SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

400buffaloes బాదంపల్లి గోదావరి రేవులో పేలుడు ఘటన.. గేదెలకు తీవ్ర గాయాలు

400buffaloes బాదంపల్లి గోదావరి రేవులో పేలుడు ఘటన.. గేదెలకు తీవ్ర గాయాలు 400buffaloes

ప్రభ న్యూస్ 19 Apr 2026 10:06 pm

సౌతాఫ్రికా మహిళలకు రెండో విజయం

డర్బన్: భారత్‌తో ఆదివారం జరిగిన రెండో టి20లో ఆతిథ్య సౌతాఫ్రికా మహిళా టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ౨-0 ఆధిక్యాన్ని అందుకుది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు లౌరా వల్‌వర్డ్, సునే లూస్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లౌరా 34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54 పరుగులు చేసింది. లూస్ 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసింది. తజ్మిన్ బ్రిస్ట్ 20 (నాటౌట్), డర్క్‌సెన్ 12 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ షఫాలీ వర్మ ఒక్కటే రాణించింది. ఒంటరి పోరాటం చేసిన షఫాలీ 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 57 పరుగులు చేసింది. అనుష్క శర్మ (28) తవనంతు పాత్ర సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ట్రియాన్, టుమి మూడేసి వికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 19 Apr 2026 10:05 pm

ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి రావాలి: కవిత

ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి రావాలి ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారు కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారు బూర్జువా పార్టీలను వదిలి జాగృతిలో చేరండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎంఎల్‌ఎ రాథోడ్ బాపూరావు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలేసి కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న జాగృతిలో చేరాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారని చెప్పారు. బోథ్ మాజీ ఎంఎల్‌ఎ, కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ బాపూరావు ఆదివారం తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. 2007లో కుటుంబంతో సహా తాను బోథ్‌కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానని గుర్తు చేసుకున్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు, మన్నెం జ్వర పీడితులతో నిండి ఉండేదని.. ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలనే తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉందన్నారు. రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారని చెప్పారు. ఆయన తెలంగాణ జాగృతి నుంచే బిఆర్‌ఎస్‌లో చేరి రెండు సార్లు ఎంఎల్‌ఎ అయ్యారని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతున్నారని తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా నుంచి బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు జాగృతిలో చేరారని అన్నారు. ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి జనగణనలో ఆదావాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఆదివాసీ కాన్‌స్టిట్యూషన్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జెఎసి జాతీయ అధ్యక్షుడు, ఖమ్మం జెడ్‌పి మాజీ చైర్మన్, మాజీ ఎంఎల్‌ఎ చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో జెఎసి నాయకులు ఆదివారం జాగృతి కార్యాలయంలో కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను చందా లింగయ్య దొర ఈ సందర్భంగా వివరించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెసా చట్టానికి తూట్లూ పొడుస్తూ ఆదివాసీల హక్కులను హరిస్తోందని అన్నారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో ఆదివాసీలకు ఉన్న రక్షణలను తొలగిస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని, తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని, దీంతో ఆదివాసీలు తమ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమే అని మండిపడ్డారు. ఆదివాసీలు తమ మతం చెప్పుకునేలా జనగణనలో ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భాష “కోయతూర్‌”ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులని వారి గౌరవాన్ని కాపాడేలా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ జెఎసి ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు. కవిత సిఎం కావాలి : మాజీ ఎంఎల్‌ఎ బాపూరావు తెలంగాణ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎంఎల్‌ఎ రాథోడ్ బాపూరావు ఆకాంక్షించారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎంఎల్‌ఎ అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని, తనకు మూడోసారి ఎంఎల్‌ఎ టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌లో చేరినా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని అన్నారు.

మన తెలంగాణ 19 Apr 2026 9:51 pm

in15thdivision |చిత్తూరులోకి చిరుత పులులు

in15thdivision | చిత్తూరులోకి చిరుత పులులు in15thdivision |రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంకలవరపెడుతున్న

ప్రభ న్యూస్ 19 Apr 2026 9:45 pm

మహిళా రిజర్వేషన్ల కోసమే డీ లిమిటేషన్: ఎంపి కొండా

మన తెలంగాణ/హైదరాబాద్: లోకసభ స్థానాల పెంపుతో పాటు మహిళల రిజర్వేషన్లతో డిలిమిటేషన్ బిల్లు సరిసమానంగా ఉంటుందని చేవేళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరుపై ఆయన మండిపడ్డారు. గతంలో ఈ బిల్లును పలుమార్లు ప్రవేశపెట్టారని, 202౩లో మహిళ రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్‌కు అసదుద్దీన్ ఓవైసీ, మరొకరు మినహా కాంగ్రెస్ పార్టీతో సహ అన్ని పార్టీలు ఏకాభిప్రాయంగా ఆమోదం తెలిపాయని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై కాంగ్రెస్ పార్టీ తొందరపెట్టడంతోనే ప్రధాని నరేంద్రమోడీ మరోసారి చట్టసభ ముందుకు బిల్లును తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. 1963లో రెండవ డీ లిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యూహత్మకంగా వ్యవహరించి బిల్లును అడ్డుకున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

మన తెలంగాణ 19 Apr 2026 9:45 pm

మహిళల చరిత్రలో చీకటి రోజు.. కాంగ్రెస్ కూటమిపై కేంద్ర మంత్రి ఫైర్

మహిళలను వంచించిన కాంగ్రెస్ కూటమి ఈ నెల 17 మహిళల చరిత్రలో చీకటి రోజు బిల్లు వీగిపోతే ఇండి కూటమి సంబురాలు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మండిపాటు మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఈ నెల 17వ తేదీ దేశ మహిళల చరిత్రలో ఒక చీకటి రోజుగా, బ్లాక్ డేగా మిగిలిపోతుందని, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండియా అలయన్స్ దేశంలోని మహిళలతో పాటు మొత్తం దక్షిణ భారత దేశాన్ని మోసం చేసిందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మండిపడ్డారు. మహిళలు చిరకాలంగా కోరుకుంటున్న 33 శాతం రిజర్వేషన్ బిల్లుతో పాటు, దక్షిణ దేశ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకునివచ్చిందని ఆమె ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు భవిష్యత్తులో జనగణన తర్వాత అన్యాయం జరగకుండా రక్షణ కల్పించడమే ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. అయితే లోక్‌సభలో ఈ బిల్లులు విఫలమైనప్పుడు కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీల నాయకులు దేశ ప్రయోజనాలను మరిచి, ఆ వైఫల్యాన్ని పండుగలా జరుపుకున్నారని వారి నవ్వులు, హగ్‌లు దేశాన్ని ఉత్తర-దక్షిణిగా విభజించే కుట్రకు నిదర్శనమని కేంద్ర మంత్రి శోభ మండిపడ్డారు. దక్షిణ భారతానికి న్యాయం చేసే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామని, కేవలం ఒక గంట సమయం ఇస్తే కొత్త బిల్లును తీసుకుని వస్తామని ప్రతిపాదించినప్పటికీ, కాంగ్రెస్, ఇండీ అలయన్స్ పార్టీలు దాన్ని తిరస్కరించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ రాజకీయ లాభాల కోసం, భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలను మరింత పెంచేలా వారు వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లుగా మహిళా సాధికారతకు పెద్ద పీట వేశామని విద్య, స్కాలర్‌షిప్‌లు, బీమా పథకాలతో పాటు ముద్ర లోన్లలో 60 శాతం, ఎంఎస్‌ఎంఇ సబ్సిడీల్లో 53 శాతం మహిళలకే అందించామని పేర్కొన్నారు. ప్రధానిగా ఎబి వాజపేయి ఉన్నప్పుడు స్వయం సహాయక సంఘాల ఆలోచనను విస్తరించి, ఇప్పుడు 3 కోట్లకు పైగా మహిళలను ‘లఖ్ పతి దీదీలు‘గా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, మహిళ చేతిలో డబ్బు ఉంటే కుటుంబానికి, దేశానికి మేలు జరుగుతుందని ఆమె అన్నారు. నేటి మహిళలు రక్షణ రంగంలో ఫైటర్ జెట్‌లు నడుపుతూ దేశానికి సేవ చేస్తున్నారని, అయినప్పటికీ రాజకీయాల్లో వారికి సరైన అవకాశాలు రాకుండా కాంగ్రెస్ వంటి పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో ముద్ర లోన్లలో 63-64 శాతం మహిళలకే దక్కాయని, ఎంఎస్‌ఎంఈ సబ్సిడీలు 53 శాతానికి పైగా మహిళలు పొందారని స్పష్టం చేశారు. కర్నాటక కోస్టల్ ప్రాంతంలోని మత్స్యకార మహిళల జీవనశైలిని ఉదాహరణగా చూపుతూ, మహిళల చేతిలో ఆర్థిక శక్తి ఉంటే నిర్ణయాధికారం ఎలా మారుతుందో ఆమె వివరించారు. కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్‌లో మహిళలకు అవకాశం అంటే అది కేవలం ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీ వంటి ఒకే కుటుంబానికి పరిమితమని విమర్శించారు. దేశంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళలలో సీట్లు పెంచే ప్రతిపాదనను అడ్డుకోవడం ద్వారా ఇండియా కూటమి దక్షిణ భారతాన్ని మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుండి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుండి 38కి పెరుగుతాయని, ఈ ప్రయోజనాన్ని ఇండీ కూటమి అడ్డుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వం గురించి మాట్లాడుతూ, ఆ పార్టీలో కేవలం ‘ఖాన్దాన్‘ (వారసత్వ) రాజకీయాలే నడుస్తాయని, జార్కిహోళి కుమార్తెకు టికెట్ ఇవ్వడాన్ని ఆమె ఉదహరించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో తనను తాను ‘జాదూగర్‘ (మాంత్రికుడు) అని సంబోధించుకుంటూ అపరిపక్వంగా ప్రవర్తించారని ఆమె విమర్శించారు. సిఎంపై నిప్పులు చెరిగిన శోభ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజలకు చేసిన అన్యాయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలో మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. చివరగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం హైకమాండ్‌ను సంతోషపెట్టడానికే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, హామీల అమలులో విఫలమై రాష్ట్ర ప్రజలను ‘పిక్ పాకెట్‘ చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఎంపీ డికె అరుణ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 19 Apr 2026 9:21 pm

నా మాటలను వక్రీకరించారు: ప్రకాశ్ రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్: తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించారు. ఇటీవల ఓ సాహితీ కార్యక్రమంలో తాను చేసిన పూర్తి ప్రసంగాన్ని వదిలేసి, అందులోని కొన్ని భాగాలను మాత్రమే తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను శ్రీరాముడిని కించపరిచానని, హిందువుల మనోభావాలను దెబ్బతీశానని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను అన్ని ధర్మాలను సమానంగా గౌరవిస్తానని, ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కొందరు రాజకీయ నాయకులు ‘హిందూ వ్యతిరేకి’ అనే ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే తన గొంతు నొక్కేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తాను పొలం పనులతో తీరిక లేకుండా ఉన్నానని, ఆ పనులు పూర్తయ్యాక ఈ విషయంపై మరింతగా మాట్లాడతానని ప్రకాశ్ రాజ్ తన పోస్ట్‌లో తెలిపారు.

మన తెలంగాణ 19 Apr 2026 8:29 pm

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. శని వారం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌కు ప్రధాని ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ’ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్‌తో మాట్లాడి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన చాలా ధైర్యవంతుడు, త్వరలోనే కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను‘ అని తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది : చిరంజీవి తన సోదరుడి ఆరోగ్యంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్ కల్యాణ్‌కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా, నిలకడగా ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు‘ అని చిరం జీవి తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ తిరిగి సాధారణ కార్యకలాపాల్లోకి రావడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని వైద్యులు సూచిం చినట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రార్థనలు చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ చిరంజీవి ధన్య వాదాలు తెలిపారు.

మన తెలంగాణ 19 Apr 2026 8:20 pm

బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి

విరుద్‌నగర్: తమిళనాడులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విరుద్‌నగర్ జిల్లా కట్టనార్‌పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పరిశ్రమ ధ్వంసం కాగా.. పరిసర ప్రాంతాలు కంపించినట్లు సమాచారం. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. విరుద్‌నగర్ జిల్లాలోనే సత్తూర్‌లో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వారం క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికులు మరణించగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

మన తెలంగాణ 19 Apr 2026 8:14 pm

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా… హేమాక్స్ లైట్ మినీ వాటర్ ట్యాంక్

ప్రభ న్యూస్ 19 Apr 2026 8:05 pm

నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం…

నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం… భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ పట్టణ

ప్రభ న్యూస్ 19 Apr 2026 8:01 pm

పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం…

పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం… కొత్త కాలువల నిర్మాణంతో మురుగు సమస్యకు

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:57 pm

బుక్ పేరుతో రాజ్యాంగ విరుద్ధ పాలన…

బుక్ పేరుతో రాజ్యాంగ విరుద్ధ పాలన… రాష్ట్రంలో తిరోగమనంలో ప్రజాస్వామ్యంమాజీ మంత్రి ధర్మాన

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:54 pm

మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు.

మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు. భవానిపురం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:46 pm

ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి…

ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి… గిట్టుబాటు ధరను పొందాలి..మార్కెట్ చైర్మన్ ఉబ్బు

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:40 pm

ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి

రోమ్: ఇటలీలోని బెర్గామో ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. కోవో పట్టణంలో భారతీయ సిక్కులు అక్కడున్న గిడ్డంగిలో ఏర్పాటు చేసుకున్న గురుద్వారా వెలుపల ఈ ఘటన జరిగింది. వైశాఖీ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న దశలో వారిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ సిక్కుల ప్రార్థనా స్థలి వద్ద కాల్పుల్లో మృతి చెందిన వారిని రాగీందర్ సింగ్, గుర్మీత్ సింగ్‌గా గుర్తించారు, కాల్పులకు దిగింది కూడా భారతీయుడేనని అక్కడున్న ప్రత్యక్ష సాక్షి మాటల ద్వారా వెల్లడైంది. 

మన తెలంగాణ 19 Apr 2026 7:38 pm

ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు

ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు పిల్లర్లతో కూడిన ప్లైఓవర్

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:36 pm

అదరగొట్టిన రింకూ.. ఈ సీజన్‌లో కోల్‌కతా తొలి విజయం

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన కెకెఆర్‌కు రాజస్థాన్ బౌలర్లు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే సైఫర్ట్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానె కూడా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. అంగ్‌క్రిష్ రఘువంశీ 10 పరుగులు చేసి ఔట్ కాగా, కామరూన్ గ్రీన్ (27), రోవ్‌మెన్ పొవెల్ (23) ఫర్వాలేదు అనిపించారు. అయితే 85 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయిన కెకెఆర్‌కు రింకూ సింగ్ అండగా నిలిచాడు. అనుకూల్ రాయ్‌తో కలిసి ఆర్ఆర్ బౌలర్లను ఎదురుకుంటూ పరుగులు రాబట్టాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. అనుకూల్ కూడా 16 బంతుల్లో 29 పరుగులు చేసి రింకూకి తగిన సహకారం అందించాడు. దీంతో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి టేబుల్‌లో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి వచ్చింది.

మన తెలంగాణ 19 Apr 2026 7:36 pm

పీసీ యువసేన మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

పీసీ యువసేన మజ్జిగ చలివేంద్రం ప్రారంభం భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:33 pm

కెసిఆర్ తరహాలో రేవంత్ రెడ్డీ మోసాలు.. బండి సంజయ్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డిలా మారారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్దాల పునాదులపైనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. అబద్దాలతోనే మహిళలను వంచించారని, మహిళలందరికీ ప్రతి నెలా రూ. 2500లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారని ఆయన విమర్శించారు. అబద్దాలు, మోసాలనే ప్రజలు నమ్ముతారని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం రేవంత్ రెడ్డికి ఉన్నట్లుందని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్ తరహాలోనే అబద్దాలు, మోసాలతోనే పాలన కొనసాగిస్తున్నారని, అబద్దాలు, మోసాలనే నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “అభినవ గోబెల్స్‌”గా మారారని తెలిపారు. అబద్దాలు, మోసాలు చేసే వారినే ప్రజలు నమ్ముతారని బహిరంగంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ అబద్దాల పునాదులపైనే ముఖ్యమంత్రి అయ్యారని, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తరహాలోనే దొంగ హామీలు, పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలనను కొనసాగిస్తున్నారని, నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ఆయనకు అలవాటుగా మారిందని, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెడితే ఇండీ కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంలో లేనిపోని విష ప్రచారం చేసి మహిళా బిల్లును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం జరగబోతోందని తప్పుడు ప్రచారాలకు తెరదీసి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగకుండా కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచడం ద్వారా దక్షిణాదికి మేలు చేయాలనుకున్నారని ఆయన తెలిపారు. అందుకే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే, ఇండీ కూటమి పేరుతో అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఇండీ కూటమి నేతలు దక్షిణాదికి ఉన్న అవకాశాలకు గండి కొట్టారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ మహిళలతోపాటు దేశంలోని 70 కోట్ల మహిళలెవరూ ఇండీ కూటమి చేసిన అవమానాన్ని ఎన్నటికీ మరచిపోరని ఆయన హెచ్చరించారు. మహిళలంతా ఏకమై రేవంత్ రెడ్డి సర్కార్‌ను గద్దె దించడం తథ్యం అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను తెలంగాణలోని గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వం సిద్ధమవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.

మన తెలంగాణ 19 Apr 2026 7:31 pm

పి.ఆర్.టి.యు ధర్నా విజయవంతం చేయాలని పిలుపు…

పి.ఆర్.టి.యు ధర్నా విజయవంతం చేయాలని పిలుపు… చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:30 pm

పేరూరు స్పూర్తి…రాష్ట్రానికి మార్గదర్శి…

పేరూరు స్పూర్తి…రాష్ట్రానికి మార్గదర్శి… 75 ఏళ్ల ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:12 pm

South Indian Film Producers’ Crucial Meeting Held

All the producers of South Indian cinema have been meeting to discuss the strict guidelines to be followed for the implementation of the OTT window. A crucial meeting has taken place in Hotel Daspalla, Hyderabad today and the film producers, representatives from the Producers’ Associations and Guilds of Telangana, Andhra Pradesh, Tamil Nadu and Kerala […] The post South Indian Film Producers’ Crucial Meeting Held appeared first on Telugu360 .

తెలుగు 360 19 Apr 2026 7:12 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎల్ఎస్‌జి

ముల్లాన్‌పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహరాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన లక్నో కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఆ జట్టుకు కీలకం కానుంది. మరోవైపు వరుస విజయాలతో జోష్‌ మీద ఉన్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేష్ రాఠీ స్థానంలో సిద్ధార్త్‌ని జట్టులోకి తీసుకుంది. మరోవైపు పంజాబ్ అదే జట్టును కొనసాగిస్తోంది. తుది జట్లు: ఎల్‌ఎస్‌జి: ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్. పిబికెఎస్: ప్రభ్‌సిమ్రన్ సింగ్(కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోల్లి, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వాదేరా, మార్కస్ స్టోయినస్, మార్క్ యాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్,.

మన తెలంగాణ 19 Apr 2026 7:12 pm

సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ అభ్యర్థుల ప్రకటన

సదాశివపేట మున్సిపల్ కో-ఆప్షన్ అభ్యర్థుల ప్రకటన సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సదాశివపేట

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:06 pm

మోరంగపల్లిలో సంఘటన…

మోరంగపల్లిలో సంఘటన… పిడుగు పడి ఎద్దు మృతి… వికారాబాద్, ఆంధ్రప్రభ : ఈదురు

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:01 pm

మహిళలపై బీజేపీ కపట ప్రేమ…

మహిళలపై బీజేపీ కపట ప్రేమ… ఎమ్మెల్యే బొజ్జు పటేల్…బిల్లులు వీగిపోతాయని బిజెపికి ముందే

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:56 pm

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:53 pm

బుద్ధ వెంకన్నను కలిసిన మాజీ కార్పొరేటర్లు

బుద్ధ వెంకన్నను కలిసిన మాజీ కార్పొరేటర్లు భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గం

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:49 pm

కాలేజీ విద్యార్థులు మ‌జ్జిగ పంపిణీ…

కాలేజీ విద్యార్థులు మ‌జ్జిగ పంపిణీ… పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక పైపుల రోడ్డు,

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:40 pm

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం.. వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:30 pm

కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ..

కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ.. రాయపర్తి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:26 pm

ఎండ నుంచి రిలీఫ్.. హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్: నగరంలో గత కొద్ది రోజులుగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం ప్రయాణంచే వాళ్లు నానా అవస్తలు పడుతున్నారు. అలాంటి వారికి ఇది నిజంగా మంచి ఉపశమనం కలిగించే వార్త. నగరంలో ఆదివారం ఒఖ్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్‌లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. చింతల్‌లోని పద్మానగర్‌లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షం నేల కూలింది. దీంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. కూకట్‌పల్లి, మూసాపేట్, జెఎన్టియు, నిజాంపేట్, కెపిహెచ్‌బి, జీడిమెట్ల ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.

మన తెలంగాణ 19 Apr 2026 6:26 pm

11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి

11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి ఖమ్మం బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:21 pm

తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు

తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు వేములవాడ, ఆంధ్రప్రభ : తెలంగాణ సత్తెమ్మ కు

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:20 pm

Hyderabad : హైదరాబాద్ లో వాన.. నగరవాసులకు ఊరట

హైదరాబాద్ లో వడగళ్ల వాన కురిసింది

తెలుగు పోస్ట్ 19 Apr 2026 6:12 pm

టేకుమట్లలో ఆహ్లాదకర వాతావరణం

టేకుమట్లలో ఆహ్లాదకర వాతావరణం టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:12 pm

Breaking : బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఇరవై మంది మృతి

తమిళనాడులో భారీ పేలుడు జరిగింది

తెలుగు పోస్ట్ 19 Apr 2026 6:01 pm

శివుని మహిమతో రాతిపై వెలసిన నంది

శివుని మహిమతో రాతిపై వెలసిన నంది జుక్కల్, ఆంధ్రప్రభ : అక్షయ తృతీయ

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:00 pm

భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ..

భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా

ప్రభ న్యూస్ 19 Apr 2026 5:56 pm

ఘనంగా ఫాదర్‌ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుక‌లు……

ఘనంగా ఫాదర్‌ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుక‌లు…… పాయకాపురం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Apr 2026 5:56 pm

హసన్ పర్తి జమా మసీద్ అధ్యక్షులుగా అహ్మద్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా అసంపూర్తి 66 డివిజన్ కేంద్రంలోని

ప్రభ న్యూస్ 19 Apr 2026 5:53 pm

రాణించిన కెకెఆర్ బౌలర్లు.. ఆర్ఆర్ స్కోర్ ఎంతంటే..

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఓపెనర్లు వైభవ్, యశస్వీలు పవర్‌ప్లేలోనే 63 పరుగులు చేశారు. 81 పరుగుల వద్ద ఆర్ఆర్ తొలి వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి కెకెఆర్ బౌలర్లు ఆర్ఆర్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆర్ఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటింగ్‌లో వైభవ్ 46, యశస్వీ 39 మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. కెకెఆర్ బౌలింగ్‌లో కార్తీక్, వరుణ్ చెరి మూడు, నరైన్ 2 వికెట్లు తీశారు. 

మన తెలంగాణ 19 Apr 2026 5:32 pm

ఆందోళన చెందకండి.. పవన్ ఆరోగ్యంగానే ఉన్నారు: చిరంజీవి

హైదరాబాద్: ఎపి డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం పాలనా పరమైన అంశాలపై అధికారులతో చర్చిస్తున్న సమయంలో పవన్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు జూబ్లీహిల్స్‌లోని అపోలో వైద్యులు శనివారం సాయంత్రం శస్త్ర చికిత్స చేశారు. అయితే పవన్‌కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తాజా అప్‌డేట్ ఇచ్చారు. పవన్ ఆరోగ్యంగా ఉన్నారని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరు పేర్కొన్నారు. ‘‘కళ్యాణ్ బాబుకు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. బాగా కోలుకుంటున్నాడు. తను సాధారణ స్థితికి వచ్చేందుకు వారం సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. పవన్ కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని చిరంజీవి సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫోన్‌లో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ నటులు ఎన్టిఆర్, అల్లు అర్జున్, సాయి దుర్గా తేజ్, రచయిత కోనా వెంకట్ తదితరులు పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.

మన తెలంగాణ 19 Apr 2026 5:08 pm

దరువు జాతర’ను విజయవంతం చేయండి….

దరువు జాతర’ను విజయవంతం చేయండి…. అమరవరపు సతీష్ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Apr 2026 5:07 pm

జలధార కింద అన్ని ఆలయాల పుష్కరిణిల్లో నీరు నింపాలి: చంద్రబాబు

అమరావతి: భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ భారం తగ్గుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ భారం తగ్గితే ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు వాడవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా జలధార-హారతి కార్యక్రమంపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ జరిపారు. క్షేత్రస్థాయిలో జలధార-జలహారతి పనులను సిఎంకు అధికారులు వివరించారు. ‘జలధార’ కు అన్నమయ్య కలెక్టర్ ను నోడల్ అధికారిగా నియమించారు. జలధార కింద అన్ని ఆలయాల పుష్కరిణిల్లో నీరు నింపాలని, అర్బన్ మండలాల్లో నోడల్ అధికారులు పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. నీటి సంరక్షణలో అన్నయ్య జిల్లా మోడల్ ప్రతిచోటా అమలు కావాలని, జలధార- జలహారతిలో ప్రజలను భాగస్వాములు చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.   

మన తెలంగాణ 19 Apr 2026 4:59 pm

మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి

మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:58 pm

దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం..

దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం.. జగిత్యాల ధర్మ పరిరక్షణ

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:52 pm

అదుపుతప్పి కారు బోల్తా

అదుపుతప్పి కారు బోల్తా భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని భీమదేవరపల్లి క్రాస్ రోడ్

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:46 pm

మానసిక దృఢత్వం.. ఆరోగ్యకర జీవితం..

మానసిక దృఢత్వం.. ఆరోగ్యకర జీవితం.. నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; మనిషి శారీరకంగా

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:42 pm

మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత..

మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:37 pm

ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం

ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:33 pm

చెరవులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఉమన్(14) మునీరాబాద్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు ఇర్ఫాన్(12) డబిల్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. విద్యార్థులు మునిగిపోతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 19 Apr 2026 4:32 pm

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని ఊర్కొండపేట జిల్లా

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:29 pm

గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి…

గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి… నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:26 pm

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సూర్యాపేట, ఆంధ్రప్రభ : టాక్టర్ బైకు ఢీకొన్న ప్రమాదంలో

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:21 pm

మహబూబ్ నగర్ లో.. లారీ వెనుక నుంచి కారు ఢీ: ఇద్దరు మృతి

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి, కుమారుడు మృతి చెందారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన కారు యజమాని ప్రకాష్ రెడ్డి భార్య నందినితో పాటు నాలుగేళ్ల కుమారుడు హైవేపై ఆగి ఉన్న లారీ వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 19 Apr 2026 4:14 pm

గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం

గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం చెన్నూర్ ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:09 pm

vishnu priya|బుల్లితెర న‌టి హాట్ ఫొటోలు

vishnu priya| బుల్లితెర న‌టి హాట్ ఫొటోలు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీవీ

ప్రభ న్యూస్ 19 Apr 2026 4:03 pm

Janvi kapoor |వ్యూహం ఫలించేనా..?

Janvi kapoor | వ్యూహం ఫలించేనా..? Janvi kapoor | సౌత్ ఎంట్రీకి

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:51 pm

గురుకుల విద్యార్థిలతో పోలీసుల ఇష్టాగోష్టి..

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:44 pm

పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చిన భట్టి విక్రమార్క

ఉట్నూర్, ఆంధ్రప్రభ : పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని ఉప

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:33 pm

IPL MATCH |టాస్ ఓడిన కోల్‌క‌తా..

IPL MATCH | టాస్ ఓడిన కోల్‌క‌తా.. IPL MATCH | ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:28 pm

ఇంద్రవెల్లి ఘటనకు 46 ఏళ్లు

ఇంద్రవెల్లి ఘటనకు 46 ఏళ్లు అదిలాబాద్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:23 pm

Banjara Hills |తెలంగాణ జాగృతిలో చేరిన‌ మాజీ ఎమ్మెల్యే

Banjara Hills | తెలంగాణ జాగృతిలో చేరిన‌ మాజీ ఎమ్మెల్యే Banjara Hills

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:21 pm

Miss India |విజేతగా సాధ్వి సతీశ్

Miss India | విజేతగా సాధ్వి సతీశ్ Miss India | ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:17 pm

కవిత సమక్షంలో జాగృతిలో చేరిక..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోత్ మాజీ శాసనసభ్యుడు

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:14 pm

ఎంపీ సహకారంతో పెద్దజట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పాలమూరు ఎంపీ డీకే అరుణ సహకారంతో గ్రామాన్ని అన్ని

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:11 pm

శివనగర్ లో ఉచిత వైద్య శిబిరం

కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని

ప్రభ న్యూస్ 19 Apr 2026 3:02 pm

రేవంత్ మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ : హరీష్ రావు

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి పోవాలి.. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మాజీ సిఎం కెసిఆర్ రావాలని కోరుకుంటున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ మొనగాడు కాదు..మోసగాడని ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..క్వింటాలు మీద 7 క్వింటాళ్ల తరుగు పెట్టి గోసపెడుతున్నారని రైతులు అంటున్నారని, వడ్లు కొనడం లేదని..5 కిలోల తరుగు పెడుతున్నారని విమర్శించారు. ఢిల్లిలో ముడుపులు కట్టడం..కుర్చి కాపాడుకోవడం రేవంత్ రెడ్డి చేసేదని, రేవంత్ మాటలకు ఎక్కువ..చేతలకు తక్కువని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్ బిసి లో మృతదేహాలను బయటకు తీయని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, రైతుబంధు రూ.15 వేలు, బోనస్ ఇస్తామన్నారని ఇచ్చారా? అని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెదవి మూసుకున్నారని, రుణమాఫీపై మొదటి సంతకం అన్నారని.. దేవుళ్లపై భద్రాద్రి రాములు, యాదాద్రి లక్ష్మినర్సింహ స్వామి, మెదక్ చర్చిలపై ఒట్టు పెట్టారని మండిపడ్డారు. వంద రోజుల్లో రుణమాపీ చేస్తామని చెప్పారని, బ్యాంకుల అకౌంట్లు విలీనం కాకుండా రైతులకు రుణమాఫీలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోయారని, అసెంబ్లీలో రుణమాఫీపై నిలదీస్తే అయిందని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ వచ్చాక 4 రైతుబంధు వచ్చాయని..ఒక్క రైతుబంధే వేశారని.. రెండు విడతల రైతుబంధు ఎగ్గొట్టారని, గత యాసంగికి ఇవ్వలేదని హరీష్ రావు దుయ్యబట్టారు.

మన తెలంగాణ 19 Apr 2026 2:55 pm

Archery|నెల‌రోజులు ఆర్చరీ క్యాంప్

Archery| నెల‌రోజులు ఆర్చరీ క్యాంప్ మహబూబాబాద్ (మానుకోట), ఆంధ్ర‌ప్ర‌భ : మహబూబాబాద్ (మానుకోట)

ప్రభ న్యూస్ 19 Apr 2026 2:44 pm

ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృతి

ఇటలీలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారయీతీయలు మృత్యువాత పడ్డారు. మృతులను కోవో ప్రాంతానికి చెందిన రాజిందర్ సింగ్(48), అగ్నాడెళ్లకు చెందిన గుర్మిత్ సింగ్‌(48)గా గుర్తించారు. వైశాఖి పండుగ సందర్భంగా బెర్గామో ప్రావిన్స్‌లో ఉన్న ఓ గురుద్వారా నుంచి బయటకు వస్తుంటే ఇద్దరిపై కాల్పులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది. అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి కారులో పారిపోయిన్టుల తెలలిపింది. 

మన తెలంగాణ 19 Apr 2026 2:36 pm

సురక్షిత ప్రయాణమే లక్ష్యం…

సురక్షిత ప్రయాణమే లక్ష్యం… ఆర్టీసీ డ్రైవర్ వెంకటేష్‌కు ఘన సన్మానం కడెం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Apr 2026 2:29 pm

Koratala |ఒకేసారి రెండు సినిమాలు..

Koratala | ఒకేసారి రెండు సినిమాలు.. Koratala | దేవర 2పై అనిశ్చితి..

ప్రభ న్యూస్ 19 Apr 2026 2:23 pm

YSRCP : వైసీపీలో లోలోపల సంతోషంగా ఉందా? హ్యాపీ తాత్కాలికమేనా?

జాతీయ స్థాయిలో డీ లిమిటేషన్ బిల్లు వీగిపోవడంపై వైసీపీ ఒక రకంగా ఆనందంగా ఉంది

తెలుగు పోస్ట్ 19 Apr 2026 2:22 pm

తొర్రూరులో ఘనంగా చండీయాగం..

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణంలో ఆదివారం శ్రీ రుద్రయాగం–చండీయాగం ఘనంగా నిర్వహించారు.

ప్రభ న్యూస్ 19 Apr 2026 2:22 pm

చిత్తూరులోకి చిరుత పులులు

చిత్తూరులోకి చిరుత పులులు రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంకలవరపెడుతున్న జింకల మృతి చిత్తూరు,

ప్రభ న్యూస్ 19 Apr 2026 2:14 pm

బాదంపల్లి గోదావరి రేవులో ఘటన..

బాదంపల్లి గోదావరి రేవులో ఘటన.. పందిగోలీలు కొరికిన మూడు గేదెలకు తీవ్రగాయాలు..వన్యప్రాణుల కోసం

ప్రభ న్యూస్ 19 Apr 2026 2:07 pm

Bollywood |త‌ల్లికాబోతున్నట్లు ప్ర‌క‌టించిన‌ దీపిక ప‌దుకొనే

Bollywood | త‌ల్లికాబోతున్నట్లు ప్ర‌క‌టించిన‌ దీపిక ప‌దుకొనే Bollywood | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 19 Apr 2026 2:06 pm

Womens |అక్ష‌య తృతీయకు జోరుగా కొనుగోళ్లు

Womens | అక్ష‌య తృతీయకు జోరుగా కొనుగోళ్లు Womens | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 19 Apr 2026 1:56 pm

హయత్ నగర్ లో హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: కాలేజీలో అంటెడెన్స్ ఫీజులు కట్టలేదని యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయతనగర్ మండలంలో జరిగింది. వనస్థలిపురం శ్రీ ఇందు కాలేజీలో మ్యాదరి ప్రణీత్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.  కాలేజీలో అటెండెన్స్ విషయమై కండోనేషన్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో హయత్ నగర్ లో తన ఇంట్లో ఉరివేసుకొని ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కాలేజీ ముందు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆందోళనకు దిగారు.

మన తెలంగాణ 19 Apr 2026 1:52 pm

Road accident |ద్విచక్ర వాహనంపై వెళ్తుండ‌గా…

Road accident | ద్విచక్ర వాహనంపై వెళ్తుండ‌గా… Road accident | వి.కోట,

ప్రభ న్యూస్ 19 Apr 2026 1:50 pm

40 degrees |తెలంగాణ‌లో భానుడు భ‌గ‌భ‌గ‌

40 degrees | తెలంగాణ‌లో భానుడు భ‌గ‌భ‌గ‌ 40 degrees | ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 19 Apr 2026 1:48 pm

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన రాహుల్ గాంధీ నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్థం

జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 19తరిగొప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళల అభ్యున్నతికి, సాధికారత కోసం 33శాతం మహిళా …

జనం సాక్షి 19 Apr 2026 1:40 pm

HYD |ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు

HYD | ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 19 Apr 2026 1:29 pm

Revanth Reddy Government Plans Free MMTS Travel in Hyderabad to Ease Traffic and Pollution

The Telangana government led by Revanth Reddy is preparing to introduce free travel in MMTS trains across Hyderabad. The proposal is expected to begin on a pilot basis from Telangana Formation Day, marking a significant shift in urban transport policy. The initiative aims to make suburban rail travel more accessible while reducing the growing burden […] The post Revanth Reddy Government Plans Free MMTS Travel in Hyderabad to Ease Traffic and Pollution appeared first on Telugu360 .

తెలుగు 360 19 Apr 2026 1:25 pm