Strait of Hormuz : హోర్ముజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ కఠిన నిర్ణయం
హోర్ముజ్ జలసంధి అంశంలో ఉద్రిక్తత మళ్లీ పెరిగింది
Iran - America Talks : ఇరాన్ - అమెరికా చర్చల మధ్య ప్రతిష్టంభన
ఇరాన్ అమెరికా తో మరో విడత ముఖాముఖి చర్చలకు ఇప్పుడే సిద్ధంగా లేదని సీనియర్ ఇరానీ అధికారి తెలిపారు
అంధకారంలో మూడు మండలాలు మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం డంపింగ్ యార్డ్
19thaprileditorial |మోడీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు
19thaprileditorial | మోడీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు 19thaprileditorial | మహిళా రిజర్వేషన్
One Nation One Reservation |రిజర్వేషన్ వ్యవస్థలో అసమానతలు
One Nation One Reservation | రిజర్వేషన్ వ్యవస్థలో అసమానతలు One Nation
Revanth reddy |మహిళా సాధికారతలో తెలంగాణ ముందంజ
Revanth reddy | మహిళా సాధికారతలో తెలంగాణ ముందంజ Revanth reddy |
హర్మూజ్ జలసంధిలో భారత నౌకపై కాల్పులు
టెహ్రాన్: హర్మూజ్ జలసంధి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెరిచినట్టే తెరిచే గంటల వ్య వధిలో ఇరాన్ తిరిగి మూసివేసింది. దానికి అమెరికా అనుసరిస్తున్న వైఖరే కారణమని స్పష్టం చే సింది. శుక్రవారంనాడు జలసంధిని తెరిచిన ఇరా న్ శనివారంనాడు మూసివేసింది. హర్మూజ్ను తెరిచినప్పటికీ ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాం డ్ పేర్కొంది. ‘హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తిరిగి మొదటికి వచ్చింది. ప్రస్తుతం మా సాయు ధ దళాల నియంత్రణలో ఉంది. ఇరాన్ ఓడరేవుల పై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంత కా లం జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుం టాం’ అని ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేవరకు హర్మూజ్లో దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. ఆ వెంటనే హర్మూజ్లో రాకపోలను ఇరాన్ నియంత్రించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో జలసంధిని దాటేందుకు ముడి చమురు, గ్యాస్తో కూడిన 14 భారతీయ జెండాలతో కూడిన నౌకల కాన్వాయ్ను ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ అడ్డుకున్నారు. ఐఆర్జిసికి చెందిన రెండు గన్బోట్లు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వాటిలో ఒకదానిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నౌక కిటికీ అద్దం దెబ్బతింది. కెష్మ్లరాక్ దీవుల నడుమ ఈ ఘటన చోటుచేసుకుంది. ముడి చమురుతో కూడిన హెచ్పిసిఎల్కు చెందిన మరో నౌక మాత్రం సురక్షితంగా హర్మూజ్ను దాటి భారత్వైపు పయనిస్తోంది. మిగతా 12 నౌకలను గన్బోట్లు 37 కిలో మీటర్ల మేరకు వెంటాడి ఒమన్ను ఈశాన్య దిశలో అడ్డుకున్నాయి. దీంతో హర్మూజ్ను దాటకుండా ఆ నౌకలు వెనక్కి పయనమయ్యాయి. 14 నౌకలు ఏడు భారతీయ జెండాలతో కూడినవి కాగా, నాలుగు లైబీరియా, రెండు మార్షల్ దీవులు, మరొకటి వియత్నాంకు చెందినవి. వీటిలో ఆరింటిలో ముడి చమురు, మూడింటిలో ఎల్పిజి, నాలుగు ఎరువులతో నిండి ఉన్నాయి. ఈ నౌకలన్నింటినీ లరాక్ దీవులకు దక్షిణాన లంగరు వేయించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మిగతా నౌకలను కూడా క్షేమంగా హర్మూజ్ దాటించేందుకు పయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా దాడికి గురైన నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నాం.. మరోవైపు దేశం లోని పలు ఎయిర్ పోర్టులను తిరిగి తెరవడంతోపాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యురేనియంను అమెరికాకు అప్పగించేది లేదు: ఇరాన్ అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శుద్ధి చేసిన యురేనియ ం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్జడేహ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భవిష్యత్లో జరగనున్న చర్చలకు యురేనియం ప్రధాన అంశమని ట్రంప్ చేస్తున్న వాదనలను కొట్టి పారేశారు. టర్కీ లోని అంటల్యా సిటీలో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సయీద్ అమెరికాతో మరో దఫా ముఖాముఖి చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని వెల్లడించారు. ఎందుకంటే అమెరికా తన గరిష్టవాదాన్ని విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని శుక్రవారం ట్రంప్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో సయీద్ఖతిబ్జ్దేహ్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
19aprSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
19aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఓ మనిషీ…నన్ను కాపాడు(కో)…! ముఖచిత్ర కథనం
19thApril2026 |ఆదివారం నేటి పంచాంగం
19thApril2026 | ఆదివారం నేటి పంచాంగం 19thApril2026 | దిన విశేషాలు &
ఆటలో కచ్చితంగా ఓడిపోతామని తెలిశాక ఎవరైనా ఆడతారా? పరాజయంలో కూడా ఏదో ప్రయోజనం ఉంటే తప్ప ఎవరూ ఓడిపోయే ఆట ఆడాలనుకోరు. మరి కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఎందుకని అంకెలు అంత స్పష్టంగా కనిపిస్తూ ఉండగా ఓడిపోవడానికి సిద్ధపడింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం పార్లమెంట్లో మొట్టమొదటిసారి ఓటమిని చవిచూడటానికి ఎందుకు సిద్ధపడింది? ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు బిల్లులు వీగిపోతాయని ఆరవ తరగతి చదివే విద్యార్థి కూడా చెప్పగలడు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే హాజరయిన సభ్యులలో తప్పనిసరిగా మూడింట రెండువంతుల బలం ఉంటే తప్ప సాధ్యం కాదన్న విషయం నరేంద్ర మోడీకి, ఆయన ప్రభుత్వంలోని పెద్దలందరికీ బాగా తెలుసు. అయినా సరే, కేంద్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను ప్రతిపాదించేందుకు ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? ఇందులో ఒకటి చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు. రెండవది నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించినది. మూడవది కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణకు సంబంధించిన బిల్లు. నిజానికి మామూలు పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కూడా వీటిని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ బిల్లు నిజానికి 2023లోనే ఏకగ్రీవంగా పార్లమెంట్ ఆమోదం పొంది ఉన్నది. దానిని ప్రస్తుతం డీలిమిటేషన్తో లింక్ చేస్తూ తీసుకురావడాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ భాషలో చెప్పాలంటే ప్రతిపక్షాలను వాటికి ఆమోదం కానీ అంశంలో ఒప్పించేందుకు ఒక చీరను చుట్టి తీసుకొచ్చారు. పోలిక అభ్యంతరకరంగా ఉండవచ్చు కానీ ఆయన ఉద్దేశం డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో తీసుకువచ్చారు అని. ఒకవైపు ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతుండగా, ముఖ్యమైన రెండు రాష్ట్రాలలో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు) పోలింగ్ ఇంకా జరగాల్సి ఉండగా ఇంత హడావుడిపడి బిల్లులు ఎందుకు ప్రవేశపెట్టాలనుకున్నట్టు? సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ నిన్నటి చర్చలో పాల్గొంటూ ఇది నారీ బిల్లు కాదు ఎన్డిఎ ‘నారా’ అన్నారు. ఉర్దూలో ‘నారా’ అంటే నినాదం. మహిళలను విపక్షాలనుండి దూరం చేసి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ఈ నారీశక్తి వందన్ అధినియం బిల్లును మరొకసారి తెరమీదకి తెచ్చిందని అఖిలేష్ యాదవ్ అభిప్రాయం. 2029 ఎన్నికలలో మహిళాబిల్లుకు విపక్షాలు అడ్డుకొట్టాయన్న నినాదం తీసుకుని జనంలోకి వెళ్ళే ఆలోచన బిజెపి చేస్తున్నదని. అదే నిజమని ఒకటికి రెండుసార్లు శుక్రవారం సభలోపలా వెలుపలా జరిగిన సంఘటనలు స్పష్టం చేశాయి. సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన వెంటనే భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాల మహిళాసభ్యులంతా ముందే తయారు చేయించి పెట్టుకున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం ఒక ఉదాహరణ. అంతేకాదు, అంతకు ముందురోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా దేశంలోని మహిళలంతా తమవైపు చూస్తున్నారనీ, విపక్షాలు మద్దతు ఇవ్వకపోయినా, బిల్లు వీగిపోయినా తనకే లాభం అని చేసిన హెచ్చరికలాంటి వ్యాఖ్యలు అయినా, చివరగా చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు అయినా కచ్చితంగా ఈ సవరణ బిల్లు వీగిపోనున్నదని వారికి ముందే తెలుసునన్న విషయం స్పష్టం చేశాయి. అంతేకాదు, ఇదంతా మోడీ ప్రభుత్వం ఒక రాజకీయ ఎత్తుగడగా చేసిందని అర్థమైంది. ఈ బిల్లును వ్యతిరేకించడానికి మొత్తం ప్రతిపక్షం ఒక్కటైందన్న విషయం కూడా రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష సభ్యులందరి మాటల్లో స్పష్టంగా అర్థం అయింది. ప్రజాస్వామ్యంలో ఒక్కోసారి ప్రతిపక్షానిది పైచేయి కావడం పెద్ద విశేషమేమీ కాదు. ప్రజాస్వామ్యానికి ఉండే గొప్పతనమే అదని మర్చిపోకూడదు. గెలుపు ఓటముల మాట అలా ఉంచితే ఎన్డిఎ ఎందుకు ఇలా చేసింది? ప్రతిపక్షాలు ఎందుకు దీనిని వ్యతిరేకించాయి? లోకసభలో ఓటింగ్ పూర్తయి మహిళా బిల్లు వీగిపోయిందన్న వార్త వెలువడిన క్షణాల్లోనే ఫెమినిస్టుల దగ్గరినుండి సామాన్యుల దాకా చాలామంది ‘అయిపోయింది, మహిళలకు మళ్లీ మొండిచెయ్యి చూపించారు’ అని సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడ్డారు. ఎన్డిఎ ఆశించింది అదే. ఇండియా కూటమితోబాటు మిగిలిన పక్షాలన్నీ దీని మీద మహిళా లోకానికి సంజాయిషీ లేదా వివరణ ఇచ్చుకుంటూ దేశమంతా తిరగాలన్నది ఎన్డిఎ పథకం. మహిళా సంఘాలు, ఫెమినిస్టులు మరోసారి నిరాశ చెందడానికి కారణం ఉంది.30 ఏళ్ళుగా వాళ్ళు ఎంత ప్రయత్నించినా మహిళా రిజర్వేషన్ల వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది. సభలో బిల్లు వీగిపోగానే అధికారపక్ష మహిళాసభ్యుల నిరసనతో మొదలై ఎన్డిఎ ఇచ్చిన పిలుపుమేరకు శనివారంనాడు దేశమంతటా ‘ప్రతిపక్షాలు మహిళా వ్యతిరేకులు’ అంటూ ఎన్డిఎ పక్షాలు నిరసన మొదలుపెట్టాయి. ‘చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు మేం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు వాళ్ళని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి’ అన్న ప్రచారం పెద్దయెత్తున ఎన్డిఎ పక్షాలు మొదలుపెట్టాయి. మీడియాలో అత్యధికులు దీనికి వంతపాడటంలో ఆశ్చర్యమేమీలేదు. కొన్ని తెలుగు పత్రికలు ‘నెగ్గని మహిళా కోటా, ఆమెకు మళ్లీ నిరాశే, నారి సారీ’ వంటి శీర్షికలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డం కొట్టాయన్న అర్థం వచ్చే విధంగా రాసాయి. ఇది విషయాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం అయినా కావచ్చు లేదా ఎన్డిఎ ఎజెండాను ముందుకు తీసుకుపోయే క్రమంలో ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి శీర్షికలు పెట్టి ఉండవచ్చు. ఈ సమయంలో ప్రముఖ విప్లవకవి శివసాగర్ కవిత ఒకటి గుర్తొస్తున్నది. ‘ఆకాశంలో సగం నువ్వు, అనంతకోటి నక్షత్రాల్లో సగం నువ్వు, సగం నేను’ అంటాడాయన స్త్రీని ఉద్దేశించి. ఆకాశంలో సగం అయితే అయింది గాని స్త్రీ మన చట్టసభల్లో మాత్రం సగం కాదు. గణాంకాలు పరిశీలించినట్లయితే 18వ లోకసభలో మహిళల ప్రాతినిథ్యం 13.6% అంటే 74 మంది మహిళ ఎంపీలు ఉన్నట్లు లెక్క. చట్టసభలకు ప్రతినిధులను పంపేందుకు జరిగే ఎన్నికలలో ఓట్లు వేసే మహిళల సంఖ్య పెరుగుతున్నదే తప్ప చట్టసభల్లోకి మాత్రం తక్కువమంది వెళ్తుండటం జీవిత సత్యం. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు, దేశంలోని నియోజకవర్గాల పునర్విభజన, వాటి సంఖ్య పెంపు. ఈ అంశాలను విడివిడిగా చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పెద్దది, చైతన్యవంతమైనది అయిన భారతదేశ ప్రజాస్వామ్యంలో నానాటికీ పెరుగుతున్న ఓటరు చైతన్యంలో మహిళల భాగస్వామ్యం విస్మరించడానికి వీల్లేనిది. చట్టసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో చైతన్యవంతులైన మహిళల సంఖ్య ఏ ఎన్నికకు ఆ ఎన్నికలో పెరుగుతున్నా అదే చట్టసభలలో వారి ప్రాతినిధ్యం మాత్రం పెరగడం లేదు. ఈనాటికీ వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య సగటున తొమ్మిది శాతం దాటడం లేదు. పార్లమెంటులో అది 15 శాతానికి మించడం లేదు. 147 కోట్ల జనాభా గలిగిన భారతదేశంలో 48% మహిళలు ఉన్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అదే నిష్పత్తిలో చట్టసభలలో వారికి ప్రాతినిధ్యం లేదు. నిజానికి 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన 33 శాతం రిజర్వేషన్లు కాకుండా జనాభా ప్రాతిపదికన వారికి 48 శాతం రిజర్వేషన్ కల్పించి, అది వెంటనే 2029లో జరగబోయే లోకసభ, దానికి ముందు వెనక జరిగే శాసనసభల ఎన్నికల్లో అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అన్ని రాజకీయపక్షాలది. డీలిమిటేషన్ తోటి, జనాభా లెక్కలతోటి సంబంధం లేకుండా 2023లో ఆమోదించిన బిల్లును చట్టం చేసి వెంటనే అమలు చేస్తే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యంపట్ల అధికారంలో ఉన్న రాజకీయపక్షాలకు చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతారు. ఎన్నికల్లో మహిళల ఓట్లు సంపాదించుకునేందుకు ప్రతిపక్షాల మీద బురద జల్లి ప్రయోజనం లేదు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే క్రమంలో అందులో కూడా వివిధ వర్గాలకు రిజర్వేషన్ల విషయం కూడా తేల్చాలి. ఒబిసిలు, ఎస్సి, ఎస్టి, మైనారిటీల ప్రాతినిధ్యం విషయంలో ప్రతిపక్షాలు తెస్తున్న ప్రతిపాదనల్ని పట్టింపులకు పోకుండా చర్చించి ఆమోదిస్తేనే ప్రభుత్వపక్షం ఈ అంశంలో నిజాయితీగా వ్యవహరిస్తోందని అనుకోవచ్చు. మహిళా రిజర్వేషన్ల శాతం ఒకసారి నిర్ణయిస్తే నియోజకవర్గాల సంఖ్య పెంచినప్పుడల్లా అదే శాతం వారికి వర్తింపజేయవచ్చు. దీనికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను సీరియస్గా పరిగణనలోకి తీసుకొని దక్షిణాదిపట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదన్న అభిప్రాయం ప్రజల్లో పెరగకుండా చూడాలి. ఆంధ్రప్రదేశ్లో అధికార, విపక్షాలు రెండూ కేంద్రప్రభుత్వం తెచ్చిన సవరణకు మద్దతుగా నిలిచి మిగిలిన దక్షిణాది రాష్ట్రాల నుండి వేరుపడి విమర్శకు తావిచ్చాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది కాబట్టి ఇక లోకసభ స్థానాలు 2026 సెన్సస్ (జనాభా లెక్కల) ప్రకారం జరుగుతాయి. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ 5, తెలంగాణ 3, తమిళనాడు 10, కర్ణాటక 2, కేరళ 7, ఒడిశా 4, పశ్చిమ బెంగాల్ 4 సీట్లు ప్రస్తుతం ఉన్నసంఖ్య కంటే తగ్గుతాయని, ఉత్తరప్రదేశ్కు, బీహార్కు 10, మధ్యప్రదేశ్కు 5, రాజస్థాన్కు 7 స్థానాలు పెరుగుతాయని బిల్లు వీగిపోయి 24 గంటలైనా గడవకముందే ఎన్డిఎ అభిమానులు ప్రచారం మొదలుపెట్టారు. దీనివల్ల బిజెపికే లాభం జరుగుతుందని చంకలు గుద్దుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం అన్నిపక్షాలను సమావేశపరిచి, వారితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం కానీ, వాటి పునర్విభజన జరపడం కానీ చేయకపోతే ముందుముందు దేశ సమగ్రతకు నష్టం జరుగుతుందన్న విషయం బాధ్యతగల రాజకీయ పక్షాలన్నీ గుర్తించాలి. రాజ్యాంగ సవరణ మీద చర్చకు చివరగా సమాధానం ఇస్తున్న సందర్భంగా ఒక దశలో అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ 50 శాతం స్థానాలు పెరిగే విధంగా ఒక సవరణ బిల్లు తేవడానికి సిద్ధమని చెప్పిన విషయం మర్చిపోకూడదు. అంతా సవ్యంగా సాగితే డీలిమిటేషన్ వల్ల 273 లోకసభ స్థానాలు, రెండువేల అసెంబ్లీ స్థానాలూ పెరుగుతాయి. సహజంగానే రాజ్యసభ స్థానాలూ, శాసన మండలి స్థానాలు పెరగక తప్పదు. ఒక్కో పార్లమెంట్ సభ్యుడికి ఏడాదికి నాలుగు కోట్ల 29 లక్షల రూపాయలు వివిధ పద్దుల కింద ప్రజాధనం ఖర్చు అవుతున్నది. 273 మంది కొత్తగా చేరితే ఈ లెక్కన సంవత్సరానికి 1,171 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే, అయిదు సంవత్సరాలకు 5,855 కోట్లు అని ఒక అంచనా. ఇదంతా ఇప్పటికే లోకసభలో ఉన్న 543 మంది సభ్యులకు అయ్యే ఖర్చుకు అదనం. ఇక రాష్ట్రాల శాసనసభల సభ్యులకు అయ్యే ఖర్చు అదనం. వీటితోబాటు చట్టసభల నిర్వహణకు అవుతున్న వ్యయం వేరు. ఇన్ని వేలకోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నందుకు ప్రజోపయోగమయిన పనులు ఎన్ని జరుగుతున్నాయి? ఆమ్ఆద్మీ రాఘవ్ చడ్డాను అడగాలి. దేవులపల్లి అమర్
ఒకప్పుడు గుండెపోటు అనేది వృద్ధులకు మాత్రమే సంబంధించిన అనారోగ్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య యువతలో గుండెపోటు మరణాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ తీవ్రతను స్పష్టం చేస్తాయి. గత ఆరేళ్లలో (2020 నుంచి 2026 జనవరి వరకు) ఈ వయసు సమూహంలో దాదాపు 18వేల మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 2020లో 2,394 మరణాలు నమోదు కాగా, 2025లో 3,255కి పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సంఖ్యలు పెరుగుతున్న ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాజిక నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. యువతే దేశ భవిష్యత్తు. వారి మరణాలు కేవలం వ్యక్తిగత నష్టం కాదు, జాతీయ సంక్షోభం. ఈ పరిస్థితికి ప్రధాన కారణం జీవనశైలి. టెక్నాలజీ యుగంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. కార్యాలయాల్లో గంటల తరబడి కూర్చుని పని చేయడం, స్మార్ట్ఫోన్లకు అంటుకుపోయి ఉండటంవల్ల గుండె బలహీనపడుతోంది. అహారపు అలవాట్లు మరింత దారుణం. ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం, రాత్రి భోజనాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ను పెంచుతున్నాయి. పొగతాగడం, మద్యపానం వంటి హానికర అలవాట్లు యువతను హత్తుకుంటున్నాయి. మరింత ముఖ్యం మానసిక ఒత్తిడి. ఉద్యోగ పోటీ, ఆర్థిక ఒత్తిడి, సామాజిక మీడియా ప్రభావంవల్ల యువత రోజురోజుకూ ఒత్తిడి హార్మోన్లతో బాధపడు తోంది. ఈ హార్మోన్లు గుండెపై అదనపు భారం వేసి, హార్ట్ అటాక్కు దారి తీస్తాయి. పట్టణీకరణ, రాత్రి షిఫ్టులు సర్కాడియన్ రిథమ్ను దెబ్బ తీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లో ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలుష్యం, పని ఒత్తిడి, నిద్రలేమి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిందనే అనుమానాలు ఉన్నాయి. వైరస్ లేదా వ్యాక్సిన్తో సంబంధం ఉందా అనే ప్రశ్నలు ప్రజల మనసులో తిరుగుతున్నాయి. కానీ హర్యానా ప్రభుత్వం సర్వే చేయలేదని తెలిపింది. ఇది ప్రధాన లోపం. అపోహలు పెరిగి, ఆరోగ్యంపై తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టి సత్వరం సమాధానం ఇవ్వాలి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వాలు చురుకైన చర్యలు తీసుకోవాలి. స్కూల్, కాలేజీలు, కార్యాలయాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో కార్డియాక్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉచిత పరీక్షలు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు బలోపేతం చేయాలి. యోగ, ధ్యానం వంటి కార్యక్రమాలను ప్రచారం చేయాలి. కానీ ప్రభుత్వాలు మాత్రమే కాదు, వ్యక్తుల బాధ్యత కూడా కీలకం. రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం, సమతుల ఆహారం, సకాలంలో నిద్ర, ఒత్తిడి నిర్వహణ అవసరం. పొగ, మద్యం వంటి వాటిని వదిలేయాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెట్టర్ దాన్ క్యూయర్ అనే సూక్తిని ఆచరణలో పెట్టాలి. లక్షణాలు తీవ్రమైన తర్వాతే వైద్యుల వద్దకు వెళ్లే మన దృక్పథం మారాలి. యువతలో ఈ మరణాలు మౌన సంక్షోభం. దీనిని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. ప్రభుత్వాలు సమగ్ర విధానాలు అమలు చేస్తే, వ్యక్తులు జాగ్రత్తగా ఉంటేనే భవిష్యత్ తరాలను రక్షించగలం. ఇప్పుడే చర్య తీసుకోకపోతే, రేపు యువత లేని దేశం మిగిలిపోతుంది. ఆరోగ్యం మన ఆస్తి. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని, ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించాలి. దయ్యాల అశోక్ 95508 89907
న్యూఢిల్లీ: దేశం యావత్తూ చూస్తుండగానే స్వార్థపూరిత ప్రతిపక్షాలు చట్టసభ సాక్షిగా భ్రూణహత్యకు పాల్పడ్డాయని ప్రధా ని నరేంద్ర మోడీ ఘాటుగా స్పందించారు. మహిళా కోటా పెంపుదల, చట్టసభలలో సీట్ల విషయంలో నిజాయితీతో ముందుకు సాగితే , వెన్నుపోటుకు దిగారని ప్రధాని విమర్శించా రు. లోక్సభలో మహిళా బిల్లు మెజార్టీ సాధించలేక వీగిపోయిన మరుసటి రోజున శనివారం ప్రధాని జాతిని ఉద్ధేశిం చి టీవీ ప్రసార సాధనాల మాధ్యమాల ద్వారా ప్రసంగించా రు. దాదాపు 30 నిమిషాల ఆయన ప్రసంగంలో ప్రతిపక్ష కూటమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలలో గౌరవప్రదమైన సంఖ్యాబలం మహిళలకు కల్పించడం బాధ్యత. వారి హక్కును వారు పొందేలా చేసే ఓ ఉదాత్తమైన సదుద్ధేశ సంకల్పానికి దిగాం. అయితే కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె , సమాజ్వాది పార్టీలు రాజకీయ స్వార్థం కట్టలు తెంచుకున్న దశలో ఫలించే దశలో భ్రూణహత్యకు పాల్పడ్డాయని ప్రధాని విమర్శించారు. సభలో చేసిన పాపపు చర్యకు తరువాత వారు సభ వెలుపల సంబరాలు కూడా చేసుకున్నారని , ఇది దేశ ఆడపడుచుల పాలిటి న్యాయమేనా అని ప్రశ్నించారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు నిర్థయతో మహిళల కలలను నేలరాచాయని విమర్శించారు. శక్తికి సరైన రీతిలో పట్టం కట్టాలనే సంకల్పాన్ని తామేదో గొప్ప పనిచేస్తున్నామనే ఆలోచనలతో ప్రతిపక్షాలు కలిసికట్టుగా అడ్డుకున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. భారతీయ మహిళకు తరతరాల నుంచి అన్యాయాన్ని మౌనంగా భరించే ఓపిక , రక్త స్వతహసిద్ధ, జీవన ధర్మ క్షమా ఓపిక గుణం నిండుకుని ఉంది. అయితే ఇదే సమయంలో తనకు అన్యాయం చేసిన వారిని గుర్తు పెట్టుకుని , ఎప్పటికీ క్షమించని స్థాయిలో శిక్షించే శక్తి కూడా మహిళా లోకానికి ఉందని ప్రధాని తెలిపారు. నిబద్థతతో ముందుకు వెళ్లితే వెనకకు లాగారు ఎంతో నిబద్దతతోనే మహిళా చట్టం సాకారానికి , వారి కలలు పండటానికి తమ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుందని, అయితే చివరి దశలో ప్రతిపక్షాల చర్యతో ఈ చట్టం చతికిలపడిపోయిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము మహిళలకు న్యాయం చేయలేకపోయినందుకు సోదరీమణులు తల్లులు తమను క్షమించాలని కోరారు. ముందుగా వారికి క్షమాపణలు చెపుతున్నానని , ప్రధాని మోడీ చేతులు జోడించారు. నిజమే ఆకాశంలో సగం అంతకు మించిన వెలుగు రేఖల సొంతమైన హక్కులు కొందరి సంకుచిత రాజకీయాలకు చిక్కుల్లో పడ్డాయని, దీనితో మహిళలకు ఉన్న ఉక్కు సంకెళ్లను తెంపివేయడం సాధ్యం కాలేదన్నారు. చట్టసభలలో వారి కోటా సముచిత మరోసారి ఎండమావి అయిందని ప్రధాని తెలిపారు. విచిత్రం ఏమిటంటే అధికారం విషయంలో తగవులకు దిగే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ఈ మహిళా బిల్లు ఓటమికి ఒకే తాటికి రావడం , తమ ఓటుతో దండెత్తడం అని విమర్శించారు. అంతా చూసే ఉంటారు...లోక్సభలో మహిళా బిల్లు వీగిపోయిన తరువాత కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె ఇతర విపక్షాల సభ్యులు ఎగిరినంత పనిచేశారు. బల్లలు చరుస్తూ ఆనందోత్సహాలను చాటుకున్నారు. ఒకరిని ఒకరు కౌగలించుకుంటూ అభినందనలు తెలియచేసుకున్నారు. చేసిన విచ్ఛిత్తికి వారికి ఇంతటి సంతసం కల్గిందని వ్యాఖ్యానించారు.టిఎంసి, డిఎంకె అధికారంలో ఉన్న బెంగాల్, తమిళనాడులలో వచ్చే వారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అక్కడి మహిళా స్పందన ఇప్పటి బిల్లు ఓటమి తరువాత ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉందని పరోక్షంగా మోడీ ప్రస్తావించారు. కష్టం నష్టం భరిస్తారు..అవమానం సహించబోరు మహిళ ఏ విషయాన్ని అయినా మరిచిపోగలదు. కష్టాలను నష్టాలను భరించగలదు. అయితే తనకు అవమానం కల్గించే వారిని ఎప్పటికీ క్షమించబోదని ప్రధాని తెలిపారు. చట్టసభలలో ప్రతిపక్షాల బల్లచరుపులు, నవ్వులు కేకలు ఏకంగా దేశ మహిళా గౌరవంపై , మర్యాదలపై వారి హుందాతనంపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. సభలో కాంగ్రెస్ , మిత్రపక్షాల వైఖరి దేశవ్యాప్తంగా ఎప్పటికి తిరుగులేని రికార్డుగా ఉంటుంది. దీని తరువాతి పరిణామాలు కూడా తీసిపోని విధంగానే వారు చవిచూడాల్సి ఉంటుందని ప్రతిపక్షాలపై ప్రధాని తమ ఆగ్రహం ఉధృతం చేశారు. సీట్ల పెంపుదలకు బ్రేక్తో రాష్ట్రాలకు అన్యాయం ప్రతిపక్షాలు చేసిన పనితో ప్రతి రాష్ట్రానికి కనీసం సగానికి పైగా సీట్లు పెరిగే అవకాశం పోయిందని , అన్ని రాష్ట్రాలకు మరింతగా గొంతు కల్పించే తమ యత్నాలను ప్రతిపక్షాలు నిలదీశాయని, కలబడి కాదన్నాయని విమర్శించారు. చిన్న పెద్ద, ప్రాంతాలు తేడా లేకుండా అన్ని రాష్ట్రాల చట్టసభలలో సీట్లపెంపుదల ప్రక్రియను దెబ్బతీశాయని విమర్శించారు. ‘తరతరాల ఆశల చిన్ని చిన్ని కువకువలకు రెక్కలు తొడుగాలని అనుకుంటే, సాధికారిక కొమ్మలకు వారి జీవితాలు విస్తారితం కావాలని అనుకుంటే , కొందరు అడ్డుపడ్డారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్షాలు రాజ్యాంగంలోని మహిళా సాధికారికతను అడ్డుకుని రాజ్యాంగాన్ని గేలిచేశారని విమర్శించారు. నిండు సభలో నారీ శక్తికి నారీ శక్తి వందన్ అదినియం అడ్డంకులతో ఘోర అవమానం జరిగిందని, దీనిని స్త్రీ జాతి విస్మరించదు, క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్పార్టీ ఈ విషయంలో తన పాత తప్పిదాలను దిద్దుకుంటుందని ఆశించానని అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరించిదని ప్రధాని తెలిపారు. కుటుంబ పాలన వ్యవస్థ దెబ్బతింటుందనే ఆలోచనతోనే మహిళకు పెద్ద పీట వేయనివ్వలేకపోయారని కాంగ్రెస్, ఎస్పి, డిఎంకెపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం సాధన ఒక చారిత్రాత్మక ఘట్టం. దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువత, రైతులు, ఉద్యోగులు మాత్రమే కాదు -మేధావులు కూడా కీలక పాత్ర పోషించారు. విశ్లేషణలతో, రచనలతో, సభలతో ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమానికి ఆలోచనా పునాది మేధావులే వేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే మేధావుల పాత్ర ఏమైంది? ఈ ప్రశ్న ఈ రోజు సామాన్య ప్రజలలో మాత్రమే కాదు, ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వర్గాలలో కూడా గట్టిగా వినిపిస్తోంది. ఉద్యమ సమయంలో ప్రజాస్వరంగా ఉన్న వారు, రాష్ట్రం వచ్చిన తర్వాత మౌన వీక్షకులుగా మారిపోయారా అనే అనుమానం పెరుగుతోంది. రాష్ట్రం వచ్చిన తొలిదశలో కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని భావించడం సహజమే. కొత్త వ్యవస్థను స్థిరపరచడానికి కొంత సమయం అవసరం ఉంటుంది. కానీ ఆ సమయం సంవత్సరాలుగా మారిన తర్వాత కూడా మేధావుల నుంచి స్పష్టమైన, నిరంతర ప్రజాపక్ష స్వరం వినిపించకపోవడం ఆందోళనకరమైన విషయం. పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ పారదర్శకత, ఆర్థిక అసమానతలు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చలు జరిపి ప్రజలను సమీకరించే ప్రయత్నాలు చాలా పరిమితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో ఒక ప్రధాన విమర్శ ఏమిటంటే -తెలంగాణ మేధావుల్లో చాలామంది స్వతంత్రత కోల్పోయి, రాజకీయ పార్టీలకు దగ్గరవుతున్నారనే భావన. ఉద్యమ సమయంలో అధికారాన్ని ప్రశ్నించిన వారు, ఇప్పుడు అధికారానికి అనుగుణంగా మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మౌనం, అదే ప్రభుత్వం మారిన తర్వాత గట్టిగా విమర్శలు చేయడం -ఈ ద్వంద్వ వైఖరి ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది కేవలం వ్యక్తుల వైఫల్యం కాదు -వ్యవస్థలో జరిగిన మార్పుల ప్రతిబింబం కూడా. ఉద్యమ కాలంలో విమర్శకులుగా, మార్గదర్శకులుగా ఉన్న మేధావులు, రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవస్థలో భాగస్వాములుగా మారారు. కొందరు నిజంగా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యవస్థలోకి వెళ్లినా, అధికారానికి దగ్గరయ్యాక స్వతంత్ర స్వరం బలహీనపడింది. మరికొందరు గుర్తింపు, నామినేటెడ్ పదవులు, ఆర్థిక లాభాల కోసం తమ వైఖరిని మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఒక పెద్ద నైతిక సంక్షోభం. మేధావి అనే పదానికి ఉన్న గౌరవం, బాధ్యత, సామాజిక కర్తవ్య భావన. ఇవి అన్నీ బలహీనపడుతున్నాయి. ఒక మేధావి తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలను ముందుకు పెట్టాలి. కానీ ప్రస్తుతం కొంతమంది వద్ద ఈ సమతుల్యత కనిపించడం లేదు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజా ఉద్యమాల బలహీనత. ఇక మరో ముఖ్యమైన అంశం-ప్రజా ఉద్యమాల బలహీనత. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన ఈ కాలంలో ప్రతి సమస్య ఒక డిబేట్గా మారుతోంది.కానీ అది మూవ్మెంట్గా మారడం లేదు. ఆన్లైన్ చర్చలు ఎక్కువగా ఉన్నా, ఆఫ్లైన్లో ప్రజలను సంఘటితం చేయడం లోపిస్తోంది. దీని వల్ల మేధావుల స్వరం కూడా ప్రభావం కోల్పోతోంది. కులాలు, వర్గాలు, మతాల ఆధారంగా సమాజంలో విభజనలు పెరగడం కూడా మరో పెద్ద సమస్య. ఒకే సమస్యపై కూడా ప్రజలు ఏకమవ్వలేకపోతున్నారు. ఈ విభజనల మధ్య మేధావులు కూడా తమ తమ వర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నారనే భావన కలుగుతోంది. ఫలితంగా సమాజాన్ని ఒకే దిశగా నడిపించే శక్తి బలహీనపడుతోంది. సంఘటిత శక్తి లోపిస్తుందా? అయితే పూర్తిగా మౌనం కూడా లేదు. కొంతమంది అకడమిక్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు వివిధ అంశాలపై స్పందిస్తున్నారు. కోర్టుల్లో, పబ్లిక్ డిబేట్స్లో, స్వతంత్ర వేదికలలో తమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు విస్తృత ప్రజా ఉద్యమాలుగా మారడం లేదు. కారణం -సంఘటిత శక్తి లోపం, ప్రజల మద్దతు కొరత, కొన్నిసార్లు భయాలు. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతుంది: మేధావులు ప్రజల కోసం నిలబడకపోతే, మరి ఎవరు నిలబడాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క వర్గంతో రాదు. మేధావులు స్వతంత్రంగా నిలబడాలి. అదే సమయంలో ప్రజలు కూడా వారికి మద్దతు ఇవ్వాలి. విమర్శకులను పార్టీ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్టితో చూడాలి. మేధావులను ప్రోత్సహించాలి, రక్షించాలి. తెలంగాణ ఉద్యమం గొప్ప పాఠ్యం నేర్పింది తెలంగాణ ఉద్యమం మనకు ఒక గొప్ప పాఠం నేర్పింది. -సంఘటిత ప్రజాశక్తి ఏదైనా సాధించగలదు. అదే స్ఫూర్తి ఇప్పుడు మళ్లీ అవసరం. మేధావులు తమ పాత్రను తిరిగి నిర్వచించుకోవాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికలుగా మారాలి. కేవలం విమర్శలతో కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను సూచించాలి. ప్రజలు కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. సమస్యలపై స్పందించాలి. చర్చలను చర్యలుగా మార్చాలి. విభజనలను పక్కన పెట్టి సామాన్య ప్రయోజనాల కోసం ఏకమవ్వాలి. లేకపోతే, మేధావి అనే పదం కేవలం ఒక గుర్తింపుగా మిగిలిపోతుంది. సమాజాన్ని మార్గనిర్దేశం చేసే శక్తిగా కాదు, వ్యక్తిగత ప్రయోజనాల సాధనంగా మారిపోతుంది. ఇప్పుడు అయినా ఒక ఆత్మపరిశీలన అవసరం - మేధావులు తమ బాధ్యతను గుర్తించాలి. ప్రజలు తమ శక్తిని గుర్తించాలి. ఈ రెండూ కలిసినప్పుడే తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుంది. సిహెచ్ వి ప్రభాకర్ రావు 9391533339
బిల్లు ముసుగులో బిజెపి కుట్రలు
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం చట్టాల ఓటమి కాదని, అది మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి జరిగిన ఓటమి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్ల పెంపు (డీలిమిటేషన్), రిజర్వేషన్ల రద్దు వంటి ప్రయత్నాలను ప్రతిపక్షాలు కలిసికట్టుగా అ డ్డుకున్నాయని, ఇది బిజెపి అహంకారానికి చెంపపెట్టు అ ని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్లో ఓడిపోయింది మోడీ అహంకారం తప్ప మరొకటి కాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్, బిజెపి చిత్తశుద్ది ఏమిటో తేల్చుకుందామని సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయన్నారు.2009లో డీలిమిటేషన్ జరిగిందని, ఆ లెక్కలతో ఆగష్టు 15, 2026 లోపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించవచ్చని సిఎం అన్నారు. ఆ రిజర్వేషన్లతో ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో 2027లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చన్నారు. ఆ విధంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే తెలంగాణ సిఎంగా తాను బాధ్యత తీసుకొని దక్షిణాది రాష్ట్రాల సిఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సిఎం రంగసా మిలతో చర్చలు జరుపుతానని, ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతారని ఆయన చెప్పారు. 2023లో పాస్ అయిన బిల్లులో సవరణలు చేయాలనుకుంటే ఒక చిన్న మార్పుతో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, బిజెపి ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు ఎత్తివేయడమేనని, పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ తీరును 140 కోట్ల మంది దేశ ప్రజలు చూశారని ఆయన తెలిపారు. మాకు గంట సమయం ఇస్తే బిల్లును మార్చేస్తా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శనివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లోనే ప్రజలు బిజెపి కుట్రలను ఓడించారని, ఇప్పుడైనా పంతాలకు పోకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్, సమగ్రతను బలహీనపర్చేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకువచ్చిందని దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లునేని మరేం కాదన్నారు. ప్రతిపక్షాలు నిలువరించింది, ఓడించింది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్నేనని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బిల్లుల విషయంలో బిజెపి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నిజాయితీ లేదని సిఎం విమర్శించారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసిందన్నారు. తమకు గంట సమయం ఇస్తే బిల్లును మార్చివేస్తామని అమిత్ షా అన్నారని సోమవారం వరకు సమయం ఉందని, ప్రస్తుతం ఉన్న 543 సీట్లతోనే బిజెపి మహిళా బిల్లు తీసుకువస్తే మంగళవారం పాస్ చేస్తామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల ఎత్తివేయాలంటే బిజెపికి 2/3 వంతుల మెజార్టీ మూడొంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేయాలని అన్ని వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని బిజెపి భావిస్తోందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. అందుకే చార్ సౌ పార్ (400 సీట్లకు మించి) నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్లారన్నారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ మార్పుతో పాటు, రిజర్వేషన్లు తొలగించాలని బిజెపి భావించిందన్నారు. ప్రజలు జాగృతమై 240 సీట్లకే బిజెపిని పరిమితం చేశారని, రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేయాలంటే బిజెపికి 2/3 వంతుల మెజారిటీ కావాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు బిల్లుల ముసుగులో రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బిజెపి మరోసారి చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు కలిసి ఓడించాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నాటికి కొత్త చట్టాలను రూపొందించాలి ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమితో కలిపి 2023 మాదిరిగా ఆ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని, సోమవారం బిల్ పాస్ చేసుకొని మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని సిఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని, నిపుణు లతో చర్చించాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాలని, ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చని సిఎం అన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతానంటే దేశ ప్రజలు ఒప్పుకోరని, దీంతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మేం యోచిస్తే దానిని కాంగ్రెస్ అడ్డుకుందని తమను బద్నాం చేసే పనిలో మోడీ, బిజెపిలు ఉన్నాయని సిఎం విమర్శించారు. అందులో భాగంగానే ఆందోళనలు చేపట్టారన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్తశుద్ది చాటుకోవాలని, సరైన పద్ధతిలో బిల్లులు తయారు చేయాలని సిఎం సూచించారు. కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత ప్రజలు, చివరగా పార్టీ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ, బిజెపికి మాత్రం తొలుత పార్టీ, తర్వాత సొంత విషయాలు, ఆ తర్వాతే దేశమని సిఎం విమర్శించారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేనని దేశంలోనే దక్షిణాది ప్రజలు బతుకుతున్నారని, దేశ సేవలో తాము ఎవరికన్నా తక్కువ కాదని, దేశాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా డీలిమిటేషన్ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా డీలిమిటేషన్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందన్నారు. దేశానికి విధేయంగా వ్యవహారించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి జరిమానా విధిస్తామనడం ఏవిధంగా సరైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తల్లిని చంపి, బిడ్డను రక్షించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర విభజనపై పలుమార్లు ద్వేషం చూపారని ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపి తేజస్వీ సూర్య పయనిస్తున్నారని సిఎం మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపి లక్ష్మణ్ మోడీ దృష్టిని ఆకర్షించి ప్రమోషన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే తప్ప ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని సిఎం రేవంత్రెడ్డి విమర్శించారు. తాను సూచించిన విధానం కిషన్ రెడ్డికి నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలే తప్ప ఎదురుదాడి చేయడమేమిటని సిఎం ప్రశ్నించారు. స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్కు మహిళా అధ్యక్షులు... మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఓటు హక్కు కోసం మహిళలు 150 సంవత్సరాలు పోరాడారని, కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేననన్నారు. దేశానికి మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కాంగ్రెస్ అందించిందని, లోక్సభ స్పీకర్గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్ పార్టీ చేసిందని సిఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్య్రానికి పూర్వమే మహిళలు అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, స్వాతాంత్య్రనంతరం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షులుగా సేవలందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియా గాంధీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పని చేశారని సిఎం తెలిపారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఫలితమే ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం 50 శాతానికి చేరుకుందన్నారు. 1980లో ఏర్పడిన బిజెపికి ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరూ కూడా మహిళ లేరని సిఎం తెలిపారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లు రెండు మూడు సార్లు అధ్యక్షులయ్యారని, కానీ, ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదన్నారు. అలాంటి బిజెపి మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తుందని సిఎం ప్రశ్నించారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు ? బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదని సిఎం రేవుంత్ రెడ్డి అన్నారు. బీహార్ మాజీ సిఎం నితీశ్ కుమార్, మహారాష్ట్ర మాజీ సిఎం ఏక్ నాథ్ షిండే పరిస్థితి చూస్తునే ఉన్నామని, భవిష్యత్లో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని సిఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలో బిజెపికి సీట్లు తక్కువగా ఉన్నాయని అందుకే టిడిపికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. భవిష్యత్లో బిజెపి బలం పెరిగితే టిడిపిని పక్కన పెడతారన్నారు. లోక్సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికేనని వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని ఆయన తెలిపారు. 2/3 మెజారిటి వచ్చినంత మాత్రాన అన్నీ చట్టాలు చేయలేమని, 2/3 మెజారిటీ ఉందని ప్రధానిగా ఉన్న వ్యక్తి తానే రాజునని చట్టం చేసుకుంటే కుదురుతుందా అని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఎపిలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని, తానే రాజునని చంద్రబాబు చట్టం తెస్తే ఒప్పుకుంటారా? డిక్టేటర్ షిప్ని ఎవరూ అంగీకరించరన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని సిఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపిలు డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవి కాలం ముగిశాకే జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగవచ్చని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. పలు కీలక అంశాలపై ఆయన స్పందిస్తూ ఎన్నికలు ఈ సమ్మర్ అయ్యా కే ఉండే అవకాశం ఉందని, కేబినెట్ విస్తరణపై చ ర్చ ఉందని విడతల వారీగా జరుగుతుందని ఆ యన తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయ న్న విషయమై ఆయన మాట్లాడుతూ ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని, అయితే, ఆయా శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమని ఆయన అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం త్వరలోనే ఉండబోతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మార్కెట్ వాల్యూ.. రాష్ట్రంలో త్వరలోనే భూముల విలువ పెరగనుందని ఈ మేరకు కసరత్తు జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూముల మార్కెట్ వ్యాల్యూ పెంచలేదన్నారు. ధరణి సమస్యలు భూ-భారతితో పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో మ్యాప్ను జతపరచడం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. మ్యాప్తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతుందని రెవెన్యూలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామని ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. నాలుగు రకాల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని ఆయన తెలిపారు. నాకు మంత్రులు మద్ధతుగా నిలిచారు.. అసెంబ్లీలో తనపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రతిపక్షం ట్రాప్లో తాను పడనని అందుకే ఎంత విమర్శించినా ఓపికగా ఉండి సమాధానం చెప్పానని ఆయన అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల జాబితా తయారవుతోందని సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయని మంత్రి హెచ్చరించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ఈనెల 20న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో 20న జరి గే బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులను రైతుల ఖాతా ల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.50కోట్ల ఎకరాలకు ‘రైతు భరోసా’ కింద ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఈ నిధులు జమ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడతగా ఒక్కో ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. మొదటి విడతలో దాదాపు రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో 45.11 లక్షల మందికి లబ్ధి రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకోనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. దీంతో రూ.5,653 కోట్లు రెండవ విడత రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి మాత్రమే సాయం అందించగా, రెండో విడతలో మిగిలిన భూమికి అర్హత మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం, మూడో విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గి సకాలంలో సాగు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో పారదర్శకత ఉంటోందని అధికారులు చెబుతున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మండుతున్న ఎండల నుంచి కొంత ఉపశమనం ల భించనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే నాలుగు రోజులు పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఉపరితల చక్రవాక ఆవర్తనం, ద్రో ణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెపుతున్నారు. అయితే వర్షాలు కురిసినా పలు జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణలో వడగాలులు వీస్తున్నాయని దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబా ద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 3040 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జి ల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో 3రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా శనివారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5, జగిత్యాల జిల్లా ఎండపల్లి, నిర్మాల్ జిల్లా ఖానాపూర్లో 44.4 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సూర్యుడి ఎండ వేడిమికి కొంత విరామం లభించింది. శనివారం సాయంత్రం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. జయశర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో పెద్ద అంబర్పేట్, వనస్థలిపురం, హయత్నగర్, ఎల్బీనగర్, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం నుంచే నగరంలో ఆకా శం మేఘావృతమయి చల్లబడింది. రాష్ట్రంలో మార్చి చివరి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రస్తుతం సా ధారణం కంటే మూడు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావర ణ శాఖ తెలిపింది. ఏప్రిల్ మొదటి వారంలో రా ష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆ తర్వాత ఎండలు మళ్లీ తీవ్రరూపం దాల్చా యి. ఏప్రిల్ చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత గా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఎల్ నినో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 0.51 డిగ్రీ మేర పెరగడంతో ఎల్ నినో ప్రభావం ఏర్పడిందని, దీని కారణంగా దక్షిణ భారతదేశంపై ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం తగ్గే అవకాశం ఉంది.
నాచారం లోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం
నాచారం పారిశ్రామిక వాడలోనీ డ్యూరో ఫెక్స్ పరుపుల కంపెనీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద పేలుడు శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకి,అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు, రెండు ఫైర్ ఇంజన్ల తో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.నాచారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, డ్యూరుఫ్లెక్ పరుపుల కంపెనీ లో అగ్ని ప్రమాదం కాదు, అందులో ఉన్న మరో కంపెనీ హైదరాబాద్ టెంట్ హౌస్ అను గోదాం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది అని తెలిపారు. నాచారం ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం. డ్యూరో ఫెక్స్ పరుపుల కంపెనీలో ఉన్న టెంట్ గోదాం లో అగ్ని ప్రమాదం జరగడం తో మంటలు వ్యాపించినట్టు తెలిపారు. అందులో ఉన్న కుర్చీలు, టెంట్ బట్టలకు మంటలు పెద్ద ఎత్తున అంటుకోవడం తో ప్రమాదం జరిగింది అని, ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అందరికీ చేరువయ్యే కథనంతో ‘రేజర్’.. ట్రైలర్ విడుదల
కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లై యింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవి బాబు ఒక డాగ్ గ్రూమర్గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్ ని కొనసాగిస్తూ, ఈసారి అందరికీ చేరువయ్యే కథనంతో ముందుకొచ్చారు.
పాక్ హెడ్ కోచ్గా సర్ఫరాజ్ అహ్మద్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును గాడిలో పెట్టేందుకు కీలక చర్య లు చేపట్టింది. ప్రపంచ క్రికెట్లో వరుసగా విఫలమవుతున్న జట్టును పటిష్టం చేసేందుకు ప్రణాళికను రూ పొందించిం ది. అందులో భాగంగా శనివారం కొత్త కోచ్లను నియమించుకుం ది. అయితే, బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్తో జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూనియార్ స్థాయిలో కోచ్ గా సక్సెస్ అయిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రదాన కోచ్గా ఎంపిక చేయగా.. బౌలింగ్ కోచ్గా పేసర్ ఉమ మ్ గుల్, బ్యాటింగ్ కోచ్గా అసద్ ఫసిక్లకు బాధ్యలను ఒప్పజెప్పింది. కాగా, పాకిస్థాన్ జట్టు వచ్చే నెలలో బంగ్లాతో రెండు మ్యాచ్ టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో బంగ్లా పర్యలనలోనే జట్టును గాడిలో పడేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
టెండర్లు ఆహ్వానించిన హెచ్సిఎ హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సిఎ) కీలక ముందడుగు వేసింది. ఐపిఎల్ తరహాలో తెలంగాణ టి20 లీగ్ ఎడిషన్ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ లీగ్ నిర్వహణకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. మొదట 5 ఏళ్ల పాటు జట్టు యాజమాన్య హక్కులు ఉంటాయని, ఆ తరువాత మూడేళ్లకోసారి రిన్యూవల్ చేసుకోవాలని తెలిపింది హెచ్సిఎ. జట్టు బిడ్ ధర రూ.3 కోట్లుగా నిర్ణయించారు. ఆటగాళ్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు, వసతి, జెర్సీలు, ప్రయాణ ఖర్చులు సయితం ఫ్రాంచెజీలే భరించాలని, జట్టు కోనుగోలు చేసేందకు ఆసక్తి ఫ్రాంచైజీలకు ఈనెల 28వ తేదీలోపు టెండర్ పత్రాలు సమర్పించాలని స్పష్టం చేసింది. జూన్లో ప్రారంభమయ్యే ఈ లీగ్కు ఈనెల 30న షార్ట్లిస్ట్ చేసి, ఫ్రాంచైజీలను ప్రకటించనున్నట్టు పేర్కోంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ టోర్నీలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్ జట్లుగా ప్రకటించారు. 21 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో ఉప్పల్ వేదికగా 32 మ్యాచ్లు నిర్వహించనున్నారు.
ఉత్కంఠ పోరులో చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం
ఉప్పల్ స్టేడయంలో జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే, చివర్లో హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో తిరిగి పట్టు సాధించింది. ఈక్రమంలో విజయం కోసం ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు ఆడటంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో చివరి ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో చెన్నైపై హైదరాబాద్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
సల్మాన్ ఖాన్-నయనతార కాంబోలో వంశీ పైడిపల్లి మూవీ షురూ..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ‘ఎస్విసి63’ ప్రాజెక్టు శనివారం సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్లో నయనతార కూడా ప్రధాన తారాగణంలో చేరారు. బలమైన భావోద్వేగాలతో కూడిన హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2027లో గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హాలీవుడ్ స్థాయిలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. పోస్టర్ రిలీజ్
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ను శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎరిక్ డస్ట్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది. ఇక శనివారం రిలీజ్ చేసిన వీడీ శౌర్యువ్ మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు పెట్ డాగ్స్ ను తీసుకుని నడుచుకుంటూ వస్తుండటం, ఆసక్తి కలిగిస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.
పవన్ కల్యాణ్కు తీవ్ర అస్వస్థత
ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షిం చిన వైద్యులు, శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించి విజయవంతంగా పూర్తి చేశారు. వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత పవ న్ కల్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వైద్యులు వెల్లడించారు. అయితే, ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి గణనీ యమైన సమయం పడుతుందని, దీర్ఘకాలికంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాలను జనసేన అధ్యక్షుడి రాజకీ య కార్యదర్శి పి. హరిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా, పవన్ కల్యాణ్కు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వ హించినట్టు తెలుస్తోంది.
8వేల మంది సిబ్బందిపై మెటా వేటు?
ముంబయి: ఫేస్బుక్ అనుబంధ సంస్థ మెటా ఈ సంవత్సరం భారీ ఎత్తున్న లే ఆఫ్లకు సిద్ధపడుతోంది. సుమారు 8వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు ఆ కంపెనీ వర్గాలను ఊటంకిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మెటాలో ఉన్న సిబ్బందిలో 20శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో లే ఆఫ్ లెటర్స్ సిబ్బంది అందుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై మెటా ఇప్పటి వరకు స్పందించలేదు. 2022లో కూడా మెటా 11వేల మంది సిబ్బందిని మెటా తొలగించింది. ఆ తర్వాత జరగబోయే లే ఆఫ్ ఇదే పెద్దది అవుతుంది.
సిఎం మేడిగడ్డ పర్యటన ఒక బోగస్: ఎర్రవెల్లి దయాకర్రావు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభను ఫెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారని, సీఎం మేడిగడ్డ పర్యటన ఒక బోగస్ పర్యటన అని మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్రావు ఆరోపించారు. కేసీఆర్ నల్గొండలో మీటింగ్ పెడితే అప్పుడు మేడిగడ్డకు వచ్చాడని, ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తున్నాడని, కేసీఆర్ బయటకు వెళ్తే రేవంత్రెడ్డికి వణుకుపుడుతుందని ఎద్దేవా చేశారు. మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజ్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో కలసి శనివారం ఆయన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మట్లాడుతూ.. కేసీఆర్ జగిత్యాలలో వాలంటీర్లతో సమావేశం పెడితే, రేవంత్ అధికార యంత్రాంగాన్ని కదిలించి అధికారిక సమావేశం పెడుతున్నారని ఆరోపించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా మూడేండ్లు రైతులను గోసపెట్టారని విమర్శించారు. 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లో 20వ పిల్లర్ కుంగిపోయిన సంగతి తెలిసిందే కాగా దానికి మరమ్మతులు చేస్తే బీఆర్ఎస్కు, కేసీఆర్కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం రూ.94 వేల కోట్లయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ విష ప్రచారం చేస్తున్నదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదని, ఈ ప్రాంత ప్రస్తుత ఎమ్మెల్యే నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటానని దుద్దిళ్ల శ్రీధర్బాబుకు సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్పాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజయ్య, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎంమ్మెల్యేలు పుట్ట మధు, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్, భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ జెడ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహరిని రాకేష్, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
పౌరసత్వ వివాదంలో రాహుల్కు ఊరట
ద్వంద్వ పౌరసత్వం వివాదంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉపశమనం కల్గింది. ఈ కేసులో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ దాఖలు వాయిదా పడింది. ఇంతకు ముందు వెలువరించిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సంబంధిత లక్నో బెంచ్ ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందటి ఆదేశాలను నిలిపివేసింది. న్యాయమూర్తులు సుభాష్ విద్యార్థితో కూడిన బెంచ్ ఇప్పుడు రాహుల్పై ఎఫ్ఐఆర్ దాఖలుకు ముందస్తు నోటీసు ఇవ్వడం చట్టపరంగా అవసరమా ? లేదా అనేది ఖరారు చేస్తుంది. ఇప్పటి ప్రాధమిక సాక్షాధారాల మేరకు చూస్తే నిందితుడు నేరానికి పాల్పడినట్లు భావించాల్సి వస్తోంది. కేంద్రీయ దర్యాప్తు సంస్థ పరిధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును అప్పగించేందుకు సమ్మతిస్తోంది. అయితే దీనికి ముందు నోటీసు జారీ గురించి ఖరారు చేయాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ‘ఎలక్ట్రిక్ సోనా వీకెండ్’ ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ముందుకొచ్చింది. అన్ని వాహనాలపై రూ.50వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త వాహనాలపై రూ.40వేల డిస్కౌంట్ అందిస్తున్న ఓలా... హెచ్ఎస్బిసి, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంకు తదితర క్రెడిట్ కార్డులపై రూ.10వేల వరకు అదనపు డిస్కౌంట్ అందజేస్తోంది. ఆఫర్లు నేడు ఆదివారంతో ముగియనున్నాయి.
భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ : హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరపడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమం లోనే భారత్ లోని ఇరాన్ రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హార్ముజ్ను ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించి 24 గంటలు గడవక ముందే ఇరాన్ మళ్లీ జలసంధిని మూసేసింది. ఇదే సమయంలో జలసంధి నుంచి వెళ్లేందుకు జగ్ అర్నవ్, సాన్మర్ హెరాల్డ్ అనే భారత నౌకలు ప్రయత్నించగా,వాటిలో జగ్ అర్నవ్ అనే చమురు నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై తీవ్ర నిరసన తెలియజేస్తూ ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. భారత పతాకం ఉన్న ఈ చమురు నౌక ఇరాక్ నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకొస్తోంది.
Allu Arjun’s Raaka will release in 2027
Icon Star Allu Arjun is completely occupied with the shoot of his upcoming film Raaka. Atlee is the director of this unique attempt and the team is maintaining utmost secrecy about the film right from the genre to the shoot. The film started rolling last year and there are a lot of speculations about the […] The post Allu Arjun’s Raaka will release in 2027 appeared first on Telugu360 .
2023 మహిళా చట్టం అమలు చేయండి.. ప్రధానికి విపక్షాల లేఖ
న్యూఢిల్లీ: ఇంతకు ముందటి 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నాయి. ఇండియా కూటమి వేదిక ద్వారా ఈ మేరకు ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ 33 శాతం మహిళా కోటా చట్టం అమలులోకి వచ్చింది. దీనిని క్షేత్రస్థాయిలో తక్షణం అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్షాలు సమగ్ర లేఖ రాసేందుకు సిద్ధం అయ్యాయి. చట్టసభలలో మహిళలకు 33 శాతం కోటా విషయంలో ప్రతిపక్షాలు వ్యతిరేకతతో ఉన్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, దీనిని ఎదుర్కొవాలని సంకల్పించారు. ఇదే దశలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాలలో మహిళా బిల్లుపై ప్రతిపక్షాల పార్టీల తరఫున ఇండియా కూటమి వేదికగా విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి తరువాత తొలిసారిగా అధికార పక్షం సభా ముఖంగా ఎదురుదెబ్బ తింది. ఈ విషయాన్ని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే 2023 చట్టం అమలుకు ముందుకు రావాలని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సోమవారం ఈ చట్టం అమలు విషయంలో చర్చించేందుకు సోమవారమే (20వ తేదీ) పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయాలి. మహిళా చట్టం మునుపటి స్థాయిలో ఉన్నదే అమలు చేస్తామని ప్రతిపాదించాలి. అప్పుడు ఈ కోటాకు ఎవరు వ్యతిరేకం? ఎవరు బాసటగా నిలుస్తున్నారు? అనేది స్పష్టం అవుతుందని ప్రియాంక తేల్చిచెప్పారు.
ట్రంప్ నియంత్రణలో మోడీ: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణలో ఉంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అదే విధంగా ఎఐఎడిఎంకె ద్వారా తమిళనాడులో అధికారం చేజిక్కించుకుని తమిళనాడు ముఖ్యమంత్రిని తన నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. మన రైతులను, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అమెరికాకు ధారాదత్తం చేయడమే కాకుండా మన ఇంధన భద్రతను, డేటాను అమెరికాకు అప్పగించేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. “పార్లమెంట్లో నిన్న మీరు మోడీ ముఖాన్ని చూసే ఉంటారు. పూర్తిగా నమ్మకం కోల్పోయినట్టు కనిపించింది. విపక్షాలను ఆయన ఎదుర్కోలేకపోయారు. పక్కదారుల్లో కూర్చున్నారు. దీనికి కారణం ఆయన అమెరికా నియంత్రణలో ఉండడమే” అని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆయన సంతకం చేశారని, అది పూర్తిగా మనదేశాన్ని అమ్ముడుబోయేలా చేసిందని విమర్శించారు. ట్రంప్ నియంత్రణలో మోడీ ఉండడానికి ఎపిస్టెయిన్ ఫైల్స్ వ్యవహారమే కారణమని ఆరోపించారు. మోడీ ఆర్థిక సంబంధాలు ట్రంప్కు తెలుసునని, ఆదానీతో మోడీకి ఉన్న సంబంధాలు ట్రంప్కు తెలుసునని ధ్వజమెత్తారు.
తడబడిన సన్రైజర్స్ మిడిలార్డర్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ లో జరుగుతున్న మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 195 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(59) మెరుపు అర్ధశతకంతో అలరించాడు. ఆ తర్వాత క్లాసెన్(59) కూడా హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ 23 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, మిడిలార్డర్ విఫలమవ్వడంతో సన్రైజర్స్ 200 మార్క్ ను చేరుకోలేకపోయింది. ఇక, చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్, కాంబోజ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేష్ చౌదరి రెండు వికెట్లు, గుర్జప్నీత్ సింగ్ ఒక వికెట్ తీశాడు.
Mythri, Prashanth Neel’s Film Titled Impressively 418
Mythri Movie Makers is stepping into darker territory with its latest venture, 418, a film that aims to revive the true essence of horror. Presented by Prashanth Neel, and directed by Kirtan Nadagouda, the project has been unveiled with a spooky poster that immediately sets it apart from the recent wave of horror-comedy entertainers. The […] The post Mythri, Prashanth Neel’s Film Titled Impressively 418 appeared first on Telugu360 .
బ్యాంకాక్లో ప్రతిరోజూ 8 గంటల కఠోర శిక్షణ తీసుకుంటున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన దశలోకి అడుగుపెడుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ’మైసా’లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు శారీరక దృఢత్వం అవసరం. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు రూపొందుతున్నాయి. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతోంది. కథ విన్న తర్వాత రష్మిక ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకోవాలని ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. రా, రియల్గా అనిపించే యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆమె బ్యాంకాక్కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందుకు అనుగుణంగా ఆమె ట్రైనింగ్ సాగుతోంది.
80%norules |స్లీపర్ బస్సుల ట్రెండ్ వెనుక వాస్తవం
80%norules | స్లీపర్ బస్సుల ట్రెండ్ వెనుక వాస్తవం 80%norules | ప్రమాదాలకు
Telangana Speeds Up Airport Plans for Warangal, Adilabad and Bhadrachalam Regions
The Telangana government has intensified efforts to develop new airports in Warangal, Adilabad and Bhadradri Kothagudem as part of its broader infrastructure and regional growth strategy. Revenue, Housing and Information & Public Relations Minister Ponguleti Srinivasa Reddy said the state, under the leadership of Chief Minister Revanth Reddy, is taking key decisions to ensure balanced […] The post Telangana Speeds Up Airport Plans for Warangal, Adilabad and Bhadrachalam Regions appeared first on Telugu360 .
క్షణాల సుఖం కోసం ఐదేండ్ల బాలుడి దారుణ హత్య
అక్రమ సంబంధానికి అలవాటుపడ్డ ఓ వ్యక్తి క్షణాల సుఖం కోసం ఐదేండ్ల బాలుడిని బలిపీఠం ఎక్కించాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకున్నది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి వివాహం కాగా ఆమెకు ఐదేండ్ల శ్రావణ్, ఎనిమిదేండ్ల కూతురు ఉన్నారు. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె భర్తకు దూరంగా, పిల్లలతో కలసి వేరుగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. లక్ష్మీ శుక్రవారం పని మీద బయటికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న బాలుడు శ్రావణ్పై నిందితుడు నర్సింలు అమానుషంగా దాడి చేశాడు. గొంతు పిసికి, నోరు, ముక్కు మూసి, నేలకేసి కొట్టి, కళ్లలో కారంపొడి పోసి దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. బాలుడిని ఇలా క్రూరంగా హింసించి చంపడం నిందితుడి రాక్షతత్వానికి పరాకాష్ఠ అని పరిసరాల వ్యక్తులు వాపోతున్నారు. రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మీ బంధువు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన చిన్నారుల భద్రత, కుటుంబ పరిసరాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది.
టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన స్మృతి మంధాన..
డర్బన్: అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును భారత మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన బ్రేక్ చేసింది. అంతేకాదు, ఈ ఫార్మాట్ లో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా స్మృతి నయా రికార్డు నెలకొల్పింది. డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా జరిగిన తొలి మ్యాచ్లో మంధాన ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్కు ముందు 4,231 పరుగులతో రోహిత్ శర్మతో సమానంగా మంధాన ఉంది. ఈ మ్యాచ్ లో 13 పరుగులు చేయడంతో మొత్తం 4,244 పరుగులతో రోహిత్ ను అధిగమించింది. మంధాన..155 ఇన్నింగ్స్లలో 30.31 సగటు, 124.38 స్ట్రైక్ రేట్తో ఈ స్కోరును అందుకుంది. ఇందులో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వారి ఆల్-టైమ్ జాబితాలో 4,717 పరుగులతో సూజీ బేట్స్ అగ్రస్థానంలో ఉంది. ఆమె తర్వాత రెండో స్థానంలో మంధాన నిలిచింది. పురుషుల విభాగంలో, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బాబర్ అజామ్ పేరిట ఉంది. ఇదిలావుంటే.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ అజేయంగా 47 పరుగులతో రాణించగా.. షఫాలీ వర్మ 34 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 36 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక, దక్షిణాఫ్రికా బౌలింగ్లో అయబోంగా ఖాకా కీలక పాత్ర పోషించింది. ఆమె కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. తుమీ సెఖుఖునే రెండు వికెట్లు పడగొట్టగా, నాన్కులేకో మ్లాబా ఒక వికెట్ తీసింది. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.
బ్రిటన్ ట్యాంకర్పై ఇరాన్ గన్బోట్లు కాల్పులు
హర్మూజ్ జలసంధిపై తిరిగి ఆంక్షలు విధిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించిన తరువాత ఆ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్పై శనివారం ఇరాన్ రివల్యూషనరీకి చెందిన రెండు గన్బోట్లు కాల్పులు కాల్పులు జరిపాయని బ్రిటిష్ మిలిటరీ వెల్లడించింది. ఆ ట్యాంకర్ ఏమిటో గుర్తింపు కానీ, గమ్యం కానీ వివరించలేదు. అయితే ట్యాంకర్, సిబ్బంది క్షేమమేనని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది.
ఒంటరిగా జీవించడానికి ఓటు వివాహ బంధానికి లేటు #SingleLife #CityTrend #Hyderabad #YouthLife
పవర్ప్లేలో రాణించిన అభిషేక్.. చివర్లో వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కి అభిషేక్ శుభారంభం అందించాడు. 15 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. దీంతో పవర్ప్లే చివరి ఓవర్ వరకూ ఎస్ఆర్హెచ్ నిలకడగా రాణించింది. కానీ పవర్ప్లే చివరి రెండు బంతుల్లో వరుసగా హెడ్ (23), కిషన్(0) పెవిలియన్ చేరాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజ్లో అభిషేక్ (52), క్లాసెన్ (1) ఉన్నారు.
2yrs boy |పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..
2yrs boy | పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. 2yrs
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ, షా అబద్ధాలు : రాహుల్
రానీపేట్ (తమిళనాడు): మహిళల ప్రాతినిధ్యం కల్పనకు రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయడానికి ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా దేశానికి అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ధ్వజమెత్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ వారి క్రూరమైన ఆలోచన వెనుక దేశ ఎన్నికల చిత్రాన్ని మార్చి, రాష్ట్రాలను బలహీనపర్చడమేనని రాహుల్ వ్యాఖ్యానించారు. వారి ప్రయత్నం జాతికి, రాష్ట్రాల సమైక్యతకు వ్యతిరేకమైన చర్య అని రాహుల్ ఆరోపించారు. బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వం అస్సాం, జమ్ముకశ్మీర్ ఎన్నికల చిత్రాన్ని మార్చి వేసిందని, దేశంలో మిగతా ప్రాంతాలను కూడా ఆ విధంగా మార్చాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. చెన్నైకు 120 కిమీ దూరంలో గల ఉత్తర తమిళనాడు పట్టణంలో రెండోసారి ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగించారు. శుక్రవారం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిందని గుర్తు చేశారు.
దుర్గమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి..
దుర్గమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల
దోపిడీ కేసు ఛేదన.. ఐదుగురు యువకులు అరెస్టు.18 గ్రాముల బంగారం స్వాధీనం. పాయకాపురం,
హర్మూజ్ మళ్లీ మూసివేత.. భారత నౌకలపై కాల్పులు
తిరిగి వెళ్తూ భారత నౌకలపై ఇరాన్ గన్బోట్ల కాల్పులు సిబ్బంది, నౌకలు సురక్షితం ఒమన్ ఈశాన్యం నుంచి వెనక్కి మళ్లింపు జలసంధిపై ట్రంప్ వైఖరితో మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితి టెహ్రాన్ : హర్మూజ్ జలసంధి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెరిచినట్టే తెరిచే గంటల వ్యవధిలో ఇరాన్ తిరిగి మూసివేసింది. దానికి అమెరికా అనుసరిస్తున్న వైఖరే కారణమని స్పష్టం చేసింది. శుక్రవారంనాడు జలసంధిని తెరిచిన ఇరాన్ శనివారంనాడు మూసివేసింది. హర్మూజ్ను తెరిచినప్పటికీ ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ పేర్కొంది. ‘ హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తిరిగి మొదటికి వచ్చింది. ప్రస్తుతం మా సాయుధ దళాల నియంత్రణలో ఉంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంత కాలం జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుంటాం’ అని ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేవరకు హర్మూజ్లో దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. ఆ వెంటనే హర్మూజ్లో రాకపోలను ఇరాన్ నియంత్రించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న భారతీయ జెండాతో కూడిన రెండు నౌకలపై ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కాల్పులు జరిపారు. ఐఆర్జిసికి చెందిన రెండు గన్బోట్లు కాల్పులు జరిపాయని బ్రిటీష్ మిలిటరీ వెల్లడించింది. అయితే ఈ ఘటనలో నౌకల్లోని సిబ్బందికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ గార్డ్ జలసంధిని మూసివేసి తిరిగి వెళ్తూ కాల్పులకు పాల్పడ్డట్లు కథనాలు వెలువడ్డాయి. నౌకలు, సిబ్బంది క్షేమమేనని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్తో పాటు ప్రభుత్వం వెల్లడించింది. నౌకల్లో ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 2మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని, భారత నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, ఒమన్కు ఈశాన్యంగా వెనక్కి మళ్లించినట్లు ట్యాకంర్ ట్రాకర్స్ డాట్ కామ్ వెల్లడించింది. మరోవైపు కాల్పులు ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నాం... మరోవైపు దేశం లోని పలు ఎయిర్ పోర్టులను తిరిగి తెరవడంతోపాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యురేనియంను అమెరికాకు అప్పగించేది లేదు: ఇరాన్ అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శుద్ధి చేసిన యురేనియ ం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్జడేహ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భవిష్యత్లో జరగనున్న చర్చలకు యురేనియం ప్రధాన అంశమని ట్రంప్ చేస్తున్న వాదనలను కొట్టి పారేశారు. టర్కీ లోని అంటల్యా సిటీలో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సయీద్ అమెరికాతో మరో దఫా ముఖాముఖి చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని వెల్లడించారు. ఎందుకంటే అమెరికా తన గరిష్టవాదాన్ని విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని శుక్రవారం ట్రంప్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో సయీద్ఖతిబ్జ్దేహ్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రత్యేక నిష్పల సిట్టింగ్ తరువాత ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలు శనివారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. డిలిమిటేషన్, సంబంధిత మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లుల కోసం మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సెషన్ కొనసాగింపుగా ఈ ప్రత్యేక సిట్టింగ్స్ సందర్భంగా ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య వాడివేడి రాజకీయ దుమారాలు చెలరేగాయి. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడ్డట్లు శనివారం అధికారికంగా ప్రకటన వెలువడింది. బడ్జెట్ సమావేశాలు జనవరిలో ఆరంభమయ్యాయి. ఈసారి అత్యంత ఉధృత స్థాయిలో లెజిస్లేటివ్ బిల్లులు నాటకీయ పరిణామాల మధ్య ఆమోదం పొందాయి. అయితే అధికార పక్షానికి చివరి దశలో కీలక బిల్లు ఆమోదం విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. దీనితో తొలిసారిగా మోడీ ప్రభుత్వం చట్టసభలో గణనీయ స్థాయి రాజకీయ వైఫల్యం మూటకట్టుకుంది. శనివారం ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో అధ్యక్ష స్థానంలో ఉన్న సిపి రాధాకృష్ణన్ సభల నిరవధిక వాయిదాలను ప్రకటించారు. సభల తీరు ఫలప్రదంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ శుక్రవారం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ల కోసం ఈ నెల 16 నుంచి మూడు రోజుల సెషన్ ఏర్పాటు అయింది. లోక్సభ స్థానాల పెంపు, మహిళా కోటా అమలు వంటి విస్తృత అంశాలు మూలకుపడిన దశలో పార్లమెంట్ వాయిదా పడింది. తుది దశలో సంకల స్థితిని చవిచూసినా ఈ బడ్జెట్ సమావేశాలలో పలు కీలక మైలురాయి ఫలితాలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇంధన రంగ పరివర్తన లిథియం ఐయాన్ ఉత్పత్తి ప్రోత్సాహకాలు , పన్నుల వ్యవస్థల క్రమబద్ధీకరణ వంటి కీలక అంశాలు జోడించారు. సిఎపిఎఫ్ బిల్లు, జన విశ్వాస్ సవరణ బిల్లు వంటివి కీలకం అయ్యాయి. ఇక సభలో తుది దశలో నెలకొన్న నాటకీయ పరిస్థితులు, భారీ స్థాయి భావోద్వేగాలు , మహిళా బిల్లు అంశం ప్రధాన అస్త్రంగా మలుచుకునేందుకు వీలైన పూర్వ రంగంతో పార్టీలు ఇప్పుడు ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నాయి. తమ తమ వాదనలను ప్రజల ముందుకు ఉంచేందుకు సమాయత్తం అయ్యాయి. లోక్సభ స్థానాల పెంపు, మహిళా కోటా ముందుకు పడకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బిజెపి మిత్రపక్షాల ఎన్డిఎ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ రెండింటిని అధికార పక్షం తన రాజకీయ స్వార్థానికి వాడుకుందని ప్రజలకు వివరించేందుకు విపక్షాలు సిద్ధం అయ్యాయి.
ఆలయ కమిటీ అధ్యక్షుడుగా గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక …
ఆలయ కమిటీ అధ్యక్షుడుగా గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక … భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలోని ఓ బ్యాంకులో సినీ ఫక్కీలో దోపిడీ సంఘటన జరిగింది. ఐదుగురు సాయుధులు బ్యాంక్లోకి దూసుకెళ్లి సిబ్బంది, కస్టమర్లను బందీలుగా ఉంచి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. కేవలం 20 నిమిషాల్లో మొత్తం కానిచ్చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో ఈ ఘటన జరిగింది. మొదట ఇద్దరు ఖాతాదారుల్లా బ్యాంక్లోకి ప్రవేశించారు. తుపాకులు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. మరికొన్ని క్షణాల్లో మరో ముగ్గురు వచ్చి బ్యాంక్పై పూర్తిగా నియంత్రణ సాధించారు. దుండగులు తుపాకీలు చూపించి సిబ్బంది, కస్టమర్లను ఒకచోట కూర్చోబెట్టారు. బెదిరించేందుకు పలు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. బ్యాంక్ మేనేజర్పై దాడి చేసి లాకర్ల తాళాలు లాక్కున్నారు. సుమారు రూ.35 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. చోరీ అయిన మొత్తం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఘటన సమయంలో బ్యాంక్లో సెక్యూరిటీ గార్డు లేకపోవడం గమనార్హం. సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్లే దుండగులు సులభంగా దొంగతనం పూర్తి చేయగలిగారని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు.
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు….
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు…. నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ
ఢిల్లీ పోలీసులు మరో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమై దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కీలు నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ ఫ్లాట్ఫాంల ద్వారా పలువురిని రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. నిఘా ఆధారిత ఆపరేషన్ ద్వారా ఇద్దరు నిందితులు మోసైబ్ అహ్మద్, హహమ్మద్ హమాద్లను మహారాష్ట్రలో, షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఒడిశాలో, మహమ్మద్ సోహైల్ను బిహార్లో అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఐఈడీ అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మ కారు తయారీకి యత్నిస్తుండగా పట్టుకున్నారు. నలుగురు నిందితులు తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. నిందితులలో ఒకడు ఎర్రకోట తమ లక్ష్యమని తెలిపే సంకేతంతో నల్లజెండాతో కూడిన ఎర్రకోట మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసినట్టు గుర్తించామని చెప్పారు. షేక్ ఇమ్రాన్ అనే నిందితుడు 2025లో ఎర్రకోట, ఇండియా గేట్ సహా కీలక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్టు తెలిపారు. మోసైబ్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఆటో ఎలక్ట్రీషియన్గా పనిచేశాడని, ఐఈడీ అమర్చిన రిమోట్ కంట్రోల్ కారు డిజైన్కు అవసరమైన సాంకేతిక నైపుణ్యం అతనికి ఉందని గుర్తించామని వివరించారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి నిందితుల నెట్వర్క్ ఛేదించేందుకు, ఇతర ముఠాలతో సంబంధాలను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
ఉత్కంఠ పోరులో ఆర్సిబిపై ఢిల్లీ ఘన విజయం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే నిస్సాంక ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్లోనే భువనేశ్వర్ మరో రెండు వికెట్లు తీశాడు. కానీ, ఢిల్లీ బ్యాటర్లు పట్టువదలకుండా బ్యాటింగ్ చేశారు. కెఎల్ రాహుల్ 57, స్టబ్స్ 60, అక్షర్ పటేల్ 26, డేవిడ్ మిల్లర్ 22 పరుగులతో తమ జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో 19.5 ఓవర్లలో ఢిల్లీ 179 పరుగులు చేసి ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది.
మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే…
మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే… ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు
మూడురోజుల్లో దారికి రాకపోతే తిరిగి దాడులే: ట్రంప్
బుధవారం నాటికి ఇరాన్ తన సైనిక చర్యలను నిలిపివేయాలని , లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి ఒప్పందానికి రావల్సిందే. లేకపోతే ఇక అమెరికా నుంచి బాంబుల దాడుల ఉధృతిని అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఓ వైపు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగుతోందని, హర్మూజ్ పెత్తనం వీడటం లేదని, వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, అమెరికా సేనల చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ను హెచ్చరించారు. అరిజోనా నుంచి వాషింగ్టన్కు తిరిగి వస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ తమ ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానం నుంవి మీడియాతో మాట్లాడారు. హర్మూజ్ను అమెరికా తమ పూర్తి స్వాధీనంలోకి తీసుకుంటుందని, ఈలోగా ఇరాన్ సరైన రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు ప్రతిగా ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్మూజ్పై అమెరికా బెదిరింపులు లెక్కలోనికి రావని, తరచూ అసమంజస ప్రకటనలకు దిగుతున్నారని ఇరాన్ ఎదురుదాడికి దిగింది. ఇప్పుడు ఇక హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకలను తక్షణం నిలిపివేస్తున్నామని, ఈ నిర్ణయానికి అమెరికా అతి చర్యలే కారణం అని విమర్శించారు.
Flash : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది
కేంద్ర ఉద్యోగుల డిఎ 2 శాతం పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దార్లకు 2 శాతం మేర కరువు భత్యం (డిఎ), కరువు ఉపశమనం (డిఆర్) పెంచారు. ఈ నిర్ణయానికి శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించింది. తరువాత ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. డిఎ, డిఆర్ పెంపుదల నిర్ణయంతో దేశంలోని దాదాపు 50.46 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 68.27 లక్షల మంది పెన్షనర్లకు ఉపయోగం చేకూరుతుంది. ఈ రెండింటి హెచ్చింపు భారం ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపుగా రూ 6791.24 కోట్ల మేర ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిఎ, డిఆర్ పెంపుదల ఉద్యోగులకు వర్తింపచేస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు, ఇప్పటి ధరల పెంపుదల , ఇతర కారణాలను విశ్లేషించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగుల మూల వేతనం/ పింఛన్లపై అమలులో ఉన్న 58 శాతం డిఎ రేటుకు అదనంగా ఈ రెండు శాతం జోడింపు జరుగుతుంది.
రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్
రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్ భార్య తరపున మధ్యవర్తుల వేధింపులతో
2026entry |సుప్రీత నాయుడు సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర నటి వరకు!
2026entry | సుప్రీత నాయుడు సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర నటి
ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత… పాయకాపురం, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి సహాయ నిధి
ఈ నెల 20న జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 304 నగరాలలో 566 పరీక్షా కేంద్రాలతోపాటు విదేశాలలోని 14 నగరాలలో ఈ నెల 2 నుంచి 8 వరకు జెఇఇ మెయిన్ 2 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా, ఆదివారం రాత్రి లేదా సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జెఇఇ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు జరగగా, ఫిబ్రవరి 16న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి: సిఎం రేవంత్ రెడ్డి
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సిఎం కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను సిఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతలతో దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తుందని కేంద్ర మంత్రులకు సిఎం వివరించారు. హైదరాబాద్లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మెషిన్టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సిఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సిఎం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
ఈనెల 21న వాహనాల బహిరంగ వేలం డీటీసీ యం పురేంద్ర… విజయవాడ, ఆంధ్రప్రభ
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సిఎస్కె
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి ఫుల్ జోష్లో ఉన్న చెన్నై జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్తో సొంత మైదానంలో గెలిచిన ఎస్ఆర్హెచ్.. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తుది జట్లు: ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సాలిల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేస్, ఇషాన్ మలింగ. సిఎస్కె: సంజు శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.
ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర.. నలుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి టెర్రరిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఢిల్లీ నగరంలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడం, లక్ష్యంగా చేసుకునేందుకు సున్నితమైన ప్రాంతాలపై రెక్కీ నిర్వహించడం, ఎన్క్రిప్టెడ్ ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఇతరులను నియమించుకునేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలతో మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన నలుగురు తీవ్రవాద భావజాలం గల వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED), దానికి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు, నిందితులలో ఇద్దరు IED అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మ కారును తయారు చేసే ప్రక్రియలో ఉన్నారని చెప్పారు. నిఘా ఆధారిత ఆపరేషన్లో మహారాష్ట్ర నుండి ఇద్దరు నిందితులను.. ఒడిశా, బీహార్ నుండి ఒక్కొక్కరిని స్పెషల్ సెల్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచన చుట్టూ కేంద్రీకృతమైన తీవ్రవాద భావజాలంతో ఈ నలుగురు ప్రభావితులయ్యారని, గజ్వా-ఎ-హింద్ వంటి నినాదాలను ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు.
తాచుపాముల స్వైరవిహారం.. సింగ్ నగర్లో ఇద్దరికి పాముకాటు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్
మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది…
మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
ఈ వేసవిలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి…
ఈ వేసవిలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : ఈ
Took Cash, Showed Fake Payment Screenshot: ATM Fraudster Held in Hyderabad
Hyderabad Police have arrested a 25-year-old man accused of cheating ATM users by showing fake PhonePe payment screenshots and escaping with cash. The accused, Abdallah Obaid Al Katheri alias Abdullah, was arrested by Chandrayangutta Police on April 17 near the same ATM centre where one of the frauds had taken place. How the Scam Worked […] The post Took Cash, Showed Fake Payment Screenshot: ATM Fraudster Held in Hyderabad appeared first on Telugu360 .
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది ఎన్డీయే సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 2శాతం డిఎ పెంచేందుకు కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. పెంచిన డిఎ జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
శ్రీధర్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం
శ్రీధర్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మాజీ
Hyderabad Police Raid 558 Shops Near Schools in Massive Anti-Tobacco Drive
In one of the largest enforcement drives in recent times, Hyderabad City Police on Saturday conducted simultaneous raids on 558 shops located near schools and colleges as part of a citywide crackdown titled Operation Safe School. The special operation was launched to curb the sale of tobacco products near educational institutions and protect students from […] The post Hyderabad Police Raid 558 Shops Near Schools in Massive Anti-Tobacco Drive appeared first on Telugu360 .
అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం
అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం కార్మికులకు అగ్నిప్రమాదాల పై అవగాహన కార్యక్రమం చిట్టినగర్,
ఎల్లుండి రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల..
హైదరాబాద్: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ సర్కార్, రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీన రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండో విడతలో 45,11,947 రైతులకు రూ.5,653 కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ చేయన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారనే దానిపై స్పస్టత రావాల్సి ఉంది. కాగా, తొలి విడతలో ఒక ఎకరం వరకు రైతులందరికీ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అనకాపల్లి రైల్వేస్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
అనకాపల్లి: అనకాపల్లి రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫుట్పాత్ వంతెన కూలిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వంతెన నిర్మిస్తున్న క్రమంలో స్తంభాలు కూలిపోయి.. విద్యుత్ వైద్యు తెగిపడ్డాయి. అయితే, ఆ సమయంలో ప్లాట్ఫామ్పై రైలు లేకపోవడంతో భారీ నష్టం తప్పింది. క్షతగాత్రులైన కూలీలను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పదవులకే వన్నె తెచ్చే నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమా…
పదవులకే వన్నె తెచ్చే నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమా… పాయకాపురం, ఆంధ్రప్రభ :
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బిజెపి నిరసనలు.. రాహుల్ దిష్టిబొమ్మ దహనం
న్యూఢిల్లీ: లోక్సభలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా కోటా చట్టాన్ని సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవాతో సహా పలువురు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. తర్వాత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు.. బీజేపీ ఎంపీలు కమల్జీత్ సెహ్రావత్, బన్సూరి స్వరాజ్తో సహా పలువురు కార్యకర్తలను, నాయకులను అదుపులోకి తీసుకుని, నిరసనకారులను చెదరగొట్టారు. ఈ నిరసన సందర్భంగా ఎంపి బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ.. “వారి వ్యాఖ్యలను బట్టి, నిన్న బిల్లును వ్యతిరేకించడం కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ అని స్పష్టమైంది. రాహుల్ గాంధీ, ఆయన సహచరులకు, మొత్తం ఇండియా కూటమికి మహిళలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కనిపిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. మహిళలు కేవలం ఓటింగ్కు మాత్రమే పరిమితం కావాలని వారు కోరుకుంటున్నారు” అని విమర్శించారు.
కేడీసీసీ బ్యాంక్కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్…
కేడీసీసీ బ్యాంక్కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్… నాణ్యతలో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. ప్రజల నుంచి వచ్చే సమస్యలను
LokSabha | రాజకీయ అనివార్యతలా? LokSabha | లోక్సభ బిల్లు వీగిపోవడం: కొత్త
నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు
శానిటేషన్పై దృష్టి సారించాలి…
శానిటేషన్పై దృష్టి సారించాలి… స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్ర ద్వారా అవగాహన..సెంట్రల్ ఎమ్మెల్యే
పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో పిచ్చి కుక్క
నటుడు ప్రకాశ్ రాజ్ పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా..
నటుడు ప్రకాశ్ రాజ్ పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా.. టీటీడి బోర్డు
హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి
హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా
2029 Election |తర్వాత ఎవరి అడుగులు ఎటువైపో?
2029 Election | తర్వాత ఎవరి అడుగులు ఎటువైపో? 2029 Election |
BRS : కేసీఆర్ కీలక ప్రకటన.. పార్టీ పై నిర్ణయం వెలువరించే ఛాన్స్
భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తడబడిన ఆర్సిబి.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..
బెంగళూరు: ఐపిఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సిబి బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సిబిని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్కి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సిబి బ్యాటింగ్లో సాల్ట్ 63, డేవిడ్ 26, కోహ్లీ, 19, పడిక్కల్ 18 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్లో ఎంగిడి, కుల్దీప్, అక్షర్ చెరి 2, ముఖేశ్ 1 వికెట్ తీశారు. అయితే 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో నిస్సాంకా ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 1 ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ 1 వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. క్రీజ్లో రాహుల్(1), కరుణ్ నయర్ (0) ఉన్నారు.
మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు : చంద్రబాబు
మహిళల ఆత్మగౌరవాన్ని విపక్షాలు దెబ్బతీశాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

30 C