అమ్ముకున్నారని అంటూ సీనియర్ నాయకులపై బహిరంగంగానే ఆరోపణలు చేయడంతో పార్టీని ఇరకాటంలోకి నెట్టివేసి పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్లు తొలగించామని, ఇక తమను అధికారంలోకి తీసుకురాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమాతో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీకి నమ్మకస్తుడైన గవర్నర్ ఆర్ఎన్ రవిని తమిళనాడు నుండి ప్రత్యేకంగా ఇక్కడకు తీసుకొచ్చి, ఎన్నికల ప్రకటన రాగానే రెవెన్యూ, పోలీసు అధికారులను భారీగా మార్చివేశారు. ప్రజలను గెల్చుకోవడం ద్వారా కాకుండా అధికార యంత్రంగం ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరే రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుండి తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కొన్నది. సుప్రీం కోర్టు జోక్యంకు కూడా దారితీసింది. ఎన్నికల కమిషన్పై మమత ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకు స్థానిక బిజెపికి నేతల నుండి ఎక్కువగా సమాధానాలవుతున్నాయి. బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలను ఆమె ప్రోత్సహిస్తూ, వారిని ఓటర్లుగా మార్చుకున్నారని, వారి పేర్లు తొలగించే ప్రయత్నంతోనే ఆమె ఆడుకుంటున్నారని ప్రచారం ప్రారంభించారు. గత ఏడాది బీహార్లో సైతం ఇటువంటి ప్రచారమే చేశారు. విదేశీ ఓటర్లను తొలగిస్తుంటే ఆర్జెడి అడ్డుకుంటుందని ప్రచారం చేశారు. అయితే, ఎంతమంది విదేశీ ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారంటే సమాధానం లేదు. కేవలం 230 మందిని మాత్రమే తొలగించారని, వారు సైతం నేపాల్ నుండి వివాహబంధం కారణంగా బీహార్కు వచ్చినవారిని చివరకు తేలింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారమే ఇప్పటివరకు బెంగాల్లో గుర్తించిన బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య బిజెపి పాలిత త్రిపురతో పోల్చుకుంటే నామమాత్రంగా ఉంది. ఈ సందర్భంగా అమిత్ షా టిఎంసి పాలనపై ఓ ఛార్జ్షీట్ను విడుదల చేశారు. అయితే తనను ‘బెంగాల్ కుమార్తె’ను అంటూ చెప్పుకుంటున్న మమతా బెనర్జీని ఎదుర్కోవడంలో బలమైన నాయకత్వం బిజెపిలో కనిపించడం లేదు. స్టార్ హోటల్స్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించడం కాకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సర్దుబాటు చేసుకుని, పార్టీ పాత- కొత్త నాయకుల మధ్య సయోధ్య కుదర్చడం ఓ పెద్ద సవాల్గా కనిపిస్తుంది. మరోవంక, తమిళనాడులో బిజెపి అస్తిత్వ సమస్యలు ఎదుర్కొంటున్నది. డిఎంకె వ్యతిరేక శక్తులు అన్నింటినీ ఎన్డిఎ పరిధిలోకి తీసుకొచ్చి ఎంకె స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ప్రయత్నాలు ఎన్నికల ముందే వికటించాయి. అందుకనే ఆ రాష్ట్రం ఎన్నికలపై పెద్దగా ఆశలు కనిపించక పోవడంతో అక్కడి గవర్నర్ రవిని ఎన్నికలు జరుగుతున్న మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్కు మార్చారు. బలవంతంతో బిజెపితో సీట్ల సర్దుబాటుకు అన్నాడిఎంకె అధినేత కె పళనిస్వామిని ఒప్పంచగలిగినా అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. బిజెపి ఎంతగా ఒత్తిడులు తీసుకొచ్చిన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం, శశికళ వంటి వారిని ఎన్డిఎ పరిధిలోకి తీసుకువచ్చేందుకు పళనిస్వామి ఒప్పుకోలేదు. దానితో గత్యంతరంలేక పన్నీరుసెల్వం డిఎంకెలో చేరిపోయారు. శశికళ సొంతదారి చూసుకున్నారు. పన్నీరుసెల్వంతో పొత్తుకోసం తమిళనాడులో బిజెపిని ఉధృతమైన రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్న మాజీ ఐపిఎస్ అధికారి అన్నామలైను పక్కనపెట్టాల్సి వచ్చింది. దానితో తండ్రి అనారోగ్యం అంటూ ఎన్నికల ప్రచారంకు దూరంగా ఉంటున్నారు. చివరకు ఎన్నికల పొత్తులో అన్నామలై పోటీ చేసేందుకు సీట్ కూడా దొరికే పరిస్థితి లేదు. సీట్ల సర్దుబాటులో సైతం ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా పళనిస్వామి తెలివిగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు లేని సీట్లను ఎక్కవుగా బిజెపికి వదిలారనే అన్నామలై మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవంక, సినీ నటుడు విజయ్ పై ఒత్తిడి తీసుకొచ్చి, టివికెను ఎన్డిఎలోకి తీసుకొచ్చేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుకోసం విజయ్ సినిమా విడుదల కాకుండా సెన్సార్ బోర్డు ద్వారా అడ్డంకులు కల్పించినా, తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు పేరుతో టివికె నేతలను సిబిఐ పలుసార్లు విచారణకు పిలిచినా ఫలితం లేకపోయింది. గతంలో అన్నాడిఎంకెలో కీలక నేతగా ఉన్న నైనర్ నాగేంద్రన్ ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కావడం గమనార్హం. ఇక కేరళలో బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ కూటమి ఎక్కడ అధికారంలోకి వస్తుందనే భయంతో సిద్ధాంతపరంగా పూర్తి వ్యతిరేకులైన సిపిఎం కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి వ్యూహాత్మకంగా సహకారం అందిస్తుందని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉంచిన కేరళ పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం, ఇటీవల ప్రధాని మోడీ జరిపిన రాష్ట్ర పర్యటనలో శబరిమలకు సంబంధించిన వివాదాలపై మౌనం వహించడం పరోక్షంగా లెఫ్ట్ ఫ్రంట్కు సహకారం అందించేందుకే అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తాము సిపిఎం- బిజెపిలను ఉమ్మడిగా ఎదుర్కొంటున్నామని రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయన్ సైతం గతంలో మాదిరిగా బిజెపిపై విమర్శల పదునును తగ్గించినట్లు కనిపిస్తున్నది. ఎల్డిఎఫ్ ప్రభుత్వం, బిజెపి నేతృత్వంలోని కేంద్రం మధ్య ఏదైనా ‘లోపాయికారి ఒప్పందం’ ఉందన్న ఆరోపణలపై ప్రశ్నించినప్పుడు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘అటువంటి ఒప్పందమే గనుక ఉండి ఉంటే, 2018 లో (కేరళ వరదల సమయంలో) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? వయనాడ్ కొండచరియల విపత్తు (2024) సమయంలోనైనా కేంద్రం రాష్ట్రానికి మద్దతు ఇచ్చిందా?’ అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. పైగా, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్పై విమర్శలు గుప్పిస్తూ, ‘యుడిఎఫ్కు బిజెపిని వ్యతిరేకించాలంటేనే భయం. అనేక అంశాలలో వారిద్దరి సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయి. కానీ మేము (ఎల్డిఎఫ్) మాత్రం భిన్నం’ అని చెప్పుకొచ్చారు. సిపిఎం బిజెపి మధ్య ఒక ‘అపవిత్ర కూటమి’ ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, ‘రాహుల్ గాంధీకి చెందిన కాంగ్రెస్ పార్టీ, బిజెపికి ఒక ‘బి-టీమ్’ లాంటిది’ అని ఘాటుగా బదులిచ్చారు.
Buzz: NBK in Talks for a New Film
Nandamuri Balakrishna is shooting for his 111th film directed by Gopichand Malineni. The veteran actor is in plans to release the film during Dasara. He also signed a two-part film to be directed by Vivek Athreya and the film will be launched during Dasara. Mythri Movie Makers will produce this film. Now, Balakrishna is holding […] The post Buzz: NBK in Talks for a New Film appeared first on Telugu360 .
Tiger : పోలవరం జిల్లాలోనే పెద్ద పులి
పోలవరం జిల్లా గోదావరి తీరంలోనే పెద్దపులి సంచారం కొనసాగుతుంది
రేషన్ కార్డుదారులకు నిజమైన పండగే
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నూతన కలెక్టర్గా ఐఏఎస్ అధికారి..
నూతన కలెక్టర్గా ఐఏఎస్ అధికారి.. గుంటూరు జిల్లా కలెక్టర్గా సి.యం. సాయి కాంత్
Tiriumala : మార్చి నెలలో రికార్డు బ్రేక్ హుండీ ఆదాయం
తిరుమల వెంకటేశ్వరస్వామి ఆదాయం మార్చి నెలలో భారీగా పెరిగింది
పరిగిలో వృద్ధురాలు హత్య... అందుకోసమేనా?
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో దారుణం జరిగింది. రంగంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రంగంపల్లి గ్రామంలో పద్మమ్మ(65) అనే వృద్ధురాలు నివసిస్తోంది. గతంలో ఆమె భర్త మాజీ ఎఎస్ఐ రిటైర్డ్ అయ్యాడు. పద్మమ్మ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొంతకాలంగా ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను పెన్షన్ డబ్బుల కోసం చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ కోర్సు కేవలం డిగ్రీ కాదు.. పరిశోధన వేదిక కోర్స్…
ఈ కోర్సు కేవలం డిగ్రీ కాదు.. పరిశోధన వేదిక కోర్స్… ఐఐఎస్ఈఆర్ ప్రవేశాల
Sabarimala : నేడు శబరిమల ఆలయం తెరుచుకోనున్న తలుపులు
శబరిమలలో నేడు ఆలయాన్ని తెరవనున్నారు
Video: Malvika Nair Exclusive Interview
The post Video: Malvika Nair Exclusive Interview appeared first on Telugu360 .
NTR |షాక్ ఇచ్చిన స్టార్ విలన్.
NTR | షాక్ ఇచ్చిన స్టార్ విలన్. NTR | పవర్ ఫుల్
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి
హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. హనుమాన్ విజయోత్సవ దినం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా భక్తులపై చలువ పందిరి కూలడంతో 15 మంది గాయపడ్డారు. నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్షరం ఆగింది.. పోరాటం నిలిచింది..
అక్షరం ఆగింది.. పోరాటం నిలిచింది.. దమ్మపేట, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలం తిమ్మంపేట
Anushka |ఈసారైనా మెప్పించేనా..?
Anushka | ఈసారైనా మెప్పించేనా..? Anushka | అనుష్క కెరీర్ టర్నింగ్ పాయింట్
కొండగట్టులో ఉత్సవాల సందడిలో అపశృతి… ఒక్కసారిగా కూలిన చలువ పందిరి #Kondagattu #HanumanJayanthi
29 మంది మృతి మాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా సైనిక విభాగానికి చెందిన ఏ ఎస్- 26 విమానం ప్రమాదానికి గురైంది. క్రిమియా మీదుగా వెళుతున్న క్రమంలో దాని సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత అది కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా విదేశాంగ అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులతో […] The post కుప్పకూలిన రష్యా విమానం appeared first on Visalaandhra .
తెలంగాణలో చికెన్ షాపులు బంద్..
తెలంగాణలో చికెన్ షాపులు బంద్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర
దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు వందేళ్లకు దగ్గర కావస్తున్నది. అయినా ఈ సమాజంలో దళిత, అణగారిన వర్గాల పరిస్థితి, బతుకుల్లో ఆశించినంత ఫలితాలు మాత్రం రాలేవనడానికి అనేక సాక్ష్యాలు నేటికీ కన్పిస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం తరువాత దళిత జనాభాలో అత్యధిక సంఖ్య గల మాదిగల బతుకుల్లో ఇంకా రావాల్సినంత సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన హక్కులకు ఇంకా అందనంతా దూరంలోనే ఉన్నారు. అంటరానితనం, అసమానతల పేరిట తీవ్రమైన అణచివేతలతో మాదిగ సమాజంలో రావాల్సినంత మార్పు ఇంకా రాకుండా పోయింది. రోజురోజుకు శాస్త్రసాంకేతిక పెరుగుతున్నప్పటికీ అంతే స్థాయిలో వివక్ష పెరుగుతూనే ఉంది. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లో అత్యంత దిగువ ఉన్నది మాదిగలు. అటువంటి మాదిగలను తరతరాలు బతుకుకు, ఉనికికి అధికారానికి, దూరంగానే ఉంచుతున్నారు. ఆధిపత్య కులాల పెత్తనం కింద మాదిగలు సమాజం నుంచి వెలివేయబడ్డారు. అటువంటి పరిస్థితులను అధిగమించి ఊరి అవతల ఉండి.. సబ్బండ కులాలకు కావాల్సిన ఉత్పత్తులను అందించిన ఘనత మాదిగలకు ఉంది. ముఖ్యంగా తోలు ఉత్పత్తులను తయారు చేసి వస్తుమార్పిడి విధానంతో శ్రమను దారబోసి ఎన్నో ఉత్పత్తులను ఈ సమాజానికి అందించారు మాదిగలు. ఊళ్లో జంతు కళేబరాలను తొలగించి శుద్ధి చేయడంతోపాటు ఆ జంతు చర్మాన్ని ఒలిచి చెప్పులు, వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన చరిత్ర ఉన్నది. వ్యవసాయానికి తొండెం బొక్కెన, నీటి నిల్వకోసం తోలు తిత్తి, వ్యవసాయంలో ప్రధానంగా తోడుగా ఉండే ఎడ్ల కాళ్లకు జోళ్లు లాంటి పరికరాలను తయారు చేసి ఇచ్చిన ఘనత వాస్తవానికి ఓ సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగిన మాదిగలను, వారి ఉత్పత్తులను వాడుకున్నారే తప్ప ఏనాడు మనుషులుగా గుర్తించలేదు.. మాదిగ సమాజం వారి వృత్తి ప్రధానంగా తోలును శుద్ధి చేయడం, పాదరక్షలు, బెల్టులు, సంచులు, కల్లు డబ్బాలు, సంచులను తయారు చేయడంతో ముడిపడి ఉంది. వీటిని అవసరమైనప్పుడు వివిధ కులాల వారికి అందించేవారు. అదనంగా మాదిగ సమాజం డప్పు అనే సాంప్రదాయ డ్రమ్ను తయారు చేయడంలో వారి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. మాదిగ జనాభాలో గణనీయమైన భాగం సాంప్రదాయకంగా చెప్పులు కుట్టేవారిగా పనిచేశారు. వారు గ్రామ డ్రమ్మర్లు కూడా, వీరు పండుగలు, మరణ, వివాహ వేడుకలు ప్రకటనలలో దండోరా కోసం సృష్టించబడిన డప్పు శబ్దం నేటి సంగీతానికి, వివిధ వాయిద్యాలకు ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం అటువంటి సామాజిక పరిస్థితులు నేటికీ ఆధునిక కాలంలో కన్పించకుండా బుసలు కొడుతూనే ఉంది. దేశంలో, ఇటు తెలుగు రాష్ట్రాలలో చమార్లు, మాదిగల జనాభా అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ దేశంలో ఇంకా బాధితులుగానే ఈ సమాజం ఉంటుంది. తమ ఓటు తాము వేసుకుంటే రాజకీయ అధికారాన్ని శాసించే సత్తా ఉన్నా.. ఆ దిశగా ఏకం కాలేకపోతున్నారు. అటువంటి ఆకాంక్షను కాన్షీరాం తొలిసారి దళిత, బడుగు వర్గాలకు రాజ్యాధికార రుచి చూపగలిగారు. మన ఓటు మనకే అనే నినాదం రాజ్యాధికారానికి సాక్ష్యంగా నిలిచింది. అయినప్పటికీ ఏకం కాలేకపోతున్నారు. బీహార్లోని మారుమూల పల్లెలో పుట్టిన బాబు జగ్జీవన్ రామ్ తనకు ఎదురైన వివక్షలను జయిస్తూ.. ఉప ప్రధానిగా ఎదగగలిగారు. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పని చేసి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ గతిని మార్చాడు. అయినప్పటికీ బాబు జగ్జీవన్రామ్ను వివక్ష వదలలేదు. ప్రధానమంత్రిగా ఎదిగే సత్తా ఉన్నా కాకుండా నియంత్రించగలిగారు. అయినప్పటికీ ఒకానొక దశలో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్తో 14 స్థానాలను గెలిపించి కింగ్ మేకర్గా రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర ఉన్నప్పటికీ .. అంతే వేగంగా దళితుల చైతన్యాన్ని ఆధిపత్య రాజకీయాలు అంతం చేస్తూ వస్తున్నాయనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు ఒక్కసారిగా దళితుల చైతన్యాన్ని వేటకొడవళ్లు, గొడ్డళ్లతో నరికి చంపిన చరిత్ర ఉంటే... నేడు రాజకీయంగా విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎదుగుదల లేకుండా అడ్డుకోగలుగుతున్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి తెలంగాణ ఏర్పాటు వరకు దళిత, మాదిగ వర్గాలు ఎన్నో అవమానాలు, అణచివేతలు ఎదుర్కొన్నాయి. సామాజిక సమానత్వం కోసం మాదిగల రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలు మించి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు మాదిగల న్యాయమైన ఆకాంక్షను గుర్తించి ఎస్సి వర్గీకరణ చట్టం అమలుకు నోచుకుంది. ఇంతటితోనే మాదిగల బతుకుల్లో పూర్తి స్థాయిలో ఆశించినంత ఫలితాలు మాత్రం రావు. తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే సత్తా ఉన్న మాదిగలకు ఇప్పుడు వాటా కావాలి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఉపాధి రంగాలలో అవకాశాలు లభించాలి. తెలంగాణ రాజకీయాలలో మాదిగల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా మారకుండా తరతరాల మాదిగల బతుకుల్లో మార్పు అసాధ్యం. ఇప్పుడు మాదిగ సమాజానికి హక్కులు అడిగే బలమైన రాజకీయ శక్తి అవసరం ఉంది. ఆ శక్తిని చాటితే తప్పా మాదిగలకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత దక్కదు. రాజకీయ రంగంలో ప్రాధాన్యత దొరకనంత కాలం శాసించే శక్తిగా ఉన్న మాదిగ సమాజం యాచించే స్థితిలోనే ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మాదిగల జనాభా ఆనాడే 50 లక్షలకు చేరింది. ఇప్పుడు పెరిగిన జనాభాను తీసుకుంటే తెలంగాణ జనాభాలో సుమారు 70 లక్షల జనాభా మాదిగలు ఉంటారు. ఇంత జనాభా ఉండి అచేతనంగా ఉన్న ఈ వర్గానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులకోసం సరికొత్త శక్తి ఏర్పాటు అవుతోంది. అదే మాదిగ మహా శక్తి. 30 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అనేక సామాజిక కార్యక్రమాల్లో నిలబడిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింలు నేతృత్వంలో హక్కుల సాధన దిశగా మాదిగ మహాశక్తి పురుడుబోసుకుంది. ఇప్పటికే మాదిగ మేధావి, ఉద్యోగ, వివిధ రంగాల వారితో నిత్యం మేధో మథనం తరువాత ఇప్పుడు ఓ రాజకీయ, హక్కుల పోరాటానికి తోవ పరిచాడు. మాదిగలను చైతన్యం చేస్తూనే కలిసివచ్చే బడుగు, బలహీన వర్గాలతో రేపటి రోజుల్లో తెలంగాణలో మాదిగ మహాశక్తి తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన జెండా రూపకల్పన, విధివిధానాలు వంటివి సిద్ధం చేసి ఏప్రిల్ 5న జెండా ఆవిష్కరణ జరగనుంది. ఇది ఒక్క మాదిగ సమాజానికి మాత్రమే పరిమితం కాదు, మాదిగలను ఏకతాటిపైకి తెస్తూ కలిసివచ్చే మిగతా బహుజన వర్గాలను కలుపుకొని రాజకీయశక్తిగా నిలవనుంది. స్వల్ప జనాభా కలిగినవారు నాయకులుగా అధికారాన్ని చెలాయిస్తున్న తరుణంలో.. శాసించే సత్తా కలిగే జనాభా కలిగిన మాదిగలు మరో అస్తిత్వ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మన ఓటును మన వారికే వేసి రాజకీయ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఓ గొప్ప సంకల్పంతో ముందుకువస్తున్న మోత్కుపల్లి నర్సింలు వెంట మాదిగ సమాజం ప్రవాహంలా ప్రయాణించాలి.. మాదిగల అభివృద్ధి ధ్యేయంగా.. మానవతా వాదమే లక్ష్యంగా బలమైన సంకల్పానికి మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. సంపత్ గడ్డం 78933 03516
ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరపున సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి #TankBundShiva
Revanth Reddy : నేడు కేరళంలో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళంలో పర్యటించనున్నారు
Telangana : తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల బాదుడు
తెలంగాణలో నేటి నుంచి కొత్త కరెంట్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి
Andhra Pradesh : చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఏటీఎంలో నగదు తీస్తున్నారా? అయితే మీ జేబులు ఖాళీ
నేటి నుంచి ఏటీఎంల వినియోగంపై పరిమితులు విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది
గరుడ వాహనం పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి..
గరుడ వాహనం పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి.. బెజ్జంకి, ఆంధ్రప్రభ :
నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన
నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది
తల్లి పక్కన నిద్రిస్తున్న పసికందును లాక్కెళ్లిన చిరుత #Maharashtra #LeopardAttack #Infant #Jalgaon
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో పగలు ఎండ.. సాయంత్రం వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి
Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి
ఛైర్మన్ ఛాంబర్ లో.. మందు పార్టీ..
ఛైర్మన్ ఛాంబర్ లో.. మందు పార్టీ.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
Telagnana : నేటి నుంచి చికెన్ షాపులు బంద్
నేటి నుంచి చికెన్ షాపులు తెలంగాణలో మూతపడనున్నాయి
Gold Prices Today : యుద్ధం కొనసాగితే బంగారం 70 వేలకు చేరుకుంటుందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి
American-Journalist-Kidnapped : లేడీ జర్నలిస్ట్ కిడ్నాప్ Andhra Prabha News
American-Journalist-Kidnapped : లేడీ జర్నలిస్ట్ కిడ్నాప్ Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
కొండను ఢీకొట్టిన విమానం: 29 మంది మృతి
మాస్కో: రష్యా దేశంలో నల్ల సముద్రంలోని క్రిమియా ద్వీపకల్పంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పెనున్సులాలో కొండచరియను విమానం ఢీకొట్టడంతో 29 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో 23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని విమానయాన అధికారులు వెల్లడించారు. 2014లో యుక్రెయిన్ దేశంలో నుంచి క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఎఎన్-26కి చెందిన సైనిక విమానంగా గుర్తించారు. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
పనికి వెళ్లి తిరిగి వస్తుంటే..
పనికి వెళ్లి తిరిగి వస్తుంటే.. కడెం, (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం
RBI : ఆర్బీఐ కొత్త రూల్స్.. ఖాతాదారులకు ఊరట
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది
Amaravathi : నేడు అమరావతికి చట్టబద్ధత
ఈరోజు పార్లమెంట్లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రానుంది.
Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి తీపికబురు
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది.
Pan Card : పాన్ కార్డులో ఉండే పది అంకెల అర్థం తెలిస్తే
ప్రతి వారికి ఇప్పుడు పాన్ కార్డు తప్పని సరి అయింది
ఒకే రకమైన పంటలు వేస్తే.. కుంటాల, ఆంధ్రప్రభ : పంటల సాగు పద్ధతులపై
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. ట్రాఫిక్ ఆంక్షలివే
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరగనుం
Chandrababu : నేడు నెల్లూరు, కడప జిల్లాలకు చంద్రబాబు
నేడు నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
గద్దర్ అంటేనే అణగారిన కన్నీళ్లకు స్వరం: పొన్నం
హైదరాబాద్: 'తెలంగాణ గర్వకారణం గద్దర్ అన్న.. జోహార్ గద్దర్ అన్న…మీ గొంతు నిశ్శబ్దం కాలేదు… ప్రజల గుండెల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పొన్నం తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను ధైర్యంగా ప్రస్తావిస్తూ, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితులను దేశం ముందుకు తీసుకువచ్చారన్నారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల్లో గద్దర్ వంటి మహానుభావుడి పేరు ప్రస్తావన రావడం బాధాకరమైన విషయమని చెప్పారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే నాయకుడు అని, గద్దర్ లాంటి ప్రజాకళాకారులు, ఉద్యమయోధుల విలువను అర్థం చేసుకుని, వారి పోరాటాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి అని పొన్నం తెలియజేశారు. అణగారిన వర్గాల స్వరం వినిపించేందుకు, వారి బాధలను దేశం ముందుకు తీసుకురావడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారని, ప్రజల కోసం పాట పాడిన గొంతుకలను గౌరవించడం అని, ప్రజల కోసం పోరాడిన నాయకులను ఆదరించడం రాహుల్ గాంధీ ప్రత్యేకత అని కొనియాడారు. గద్దర్ లాంటి మహానుభావులు సమాజానికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభాలు అని, అలాంటి వారిని కాపాడటం, గౌరవించడం, వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం గొప్ప అని పొన్నం పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచే బాధ్యతను రాహుల్ గాంధీ నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. గద్దర్ అంటే కేవలం ఒక కళాకారుడు కాదు అని, ప్రజల బాధలను తన గొంతులో మోసిన గొంతుక అని, అణగారిన వారి కన్నీళ్లకు స్వరం ఇచ్చిన పోరాటయోధుడు అని, ఆయన పాటలు వినిపించేవి కాదని, వేడి రక్తాన్ని కదిలించేవని, అన్యాయంపై తిరుగుబాటు రగిలించేవని, తెలంగాణ మట్టిలో ప్రతి గుండె చప్పుడు లా మారేవని మెచ్చుకున్నారు. ఈ నేల కోసం…నీళ్ల కోసం…నిజమైన హక్కుల కోసం…తన జీవితం మొత్తం అంకితం చేసిన మహానుభావుడు గద్దర్ అని ప్రశంసించారు. అలాంటి మహోన్నత వ్యక్తిని అవమానించడం అంటే ఒక్క వ్యక్తిని కాదు అని, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూడటమేనని, గద్దర్ పాటలు కేవలం స్వరాలు కావు అని, అవి ఒక ఉద్యమ చరిత్ర, అవి ఒక తరానికి ప్రేరణ, అవి న్యాయం కోసం ఎప్పటికీ మసకబారని జ్యోతి అని పొన్నం తెలిపారు.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో భారీ డ్రగ్స్ బస్ట్ వెలుగులోకి #Hyderabad #RGIAirport #DrugBust #DRI
Andhra Pradesh : ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది.
నేటి నుండి ఇంటర్ క్లాసులు.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా
IPL 2026 : గుజారాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ ఉత్కంఠ మధ్య విజయం
గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
మై విలేజ్ షో అనిల్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు
సిద్దిపేట: మై విలేజ్ షో అనిల్ గీలా కుటుంబాన్నిహరీష్ రావు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో అనిల్ గీలా తండ్రి మృతి చెందాడు. స్వగ్రామం సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం దర్గపల్లి గ్రామంలోని ఇంటికి వెళ్ళి అనిల్ కుటుంబ సభ్యులను హరీష్ పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సాహస యాత్ర.. నేటి నుంచి సలేశ్వరం జాతర
దక్షిణ భారత దేశంలో తెలంగాణ అమరనాథ్ యాత్ర, నేటి నుండి 3 వరకు సలేశ్వరం జాతర గత ఏడాది 3 లక్షల మంది భక్తులు, మార్గమధ్యలో అభయారణ్యం, వైద్యశిబిరాలు, చలివేంద్రాలు ఏర్పాటు మన తెలంగాణ/అచ్చంపేట : నల్లమల్ల అటవీ ప్రాంతం అనేక శివాలయ క్షేత్రాలకు పుట్టినిల్లు. కొండల గుట్టల మధ్యన శివ క్షేత్రాలకు నిలయమై భక్తుల చేత ఆయా సందర్భాలలో పూజలు అందుకుంటున్న శైవ క్షేత్రాలు అనేకం. రాష్ట్రంలో అతిపెద్ద ఆదివాసీల జాతర సమ్మక్క సార క్క. సలేశ్వరం జాతర రెండోది అని చెప్పవచ్చు. సమ్మక్క సారలమ్మ జా తర రెండేళ్లకొకసారి జరిగితే.. సలేశ్వరం జాతర ప్రతి ఏడాది జరగడం విశేషం. రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం పరిధిలో ని నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో కొండలు, కోనలు, రెండో ఎత్తయిన గుట్టల సరికల మధ్యన వెలిసిన సలేశ్వరం శివలింగయ్యను ద ర్శించుకోవాలంటే సాహసోపేతమైన యాత్ర చేయాల్సి ఉంటుంది. లిం గమయ్య దిగువన దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జలపాతాన్ని తాకిన భక్తులు మైమరిసిపోతూ గుండంలో పుణ్య స్థానాలు చేస్తారు. ఈ యాత్రను దక్షిణ భారతదేశంలో తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలువబడుతున్న ఈ సాహస యాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి కాకుం డా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు, ప్రకృతి ప్రేమికు లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా దర్శించుకుంటారు. యాత్ర ప్రతి ఏ డాది చైత్ర పౌర్ణమి ఒక్క రోజే దాదాపు లక్ష మందికి పైగా భక్తులు శివనామ స్వరంతో దర్శించుకుంటారు. ఏప్రిల్ 1 నుండి 3 వరకు సలేశ్వ రం జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది సలేశ్వరం జాతర వే డుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా ప్లాస్టిక్ నియంత్రణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరువ చూపుతున్నారు. - ఆలయ చరిత్ర నాగార్జున కొండలో బయటపడిన ఆధారాలను బట్టి ఇక్ష్వాకుల కాలం క్రీస్తు శకం 360 కాలపు నిర్మాణాలు లింగమయ్య గుడికి ఏర్పాటుచేసి న ఇటుకలను బట్టి అర్థమవుతుంది. అలాగే గర్భగుడి ముఖద్వారం నా టి విష్ణు కుండీల శిలాఫలకం ఉన్నది. ఆలయాన్ని ద్వారానికి కుడివైపు న వీరభద్రుడు దక్షకుడి విగ్రహాలు, ఎడమవైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి ముందు భాగంలో 10 అడుగుల క్రింద సలేశ్వ రం గుండం ఉన్నది. వస్తున్నాం లింగమయ్య అంటూ భక్తులు నల్లమల ప్రతి ధ్వనించే విధంగా ప్రయాణం కాలి నడకన కొనసాగుతోంది. నల్లమల్ల కొండల్లో కోనల్ల మధ్యన వెలిసిన లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన సుమారు 4 కి.మీ కొండలు గుట్టలను ఎక్కు తూ, దిగుతూ లోయల సరికలకుండా భక్తులు వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య, హర హర శంభో శంకర అంటూ భక్తులు గొంతు ఎత్తు తూ కొండల మధ్యన శివనామ స్వరంతో దరులు దద్దరిల్లేలా యాత్రను కొనసాగిస్తారు. సాహసోపేతమైన యాత్ర చైత్ర మాసం పౌర్ణమి సందర్భంగా నల్లమల్ల అడవుల్లో కొలువుదీరిన శి వలింగయ్యను దర్శించుకునే యాత్ర అమరనాథ్ను తలపించేలా ఈ యాత్ర ఉంటుంది. అమరనాథ్ యాత్ర మంచు కొండలలో కొనసాగితే ఈ యాత్ర మాత్రం అడవులు, కొండలు, గుట్టలు, లోయలు మార్గంలో కొనసాగుతది. స్వామిని దర్శించుకునే సమీప ప్రదేశంలో రెండు గుట్టల మధ్యన ఇరుకైన బాటలో భక్తులు సాహసోపేతంగా నడుస్తూ అలసిపోయిన భక్తులకు గుండం వద్దకు చేరుకోగానే సుమారు వెయ్యి అడుగుల ఎత్తు నుండి దూకే జలపాతాన్ని తాకగానే కాలినడకన వచ్చిన బాధను మరిచిపోయి మైమరసిపోతూ లింగమయ్య దర్శించుకుంటారు. ఆది నుంచి ఆదివాసులే పూజారులు. సమ్మక్క సారలమ్మ జాతరలో ఆదివాసులే పూజారులు ఎలా ఉత్సవాలను కొనసాగిస్తారు. నల్లమల్ల అడవి ప్రాంతంలో కొండల మధ్యన ఉన్న సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలంటే నాగర్ర్నూల్ జిల్లాలో ఒక మార్గం లింగాల మండలం అ ప్పాయిపల్లి గ్రామం మీదుగా 30 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సి ఉం టుంది. మరో మార్గం శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి వెంట అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చేరుకోవాలి. అక్కడ ను ంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుం చి అడవి మార్గంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ పెంట వద్దకు వాహనాలు ద్వారా చేరుకోవచ్చు. అక్కడనుండి నాలుగు కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు లోయలు దాటుకుంటూ సాహసోపేతమైన యాత్ర కాలినడకన లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం భక్తులు సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలంటే నాగర్కర్నూల్ జిల్లాలో ఒక మార్గం లింగాల మండలం అప్పాయి పల్లి గ్రామం మీదుగా 30 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మరో మార్గం శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి వెంట అమ్రాబాద్ మ ండలం మన్ననూరు గ్రామానికి చేరుకోవాలి. అక్కడ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుంచి అడవి మా ర్గంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ పెంట వద్దకు వాహనాలు ద్వారా చేరుకోవచ్చు. అక్కడనుండి నాలుగు కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు లోయలు దాటుకుంటూ సాహసోపేతమైన యాత్ర కాలినడకన లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శా తం భక్తులు మన్ననూరు ఫరహాబాద్ చౌరస్తా నుంచి సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు. - ప్రత్యేక బస్సులు సలేశ్వరం జాతర వేడుకలకు భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కాకుండా నల్గొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు రాంపూర్ పేట వద్దకు మాత్రమే చేరుకుంటాయి. అక్కడ నుండి భక్తులు కాలినడకతో 4 కి.మీ పాదయాత్ర చేసి.. అక్కడ అన్నదానంలో పాల్గొని గుట్టల్లో మరో నాలుగు కి.మీ వరకు వెళ్లి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటారు. - భారీ బందోబస్తు సలేశ్వరం జాతర వేడుకలకు లక్షలాది భక్తులు వస్తున్న నేపథ్యంలో భ క్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్, అడవి శాఖ సమన్వయంతో పెద్ద మొత్తంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ శాఖ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మ రోవైపు ఇటీవల నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏర్పాట్లు చే యాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు, వైద్యం, శానిటేషన్ తదితర సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జాతర ఏర్పాట్లకు రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో ముందుకు పోతున్నారు. గత సంవత్సరం 3 లక్షల మంది భక్తులు వచ్చారని ఈ సంవత్సరం భక్తులు పెరిగే అవకాశం వుండవచ్చుని అధికారులు అంచనా వేస్తున్నారు. - అభయారణ్యం మార్గమధ్యలో వైద్యశిబిరాలు, చలివేంద్రాలు రాంపూర్ పేట నుండి భక్తులు కాలినడకతో గుట్టల్లో మరో నాలుగు కి.మీ వరకు పోవాల్సిఉంది. తదనంతరం సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. మార్గమధ్యంలో భక్తులు ఎండలకు సొమ్మసిల్లీ పడి పోయాప్రమాదం వుంది కనుక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రలు ఏర్పాటు చే యడం ఆనవాయితీగా వస్తుంది.
నేటి నుండి జనగణన.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన-2027
Israel - Iran War : ఇరాన్పై దాడులు… బెరూట్, ఖతార్, సౌదీ, యుఏఈలో ఉద్రిక్తత
ఇజ్రాయిల్, అమెరికా కలిసి మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్ పై మరో దఫా దాడులు జరిపాయి
మహిళా పోలీస్ త్రివేణికి తీవ్ర గాయాలు..
మహిళా పోలీస్ త్రివేణికి తీవ్ర గాయాలు.. తుగ్గలి, ఆంధ్రప్రభ : పత్తికొండ మండలం
Israel - Iran War : యుద్ధం నెలరోజులు దాటినా ముగిసేట్లు లేదుగా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మిత్రదేశాలపై తీవ్ర విమర్శలు చేశారు
తక్షణ చర్యలు తీసుకోవాలి –డాక్టర్ మెహబూబ్ షేక్..
తక్షణ చర్యలు తీసుకోవాలి – డాక్టర్ మెహబూబ్ షేక్.. విజయవాడ, ఆంధ్రప్రభ :
ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రేక్.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి నుండి
1stAprilchintana |దేవాలయ ప్రాముఖ్యతపై ఆధ్యాత్మిక విశ్లేషణ..
1stAprilchintana | దేవాలయ ప్రాముఖ్యతపై ఆధ్యాత్మిక విశ్లేషణ.. 1stAprilchintana | ఇల్లు మరియు
1stAprileditorial |ఇరాన్ యుద్ధం.. ప్రపంచం పై ఆర్థిక ప్రభావం..
1stAprileditorial | ఇరాన్ యుద్ధం.. ప్రపంచం పై ఆర్థిక ప్రభావం.. 1stAprileditorial |
మూసీ ప్రక్షాళనపై ప్రజాభిప్రాయ సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ బుధవారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొ న్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా ప్రాజెక్టు పురోగతి, ప్రజల భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. మూసీ ప్రాజెక్టు రూపకల్పన, అమల్లో ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈనెల 15వ తేదీ వరకు ప్రజలు తమ సలహాలను, సూచనలను ప్రభుత్వానికి పంపవచ్చని కమిటీ వెల్లడించింది. ప్రాజెక్టుపై అభిప్రాయాలు ఉన్నవారు musrirdc@gmail.com అనే అధికారిక ఇమెయిల్ ఐడీకి తమ సూచనలను పంపాలని కేబినెట్ సబ్ కమిటీ కోరింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పునరావాస ప్యాకేజీలు, అభివృద్ధి పనుల విషయంలో పారదర్శకత పాటించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోం ది. ఈ క్రమంలో ప్రజలు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ప్రాజెక్టు విజయవంతానికి ఎంతో దోహదపడతాయని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మంత్రు లు అభిప్రాయపడ్డారు.
1stApril2026 |బుధవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
1stApril2026 | బుధవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 1stApril2026 |
దుబాయ్: ఇరాన్లోని ప్రధాన అణు కేంద్రాలు ఉ న్న నగరం ఇస్ఫహాన్పై అమెరికా మంగళవారం భారీ వైమానిక దాడులు జరిపింది. ఆయుధ నిల్వ లు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడి చేసింది. ఈ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడికి సంబంధించి న వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అదే సమయంలో పెర్షియన్ గల్ఫ్లో పూర్తిగా చమురు లోడ్తో వెళ్తున్న కువైట్ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలతో అమెరికా-ఇజ్రాయెల్ మొదటి దాడులు ప్రారంభమైన దాదాపు నెల తర్వాత కూ డా యుద్ధం తీవ్రత తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోం ది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 3,000 మందికి పైగా మరణించగా, ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్కు 4 డాలర్లను దాటడం కూడా ఈ యుద్ధ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు మార్కెట్లలో కలకలం పెర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ చమురులో ఐదవ వంతు రవాణా జరిగే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం, అలాగే ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం వల్ల గ్లోబల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 106 డాలర్ల వద్ద ఉండగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 45 శాతం పెరుగుదల నమోదైంది.ఈ ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ త్వరలో ఆపకపోతే, హా ర్మూజ్ మార్గం తెరవకపోతే దాడులను మరింత విస్తరించనున్నట్లు హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై మరోసారి దాడులు ప్రారంభించాయి. రాజధాని తెహ్రాన్తో పాటు ఇస్ఫహాన్ ప్రాంతం లక్ష్యంగా భారీ దాడులు జరిగినట్లు సమాచారం. ఇస్ఫహాన్ ప్రాంతంలో భారీ స్థాయిలో యురేనియం నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఈ ప్రాంతం లక్ష్యంగా మారింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, శుద్ధి చేసిన అధిక యురేనియాన్ని ట్రక్కుల ద్వారా భూగర్భ సొరంగాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ తీరానికి సమీపంలో కువైట్ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ట్యాంకర్లో మంటలు చెలరేగినా, తరువాత అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దాడిలో చమురు లీకేజీ జరగలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ మిగులు భాగాలు నివాస ప్రాం తంలో పడటంతో నలుగురు గాయపడ్డారు. బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగగా, సౌదీ అరేబియా తన రాజధాని వైపు దూసుకొచ్చిన మూడు క్షిపణులను అడ్డుకుంది. ఇజ్రాయెల్లో కూడా భారీ పేలుళ్లు వినిపించాయి. లెబనాన్లో శాంతి బలగాలు మృతి ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం కొనసాగుతున్న లెబనాన్లో, 24 గంటల్లో ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ టనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర స మావేశం నిర్వహించనుంది. ఇరాన్లో 1,900 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్లో కూడా మరణాలు నమోదయ్యాయి. లెబనాన్లో 1,200 మందికి పై గా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితు లు కొనసాగుతుండగా, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్ర భావం చూపుతోంది.
మా హెచ్చరికతోనే ఆంధ్ర వెనకడుగు
మన తెలంగాణ/హైదరాబాద్: ‘శ్రీశైలంలో నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మా హెచ్చరికతోనే విరమించుకుంది..’ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్లో కనిష్ఠ నీటి మట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు)కు చేరుకున్నప్పుడు శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. మన రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాలు పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా నీటిని వినియోగించుకుంటున్నదని మంత్రి జూపల్లి విమర్శించారు. ఈ అంశంపై ఎన్ని సార్లు ఆ రాష్ట్రానికి విన్నవించినా ఏపీ సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. అందుకే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, రైతులు అదే విధంగా కృష్ణా పరివాహక ప్రాంత జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామని వారు చెప్పారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిందని వారు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వారు వివరించారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ - ప్రజాప్రతినిధులంతా దేనికైనా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. పాలమూరు జిల్లాకు నష్టం జరిగితే- రైతు పక్షాన ప్రభుత్వం పోరాడుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని మంత్రి జూపల్లి అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇలాగే వ్యవహరిస్తే ఆందోళన చేపటామని, హై కోర్టునాశ్రయించామని ఆయన గుర్తు చేశారు. అప్పుడు, ఇప్పుడ, ఎప్పుడైనా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయంలో మూడు శాఖలు దూసుకుపోతున్నాయి.2025-26 ఆర్థి క సంవత్సరానికి గానూ వాణిజ్య పన్నుల శాఖ, ఎ క్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు గతేడాది కన్నా ఈసారి ఆదాయంలో అధిక వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలో మొ దటిస్థానం కమర్షియల్ ట్యాక్స్ది కాగా, రెండోస్థా నం ఎక్సైజ్ శాఖ, మూడో స్థానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు ఉంటాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) గానూ కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం సుమారు రూ.78,655 కోట్ల పైచిలుకు రాగా, ఎక్సైజ్ శాఖకు రూ.39,494 కోట్లు, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.15,925కోట్ల ఆదా యం వచ్చినట్టు ఆ శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ గణాంకాలు 31వ తేదీ రాత్రి వ రకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఈ గణాంకాల్లో స్వల్పమార్పులు ఉంటాయని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం (2024-25)లో కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం రూ.75,149 కోట్లు కాగా, ఎక్సైజ్ శాఖకు రూ.34,603 కోట్లు, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.14,214 కోట్ల ఆదా యం వచ్చింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం గతేడాది కన్నా ఈసారి రూ.3,506 కోట్ల ఆదాయం అధికంగా వ చ్చింది. ఇక, ఎక్సైజ్ శాఖకు గతేడాది కన్నా ఈసారి రూ.4,891 కోట్ల అధిక ఆదాయం రాగా, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.1,711 కోట్ల అధిక ఆదాయం రావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) కమర్షియల్ ట్యాక్స్ ఆదాయంలో జిఎస్టీ వసూళ్ల ద్వారా రూ.43 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ఈ శాఖకు రాగా, పెట్రోల్ ఉత్పత్తుల ట్యాక్స్ ద్వారా సుమారుగా రూ.32 వేల కోట్ల పైచిలుకు ఆదాయం, ఇతర ట్యాక్స్ల ద్వారా మొత్తంగా ఆ శాఖకు రూ.78,655 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్టుగా ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి ఎక్సైజ్ శాఖ 14శాతం వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) గానూ ఎక్సైజ్ శాఖకు జనవరిలో రూ.3,325 కోట్లు, ఫిబ్రవరిలో రూ.3,208 కోట్లు, మార్చిలో రూ.3,425 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరిలో 34 లక్షల బీర్ల కేసులను, 32 లక్షల మద్యం పెట్టేలను, ఫిబ్రవరిలో 38 లక్షల బీర్ల కేసులను, 29 లక్షల మద్యం పెట్టేలను, మార్చిలో 25 లక్షల మద్యం కేసులను, 44 లక్షల బీ ర్ల కేసులను ఎక్సైజ్ శాఖ విక్రయించింది. దీంతోపా టు 2025 అక్టోబర్లో కొత్త మద్యంషాపుల కోసం వచ్చిన దరఖాస్తుల రూపంలో సుమారుగా రూ.2,868 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.39,494 కోట్లు ఆదాయం రాగా, గతేడాది ఈసారి 14 శాతం వృద్ధిని ఆ శాఖ నమోదు చేసింది. 18.05లక్షల డాక్యుమెంట్లతో.. ఈ ఆర్థిక సంవత్సరం (2025,26) గాను (సుమారుగా 18.05లక్షల) డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.15,925 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి 31వ తేదీ, బుధవారం ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం రాత్రి వరకు రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వినియోగదారులు భారీగా స్లాట్లు బుక్ చేశారు. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేయడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పనిగంటలు పెంచడంతో సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్లను పూర్తి చేశారు. ఆర్థిక సంవత్సరం నేటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూడు రోజుల పాటు ఉదయం 9.30ల నుంచి రాత్రి 8.30ల వరకు పనిగంటలను పెంచింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ మూడు రోజుల పాటు రెగ్యులర్గా జరిగే రిజిస్ట్రేషన్ల కంటే 60 శాతం అదనంగా స్లాట్లను కేటాయించారు.
‘మహాలక్ష్మి’తో మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం వేసిన అడుగులు అ ద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ’మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 290 కోట్ల సార్లు ప్రయాణించి, తద్వారా 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా పా లన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామన్నారు. మ హిళలు ఆదా చేసుకున్న ఈ రూ.10 వేల కోట్లు వారి కు టుంబ ఆర్థిక అవసరాలకు, పిల్లల చదువులకు ఉపయోగపడతాయని అన్నారు. కేవలం బస్సు ప్రయాణమే కాకుం డా, మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాబోయే మూడేళ్లలో మహిళా సం ఘాలకు రూ. లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందించబోతున్నామన్నారు. మహిళలు సూక్ష్మ, మధ్యతరహా పరి శ్రమలు స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఆర్టిసిని కాపాడుకుంటూనే సంక్షేమ పథకాల అమలు : మంత్రి పొన్నం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ‘మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంలో ఆర్టిసి డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర మరువలేనిదని కొనియాడారు. రోజుకు 65లక్షల మం ది ప్రయాణికులలో 40 లక్షల మంది మహిళలే ఉండటం గొప్ప విషయమని అన్నారు. ఆర్టిసిని కాపాడుకుంటూనే మహిళలకు ఈ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆర్టిసికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోందని, కొత్త బస్సులు, కొత్త రూట్ల ఏర్పాటుతో సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క ఉచిత ప్రయాణాన్ని విమర్శించే వారికి మహిళలు తమ తిరుగుబాటుతో సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క పిలుపు నిచ్చారు. ‘సిఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో మహిళలను ఆర్టిసి బస్సులకు యజమానులను చేశామని, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. అనంతర మహిళలు పొదుపు చేసుకున్న రూ. 10వేల కోట్ల మెగా చెక్కును మంత్రులు ఆర్టిసి ఎండి వై. నాగిరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో వైరా ఎంఎల్ఎ మాలోతు రాందాస్, మాజీ మేయర్ విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి అనిత రామచంద్రన్, సెర్ఫ్ సీఈఓ దివ్య, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టిసి ఈడీలు సిహెచ్. వెం కన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బు ధవారం నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వ రకు నిర వధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతం లో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లు గా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మా ర్జిన్ రూ.16కు తగ్గించారని, దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు బుధవారం నుంచి నిరవ ధిక బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ధరలు పడిపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు, ఈ బంద్ పిలుపు పెద్దదెబ్బగా మారనుంది. బుధ వారం నుండి మాంసం లభ్యత ఉంటుందో లే దో అన్న సందేహంతో చాలామంది ఈరోజే మార్కెట్లకు క్యూ కడుతున్నారు. ఈ తరు ణం లో చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పౌ ల్ట్రీ కంపెనీలు రిటైల్ షాప్లకు ఇస్తున్న మార్జిన్లో ఇప్పుడు కోత విధించి చిన్న చిన్న దుకాణాలను లేకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇలాంటి ఆలోచనను పౌల్ట్రీ కంపెనీలు మానుకోవాలని సూచిం చారు. బుధవా రం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధ ర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఐపిఎల్ సీజన్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కూపర్ కొనొలి అద్భుత బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కూపర్ 44 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ (37) తనవంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 6 ఫోర్లతో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ (38), గ్లెన్ ఫిలిప్స్ (25) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ మూడు, చాహల్ రెండు వికెట్లను పడగొట్టారు.
బుధవారం రాశి ఫలాలు (01-04-2026)
మేషం వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృషభం సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. మిధునం దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. కర్కాటకం దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. సింహం చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కన్య దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తుల అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. వృశ్చికం ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ధనస్సు ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మకరం చుట్టుపక్కలవారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున స్థిరత్వం కలుగుతుంది. కుంభం ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి. మీనం సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అమెరికాకు మరోదేశం షాక్ ఇచ్చింది. స్పెయిన్ బాటలోనే ఇటలీ నడిచింది. ఇరాన్పై దాడులకు దిగుతున్న అగ్రదేశం విమానాలకు తమ గగనతలం మీదుగా అనుమతి లేదని తాజాగా ఇటలీ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడయ్యాయి. బాంబర్ విమానాలు నిలపడం, అక్కడి నుంచి ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి సిసిలీలోని వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుంటామని అమెరికా ఇటీవల ఇటలీకి చేసిన విజ్ఞప్తిని ఆ దేశం ప్రభుత్వం తిరస్కరించిందని మీడియా తెలిపింది. ఇప్పటికే మిత్రదేశాలు ఇరాన్పై యుద్ధంలో కలిసి రావడం లేదని ఆరోపణలు చేస్తున్న ట్రంప్కు తాజాగా ఇటలీ తీసుకున్న నిర్ణయం ఎదురుదెబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్పై అమెరికా దాడులను ఐరోపా యూనియన్ దేశాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటలీ తాజా నిర్ణయం వెలువడడం విశేషం.
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.
వర్స్ ఇన్నోవేషన్ బోర్డులో పి.ఆర్. రమేష్ నియామకం ఆడిట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగింత
పాలన బలోపేతంపై దృష్టితదుపరి వృద్ధి దశకు సంస్థ సిద్ధం
srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News
srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News
తడబడిన గుజరాత్.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే?
ఐపిఎల్ 2026లో భాగంగా పంజాప్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్(11) విఫలం కాగా.. శుభ్ మన్ గిల్(39), జోస్ బట్లర్(38), గ్లెన్ ఫిలిప్స్(25)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీంతో గుజరాత్, పంజాబ్ జట్టుకు కేవలం 163 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ మూడు వికెట్లతో రాణించగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు, జాన్సెన్ ఒక వికెట్ తీశారు.
China Pakistan Call : కాల్పులు ఆపండి Andhra prabha News
China Pakistan Call : కాల్పులు ఆపండి Andhra prabha News (
మేడ్చల్ లో శ్రీరామ బేకరీలో కాలం చెల్లిన కేకులు
మేడ్చల్ లో శ్రీరామ బేకరీలో కాలం చెల్లిన కేకులు మేడ్చల్, ఆంధ్రప్రభ :

31 C