గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం
Kavitha Pushes Ahead with New Party ‘Telangana Praja Jagruti’, Awaits EC Clearance
K. Kavitha is taking clear steps towards launching her own political party in Telangana. The name Telangana Praja Jagruti is almost locked, and the groundwork for the party is already underway. She had applied to the Election Commission on January 23 seeking registration under the Representation of the People Act. But the process did not […] The post Kavitha Pushes Ahead with New Party ‘Telangana Praja Jagruti’, Awaits EC Clearance appeared first on Telugu360 .
bcci | పదవీకాలం పొడిగించండి బీసీసీఐకి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విన్నపం
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కిష్టయ్య
నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి, సీనియర్
కోడూరులో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజల పరుగులు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలంలోని కోడూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కోసం
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : గ్రామాల్లో యువత చెడు మార్గాలకు దూరంగా ఉండేలా
నవనాయకుల ఫలితాలు.... భవిష్య భారతం 2026-27
రాజు - గురువు: దేవతలకు గురువైన గురువుకి రాజ్యాధి పత్యం రావడం మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగం అభివద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి రావడం వలన దేశంసుభిక్షంగా ఉంటుంది. బంగారం, వెండి ఎప్పుడూ లేని విధంగా అధికంగా ధరలు పెరుగుతాయి, సామాన్యుడికి బంగారం అనేది ఒక కలగా మిగిలిపోతుంది. ప్రతి విషయంలో కూడా ధనానికి ఉన్నప్రాముఖ్యత ఎందులోనూ కనిపించదు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. పశు, పక్షి సంతతిని రక్షించే ప్రయత్నాలు జరుగుతాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, పప్పు దినుసులు అధికధర కలిగి ఉంటాయి. వ్యవసాయ భూములు అధిక ధర కలిగి ఉంటాయి. అకాల వర్షాలు, తుఫానులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడంలో వాతావరణ శాఖ విఫలమవుతుంది. చలనచిత్ర పరిశ్రమలో టాలెంట్ను బట్టి కాకుండా బ్యాక్గ్రౌండ్ ద్వారానే అవకాశాలు వస్తాయి. సుప్రీం కోర్టు తీర్పులు కొన్ని వివాదాస్పదం అవుతాయి. బంగారు ఆభరణాలలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. జ్ఞానం మరింతగా పెరుగుతుంది. సాంప్రదాయ బద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటారు. ధర్మ సత్రాలకు, మఠాలకు, జగద్గురువులకు ఆదరణ అనేది పెరుగుతుంది, హైందవ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. మంత్రి - కుజుడు: మంత్రిత్వం కుజునికి రావడం వలన శక్తివంతమైన రక్షణ శాఖ బలపడుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి. భూములు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అగ్నిప్రమాదాలు జరుగుతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. రాజకీయాలలో కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. లోహపు వస్తువులు అధిక ధరలు కలిగి ఉంటాయి. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి లభిస్తుంది. క్రికెట్, సినిమారంగం, రియల్ ఎస్టేట్ రంగం వారు బాగా రాణిస్తారు. యువత పెడదోవ పడతారు, వాయుకాలుష్యం పెరుగుతుంది. సేనాధిపతి - చంద్రుడు: సేనాధిపత్యం చంద్రుడుకి రావడం వలన భూముల ధర పెరుగుతుంది. అన్ని వస్తువులు ధర కలిగి ఉంటాయి. పాడి పరిశ్రమ అభివద్ధి చెందుతుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడతాయి. వాణిజ్య పంటలకు మద్ధతు ధర లభించదు. వేరుశనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది. పొగాకు పరిశ్రమకు గడ్డుకాలం. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. సినీ కళారంగాలలోని వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సస్యాధిపతి - శుక్రుడు: సస్యాధిపత్యం శుక్రుడికి రావడం వలన అన్నదాన సత్రాలు బాగుంటాయి. మద్యం ఏరులై పారుతుంది. ప్రతి విషయంలో స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు విద్యార్థినీ విద్యార్థులు బానిసలు అవుతారు. పాలకుల అండదండలతో కొంతమంది చెలరేగిపోతారు. క్రీడారంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. సినీ, కళారంగాలలోని వారికి, సాహిత్య రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. ధాన్యాధిపతి - బుధుడు: ధాన్యాధిపత్యం బుధుడికి రావడం వలన పెసలు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధమైన అన్ని తినుబండారాలు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది. దుంప కూర లు, ఆకుకూరలు, వేరుశనగ, ఉల్లి, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ అధిక ధర కలిగి ఉంటాయి. న్యాయవాదులకు, రచయితలకు, మిమిక్రీ ఆర్టిస్ట్స్ లకు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారికి, బోధనారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అర్గ్యాధిపతి - చంద్రుడు: అర్గ్యాధిపతి చంద్రుడికి రావడం వలన పంటలు బాగా పండును, పాల ఉత్పతులకు సంబందించిన అన్ని రకాల వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి. వర్షాలు సరైన కాలంలో పడడానికి అవకాశాలు వుంది, కొన్ని చోట్ల వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. రాగి, ఇత్తడి, వెండి అధిక ధర కలిగి ఉంటాయి, పూజా సామాగ్రి అధిక ధరలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ రంగాలలో వున్న స్త్రీలకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మేఘాధిపతి - చంద్రుడు: మేఘాధిపతి చంద్రుడుకి రావడం వలన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, వేరుశనగ, పప్పు దినుసులు అధిక ధర కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం వర్షపాతం అధికంగా ఉంటుంది. గో సంపద పెరుగుతుంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం వుంది. రసాధిపతి-రవి: రసాధిపతి - రవికి రావడం వలన గోధుమలు, వరి, అన్ని రకాల నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. రాగి సంబంధించిన వస్తువులు అధిక ధర ఉంటుంది. తేనె, కందులు అధిక ధరలు కలిగి ఉంటాయి, రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు గడ్డుకాలం (కొంతమందికి మాత్రమే). చంద్రుడు మన:కారకో చంద్ర అన్నారు. అంటే మన మనసు అనేది చంద్రుని ఆధీనంలో ఉంటుంది అని. మన మనోబలానికి చంద్రుడే కారకుడు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు. సూర్య మండలంలోని గ్రహాలలో చంద్రుడొక్కడే భూమి చుట్టూ తిరిగే గ్రహం. మన దైనందిన కార్యక్రమాలు చంద్రుని మీద ఆధారపడి ఉంటాయి. చంద్రుడు అనుకూలమైన రాశిలో ఉన్నప్పుడు ఉత్సాహంగా, ప్రతికూలమైన రాశిలో ఉన్నప్పుడు నిరుత్సాహంగా, కృంగిపోయినట్లు ఉంటాము. రవిచంద్రులను రాజగ్రహాలని అంటారు. రవి పురుష గ్రహం, చంద్రుడు స్త్రీ గ్రహం. చంద్రుడు కర్కాటకరాశికి అధిపతి. వృషభరాశి చంద్రునికి ఉచ్ఛ స్థానము, వృశ్చికరాశి నీచస్థానము. కర్కాటకరాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన వారికి చంద్రుడు బలంగా ఉన్నాడని, వృషభ రాశి అన గా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాల యందు జన్మించిన వారికి చం ద్రుడు అధికబలం కలిగి ఉన్నాడని అర్థం, అదే విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ నక్షత్రాలు కలిగి వృశ్చికరాశి వారికి చంద్రబలం తక్కువ. జాతకంలో లగ్నం నుండి గ్రహాలు ఉన్న స్థితిననుసరించి ఫలితాలు చెప్పినట్టే చంద్రరాశిని, చంద్రలగ్నంగాపేర్కొంటూ అక్కడి నుండి గ్రహాల స్థితిని గమనించాలి. ముఖ్యంగా గోచార ఫలితాలు చంద్రరాశి నుండే చెప్పడం సాంప్రదాయంగా వస్తుంది. చంద్రునికున్న ప్రాముఖ్యత జన్మనక్షత్రానికి కూడా ఉంటుంది. చంద్రుని నక్షత్రాలు అయినటు వంటి రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి జనన సమయంలో చంద్రదశ జరుగుతున్నట్టే. ముహూర్తాలకు తారాబలం, చంద్రబలాలను చూడవలసి ఉంటుంది. దైనందిన జీవితంలో కూడా దానిని చూసి ఏ రోజు అనుకూలమైనదో, ఏ రోజు మనకు అనుకూలం కాదో తెలుసుకోవచ్చు. చంద్రుడు మానసిక వికాశానికి, మనోధైర్యానికి కారకత్వం వహిస్తాడు. ఏ సమస్య వచ్చినా దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవటంలో చంద్ర గ్రహం పాత్ర చాలాముఖ్యమైనది. ఎవరికైతే చంద్రబలం బాగుంటుందో వారు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబలం బాగాలేకపోతే వారు తీసుకునే నిర్ణయాల వలన చాలా సందర్భాలలో సమస్యలను ఎదుర్కొంటారు. చంద్రుని గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిశ్యశాస్త్ర రీత్యా పూర్ణ చంద్రుడిని శుభుడిగా, క్షీణ చంద్రుడిని పాపిగా చెప్పారు. పూర్ణ చంద్రుడు అనగా శుక్ల పంచమి నుండి బహుళ పంచమి వరకు ఉండే చంద్రుడిని పూర్ణచంద్రుడు అంటారు. చంద్రునికి మిత్రులు రవి, బుధులు. శత్రువులు ఎవ్వ రూ లేరు. కుజ, గురు, శుక్ర, శనులు సములుగానే పేర్కొనబడ్డారు. బుధ, శుక్ర, శనులకు చంద్రుడు శత్రు గ్రహం. అందువలన మిథున. కన్య(బుధ రాశులు), వృషభ, తుల (శుక్ర రాశులు), మకర, కుంభ (శని రాశులు), రాశులయందు చంద్రుడు ఉంటే ఆయా రాశులలో శత్రువు ఉన్నట్టే లెక్క. ఆ శత్రుత్వాన్ని శాంతి చేయడానికి చంద్రునికి పరిహారాలు, దానాలు చేయవలసి ఉంటుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని ‘చంద్ర గ్ర హణం’ అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలా సే పు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది. చంద్రుడు మాతృకారకుడు. తల్లికి ఆరోగ్యం బాగుండకపోయినా, తనకు మానసికంగా వేదన ఉన్నా, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థికంగా బాధపడు తున్నా చంద్రునికి శాంతి క్రతువులు చేయడం మంచిది.
cricketer |తండ్రయిన టీమిండియా మాజీ వికెట్ కీపర్
cricketer | తండ్రయిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ సోషల్ మీడియా వేదికగా
రవి గ్రహం గురించి సూక్ష్మంగా..
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగుతుంది. అందువలననే రాత్రి పగలు ఏర్పడుతాయని మనందరికి తెలిసిన విషయమే. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టు తిరుగుట వలన వెన్నెల రాత్రులు, చీకటి రాత్రులు ఏర్పడుతున్నవి. ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుభవించే సుఖ దుఖాలకు, లాభనష్టాలకు, వినోదాలకు, విచారాలకు ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ అన్నిటి కంటే ముఖ్యమైన కారణం నవగ్రహాల ప్రభావం, అంతరిక్షంలో సూర్య మండలంలో సంచరించే గ్రహాల స్థితిగతులను అనుసరించి మన జీవన విధానం జరుగుతుందని మన మహర్షులు మనకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలియజేశారు. మానవ జీవితంపై రవిగ్రహ ప్రభావం, ప్రాముఖ్యత తిరుగు లేనిది. అన్ని గ్రహాలు కూడా రవిగ్రహం చుట్టే తిరుగుతాయి. ఈ రవి గ్రహం నవగ్రహాలకు అధిపతి. ఈ రవిగ్రహం అనుకూలంగా ఉంటే స్థిరమైన అధికారం, మంచి ఆరోగ్యము, పుత్ర సంతాన ప్రాప్తి కలుగు తుంది. సింహరాశికి అధిపతి రవి. మేషరాశి రవికి ఉచ్ఛస్థానం, తులారాశి నీచస్థానం. రవికి చంద్ర, కుజ, గురువులు మిత్రులు, బుధుడు సముడు. శుక్ర, శనులు శత్రు గ్రహాలు. రవికి శత్రుక్షేత్రాలు మకరం, కుంభం. మిత్రక్షేత్రం మీనం. సింహరాశిలో జన్మించిన వారు రవిగ్రహ ఆధిపత్యంలోకి వస్తారు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టిన వారు, ఆదివారం రోజున పుట్టిన వారిపై రవి గ్రహ ప్రభావం ఉంటుంది. రవి పితృకారకుడు. రవి, సింహ రాశి మన శరీరంలో గుండెను తెలుపుతుంది. మగవారికి కుడి కన్ను, ఆడవారికి ఎడమ కన్ను రవి గ్రహ ప్రభావంలోకి వస్తాయి. రవి మేష రాశి ప్రవేశం నుండి సూర్యమాన సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం చాంద్రమానం అనుసరిస్తాము. ఆదిత్యుడు, భానుడు, భాస్కరుడు, దినకరుడు, సూర్యుడు ఇవన్నీ కూడా రవిగ్రహం యొక్క పేర్లే. సూర్య చంద్రుల మధ్య దూరం అనుసరించి తిథులు, యోగం, కరణం లెక్కవేస్తారు. రవి గ్రహ జాతకులకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా అనారోగ్యం వచ్చినా త్వరగా కోలుకుంటారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలకు, స్థిరమైన ఉద్యోగాలకు రవి కారకుడు. ఒక వ్యక్తి వైద్యవృత్తిలో రాణించాలంటే రవి గ్రహ అనుగ్రహం తప్పని సరి. రవిగ్రహంతో కలిసి ఉన్న ఇతర గ్రహాలను అనుసరించి వైద్య వృత్తిలో ఏ విభాగంలో రాణిస్తారో తెలుసుకోవచ్చు. రవిగ్రహ ఆధిపత్యంలో ఉన్న సింహరాశి స్థిరరాశి, పురుష రాశి, అగ్నితత్వ రాశి. అందువలన ఈ రాశిలో జన్మించిన వారు దృఢసంకల్పం కలిగి ఉంటారు, ఏదైన ఒక పనికి పూనుకుంటే అది విజయవంతం అయ్యే వరకు సహనంతో, ఆత్మవిశ్వాసంతో, దృఢసంకల్పంతో పనిచేస్తారు. ఎక్కువగా మాట్లాడరు, మౌనం ఎక్కువగా పాటిస్తారు. రవి అనుకూలంగా ఉన్నప్పటికీ బలం లేక మంచి జరగని సమయంలో అప్పుడు రవిగ్రహానికి సంబంధించిన పూజలు, హోమాది క్రతువులు చేయాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నా అవి బలహీనత వల్ల సత్ఫలితాలు అందుకోలేకపోతున్నప్పుడు కావలసినవి పూజలు, జపాలు, శాంతులు, పరిహారాలు. రవికి బలం లేనప్పుడు అనగా స్వక్షేత్రమైన సింహరాశిలో కానీ, ఉచ్ఛస్థానమైన మేషరాశిలో కానీ లేకపోవడం నీచస్థానమైన తులలో, శత్రురాశులలో (వృషభ, తులా, మకరం, కుంభ, రాశులలో) ఉండటం. రవికి నవధాన్యాలలో గోధుమలు ప్రీతికరమైనవి, కనుక నవగ్రహాలు ఉన్న గుడిలో ఆదివారం రోజున రవిగ్రహానికి అర్చన చేసి, గోధుమలు దానంగా ఇవ్వాలి. అలాగే రవిగ్రహ స్తోత్రం, ఆదిత్య హృదయం పఠించడం మేలు చేస్తుంది. :: పంచాంగ కర్త :: శ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి వైధిక్ఆస్ట్రో.కామ్ (www.vydicastro.com) ఫోన్ నెం: 90141 26121, 84669 32224/2225
Babu-Jagan |సాంప్రదాయ దుస్తుల్లో సీఎం, మాజీ సీఎం
Babu-Jagan | సాంప్రదాయ దుస్తుల్లో సీఎం, మాజీ సీఎం Babu-Jagan | ఆంధ్రప్రభ,
ఖతార్ గ్యాస్ ప్లాంట్పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్పై తీవ్ర ప్రభావం!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్లోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఎల్ఎన్జీ ప్లాంట్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా ఆస్తులతో పాటు, ఇంధన ఉత్పత్తి […] The post ఖతార్ గ్యాస్ ప్లాంట్పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్పై తీవ్ర ప్రభావం! appeared first on Visalaandhra .
శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు.. సిఎం రేవంత్ కు ఆహ్వానం
హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27 న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఇఒ దామోదర్ రావు ఉన్నారు.
నార్సింగి జామా మసీదులో ఘనంగా రంజాన్ కార్యక్రమాలు
నార్సింగి, ఆంధ్రప్రభ ; నార్సింగి జామా మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక
ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో పండుగల సందడి నెలకొన్న వేళ, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిచ్చే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసపు పవిత్ర ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా్ను పురస్కరించుకుని రేపు ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలిడే)ను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.వాస్తవానికి, ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఐచ్ఛిక సెలవును తొలుత మార్చి 13న ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, రంజాన్ మాసపు చంద్రదర్శనం, పండుగ కాలాన్ని నిశితంగా పరిశీలించిన తెలంగాణ స్టేట్ […] The post ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం appeared first on Visalaandhra .
మీర్ పేట్ లో పిల్లి చనిపోయిందనే బాధతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
రంగారెడ్డి: పెంపుడు పిల్లి చనిపోయిందనే బాధతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బడంగ్పేట ప్రాంతం వెంకటాద్రి కాలనీలో హిమబింధు అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. హిమబింధు డిగ్రీ చదువుతోంది. ఇంట్లో పెంపుడు పిల్లి చనిపోవడంతో ఆమె విషాదంలో మునిగిపోయింది. పిల్లి మృతిని తట్టుకోలేక బుధవారం ఉదయం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
గ్రామీణాభివృద్ధికి వాటర్ షెడ్ పాత్ర కీలకం
గ్రామీణాభివృద్ధికి వాటర్ షెడ్ పాత్ర కీలకం స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :
భారీ మూల్యం తప్పదు…ఇజ్రాయెల్కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజానీని ఇజ్రాయెల్ హత్య చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీనిపై ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దుశ్చర్యకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.. ‘‘మా నాయకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ తన పతనానికి తానే పునాది వేసుకుంటోంది. ఇలాంటి హత్యలతో మా మనోస్థైర్యం దెబ్బతినదు, మా విప్లవ పోరాటం మరింత ఉద్ధృతమవుతుంది‘‘ అని […] The post భారీ మూల్యం తప్పదు…ఇజ్రాయెల్కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక appeared first on Visalaandhra .
Ys Jagan : ఈసారి ఒంగోలు టిక్కెట్ ఆ ఇద్దరికీ కాదటగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఒంగోలుకు కొత్త అభ్యర్థిని రెడీ చేస్తున్నారు
భారతాన్ని విశ్వగురుగా నిలపాలి..
భారతాన్ని విశ్వగురుగా నిలపాలి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు
నెల్లూరులో కూల్డ్రింక్స్ లారీ బోల్తా.. ఎగబడిన స్థానికులు #Nellore #RoadAccident #CoolDrinksLorry
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో విధించిన టారిఫ్ల భారంతో ప్రపంచ వాణిజ్యం ఏ విధంగా ఒడిదుడుకులకు లోనయ్యిందో ఇప్పుడు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై సాగిస్తున్న యుద్ధం బీభత్సంగా తయారై ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా, భారత్పైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అసలు ఈ యుద్ధం వల్ల అమెరికాకు ఎంతవరకు లాభమని, ఇజ్రాయెల్ ఒత్తిడితో తప్పుదారి పట్టడం మంచిది కాదని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ నేరుగా ట్రంప్కు లేఖ రాసి నిలదీశారు. అంతేకాదు ఇరాన్పై యుద్ధానికి మద్దతు ఇవ్వడానికి తన మనస్సాక్షి అంగీకరించడం లేదని తన పదవికి జో కెంట్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధంలో ఇరాన్ గట్టిగా ఎదుర్కొని అమెరికాను ధిక్కరించడం ట్రంప్లో యుద్ధోన్మాదాన్ని మరింత పెంచుతోంది. ఇందులో అమెరికాకు మద్దతుగా యుద్ధం లోకి దిగడానికి ఇతర దేశాలు తిరస్కరిస్తున్నాయి. స్పెయిన్ తన భూభాగంలో మిలిటరీ స్థావరాలను అమెరికా వినియోగించుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఇది మానవత్వ ప్రయోజనాలకు విరుద్ధమని, అక్రమమని స్పెయిన్ స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పిడికిలినుంచి తప్పించడానికి సాయపడేలా ఐరోపా యుద్ధనౌకలను పంపించకుంటే భవిష్యత్ ఉండబోదన్న ట్రంప్ హెచ్చరికలను నాటో దేశాల కూటమి ఖాతరు చేయడం లేదు. ఈ యుద్ధాన్ని పొడిగించడానికి తాము జోక్యం చేసుకోబోమని బ్రిటన్ ఖరాఖండీగా తేల్చిచెప్పింది. అత్యంత శక్తిమంతమైన అమెరికా నేవీ దళాలే ఏమీ చేయలేకపోతున్నప్పుడు యూరప్ యుద్ధనౌకలను పంపించాలని ట్రంప్ ఎందుకు భావిస్తున్నారు? అని జర్మనీ రక్షణ మంత్రి ఎద్దేవా చేశారు. టారిఫ్ల విధింపుతో ప్రపంచ దేశాలు తనకు మోకరిల్లేలా ట్రంప్ మరీమరీ పీడించారు. ఒప్పందాలు కుదుర్చుకునేలా బలవంతం చేశారు. నా ఇష్టం నేనేదైనా చేస్తాను, చేయగలను అని హూంకరించారు. అయితే ఇది అంతటా, ఎల్లవేళలా సాగదు. చైనా తన అపురూప ఖనిజాల బలంతో బూచిని చూపించింది. మిగతా దేశాలు తిరస్కారం అంతగా చూపించకుండా తమ ఉనికిని కాపాడుకోవడానికి స్థితిస్థాపకతను ప్రదర్శించాయి. ట్రంప్ అస్థిరమైన, అనూహ్య నిర్ణయాలకు కొన్నిదేశాలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. ఇప్పటికి భారత్ కూడా తనకు కావలసిన ఇంధనం అవసరాలు హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యేలా ఇరాన్తో సంప్రదింపులు సాగించింది. అయినప్పటికీ ట్రంప్ తన వినాశన విధానాలను మార్చుకోవడం లేదు. ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇది ఒక్క ట్రంప్ విషయం లోనే కాదు, అధికార గర్వాంధకారంతో తుళ్లిపడే ఎవరికైనా చరిత్ర ఎన్నో గుణపాఠాలు నేర్పిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నిర్ణయానికి ఎదురులేదన్న అతిశయంతో ఎమర్జెన్సీని విధించి తరువాత వచ్చే ఎన్నికల్లో భంగపడ్డారు. లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ టెస్టోస్టెరాన్ క్యాన్సర్ను జయించి, సైక్లింగ్ చరిత్రలో అత్యంత గొప్ప క్రీడాకారుడుగా గుర్తింపు పొందాడు. ఆ సమయంలో అతణ్ణి ఎవరూ ఓడించలేరని, అజేయుడని ప్రపంచం నమ్మింది. కానీ 2013 లో నిషేధిత ఉత్ప్రేరకాలను వినియోగించినట్టు ఒప్పుకుని సైక్లింగ్లో జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఒకప్పుడు హాలీవుడ్ రాజుగా వెలుగొందిన హార్వేవెయిన్స్టెయిన్ ప్రముఖ నిర్మాత మాత్రమే కాదు, ఆస్కార్ అవార్డులు ఎన్నో గెల్చుకున్న మిరామాక్స్ స్టుడియో నిర్మాత. అయితే 2017 లో అతని లైంగిక వేధింపుల నేరాలు పతనానికి దారితీశాయి. 202223 లో వేర్వేరు అత్యాచార కేసుల్లో ఆయనకు న్యూయార్క్ కోర్టు 23ఏళ్ల జైలుశిక్ష విధించింది. అధికారం చేతిలో ఉన్నప్పుడు పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని గర్వంతో, అహంకారంతో విర్రవీగుతుంటారు. అదే విధంగా వ్యవహరిస్తున్న ట్రంప్కు 2026లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన విస్తృతమైన గ్లోబల్ టారిఫ్లు చట్ట విరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులనే ట్రంప్ అపహాస్యం చేశారు. మూర్ఖులని, లాప్డాగ్స్ అని తీవ్రంగా వ్యాఖ్యానించారంటే ఆయన ఎంత దురహంకారంతో ఉన్నారో తెలుస్తుంది. ఇప్పటికీ ట్రంప్లో పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేసిన తరువాత క్యూబా సంగతి తేలుస్తానని హెచ్చరిస్తున్నారు. ప్రాచీన గ్రీకు సామెత గుర్తు తెచ్చుకుంటే నిర్లక్షం కన్నా దురహంకారం చాలా ప్రమాదం అని ఏనాడో చెప్పారు. ఇది కేవలం వ్యక్తిత్వ లోపం మాత్రమే కాదు. విశ్వ, సామాజిక క్రమాన్ని ఉల్లంఘించడం అవుతుంది. అధికారం గర్వం ప్రతీకారం అనే ధోరణిలోనే ఇలాంటి కథలు సాగుతుంటాయి. 1945 1952 ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీ దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో అమెరికా కీలక పాత్ర వహించిందని చరిత్ర చెబుతోంది. 1947లో అమెరికా సాయంతో జపాన్ కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఆమోదించింది. చక్రవర్తి అధికారాలను తగ్గించి ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పించింది. అలాగే జర్మనీలో నాజీయిజం నిర్మూలించి సోవియెట్ యూనియన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి స్థిరమైన, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సృష్టించడం అమెరికా ప్రధాన వ్యూహంలో భాగమైంది. యుద్ధానంతరం ప్రపంచంలో శక్తివంతమైన మిత్రదేశాలుగా జపాన్, జర్మనీలను తీర్చిదిద్దడంలో అమెరికా పాత్ర కీలకమైందని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో అమెరికా నేతృత్వం లోని కూటమి జరిపిన ‘ప్రభుత్వాలను పడగొట్టే యుద్ధాలు’ ముఖ్యంగా ఇరాక్, లిబియా, అఫ్గానిస్థాన్ ప్రభుత్వాల మార్పు ప్రపంచ రాజకీయాలను, భౌగోళిక పరిస్థితులను పూర్తిగా మార్చి వేశాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికే ఈ యుద్ధాలని పైకి చెబుతున్నా ఫలితాలు మాత్ర వినాశకరంగా మారడం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది.
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు శ్రీ పరాభవ
అగ్ని కిరాతకం… నిరుపేద రైతు ఇల్లు బూడిద
అగ్ని కిరాతకం… నిరుపేద రైతు ఇల్లు బూడిద ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: మనుషుల
రైతును రాజుగా చేయాలనేదే మా లక్ష్యం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సిఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ అని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని పేర్కొన్నారు. ‘‘రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖ శాంతులతో ఉంటుంది. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేసింది. రైతు భరోసా ద్వారా ఇప్పటికే రూ.18 వేల కోట్లు ఇచ్చాం. ఈ నెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా కార్యక్రమం ప్రారంభమవుతుంది. రైతుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని సిఎం అన్నారు.
అధికారంలో ఉన్నపుడు పార్టీగా కాంగ్రెస్ బలహీనంగా కనిపిస్తుంది, అనైక్యత ప్రబలుతుంది అనే పరిశీలన ఒకటుంది. ఒకవైపు పెరిగే ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు పార్టీ అంతర్గత వైరుధ్యాలు, బహిరంగ వ్యాఖ్యలు, అసంతృప్తులు సంస్థాగత స్థితిని దిగజార్చడం వల్లే ఎన్నికల సమయానికి అది మరింత బలహీనపడటం, అధికారం కోల్పోవడం లోగడ పలుమార్లు రుజువైంది. అలా కాకుండా, అధికారంలో ఉన్నపుడు పార్టీని ఓ కంట కనిపెడుతూ, జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి అధికారం నిలబెట్టుకున్న సందర్భాలు కాంగ్రెస్లో అరుదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో 2009 ఎన్నికల్లో గెలుపు అటువంటిదే! అదైనా, వైఎస్ఆర్ మాటల్లోనే చెప్పాల్సి వస్తే, ‘బొటాబోటి పాస్ మార్కులతో (156/294) గట్టెక్కడం’ మాత్రమే! తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత, అంటే నాలుగున్నర దశాబ్దాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణలో కాని, అదొకటే కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం నిలబెట్టుకున్న సందర్భం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేళ్లు ప్రభుత్వం మాదే, నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు. అందుకు వీలుగా పార్టీని ఐక్యంగా, సమర్థంగా ఉంచే విషయంలో ఆయన ప్రాధాన్యతలేంటి? కార్యాచరణ ఎలా ఉంది? అవి ఎంతమేర చెల్లుబాటవుతున్నాయి? ఇది కోటి రూకల ప్రశ్న! ఎందుకంటే, సిఎం ఇటీవలి సిఎల్పి సమావేశంలో మాట్లాడుతూ ‘మీడియాతో చిట్చాట్లు వద్దు.. ప్రభుత్వం పోతే నేనొక్కడిని కాదు, మొత్తం పార్టీ వ్యవస్థ మునుగుతుంది’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇది జరిగిన 24 గంటల్లో పలువురు మంత్రులు, ఎంఎల్ఎలు, ఇతర నాయకులు ఇష్టానుసారం మాట్లాడారు. ఆయన చెప్పిన ‘పార్టీ లైన్’ అనే లక్ష్మణరేఖను ఖాతలు చేసినట్టు కనబడదు. కాంగ్రెస్లోనే పుట్టి, ఎదిగిన వారికి ఆదరణ కరువవుతోందని, బయటినుంచి వచ్చిన వారికే ప్రభుత్వంలో, పార్టీలో అందలాలు దక్కుతున్నాయనే అసంతృప్తి లోలోపల రగులుతోంది. ప్రభుత్వ పెద్దలు, పిసిసి నాయకత్వంపైనా పార్టీ సీనియర్లు కొందరు గుర్రుగా ఉన్నారు. అభిప్రాయ భేదం, బహిరంగ వ్యాఖ్యలు ఒకటేనా? రాజకీయ పార్టీగా కాంగ్రెస్లో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలుండొచ్చు. బహిరంగ వ్యాఖ్యలే పార్టీకి చేటు చేస్తాయని కార్యకర్తల శ్రేణులు భావిస్తున్నాయి. పిసిసి పీఠం, బిసి వర్సెస్ అగ్రవర్ణం వంటి వివాదమొకటి మొదలైంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలో, నాయకత్వ మార్పిడో లేని ప్రస్తుత తరుణంలో పిసిసి నేతగా ఫలానా నాయకుడుంటే బాగుంటుందనే వ్యాఖ్య, అదీ ఒక మంత్రి చేయాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్న సహజం! అది కూడా ‘చిట్చాట్’లు వద్దు అని ముఖ్యమంత్రి చెప్పిన గంటల్లోనే! పిసిసి నేతగా జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్రెడ్డి) ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్య వివాదమే రేపింది. ఫలితంగా, పిసిసి ప్రస్తుత అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్కు అనుకూలంగా కొందరు నాయకులు బహిరంగ ప్రకటనలు చేసే పరిస్థితి తలెత్తింది. ఇంకోవైపు మంత్రి సోదరుడు, ఎంఎల్ఎ రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ తానెవరికీ భజన చేయనని, పేద ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు పోరాడుతానని, తనలాంటి వాళ్లే రాజకీయాల్లో మార్పు తేగలరనే వ్యాఖ్య చేసినట్టు వార్తా కథనాలొచ్చాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్కుమార్ పైన పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్లో ఉండి నాయకుల్ని సమన్వయపరుస్తూ, పార్టీని నడిపించాల్సింది అంతకన్నా ఇతర విషయాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎవరెవరి వెంటో తిరుగుతారనే విమర్శ ఉంది. మహిళా కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షురాలి నియామకాంశం కూడా వివాదాస్పదమైంది. పలు కార్పొరేషన్ల చైర్మన్లుగా పార్టీ నాయకుల్ని నియమించి రెండేళ్లయినా, డైరెక్టర్లను వేయకుండానే వారి పదవీ కాలం ముగింపునకొచ్చింది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, పార్టీ కోసం పనిచేసిన వారికి డైరెక్టర్లుగా అవకాశం కల్పించాల్సింది కదా? అని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోగడ పార్టీ సమావేశంలో అడిగినపుడు, పిసిసి నుంచి సిఫారసు జాబితా రాలేదని ముఖ్యమంత్రి పేర్కొన్న విషయాన్ని పార్టీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. పిసిసి నేత ‘ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్’లా వ్యవహరిస్తున్నారన్న సిఎం వ్యాఖ్య అటువంటి ఒక సందర్భంలోదే! ఇక, ‘జీవన్రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, ఆయనను పార్టీ అధినాయకత్వం సంప్రదించి, అనునయించి ఉండాల్సింది’ అన్న సీనియర్ మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్య పార్టీలో ఆలోచనలు రేపుతోంది. ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు జీవన్రెడ్డి అసంతృప్తి పార్టీలో అకస్మాత్తుగా పుట్టిన సమస్య కాదు. చాన్నాళ్లుగా రగులుతున్నదే! 2021, నాగార్జున్సాగర్ ఉపఎన్నికలకు ముందరే జీవన్రెడ్డి పేరు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఖాయమైంది. పలువురు అభినందనలు కూడా చెప్పారు. అప్పుడు ప్రచార కమిటీ నేతృత్వానికి రేవంత్రెడ్డి అంగీకరించడం, ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించడం జరిగాయి. రేపోమాపో జీవన్రెడ్డి పేరు పిసిసి పీఠానికి ప్రకటిస్తారన్నపుడు, ఆ దశలో వద్దని ఉపఎన్నిక తర్వాతే ప్రకటించాలని మాజీమంత్రి జానారెడ్డి తదితరుల ఒత్తిడితో అధిష్టానం ప్రకటన ఆపింది. కానీ, తర్వాతి పరిణామాల్లో ఆయన కాకుండా రేవంత్రెడ్డి పిసిసి అధ్యక్షుడవడం, ఎన్నికల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే! పట్టభద్రుల నియోజకవర్గంనుంచి ఎంఎల్సి అయిన జీవన్రెడ్డికి ఆయన కోరిన రీతిలో మరోసారి ఎంఎల్సి అయ్యే అవకాశాన్ని పార్టీ కల్పించలేదు. అంతకు మించి, తనపైన గెలిచివచ్చిన బిఆర్ఎస్ ఎంఎల్ఎ సంజయ్ అధికారికంగా కాంగ్రెస్లో చేరకపోయినా పార్టీలో, ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఆయనకే కల్పించడం రాజకీయంగా తన ఉనికికి పెరుగుతున్న ప్రమాదంగా జీవన్రెడ్డి భావిస్తూ వచ్చారు. దాన్ని ఆయనేం దాచుకోకుండా ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. పార్టీ వీడనున్నారని తెలిసి ఇదివరకే ఒకసారి ఢిల్లీ పెద్దలు మాట్లాడి, జీవన్రెడ్డిని అనునయించి ఉన్నారు. కానీ, ఇప్పుడాయన పార్టీ వీడతారని, నెలాఖరులో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని వార్తలొచ్చాయి. భవిష్యత్ నిర్ణయించలేదు కానీ, పార్టీలో కొనసాగలేని పరిస్థితి ఉందని జీవన్రెడ్డియే స్వయంగా ప్రకటించారు. ఈ తరుణంలో జీవన్రెడ్డి వ్యవహారంపై పాత కరీంనగర్ జిల్లా నేత, సీనియర్ మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యలు, అదీ సిఎల్పి భేటీలో సిఎం వ్యాఖ్యల తర్వాత రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ, అందరికీ ‘సమయం’ ఇవ్వాల్సిన సమయమొచ్చింది. తగిన సమయం ఇవ్వట్లేదని.. ఇంకా ఇతరత్రా కారణాలతో కార్యకర్తలు ఎంఎల్ఎలపైన, ఎంఎల్ఎలు మంత్రులపైన, మంత్రులు సిఎంపైన కొంత అసంతృప్తితో ఉన్నారు. ‘నేను సమయం ఇస్తాను, మంత్రులు మీరూ ఎంఎల్ఎలకు సమయమీయండి’ అని సిఎం రేవంత్రెడ్డి సిఎల్పి భేటీలో సూచించారు. రేపటి రెండున్నరేళ్ల కాలానికి అదే ముఖ్యం కానుంది. పార్టీ ప్రభుత్వం మధ్య ‘సమన్వయం’ కోసం కొందరు నాయకులతో ఒక కమిటీ వేశారు. సమన్వయ కమిటీలో ఉన్న వాళ్లకే వాళ్ల పరిధిలో, వారి జిల్లాల్లో ఇతర నాయకులతో సమన్వయం లేదనే విమర్శ కాంగ్రెస్లో వినిపిస్తోంది. పార్టీని సమన్వయపరచకుండా కడదాకా ‘ఇంకా ఆఖరి బంతి మిగిలే ఉంది’ అన్న ముఖ్యమంత్రి ఒకరు పార్టీని వీడి వెళ్లిన తర్వాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఏ గతి పట్టిందో అధిష్టానం పాఠం నేర్చుకోవాలి! సిఎం కారణంగా పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత పెరుగుతోందనే వాదన కాంగ్రెస్లో బలంగా ఉంది. తెలంగాణ ప్రజానీకానికి ఎపి సిఎం చంద్రబాబు మీద ఇంకా కోపం తగ్గని పరిస్థితుల్లో తరచూ ఆయన్ని పొగడటం, పార్టీని ‘తెలుగు కాంగ్రెస్’ చేయడం ప్రమాదకరమనే వారున్నారు. మొదట్నుంచి కాంగ్రెస్నే నమ్ముకున్న వారిని లెక్కచేయట్లేదని, సగం కేబినెట్ బయటి నుంచి వచ్చిన వారో, బయటకు వెళ్లి వచ్చిన వారితోనో నిండిందనే వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. సింగరేణి స్కాం వివాదం తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గర కొందరు మంత్రులు భేటీ అయ్యారనే వార్తలొచ్చాయి. అరడజన్ మందికిపైగా పార్టీ ఎంఎల్ఎలు ఇటీవలే ఓ డిన్నర్ పార్టీలో సమావేశమై అసంతృప్తి ‘మనోభావాలు’ పంచుకున్నారనే వార్త గుప్పుమంది. ఇది కాంగ్రెస్కి కీలక సమయం. (రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ) దిలీప్రెడ్డి సమకాలీనం
జగిత్యాల జిల్లాలో పులి అలర్ట్#TigerAlert#Jagtial#Kodimyal#ForestDepartment#WildlifeNews#Telangana
పేదల జీవితాల్లో చీకట్లు నింపిన వెలుగుమట్ల
హైడ్రా కూల్చివేతలతో హైరాన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చోటు చేసుకున్న నిరుపేదల ఇళ్ళకూల్చివేతల ఘటన మాయని మచ్చగా మిగలనుంది. రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టించిన వెలుగుట్ల కూల్చివేతల ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠకు మాసకబారేటట్లు చేయగా వందలాది మంది నిరుపేదల జీవితాల్లో కారుచీకట్లను కమ్మింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ముచ్చెమటలు పట్టించి దాదాపు పక్షం రోజుల పాటు ఉక్కిబిక్కిరి చేసింది. ఈ ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అభాసుపాలైంది. రాష్ఱ రాజధానిలో బఫర్ జోన్లో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలను హైడ్రా పేరుతో బుల్డోజర్తో నేలమట్టం చేస్తుండటం, దీనికి తోడు మూసీ సుందరీకరణతో పలు బహుళ అంతస్తులను కూల్చివేస్తామని నోటీస్లను జారీ చేయడం, రాష్ట్రంలో పలు జిల్లాలో కూడా అక్రమ కట్టడాల పేర్లతో కూల్చివేస్తున్న నేపధ్యంలో గత నెల 24న ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల రెవెన్యూ గ్రామంలోని భూదాన భూముల్లో అక్రమంగా ఇళ్ళ నిర్మాణం చేసుకున్నారనే కారణంతో సుమారు 750 మంది నిరుపేదల ఇళ్ళను అమాననీయంగా, నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన సంఘటన రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ను కుదిపేసింది. వెలుగుమట్ల గ్రామంలో కల్వల రాజరామారావు అనే భూస్వామికి సర్వే నెం. 147, 148, 149లో మొత్తం 62.07 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 31.07 ఎకరాల భూమిని 1953లో అచార్య వినోభాబావే పిలుపుమేరకు భూదాన బోర్డుకు దానం చేశారు. మిగిలిన 30 ఎకరాల భూమిని ఇతర రైతులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. భూదాన బోర్డుకు దానంచేసిన భూమిని అప్పట్లో 13 మంది పుట్టకొట్ట రైతులకు సాగుకోసం ఆనాటి రెవెన్యూ అధికారులు పంపిణి చేశారు. అయితే ఈ భూమి వ్యవసాయానికి అనుకులంగా లేకపోవడం, గుట్టలతో, దట్టమైన అడవితో కూడుకోని ఉండటంతో వారు వ్యవసాయం చేసుకోలేదు. దీనిని గమనించిన అప్పటి రెవెన్యూ అధికారులు రైతులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తిరిగి ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 31.07 ఎకరాల భూమిలో 10.20 భూమిని జర్నలిస్టుల కోసం కేటాయించి తిరిగి రద్దు చేశారు. ఈ రద్దు చేసిన భూమిలో అయిదు ఎకరాల భూమిని కెజిబివి కళాశాలకు, మరో అయిదు ఎకరాల భూమిని మోడల్ స్కూల్కు కేటాయించారు. మిగిలిన భూమిలో దాదాపు పదేళ్ళ క్రితం నుంచి దశలవారీగా నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఆక్రమించడం, పక్కా ఇళ్ళను నిర్మించుకోవడం ప్రారంభించారు. దీనికి సిపిఐ (ఎంఎల్), యుసిసిఆర్ఐ అనుబంధ గ్రామీణ పేదల సంఘం (ఒపిడిఆర్) సారథ్యం వహించింది. మొదట్లో పేదలకు నిలువనీడను కల్పించాలనే తపన ఉన్నప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేసిన వినోభా భూదాన్ వెల్పేర్ సొసైటీ కమిటీలోకి పార్టీకి సంబంధం లేని వారు చేరడం, ఆ కమిటీలోని సభ్యులకు డబ్బు కాంక్ష పెరగడంతో అవినీతి అక్రమాలు భారీ ఎత్తున చోటుచేసుకున్నాయి. అసలు వెలుగుమట్లలో ఉన్న భూదాన భూములు 31.07 ఎకరాలా, లేక 62.07 ఎకరాలా? అనే విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంలో కూడా రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది. కొందరు అధికారుల అత్యుత్సాహం సమస్యను మరింత జటిలం చేసింది. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. ఈ భూమి వివాదంపై హైకోర్టులో పలు కేసులు నమోదు అయి ఉండటంతోపాటు భూపరిపాలన ప్రత్యేక కమిషనర్ ఈ ఏడాది జనవరి 17న జారీ చేసిన సుమోటో ఆదేశాలతో ఫిబ్రవరి 24న ఆపరేషన్ బుల్డోజర్ చేపట్టి రెండు రోజుల వ్యవధిలో 750 ఇళ్ళను నేలమట్టం చేశారు. ముందస్తుగా ఎలాంటి నోటీస్లు ఇవ్వకుండా రాత్రికి రాత్రే బలవంతంగా ఇళ్ళ నుంచి బైటికి పంపించి ఇళ్ళను కూల్చివేయడంతో బాధితులంతా కన్నీళ్ళతో లబోదిబోమన్నారు. నిబంధనల ప్రకారం స్థ్దానిక తహసీల్దార్ ప్రతి ఇంటికీ నోటీస్ అందించి వారికి గడువు ఇవ్వాలి. వారు ఇంట్లో లేకపోతే గోడకు అతికించి వెళ్ళాలి. కాని ఇక్కడ ఇలాంటివి ఏమి జరగలేదు. పైగా ఈ చర్యను అడ్డుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. భూదాన్ భూదందాపై ఇప్పటికే పోలీసులు 24 కేసులను నమోదు చేసి 60 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్టు చేసి వారి ఆస్తులను అటాచ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం నిరుపేదల నుంచి రూ. 3 కోట్ల వరకు వసూళ్ళు చేశారని, వాటిని రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగిస్తామని పోలీసు అధికారులు ప్రకటించడం నష్టపోయిన బాధితులకు కొంత ఊరడింపుగా మారినప్పటికీ కూల్చివేతలో తీవ్రంగా నష్టపోయిన పేదల కన్నీళ్ళను మాత్రం ఎవ్వరూ తూడ్చలేనిది. కూల్చివేసిన చోటే ఇంటి స్థలాలు ఇవ్వడం తాత్కాలిక ఊరడింపు చర్యేగాని నిరు పేదల గుండెకు అయిన గాయం మాత్రం ఎప్పటికీ మానని పుండుగానే మిగులుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇళ్ళ కూల్చివేత ఘటనతో ఎంత వేగంగా విమర్శలు మిన్నంటాయో.. అంతే వేగంగా బాధితులకు స్వాంతన కలిగించే చర్యలకు పూనుకోవడంతో కారుచీకట్లు కమ్ముకున్న వెలుగుమట్ల నిరుపేదల జీవితాలలో శాశ్వత వెలుగులు నింపినట్లయిందని చెప్పకతప్పదు. వనం వెంకటేశ్వర్లు 98489 97240 (ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)
ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక
ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం పుష్కరాల లోపే పోలవరం పూర్తి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి, ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను, అభివృద్ధి సంకల్పాన్ని ప్రజల ముందుంచారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక అని, ఈ ఏడాది అంతా […] The post ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక appeared first on Visalaandhra .
21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి సేవా సమితి భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో
ప్రజలను సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఏకం చేసి వారిలో మానవతావిలువల పెంపుకు దోహదపడడానికి పూర్వం పెద్దలు వివిధ పండుగలను ఏర్పరచారు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క నేపథ్యంగా.. విశిష్ఠతను చేకూర్చారు. కొన్ని పండుగలు దేవుళ్ళ ప్రాశస్త్యాన్ని చాటిచెప్పి వారికి చేరువచేసేవి. అయితే, ఇంకొన్ని పండుగలు కుటుంబ బంధాలు, అన్నాచెల్లెల్ల అనురాగాన్నీ పెంచేవి. మరికొన్ని పండుగలు ప్రకృతినీ, నేల తల్లినీ, వ్యవసాయాన్నీ పూజింపజేసే పండుగలను పుట్టించి వాటికి గొప్పగొప్ప పేర్లు పెట్టి ఆచరింపజేశారు. అలాంటి పండుగల్లో తెలుగు వారికి తొలి పండుగగా ‘ఉగాది’ ఆవిర్భవించింది. దీనికి నేపథ్యం సృష్టిమొదలై మానవులు చైతన్యం పొంది, నాగరికతకు ఎదిగిన రోజు ఉగాది (యుగ+ఆది=యుగాది) పర్వదినంగా చెప్పారు. తెలుగువారికి చాంద్రమాన కొత్త సంవత్సరం మొదటిరోజు చైత్రశుద్ధ పాడ్యమిన ఈ పండుగను జరుపుకోవడం సంస్కృతిగా మారింది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారంగా ఉగాది పండుగను నిర్ణయించారు. చైత్రమాసంలో మొదటి పక్షమైన శుక్లపక్షంలో తొలితిథి అయిన పాడ్యమి బ్రాహ్మిముహూర్తం నుంచి ఉగాది మహాపర్వ దినాన్ని శాస్త్రయుక్తంగా ప్రజలు నిర్వహించి తరించాలని పెద్దలు ఉపదేశించారు. అయితే ఈ పండుగకు జ్యోతిష్య శాస్త్రాన్ని పట్టాభిషేకం చేశారు. కొత్త సంవత్సరంలో జ్యోతిష్యశాస్త్ర (పంచాంగం) ప్రకారం నడుచుకుంటే ఏ ఇడుములు రావని చెప్పారు. ‘పంచాంగం’: జ్యోతిష్యశాస్త్రమనే పంచాంగ శ్రవణాన్ని పాటింపును చేశారు. వ్యక్తుల ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు, కందాయఫలాలు, రాశిఫలాలు, తెలియజెప్పే పంచాంగం వినడాన్ని పండుగనాడు ఆనవాయితీని చేశారు. అలాగే కొత్త సంవత్సరంలో దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాల భవిష్యత్తులు, మంచిచెడులను, కొత్త సంవత్సరంలో తారసపడే పరిణామాలు, శుభాశుభ ఫలితాలు పంచాంగంవల్ల తెలుస్తాయి. పంచాంగం అనగా భగవంతుని పంచ అంగాలుగా రుషులు చెప్పారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగంగా పంచాంగాన్ని నిర్వచించారు. పంచాంగ శ్రవణంవల్ల గంగాస్నానం పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ‘జ్యోతిష్యానికి ఇంత నమ్మకం ఎలా వచ్చింది?’: జ్యోతిష్య, ఖగోళ గణిత, భూగోళ, పర్యావరణ శాస్త్రాలలో అపార ప్రజ్ఞ కలిగిన విశేషశేముషీ దురంధరుడు వరాహమిహిరుడు.. విక్రమార్కునిగా పిలువబడే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. తన మహారాజు విక్రమాదిత్యుని కుమారుడు వరాహ కారణంగా మరణిస్తాడని సందేహం లేకుండా జ్యోతిష్యశాస్త్రం మీద తనకున్న అపారపట్టు, ప్రతిభ, విశ్వాసంతో ముందుగానే చెప్పాడు. ఆ మాటలు నిజం కాగా చక్రవర్తి వరాహమిహిరుని మనస్ఫూర్తిగా అభినందించాడు. దీంతో గెలిచింది నేను కాదు! జ్యోతిష్యశాస్త్రం అని వరాహమిహిరుడు సవినయంగా రాజుకు చెప్పాడు. అప్పటినుంచి జ్యోతిష్యశాస్త్రాన్నీ, జ్యోతిష్య పండితులను అపారగౌరవంతో ప్రజలు నమ్ముతూ భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను చెప్పే మహత్తర గ్రంథంగా, మానవాళికి దిక్సూచిగా పంచాంగాన్నీ, జ్యోతిష్యశాస్త్రాన్నీ చూస్తున్నారు. అందుకే ఉగాదినాడు పంచాంగ శ్రవణాన్ని పవిత్ర దైవకార్యంగా ప్రజలు పెట్టుకున్నారు. 2000 ఏళ్లుగా... ఇక్ష్వాకుల నుంచి: ఈ నేపథ్యంలో సుమారు 2000 ఏళ్ళనాడు విక్రమార్క, శాలివాహన చక్రవర్తుల శకాలు ఉగాది నుంచే ప్రారంభమై తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసాదులతో కూడిన పంచాంగం రూపొందించబడి ఇక్ష్వాకుల రాజులపాలనా కాలం నుంచి వాడుకలోకి వచ్చిందని చరిత్ర నిర్ధారిస్తున్నది. ఉగాది విశిష్ఠత: ఉగాదినాడు తెల్లవారు జామున తైలాభ్యంగనం దైవారాధనం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి), ప్రపాదాన ప్రారంభం (చలివేంద్రాలు నెలకొల్పడం), పంచాంగశ్రవణంతో పాటు ప్రతీ ఒక్కరూ కొన్ని విధులూ, నియమాలు పాటించాలని, అలాగే ప్రాచీన రుచులను.. ప్రబోధం చేశారు. ‘ఉగాది పచ్చడి: మనిషి జీవితానికి ప్రతీకగా ఉగాది పచ్చడిని ప్రవేశపెట్టారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల నమ్మేళనంగా.. జీవితంలో కష్టం, సుఖం, ఆనందం, విషాదం ఇంకా ఎన్నో కలగలసి ఉంటాయనీ, వాటన్నింటినీ సమానంగా స్వీకరించి నిబ్బరంగా, గంభీరంగా ఉండాలని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరికీ ఉగాది ఉత్కృష్టమైన రోజున సేవనం చేశారు. కాగా ఈ పచ్చడిని వేపపువ్వు, కొత్తబెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడికాయ ముక్కలు (కొన్ని ప్రాంతాల్లో అరటి పళ్ళ గుజ్జును కూడా చేర్చి పచ్చడిగా తయారుచేసి తాగుతారు. ఈ విధమైన సనాతన సంస్కృతి, సంప్రదాయంతో ఉగాదికి నిండుదనం చేకూరుస్తారు. పండుగ ఆచరణ: ఇళ్ళద్వారాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టడం, తలస్నానం చేయడం, నూతనవస్త్రాలు ధరించడం, పిండి వంటకాలు చేయడం పూర్వంనుంచి వస్తున్న ఆచారం. వసంత మాసం, ప్రకృతి సౌందర్యాలతో కూడిన ఆహ్లాద పూరిత (వాతావరణాలను) మానవుల సుఖసంతోషాల కోసం ఆహ్వా నించే పండుగ ఉగాది పండుగ. సంవత్సరంలోని రెండు ఆయణాల్లో మొదటిదైన ఉత్తరాయణంలో ఉన్న మూడు రుతువుల్లో తొలిదైన వసంత రుతువులో ఈ పండుగ వస్తుంది. ప్రకృతి మాత నిలువెల్లా ఆకుపచ్చని పట్టుపీతాంబరధారినియై ఆకుపచ్చ వర్ణస్వర్ణాభరణ అలంకృతయై మహెూజ్వల తేజో విరాజితకాంతితో సందర్శితయై పులకింపజేస్తుంది. ప్రకృతి చైతన్యాన్నీ, నూతనత్వాన్నీ సంతరించుకొని, ఆకురాల్చిన మోడుదశకు తిలోదకాలిచ్చి చిగురించిన వనాలు, చల్లనిగాలులు, నిర్మల ఆకాశం, విరబూసిన రంగురంగల పూవుల సుగంధ పరిమళాలు, వివిధ రకాల పక్షుల ఆనందిత కిలకిల రావాలు, కోయిలల సంబర కుహుకుహూ రాగాలూ, ఎటుచూసినా ప్రకృతి మాత శోభాయమానంగా కనిపిస్తూ హృదయాలను పరవశింపజేస్తుంది. తాళ్ళపల్లి యాదగిరి గౌడ్ 99497 89939
సీఎంఆర్ఎఫ్ ఫైల్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం..రూ.55.63 కోట్లు విడుదల
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఫైల్పై ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం చేశారు. ఈ సంతకంతో అనారోగ్యంతో బాధపడుతున్న 6,787 మందికి తక్షణ సాయం కింద రూ.55.63 కోట్లను విడుదల చేశారు.ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత 21 నెలల కాలంలో సీఎం సహాయ నిధి, ఎల్ఓసీల ద్వారా పేదలకు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఈ సమయంలో మొత్తం […] The post సీఎంఆర్ఎఫ్ ఫైల్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం..రూ.55.63 కోట్లు విడుదల appeared first on Visalaandhra .
Telangana Praja Jagruthi |పార్టీ పేరుపై క్లారిటీ
Telangana Praja Jagruthi | పార్టీ పేరుపై క్లారిటీ Telangana Praja Jagruthi
వెంకన్న సన్నిధిలో రాములోరు బుచ్చెయ్యపేట (అనకాపల్లి ), ఆంధ్రప్రభ ; వడ్డాది గిరిజాంబ
rain|నాలుగు రోజుల పాటు వర్షాలు
rain| నాలుగు రోజుల పాటు వర్షాలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో
అమెరికా కీలక అధికారుల నివాసాలపై డ్రోన్ల కలకలం
అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేతల నివాసాలపై డ్రోన్లు సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ల నివాసాల పరిసరాల్లో ఈ డ్రోన్లు కనిపించడంతో అమెరికా నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ పరిణామంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. గత కొన్ని రోజులుగా వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్ ఫోర్స్ బేస్ వంటి అత్యంత కీలకమైన సైనిక స్థావరాల వద్ద కూడా రాత్రి సమయాల్లో ఈ డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు […] The post అమెరికా కీలక అధికారుల నివాసాలపై డ్రోన్ల కలకలం appeared first on Visalaandhra .
కృష్ణా జిల్లాలో లంచం తీసుకొని.. ఆవులని తరలిస్తున్న లారీని వదిలేసిన పోలీస్
JC Prabhkar : జేసీ మాటల్లో ఆంతర్యం అదేనా? ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
రాజకీయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక రిటైర్ అయినట్లే అనుకోవాలి
విదేశీ వైద్యులకు హెచ్-1బీ ఫీజు మినహాయింపు కోరుతూ అమెరికాలో కీలక బిల్లు
హెచ్-1బీ వీసాల కోసం ప్రతిపాదించిన లక్ష డాలర్ల భారీ ఫీజు నుంచి వైద్య రంగానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కొందరు చట్టసభ సభ్యులు అమెరికా కాంగ్రెస్లో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన సభ్యులు కలిసికట్టుగా ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం. ఈ భారీ ఫీజు వల్ల దేశంలో ఇప్పటికే తీవ్రంగా ఉన్న వైద్యుల కొరత మరింత పెరిగిపోతుందని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.హెచ్-1బీస్ ఫర్ […] The post విదేశీ వైద్యులకు హెచ్-1బీ ఫీజు మినహాయింపు కోరుతూ అమెరికాలో కీలక బిల్లు appeared first on Visalaandhra .
chahal |ఇప్పుడు ఆట పైనే ఫోకస్
chahal | ఇప్పుడు ఆట పైనే ఫోకస్ chahal |ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
కవిత కొత్త పార్టీ... ఢిల్లీ హైకోర్టులో ఊరట
ఢిల్లీ: పార్టీ నమోదు వ్యవహారంలో మాజీ ఎంఎల్సి కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి సూచించింది. 'తెలంగాణ ప్రజా జాగృతి' పై వీలైనంత త్వరంగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో కోర్టుకు ఇసి చెప్పిన విషయం తెలిసిందే. లోపాలన్నీ సరి చేశామని కోర్టుకు కవిత తరఫు న్యాయవాదులు తెలిపారు. సాంకేతిక తప్పులు సరి చేసి ఇసికి మళ్లీ దరఖాస్తు చేశామని కవిత లాయర్లు తెలిపారు. కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు ఎన్నికల సంఘం తెలపడంతో విచారణ ముగిసింది.
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు..
ఖమ్మం, ఆంధ్రప్రభ : పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర
Ustad Bhagath Singh : ఉగాది రోజున ఉస్తాద్ అలరించాడా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది
డిజిటల్ మోసాలపై పరిహారం పోగొట్టుకున్నా.. చేతికి పాతిక వేలు! #DigitalFraud#RBI#CyberCrime#OnlineScam
Balakrishna |బ్లాక్ బస్టర్ సాధించేనా..?
Balakrishna | బ్లాక్ బస్టర్ సాధించేనా..? Balakrishna | బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోపై
Cat |పాపం డిగ్రీ చదువుతున్న యువతి…
Cat | పాపం డిగ్రీ చదువుతున్న యువతి… Cat | ఆంధ్రప్రభ, వెబ్
ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ‘ధురంధర్ 2’కు ఎక్కువ స్క్రీన్లు?
తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది
Wishes |తెలుగు ప్రజలకు మోడీ శుభాకాంక్షలు
Wishes | తెలుగు ప్రజలకు మోడీ శుభాకాంక్షలు Wishes | ఆంధ్రప్రభ, వెబ్
Chandrababu : ఉగాది నాడు చంద్రబాబు పేదలకు గుడ్ న్యూస్
ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు
చెన్నూర్, ఆంధ్రప్రభ : పరాభనమ సంవత్సరం ఉగాది వేడుకలను చెన్నూరు పట్టణ ప్రజలు
కవిత కొత్త పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'?
హైదరాబాద్: 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరిట కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి గుర్తు కేటాయించాలని ఇసికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. తన పార్టీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కవిత పిటిషన్పై ఇవాళ మరోసారి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది..
ఊర్కొండ, ఆంధ్రప్రభ : నాడు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపు
Ugadi : ఉగాది వేడుకల్లో చంద్రబాబు.. పంచాగ శ్రవణం.. సత్కారాలు
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి
దేశంలో తొలి ఎల్పీజీ 'ఏటీఎం' #LPGATM#Gurugram#BPCL#SmartVending#GasCylinder#IndiaTech
Ugadi 2026: Wishes from Leaders, and a Big Job Calendar Boost
Ugadi marks the beginning of a new year for Telugu people. On March 19, 2026, people across Andhra Pradesh and Telangana welcomed the Sri Parabhava Nama Samvatsaram with devotion and joy. On this special occasion, several national and state leaders extended their heartfelt wishes. Prime Minister Narendra Modi greeted Telugu people and said Ugadi brings […] The post Ugadi 2026: Wishes from Leaders, and a Big Job Calendar Boost appeared first on Telugu360 .
Ugadi : పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు ఇలా
పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు ఇలా ఉంటాయి
పాకిస్థాన్లో వర్షం బీభత్సం.. 20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కరాచీలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలులతో 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా తెలిపింది. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కింద కూర్చుని టీ తాగుతున్న వారిపై పైకప్పు, గోడ కూలిపోవడంతో 12 మంది మరణించారు. సయీదాబాద్ ప్రాంతంలోని మావచ్ గోత్ తో బలమైన గాలులు, ఉరుములు, వర్షాల కారణంగా రెండంతస్తుల భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగిస్తున్నాయని, శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరాచీలో గంటలకు 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో కరాచీలోని 60 శాతం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరాచీ మేయర్ నగరంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పాక్ లోని జంషోరో, హైదరాబాద్, తట్టా, సుజావల్, బాడిన్, మతియారీ, తండో ముహమ్మద్ ఖాన్, తండో అల్లా యార్, ఉమర్కోట్, థార్పార్కర్, సంఘర్, మీర్పుర్ఖాస్, నౌషాహ్రో ఫిరోజ్, షహీద్ బెనజీరాబాద్, దాదు ప్రాంతాలలో బలమైన గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Good news | 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్
Good news | 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ Good news |
Dhurandhar 2,Ustaad |పబ్లిక్ టాక్ ఇదే..
Dhurandhar 2,Ustaad | పబ్లిక్ టాక్ ఇదే.. Dhurandhar 2,Ustaad | ఉస్తాద్
19thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
19thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 19thMarchCartoon | ఆంధ్రప్రభ ఉగాది శుభాకాంక్షలునగరీకరణతో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో నూతన సంవత్సరం ఉగాది పర్వదినం (శ్రీ పరాభవ
మున్సిపల్ చైర్మన్ కు ఉగాది సన్మానం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన
ఉగాది శుభాకాంక్షలతో గ్రామాభివృద్ధికి పిలుపు
ఉగాది శుభాకాంక్షలతో గ్రామాభివృద్ధికి పిలుపు నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలంలోని మేడపల్లి
సాంకేతిక కారణాలతో ధురంధర్-2 షోస్ రద్దు థియేటర్ యాజమాన్యంపై ప్రేక్షకుల ఆగ్రహం #Dhurandhar2
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం పొందిన ఉగాది పండుగ
గిరిజన హాస్టల్లో మెనూ గందరగోళం
గిరిజన హాస్టల్లో మెనూ గందరగోళం స్టేషన్ ఘనపూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్
నేడే గద్దర్ ఫిలిం అవార్డుల వేడుక #GaddarAwards #UgadiSpecial #HyderabadEvents #RevanthReddy
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనుంది. యువగళం పాదయత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకున్న సందర్భంగా గురువారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. కూటమి ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని తన సోషల్ మీడియా ఖాతాలో లోకేష్ పోస్టు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని, సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామన్నారు. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందాలని సూచించారు. ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుందని, తన మాట నేను నిలబెట్టుకున్నానని, ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, ఇక నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధం కావాలని, తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా క్రికెట్ పోటీలు.. -5 రోజుల పాటు 4 మండలాల్లో క్రికెట్ పోటీలు-ఎస్ఐ
2026ugadi |పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు – శుభ, అశుభ ఫలితాలు &శని పరిహారాలు
2026ugadi | రాశిఫలాలు: శని ప్రభావం, జాగ్రత్తలు & శుభఫలితాలు పూర్తి వివరాలు
నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం..
నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం.. చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలో
Rain Alert : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. నేడు కూడా వానలే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వానలపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది
అక్షర్ అలా చేస్తేనే ఢిల్లీ గెలుస్తుంది: పుజారా
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్కు భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా పలు కీలక సూచనలు చేశాడు. రానున్న ఐపిఎల్ సీజన్లో ఢిల్లీ ముందుకు సాగాలంటే కెప్టెన్ అక్షర్ పటేల్ తన పద్ధతిని మార్చుకోక తప్పదన్నాడు. అక్షర్ మైదానంలో చాలా ప్ర శాంతంగా ఉంటాడన్నాడు. అయితే ఐపిఎల్ వంటి తీవ్ర ఒత్తిడి ఉండే టోర్నీలో ఇలా ఉం డడం సరికాదన్నాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ సహచరుల్లో కొత్త ఉత్సాహం నింపాల్సిన బాధ్యత కెప్టెన్పై ఉంటుందన్నాడు. అక్షర్ మాత్రం ప్రశాంతంగా ఉంటూ ఆటగాళ్లలో ఎలాంటి ఉత్సాహం నింపడం లేదన్నాడు. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతుందన్నాడు. దీనికి కిందటి సీజన్లో ఢిల్లీ ప్రదర్శనే నిదర్శనమని పుజారా పేర్కొన్నాడు.
ఖతార్ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి
ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధపడుతున్న సౌదీ ఖతార్: ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు బుధవారం అర్ధరాత్రి దాడులు జరిపింది. తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా దాడులు చేపట్టింది. ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీస్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. […] The post ఖతార్ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి appeared first on Visalaandhra .
నేటి నుంచి భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి
హైదరాబాద్లో కల్తీ పచ్చళ్ల గుట్టు రట్టు ఇద్దరు నిందితుల అరెస్ట్ #Hyderabad #FoodAdulteration
Ugadi : ఉగాది రోజున చేయకూడని పనులివేనట
ఉగాది పర్వదినం జరుపుకోవడం అనాదిగా వస్తోన్న సాంప్రదాయం
వేగవంతంగా నేవీ రాడార్ పనులు.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో నేవీ
‘పెద్ది’ షూటింగ్ సెట్లో తిలక్ వర్మ.. బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ #RamCharan #TilakVarma
రోడ్డుపై పొంగి ప్రవహిస్తున్న మురుగునీరు..
రోడ్డుపై పొంగి ప్రవహిస్తున్న మురుగునీరు.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని
ఉగాది పచ్చడి ఉన్నత జీవనానికి సంకేతం
సమస్త ప్రజానికం నూతన వస్త్ర ధారణ చేసి, భగవధ్యానం లో భాగంగా నూతన సంవత్సరాది స్తోత్ర పూజ చేస్తారు. దేవుని గదిలో మంటపాన్ని మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో నిర్మించి, అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను ఇష్టదేవతారాధనతో బాటు పూజించి, తదనంతరం సూర్యభగవానుడికి మనస్పూర్తిగా నమస్కారం చేసుకుంటారు. తదనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, రకరకాల పిండి వంటలు తయారు చేసి దేవతామూర్తులకు నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరిస్తారు. ఇలా ప్రతి సంవత్సరాదికీ పాటించి నిష్టగా పూజ చేస్తారు. మన పూర్వీకులు ఉగాది కార్యక్రమాలలో ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరాదికీ నిర్వహించేవారు. ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించాలి. ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని సంవత్సరాది స్తోత్ర పూజలోని భావం
బ్రహ్మ ప్రళయం పూర్తైన తరువాత తిరిగి సృష్టి ప్రారంభమయ్యే సమయాన్ని ’బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది‘ గా వ్యవహరిస్తారు. ’ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణిస్తాం. పురాణాల ప్రకారం ఉగాదికి అసలు పేరు యుగాది. అంటే యుగానికి ఆరంభమని అర్థం. ఉగాది అనే పేరులో ‘ఉగ‘ అనగా నక్షత్ర గమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అనగా ఈ సృష్టి ఆరంభమైన దినమే ఉగాది పర్వదినంగా పరిగణించబడింది. యుగము అంటే ద్వయము లేక జంట అని కూడా అర్ధం వస్తుంది. వేదాలను హరించిన కారణంగా సోమకుడనే రాక్షసుడిని వధించిన మత్యావతారుడైన విష్ణువు, ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకుని ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చింది. అదేరోజైన చైత్రశుక్ల పాడ్యమి నాడు ఈ విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. చారిత్రక వృత్తాంతం ప్రకారం చైత్రశుక్లపాడ్యమి అయిన ఉగాదినాడు శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడై శాలివాహన యుగకర్తగా వర్థిల్లిన కారణం కూడా ఉగాది ఆచరించడానికి ప్రధాన కారణమంటారు. నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి: ధర్మసింధు కారులు పంచవిధులు సూచించిన విధంగా ఇప్పటికీ భారతీయులు ఉగాది ఆచరణ విధానం శాస్త్రోక్తంగా పాటిస్తారు. ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్ళు శుబ్రపరుచుకుని తోరణాలతో అలంకరించుకుని, మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో ఇంటిని అలంకరిస్తారు. ఉగాది రోజున వేకువజామునే ప్రతి ఒక్కరూ తైలంతో, కుంకుడితో అభ్యంగన స్నానం చేస్తారు., నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధిగా భావిస్తారు. మహాలక్ష్మిదేవిని నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి స్నానం చేసినట్లైతే లక్ష్మి, గంగా మాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. మనిషికి చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు.. ప్రాణులన్నీ కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు
మార్చి 19 ఉగాది (శ్రీపరాభవ నామ సంవత్సరాది) 21 -డోలా గౌరీవ్రతం, రంజాన్ 23 మత్స్య జయంతి, లక్ష్మీపంచమి 27 సర్వేషాం శ్రీరామనవమి 29 సర్వేషాం ఏకాదశి ఏప్రిల్ 02 హనుమద్విజయోత్సవం 05 సంకష్టహర చతుర్థి 13 సర్వేషాం ఏకాదశి 15 మాస శివరాత్రి 19 పరుశురామ జయంతి 20 అక్షయతృతీయ, డోలా గౌరీవ్రతం 21 శంకర జయంతి 22 రామానుజ జయంతి 26 వాసవీ జయంతి 27 సర్వేషాం ఏకాదశి 30 నృసింహ జయంతి మే 01 మేడే (కార్మికుల దినోత్సవం) 01 వ్యాస పౌర్ణమి 04 వాస్తు కర్తరీ ప్రారంభం 05 సంకష్టహర చతుర్థి 11 హనుమజ్జయంతి అగ్ని కర్తరీ ప్రారంభం 13 సర్వేషాం ఏకాదశి 15 మాస శివరాత్రి వృషభ సంక్రమణం 25 అగ్ని కర్తరీ త్యాగ: 27 సర్వేషాం ఏకాదశి 29 వాస్తు(డొల్లు) కర్తరీ త్యాగ: జూన్ 03 సంకష్టహర చతుర్థి 11 సర్వేషాం ఏకాదశి 13 మాస శివరాత్రి శని త్రయోదశి 15 మిథున సంక్రమణం 16 బౌద్ధ, కల్కీ జయంతీలు 25 సర్వేషాం ఏకాదశి 27 శని త్రయోదశి 29 ఏరొక్క పూర్ణిమ వట సావిత్రీ వ్రతం జూలై 03 సంకష్టహర చతుర్థి 10 స్మార్తానామేకాదశి 11 మాధ్వ శ్రీవైష్టవానామేకాదశి 12 మాస శివరాత్రి 16 జగన్నాథస్వామి రథయాత్ర 17 కర్కాటక సంక్రమణం దక్షిణాయన పుణ్యకాలం 25 సర్వేషాం తొలికాదశి చాతుర్మాస్య వ్రతారంభ: 29 వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి ఆగష్టు 02 సంకష్టహర చతుర్థి సికింద్రాబాద్ మహంకాళి జాతర 09 సర్వేషాం ఏకాదశి హైదరాబాద్ మహంకాళి జాతర 11 మాస శివరాత్రి 12 చుక్కల అమావాస్య 16 నాగచతుర్థి 17 గరుడ, నాగ పంచమీలు సింహ సంక్రమణం 21 వరలక్ష్మీ వ్రతం 23 సర్వేషాం ఏకాదశి 26 ఋగ్వేదోపాకర్మ 28 రాఖీ పౌర్ణమి 31 సంకష్టహర చతుర్థి సెప్టెంబర్ 04 సర్వేషాం శ్రీకృష్ణాష్టమి 07 సర్వేషాం ఏకాదశి 09 మాసశివరాత్రి 10 పిఠోరీ వ్రతం 11 పోలాల అమావాస్య 13 సామోపాకర్మ 14 వినాయక చతుర్థి 15 ఋషి పంచమీ వ్రతం 17 కన్యా సంక్రమణం 18 జ్యేష్ఠాష్టమీ 22 సర్వేషాం ఏకాదశి 25 అనంత పద్మనాభ వ్రతం 26 ఉమా మహేశ్వర వ్రతం 27 మహాలయ పక్షారంభం 29 సంకష్టహర చతుర్థి అక్టోబర్ 06 సర్వేషాం ఏకాదశి 09 మాస శివరాత్రి 10 మహాలయ అమావాస్య 11 దేవీ శరన్నవరాత్రారంభం కలశస్థాపన 16 సరస్వతీ పూజ (మూలా) 17 త్రిరాత్ర కలశస్థాపన 18 దుర్గాష్టమి బతుకమ్మ పండుగ తులా సంక్రమణం 19 మహర్నవమి సుహాసినీ పూజ 20 విజయ దశమి (దసరా) మబలిదానములు 21 రాజ్ఞాం పట్టాభిషేకం 22 సర్వేషాం ఏకాదశి 24 శని త్రయోదశి 29 సంకష్టహర చతుర్థి నవంబర్ 05 సర్వేషాం ఏకాదశి 07 శని త్రయోదశి మాస శివరాత్రి నరక చతుర్దశీ స్నానం (తెల్లవారితే ఆదివారం అనగా) 08 దీపావళి పండుగ ధనలక్ష్మీ పూజలు 09 కేదార వ్రతం 10 బలి పాఢ్యమి ఆకాశ దీప వ్రతం ఆరంభం భగినీహస్త భోజనం 13 నాగచతుర్థి 17 వృశ్చిక సంక్రమణం 20 సర్వేషాం ఏకాదశి 21 చిల్కుద్వాదశి తులసీ వ్రతం ప్రారంభ: 24 వ్యాస పౌర్ణమి జ్వాలా తోరణం 27 సంకష్టహర చతుర్థి డిసెంబర్ 04 సర్వేషాం ఏకాదశి 07 మాస శివరాత్రి 15 సుబ్రహ్మణ్య షష్ఠి 16 ధనస్సంక్రమణం 20 సర్వేషాం వైకుంఠైకాదశి గీతా జయంతి 22 హనుమద్వ్రతం 23 దత్తాత్రేయ జయంతి 27 సంకష్టహర చతుర్థి 31 కాలభైరవాష్టమి జనవరి-2027 03 సర్వేషాం ఏకాదశి 06 మాస శివరాత్రి 14 భోగి మకర సంక్రమణం (రాత్రి 3:12) 15 -మకర సంక్రాంతి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం 16 కనుమ 16 కోనసీమ ప్రభల తీర్థం 17 ముక్కనుమ 18 స్మార్తా ఏకాదశి 19 మాధ్వ శ్రీవైష్ణవానాం ఏకాదశి 25 సంకష్టహర చతుర్ధి ఫిబ్రవరి - 2027 02 సర్వేషాం ఏకాదశి 04 మాస శివరాత్రి 11 వసంత పంచమి (శ్రీపంచమి) 13 రథ సప్తమి కుంభ సంక్రమణ 15 మధ్వ నవమి 17 సర్వేషాం ఏకాదశి 20 వ్యాస పౌర్ణమి 24 సంకష్టహర చతుర్థి మార్చి 04 సర్వేషాం ఏకాదశి 06 మాస శివరాత్రి శని త్రయోదశి 15 మీన సంక్రమణం 18 సర్వేషాం ఏకాదశి 20 దాక్షిణాత్యానాం కామదహనం శని త్రయోదశి 22 ళికోత్సవ: 25 సంకష్టహర చతుర్థి ఏప్రిల్ 02 సర్వేషాం ఏకాదశి 05 మాస శివరాత్రి 07 చైత్ర శుద్ద ఉగాది (శ్రీ ప్లవంగ నామ సంవత్సరాది)
Andhra Pradesh : నిరుద్యోగులకు ఉగాది నాడు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది నాడు గుడ్ న్యూస్ చెప్పింది.
Dhurandhar: The Revenge Movie Review:
Dhurandhar The Revenge Movie Review Dhurandhar is the biggest Indian hit of the year and the sequel titled Dhurandhar: The Revenge is releasing in just three months. The expectations are big and the advance sales are stupendous. Dhurandhar: The Revenge released with special paid premieres on March 18th evening. The film features Ranveer Singh in […] The post Dhurandhar: The Revenge Movie Review: appeared first on Telugu360 .
ఆ రెండు రాశుల వారు మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది
మేషరాశి ఆదాయం: 11 వ్యయం: 05 రాజ: 02 అవ: 04 అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుం ది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, లాభస్థానంలో రాహువు, వ్య యంలో శని అలాగే జూన్ 2వ తేదీన గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5న రాహువు కేతువుల మార్పు, రాహువు దశమ స్థానంలో, కేతువు చతుర్థం స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటా యి. మీరు కష్టపడితేనే దానికి తగినట్టు విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలిననాటి శని నడుస్తుంది. ఈ ఏలిననాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్ గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. అదష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహ యోగం, వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత గురువు నాల్గవ ఇంటి నుండి 5వ ఇంటిలోకి సంచరిస్తాడు. కెరియర్ పరంగా మంచి అభి వద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. మేష రాస్యాధిపతి బలం కలిగి ఉండటం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల పైన కుటుంబ విషయాలు పైన దష్టి పెట్టవలసి ఉంటుంది. సోదరి సోదరుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోయి రక్తసంబంధీకులతో సఖ్యత అనేది ఏర్పడు తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. సంతానం యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరాశి వారికి ఏలిననాటి శని కొనసాగుతుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు వివాహ కాలంగా చెప్పవచ్చు కానీ వివాహ నిశ్చయానికి, పెళ్ళికి సమయం కొంత ఎక్కువగా వుండవచ్చు. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత అభివృద్ధి సాధిస్తారు. ప్రజలలో ఆదరణ పొందుతారు. చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలతో పాటు బరువు బాధ్యతలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. సినీకళా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలు ఊపందు కుంటాయి. విద్యార్థినీ విద్యార్థులు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పక పోవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. హెచ్1 బి వీసా, పి.ఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తి స్తాయి. ఆరోగ్యం విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినా సంతానం మీ మాట వినకపోవడం వలన మీరు వారి కోసం ఎంత శ్రమించినా అది వృథా అవుతుంది.అయితే వారిని దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది.ఈ రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం.వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అత మంచిది. విహార యాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణం అవుతాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలోని వారు పేరుప్రఖ్యాతలు పెంచుకోగలుగు తారు. చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యూటీపార్లర్ నిర్వాహకులు, వైద్యరంగంలో ఉన్నవారు, సాఫ్ట్వేర్ రంగంలోని వారు, అడ్మినిస్ట్రేషన్ రంగంలోని వారు బాగా రాణిస్తారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐ.ఎ.ఎ స్., ఐ.పి.యస్. వంటి సివిల్ సర్వీస్లకు అతికష్టం మీద ఎంపిక అవుతారు. వివాహం విషయంలో జాతక పరిశీలన అలాగే కుటుంబ ప రంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు దుర్గస్తుతి పఠించడం, ఎరుపు వత్తులతో దీపారాధన చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించడం, క్రీడారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృశ్చికరాశి ఆదాయం: 11 వ్యయం: 05 రాజ: 02 అవ: 06 విశాఖ 4వ పాదము, అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు. వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశివారికి చతుర్థంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో గురువు, దశమంలో కేతువు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఆర్థికపరంగా అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయాలలో కూడా ఈ రాశి వారు సంవత్సర ప్రథమార్థం వరకు దూరంగా ఉండటం మంచిది. ఛాయాగ్రహమైన రాహువు మాత స్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి. జూన్ రెండవ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతియైన గురువు భాగ్య స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రుణాలు చాలా వరకు తీర్చగలుగు తారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పరంగా పదోన్నతి లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసివస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హోటల్మేనేజ్మెంట్, హోల్సేల్ రిటేల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థికలావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమకుతగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ మీద బరువు బాధ్యతలు పెరుగుతాయి. డిసెంబర్ 5వ తేదీన రాహువు చతుర్థం నుండి తృతీయ స్థానంలోకి కేతువు దశమంనుండి భాగ్యస్థానంలోకి మారడం వలన చిన్నచిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. ఎన్నడూ లేని విధంగా అదృష్టం మీకు తోడవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చికరాశి వారు అదృష్టవంతులు. గురుగ్రహ అనుగ్రహంతో అన్నింటిలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. రాజకీయ పరమైనటువంటి చిక్కులు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. స్థిర చరాస్తుల విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్నిజాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. థైరాయిడ్, బి.పి., షుగర్, ఇండైజిషన్, ఉదర సంబంధిత సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది.ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. విద్యా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.ద్వితీయార్థంలో వీసాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తె అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంకోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలం- గా ఉంది. సివిల్ సర్వీస్లకు ఎంపిక అవుతారు. ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పదిమందిలో మెచ్చుకోలుగా ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. వైద్య విద్యను అభ్యసిస్తున్నవారు, సాఫ్ట్వేర్, మెకానికల్, కళాసాంస్కృతిక రంగంలో ఉన్నవారికి, బ్యూటీపార్లర్స్, కాస్మోటిక్స్, ఇ.ఎన్.టి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ మొదలైన రంగాలలో ఉన్న వారు మంచి అబివృద్ధి సాధిస్తారు. ప్రథమార్థంలో మరియు ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం, అలాగే రాహుకేతువులకు జప, దాన, తర్పణాలు చేయించడం అనేది చెప్పదగిన సూచన. స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎన్నో విషయాలు కలిసివస్తాయి. పాడి పరిశ్రమలో లాభాలు బాగుంటాయి. విద్యా సాంస్కృతిక విషయాలలో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది. వత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం పెరుగుతుంది. శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వత్తి, ఉద్యోగాలపరంగా బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. కొన్ని విషయాలలో మీ శ్రమకి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. నిర్మాణ రంగంలో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, నీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి, ఐ.వి.ఎఫ్ కోసం వెళ్ళేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, వాటి విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తి స్తారు. ఆర్భాటాలకు, పొగడ్తలకు దూరంగా ఉండటం చెప్పదగినది. దూరప్రయాణాలు కలిసివస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థాధిపతియైన రాహువు డిసెంబర్ 5న తృతీయ స్థానంలోకి రావడం వలన సోదరసోదరీమణుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం లేకపోలేదు.ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.
ఉస్తాద్ భగత్ సింగ్ మానియా.. విజయవాడలో అభిమానుల హోరు..థియేటర్ల వద్ద హద్దుల దాటిన
Ugadi : తెలుగు ఏడాది ప్రారంభమయ్యే పండగ ప్రత్యేకత ఏంటంటే?
తెలుగు సంవత్సరాదిని ఉగాది అంటారు
విద్యానిలయంలో.. ఉగాది వేడుకలు..
విద్యానిలయంలో.. ఉగాది వేడుకలు.. కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల శాంతి

30 C