SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

39    C
...

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు…

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:29 pm

AP |సీఎం చంద్ర‌బాబు నాయుడు

AP | సీఎం చంద్ర‌బాబు నాయుడు AP | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:26 pm

Narendra Modi : మోదీ అనుకున్నదే జరిగిందా? అయితే ఎంత వరకూ లాభం?

లోక్ సభలో కేంద్ర ప్రభుత్వానికి తొలిసారి కోలుకోలేని దెబ్బ తగిలింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 1:25 pm

టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం

టీసీఎస్ లో లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 1:25 pm

మే డే ఉత్సవాలు జయప్రదం చేయాలి

మే డే ఉత్సవాలు జయప్రదం చేయాలి నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : మే 1న

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:24 pm

ఎన్నికల కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు భారత ఎన్నికల సంఘం నవీకరించిన ఓటర్ల జాబితాలోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, […] The post ఎన్నికల కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 1:22 pm

డీఆర్‌డీఓ విజయలక్ష్మికి ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రం కడెంలోని రైతు వేదికలో ఇటీవల ప్రభుత్వ

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:19 pm

కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవ్.. జాగ్రత్త

రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట బీజేపీ నిరసనలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 1:17 pm

గురుకుల హైస్కూల్‌లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

గురుకుల హైస్కూల్‌లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పెడన – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:17 pm

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ స్పందన

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:16 pm

అంగన్వాడీ పిల్లలతో పోషణ అభియాన్ కార్యక్రమం

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప కేంద్రంలో అంగన్వాడీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:13 pm

అంబటి రాంబాబు నిరాహారదీక్ష..

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా, నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో అంబటి నేడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై నిప్పులు చెరిగారు. ఁచంద్రబాబును దూషించాననే సాకుతో నన్ను అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో ఉంచారు.. మరి నా ఇంటిపై దాడి […] The post అంబటి రాంబాబు నిరాహారదీక్ష.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 1:12 pm

Problems |గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త‌

Problems | గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త‌ Problems | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:12 pm

పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి…

పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి… – నలుగురు మహిళలు సహా ఆరుగురి అరెస్ట్

ప్రభ న్యూస్ 18 Apr 2026 1:12 pm

Hyderabad: రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన బీజేపీ

రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ మహిళా నేతల యత్నించారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 1:12 pm

Vangaveeti Radha Likely to Get MLC Post

Leaders within the ruling alliance are now actively seeking the positions that were promised to them earlier. With nearly two years of governance completed, many are reminding party leadership about commitments made before elections. The Telugu Desam Party has already finalized its internal structure. Several leaders at the mandal level have been accommodated in key […] The post Vangaveeti Radha Likely to Get MLC Post appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 1:07 pm

Official: ‘హాయ్ నాన్న’డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చి పవర్‌ఫుల్ లైనప్‌తో ముందుకు దూసుకుపోతున్నాడు. రౌడీ జనార్ధన మరియు రణబాలి వంటి బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విజయ్ నుండి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ వెలువడింది. తన డెబ్యూ చిత్రం ‘హాయ్ నాన్న’తోనే మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు శౌర్యువ్ మరోసారి విజయ్‌తో కలిసి కొత్త సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని ఓ స్ట్రైకింగ్ పోస్టర్ ద్వారా అఫీషియల్‌గా రివీల్ […] The post Official: ‘హాయ్ నాన్న’ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 18 Apr 2026 1:00 pm

ఫ్యాక్ట్ చెక్: రైలు ప్రమాదం నుండి చిన్నారిని ఆవు కాపాడిన ఘటనను నిజమైనదిగా ప్రచారం చేస్తున్నారు

వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు. రైలు పట్టాలపై ప్రమాదం అంచున ఉన్న చిన్నారిని ఆవు కాపాడిన ఘటనను నిజమైనదిగా ప్రచారం చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 12:57 pm

కేంద్రప్రభుత్వానికి ఇది మొదటి ఎదురు దెబ్బ: ప్రియాంక గాంధీ

ఢిల్లీ: ఇది డీలిమిటేషన్ కోసం తీసుకొచ్చిన బిల్లు అని మహిళల హక్కుల కోసం కాదని లోక్‌సభ ఎంపి ప్రియాంకగాంధీ తెలిపారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించామని అన్నారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచిందని, 2023లో ఆమోదం పొందిన బిల్లు మళ్లీ తీసుకొచ్చి సభలో పెట్టండని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రియాంకగాంధీ మీడియాతో మాట్లాడారు.  కేంద్రప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టించకూడదని, మహిళలకు వెంటనే తమ హక్కులను కల్పించాలని సూచించారు. ప్రభుత్వానికి చీకటిరోజు..తొలిసారి తీవ్ర కుదుపునకు లోనైందని, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కేంద్రం గమనించాలని ఎద్దేవా చేశారు. భారత్ మేల్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మలేకపోతుందని, కేంద్రప్రభుత్వంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దని, 543 సీట్లలో నుంచే మహిళలకు 33శాతం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కేంద్రప్రభుత్వానికి ఇది మొదటి ఎదురు దెబ్బని విమర్శించారు. తమ మాటలు నమ్మాలని హోంమంత్రి అమిత్ షా పదేపదే చెప్తున్నా..ప్రజలు నమ్మడం లేదని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలన్న ప్రభుత్వ కుట్ర ఓడిపోయిందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా పడడంతో పార్లమెంట్‌ ముందుకు మూడు కీలక బిల్లులు కేంద్రం తెచ్చింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన కారణంగా.. అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో బిల్లు వీగిన పోయింది. డీలిమిటేషన్‌, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకోవడంతో మూడో రోజు ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు ముగిశాయి.

మన తెలంగాణ 18 Apr 2026 12:57 pm

హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించే హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం ప్రకటించారు. లెబనాన్ లో కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ తెరిచే ఉంటుందని, అన్ని దేశాల నౌకలు రాకపోకలు సాగించవచ్చని చెప్పారు. అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) నిర్దేశించిన మార్గంలోనే నౌకలు […] The post హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 12:56 pm

రీసైక్లింగ్ ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన సిఎం

హైదరాబాద్: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రిశ్ర‌మ‌) ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు, భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు క‌లుగుతుంద‌ని వివరించారు. కేంద్ర మంత్రి శ్రీ కుమార‌స్వామి, ఉక్కు శాఖ స‌హాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్ర‌తిపాద‌నల‌ను కేంద్ర మంత్రుల‌కు వివ‌రించారు.  తెలంగాణలో పాత వాహ‌నాల‌ స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌ను కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక‌త‌, భారీ ప‌రిశ్ర‌మ‌లు, పారిశ్రామిక ఉత్ప‌త్తికి ఉన్న అనుకూలత‌ల వ‌ల‌న దేశ పారిశ్రామిక ఉత్ప‌త్తి లక్ష్యాలకు హైద‌రాబాద్ కేంద్రంగా నిల‌వ‌గ‌ల‌ద‌ని వివరించారు. హైదరాబాద్ లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని సిఎం కోరారు. అలాగే మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యం లేని నెట్ జీరో నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని పేర్కొన్నారు. ఆధునిక పరిశ్రమల‌కు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రులతో జరిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌నివాస‌రాజు, కేంద్ర ప్రాజెక్టుల స‌మ‌న్వ‌య ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 12:49 pm

ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు

క్షమాపణ చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరికప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ నోటీసులను పంపారు. ఇటీవల ప్రకాశ్ రాజ్ రామలక్ష్మణులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, అవి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచాయని నోటీసులో […] The post ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 12:44 pm

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి…

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి… ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామికి సీఎం

ప్రభ న్యూస్ 18 Apr 2026 12:30 pm

BRS |గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకున్న సంతోశ్‌ కుమార్‌

BRS | గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకున్న సంతోశ్‌ కుమార్‌ BRS

ప్రభ న్యూస్ 18 Apr 2026 12:29 pm

ప్రజాస్వామ్యం గెలిచింది : ప్రియాంక గాంధీ

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడతో ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రియాంక గాంధీ అన్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 12:29 pm

సీఎం రేవంత్‌కు ప్రియాంక గాంధీ అభినందనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై బీజేపీ విధానంలో ఉన్న లోపాలను

ప్రభ న్యూస్ 18 Apr 2026 12:26 pm

Jamili Elections : కేంద్ర ప్రభుత్వం ఆలోచన మారుతోందా? ఏం జరుగుతోంది?

జమిలి ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 12:24 pm

తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ

గంభీరావుపేట ఏప్రిల్ 18 (జనం సాక్షి):ఈనెల ఏప్రిల్ 25వ తేదీనాడు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత …

జనం సాక్షి 18 Apr 2026 12:24 pm

131 Constitutional |బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌ల అరెస్ట్‌

131 Constitutional | బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌ల అరెస్ట్‌ 131 Constitutional |

ప్రభ న్యూస్ 18 Apr 2026 12:22 pm

Venky and Anil Ravipudi Strikes the Best Deal

Successful director and Hit Machine Anil Ravipudi will direct Victory Venkatesh for the fifth time after F2, F3 and Sanrkanthiki Vastunnam. Venkatesh played a cameo in Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu. The pre-production work of the film is currently going on and the shoot commences in the last week of June. Zee Studios will […] The post Venky and Anil Ravipudi Strikes the Best Deal appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 12:21 pm

VDxShouryuv : Telugu cinema continues to go global

Actor Vijay Deverakonda has joined forces with director Shouryuv for an ambitious new project that aims to push into global cinema. The announcement came with a striking poster featuring Vijay walking confidently while holding four dogs on metal leashes, accompanied by a group symbolizing the film’s core technical team. Alongside this reveal, the makers released […] The post VDxShouryuv : Telugu cinema continues to go global appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 12:19 pm

రోడ్డుపై మురుగునీరు… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన

ప్రభ న్యూస్ 18 Apr 2026 12:17 pm

153 mobiles |చోరీకి గురైన 153 మొబైల్ ఫోన్ల రికవరీ

153 mobiles | చోరీకి గురైన 153 మొబైల్ ఫోన్ల రికవరీ 153

ప్రభ న్యూస్ 18 Apr 2026 12:16 pm

మద్దూర్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా

మద్దూర్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా మద్దూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వాలు పేదలందరికీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 12:12 pm

ఘనంగా బడిబాట కార్యక్రమం ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి ఈ ఓ

మెదక్ ఏప్రిల్ 18 (జనం సాక్షి)మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం కూచంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా …

జనం సాక్షి 18 Apr 2026 12:09 pm

నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను వదిలి పెట్టం: రాంచందర్

హైదరాబాద్: కాంగ్రెస్ వైఖరికి నిరసనగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చామని టిబిజెపి అధ్యక్షుడు రాంచదర్ తెలిపారు. తార్నాకలో పోలీసులు తనను హౌస్ అరెస్టు చేశారని అన్నారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందంటూ బిజెపి నిరసన చేసింది. సిఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ శ్రేణులు,నాయకులు రేవంత్ ఇంటిని ముట్టడిస్తారని, దేశంలో ఇంకా రాచరిక పాలన కావాలని కాంగ్రెస్ భావిస్తోందని రాంచందర్ విమర్శించారు. ముస్లిం సమాజానికి మేలు చేయాలని కాంగ్రెస్ డ్రామా ఆడుతోందని, నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను వదిలి పెట్టమని హెచ్చరించారు. దేశ ప్రజలు, తెలంగాణ సమాజం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని రాంచందర్ కోరారు.  

మన తెలంగాణ 18 Apr 2026 12:08 pm

HYD | 20మంది ప్ర‌యాణికులు సేఫ్‌

HYD | 20మంది ప్ర‌యాణికులు సేఫ్‌ HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 12:07 pm

పంట దగ్ధమైన రైతు కుటుంబాలకు పరామర్శ

కుంటాల, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో నష్టపోయిన

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:55 am

ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్!

శ్రీరాముడు మరియు రామాయణంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ కామెంట్స్‌కు వ్యతిరేకంగా అన్ని వైపుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, మెగా బ్రదర్ నాగబాబు కూడా తన స్పందన తెలిపారు. విశేషమేమిటంటే — నాగబాబు ప్రకాష్ రాజ్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో చాలా పదునైన కౌంటర్ పోస్ట్ చేశారు. “శ్రీరాముడు హిందువులకు కేవలం ఒక దైవం మాత్రమే కాదు, ఆయన ధర్మానికి […] The post ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 18 Apr 2026 11:46 am

Allu Arjun’s Intense Hardwork for Raaka

Raaka is the next big attempt of Allu Arjun after the Pushpa franchise. It has been one year since the shoot commenced and the film is half done. Atlee is the director and reports say that the film may release during December 2027. The first look poster created a sensation and there is a big […] The post Allu Arjun’s Intense Hardwork for Raaka appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 11:36 am

Hyderabad : జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్స్ కేసులో అసలు ఏం జరిగింది?

జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 11:35 am

మొక్కజొన్న, జొన్న రైతులకు న్యాయం చేయాలి

మొక్కజొన్న, జొన్న రైతులకు న్యాయం చేయాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : మొక్కజొన్న, జొన్న

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:26 am

అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు ఫుట్‌పాత్ ఆక్రమణలు కూల్చివేత

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు అక్రమంగా నిర్మించిన ఫుట్‌పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రజల నుండి స్పందన రాకపోవడంతో ఈరోజు టౌన్ ప్లానింగ్ ఎసిపి శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు నిర్వహించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరించారు.

మన తెలంగాణ 18 Apr 2026 11:25 am

ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా

నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా వేశారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 11:24 am

KTR |ఈ నెల 20న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌

KTR | ఈ నెల 20న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ KTR |

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:20 am

Loksabha : ఉభయ సభలు నిరవధిక వాయిదా

లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 11:18 am

చెన్నూరులో రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం

చెన్నూరు, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాల్టీ పరిధిలోని మెయిన్ రోడ్డును

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:18 am

బ్రిటన్ పార్లమెంట్ లో మాజీ ఎంపి సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం

హౌస్ ఆఫ్ లార్డ్స్ లో గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందజేత వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్ క్లేవ్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పై ప్రశంసల వర్షం లండన్ : హరిత ఉద్యమాన్ని ఓ బాధ్యతగా భావించి ఆ దిశగా లక్షలాది మంది మొక్కలు నాటేలా ప్రభావితం చేసిన బిఆర్ఎస్ నేత,  రాజ్యసభ మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కు బ్రిటన్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం దక్కింది. పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడిన వారి కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో సంతోష్ కుమార్ కు అందజేశారు. శుక్రవారం (2026 ఏప్రిల్ 17న) హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగిన ప్రపంచ వాతావరణ సంరక్షకుల సదస్సు (వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్ క్లేవ్) లో ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. ఎంఆర్ నిక్ న్యూలాండ్ ఎస్నార్ వైస్ ప్రెసిడెంట్ యునెస్కో, బ్రిటిష్ పార్లమెంట్ సీనియర్ సలహాదారు డేవిడ్ తాంప్సన్, నికెల్ ఎడ్విన్ అడ్వైజర్ టు కౌంటీ కౌన్సిల్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ పలువురు ముఖ్య బ్రిటిష్ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కాన్ క్లేవ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ లార్డ్ష్ ప్రతినిధులు .. సంతోష్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమానికి కితాబునిచ్చారు. లక్షలాది మంది పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టేలా స్ఫూర్తినిచ్చారంటూ శ్లాఘించారు.   పచ్చటి మొక్కలతోనే భవిష్యత్తంటూ.. ఇగ్నైటింగ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులైన సంతోష్ కుమార్ పచ్చటి మొక్కలతోనే అందమైన భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎంపి సంతోష్ కుమార్ భావించారు. తెలంగాణలో హరితహారం ఇచ్చిన స్ఫూర్తితో వసుధైక కుటుంబం నినాదంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం నడిపారు. ఇందులో భాగంగానే.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు లక్షలాది మంది పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. తెలంగాణలో పలుచోట్ల చిట్టడవులు పచ్చగా కళకళలాడేలా చేయగలిగగారు.పర్యావరణ సంరక్షణలో సంతోష్ కుమార్ కృషిని గుర్తించిన వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్ క్లేవ్ .. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందజేసింది.   సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది ... హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఈ అరుదైన పురస్కారం దక్కినందుకు నిజంగా గర్వంగా ఉందని మాజీ ఎంపి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన ఒక్కడి ఘనతేనని భావించడం లేదని, తాము చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలో లక్షలాది మంది పాలు పంచుకోవడం వల్లే తనకు ఈ పురస్కారం దక్కిందన్నారు. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారమే గ్రీన్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తి గా నిలిచిందని తెలియజేశారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో 280 కోట్ల మొక్కలు నాటడం చరిత్రలోనే ఓ మైలు రాయి అని, పర్యావరణ సమతుల్యత కోసం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం అని ప్రశంసించారు.  ప్రకృతి హితం కోసం హరితహారం తమకు ఓ సంకల్పాన్ని అందించిందని, అందులోనుంచే గ్రీన్ ఇండియా చాలెంజ్ పుట్టిందని, ఆ ఉద్యమంలో భాగంగానే గ్రామస్థాయి నుంచి కాస్మొపాలిటన్ నగరాల వరకు లక్షలాది మంది మొక్కలు నాటారని సంతోష్ కుమార్ ప్రశంసించారు. హరిత ధరిత్రి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలనే భావనను గ్రీన్ ఇండియా చాలెంజ్ కలిగించిందని, లక్షలాది మైండ్ సెట్ మార్చగలిగిందన్నారు. ఈ పురస్కారం మరిన్ని బాధ్యతలను గుర్తు చేసిందని తెలిపారు. భవిష్యత్ తరాలను హరితమయం చేసే దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా ఈ అవార్డు స్ఫూర్తినిచ్చిందని సంతోష్ కుమార్ వివరించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 11:14 am

2వ వార్డులో సమస్యలపై మున్సిపల్ చైర్మన్ సమీక్ష

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 2వ

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:14 am

కొమ్మలపాటి శ్రీధర్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం..

కొమ్మలపాటి శ్రీధర్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మాజీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:13 am

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రత

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:11 am

Indian Cricket : యంగ్ ఇండియాతో ఐర్లాండ్ టూర్ లో ప్రయోగం

ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించిన వారికి బీసీసీఐ టీం ఇండియాలో స్థానం కల్పించేందుకు సిద్ధమయింది.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 11:10 am

వెంకటేశ్వర్లుకు బ్రాంజ్ డిస్క్ అవార్డ్ రావడం పట్ల హర్షం

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ ఫైర్ స్టేషన్‌లో పనిచేస్తున్న జుట్టుకొండ వెంకటేశ్వర్లుకు దేశ

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:05 am

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష టన్నుల చెత్తతో దుర్గంధం భరించాం.!

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష టన్నుల చెత్తతో దుర్గంధం భరించాం.! మచిలీపట్నం –

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:02 am

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరిన పెరుగు పంచాయతీ... విచిత్ర దంపతులు

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య పెరుగు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. బక్కగా సన్నగా ఉన్నావని పెరుగు తింటే లావుగా అవుతావని భార్యను పలుమార్లు వేధించడంతో పాటు పెరుగు తిన్నాలని భర్త ఒత్తిడి తీసుకొచ్చాడు. పాల పదార్థాలు తనకు పడవని భార్య చెప్పడంతో దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో తన భార్య కనిపించడంలేదని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు చేశాడు. 

మన తెలంగాణ 18 Apr 2026 10:48 am

వలస కార్మికులపై యుద్ధప్రభావం

పశ్చిమాసియా లోని బహ్రయిన్, కువాయిట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లోని భారతీయ వలస కార్మికులు ఇరాన్ అమెరికా యుద్ధ బీభత్సం వల్ల ఉపాధి కోల్పోయి దిక్కుతోచక స్వదేశానికి తిరిగి తరలి వస్తున్నారు. గత మార్చి నుంచి తాము పనిచేస్తున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 3,75,000 మంది వలస కార్మికులు తిరిగి స్వదేశానికి తరలి వచ్చేశారు. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల భారతీయ వలస కార్మికుల నుంచి ఏటా భారత్‌కు 45 బిలియన్ డాలర్లు వరకు చెల్లింపులు జరిగేవి. అంటే భారత్ లోని అంతర్గత చెల్లింపుల వెల్లువలో దాదాపు సగం.ఈ నిధులు భారత వాణిజ్యంలో గణనీయంగా లోటును తీర్చేవిగా ఉంటున్నాయి. అయితే యుద్ధం నుంచి ఈ పరిస్థితి మారిపోయింది. వలస కార్మికుల నుంచి స్వదేశానికి నిధులు రావడం ఆగిపోయింది. విదేశాల్లో ఆర్థిక మాంద్యం, ఉపాధి కోల్పోవడం వల్ల కార్మికులు డబ్బు పంపలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని ఒక విధంగా ‘విదేశీ మారక ద్రవ్య సంపీడనం’ అని వ్యవహరిస్తున్నారు. డబ్బు రాకపోవడంతో స్వదేశం భారత్‌లో ఉన్నవారు ఉపాధి కోసం వెదుక్కుంటున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న డబ్బుతో చాలీచాలని అవసరాలతో కొందరు సర్దుకుపోతున్నారు. ఇది కుటుంబాల జీవన ప్రమాణాలను, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, స్థానిక మార్కెట్లను కుదిపేసే నిజమైన ఆర్థిక సంక్షోభం. ఇది కేవలం ప్రభుత్వ సంక్షేమ గణాంకాలతో పరిష్కారమయ్యేది కాదు. కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గ్రామీణ జీవన ఆర్థిక పరిస్థితికి పెద్ద దెబ్బ. ఇంటి ఖర్చులకు, ఆస్తుల పెట్టుబడికి, పిల్లల చదువుకు తగిన ఆర్థికస్తోమతు లేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉండగా అసంఘటిత కార్మికులు తీవ్ర పేదరికం లోకి నెట్టబడుతున్నారు. ఎల్‌పిజి వినియోగంలో 60% భారత్ దిగుమతి పైనే ఆధారపడుతోంది. ఈ మొత్తంలో 90% హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. మార్చి మొదటి వారంలో ఈ రవాణా మార్గం తీవ్ర ఒత్తిళ్లకు గురి కావడంతో సరకుల రవాణాకు, సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అసంఘటిత కార్మికులు 40కోట్ల మంది కార్మికులు పేదరికం లోకి నెట్టబడ్డారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లు దాదాపు 30,000 వరకు పంపిణీ చేస్తున్నా నమోదిత గృహ కనెక్షన్ల ద్వారానే ఈ పంపిణీ సాగుతుండడంతో వివిధ పరిశ్రమల్లో పనిచేసే వలస కార్మికులకు ఇవి చేరడం లేదు. దేశ తయారీ రంగానికి సంబంధించి వస్త్ర పరిశ్రమలు, నిర్మాణ రంగంలో కోట్లాది మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమలో సింథటిక్ ఫైబర్స్, డైస్, కోటింగ్‌లను వినియోగిస్తుంటారు. వీటికి పెట్రో కెమికల్స్ ముడి సరకులు. దీనికి తోడు నాఫ్తా, ఎల్‌పిజి, నిల్వల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉత్పత్తుల ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. వస్త్రాల తయారీ యూనిట్లు ఏవైనా అధికారికంగా మూసివేసే ముందు కార్మికులు పనిచేసే షిఫ్టులను తగ్గిస్తుంటారు. ఉత్పత్తులు తగ్గడమే కాక, వేతనాలు సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఫ్యాక్టరీలు మూతపడటానికి దోహదం చేస్తుంది. వ్యవసాయం తరువాత వలస కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే రంగం నిర్మాణ రంగమే. పెట్రోల్ ఆధారిత మెటీరియల్ ధరలు పెరగడంతో ఇంధనానికి సంబంధించిన ఇతర సమస్యలు తలెత్తి నిర్మాణానికి కావలసినవేవీ అరుదైపోతున్నాయి. దాంతో నిర్మాణాలపై డెవలపర్లు పెట్టుబడులను తగ్గిస్తున్నారు. ఉదాహరణకు గుజరాత్‌లో నిర్మాణరంగం లోని కార్మికులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. పోర్టు పనుల్లో పనిచేసే వారు, రవాణా రంగంలో పనిచేసేవారు దాదాపు లక్ష మంది కార్మికులు పని దొరకుతుందో లేదో అన్న సందేహంతో హోళీ పండగ తరువాత పనుల్లోకి రావడం లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించి యూరియా ఉత్పత్తికి సహజవాయువు (నేచరల్ గ్యాస్) ఎంతో అవసరం. గ్యాస్ ధరలు పెరగడంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలతో సంబంధం లేకుండా యూరియా ఉత్పత్తుల ధరలు, ఆహార రిటైల్ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వలస కార్మికుడు ఒక పక్క ఎక్కువ ధరతో ఎల్‌పిజిని కొనుక్కోవలసి రావడం, మరో వైపు ఎక్కువ ధరలకు ఆహారాన్ని కొనుగోలు చేయడం తప్పడం లేదు. ఈ ఆర్థిక పరిణామాలు అర్బన్ లోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లోని పరిశ్రమలు కార్మికుల కొరతతో అల్లాడుతుండగా, తిరిగి స్వగ్రామాలకు తరలివస్తున్న వలస కార్మికులకు గ్రామాల్లో ఉపాధి దొరకడం లేదు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యమార్గాల ద్వారా హర్మూజ్ జలసంధి ద్వారా చిక్కుకుపోయిన ఎనిమిది ఎల్‌పిజి ట్యాంకర్లను దేశానికి రప్పించగలగడం కొంతవరకు మేలు బాట అవుతుంది. స్వదేశీ ఎల్‌పిజి ఉత్పత్తి దాదాపు 40% పెరిగింది. రిఫైనరీలు తమ సామర్థాన్ని మించి ఆపరేషన్ చేస్తున్నాయి. వీటన్నిటివల్ల దేశంలో తయారీ, నిర్మాణ రంగాల్లో సరఫరాకు ఆటంకాలు కొంతవరకు నివారించగలిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక మూడవ శ్రేణి ఆర్థిక పరిణామాలకు అంటే పరిశ్రమలు మూతపడడం, పెట్టుబడులు వేరే దేశానికి తరలిపోవడం, నైపుణ్యాలు తగ్గిపోవడం వంటి వ్యవస్థాగత మార్పుల్లో తగిన స్పందనలు రావలసి ఉందని భావిస్తున్నారు. వలస కార్మికులు తమ ఇళ్లకు తరలిపోయే పరిస్థితి రాకుండా పాలనా పరమైన విధానాలతో ఆయా పరిశ్రమలను పర్యవేక్షించడం తప్పనిసరి. వేతనాలకు గ్యారంటీ కల్పించడంతోపాటు పునరావాసం కల్పించడం వంటి చర్యలు తక్షణం చేపట్టవలసి ఉంది. 

మన తెలంగాణ 18 Apr 2026 10:43 am

దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్

తెహ్రాన్: ఉద్రిక్తితల నడుమ 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు అడ్డంకులన్నీ తొలగినట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్. దిగ్బంధనం కొనసాగితే హోర్మూజ్‌ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. […] The post దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 10:35 am

రెండో విడతలో తేలేనా?

అమెరికా ఇరాన్ మధ్య రెండవ విడత చర్చలంటూ జరిగితే ఈసారైనా ఒక రాజీ అంటూ జరిగేనా? ఎవరూ చెప్పలేరు. చర్చలు ఎపుడు జరగవచ్చు? ప్రస్తుత సూచనలను బట్టి బహుశా వచ్చే వారం. మొదటి చర్చలు 12న విఫల మైన తర్వాత రెండు రోజులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనంతట తానే తిరిగి చర్చలు ‘రెండు మూడు రోజుల్లో’, మళ్లీ ఇస్లామాబాద్‌లోనే అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇటువంటి తీవ్రమైన విషయమై దౌత్య చర్చలు మొదటి విడతలోనే ఒక కొలిక్కి రావటం జరగదు. ఒకోసారయితే నెలలు, సంవత్సరాల తరబడి చర్చలు సాగుతూనే ఉంటాయి. ప్రస్తుత యుద్ధంలో ఇమిడి ఉన్న అంశాలు చాలా తీవ్రమైనవి. వాటికి దశాబ్దాల నేపథ్యం ఉందన్నది తెలిసిందే. అమెరికా ఇరాన్‌ల మధ్య సమస్య ఇరాన్ ప్రధానమంత్రి మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికన్ సిఐఎ, బ్రిటిష్ ఎంఐ6 లు కలిసి అక్కడి చమురు కోసం 1953లో కూలదోయటం నుంచి మొదలై పలు కారణాలతో, పలు రూపాలలో నేటికీ కొనసాగుతున్నది. పశ్చిమాసియా అంతటా తనదే ఆధిపత్యం కావాలని, గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడాలని, స్వతంత్ర పాలస్తీ ఎన్నటికీ ఏర్పడరాదని, ఈ లక్షాల కోసం ఇరాన్ విచ్ఛన్నం కావాలని కోరుకునే ఇజ్రాయెల్ అందుకు తోడైంది. ఇరుపక్షాల వివాదానికి మధ్యలో ఇరాన్ అణుపరిశోధనల వివాదం వచ్చి చేరింది. ఈ మౌలికమైన చిక్కుముళ్లు తేలకుండా, తన స్వాతంత్య్రానికి, సార్వభౌమతకు, అంతర్జాతీయ హక్కుల పరిరక్షణలు భరోసా అన్నది ఇరాన్‌కు లభించకుండా ఎన్ని విడతల చర్చలు జరిగినా సమస్య తేలుతుందా అన్నది ప్రశ్న. ఎంతో కొంత కాలం కాల్పుల విరమణలు ఏవో కొన్ని రాజీలు కుదరటం వేరు, శాశ్వత మైన పరిష్కారాలు వేరు. మొదటి విడత చర్చలకు ముందు, ఇపుడు రెండవ విడత చర్చలు జరగనుండగా కూడా అమెరికా కోరుకుంటున్నది తాత్కాలిక విరామాలను మాత్రమే. అంతేతప్ప తన ఆధిపత్య ఆలోచనలను వదలుకునే లక్షణాలు చూపటం లేదు. ఇరాన్ మాత్రమే ప్రతిసారి కేవలం కాల్పుల విరమణలు కాదు, శాశ్వత పరిష్కారాలు అవసరమని, తాత్కాలికాల వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేస్తున్నది. ఈ పరిస్థితి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ ఉభయుల మధ్య వివాదంలో ఇతర అంశాలు ఎట్లున్నా, నాటో సైనిక కూటమిలో ఉక్రెయిన్ చేరకపోవటం తమకు అన్నిటికన్న ప్రధానమని, అందుకు ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, నాటో కూటమి, అమెరికా హామీ ఇస్తే అపుడు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, అట్లాగాక స్వల్పకాలిక యుద్ధ విరమణల వల్ల ఉపయోగమేమిటని రష్యా ప్రశ్నిస్తున్నది. ఇరాన్ వైఖరి కూడా అటువంటిదే. కాని అమెరికా ఆ జోలికి వెళ్లకుండా, తాత్కాలికమైన వేవో చేసి, ఇరాన్‌ను రకరకాలుగా ఒత్తిడి చేస్తూ, తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనజూస్తున్నది. ఇజ్రాయెల్ గురించి అయితే చెప్పనక్కర లేదు. వారికి అసలు తాత్కాలిక విరమణలు గాని, అరకొర పరిష్కారాలు గాని సరిపడవు. ఏదో విధంగా అమెరికాను ఉపయోగించుకుంటూ ఇరాన్‌ను ఛిన్నాభిన్నం చేయటమే వారికి కావలసింది. ఈ మాట ఇతరులు అంచనా వేయనక్కర లేకుండా స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తరచు బహిరంగంగానే అంటుంటారు. ఇది ఇటీవలనే రెండుసార్లు రుజువైంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు అమెరికా ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదరనుండగా దానిని భంగపరచేందుకు ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. మొన్న మొదటి విడత చర్చలకు గల షరతులలో లెబనాన్ పై కూడా దాడుల విరమణ అన్నది ఒకటి కాగా, అందుకు పాకిస్థాన్ ద్వారా మొదట ఒప్పుకుని అంతలోనే ఉల్లఘించటం మొదలుపెట్టారు. అదేమిటని ఇరాన్ ప్రశ్నించగా, కాల్పుల విరమణ ఒప్పందంలోకి లెబనాన్ రాదని ఇజ్రాయెల్ ఆ తర్వాత ట్రంప్ వాదించారు. అక్కడ కూడా విరమణ జరిగితే తప్ప తాము చర్చలలో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేయటంతో, లెబనాన్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని అపుడన్నారు. అవి ఎక్కడ తేలేదీ, తేలనిదీ చెప్పలేమన్నది అట్లుంచితే, మొత్తం మీద చర్చలు, పరిష్కారాలపట్ల ఎవరి వైఖరి ఏమిటన్నది ఈ వివరణలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదటి విడత వైఫల్యం తర్వాత కూడా అమెరికా అధ్యక్షుని తీరు ఎంతమాత్రం మారలేదు. ప్రతిసారీ ఒకవైపు చర్చలు, మధ్యలోనే దాడులు అనే కనీవినీ ఎరుగని ధూర్తమైన దౌత్యాన్ని ప్రదర్శించే ఆయన, ఈసారి చర్చలు ముగిసినాక రెండవసారి చర్చలని అంటూనే హర్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని ప్రకటించారు. ఆ విధంగా ఇరాన్ ఒత్తిడికి లోనై లొంగిపోతుందని తన అంచనా అనుకోవాలి. కాని ఏమైంది? ఒకవైపు ఇరాన్ ముప్పు, మరొక వైపు అమెరికా ముప్పుతో రవాణా స్తంభించిపోయింది. ఇరాన్ రేవుల నుంచి రవాణా తగ్గింది గాని పూర్తిగా ఆగలేదు. వారు ఇతర ప్రత్యామ్నాయాల కనిపెట్టారు. నిత్యావసర సరకుల రవాణా చైనాలోని శియాన్ నగరం నుంచి మధ్య ఆసియా మీదుగా రైలు మార్గంలో మొదలైంది. హర్మూజ్‌లో కుడి వైపున ఇరాన్ రేవులు పెద్దవి మూడు మాత్రమే ఉండగా, ఎడమ వైపున అమెరికా మిత్రులైన గల్ఫ్ రాజ్యాలవి తొమ్మిది ఉన్నాయి. అమెరికా దిగ్బంధంతో ఎవరికి ఎక్కువ నష్టం? అందుకే వెంటనే సౌదీ అరేబియా దిగ్భంధం తగదని అమెరికాను హెచ్చరించింది. విషయం అంతటితో ఆగలేదు. యుద్ధం మొదలైన తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మొదటిసారిగా మాట్లాడుతూ, ఇరాన్‌తో తమ వాణిష్య సంబంధాలు తామిద్దరి స్వేచ్ఛ తప్ప, అందులో దిగ్భంధనాల ద్వారా జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసారు. దానితో దిగివచ్చిన ట్రంప్, చైనా నౌకలపై ఏ ఆంక్షలు లేవన్నారు. నిజానికి చైనా నౌకలు అప్పటికే యథేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి. స్వయంగా ఇరాన్ కూడా, మొదటి విడత చర్చల సమయానికే తనంతట తానుగా ఇండియా, ఫ్రాన్స్ సహా పలు దేశాలుపై ఆంక్షలు ఎత్తివేయటం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్‌తో సహకరిస్తున్న వారిపై మాత్రమై ఆంక్షలు ఉంటాయన్నది. ఇపుడు రెండవ విడతకు ముందు అమెరికా హర్మూజ్‌ను దిగ్భంధించగా, అందుకు ప్రతిగా తాము, హూతీలు కలిసి పర్షియన్ గల్ఫ్‌తోపాటు బాబ్ అల్ మెందర్, ఎర్ర సముద్రాలను మూసివేయగలమని హెచ్చరించింది. హర్మూజ్ మూసివేత వల్లనే ఇంతటి కల్లోలం ఏర్పడి 20 శాతం రవాణా స్తంభించగా, తక్కిన రెండు చోట్ల కూడా అది జరిగితే 35 శాతం వరకు ఆగి ఇక ఏమి జరిగేదీ ఎవరైనా ఉహించవచ్చు. ఈ నేపథ్య వివరాలన్నీ ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, కనీసం రెండవ విడత నాటికైనా అమెరికా అధ్యక్షునికి వివేకం కలుగుతుందా? నెతన్యాహూ ప్రభావం నుంచి కొంతైనా బయటపడగలరా అన్నది ఈ పరిస్థితులను బట్టి వేచిచూడవలసి ఉంటుంది. మొదటి విడత వైఫల్యం తర్వాత ట్రంప్ అన్నది, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల తయారీపై తప్ప అన్ని అంశాలపై అంగీకారం కుదిరినట్లేనని. వాస్తవానికి అది కూడా ఒక సమస్య కానేకాదని ప్రపంచానికంతా తెలుసు. ట్రంప్, నెతన్యాహూలకు కూడా తెలుసుగాని, ఇతర లక్షాల కోసం దానిని ఒక సాకుగా ముందుకు తెస్తున్నారు. శాంతియుత అవసరాల కోసం అణు శుద్ధి హక్కు, అంతర్జాతీయ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం దారుగా ఇరాన్‌కు చట్టబద్ధంగా లభించింది. అణ్వస్త్ర తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం కాగా, వారు 60 శాతాన్ని ఎప్పుడూ మించలేదు. వారి అణు కేంద్రాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్‌స్పెక్టర్లు తరచు తనిఖీ చేస్తూనే ఉన్నారు. తాము అణ్వస్త్రాలు తయారు చేయబోమని అయతొల్లా ఒకటికి రెండుసార్లు ఫత్వా సైతం జారీ చేసారు. అయినా స్వయంగా అణ్వస్త్రాలు గల అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ విధంగా ప్రవర్తిస్తున్న స్థితిలో, రెండవ విడత చర్చలలో రాగల షరతులేమిటో, కుదరగల రాజీలేమిటో, అంతా దైవాధీనం అన్నట్లుగా తయారయింది పరిస్థితి.  - టంకశాల అశోక్ (దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు 

మన తెలంగాణ 18 Apr 2026 10:29 am

Rashmika trains eight hours non-stop for Mysaa

Rashmika Mandanna is leaving no stone unturned for her highly anticipated action thriller, Mysaa. The actress has flown to Bangkok and is currently undergoing intense martial arts and stunt training. Working closely with the renowned Jaika Stunt Team, she is dedicating a grueling eight hours every day to perfect her combat skills and hand-to-hand techniques. […] The post Rashmika trains eight hours non-stop for Mysaa appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 10:25 am

ధోని ఈరోజైనా దిగుతాడా?

హైదరాబాద్: హోరాహోరీగా సాగుతోన్న ఐపీఎల్ పోటీల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయిదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఒకే స్థితిలో ఉన్న ఈ జట్ల మధ్య పోరుకు శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. గాయం కారణంగా తొలి అయిదు మ్యాచ్‌ల్లో ఆడని చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తి […] The post ధోని ఈరోజైనా దిగుతాడా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 10:24 am

Revanth Reddy : ఓల్డ్ ఫ్రెండ్స్ తో తెలంగాణ సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన పాత మిత్రులను కలుసుకున్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 10:19 am

గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన నాబార్డ్ అధికారులు

మంథని, ( జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ శివారులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.40 కోట్ల వ్యయంతో పిఎం కుసుమ్ …

జనం సాక్షి 18 Apr 2026 10:18 am

టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. భీమదేవరపల్లి:ఏప్రిల్ 18(జనం సాక్షి)తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంయుక్త చర్య కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో …

జనం సాక్షి 18 Apr 2026 10:15 am

ఆంధ్ర నేతల ఢిల్లీ విధేయత సంక్షోభానికి సంకేతం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి, పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ సవరణ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి విధేయత చూపుతూ, దక్షిణ భారత రాష్ట్రాల సహకారాన్ని విరమించుకోవడం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఉన్న లోతైన నైతిక సంక్షోభాన్ని సూచిస్తోంది. వివిధ చర్యలు, లోపాల ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధాంతపరంగా బలహీనంగా మారి, ఢిల్లీ దర్బార్ ముందు వినయపూర్వకంగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత, పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ కోల్పోయిన బిజెపి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ మూడు పార్టీలు వివిధ అంశాలపై బిజెపికి మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే, జనాభా, ఆర్థిక పరంగా మెరుగైన ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై పార్లమెంటరీ శక్తి సమతౌల్యాన్ని దెబ్బతీయాలనే ప్రతిపాదనపై ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి విడిపోయి తీసుకున్న నిర్ణయం రాజకీయ విధేయతకు మించిన సేవాభావాన్ని సూచించే చర్యగా భావించాల్సి వస్తోంది. విచిత్రంగా, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ‘తెలుగువాడి ఆత్మగౌరవం’ అనే భావనపై ఆవిర్భవించాయి. టిడిపి స్థాపకుడు ఎన్.టి. రామారావు ‘కేంద్రం అనేది ఒక భావనాత్మక మిథ్’ అని పేర్కొంటూ, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమలు చేసిన అధికార కేంద్రీకరణ విధానాన్ని సవాలు చేశారు. ఆయన ఒత్తిడితో కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా, జగన్ మోహన్‌రెడ్డి తన తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ ఆధారిత వర్గం తన కుటుంబంపట్ల ఎలా ప్రవర్తించిందనే విషయంపై నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ‘ఆత్మగౌరవం’ అనే భావనతో రాజకీయంగా ఎదిగిన నాయకులకు, తెలుగువారిలో పెద్దగా ప్రాధాన్యం లేని ఒక జాతీయ పార్టీ నాయకత్వానికి లొంగిపోవాల్సిన పరిస్థితి నిజం గా అవమానకరంగా మారింది. రాజకీయ ప్రాధాన్యత, అధికారాన్ని కాపాడుకోవాలనే ఆశతో వారు చూపుతున్న విధేయత, కొత్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వంలో ఉన్న లోతైన సంక్షోభాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. మరోవైపు, రాజ్యాంగ సవరణ అంశంపై తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల స్పందన పూర్తిగా భిన్నంగా కనిపించింది. భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్ పూర్వం తెలంగాణ రాష్ట్ర సమితి), కాంగ్రెస్ పార్టీలు ఇతర దక్షిణాది రాష్ట్రాలతో కలిసికట్టుగా నిలిచాయి. ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపుని సూచిస్తోంది. ప్రాంతీయ పార్టీగా బిఆర్‌ఎస్ తన ప్రాంత ప్రయోజనాలపట్ల నిబద్ధత చూపడం సహజమే. అలాగే, కర్ణాటక, తెలంగాణలో రాష్ట్ర స్థాయి బలమైన నాయకత్వం కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో ఐక్యతను ప్రదర్శించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను ప్రాంతీయ నాయకుడిగా ప్రతిష్టించుకునే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఈ వేదికను బిఆర్‌ఎస్ ఏకాధిపత్యంగా మార్చకుండా నిలబడ్డారు. తెలంగాణ అభివృద్ధి పట్ల బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకత్వం చూపిన కట్టుబాటు, ఆ రాష్ట్ర రాజకీయాల్లో బిజెపిని పక్కకు నెట్టడం లో కీలక పాత్ర పోషించింది. ప్రారంభంలో హిందుత్వ అజెండాతో కొంత చురుకుదనం ప్రదర్శించిన బిజెపి, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం కోల్పోయిన స్థితికి చేరుకుంది. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో అసలు సంక్షోభం ఏమిటి? ఇది పాలనాపరమైన సంక్షోభం. వరుసగా అధికారంలోకి వచ్చిన నాయకత్వాల అధిక అవినీతి కారణంగా పరిపాలన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా, ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు, జగన్‌రెడ్డి. ఇద్దరూ జైలుశిక్ష అనుభవించిన వారు. ఇక్కడ అవినీతి సమస్య ఎంత తీవ్రమో, అంతకంటే లోతుగా విస్తరించినది కులవాదం. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు, మూడు ప్రధాన కులాలకు ప్రతినిధులుగా మారాయి. తెలుగు దేశం పార్టీపై కమ్మ కుల ఆధిపత్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రెడ్డి కుల ఆధిపత్యం, జనసేనపై కాపు సమాజ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పరిపాలన, రాజకీయాలు, వ్యాపారాల్లో కులవాదం విస్తృతంగా వ్యాపించింది. రాష్ట్ర సమస్యలను మరింత తీవ్రతరం చేసిన అంశం, దాని దారుణమైన ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడాల్సి వస్తుందని ప్రారంభం నుంచే స్పష్టమైంది. ఏకీకృత ఆంధ్రప్రదేశ్ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ప్రాంతం సృష్టించిన మిగులు ఆదాయంపై ఆధారపడి ఉండేది. హైదరాబాద్ అభివృద్ధి దానికి ప్రధాన కారణం. హైదరాబాద్ లేకుండా కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిన స్థితిలోనే ప్రారంభమైంది. ఇలాంటి పాలనాపరమైన సవాళ్లను ఆంధ్ర రాజకీయ పరిస్థితులు మరింత క్లిష్టం చేశాయి. అధికారంలోకి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు, ఆశయపరుడైన పవన్ కళ్యాణ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. మరోవైపు, ఇంకా ఎక్కువ ఆశలు పెట్టుకున్న తన కుమారుడు నారా లోకేష్, తండ్రి స్థానాన్ని త్వరగా స్వీకరించాలనే తపనతో ముందుకు వస్తున్నారు. టిడిపిలో తరాల మార్పు రాజకీయాలు కూడా పాలనపై ప్రభావం చూపుతున్నాయి. ఎన్‌టిరామారావు కుటుంబం ఇప్పటికీ నాయుడు తన మామగారిని ఎలా మోసం చేశాడనే విషయంపై అసంతృప్తితో ఉండటం, అలాగే లోకేష్ త్వరగా నాయకత్వం చేపట్టాలని కోరుకోవడం వంటి అంశాలు రాష్ట్ర పాలనను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అమరావతిని కొత్త రాజధానిగా నిర్మించాలనే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష, రాష్ట్రంలో అత్యవసరమైన పట్టణాభివృద్ధి సవాళ్లపై దృష్టిని మళ్లించింది. కఠిన మౌలిక సదుపాయాల నిర్మాణం (హార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)తో పాటు పట్టణీకరణకు అవసరమైన సామాజిక -ఆర్థిక వ్యవస్థల (సాఫ్ట్ సూపర్‌స్ట్రక్చర్) అభివృద్ధి వంటి కీలక అంశాలు పక్కన పడిపోయాయి. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి వ్యాపార వర్గాలు మారాల్సి ఉంటుందని భావించారు. తెలంగాణ నాయకత్వం, హైదరాబాద్ అభివృద్ధి ప్రయోజనాలను స్వాధీనం చేసుకుంటూ, ప్రాంతీయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర వ్యాపార వర్గాలపై విమర్శలు చేసింది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర వ్యాపార, ప్రొఫెషనల్ వర్గాలను దూరం చేయకుండా ఉంచాలనే టిఆర్‌ఎస్ నాయకుడు కెటిఆర్ (కె.టి. రామారావు) తీసుకున్న తెలివైన నిర్ణయం, హైదరాబాద్‌లోనే మూలధనం, ప్రతిభ నిలిచేలా చేసింది. దీనివల్ల ఆ నగరం నిరంతర అభివృద్ధి సాధించింది. ఆంధ్రాలోని కమ్మ, రెడ్డి వర్గాల వ్యాపార ప్రముఖులు హైదరాబాద్‌లోనే పెట్టుబడులు పెట్టడం లేదా విదేశాల్లో, ముఖ్యం గా అమెరికాలో స్థిరపడటాన్ని కొనసాగించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇప్పటికీ తిరిగి రాలేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నాయుడు, జగన్‌రెడ్డి నాయకత్వాలకు పెద్దగా సవాల్ విసరలేకపోవడంతో, రాష్ట్ర రాజకీయాలు వ్యక్తిగత ప్రతిష్టా పోరాటం, కుల రాజకీయాల మధ్య చిక్కుకుపోయాయి. 1969-72 మధ్య జరిగిన మొదటి ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల తర్వాత, హైదరాబాద్ అనేక ప్రభుత్వాల పాలనలో స్థిరమైన అభివృద్ధిని సాధించింది. చంద్రబాబు నాయుడు భారత వ్యాపార వర్గాలకు ప్రీతిపాత్రుడిగా ఎదిగినా, ఆయన తరువాత ముఖ్యమంత్రులైన వై.ఎస్. రాజశేఖరరెడ్డి, కె. చంద్రశేఖరరావు కూడా నగర అభివృద్ధిని కొనసాగించే దిశగా చర్యలు తీసుకున్నారు. దీని ఫలితంగా, 1980 నుంచి 2015 వరకు దాదాపు మూడు దశాబ్దాలపాటు ఆంధ్ర వ్యాపార వర్గాలు, ప్రతిష్ఠాత్మక వర్గాలు హైదరాబాద్‌ను తమ కేంద్రంగా చేసుకున్నాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఢిల్లీపై ఆధారపడాల్సిన పరిస్థితి, రాష్ట్ర నాయకత్వంపై విచారణ సంస్థల ప్రభావం, అలాగే ఆంధ్ర ఎలైట్ వర్గాలు హైదరాబాద్‌పైనే చూపుతున్న మక్కువ.. ఇవన్నీ కలిసివచ్చి రాష్ట్ర రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరిచాయి. ఫలితంగా, వారు ఢిల్లీ దర్బార్‌కు ఆధీనంగా మారే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఆంధ్రా వర్గాలను ఆకర్షించే కేంద్రంగా కొనసాగుతున్నంత కాలం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలు ఆధునిక పట్టణ, సాంసృ్కతిక కేంద్రాలుగా అభివృద్ధి చెందడంలో ఆలస్యం అనివార్యం. ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఉన్న నగరాల చుట్టూ స్థానిక వ్యాపార, విద్యా, సాంసృ్కతిక కేంద్రాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలి. భారీ ఖర్చుతో కూడిన అమరావతి రాజధాని ఒక మాయాజాల కేంద్రంగా మారుతుందనే ఆశపై ఆధారపడడం కంటే, స్థిరమైన, సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అవసరం. - సంజయ్ బారు

మన తెలంగాణ 18 Apr 2026 10:13 am

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసలు

దిల్లీ: ఇటీవల దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరణ్‌జీత్ సింగ్ సంధూపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఆయన ఈ మేరకు ట్రూత్ సామాజిక వేదికగా సోస్టు చేశారు. ‘దిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సంఇంగ్ సంధూకి అభినందనలు. అమెరికా మాజీ రాయబారిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు తరణ్‌జీత్ ఎంతో నిబద్ధత చూపించారు’. అని తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది వరకు ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. […] The post దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 10:12 am

Summer Effect : రోళ్లు పగులుతున్నాయ్.. రోడ్లపై ఆమ్లెట్ వేసుకునేంతగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 10:11 am

Chandrababu: రెండో విడత భూ సమీకరణపై చంద్రబాబు

రెండో విడత భూసమీకరణపై రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 10:06 am

Telangana : తెలంగాణలో మొరాయించిన సర్వర్లు..నిలిచిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి

తెలుగు పోస్ట్ 18 Apr 2026 10:01 am

Gold Prices Today : గుడ్ న్యూస్.. త్వరపడండి..బంగారం కొనేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 9:54 am

బరువుబాధ్యతల వేతనజీవులు

రాష్ట్ర పరిపాలన అనే విస్తారమైన వ్యవస్థలో ఒక అచంచలమైన సత్యం ఉంది. ప్రజల సంక్షేమం కోసం రూపుదిద్దుకున్న ప్రతి పథకం, ప్రతి నిర్ణయం చివరికి కార్యరూపం దాల్చేది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదుగానే. పాలన అనే యంత్రాంగం ఎంత శక్తివంతంగా కనిపించినా, దానికి ప్రాణం పోసేది ఉద్యోగులే. వారి కర్తవ్య నిబద్ధత, నిజాయితీ, సేవాభావం లేకపోతే ప్రభుత్వ లక్ష్యాలు కేవలం కాగితాలకే పరిమితమైపోతాయి. ప్రజల ఆశలు, ప్రభుత్వ సంకల్పాల మధ్య నిలిచే సజీవ వారధి -అదే ప్రభుత్వ ఉద్యోగి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఇ జెఎసి) నిన్న 17 ఏప్రిల్ రోజున చేపట్టిన కార్యాచరణను ఒక సాధారణ నిరసనగా చూడలేం. ఇది ఒక బాధ్యతతో కూడిన వినతి, వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోని నిశ్శబ్ద ప్రతిఘటన, న్యాయమైన హక్కుల కోసం వినిపిస్తున్న గంభీర స్వరం. ఉద్యోగులు ఎంచుకున్న మార్గం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. విధులను విస్మరించకుండా, ప్రజాసేవలకు అంతరాయం కలగకుండా, క్రమశిక్షణతో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడం. రాష్ట్రవ్యాప్తంగా మండల, డివిజనల్ కేంద్రాలలో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించడం. ఇది ఒక ప్రతీకాత్మక చర్య మాత్రమే కాదు; ఇది ప్రభుత్వ వ్యవస్థపై ఉద్యోగులకు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించే చర్య. రోడ్లపై ఆందోళనలు, నినాదాలకంటే, విధి నిర్వహణలో భాగంగానే తమ గళాన్ని వినిపించడంద్వారా వారు ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రతిష్ఠించారు. ఈ వినతి పత్రాలలో ప్రతిఫలించిన అంశాలు ఉద్యోగుల జీవన వాస్తవాలను, వారి భవిష్యత్ భద్రతను ప్రతిబింబిస్తున్నాయి. పిఆర్‌సి అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డిఎల విడుదల, 61 సంవత్సరాలు నిండిన విఆర్‌ఎల సమస్యల పరిష్కారం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, సాధారణ బదిలీల నిర్వహణ, ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర కార్యాచరణ. ఇవి కేవలం ఆర్థిక అంశాలు మాత్రమే కాదు; ఇవి ఉద్యోగుల గౌరవం, భద్రత, స్థిరత్వానికి సంబంధించిన మూల సూత్రాలు. ప్రభుత్వ ఉద్యోగి పాత్రను సమగ్రంగా పరిశీలిస్తే, అది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత, ఒక ధర్మం. గ్రామంలో భూమి సమస్య పరిష్కారం నుండి పట్టణంలో సంక్షేమ పథకాల అమలు వరకు, విద్యా రంగంలో ఉపాధ్యాయుడిగా జ్ఞానాన్ని పంచడం నుండి ఆరోగ్యరంగంలో సేవలను చేరవేయడం వరకు. ప్రతి రంగంలో ఉద్యోగుల పాత్ర అపారమైనది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుండి సహాయక చర్యలు చేపట్టేది ఉద్యోగులే; ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియను సజావుగా నడిపేది ఉద్యోగులే; సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేసేది కూడా వారే. ప్రజలకు ప్రభుత్వం అనిపించేది చాలాసార్లు ఒక కార్యాలయంలో కూర్చున్న ఉద్యోగి రూపంలోనే. ఒక రైతు సమస్యకు పరిష్కారం చూపినప్పుడు, ఒక పేద కుటుంబానికి పింఛన్ అందినప్పుడు, ఒక విద్యార్థికి స్కాలర్షిప్ చేరినప్పుడు, ప్రభుత్వం అంటే ఇదే అన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టేది ఉద్యోగులే. అందుకే వారి సేవ కేవలం విధి నిర్వర్తన కాదు; అది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే శక్తి. అయితే ఈ సేవామార్గంలో ఉద్యోగులు ఎదుర్కొనే సవాళ్లు కూడా చిన్నవి కావు. పెరుగుతున్న పనిభారం, పరిమిత వనరులు, సమయపాలన ఒత్తిడి, ప్రజల అంచనాలు ఇవన్నీ ఒక ఉద్యోగిని నిరంతరం పరీక్షిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో వారి సంక్షేమం, ఆర్థిక భద్రత, సేవా నిబంధనల పరిరక్షణ మరింత ముఖ్యమవుతుంది. ఉద్యోగి బలంగా ఉంటేనే పరిపాలన బలంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగి వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం ఆశలు, ఆర్థిక బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు all these depend on the employee. ఒకవైపు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత, మరోవైపు కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత, ఈ ద్వంద్వ పాత్రలో ఉద్యోగి జీవితం సాగుతుంది. అయినప్పటికీ, అతను తన కర్తవ్యాన్ని ఎప్పుడూ ముందుకు ఉంచుతాడు. అదే అతని సేవాతత్వం. ప్రభుత్వం ప్రజల మధ్య ఉన్న అనుబంధం ఒక భావోద్వేగ సంబంధం. ఆ బంధాన్ని బలపరచేది ఉద్యోగులే. ప్రజల సమస్యలను వినిపించి, పరిష్కారం చూపే సమయంలో వారు చూపే సహానుభూతి, సహనం, సేవా దృక్పథం ఇవి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతాయి. అదే విధంగా ప్రభుత్వం కూడా ఉద్యోగులను కేవలం యంత్రాంగంగా కాకుండా, తమ వ్యవస్థలో కీలక భాగస్వాములుగా చూడాలి. రాబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2కు ముందే ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఉద్యోగులు కోరడం వెనుక ఉన్న భావన గంభీరమైనది. అది ఒక గడువు మాత్రమే కాదు; అది ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, ఆశ, విశ్వాసానికి ప్రతీక. అలాగే వచ్చే నెల 5వ తేదీన జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు అందజేయడానికి సిద్ధమవడం. ఇది వారి పోరాటం శాంతియుతంగా, క్రమబద్ధంగా కొనసాగుతుందనే సంకేతం. ఈ దశలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం. ఉద్యోగుల సమస్యలను వేరుచేసి చూడకుండా, పరిపాలనా వ్యవస్థలో భాగంగా పరిగణించి, ఒక సమగ్ర, సమయబద్ధ పరిష్కారం అందించాల్సిన అవసరం ఉంది. ఒకసారి సమస్యలు పరిష్కారమైతే, ఉద్యోగుల్లో నూతనోత్సాహం పుడుతుంది. ఆ ఉత్సాహం ప్రజా సేవల నాణ్యతలో ప్రతిఫలిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం. ఉద్యోగులు కేవలం జీతం కోసం పనిచేసే వారు కాదు; వారు సమాజానికి సేవ చేయాలని నమ్మే వ్యక్తులు. వారి పనిలో ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. ఆ విలువను గుర్తించడం, గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. మొత్తానికి, ఈ ప్రతిఘటన ఒక విరోధం కాదు, ఇది ఒక విజ్ఞప్తి. ఒక న్యాయమైన, సమంజసమైన అభ్యర్థన. ప్రజల సేవలో అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించడం సహజం. ఈ పిలుపును ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తే, అది ఉద్యోగులకే కాదు, ప్రజా సేవల నాణ్యతకు, రాష్ట్ర అభివృద్ధికి, సమాజ స్థిరత్వానికి కూడా దోహదపడుతుంది.  - (రచయిత తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒఎస్‌డి) 

మన తెలంగాణ 18 Apr 2026 9:52 am

పంజాగుట్టలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట: హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....  ఓ యువతి పంజా గుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని మరో పోలీసు కానిస్టేబుల్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 18 Apr 2026 9:52 am

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణమే.. అదే కారణమా?

తిరుమలలో భక్తుల రద్దీ కొంత సాధారణంగానే ఉంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 9:37 am

రొటీన్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా సినిమా బ్యాడ్ బాయ్ కార్తీక్. ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని మంచి విజయాలందుకున్న నాగశౌర్య మూడేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఇది. శుక్రవారం ఈ హీరో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం. కథ: కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అయిన తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తీక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెకు ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటిది తన అక్కను ఎవరో చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి.. వాళ్ల సంగతేంటో తేల్చడానికి సిద్ధమవుతాడు కార్తీక్. ఈ క్రమంలోనే కదిరికి వస్తాడు. ఆ ప్రాంతానికే చెందిన రాజకీయ నాయకుడు గోవిందప్ప (మీమ్ గోపి)నే తన అక్కను టార్గెట్ చేశాడని తెెలుసుకుని అతడిని కస్తూరి కళ్ల ముందే చంపేస్తాడు కార్తీక్. అయితే కదిరికే చెందిన మరో రాజకీయ నాయకుడు వరదా రెడ్డి (సముద్రఖని) రూపంలో కస్తూరి కి ఇంకా పెద్ద ముప్పు పొంచి ఉందని కార్తీక్ తెలుసుకుంటాడు. ఇంతకీ గోవిందప్ప, వరదారెడ్డిలతో కస్తూరికి ఉన్న గొడవేంటి.. ఈ ఇద్దరి నేపథ్యం ఏంటి.. గతం తెలిశాక కార్తీక్ ఏం చేశాడు.. తన అక్కను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ. కథనం, విశ్లేషణ: హీరో నాగ శౌర్య తన అక్కను కాపాడుకునే తమ్ముడి పాత్రలో పర్వాలేదనిపించాడు. కథలో అంతబలం లేకపోయి నా, తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయ త్నం చేశాడు. అయితే అవుట్‌డేటెడ్ కథ, కథనాలే ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. చాలా రొటీన్ కథని ద ర్శకుడు ఈ సినిమా కోసం తీసుకున్నాడు. ఇదే కథ, కథనాలతో తెలుగులో ఎన్నో సినిమాలు మనం చూశాం. దీంతో ఈ సినిమా రొటీన్ మాస్ ఎమోషనల్ డ్రామాగా అనిపిస్తుంది. అలాగే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోదు. అసలు వారి మధ్యలో ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా అర్ధం కానీ విధంగా వీరి నడుమ సీన్స్ ఉంటాయి. ఇక టాలీవుడ్ మాస్ హీరోలు దశాబ్దాల ముందు చేసిన యాక్షన్ విన్యాసాలను ఇందులో నాగశౌర్య ప్రయత్నించాడు. తనకు ఏమాత్రం సెట్ కానీ ఎన్నెన్నో మాస్,యాక్షన్ విన్యాసాలు చేశాడు శౌర్య. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లు.. ఎవరినో అనుకరిస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప.. ఎక్కడా ఒరిజినాలిటీ అన్న దే కనిపించదు. చాలా చోట్ల సీన్స్ బోర్ కొడతాయి. అలాగే కొన్ని చోట్ల కామెడీ సీన్స్ కూ డా వర్కవుట్ కాలేదు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది.

మన తెలంగాణ 18 Apr 2026 9:25 am

నేడు ఢిల్లీతో ఆర్‌సిబి ఢీ

బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు విజయాలు సాధించిన ఆర్‌సిడి ఈసారి కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్‌లు జోరుమీదున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక కెప్టెన్ రజత్ పటిదార్, జితేశ్ శర్మ, దేవ్‌దుత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, రొమరియో షెఫర్డ్, కృనాల్ పాండ్యలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతో పాటు భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, హాజిల్‌వుడ్, కృనాల్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఢిల్లీలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కెఎల్ రాహుల్, నితీశ్ రాణా, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ అక్షర్ పటేల్, నిసాంకా తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా ఢిల్లీ పటిష్టంగానే ఉంది. దీంతో ఢిల్లీ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

మన తెలంగాణ 18 Apr 2026 9:23 am

‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్

మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వం లో తానే హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ “మంచి కథా వస్తువుతో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నాం”అని అన్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 9:14 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದ ಮುರ್ಷಿದಾಬಾದ್‌ನಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಹಿಂದೂಗಳು ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು 2022ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದ ಮುರ್ಷಿದಾಬಾದ್‌ನಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಹಿಂದೂಗಳು ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು 2022ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 18 Apr 2026 9:10 am

Zodiac Signs : ఈ రాశి వారికి నేడు శుభదినమే

ఎక్కువ మంది దినఫలాలను చూసుకుని మరీ ముందుకు వెళుతుంటారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 9:06 am

18thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

18thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 18thAprilCartoon సంఖ్యాబలం తెలియని అమాయకత్వమా.. లేక

ప్రభ న్యూస్ 18 Apr 2026 9:03 am

Chandrababu : నిడదవోలుకు నేడు చంద్రబాబు

నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:53 am

మంచిర్యాలలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం.... పసికందుతో ధర్నాకు దిగిన ప్రియురాలు

మంచిర్యాల:  ఓ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ఓ యువతిని లొంగదీసుకున్నాడు. అనంతరం సదరు యువతిని గర్భవతిని చేసి అనంతరం బిడ్డ పుట్టగానే  వదిలేసి పారిపోయాడు. దీంతో పసికందుతో తల్లి ధర్నాకు దిగిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముదిగుంట గ్రామానికి చెందిన సాయిరాజ్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ యువతిని లొంగదీసుకున్నాడు. సదరు యువతిని గర్భవతి చేసి బిడ్డ పుట్టగానే వదిలేసి పారిపోయాడు. దీంతో కానిస్టేబుల్ ఇంటి ముందుకు చేరుకొని పసికందుతో ధర్నాకు దిగింది. దీంతో కానిస్టేబుల్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పారిపోయాడు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. 

మన తెలంగాణ 18 Apr 2026 8:53 am

Ys Jagan : బిల్లు వీగిపోవడంపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ ఇదే

మహిళ రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:47 am

KTR : మహిళ బిల్లు వైఫల్యానికి బీజేపీదే బాధ్యత

మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీ పార్టీదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:41 am

Naga Shaurya’s Film Shocks Telugu Film Industry

After the debacle of Rangabali, Naga Shaurya has calmed down. After three years, he tested his luck with Bad Boy Karthik. The makers have spent Rs 30 crores on the film. The director was changed and the film underwent several unexpected changes. The trailer and the songs failed to generate the need buzz. Naga Shaurya […] The post Naga Shaurya’s Film Shocks Telugu Film Industry appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 8:36 am

Bandi Sanjay : కాంగ్రెస్ పై బండి ఫైర్

మహిళ రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:34 am

18aprilchintana |ధర్మం ఎందుకు క్షీణిస్తోంది?

18aprilchintana | ధర్మం ఎందుకు క్షీణిస్తోంది? 18aprilchintana | కలియుగ లక్షణాలు మరియు

ప్రభ న్యూస్ 18 Apr 2026 8:29 am

Revanth Reddy : బిల్లుల వీగిపోవడంపై రేవంత్ ఏమన్నారంటే?

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వీగిపోయిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్‌ చేశారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:28 am