తమిళ కవి వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ తమిళకవి, గీత రచయిత వైరముత్తు రామసామికి సాహిత్య ప్రతిష్టాత్మక 2025 సంవత్సరపు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించారు. తన పాటలతో , నవలలతో రచనలతో సృజనాత్మక గాఢత, విశిష్ట, విభిన్న కవితా విలువలను చాటినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. కేంద్ర భారతీయ జ్ఠానపీఠం శనివారం ఈ 60వ జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రముఖ రచయిత ప్రతిభారాయ్ సారధ్యపు సంబంధిత కమిటీ జరిపిన సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. కమిటీలో ప్రముఖ మేదావులు, సాహితీవేత్తలు మాధవ్ కౌశిక్, దామోదర్ మౌజో, సురంజన్ దాస్, ఎ కృష్ణారావు , ప్రఫుల్లా శైలేదర్, కేశూభాయ్ దేశాయ్, జానకి సభ్యులుగా ఉన్నారు. పురస్కార విజేతకు రూ 11 లక్షల నగదు , వాగ్ధేవి కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రం బహుకరిస్తారు. 72 సంవత్సరాల వైరముత్తు పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. వైరముత్తు తమిళ సినిమా పాటలు అనేకం తెలుగులో డబ్ అయ్యాయి. రోజాలో చిన్ని చిన్ని ఆశ ఆయన మాతృక పాట నుంచి వెలువడిందే. తమిళనాడుకు జ్ఞాన్పీఠ్ దక్కడం ఇది మూడోసారి.
అడవిలో ఆయుధాలు..జనంలోకి అన్నలు!
మావోయిస్టు ఉద్యమం అంతం అయిందా? కేంద్రప్రభుత్వం పదేపదే ప్రకటించినట్టుగా ఈనెల 31తో ఆ ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టేనా? దశాబ్దాల తరబడి ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించి, రహస్య ఉద్యమంలో పాల్గొని సాయుధ పోరాటబాట పట్టిన సిపిఐ (మావోయిస్టు) పార్టీ అంతమైనట్టేనా? లేక తన పార్టీని రహస్య ఉద్యమం వైపు నుండి చట్టంబాట పట్టించిందా? అధికారికంగా మావోయిస్టు పార్టీ చట్టబద్ధంగా ఇతర రాజకీయపార్టీల మాదిరిగానే ప్రజలమధ్యకు వచ్చి చట్టానికి లోబడి తమ కార్యాచరణ కొనసాగిస్తామని ప్రకటించలేదు. పార్టీ కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించాక ఆ స్థానంలోకి వచ్చిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మాటల్లోనే కార్యదర్శిగా ఆయన నియామకం ఇంకా అధికారికం కాలేదు. అటువంటప్పుడు ఆయన చేసే విధానప్రకటన ఏదీ పార్టీ తరఫున అధికారికంగా చేసినట్టు ఎలా అవుతుంది? దేవ్జీ చెప్తున్నదానికి, అంతకుముందే లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనీ చెబుతున్నదానికి బోలెడు వ్యత్యాసం కనిపిస్తున్నది. సోను తదితరులు పెద్దసంఖ్యలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి తదితరులు తెలంగాణ డిజిపి ఎదుట లొంగిపోయారు. వారు లొంగిపోయారా లేక అరెస్ట్ అయ్యారా అనేది స్పష్టంగా లేదు. ఆయుధాలు మాత్రం అడవుల్లో దాచి వచ్చామని చెప్తున్నారు. శాంతిభద్రతలు రాష్ట్రాల సమస్య. వామపక్ష తీవ్రవాద ఉద్యమాన్ని సమర్ధించేవారు, దానిపట్ల సానుభూతి ప్రకటించేవారు.. ఇది శాంతిభద్రతల సమస్య కాదు, సామాజిక సమస్యగా చూడాలని ఎంత చెప్పినా ప్రభుత్వాలు మొదటినుండి నక్సలైట్ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగానే పరిగణిస్తూ వచ్చాయి. కాబట్టి నక్సలైట్ ఉద్యమాన్ని 2014లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి వచ్చేవరకు కూడా కేంద్రం దాన్ని శాంతిభద్రతల సమస్యగానే పరిగణించి అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యతను రాష్ట్రాలకే వదిలిపెట్టింది. 2014 తరువాత ఈ అంశాల్లోకి కేంద్రం చొరబాటు పతాకస్థాయికి చేరింది. ఆపరేషన్ కగార్తో కర్రెగుట్టలను జల్లెడపట్టి వందలాదిమందిని అంతం చేసి, వందల సంఖ్యలో లొంగుబాట్లకు దారితీసిన ఆపరేషన్ ఇది. దీని కొనసాగింపుగా, వందల సంఖ్యలో మావోయిస్టులు బయటకు రావడం లొంగుబాటా, అరెస్టా అనేది స్పష్టంగా లేదు. తిప్పిరి తిరుపతి రెండురోజుల క్రితం పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టే వారు లొంగకపోతే, అరెస్టయి ఉంటే బయట స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారు? టివి చానళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఎలా వచ్చింది? పోనీ, బెయిల్ మీద ఉన్నారా? అనేవి ఏవీ తెలియదు. తాము ఆయుధాలను అడవిలో ఉంచి వచ్చామనీ, తమను అరెస్ట్ చేసారనీ చెపుతున్నవారు ముఖ్యమంత్రితో సహా ఇతర అధికారులను, రాజకీయ నాయకులను ఎలా కలుసుకోగలుగుతున్నారు? ప్రజాసమస్యల మీద చట్టం పరిధిలో పోరాటం చెయ్యడానికి అజ్ఞాతంనుండి బయటికి వచ్చినవాళ్ళను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని చెప్పడం లేదు కానీ ఈ గందరగోళం ఎందుకు ఉందనేదే ప్రశ్న. పోలీసులు ఇది లొంగుబాటు అంటుంటే, దేవ్జీ మాత్రం తాము ఆయుధాలు అడవిలో దాచి ఉంచి ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి వెళుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఆయన ఇంటర్వ్యూలో మొత్తంగా మావోయిస్టు పార్టీ ప్రస్తుత వైఖరి ఏమిటనే దానిపై స్పష్టత లేదు. చాలా ప్రశ్నల్ని ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. దానినిబట్టి పార్టీగా ఒక సమష్టి నిర్ణయం ఉన్నట్టు కనిపించడం లేదు. ఎవరి దారినవారు బయటికి వచ్చారన్న అభిప్రాయం కలుగుతున్నది. ‘కాంగ్రెస్ పార్టీ మీద మీ అభిప్రాయం చెప్పండి’ అన్నప్పుడు ఆయన ‘ఇప్పుడు దాని గురించి మాట్లాడను’ అని ఎందుకు దాటవేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనితీరును విశ్లేషించడానికి ఆయన ఎందుకు జంకాలి? మావోయిస్టు ఉద్యమం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరిలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న తేడానైనా ఎందుకు ఆయన బహిరంగంగా చెప్పలేకపోతున్నారు? ఐదెకరాల భూమి, కోటి రూపాయల పునరావాసం కోరడం పొరపాటనే ఒక మాటతో సరిపెడితే పోతుందా? ఎవరికివారు వారి కారణాలతో బయటకు రావడం, లొంగిపోవడం, అరెస్ట్ కావడం జరిగింది కానీ మొత్తం పార్టీగా ఒక నిర్ణయం అయితే జరగలేదనిపిస్తుంది. అటువంటప్పుడు దేవ్జీ చెపుతున్నట్టు ప్రజల సమస్యల మీద చట్టం పరిధిలో పోరాటం చేయ్యడానికయినా అజ్ఞాతంలో ఉన్నప్పటి పార్టీ నిర్మాణం బయట జరగడం అంత సులభమయిన పనేనా? ఇప్పటికే వీరిని తమ పార్టీలలో చేర్చుకోవడానికి కాంగ్రెస్, సిపిఐ వంటి పార్టీలు సుముఖత వ్యక్తం చెయ్యడం, ఆహ్వానం పలకడం కూడా చూసాం. అలా ఎవరికి నచ్చిన పార్టీల్లో వారు చేరిపోతారా? ఇప్పటికే చాలా ప్రాణనష్టం జరిగింది, అటయినా, ఇటయినా. ఇంకా నష్టం జరగకుండా బయటకు వచ్చినవారి భవిష్యత్ కార్యక్రమం వారినే నిర్ణయించుకోనిస్తే సరిపోతుంది.అయితే, ఇప్పటిదాకా వీళ్ళ సిద్ధాంతాలను, కార్యాచరణను సమర్ధిస్తూ బయట పనిచేస్తున్న ప్రజాసంఘాలు, మేధావుల పరిస్థితి ఏమిటి? కేంద్రప్రభుత్వ విధానంలో భాగంగా ఇప్పటికే అర్బన్ నక్సల్స్ గా ముద్రపడి కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయినవారు, ఉన్న ఊరునూ, భార్యాపిల్లలను వదులుకుని వృద్ధాప్యంలో షరతులతో కూడిన బెయిల్ మీద ప్రవాస జీవితం వెళ్ళదీస్తున్నవారు ఉన్నారు.. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఉద్యమంపట్ల ఆకర్షితులై, అజ్ఞాతంలోకి వెళ్లి పోలీసు ఎన్కౌంటర్లలో ప్రాణాలు విడిచినవారి కుటుంబాల మాటేమిటి? అటువంటి కుటుంబాల సంఖ్య తక్కువేం ఉండదు. ప్రస్తుతం బయటకొచ్చి చట్టపరిధిలో పార్టీని నిర్మించి పనిచేసే క్రమంలో అటువంటివారిని గురించి కూడా ఆలోచించాలి. కేంద్ర బలగాలు నెలల తరబడి ‘ఆపరేషన్ కగార్’ పేరిట సాగించిన నక్సలైట్ నిర్మూలన కార్యక్రమం కారణంగా ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు, అనారోగ్య కారణాలతో అడవుల్లో ఇంకా తుపాకీ చేతబట్టి పోరాటం చేయలేని స్థితిలో మరికొందరు ఈ లొంగుబాట పట్టినట్టు కనిపిస్తున్నది. పెద్దపెద్దవాళ్ళు చనిపోయారు. కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవరావు, మరో ముఖ్యనేత హిడ్మావంటి ప్రముఖులతోసహా వందలమంది మరణించారు. కడుపులో చల్లకదలకుండా కూర్చుని సిద్ధాంతాలు వల్లేవేస్తూ అందరి గురించి తీర్పులు చెప్పేవాళ్ళను పట్టించుకోవాల్సిన పనిలేదు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉండి కష్టనష్టాలు ఎదుర్కొన్నవారికి తెలుస్తుంది ఆ పరిస్థితి.‘మరో 15 రోజులే గడువు. మేం చెప్పినట్టుగానే తీవ్రవాదాన్ని అంతం చేసాం. మహా ఉంటే ఇంకో ఏడెనిమిదిమంది ఉండి ఉంటారు లోపల’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే ఢంకా బజాయించి చెప్తున్నారు. ‘చర్చలకు వస్తాం.. మాకు సమయం ఇవ్వండి’ అని మావోయిస్టు పార్టీ అధికారికంగా విజ్ఞప్తి చేసినా సరే, కనీస మానవత్వం లేకుండా మొత్తం అందరినీ తుదముట్టించడమే ఈ సమస్యకు పరిష్కారమనేది కేంద్రప్రభుత్వ విధానమైతే, దొరికినవారిని, బయటికి రావడానికి సుముఖత వ్యక్తం చేసినవారిని చంపకుండా అరెస్టు చెయ్యడమో, లొంగదీసుకోవడమో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అధికారికంగా మావోయిస్టులను చర్చలకు పిలవాలని తమ విధానాన్ని ప్రకటించి ఉన్నాయి. గతంలో ఒకసారి చర్చల ప్రక్రియ జరిగింది కూడా. అది కూడా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఆ చర్చలు అప్పటి పౌరస్పందన వేదిక కృషి ఫలితంగా జరిగాయి. చర్చలు విఫలం అయినా, అసలు ఇరువర్గాలనూ చర్చల బల్లదాకా తెచ్చిన ఆ వేదికలోని మేధావులు చాలావరకు ఇప్పుడు లేకపోవడమే కాదు, ఆ వాతావరణం కూడా లేకపోవడం శోచనీయం. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అందుకు భిన్నంగా మొత్తంగా ఉద్యమాన్నే కూకటివేళ్లతో పెకలించివేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూడటంనుండి కొంచెం పక్కకు జరిగింది. అందుకే దొరికినవాళ్లను గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టేసి ఎన్కౌంటర్ ముద్ర వేయలేదు ఈసారి. శాంతిభద్రతల సమస్య రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి కేంద్రం జోక్యం కుదరదన్న విషయాన్ని విస్మరించి కేంద్రం చేపట్టిన ‘కగార్’ కార్యక్రమంలో కర్రెగుట్టల చుట్టూ ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణకైతే అధికారికంగా అందులో పాల్గొనే అవకాశం గానీ, దాని గురించిన అభిప్రాయం తెలిపే అవకాశం కానీ ఇవ్వలేదు. చత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఎంతమేరకు తెలుసో మనకు తెలియదు. బహుశా ఈ లొంగిపోయిన లేదా అరెస్టు అయినవారిపట్ల చట్టపరంగా ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం వదిలేస్తుందని ఆశిద్దాం. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ రెండవ తేదీ వరకు కొనసాగవచ్చునని తెలుస్తున్నది. ఈ నెల 31న లేదా ఏప్రిల్ ఒకటిన పార్లమెంట్లో ఎన్డిఎ ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పనిసరిగా తమ విజయాన్ని అత్యంత ఆర్భాటంగా ప్రకటిస్తారనడంలో సందేహం అవసరం లేదు.2026 మార్చి 31 తర్వాత ఇక ఈ దేశంలో అసమానతలు, దోపిడీ, దౌర్జన్యాలు అంతరించిపోయినట్టేనా, లేక మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించారు కాబట్టి వాటిమీద పోరాటం చేసే వాళ్ళు ఉండరా? ఇది పాలకుల ఆత్మతృప్తికి ఉపయోగపడుతుందే తప్ప దోపిడీ, పీడన ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది. అది ఏ రూపంలో అనేది అప్రస్తుతం. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు అడవిలోని ఓ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలు భద్రపరచి వెళ్తారు. అలాగే, మావోయిస్టులు కూడా ఇప్పుడు తమ ఆయుధాలను అడవిలో వదిలిపెట్టి వచ్చారు. వాళ్ళు వదిలి వచ్చిన ఆ ఆయుధాలను ఇంకెవరో అందుకుని, అజ్ఞాతంలోకి వెళ్తారు. మావోయిస్టు ఉద్యమానికి ముందుకూడా ప్రజల తిరుగుబాట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఆ ఉద్యమం లేకపోయినా ఇంకో రూపంలో తిరుగుబాట్లు ఉంటాయి. అడవులు ఖాళీ అయ్యాయి కదా అని మైదానాల మీద పడి అర్బన్ నక్సలైట్ల పేరుతో ఆలోచనలను చంపే ప్రయత్నం మానేసి ప్రభుత్వాలు మౌలిక సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తే మంచిది. సమాజంలో హింసను రూపుమాపే పేరిట హింసకు ఎవరు పాల్పడినా అది సరికాదు. Delete Edit
మాజీ ఎంఎల్ఎ ఫామ్హౌస్లో కాల్పుల కలకలం
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా, పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీమ్కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా, అక్కడ ఉన్న యువకులు పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న కొందరు యువకులు రివాల్వర్తో గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీమ్ రంగంలోకి దిగి ఫామ్ హౌస్ను చుట్టుముట్టింది. పోలీసుల సోదాల్లో ఫామ్ హౌస్లో భారీగా కొకైన్ , ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి పోలీసులు ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక ప్రజాప్రతినిధి సహా పలువురు వీఐపీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా, లోతుగా విచారిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ కావడంతో పాటు, పట్టుబడిన వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈగల్ టీమ్ , ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని పోలీస్ స్టేషన్కు తరలించి, వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టుబడిన వీఐపీలు ఎవరు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరాసరఫరా అయ్యాయి? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పార్టీలో ఉత్తరాది ఎమ్మెల్యే, ఎపికి చెందిన ఎంపితో సహా ఎనిమిది మంది విఐపిలు ఉన్నట్లు సమాచారం.
వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురు మృతి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో శనివారం ఘోర విశాదం చోటుచేసుకుంది. కొరికిశాల గ్రా మంలో వ్యవసాయ బావిలో పూడికతీస్తుండగా క్రేన్ వైర్ తెగి క్రేన్ బావిలో పడగా క్రేనువద్ద ఉన్న ముగ్గురు మృతి చెందగా ఒక్కరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవా రావు(48) బండారి అభిలాష్(14) అదే మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన సరిగోమ్ముల పైడయ్య (53) ముగ్గురు మృతి చెందగా, సుకినే మోహన్రావుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఒకే ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మోహన్రావుకు తలకు వెనుక వైపు బలమైన గాయమైంది అలాగే పక్కటెముకలు కూడా విరిగగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి 108 అంబులెన్స్లో తరలించారు. మృతి చెందిన దేవరావు, గాయపడిన మోహన్రావులకు చెందిన వ్యవసాయబావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవరావు, మోహన్రావు, పైడయ్యలు బావి పైనుండి క్రేన్ నడు పుతుండగా అభినాష్లనే పదో తరగతి విద్యార్థి అక్కడికి వెల్లగా బరువుకోసం క్రేన్ పై నిలబడగా ఒక్క సారిగా క్రేన్ వైరు తెగగా క్రేన్ బావిలో పడిన సందర్భంలో క్రేన్ తగలి ముగ్గురు మృతిచెందారు. బావిలో ఉన్న మరో ఇద్దరు క్రేన్ ఓనర్లు మహిళ, పురుషుడుకి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పదో తరగతి విద్యార్థి అభిలాష్ శనివారం జరిగిన పరీక్షకు హాజరై బావి దగ్గరు వచ్చి ప్రమాదంలో మరనించాడు. ఈ సపంఘటనతో మొగుళ్లపల్లిలో విశాదచాయలు చోటు చేసుకున్నాయి. ఈసంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.
కిమ్ బలప్రదర్శన..ఒకేసారి 10 క్షిపణుల ప్రయోగం
ప్రపంచ యుద్ధ భయాల వేళ ఉత్తర కొరియా భారీ స్థాయి బలప్రదర్శనకు దిగింది. ఒకేరోజు వరుసగా పది బాలిస్టిక్ క్షిపణులను శనివారం తూర్పు సముద్రం వైపు విజయవంతంగా ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా సైన్యం ప్రకటించింది. ఓ వైపు తమ శత్రుదేశం దక్షిణ కొరియా అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలకు దిగిన దశలో కిమ్ ఈ చర్యకు దిగారు. ఈ ప్రయోగ పరీక్షలను దేశ అధినేత కిమ్ తన 13 ఏండ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి కాన్షరెన్స్ హాల్లో కూర్చుని ఉత్సాహంగా తిలకించారు. చప్పట్లు చరిచారు. దేశ రాజధాని ప్యాంగాంగ్కు వద్ద ఓ చోటు నుంచి ఈ క్షిపణును పరీక్షించినట్లు దేశ సైనిక బలగాల సంయుక్త అధినేత తెలిపారు. ఈ పరీక్షలపై జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. సముద్రంలో పయనించిన ఈ క్షిపణులు కొన్ని తమ దేశ నిర్ణీత ఆర్థిక వాణిజ్య కేంద్రాల వెలుపలి జలాల్లో వచ్చిపడ్డాయని మండిపడ్డారు.
అరుదైన బాంబే బ్లడ్గ్రూప్తో ఆమె
అత్యంత అరుదైన బాంబే బ్లడ్గ్రూప్ను ఎయిమ్స్ గోరఖ్పూర్ వైద్యుల బృందం గుర్తించింది. తమ వద్దకు చికిత్సకు వచ్చిన ఓ గర్భిణీకి పరీక్షల దశలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఉండే ఎ బ్లడ్ గ్రూప్లో అసలు కానరాని, అతి తక్కువగా కన్పించే సబ్ గ్రూప్ రక్తాన్ని ఈ మహిళలో కనుగొన్నారు. 8 నెలల గర్భంతో ఉన్న ఈ మహిళ వైద్య పరీక్షల క్రమంలో తరచూ లోపాలు తలెత్తడం, పరీక్షల ఫలితాలలో తేడాలు ఉండటంతో వైద్య బృందానికి ఈ మహిళ శారీరక స్థితి సవాలుగా మారింది. ఈ మహిళకు డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరీక్షలు జరిపింది. మామూలుగా ఆమెలో ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు తేలింది. అయితే దీని ఉపరకం ఆమె రక్తంలో ఉందని,అందుకే అసాధారణ రీతిలో ఆమె ఆరోగ్యం ఉంటోందని గుర్తించారు. ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ను బాంబే బ్లడ్గ్రూప్గా పిలుస్తారు. ఈ మహిళ ఈ బ్లడ్గ్రూప్తో ఉందని నిర్థారణ అయింది. దీనితో ఈ మహిళకు ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్య చికిత్సలు, పరీక్షలకు సిద్ధం అయినట్లు ఎయిమ్స్ గోరఖ్పూర్ సిఇఒ , కార్యనిర్వాహక సంచాలకులు విభా దత్తా తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారిలో ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్గ్రూప్ ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.
ఒత్తిడినే బలం చేసుకున్న వ్యాపారవేత్త రోహిత్ సేథి
₹100 కోట్ల ఆస్తి మైలురాయి దాటిన వ్యాపార ప్రయాణందేశవ్యాప్తంగా ₹1000 కోట్ల విస్తరణ ప్రణాళిక ప్రకటించిన సేథి
ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్లో ఇంగ్లండ్ మహిళా టీమ్ విజేగా నిలిచింది. శనివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 20 గోల్స్ తేడాతో ఆతిథ్య భారత జట్టును ఓడించింది. కాగా, ఈ ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే మహిళా హాకీ ప్రపంచకప్ కోసం అర్హత పోటీలను నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్తో పాటు స్కాట్లాండ్, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఇంగ్లండ్ జట్లు పాల్గొన్నాయి. భారత్, ఇంగ్లండ్లు ఇప్పటికే వరల్డ్కప్ బెర్త్లను సొంతం చేసుకున్నాయి. కాగా, టైటిల్ కోసం జరిగిన పోరులో మాత్రం భారత్ ఓటమి పాలైంది. ఆరంభం నుంచే ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. భారత దాడులను సమర్థంగా తిప్పికొడుతూ అలవోక విజయం సాధించి ఛాంపియన్గా అవతరించింది.
కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 24 మంది విద్యార్థులకు గాయాలు
కరూర్: రైల్వే లెవల్ క్రాసింగ్ను దాటుతుండగా కాలేజీ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం కరూర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 50 మంది విద్యార్థులతో వెళ్తున్న కళాశాల బస్సు మానవరహిత లెవల్ క్రాసింగ్ను దాటడానికి ప్రయత్నించగా.. దిండిగల్ నుండి కరూర్ వెళ్తున్న గూడ్స్ రైలు బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. తర్వాత జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జోష్ కె తంగయ్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
వైరల్ గా మారిన రాధికా శరత్ కుమార్ వ్యాఖ్యలు
సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్న అంశంపై ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా తమిళ మూవీ తాయి కళవి సినిమా సక్సెస్ మీట్ లో రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కంటెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్ మీట్లో రాధిక మాట్లాడుతూ ‘మా సినిమా కేవలం 150 రూపాయల టికెట్ రేటుతోనే దాదాపు 60 కోట్లు వసూలు చేసింది. కానీ కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ.1500,- రూ.2000 వరకు ఉంటున్నాయి. మీరు కరెక్ట్ గా లెక్కలు వేస్తే మేమే వారికంటే పెద్ద సక్సెస్ సాధించినట్టే అవుతుంది”అని అన్నారు.
కాకతీయుల కాలపు శిధిల శివాలయం కాపాడాలి
700 ఏళ్ల నాటి శిల్పాలను సంరక్షించాలి అన్న శివనాగిరెడ్డిబొత్తలపాలెం వద్ద నందిబోడుపై పురాతన శివాలయ అవశేషాల పరిశీలన
వెయ్యేళ్ల చారిత్రక ఆనవాళ్లు కాపాడాలి
నిర్లక్ష్యంలో పొదిలి ఆలయ శిల్పాలు, శాసనాలుపరిరక్షణకు చర్యలు తీసుకోవాలి అన్న శివనాగిరెడ్డి
10వ శతాబ్ద శివాలయ పునరుద్ధరణకు గ్రామస్తుల నిర్ణయం
సన్నమూరు చారిత్రక ఆనవాళ్లు కాపాడుకోవాలి: శివనాగిరెడ్డి
మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు: కెటిఆర్
అందాల పోటీలకు, ఫుట్బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ రెడ్డి తీరు తయారైందని కెటిఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలకు అభివృద్ధికి డబ్బులు లేవు, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నారని అన్నారు. లక్షన్నర కోట్ల రూపాయలతో మూసిని అభివృద్ధి చేస్తామంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ పిపిటి ప్రజంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పిపిటి ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పిపిటి ఇచ్చారని విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి పిపిటి ఇస్తే, మూసీని ఎలా అభివృద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి బాధితుల పక్షాన తాము వివరిస్తున్నారని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా గత ప్రభుత్వం ఆరు కిలోమీటర్ల మూసిని విజయవంతంగా అభివృద్ధి చేసిందని వ్యాఖ్యానించారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసి సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్రెడ్డి పాపాన్ని కడుక్కోవాలని అన్నారు. నమామి గంగేకి ఖర్చు 42 వేల కోట్లు అని, వందల కిలోమీటర్ల నమామి గంగేకి అంత ఖర్చు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే తమ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోమని, కానీ మూసీ పేరుతో వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటామంటే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.
భట్టి విక్రమార్క కుమారుడు కోడలును ఆశీర్వదించిన ఎపి సిఎం చంద్రబాబు
ఎపి సిఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్కు విచ్చేసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు.ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు. గత మార్చి 5వ తేదీన సూర్యవిక్రమాదిత్య వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఎపికి వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే, అప్పట్లో ఉన్న అత్యవసర కార్యకలాపాలు, బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు వివాహానికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజా భవన్కు విచ్చేసి నూతన దంపతులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబ, వాకిటి శ్రీహరి లు పాల్గొన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 70 డ్రోన్లు పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద సంఖ్యలో డ్రోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సింగపూర్ నుంచి తీసుకొస్తున్న 70 డ్రోన్లను సీజ్ చేశారు. డ్రోన్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్య లో డ్రోన్లను సింగపూర్ నుంచి తీసుకు రావడం వెనక కారణం ఏంటి? అనే కోణంలో విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్ నుంచి ముగ్గురు ప్రయాణికులు తీసుకొచ్చిన 70 డ్రోన్లను కస్టమ్స్ అధికారులు పట్టుకు న్నారు. రెండు వేర్వేరు విమానాల్లో ఈ డ్రోన్లను సింగపూర్ నుంచి శంషాబాద్కు తీసుకు వచ్చారు. పట్టుకున్న డ్రోన్ల విలువ దాదాపు రూ.50లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వార్ ఎఫెక్ట్...13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు మరోవైపు, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ముదురుతుండటం వల్ల అక్కడి గగనతలాన్ని మూసివేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ అంతర్జాతీయ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. శనివారం ఒక్కరోజే మొత్తం 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనితో విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలు అస్తవ్యస్తంగా మారడంతో ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో లోక్ అదాలత్
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో లోక్ అదాలత్ కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : శీఘ్ర
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం కావడంతో స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనారసింహుడి నిత్యరాబడి : శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.34,24,189 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,78,150, బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,88,600, వీఐపీ దర్శనం ద్వారా రూ.4,35,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.5,51,500, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.78,632, ప్రసాద విక్రయం ద్వారా రూ.10,14,030, కల్యాణకట్ట ద్వారా రూ.84,000తో పాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం ద్వారా ఆలయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. యాదగిరీశుడి సేవలో గండ్ర : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.
వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ
The post వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ appeared first on Visalaandhra .
చిరుతపులి హతం.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్
చిరుతపులి హతం.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్ జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
2,256 గహ ప్రవేశాలకు సిద్దం నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి… The post ఉగాది టిడ్కో ఇళ్లు పంపిణీ appeared first on Visalaandhra .
అక్రమ ఇసుక రవాణా కేసులో ఆరుగురికి జరిమానా
అక్రమ ఇసుక రవాణా కేసులో ఆరుగురికి జరిమానా మొబైల్ కోర్టు ఆదేశాలతో కమ్యూనిటీ
అక్రమ ఇసుక రవాణాపై గుడిపాల పోలీసుల కఠిన చర్యలు
అక్రమ ఇసుక రవాణాపై గుడిపాల పోలీసుల కఠిన చర్యలు రెండు ఇసుక లారీల
నకిలీ కలుపు మందుతో వరి పంటకు నష్టం
నకిలీ కలుపు మందుతో వరి పంటకు నష్టం వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించిన
ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద విజయా టాక్సీ యూనియన్, విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్ సంయుక్తంగా చేపట్టిన సీపీఐ నిధి సమీకరణ కార్యక్రమాన్ని దోనేపూడి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో టాక్సీ యూనియన్లకు విశిష్టమైన […] The post మరింతగా ప్రజలతో మమేకం కావాలి appeared first on Visalaandhra .
మానవతా విలువలు పెంపొందించుకోవాలి
మానవతా విలువలు పెంపొందించుకోవాలి నబీ సేవలు అభినందనీయంతుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూర్,ఆంధ్రప్రభ
అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్ మన్ దంపతులను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భార్యాభర్తల హత్య అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు చెప్పారు. కాగా మృతులు మహబూబబాద్ జిల్లా, గూడూరు మండలం, దొంగచింత తాండకు చెందిన ధరావత్ సోముల(45), ధరావత్ మంగమ్మ (40) గా పోలీసులు గుర్తించారు. మృతుడు గత మూడున్నర సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి అని బిల్డర్ దగ్గర పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు పెళ్లికాగా, చిన్న కూతురు సానియా పదవ తరగతి పరీక్ష రాస్తోంది.భార్యాభర్తలు హత్యకు గురి అవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్యూస్ టీం, డాగ్ స్క్వాడ్ ల సహాయంతో కీలక ఆధారాలను సేకరించారు. జంట హత్యలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని రామచంద్రాపురం ఏసిపి శ్రీనివాస్ కుమార్ చెప్పారు.
ముందు ఆ పాపాన్ని కడుక్కోండి.. కాంగ్రెస్ పై కెటిఆర్ ఫైర్
కాంగ్రెస్ హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ముందు ఆ పాపాన్ని కడుక్కోవాలని.. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకుని కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మూసీ ప్రాజెక్టుపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. 2016–17 సంవత్సరంలో రూ.16,634 కోట్లతో మూసీ సుందరీకరణ చేసేందుకు, ఆనాడు కేసీఆర్ హయాంలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కానీ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. నిన్న అధికారులు మూసీ సుందరీకరణ వెబ్ సైట్లో కొన్ని ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు కూడా మా ప్రభుత్వంలో చేసిన మూసీ సుందరీకరణ ఫోటోలే. నేను రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తా తప్పేంటి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా అంటున్నాడు.. మరి మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం చేస్తున్నాడా లేక భూముల కోసం చేస్తున్నాడు అనుకోవాలా?. మూసీ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి. మూసీని ప్రక్షాళణ చేసేందుకు బీఆర్ఎస్ మంచి ప్రణాళికలు సిద్ధం చేసింది. మంచి రేవుల నుంచి ఘట్కేసర్ వరకు 57కి.మీ. పరిధిలో మూసీ రూపం మార్చాలనుకున్నాం. మూసీపై 15 బ్రిడ్జ్లు నిర్మించాలని ప్లాన్ చేశాం. కానీ, ఈయన లాగా డబ్బా కొట్టుకోలేదు. చేయంది చేసినట్లు.. ఉన్నది లేనట్లు చెప్పుకోలేదు అని అన్నారు.
మృతుల కుటుంబాలకు అందుకుంటాం మొగుళ్ల పల్లి మృతుల కుటుంబాలను పరామర్శ భూపాలపల్లి ఎమ్మెల్యే
Dhurandhar 3: Forceful or Planned?
Dhurandhar happens to be a milestone in Indian cinema and the film surpassed the lifetime numbers of several Indian blockbusters. The second part titled Dhurandhar: The Revenge is all set for release on March 19th. The advance sales are extraordinary in all the languages and territories. Bollywood media speculates that Jio Studios, the producers of […] The post Dhurandhar 3: Forceful or Planned? appeared first on Telugu360 .
బంగారం, వెండి ధరలు శనివారంనాడు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదారాబాద్ బులియన్ మారెక్ట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,660కు చేరుకుంది. శుక్రవారంనాటి ధరతో పోల్చుకుంటే రూ.1030 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 పలుకుతోంది. ఇది రూ.950 మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా శనివారం తగ్గుదల నమోదు చేశాయి. వెండి కిలోకు రూ.4,900 వేల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.75 లక్షలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతు వ్యక్తి మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతు వ్యక్తి మృతి ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రైవేట్
వీసాల మోసం కేసులో 11మంది భారతీయుల అరెస్ట్
అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న 11 మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మసాచుసెట్స్, కెంటకీ, ఒహియో రాష్ట్రాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాము వివిధ రకాల నేరాల బాధితులమని, వాళ్లకు కావాల్సిన వివిధ రకాల షాపుల్లో దొంగతనాల బారినపడ్డట్టు నకిలీలు సృష్టించి గ్రీన్ కార్డులు పొందేందుకు పథక రచన చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ విధంగా మూడు రాష్ట్రాల నుంచి జితేంద్ర కుమార్ పటేల్, మహేష్ కుమార్ పటేల్, సంజయ్ కుమార్ పటేల్, దీపికాబెన్ పటేల్, రమేష్భాయి పటేల్, అమితాబహెన్ పటేల్, రోనక్ కుమార్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మింకేష్ పటేల్, సోనాల్ పటేల్, మితుల్ పటేల అనే వ్యక్తులను వీసా ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో దీపికా పటేల్ను దేశం నుంచి పంపించివేసినట్లు తెలిపారు. మిగతా వారిని బోస్టన్లోని వివిధ కోర్టుల్లో హాజరుపరిచి వదిలేసినట్లు వివరించారు. అయితే గ్రీన్కార్డులు పొందేందుకు వీరంతా దొంగతనం డ్రామాలు ఆడినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీల బాధితులమని యూవీసా పొందేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. హింసాయుత నేరాల్లో బాధితులకు అక్కడే ఉండేందుకు వలసదారులకు అమెరికా ప్రభుత్వం యూవీసా వెసులుబాటు కల్పిస్తుంది. దీని ఆధారంగా ఐదు పదేళ్లలో గ్రీన్ కార్డు పొందే మార్గం కూడా ఉంది. చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని పలువురు గ్రీన్ కార్డు పొందేందుకు ఇలాంటి నకిలీ నేరాలను సృష్టించుకుంటున్నారని విచారణలో అధికారులు తేల్చారు.
పెద్ద కాపర్తి పాఠశాల ప్రహరీ గోడని ఢీకొన్న వాహనం
పెద్ద కాపర్తి పాఠశాల ప్రహరీ గోడని ఢీకొన్న వాహనం పాఠశాల్లో విద్యార్థులు లేకపోవడంతో
రేపు ఎల్బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న సిఎం రేవంత్
ఎల్బి స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దావత్ ఎ ఇఫ్తార్ 15వ తేదీ నిర్వహించనున్నారు. దీని దృష్టా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు. ఏ.ఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుండి బి.జె.ఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏ ఆర్ పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. బషీర్బాగ్ నుండి ఏ.ఆర్ పెట్రోల్ పంప్ వైపు వచ్చే వాహనాలను బి.జె.ఆర్ విగ్రహం వద్ద ఎస్బిఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. సుజాత స్కూల్ లేన్ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు. రద్దీగా ఉండే జంక్షన్లు ... ట్రాఫిక్ ఆంక్షల వల్ల లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్బాగ్, బి.జె.ఆర్ విగ్రహం సర్కిల్, ఎస్.బి.ఐ గన్ ఫౌండ్రీ, ఏ.ఆర్. పెట్రోల్ పంప్, కె.ఎల్.కె బిల్డింగ్ మరియు లిబర్టీ. ఆర్టీసీ బస్సులు... రవీంద్ర భారతి నుండి బి.జె.ఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ట్రాఫిక్ను బట్టి ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు.
పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలి
పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలి టిఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
భర్త మీద కోపంతో తన పిల్లలు భర్తకు కూడా దక్కరాదని తల్లి తన ఇద్దరు కొడుకులతో గార్గేయపురం చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎపిలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలీవిధంగా ఉన్నాయి. అలంపూర్కి చెందిన రాజుతో గార్గేయపురానికి చెందిన రాజేశ్వరి(36)కి కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి అబ్రహం (6) సుకుమార్(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలం సంసారం సజావుగానే సాగింది. ఇటీవల భార్యాభర్తల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల భర్త తో ఘర్షణపడ్డ రాజేశ్వరి పుట్టిన ఊరు గార్గేయపురంలో కొన్ని రోజులుగా ఉంటుంది. ఏమైందో ఏమో గానీ శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి చెరువులో దూకేసింది. శనివారం ఉదయం ముగ్గరు మృతదేహాలు బయట పడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉగాది రోజున సాంతింటిలోకి సగర్వంగా!
ఉగాది రోజున సాంతింటిలోకి సగర్వంగా! గృహ ప్రవేశాలకు సిద్ధంగా జక్కంపూడిలో 2,256 టిడ్కో
రేపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న స్వర్ణ
ఇటీవల పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ 15 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులూ పాల్గొంటారు.
పంటల ఉత్పత్తి పై నైపుణ్యం, అభివృద్ధి, మద్దతు సేవలపై శిక్షణ
పంటల ఉత్పత్తి పై నైపుణ్యం, అభివృద్ధి, మద్దతు సేవలపై శిక్షణ పరకాల, ఆంధ్రప్రభ
మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా విగ్రహావిష్కరణ…
మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా విగ్రహావిష్కరణ… భవానిపురం, ఆంధ్రప్రభ : నగరాల సామాజికవర్గంలో
సిద్ధివినాయకుడి సేవలో గంభీర్, సూర్యకుమార్ యాదవ్ #GautamGambhir#SuryakumarYadav#JayShah #TeamIndia
విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు….
విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు…. కార్పొరేటర్ నేలీ బండ్ల బాల స్వామి… విజయవాడ
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఐపీఎస్ నెహ్ర మనీషా ట్రేని
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఐపీఎస్ నెహ్ర మనీషా ట్రేని స్టేషన్ ఘన్పూర్,
తప్పిపోయిన ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యం…
తప్పిపోయిన ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యం… కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి
అందెశ్రీ ఉగాది పురస్కారం అందుకున్న రవీందర్
అందెశ్రీ ఉగాది పురస్కారం అందుకున్న రవీందర్ చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జడల్
కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి
ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం... జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావువిశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్ 143వ వర్ధంతిని పుష్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడలోని హనుమాన్పేటలో గల మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాలకు ఆయన […] The post కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి appeared first on Visalaandhra .
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ వచ్చేసింది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత పవన్ నుంచి మాస్ ఎంటర్ టైన్మెంట్ రాబోతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.
ఎల్.పీ.జీ. గ్యాస్ బుకింగ్ స్కామ్.. జాగ్రత్తగా ఉండండి!!| LPG Gas Booking Scam Alert ⚠️
కొరియన్ పర్యాటకుడికి చేదు అనుభవం.. స్పందించిన టీటీఈ #IndianRailways#TTE#TrainTravel#Tourist
బిజెపి ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు: కూనంనేని సాంబశివరావు
దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధాన వైఫల్యాలే కారణమని కూనంనేని ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ తమపై దాడి చేయకుండా ముందస్తు దాడి చేస్తున్నామనే పొంతనలేని సాకుతో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వాన్ని మార్చాలని కుటిల నీతితో అమెరికా ఆ దేశంపై ఫిబ్రవరి 28న ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపించాయని, పిల్లలు చదుకునే పాఠశాలలపై క్షిపణి దాడుల చేసి 165 మంది చదువుకునే అమ్మాయిలు, టీచర్లను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రమయ్యిందని, బ్యారెల్ ధర రూ.1 00 డాలర్లు దాటిందన్నారు. ఫలితంగా భారతదేశంలో గృహ అవసరాల గ్యాస్ సిలిందర్ ధర రూ. 60 పెరిగిందన్నారు. మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని బైట పరిస్థితి చూస్తే తేలిపోతోందన్నారు. గ్యాస్ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హోటల్స్ ముతపడుతున్నాయని కూనంనేని తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడమే కారణమని ఆయనన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈ నెల 16న తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని సిపిఐ ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించాలని, భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.
అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత….
అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత…. కోడూరు – ఆంధ్రప్రభ :
కమ్మర్ పల్లి, సిరికొండ,ఇందల్వాయి రేంజ్ ల సిబ్బందికి అవగాహన
కమ్మర్ పల్లి, సిరికొండ,ఇందల్వాయి రేంజ్ ల సిబ్బందికి అవగాహన కమ్మర్ పల్లి, ఆంధ్ర
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..! కోడూరు – ఆంధ్రప్రభ : బ్యాంక్
BC ACT READY : కూటమి బ్రహ్మాస్త్రం Andhra Prabha News
BC ACT READY : కూటమి బ్రహ్మాస్త్రం Andhra Prabha News (
మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా రూ.93 కోట్లు ఆఫర్
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారన్న సమాచారం చెప్పే వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.93కోట్లు )ఇస్తామని అమెరికా భారీ ఆఫర్ ప్రకటించింది. ఈమేరకు యూఎస్ విదేశాంగశాఖ ఎక్స్లో ప్రకటన చేసింది. సుప్రీం నేత ఖమేనీతోపాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని సహా పలువురి పేర్లను యూఎస్ విదేశాంగశాఖ ప్రస్తావించింది. వీరు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించింది. వీరికి సంబంధించిన సమాచారం ఉంటే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లేదా టోర్ నెట్వర్క్ ద్వారా తెలియజేయాలని పేర్కొంది. ఇందుకు తగిన బహుమతి ఇస్తామని, సమాచారం అందించినవారికి పునరావాసం కల్పిస్తామని వెల్లడించింది. అమెరికాఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తరువాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఎన్నికయ్యారు. అయితే మొజ్తాబా ఇప్పటివరకు ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత లేదు.
Pawan’s UBS Trailer: Blockbuster Spectacle
The buzz around Power Star Pawan Kalyan’s upcoming entertainer Ustaad Bhagat Singh is growing stronger, with massive response to the songs trailer tease and posters. The team has now unveiled the film’s theatrical trailer. It’s a cleverly cut trailer that makes a strong impact without revealing much about the film’s storyline. The focus is primarily […] The post Pawan’s UBS Trailer: Blockbuster Spectacle appeared first on Telugu360 .
IPLలో తన ఫేవరెట్ టీం హైదరాబాద్ సన్రైజర్స్ అని చెప్పిన మీనాక్షీ చౌదరి #MeenakshiChaudhary
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని రాంపూర్ వద్ద 765D జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న తరుణంలో నర్సాపూర్ నుంచి బైక్ పై మెదక్ వైపు వెళ్తున్న వారిని మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (51) తో పాటు కొడుకు రిశివర్ధన్ గౌడ్ (13), అల్లుడు బొగడ సాయ గౌడ్ (32) అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికుల సమాచారం మేరకు కొల్చారం పోలీసులు ఘటన స్టలికి చేరికొని మృతదేహాలను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆందోళన వద్దు.. వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు: కేంద్రం
వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం LPG సరఫరాలో ఎలాంట ఇబ్బందులు లేవని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్ఫ్ లో యుద్ధం కారణంగా భారత్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, హిందూస్థాన్, ఇండియన్ ఆయిల్ సంస్థలు తాత్కాలికంగా బుకింగ్ ను నిలిపేశాయి. ఈ క్రమంలో ప్రజల్లో మరింత ఆందోళనలు నెలకొన్నాయి. దీనిపై పెట్రోలియం శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ సరఫరా గొలుసు దెబ్బతింటున్నందున ప్రజలలో భయాందోళనలు బాగా పెరుగుతున్నాయని.. అందుకే, చాలామంది అవసరం లేకున్నా LPG బుకింగ్ చేస్తున్నారని తెలిపారు. 92,700 మెట్రిక్ టన్నులతో రెండు LPG నౌకలు ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని.. మార్చి 16-17వరకు భారత్ కు చేరుకుంటాయని వెల్లడించారు.
రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి…
రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి… చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక
వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ..
వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు..కలెక్టరేట్ లో
కోమటి జయరామ్కు ఎమ్మెల్యే అభినందనలు…
కోమటి జయరామ్కు ఎమ్మెల్యే అభినందనలు… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రవాస భారతీయుడు కోమటి
బావిలో పూడిక తీయడంలో ఘోరం మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
Varanasi Business Deals yet to be Closed
Superstar Mahesh Babu’s upcoming film Varanasi is directed by SS Rajamouli and the shoot is almost half done. The Georgia schedule has been wrapped up and the new schedule will commence in Hyderabad from Monday. There are a lot of speculations about the film’s theatrical, non-theatrical deals and the business collaborations. We have an update […] The post Varanasi Business Deals yet to be Closed appeared first on Telugu360 .
Varanasi Business Deals yet to be Disclosed
Superstar Mahesh Babu’s upcoming film Varanasi is directed by SS Rajamouli and the shoot is almost half done. The Georgia schedule has been wrapped up and the new schedule will commence in Hyderabad from Monday. There are a lot of speculations about the film’s theatrical, non-theatrical deals and the business collaborations. We have an update […] The post Varanasi Business Deals yet to be Disclosed appeared first on Telugu360 .
Jeevan Reddy : గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయిన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు
250 branches |విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి…
250 branches | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి… విజయవాడ పార్లమెంటు సభ్యులు
డీఆర్ఐ దాడులతో ఉలికిపాటు… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పారిశ్రామికవాడలో అక్రమ మాదకద్రవ్య
Nagababu : వైసీపీపై నాగబాబు సంచలన కామెంట్స్
వైసీపీపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు.
వ్యాధి నివారణ టీకాలు వేయించాలి..
వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; పాడి రైతులు
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు..
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు.. గంపలగూడెం, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ 13వ
No OTP, No LPG Cylinder: AP Govt Issues Strict Rule Amid Supply Concerns
Andhra Pradesh Minister Payyavula Keshav said the Centre is closely monitoring the LPG supply chain amid growing concerns over disruptions caused by tensions in the Middle East. The minister held a review meeting with officials on Saturday to assess the situation and discuss measures to prevent shortages. He said the state government is also exploring […] The post No OTP, No LPG Cylinder: AP Govt Issues Strict Rule Amid Supply Concerns appeared first on Telugu360 .
ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్ల పంపిణీ…
ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్ల పంపిణీ… మతసామరస్యానికి కట్టుబడి ఉండాలని పిలుపు విజయవాడ,
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ ఏమన్నారంటే?
టీవీకే చీఫ్ విజయ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు
వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖిలావరంగల్ మండలం మామునూరు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మత్తులో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను శ్రీపతి వంశీ, శ్రీపతి రాజుగా గుర్తించారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Chandrababu : గ్యాస్ సరఫరా పై చంద్రబాబు కీలక ప్రకటన
మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
బండి సంజయ్ యాత్రలో తేనటీగల దాడి..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ యాత్రపై తేనటీగలు దాడి చేశాయి. శనివారం ఉదయం కరీంనగర్ నుండి కొండగట్టుకు బండి సంజయ్.. సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి భారీగా బిజెపి శ్రేణులతో కలిసి సంజయ్ యాత్రను ప్రారంభించారు. అయితే, రామడుగు మండలంలోని వెదిరకు చేరుకున్న సంజయ్ పాదయాత్రపై తేనటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొండగట్టుకు బండి సంజయ్ యాత్ర కొనసాగుతోంది. కాగా, అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి కైవసమైతే కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని మొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే తాను యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అంజన్న క్షేత్రాభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని ఆయన చెప్పారు.
Breaking : మెదక్ జిల్లాలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురి మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
దళిత మహిళా మున్సిపల్ వైస్ చైర్మన్కు అవమానం
దళిత మహిళా మున్సిపల్ వైస్ చైర్మన్కు అవమానం పరకాల, ఆంధ్రప్రభ : పరకాల
పంటల సాగులో మెలకువలు పాటించాలి
పంటల సాగులో మెలకువలు పాటించాలి జైనూర్, ఆంధ్రప్రభ : పంటల సాగులో రైతులు
Cricket |భారత్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..
Cricket | భారత్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. 20 జట్లతో ఉత్సాహంగా
తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుడిమెత తిరుపతి
తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుడిమెత తిరుపతి దండేపల్లి,ఆంధ్రప్రభ : ములుగు
గ్యాస్ ఏజెన్సీ పరిశీలించిన తహసీల్దార్, ఎస్సై
మామడ, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో గ్యాస్ కొరత గురించి వస్తున్న వార్తలను
విషాదం.. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి.. ఉరేసుకున్న తల్లి
తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమిన తల్లి.. తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సత్యవాణి, మురళి వేణు దంపతులు తమ కుటుంబంతో కలిసి పెద్దమ్మనగర్ లో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు(5), కూతురు(2) ఉన్నారు. మురళి తన తండ్రిని డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లిన అనంతరం సత్యవతి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఈ ఘటనలో తల్లితోపాటు కుమారుడు చనిపోగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై ఆరా తీయగా.. కుటుంబ కలహాల కారణంగానే సత్యవతి ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
ఏకలవ్య పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
దమ్మపేట, ఆంధ్రప్రభ ; దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్
చల్లపల్లిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం…
చల్లపల్లిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం… చల్లపల్లి, ఆంద్రప్రభ : జనసేన పార్టీ
ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ
ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ జఫర్ గడ్, ఆంధ్రప్రభ :
పేదల కష్టాన్ని చూసి చలించే నేత పవన్ కళ్యాణ్
పేదల కష్టాన్ని చూసి చలించే నేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డ, ఆంధ్రప్రభ :
పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
మునుగోడు, ఆంధ్రప్రభ : 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్

22 C