KVN Productions lining up Big Tollywood Films
K Venkata Narayana, a realtor based in AP has settled in Bengaluru and his construction firm Prestige Group is one among the leading construction companies of South. He floated KVN Productions and is currently producing Vijay’s Jana Nayagan and Yash’s Toxic. KVN has paid big advances for some of the happening stars and directors and […] The post KVN Productions lining up Big Tollywood Films appeared first on Telugu360 .
జైలులో ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు.. స్పందించిన అధికారులు
లాహోర్ : మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక స్పందన వెలువడింది. ఆయన ఖైదీగా ఉంటున్న అడియాలా జైలు అధికారుల నుంచి గురువారం ఓ ప్రకటన వెలువరించారు. జైలులో ఆయన ఆరోగ్యం బాగా ఉందని, ఆయన పరిస్థితిపై వెలువడ్డ వార్తలు వదంతులే అని తెలిపారు. పాకిస్థాన్ తెహరీక్ఏ ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చిత్రహింసల పాలయ్యి , మృతి చెందాడనే వార్తలు పాకిస్థాన్లో భగ్గుమన్నాయి. ఆయన జైలులోనే బాగా ఉన్నారని, ఫిట్గా ఉన్నారని తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఫోటోలు ఏమీ పొందుపర్చలేదు. పార్టీ వర్గాలకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేశామని, వదంతులు నమ్మవద్దని తెలియచేస్తున్నామని పేర్కొన్నారు. రావల్పిండిలోని జైలు వద్ద పిటిఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున రెండు రోజులుగా తమ నేత ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జైలు అధికారులు స్పందించారు. ఆయన జైలులోనే ఆరోగ్యంగా ఉన్నారు. వేరే చోటికి తరలించారనే వాదన సరికాదని పేర్కొన్నారు.
చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ కెటిఆర్: కడియం శ్రీహరి
అహంకారం, బలుపుతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని, దాన్ని ప్రజలు హర్షించరని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్పూర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మాజీ మంత్రి కెటిఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెటిఆర్ సభ్యత, సంస్కారం మర్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కెటిఆర్ లాగా అయ్య పేరు చెప్పుకొని.. కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదన్నారు. నేను సొంతంగా ఎదిగిన నాయకుడిని అన్నారు. కెసిఆర్ లేకపోతే కెటిఆర్ ఎక్కడ ఉండేవాడో ఆయన ఊహకే వదిలేస్తున్నాను. కెటిఆర్ నాయకత్వంపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయన్నారు.కెటిఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత వెళ్లిందన్నారు. కెటిఆర్ కు సిగ్గుంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్యాసి కెటిఆర్ అన్నారు. తన దగ్గర ఆధారాలున్నాయి కాబట్టే కవిత ఆ విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు. ముందు నీ చెల్లికి సమాదానం చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.
ఉర్రూతలూగిస్తున్న ‘భీమవరం బల్మా...’
వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ’అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది. ‘భీమవరం బల్మా’ పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య ప్రదర్శన కట్టిపడేసింది. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనగనగా ఒక రాజు చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీస్థాయిలో విడుదల కానుంది.
ట్రాఫిక్ నియంత్రణలో రౌడీ షీటర్లు
రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను సామాజిక సేవలో భాగస్వాముల్ని చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
కాలేయానికి లైఫ్ ఇచ్చే తులసి-28ఎక్స్
అనారోగ్యంతో కాలేయం దెబ్బతిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మందిని ఆసుపత్రుల్లో చూస్తున్నాం.
డాక్టర్ షాహిన్ గర్ల్ ఫ్రెండ్ కాదు..నాభార్య : ఉగ్రవాది ముజమ్మిల్
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో నిందితురాలు డాక్టర్ షాహిన్ గర్ల్ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహ నిందితుడు ముజమ్మిల్ షకీల్ విచారణలో వెల్లడించాడు. 2023 సెప్టెంబర్లో అల్ ఫలా యూనివర్శిటీ సమీపం లోని మసీదులో తమ నిఖా జరిగిందని దర్యాప్తు సంస్థలకు తెలిపాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) దర్యాప్తులో ముజమ్మిల్కు 2023లో ఆయుధాలు కొనేందుకు షాహిన్ రూ. 6.5 లక్షలు ఇచ్చినట్టు బయటపడింది. అలాగే 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనేందుకు రూ. 3 లక్షలు ఇచ్చింది. మొత్తం ఆమె జైష్ మాడ్యూల్కు ఆయుధాలు, పేలుడు పదార్ధాల కొనుగోలుకు రూ.27 లక్షల నుంచి రూ. 28 లక్షల వరకు ఇచ్చినట్టు బయటపడింది. అయితే ఈ డబ్బంతా జకత్ (మతపరమైన విరాళం) కిందే ఇచ్చినట్టు దర్యాప్తు అధికారులకు షాహిన్ వెల్లడించింది.
సాంగ్ లాంచ్.. భీమవరంలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి డ్యాన్స్..
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తొలి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. గురువారం భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో 'భీమవరం బల్మా' అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. విద్యార్థుల కేరింతల మధ్య ఈ సాంగ్ కు నవీన్, మీనాక్షీ డ్యాన్స్ చేసి హుషారెత్తించారు. ఇక, విడుదలైన లిరికల్ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేథ్యంలో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా అనగనగా ఒక రాజు మూవీ రూపొందుతోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సూపర్ హిట్ మూవీ తర్వాత నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది.
ప్రపంచ టాప్ 100 నగరాల్లో హైదరాబాద్
ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్-100 నగరాల్లో హైదరాబాద్ స్థానం సంపాదించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్ ఓఎస్డి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారు రెండు గంటల పాటు ఆయన్ను విచారించిన అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ఫోర్స్ డిసిపి రాధకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధా కిషన్ రావు స్టేట్మెంట్లో మాజీ సిఎం కెసిఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, కెసిఆర్ కుటుంబ సభ్యులు, బిఆర్ఎస్లో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పని చేశామని గతంలో రాధా కిషన్ రావు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం అధికారులు రికార్డు చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు నిందితులతో పాటు, భారీ సంఖ్యలో బాధితులను విచారించారు.
నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Video: Ram Achanta & Gopi Achanta Interview
The post Video: Ram Achanta & Gopi Achanta Interview appeared first on Telugu360 .
సిగాచీ పేలుళ్ల ఘటనలో దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహాం
సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగాచీ పేలుళ్లపై బాబురావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన కాదని, 54 మంది కార్మికులు చనిపోయారన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటని, ఇంత పెద్ద ప్రమాదంలో బాధ్యత ఎవరిదో ఇప్పటికీ నిర్ధారణ కాలేదా? అంటూ ఏఏజీ రజినీకాంత్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తులో 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులెవరని తేల్చలేదా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే డిఎస్పిని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని ఏఏజిని సిజె నిలదీశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అని సిజె ప్రశ్నించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవారి వసుధా వాదనలు వినిపించారు. పేలుడు సంభవించి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిపుణల కమిటీ పరిశ్రమల నిర్వహణలో లోపాలున్నాయని తేల్చిందని, నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారని కమిటీ గుర్తించినట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు. పేలుడు తీవ్రతకు ఎనిమిది మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని న్యాయవాది వసుధా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏఏజీ రజినీకాంత్ కోర్టుకు తెలిపారు. దీనికిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో పోలీసు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏఏజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
Rs. 1 lakh |నిందితుతులకు జైలు శిక్ష
Rs. 1 lakh | నిందితుతులకు జైలు శిక్ష Rs. 1 lakh
Election Commission |ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి..
Election Commission | ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి.. Election Commission |
ఆధార్ ఉంటే ఎవరికైనా ఓటు హక్కు ఇస్తారా?: సుప్రీంకోర్టు
ఆధార్ కార్డు పౌరసత్వ పూర్తి స్థాయి ఆధారం కాదని, ఆధార్ ప్రాతిపదికన ఎన్నికల్లో ఓటుకు విదేశీయులకు అనుమతినిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల తుది విచారణల దశలో ఎన్నికల సంఘానికి గురువారం కీలక ప్రశ్నలు సంధించింది. చొరబాటుదార్లు ఆధార్ కార్డులు పొంది ఉంటే వారు ఓటు హక్కుకు అర్హులవుతారా? అని ప్రశ్నించింది. ప్రస్తుతం పలు రాష్ట్రాలు, యుటిలలో సర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆధార్ కార్డు వాడకం, ఓటు హక్కు వంటి ప్రశ్నలు తలెత్తాయి. ఆధార్ను పౌరసత్వ నిర్థారణ పత్రంగా పూర్తి స్థాయిలో భావించడానికి వీల్లేదు. ఈ క్రమంలో విదేశీయుల ఓటు హక్కు కూడా పరిగణనలోకి వస్తుందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాలా బాగ్చీతో కూడిన ధర్మాసనం వ్యాజ్యాలపై విచారణను వేగవంతం చేసింది ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు వాడే ఫారం 6 విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఫారంలోని సమాచారం అంతా సరైనదేనా? కాదా అనేది నిర్థారించుకునే అధికారం పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు. ఆధారే అన్నింటికీ ఆధారభూతం అని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా పౌరులు ప్రయోజనాలు పొందేందుకు రూపొందించిన అధికారిక సాధనం అంతే అని తెలిపారు. రేషన్ ఇతర విషయాలకు ఆధార్ జారీ అయిన వ్యక్తులను వారి ఆధార్ ప్రాతిపదికన ఓటరుగా చేర్చడం కుదురుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉదాహరణకు పొరుగుదేశం వ్యక్తి ఎవరైనా ఇక్కడికి వచ్చి రోజువారి కూలీగా పనిచేస్తూ ఉంటే , దీని ద్వారా రేషన్ వంటివి పొందుతూ ఉంటే వారు ఓటు వేసేందుకు వీలు కల్పిస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పోస్టాఫీసు కాదుగా ఎన్నికల సంఘం పోస్టాఫీసు కాదు. ఫారం 6 లో పొందుపర్చిన వాటన్నింటిని యధావిధిగా అంగీకరిస్తూ పోవల్సిన పనిలేదని , అవుననే వాదన కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లు కొందరు తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ లేవనెత్తిన అంశాలను బెంచ్ తోసిపుచ్చింది. సర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం సాధారణ పౌరులపై అనుచిత భారం మోపుతోందని , అనేకులు రాతకోతలతో చిక్కులు ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. దీనిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల సంఘాన్ని మీరు బట్వాడా విభాగం అనుకుంటున్నారా? అని చురకలు పెట్టింది. అత్యధిక వివరణలతో చివరికి ఓటరు కార్డులు తొలిగిపోయిన వారు ఉన్నారనే సిబల్ వాదన సరికాదని బెంచ్ తెలిపింది. రివిజన్ ఇసి విద్యుక్త ధర్మం కాదనడానికి వీల్లేదు రివిజన్ అనేది ఎన్నికల సంఘం అధికారంలో ఓ భాగం. దీని వల్ల ప్రజాస్వామికమైన ఓటుహక్కుకు విఘాతం ఏర్పడుతోందనే వాదన సమంజసమా? అని ప్రశ్నించారు. సరైన నోటీసు తరువాతనే జాబితాల్లో నుంచి పేర్ల తొలిగింపులు ఉంటాయని, ఇది తప్పనిసరి అని న్యాయస్థానం తెలిపింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ సాగుతున్న దశలో ప్రత్యేక సందేహాలు సవాళ్లకు కోర్టు నిర్ధేశిత గడువులను విధించింది. తమిళనాడు పిటిషన్లపై ఎన్నికల సంఘం డిసెంబర్ 1లోగా వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. కేరళ పిటిషన్లపై విచారణ రెండున జరుగుతుంది. ఇక బెంగాల్కు సంబంధించిన పిటిషన్లపై విచారణ 9వ తేదీన ఉంటుంది. ఈ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు సర్ ప్రక్రియపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని వీటికి ప్రత్యేక నిర్థిష్ట గడువును ఖరారు చేశారు.
Manchiryala | 11 నామినేషన్ల స్వీకరణ
Manchiryala | 11 నామినేషన్ల స్వీకరణ Manchiryala | జన్నారం, ఆంధ్రప్రభ :
షేక్ హసీనాకు 21 సంవత్సరాల జైలుశిక్ష
పదవీచ్యుత, ప్రవాస బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు దేశంలోని ప్రత్యేక న్యాయస్థానం 21 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో అవినీతి సంబంధిత మూడు కేసులలో ఆమెకు ఈ శిక్ష విధించారు. ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానం 5 న్యాయమూర్తి మెహమ్మద్ అబ్దుల్లా ల్ మమూన్ గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. మూడు కేసులకు కలిపి ఇప్పుడు ఈ 78 సంవత్సరాల నాయకురాలు, ఇప్పుడు భారత్లో తలదాచుకుంటున్న హసీనా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కేసుల విచారణ ఆమె గైర్హాజరీ క్రమంలోనే వెలువడింది. ఇప్పటికే బంగ్లాదేశ్ లోని ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. దీనిని అమలుచేస్తామని ప్రకటించింది. ఈ మూడు కేసులలో హసీనాకు కేసుకు ఒక్క లక్ష టాకాల జరిమానా విధించింది. ఈ మొత్తం కట్టకపోతే అదనంగా 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్కు , కూతురు సైమా వాజిద్ పుతుల్కు ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్షల తీర్పు వెలువరించారు. రాజధాని ఢాకా సమీపంలో హౌసింగ్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో ఆమె తమ అధికార దుర్వినియోగం తారాస్థాయికి చేరిందనే అభియోగాలతో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు ఈ విచారణలు, ఈ తీర్పులు అన్ని కూడా తనపై కక్షపూరితం, రాజకీయ దురుద్ధేశపూరితం అని హసీనా కొట్టిపారేశారు.
Manchu Manoj Unveils intriguing Vaanara Teaser filled with action & emotion
Young actor Avinash Thiruvidhula is making his debut as hero and director with the socio-fantasy entertainer “Vaanara”. Simran Choudhary plays the female lead, while Nandu appears as the antagonist. After the solid reception to the first look, the makers unveiled the teaser today in a grand launch event. Rocking Star Manchu Manoj graced the event […] The post Manchu Manoj Unveils intriguing Vaanara Teaser filled with action & emotion appeared first on Telugu360 .
ఓట్ల రాజకీయాలు తప్ప రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదు:హరీష్ రావు
సిఎం రేవంత్ రెడ్డి ఓట్ల రాజకీయాలు తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నవంబర్ 29, 2009 చరిత్ర మలుపు తిప్పిన చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఆనాడు కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎక్కడిది, రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిదని అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే సిద్దిపేట జిల్లా అయిందని సిద్దిపేట కు గోదావరి జలాలు వచ్చాయని సిద్దిపేటకు రైలు, మెడికల్ కాలేజీ వచ్చాయన్నారు. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని అన్నారు. ఆనాడు కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నాడు మనం కూడా సిద్దిపేటలో పాత బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మొత్తం 1531 రోజులు దీక్ష శిబిరం నడిచిందన్నారు. కొన్ని వేల మంది దీక్షా శిబిరంలో పాల్గొన్నారని ప్రతి ఒక్క ఉద్యమకారుడు వచ్చారన్నారు. ఆ శిబిరానికి గుర్తు గా చిహ్నంగా ఒక పైలాన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిపాదన పెడుతున్నానని నవంబర్ 29 న పొద్దునే ఉద్యమంలో అని మీ ఉద్యమ జ్ఞాపకాలను ట్విట్టర్ లో గానీ సోషల్ మీడియాలో గానీ, ఇన్స్టగ్రాం లో కానీ మీ సోషల్ మీడియా అకౌంట్ లలో డిసెంబర్ 9 వరకు రోజు ఒకటి పోస్ట్ చేయాలన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పది ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్ట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కెసిఆర్ అని అలాంటి నాయకుడు కలలో కూడా తెలంగాణను మోసం చేశాడా అని అన్నారు. కొన్ని దశాబ్దాల కలను, కోట్ల మంది కలను కేసీఆర్ నిజం చేశాడన్నారు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి రేవంత్ గద్దెనెక్కిండని అన్నారు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్రం మీద ప్రజల మీద శ్రద్ధ లేదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అని బీసీలను మోసం చేశారని రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్కు, ఈ కాంగ్రెస్ నాయకులకు పోలిక లేదని అన్నారు. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తారు మరి మలన్నసాగర్ లో కొండపోచమ్మలో నీళ్ళెక్కడివని ఎక్కడ కాలువలు తవ్వి నీళ్ళు ఇస్తే కేసీఆర్కు పేరు వస్తుందని ఆ పని ఆపేశారన్నారు. అలాంటి రాజకీయాల కోసం చూసే కాంగ్రెస్ నాయకులకు మనకు పొంతన లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
High Court |ఇమ్మడి రవి త్వరలో…
High Court | ఇమ్మడి రవి త్వరలో… High Court | ఖైరతాబాద్,
గ్రేటర్లో..ఇక ప్లాస్టిక్ ఫుట్ పాత్లు
పాదచారుల భద్రతపై జీహెచ్ఎంసి ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పాదచారుల సౌకర్యాలను మెరుగుపరచడం, నగర వీధులను సుందరంగా తీరిదిద్దడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్ ప్రాంతంలో మోడల్ ఫుట్పాత్ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసి ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ సర్కిల్-18, ఖైరతాబాద్జోన్ పరిధిలోని రామానాయుడు స్టూడియో - రోడ్ నెం. 79/82 జంక్షన్ నుండి బీవిబా జంక్షన్, సివిఆర్ ఛానల్, రోడ్ నెం. 82 వరకు పాదచారుల రద్దీ అధికంగా ఉండే 1500 మీటర్ల పొడవైన మార్గాన్ని కవర్ చేస్తుంది. ఇందులో ఎడమ వైపు రూ. 1000 మీటర్లు, కుడి వైపు 500 మీటర్లు అభివృద్ధికి ప్రణాళికలను జిహెచ్ఎంసి రూపొందించింది. ఇందుకోసం మొత్తం రూ. 1 కోటి 68 లక్షలు వెచ్చించనున్నారు. వచ్చే 4 నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫుట్పాత్లో ప్లాస్టిక్ పేవర్ బ్లాకుల పయోగించబడుతోంది. ఈ బ్లాకులు.. 65-70% పోస్ట్-కన్స్యూమర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు అవుతాయి. 35 ఎంపిఏ కంప్రెషన్ బలం కలిగి ఉంటాయి 225ఎంఎం 112 ఎంఎంస 50 ఎంఎం(జిగ్-జాగ్ ప్యాటర్న్) పరిమాణంలో ఉంటాయి. సాధారణ కాంక్రీట్ పేవర్లకు సరిసమానమైన దృఢత్వంను అందిస్తాయి భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి పర్యావరణాన్ని కాపాడటానికి తోడ్పడతాయి స్మార్ట్ ఫుట్పాత్ కోసం సోలార్ గ్రిడ్ ఫుట్పాత్ పైభాగంలో 10 కెడబ్లూపి సామర్థ్యం గల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. 600 డబ్య్లూ లేదా అంతకంటే పై రేటెడ్ సోలార్ మాడ్యూల్స్ 10 కెడబ్లూ గ్రిడ్ -టైడ్ ఇన్వర్టర్. 8-10 అడుగుల ఎత్తులో ఎంఎస్ మౌంటింగ్ స్ట్రక్చర్ ఆటోమేటెడ్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లు, లైట్నింగ్ అరెస్టర్, ఎర్తింగ్, అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్లు, ఇన్స్టాలేషన్ & కమిషనింగ్ ఈ సోలార్ పందిరి ( రూప్ టాప్ ) పాదచారుల భద్రతను పెంచడంతో పాటు సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దివ్యాంగులకు అనుకూలంగా టాక్టైల్ పేవర్లు ( స్పర్శ సంబంధిత టైల్స్) దృష్టిలోపం ఉన్నవారికి, వృద్ధులకు మార్గనిర్ధేశం చేసేలా టాక్టైల్ పేవర్లు మరియు గైడ్ బార్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఫుట్పాత్ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది.
పవన్ కల్యాణ్వి తెలివితక్కువ మాటలు: జగదీష్రెడ్డి
కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న ఎపి డిప్యూటీ సిఎం పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్వి తెలివితక్కువ మాటలని, మెదడుకు పనిచెప్పకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ దిష్టి వాళ్లకు తగలడం కాదు, ఇన్నేళ్లుగా వాళ్ల దిష్టే మా తెలంగాణకు, హైదరాబాద్కు తగిలిందని కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజూ వందలాది మంది ఎపి నుంచే హైదరాబాద్కు వస్తున్నారని, అలాంటప్పుడు తమ దిష్టి ఎలా తగులుతుందని ప్రశ్నించారు. ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే, ఓ దిష్టిబొమ్మ పెట్టుకోవాలని, దాన్ని తామేమీ ఆపలేదని అన్నారు. ఇంత తెలివిలేని వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో గురువారం బిఆర్ఎస్ నేతలతో జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని, పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.10 వేల ఎకరాల విలువైన భూములను కారు చౌకగా, రేవంత్ రెడ్డి ఆత్మీయ బంధువులు అప్పగించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని, అందులో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 40 మంది ఉన్నారని అన్నారు. హైదరాబాద్ ప్రజలనే కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేయడమే ఈ హిల్ట్ పి పాలసీ అని పేర్కొన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పుకుంటూ ఒఆర్ఆర్ దగ్గర ఎకరం 137 కోట్లు పలికిందనీ చెప్తున్న ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములని కారు చౌకగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పారిశ్రామిక భూములను ఒక పథకం ప్రకారం తక్కువ ధరకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నాచారం, బాలానగరంలో గజం లక్ష యాభై వేలు మార్కెట్ ధర ఉంటే,10వేల రూపాయలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎకరానికి ప్రభుత్వానికి కట్టిదే 3 కోట్ల ఆదాయం వస్తే, రేవంత్ రెడ్డి బంధువులకు 30 కోట్లు లాభం చేకూరుతుందని ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భూములు ఉపయోగపడాలని కెసిఆర్ అన్నారని, పార్కులు, ఆసుపత్రులు కట్టేందుకు ఉపయోగపడాలని ఆయన చెప్పేవారని గుర్తు చేశారు. కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి హిల్ట్ పి పాలసీకి తెరలేపారని, మంత్రులకు వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించారని ఆరోపించారు. పారిశ్రామిక వాడలోనీ భూములను ఎవరికీ కేటాయించారో వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
Nizam College |తక్షణమె జీఓ 46 రద్దు చేయాలి
Nizam College | తక్షణమె జీఓ 46 రద్దు చేయాలి Nizam College
కెటిఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క
బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, బిసి రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. గురువారం ప్రజాభవన్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిందని పేర్కొన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, అయితే 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందని ఆమె స్పష్టం చేశారు. బీసీలకు జరిగిన ఈ అన్యాయాన్ని బీసీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. 2019 స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్ గా సర్పంచ్ల రిజర్వేషన్లను టిఆర్ఎస్ ఖరారు చేయగా, ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు మండల యూనిట్గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్గా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగిందని తెలిపారు. కుల గణనను పూర్తి చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం
ఐటీ, బయోటెక్ హబ్గా ఎదిగిన భాగ్యనగరం, ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతి …
MLA |విద్యుత్ స్థంభాలు వేయాలని ఆదేశాలు..
MLA | విద్యుత్ స్థంభాలు వేయాలని ఆదేశాలు.. MLA | జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ
Mulugu |సర్పంచ్16, వార్డు నెంబర్లు11 నామినేషన్లు దాఖలు.
Mulugu | సర్పంచ్16, వార్డు నెంబర్లు11 నామినేషన్లు దాఖలు. Mulugu | ములుగు,
School |పీఎం శ్రీనిధుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు..
School | పీఎం శ్రీనిధుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు.. School | మోత్కూర్,
ఎసిబికి పట్టుబడిన ఆర్మూరు మున్సిపల్ కమిషనర్..
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు మరో అవినీతి చేప చిక్కింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అస్తి పన్నుకు సంబంధించి ఓ వ్యక్తి నుంచి 20 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కమిషనర్ రాజును నిజామాబాద్ ఎసిబి అధికారులు పట్టుకున్నారు. కమిసనర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలోనే కాదు దేశంలో నిత్యం అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు.
MLA |ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్గా….
MLA | ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్గా…. MLA | రేగొండ, ఆంధ్రప్రభ :
Bhimavaram Balma from Anaganaga Oka Raju: Total Festive Blast
Star Entertainer Naveen Polishetty is back, and this time as a playback singer. Fans of Naveen Polishetty have a reason to celebrate! The first single from Anaganaga Oka Raju, Bhimavaram Balma, has dropped, and it’s already creating a solid buzz with a catchy vibe. The track has a fun, energetic feel with beats that instantly […] The post Bhimavaram Balma from Anaganaga Oka Raju: Total Festive Blast appeared first on Telugu360 .
బంగాళాఖాతంలో మరో తుఫాను.. భారీ వర్షాలు
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో వాయుగుండం ఏర్పడిందని.. అది తుఫాను మారుతోందని ప్రకటించింది. దీనికి దిట్వా తుఫానుగా నామకరణం చేశారు.ఈ తుఫాను నవంబర్ 30 నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి-దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీరప్రాంత రాష్ట్రాలలోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే శ్రీలంకలో భారీ వర్షాలతో కూడిన ఈదురుగాలులు ప్రారంభమయ్యాయని.. ఎపి, తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు.
Nizamabad | సర్పంచ్ బరిలో … Nizamabad | వేల్పూర్, ఆంధ్రప్రభ :
English Olympiad |ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు…..
English Olympiad | ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు….. English Olympiad | రేగొండ,
తనిఖీ చేస్తున్న కార్మికులను ఢీకొట్టిన రైలు.. 11 మంది మృతి
బీజింగ్: చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్లో టెస్ట్ రైలు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. గురువారం కార్మికులు ట్రాక్ను తనిఖీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. లూయాంగ్జెన్ స్టేషన్లో సాధారణ నిర్వహణ పనుల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చైనా రైల్వే కున్మింగ్ గ్రూప్ కో. లిమిటెడ్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికుని... రైల్వే అధికారులు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్లో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రైలు వ్యవస్థ ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి.
Tirumala |కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్
Tirumala |కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్ Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ
విద్యుత్ తీగలు తగిలి లారీకి అంటుకున్న మంటలు
విద్యుత్ తీగలు తగిలి లారీకి మంటలు అంటుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం పెంజర్ల గా్రమం నుంచి మహేశ్వరం మండలం నాగారం గ్రామనికి గడ్డిని లారీలో తరలిస్తుండగా విద్యుత్ తీగలు లారీకి తగిలి మంటలు అంటుకున్నాయి. అది గమనించకుండా లారీ డ్రైవర్ కొంచెం దూరం అలానే వెళ్లాడు. స్థానికులు తెలపడంతో లారీ డ్రైవర్ లారీని పక్కనే ఉన్న పంటపొలాల్లోకి తీసుకెళ్లి ఆపాడు. మంటలు ఎక్కువకావడంతో లారీని దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లి నీళ్లతో మంటలను ఆర్పాడు. ఈ ఘటనలో లారీ వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. రోడ్డుపై గడ్డి కట్టలు పడడంతో అందులోంచి వంచిన పోగతో వాహదారులు తీవ్ర ఇబ్బందికి గురైనారు.
Accidents |జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి
Accidents | జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి Accidents |
Minister |వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి …
Minister | వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి … Minister | మోత్కూరు, ఆంధ్రప్రభ :
అక్కడ.. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించిన హైకోర్టు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లా మహబూబపట్నం పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు.. ఒక సర్పంచ్, మూడు వార్డులు ఎలా రిజర్వ్ చేశారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉంటే.. మిగతా రెండు వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని సర్కార్ ను హైకోర్టు వివరణ కోరింది. కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. అయితే, బిసిలకు సరైన విధంగా రిజర్వేషన్లు కేటాయించలేదని.. ఈ ఎన్నికలపై స్టే విధించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
MLA |ఘనంగా జన్మదిన వేడుకలు…
MLA | ఘనంగా జన్మదిన వేడుకలు… MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ :
Chevella |అదనపు బస్సులు కేటాయించాలి
Chevella | అదనపు బస్సులు కేటాయించాలి ఎమ్మెల్యే, ఆర్టీసీ డిపో మేనేజర్ కు
judgment |భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
judgment | శ్రీకాకుళం(లీగల్), ఆంధ్రప్రభ : భార్యను హత్య చేసిన కేసులో ముద్దాయి
పాలమూరుకు రేవంత్ చేసింది శూన్యం:కెటిఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కెసిఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కెటిఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లను పూర్తి చేసి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్దేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డను అని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్టిఆర్ రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని పేర్కొంటూ కెటిఆర్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బిఆర్ఎస్ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని, ప్రజలు కెసిఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కెసిఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైపల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ఐక్యంగా ముందుకు సాగాలని కెటిఆర్ బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Medical |డాక్టర్ సుధాకుమారి సేవలు ఉత్తమం
Medical | డాక్టర్ సుధాకుమారి సేవలు ఉత్తమం కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూల్
WPL 2026 Auction.. దీప్తి శర్మకు రికార్డు ధర
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 4వ ఎడిషన్ కోసం గురువారం మెగా వేలం నిర్వహించారు. ఈ మెగా వేలంలో టీమిండియా బ్యాటర్ దీప్తి శర్మ రికార్డు ధరను దక్కించుకుని అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెను రూ.3.2 కోట్లతో యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. దీప్తి శర్మ తర్వాత న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.3 కోట్లు వెచ్చించి అమేలియాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. తెలుగమ్మాయి శ్రీ చరణీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, యూపి వారియర్స్ పోటీపడ్డాయి. రూ.1.3 కోట్లకు ఆమెను ఢిల్లీ సొంతం చేసుకుంది. పలువురు విదేశీ స్టార్ ప్లేయర్లు భారీ ధరలనే దక్కించుకున్నారు. ఇక, ఈ మెగా వేలంలో కొంతమంది ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలారు. సోల్డ్, అన్సోల్డ్ ప్లేయర్ల జాబితా: సోల్డ్ అయిన ప్లేయర్లు దీప్తి శర్మ - రూ.3.2 కోట్లు (యూపీ వారియర్స్) - RTM న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ - రూ. 3 కోట్లు (ముంబై ఇండియన్స్) న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ - రూ.2 కోట్లు (గుజరాత్ జెయింట్స్) రేణుకా సింగ్ ఠాకూర్ - రూ.60 లక్షలు (గుజరాత్ జెయింట్స్) ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్ - రూ.85 లక్షలు (యూపీ వారియర్స్) - RTM ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ - రూ.1.9 కోట్లు (యూపీ వారియర్స్) సౌతాఫ్రికా క్రికెటర్ లారా వోల్వార్డ్ట్ - రూ. 1.1 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) భారతి ఫుల్మాలి - రూ.70 లక్షలు (గుజరాత్ జెయింట్స్) - RTM ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ - రూ. 1.2 కోట్లు (యూపీ వారియర్స్) జార్జియా - రూ. 60 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కిరణ్ నవ్గిరే -రూ. 60 లక్షలు (యూపీ వారియర్స్) - RTM వెస్టిండీస్ ప్లేయర్ చినెల్లే హెన్రీ - రూ.1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) శ్రీ చరణి - రూ. 1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) ఇంగ్లాండ్ ఫాస్ట్బౌలర్ లారెన్ బెల్-రూ.90 లక్షలు(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) నాడిన్ డి క్లర్క్ - రూ. 65 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్- రూ.60 లక్షలు(ముంబై ఇండియన్స్) స్నేహ రానా - రూ. 50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్) రాధా యాదవ్ - రూ. 65 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) హర్లీన్ డియోల్ - రూ. 50 లక్షలు (యూపీ వారియర్స్) లిజెల్ లీ - రూ.30 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్) ఇంగ్లాండ్ బౌలర్ లిన్సే స్మిత్- రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) అన్సోల్డ్ అలిస్సా హీలీ గ్రేస్ హారిస్ సబ్బినేని మేఘన తజ్మిన్ బ్రిట్స్ అమీ జోన్స్ ఇజ్జీ చూపులు
Cheetahs |డిసెంబర్ 1 నుంచి చిరుతల లెక్కింపు
Cheetahs | డిసెంబర్ 1 నుంచి చిరుతల లెక్కింపు Cheetahs | శ్రీ
California almonds |రెండు సూపర్ఫుడ్ రెసిపీలు
California almonds | రెండు సూపర్ఫుడ్ రెసిపీలు California almonds | హైదరాబాద్,
బీసీలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
బీసీ కులాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Ambati Rambabu : లోకేశ్, పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు విన్నారా?
మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Peddi Chikiri BTS Special: Wow Mind-blowing efforts, Charan!!
Peddi’s Chikiri song has become a global sensation hitting more than 100 Million+ views across different languages. Mega Powerstar Ram Charan with ease and grace like only he can, made the hook step of the song, very popular. His styling, grace and background setting have added to the song’s reach and popularity. To attain that […] The post Peddi Chikiri BTS Special: Wow Mind-blowing efforts, Charan!! appeared first on Telugu360 .
DM&HO |టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు
DM&HO | టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు DM&HO | భీమిని, ఆంధ్రప్రభ
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమును వెంటనే ప్రభుత్వం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 590తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానములో ఏర్పాటు చేయడం ద్వారా 3700 కోట్లు అభివృద్ధి ఖర్చు ఏటా 500 కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని వారు తెలిపారు. సుమారు […] The post మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలి appeared first on Visalaandhra .
Police|భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
Police|భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు Police| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ :
Rangel |ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు
Rangel | ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు Rangel | రెంజల్, ఆంధ్రప్రభ
సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్..విశాలాంధ్ర- అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అనంతపురం నగర జనరల్ బాడీ సమావేశం గురువారం వి.కె. మెమోరియల్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి. నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సంద్భంగా జగదీష్ మాట్లాడతు… భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100 […] The post సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు…
విశాలాంధ్ర ధర్మవరం;పట్టణం లోని శారదానగర్ కు చెందిన కీ శే జుజారు మణి (40 సం) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి వారి సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివై. కుళ్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం ఉపాధ్యక్షులు […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు… appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావాలి
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : డీసీసీ అధ్యక్షుడు కావాలను కున్నావా దరఖాస్తు చేసుకోండి అని కాంగ్రెస్పార్టీ అదిష్టానం కోరుతుంది. గత 9 నెలలుగా డీసీసీ అద్యక్షుడు పదవీ ఖాళీగా ఉంది.ఖాళీగా ఉన్న అద్యక్షత పదవికి దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల పార్టీ అదిష్టానం పిలుపు నివ్వడం జరిగింది. కర్నూలు జిల్లా ఒకప్పటి కాంగ్రెస్పార్టీ అడ్డా .కాంగ్రెస్పార్టీకి ఉద్దండులను అందించిన జిల్లా కోట్ల విజయబాస్కర్రెడ్డి, దామోదరం సంజీవయ్య, పెండేకంటి వెంకటసుబ్బయ్య, మాచాని సోమప్ప, రాచోటి రామయ్య, కోసిగి దొరలు, […] The post కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావాలి appeared first on Visalaandhra .
'చికిరి' సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు పెద్ది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన చికిరి లిరికల్ వీడియో సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్, సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైనప్పటి నుంచి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. ఇప్పటికే 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్ దూసుకుపోతోంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ సాంగ్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ చేసిన హుక్ స్టెప్ చాలా పాపులర్ అయింది. ఈ సాంగ్ పై వరల్డ్ వైడ్ గా వేల రీల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మర్చి 27న ప్రపంచవ్యాప్తంగా పెద్ది మూవీ గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
Mukt Bharat |ప్రతి ఒక్కరి పాత్ర కీలకం
Mukt Bharat | ప్రతి ఒక్కరి పాత్ర కీలకం Mukt Bharat |
Collector|శెట్టిపల్లి లేఔట్ పనులు వేగవంతం చేయాలి
Collector|శెట్టిపల్లి లేఔట్ పనులు వేగవంతం చేయాలి Collector| తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Collector |ఎన్నికల సంస్కరణలపై సమీక్ష…
Collector | ఎన్నికల సంస్కరణలపై సమీక్ష… తిరుపతి ప్రతినిధి, ఆంధ్ర ప్రభ :
Huzurnagar |రైస్ మిల్ లో ప్రమాదం…
Huzurnagar | రైస్ మిల్ లో ప్రమాదం… నలుగురు కూలీలకు తీవ్రగాయాలుఇద్దరి పరిస్థితి
Megastar’s Remuneration for Mana Shankara Vara Prasad Garu
Mana Shankara Vara Prasad Garu is the upcoming movie of Megastar Chiranjeevi. The film is in the final stages of shoot and it is announced for Sankranthi 2026 release. Successful director Anil Ravipudi is carving out this family entertainer. Chiranjeevi is taking Rs 72 crores as remuneration for this film and his daughter Sushmitha Konidela […] The post Megastar’s Remuneration for Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .
స్ఫూర్తిదాయకంగా “దీక్ష దివాస్”
బి. వినోద్ కుమార్ మాజీ ఎం.పీ. అంబేద్కర్ చౌక్ వద్ద స్థల పరిశీలన. రాజన్న సిరిసిల్ల (జనంసాక్షి): నవంబర్ 29 దీక్ష దివాస్ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తామని …
Election |నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్, కలెక్టర్…
Election | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్, కలెక్టర్… Election | నార్కట్
హాంకాంగ్ అగ్నిప్రమాద ఘటన..55కి చేరిన మృతుల సంఖ్య.. 279 మంది మిస్సింగ్
హాంకాంగ్: హాంకాంగ్లోని తాయ్ పో జిల్లాలోని ఎత్తైన అపార్ట్మెంట్ భవనాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 55కి పెరిగిందని అధికారులు తెలిపారు. దీనిని, హాంకాంగ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన అగ్నిప్రమాదంగా పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం వాంగ్ ఫక్ కోర్టు కాంప్లెక్స్లోని 32 అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో ఐదు భారీ టవర్స్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 279 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని రక్షించిన సహాయక బృందాలు.. భవనాల్లో చిక్కుకున్న మిగతావారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం నాటికి నాలుగు భవనాల్లో మంటలు నియంత్రణలోకి వచ్చినట్లు అగ్నిమాపక సేవల విభాగం తెలిపింది. కాగా, ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి నరహత్య అనుమానంతో ముగ్గురు వ్యక్తులను హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు.
గోదావరిలో పడవ పోటీలు...#boats #latestnews #telugupost #godavaririver #fishing #viralvideo
గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలి
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రగ్రాద్ధతో పనిచేయాలి నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు,పొరపాట్లు లేకుండా చూడాలి వికారాబాద్ జిల్లా సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష …
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిజెపి సహకరించలేదు : పొన్నం
హైదరాబాద్: బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా? అని.. విపక్ష పార్టీలకు చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిజెపి సహకరించలేదని విమర్శించారు. కాంగ్రెస్ రిజర్వేషన్ల పక్షపాతి పార్టీ అని పొన్నం తెలియజేశారు. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న పార్టీ బిజెపి అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉండి ఉంటే.. గంటల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు దక్కేవని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లపై బిజెపి నేత లక్ష్మణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. బిసి రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ప్రిన్సిపాల్ సురేష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులు మెగా జాబ్ మేళా ని సద్వినియోగ పరుచుకోవాలి అని తెలిపారు.రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ […] The post జాబ్ మేళాకు విశేష స్పందన appeared first on Visalaandhra .
రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని చెకిచెర్ల గ్రామములో కొనసాగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామములోని భూ సర్వే పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడంతోపాటు ఆ గ్రామ ప్రజలు రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గౌడ్ నోటీసులు సక్రమంగా అందుతున్నాయా లేదా, రైతుల వద్ద ఉన్న పాస్ పుష్కాలను కూడా తాము పరిశీలించడం జరిగిందని తెలిపారు. […] The post రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ appeared first on Visalaandhra .
SIT Probe Gains Momentum in Phone Tapping Scandal, Key Aide of KCR Examined
After weeks of silence in phone tapping case, the Special Investigation Team revived its inquiry and questioned former Chief Minister KCR’s Officer on Special Duty, Rajasekhar Reddy. He was examined at the Jubilee Hills Police Station for nearly two hours, where investigators pressed him on several key points and formally recorded his statement. The renewed […] The post SIT Probe Gains Momentum in Phone Tapping Scandal, Key Aide of KCR Examined appeared first on Telugu360 .
MP |తాగునీరు, సైన్బోర్డులు అందుబాటులో ఉంచాలి
MP | తాగునీరు, సైన్బోర్డులు అందుబాటులో ఉంచాలి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి
Mahesh Babu Businessman |ప్రేక్షకుల ముందుకు బిజినెస్మేన్
Mahesh Babu Businessman | ప్రేక్షకుల ముందుకు బిజినెస్మేన్ సినీ థియేటర్లలో మహేశ్బాబు
Child marriages |బాల్య వివాహాలు అరికట్టాలి..
Child marriages | తుగ్గలి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న బాల్య
Nuzvidu |పీ-4 కార్యక్రమానికి బాసటగా నిలవాలి
Nuzvidu | పీ-4 కార్యక్రమానికి బాసటగా నిలవాలి నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష..
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. మూడు అవినీతి కేసుల్లో ఆమెకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం 21 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని BSS వార్తా సంస్థ ప్రకారం.. పుర్బాచోల్లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్ట్లో ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈ మూడు కేసులు హసీనాపై దాఖలు చేయబడ్డాయి. మూడు కేసుల్లో ప్రతి కేసులోనూ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఢాకా స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసుల్లో షేక్ హసీనా కొడుకు, కూతురికి కూడా కోర్టు శిక్ష విధించింది. ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ కు కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష టాంకుల జరిమానా విధించగా.. కుమార్తె సైమా వాజెద్ పుతుల్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఢాకాలోని పుర్బాచల్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ప్లాట్లను చట్టవిరుద్ధంగా కేటాయించారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ACC) గత జనవరిలో షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై ఆరు వేర్వేరు కేసులు దాఖలు చేసింది. మిగిలిన మూడు కేసుల తీర్పు డిసెంబర్ 1న రానుంది. ఇదిలావుంటే.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన ఘటనలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) జూలై 2024న షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.
AndhraPrabha Smart Edition|పోరు భూమిలో/అమరావతిలో/పంచాయతీ షురూ
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 27-11-2025, 4.00PM* *పోరు భూమిలో హరిత విప్లవం*
Bhimavaram Police Bust International Cybercrime Network Behind “Digital Arrest” Scam
In a significant breakthrough, Bhimavaram police have uncovered a sophisticated international cybercrime network responsible for a series of “digital arrest” scams that have recently targeted retired and vulnerable individuals. The investigation began after retired professor Sharma lost ₹78 lakh to fraudsters posing as CBI officials. The gang allegedly called him claiming that his SIM card […] The post Bhimavaram Police Bust International Cybercrime Network Behind “Digital Arrest” Scam appeared first on Telugu360 .
Jannaram |జిల్లా స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా ధర్మారం వాసి
Jannaram | జిల్లా స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా ధర్మారం వాసి జన్నారం
SEWAGE |కాలువల్లో చెత్త తొలగించండి
SEWAGE | కాలువల్లో చెత్త తొలగించండి మురుగునీరు రోడ్లపైకి రానీయొద్దుఇన్చార్జి జాయింట్ కలెక్టర్,
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. 12 గంటల్లో తుపానుగా మార్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 48 గంటల్లో (నవంబర్ 29 సాయంత్రం లేదా 30 ఉదయం నాటికి) ఉత్తర తమిళనాడు, […] The post బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. 12 గంటల్లో తుపానుగా మార్పు appeared first on Visalaandhra .
Temple |నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది..
Temple | నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది.. Temple | బాసర (నిర్మల్
MEDICAL |సేవా భావంతోనే పరమార్థం…
MEDICAL | సేవా భావంతోనే పరమార్థం… నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : సమాజంలోని
Crop |కాలానికి అనుగుణంగా పంటల సాగు చేయాలి
Crop | కాలానికి అనుగుణంగా పంటల సాగు చేయాలి Crop | తుగ్గలి,
వచ్చే ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తాం : ఉత్తమ్
హైదరాబాద్: నగరంలో పరిశ్రమలు ఒఆర్ఆర్ వెలుపలకు తరలించాలనేది తమ ప్రణాళిక అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హిల్ట్ పాలసీ ఎన్నో రకాలుగా ప్రయోజనకరం అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని తెలియజేశారు. ఏం చేసినా ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనే ధోరణి ప్రతి పక్ష నేతల్లో కనిపిస్తోందని విమర్శించారు. వచ్చే ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలియజేశారు. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పై కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ప్రతి పక్ష నేతలపై మండిపడ్డారు. విభజనచట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కాలం చెల్లిన పద్ధతిలో గత ప్రభుత్వం చేపట్టిందని, సబ్ క్రిటికల్ పద్ధతి వల్ల ఆర్థికంగా, పర్యావరణ పరంగా తీవ్రమైన నష్టం కలుగుతుందని ధ్వజమెత్తారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి కూడా భారంగా మారిందని, ఛత్తీస్ గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగాయని అన్నారు. ఇంకా మంజూరు చేయని, నిర్మాణం జరగని విద్యుత్ ప్లాంట్ లో అవినీతి ఎలా జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు.
Ayyappa devotees angry on Telangana Government
The Ayyappa Swamy devotees are angry over Telangana Government, as Police higher officials ordered their staff observing Ayyappa Deeksha to wear uniforms and not black colour clothes normally worn by Swamis during the Deeksha period. Ayyappa Swamy devotees gathered in large numbers and held a protest in front of Telangana DGP office on Thursday. The […] The post Ayyappa devotees angry on Telangana Government appeared first on Telugu360 .
స్మృతి మంధానకు మద్దతుగా జెమీమా కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: తన స్నేహితురాలు స్మృతి మంధానకు మద్దతుగా భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడు పలాశ్ తో జరగాల్సిన వివాహాన్ని మంధాన వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన స్నేహితురాలి పెళ్లి కోసం వచ్చిన జెమీమా రోడ్రిగ్స్..మంధానకు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం WBBL (మహిళల బిగ్ బాష్ లీగ్)లో ఆడుతున్న జెమీమా.. మంధాన పెళ్లి వేడుకకు హాజరైయ్యేందుకు ఇండియాకు వచ్చింది. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిన బాధలో ఉన్న మంధానకు అండగా ఉండేందుకు జెమీమా.. WBBL నుండి వైదొలిగింది. ఈ విషయాన్ని జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్స్ ప్రకటించింది. బిగ్ బాష్ లీగ్ 2025 సీజన్లోని చివరి నాలుగు మ్యాచ్ లు ఆడేందుకు జెమీమా తిరిగి రావడం లేదని తెలిపింది. కాగా, తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా.. సడెన్ గా తన వివాహాన్ని మంధాన వాయిదా వేయడం సంచలనంగా మారింది. మొదట అనారోగ్యం కారణంగా మంధాన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారని.. అయన కోలుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని స్మృతి తన వివాహాన్ని వాయిదా వేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తన కాబోయే భర్త పలాశ్ కూడా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలో పలాశ్, మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు తెలియడంతోనే స్మృతి, అతనితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రీవెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వివాహం ఎందుకు ఆగిపోయిందో ఇప్పటివరకు ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వర్తాలు ప్రచారం జరుగుతున్నాయి.

22 C