petrol |పెట్రోల్.. పుకార్లు.. పెట్రోల్ అయిపోతుంది దొరకదనే వదంతులు.. వాహనదారులతో కిటకిటలాడుతున్న పెట్రోల్
అమెరికా ఇరాన్ చర్చల్లో మధ్యవర్తిత్వానికి రెడీ: పాక్ ప్రధాని
పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధానికి అర్థవంతమైన ముగింపునిచ్చేందుకు అమెరికాఇరాన్ నడుమ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దాన్ని తాను గౌరవంగా కూడా భావిస్తానని మంగళవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు పాక్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నారు. అమెరికా, ఇరాక్ శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుందని ఊహాగానాలు వెలువడిన నేపథ్యలో షరీఫ్ ప్రకటన చేయడం విశేషం. మరోవైపు చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుందని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై అమెరికా ఇప్పటి వరకు స్పందించలేదు.
అమెరికా లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు
టెక్సాస్ లోని పోర్ట్ ఆర్థర్లో గల వాలెరో రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీ లోని ఓ ఇండస్ట్రియల్ హీటర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలోఈ ప్రమాదం సంభవించింది. పేలుడు సమయంలో భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు తెలిపారు. కొన్ని మైళ్ల దూరం వరకు భూమి కంపించినట్టు వెల్లడించారు. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను షెల్టర్లకు తరలిస్తున్నారు. అమెరికా లోని కీలకమైన చమురు శుద్ధి కేంద్రాల్లో వాలెరో రిఫైనరీ ఒకటి. ఇందులో రోజుకు 3,80,000 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేస్తుంటారు.
వాంటెడ్ మావోయిస్టు శుక్రు లొంగుబాటు
ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు కంధమాల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారంనాడు లొంగిపోయారు. మరో నలుగురు మావోయిస్టు సభ్యులతో కలిసి శుక్రు లొంగిపోయినట్టు డిజిపి వైబి ఖురానియా తెలిపారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడైన శుక్రు ఏకే-47 రైఫిల్తో లొంగిపోయినట్టు చెప్పారు. శుక్రుపై రూ.55 లక్షల రివార్డు కూడా ఉంది. మల్కాన్గిరి జిల్లాకు చెందిన శుక్రు కెకెబిఎన్ డివిజన్ పేరిట కొత్తగా దళాన్ని ఏర్పాటు చేసి కంధమాల్ జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీలోగా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రం గడువు విధించిన నేపథ్యంలో తాజా లొంగబాటు చోటు చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పలు జిల్లాల్లో గాలింపు చర్యలను కూడా పోలీసులు ముమ్మరం చేశారు.
ట్రాన్స్జెండర్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టంలో సవరణలు చేయడానికి తీసుకొచ్చిన బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది. అయితే, ఈ బిల్లులో గే, లెస్బియన్ వంటి లైంగిక అభిరుచులను చట్ట పరిధి నుంచి మినహాయించడం పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ బిల్2026పై జరిగిన చర్చకు స్పందించిన సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, ఈ చట్టం జీవ వైజ్ఞానిక కారణాల వల్ల సామాజికంగా బహిష్కరణకు గురయ్యే వ్యక్తులకు మాత్రమే రక్షణ కల్పించడం లక్ష్యమని తెలిపారు. ఈ సవరణతో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు చట్టపరమైన గుర్తింపు, రక్షణ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. 2019 చట్టంలో గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష ఉండగా, కొత్త సవరణ బిల్లులో గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం కల్పించినట్లు మంత్రి వివరించారు. బిల్లు ఆమోదానికి ముందు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలను సభ వాయిస్ ఓటుతో తిరస్కరించింది. ప్రభుత్వం ఈ బిల్లు లక్ష్యం ట్రాన్స్జెండర్ వర్గానికి రక్షణ కల్పించడం మాత్రమేనని చెబుతుండగా, ప్రతిపక్షం మాత్రం ఈ చట్టం వ్యక్తిగత లైంగిక గుర్తింపు నిర్ణయించే హక్కును దూరం చేస్తోందని విమర్శించింది. ముఖ్యంగా గే, లెస్బియన్ వ్యక్తులను ఈ చట్ట పరిధి నుంచి తప్పించడం సరికాదని పేర్కొంటూ, బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసింది. ఈ బిల్లు ట్రాన్స్జెండర్ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ, ‘లైంగిక అభిరుచులు, స్వీయ లైంగిక గుర్తింపులు’ చట్ట పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా పరిగణించబడే వర్గంలో ఇవి ఎప్పటికీ చేరవని బిల్లులో పేర్కొంది. సమాజంలో తీవ్రమైన వివక్షకు గురయ్యే ట్రాన్స్జెండర్ వర్గాన్ని రక్షించడమే ఈ చట్టం ఉద్దేశమని, అన్ని రకాల లైంగిక గుర్తింపులు లేదా జెండర్ ఫ్లూయిడిటీ కలిగిన వర్గాలకు ఇది వర్తించదని బిల్లు వివరిస్తోంది.ట్రాన్స్జెండర్ వ్యక్తులను ఖచ్చితంగా గుర్తించి వారికి చట్ట ప్రయోజనాలు అందేలా స్పష్టమైన నిర్వచనం అవసరమని బిల్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒక అధికారం (అథారిటీ) నియామకం కోసం కూడా నిబంధనలు కల్పించింది. అవసరమైతే నిపుణుల సలహా తీసుకునే అధికారం దీనికి ఉంటుంది. ఈ అథారిటీగా ప్రధాన వైద్యాధికారి లేదా ఉప ప్రధాన వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ బోర్డును కేంద్రం, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం నియమించవచ్చని బిల్లులో పేర్కొంది.ట్రాన్స్జెండర్ చట్టం అమలు సమయంలో నిర్వచన పరిధిపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఈ సవరణలు తీసుకొచ్చినట్లు బిల్లు వివరిస్తోంది. ‘కిన్నర్’, ‘హిజ్రా’, ‘అరవాణి’, ‘జోగ్తా’ వంటి సామాజిక-సాంసృ్కతిక గుర్తింపులు కలిగిన వ్యక్తులు, యూనక్స్, ఇంటర్సెక్స్ వేరియేషన్స్ ఉన్న వారు లేదా జనన సమయంలో లింగ లక్షణాల్లో సహజ భిన్నత్వం ఉన్నవారిని ట్రాన్స్జెండర్గా నిర్వచించేలా కొత్త ఉపవిభాగాన్ని చేర్చింది. అలాగే నేరాల తీవ్రత, గాయాల ప్రభావం, ముఖ్యంగా బాలలపై జరిగే నేరాల దృష్ట్యా వేర్వేరు శిక్షలను విధించే విధానాన్ని కూడా బిల్లు ప్రతిపాదించింది.
ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం పాకిస్థాన్
ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో బాధపడుతున్న దేశంగా పాకిస్థాన్ తొలి స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్, తజికిస్తాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్కు చెందిన గాలి నాణ్యత సాంకేతిక సంస్థ ‘ఐక్యూఏయిర్’ విడుదల చేసిన 2025 ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్’ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక 143 దేశాలు, ప్రాంతాలు, భూభాగాల్లోని 9,446 నగరాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 40,000కు పైగా మానిటరింగ్ స్టేషన్లు, తక్కువ ఖర్చు సెన్సర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తీసుకున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, పౌర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కాలుష్య దేశాల జాబితాలో చైనా 20వ స్థానంలో ఉండగా, అమెరికా 120వ స్థానంలో, యునైటెడ్ కింగ్డమ్ 110వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన వార్షిక సగటు పీయం2.5 ప్రమాణాలను కేవలం 13 దేశాలు లేదా ప్రాంతాలు మాత్రమే పాటించగలిగినట్లు నివేదిక పేర్కొంది. ఫ్రెంచ్ పోలినీషియా, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ దీవులు, బార్బడోస్, న్యూ కాలెడోనియా, ఐస్లాండ్, బెర్ముడా, రీయూనియన్, ఆండోరా, ఆస్ట్రేలియా, గ్రెనడా, పానామా, ఎస్టోనియా ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 143 దేశాల్లో 130 దేశాలు (91 శాతం) డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన పీయం2.5 పరిమితులను మించాయని నివేదిక స్పష్టం చేసింది. అత్యంత కాలుష్య దేశాలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, తజికిస్తాన్, చాద్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో ఉన్న 25 నగరాలు భారత్, పాకిస్థాన్, చైనా దేశాల్లోనే ఉండగా, అత్యధికంగా భారత్లోనే ఉన్నట్లు నివేదిక తెలిపింది. అత్యంత పరిశుభ్రమైన నగరంగా దక్షిణాఫ్రికాలోని న్యూవౌడ్విల్ నిలిచింది. నగరాల వారీగా ఉత్తరప్రదేశ్లోని లోనీ అత్యంత కాలుష్య నగరంగా నిలవగా, చైనాలోని హోటాన్, మేఘాలయ రాష్ట్రంలోని బైర్నిహాట్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా, పాకిస్థాన్లోని ఫైసలాబాద్ ఐదో స్థానంలో ఉంది. 2025లో అటవీ అగ్నిప్రమాదాలు గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది. గతంలో తక్కువ కాలుష్య స్థాయులు ఉన్న ప్రాంతాల్లో కూడా పీయం2.5 స్థాయిలు పెరిగాయి. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 శాతం నగరాలు మాత్రమే డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోగలిగాయి. 2024లో ఇది 17 శాతంగా ఉండటం గమనార్హం.
TN Polls 2026: ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న కమల్ హాసన్ పార్టీ..
న్యూఢిల్లీ: కమల్ హాసన్ పార్టీ 'మక్కల్ నీది మయ్యం' (MNM) రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని కమల్ ప్రకటించారు. అయితే అధికారంలో ఉన్న 'ద్రవిడ మున్నేట్ర కజగం' (DMK) నేతృత్వంలోని కూటమికి తమ మద్దతు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్తో కమల్ హాసన్ సమావేశమయ్యారు. అనంతరం కమల్ మీడియాతో మాట్లాడుతూ.. మేము DMK కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. మేము విజయం సాధిస్తాం... నా దార్శనికత గురించి పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసు. వారు నా ఆశయాలను అనుసరిస్తారు. మేము మధ్యేవాదులం (centrists). మేము ఏ వైపుకూ మొగ్గు చూపమని మాకు తెలుసు అని అన్నారు. కాగా.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కమల్ హాసన్, జూన్ 12న DMK కూటమి మద్దతుతో ఏకగ్రీవంగా రాజ్యసభలో అడుగుపెట్టారు. అవినీతి నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తూ.. MNM వ్యవస్థాపకుడు కమల్ హాసన్ 2017లో తన పార్టీని ప్రారంభించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కమల్ పార్టీ మొత్తం ఓట్లలో సుమారు నాలుగు శాతం వాటాను దక్కించుకుని, తమిళనాడు రాజకీయాల్లో తన తొలి అడుగులను బలంగానే వేసింది. తర్వాత, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుండి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక, 2024 లోక్సభ ఎన్నికల సమయంలో MNM పోటీకి చేయకుండా DMK కూటమికి మద్దతును ప్రకటించింది. ఇదిలావుంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.
రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మంగళవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురవగా హైదరాబాద్లో వడగండ్ల కూడిన వర్షం కురిసింది. ఉదయం వరకు విపరీతమయిన ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వరుణుడు షాక్ ఇచ్చాడు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షకురవగా, జూబ్లీహిల్స్, బజారాహిల్స్, ఫిల్మ్నగర్లో మాత్రం కుంభ వృష్టి కుసిరింది. మణికొండ, గచ్చిబౌలి ప్రాంతాల్లో వడగండ్లు పడటంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరం వెలుపల ప్రాంతాలయిన సూరారం, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లోనే వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. కుండపోతగా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వరద నీరు రోడ్లపైకి చేరింది. ప్రధానంగా ఐటి కారిడార్లో రోడ్లు చెరువులను తలపించాయి. ప్రజలు ఉద్యోగ, ఉపాధి, కూలీ పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం దాటికి నిలిచిన ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో రంగు హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ల పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు మరియు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సమీపంలో జరిగింది. నర్సిపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి వెంకటేశ్వర్లు (31) అనే యువకుడు మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు రైల్వే పట్టాలు దాటుతున్నాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రైలును గమనించలేదు దీంతో వేగంగా వచ్చిన రైలు అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.ఆర్.పి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ రత్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి స్థానిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.వెంకటేశ్వర్లు మృతితో నర్సిపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
విజయవాడలో ఉగ్రవాద ముఠా భగ్నం సోషల్ మీడియా ద్వారా యువతను లక్ష్యంగా చేసుకున్న
మద్యం సేవించి వాహనం నడిపితే.. రెండు రోజుల జైలు శిక్ష
మద్యం సేవించి వాహనం నడిపితే.. రెండు రోజుల జైలు శిక్ష చిట్యాల, ఆంధ్రప్రభ
ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్..
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 నుండి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్ డకెట్ తప్పుకున్నాడు. కేఎల్ రాహుల్తో పాటు డకెట్ ఓపెనర్ గా ఎంపికవుతాడని భావించారు. అయితే, టోర్నమెంట్కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు డకెట్ షాకిచ్చాడు.రాబోయే సీజన్లో తాను ఆడటం లేదని డకెట్ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పుడు తన ఏకైక లక్ష్యం జాతీయ జట్టు కోసం రాణించడమేనని తెలిపాడు. “ఇది చాలా కష్టమైన నిర్ణయం. నేను రాలేకపోతున్నందుకు ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను వేలంలో పాల్గొన్నప్పుడు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాను. ఢిల్లీ లాంటి ఫ్రాంచైజీ నన్ను ఎంపిక చేసుకోవడం అద్భుతంగా అనిపించింది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ పోటీ. ఈ టోర్నీ ఒక అద్భుతమైన అనుభవం అయ్యేది” అని డకెట్ పేర్కొన్నాడు. అయితే, యాక్షన్లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది బిసిసిఐ కొత్త రూల్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డకెట్ పై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.
No Relief from the Supreme Court for Peddireddy
In a significant legal development, senior YSRCP leader and former minister Peddireddy Ramachandra Reddy has faced a setback in the Supreme Court. The case revolves around pending payments linked to road works carried out during the previous government in Andhra Pradesh. The petition was filed in his wife’s name. It sought directions from the state […] The post No Relief from the Supreme Court for Peddireddy appeared first on Telugu360 .
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి..
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి.. దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వంఇది ప్రజా పాలన కాదు..ప్రజా వ్యతిరేక
Sanjay Dutt Meets Chandrababu Naidu, Signals Big Push for Film Industry in Andhra Pradesh
Bollywood actor Sanjay Dutt met Chief Minister Nara Chandrababu Naidu in Amaravati, in a meeting that is being seen as a strong signal for the growth of the film industry in the state. The meeting took place at the Secretariat in Velagapudi. Sanjay Dutt was accompanied by his team, including Gaurav Dubey, Kunal Patel, and […] The post Sanjay Dutt Meets Chandrababu Naidu, Signals Big Push for Film Industry in Andhra Pradesh appeared first on Telugu360 .
క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం..
క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్షయ(టీబీ) వ్యాధిని సమూలంగా
మద్యం సేవించి వాహనాలు నడపరాదు..
మద్యం సేవించి వాహనాలు నడపరాదు.. సరైన పత్రాలు లేని 10 వాహనాలకు 1500,
ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలిమున్సిపల్
నేరేడ్మెట్ లో నకిలీ దంత వైద్యుడు అరెస్ట్
పదవ తరగతి పాస్ కాకుండానే డెంటల్ డాక్టర్ గా అవతారం ఎత్తి 20 ఏళ్లుగా నగరం నడిబొడ్డులో దంత వైద్యునిగా చలామణి అవుతున్న వ్యక్తి బండారం మంగళవారం మధ్యాహ్నం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్మెట్ పోలీసులు ఓ వ్యక్తి ఫిర్యాదుతో బట్టబయలు చేశారు. నేరేడ్మెట్ సత్య ఆదిత్య టవర్స్ లో అంజాలికా డెంటల్ ఆస్పత్రి పేరుతో గత 20 ఏళ్లుగా రమేష్ కుమార్ గుప్తా అమాయక రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఓటి పోలీసులు అతని ఆసుపత్రిని పరిశీలించి సర్టిఫికెట్లను కోరడంతో అసలు విషయం బయటపడింది. పదవ తరగతి మాత్రమే చదివిన యూపీ కి చెందిన రమేష్ కుమార్ గుప్తా నగరంలో నకిలీ డాక్టర్ గా అవతారం ఎత్తి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ అంది వచ్చిన సొమ్మును దండుకున్నాడని గుర్తించారు. బిడిఎస్ చేశానని చెప్పి తప్పుడు సర్టిఫికెట్లతో వైద్యం అందిస్తున్న రమేష్ కుమార్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము వరకు మాత్రమే ఇతని సేవలు ఉండడం అతని సేవలపై అనుమానించిన వ్యక్తి ఎస్ ఓ టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమేష్ గుప్తాను అదుపులోకి తీసుకుని తీసుకున్న ఎస్ఓటి పోలీసులు నేరేడ్మెట్ పీఎస్ లో అప్పగించారు.
చిత్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు సీజ్
చిత్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు సీజ్ ఏసీబీ కానిస్టేబుల్ పై డాక్యుమెంట్
మళ్లీ చెప్తున్నా.. ఫార్ములా ఈ-కార్ రేస్ ఒక లొట్టపీసు కేసు: కెటిఆర్
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో కెటిఆర్ చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికీ ఒక లొట్టపీసు కేసు మాత్రమే అన్నారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదు, లేని కేసును ఉన్నట్టుగా చూపి మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని నిన్న స్పీకర్ను అవకాశం ఇవ్వాలని కోరాం. ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎవరికీ లబ్ధి జరిగిందో ఆ కంపెనీ పేరును కనీసం చార్జ్షీట్లో కూడా చేర్చలేదు. నా వల్ల ఒక్క పైసా ఎవరికైనా వెళ్లిందా అన్న అంశాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రస్తావించలేదు. ఇప్పటికీ డబ్బులు అక్కడే ఉన్నాయి. తప్పుడు చార్జ్షీట్ తీసుకొచ్చి అక్రమ కేసు పెడుతున్నారు. బ్యాంక్ టు బ్యాంక్ డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినట్టు ఉంది...అయితే రికవరీ ఎందుకు చేయడం లేదు ప్రభుత్వం?. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు, ఎలక్ట్రిక్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ నిర్వహించాం....దాని వల్ల సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.200 కోట్లు ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీ పెట్టి రాష్ట్ర, దేశ పరువు పోయేలా చేశారు. నన్ను వేశ్యలా చూసారని మిలా మ్యాగీ స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చింది...ఈ అంశంపై ఎలాంటి విచారణ చేశారు?. అక్రమ కేసులపై మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం...మాకు న్యాయం జరుగుతుంది. మేము భయపడము. రేవంత్ రెడ్డి లాగా చట్టాలను, న్యాయస్థానాలను చేతుల్లోకి తీసుకోము. ఫార్ములా ఈలో క్విడ్ ప్రో కో జరగలేదు...అయితే అందులో ఆ కంపెనీ పేరు ఎందుకు చేర్చలేదు? అని కెటిఆర్ ప్రశ్నించారు.
రేషన్కార్డుదారులకు ఉచితంగా రిఫ్రిజిరేటర్లు
త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంపిణీ చేస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది. అదే విధంగా కేజీ పప్పుతో పాటు కిలో వంటనూనె కూడా ఉచితంగా సరఫరా చేస్తామని హామీనిచ్చింది. మంగళవారంనాడిక్కడ ఎఐడిఎంకె ప్రధాన కార్యదర్శి, మాజీ సిఎం పళనిస్వామి మేనిఫెస్టో విడుదల చేశారు. రిఫ్రిజిరేటర్లను పంపిణీ చేయడమంటే గృహిణులపై పని భారాన్ని తగ్గించడమేనని పళనిస్వామి అన్నారు. ప్రతి ఏటా మూడు వంటగ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా అందజేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. జల్లికట్టు క్రీడలో ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంకా మహిళా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు వారికి ప్రతి నెలా రూ.2000 ఆర్థిక సాయం, ఐదు లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్రవాహనాలను సబ్సిడీపై అందజేస్తామని పళనిస్వామి ప్రకటించారు. పింఛన్లను రూ.2000కు పెంచుతామన్నారు. మహిళలకు బస్సులో ఉచితంగా ఇప్పటికే ప్రయాణ వసతి కల్పిస్తున్నారని, దాన్ని పురుషులకు కూడా వర్తింప జేస్తామన్నారు. అధికారంలోకి రాగానే డిఎంకె హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. మేనిఫెస్టోలోమొత్తం 297 హామీలను అన్నాడిఎంకె ప్రకటించింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చే నెల 23న పోలింగ్ జరగనుంది.
మొండి బకాయిల వసూళ్ల పై భారీ అవగాహనా ర్యాలీ
మొండి బకాయిల వసూళ్ల పై భారీ అవగాహనా ర్యాలీ సిర్పూర్ (యు ),
అక్రమంగా నిల్వచేసిన… 8గ్యాస్ సిలిండర్లు సీజ్
అక్రమంగా నిల్వచేసిన… 8గ్యాస్ సిలిండర్లు సీజ్ చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం
11 నంబర్ జెర్సీతో బరిలో దిగనున్న ఆర్సిబి
ఐపిఎల్ సీజన్ 2026 ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ఆటగాళ్లు 11 నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్తో మార్జి 28న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు తన తొలి మ్యాచ్ను ఆడనుంది. ఈ మ్యాచ్లో జట్టు సభ్యులు 11వ నంబర్ జెర్సీని ధరించనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సిఇఓ రాజేశ్ మేనన్ మంగళవారం వెల్లడించారు. కిందటి ఏడాది బెంగళూరు టీమ్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వారికి నివాళిగా బెంగళూరు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే వారి మృతికి సంతాప సూచకంగా స్టేడియంలో 11 సీట్లను రిజర్వ్ చేసి పెట్టనున్నట్టు తెలిసింది. చిన్నస్వామి స్టేఇయడంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లతో సహా, ఇతర కార్యక్రమాల సమయంలో కూడా ఈ 11 సీట్లు ఖాళీగానే ఉంటాయని సమాచారం. అంతేగాక ఆరంభ మ్యాచ్కు ముందు స్టేడియం ప్రవేశ ద్వారం దగ్గర ఒక స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆర్సిబి యాజమాన్యం నిర్ణయించింది. కాగా, ఈ సీజన్లో ఆర్సిబి బెంగళూరులో ఐదు మ్యాచ్లను ఆడనుంది. రెండు మ్యాచ్లు రాయ్పుర్లో జరుగుతాయి.
మండలి చైర్మన్, ప్రభుత్వ విప్పులను కలిసిన కాంగ్రెస్ నాయకులు
మండలి చైర్మన్, ప్రభుత్వ విప్పులను కలిసిన కాంగ్రెస్ నాయకులు చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి..
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి.. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు తగ్గించడం దారుణం..ఆటో డ్రైవర్లనూ
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ గాయాలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ గాయాలు కల్లూరు సాయిబాబా టెంపుల్ సమీపంలో రోడ్డు
బైంసాలో నో స్టాక్ పెట్రోల్ భైంసా పట్టణంలోని గీత పెట్రోల్ బంక్ లో
సెక్రటేరియట్ వద్ద ప్రమాదకర స్టంట్లు..ఇద్దరు యువకుల అరెస్టు
తెలంగాణ సెక్రటేరియట్, లుంబినీ పార్క్ వద్ద బైక్లతో ప్రమాదకర స్టంట్లు చేసిన ఇద్దరు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ముషీరాబాద్, బోలక్పూర్కు చెందిన మహ్మద్ అఖీల్ కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు, నాంపల్లికి చెందిన మహ్మద్ అతీక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ కోసం సెక్రటేరియట్, లుంబినీ పార్క్ వద్ద బైక్లతో స్టంట్లు చేశారు.నిందితులు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు తమ మోటారు సైకిళ్లపై బాధ్యతారహితంగా స్టంట్లు చేస్తున్నారు. సెక్రటేరియట్ వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో వీరు స్టంట్లతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైఫాబాద్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. బైక్లు, వీడియోలు,మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు.సైఫాబాద్ ఇన్స్స్పెక్టర్ సీతయ్య, ఎస్సై వి. పరమేశ్వరి, పోలీసు సిబ్బంది, ఎల్. సంపత్ కుమార్, బి. విజయ్ కుమార్, జె. లింగస్వామి, ఎస్. మహేష్ అరెస్టు చేశారు.
వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి మంత్రిని కోరిన పాలకుర్తి ఎమ్మెల్యే
సినిమా థియేటర్లో ఆకస్మిక తనిఖీలు …
సినిమా థియేటర్లో ఆకస్మిక తనిఖీలు … పలు విభాగాలు ,ఆహార పదార్థాలను క్షుణ్ణంగా
జనగణన మరింత సులభం మీ వివరాలను మీరే నమోదు చేసుకోవచ్చుకమిషనర్, ప్రిన్సిపల్ సెన్సెస్
వార్డుల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు…
వార్డుల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు… మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ చిత్తూరు, ఆంధ్రప్రభ
పురుషులకూ ప్రీ బస్సు.. తమిళ ప్రజలపై అన్నాడిఎంకె హామీల వర్షం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ప్రజలపై ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) హామీల వర్షం కురిపించింది. మంగళవారం అన్నాడిఎంకె తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే..రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఉచిత రిఫ్రిజిరేటర్లు ఇస్తామని.. మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్నికల్పిస్తామని హమీ ఇచ్చింది. మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు.. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు, 1 కిలో పప్పు, 1 లీటరు వంట నూనె. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు. ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం. వృద్ధులు , ఇతర లబ్ధిదారుల సామాజిక భద్రతా పింఛన్లను రూ. 2,000కు పెంపు. జల్లికట్టు కళాకారుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం. కాగా, తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి, ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…
ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత… భవానిపురం,ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గానికి
యువకుడు మిస్సీంగ్…. కాల్వలో దూకినట్లు అనుమానం మాచర్ల, ఆంధ్రప్రభ : ఓ యువకుడు
పేదలకు రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని సీపీఐ ఆందోళన
పేదలకు రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని సీపీఐ ఆందోళన కర్నూలు, ఆంధ్రప్రభ : పేద
ప్రమాద రహిత జిల్లాగా చేయటమే లక్ష్యం
ప్రమాద రహిత జిల్లాగా చేయటమే లక్ష్యం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లారహదారి భద్రత
ప్రపంచంలోనే 25 కాలుష్య నగరాలు ఇండియాలోనే…
ప్రపంచంలోనే 25 కాలుష్య నగరాలు ఇండియాలోనే… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రపంచంలో అత్యంత
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ’దేత్తడి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ ఆదిత్య రావు గంగసాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఆశిష్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జునైద్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ను అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్ప్లే, డైలాగ్స్తో పాటు క్రియేటివ్ హెడ్గా కూడా పని చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కూడా పడింది. మియాపూర్, కూకట్పల్లి, బోరబండ, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్చెరు, బాచుపల్లి వంటి పలు ప్రాంతాల్లో రాళ్ల వర్షంతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, బేగంపేట్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, యూసుఫ్గూడ, మణికొండ, బోరబండ, చందానగర్ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడటంతో ఐటీ కారిడార్తో పాటు ప్రధాన రహదారులన్నీ జలమయమై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వానతో రోడ్లు జలమయమై, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న 2-3 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) యెల్లో అలర్ట్ జారీ చేసింది.
on6guarantees |అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం
on6guarantees | అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం on6guarantees | ఆరు గ్యారెంటీలు…
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై బిఆర్ఎస్ వాయిదా తీర్మానం
రాష్ట్రంలో గ్యాస్ కొరతతో సామాన్యులు, చిరు వ్యాపారులు, వృద్ధాశ్రమాలు,హాస్టళ్లు, హోటల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సకాలంలో గ్యాస్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేందుకు శాసనసభ, శాసన మండలిలో దీనిపై తక్షణమే చర్చ జరగాలని మంగళవారం బిఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఈ మేరకు గన్పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆపండి వెంటనే గ్యాస్ ఇవ్వండి..కేంద్ర చెబుతోంది కొరత లేదు, రాష్ట్ర చెబుతుఓంది సప్లై లేదు..ఏదీ నిజం..? అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.ఈ నిరసనలో బిఆర్ఎస్ ఎంఎల్ఎలు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్రెడ్డి, సుధీర్రెడ్డి, మదుసూదనాచారితో పాటు పార్టీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్లు సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎల్పిజి డిస్టిబ్యూషన్ దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున్న క్యూ లైన్లో ఉంటున్నారని పేర్కొన్నారు. గ్యాస్ కొరత లేదు..సరిపడా నిల్వలు ఉన్నాయి అని కేంద్రం చెబుతుది..పెట్రోలియం, గ్యాస్ కేంద్ర పరిధిలో ఉన్నాయి, గ్యాస్ కొరత ఉందని రాష్ట్రం చెబుతుందని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 4 నుంచి కేంద్రం సిలిండర్ సైజ్ తగ్గించే ప్రయత్నం చేయబోతుందని, 14 కిలోల సిలిండర్ను 10 కిలోలు కాబోతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇరాన్లో ఇబ్బంది ఉంటే వేరే చోట నుండి తెప్పించాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఇంట్లో సిలిండర్ల గురించి చర్చ జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఇదే విషయంపై శాసనసభలో, శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చామని, ప్రజల గొంతుకుగా అసెంబ్లీలో మాట్లాడుతామని తెలిపారు.
Big Troubles for Puri Jagannadh Ahead
Sensational director Puri Jagannadh has delivered two massive duds like Liger and Double iSmart. Both these films left the buyers and exhibitors in huge losses. Puri Jagannadh has been responsible for the repayment and the issues reached the Film Chamber long ago. The distributors and other parties involved are waiting with patience as Puri Jagannadh […] The post Big Troubles for Puri Jagannadh Ahead appeared first on Telugu360 .
మంత్రి పదవి లేకున్నా నా బ్రాండ్ ఇమేజ్ తగ్గదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి ఉన్నా లేకున్నా తన బ్రాండ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ముగియగానే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని రావాలని కెసి వేణుగోపాల్ చెప్పారని ఆయన తెలిపారు. ఆ హామీ ఇప్పటికీ ఉందన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనడం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేప్పుడు తెలియదా తాము అన్నదమ్ములమని అని ఆయన ప్రశ్నించారు. తమ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు లేరా? అని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి రానంత మాత్రాన తన బ్రాండ్ ఇమేజ్ ఇలాగే ఉంటుందన్నారు. మంత్రి పదవి వచ్చినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని, మార్పు ఏమీ ఉండదని ఆయన తెలిపారు. మంత్రి పదవి కోసం పాకులాడడం లేదన్నారు. మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.
మతం మార్చుకుంటే ఎస్సీ కోటా రద్దు: సుప్రీంకోర్టు
మతం మార్చుకున్న తరువాత అట్రాసిటీ చట్టం కేసులపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులను పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే ఈ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపి, నేడు తుది ఉత్తర్వులను జారీ చేసింది.బాపట్ల జిల్లా పిట్టలవాని పాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చిని నిర్వహించడంపై అక్కల రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటే రామిరెడ్డి, స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేస్తున్నందు వల్ల క్రైస్తవుడవుతారని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు. పుట్టుకతో హిందువు అయినా.. క్రైస్తవం స్వీకరించడంతో అతను షెడ్యూల్ కులానికి చెందరని కోర్టుకు విన్నవించుకున్నారు. అట్రాసిటీ చట్టం లోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని.. తమపై పెట్టిన కేసుకు విచారణ అర్హత లేదని వాదించారు. రామిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేదని కోర్టు పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే ఎస్సీ హక్కులు పొందే అర్హతఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. పైగా చింతాడ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవం ఉన్నారని నిరూపణ అయిందని ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి కేసులకు మార్గదర్శకంగా నిలవనుంది.
గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి
గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ ; భూ
ఇండో-ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ మీట్లో పాల్గొన్న మేఘా రెడ్డి..
మునుగోడు, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీలోని ఫిన్లాండ్ రాయబారి కార్యాలయంలో నిర్వహించిన ఇండో-ఫిన్లాండ్ ఎడ్యుకేషన్
Mythri’s Next With Soori, Intriguing Poster
Mythri Movie Makers is bankrolling good number of Pan India films with big stars, and they are also backing content-rich movies. After making films like Good Bad Ugly and Dude, they have now announced their third Tamil film- #MythriTamil03, starring the very talented Soori in the lead. The film will be directed by R Ravikumar […] The post Mythri’s Next With Soori, Intriguing Poster appeared first on Telugu360 .
మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
చిట్యాల, ఆంధ్రప్రభ ; మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు
జైనూర్ పంచాయతీలో వారపు సంతల వేలంపాట
జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రతి
Ram’s Action Thriller on Cards
Energetic Star Ram is occupied with debacles. He was super confident on his last film Andhra King Taluka but the film ended up as a disappointment. Ram is on a break and he is personally working on a couple of scripts. His next film has been finalized and it will be announced next week. Logi […] The post Ram’s Action Thriller on Cards appeared first on Telugu360 .
lpg |గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్
lpg | గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్ మూసివేత దారిలో యజమానులుఖర్చు
7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు…
7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు… కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను
పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యాన్ని అందిస్తున్నాం…
పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యాన్ని అందిస్తున్నాం… పటమట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో
ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్లు..
ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్లు.. -ఏడాది నుంచి భారత్ పెట్రోల్ బంక్
డ్యూటీకి మించి మానవత్వం చూపిన పోలీసులు
డ్యూటీకి మించి మానవత్వం చూపిన పోలీసులు ట్రాఫిక్ పోలీసుల మానవీయ కోణం…సిగ్నల్ వద్ద
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు
రెండోవ రోజు ఘనంగా ఉర్సు గంధ మహోత్సవం…
రెండోవ రోజు ఘనంగా ఉర్సు గంధ మహోత్సవం… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండలంలోని
బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు.
బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని
గ్యాస్, పెట్రోల్ పై ప్రధాని క్లారిటీ
దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు
Telangana : ప్రభుత్వోద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు..
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల
ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవ్వండి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపొందుగల గ్రామంలో ‘రైతన్నా మీకోసం’
Telangana |నిందితులు అదుపులో..
Telangana | నిందితులు అదుపులో.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ
వార్డు అభివృద్ధే లక్ష్యం -ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను-అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు
కన్నతండ్రి కాలయముడయ్యాడు.. సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : భార్యాభర్తల కుటుంబ కలహాలకు ఘోర
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన…
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన… మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకనిమెర్లతండాలో హెల్త్
సాకరమైన పేదల దశాబ్దాల కల… పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత
పాత వాహనాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం… #Telangana #VehicleScrappage #Hyderabad #GreenTax
మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ…
మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ… విద్యార్థులతో కలిసి భోజనం చేసిన గద్దె
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో సాయంత్రం
మూడుచింతలపల్లిలో జంతర్ మంతర్… మూడు చింతలపల్లి, ఆంధ్రప్రభ : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ
చిరంజీవి సినిమాకు సంగీతం అందించాలనేది నా డ్రీమ్
యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ తన 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించా రు. వాటిలో నాగార్జున నటించిన ది ఘోస్ట్, ప్రియదర్శి మల్లేశం, తేజ సజ్జ జాంబీరెడ్డి, తాప్సీ మిషన్ ఇంపాజిబుల్, నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. తాజాగా దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు మార్క్ కె రాబిన్. ఈ సందర్భంగా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని, తన ప్రయాణంలోని విశేషాల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ “దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. గద్దర్ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా దండోరా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రేరణనిచ్చింది. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు, చివరకు చనిపోయాక అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, ఒక బ్రిడ్జి మీద నుంచి శవాలను నీటిలోకి దింపడం వంటివి దర్శకుడు చెప్పాక నా మనసు చలించింది. భావోద్వేగం నిండిన మనసుతోనే దండోరా సినిమాకు సంగీతాన్ని అందించాను. ఇక నాని తను నిర్మించిన అ..! సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం కల్పించారు. ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలా టాలీవుడ్లో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 8 ఏళ్ల ప్రయాణంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాను. - మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్. - ప్రస్తు తం కథాకళి అనే ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వర్మతో రెండు మూవీస్ చేస్తున్నాను”అని అన్నారు.
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : తాగునీటి నాణ్యత పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఇంజనీర్లకు, కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవి ప్రసాద్,మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించవచ్చని వివరించారు. […] The post తాగునీటి నాణ్యతపై అవగాహన appeared first on Visalaandhra .
హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన […] The post హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే! appeared first on Visalaandhra .
IPL 2026.. SRHలోకి ఇంగ్లాండ్ బౌలర్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026 ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారంగా ప్రారంభ మ్యాచులకు దూరం కాగా.. తాజాగా జాక్ ఎడ్వర్డ్స్ వైదొలగాల్సి వచ్చింది. గాయం కారణంగా అతను IPL 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జాక్ ను ఎస్ఆర్ హెచ్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతని స్థానంలో 35 ఏళ్ల ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ పేన్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. పేన్.. ఇంగ్లాండ్ తరపున కేవలం ఒక వన్డే (ODI) మాత్రమే ఆడినప్పటికీ, రూ. 1.5 కోట్లకు SRH జట్టులో చేరడం విశేషం. అయితే, పేన్ టీ20 ఫార్మాట్లో అత్యున్నత ప్రదర్శనే చేశాడు. T20 క్రికెట్ ఆడిన అపారమైన అనుభవం అతనికి ఉంది.పేన్, తన కెరీర్లో ఇప్పటివరకు అతను 233 T20 మ్యాచ్లు ఆడి.. 8.03 ఎకానమీ రేటుతో మొత్తం 304 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జరిగిన BBL (Big Bash League) 15 సీజన్లో పేన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ టైటిల్ విజేతగా నిలిచిన 'పెర్త్ స్కార్చర్స్' జట్టులో డేవిడ్ పేన్ కీలక బౌలర్ గా ఉన్నాడు. ఆడిన ఆరు మ్యాచ్లలో 11 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా, ఫైనల్ మ్యాచ్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పేన్.. నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. BBLలో చూపిన ఇదే ఫామ్ను IPLలో SRH తరపున కూడా పునరావృతం చేయాలని పేన్ ఆశిస్తున్నాడు. దీంతో సరైన బౌలింగ్ లేక ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ కు పేన్ కీలకం కానున్నాడు. ఇక, కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ SRH జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక
విశాలాంధ్ర ధర్మవరం;;ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల గురించి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం, బ్యాగు, షూస్, యూనిఫారం గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవి, అమానుషమైనవనీ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి, ధర్మ ప్రబోధాలు చేసే వ్యక్తి, పేద పిల్లల ఆకలిని , వారి ప్రాథమిక హక్కులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ […] The post పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక appeared first on Visalaandhra .
తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి…
కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు దేశవ్యాప్తంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న తప్పుడు ఫిర్యాదులు, కల్పిత ఆరోపణలు, నకిలీ సాక్ష్యాల సమస్యపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన […] The post తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి… appeared first on Visalaandhra .
Pic Talk: Vaani Kapoor in a Bikini
Bollywood beauty Vaani Kapoor is open to glamorous roles. The actress hasn’t scored a big hit but she has been associated with some of the top production houses. From sizzling in a bikini to slipping into the best modern looks, Vaani Kapoor looks stunning on screen. The actress posted several pictures in a two-piece bikini […] The post Pic Talk: Vaani Kapoor in a Bikini appeared first on Telugu360 .
క్రికెట్లో ప్రకాశం పటిమ… ఏసీఏ సెంట్రల్ జోన్ వన్డే కిరీటం కైవసం…ఫైనల్ లీగ్
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి కృష్ణ తాజ్ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నుంచి 15 గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 81,483 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 30,777 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.12 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Indians |పశ్చిమాసియా యుద్ధంపై…
Indians | పశ్చిమాసియా యుద్ధంపై… Indians | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో
Social media |‘దురంధర్’పై సరిహద్దులు దాటి చర్చలు – నిజం ఎంత?
Social media | ‘దురంధర్’పై సరిహద్దులు దాటి చర్చలు – నిజం ఎంత?
నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం…
నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం… కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..
సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున […] The post మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం.. appeared first on Visalaandhra .
West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి
West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి West Asia |
100% exemption|ఈవీ వాహనాలకు భారీ డిస్కౌంట్
100% exemption| ఈవీ వాహనాలకు భారీ డిస్కౌంట్ 100% exemption | కొనుగోలుకు
Andhra Prabha Smart Edition |TS|మతం మారితే/జీవన్రెడ్డి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-03-2026, 4.00PM ts మతం మారితే ఎస్సీ

26 C