POLICE | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని
Telangana : తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఆశలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు
RSS |పరివర్తన కోసం.. RSS | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వ్యక్తి
ELECTION | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగనుండడంతో
Telangana |శ్మశానవాటిక పనులు ప్రారంభం
Telangana |శ్మశానవాటిక పనులు ప్రారంభం Telangana | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
అండర్–14 కరాటే పోటీలలో ప్రతిభ KARATE | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ
Mines | 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలు
రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర Mines| ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు
Fact Check: Viral Video Claiming Aishwarya Rai Confronted PM Modi at Sai Baba Event Is a Deepfake
The viral video shows Aishwarya Rai questioning PM Modi about losing jets to Pakistan, Rafale aircraft, S-400 systems, and soldiers.
MONEY | ఆదర్శం.. ఆటో డ్రైవర్.. MONEY | నర్సింహులపేట, ఆంధ్రప్రభ :
POCSO | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో 17 ఏళ్ల బాలిక
RICE |రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
RICE | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని
Male Balappa |బీఆర్ఎస్ నాయకుడు మృతి
Male Balappa | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల
ఇవాళ కూతురు పెళ్లి.... రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
వికారాబాద్: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగుతున్నాయి. కన్న కూతురుకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సగెంకుర్దు గ్రామంలో అనంతప్ప అనే వ్యక్తి తన కూతురు అవంతి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. దగ్గర బంధువుతో ఆదివారం పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి పనులలో భాగంగా అనంతప్ప యాలాల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా అతడి బైక్ స్కిడ్ అయ్యింది. వెంటనే అతడిని తాండూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్సనిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో మృతదేహాన్ని సొంతూరు తీసుకొచ్చారు. పెళ్లి కోసం వేసిన టెంట్ కిందనే తండ్రి మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సగెంకుర్ధు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Dharmayuddham|ధర్మయుద్ధ సభకు భారీ బందోబస్తు
Dharmayuddham | ఉట్నూర్, ఆంధ్రప్రభ : లంబాడీలను ఎస్టీ జాబితా తొలగించాలని ప్రధాన
రాష్ట్రంలో తొలి సైనిక్ స్కూల్! #telugupost #sainikschool #latestnews #cmrevanthreddy
POLITICS |అదే జరిగితే.. తరిమికొడతాం..
POLITICS | నల్గొండ, ఆంధ్ర ప్రభ : గాంధీ భవనం చుట్టూ తిరిగితే
SMRUTI MANDANA |వాళ్లిద్దరూ ఒక్కటవుతున్నారు..
సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో స్మృతి మంధాన పెళ్లినేడు స్మృతి స్వస్థలం సాంగ్లీలో
TELANGANA |ఇంటింటికి వెళ్లి.. ప్రభుత్వంపై ఆశీర్వాదం ఉండాలిప్రతి మహిళకు బొట్టు పెట్టి చీరలు
Vijayawada Politics Heat Up as Kesineni Nani Plans a Strong Comeback
Vijayawada’s political landscape is witnessing a dramatic turn as former MP Kesineni Nani appears set for a major comeback. After months of political silence, Nani has begun holding meetings with supporters and close associates, signalling renewed activity. His re-entry is gaining attention, especially as his brother Kesineni Chinni currently represents Vijayawada as a TDP MP. […] The post Vijayawada Politics Heat Up as Kesineni Nani Plans a Strong Comeback appeared first on Telugu360 .
గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు సఫారీలు 114 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 323 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సెనురన్ ముతుసామీ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఆరో వికెట్ పై ముత్తుసామీ, వెరెన్నె 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామీ(62), కైల్ వెరెన్నె(39) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచి సౌతాఫ్రికా ముందంజలో ఉంది.
WORLD CUP |మళ్లీ దాయాదుల పోరు
2026 టీ20 వరల్డ్ కప్లో ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్ WORLD CUP
Chandrababu Naidu Orders Officials to Make All AP Roads Pothole-Free by December-End
Chief Minister N. Chandrababu Naidu has issued clear instructions that every road in Andhra Pradesh must be pothole-free by the end of December. He held a detailed teleconference with Roads and Buildings Minister B.C. Janardhan Reddy, Special Chief Secretary M.T. Krishna Babu and senior officials to review the state’s road conditions and ongoing repair work. […] The post Chandrababu Naidu Orders Officials to Make All AP Roads Pothole-Free by December-End appeared first on Telugu360 .
Sathya Sai |కనులు పండుగగా సత్యసాయి జయంతి ఉత్సవాలు
సత్యసాయి 100 వ జయంతి Sathya Sai | చెన్నూర్ ఆంధ్రప్రభ :
ఈత కొడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థి మృ*తి #telugupost #latestnews #viralnews #heartattack
కుక్కకు బేబీ షవర్..#dog #telugupost #latestnews #babyshower #viralvideo
BEACH | పుణ్య స్నానాలు BEACH | కోడూరు, ఆంధ్రప్రభ : కృష్ణా
Congress |రెండోసారి.. ప్రశాంత్ రెడ్డి..
Congress | రెండోసారి.. ప్రశాంత్ రెడ్డి.. Congress, నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ :
మహిళలకు చీరలు పంచిన పొన్నం ప్రభాకర్
కోహెడ: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు బొట్టు పెట్టీ చీర (సారే) అందించడం జరిగింది. 22 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయానికి 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కోహెడ మార్కెట్ యార్డును పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గతంలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేనందున ఇవాళ చైర్మన్ నిర్మల జయరాజ్ ,కమిటీ సభ్యులను సత్కరించారు. మార్కెట్ కమిటీ కి కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో డబ్బుల జమలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించడం జరిగింది.
ఈవెంట్ కు సంబంధించి ఐశ్వర్య రాయ్ పూర్తి ప్రసంగం కోసం మేము Googleలో వెతికాం
మరో మహోద్యమానికి బడుగులు సిద్ధం కావాలి!
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో బడుగు బలహీన వర్గాలలో బానిసత్వ విముకై పోరాటం మొదలైనది. ఇదే తెలంగాణలో బిసిల రిజర్వేషన్ ఉద్యమం. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఎవరమెంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం బలపడుతున్నది. పలు సభల్లో, వేదికల దగ్గర 90 శాతం ఉన్న బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలు తమకు రావాల్సిన వాటాను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో అమలు కావాలని కోరుకుంటున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కొంత మేరకు సమానత్వానికి పెద్దపీట వేశారు. అయినప్పటికీ ఇంకా వివక్ష ఛాయలు కొనసాగుతున్నాయి. అన్నివర్గాలకు జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బిసి రిజర్వేషన్లను 42 శాతం పెంపుతో సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. బిసి రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్కు పంపారు. ఇప్పుడది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడంతో చట్టరూపం దాల్చలేకపోయింది. తక్షణం బిసి రిజర్వేషన్ 42 శాతం అమలతో స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించడానికి జిఒ 9 తీసుకొచ్చారు. ఇదీ న్యాయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అటు చట్టం, ఇటు జిఒ న్యాయస్థానాల్లో నిలవడం కష్టంగా మారింది. ఆ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారమని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. మరోవైపు బిసి సంఘాల సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల పోరుకు సిద్ధమవుతోంది. పాత పద్ధతిలో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్ 50 శాతానికి పరిమితం చేస్తూ ఇటీవల జిఒ 46 తీసుకొచ్చారు. ఈ క్రమంలో తొమ్మిదో షెడ్యూల్లో బిసి రిజర్వేషన్ చేర్చాలని నడుస్తున్న బిసి ఉద్యమంపై ప్రధాన బాధ్యత ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. ఎలాంటి పరిమితి విధించలేదు. సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో ప్రతిభకు అవకాశం కల్పించాలని అసంబద్ధమైన 50 శాతం పరిమితిని విధించింది. ఇప్పుడు దేశంలో తమిళనాడు తరహాలో పలు రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్లను పెంచాలని భావిస్తున్నాయి. కోర్టు విధించిన 50 శాతం పరిమితితో అమలుకు నోచుకోవడం లేదు. 2023 లో బీహర్ ప్రభుత్వం 65 శాతం రిజర్వేషన్ పెంపును పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బిసి రిజర్వేషన్ పెంపుకుసైతం కోర్టు చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో బిసి రిజర్వేషన్లను తమిళనాడు మాదిరిగా 9 వ షెడ్యూల్లో చేర్చాలని బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఇందులో బిసి, ఎస్సి, ఎస్టి జెఎసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఎపి రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వీరి నాయకత్వంలోనే బిసి రిజర్వేషన్ల ఉద్యమం విజయవంతం కానుంది. వీరితోపాటు పలువురు బిసి, ఇతర కులసంఘ నాయకులు, మేధావులు కలిసి వస్తున్నారు. ఈ సమితి రాజకీయాలకతీతంగా నికార్సయిన నాయకత్వంతో బిసి కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంది. ఇది బిసి రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. కావున ప్రభుత్వం సైతం బిసి రిజర్వేషన్లను రాజకీయ కోణం గా చూడకుండా సబ్బండవర్గాల అభివృద్ధిగా భావించాలి. అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కోర్టులు సైతం ప్రతిభ పేరుతో అవకాశాలను లాక్ చేయడం సరికాదు. కాలమాన పరిస్థితుల కనుగుణంగా సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని పునస్సమీక్షించాలి. అభివృద్ధి జరగాలంటే ఉచిత పథకాలకు బదులు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆర్థికవేత్తల భావన. ఇందుకై రిజర్వేషన్స్ పంపు దోహదపడనుంది. అధికార వికేంద్రీకరణకు కేంద్ర బిందువు అయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి జరగాలని భారత రాజ్యాంగం కోరుకుంటుంది. ఈ అధికార వికేంద్రీకరణలో అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం లభించాలంటే 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు కావాలి. లేదంటే ధనస్వామ్య ప్రజాస్వామ్యంలో జనరల్ స్థానంలో ఒక నిరుపేద బిడ్డ గెలిచే అవకాశం లేదు. బిసి రిజర్వేషన్ల కోసం ఉద్యమించకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బలమైన బిసి ఉద్యమం నడుస్తుంది. ఇటీవల కామారెడ్డిలో బిసి ఆక్రోష సభ నిర్వహించారు. ఈ విధంగా రిజర్వేషన్ల సాధన సమితి వైవిధ్యమైన పోరాటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ఈ ఉద్యమానికి బిసిలు మరింత తోడై రావాలి. లేదంటే బిసిలు మరోసారి మోసపోతారు. కొందరు బిసి నాయకులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ బిసిల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇది సరికాదు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా సీటు గెలవగానే వెనుకబడిన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చే బిసి రిజర్వేషన్లపై పరిష్కారాన్ని పక్కన పెట్టారు. ఇది ఎటు తేలికముందే రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నది. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ సాధ్యం కానీ బిల్లులు, ప్రకటనలు చేస్తున్నారా అనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు ఏమాత్రం నిబద్ధత లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఓటు బ్యాంకు కోసం బిసి, ఎస్సి, ఎస్టి లను వాడుకుంటున్నారు. దేశం, రాష్ట్రాలు కులగణన రిజర్వేషన్ల పెంపు అనేవి సామాజిక న్యాయం, వనరుల సమాన పంపిణీకి విధాన రూపకల్పనగా చెప్పవచ్చు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తూ వనరుల పునః పంపిణీ జరగడమే. ఈ దేశ నిర్మాణంలో తన రక్తమాంసాలు ధార పోసిన ఈ వర్గాలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయం. దీనికి రిజర్వేషన్ 42 శాతం రిజర్వేషన్లు ప్రాతిపదిక కానున్నాయి. కానీ ప్రభుత్వం స్థానిక పోరుకు వెళ్లడమంటే మరొకసారి సబ్బండవర్గాలను మోసం చేయడమే. దీనిపై బిసి, ఎస్సి, ఎస్టిలు ఏకమై మరో మండల కమిషన్ ఉద్యమంలా పోరాటం చేస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. - సంపతిరమేష్ మహరాజ్ 7989578428
Mopidevi |స్వామివారి దర్శనం చేసుకుంటే..
Mopidevi | స్వామివారి దర్శనం చేసుకుంటే.. Mopidevi, మోపిదేవి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా
మూవీ రూల్జ్లో కొత్త సినిమాలు ప్రత్యక్షం
హైదరాబాద్: పైరసీ వెబ్సైట్ల దందా ఆన్లైన్లో ఆగడంలేదు. మూవీ రూల్జ్లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. శుక్రవారం రిలీజైన అన్ని మూవీలను ముఠా పైరసీ చేసింది. ఐ బొమ్మ, బప్పం బ్లాక్ అయినా మూవీ పైరసీ ఆగడంలేదు. థియేటర్లో కెమెరాలతో రికార్డుచేసి నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. మూవీ రూల్జ్ వెబ్సైట్ ముఠా తీరు మాత్రం మార్చుకోవడంలేదు. ఇప్పటికే ఐ బొమ్మ రవి పైరసీపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఐ-బొమ్మ రవిని నాలుగో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.. హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా విచారించిన కూడా ఐ-బొమ్మ రవి నోరు మెదపడంలేదు . మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీల ఫోకస్ పెట్టాయి. ప్రముఖ ఓటిటిల ఫిర్యాదులతో కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది.
BANK | కల నెరవేరింది.. మాజీ సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి
CONGRESS |కోటి మహిళలకు కోటి చీరలు పంపిణీ
పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి.. CONGRESS | బిక్కనూర్ ఆంధ్ర ప్రభ
TG |అలా చేస్తే సహించేది లేదు..
TG | అలా చేస్తే సహించేది లేదు.. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్
నాగచైతన్య సినిమా టైటిల్ పేరు ఇదే... మహేష్ బాబు పోస్టు.. జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ఎన్24 పేరుతో మూవీ టైటిల్ ను విడుదల చేశారు. నాగ చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 'వృషకర్మ' సినిమా పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో హీరో మహేష్ బాబు పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు పోస్టు చేయడంతో అక్కినేని అభిమానుల సంతోషానికి అవధులులేకుండా పోయాయి.
AP | పేదవారి కోసం.. AP, ఆకివీడు, ఆంధ్రప్రభ : ఏలూరు (Eluru)
SPORTS |ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ*
SPORTS | ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : హనుమకొండలో వరంగల్ ట్రై సిటీ
సత్యసాయి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి
శ్రీసత్యసాయి సేవా సమాజము ఆర్ బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి : “ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సేవ భావన సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, యువత ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభ్యున్నతిలో తమ వంతు పాత్ర నిర్వర్తించాలని సూచించారు.”రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్లోని శ్రీసత్యసాయిబాబా మందిరం లో ఆదివారం ఉదయం జరిగిన సంప్రదాయ పూజా కార్యక్రమంలో కలెక్టర్ […] The post సత్యసాయి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra .
Vrushakarma 1st Look: Chay Roars In Rugged Avatar
On the occasion of Naga Chaitanya’s birthday, the makers of his highly anticipated film NC24 unveiled the title and first look. Directed by Karthik Dandu of Virupaksha fame, the film now proudly carries the imposing title Vrushakarma- a term that signifies one whose actions are virtuous, perfectly mirroring the protagonist’s moral core. Superstar Mahesh Babu […] The post Vrushakarma 1st Look: Chay Roars In Rugged Avatar appeared first on Telugu360 .
పల్నాడులో భారీ పేలుడు.. రెంటచింతల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా
LOAN | థ్యాంక్యూ సీఎం సార్… రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
రేషన్ కార్డుదారులూ.. బహుపరాక్.. మూడు నెలలైనా పూర్తికాని పంపిణీ.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్.. ఆ తర్వాత వెనక్కే..? విశాలాంధ్ర – కొవ్వూరు :రేషన్ దుకాణాలలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామంది లబ్ధిదారులు ముఖ్యంగా వలస వెళ్లిన వారు ఇంకా కార్డు తీసుకోలేదు. జిల్లాలో అనేక మండలాలలో వేలాదిగా కార్డులు మిగిలిపోయాయి. ఈనెల 30 లోపు కార్డులు తీసుకోకపోతే అవి రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రతి […] The post రేషన్ వెనక్కే appeared first on Visalaandhra .
ప్రతి దుకాణం వద్ద డస్ట్ బిన్ తప్పనిసరి* *కమిషనర్ రాహుల్ మీనా* విశాలాంధ్ర – రాజమహేంద్రవరం ;నగరంలోని ప్రతి దుకాణం వద్ద చెత్తబుట్ట తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది విధులకు వస్తున్నదీ రికార్డులు ఉండాలన్నారు. రహదారులు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ వేయాలన్నారు. ప్రధాన […] The post డస్ట్ బిన్ తప్పనిసరి appeared first on Visalaandhra .
Accident |అయ్యో.. మల్లన్న.. నలుగురు దుర్మరణం..
Accident | అయ్యో.. మల్లన్న.. నలుగురు దుర్మరణం.. Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
రైల్లో నూడుల్స్ వండిన మహిళ #telugupost #latestnews #indianrailways #noodles #viralvideo
తల్లి ప్రేమ, త్యాగం నేపథ్యంలో..
రవి, శ్రీయ తివారి హీరో హీరోయిన్లుగా సిస్ ఫిలిమ్స్ బ్యానర్పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘విచిత్ర’ పేక్షకుల హృదయాలను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీహర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించారు విచిత్ర’ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త దృక్కోణంలో చూపించబోతున్నము. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేస్తుందనే ఆశాభావం ఉంది’ అని తెలిపారు.
*రాష్ట్ర పండుగగా పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు* *జిల్లా స్థాయిలో నవంబర్ 23 న జిల్లా నుంచి సచివాలయం స్థాయి వరకు ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు* — జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి :ఆంధ్రసోరదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా వంద సంవత్సరాల పుట్టిన రోజు సందర్భంగా శతజయంతిని రాష్ట్ర పండుగగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి […] The post శ్రీ సత్యసాయిఉత్సవాలు appeared first on Visalaandhra .
Congress | మహిళలకు అండగా.. Congress, బిక్కనూర్, ఆంధ్రప్రభ : మహిళలకు కాంగ్రెస్
రైతున్న–మీకోసం-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
*రైతున్న–మీకోసం వారోత్సవాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి టెలికాన్ఫరెన్స్* *నవంబర్ 24 నుంచి 30 వరకు వారోత్సవాలు* *రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఏర్పాట్లు* జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి :రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నవంబర్ 24 నుండి 29, 2025 వరకు “ *రైతున్న– మీకోసం* ” వారోత్సవాలు ప్రతి రైతు సేవా కేంద్రం (RSK) పరిధిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి […] The post రైతున్న–మీకోసం-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra .
విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్టైన్మెంట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా ‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ - రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026’ పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన మీడియా సమావేశంలో రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల, మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ ఈ వరల్డ్ టూర్ వివరాలను వెల్లడించారు. రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ చేపడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని వారు అభిప్రాయ పడ్డారు. ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణ అని వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన ‘డాక్యు-మ్యూజికల్ సిరీస్’ను రూపొందిస్తోంది. ఈ సందర్భంగా మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ.. ‘రమణ గోగుల గతంలో ఎప్పుడూ ఇలాంటి కాన్సర్ట్స్ చేయలేదు. ఇది కేవలం ఒక టూర్ కాదు, ఇదొక భావోద్వేగాల ఉద్యమం. హృదయాన్ని టచ్ చేసే సంభాషణల సమాహారం. ‘ట్రావెలింగ్ సోల్జర్’ తొలిసారిగా ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న మ్యూజిక్ లవర్స్ రమణ గోగుల కళను, కథను వింటూ అనుభూతి చెందాలని మేము కోరుకుంటున్నాము’ అని అన్నారు.
వైజ్ ఇంజనీరింగ్ కళాశాల, ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత
విశాలాంధ్ర – నల్లజర్ల : స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పచ్చదనం-పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని ఆవపాడు సర్పంచ్ అచ్యుత సత్యనారాయణ పిలుపునిచ్చారు. వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక సేవా శిభిరంలో భాగంగా ఆఖరి రోజు శనివారం ఆవపాడు గ్రామంలో పచ్చదనం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత , స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలిమెంటరీ స్కూలు […] The post వైజ్ ఇంజనీరింగ్ కళాశాల, ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత appeared first on Visalaandhra .
గ్రామీణ ఉపాధి మెగా గ్రామ సభలు నిర్వహణ విశాలాంధ్ర – సీతానగరం : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సేవలను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ఈ గ్రామ సభలను నిర్వహించినట్లు ఎంపిడిఓ ఎమ్ భారతి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శనివారం మెగా గ్రామసభలు జరిగాయి. దీనిలో ఎంపిడిఓ ఎమ్ భారతి, ఎ. పి. ఓ సత్యవతి, టెక్నికల్ అసిస్టెంట్లు వీరబాబు, […] The post మెగా గ్రామ సభలు appeared first on Visalaandhra .
Telangana Govt |ఇందిరమ్మ ప్రభుత్వం.. ప్రజలకే అంకితం!
Telangana Govt | ఇందిరమ్మ ప్రభుత్వం.. ప్రజలకే అంకితం! Telangana Govt, ఉమ్మడి
సమిత్వ సర్వే లో తప్పులుంటే సరి చేస్తాం విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం లో స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ రాపాక రాజేశ్వరి అధ్య క్షతన జరిగింది. సమిత్వా సర్వే లో గుర్తించిన ఇళ్ల కొలతలు, స్థలాల కొలతల వివరాలను వెల్లడిస్తు, ఆయా ఇళ్ల యజమానులకు 9(2) నోటీస్ లు అందచేశారు. ఈ సమావేశమునకు హాజరైన ఇంచార్జి ఈ.ఓ.పి ఆర్డీ వీరన్న, తహసీల్దారు లక్ష్మీ లావణ్య ధ్రువీకరణ పత్రాలు పంపిణీ […] The post తప్పులుంటే సరి చేస్తాం appeared first on Visalaandhra .
యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా’ఛాంపియన్’తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫస్ట్-లుక్ పోస్టర్లు, టీజర్తో సంచలనం సృష్టించిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్ గ్లింప్స్ ద్వారా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. టీజర్ ప్రేక్షకులను మైఖేల్ సి విలియమ్స్ వరల్డ్ని పరిచయం చేయగా, ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే ప్రోమో అనస్వర రాజన్ పోషించిన చంద్రకళని అద్భుతంగా చూపించింది. గ్లింప్స్లో చంద్రకళని ఓ ధైర్యసాహసాలున్న పల్లెటూరి అమ్మాయిగా పరిచయం చేశారు. తన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం కంటే పెద్ద కలలు కంటూ, మంచి నాటక కళాకారిణిగా ఎదిగి, ఒక రోజు తనకంటూ స్వంత నాటక బృందాన్ని స్థాపించాలనే ఆశతో ముందుకు సాగే అమ్మాయి చంద్రకళ. అనస్వర రాజన్ పాత్రను ఎంతో అందంగా మలిచారు. ఆమె పాత్ర ఎంత కీలకమో సన్నివేశాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. రోషన్-అనస్వరల కెమిస్ట్రీ ఈ గ్లింప్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి ప్రేమకథ ‘ఛాంపియన్’లో మనసుని తాకేలా ఉండబోతుంది. మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసిన ఆహ్లాదకరమైన మెలోడీ కట్టిపడేసింది. రామ్ మిరియాల వాయిస్ మైమరపించేదిగా వుంది. పూర్తి లిరికల్ సాంగ్ నవంబర్ 25న విడుదల కానుంది. ఛాంపియన్ డిసెంబర్ 25న క్రిస్మస్కు విడుదల కానుంది
శ్రీ కోట సత్తెమ్మకు రూ 5.29 లక్షల విరాళం
విశాలాంధ్ర – నిడదవోలు : మార్కొండపాడు వాస్తవ్యులు గంగా భవాని జ్ఞాపకార్ధం భర్త ఈదర రామ కోటేశ్వరరావు, మనవలు నితిన్ చౌదరి , సాయి దిలీప్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టు కు రూ.5 లక్షలు, విరాళము గా రూ.28,500/- లు వెరసి మొత్తం రూ .5,28,500 లను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవి శంకర్, ఆలయ సహాయ కమీషనర్, కార్యనిర్వాహణాధికారి,వి.హరి సూర్య […] The post శ్రీ కోట సత్తెమ్మకు రూ 5.29 లక్షల విరాళం appeared first on Visalaandhra .
ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక
విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండల పైడిమెట్ట బేసిక్ ప్రాథమిక పాఠశాల వేదికగా శనివారం ఏపీటీఎఫ్ తాళ్లపూడి మండల శాఖ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాళ్లపూడి మండల ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసినట్లు ఎలక్షన్ అధికారిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు దున్నా దుర్గారావు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సమస్యలపై మరింతగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులచే ప్రమాణం చేయించారు. కమిటీ సభ్యులు […] The post ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక appeared first on Visalaandhra .
Ram’s Big Statement about Bhagyashri Borse
Bhagyashri Borse made her debut with Ravi Teja’s Mr Bachchan and she played the leading lady in Vijay Deverakonda’s Kingdom. The actress is busy with several Telugu and Tamil films. Her performance in Dulquer Salmaan’s Kaantha received wide appreciation and everyone is talking about the performance of this beauty. Bhagyashri Borse is the leading lady […] The post Ram’s Big Statement about Bhagyashri Borse appeared first on Telugu360 .
Rajinikanth’s Jailer 2 Update Loading
Superstar Rajinikanth is completely occupied with the shoot of Jailer 2. There are reports that the film may hit the screens in summer 2026 and an official announcement has to be made. The makers have released an announcement video before the shoot commenced and the teaser of Jailer 2 will be out on December 12th […] The post Rajinikanth’s Jailer 2 Update Loading appeared first on Telugu360 .
దొంగలను పట్టుకున్న నల్లజర్ల పోలీసులు
అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న నల్లజర్ల పోలీసులు విశాలాంధ్ర – నల్లజర్ల : జైల్లో ఉన్న పరిచయాలను వాడుకునీ టీం గా తయారై పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ టీం గా తయారైన మధ్యప్రదేశ్ కు చెందిన తార్ టీంను వలవేసి పట్టుకున్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు నల్లజర్ల లో ఒంటరి మహిళలు టార్గెట్ చేసి బండరాయితో తలపై దాడి చేసి బంగారు వస్తువులను అపహరించిన కేసులో కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు […] The post దొంగలను పట్టుకున్న నల్లజర్ల పోలీసులు appeared first on Visalaandhra .
Andhra king taluka |గర్వపడే సినిమా..
Andhra king taluka | గర్వపడే సినిమా.. Andhra king taluka, ఎనర్జిటిక్
శ్రీశైలం ఆలయానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్తరాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మధ్యప్రదేశ్ కు చెందిన కులాస్ సింగ్(62), సంతోషి(62), సింగ్ పవార్(60), విజయ్ సింగ్ తోమర్(65)గా గుర్తించారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
FIRE ACCIDENT |షాపు దగ్ధం… FIRE ACCIDENT | నర్సంపేట,క్రైమ్, ఆంధ్రప్రభ :
పెన్మెత్స సుబ్బరాజు చెక్కు పంపిణీ
విశాలాంధ్ర – దేవరపల్లి : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చెక్కు పంపిణీ కార్యక్రమందేవరపల్లి మండలం యర్నగూడెం ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ వారికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 85 వేల రూపాయల చెక్కును వేణుగోపాల సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స సుబ్బరాజు సంఘ సభ్యులకు శనివారం అందించారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సహకార సంఘాల ద్వారా కూడా రుణాలను మంజూరు చేసి ఉన్నతికి తోడ్పాటు అందిస్తామని […] The post పెన్మెత్స సుబ్బరాజు చెక్కు పంపిణీ appeared first on Visalaandhra .
లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పేరాయిపల్లి మిట్ట దగ్గర జాతీయ రహదారి 40పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 35 మంది ప్రయాణికులు మైత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని బస్సు డ్రైవర్ ఢీకొట్టింది అనంతరం వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పాండిచ్చేరికి చెందిన బద్రినాథ్, హరితగా గుర్తించారు. ఇరుక్కున్న లారీ డ్రైవర్ ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ టి రామగుర్రెడ్డి. విశాలాంధ్ర – అనపర్తి : చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి వైరల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. తాడి రామ గుర్రెడ్డి సూచించారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూవృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని అన్నారు.రోజుకు […] The post చలి తీవ్రత-రామగుర్రెడ్డి appeared first on Visalaandhra .
నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్
ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్. విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తికి చెందిన ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయుష్ శాఖ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే. దినేష్ కుమార్ ఐఏఎస్ కు పత్రాలు అందజేశారు.గత 15 ఏళ్లుగా ఎన్నికలు జరగక ఫార్మసిస్టులు రిజిస్ట్రేషన్, రిన్యువల్ సమస్యలు ఎదుర్కొన్నారని ఆది రెడ్డి […] The post నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్ appeared first on Visalaandhra .
వైద్య ఆరోగ్య, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమీక్ష
అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరీక్షలు — విశాలాంధ్ర – తూర్పుగోదావరి :జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ–స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల్లో నమోదు అయిన ప్రతి చిన్నారికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయడం, వైద్య సేవలు అందించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు. సమీక్ష సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. […] The post వైద్య ఆరోగ్య, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమీక్ష appeared first on Visalaandhra .
CM Revanth |సమ్మిట్ సభ దద్దరిల్లాలే!
CM Revanth | సమ్మిట్ సభ దద్దరిల్లాలే! CM Revanth, హైదరాబాద్, ఆంధ్రప్రభ
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల మానవతా సంస్థకు దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నున్న నాగేశ్వరరావు చిన్ని 50 వేల రూపాయలు విరాళాన్ని శనివారం నాడు అందజేశారు దేవరపల్లిలో మానవతా సంస్థ సభ్యుడు బళ్ళ సూర్య చక్రంకు విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ దేవరపల్లి మండల మానవతా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యంగా శాంతి రథం నిర్వహణ చేపడుతుందని అన్నారు దేవరపల్లి మండల మానవతా సంస్థ సభ్యులు […] The post నున్నచిన్ని 50 వేల విరాళ0 appeared first on Visalaandhra .
Bigg Boss Telugu 9: Is There a MAA TV Quota? A Growing Debate Among Viewers
Bigg Boss Telugu has always projected itself as a reality show driven by audience votes and fair competition. Viewers invest emotionally, believing the trophy ultimately goes to the contestant who earns genuine public love. However, in recent seasons, a new question is gaining momentum: Is there an unofficial MAA TV quota influencing who gets protected […] The post Bigg Boss Telugu 9: Is There a MAA TV Quota? A Growing Debate Among Viewers appeared first on Telugu360 .
విశాలాంధ్ర – పెరవలి ;దేవాదాయశాఖ తణుకు డివిజన్ ఇన్స్పెక్టర్ జి సత్య వరప్రసాద్ నేతృత్వంలో అన్నవరప్పాడు ఆలయ కార్య నిర్వహణ అధికారి మీసాల రాధాకృష్ణ సమక్షంలో అన్నవరప్పాడు వెంకన్న ఆలయ నూతన పాలకవర్గం కొలువు తీరింది The post నూతన పాలకవర్గం appeared first on Visalaandhra .
Venky | షూటింగ్ ఎప్పుడంటే.. Venky, వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా
Accident |ఘోర రోడ్డు ప్రమాదం..
Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. నంద్యాల బ్యూరో /ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ :
Congress |ఆటో డ్రైవర్ టూ డీసీసీ ప్రెసిడెంట్..
Congress | ఆటో డ్రైవర్ టూ డీసీసీ ప్రెసిడెంట్.. Congress, సూర్యాపేట ప్రతినిధి,
Metro |మార్చి నెల మెట్రోకు కీలకం..
Metro | మార్చి నెల మెట్రోకు కీలకం.. Metro, హైదరాబాద్, ఆంధ్రప్రభ :
పంచాయతీ రిజర్వేషన్లకు మార్గర్శకాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా అ డుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పంచాయతీ ల్లో వార్డులు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ల కేటాయింపునకు సంబంధించి విధివిధానాలను ఖరా రు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కా గా రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుం డా, కుల గణన, 2011 జనాభా లెక్కల ఆధారం గా రిజర్వేషన్లు ఎలా నిర్ణయించాలో వెల్లడిస్తూ ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జివో నెం.46 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు విడుదలతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పూర్తికావడంతో ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలే మిగిలింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, సర్పంచ్లకు సంబంధించిన రిజర్వేషన్లను నిర్ణయించిన తర్వాత నివేదికను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో ప్రభుత్వం పూర్తి చేస్తే, ఎన్నికల సంఘం ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవీ మార్గదర్శకాలు.. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర మార్గదర్శకాలు ఇలా ఉ న్నాయి. సుప్రీంకోర్టు నిబంధనలను అనుసరించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలని, సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య సర్వే(ఎస్ఇఇపిసి)ఆధారంగా రిజర్వేషన్ కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను సంబంధిత ఆర్టీవోల స్థాయిలో ఖరారు చేయాలని, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా ఎంపీడీవోలు నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఇక మహిళా రిజర్వేషన్ల విషయానికొస్తే రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు నిర్ధారించాలని పేర్కొంది. వంద శాతం జనాభా ఉన్న ఎస్టి గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలను ఎస్టిలకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంటాయని వెల్లడించింది. కిందటిసారి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు, గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయకూడదని పేర్కొంది. 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చని తెలిపింది. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసింది. ఎస్టి రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి ఆ తర్వాత ఎస్సి, బిసిలకు కేటాయించాలని వెల్లడించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అథారిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాస్తుందని, అదే విధంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు, ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన విచారణను కూడా ముగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల తర్వాత అదే రోజు లేదా తర్వాత రోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధంగా ఉందని సమాచారం.
మనతెలంగాణ/ హైదరాబాద్: విభాగాల వారీగా ఈనెల 25వ తేదీ నుంచి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేళ్ల విజయోత్సవాలుగా జరపాలని సిఎం అధికారులకు సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సిఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సిఎంఓ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినందున, రెండేళ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. రౌండ్ మీటింగ్లను ఏర్పాటు చేయాలి డిసెంబర్ 8వ తేదీ, తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్ దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలని సిఎం రేవంత్ సూచించారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేండ్ మీటింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్ లక్ష్యాలను కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు, ప్రజేంటేషన్లు తయారు చేసుకోవాలని సిఎం సూచించారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని సిఎం ఆదేశించారు. ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేయాలి ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంతో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని సిఎం ఆదేశించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవటం, రైజింగ్ డాక్యుమెంట్లో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసుకోవాలని అధికారులను సిఎం రేవంత్రెడ్డి అప్రమత్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సిఎం తెలిపారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు రెండేళ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్ 2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడి యం శ్రీహరికి స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధా నం ఇచ్చేందుకు గడువు ఆదివారం (23)తో ముగియనుంది. అయితే స్పీకర్ ప్రసాద్ కుమార్ వారిరువురికి మరింత గడువు ఇస్తారా? లేక గడువులోగా సమాధానం ఇవ్వలేదని వేటు వేస్తారా? అనే ఉత్కం ఠ నెలకొంది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు పది మంది ఎంఎల్ఏలపై ఆ పార్టీ నేత (ఎంఎల్ఏ)లు స్పీకర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పది మంది ఎంఎల్ఏలకు స్పీకర్ రెండు నెలల క్రితం నోటీసులు పంపించగా, ఎనిమిది మంది ఎంఎల్ఏలు కౌంటర్ దాఖలు చేశారు. కాగా ఇద్దరు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసుకు సమాధానం చెప్పకుండా, న్యాయ నిపుణులతో చర్చించి సమాధానం చెప్పేందుకు తమకు సమయం గడువు కావాలని కోరారు. కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 23వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఈ నెల 13న మలి విడత నోటీసు ఇచ్చారు. కాగా కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిసి తనకు మరి కొంత గడువు కావాలని కోరారు. అయితే తన విజ్ఞప్తికి స్పీకర్ ప్రసాద్ కుమార్ సానుకూలంగా స్పందించారని కడియం శ్రీహరి చెప్పారే తప్ప సానుకూలంగా ఉన్నట్లు స్పీకర్ గానీ, స్పీకర్ కార్యాలయంగానీ వెల్లడించ లేదు. శ్రీధర్ బాబుతో దానం భేటీ ఇదిలా ఉండగా స్పీకర్ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉన్న ఎంఎల్ ఏ దానం నాగేందర్ శనివారం రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును కలిసి మంతనాలు జరిపారు. అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు దానం మంత్రికి వివరించారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం, గెలుపు సాధ్యసాధ్యాలపై వారిరువురు చర్చించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు ఆదివారం గడువు ముగియనున్నందున దానం నాగేందర్ మరింత గడువు కోరుతారా? లేక రాజీనామా లేఖ అందజేస్తారా? అనే ఉత్కంఠత నెలకొంది. నేనే పోటీ చేస్తా: కడియం ఇదిలాఉండగా సమాధానం చెప్పేందుకు తనకు మరింత గడువు కావాలని ఎంఎల్ఏ కడియం శ్రీహరి కోరిన సంగతి తెలిసిందే. కాగా దానం, కడియంతో కాంగ్రెస్ అధిష్ఠానం రాజీనామా చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే రాజీనామా చేయాల్సి వస్తే తిరిగి తానే పోటీ చేసి గెలుపొందుతానని కడియం ధీమాగా చెబుతున్నారు. స్పీకర్ గడువు ఇస్తే న్యాయ నిపుణులతో చర్చించి, సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశానని కడియం శ్రీహరి చెప్పారు.
Sunday Magazine 23 Nov 2025 |ఆదివారం సంచిక 23 నవంబర్ 2025
Sunday Magazine 23 Nov 2025 | ఆదివారం సంచిక 23 నవంబర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఎ దుట ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా 37 మంది మావోయిస్టులు శనివారం డిజిపి కార్యాలయంలో లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు డిజిపి శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా మావోయిస్టులు లొంగుబాటు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్ర స్తుతం లొంగిపోయిన మావోయిస్టులు పార్టీ సిద్ధాంతాల తో విబేధించడం, అనారోగ్య కారణాలు, ప్రభుత్వ ప్రో త్సాహాం, దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్, వరుస ఎన్కౌంటర్లు లాంటి అనేక కారణాలతో జనజీవన స్ర వంతిలోకి వస్తున్నట్లు డిజిపి చెప్పారు. లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు వారం క్రితమే తమ ఆధీనం లో ఉన్నారని డిజిపి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు బికె ఏఎస్ఆర్ డివిజనల్ కమిటి కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజా ద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, సాంకేతిక విభాగం ఇంచార్జ్ అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, రాష్ట్ర కమిటీ స భ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ముచ్చకి సోమడా అలియాస్ ఎర్రలు ఉన్నారన్నారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులతో 34 మంది మావోయిస్టులు ఉన్నారని, వారిలో రాష్ట్ర కమిటీకి చెందిన ఏడుగురు ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు, ముగ్గురు బికెఏఎస్ఆర్ డివిజన్ కమిటీ సభ్యులు, 22 మంది దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ నాయకులు, సభ్యులు, ఇద్దరు పిఎల్జిఏ ఒకవట బెటాలియన్ కమాండర్లు ఉన్నట్లు డిజిపి పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు తమ ఆయుధాలను పోలీసులకు అ ప్పగించగా, వీటిలో ఒక ఏకే 47, రెండు ఎస్ఎల్ఆర్ లు, నాలుగు 303 తుపాకీలు, ఒక జి3 తుపాకీ, వివిధ కాలిబర్లకు చెందిన 346 తూటాలు ఉన్నాయన్నారు. లొంగిపోయిన 37 మంది మావోయిస్టుల్లో 25 మంది మహిళా మావోయిస్టులు, 12 మంది పురుషులు ఉన్నారు. గత 11 నెలల్లో 465 మంది మావోయిస్టులు రాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు డిజిపి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఐదుగురు కేంద్ర కమిటి సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చోక్కారవు అలియాస్ దామోదర్లు ఉండగా, పది మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో భవనాంద రెడ్డి, జోడే రత్నాబాయ్, లోకేటి చందర్, వార్తా శేఖర్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, మేకల మనోజ్, కర్రా వెంకట్ రెడ్డి, గంగిడి సత్యనారాయణ రెడ్డిలు ఉన్నారని డిజిపి తెలిపారు. మిగిలిన నాయకులందరూ లొంగిపోవాలని, ఏ రకంగా వచ్చినా మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని డిజిపి చెప్పారు. మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చినా, రాజకీయల నాయకుల ద్వారా వచ్చి నా, ఏ విధంగా వచ్చినా స్వాగతిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులకు రూ. 20 లక్షలు, మిగిలిన వారికి తక్షణ సాయంలో భాగంగా రూ. 25 వేలు, ఆయా కేడర్లను అనుసరించి ఇతర రివార్డును అందించామన్నారు. మొత్తం 37 మంది మావోయిస్టులకు రూ. 1,41,05,000 చెక్కులను డిజిపి అందచేశారు. దీంతో పాటు పునరావాసంలో భాగంగా లభించే సౌకర్యాలు లొంగిపోయిన వారికి కల్పిస్తామని డిజిపి స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం అజ్ఞాతంలోనే లొంగిపోయిన రాష్ట్ర కమిటీ మావోయిస్టులు సుదీర్ఘ కాలం అజ్ఞాతంలోనే గడిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం, మొద్దుల గూడెం స్వగ్రా మం కాగా ఆయన గత 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. మరోక రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ పెద్దపల్లి జిల్లా రామగుండం కాగా, 32 సంవత్సరాలుగా పలు హోదాల్లో పనిచేశారు. ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, జేగర్గుండా పి.ఎస్ పరిధిలోని పెంటా స్వగ్రామం కాగా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ఉన్నారు. పార్టీకి చెప్పే లొంగిపోయాం : ఆజాద్ పార్టీ నాయకత్వానికి చెప్పే లొంగిపోయామని కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర కమిటిలో ఉన్న నేతలు లొంగిపోవాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. జాతీయ కార్యదర్శి ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు తెలియదని ఆజాద్ సమాధానం చెప్పారు. పార్టీలో ఎటువంటి ఆదిపత్య పోరులేదని ఆయన స్పష్టం చేశారు. దండకారణ్యంలో ఉండి పనిచేయడం కష్టం : ఎర్ర దండకారణ్యంలో ఉండి పనిచేయడం కష్టంగా మారిందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో లొంగిపోయామని రాష్ట్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర తెలిపారు. వరుసగా మావోయిస్టులు మృతి చెందుతున్నారని, ప్రజా జీవితంలొ పనిచేయాలనే జనజీవన స్రవంతిలోకి వచ్చామని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరుస ఘటనలతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ మార్చి 2026 కల్లా మావోయిస్టులను ఏరివేస్తామని ప్రకటించిన కేంద్రం అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. ఆపరేషన్ కగార్తో అటవీ ప్రాంతాలను భద్రతా దళాలు విస్తృతంగా జల్లెడపట్టడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్దకంగా మారింది. వరుస ఎన్కౌంటర్లతో పార్టీ కీలక నాయకత్వం, సభ్యులను కోల్పోగా, రిక్రూట్ మెంట్ సైతం ఆగిపోయింది. తమకు కంచుకోటగా ఉన్న అడవులు భద్రతా దళాలకు ఆవాసాలుగా మారడంతో మావోయిస్టులు తమ ఉనికి కోసం పట్టు లేని ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఈ క్రమం లో ఈ ఏడాదిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు, కేంద్ర కమిటి సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రా రెడ్డిలు ఎన్ కౌంటర్లలో మృతి చెందారు. అనారోగ్య, ఇతర కారణాలతో మాల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న, బండి ప్రకాశ్లతో పా టు భారీ సంఖ్యలో సభ్యులు ఆయుధాలు వీడారు. తా జాగా కీలక నాయకులు మాడవి హిడ్మా, ఆయన భార్య రాజే ఎన్కౌంటర్లో మృతి చెందగా, ప్రస్తుతం 37 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది.
మనతెలంగాణ/హైదరాబాద్: అందె శ్రీ తనకు అత్యంత అప్తుడని, తన మనసుకు దగ్గరి వాడని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారని ఆయన అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలిందన్నారు. సమైక్యవాదాలకు వ్యతిరేకంగా గద్దర్, గూడ అంజన్న, అందె శ్రీ, గోరెటి వెంకన్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బడి ముఖం ఎరుగని అందెశ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారురని, ప్రతి తెలంగాణ గుండెకు జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ చేర్చారని ఆయన తెలిపారు. జయ జయ హే తెలంగాణ పాట ను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారని, కానీ ఆ నాటి పాలకుల వల్ల జయజయ హే తెలంగాణ పాట మూగబోయిందన్నారు. అధికారం శాశ్వతం అని వారు ఆనాడు భావించారని, తెలంగాణ లో స్పూర్తిని నింపిన కవులు, కళాకారుల గానం తెలంగాణలో వినిపించకుండా కుట్ర చేశారని, పెన్నులపైన మన్ను కప్పితే గన్ను లై మొలకెత్తుతాయని, గడీలను కూల్చుతాని అందెశ్రీ నిరూపించారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన అందెశ్రీ సంతాపసభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపిస్తారు, కానీ, అమాయకులు కాదని ఆయన అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరూ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని సహించరన్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతోమంది కవులు, కళాకారులు తమ ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. వాళ్లు తీసుకొచ్చిన ఊపుతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు. అందెశ్రీ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేమని ఆయన అన్నారు. ఆయన పాటలు తెలంగాణ ప్రజలను ఎంతో ఉత్తేజపరిచాయని ఆయన వెల్లడించారు. ఉద్యమ సమయంలో ఆయన పాటలు మార్మోగాయని అదే సమయంలో ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా చేయాలని కూడా కొందరు కుట్ర చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ చర్చ వచ్చినా తెలంగాణకు రెండు కళ్ల లాంటి వారైన అందెశ్రీ, గద్దర్ కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే జయజయహే గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించామన్నారు. ప్రతి పాఠ్యపుస్తకంలో గీతాన్ని చేర్చామని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సిఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. చదువుల్లోనే కాదు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లోనూ ఎస్సీల ప్రాతినిథ్యం పెరగాలని దానికి ప్రజాప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గంలోనూ ఎస్సీలకు సముచిత స్థానం ఇచ్చినట్లు సిఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రం అందె శ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్, అందె శ్రీ కోరుకున్నారని, అందె శ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని, అందె శ్రీ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అందెశ్రీ పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చామని, భారత్ ప్యూచర్ సీటీలో వారికి ఇంటిని నిర్మించి ఇస్తామని, దేశంలో వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, వర్గీకరణ అమలు వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు అవుతున్నారని, తన మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులుగా ఉన్నారని, కవులు ఎంతమంది ఉన్నా తెలంగాణ చరిత్రలో అందె శ్రీ ఒక కోహినూర్ వజ్రంలా నిలిచిపోతారని ఆయన తెలిపారు.
అమెరికా లేకున్నా జీ20 డిక్లరేషన్
జొహనెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జి 20 సదస్సు ఆరంభంలోనే ప్రధాన డిక్లరేషన్ను అసాధారణ రీతిలో ఆమోదించారు. దక్షిణాఫ్రికా ఆతిధ్యంలో తొలిసారిగా ఇక్కడ జి 20 సమ్మిట్ జరుగుతోంది. డిక్లరేషన్ వెలువడకుండా అమెరికా శతవిధాలుగా యత్నించినా , పట్టించుకోకుండా దీనిని ఏకగ్రీవంగా ఆమోదించి, వెలువరించడం కీలక అంశం అయింది. దక్షిణాఫ్రికాలో శక్తివంతమైన జి 20 సదస్సు నిర్వహణపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ నిరసనకు దిగాడు. తాను వెళ్లడం లేదని అలకవహించాడు. ప్రపంచ దేశాల పలువురు నేతలు , ప్రతినిధులు తరలివచ్చిన ఈ సమ్మిట్లో డిక్లరేషన్ ఆమోదం అమెరికా వైఖరికి ప్రతిఘటనగా నిలిచింది. సాధారణంగా తీర్మానం లేదా డిక్లరేషన్ను సమావేశంలో పలు స్థాయిల్లో జరిగే చర్చలు ఉప చర్చల తరువాత ఆమోదించడం జరుగుతుంది. కానీ ఈసారి ఇందుకు విరుద్ధంగా దీనిని శనివారం సదస్సుకు ఆరంభం ముందే ఆమోదించడం కీలకం అయింది. పైగా సర్వసమ్మతితోనే దీనిని వెలువరించారు. అమెరికా ప్రాతినిధ్యం లేకుండా జి 20 డిక్లరేషన్ కుదరదనే ట్రంప్ వాదనను జి 20 సదస్సు ఆరంభంలోనే కొట్టిపారేసింది. ఈ డిక్లరేషన్ ఆమోదం అత్యంత కీలకం అని , తమకు ఘననీయమైన క్షణం అని ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వ్యవహారాలు , సహకార మంత్రి రోనాల్డ్ లమోలా తెలిపారు. ఇది ఆఫ్రికా ఖండాన్ని విప్లవభరితం చేస్తుందని వ్యాఖ్యానించారు. పైగా డిక్లరేషన్ పూర్తిగా బహుళధృవ అంతర్లీనతను సంతరించుకుందని వివరించారు. ముందుగానే తమ దూతలు పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడిన తరువాత డిక్లరేషన్కు రంగం సిద్ధం అయిందని తెలిపారు. ఆఫ్రికా ఖండానికి, ప్రపంచానికి అవసరం అయిన పలు కీలక విషయాలు ఈ డిక్లరేషన్లో ఉన్నాయని మంత్రి ప్రకటించారు. నేతలకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా గైర్హాజరీపై, ట్రంప్ విమర్శలపై రోనాల్డ్ తీవ్రంగా స్పందించారు. జి 20 ఓ వేదిక. అమెరికా ప్రాతినిధ్యం ఉన్నా లేకున్నా ఇది కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఆహ్వానితులు రాకపోవడంతో సదస్సు జరగకుండా పోదని, జరిగి తీరుతుందని లమోలా తెలిపారు. ట్రంప్ వైఖరిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు . ఇది బహుళపక్ష వేదిక. ఏ ఒక్కరి కోసం సాగేది కాదు. లేరని ఆగేది కాదని తేల్చిచెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి దశ నుంచి కూడా ఈ వేదిక అంతర్జాతీయ విషయాలలో కీలక పాత్ర వహిస్తూ వచ్చింది. అందుకే ఈ డిక్లరేషన్ను సగర్వంగా వినూత్నంగా వెలువరించడం జరుగుతోందని తెలిపారు. డిక్లరేషన్ విజయవంతం అయి తీరుతుంది. ప్రపంచం అంతా ఇక్కడనే ఉందని తెలియచేయదల్చుకున్నామని , ప్రస్తుత దశలో అంతర్జాతీయ సహకారం అత్యవసరం , దీనిని మించిన వాదన ఏదీ లేదని దక్షణాఫ్రికా మంత్రి పిలుపు నిచ్చారు. ట్రంప్ అసత్య ఆరోపణలు.. అమెరికా పట్ల గౌరవం హద్దుల మేరకే దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై సామూహిక హత్యాకాండ జరుగుతోందని ట్రంప్ చేస్తున్న ఆరోపణలను దక్షిణాప్రికా మంత్రి ఖండించారు. అటువంటిదేమీ లేదు. నేరాల ఘటనలు అందరిని ఇబ్బందిపెడుతాయి. తమ సవాళ్లు, సమస్యలు తమకు ఉండనే ఉన్నాయని ఆయన విశ్లేషించారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల గురించి స్పందించారు. అమెరికా అతి పెద్ద ఆర్థిక శక్తి, దక్షిణాఫ్రికాకు రెండో అతి పెద్ద వ్యాపార భాగస్వామ్య పక్షం, అమెరికాతో నిమిత్తం లేకుండా ఆఫ్రికా ముందుకు సాగదు. అయితే దౌత్యపరంగా సముచితంగా ఉంటున్న తమకు వేరే దేశం మితిమీరి వ్యవహరిస్తే ఇంకో విధంగా స్పందించాల్సి ఉంటుందని మంత్రి లమోలా అమెరికాకు చురకలు పెట్టారు. డిక్లరేషన్లో పలు కీలక విషయాల ప్రస్తావన జరిగింది. ఇందులో పేద దేశాల రుణాల పరిస్థితి, వడ్డీల భారం వంటివాటి ప్రస్తాన ఉందని తెలిపారు. కొన్ని వివాదాస్పద విషయాలు ఉండనే ఉంటాయి. వీటిని రెండు రోజుల సదస్సులో సంప్రదింపుల్లో చర్చించుకుని, మార్పులు చేర్పులకు దిగవచ్చు అని, ఈ క్రమంలో కొన్ని లాభనష్టాలు ఉండనే ఉంటాయని, ఏకాభిప్రాయం కీలకం అని తేల్చిచెప్పారు. వర్థమానదేశాలకు ప్రాధాన్యత కీలకం ..జి 20 డిక్లరేషన్ సంక్షుభిత ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఎదుగుతున్న దేశాల పట్ల ప్రాధాన్యత అత్యవసరం. దీనినే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. వీధి పోరాటాలుగా మారుతున్న పలు అంతర్జాతీయ ప్రాంతీయ ఘర్షణల నివారణకు సత్వర చర్యలు అవసరం .ఇందుకు అంతా పాటుపడాలి. పేద దేశాలకు రుణాల పరపతి వ్యవస్థ బలోపేతం చేయాలి. వడ్డీ భారం కుదించాల్సి ఉంది. దీనిని స్థిరీకరించాల్సి ఉంది. ఉక్రెయిన్, ఆక్రమిత పాలస్తీనియా, సూడాన్, కాంగో రిపబ్లిక్ ప్రాంతాలలో శాశ్వత స్థిరమైన శాంతికి అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. యాంత్రీకరణ ప్రభావంతో తలెత్తుతున్న కాలుష్యం, వాతావరణ పరిసరాల సమస్యలపై శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంది. గ్లోబల్ వార్మింగ్ పరిణామాలపై మరింత స్పందన అవసరం. ప్రపంచవ్యాప్తంగా విలువైన అరుదైన ఖనిజాల గనుల నిక్షేపాల పరిరక్షణ, వీటిని కొన్ని దేశాలు తమ వాణిజ్యపరమైన ప్రయోజనాలకు కొల్లగొట్టకుండా చూడాల్సి ఉంది.
వార ఫలాలు (23-11-2025 నుండి 29-11-2025 వరకు)
మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఇంకా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఉండవు. ఆర్థికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు వెంటాడుతాయి. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి వెళుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా శివ అష్టోత్తరం చదవండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార పరంగా మాత్రం లాభాలు బాగుంటాయి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. సమాజ సేవలో పాల్గొంటారు. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కి గాని ప్రమోషన్స్ కానీ లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సినీ పరిశ్రమంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. హనుమాన్ వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. మీకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. లేదు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాములతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పర్సనల్ లోన్లకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థాయిని సాధించగలుగుతారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటిని అదుపు చేసే ప్రయత్నం చేయాలి. నూతన వాహన యోగం ఏర్పడుతుంది. స్వగృహ యోగం ఏర్పడుతుంది. విదేశాలు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ప్రతిరోజు కూడా అరటి నారావత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తులారాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగ పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు పైన శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో కొన్ని అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ. వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. నరదిష్టి కొంతవరకు తగ్గుతుంది. మీరు చేస్తున్న పనిని గోప్యంగా ఉంచండి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పదిమంది మెప్పు కోసం మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో తర్వాతే కాలంలో అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పాస్పోర్టు వీసా లభిస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మానసీకమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కెరియర్ పరంగా మీరు కోరుకున్న రంగంలో స్థిరత్వం లభిస్తుంది. చాలాకాలంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్ లభిస్తుంది. సినీ కళా రంగాలలో ఉన్నవారికి అంతంతమాత్రంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కెరియర్ పరంగా కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవారాధన ఎక్కువగా చేయండి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మాట తీరుతో ఇంట బయట అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టినా పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బందు మిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు రెడ్. కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. సన్నిహితులతో మాత్రమే ముఖ్యమైన విషయాలను చర్చించండి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు. ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేయండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు పెరుగుతాయి. నూతన అరుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. నూతన ఉద్యోగాలలో ఎంపిక అవుతారు. మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీరు సొంతంగా చేస్తే వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చదువుపై శ్రద్ధ వహిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన నూతన కోర్సులను అభ్యసిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలమనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు ప్రారంభించిన వ్యాపారాలలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలిగిపోతాయి. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. వివాహపరంగా స్వంత నిర్ణయాలు పనికిరావు. పెద్దవాళ్ల సలహాలు సూచనలు పాటించండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయన చేయండి. శని గ్రహ స్తోత్రం కూడా చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు.
మిస్టర్ జస్టిస్..మిగిలిన పెండింగ్ల మాటేమిటీ?
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది శాసనసభ్యుల అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రానున్న నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని తీవ్రంగా వ్యాఖ్యానించడంతో ఎక్కడెక్కడ, ఏ ఏ వ్యవస్థల్లో, ఎన్నెన్ని కేసులు, పిటిషన్లు ఏళ్ళుపూళ్ళు గడిచిపోయినా, కాల పరిమితి ముగిసినా తుది నిర్ణయం రాకుండా పడి ఉన్నాయో, ఎంతమంది ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఇవ్వాళే జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తుండటం కాకతాళీయం. తెలంగాణ స్పీకర్ చేసింది తీవ్రమైన కోర్టు ధిక్కారమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అనడం అంటే నాలుగు వారాల్లోగా పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోకపోతే జైలుకు పంపుతామని చెప్పడమే కదా. పార్టీ ఫిరాయింపుల మీద తాము విధించిన మూడు మాసాల గడువు దాటిపోయినా ఒక నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ స్పీకర్ మీద ఆగ్రహించిన ఇదే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తో కూడిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పార్లమెంట్ లేదా వివిధ రాష్ట్రాల శాసన సభలూ ఆమోదించిన బిల్లులను త్వరగా పరిష్కరించాలని కోర్టులు జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నది. బిల్లులను సుదీర్ఘ కాలం పెండింగ్లో పెట్టుకునే అధికారం గవర్నర్లకు లేదంటూనే కోర్టులు గడువు విధించలేవని చెప్పింది. తమ పరిధిలో నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజ్యాంగ వ్యవస్థలకు కాల పరిమితి అంటూ ఏమీ నిర్దిష్టంగా లేదు. గురువారం నాడు సుప్రీం కోర్టు కొద్ది కాలం క్రితం రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలకు ఇచ్చిన రాజ్యాంగ పరమయిన వివరణ లేదా విశ్లేషణతో ఆ విషయం అర్థ్ధం అవుతున్నది. న్యాయస్థానాలు, రాష్ట్రపతి, గవర్నర్లు, పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్ వ్యవస్థలు తమకు సంక్రమించిన రాజ్యాంగ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు రాజ్యాంగం లేదా చట్టాలూ స్పష్టమైన కాల పరిమితి ఏదీ విధించలేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కనీసం నాలుగు రాష్ట్రాలలో 33 బిల్లులు గవర్నర్ల ఆమోదం కోసం వేచిచూస్తున్నాయి. ఇందులో అత్యధికంగా బిల్లులు పెండింగ్లో ఉన్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈ జాప్యం రాష్ట్ర ప్రభుత్వాలూ గవర్నర్ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఎటువంటి వివరణ లేకుండా సుదీర్ఘ కాలం బిల్లులు పెండింగ్లో పెడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల మీద సుప్రీం కోర్టు గడప తొక్కిన విషయం జగద్విదితం. పశ్చిమ బెంగాల్ ఉదాహరణే మళ్ళీ తీసుకుంటే ఆ రాష్ట్రం లో 2022 నుండి ఏడు బిల్లులు, 2023 నుండి ఒక బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ బిల్లులన్నీ యూనివర్శిటీ చట్టాలకూ, పట్టణ గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించినవి. అసంఖ్యాకంగా వచ్చే కోర్టు కేసులు కూడా పరిష్కరించడానికి రాజ్యాంగం స్పష్టంగా కాలపరిమితి ఏదీ విధించలేదు. న్యాయ వ్యవస్థ తానే రూపొందించుకున్న విధానాలు, నిబంధనల ఆధారంగా వ్యవహరిస్తుంది. అయితే విచారణ వేగవంతంగా జరగాలన్న అంశం రాజ్యాంగం లోని ఆర్టికల్ 21తో ముడిపడి ఉండటమేకాక కేసుల వాయిదాల సంఖ్యా తగ్గించే క్రమంలో నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు కొంత అక్కర కొస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల మీద ఒకసారి దృష్టి సారిస్తే దిగువ కోర్టుల్లో నాలుగు కోట్ల అరవై లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వివిధ హైకోర్టులలో 63 లక్షలు, సుప్రీం కోర్టు లో 87 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ ఏడాది జులై 31 నాటి గణాంకాలు. దిగువ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో అధిక భాగం భూతగాదాలకు సంబంధించినవే కావడం విశేషం. శాసన, న్యాయ వ్యవస్థలు రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలే. రెండు వ్యవస్థల అధికారాలు దేనివి దానికే ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల మీద ఏ కారణం చేతనైనా ఒకవేళ తెలంగాణ శాసనసభ అధ్యక్షుడు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోలేకపోతే నిజంగానే ఆయనను జైలుకు కూడా పంపే అంతటి కఠిన నిర్ణయం సుప్రీం కోర్టు తీసుకునే అవకాశం ఉందా! అది న్యాయ వ్యవస్థ పరిధిని దాటి ఉంది అనిపించడం లేదా అన్న చర్చ జరుగుతున్నది. మరి వివిధ కోర్టు లలో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కోట్లాది కేసుల గురించి ఏం చెబుతారు. తెలంగాణ స్పీకర్ మీద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య తీర్పులో భాగంగా వెలువరించింది కాదు. వాదనలు సాగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్య మాత్రమే. సరే ఈలోగా గత రెండు మూడు రోజులుగా తెలంగాణ స్పీకర్ పదిమంది శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారంలో విచారణ కూడా వేగవంతం చేశారు. నాలుగు వారాల్లోగా ఒక నిర్ణయం జరుగుతుందని స్పీకర్ తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహాత్గి కూడా సుప్రీం కోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం అంతిమంగా ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. తెలంగాణ అసెంబ్లీ లో ప్రస్తుతం ఓ పదిమంది శాసన సభ్యులు భారత రాష్ట్ర సమితి నుండి అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అనర్హత వేటు పడుతుందేమో అన్న అనుమానం రావడంతో కండువా కప్పుకుంటే, నియోజక వర్గం అభివృద్ధి పనులకోసం ముఖ్యమంత్రిని కలిస్తే, సరదాగా కబుర్లు చెప్పుకుని చాయ్ తాగడానికి పిసిసి సభ్యుడిని కలిస్తే పార్టీ మారినట్టా అని బుకాయిస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు 2014 లో రాష్ట్రం ఏర్పడి తాము అధికారం లోకి వచ్చిన దగ్గరినుండి అధికారం కోల్పోయే దాకా బిఆర్ఎస్ ఉజ్జాయింపుగా ఓ 38 మంది శాసన సభ్యులను ఇతర పార్టీల నుండి చేర్చుకున్న విషయం ఎవరయినా మరిచిపోతారా. అట్లా అని ప్రస్తుతం ఫిరాయించిన వారిని సమర్థించాల్సిన అవసరం లేదు. అయినా రాజకీయాల్లో నైతికత కోసం వెతకడం ఏమిటి నేతి బీరకాయల్లో నెయ్యి కోసం వెతికినట్టు. అయితే ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన వారిలో ఇద్దరి మీద మాత్రం వేటు తప్పనిసరి. అందులో ఒకరు ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్, ఆయన 2023 లో బిఆర్ఎస్ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికై 2024 లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓడిపోయారు, పార్టీ మారిన ఆధారం స్పష్టంగానే ఉంది. ఈయన కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీకి, అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్కు తిరిగి బిఆర్ఎస్కు, ఇప్పుడు తిరిగి సొంత గూడు అంటూ కాంగ్రెస్కు చేరుకున్నారు ప్రజా సేవ కోసం. ఇక రెండో నాయకుడు కడియం శ్రీహరి, వీరు 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా స్టేషన్ఘనపూర్ నుండి గెలిచి ప్రజా సేవ కోసమే అధికార పక్షం లో చేరారు. అయితే కూతురికి కాంగ్రెస్ లోకసభ స్థానం నుండి టికెట్ ఇప్పించుకుని ఆమె గెలుపు కోసం కృషి చేయడం వల్ల అనర్హత తప్పేట్టు లేదు. శ్రీహరి రాజకీయాలతోబాటు పార్టీ ఫిరాయించడంలో కూడా సీనియర్యే. తెలుగుదేశం నుండి భారత రాష్ట్ర సమితికి అక్కడి నుండి కాంగ్రెస్కు మారారు. వీరిరువురూ వేటు పడక ముందే రాజీనామా చేస్తారని వార్తలొస్తున్నాయి. స్పీకర్ మీద సుప్రీం కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యం లో ఒకవేళ వేటు పడితే ఆరు నెలల వరకూ పోటీచేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున తామే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని అనుకుంటున్నారని సమాచారం. మొన్ననే జూబ్లీహిల్స్లో ఉపఎన్నిక గెలిచిన ఊపులో ఉంది అధికార పక్షం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని పార్టీకి దక్కేట్టు చేసారు. ఆ పొరుగునే ఉన్న ఖైరతాబాద్ కూడా అదే ఊపులో గెలవచ్చన్న ధీమా ఉండొచ్చు. స్టేషన్ ఘనపూర్ గెలిస్తే కాంగ్రెస్ బలంలో ఒకటి పెరిగినట్టు, పోయినా అది ప్రతిపక్షానిదే కాబట్టి బెంగ లేదు. మిగిలిన ఎనిమిది మంది శాసన సభ్యుల విషయంలో ప్రతిపక్ష బిఆర్ఎస్ పశ్చిమ బెంగాల్లో జరిగింది చూసి కొంత ఉత్సాహం తెచ్చుకున్నది. ఇటీవల పశ్చిమబెంగాల్లో బిజెపి నుంచి తృణమూల్ కాంగ్రెస్కు ఫిరాయించిన శాసనసభ్యుడు ముకుల్రాయ్ బిజెపి వీడిపోయినట్టు ఆధారాలు లేవని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రకటించడంతో బిజెపి వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఒకవేళ అక్కడి స్పీకర్ లాగానే వీళ్ళంతా బిఆర్ఎస్ వీడిన ఆధారాలు లేవని తేల్చినట్టయితే కోర్టులు తమకు న్యాయం చేస్తాయన్నది ఆ పార్టీ ఆశ కావచ్చు. అదలా ఉంచితే ఒక విషయం ఇక్కడ తప్పనిసరిగా చర్చించాలి. 1985లో రాజ్యాంగ సవరణద్వారా ఏర్పాటైన పార్టీ ఫిరాయింపుల చట్టం పార్టీ ఫిరాయింపుల మీద శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలి అన్న విషయంలో స్పష్టతనివ్వలేదు. నిజానికి ఈ చట్టం ఎంతో లోపభూయిష్టంగా ఉన్నదనడానికి చట్టం అమల్లోకి వచ్చిననాటి నుండి నేటివరకు జరిగిన అనేక ఉదంతాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2004 2009 మధ్య అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పదిమంది శాసన సభ్యులు పార్టీ నిర్ణయాన్ని కాదని శాసనమండలి ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసిన కారణంగా వారందరి మీద అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ కోరినప్పటికీ ఆనాటి స్పీకర్ ఆ శాసనసభ పదవీకాలం ముగిసే వరకు ఈ వ్యవహారాన్ని తేల్చకుండా చివరకు 2009లో సమావేశాలు ముగింపుకొచ్చిన సమయంలో వారిని అనర్హులుగా ప్రకటించారు. ఇటువంటి ఉదాహరణలు మనకు దేశంలోని పలు శాసనసభల్లో, రాజ్యసభలో కూడా అనేకం కనిపిస్తాయి. 2019 లో ఎన్నికలలో ఓడిపోగానే తెలుగు దేశం రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన వైనం ఉదాహరణే కదా, అంతకు ముందు అధికారం లో ఉండగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి నుండి 23 మంది శాసన సభ్యులను, ముగ్గురు లోక్సభ సభ్యులను తెలుగుదేశంలో చేర్చుకుని ఓ నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు కదా చంద్రబాబు నాయుడు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు పార్టీకి రాజీనామా చేయకుండానే అప్పటి టిఆర్ఎస్ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరారు. పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఈ రోజుదా, 1967 లో హర్యానాలో గయా లాల్ అనే శాసన సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారాడు, కాంగ్రెస్ నుండి యునైటెడ్ ఫ్రంట్కు మళ్ళీ తిరిగి కాంగ్రెస్కు అది జరిగిన తొమ్మిది గంటల్లోనే మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్కు మారి ఆయారాం గయారాం అనే నానుడిని వాడుకలోకి తెచ్చారు. గెలిచి వచ్చిన పార్టీకి రాజీనామా చేయకుండా అధికార పక్షంలోకి వలసపోయిన సందర్భాలు పలు శాసనసభల్లో బోలెడు. పార్టీ ఫిరాయింపుల విషయం అయినా, గవర్నర్ల దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులయినా, కోట్లాది కోర్టు కేసులయినా ఏ మాత్రం జాప్యం లేకుండా పరిష్కారం అయిపోయే మార్గం ఆలోచించాల్సిందే తప్ప పరస్పర విమర్శల వల్ల ఫలితంలేదు. అన్ని వ్యవస్థలూ అంతిమంగా ప్రజలకే కదా జవాబుదారీగా ఉండాలి. అప్పుడప్పుడు ఢిల్లీలో లోక్సభ స్పీకర్ అధ్యక్షతన రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పలు సమస్యలు చర్చకు వస్తాయి, పరిష్కారాల గురించి కూడా ఆలోచిస్తారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యానం నేపథ్యంలో తప్పనిసరిగా ఈసారి జరిగే స్పీకర్ల సమావేశం లో దీని మీద చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొంటే బాగుంటుంది. Delete Edit DeleteEdit
Cartoon 23 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
AP |పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రభ : ప్రముఖ పరకామణి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక
సీఎం రేవంత్ను కలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రభ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

27 C