IPL 2026 : నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
శునకాల దాడిలో ఆవుదూడ మృతి.. వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా
Nara Lokesh : నేడు ప్రధానిని కలవనున్న లోకేశ్
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి నారా లోకేశ్ కలవనున్నారు
Anhdra Pradesh : ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుంది
నిధులు పక్కా దారి పట్టకుండా.. కుంటాల, ఆంధ్రప్రభ : ప్రగతి పాలన ప్రగతి
Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి గుడ్ న్యూస్... సులువుగానే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే ఉంది
రామదుర్గం కొండల్లో పెద్ద పులి కలకలం #TigerAlert #WildlifeMovement #Ramadurgam #BigCat #ForestAlert
కలెక్టర్ లక్ష్మీశ సంచలన ఉత్తర్వులు..
కలెక్టర్ లక్ష్మీశ సంచలన ఉత్తర్వులు.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ
Earth Quake : ఇండోనేషియాను వణికించిన భూకంపం
ఇండోనేషియాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో నమోదయింది.
నేటితో పదో తరగతి పరీక్షలు పూర్తి..
నేటితో పదో తరగతి పరీక్షలు పూర్తి.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థుల
Telangana : తెలంగాణలో విద్యాసంస్థలు జూన్ 13న తిరిగి ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆలయంలో దొంగని ఎలా పట్టుకున్నారంటే..
ఆలయంలో దొంగని ఎలా పట్టుకున్నారంటే.. యడ్లపాడు, ఆంధ్రప్రభ : యడ్లపాడు గ్రామంలోని శ్రీ
Amaravathi : నేడు రాజ్యసభలో అమరావతి బిల్లు
నేడు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రానుంది
7.4 Earthquake Indonesia : భూకంపం బీభత్సం Andhra Prabha News
7.4 Earthquake Indonesia : భూకంపం బీభత్సం Andhra Prabha News (
2ndAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
2ndAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
IPL 2026 : లక్నో సూపర్ జెయింట్స్ కు తప్పని ఓటమి.. సునాయాసంగా గెలిచిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది
Iran - America War : అమెరికా నౌకాదళ బలగాలు మధ్యప్రాచ్యానికి…ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రసంగం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలో ఇరాన్పై యుద్ధ పురోగతిపై వివరించారు
Pak - Afghan War : పాక్ , ఆఫ్ఘాన్ మధ్య చర్చలు.. నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం
Pak - Afghan War : పాక్ ఆఫ్ఘాన్ మధ్య చర్చలు.. నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం
హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు ?
హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు ? ఊరుకొండ, ఆంధ్రప్రభ : నేడే హనుమాన్
No 3 Capitals : ఏపీకి అమరావతి కిరీటం Andhara Prabha SPL News
No 3 Capitals : ఏపీకి అమరావతి కిరీటం Andhara Prabha SPL
2ndAprilchintana |మానవత్వం, ఆధ్యాత్మికత పై సమగ్ర విశ్లేషణ..
2ndAprilchintana | మానవత్వం, ఆధ్యాత్మికత పై సమగ్ర విశ్లేషణ.. 2ndAprilchintana | మానవత్వం
2ndAprileditorial |నాటోపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు..
2ndAprileditorial | నాటోపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. 2ndAprileditorial | ఇరాన్ యుద్ధానికి
2ndApril2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
2ndApril2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 2ndApril2026 |
మన తెలంగాణ/హైదరాబాద్:“కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లే ..” అవుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఓటర్లను అప్రమత్తం చేశారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోడీ... తి వేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు వస్తాయన్నారు. ప్ర ధాని మోడీ-సిఎం విజయన్వి విభిన్న భావజాలాలైనా, భా వాలొక్కటేనని, ఎల్డీఎఫ్-బిజెపిల మధ్య ఒప్పందాలు ఉన్నాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని సభల్లోనూ ముఖ్యమంత్రి ప్రసంగాలకు భారీ స్పందన లభించింది. నేమం నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరీనాథన్ తరఫున పూంథురలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి, ఆ ర్ఎస్ఎస్ను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్ అని అన్నారు. కేరళలో జాతీయ రహదారులు సహా పలు అభివృద్ధి పనులు నిలిచిపోయినా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నోరుమెదపడం లేదని ఆయన మండిపడ్డారు. కేరళ ప్రజలు బిజెపి-ఎల్డిఎఫ్కు గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు. బిజెపి-సిపిఎం మధ్య సైలెంట్ అండర్స్ట్రాండింగ్ ఉందని అన్నారు. అందుకే వారిపై ఎటువంటి కేసులు ఉండవని విమర్శించారు. దేశంలో ఎవరినైనా బిజెపి ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తారని కానీ, విజయన్ సర్కారుపై ఈగ కూడా వాలనీయరని ఆగ్రహించారు. బిజెపి, ఎల్డిఎఫ్ బయటకు పోటీ పడుతున్నట్టు కనిపించినా, అది అవాస్తవమని, నటనేని ఆయన విమర్శించారు. కేరళం సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యం కేరళ సమగ్రాభివృద్ధి యుడీఎఫ్ లక్షమని ఆయన తెలిపారు. విద్యావంతులైన ఎందరో మలయాళీలు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. వారికి స్థానికంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు తగిన సంఖ్యలో లేవన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు కేరళం సమగ్రాభివృద్ధికి యూడీఎఫ్ ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని రేవంత్ పిలుపునిచ్చారు. హస్తం పార్టీకి ఓటేస్తే పాత కేరళం ఏమిటో మళ్లీ చూపిస్తామని హామీ ఇచ్చారు. డెవలప్మెంట్ విత్ డిగ్నిటీతో ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిఎంల నిష్కళంక రాజకీయాలు... సామాజిక ప్రగతి, అభివృద్ధి, అక్షరాస్యతలో కేరళం ఎప్పటినుంచో యావత్ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని, అందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కృషే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగంలో కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళంకు ఉన్న గుర్తింపును రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. విద్యా, అవగాహన, సామాజిక చైతన్యంలో కేరళం దేశానికి అప్పటికీ, ఇప్పటికీ నమూనాగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీ, ఏకే ఆంటోనీల కృషి ప్రధాన కారణమన్నారు. వాళ్లు కేరళంకు సమగ్ర, సమ్మిళిత, సమతుల్య, నిష్కళంక రాజకీయాలను అందించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కరుణాకరన్ కేరళలో అభివృద్ధికి బాటలు వేశారని, ఊమెన్ చాందీ సంక్షేమం-అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చారని, ఏకే. ఆంటోనీ నిజాయితీకి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో కేరళంకు గౌరవం, నమ్మకం, పరిపాలనా స్థిరత్వం వచ్చిందన్నారు. కేరళంను గాడ్స్ ఓన్ కంట్రీ గా పిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే, దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా కేరళం ఒక బ్రాండ్గా నిలిచిందన్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్యం, సామాజిక పురోగతి- ఇవన్నీ కేరళంను ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాయన్నారు. అక్కడా.. ఇక్కడా వైఫ్యలం.. గత 12 ఏళ్ళుగా ఢిల్లీలో, 10 ఏళ్ళుగా కేరళంలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోడీ, కేరళంలో విజయన్ డబుల్ ఫెయిల్యూర్గా నిలిచారని సీఎం విమర్శించారు. ఢిల్లీలో మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం, తిరువనంతపురంలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారులో దేశం, రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లాయని విమర్శించారు. వీరి ఇరువురి సిద్ధాంతాలు వేరు అయినా... వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. తెలంగాణ బాటలో కేరళం.. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళం కూడా అలానే ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేరళం అభివృద్ధికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళం కుటుంబ సభ్యుల్లా మారారని సీఎం తెలిపారు. విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో.... మలయాళీ సూపర్ స్టార్ మోహన్లాల్ నరసింహం సినిమాలో చెప్పిన నీ పో మోనే.. దినేశా.. స్టైల్లో నీ పో మోనే విజయన్.. యువర్ టైమ్ ఈజ్ ఓవర్ (విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో) అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. మలయాళంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుకరించడంతో యువత నుంచి భారీ స్పందన లభించింది. యంగ్ సీఎం... డైనమిక్ సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కా ల్పులు విరమణ కోరుతూ విజ్ఞప్తి చేశారని తన సో షల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో బుధవారంనాడు పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచేంత వర కు ఇరాన్పై భీకర దాడులు కొనసాగుతూనే ఉం టాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే హర్మూజ్ను తెరుస్తారో అప్పుడు కాల్పుల విరమణ అంశా న్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ త్వరితగతిన లొంగుబాటుకు ముందుకు రాకపోతే రాతియుగం నాటి పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ కొత్త పాలకుడు గత పాలకుడితో పోల్చితే కొంత మేరకు తెలివైన వా డని అధ్యక్షుడు పెజెష్కియాన్ను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ వెంటనే స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అసత్యాలు, ఆధారరహితమని కొట్టిపారేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికా ర ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ పారామిలిటరీ రెవెల్యూషనరీ గా ర్డ్(ఐపిఆర్జి) తరపున కూడా ఒక ప్రకటన వెలువడింది. హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని తెలిపింది. శత్రుదేశాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు తలొగ్గి హర్మూజ్ను తెరిచివుంచేది లేదని కుండబద్ధలు కొట్టింది. పెజెష్కియాన్ విరుద్ధ ప్రకటన... అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యురోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్తాతో ఫోన్లో మాట్లాడారు. యుద్ధం ముగించాలంటే కొన్ని కీలకమైన అంశాల్లో తమకు హామీలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్లో తమపై తిరిగి ఇలాంటి దాడులు జరగబోవని స్పష్టం చేయాలన్నారు. ఈ అంశాన్ని ఆంటోనియో కూడా ధ్రువీకరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. తాము అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్తో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమే కానీ అది యుద్ధం ముగింపునకు ఉద్దేశించినవి కావన్నారు. అవి అమెరికాతో అధికార చర్చలు మాత్రం కావన్నారు. మధ్యవర్తుల ద్వారా వస్తున్న సందేశాలకు మాత్రమే స్పందిస్తున్నామన్నారు. తాము కాల్పుల విరమణకు మొగ్గు చూపడం లేదని, యుద్ధ విరమణే కోరుకుంటున్నామన్నారు.
తక్షణమే కాజీపేట రైల్వే డివిజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ను త క్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి ఒక సమగ్రమైన లేఖ రా శారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం బుధ వా రం కేంద్ర మంత్రికి స్వయంగా అందజేశారు. కా జీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబా ద్ డివిజన్పై పనిభారం విపరీతంగా పెరిగి ందని తన లేఖలో ఎత్తిచూపారు. తాజా గణాంకాల ప్ర కారం, ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉందని, రాబో యే కాలంలో వాడి-రాయచూర్, విష్ణుపురం-బీబీనగ ర్ డబ్లింగ్ పనులు పూర్తయితే, ఇది సుమారు 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని ఆయ న పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకారం ఒక డివిజన్కు ఉండాల్సిన పరిమితి కంటే చాలా ఎక్కువని వివరించారు. మిగతా డివిజన్లతో పోలిస్తే సికింద్రాబాద్పై ఉన్న ఒత్తిడిని వివరిస్తూ విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2,200 ట్రాక్ కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, గుంటూరు డివిజన్ కేవలం 900 కిలోమీటర్ల లోపే ఉందని గుర్తు చేశారు. అనేక చో ట్ల ప్రతిపాదిత కాజీపేట డివిజన్ కన్నా తక్కువ కి లోమీటర్లు ఉన్న డివిజన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భారీ అసమతుల్యత వ ల్ల సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ అత్యంత సం క్లిష్టంగా మారిందని, ఇది రైళ్ల రాకపోకల సాంద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయడం అటు పరిపాలన సౌల భ్యం, ఇటు కార్యకలాపాల రీత్యానూ అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపాదిత కాజీపేట డివిజన్లో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మణుగూరు అండ్ సత్తుపల్లి వంటి కీలక మార్గాలను చేర్చడం ద్వారా సుమారు 2,000 ట్రాక్ కిలోమీటర్ల నెట్వర్క్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చని సూచించారు. రైల్వే శాఖ ప్రస్తుతం పరిశీలిస్తున్న కొన్ని మార్పులపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్ను హైదరాబాద్ డివిజన్కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, భౌగోళిక సామీప్యత దృష్ట్యా దానిని కాజీపేట డివిజన్లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే, లాతూర్ రోడ్-పర్లీ వైజనాథ్ సెక్షన్ను నాందేడ్ డివిజన్కు మార్చే అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని విన్నవించారు. కాజీపేట ప్రధాన రైలు మార్గాల కూడలిలో ఉండటం, అక్కడ ఇప్పటికే రైల్వే తయారీ యూనిట్, మహబూ బాబాద్లో మెయింటెనెన్స్ కేంద్రాల అభివృద్ధి జరుగుతున్నందున, ఈ ప్రాంతం జాతీయ స్థాయిలో కీలక రైల్వే హబ్గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు ఆహార ధాన్యాల రవాణా ద్వారా రైల్వేకు ఈ ప్రాంతం నుండి భారీ ఆదాయం లభిస్తుందని, ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్గాలపై ప్రత్యేక పరిపాలనా పర్యవేక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్పై ఉన్న ఆర్థిక భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుతో కార్యకలాపాల వికేంద్రీకరణ జరుగుతుందని, తద్వారా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే సేవలు మెరుగుపడటమే కాకుండా, సమ తుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. చివరగా, భారతీయ రైల్వేల సంస్థాగత బలోపేతానికి, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈ డివిజన్ను తక్షణమే ఆమోదించాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నేటి నుంచి ఐదు మండలాల్లో భూభారతి
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో భూ వి వాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమై న, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొ డుగు కిందకు తెస్తూ ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్ను రూపొందించామని ఆయన తెలిపా రు. ఈ పోర్టల్ను గురువారం (2వ తేదీ) నుం చి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూ వివాదాల పరిష్కారానికి ఇది తొలి అడుగు అని ఆ యన పేర్కొన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బ ట్టి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను రైతు కోణంలో రూపొందించామని, సామా న్య రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఖ మ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గ ల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జి ల్లా కొస్గీ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.గతం లో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్ను రూపొందించామని మంత్రి తెలిపారు. రై తులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే ’భూ భారతి’ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తమకున్న భూమి వివరాలు కనిపిస్తాయని మంత్రి తెలిపారు. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే, అందుకు సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో చూపిస్తుంద న్నారు. ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెనస్డ్ సర్వేయర్ లాగిన్కు వెళతాయన్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారన్నారు. అనంతరం ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెనస్డ్ సర్వేయర్ ఖరారు చేయడమే కాకుండా, సర్వేను రోవర్లతో పూర్తి చేస్తారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. దీనిని సిస్టంలో నమోదు చేశాక, అది మండల సర్వేయర్ స్క్రూటినీకి వెళుతుందన్నారు. ఆపై మండల తహసీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్పీఎం, భూధార్ నంబర్లు కేటాయిస్తారని ఆయన తెలిపారు. ఈ వివరాలన్నీ భూ భారతి పోర్టల్లో నిక్షిప్తమవుతాయన్నారు. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ను జనరేట్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారని ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తాయని మంత్రి వివరించారు. భూముల క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా.... భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్ను (ఎల్పీఎం) యూనిక్ నంబర్, ప్రతి సర్వే నంబర్కు భూధార్ నంబర్ కూడా ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని, గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ జరింగ్ వంటి పాత పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామన్నారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి కావడమే కాకుండా, కచ్చితమైన వివరాలు వస్తాయన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని మంత్రి స్పష్టం చేశారు.
సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం
సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ […] The post సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం appeared first on Visalaandhra .
. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. నాటో నుంచి వైదొలుగుతాం. ట్రంప్ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్: మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్తో యుద్ధం ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మనకంటే వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది. […] The post త్వరలో యుద్ధం ముగిస్తాం appeared first on Visalaandhra .
వాల్స్ట్రీట్ జర్నల్ కథనంన్యూయార్క్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే […] The post ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ? appeared first on Visalaandhra .
ఇరాక్లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్
బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్ను ఇరాక్లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని […] The post ఇరాక్లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్ appeared first on Visalaandhra .
ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?
హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్టైమ్తో కొత్త వెర్షన్ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు […] The post ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు? appeared first on Visalaandhra .
తెలంగాణ నేపథ్య కథతో ‘సుకుమార’ కొత్త చిత్రం
హైదరాబాద్: తెలంగాణ మట్టికథలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రధాన కథావస్తువుగా తీసుకుని దర్శకులు భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘బలగం’ ఈ కోవలోనే ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చిత్రాన్ని తెలంగాణలోని ప్రతి పల్లెలో తెరలు కట్టుకుని చూస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘బలగం’ తరువాత తెలంగాణ నేపథ్య కథలతో సినిమాలు తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇక త్వరలో మరో తెలంగాణ నేపథ్య కథతో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా […] The post తెలంగాణ నేపథ్య కథతో ‘సుకుమార’ కొత్త చిత్రం appeared first on Visalaandhra .
విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా
హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే […] The post విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా appeared first on Visalaandhra .
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు రూ.195.50 పెంచాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,078.50 లకు చేరింది. మార్చి 1న కూడా 19 కిలోల సిలిండర్ రేటు 114.5 పెరిగింది. మార్చి 7న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.60 పెరగ్గా, ఇప్పుడు ఈ రేటు ఎలాంటి మార్పులేదు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు ఎటిఎఫ్, ఎల్పిజి ధరలను సవరిస్తాయి. వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలతో హోటళ్లలో టిఫిన్లు, భోజనం, టీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. రెట్టింపైన విమాన ఇంధన ధర దేశీయ విమాన ఇంధన ధరలు రెట్టింపు అయ్యాయి. కిలో లీటరు ధర రూ.2.07 లక్షల కోట్లకు చేరింది. అంటే 114.5 శాతం లేదా రూ.1,10,703 పెరిగింది. మొదటిసారిగా వి మాన ఇంధనం ధర రూ.2 లక్షల కోట్ల మార్క్ ను దాటింది. 2022లో రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా ఇది కిలో లీటరు రూ.1.1 లక్షలకు పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వి మానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు పెరిగి, భవిష్యత్తులో ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మ్యాచ్ గెలిచినా రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!
శ్రేయాస్కు బీసీసీఐ షాక్ముల్లాన్పూర్ : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తొలిమ్యాచ్లోనే గెలుపు ఖాతా తెరిచింది. కొట్టింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ […] The post మ్యాచ్ గెలిచినా రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు! appeared first on Visalaandhra .
ఐపీఎల్లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ
అందుకే ఆడట్లేదుఆడమ్ జంపాఇస్లామాబాద్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా… ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన నైపుణ్యానికి ఐపీఎల్లో సరైన విలువ, డబ్బు లభించడం లేదని, అందుకే ఈ లీగ్లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జంపా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎసఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ జంపా తన అసంతృప్తిని బయటపెట్టాడు. “ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను. […] The post ఐపీఎల్లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవప్రదమైన ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. గత పాలనలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులకు ఈ బిల్లు ఆమోదంతో శాశ్వత ముగింపు లభించిందని, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధత తొలగిపోయిందని తెలిపారు. రైతుల […] The post ఆంధ్రులకు దక్కిన గౌరవం appeared first on Visalaandhra .
కేంద్ర నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టింది
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అమరావతి రాజధాని బిల్లును లొక్సభ ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ |ర్కొన్నారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజుకు పార్లమెంట్ వేదిక కావడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నేపథ్యంలో, దానికి చట్టబద్ధత […] The post కేంద్ర నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టింది appeared first on Visalaandhra .
గురువారం రాశి ఫలాలు (02-04-2026)
మేషం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృషభం ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మిధునం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కర్కాటకం సోదరులతో ఆస్థి వివాదాలు కలుగుతాయి. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. సింహం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. కన్య ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. తుల కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనస్సు భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుంభం సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. మీనం ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
న్యూదిల్లీ : దేశంలో జనాభా లెక్కల కోసం కేంద్రం చేపట్టిన జనగణన తొలివిడత కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమయింది. ఇది 16 వ విడత లెక్కింపు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎనిమిదోది. మొదటిసారిగా దేశంలో జనగణన 1872 లో ప్రారంభమయింది. ఇంతకుముందు చివరిసారిగా 2011 లో జనాభాను లెక్కించారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం 2021లో తిరిగి జనాభా లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా… ఆ సమయంలో కోవిడ్ కారణంగా ఇది వాయిదాపడింది. దీంతో ఇప్ప్పుడు జనగణన కేంద్రం […] The post దేశంలో జనగణన ప్రారంభం appeared first on Visalaandhra .
ఐపిఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. సమీర్ రిజ్వీ(70) 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడటంతో 6 వికెట్లతో జయకేతనం ఎగురవేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలుండగానే అందుకుంది. రిజ్వీకితోడు త్రిస్టన్ స్టబ్స్ సయితం బ్యాట్ ఝులిపించడంతో విజయ లాంచనం పూర్తయింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాద్ రెండు వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, మొసిన్ ఖాన్ చెరు వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రిషభ్ పంత్(7) అనవసర పరుగు కోసం ప్రయత్నించి రన్నవుట్గా వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్(35)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. ఎయిడెన్ మార్క్మ్(్ర11)ను అక్షర్ పెవిలియన్ చేర్చాడు. డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్(8)ను ఎన్గిడి క్లీన్ బౌల్ చేయగా.. ఆయుష్ బదోని(0), అబ్దుల్ సమద్(36), మహమ్మద్ షమీ(1)లను నటరాజన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎన్గిడి, నటరాజన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్కు ఒక వికెట్ తీసి కీలక భూమిక ఫోషించాడు.
ఇండిగో విమాన టికెట్లపై ఇంధన చార్జీలు పెంపు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, జెట్ ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై సవరించిన ఇంధన చార్జీలను విధించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ సవరణల ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమానాలపై రూ.275 నుంచి రూ.10,000 వరకు ఇంధన చార్జీలు విధించబడతాయి. దీంతో విమాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఇదే రోజున విమాన ఇంధనమైన ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ఫ్యుయెల్) ధరలు సవరించగా, ప్రభుత్వం దేశీయ విమానాల కోసం వాటిని కేవలం 25 శాతం మేరకు మాత్రమే పెంచినట్లు వెల్లడించింది. మార్చి 14 నుంచే ఇండిగో, ధరల పెరుగుదల కారణంగా రూ.425 నుంచి రూ.2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తూ వస్తోంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయ విమానాల విషయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి కొత్త ఇంధన చార్జీలు రూ.275 నుంచి రూ.950 వరకు ఉండనున్నాయి. ‘ప్రయాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని ఇంధన చార్జీలను మళ్లీ సవరించాం’ అని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ విమానాల విషయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి ఈ చార్జీలు రూ.900 నుంచి రూ.10,000 వరకు ఉండనున్నాయి. ‘గత నెలలో అంతర్జాతీయ విమానాల కోసం ఉపయోగించే ఏటీఎఫ్ ధరలు రెండింతలకుపైగా పెరిగాయి. దీనివల్ల ఆ మార్గాలపై నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని ఇండిగో తెలిపింది. ఈ సవరించిన చార్జీలు ఏప్రిల్ 2 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని పూర్తిగా టికెట్ ధరలపై మోపాలంటే భారీగా పెంచాల్సిన అవసరముందని సంస్థ పేర్కొంది. అయితే ప్రయాణికులపై భారం తగ్గించే ఉద్దేశంతో తక్కువ మొత్తాన్నే పెంచినట్లు ఇండిగో వెల్లడించింది.
ఏటా 15 శాతం పెరుగుదల.. పదేళ్లలో మూడు రెట్లుక్యాపిటల్ వాల్యూ విధానంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వంఎన్నికల హామీకి తిలోదకాలుజీవో 198 రద్దుకు పెరుగుతున్న డిమాండ్ విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలోని పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం కొండలా పేరుకుపోతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘క్యాపిటల్ వాల్యూ’ (ఆస్తి విలువ ఆధారిత) పన్ను విధానం ఇప్పుడు సామాన్యుడి పాలిట శాపంగా మారింది. ఎన్నికలకు ముందు ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి నాయకులు… అధికారంలోకి వచ్చి రెండేళ్లు […] The post పట్టణ ప్రజలపైపన్ను పోటు appeared first on Visalaandhra .
ఇజ్రాయిల్, అరబ్ దేశాలపై క్షిపణుల వర్షంతెహ్రాన్పై విస్తృతంగా వైమానిక దాడులుమేం కాల్పుల విరమణ కోరలేదు: ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని వెల్లడి తెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 33వ రోజుకు చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా…తెహ్రాన్ కాల్పుల విరమణ కోరిందంటూ ట్రంప్ బాంబు పేల్చారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలు ‘అవాస్తవం, నిరాధారం’ అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ అన్నంత పని […] The post యుద్ధ బీభత్సం appeared first on Visalaandhra .
ఏడేండ్ల తరువాత ఇరాన్ చమురు భారత్ కు
దాదాపుగా 6 లక్షల బ్యారెల్స్ ఇరాన్ ముడిచమురు నౌక భారత్కు చేరుకోనుంది. ఏడు సంవత్సరాల వ్యవధిలో ఇరాన్ క్రూడాయిల్ భారత్కు చేరడం ఇదే మొదటిసారి. గల్ఫ్ యుద్ధం క్రమంలో భారత్కు ఇరాన్ నుంచి ఈ చమురు అందుతోంది. గుజరాత్లోని దీన్దయాళ్ పోర్టుకు ఈ నెల 4వ తేదీన ఈ క్రూడాయిల్ నౌక చేరుతుందని అధికారులు తెలిపారు. గతంలో అమెరికా ఆంక్షలతో ఇరాన్ నుంచి భారతదేశం చమురు నిలిపివేతకు దిగింది. ప్రస్తుత చమురు సంక్షోభ దశలొ అమెరికా ఆంక్షలు సడలించారు. దీనితో పాటు భారత్కు క్రూడాయిల్ చేరవేతకు ఇరాన్ ఆసక్తి చూపింది. రెండు మూడు రోజుల్లో చమురు ఇక్కడికి చేరడంతో దేశంలో ఇంధన లోటు భర్తీకి వీలేర్పడుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు ఇరాన్ నుంచి భారత్కు 2019 మేలో క్రూడాయిల్ అందింది. తరువాత ఇప్పుడు ఈ చమురు రానుంది.
ఆంధ్రప్రదేశ్లో రోయింగ్కు బూస్ట్ కి కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్లో రోయింగ్కు బూస్ట్ కి కీలక నిర్ణయాలు సూర్యలంక, విజయవాడ, విశాఖలో ప్రధాన
పారుతున్న కాళేశ్వర జలాలే సజీవ సాక్ష్యం: హరీష్ రావు
పారుతున్న కాళేశ్వరం జలాలే ప్రాజెక్టు ఫలితాలకు సజీవ సాక్షంగా నిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫోటోతో కూడిన సందేశాన్ని ఆయన పోస్ట్ చేశారు. లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లు లేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజావ సాక్షమని హరీష్ రావు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు అని అన్నారు.
విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి
విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని
Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News
Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ,
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి , –చిట్యాల ఎస్.ఐ ,పోచంపల్లి సతీష్
మత్తు పదార్థాలకు దూరం, హెల్మెట్లు ధరిస్తామని తీర్మాన పత్రం
మత్తు పదార్థాలకు దూరం, హెల్మెట్లు ధరిస్తామని తీర్మాన పత్రం తొర్రూరు, ఆంధ్రప్రభ :
రేపు హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ హనుమాన్ నామస్మరణతో మారుమోగనుంది. గురువారం నగరంలో నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రధాన యాత్ర రాత్రి 8 గంటలకు తాడిబం డ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలవనున్నాయి. అంతేకాకుండా మల్కాజిగిరి కమిషన రేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు జరగనున్నాయి. యాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సిటిఒ తాడిబండ్, ఇసిఐఎల్, ఎఎస్ రావు నగర్, సైనిక్పురి, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆర్టిసి బస్సులు, సరుకు రవాణా వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయి. యాత్ర సాగే రూట్లలో వాహనాల పార్కింగ్ పూర్తిగా నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను టోయింగ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. భక్తుల సౌకర్యార్థం తాడిబండ్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతు న్నారు.యాత్ర సాఫీగా సాగేందుకు సుమారు 3000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటు అదనపు సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. శోభాయాత్ర నిర్వాహకులకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశామని, భక్తులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సిఎం రాముడు అయితే శకుని ఎవరు?: కల్వకుంట్ల కవిత
సీఎం రేవంత్రెడ్డి తాను రాముడిని అని.. మాజీ సీఎం కేసీఆర్ రావణుడు అని అంటున్నారని.. అయితే శకుని ఎవరు అని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం అనం తరం ఆమె మీడియాతో చిట్చాట్ చేశారు. మావోయిస్టులు కూడా తమ పార్టీలోకి వస్తారని, వారిది తమది ఒకే ఎజెండా అని వెల్లడించారు. అసె ంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టుకున్నారని ఆరోపించారు. అలా గే బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని చెప్పారుహిళలకు సబ్ కోటా ఇవ్వాలని పోరాటం చేస్తామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కుర్మిద్దలో పెద్ద భూస్వాముల భూములు వదిలి పేద గిరిజనుల భూములు టీజీఐఐసీ గుంజుకుంటున్నదని త్వరలో వారికోసం పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి ముందు ఉమా భారతి సహా ఇతర పెద్ద లను కలిసి ఆశీర్వాదం తీసుకుంటామన్నారు.
అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి
అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంట క్షేత్రాల
పరిటాల కుటుంబాన్ని ఎక్కడైనా ఓడిస్తాం..!
పరిటాల కుటుంబాన్ని ఎక్కడైనా ఓడిస్తాం..! మా టార్గెట్ పరిటాల కుటుంబం..! రాప్తాడు,ఆంధ్రప్రభ :
అద్విక ట్రేడింగ్ స్కామ్లో మరొకరి అరెస్ట్
అద్విక ట్రేడింగ్ స్కామ్లో మరొకరి అరెస్ట్ డిపాజిటర్లను మోసం చేసిన ఏజెంట్ ఖాజావళి
నరహరిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన లగడపాటి
నరహరిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన లగడపాటి భవానిపురం, ఆంధ్రప్రభ : సమైక్యాంధ్ర ఉద్యమ నేత,
మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది –రైతులకు గిట్టుబాటు ధర అందేలా అన్ని
అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం
అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వంఎమ్మెల్యే
ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గిరిజన వ్యక్తి ఆత్మహత్య
ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గిరిజన వ్యక్తి ఆత్మహత్య ఎ.కొండూరు,ఆంధ్రప్రభ : ఇంటిపై తీసుకున్న
ముగిసిన లక్నో ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది లక్నో. ఈ మ్యాచ్ లొ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. తర్వాత మార్క్రమ్ (11) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్(37)లు పర్వాలేదనిపించారు. స్టార్ బ్యాటర్ పూరన్(8) విఫలమయ్యాడు. దీంతో లక్నో జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాన్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
ఎన్టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత
ఎన్టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత జిల్లాలో 2,26,775 మందికి రూ. 98.45
యుద్ధ పరిస్థితులపై ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై, అలాగే దేశ సంసిద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జె.పి. నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పూరి ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శులు పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, అలాగే క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్పై పడే ప్రభావంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో సీసీఎస్ రెండోసారి సమావేశం ఇది. తొలి సమావేశంలో గల్ఫ్ దేశాల పరిస్థితిపై చర్చ, దేశం ఎదుర్కొంటున్న పరిణామాలపై ప్రజెంటేషన్ ఇవ్వడంతోపాటు.. దేశ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలపై ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు.
ఏకా –ది వన్ చిత్ర ప్రదర్శన అదరహో..
ఏకా – ది వన్ చిత్ర ప్రదర్శన అదరహో.. ప్రతి స్వరూపం విశిష్ట
హెచ్పివి వ్యాక్సిన్ పై అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన రాజనర్సింహ
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ)ఆధ్వర్యంలో హెచ్పివి వ్యాక్సిన్ పై సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించటానికి రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ రకాల నుంచి రక్షణ కల్పించే సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన, దీర్ఘకాలిక రక్షణ కోసం ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను బాల బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని మంత్రి సూచించారు. హెచ్పివి వ్యాక్సిన్ ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ ను తొమ్మిది నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు తప్పనిసరిగా వేసుకునేలా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి కోరారు.
వినూత్న సాగుతో సుస్థిర ఆదాయం ఆంధ్రప్రభ, విజయవాడ : రైతులు సంప్రదాయ పద్ధతులతో
కేంద్రీయ బలగాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల బిల్లు (సిఎపిఎఫ్) 2026ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ప్రతిపక్షాల వాకౌట్ దశలో బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం పలికారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల నిర్వహణకు సంబంధించి చట్టపరమైన ఏకీకృత వ్యవస్థ కోసం ఈ బిల్లు తీసుకువచ్చారు. ఇప్పుడు సంబంధిత బలగాలకు సంబంధించి వేర్వేరు సర్వీసు నిబంధనల ఏర్పాటు ఉంది, దేశవ్యాప్తంగా ఐదు సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు దళాలు ఉన్నాయి. అంతకు ముందు బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. కేంద్రీయ పోలీసు బలగాలలలో సరైన సమర్థత, ఆత్మస్థయిర్యానికి ఈ ప్రతిపాదన తీసకువచ్చినట్లు వివరించారు. దేశ సమాఖ్య విధాన బలోపేతానికి , రిక్రూట్మెంట్ కార్యకలాపాలు, క్రమబద్ధీకరణకు ఈ చర్య ఉపయోగపడుతుందని తెలిపారు. సమాఖ్య విధానానికి ఇది వ్యతిరేకంగా ఉందనే వాదనను తోసిపుచ్చారు. పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించాలని పట్టుపడుతూ ప్రతిపక్షాలు వాకౌట్కు దిగాయి. మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ప్రతిపక్షాలు సభాసాంప్రదాయాలను పట్టించుకోవడం లేదని సభా నాయకులు , కేంద్ర మంత్రి జెపి నడ్డా ఎదురుదాడికి దిగారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. ఎంపీకి అభినందనలు
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. ఎంపీకి అభినందనలు విజయవాడ,ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని
లోక్సభలో జనవిశ్వాస్ సవరణ బిల్లుకు ఆమోదం
లోక్సభ బుధవారం జన విశ్వాస్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. 23 మంత్రిత్వశాఖల నిర్వహణలోని 79 కేంద్రీయ చట్టాలలోని 784 నిబంధనల సవరణకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చిన్న పాటి నేరాలను శిక్షారహితం చేసేందుకు , నిర్వహణపరమైన సరళీకృతానికి బిల్లును తీసుకువచ్చారు. కాలం చెల్లిన, నిరర్థక నిబందనల ఎత్తివేతకు సంబంధించి వేయి వరకూ నేరాల సమీక్ష తరువాత బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ప్రజలకు , ఎంఎస్ఎంఇలకు ఉపయోగపడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. బిల్లుకు వరంగల్ కాంగ్రెస్ సభ్యులు కడియం కావ్య తీసుకువచ్చిన మార్పులు చేర్పులను సభ తిరస్కరించింది. అభ్యంతరాలను తోసిపుచ్చారు.
గురుకుల పాఠశాలలో విషాదం రెండో అంతస్తు నుంచి జారిపడి విద్యార్థిని మృతి పాతపట్నం,ఆంధ్రప్రభ
అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం.. స్వాగతించిన మంత్రి పొన్నం..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు.. లోక్సభలో ఆమోదం పొందడాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఎపి ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం వివక్ష చూపుతోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ‘‘బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం వంటి హామీలను ఇప్పటివరకూ నెరవేర్చలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో కూడా కేంద్రం మాట తప్పింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ విభజన చట్టంలో పొందు పరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’’ అని పొన్నం డిమాండ్ చేశారు.
కాజీపేటలో చైన్ స్నాచింగ్ కలకలం..
కాజీపేటలో చైన్ స్నాచింగ్ కలకలం.. కాజీపేట, ఆంధ్ర ప్రభ : జీపేట బాపూజీ
మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బారికేడ్ల వితరణ
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 01 (జనం సాక్షి ): జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ …
నిరాశపర్చిన పంత్.. కీలక వికెట్లు కోల్పోయిన లక్నో
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఐపిఎల్ 2026లో భాగంగా తొలి మ్యాచ్ లో ఢిల్లీపై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న లక్నోకు శుభారంభం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. తర్వాత మార్క్రమ్ (11) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 7 ఓవర్లలో 50/3తో ఢిల్లీ ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో మిచెల్ మార్ష్ (21), పూరన్(1)లు ఉన్నారు.
ఇది చారిత్రాత్మక ఘట్టం: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల మహోన్నత త్యాగాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ‘తరతరాలు గుర్తుంచుకునేలా, అపారమైన విశ్వాసంతో 33,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు నా ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను‘ అని పేర్కొన్నారు. అదే సమయంలో, అమరావతికి బలమైన పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఈ బృహత్ కార్యం వాస్తవరూపం దాల్చడానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఎయిర్పోర్టులు, చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులు
గల్ఫ్ యుద్ధంలో ఇరాన్ మరోసారి కువైట్పై దాడులు తీవ్రతరం చేసింది. కువైట్ ఎయిర్పోర్టు, ఖతార్ పోర్టు వద్ద ఓ చమురు ట్యాంకర్పై విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధిపై తన పట్టు సడలించడానికి నిరాకరిస్తున్న ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులను విస్తృతం చేసింది. గల్ఫ్ ప్రాంతానికి అమెరికా నుంచి అదనపు బలగాల తరలింపు దశలో ఇరాన్ ఎదురుదాడులతో బుధవారం కువైట్ తల్లడిల్లింది. క్రూయిజ్ మిసైల్స్తో దాడులు జరిగాయి. తమ దేశ తీర ప్రాంతంలో ఇరాన్ దాడి జరిగిందని ఖతార్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ ట్యాంకర్ దెబ్బతింది. సిబ్బందిని సురక్షితంగా తరలించారు. దుబాయ్కు సమీపంలో కువైట్కు చెందిన పూర్తి స్థాయి లోడ్తో ఉన్న ట్యాంకర్పై దాడులు జరిగాయి. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్లో ఫుజైరా వద్ద ఇరాన్ డ్రోన్ శకలాల ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. బహరైన్లో రెండు మూడుసార్లు సైరన్ల మోతలు విన్పించాయి. జోర్డాన్లో ఇరాన్కు చెందిన రెండు డ్రోన్లను, బాలిస్టిక్ మిస్సైల్ను అక్కడి సైన్యం అడ్డుకుంది. సౌదీ అరేబియాలో కూడా ఇరాన్ చర్యను నివారించారు. ఇజ్రాయెల్ బుధవారం టెహరాన్లో జరిపిన వైమానిక దాడులలో అక్కడి అమెరికా మాజీ ఎంబసీ కాంపౌండ్ దెబ్బతింది. ప్రస్తుతం ఇక్కడ ఐఆర్జిసి బలగాలు ఉంటున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్పై విరుచుకు పడ్డాయి
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు..
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా నది నుంచి
ఇరాన్ పాలకుడు కాల్పుల విరమణకు ముందుకొచ్చాడు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కాల్పులు విరమణ కోరుతూ విజ్ఞప్తి చేశారని తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో బుధవారంనాడు పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచేంత వరకు ఇరాన్పై భీకర దాడులు కొనసాగుతూనే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే హర్మూజ్ను తెరుస్తారో అప్పుడు కాల్పుల విరమణ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ త్వరితగతిన లొంగుబాటుకు ముందుకు రాకపోతే రాతియుగం నాటి పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ కొత్త పాలకుడు గత పాలకుడితో పోల్చితే కొంత మేరకు తెలివైన వాడని అధ్యక్షుడు పెజెష్కియాన్ను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యురోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్తాతో ఫోన్లో మాట్లాడారు. యుద్ధం ముగించాలంటే కొన్ని కీలకమైన అంశాల్లో తమకు హామీలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్లో తమపై తిరిగి ఇలాంటి దాడులు జరగబోవని స్పష్టం చేయాలన్నారు. ఈ అంశాన్ని ఆంటోనియో కూడా ధ్రువీకరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. తాము అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్తో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమే కానీ అది యుద్ధం ముగింపునకు ఉద్దేశించినవి కావన్నారు. అవి అమెరికాతో అధికార చర్చలు మాత్రం కావన్నారు. మధ్యవర్తుల ద్వారా వస్తున్న సందేశాలకు మాత్రమే స్పందిస్తున్నామన్నారు. తాము కాల్పుల విరమణకు మొగ్గు చూపడం లేదని, యుద్ధ విరమణే కోరుకుంటున్నామన్నారు.
ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటి మిట్టలోని సీతా రాముల వారి కళ్యాణం వైభవోపేతంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఈ వేడుకకు హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పటిష్టం ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణ వేదికకు ఎదురుగా 120 గ్యాలరీలు ఏర్పాటు చేసింది. గ్యాలరీల్లో కూర్చొనే భక్తులకు తీర్థప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు, తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్ల కిట్తో పాటు ఈసారి లడ్డూ ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తున్నారు. 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు.
ఇరాక్లో అమెరికా మహిళా జర్నలిస్టును కిడ్నాప్ కలకలం #ShelleyKittleson #Baghdad #Kidnap #Iraq
లిఫ్ట్ మార్గం మార్పు… భక్తులకు మెరుగైన సౌకర్యాలుమహా మండపంలో అంతర్గతంగా లిఫ్ట్ దారి
రైతుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం,
రైతుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్,
సింహవాహనంపై శ్రీ గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులు…
సింహవాహనంపై శ్రీ గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులు… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై
హోటళ్లలో యదేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం
హోటళ్లలో యదేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం అరకొర తనిఖీలు , పట్టించుకోని అధికారులు
అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం…
అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం… పార్లమెంట్ మద్దతుతో రాజధానికి మరింత బలంఇది రైతులందరి
మన ఇసుక వాహనం పోస్టల్ లో దరఖాస్తు చేసుకోండి..
మన ఇసుక వాహనం పోస్టల్ లో దరఖాస్తు చేసుకోండి.. ఊట్కూర్ తాసిల్దార్ చింతరవి
11 సీట్ల తీర్పు మరిచిన జగన్…. అమరావతిపై ఇంకా విషం కక్కుతూనే!మాజీ ఎమ్మెల్సీ
చౌడమ్మది ఆత్మహత్య కాదు.. పోస్ట్ మార్టం రిపోర్ట్…!!!
చౌడమ్మది ఆత్మహత్య కాదు.. పోస్ట్ మార్టం రిపోర్ట్…!!! హత్య అని ముందే చెప్పిన
దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి
*మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదు*న్యాయ వ్యవస్థ ద్వారా బీజేపీ తన అజెండాను అమలు చేస్తోంది*దళిత క్రైస్తవులకు అట్రాసిటీ చట్టం వర్తించకపోవడం దుర్మార్గంసీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ విశాలాంధ్ర-తిరుపతి : దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే పునఃపరిశీలించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. […] The post దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి appeared first on Visalaandhra .

30 C