చంద్రబాబు సలహా పాటించక నష్టపోయా : డీఎల్ఎఫ్ ఛైర్మన్
చంద్రబాబు సలహా పాటించక నాడు హైదరాబాద్ లో నష్టపోయాయని డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ అన్నారు.
T 20 World Cup : నేడు టీ20 వరల్డ్కప్లో నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్
నేడు టీ20 వరల్డ్కప్లో నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది
భగవద్గీత పుస్తక ప్రచురణ ఖర్చు రూ. 50 కోట్లు... నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా?: భూమన
హైదరాబాద్: పోర్న్ వీడియోలు చూసే వారికి గీత సారాంశం ఎలా తెలుస్తుందని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ప్రశ్నించారు. భక్తి అంటే భామ పూజ.. భజన అంటే వంట గదిలో జంట విన్యాసం అనే వ్యక్తికి భగవద్గీతలో మొదటి రెండు అక్షరాలే అర్థం అవుతాయని చురకలంటించారు. ఈ పుస్తకంలో భగవద్గీతలో సారం అంటే సారాయి అని, గీతా అంటే అమ్మాయి అని బిఆర్ నాయుడు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. శనివారం సాయంత్రం భూమన మీడియాతో మాట్లాడారు. భగవద్గీత పుస్తక ప్రచురణ ఖర్చు కేవలం రూ.3.71 కోట్లు అని ప్రోసీడింగ్స్ బయటపెట్టాడు. రూ.50 కోట్లు ఎలా ఖర్చు చేశారని, స్కామ్ జరిగిందని ఆరోపణలు చేశారు. అధికారిక పత్రాల ప్రకారం మొత్తం ప్రాజెక్టు ఆమోదిత వ్యయం సుమారు రూ.3.71 కోట్లు మాత్రమేనని, మొదటి దశలో ముద్రించిన 52.95 లక్షల పుస్తకాల ఖర్చు రూ.1,99,81,250 (సుమారు ₹2 కోట్లు) అని, అయితే రూ.50 కోట్లు అనే సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది అని భూమన ప్రశ్నించారు. భగవద్గీత పుస్తక ప్రచురణకు రూ.50 కోట్లు ఖర్చు అయ్యుంటే రాజకీయాల నుంచి విరమిస్తానని సవాల్ విసిరారు. భగవద్గీతపై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారా అని నిలదీశారు. 'మా విలువ తగ్గదని, మీ పతనం పాతాళానికి దిగజారుతుంది, మీ బుర్రలో తొర్రలు లేకపోతే భగవద్గీత అర్థం అవుతుంది' అని విమర్శించారు. అర్హత లేనివాడు అందలం ఎక్కితే వందిమాగదులు వందమాది కావాలన్నట్లుగా బిఆర్ నాయుడి తీరు ఉందని భూమన విమర్శించారు.
ఎన్నికల వేళ టీవీకే చీఫ్ సూపర్ సిక్స్ హామీలు ఇవే
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు ప్రకటించారు
Iran vs Israel War :రష్యా నుంచి ఇరాన్కు సమాచారంపై ట్రంప్ ఏమన్నారంటే?
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం వారం రోజులు దాటుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు
08 Mar 2026 |తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..
08 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం.. తిరుమలలో టోకెన్లులేని
తిట్లు ఆపి రైతుబంధు ఇవ్వాలి సిఎంపై బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఫైర్ మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూ రో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో,కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్గా మార్చామని .. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధా లు చెబుతున్నాడని మాజీ మంత్రి, డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు మండిపడ్డారు. శనివారం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం కురిక్యాల గ్రామం కొండన్నపల్లి బ్రిడ్జి వద్ద వరద కాలువను మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు బీఆర్ ఎస్నేతలతో కలిసి పరిశీలించారు. గోపాల్ రావుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలా లను పరిశీలించగా రైతులు ఎండిపోయిన పొలాలను చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన గ్రామంలో‘రైతులతో మాట ముచ్చట’కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈసం దర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వం లో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్గా మార్చామని స్పష్టం చేశారు. పొద్దున లే స్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నాడనిమం డిపడ్డారు. మొన్న లక్ష్మి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలకు నీళ్లు వదిలారు. మరి ఆ వరద కాలువలలో పారుతున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా..? అని హరీష్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కాళేశ్వరంలో భాగమైన లక్ష్మీ పంప్ హౌ స్ మోటార్లు నడుస్తుంటేనే కదా ఈ నీళ్లు వచ్చాయన్నారు. రైతన్నకు సకాలంలో రైతుబంధు ఇవ్వు : ఎన్నికల ముందు మూడు పంటలకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, ఇప్పుడు మూడు పంట లకు రైతుబంధు ఎగ్గొట్టిన రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు మండిపడ్డారు. నీ బూతులు రైతుల కడుపు నింపవు.. బూతులు ఆపి.. సకాలంలో రైతుబంధు ఇవ్వాలి, యూరియా ఇవ్వాలి అని రేవంత్రెడ్డికి సూచించారు. కేసీఆర్రెండు పంటలకు రైతు బంధు ఇస్తే.. మూడు పంటలకు రైతు బంధు ఇయ్యాలని మాట్లాడిన రేవంత్రెడ్డి.. ఇయ్యాలా మూడు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినంక ఇచ్చేవి 5 రైతు బంధులు.. వాటిలో రెండిచ్చినవు.. మూడు ఎగ్గొట్టినవ్.. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద లేదు. నీకు బూతుల మీదున్న ప్రేమ రైతులపై లేదు. పోయిన యాసంగికి బోనస ఎగ్గొట్టినవ్.. ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినవ్. వడగండ్ల వానకు, తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళ్టికి కూడా ఒక్క రూ పాయి కూడా సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా మారాడన్నారు. 99 రోజుల ప్రణాళి క’అంటూ మళ్లీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కాంగ్రెస్ సర్కార్పై హరీష్రావు ధ్వజమెత్తారు.
గణపతి సహా అజాతంలోని మావోయిస్టులందరికీ సిఎం రేవంత్ అభయం లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు.. నిమ్స్లో మెరుగైన చికిత్స హోదాను బట్టి రివార్డు ప్రోత్సాహంలో ఉదారంగా వ్యవహరిస్తాం ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు భూముల కేటాయింపు విషయంలో ఇప్పుడేం చెప్పలేం రాష్ట్ర పరిధిలో అవకాశం ఉన్న కేసులు ఎత్తివేస్తాం మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వస్తామంటే స్వాగతిస్తాం పెద్దఎత్తున మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోవడం ఇదే తొలిసారి 130 మంది మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలో ముఖ్యమంత్రి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో హింసకు తావు లేదని, ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాసమస్యలు పరిష్కరించుకుందామని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రాకు చెందిన 130 మావోయిస్టులు, 124 ఆయుధాలతో శనివారం రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోయారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన పిలుపు మేరకు ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోయారన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వారికి ఆర్థిక, ఇతర వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని నమ్మకం కలిగించిన పోలీసు ఉన్నతాధికారులను సిఎం అభినందించారు. శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని బలంగా నమ్మే దేశం మనదని, బ్రిటిష్ వాళ్లను సైతం అహింసతో ఎదుర్కొన్న గాంధీ సిద్దాంతాలతో దేశం నడుస్తోందని చెప్పారు. శాంతియుత పోరాటంతో మహాత్మా గాంధీ ఒక యుద్ధాన్ని జయించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని, ఎంత పెద్ద సమస్య అయినా చర్చలే పరిష్కారమని సిఎం తెలిపారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగితే చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్న పరిస్థితి ఈ రోజుల్లో ఉందన్నారు. అజ్ఞాతంలో ఉన్న గణపతితో సహా ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సిఎం పిలుపునిచ్చారు. లొంగిపోతే సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదని సిఎం స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఇటీవల లొంగిపోయిన దేవ్ జీ, దామోదర్, ఇతర కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు కొన్ని ప్రతిపాదనలు ఉంచారని వాటన్నింటీ సాధ్యమయినంత మేరకు అమలు చేస్తామన్నారు. మావోయిస్టులకు సంబంధించి రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రతి అంశం పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యహరిస్తోందని, లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామన్నారు. రివార్డు పెంపుపై ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని సిఎం తెలిపారు. మావోయిస్టుల ప్రతిపాదనలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని, వారి విషయంలో రాష్ట్రానికి పూర్తి స్వేచ్చనిచ్చినట్లు సిఎం చెప్పారు. రాష్ట్ర చర్రితలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలతో లొంగిపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టుల పట్ల సానుకూల వైఖరికి నిదర్శనమని సిఎం పేర్కొన్నారు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని జనజీవన స్రవంతిలోకి వచ్చిన అందరికి సిఎం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ప్రభుత్వంపై నమ్మకంతో మిగిలి వారందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని సిఎం పిలుపు నిచ్చారు. రాష్ట్ర పరిధిలో అవకాశం ఉన్న కేసులు ఎత్తివేస్తాం: సిఎం లొంగిపోయిన మావోయిస్టులపై రాష్ట్ర పరిధిలో అవకాశం ఉన్న కేసులు ఎత్తివేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర, కేంద్ర కమిటీలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలని, కష్టపడి సాధించుకున్న తెలంగాణ పునర్నించుకొవడంలో భాగస్వాములు కావాలని సిఎం పిలుపునిచ్చారు. ఎత్తివేసే అవకాశం ఉన్న కేసులు ఎత్తివేస్తామని, తీవ్రమయిన నేరాలు ఉన్న కేసులు కూడా ఎత్తివేస్తామంటే న్యాయస్థానాలు ఊరుకోవని, వ్యక్తులు, వారిపై ఉన్న నేరాల తీవ్రతను బట్టి పరిశీలిస్తామని సిఎం చెప్పారు. లొంగిపోయన వాళ్లు రాజకీయాల్లో వస్తామన్నా స్వాగతిస్తామని, వారందరికి గౌరవంగా, స్వేచ్చగా బ్రతికే హక్కు ఉందని, అందుకోసం ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తుందని పునరుద్ఘాటించారు. సీతక్క లాంటి వాళ్లు రాజకీయాల్లో వచ్చి ప్రజా సేవ చేస్తున్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు.
గల్ఫ్ దేశాలపై దాడులు తప్పిదమే: ఇరాన్ అధ్యక్షుడు
దుబాయ్: ఇరుగుపొరుగుదేశాలపై తమ దేశ క్షిపణి, డ్రోన్ దాడుల పట్ల ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియాన్ విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరుతున్న ట్లు శనివారం ప్రకటించారు. ఇకపై ఈ దేశాలపై తమ నుంచి దాడులు ఉండబోవని, అయితే తమపై దాడులకు దిగితే ఊరుకునేది లేదని తెలిపారు. ఏది ఏమైనా తమ దేశం నుంచి వారిపై ముందుగా దాడులు జరగబోవని తేల్చిచెప్పారు. ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణ తమ తక్షణ కర్తవ్యం అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశ రాజకీయ నాయకత్వానికి సైనిక బలగాలపై పూర్తి స్థాయి అదుపు లేకపోవడం కూడా ఒక కారణమని పరోక్షంగా వివరించారు. అ మెరికా, ఇజ్రాయెల్తో ప్రస్తు త పోరు దశలో పరిస్థితి పలు మలుపులు తిరగడం, చివరికి పక్కదేశాలపై కూడా తమ సేనలు విరుచుకుపడటం తప్పడం లేదన్నారు. రాత్రంతా ఇజ్రాయెల్ దాడులు.. లెబనాన్లో 41 మంది మృతి లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో 41 మంది చనిపోయారు. నబి చిట్ పట్టణంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. శుక్రవారం రాత్రి జరిగిన దాడులలో మృతులు, క్షతగాత్రుల గురించి లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. శనివారం ఉదయం నుంచే తిరిగి దాడులు సాగాయి. లెబనాన్లోని స్థానిక సాయుధ గ్యాంగ్ల నిర్మూలనకు ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ దాడులలో ముగ్గురు సైనికులు కూడా ఉన్నారని లెబనాన్ సైన్యం ప్రకటించింది. ఇక్కడి నిషేధిత మిలిటెంట్ల వెలికితీత పేరిట ఇజ్రాయెల్ తమ ప్రాంతంలో విచక్షణారహిత దాడులకు దిగుతోందని స్థానికంగా విమర్శలు వెలువడ్డాయి. అయితే ఇక్కడి సాయుధ ముఠాలు చివరికి లెబనాన్ భద్రతకే ముప్పుగా మారినందున ఇప్పటి తమ దాడులు సమర్థనీయమే అని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు తెలిపాయి.
గద్దర్ అవార్డులు.. ఉత్తమ చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి'
చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన్న ఉత్తమ దర్శకుడు సాయిలు కంపాటి రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది ప్రీ వెడ్డింగ్ షో, కోర్ట్, లిటిల్ హార్ట్ చిత్రాలకు అవార్డుల పంట ప్రజాగాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘గద్దర్ ఫిలిం అవార్డులు 2025’ విజేతల జాబితాను ప్రకటించారు. జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గద్దర్ అవార్డుల విజేతల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించగా, విలక్షణ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు దక్కింది. పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్కు, సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజకు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్వినీదత్కు, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్కు, కాంతారావు అవార్డు ఆర్. నారాయణ మూర్తికి ప్రకటించారు. ఈ సంవత్సరం మొత్తం 17 విభాగాల్లో గద్దర్ ఫిలిం అవార్డులను అందజేస్తున్నట్లు జ్యూరీ వెల్లడించగా, కొత్తగా సామాజిక సందేశాత్మక చిత్రాలకు ప్రత్యేక పురస్కారాలతో పాటు డాక్టర్ సినారే, ఏఎన్ఆర్ పేర్లతో అవార్డులను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాలను నామినేషన్లకు ఎంపిక చేశారు. చిన్న చిత్రాలకే ఎక్కువ అవార్డులు.. ‘తెలంగాణ గద్దర్ ఫిలిమ్ అవార్డులు’ ప్రధాన కమిటీ అధ్యక్షునిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు,- సమీక్షల పరిశీలనకు తనికెళ్ళ భరణి చైర్మన్గా ఉన్నారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ ఏడాది గద్దర్ అవార్డులు ఎక్కువశాతం చిన్న చిత్రాలకే దక్కాయి. రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది ప్రీ వెడ్డింగ్ షో, కోర్ట్, లిటిల్ హార్ట్ చిత్రాలు ఎక్కువగా అవార్డులకు ఎంపికకావడం విశేషం. గద్దర్ అవార్డులలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్రం ద్వారా సాయిలు కంపాటి ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ఉత్తమ నటునిగా ‘తండేల్’ కథానాయకుడు నాగచైతన్య, ఉత్తమ నటిగా ‘ద గర్ల్ ఫ్రెండ్’ నాయిక రష్మిక మందన్న ఎంపికయ్యారు. ఉత్తమ సహాయనటులు కేటగిరీలో ‘దండోరా’ నుండి శివాజీ, ’యుఫోరియా’ ద్వారా భూమిక విజేతలుగా నిలిచారు. ఉత్తమ హాస్య నటుడిగా ‘జిగ్రీస్’లో నటించిన కృష్ణతేజ రెడ్డి, ఉత్తమ బాల నటుడిగా ’ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో నటించిన మాస్టర్ రోహన్ నిలిచారు. ఇక ఉగాది రోజు మార్చి 19వ తేదీన ’తెలంగాణ గద్దర్ ఫిలిమ్ అవార్డులు’ వేడుక హైదరాబాద్ హైటెక్స్లో జరగనుంది. స్పెషల్ అవార్డులు.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ః చిరంజీవి నాగిరెడ్డి-, చక్రపాణి అవార్డు ః అశ్వినీదత్ బీఎన్రెడ్డి అవార్డు ః సింగీతం శ్రీనివాసరావు పైడి జయరాజ్ అవార్డు ః కమల్హాసన్ అక్కినేని నాగేశ్వర రావు ఫిల్మ్ అవార్డు ః జయసుధ సి.నారాయణ రెడ్డి అవార్డు ః సుద్దాల అశోక్ తేజ రఘపతి వెంకయ్య అవార్డు ః రమేష్కు ప్రసాద్ కాంతారావు అవార్డు ః ఆర్. నారాయణమూర్తి
మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదు వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోంది ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత నెరవేరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లోని జేఎన్టియూలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తిమేర పదవులను కట్టబెట్టడమే కాకుండా, ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మన బాధ్యత తీరిపోలేదని, దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్కు తెలంగాణలో ప్రజలు అధికారం ఇచ్చారని, అందుకే మహిళల ప్రాధాన్యతను గుర్తించి, బాధ్యతలను అప్పగించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుం టుందని ఆయన తెలిపారు. మహిళను మనం శక్తితో పోలుస్తామని, అలాంటి మహిళలకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్ట్రా నికి గౌరవం కాదని, ఇంతకు ముందు మహిళల వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవన్నారు. కానీ, సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనూ మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని, అందుకే మనల్ని మనం సవరించు కొని బాధ్యతతో మెలగాల్సిన సమయం వచ్చిందని, సమాజంలో చట్టాలను చేయడం, పోలీసులు పర్యవేక్షించడమే కాదన్నారు. మనమంతా సామాజిక బాధ్యతగా భావిస్తేనే మహిళల రక్షణ సాధ్యమవుతుందని, మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో సమాజంలో ఆడబిడ్డలను అలాగే గౌరవించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే అందిస్తున్నామని, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో అందిస్తున్నామని, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి వారికి శిల్పారామం వద్ద దుకాణ సముదాయాన్ని కేటాయించామన్నారు. అదేవిధంగా గ్రామీణ మహిళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ, వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసిలో 1,000 బస్సులను నడిపిస్తూ వారిని వ్యాపార భాగస్వాములుగా మార్చామన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని సిఎం కొనియాడారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణను మహిళలకు అంత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం తీసుకున్నామని ఆయన తెలిపారు. మహిళల రక్షణకు ప్రతి యువకుడు బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలన్నారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షఅని ఆయన తెలిపారు. మహిళల రక్షణ కోసం నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అంతా పెంపొందించుకోవాలని సోషల్ మీడియా పెరగడంతో సైబర్ క్రైమ్ పెరిగిపోయిందని సమస్య వచ్చినపుడు ‘స్టాండ్ విత్ హర్’ అని గట్టిగా నిలబడాలని ఆయన అన్నారు.
మా దెబ్బతో గల్ఫ్లో ఇరాన్ ఓడింది
క్షమాపణలపై ట్రంప్ స్పందన.. తుడిచిపెట్టేస్తామని ఘాటైన హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇప్పుడు ఇరాన్ ఓడిపోయిన దేశం అయిందని, ఓటమిని అంగీకరించిందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తెలిపారు. ఇరాన్ అధ్యక్షులు పలు గల్ఫ్దేశాలకు క్షమాపణలు చెప్పడం ద్వారా లొంగిపోయారని వ్యాఖ్యానించారు. ఇకపై తిరిగి దాడులకు దిగబోమని కూడా ఇరాన్ ప్రకటించింది. ఇదంతా కూడా అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తూ వస్తున్న నిర్విరామ దాడుల ప్రభావమే అని తెలిపారు. ఎప్పుడూ ఎవరికి లొంగకుండా వందల ఏండ్ల చరిత్రతతో ఉన్న ఇరాన్ ఇప్పుడు తొలిసారిగా ఇతర దేశాలకు సారీ చెప్పిందని ట్రంప్ గుర్తు చేశారు. ఇతర ప్రాంతాలను , ప్రత్యేకించి గల్ఫ్లోని కీలక దేశాలను బెదిరించాలని ఇంతకాలం ఇరాన్ యత్నించింది. అయితే అమెరికా దెబ్బతో ఈ పనిచేయలేకపోయిందని, ఇప్పటి క్షమాపణలు ఈ ప్రాంతం లో ఇరాన్ పెత్తనాన్ని దెబ్బతీసే చారిత్రక ఘట్టానికి దారితీస్తాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ పూర్తి స్థాయిలో లొంగిపోవడం లేదా ఓడిపోవడం జరగాల్సిం దే. అంతవరకూ తమ దాడులు సాగిస్తూనే ఉంటామని ట్రంప్ తెలిపారు. ఇక అత్యంత తీవ్రస్థాయి పరిణామంగా ఇరాన్ ఇక ఏ కోశానా కోలుకోకుండా సర్వనాశనం అయ్యేలా దాడులకు ప్లాన్ చేస్తున్నామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పరాజిత అయి కూర్చుంది. ఇక ఈ దశలోనే తమ సేనలు మరింతగా ఇరాన్ను వేయించుకుతింటాయని (రోస్ట్) అని ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఇప్పుడు మిడిలిస్టు చవట అని వ్యాఖ్యానించారు. వేలాది సంవత్సరాలలో ఎప్పుడూ ఇరాన్ ఓడిపోలేదు. తొలిసారిగా ఇరాన్ కొమ్ము విరిచింది తామేనని ట్రంప్ తెలిపారు. తనను పలు గల్ఫ్ దేశాలు అభినందిస్తున్నాయి. థ్యాంక్యూ ట్రంప్ అని నేతలు చెపుతున్నారని, వీటిని తాను స్వీకరిస్తున్నానని తెలిపారు,
పాత అసెంబ్లీలో కొలువుదీరనున్న కౌన్సిల్
నాడు నిజాం టౌన్ హాలు.. నేడు కౌన్సిల్ హాలు తుది మెరుగులు దిద్దుకుని ముస్తాబైన భవనం సిఎం చేతుల మీదుగా నేడు ప్రారంభోత్సవం ఇండో-ఇస్లామిక్ శైలిలో, రాజస్థానీ-పర్షియన్ మిశ్రమ ఆర్కిటెక్చర్ మన తెలంగాణ/హైదరాబాద్ః నిజాం కాలంలో ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించేందుకు వెలసిన టౌన్ హాలు, ఇకమీదట ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎమ్మెల్సీల కోసం (పెద్దల సభ)గా రూపాంతరం చెందబోతున్నది. తుది మెరుగులు దిద్దుకుని ముస్తాబైన చారిత్రాత్మక భవనం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం (8న) ప్రారంభంకాబోతున్నది. చూడని వారుండరు.. నగరం నడిబొడ్డున ఇంత గొప్ప చారిత్రాత్మక భవనాన్ని చూడని వారుండరు. ఈ చారిత్రాత్మక భవన నిర్మాణ కౌశల్యాన్ని మెచ్చుకోని వారుండరు. అయితే సాధారణ ప్రజలకు లోపలికి అనుమతించరు. కేవలం అసెంబ్లీ సమావేశాల సమయంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, మీడియా ప్రతినిధులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రజలు సందర్శించాలనుకుంటే అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సులు తప్పని సరి. పూర్వాపరాల్లోకి వెళితే.. ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన 40వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1913 సంవత్సరంలో ప్రజల సేవ కోసం ఈ భవనాన్ని అంకితమిచ్చారు. అయితే ఈ భవన నిర్మాణానికి ప్రజలు కూడా చందాలు వేసుకుని భవన నిర్మాణానికి తమ వంతు సహాయం చేశారు. ఇండో-ఇస్లామిక్ శైలిలో రాజస్థానీ-పర్షియన్ మిశ్రమ ఆర్కిటెక్చర్తో ఆత్యద్భుతంగా భవన నిర్మాణం జరిగింది. ఈ అద్భుత కళాఖండం కట్టడానికి ఎనిమిదేళ్ళ వ్యవధి పట్టింది. అసెంబ్లీ సమావేశాలకూ .. ఇంత అద్భుతమైన కట్టడంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఎమ్మెల్యేలు తమ సమస్యల పరిష్కారాలపై ఈ భవనంలో చర్చిస్తారని ప్రజలందరూ అనుకుంటారు. కానీ అది కొంత వరకే నిజం. చాలా ఏళ్ళ క్రితం వరకూ ఈ భవనంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది వాస్తవమే. కాల క్రమేణా ఈ భవనం నిరుపయోగంగా మారింది. నిరుపయోగానికి కారణం? దేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్య్రం లభించిన తర్వాత 1948 సంవత్సరం సెప్టెంబర్ 17న అంటే సుమారు 13 నెలల తర్వాత నిజాం ప్రభువు కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ పటేల్ ముందు తలవంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్గా ఏర్పడింది. 1948-1952 వరకూ ఈ భవనం ఖాళీగా ఉన్నది. తొలిసారి 1952 లో ఎన్నికల అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పడడంతో ఈ భవనంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 1956 సంవత్సరంలో రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి1985 సంవత్సరం వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కాగా 1979లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఈ భవనం వెనక భాగంలో నూతన భవనానికి శంకుస్థాపన చేయగా, 1985 సంవత్సరంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారు. అప్పటి నుంచీ ఈ కొత్త భవనంలోనే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే కౌన్సిల్ సమావేశాలు పబ్లిక్ గార్డెన్స్ ఆవరణలోని జూబ్లీహాలుకు పక్కన ఉన్న హాలులో జరిగేవి. కాగా 1985 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు కౌన్సిల్ను రద్దు చేశాక ఆ కౌన్సిల్ భవనం కూడా నిరుపయోగంగా మారింది. ఇప్పుడు ప్రధాన రోడ్డుపై కనిపించే నాటి అసెంబ్లీ భవనం, కౌన్సిల్ భవనం అనేక సంవత్సరాలుగా మూసి ఉంచారు. వైఎస్ హయాంలో తిరిగి ప్రారంభం 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కౌన్సిల్ను పునరుద్ధరించారు. దీంతో ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగానికి మాత్రమే (ఒక్క రోజు) అసెంబ్లీ భవనాన్ని వినియోగించేవారు. రాష్ట్ర విభజన తర్వాత .. ఇదిలాఉండగా రాష్ట్ర విభజన (2014) తర్వాత పదేళ్ళ పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సి ఉండడంతో కొంత కాలం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ పాత భవనంలో జరగడం విశేషం. రాష్ట్ర విభజనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత కాలం సమావేశాలు ఈ భవనంలో కొనసాగించారు. అయితే అమరావతిలో తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పదేళ్ళ గడువు ముగియడం ఆ భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యుల కోసం జూబ్లీహాలు పక్కన ఉన్న పాత కౌన్సిల్ భవనాన్నే కేటాయించగా, అప్పటి గవర్నర్ నరసింహన్ అసెంబ్లీ, కౌన్సిల్ పరిసరాల్లోని భవనాలను సందర్శించినప్పుడు జూబ్లీహాలును తెలంగాణ కౌన్సిల్ కోసం సిద్ధం చేయించారు. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీల కోసం పాత అసెంబ్లీ భవనం సిద్ధమైనందున, ఇకమీదట జూబ్లీహాలును ప్రభుత్వ కార్యక్రమాలకు నిర్వహించుకునే అవకాశం ఉంది. సిఎం రేవంత్ రెడ్డి చొరవ.. 2024లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తన దృష్టి నిజాం కాలం నాటి టౌన్ హాలుపై పడింది. ప్రస్తుతం తెలంగాణ కౌన్సిల్ సమావేశాలు జూబ్లీహాలులో జరుగుతున్నందున, దానిని కౌన్సిల్ సమావేశాల కోసం ఉపయోగించాలన్న ఆలోచన చేశారు. అందుకు అనుగుణంగా కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో చర్చించి అవసరమైన మేరకు భవనానికి కొత్త మెరుగులు దిద్దారు. ఈ భవన నిర్మాణం ప్రత్యేకతల కారణంగా యాభై అడుగుల ఎత్తులో పైకప్పు ఉండడం, అలాగే దానిని సున్నపురాయితో విశాలంగా నిర్మించడం వల్ల లోపల చాలా చల్లదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ భవనం రాజస్థానీ-పర్షియన్ మిశ్రమ ఆర్కిటెక్చర్తో నిర్మించినందుకన దానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా అత్యాధునిక పివోపి ద్వారా తెల్లగా, మెరిసెలా రూపాంతరం చెంది ఈ భవనం ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం.. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలు కనిపిస్తాయి. మహాత్ముని పక్కన గాంధీ విగ్రహం ఉన్నట్లే మరో పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నా, సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో ఈ నెల 16వ తేదీ వరకూ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త భవనంలో కొత్త గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16న ప్రారంభంకానున్నందున కొత్త భవనంలో రాష్ట్రానికి కొత్తగా నియమితులైన గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఉభయ సభల సభ్యులనుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఏడవ నిజాం కల జూబ్లీ హాలు.. ఇక ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ తన జ్ఞాపకార్ధంగా పబ్లిక్ గార్డెన్ ఆవరణలో జూబ్లీహాలును నిర్మించి తన కల నెరవేర్చుకున్నారు. 1936 సంవత్సరంలో తన ఇరవై అయిదవ ఏట జూబ్లీహాలును ప్రారంభించారు. జూబ్లీ హాలులో దర్బారు పీఠం, తైలవర్ణంతో అసఫ్జాహి చిత్రాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జూబ్లీహాలులో దర్బారు పీఠంపై కూర్చుని ప్రజల నుంచి వినతుల స్వీకరించే వారని ప్రతీతి.
16 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ హాల్లో (ఉభయ సభల సంయుక్త సమావేశాలు) ఉదయం 11.45 గంటలకు ప్రారంభమవుతాయని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగిస్తారని ఈ నోటిఫికేషన్లో ఆయన తెలిపారు. ఉభయ సభలను గవర్నర్ సమన్ చేశారు.
8MarSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
8MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో
రాజకీయాలు ఎప్పుడూ స్తబ్దుగా ఉండవు. ఒక్కోసారి చాలావేగంగా మారుతూ ఉంటాయి. అలా మారే క్రమంలో ఎక్కడో కింద ఉండిపోయినవాళ్లను శిఖరాగ్రాన కూర్చోబెట్టడం, మీది అంతస్తులో ఉన్నవాళ్లను దభేల్న కింద పడేయడం రాజకీయాల విచిత్ర క్రీడలో భాగం. ప్రస్తుతం దేశంలో 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయి, వాటికి ఈ నెల 16న ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభ నుంచి రిటైర్ కాబోతున్నవారిలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కూడా ఒకరు. ఆయనది ఏముంది కానీ, ఖాళీ అయిన ఈ స్థానాల భర్తీకి వివిధ పార్టీలు తమ అభ్యర్థులుగా నిలిపినవారిలో ఇద్దరిని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు, పోటీ లేదు. అందులో ఒకరు ప్రస్తుత బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు నితీశ్ కుమార్. రెండవవారు తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లనున్న వేం నరేందర్ రెడ్డి. 37 మందిలో వీరు ఓ ఇద్దరు. ఏమిటి వీరి ప్రత్యేకత అనుకోవచ్చు. ఈ ఇద్దరు అభ్యర్థులు రాజకీయ విచిత్ర క్రీడకు మంచి ఉదాహరణ. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఆయన ఓ రెండు దశాబ్దాలుగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నితీశ్ కూడా ఒకరు. నాలుగు మాసాల క్రితం ఆయన పదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రకెక్కారు. 15 ఏళ్లపాటు బీహార్ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన రాష్ట్రీయ జనతాదళ్ పాలనను ముగింపజేసి కూడా రికార్డుకు ఎక్కారు నితీశ్ కుమార్. దేశంలో అత్యధికసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్), గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), కరుణానిధి (తమిళనాడు), ప్రకాష్ సింగ్ బాదల్ (పంజాబ్), పవన్ కుమార్ ఛాంలింగ్ (సిక్కిం), నవీన్ పట్నాయక్ (ఒడిషా) ల సరసన నితీశ్ కుమార్ను నిలబెట్టొచ్చు. ఈ జాబితాలో అందరికంటే ఎక్కువ కాలం 23 సంవత్సరాలపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు జ్యోతిబసు. నాలుగు మాసాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీచేసి మళ్లీ అధికారంలోకి వచ్చిన నితీశ్ కుమార్ ఎందుకు హఠాత్తుగా రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు? అంతకు సంవత్సరం ముందు జరిగిన లోకసభ ఎన్నికల్లో గత రెండు పర్యాయాలు జరగని విధంగా భారతీయ జనతా పార్టీకి 240 స్థానాలు మాత్రమే దక్కి, తప్పనిసరిగా భాగస్వామ్య పక్షాల మీద, అందులో ముఖ్యంగా బీహార్లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జెడి(యు), ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీల సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటమి తరఫున నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా మరొకసారి ఎన్నికయిన నాలుగు మాసాల్లోనే రాజ్యసభకు వెళ్లడానికి పదవీత్యాగం చేయడానికి కారణాలేమిటి? అనే ప్రశ్న అందరిని తొలుస్తున్నది. బయటి వాళ్ళ పరిస్థితి ఏమో గాని నితీశ్ నాయకత్వం వహిస్తున్న జనతాదళ్(యు) కిందిస్థాయి నాయకత్వం, కార్యకర్తలు మాత్రం ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బీహార్ రాష్ట్రంలో అధికారం తమ పార్టీ చేజారి బిజెపి చేతుల్లోకిపోతున్నదని వాళ్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నితీశ్ ఈ హఠాత్ నిర్ణయానికి బయటికి చెబుతున్న కారణం.. ఆయన శాసనసభలో, మండలిలో, లోకసభలో చాలాసార్లు సభ్యుడిగా ఉండి ప్రజలకు సేవ చేశారు.. ఇక మిగిలిన ఒక్క పెద్దల సభలో కూడా సభ్యుడిగా ఉండాలన్నది ఆయన కోరిక అని. వినడానికి బాగానే ఉంటుంది కానీ నిజంగా కారణం అదేనా? వయసు మీద పడింది, అనారోగ్య సమస్యలు ఉన్నాయనేవి ఉత్త మాటలు. ఎందుకంటే అధికారం పనిచేసినంత బలంగా ఇంకే ఔషధమూ పని చెయ్యదు. కొద్దికాలం క్రితం ఉపరాష్ట్రపతిగా ఉండిన జగ్దీప్ ధన్కడ్ కూడా ఆరోగ్య కారణాలతో హఠాత్తుగా అంతర్ధానం కావడం గురించి ఇప్పటికీ చెవులు కొరుక్కుంటున్నవారులేకపోలేదు. పోనీ జెడి(యు) అధికారంలో లేనప్పుడు, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా లేనప్పుడు భారతీయ జనతా పార్టీ వయసులో పెద్దవాడిగా గౌరవించి నితీశ్ కుమార్ని రాజ్యసభకు పంపించి ఉంటే పైవాదనకు విలువ ఉండేది. నిజానికి నితీశ్ కుమార్ ఏమీ చిన్న నాయకుడు కాదు. ఒక దశలో బిజెపి, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల నుండి కాకుండా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే నితీశ్ కుమార్ సరైన అభ్యర్థి అన్న వాదన వినిపించింది. అందరూ ఆమోదించదగ్గ ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చిన ఇమేజ్ని పోగొట్టుకోవడం నితీశ్ స్వయంకృతాపరాధం. రేపు 16వ తేదీన రాజ్యసభ ఎన్నికలు లాంఛనంగా పూర్తయ్యాక ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయడం, ప్రస్తుతం బీహార్ కూటమిలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నాయకుడు సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం ఖాయం అయిపోయింది అంటున్నారు. బీహార్ రాజకీయాల్లో ప్రస్తుతం నితీశ్ కుమార్కు, సామ్రాట్ చౌదరికి కొంతకాలంగా అసలే పొసగడం లేదన్న వార్త బాగా చక్కర్లు కొట్టింది. నితీశ్ కుమార్ను రాజ్యసభకు పంపడమే కాకుండా ఆయనకు కేంద్రంలో మంత్రిపదవి ఖాయమని, అది కూడా రైల్వేమంత్రిత్వ శాఖ ఇస్తారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతున్నది. కేంద్రంలో ప్రభుత్వం సజావుగా నడవడానికి జెడి(యు) అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పని చేస్తే చేయొచ్చు. కానీ బీహార్ వంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లిపోవడంవల్ల నితీశ్కు, ఆయన పార్టీకి రాజకీయంగా జరిగే నష్టం అంచనా వేయడానికి పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఆ విషయం నితీశ్ కుమార్కు తెలియక కాదు కానీ ఆయన పార్టీ వారికైతే బాగా అర్థమైంది. అందుకే రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. నితీశ్ ను రాజ్యసభకు పంపించి, ఆయన కుమారుడు నిశాంత్ కుమార్కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారం బహుశా జెడి(యు)లో ఆందోళనల నిప్పు మీద నీళ్లుచల్లడం కోసం కావచ్చు. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదులుకుని ఆరో వేలులాంటి ఉపముఖ్యమంత్రి పదవిని కొడుకు కోసం నితీశ్ కుమార్ ఏ ప్రయోజనాన్ని ఆశించి లేదా ఏ ఒత్తిడికి లొంగి అంగీకరించారు అన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. బీహార్ పరిణామాలు జాతీయ మీడియాలో పొక్కగానే ఎన్డిఎలో బిజెపికి మద్దతుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కలకలం మొదలైందట. రేపో మాపో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా రాజ్యసభకు వెళ్ళమంటారేమోనని తెలుగు తమ్ముళ్లు బెంబేలుపడిపోతున్నారు.ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా రాష్ట్రంకోసం త్యజించిన తమ నాయకుడికి ఆ పరిస్థితి తప్పదా అన్న ఆందోళన మొదలయిందట. సరే, అదిగో తోక అంటే ఇదిగో పులి అనే అమాంబాపతు మీడియా సంస్థలు అప్పుడే చంద్రబాబు ఉపప్రధాని అవుతారని, ఆంధ్రప్రదేశ్కు యువ నాయకుడు లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతారని సాయంకాలం చర్చల్లో ఊదరగొట్టడం మొదలుపెట్టాయి. ఇటువంటి ఉపద్రవం ఏదోవస్తుందనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గరనుండి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అవకాశం దొరికినప్పుడల్లా 15 ఏళ్ల పాటు చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అని పదే పదే ప్రకటిస్తున్నారు. ఇక ఆయన్ని సమర్థించే మరో మీడియా సంస్థ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన పార్టీ బిజెపి పవన్ కళ్యాణ్ మీద ఎంతగా ఆధారపడ్డారో బలంగా చెప్పేందుకు ఓ సాయంత్రం తన చానల్లో కొన్ని గంటల సమయం కేటాయించింది. ఉప ప్రధానమంత్రి పదవి అనేది కూడా ఆరో వేలే అన్న విషయం రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడుకు తెలియదా? ఈ సందర్భంగా ఉప ప్రధానమంత్రి అన్న మాట మీద చిన్న పిట్ట కథ గుర్తు చేసుకోవాలి. ఎమర్జెన్సీ అనంతరం మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన జనతా ప్రభుత్వంలో దేవీలాల్ ఉప ప్రధానమంత్రి. ప్రమాణస్వీకారం సమయంలో ఆయనను మంత్రిగా ప్రమాణం చెయ్యమంటే ‘దేవీలాల్ అనే నేను ఉప ప్రధానమంత్రిగా’ అని అనడంతో అధికారులు ఆయనను వారించి ‘రాజ్యాంగంలో ఉప ప్రధానమంత్రి అనే పదవి ఉండదు. అది ఆరోవేలు, మీరు పెట్టుకునేది మాత్రమే’ అని చెప్పారట. అయితే నితీశ్ కుమార్ లాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా వస్తే తప్పదేమో కానీ బీహార్లో నితీశ్ స్థానంలో ముఖ్యమంత్రి పదవి బిజెపికి దక్కింది. ఆంధ్రప్రదేశ్లో అది సాధ్యమయ్యే పనేనా లేక ఎనిమిది స్థానాలకే పరిమితమైనా కూడా బిజెపి అది సాధ్యం చేసుకుంటుందా చూడాలి. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి కూడా తక్కువ తరగతిలో కూర్చున్న పరిస్థితి నితీశ్ కుమార్ ది. ఇక తెలంగాణ నుండి ప్రస్తుతం రాజ్యసభకు వెళుతున్న ఇద్దరిలో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుండి 2004 లో మొదటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత 2010 లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన ఆసక్తికర పరిణామంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి హైదరాబాద్ వీడి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడటానికి శాసనసభ నుండి మండలికి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వేం నరేందర్రెడ్డి అభ్యర్థిగా ఉండటం కారణం. అప్పట్లో తెలుగుదేశం నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఒక కేసులో కొద్దికాలం జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ కేసులోని పూర్వాపరాలు, మంచిచెడ్డలు, నిజానిజాలను గురించి చర్చించడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మరికొందరి మీద ఓట్ల కోసం శాసనసభ్యులను ఫిరాయింపజేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి తాను అధికారంలో ఉన్నంతకాలం ఎడాపెడ శాసనసభ్యులను తన పార్టీలోకి ఫిరాయింపచేసుకున్న సందర్భాలు చూశాక రాజకీయాల్లో ఇటువంటి విషయాలను గురించి చర్చించడం కూడా దండగమారి పనే అనిపిస్తుంది. కొందరు దొరుకుతారు, చాలామంది దొరకరు. అదలా ఉంచితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ తరువాత కాలంలో రేవంత్రెడ్డి వెంట నరేందర్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ప్రజామోదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్రెడ్డి కష్టాన్ని గుర్తించి అధిష్టానవర్గం ఆయనను ముఖ్యమంత్రిని చేయడం, ముఖ్యమంత్రి సలహాదారుగా నరేందర్ రెడ్డి నియమితులు కావడం. ఏ శాసనసభలో అయితే మండలికి ఎన్నికయ్యేందుకు శాసనసభ్యులను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చి, ఆ ఎన్నికల్లో ఓటమి కూడా చవిచూసిన నరేందర్ రెడ్డిని అదే శాసనసభ ఈరోజు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక చేసి పంపింది. రాజకీయాలను నమ్ముకున్నవారిని అవి ప్రతిసారీ కింద పడేయవు. అప్పుడప్పుడు ఇలా పైకి కూడా లేపుతుంటాయి. పదహారుమంది ఆశావహుల జాబితానుండి అధిష్టానం వేం నరేందర్రెడ్డి పేరును ఎంపిక చెయ్యడం అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి 9 ఏ కోట్లామార్గ్లోని ఇందిరాభవన్లో ఎంత పలుకుబడి ఉందో ఎవరయినా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వైకుంఠపాళిలో గవ్వలు అనుకూలంగా పడి వేం నరేందర్ రెడ్డి నిచ్చెన ఎక్కారు. నితీశ్ కుమార్ను మాత్రం పాము మింగింది. దేవులపల్లి అమర్
హైదరాబాద్ను క్లీన్ సిటీగా మార్చాలి
ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలి క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్కు సంబంధించిన ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాలని ఆయన ఆదేశించారు. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని సిఎం అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీకర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు రూ.60 వరకు పెంచిన చమురు సంస్థలు శనివారం అర్థరాత్రి నుంచే అమలులోకి వాణిజ్య అవసరాల సిలిండర్ రూ 115 పెంపు మన తెలంగాణ / హైదరాబాద్: దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ. 115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965 కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రధాన నగరాల్లో కొత్తధరలు ఇలా ... గృహ వినియోగ సిలిండర్ 14.2 కేజీ) ఢిల్లీ రూ913, ముంబై రూ.912.50, కోల్కతా రూ.939. చెన్నై రూ.928.50, వాణిజ్య సిలిండర్ ధరలు.. ఢిల్లీ రూ.1883. ముంబై రూ.1835, కోల్కతా రూ.1990, చెన్నై రూ.2043. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఇంధన లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి స్పందించారు. “ పౌరులకు అందుబాటు ధరలో ఇంధన లభ్యత ఉండేలా చూడటం మా తొలిప్రాధాన్యత. దేశంలో ఎలాంటి కొరతా లేదు. దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు.” అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తోసి పుచ్చింది. ముడి చమురు , పెట్రోలియం ఉత్పత్తులు , ఎల్పీజీ విషయంలో భారత్ సౌకర్యవంతమైన స్థితిలోనే ఉందని శుక్రవారం ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. హర్మూజ్ అంతరాయాల వేళ వేర్వేరు సోర్సుల నుంచి దేశానికి భారీ స్థాయిలో ఇంధనం లభ్యమవుతోందని పేర్కొన్నాయి. హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,045.50 వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 115 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,930.50 గా ఉండగా ప్రస్తుతం రూ. 115లు పెరగడంతో ఇది రూ. 2,045.50లకు చేరింది. అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ద్వారా అందించే వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.
రాజకీయ లబ్ది కోసం సినిమాలను వాడుకుంటున్నారు
` ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదు: రాహుల్ గాంధీ ` నిజమైన కేరళ సంస్కతి సంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్య …
` తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ` ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ` వాడగాలులు వీచే అవకాశం ` అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ …
పొరుగు దేశాలకు ఇరాన్ లొంగిపోయింది
` అందుకే దాడుల చేయమని పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పింది ` పశ్చిమాసియాను ఆ దేశం ఇక బెదిరించలేదు ` అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల వల్లే …
` యుద్ధంతో సాధించేది లేదు ` ప్రజలతో మమేకమై పనిచేయండి ` తెలంగాణ గడ్డపై హింసకు తావులేదు ` అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తాం ` ఆర్థిక, …
న్యూదిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్పై రూ.60, వాణిజ్య సిలిండర్పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం పేరుతో ధరలు విపరీతంగా పెంచాయి. కాగా, ప్రధాన నగరాల్లో కొత్త ధరలు […] The post వంట గ్యాస్ మంటలు appeared first on Visalaandhra .
ఇరాన్ స్పష్టీకరణ…ట్రంప్ హెచ్చరికల బేఖాతరు . ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపై దాడులు. యూఏఈ, కువైట్పైకి డ్రోన్లు. మాపై క్షిపణులతో దాడి: ఇజ్రాయిల్. ఇరాన్ను చిత్తు చేశాం: ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకునే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఇరుగు పొరుగు దేశాల్లోని ఇజ్రాయిల్అమెరికా స్థావరాపై విరుచుకుపడింది. డ్రోన్లతో తీవ్ర దాడులు సాగించింది. యూఏఈ, కువైట్ […] The post తలొగ్గేది లేదు appeared first on Visalaandhra .
దానం కేసు తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్
మన తెలంగాణ/హైదరాబాద్ః బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ దాదాపు పూర్తయ్యింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం దానం నాగేందర్ తరఫు న్యాయవాదుల వాదన విన్నారు. తమ క్లయింట్ ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయించలేదని చెప్పారు. ఇదిలాఉండగా స్పీకర్ స్పీకర్ తీర్పును రిజర్వ్ చేసినట్లు సమాచారం. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇదివరకే ఎనిమిది మంది ఎమ్మెల్యే పిటిషన్లను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
. నాడు కుటుంబ నియంత్రణ-నేడు జనాభా నిర్వహణ. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. దిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికతసుపరిపాలనభవిష్యత్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు. […] The post త్వరలోనే రివర్స్ మైగ్రేషన్ appeared first on Visalaandhra .
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
ఉత్తమ నటీనటులు రష్మిక, నాగ చైతన్య. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రం దండోరా. కమల్ హాసన్కు పైడి జయరాజ్… సుద్దాలకు సినారె అవార్డు. గద్దర్ అవార్డు గ్రహీతలకు 19న సత్కారం విశాలాంధ్ర-హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ను శనివారం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల తుది జాబితా అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అవార్డు విజేతలను ప్రకటించారు. అగ్ర కథానాయకుడు […] The post చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం appeared first on Visalaandhra .
ప్రోటోకాల్ వివాదం.. ముర్ము వర్సెస్ మమత
రాష్ట్రపతికి ఆహ్వానం పలకని సిఎం, అధికార యంత్రాంగం ప్రొటోకాల్ ఉల్లంఘించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ మండిపడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్ని హద్దులు దాటారని మమతపై మోడీ ఫైర్ ఎన్నికల్లో లబ్ధికి రాష్ట్రపతినీ ఉపయోగించుకుంటున్నారని మమత కౌంటర్ కోల్కతా/సిలిగురి/న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ప్రొటోకాల్ ఉల్లంఘనలకు దారితీయడంతో పాటు రాజకీయ రంగు పులుముకుంది. శనివారంనాడు సంతాల్ గిరిజిన తెగకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనాల్సి ఉంది. అందుకు బిదన్నగర్లో తొలుత ఏర్పాట్లు కూడా చేశారు. భద్రతా పరమైన కారణాలు చూపుతూ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ వేదికను బడోగ్రా విమానాశ్రయానికి దగ్గరల్లోని గోషైపూర్కు మార్చింది. రాష్ట్రపతి పర్యటనకు వస్తున్నారనంటే ప్రొటోకాల్ ప్రకారం ఆ రాష్ట్రముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, కీలక అధికారులు ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. మంత్రులు కూడా ఎవరూ రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. అధికారులు కూడా ప్రొటోకాల్ను పాటించలేదు. ఒక్క సిలిగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే రాష్ట్రపతి ముర్మును విమానాశ్రయానికి వెళ్లి అహ్వానించారు. ఇది రాష్ట్రపతి ముర్ముకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సిఎం మమతను సోదరిగా సంబోధిస్తూనే సుతిమెత్తగా చురకలంటించారు. సంతాల్ తెగ సభలో మాట్లాడుతూ.. ‘సాధారణంగా రాష్ట్రపతి వస్తే సిఎం, మంత్రులు, అధికారులు ఆహ్వానం పలుకుతారు. కానీ ఇక్కడ అవేమీ లేవు. గవర్నర్ కూడా రాజీనామా చేశారు. కొత్త వాళ్లు బాధ్యతలు తీసుకోలేదు. కానీ కార్యక్రమం తేదీ ఫిక్స్ అయ్యింది కాబట్టి నేను రాక తప్పలేదు. కనీసం మీరైనా వచ్చారు’ అని సభికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీదన్నగర్లోనే సభ ఉన్నట్లయితే ఇంకా అధిక జనం హాజరయ్యే వారని, హఠాత్తుగా గోషైపూర్కు మార్చడం వల్ల రవాణా ఇబ్బందిగా మారి అనుకున్నంత మంది రాలేకపోయరాని, గిరిజనుల సంక్షేమం, పురోభివృద్ధి పట్ల రాష్ట్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఇదేనా? అని ముర్ము మండిపడ్డారు. మమతా బెనర్జీ తనకు సోదరిలాంటి వారని, తాను కూడా బెంగాల్కు బిడ్డలాంటిదాన్ని అని అన్నారు. కానీ తాను ఇక్కడికి వచ్చేందుకు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆమె ఎందుకు ఆందోళన చెంది సభా వేదికను ఇక్కడికి మార్చరో తెలియదని రాష్ట్రపతి విసుర్లు విసిరారు. టిఎంసికి ఇది సిగ్గుచేటు: ప్రధాని రాష్ట్రపతికి జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇది చాలా సిగ్గుచేటు అన్నారు. టిఎంసి ప్రభుత్వం అన్ని రకాల హద్దులు దాటేసిందని మోడీ మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతం అని, రాజ్యాంగబద్ధ పదవి.. ఆ ఆఫీసును పవిత్రతను అందరం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగిన విధంగా నేర్చుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. స్వయంగా గిరిజన సంతతికి చెందిన రాష్ట్రపతి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై స్పందించిన తీరు తనను కలిచివేసిందన్నారు. గిరిజనుల సాధికారత పట్ల ఆ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇదేనా అని మోడీ ప్రశ్నించారు. రాష్ట్రపతిపై కేంద్రం ఒత్తిడి.. రాలేనని ముందే సమాచారం ఇచ్చాం: మమత గిరిజనుల పేరిట తన ప్రభుత్వాన్ని రాష్ట్రపతి లక్షంగా చేసుకోవడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో రాష్ట్రపతి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆమె వ్యవహార శైలి ఉన్నట్లు తమకు అర్థం అవుతోందన్నారు. తాము గిరిజనుల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాల్లో చేపడుతున్నామో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో లబ్ధి కోసం బిజెపి రాష్ట్రపతి పదవిని ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ల దిగుజారుడు తనమేనని మమత అన్నారు. తమకు ముందుస్తు కార్యక్రమాలు ఉన్నందున తనతో పాటు మంత్రులు, అధికార యంత్రాంగం హాజరుకాబోవడం లేదని రాష్ట్రపతికి ముందే సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ దీన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘మీరు ఏడాదికి ఒకటో రెండు సార్లు వస్తే స్వయంగా ఆహ్వానించగలం. కానీ మీరు కీలకమైన ఎన్నికల సమయంలో వచ్చారు. ప్రజల హక్కుల కోసం పోరాడే క్రమంలో తనకు ముందస్తు బిజీ షెడ్యూల్ ఉన్నందున రాలేకపోయాను’ అని రాష్ట్రపతిని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు.
విజయ్ ఇంట్లోనే ఉంటా.. కోర్టులో భార్య సంగీత పిటిషన్
చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ విడాకుల వివాదం మరింత ముదురుతోంది. తాజాగా విజయ్ భార్య సంగీత ఆయన ఇంట్లో ఉండడానికి అనుమతి కోరారు. తాను వివాహిత ఏ ఇంట్లోనైతే అడుగుపెట్టానో ఆ ఇంట్లోనే ఉండడానికి అనుమతిని ఇప్పించాలని తాజాగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విజయ్ - సంగీత రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆయనతో విడాకులు ఇప్పించాలని ఇప్పటికే కోర్టుకెక్కారు. తాజాగా సంగీత తాను లండన్ జాతీయురాలినని, వేరోచోట ఉండడానికి వీల్లేదని, అందుకే విజయ్ ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇప్పించాలని కోరారు. తొలుత దాఖలు చేసిన విడాకుల పిటిషన్పై నిర్ణయం వెలువడే వరకు తన ఆయన నివాసంలో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, అది తన హక్కు అని కూడా తెలిపారు. ఈ మేరకు శనివారంనాడు ఇక్కడి న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను ఇంట్లో ఉండాలని లాయర్ ద్వారా అడిగిస్తే విజయ్ బెదిరిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ భరణం, పరస్పర విడాకులు అంటూ వస్తోన్న వార్తలో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. పరస్పర విడాకులకు విజయ్ అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
మహిళలు అంకిత భావంతో పనిచేస్తారు
విశాలాంధ్ర – ఏలూరు:మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. . అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా స్థానిక గిరిజన భవన్ లో శనివారం సాయంత్రం ఏ పి ఎన్జీవోస్ ఏలూరు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషుల కంటే అధికంగా రాణిస్తారన్నారు.మహిళలు పురుషులతో దేంట్లోనూ తీసిపోరని, ప్రోత్సాహం, అవకాశం, చేయూత […] The post మహిళలు అంకిత భావంతో పనిచేస్తారు appeared first on Visalaandhra .
మహిళలకు టివికె చీఫ్ విజయ్ హామీల వర్షం..
ప్రతి నెల రూ.2500, పెళ్లి కూతుళ్లకు పట్టుచీర, 8గ్రాముల బంగారం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ కింద ఆరు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఏటా రూ.15వేలు రూ.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఎన్నికల వాగ్దానాలు గుమ్మరించిన టివికె చీఫ్ చెన్నై: టివికె అధినేత, తమిళనాడు ఎన్నికల రంగంలో దిగుతున్న నటుడు విజయ్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారంనాడు మామళ్లాపురంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్షంగా పథకాలను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మినహా మిగతా మహిళలకు ప్రతినెలా ఆర్థిక సాయం కింద రూ.2500 అందజేయనున్నట్లు ప్రకటించారు. పెళ్లి కూతుళ్లకు పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారాన్నిఅందజేయనున్నట్లు వెల్లడించారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం పేరిట అన్ని కుటుంబాలకు ప్రతి ఏడాది 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి తల్లి, సంరక్షుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం జమ చేస్తామని తెలిపారు. అదే విధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతామని, బస్సుల్లో పానిక్ బటన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్కూళ్లు, రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేస్తామన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5లక్షల వరకు జీరో వడ్డీ రుణాలు అందజేస్తామన్నారు. అప్పుడే పుట్టిన ప్రతి బిడ్డకు ఆశీర్వాద్ పథకం పేరిట బంగారు ఉంగరం, వెల్కమ్ కిట్ బహుమతిగా ఇవ్వనున్నట్లు విజయ్ తెలిపారు. మహిళలపై అకృత్యాలను అడ్డుకునేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన కేసుల విచారణ వేగవంతం చేస్తామని, త్వరితగతిన ఆడబిడ్డలకు న్యాయం దక్కేలా చర్యలు తీసుకుంటామని విజయ్ వాగ్దానం చేశారు.
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి బెంజ్ కారు గిఫ్ట్#AlluArjun#SnehaReddy#AnniversaryGift#BenzCar
ED Action in Andhra Liquor Scam Sparks Political War as Lokesh Targets Jagan
Andhra Pradesh IT Minister Nara Lokesh strongly attacked former Chief Minister YS Jagan Mohan Reddy over the issue. In a post on X, Lokesh claimed that the scam involved kickbacks of nearly ₹100 crore every month and laundering of around ₹3,500 crore. Lokesh questioned the credibility of Jagan’s 2019 promise of prohibition. He said that […] The post ED Action in Andhra Liquor Scam Sparks Political War as Lokesh Targets Jagan appeared first on Telugu360 .
గజ్వేల్ తహశీల్దార్పై ఏసీబీ దాడులు… బయటపడ్డ కోట్ల ఆస్తులు #ACB#CorruptionCase#Gajwel#Tahsildar
కమ్యూనిస్టు పార్టీల శాశ్వత ఎజెండా అదే
డోనాల్ ట్రంప్ ప్రపంచ శాంతికి భంగం అమెరికాకు మోడీ దాసోహం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: జవహర్ లాల్ నేహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం అలీనోద్యమానికి నాయకత్వం వహించి, ప్రపంచ శాంతికి కృషి చేయగా, ప్రస్తుత మోడీ ప్రభుత్వం అమెరికాకు దాసోహమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజి ఎంఎల్ఎ పల్లా వెంకట రెడ్డి విమర్శించారు. ప్రపంచంలోని ఖనిజ సంపద, చమురు నిక్షేపాలపై అధిపత్యం కోసమే అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రపంచ శాంతే శాశ్వత ఎజెండా అని ఆయన ఉద్ఘాటించారు. హైదరాబాద్ మఖ్ధూంభవన్లో శనివారం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) రాష్ట్ర సమన్యయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ రచించిన ‘ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం’ అనే పుస్తక పరిచయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐఎఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షత వహించగా, పల్లా వెంకట్ రెడ్డితో పాటు మాజి ఎంఎల్ ఐప్సో జాతీయ నాయకులు కె. యాదవ రెడ్డి, ఐప్సో నాయకులు ఓబేదుల్లా కోత్వాల్, డాక్టర్ డి.సుధాకర్, పి.ప్రేమ్ పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ రెండు ప్రపంచ యుద్ధాలతో అనేక దేశాలు తీవ్రమైన సంక్షోభాల్లో కూరుకపోయాయని, సోవియేట్ యూనియన్ నేతృత్వంలో సోషలిస్ట్ శిబిరం ఉండటం వల్లనే మూడవ ప్రపంచ యుద్ధం రాలేదన్నారు. డోనాల్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ప్రపంచ శాంతికి భగం వాటిల్లిందని, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాలు యుద్ధం చేస్తున్నాయని అన్నారు. ఇరాన్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తెలిపారు. కెవిఎల్ 24 పుస్తకాలు రాయడం సాధారణ విషయం కాదన్నారు. ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం అనే పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. సోవియేట్ యూనియన్ శిబిరంలో ఉన్న క్యూబా అమెరికాను గడగడలాడించిందని, క్యూబాను అమెరికా ఏమిచేయలేకపోయిందని పల్లా వెంకట రెడ్డి చెప్పారు. ఏడాది యుద్ధం ఖర్చుతో 200 ఏళ్లకు విద్య, వైద్యం: యాదవ రెడ్డి ఒక ఏడాది యుద్దానికి అయ్యే వ్యయంతో 200 ఏళ్లకు సరిపడే విద్య, వైద్యం ఉచితంగా అందించవచ్చని యాదవ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది మూడవ ప్రపంచ యుద్ధమే నన్నారు. శాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతోందన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమైతే పేదలకు మేలు జరుగుతుందన్నారు. డాక్టర్ డి.సుధాకర్ మాట్లాడుతూ కెవిఎల్ రచనలు సమాజానికి స్పూర్తిదాయకమన్నారు. కెవిఎల్ రాసిన పుస్తకాలను క్యూబాలో ఆవిష్కరించామని గుర్తు చేశారు. ఒబెదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ కెవిఎల్ శాంతి సంఘంలో సభ్వత్వం నుంచి నిర్మాణం వరకు పట్టుదలగా కృషి చేస్తారన్నారు. పుస్తకాలు రాయడం ద్వారా యువతకు మార్గదర్శిగా పనిచేస్తారన్నారు. పేమ్ పావని మాట్లాడుతూ గతంలో అలీనోద్యమానికి నాయకత్వం వహించిన భారతదేశం మూడవ ప్రపంచ యుద్ధాన్ని నివారించిందన్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అమెరికాకు ఊడిగం చేస్తూ, అమెరికా, ఇరాన్ యుద్ధం విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐప్సో ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాచం సత్యనారాయణ, పడాల నళిని, రాంచంద్రా రెడ్డి, పోలగాని రవికిషోర్, అరసం నాయకులు రాపోలు సుదర్శన్, బొమ్మగాని నాగభూషణం, జిఎస్ రిటైర్డ్ అధికారి లక్ష్మయ్య, నాయకులు డి.జి.నరేంద్ర ప్రసాద్, కె.శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ అంతర్ధానం అయింది: డిజిపి
రాష్ట్రంలో ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులతో రాష్ట్ర కమిటీ అంతర్ధానం అయిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన 11 మందిలో ప్రస్తుతం నలుగురు లొంగిపోయారని.. మిగిలింది ఏడుగురు మాత్రమే అని డిజిపి చెప్పారు. లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో 125 మంది చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఒకరు ఆంధ్రాప్రదేశ్, నలుగురు తెలంగాణకు చెందిన మావోయిస్టులని డిజిపి వెల్లడించారు. వీరందరికి మొత్తం రూ. 4.18 కోట్ల రూపాయల రివార్డు అందచేయనున్నామన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో పిఎల్జిఏ బిఎటాలియన్ కాపీ1, 2 కమాండర్లు ఎండ్రి కలిత్రామ్ అలియాస్ ఉయికే కల్లు, కోర్సా లక్కు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ రీజినల్ పొలిటికల్ స్కూల్ సభ్యురాలు చలసాని నవత అలియాస్ చంద్ర, దేవ్జీ ప్రొటెక్షన్ టీమ్ కమాండర్ ఇర్పా రాము అలియాస్ వినోద్, డివిసి సభ్యుడు ముచాకి ఉంగల్ అలియాస్ సుధాకర్, చర్ల శబరి ఏరియా కమిటీ సభ్యురాలు పొట్టం అరుణ అలియాస్ సనికి లతో పాటు సిసిఎంల వ్యక్తిగత సిబ్బంది ఉన్నారన్నారు డిజిపి వివరించారు. మావోయిస్టులు ఒక ఇన్సాన్ రైఫిల్, ఏకె 47 ఆయుధాలు 31, ఇన్సాస్ రైఫిళ్లు 21, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు 20, 303 రైఫిళ్లు 18, ఒక 9ఎంఎం కార్బన్ గన్, ఒక 7.62 బోల్ట్ యాక్షన్ రైఫిల్, ఒక ఫాల్ రైఫిల్, రెండు బిజిఎల్, ఒక స్టెన్ కార్బైన్, నాలుగు ఎయిర్ గన్స్ ఉన్నాయని, వీటితో పాటు 222 మ్యాగ్జైన్స్, 5,205 తూటాలు మావోయిస్టులు అప్పగించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయుధాలతో లొంగిపోయిన వారికి రివార్డు బహుమతి కూడా అందచేస్తామని డిజిపి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐబి ఐజి సుమతి, ఇంటెలిజెన్స్ ఏడిజిపి విజయ్ కుమార్, గ్రేహౌండ్స్ ఏడిజిపి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
వంటగ్యాస్ ధరల పెంపు.. నిరసనలకు సిపిఎం పిలుపు
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60లు, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115లు పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజలపై వేస్తున్న ఈ భారానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. దేశ సంపదను అంబాని, అదాని వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, పేదప్రజలపై అదనపు భారాలు విధించే కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరల అదుపుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
UBS Trailer Teaser: Pawan’s Mass Euphoria
The countdown has begun for Ustaad Bhagat Singh, the upcoming Power Star Pawan Kalyan starrer directed by Harish Shankar and produced by Mythri Movie Makers. The film is scheduled for a festive theatrical release on March 19 during Ugadi. The makers gave a pleasant surprise by releasing trailer tease. The glimpse begins with a verse […] The post UBS Trailer Teaser: Pawan’s Mass Euphoria appeared first on Telugu360 .
ఈసారి భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉంది: కివీస్ కెప్టెన్
టి-20 ప్రపంచకప్-2026 తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది. కానీ, ఈ సారి భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అంచనా వేశాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రాతోనే కాకుండా మిగితా ఆటగాళ్లతో కూడా తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు. భారత్తో ఫైనల్ పోరు నేపథ్యంలో శాంట్నర్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఇప్పటి వరకూ నేను అహ్మదాబాద్ పిచ్ చూడలేదు. ప్రస్తుతానికి కవర్స్ కప్పి ఉంది. అయితే, ఈసారి భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని మాత్రం అంచనా వేస్తున్నాం. పిచ్ ఫ్లాట్గా ఉంటుందని భావిస్తున్నా’’ అని శాంట్నర్ అన్నాడు. బుమ్రాతో ప్రమాదం పొంచి ఉందనేది ప్రతీ ఒక్కరూ చెప్పే మాటే అన్న శాంట్నర్ ప్రపంచకప్లో బుమ్రా ప్రదర్శన కూడా అలాగే ఉందని కొనియాడారు. ‘‘ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా బుమ్రాను ఎదురుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆ మ్యాచ్లో అతడే గేమ్ ఛేంజర్. తప్పకుండా సవాల్ తప్పదని భావిస్తున్నాం. కానీ, కేవలం బుమ్రాతోనే కాదు.. భారత జట్టులోని ప్రతీ ఒక్క ప్లేయర్తోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ.. వాళ్లు ఈ దశకు వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేయర్ ముందుకు వచ్చి జట్టును విజయ పథంలోకి తీసుకెళ్లారు’’ అని పేర్కొన్నాడు.
india-russia-oil: ఇరాన్ స్ట్రాటజీ Andhra Prabha News
india-russia-oil: ఇరాన్ స్ట్రాటజీ Andhra Prabha News ( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవారికి మెరుగైన చికిత్సలను అందించాలి
. రోగి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి… విశాలాంధ్ర – భీమవరం : రోగి వద్దనుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం లో శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […] The post ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవారికి మెరుగైన చికిత్సలను అందించాలి appeared first on Visalaandhra .
Rākāsā’s First Single ‘Rapappa’ Brings Catchy Musical Energy to a Quirky Breakup Song
The musical promotions of Rākāsā have officially begun with the release of its first single, “Rapappa.”. Written and directed by Manasa Sharma the film is produced by Niharika Konidela under Pink Elephant Pictures, with Z Studios presenting the film. As the first musical offering from the project, “Rapappa” provides audiences with an early taste of […] The post Rākāsā’s First Single ‘Rapappa’ Brings Catchy Musical Energy to a Quirky Breakup Song appeared first on Telugu360 .
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు
విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబం నుంచి దేశ, రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మహిళలు సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, […] The post అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు appeared first on Visalaandhra .
మిషన్ భగీరథ – ఆర్ఓ నీటి మధ్య తేడాపై అవగాహన
మిషన్ భగీరథ – ఆర్ఓ నీటి మధ్య తేడాపై అవగాహన అచ్చంపేట, ఆంధ్రప్రభ
ఏసీపీ అధికారుల మెరుపు దాడి.. కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా
శ్రీవెంకటేశ్వర స్వామీ పుణ్యక్షేత్రం మహాఅద్భుతం
శ్రీవెంకటేశ్వర స్వామీ పుణ్యక్షేత్రం మహాఅద్భుతం శ్రీశ్రీశ్రీ మదవానంద సరస్వతి స్వామీజి జుక్కల్, ఆంధ్రప్రభ
విబి-జి రామ్ జి జన్-సంవాద్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభం
. చట్టంపై గ్రామీణ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి... గోడపత్రిక, కరపత్రాలు ఆవిష్కరణ... జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. విశాలాంధ్ర – భీమవరం:వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ & అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రజలలో ఆరు వారాలపాటు విస్తృత అవగాహన కల్పించేందుకు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించినట్లు తెలిపారు.జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ […] The post విబి-జి రామ్ జి జన్-సంవాద్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభం appeared first on Visalaandhra .
కావలసినంత యూరియా అందుబాటులో ఉంది
కావలసినంత యూరియా అందుబాటులో ఉంది జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి సంస్థాన్ నారాయణపురం,
సమాజ అభివృద్ధి మహిళా సాధికారతతోనే సాధ్యం
హైదరాబాద్ : మహిళా సాధికారత సాధించకుండా దేశ ప్రగతిని ఊహించలేమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. శనివారం బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలను గౌరవించని సమాజం పురోగతి సాధించలేదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు డాక్టర్ దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్యఅతిథిగా, కార్యక్రమం ప్రధాన నిర్వహకుడిగా దుండ్ర కుమారస్వామి విశిష్ట అతిథిగా, ఆర్పి పట్నాయక్, వివిధ రంగాల చెందిన ప్రముఖులు , డాక్టర్ వినయ్ పాండురంగ తదితరులు డాక్టర్ హరికుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న 25 మంది మహిళా మూర్తులకు పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ, సనాతనంగా మహిళలను గౌరవించడం కొనసాగుతున్నప్పటికీ ఆధునిక వ్యవస్థలో క్రైమ్ రేటు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్త్రీల పట్ల ఆందోళన కలిగించే సంఘటనలు పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదికలో పేర్కొనబడడం విచారకరమని అన్నారు. ఈ పరిణామాలు సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి జరిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, దేశం కూడా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ ప్రసంగిస్తూ, స్త్రీ తల్లిగా, అమ్మమ్మగా వివిధ రూపాలలో మన జీవితాల్లో ఉండే అనుభూతి ఎంతో మాధుర్యమైనదని అన్నారు. స్త్రీని గౌరవించడంలో తల్లిని చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధావాణి, డాక్టర్ లక్ష్మీ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ భాటియా, విద్యాసంస్థల అధినేత మేఘన, ప్రముఖ సినీనటి కైరా అద్వానీ,సింగర్ మమత, డాక్టర్ రమాదేవి, ప్రొఫెసర్ రేఖా దయాల్, శశిబాల రామ్మోహన్ రావు, ప్రముఖ రచయిత్రి పవిత్ర సింధూరన్, ప్రముఖ తమిళ నటి తదితరులు పాల్గొన్నారు.
అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయం
అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయం సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కక్షిదారులకు
రైస్ గోదాంలో ఘనంగా మహిళా దినోత్సవం
రైస్ గోదాంలో ఘనంగా మహిళా దినోత్సవం తొర్రూరు, ఆంధ్రప్రభ : ధర్మశ్రీ చారిటబుల్
వైద్య వృత్తిలో స్థిత ప్రజ్ఞత అవసరం..
వైద్య వృత్తిలో స్థిత ప్రజ్ఞత అవసరం.. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసానిగుంటూరు
జెడి(యు)లోకి నితీష్ కుమారుడు ఎంట్రీ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ ఆదివారం అధికారికంగా జెడి(యు)లో ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. ఇది జెడి(యు) నాయకత్వంలో తరం మార్పును సూచిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్ఎల్ఎలు, ఎమ్ఎల్సిల సమక్షంలో నిశాంత్ ప్రవేశం జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీహార్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పాలించిన నితీశ్ కుమార్ మార్చి 16న రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయడంతో ఈ పరిణామాలు సంభవించాయి. “జేడీ(యు) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా నివాసంలో శుక్రవారం పార్టీ ఎమ్ఎల్ఎలు, ఎంఎల్సిలను నిశాంత్ కుమార్ కలుసుకుని తన భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించారు. ఆదివారం నాడు అధికారికంగా పార్టీ లోకి ప్రవేశించిన తరువాత నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించడంపై నిర్ణయం అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో సీనియర్ జేడి(యు ) నాయకుడు, బీహార్ ఏకైక మంత్రి శ్రావణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీగా నితీశ్ కుమార్ ఢిల్లీ వెళ్లడానికి నిర్ణయం తీసుకోవడంపై జేడీ(యు) శాసనసభ్యులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నిశాంత్ రాజకీయ ప్రవేశం దగ్గరపడుతుండడంతో ఓదార్పు చెందారు. నితీష్ కుమార్ ఆకస్మిక నిర్ణయానికి ఉభయ శాసనసభల , పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల మద్దతు ఉంటోంది. శుక్రవారం సిఎం నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈమేరకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీష్కుమార్ స్వంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో ఎవరి బలవంతం లేదని శాసనసభ్యులు వెల్లడించారని, నితీశ్ కుమార్ కూడా తాను రాష్ట్ర పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి మార్గదర్శకాలు సూచిస్తుంటానని హామీ ఇచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్కుమార్ చౌదరి విలేకరులకు వివరించారు. పార్టీలో నిశాంత్ ప్రవేశానికి సిఎం నితీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారులు అదృశ్యం
కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారులు అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఇద్దరు చిన్నారులు, ఈరోజు (శనివారం) ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారు. శుక్రవారం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి(10), విజయ్(9) అదృశ్యమయ్యారు. ఈ రోజు ఆర్బి నగర్ కాలనీకి చెందిన ముగ్గు అక్కా చెల్లెల్లు సీపాత్(8), ఆయాత్(7), మరియం(5) కనిపించకుండా పోయారు. ఉదయం ఇంటి నుంచి తండ్రితో కలిసి ముగ్గురు చిన్నారులు ఆటోలో వెళ్లారు. పిల్లలను షాపు వద్ద దింపేసి కిరాయికి వెళ్లానని పిల్లల తండ్రి చెబుతున్నాడు. ఐదుగురు పిల్లలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు కామారెడ్డి పిఎస్లో ఫిర్యాదు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డి అదనపు ఎస్పి తెలిపారు.
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
. బ్రాంచ్ మేనేజర్ సి. నారాయణ రెడ్డి విశాలాంధ్ర-రాప్తాడు : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం బ్రాంచ్ మేనేజర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.మండలంలోని మరూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖను పిఎసిఎస్ డైరెక్టర్ గోపాల్ నాయుడు సీనియర్ మేనేజర్లు జి.చైతన్య కుమార్, సిహెచ్ కె.వి శ్రీధర్ మేనేజర్ బి.రెడ్డప్ప, అసిస్టెంట్ మేనేజర్ బి.దుర్గన్న, సొసైటీ చైర్మన్ మరూరు గోపాల్ తో కలిసి శనివారం […] The post ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం appeared first on Visalaandhra .
Farmers |టమాటా రైతుల సమస్య పరిష్కారం
Farmers | టమాటా రైతుల సమస్య పరిష్కారం మచిలీపట్టణం, ఉయ్యూరు రైతు బజారుల్లో
స్కానింగ్ సెంటర్ లపై మరింత నిఘా పెంచాలి
డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఈ బీ దేవివిశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా మరింత పటిష్టమైన నిఘా పెంచాలని పి సి పి ఎన్ డి టి చట్టం అమలు సలహా కమిటీలో డి ఎం అండ్ హెచ్ ఓడాక్టర్ ఈ బీ దేవి తీర్మానం చేశారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంహెచ్వో డాక్టర్ ఈ .బి. దేవి అధ్యక్షతన జరిగిన […] The post స్కానింగ్ సెంటర్ లపై మరింత నిఘా పెంచాలి appeared first on Visalaandhra .
పన్నులు వందశాతం వసూలు చేయాలి ఎంపీడీఓ : శంకరరావు
విశాలాంద్ర – వలేటివారిపాలెం : సచివాలయం సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలలో పన్నులు వందశాతం వసూలు చేయాలని ఎంపీడీఓ వై. శంకరరావు అన్నారు.శనివారం అమ్మపాలెం గ్రామం లో జరుగుతున్న యుఎఫ్ ఎస్ సర్వే స్పెషల్ డ్రైవ్ ను ఎంపీడీఓ వై. శంకరరావు, డిప్యూటీ ఎంపీడీఓ రాంబాబు పరిశీలించారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ శంకరరావు మాట్లాడుతూయుఎఫ్ ఎస్ సర్వే,ఇంటి పన్నులు వందశాతం పూర్తి చేయాలని అన్నారు సచివాలయం పరిధిలోని గ్రామాలలో సర్వే లు త్వరగా పూర్తి చేయాలని సిబ్బంది కి […] The post పన్నులు వందశాతం వసూలు చేయాలి ఎంపీడీఓ : శంకరరావు appeared first on Visalaandhra .
పన్నుల వసూళ్లతో గ్రామాల అభివృద్ధి
. ఎంపీడీఓ బి.విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : ఇంటి పన్నుల వసూళ్లతో గ్రామాలను కొద్దిమేర అభివృద్ధికి వినియోగించుకోవచ్చని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లపై గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశోక్ బాబు,వ్ పంచాయతీ అభివృద్ధి అధికారి శమంతకమణి,వ్ సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా అధికారులు గ్రామస్థులకు పన్ను చెల్లింపుపై అవగాహన కల్పించారు. పంచాయతీ అభివృద్ధికి పన్నుల చెల్లింపు […] The post పన్నుల వసూళ్లతో గ్రామాల అభివృద్ధి appeared first on Visalaandhra .
రేపటితో ముగియనున్న నీట్ యుజి దరఖాస్తు గడువు
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) పరీక్షకు దరఖాస్తు గడువు ఆదివారం(మార్చి 8)తో ముగియనున్నది. మే 3వ తేదీన నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నారు. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్ఎంఎస్,బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష జరుగనున్నది.
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా ‘ఎలెక్ట్రోమానియా 2కె26’
విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని హంపాపురం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఎలెక్ట్రోమానియా 2కె26” జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమం మార్చి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సంస్థ కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్ర రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎస్కేయూ అటల్ ఇన్క్యూబేషన్ […] The post శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా ‘ఎలెక్ట్రోమానియా 2కె26’ appeared first on Visalaandhra .
మాంటిస్సోరి ఎలీట్ కరస్పాండెంట్ కృష్ణసమీరకు ‘విద్యా ప్రణాళిక సాధికురాలు’పురస్కారం
విశాలాంధ్ర-రాప్తాడు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులోని అశోక సచి విశ్వవిద్యాలయం గురువారం రాత్రి నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణసమీరకు ప్రతిష్టాత్మకమైన ‘మాంటిస్సోరి ఎలీట్ విద్యా ప్రణాళిక సాధికురాలు’ పురస్కారాన్ని ఆర్ డి టి మహిళా సాధికారత చైర్మన్ విశాల ఫెర్రర్ ప్రదానం చేశారు. వక్తలు మాట్లాడుతూ విద్యా రంగంలో ఆమె చేస్తున్న విశేష కృషికి మరియు వినూత్న విద్యా విధానాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందన్నారు. […] The post మాంటిస్సోరి ఎలీట్ కరస్పాండెంట్ కృష్ణసమీరకు ‘విద్యా ప్రణాళిక సాధికురాలు’ పురస్కారం appeared first on Visalaandhra .
అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: విజయ్
చెన్నై: తమిళనాడు ఎన్నికల దృష్ట్యా టివికె పార్టీ అధినేత విజయ్ పలు హామీలను ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల చిన్నారులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇస్తామని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని పేర్కొన్నారు. వివాహం చేసుకున్న యువతులకు నెలకు నెలవారీగా రూ.2500 నగదు, ఒక బంగారు నాణెం, పట్టుచీర బహుమతిగా ఇస్తామని అన్నారు.
Photos : Mrithyunjay Movie Success Meet
The post Photos : Mrithyunjay Movie Success Meet appeared first on Telugu360 .
GPS Promotional Song: A Quirky Rap
Tharun Bhascker is gearing up to entertain with his contemporary entertainer Gaayapadda Simham, directed by debutant Kasyap Sreenivas. The makers recently kick-started the film’s promotions with the release of the traiser, which received a superb response. Keeping the momentum going, they have now unveiled a quirky promotional song that perfectly reflects the film’s tone. The […] The post GPS Promotional Song: A Quirky Rap appeared first on Telugu360 .
న్యాయశాఖలో 30ఏళ్ల అప్రతిహత సేవలు
న్యాయశాఖలో 30ఏళ్ల అప్రతిహత సేవలు పల్లపోలు సురేష్కు ఘన సన్మానంబాపట్ల కోర్టులో జూనియర్
బాలలపై దాడులు ఆందోళనకరం.. వారి భద్రతకు సమాజం బాధ్యత వహించాలి– డా. పెమ్మసాని
రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యం.. ముర్ము అసహనం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్లోని అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని తెలిపారు. అంతేకాక.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు సిఎం కానీ, మంత్రుల నుంచి కానీ అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఆదివాసీ సదస్సుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. అయినప్పటికీ మమత ప్రభుత్వంపై ఎటువంటి ద్వేషం లేదని.. ఆమె తనకు సోదరితో సమానమని అన్నారు.
మహిళల విజయాలే స్ఫూర్తిగా.. సిరిసిల్ల, ఆంధ్రప్రభ : నారి శక్తి ప్రతిబింబించేలా.. మహిళలు
Peddi’s Blockbuster Album Adds To The Hype
Mega Power Star Ram Charan is leaving no stone unturned for his upcoming film Peddi, directed by Buchi Babu Sana. The actor has undergone a striking transformation for the rustic character and is dedicating ample time and effort to bring authenticity to the role. A film always gains an early advantage when its music becomes […] The post Peddi’s Blockbuster Album Adds To The Hype appeared first on Telugu360 .
Chandrababu Naidu Outlines India’s Tech Vision at Raisina Dialogue
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu said India is rapidly moving toward a technology driven future. Speaking at the Raisina Dialogue 2026 in New Delhi, he highlighted India’s growing strength in the global knowledge economy. Naidu said the IT revolution that began three decades ago helped Indian professionals, especially from the Telugu states, establish […] The post Chandrababu Naidu Outlines India’s Tech Vision at Raisina Dialogue appeared first on Telugu360 .
ఎల్లంపేట్ మున్సిపల్ లో మహిళలకు ఘనసన్మానం
ఎల్లంపేట్ మున్సిపల్ లో మహిళలకు ఘనసన్మానం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని …
పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలి
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక
మూడు విడతల రైతు భరోసాను విడుదల చేయాలి
మూడు విడతల రైతు భరోసాను విడుదల చేయాలి దండేపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు…
ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు… కర్నూలు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని
భాష్యం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు..
భాష్యం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు.. కర్నూలు, ఆంధ్రప్రభ : స్థానిక కర్నూలు శంకలబాగ్
వరుణ్కి ఆ విషయం చెప్పి చెప్పి అలసిపోయా: అశ్విన్
టీం ఇండియా టి-20 ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు జట్టుకు ఓ విషయం తలనొప్పిగా మారింది. అదే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చకవర్తి పేలవ ప్రదర్శనే. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో వరుణ్ 4 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే తీసి ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. వరుణ్ బౌలింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ విషయంలో ఇప్పటికే చాలాసార్లు ఒక మాట చెప్పానని అశ్విన్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘వరుణ్ విషయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు పెద్ద చర్చ. ప్రత్యర్థి బ్యాటర్లు అతడిని లక్ష్యంగా చేసుకొని ఎటాకింగ్ చేస్తున్నారా? లేదా వారికి ఛాన్స్ ఇస్తున్నాడా? ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ కూడా గూగ్లీలు వేస్తాడు. రషీద్ను మన బ్యాటర్లు బాగానే ఎదుర్కొన్నారు. కానీ, అతడు మరీ ఎక్కువగా పరుగులు ఇవ్వలేదు. కానీ, వరుణ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. స్పీడ్ వేరియేషన్ చూపించాలి. ఇలాంటప్పుడే వరుణ్తో మేనేజ్మెంట్ మాట్లాడాలి. బ్యాటర్లు ఎటాకింగ్ చేయగానే అతడిలో విశ్వాసం సన్నగిల్లుతోంది. అయితే, ఎడమ చేతి వాటం బ్యాటర్లు క్రీజ్లో ఉన్నప్పుడు రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేయవద్దని చెప్పి చెప్పి నేను అలసిపోయా’’ అశ్విన్ వ్యాఖ్యానించాడు.
నగరపాలక మేనేజర్కు అభినందనలు… కర్నూలు, ఆంధ్రప్రభ : నగరపాలక సంస్థ మేనేజర్గా బాధ్యతలు
Telangana : వేటు తప్పదట.. ఉప ఎన్నిక ఖాయమట
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది
వార్డు పరిశుభ్రతపై మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రత్యేక దృష్టి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆయన మున్సిపల్ వైస్ ఛైర్మెన్ కొత్తగా రాజకీయాల్లో కి
women | ఆదోనిలో మహిళల సందడి women | ఆదోని, ఆంధ్రప్రభ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. #MaoistsSurrender#RevanthReddy
రాజకీయ రణరంగంలో ‘మహిళా మణులు’ మోత్కూర్, ఆంధ్రప్రభ : ఆడది అంటే అబల
ఎస్వీఐటిలో ఎలెక్ట్రోమానియా 2కె26…
ఎస్వీఐటిలో ఎలెక్ట్రోమానియా 2కె26… రాప్తాడు, ఆంధ్రప్రభ : శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల
కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, మార్చి7(ఆంధ్రప్రభ ) :
చారిత్రక ఆనవాళ్లను కాపాడాలని పిలుపుపురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వ్యాఖ్య
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం..
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొర్రూరు జూనియర్
నిధులే లేవు అభివృద్ధి ఎలా? మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం
Telangana : వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
Google Data Center Vizag : అమరావతిలో 9 సిటీస్ Andhra Prabha News
Google Data Center Vizag : అమరావతిలో 9 సిటీస్ Andhra Prabha

26 C