నేడు కొల్లాపూర్లో మంత్రి జూపల్లి పర్యటన
నేడు కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు
భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు
– కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడి న్యూదిల్లీ : ఇరాన్ పై దాడి కోసం భారత కోర్టులను అమెరికా వినియోగించుకుంటుందని అమెరికా మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నిరాధార వార్తలంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. యూ ఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రేగోర్ అమెరికా మీడియా ఛానల్ లో మాట్లాడుతూ… తమ బేస్ […] The post భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు appeared first on Visalaandhra .
రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్, వేం నరేందర్రెడ్డి.. నామినేషన్ దాఖలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన రెండు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం అభిషేక్ మను సింఘ్వీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇద్దరూ ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు.
Nagabandham’s Namo Re To Unveil Grand Musical Canvas
The makers of the upcoming pan-India extravaganza Nagabandham have officially announced that the film’s first single, Namo Re, will be released on March 15, marking the beginning of the movie’s musical promotions. Mounted on an extravagant scale, the first song Namo Re is said to be one of the most visually elaborate songs in the […] The post Nagabandham’s Namo Re To Unveil Grand Musical Canvas appeared first on Telugu360 .
విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి: గొట్టిపాటి
అమరావతి: ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విజయనగరంలో భూగర్భ కేబుల్ పై ప్రతిపాదన పరిశీలిస్తున్నామని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అధిక లోడ్ ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం అని అన్నారు. ఎపి అసెంబ్లీలో విద్యుత్ సబ్స్ స్టేషన్ల ఏర్పాటుపై టిడిపి ఎమ్మెల్యే పూసపాటి అతిది విజయలక్ష్మి ప్రశ్నకు గొట్టిపాటి సమాధానం చెప్పారు. 200కు పైగా 33/11 కెవి సబ్ స్టేషన్ల డిమాండ్ ఉందని.. ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో 400 కెవి,200 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని గొట్టిపాటి తెలియజేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని, పరిశ్రమలు, వ్యవసాయం కనెక్షన్లు పెరుగుతున్నాయని అన్నారు. రోజుకు 280 మిలియన్ యూనిట్ల వినియోగానికి చేరుకునే అవకాశం ఉందని, విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య లేకుండా చూడాలని తమ లక్ష్యం అని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Colton mine | 200 మందికి పైగా మృతి..!
Colton mine | 200 మందికి పైగా మృతి..! Colton mine |
పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్రూం
-అందుబాటులో హెల్ప్లైన్ నంబర్లు న్యూదిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్ రూంని ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1800 118797 టోల్ఫ్రీ నంబరును గానీ, ం91 11 2301 2113, […] The post పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్రూం appeared first on Visalaandhra .
గురుకుల పాఠశాల విద్యార్ధి అదృశ్యం..
గురుకుల పాఠశాల విద్యార్ధి అదృశ్యం.. చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు
నిజామాబాద్ లో.. కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా మస్కట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరుకు చెందిన మల్లయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మల్లయ్య మరణవార్త తెలియడంతో కుటుంబసభ్యులు విలపించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
దుబాయ్ లో ఉన్నవారికి సాయం అందిస్తాం : సోనూసూద్
న్యూదిల్లీ : రియల్ హీరో సోను సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్ లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం ఆయన సాయం చేయనున్నట్లు తెలిపారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో అక్కడ విమాన సర్వీసులు రద్దయిన విషయం విధితమే. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటాననే విషయాన్ని మరొక్కసారి ఆయన రుజువు చేసుకున్నారు. ఎటువంటి షరతులు లేవని, ఏ దేశస్తులైనా ఉచితంగా బస చేయవచ్చని చెప్పారు. […] The post దుబాయ్ లో ఉన్నవారికి సాయం అందిస్తాం : సోనూసూద్ appeared first on Visalaandhra .
మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్ #SonuSood#Dubai#Humanity#Help#WarSituation#IndianSupport
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు
గత వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా మూకుమ్మడిగా దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడులు చేస్తోంది. బహ్రెయిన్ లో యూఎస్ నేవీ ఫ్లీట్ పై.. ఖతార్ లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి చేసింది. అలాగే, ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతోంది. టెల్ అవీవ్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో ఎటాక్ చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాలు తమ దాడులను పెంచాయి. ఇరాన్ వార్ షిప్ లను లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ ఇప్పటివరకు 500కు పైగా బాలిస్టిక్ మిస్సైల్స్.. 2 వేలకు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు అమెరికా ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు అధికారులతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడులు ఇంకా కొనసాగుతుండటంతో ఇరాన్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
22 ఏ ని తొలగించి షేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేయించండి
-ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర- ధర్మవరం: రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, నెల కిందట ముదిగుబ్బలో ఇచ్చిన హామీ మేరకు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి అవి తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ నాయకులు మండల తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో […] The post 22 ఏ ని తొలగించి షేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేయించండి appeared first on Visalaandhra .
Ustaad Vs Dhurandhar Clash: Impact at Box-office
Powerstar Pawan Kalyan’s Ustaad Bhagat Singh was initially planned for March 26th release but it is now getting preponed by a week after Toxic is postponed to June. Ustaad Bhagat Singh will head for a clash with Dhurandhar: The Revenge. But why did the makers decide to prepone the film? A bunch of holidays like […] The post Ustaad Vs Dhurandhar Clash: Impact at Box-office appeared first on Telugu360 .
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. దివ్యాంగులతో పాటు వారికి కూడా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
వీధి కుక్కల బెడదకు అడ్డుకట్టవేసేలా..
వీధి కుక్కల బెడదకు అడ్డుకట్టవేసేలా.. దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: రాబోయే రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ గురువారం వివిధ రాష్ట్రాల నుండి ఆరుగురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా వెల్లడించారు. ఈ జాబితాలో తెలంగాణ నుండి ఇద్దరు, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు నుండి ఒక్కొక్కరు ఉన్నారు. తెలంగాణ నుండి అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి.. ఛత్తీస్గఢ్ నుండి ఫూలో దేవి నేతమ్.. హర్యానా నుండి కరంవీర్ సింగ్ బౌధ్.. హిమాచల్ ప్రదేశ్ నుండి అనురాగ్ శర్మ.. తమిళనాడు నుండి ఎం క్రిస్టోఫర్ తిలక్ ఉన్నారు. కాగా, తెలంగాణలో అభిషేక్ సింఘ్వీ, కెఆర్ సురేష్ రెడ్డిల ప్రస్తుత పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనున్నందున రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, శాసనసభలో పార్టీకి ఉన్న సంఖ్యా బలం కారణంగా సింఘ్వీ ఎగువ సభలో తన స్థానాన్ని నిలుపుకుంటారని సమాచారం.
Kishan Reddy : నేడు హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన
నేడు హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన సాగనుంది
ఉగాది నాటికి కమిటీలు పూర్తి చేయాలి..
ఉగాది నాటికి కమిటీలు పూర్తి చేయాలి.. పాయికాపురం, ఆంధ్రప్రభ : వైఎస్సార్సీపీ అధినేత,
Telangana : నేటితో అనర్హత పిటీషన్ విచారణ ముగింపు
నేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ విచారణ ముగియనుంది
జోష్ గా విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్#VijayDeverakonda#RashmikaMandanna#WeddingReception#HyderabadEvent
భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయాలి..
భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయాలి.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై
నేడు ఏపీ, తెలంగాణ టెన్త్ హాల్ టిక్కెట్లు విడుదల
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నేడు హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి
‘క్రేజీ కల్యాణం’లో బాల్ రాజ్గా..
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా క్రేజీ కల్యాణం. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా ‘క్రేజీ కల్యాణం‘ మూవీ నుంచి టాలెంటెడ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన బాల్ రాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తరుణ్ భాస్కర్ సూపర్ మ్యాన్ లా మంచి జోష్ లో కనిపిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో పూర్తి ఎంటర్టైన్మెంట్తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ‘క్రేజీ కల్యాణం’ సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
డోనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ
-టారిఫ్ ల సొమ్ము రిఫండ్ చేయాలని తీర్పు ఇచ్చిన ట్రేడ్ కోర్టు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాగానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. టారిఫ్ల సొమ్ము రిఫండ్ చేయాల్సిందేనని న్యూయార్క్లోని ట్రేడ్ కోర్టు తీర్పునిచ్చింది. 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ గతేడాది విధించిన భారీ సుంకాల ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అట్మస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా.. […] The post డోనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ appeared first on Visalaandhra .
Hyderabad: More than a decade after the controversial “cash-for-vote” episode shook Telangana politics, the man at the center of that storm — Vem Narender Reddy — has now been nominated to the Rajya Sabha by the Congress, marking a dramatic political turnaround. The story of this nomination begins in the heat of 2015, during the […] The post From Cash-for-Vote Scandal to Rajya Sabha: The Full Circle of Revanth’s Closest Ally Vem Narender Reddy appeared first on Telugu360 .
నేడు పోలీసుల విచారణకు సునీల్ నాయక్
నేడు పోలీసుల విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హాజరు కానున్నారు.
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్క ర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6న గ్రాం డ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ “ఈ సినిమాకి ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్. ఆయనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. సెకండ్ హీరో మా డైరెక్టర్. నన్ను బలంగా నమ్మి ఈ క్యారెక్టర్ కి నేనైతే బాగుంటుందని హీరోగా పెట్టారు. మా నిర్మాత, డైరెక్టర్ నమ్మకాన్ని నిలబెట్టానని భావిస్తున్నాను. నిజాయితీతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం”అని అన్నా రు. నిర్మాత రాజేష్ మాట్లాడుతూ “బాల సతీష్, నేను కథ విషయంలో చాలా కసరత్తు చేశాం. ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నాము”అని తెలిపారు. ఈ సమావేశంలో హీరోయిన్లు గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల, రాజ్ కుమార్ కసిరెడ్డి, సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు.
సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సుజనా చౌదరి..
సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన సుజనా చౌదరి.. భవానిపురం, ఆంధ్రప్రభ :
Hot Summer : అత్యవసరమైతే తప్ప పగలు బయటకు రావద్దు.. వస్తే ఇక అంతే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అమ్మవారి చరిత్ర విశిష్టమైనది..
అమ్మవారి చరిత్ర విశిష్టమైనది.. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగుతున్న తిరుపతమ్మ
Gold Prices Today : గుడ్ న్యూస్... బంగారాన్ని ఇప్పుడే కొనండి.. ఇంత తగ్గడం ఎప్పుడైనా చూశారా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
పెద్దమ్మ తల్లి.. బోనాల పండుగ..
పెద్దమ్మ తల్లి.. బోనాల పండుగ.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ముదిరాజుల
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
మన తెలంగాణ/మోత్కూర్: గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలు, పల్లె దవాఖానాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తలు అన్నారు. బుధవారం మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంలోని పల్లె దావఖానాను అషుమాన్ ఆరోగ్య మందిరంను వారు కౌన్సిలర్ లతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలన్నారు. మోత్కూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్త, మున్సిపల్ కౌన్సిలర్ లు మొగుళ్ల అనూరాధ శ్రీనివాస్ రెడ్డి, నల్ల మధు, గనగాని శైలజ నర్సయ్య, కారుపోతుల వెంకన్న లను వైద్య సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ లు త్రివేణి, సూపర్ వైజర్ ఊర్మిల , ఏ ఎం ఎం లు నాగమణి, గురువమ్మ, ఆశా కార్యకర్తలు ఉమ, రేణుక, వసంత, లలిత తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
వసతి గృహంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్
Sharwa’s Biker Set For A Grand Premium Release
Charming Star Sharwa is gearing up to arrive with Biker, a sports drama that blends high-octane racing with an emotional family backdrop. Directed by Abhilash Kankara and produced by UV Creations, the film is scheduled to hit cinemas in a month on April 3rd. Biker is being crafted as a visually rich spectacle meant for […] The post Sharwa’s Biker Set For A Grand Premium Release appeared first on Telugu360 .
IPS Officer Sunil Naik to Face Questioning in Raghurama Custodial Torture Case
The investigation into the alleged custodial torture of Andhra Pradesh Deputy Speaker Raghurama Krishnam Raju has entered an important phase. IPS officer Sunil Naik, who has been named as an accused in the case, will be questioned for five days starting today. The Andhra Pradesh High Court directed Sunil Naik to appear before the investigating […] The post IPS Officer Sunil Naik to Face Questioning in Raghurama Custodial Torture Case appeared first on Telugu360 .
రథాన్ని లాగిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
రథాన్ని లాగిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.. రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి
Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం అత్యంత తక్కువ
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది
Fact Check: Viral video claiming Ali Khamenei was killed in a joint US-Israel missile strike is false. Investigation reveals that three of the four clips are AI-generated, while the remaining footage predates the alleged assassination.
Andhra Pradesh :చంద్రబాబును కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాలు
ఏపీఎన్జీవో సంఘ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. ఒక్కరోజే 180 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వైమానిక పరిమితులు విధించడంతో భారత్ లో భారీగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం విమాన సర్వీస్ లకు అంతరాయం కలిగింది. ముంబయిలో అత్యధికంగా 93 విమానాలు రద్దు చేశారు. వీటిలో 48 అవుట్బౌండ్.. 45 ఇన్బౌండ్ సేవలు ఉన్నాయి. ఢిల్లీలో 52 విమానాలను నిలిపేశారు. బెంగళూరులో 34 విమాన సర్వీసులు రద్దయాయి. వాటిలో 18 ఇన్కమింగ్ విమానాలు ఉన్నాయి.
Andhra Pradesh : సైబర్క్రైమ్ పోలీసులకు ఏపీ బీజేపీ ఫిర్యాదు
విజయవాడ సైబర్క్రైమ్ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫిర్యాదు చేసింది.
Telangana : అమిత్ షా తో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు
Telangana : నేడు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో నేడు నామినేషన్లను దాఖలు చేయనున్నారు
T20 World Cup : గెలుస్తూ వచ్చి చతికిలపడిన దక్షిణాఫ్రికా... పడుతూ లేస్తూ వచ్చి నిలిచిన న్యూజిలాండ్
దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది
ఇరాన్ హస్తగతమే ఆ ఇద్దరి లక్ష్యం?
అణు కార్యక్రమాలను ఇరాన్ విస్తరింప చేయడం ప్రపంచానికే ప్రమాదకరమని అవాస్తవాలు విస్తృతంగా ప్రచారం చేసి ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు భీకరంగా యుద్ధాన్ని సాగిస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇది ఇరాన్ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించడం కోసంకాదు. ఇరాన్ అభివృద్ధిని కాంక్షించే కొత్త తరం పాలన అందించడానికి అంతకన్నా కాదు. ఇరాన్లో నిక్షిప్తమై ఉన్న అపార చమురు నిల్వలను చేజిక్కించుకోవడానికి, తమకు గట్టి పోటీదారులుగా ఉన్న చైనా, రష్యాలను భౌగోళికంగా కుంగదీయడానికే. ఇరాన్ అణు క్షేత్రాలను, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను గత ఏడాది జూన్లో తాము ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్ మళ్లీ భూగర్భంలో అణుక్షేత్రాలను, బంకర్లను నిర్మించడం ప్రారంభించిందని, అందుకనే తాము అమెరికాతో కలిసి అత్యవసరంగా దాడి చేయక తప్పలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక ఇంటర్వూలో వెల్లడించడం అబద్ధాలను మరోసారి వాస్తవాలుగా చిత్రీకరించినట్టు అయింది. అలాగే పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే ప్రధాన కారణమని ఆ పాలన అంతమొందిస్తేనే పశ్చిమాసియాలో శాంతి లభిస్తుందని సమర్ధించుకున్నారు. మొత్తం మీద ఇరాన్లో ఖమేనీ తరం పాలన అంతమొందాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాన లక్షంగా స్పష్టమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ముజ్తబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికైనట్టు వార్తలు వెలువడుతున్న తరుణంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా వాళ్లని లక్షంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ నాయకుడిగా ఎవరు వచ్చినా అంతం చేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారంటే తాము ఆడించే కీలుబొమ్మ ప్రభుత్వం ఇరాన్లో వచ్చే వరకు అమెరికా ఇజ్రాయెల్ మారణ కాండ తప్పకపోవచ్చు. మరోవైపు ఇరాన్లో ప్రజా తిరుగుబాటును ప్రోత్సహించడానికి అమెరికా వ్యూహాలు రూపొందిస్తోంది. ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో చురుగ్గా ఉన్న కుర్దులకు ఆయుధాలు ఇవ్వాలని అమెరికా నిఘా సంస్థ సిఐఎ పన్నాగాలు పన్నుతోంది. ఈమేరకు డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్థాన్ అధ్యక్షుడితో ట్రంప్ మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇరాన్, ఇరాక్ సిరియా, టర్కీల్లో విస్తరించిన కుర్దుజాతి కొన్ని దశాబ్దాలుగా తమకు స్వతంత్ర దేశం కావాలని పోరాడుతోంది. ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో ఇరానియన్ కుర్దిష్ సాయుధ గ్రూపులకు వేల సంఖ్యలో బలగాలు ఉన్నాయి. ఈ బలగాలను కూడదీసుకోడానికి అమెరికా, ఇజ్రాయెల్ పావులు కదుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి లక్షం ఇరాన్ ఇంధనం కొల్లగొట్టడం. ప్రపంచం మొత్తం మీద రెండవ భారీ చమురు, సహజవాయు నిల్వలు ఇరాన్లోనే ఉన్నాయి. అమెరికా చెప్పుచేతల్లోని కొత్త ప్రభుత్వం ఇరాన్లో పాలనా పగ్గాలు చేపడితే కేవలం చమురు విక్రయాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన మార్కెట్ రూపురేకలనే మార్చి వేస్తుంది. ఇరాన్ ప్రధాన చమురు వినియోగదారు చైనా. ఆంక్షల యుగ వాణిజ్యంలో కీలక భాగస్వామి. రెండో అంశం చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కారిడార్ నిర్మాణంలో ఇరాన్ కీలకమైన భాగస్వామిగా ఉంటోంది. తూర్పు ఆసియా ఐరోపా మధ్య ఈ కారిడార్ అనుసంధాన వంతెనలా పనిచేస్తోంది. ఏదైనా మార్పు వచ్చి అమెరికా రెగ్యులేటరీ పరిధి లోకి ఇరాన్ ఎగుమతులు వస్తే చైనా ఇంధన భద్రత బలహీనం కాక తప్పదు. మూడో అంశం ఇటీవల గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, ఇరాన్ దేశాలు చాలా సన్నిహితంగా ఉంటున్నాయి. పశ్చిమ దేశాల మార్కెట్ లోకి ఇరాన్ ఇంధనం తిరిగి ప్రవేశిస్తే ఐరోపాపై రష్యా ఆధిపత్యం నాటకీయంగా సన్నగిల్లుతుంది. ఇదిలా ఉండగా భౌగోళిక రాజకీయాల ప్రభావంలో మార్పు కనిపిస్తోంది. ఇరాన్లో అంతర్గతంగా అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లు, ఆర్థిక లావాదేవీలు దెబ్బతినడం, సామాజిక అశాంతి, ఇరాన్ పాలకులకు అగ్నిపరీక్షగా మారాయి. ఇరాన్ ప్రజల ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో కర్కశంగా అణిచివేయడం పాలక వర్గంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసింది. దీన్ని అమెరికా బాగా వినియోగించుకుంది. ప్రజల్లో అసంతృప్తి కార్చిచ్చులా వ్యాపించింది. ఇరాన్ పాలన మార్పు విప్లవాన్ని పోలి ఉండనవసరం లేదు. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ పతనంగా భావించనక్కర లేదు. అలాగే రాచరిక వ్యవస్థ పునరుద్ధరణ కాదు. ఉన్నత వర్గాల పునక్రమణిక ద్వారా పరివర్తన ఉద్భవించవచ్చు. అయితే ఇరాన్ ప్రాంతీయ సంక్షోభాలను ఇజ్రాయెల్ అమెరికా కూటమి తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం లేకపోలేదు. పశ్చిమ దేశాల వ్యవస్థలోకి ఇరాన్ ప్రవేశిస్తే ఫలితం కేవలం ఆంక్షల ఉపశమనంతోనే సరిపోదు. ఇది పశ్చిమాసియా నిర్మాణాత్మక పునర్ వ్యవస్థీకరణకు మార్గం అవుతుంది. ఇజ్రాయెల్ గల్ఫ్ ఇరాన్ అనుసంధానం ఒకప్పుడు ఊహకు అందనిదైనా, అమెరికా పెత్తనం గొడుగు కింద ఆచరణాత్మక వాణిజ్య మండలంగా మారిపోతుంది. ఐరోపాకు ఇరాన్ నుంచి గ్యాస్ సరఫరా ప్రవాహం మాస్కోకు చోటు లేకుండా తుడిచిపెడుతుంది. చైనా యురేసియన్ కారిడార్కు ప్రమాణీకరణ అవసరం అవుతుంది. భూగర్భం లోని ఫలకలు చాలా అరుదుగా మారుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ సైద్ధాంతిక పునాదులతో స్థిరమైన దేశాల్లో అధికార పరివర్తన అంత సులువుగా జరగదు. అల్లకల్లోలం రేపుతుంది. ఇరాన్లో పాలన తరం మార్పు ఎలా జరుగుతుంది? అదేమైనా హింసాత్మకంగా మారుతుందా? ఎవరు ఇరాన్ దిశాదశను ఎలా మారుస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రేక్షక పాత్రను వహిస్తోంది. ఇరాన్పై రెండు దేశాల ముప్పేట దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ద్వయాన్ని ఒప్పించగల మధ్యవర్తిత్వం చేసే దేశాలు కరువైనాయి. నిరాయుధీకరణ నిత్య మంత్రం కావాలని ఐరాస బోధించడం మినహా చేసేది ఏమీ కనిపించడం లేదు. ఆయుధాలు, యుద్ధ వ్యాప్తి నిరోధక చర్యలు సాకారం కావాలని ఆకాంక్షిస్తున్న ఐరాస నేటి ఇజ్రాయిల్- అమెరికా సైనిక దాడులను ఆపమని ఒక్క మాట కూడా అనలేని నిస్సహాయ దుస్థితిలో ఉన్నది. ప్రపంచ శాంతి నెలకొనాలనే సదుద్దేశంతో 2022 నుంచి ఐరాస ప్రతి ఏటా అంతర్జాతీయ నిరాయుధీకరణ, వ్యాప్తి నిరోధక అవగాహన దినం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిస్ఆర్మమెంట్ అండ్ నాన్-ప్రొలిఫరేషన్ అవేర్నెస్) పాటించడం జరుగుతున్నది. అణ్వాయుధాలు, రసాయన, జీవాయుధాలవల్ల కలిగే అపార నష్టాలను అవగాహన పరుస్తూ నిరాయుధీకరణ సూత్రాలను వ్యాప్తి చేస్తున్నది. సామూహిక వినాశన ఆయుధాల వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా అంతర్జాతీయ భద్రత, మానవాళి రక్షణ, శాంతి నెలకొంటాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. 1945లో హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుబాంబు దాడుల విధ్వంసంతో 2 లక్షల మంది ప్రజలు మరణించగా, లక్షలాది మంది దీర్ఘకాలిక నష్టాలను కూడా నమోదు చేసుకున్నారు. 1945లో ప్రారంభమైన అణ్యాయుధ పరీక్షలు, దాదాపు నేటికీ 2,000 వరకు అణు పరీక్షలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి 24 ఫిబ్రవరి, 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్- రష్యా యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. అదే విధంగా 07 అక్టోబర్, 2023 నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి అంతం కనిపించడం లేదు. నేడు ఇరాన్పై ఇజ్రాయెల్ -అమెరికా మరో యుద్ధం కొనసాగిస్తూ క్షిపణుల వర్షంతో మధ్యప్రాచ్యం మంటల్లో భగ్గుమంటోంది. గల్ఫ్ దేశాల ఆకాశం బాంబు పేలుళ్లతో నల్లటి కారుమబ్బులతో నిండి ఉన్నది. నగరాలు, సైనిక స్థావరాలు, చమురు శుద్ధి కేంద్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర బాంబుల దాడితో ప్రపంచ శాంతి గాల్లో దీపమైంది. 3వ ప్రపంచ యుద్ధం రానుందా అనే వాదనలు బలపడుతున్నాయి. పిల్లిని గదిలో బంధించితే గత్యంతరం లేక తెగబడి ఎదురు తిరుగుతుందనే విషయం మనకు తెలుసు. నేడు ఇరాన్ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఇరాన్ అణు కార్యక్రమం మింగుడుపడని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా భీకర సైనిక దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని మట్టుపెట్టడంతోపాటు ఖమేనీ సమీప బంధువులు/ కుటుంబ సభ్యులు, అగ్రనేతలు, ఉన్నత సైనిక అధికారులు, సహాయకులు కలుపుకొని ఇప్పటికీ 800లకు పైగా నిండు ప్రాణాలను కోల్పోయారు. 1989 నుంచి నిన్నటి వరకు ఇరాన్ సుప్రీం నాయకుడిగా మూడున్నర దశాబ్దాలకు పైగా తిరుగులేని నాయకుడిగా శాసించడం చూసాం. ఇరాన్లో పార్లమెంట్, న్యాయవ్యవస్థ, పోలీస్ విభాగం, మీడియా, మతపరమైన వర్గాలను తన అదుపులో ఉంచుకొని ప్రత్యర్థులను అక్రమంగా అరెస్టులు చేయడం, మానవ హక్కులను హననం చేయడం, మహిళా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం, వ్యతిరేక ఉద్యమాలను అణచివేయడం తీవ్ర స్థాయిలో జరిగిపోయింది. ఇరాన్కు చెందిన వ్యూహాత్మక మిలిటరీ, వైమానిక, నావికా కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని వేల బాంబులను ఇజ్రాయెల్ -అమెరికాలు వేస్తున్నాయి. పశ్చిమాసిమాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ భీకర యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు ధరలు బంగారం వలే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇరాన్లో నిరంకుశ పాలన అంతం అయిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చిందని ఇరానియన్ ప్రజలకు ట్రంప్ ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ యుద్ధం ఇలాగే మరి కొన్ని వారాలు కొనసాగుతుందని నెతన్యాహు -ట్రంప్ ద్వయం ప్రకటిస్తున్నారు. రోజురోజుకూ యుద్ధం ముదురుతోంది. చమురు కేంద్రాలు భగ్గుమంటున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు ఇరాన్ అణుకేంద్రాలు, సైనిక స్థావరాలను నేలమట్టం చేశాయి. ప్రతీకార జ్వాలలతో రగులుతున్న ఇరాన్ రగిలిపోతూ అమెరికా సైనిక స్థావరాలున్న 8 దేశాలపై ఏకకాలంలో దాడులు చేసింది. నేడు ఇరాన్ చేసిన ఎదురు దాడుల్లో బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీఅరేబియా, యుఎఇ దేశాల చమురు శుద్ధికేంద్రాలు ప్రభావితం అయ్యాయి. నేడు ఇరాన్ పక్షాన మిలిటెంట్ గ్రూపులు కూడా రంగంలోకి దిగుతున్నాయి. అమెరికా చర్చలకు సిద్ధమని ప్రకటించినా ఇరాన్ ససేమీరా అంటోంది. ‘స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్’ జలసంధి సముద్ర రవాణా మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు సరఫరా ఆగిపోయింది. దీనితో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలకు చమురు రవాణా ఆగిపోయింది. 9 కోట్లకు పైగా జనాభా కలిగిన ఇరాన్కు 6.10 లక్షల క్రియాశీల సైన్యం ఉన్నది. 28 ఫిబ్రవరి రోజున ఇజ్రాయెల్ చేసిన సైనిక దాడుల్లో అపార ప్రాణ, ఆస్తినష్టాలు నమోదు అవుతున్నాయి. అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫలితంగా ఇరాన్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఆపరేషన్లో భాగంగా వైమానిక, సముద్ర తలాల మీదుగా ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నామని అనుకున్న అమెరికా - ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్నాయి. భారతదేశ చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నది. హోర్మోజ్ జల సంధి మూసివేయడంతో బ్యారెల్ ముడి చమురు ధరలు 80 డాలర్లకు చేరిందని, రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనితోపాటు గ్యాస్, ఖనిజాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారం, వెండి, వ్యవసాయ పరికరాలు, సన్ఫ్లవర్ ఆయిల్, సబ్బులు, తలనూనె, ఎరువులు, బిస్కెట్లు, షాంపులు లాంటి అనేక నిత్యావసర సరుకుల దిగుమతులు భారమై, రవాణా దూరమై ధరలు పెరగనున్నాయి. ఈ జలసంధిని మూసివేయడంతో 13 దేశాల నుంచి భారత్కు దిగుమతులు భారమైపోతున్నాయి. భారతదేశం రోజూ వినియోగించే 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు ఈ జలసంధి నుంచి మాత్రమే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉండగా, మరో 25 రోజులకు సరిపడా చమురు రవాణా మార్గంలో ఉన్నాయని భారత ప్రభుత్వం వెల్లడిస్తున్నది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలతో దగ్గరి సంబంధాలను కొనసాగిస్తున్న భారత్ నేడు ఈ దేశాలను సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కరించుకోవాలని ప్రకటన చేయడం మినహా మరోమార్గం కనిపించడంతో లేదు. ట్రంప్- నెతన్యాహు ద్వయానికి సత్వరమే సద్బుద్ధి కలగాలని, ఇరాన్ కూడా సంయమనం పాటించాలని కోరుతున్నది. ఏదిఏమైనా అంతర్జాతీయ నిరాయుధీకరణ, వ్యాప్తి నిరోధక అవగాహన దినం వేదికగా నేటి యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయదని ఆశిద్దాం. బుర్ర మధుసూదన్ రెడ్డి 99497 00037
నేటి నుంచి అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్లు
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో విద్యార్థులు గురువారం నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలకు హాల్ టికెట్లను ఇప్పటికే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించామని, గతంలో ప్రకటించిన విధంగా ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు ఇదే సమయం వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరునున్నట్లు పేర్కొన్నారు. హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు www.bse.telangana.gov.in అధికారిక వెబ్సైట్ ను సంప్రదించాలని, విద్యార్థులు తమ హాల్ టికెట్ల కోసం 8096958096 నంబర్కు Hi అని మెసేజ్ పంపి, ఆపై SSC Hall Ticket March-2026 అని టైప్ చేయడం ద్వారా కూడా పొందవచ్చని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, దీంతో పాటు 040-23230942 నంబర్ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
సమరానికి సర్వం సిద్ధం.. నేడు ఇంగ్లండ్తో భారత్ సెమీస్ పోరు
ముంబై: టి20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్ సమరానికి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, మాజీ విజేత ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ పోరు జరుగనుంది. సూపర్8లో ఇంగ్లండ్ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి సెమీస్కు దూసుకొచ్చింది. భారత్ మాత్రం కాస్త చెమటోడ్చి సెమీస్ బెర్త్ను దక్కించుకుంది. అయితే కచ్చితంగా గెలవాల్సిన చివరి రెండు మ్యాచుల్లో అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్తో పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. సంజు శాంసన్ ఫామ్లోకి రావడం భారత్కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సంజు తన మార్క్ బ్యాటింగ్తో చెలరేగితే టీమిండియాకు ఎదురే ఉండదు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తన పాత్రను సక్రమంగా నిర్వర్తించాలి. ఈ వరల్డ్కప్లో ఆరు మ్యాచులు ఆడిన అభిషేక్ కేవలం ఒక దాంట్లో మాత్రమే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. మిగతా వాటిల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్తో జరిగే సెమీస్ మ్యాచ్ అతనికి సవాల్గా మారింది. వరుస వైఫల్యాలకు పుల్స్టాప్ పెట్టి తన సహాజ శైలీలో బ్యాట్ను ఝులిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇషాన్ కిషన్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. అయితే ఇషాన్ బ్యాటింగ్లో నిలకడ లోపించడం ఆందోళన కలిగించే అంశమే. ఒక మ్యాచ్లో రాణిస్తే తర్వాతి పోరులో విఫలం కావడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ పద్ధతిని మార్చుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత ఇషాన్పై ఉంది. అందరి కళ్లు సూర్యపైనే.. మరోవైపు జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఏర్పడింది. కీలకమైన సెమీస్ మ్యాచ్లో సూర్య జట్టుకు కీలకంగా మారాడు. బ్యాట్తో పాటు కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలవాల్సిన పరిస్థితి సూర్యకు నెలకొంది. సూర్య తన మార్క్ ఆటతో చెలరేగితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్దీప్, బుమ్రా, వరుణ్, హార్దిక్, అక్షర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో భారత్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. జోరుమీదున్న ఇంగ్లండ్ ఇంగ్లండ్ కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. విల్ జాక్స్, సామ్ కరన్ ఆల్రౌండ్షోతో అదరగొడుతున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, రెహాన్, టామ్ బాన్టన్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లోనూ ఇంగ్లండ్ మెరుగ్గా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో సెమీస్ పోరు ఆసక్తి కరంగా సాగడం ఖాయం. రాత్రి 7 గంటల నుంచి స్టార్ నెట్వర్క్లో..
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపిఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చా లా ఆలస్యంగా 2025లో జరిగిందన్నారు. ఆ సమయంలోనూ కేవ లం 7 గురు ఐపిఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటా యించారని సిఎం వివరించారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కోంటోందని సిఎం తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ క మిషనర్, హైదరాబాద్ నగరంలో భారగీ పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపిఎస్ అధికారుల అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షాకు సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని కేంద్ర మంత్రి కి సిఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపిఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాలని సిఎం కోరారు. అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా... ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు వారి మధ్య చర్చకు వాచ్చియి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్లో గణనీయమైన మార్పులు వచ్చాయని సిఎం తెలిపారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి సిఎం తెలియజేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డిజిపి బి.శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషినల్ డిజిపి విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజిపి బి.సుమతి పాల్గొన్నారు.
అగ్రవర్ణ అహంకారం కారణంగా 2 నెలల పసికందు ప్రాణాలు వదలడం మానవ సమాజాన్ని దుఃఖసాగరంలోకి నెట్టింది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న జరిగిన ఈ అవమానవీయ ఘటన కేవలం నేరం కాదు. ఇది భారతీయ సామాజిక ఆత్మకు తగిలిన లోతైన గాయం.ఆధునిక ప్రజాస్వామ్యంలో కాకుండా మనం ఇంకా మధ్యయుగపు అంధకారంలోనే ఉన్నామని చాటి చెబుతుంది. ఈ ఘటన కేవలం రూ. 100 కొబ్బరికాయల రుసుం వివాదం అనేది కట్టుకథ మాత్రమే. దీని వెనుక శతాబ్దాల కుల అహంకారం, కులాంతర వివాహాలపై ఉన్న కసి, పెత్తందారీ పోకడలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. కుమ్మెర మల్లన్న జాతరలో బాధితురాలు కీర్తి తన భర్త గణేశ్, అత్త చంద్రకళతో కలిసి స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు, నిర్వాహకులు రూ. 100 రుసుం చెల్లించాలని డిమాండ్ చేయడంతో బాధితురాలు కీర్తి తాము కూడా ఇదే గ్రామస్థులం కదా, మా దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని, మేము కులవృత్తులు చేసుకుని బతికేవాళ్లం, మా దగ్గర డబ్బులు తీసుకోవడం ధర్మం కాదని, ఒకవేళ మేము మీకు డబ్బులు ఇచ్చినందుకు మీరు దానికి రశీదు ఇస్తారా? మరి రశీదు లేకుండా డబ్బులు ఎందుకు కట్టాలి? అనే ప్రశ్నలు అడగడంతో అగ్ర కులస్థులకు అవమానంగా అనిపించాయి. వారి దృష్టిలో కీర్తి ఒక ‘తక్కువ కులం’ మహిళ. వెనుకబడిన వర్గానికి చెందిన ఒక స్త్రీ, ఇలా తల ఎత్తి తమను ప్రశ్నించడం వారి సామాజిక అహంకారాన్ని దెబ్బతీసింది. కీర్తి కుటుంబంపై జరిగిన దాడి, రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుతోపాటు, గౌరవంగా జీవించే హక్కుకు ప్రత్యక్ష ఉల్లంఘనే. బహుజనుల బిడ్డలపై అగ్రవర్ణాల దాడి వెనుక లోతైన సామాజిక కారణం ఉంది. కీర్తి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాగా, ఆమె భర్త గణేశ్ చాకలి సామాజిక వర్గానికి చెందినవారు. గణేశ్ సోదరులు కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు. ఇలాంటి కులాంతర వివాహాలు కులాల మధ్య అంతరాలను చెరిపేస్తాయి. కులవ్యవస్థ నిలవాలంటే ‘రక్తస్వచ్ఛత’ ఉండాలని నమ్మే పెత్తందార్లకు ఇది మింగుడు పడలేదు. ఈ దాడి వెనుక అసలు కారణం అదే. గ్రామాల్లోని కులం, చేతి వృత్తులవారు అగ్రవర్ణాల వారికి ఉచితంగా సేవ చేయాలనే ‘వెట్టి’ సంస్కృతి ఇంకా పోలేదు. రాజ్యాంగంలోని 23వ నిబంధన ‘బలవంతపు చాకిరీ నిరోధం’ గురించి తెలుపుతోంది. గ్రామాల్లో జరుగుతున్నది కేవలం సామాజిక వివక్ష కాదు, ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే. శ్రమకు విలువ ఇవ్వనివారు, కొబ్బరికాయకు మాత్రం వంద రూపాయల వెల కట్టడం వారి దోపిడీ మనస్తత్వానికి నిదర్శనం. కీర్తి అడిగిన హక్కుల ప్రశ్న పెత్తందారీ అహంకారానికి తగిలిన దెబ్బ. ఇలాంటి ఘటనలు మన స్వార్థానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చిన్నారి ప్రాణం కోల్పోయిన క్షణం, తల్లి మౌనిక గుండెలు పగిలిన ఆవిష్కరణ. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు ‘కనీరు కన్నీళ్లు కలిసి పోతున్నాయి’ అన్నట్టు, ఈ దుఃఖం సమాజానికి కన్నీళ్లు తెప్పించింది. యుఎన్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో కులవివక్ష ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది మానవ హక్కులకు అతి పెద్ద సవాల్. ప్రపంచ వేదికలపై సమానత్వం గురించి మాట్లాడే దేశం, తన అంతర్గత విభజనలను అధిగమించలేకపోతే అది విరోధాభాసమే. మన విద్యా వ్యవస్థ ప్రతిభను పెంపొందిస్తోంది. కానీ విలువలను పెంచుతోందా? పిల్లలకు ర్యాంకులు, పోటీ, విజయమే నేర్పితే సరిపోదు. సహానుభూతి, పరస్పర గౌరవం, సమానత్వం వంటి విలువలు చిన్నప్పటి నుంచే బోధించాలి. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, పాఠశాల వాతావరణంలో ఆచరణలో కనిపించాలి. అంబేద్కర్ చూపించిన మార్గం, కులనిర్మూలన, సామాజిక న్యాయం, విద్యలో భాగం కావాలి. మనిషి అనే గుర్తింపే ప్రధానమని పిల్లలకు నేర్పాలి. ఇలాంటి ఘటనల తర్వాత కొద్ది రోజులు ఆగ్రహావేశాలు, నిరసనలు. ఆపై మౌనం. కానీ బాధిత కుటుంబానికి ఆ మౌనం శాశ్వత గాయం. మీడియా సంచలనాలకే పరిమితం కాకుండా మూలకారణాలను వెలికితీయాలి. చైతన్యాన్ని పెంపొందించాలి. రాజకీయాలు కుల ఓటు బ్యాంకులకే పరిమితం కాకుండా సమానత్వానికి కట్టుబడాలి. ఎస్సి, ఎస్టి అట్రాసిటీస్ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. బాధితుల పక్షాన నిలబడుతూ, అగ్రవర్ణ అహంకారం, ఆధిపత్యంతో అంటరాని వర్గమనే నెపంతో 2 నెలల పసికందును బలిపశువును చేసిన అగ్రకుల మానసిక రోగులను కఠినంగా శిక్షించవలసిన ‘ఖాకీ’లు ఈ ఘటనలో వింత పోకడను అవలంబిస్తూ, కేసును పక్కదారిని పట్టిస్తున్నారనడంలో సందేహం లేదు. కుమ్మెర ఘటనలో అసువులు బాసిన 2 నెలల పసికందు మౌనంగా సమాజానికి ఒక ప్రశ్న వేసింది. తన తప్పు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది మనమంతా. ఈ ఘటనను కేవలం వార్తగా మరిచిపోతే అది మరో గణాంకమవుతుంది. కానీ దాన్ని మేల్కొలుపు పిలుపుగా తీసుకుంటే అది మార్పుకు నాంది అవుతుంది. మానవత్వం బయట వెతికే విలువ కాదు. అది మనలోనే ఉంది. దాన్ని వెలిగించాల్సింది మనమే. మనిషి మీద మనిషి ఆధిపత్యం కాదు మమకారం రాజ్యమేలే సమాజమే నిజమైన అభివృద్ధి సాధించినదిగా చరిత్ర గుర్తిస్తుంది. కులాలు, మతాలు, వర్గాలు ద్వితీయాలు కావాలి. మనిషి అనే ఒకే గుర్తింపు సరిపోతుంది. పసికందును కాళ్లతో తన్ని, అగ్రకుల అహంకారంతో హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు ముక్తకంఠంతో నినదిస్తూ, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి న్యాయపోరాటం చేయడంతో ప్రజల మన్నలను పొందున్నాయి. ప్రజా సంఘాలు అనేవి ప్రజల పక్షాన నిలబడి, రాష్ట్రంలోని నలుమూలల్లో ఎక్కడ అన్యాయం జరిగిన బాధితుల పక్షాన నిలబడి పోరాడుతూ, న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యం. పసికందును బలిపశువును చేసిన అగ్రకుల మానసిక రోగులకు సరైన శిక్షతోపాటు నిరుపేద బాధిత కుటుంబానికి న్యాయం చేకూర్చే వరకు అధికార యంత్రాంగం మెడలు వంచేలా పోరాటాలు చేస్తూ, బాధితులకు సరైన న్యాయం చేకూరి, భవిష్యత్తులో ఎక్కడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించేంతవరకు అలుపెరుగని పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
` ఇరాన్ పగ్గాలు ముజ్తబా ఖమేనీకి అప్పగింత! ` అధికార మార్పిడి జరిగిందని ప్రచారం టెహ్రాన్(జనంసాక్షి): అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో …
ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా ఉక్కుపాదం
` దేశాన్నే ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ ` ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ధ్వంసం ` తామే దాడి చేశామని ఇజ్రాయిల్ రక్షణ దళం ప్రకటన …
మావోయిస్టు పార్టీ లీగల్కు అనుమతివ్వండి
` ఆ పార్టీ అగ్రనేతల వినతి.. అమిత్ షాతో సీఎం రేవంత్ మధ్యవర్తిత్వం ` ఇతర నాయకత్వంతో మాట్లాడి పీఎల్జీఏ రద్దు చేసుకుంటాం ` ఇటీవల లొంగుబాటు …
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి
` ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. వేం నరేందర్రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను అధిష్ఠానం ఖరారు …
న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కూటమి నడుమ యుద్ధం గల్ఫ్ దేశాలను దాటి విస్తరిస్తోంది. బుధవారం తెల్లవారుజామున శ్రీలంక తీ రం ప్రాంతం గాలె సమీపంలో ఇరానియన్ నౌక పై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది మృతి చెందారు.78 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు 87 మృతదేహాలు సము ద్రం నుంచి వెలికి తీసినట్లు శ్రీలంక నౌకాదళం ప్రకటించింది. ఇరాన్కు చెందిన ‘ఐఆర్ఐఎస్ దే నా’ అనే యుద్ధనౌక శ్రీలంక తీర ప్రాంతం మీదు గా తిరిగి ఇరాన్ వెళుతుండగా ఈ దాడి జరిగిం ది. అది తమపనేనని అమెరికా సాయంత్రానికి ప్రకటించింది. జలాంతర్గామి టార్పెడోలతో ఇరాన్ యుద్ధ నౌక ను ముంచేశామని అమెరికా రక్ష ణ మంత్రి పీటర్ హెగ్సెత్ ప్రకటించారు. భా రతదేశంలోని విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ‘మిలాన్2026’ పలు దేశాల నావికా వి న్యాసాల లో పాల్గొన్న తర్వాత ఇరాన్కు తిరిగి వె ళ్తుండగా ఈ దాడి జరిగింది. స్వల్పంగా గాయప డిన వారికి చికిత్స అందిస్తున్నామని శ్రీలంక ఆ రోగ్యశాఖ ఉన్నతాధికారి డాక్టర్ అ నిల్ జా సింగ్ తెలిపారు. అనంతరం శ్రీలంక నౌకాదళం ఓ ప్రకటనలో మొత్తం 79 మందిని రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు, వారిలో ఒ కరు మరణించినట్లు, మ రో 101 మంది తప్పిపోయినట్లు తెలిపింది. నౌక మాత్రం సముద్ర జలాలలో మునిగిపోయిందని వివరించింది. దాదాపు 180 మం దితో కూడిన ఐఆర్ఐఎస్ దేనా నౌక ప్రమాదం లో ఉందని శ్రీలంక నావికా దళానికి అత్యవసర సందేశం అందిందని, వెంటనే ఓడలు, వై మానిక దళ విమానాలు సహాయ చర్యలకోసం పంపిన ట్లు లంక విదేశాంగమంత్రి విజిత హరా త్ పార్లమెంటులో ప్రకటించారు. పేలుడు వల్లే మునక.. పెద్ద పేలుడు సంభవించడంతో నౌక దెబ్బతిన్నద ని సిబ్బంది చెప్పినట్లు శ్రీలంక నావికా దళం వ ర్గాలు బుధవారం తెలిపాయి. నౌక మునిగిపోయిన ప్రాంతంలో కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఓడ మునిగిపోయిన ప్రాంతం నుంచి తాము కొందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరి కొందరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని శ్రీలంక నావికాదళ ప్రతినిధి బుద్ధిక సంపత్ కొలంబోలో విలేకరులకు తెలిపారు. అది మా పనే : అమెరికా హిందూ మహా సముద్రంలో ఇరాన్ నౌకను జలాంతర్గామి టార్పెడోలతో ముంచేశామని అమెరికా రక్షణమంత్రి పీటర్ హెగ్సెత్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శత్రుదేశంపై జరిగిన అతి భారీ దాడిగా ఆయన అభివర్ణించారు. త్వరలో మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. కొద్ది రోజుల్లో ఇరాన్ గగనతలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. ఇరాన్పై అమెరికా మరింత విజయం సాధించిందన్నారు. తమ వద్ద అపరిమిత సంఖ్యలో గ్రావిటీ బాంబులు ఉన్నాయని, వాటిని కూడా ఉపయోగిస్తామన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను బుధవారం సాయంత్రం ఎంపి క చేసింది. వీరిలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అ భిషేక్ మను సింఘ్వి, మరో అభ్యర్థిగా ముఖ్యమంత్రి సన్నిహితుడు, రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధిష్టానం ఎంపిక చేసింది. సింఘ్వి ఎంపిక ముందే ఖరారు కావడంతో ఆయన బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు. తన నామినేషన్కు సంబంధించిన ప్రక్రియపై పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్తో సమావేశ మై చర్చించారు. పలు సీనియర్ నాయకులు సిం ఘ్వికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మరో అభ్యర్థి ఎంపికపైనే చివరి వరకూ సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలతో చర్చించి వేం నరేందర్రెడ్డి ఎంపిను ఖరారు చేశారు. సా యంత్రం ఢిల్లీలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీకి ముందే రాష్ట్ర నాయకులకు ఫోన్ ద్వారా వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసిన విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రం నుంచి ఖాళీకాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం పార్టీ సీనియర్ నాయకులు తీవ్రం గా ప్రయత్నించినప్పటికీ చివరకు అధిష్టానం ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం మేరకు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ పదవి కోసం పార్టీ నుంచి పదహారు మంది ఆశావాహులు లా బీయింగ్ చేసినప్పటికీ చివరకు వారికి నిరాశే ఎ దురైంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అ త్యంత సన్నిహితుడు కావడమే కాకుండా తన రా జకీయ ప్రస్థానంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డికి తోడుగా ఉన్నారు. వీరిద్దరు గతంలో తెలుగు దే శం పార్టీలో కూడా కలిసి పని చేశారు. అదే పార్టీ లో వీరిద్దరు ఎమ్మెల్యేలుగా కూడా కొనసాగారు. రేవంత్ రెడ్డి టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన సమయంలోనే ఆయనతో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. సిఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి మొదటి నుంచి అత్యంత సన్నిహితునిగా కొనసాగడమే కాకుండా ఆయన కుడి భుజంగా పేరు తెచ్చుకున్నారు. సింఘ్వి ఎంపిక పూర్తిగా అధిష్టానం నిర్ణయమే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న సింఘ్వి రాజ్యసభకు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపికైనప్పటికీ ఆయన పదవీ కాలం అర్థాంతరంగా ముగిసింది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బిఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యునిగా రాజీనామా చేయడంతో ఏర్పడిన మిగిలిన పదవీ కాలానికి సింఘ్విని ఎంపిక చేయడం జరిగింది. అది కూడా ఏప్రిల్ తొమ్మిదో తేదీతో ముగియనుండడంతో ఈ సారి పూర్తి స్థాయి పదవీ కాలానికి సింఘ్విని రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. పార్టీకి సంబంధించిన కోర్టు వ్యవహారాలన్నింటినీ సింఘ్వి చూసుకుండడంతో పార్టీ పెద్దలు సింఘ్వి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఈ విషయాన్ని ఇటీవల రాహుల్ గాంధీ వికారాబాద్లో ఏర్పాటైన పార్టీ శిక్షణా తరగతులకు హాజరైన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి సింఘ్వి ఎంపికపై సంకేతం ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. నేడు నామినేషన్లు రాజ్యసభ పోటీకి నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి తేదీ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన ఇద్దరు అభ్యర్థులు అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఉదయం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ కూడా హాజరుకానున్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో ఐఏఎస్, ఐపిఎస్లను మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రావని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు టి.హరీశ్ రావు విమర్శించారు. సిఎం రేవంత్రెడ్డికి పరిపాలన రావడం లేదన్నారు. బుధవారం హై దరాబాద్లో మీడియాతో హరీశ్ రావు చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులను పదే ప దే మారుస్తున్నారని, ఇప్పటి వరకు ఐదుసార్లు భా రీగా మార్పులు, చేర్పులు జరిగాయన్నారు. విభా గాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదని విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలం లో ఐదుగురు అధికారులు మారారని ఆయన వి మర్శించారు. ఈ బదిలీలతో విద్యుత్ శాఖ అతలా కుతలం, అవినీతి మయం అయ్యిందన్నారు. రెం డేళ్ల పాలనలో రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్ట ర్లు మారారని, ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వ ల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని ఆయన తెలి పారు. అధికారులను ఇలా తరచూ మారిస్తే పాల న ఎలా నడుస్తుందని, ఇదంతా ఓ జోక్గా మారి పోయిందని ఆయన విమర్శించారు. కలెక్టర్కు జి ల్లాపై అవగాహన రావడానికే ఆరునెలల సమయం పడుతుందని, అలాంటిది ఆరునెలల్లోనే మారిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారని హరీష్రావు విమర్శించారు. నిత్యం బదిలీల వల్ల యువ కలెక్టర్లలో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని, వాళ్లకు నచ్చిన వాళ్లకు మంచి పోస్టింగ్లు, నచ్చని వారిని బదిలీలు చేస్తున్నారని హరీష్రావు ఆరోపించారు. సిఎం, మంత్రులకు నచ్చకపోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడిగింపు సాధారణం అయిపోయిందన్నారు. డజన్ మంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు ఎక్స్ టెన్షన్ ఇచ్చారని, వందల మంది ఇంజనీర్లకు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలో అధికారుల పదవీ కాలం పొడగింపుపై అప్పట్లె కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్ల అవినీతిని.... యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లను ఐదు శాతం ఎక్కువకు ఇస్తున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని హరీశ్ రావు ఆరోపించారు. ఇంజనీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోందని ఆయన అన్నారు. అధికారులను తరచూ బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదని గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. కలెక్టర్లకు కనీసం రెండేళ్లు ఒకే చోట ఉంటే ఫలితాలు వస్తాయని కెసిఆర్ హయాంలో రాష్ట్రం మోడల్ స్టేట్ అయ్యిదంటే దానికి అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లేనని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్ధతి కాదని, తమ అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సిఎం వారిని బెదిరిస్తూ బదిలీ చేస్తున్నారని హరీష్రావుఆరోపించారు. అధికారులను సిఎం బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని హరీష్రావు హితవు పలికారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు... వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారని హరీష్రావు ఆరోపించారు. ఐటీ కార్యదర్శిగా సిఎస్ ఎలా పని చేయగలుతారిన, సిఎస్కు చాలా బాధ్యతలు ఉంటాయని, అదనంగా ఐటీ కార్యదర్శిగా ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తారని హరీష్రావు ప్రశ్నించారు. 20 శాతం జీఓలు ఆన్లైన్లో ఉంచుతూ 80 శాతం ఆఫ్ లైన్లో ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశించినా జీఓలు ఆన్లైన్లో పెట్టడం లేదని ఆయన విమర్శించారు. తమ సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తే మంచిదని లేదంటే వారి ఖర్మ ఆయన అన్నారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇలా తయారైందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు.... ఫిరాయింపుల విషయంలో కౌన్సిలర్లకు ఓ నీతి? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరో నీతా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశం అంతా జోక్గా మారిపోయిందని అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ అసెంబ్లీ మాదిరిగా లేదని హౌజ్ కమిటీలు వేయడం లేదని, డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడం లేదని, చీఫ్ విప్ పదవి ఖాళీగా ఉందని, ఇలా ఎప్పుడు జరగలేదని, అసెంబ్లీ లైబ్రరీ కూడా సరిగా లేదని హరీష్రావు విమర్శించారు. రాజేంద్రనగర్లో మైనింగ్ దందా రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని, మొబైల్ క్రషింగ్ ప్లాంట్కు మాత్రమే నిబంధనలుండగా ఫికస్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపోలిస్లో పెట్టారని హరీష్రావు ఆరోపించారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలని, లెటర్లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని అక్కడ రెడీమిక్స్కు అనుమతి లేదని ఆయన అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యేకు, మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారని, ఓఆర్ఆర్కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉందన్నారు. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్లో మైనింగ్ దందా నడుపుతుందని ఆయన ఆరోపించారు. నేడు నిజానిర్ధారణ కోసం బిఆర్ఎస్ బృందం అక్కడకు వెళ్తుందన్నారు. రాజ్యసభ పోటీపై వేచిచూద్దాం... రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ ఉండనివ్వండి రేపటి వరకు వేచి చూద్దామని హరీష్రావు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చానని, జర్నలిస్టులకు పెట్టిన రూ.16 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎడ్యుకేషన్ పాలసీ బాగుంటే వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదన్నారు.
పట్నా: బీహార్ లో రాజకీయ పెనుమార్పులు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారని, బీజేపీ నాయకుడికి ముఖ్యమంత్రి పగ్గాలు దక్కనున్నాయని, నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 2025 లో బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయు అధినేత నితీష్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయనకు స్థాన భ్రంశం తప్పదనే అంశం ప్రచారంలో ఉంది. అయితే బీహార్ లో నితీష్ కుమార్ కు గల రికార్డు నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం జరగలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటి నుంచీ పార్టీ వర్గాలలో ముఖ్యమంత్రి పదవి కాషాయం పార్టీ నేతకే దక్కాలనే భావన నలుగుతోంది. ప్రధాని మోదీ మాటకు కట్టుబడి బహిరంగ ప్రకటనలు చేయకుండా పార్టీ వర్గాలు సర్దుకున్నాయి. రాజ్యసభ స్థానానికి నితీష్ కుమార్ నామినేషన్ కోసం సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని జేడీ(యు) వర్గాలు తెలిపాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం అయ్యాయి. ముఖ్యమంత్రి సంతకం పెట్టడమే ఇక తరువాయి. మార్చి 5న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 1న నితీష్ కుమార్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. మార్చి 16 తర్వాత సీఎం పదవికి నితీష్ రాజీనామా రాజ్యసభ ఎన్నికలు మార్చి 16వ తేదీన జరుగనున్నాయి. అప్పటివరకూ ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తేదీ తర్వాత నితీష్ పదవి నుంచి వైదొలగవచ్చు. ఆయన రాజ్యసభకు వెళ్తే.. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణమాలు జరిగే అవకాశం ఉంది. జేడీ(యు) శిబిరంలో కలకలం ఈ పరిణామాల పట్ల జనతా దళ్ (యునైటెడ్ ) సమావేశంలో కలకలం చెలరేగింది. సీనియన్ నాయకుడు, మంత్రి విజేంద్ర ప్రసాద్ యాదవ్ సీఎంను కల్సి చర్చలు జరిపారు. మరో మంత్రి అశోక్ చౌదరి కూడా సిఎంని కలిశారు. అదే సమయంలో జేడీ(యు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా నితీష్ కుమార్ అధికార నివాసానికి చేరుకున్నారు. వేగంగా జరుగుతున్న పరిణామాల పార్టీలో సంచలనంగా మారాయి. రానున్న రాజ్యసభ నామినేషన్ల చుట్టూ చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం ఛాన్స్ బీహార్ భవిష్యత్ ముఖ్యమంత్రి పై ఇప్పటికే సమాంతర చర్చలు మొదలయ్యాయి. బీజేపీ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. అదే సమయంలో నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టవచ్చునని జేడీ(యు) వర్గాలు చెబుతున్నాయి. ఆయనను డిప్యూటీ సీఎం చేయవచ్చుననే ఊహాగానాలు ఉన్నా, అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.
గురువారం రాశి ఫలాలు (05-03-2026)
మేషం కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపార కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్వల్ప ధనలాభం సూచనలు ఉన్నవి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. వృషభం ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. మిధునం నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. పాత ఋణాల తీర్చగలుగుతారు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నూతన భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహం ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాల అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యవిషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. కన్య నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు అనుకూల ఫలితాన్నిస్తాయి. స్థిరాస్థి క్రయవిక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. తుల చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణప్రయత్నాలు కలసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. వృశ్చికం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమకు అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామ్య సలహాలు కొన్ని విషయాలలో కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ధనస్సు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు. మకరం భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతారు. క్రయవిక్రయాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ సంబంధిత చర్చలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. కుంభం ధన పరమైన ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి. కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. చాలా కాలంగా వేచిచూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. మీనం చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి
. టెక్నికల్ కమిటీని నియమించండి. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు డీపీఆర్లు. అధికారులకు మంత్రుల ఆదేశం విశాలాంధ్ర – హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పై మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ శాఖ […] The post ‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి appeared first on Visalaandhra .
ఎస్హెచ్జీ మహిళల ఆరోగ్య వివరాల సేకరణ
. 46 లక్షల మందికి 30 రకాల పరీక్షలు. ఈ నెల 8 నుంచి ప్రారంభం. 4 దశల్లో ఆరోగ్యశాఖ కార్యక్రమాలు విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాక సంఘాల మహిళల ఆరోగ్య వివరాలు (హెల్త్ ప్రొఫైల్) నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్లో మంత్రి […] The post ఎస్హెచ్జీ మహిళల ఆరోగ్య వివరాల సేకరణ appeared first on Visalaandhra .
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు […] The post సీఎం నితీశ్ రాజీనామా? appeared first on Visalaandhra .
జిమ్ లో వర్కౌట్ చేస్తూ వ్యక్తి మృతి
జిమ్ లో వర్కౌట్ చేస్తూ వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వ్యాయామం చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
న్యూదిల్లీ: ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. చరిత్రలో మొదటిసారిగా రూపాయి విలువ 92 మార్కును దాటి పడిపోయింది. యుద్ధం కారణంగా ముడి […] The post రూపాయి విలువ మరింత క్షీణత appeared first on Visalaandhra .
ఇరాన్ ప్రతిదాడులు తీవ్రతరం . గల్ఫ్ లక్ష్యాలపైకి క్షిపణులు, డ్రోన్లు. లెబనాన్లో ఐడీఎఫ్ భూతల దాడులు. ఐదు రోజుల్లో 1,045 మంది మృతి. వారంలోగా ఇరాన్ గగనతలం స్వాధీనం: అమెరికా. ఒకట్రెండు వారాల్లో లక్ష్యాలన్నీ ధ్వంసం: ఇజ్రాయిల్ తెహ్రాన్: క్షిపణలు, బాంబులతో పశ్చిమాసియా మండుతోంది.అటు అమెరికాఇజ్రాయిల్, ఇటు ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరస్పర దాడులతో భీతావహం సష్టిస్తున్నాయి. అమెరికాఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం […] The post పోరు…హోరు appeared first on Visalaandhra .
తెహ్రాన్: అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఇప్ప్పుడు పాలనా పగ్గాలను ఖామేనీ కుమారుడు ముజ్తబా హుస్సేనీ ఖామేనీకి అప్పగించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ పదవి నిర్వహించిన అనుభవమేదీ లేని ముజ్తబా… త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఖామేనీ రెండో కుమారుడే ముజ్తబా. 1969లో ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ముజ్తబా పదేళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రెజా […] The post ముజ్తబాకు పగ్గాలు! appeared first on Visalaandhra .
. లడ్డూ అంశంపై మాటల యుద్ధం. ఆవేశంతో ఊగిపోయిన అధికార, ప్రతిపక్ష సభ్యులు. జగన్పై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు వైసీపీ నిరసన. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశంపై శాసన మండలి దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కల్తీ నెయ్యి పాపం మీదంటే మీదే నంటూ పరస్పర ఆరోపణలతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక దశలో చైర్మనం […] The post మండలి ఉద్రిక్తం appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసన మండలి చైర్మన్పై అవిశ్వాస అస్త్రానికి కూటమి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అదీ వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలతోనే వ్యూహాత్మకంగా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు లీక్లు వస్తున్నాయి. తాజాగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ పత్రికలోను ఈ విషయం వెల్లడి కావడంతో ఆ ప్రచారానికి కాస్త బలం చేకూరుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీతకు ఆ పార్టీ […] The post మండలి చైర్మన్పైఅవిశ్వాసం? appeared first on Visalaandhra .
స్పీకర్ నుంచి నోటీసు రాలేదు: ఎంఎల్ఎ దానం
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నుంచి తనకు ఎటువంటి నోటీసు రాలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బుధవారం పీపుల్స్ ప్లాజాలో జరిగిన హోళి వేడుకల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హుషారుగా నృత్యం చేశారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అనర్హత పిటిషన్కు సంబంధించి గురువారం (5)న హాజరుకావాల్సిందిగా స్పీకర్ నుంచి నోటీసు ఏదీ రాలేదన్నారు. గురువారం దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇరుపక్షాల (పిటిషనర్, రెస్పాడెంట్ల) వాదనలు విననున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే దానం తనకు నోటీసు రాలేదని చెప్పారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ నెల 10వ తేదీలోగా పెండింగ్లో ఉన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వనున్నారన్న ప్రచారం జరుగుతున్నది. స్పీకర్పై దాఖలైన ధిక్కరణ పిటిషన్పై సుప్రీం కోర్టు ఈ నెల 12న సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు విచారణకు రానున్నది. ధిక్కరణ పిటిషన్పై విచారణకు ముందే స్పీకర్ తీర్పు వెలువరించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
ఎవరి భయంతోనో తప్ప్పును సమర్థించం: పెడ్రో శాంచెజ్ మాడ్రిడ్: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై దాడులకు దిగడాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్రంగా ఖండించారు. లక్షల మంది జీవితాలు పణంగా ‘రష్యన్ రోలెట’ (ప్రమాదకర ఆట)ను ఇజ్రాయిల్, అమెరికా ఆడుతోందని విమర్శించారు. యుద్ధానికి మద్దతు ఇవ్వలేదన్న కారణంగా స్పెయిన్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడాన్ని పెడ్రో బుధవారం ఆక్షేపించారు. యుద్ధం వద్దు అంటూ మరోసారి స్పష్టంచేశారు. యుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకమని, ఎవరో […] The post యుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకం appeared first on Visalaandhra .
నేపాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
. బరిలో 67 పార్టీలు… 3,405 మంది అభ్యర్థులు. ఝాపా 5, సర్లాహి 4, రుకుం 1లో రసవత్తర పోటీ. నిర్భయంగా ఓటేయండి: ప్రధాని ఖార్కి ఖాట్మండు: నేపాల్ ఎన్నికలకు సర్వసన్నద్ధమైంది. బుధవారం పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. జెన్ జీ ఆందోళనలు రాజకీయంగా ప్రకంకనల నేపథ్యంలో తాజా ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 2006లో పౌర యుద్ధం ముగిసిన తర్వాత జరగబోయే కీలక ఎన్నికలుగా ఇవి నిలిచాయి. 2025 సెప్టెంబరులో జెన్ జీ ఆందోళనల్లో […] The post నేపాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం appeared first on Visalaandhra .
మూడు రోజుల విషాదం తర్వాతే ఖననం – అధినేతకు తెహ్రాన్ కన్నీటి వీడ్కోలు తెహ్రాన్: ఇరాన్ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీ (86) అంత్యక్రియలు పవిత్ర నగరం మషాద్లో జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. 36 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఖామేనీ… అమెరికాఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన పుట్టినది మషాద్లోనే. ఇది ఇరాన్లో రెండవ అతిపెద్ద నగరం. ఖామేనీ తండ్రి అంత్యక్రియలు కూడా అక్కడి ఇమామ్ రెజా పవిత్ర […] The post మషాద్లో ఖామేనీ అంత్యక్రియలు appeared first on Visalaandhra .
100 మందికిపైగా గల్లంతు?శ్రీలంక తీరంలో ఘటనకొలంబో: పశ్చిమాసియా అట్టుడికిపోతున్న వేళ శ్రీలంక తీరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించినట్లు శ్రీలంక తెలిపింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురికి అత్యవసర చికిత్స అవసరమైనట్లు వెల్లడించింది. ‘గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ‘ఐఆరఐఎస్ దేనా’ అనే ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందింది. సహాయక చర్యల […] The post ఇరాన్ యుద్ధ నౌక మునక appeared first on Visalaandhra .
పాక్ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర
ఇజ్రాయిల్, అఫ్గాన్, ఇరాన్, భారత్పై ఖాజా ఆసిఫ్ ఆరోపణలుఇస్లామాబాద్: పాకిస్థాన్ సరిహద్దుల వరకు తమ పట్టు పెంచుకునేలా ఇజ్రాయిల్ కుట్రచేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఆరోపించారు. ఇరాన్పై యుద్ధం వెనుక ఉద్దేశం ఇదేనన్నారు. తమ దేశాన్ని సామంత రాజ్యంగా మార్చే ఇజ్రాయిల్ కుట్రలో అఫ్గాన్, ఇరాన్, భారత్ భాగస్వామ్యం ఉన్నట్లు ఆయన ఎక్స్ మాధ్యమంగా ఆరోపణలు చేశారు. ఒక్కటిగా ఉండాలని… రాజకీయ, మతపరమైన విభేదాలను విడనాడి, విదేశీ శుత్రువుల కుట్రలను తిప్పికొట్టాలని పాకిస్థానీయులకు ఖాజా […] The post పాక్ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర appeared first on Visalaandhra .
అలెన్ విధ్వంసం.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో విధ్యంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సులతో వంద పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలెన్ తోపాటు మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కూడా మెరుపులు మెరిపించాడు. అతను 33 బంతులు ఎదుర్కొని 58 పరుగులతో రాణించాడు. దీంతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. దీంతో కివీస్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ అర్ద శతకంతో చెలరేగాడు. 30 బంతుల్లోనే 5 భారీ సిక్సులు, 2 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రెవిస్ 34 పరుగులు, స్టబ్స్ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్కాంచి, హెన్రీ తలో రెండు వికెట్లు తీయగా.. నీషమ్, ఫెర్గూసన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీలంక
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా భారత కరెన్సీ రూపాయి విలువ భారీగా క్షీణించింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ట స్థాయి 92.30 పడిపోయింది. తొలిసారిగా 92 మార్క్కు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో పెరుగుతున్న ఆందోళనలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు బ్యారెల్కు 85 డాలర్లకు చేరడం వల్ల భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 92 కు పడిపోయింది. గతంలో జనవరిలో కనిష్ట స్థాయి 91.98 గా ఉంది. ఈ సంవత్సరం రూపాయి విలువ ఇప్పటికే 2 శాతానికి పైగా క్షీణించింది. యుద్ధ పరిస్థితులు కొనసాగితే రూపాయి ఒత్తిడిలోనే ఉంటుందని నిపుణులు తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గుచూపడంతో రూపాయి బలహీనపడింది. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. గత నెలలో అమెరికా, -భారత్ వాణిజ్య ఒప్పందం తర్వాత వచ్చిన ఊరట తాత్కాలికంగా ముగిసింది. విదేశాలకు చదువు, ప్రయాణ ఖర్చులు పెరగవచ్చు. దిగుమతి ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదయ్యే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఆర్బిఐ (భారతీ రిజర్వ్ బ్యాంక్) జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
చెన్నై: తమిళ నటుడు విజయ్ రాజకీయపార్టీని స్థాపించి సినిమాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. తన ఆఖరి చిత్రం జన నాయకుడు విడుదలకు ఇంకా నోచుకోలేదు కానీ ఈ వ్యవధిలో మాత్రం విజయ్ కి ఊహించని సమస్యలు వచ్చాయి. తన భార్య సంగీత… విజయ్ విడాకులు కావాలని కోరుతూ కోర్టు మెట్లుఎక్కడం షాకింగ్ గా మారింది. అయితే ఈ సమస్యపై మరో షాకింగ్ రూమర్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. తమ సమస్యని విజయ్ […] The post సంగీతతో రాజీకి విజయ్ సిద్ధం ? appeared first on Visalaandhra .
Photos: Virosh Wedding Reception
The post Photos: Virosh Wedding Reception appeared first on Telugu360 .
హైదరాబాద్: గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా హీరోయిన్స్ నయనతార, కియార అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్. కన్నడ, ఇంగ్లీష్ లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేసేందుకు మేకర్స్ఏ ర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు అభిమానులకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే…. మేకర్స్ ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. తాము ఎంతో […] The post ‘టాక్సిక్’ విడుదల వాయిదా appeared first on Visalaandhra .
తెలంగాణ విశ్వవిద్యాలయంలో మద్యం మత్తులో జూనియర్ పై సీనియర్స్ దాడి
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గల తెలంగాణ విశ్వవిద్యాలయం లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ కు ఘర్షణ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం హోలీ సంబరాల్లో భాగంగా జూనియర్స్ వర్సెస్ సీనియర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. సీనియర్ లు మధ్యం తాగి వచ్చి ఓ జూనియర్ పై దాడికి దిగారు. దీంతో రెండు రోజులుగా కళాశాలలో సీనియర్ వర్సెస్ జూనియర్లుగా విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. హిస్టరీ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థి విక్కీ, హిస్టరీ విభాగంకు చెందిన జూనియర్ రాజును వాటర్ జగ్గు తో దాడి చేశారు. దింతో గాయాల పాలైన రాజు ను చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టగా వసతి గృహం వద్దకు చేరుకున్న ఎస్ఐ ఆంజనేయులు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసిle వినలేదు. ఈ విషయమై దాడికి ప్రయత్నం చేసిన 8 మంది విద్యార్ధులను ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తాత్కాలిక సస్పెండ్ చేశారు.
ఆల్టైమ్ రికార్డ్ సృష్టించిన ‘పెద్ది’ పాట
హైదరాబాద్ : రామ్చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ద’ విడుదల కాకముందే సోషల్ మీడియాలో రికార్డుల వేట మొదలు పెట్టింది. ఆస్కార్ విజేతఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మోటివేషనల్ సాంగ్ ‘రై రై రా రా’ సౌత్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లోనేఅత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియో సాంగ్గా నిలిచింది. కేవలం తెలుగు వెర్షన్లోనే ఈ పాట 29.22 మిలియన్ల వ్యూస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది.ఈ క్రమంలో […] The post ఆల్టైమ్ రికార్డ్ సృష్టించిన ‘పెద్ది’ పాట appeared first on Visalaandhra .
లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేములవాడ పట్టణంలో ఓ లాడ్జ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. జాతర గ్రౌండ్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఇది హత్యనా..? లేక ఆత్మహత్యనా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు ఎవరు...? ఎక్కడి నుండి వచ్చాడు.. అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇరాన్ సుప్రీంగా ఆయతుల్లా కుమారుడు?
దుబాయ్ : ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా, పరిపాలకునిగా ఆయన కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీని పరిగణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో తన తండ్రి మృతి చెందక ముందు, యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఆయన ప్రభుత్వ పదవికి ఎంపిక కాలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్లో రహస్యమైన వ్యక్తిగా ఉన్న మొజ్తాబా శనివారం నుంచి బయటకు కనిపించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ వైమానిక దాడి సుప్రీం లీడర్ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని 86 ఏళ్ల తన తండ్రిని హత్య చేసింది. అంతేకాదు యువ ఖమైనీ భార్య జహ్రా హడ్డాద్అడెల్ను కూడా హత్య చేసింది. మొజ్తాబా ఖమేనీ సజీవంగానే ఉన్నట్టు నమ్ముతున్నారు. అమెరికాఇజ్రాయెల్ దాడుల కారణంగా అజ్ఞాతంలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఆయన ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేయలేదు. దైవ పరిపాలనగా ఇరాన్ పూర్వ వంశపారంపర్య రాజరికంపై విమర్శలు ఉన్నప్పటికీ మొజ్తాబా ఖమేనీ పేరు ప్రచారంలో కొనసాగుతోంది. మొజ్తాబా తండ్రి ఆయతుల్లా ఖమేనీ, భార్య జహ్రా హడ్దాద్ను అమరవీరులుగా ఇరాన్లో ప్రస్తుతిస్తున్నారు. 88 సీట్ల ఇరాన్ అసెంబ్లీలో వృధ్ధాప్య మతాధికారుల సంఖ్య పెరగడంతో ఖమేనీ వంశస్థుల సంఖ్య కూడా పెరిగింది. తదుపరి నాయకుడిని ఈ అసెంబ్లీయే ఎన్నుకుంటుంది. ఎవరైతే ఇరాన్ సుప్రీం అవుతారో వారు ఇప్పుడు యుద్దంలో ఇరాన్ మిలిటరీపై నియంత్రణ కలిగి ఉండటమే కాక, అణ్వాయుధ నిర్మాణానికి కావలసిన యురేనియం నిల్వలను కూడా పర్యవేక్షించవలసి ఉంటుంది. మొజ్తాబా 1969లో ఇరాన్ లోని మషాద్లో జన్మించారు. ఆయన పదేళ్ల వయసులో ఇరాన్లో 1979 లో ఇస్లామిక్ రివల్యూషన్ సాగింది. ఇరాన్లో షా మొహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా తన తండి ఆయతుల్లా ఖమేనీ ఉద్యమం సాగించారు. అలాంటి పరిస్థితుల్లో మొజ్తాబా పెరిగారు. షా సీక్రెట్ పోలీస్ “ఎస్ఎవిఎకె ” తమ ఇంటిపై దాడి చేసిన సమయంలో మొజ్తాబా,మిగతా కుటుంబీకులు తమ తండ్రి ఇంటిని విడిచి ఎక్కడికో వెళ్లారని సీక్రెట్ పోలీసులకు చెప్పారు. షా ప్రభుత్వం పతనమైన తరువాత ఖమేనీ కుటుంబం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకుంది. 1989 లో ఆయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయిన తరువాత తండ్రితో పాటు మొజ్తాబా అధికారిక కార్యకలాపాల్లోనే కాకుండా వాణిజ్యపరమైన ఆస్తులను విస్తరింప చేశారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా సైనికులకు అండగా ఉండి తీవ్రవాదుల మధ్య విశ్వసనీయతను పొందారు. చాలా కాలంగా పాలనలో శక్తివంతమైన వ్యక్తిగా, మతాధికారులు, రివల్యూషనరీ గార్డ్కమాండర్ల నెట్వర్క్ నిర్వహించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019లో అమెరికా ట్రజరీ మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. అతను ప్రభుత్వంలో ఎన్నుకోబడక పోయినా, అధికారిక హోదాలో తన తండ్రి తరఫున అధికారం చెలాయించాడని ఆరోపించింది. ఖమేనీ కుటుంబీకులు అనేక మంది హత్యకు గురైన సంఘర్షణ కాలంలో నిలబడిన నాయకునిగా మొజ్తాబా ఇమేజ్ దృఢ పడింది.
ఆశ చూపాడు,అందినకాడికి దోచాడు దమ్మపేట, ఆంధ్రప్రభ: గతంలో చిట్ ఫండ్ కంపెనీలో సభ్యులుగా
ఇంగ్లాండ్తో సెమీస్ పోరుకు టీమిండియా సిద్ధం
. టీ20 ప్రపంచకప్లో వరుసగా మూడోసారి సెమీస్ లో తలపడనున్న ఇరు జట్లు. నేడు వాంఖడే వేదికగా జరగనున్న మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి ముంబై : టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లాండ్ తలపడనుంది. క్రికెట్ని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్సె మీఫైనల్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ […] The post ఇంగ్లాండ్తో సెమీస్ పోరుకు టీమిండియా సిద్ధం appeared first on Visalaandhra .
Breaking : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు
వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్లో 1040 మంది మృతి
దుబాయ్ ః అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా సాగిస్తున్న దాడులలో ఇరాన్లో మృతుల సంఖ్య బుధవారం కనీసం 1045 కు చేరుకుంది. పలు చోట్ల శిథిలాలు, రక్తసిక్త వీధులు కన్పిస్తున్నాయి. మృతుల సంఖ్యను ఇరాన్ ప్రభుత్వ పరిధిలోని అధికారిక సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది. రెండు దేశాల సైన్యం నివాసిత ప్రాంతాలపైనే నేరుగా దాడులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇరాన్కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ మార్టియర్స్, అండ్ వెటర్న్ సంస్థ ఎప్పటికప్పుడు బాధితులు, మృతుల సంఖ్య ఇతర వివరాలను అంతర్జాతీయ మీడియాకు వెలువరిస్తోంది. పలు చోట్ల సామూహిక ఖననాలకు ఏర్పాట్లు చేశారు. ఇక ఇరాన్ జరిపిన దాడులలో ఇప్పటివరకూ ఇజ్రాయెల్లో 11 మంది చనిపోయారు. కోన్ని ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగింది. కువైట్లో బుధవారం ఇరాన్ దాడుల శకలాలు తగిలి 11 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఇంతకు ముందు ఇక్కడ ఒక్కరు చనిపోయారు. యుఎఇలో ముగ్గురు, బహరైన్లో ఒక్కరు ఇరాన్ దాడులలో మృతి చెందారు. ఇక కువైట్లో ఇరాన్ దాడులలో ఇప్పటికే ఆరుగురు అమెరికా ఆర్మీ రిజర్వ్ సైనికులు చనిపోయారు.

33 C