SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
...

Sabarimala : శబరిమలలో వారికి ఇక అనుమతి లేదు

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 8:26 am

ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పది మంది మృతి

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒ

తెలుగు పోస్ట్ 16 Mar 2026 8:21 am

డ్రగ్స్ ఆరోపణలపై పుట్టా మహేష్ ఏమన్నారంటే?

డ్రగ్స్ ఆరోపణలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ స్పందించారు

తెలుగు పోస్ట్ 16 Mar 2026 8:11 am

ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులుగా పోలే రాజు..

ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులుగా పోలే రాజు.. ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఊరుకొండ

ప్రభ న్యూస్ 16 Mar 2026 8:05 am

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు..

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు.. పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారులో

ప్రభ న్యూస్ 16 Mar 2026 7:58 am

Andhra Pradesh : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 7:47 am

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కటక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ సిబి మెడికల్ కాలేజీలో భారీ ఎత్తున మంటల చెలరేగాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానిక ిచేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఐసియులో షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్‌తో సిఎం కలిసి ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులను కూడా పరామర్శించారు. గాయపడిన మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. 

మన తెలంగాణ 16 Mar 2026 7:36 am

Iran - Israel War : మిచిగాన్‌ పై దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి ఇజ్రాయెల్‌ దాడితో సంబంధం?

అమెరికా మిచిగన్‌లోని ఒక పెద్ద సినగాగ్‌పై దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి, ఈ నెల ప్రారంభంలో లెబనాన్‌లో జరిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడితో సంబంధం ఉన్నట్టు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది

తెలుగు పోస్ట్ 16 Mar 2026 7:34 am

Iran - Israel War : ఇరాన్ యుద్ధంతో పెరుగుతున్న చమురు ధరలు

హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా సురక్షితంగా కొనసాగాలంటే కొన్ని దేశాలు తమ యుద్ధనౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 7:18 am

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విమర్శనాస్త్రాలకు పదును పెట్టిన విపక్షాలు ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన మంత్రులు 11.45 గంటలకు కొత్త గవర్నర్ ప్రసంగం గంటలకు అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సిఎం డ్రగ్స్ కలకలం, మూసీ నదీ ప్రక్షాళన, గోదావరి నదీ జలాల వివాదం, గిగ్ వర్కర్స్‌కు కొత్త చట్టం, విద్యా రంగంలో కొత్త విధానాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ మౌనం, సోషల్ మీడియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఈసారి కూడా కెసిఆర్ రానట్లేనా..? మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉభయ సభల (కౌన్సిల్, అసెంబ్లీ) సభ్యులనుద్దేశించి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉదయం 11.45 గంటలకు ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలూ ధన్యవాదాలు తెలిపిన అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు వాడి-వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విపక్షాల నేతలు తమ విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. కాగా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు మంత్రులు, అధికారపక్ష సభ్యులు సంసిద్ధంగా ఉన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా డ్రగ్స్ కలకలం సృష్టించే అవకాశం ఉంది. ఇంకా మూసీ నదీ ప్రక్షాళన, మూసీ నదీ ప్రక్షాళన, గోదావరి నదీ జలాల వివాదం, గిగ్ వర్కర్స్‌కు కొత్త చట్టం, విద్యా రంగంలో కొత్త విధానాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ మౌనం, సోషల్ మీడియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించనున్నారు. విద్యా రంగంలో కొత్త విధానాల అమలు, మార్పులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. ఇంకా సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రసారం, హార్మ్ కంటెంట్ నియంత్రణకు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా మూసీ నది ప్రక్షాళనపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా నదీ జలాల అంశంపై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు, సిబిఐ మౌనం, హైడ్రాతో ప్రజలకు కలిగిన మేలు, తదితర అంశాలపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇదిలాఉండగా ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగించడానికి పదిహేను నిమిషాల ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎడమ వైపు బిఆర్‌ఎస్ అంబేద్కర్ విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అసెంబ్లీ అధికారులు ఇప్పుడు కొత్తగా గాంధీ విగ్రహానికి కుడి వైపున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. పది రోజుల పాటు సమావేశాలు ? సోమవారం గవర్నర్ ఉభయ సభలనుద్ధేశించి ప్రసంగించి వెళ్ళిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం కానున్నది. మరోవైపు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశమై అజెండాపై చర్చించనున్నది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారు పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాలకు కెసిఆర్ వస్తారా..? రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా...? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెసిఆర్ సభకు హాజరవడంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలకు రాకపోవచ్చని పలువురు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. తర్వాత రెండు రోజులు మంగళ, బుధవారాలు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇతర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 16 Mar 2026 7:00 am

16th March 2026 |తిరుమల సమాచారం..

16th March 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో

ప్రభ న్యూస్ 16 Mar 2026 6:51 am

22నుంచి రైతు భరోసా

 సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్న సిఎం రేవంత్‌రెడ్డి మొత్తం మూడు విడతల్లో అన్నదాతలకు రూ.9వేల కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిం ది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేయనున్నట్లు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈమేరకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సిఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాల్లో నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో అ క్కడి నుండే రైతు భరోసా తొలి విడుత నిధులు విడుదల చేయనున్నారు. తొలి విడత రైతు భరోసాలో ఒక ఎకరం భూమి కలిగిన 70లక్షల మంది రైతుల  ఖాతాల్లో రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తరువా త రెండో విడత రైతు భరోసా నిధులు రూ.2,650 కోట్ల రైతు ఖాతాల్లో ప్రభు త్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివర వరకు మూడోవిడతగా మొత్ంత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని, మూడు విడతల్లో 1.50కోట్ల ఎకరాలకు మొత్తం సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

మన తెలంగాణ 16 Mar 2026 6:30 am

మోగిన నగారా

ఒక యూటీ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల  ఏప్రిల్ 9నుంచి 29వ తేదీ వరకు పోలింగ్ మే 4న కౌంటింగ్ పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో పోలింగ్ తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఒక దశతో ముగియనున్న ఎన్నికలు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటన వివిధ రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల తేదీల వివరాలతో కూడిన షె డ్యూల్‌ను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్ర ధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. ఇతర ఇరువురు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివే క్ జోషితో కలిసి ఎన్నికల తేదీలు వెలువరించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అసోం రా ష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో అసోం, కేర ళం, పుదుచ్చేరిలలో ఎన్నికలు ఒకే విడతలో ఏప్రి ల్ 9న జరుగుతాయి. కాగా పశ్చిమబెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు ఏప్రిల్ 23, 29తేదీల్లో జ రుగుతాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం మీద 824 స్థానాలకు ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. తమిళనాడులో మొ త్తం 234 స్థానాలు ఉన్నాయి. డిఎంకె నేత స్టాలిన్ సిఎంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థా నాలు ఉన్నాయి, టిఎంసి అదినేత్రి మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేరళలో 104 స్థానాలు ఇక్కడ వామపక్ష సీనియర్ పినరయి విజయన్ సి ఎం. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నా యి. ఇక్కడ బిజెపి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి గా హిమంత బిస్వా శర్మ ఉన్నారు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రిగా ఎన్ రామస్వామి ఉన్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. ఇది అతి పెద్ద ఎన్నికల ప్రజాస్వామిక ప్రక్రియ అని సిఇసి తెలిపారు. ఇంత మంది ఓటర్లు ఉండటం విశేషం అని, ఇదది ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీచ దక్షిణాఫ్రికా జనాభాతో సమానం అని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. అర్హులైన పౌరులందరికి ఓటు హక్కు ఉంది. దీనిని అంతా సక్రమంగా వినియోగించుకోవడం పౌరుల బాధ్యత అని పిలుపు నిచ్చారు. ఇక గోవా, కర్నాటక, త్రిపుర, నాగాలాండ్‌లలో కలిపి ఐదు అసెంబ్లీ స్ధానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇవి ఎప్రిల్ 9న నిర్వహిస్తారు. గుజరాత్ మహారాష్ట్రలలో మూడు స్థానాలకు ఏప్రిల్ 23న ఉప ఎన్నిక ఉంటుందని సిఇసి ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఈ ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికల అవసరం ఏర్పడింది. ఇందులో మహారాష్ట్రలోని బారామతి కూడా ఉంది.

మన తెలంగాణ 16 Mar 2026 6:00 am

పైలట్‌కు జైలు..ఎంపికి బెయిల్

 మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ పోలీసులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జి డ్రగ్స్ పరీక్షల్లో ఏలూరు ఎంపి మహేశ్ యాదవ్, మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి సహా ఆరుగురికి పాజిటివ్ పార్లమెంట్ సభ్యుడితో పాటు 8మందికి స్టేషన్ బెయిల్ మన తెలంగాణ/హైదరాబాద్/మొయినాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పా ర్టీ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు 14రోజుల రిమాం డ్ విధించింది. ఆదివారం రాత్రి ఉప్పర్‌పల్లి మెజిస్ట్రేట్ ఎదు ట పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, మరో నిందితుడు నమిత్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వీరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకున్న ఈగల్ పోలీసులు అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏలూరు ఎంపి పుట్టా మహేశ్ యాదవ్, పైలట్ రో హిత్‌రెడ్డి సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. అయితే టిడిపి ఎంపి పుట్టా మహేష్ కుమార్, కౌషిక్ రవి, అర్జున్ రెడ్డి, రమేష్, విజయ్ కృష్ణ, శ్రవణ్ కుమార్, శరత్ కుమార్, ప్రియాంక లకు స్టేషన్ బెయిల్ లభించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు ఓ ప్రకటనలో వె ల్లడించారు. ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పార్టీలో అదుపులోకి తీసుకున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు ఉప్పర్ పల్లిలోని జడ్జి నివాసంతో ఆయన ఎదుట హాజరు పరిచ్చారు. వారికి బెయిల్ ఇవ్వాలని నిందితుల తరుపు న్యాయవాదులు వాదించారు. అయితే ప్రధానంగా గన్ ఫైరింగ్ గురించి పోలీసులు దృష్టి సారించడంతో ప్రభుత్వ న్యాయవాదులు సైతం ఆ దిశగానే వాదనలు వినిపించారు. కాగా, నిందితుల్లో మాజీ ఎంఎల్‌ఏ రోహిత్ రెడ్డి, టిడిపి ఎంపి మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌషిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి లకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఫాం హౌస్‌లోనే నిందితులకు యూరిన్ పరీక్షలు నిర్వహించగా, ఎంపి మహేష్ కుమార్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది. యూరిన్ పరీక్షల(ర్యాపిడ్ టెస్ట్) సమయంలో మహేష్ కుమార్‌కు నెగిటివ్ వచ్చిందని, తరువాత రక్త పరీక్షలు నిర్వహించడంతో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు జరుగుతోంది : ఈగిల్ ఎస్పీ గిరిధర్ ఈగిల్ ఎస్పీ గిరిధర్ రంగారెడ్డి ఈగిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాతూ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్ర గ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. డ్ర గ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే ఈగల్ టీమ్ లక్ష్యమని, ఆ విధంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయని, పోలీస్‌లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో అక్క డే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న వ్యక్తి సిల్వేరి శరత్ కు మార్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పా యింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చే సుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు. సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. ఫామ్‌హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డ్రగ్స్ వినియోగం గుర్తిస్తే టోల్ ఫ్రీ 1908 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం ఉంచుతామని తెలిపారు. పుట్టా మహేష్ పై చంద్రబాబు ఆగ్రహం ఆంధ్ర ప్రదేశ్ ఎంపి పుట్టా మహేష్ కుమార్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. డ్ర గ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఘటనపై మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ప ల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపి మహేష్‌కు పార్టీ అధ్యక్షుడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లోపు లిఖిత పూ ర్వక వివరణ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్లమెంట్ జరుగుతుంటే డ్రగ్స్‌తో చిందులు వేస్తున్న ఎంపి: వైస్ షర్మిలా రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంటే టిడిపి ఎంపి పుట్టా మహేష్ ఫాం హౌస్‌లో కొకైన్‌తో చిందులు వేస్తొన్నాడని ఏపిసిసి చీఫ్ వైస్ షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇదెక్కడి బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. పాజిటివ్ వచ్చిన ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఎంపి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 16 Mar 2026 5:30 am

తీవ్రరూపం దాలుస్తున్న వాణిజ్య సిలిండర్ల కొరత

రోజు రోజుకీ మూతపడుతున్న టీ స్టాల్స్, హోటళ్లు బ్లాక్‌లోనూ స్థిరంగా లేని వాణిజ్య సిలిండర్ల ధర గ్యాస్ సరఫరా పునరుద్దరిస్తే తప్ప ఏం చేయలేమని చేతులెత్తేస్తున్న వ్యాపారులు హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో వాణిజ్య సిలిండర్లకు కటకట మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం చిన్నచిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నుంచి రెస్టారెంట్ల వరకు తీవ్రంగా పడింది. ప్రైవేటు వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేయడం వల్ల పరిస్థితి క్రమేణా తీవ్ర రూపం దాలుస్తోంది. ఒక్కొక్కటిగా దుకాణాలు మూతపడుతూ రోజుకి వందల సంఖ్యలోనే మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న కమర్షియల్ ఎల్పీజీ సరఫరా కొరత కారణంగా చిరు వ్యాపారులు నుంచి రెస్టారెంట్ల వరకు తమ వ్యాపారాలను మూసుకుంటున్నారు. గత వారం రోజులుగా భారీగా హోటళ్లు, మెస్‌లు, చిరుతిళ్లు అందించే బండ్లపై నడిపే వ్యాపారాల వరకు వాణిజ్య సిలిండర్లు దొరక్క తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలపై వాణిజ్య సిలిండర్ల కొరత, సరఫరా నిలిపివేత ప్రభావం చాలా ఎక్కువ ఉందని చెబుతున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాల్లో ఆహార పదార్థాల సరఫరాపై తీవ్ర ప్రభావం పడి సగానికి సగం తయారు చేయడాన్ని నిలిపివేస్తున్నారు. గ్యాస్ సరఫరా మెరుగుపడితే తప్ప యధాతధ పరిస్థితికి రాదని ఖరాకండీగా చెబుతున్నారు. ఇక బ్లాక్‌లో సిలిండర్ కొనాలంటే పెద్ద సాహసమే అవుతోందని వాపోతున్నారు. బ్లాక్‌లో దొరికే వాణిజ్య సిలిండర్లను నాలుగు నుంచి ఆరు వేల వరకు కొనుగోలు చేసుకుని ధరలు పెంచి టిఫిన్లు, ఇతర తినుబండారాలను అందిస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్‌లో కూడా దొరక్కపోవడం, దొరికినా భారీ ధర చెప్పడంతో వ్యాపారం చేయలేక దుకాణాన్ని, లేదా టిఫిన్ బండిని మూసివేసుకుంటున్నారు. తీవ్రరూపం దాల్చిన వాణిజ్య సిలిండర్ల కొరత గత రెండు రోజులుగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రరూం దాల్చడంతో చేసేది లేక రెస్టారెంట్ల వరకు మూసుకుంటున్నారు. ఇక మెస్‌లు, హాస్టళ్ల వంటి చోట్ల మాత్రం ఎంతో కొంత వరకు గ్యాస్ మీద చేసినా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కట్టెల పొయ్యిలపై పరిమితంగా వంట చేసుకుని హాస్టళ్లలో ఉండే విర్థులు, ఉద్యోగార్థులకు అందిస్తున్నారు. ఇండ్లలో వాడుకునే డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా కొంచెం ఆలస్యమైనా ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. అయితే ఎక్కడైనా హోటళ్లు, మెస్‌లు, బండ్లమీద విక్రయాలు చేసే వారు డొమిస్టిక్ సిలిండర్లు వాడితే భారీ జరిమానా విధించి కేసు నమోదు చేస్తున్నారు. దీంతో వాటిని వినియోగించి చిక్కుల్లో పడ్డం దేనికంటూ వాపోతున్నారు. కొందరైతే గ్యాస్ దొరికితేనే వ్యాపారం చేద్దాం, లేదంటే ఇంకో పని చూసుకుందామని సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా టి పాయింట్లను మూసివేస్తున్నారు. గ్యాస్ దొరికిన వాళ్లు నడుపుతున్నారు, లేదంటే టి దుకాణాలను మూసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా చెన్నై, ఢిల్లీ, సూరత్, బెంగళూరు, భోపాల్, కోల్‌కత్తా వంటి మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.29 కోట్ల గృహ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీటిని 810 డిస్ట్రిబ్యూటర్లు అందిస్తున్నారు. దినసరి గ్యాస్ అవసరాలలో 86 శాతం గృహ అవసరాలకు, మిగిలిన 14 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. రోజువారీగా సుమారు 2.5 లక్షల సిలిండర్లు అవసరం ఉంటుందని అధికారిక అంచనా. బ్లాక్‌లోనూ గుది‘బండ’ బ్లాక్‌లో సిలిండర్లు కొనే వారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణంగా రూ. 1,800 నుంచి రూ. 1,900 వరకు ఉండే కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చేరింది. అది కూడా రెండు మూడు రోజుల ముందు చెబితేనే అందుతుంది. అయితే ఈ ధర నిలకడగా ఉంటుందని చెప్పే పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్ వంటి మహానగరం నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించకపోతే చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్ల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడం, ధరలు అమాంతం పెరగడం, రీఫిల్లింగ్ గడువు 25 రోజులకు పెరగడం వంటి కారణాలతో హోటల్ వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా హోటల్ రంగంపై ఆధారపడిన సిబ్బంది నిత్య జీవితం అస్తవ్యస్తంగా మారింది. వారి కుటుంబ పోషణ అధిక భారం కావడమే కాకుండా హోటల్లో పనిచేసే సిబ్బందికి కూడా వంట చేసుకునేందుకు గ్యాస్ లేకపోవడంతో లెక్కలేనన్ని బాధలు పడుతున్నారు. ఇక రోజువారీగా సిబ్బంది జీతాలు, హోటల్ అద్దె భారం పెరుగుతుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాపోతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నగరంలోని చిన్న హోటళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించకపోతే చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్ల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని ఆయా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ సరఫరా జరుగుతోంది. బహిరంగ మార్కెటల్లో వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరో వైపు ముమ్మరం చేసింది. వారం రోజుల్లో వాణిజ్య సరఫరా పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మన తెలంగాణ 16 Mar 2026 4:50 am

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు...వాతావరణ శాఖ అలర్ట్

ఐదు రోజులు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ మన తెలంగాణ/హైదరాబాద్ : మార్చి ఆరంభంలోనే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే అలర్ట్ ఇచ్చింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సుమారు 40 నుంచి -50 మి.మీ మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు, భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావం ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశాముందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తుందని, దీంతో మండే ఎండలతో సతమతమవుతున్న జనాలకు కొంత మేర ఉపశమనం లభించనుందని వివరించింది. ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో సోమవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మాల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

మన తెలంగాణ 16 Mar 2026 4:20 am

మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం

ఆరుగురికి పాజిటివ్ డ్రగ్స్ పార్టీ జరుగుతుండడంతో పకడ్బందిగా ఈగల్ టీం సోదాలు కాల్పులు, మాదక ద్రవ్యాల సరఫరాపై దర్యాప్తు జరుగుతోంది ఈగిల్ అధికారులు ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు ఆగ్రహాం మన తెలంగాణ/హైదరాబాద్/మొయినాబాద్ : మొయినాబాద్ ఫాం హౌస్‌లోని డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు బృందం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయన, పోలీస్‌లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో అక్కడే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న సిల్వేరి శరత్ కుమార్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పాయింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు. సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. నిందితుల్లో 11 మంది వ్యక్తులకు మాదకద్రవ్యాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఫామ్‌హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దర్యాప్తు జరుగుతోంది : ఈగిల్ ఎస్పీ గిరిధర్ ఈగిల్ ఎస్పీ మీడియాతో మాట్లాతూ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ ఫ్రీగా చేయాలన్నదే ఈగల్ టీమ్ లక్ష్యమని, ఆ విధంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. నిందితుల్లో పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), ఏపి టిడిపి ఎంపి పుట్ట మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయ కృష్ణ, వరమచనేని శ్రవణ్ కుమార్, మోరవినేని రమేష్, ప్రియాంక, సిల్వేరి శరత్ కుమార్‌లు ఉన్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ వినియోగం గుర్తిస్తే టోల్ ఫ్రీ 1908 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం ఉంచుతామని తెలిపారు. పుట్టా మహేష్ పై చంద్రబాబు ఆగ్రహాం ఆంధ్ర ప్రదేశ్ ఎంపి పుట్టా మహేష్ కుమార్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఘటనపై మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపి మహేష్‌కు పార్టీ అధ్యక్షుడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లోపు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్లమెంట్ జరుగుతుంటే డ్రగ్స్‌తో చిందులు వేస్తున్న ఎంపి: వైస్ షర్మిలా రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంటే టిడిపి ఎంపి పుట్టా మహేష్ ఫాం హౌస్‌లో కొకైన్‌తో చిందులు వేస్తొన్నాడని ఏపిసిసి చీఫ్ వైస్ షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇదెక్కడి బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. పాజిటివ్ వచ్చిన ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఎంపి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 16 Mar 2026 3:40 am

అప్పుడు పట్టిచ్చారు..... ఇప్పుడు పట్టుబడ్డారు

నాడు ఎమ్మెల్యేలకు ఎర.. నేడు డ్రగ్స్ పార్టీ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ పోలీసులకు ఉప్పు అందించిన అప్పటి కోడ్ భాష ‘నారియల్ పానీ లే అయియే’ తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తోన్న తాజా డ్రగ్స్ కేసు మన తెలంగాణ/హైదరాబాద్:  మూడున్నర ఏండ్ల కిందట (అక్టోబర్ 2022) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బుల ఎర కేసు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ పార్టీ రెండు సంచలన కేసులకు బీఆర్‌ఎస్ నాయకుడు, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ కేంద్ర బింధువుగా మారింది. అప్పుడు ఎమ్మెల్యేలకు డబ్బుల ఎర కేసులో పైలెట్ రోహిత్‌రెడ్డి స్వయంగా పోలీసులకు ఉప్పు అందించి నిందితులను పోలీసులకు పట్టించగా , తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ పార్టీపై అగంతకులు సమాచారం ఇచ్చి పోలీసులకు పట్టించడం కొసమెరుపు. సరిగ్గా తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి రెండు రోజుల ముందు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి డ్రగ్స్ సేవించి పట్టుబడగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా అక్కడ అధికార టిడిపికి చెందిన ఏలూరు ఎంపి పట్టా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ సేవించి పట్టుబడటంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను, అక్కడ అధికార పక్షం టీడీపీని రాజకీయంగా తీవ్ర ఇరకాటంలోకి నెట్టివేసిందని చెప్పవచ్చు. ఈ కేసులో తమ ఎంపి మహేశ్‌కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో అతనికి ఎపి టీడీపి షోకాజ్ నోటీసు జారీ చేసి 48 గంటలలో సంజాయిషీ ఇవ్వాలని కోరింది. అయితే తమ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయనపై బీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం సంజాయిషీ నోటీసు కూడా జారీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా డ్రగ్స్ కేసు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ప్రధాన చర్చకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ, తమ పార్టీ ఎమ్మెల్యేలతో సహా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్ పరీక్షకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. దీనికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిస్పందిస్తూ డ్రగ్స్ పరీక్షకు తాను సిద్దమేనని ప్రకటించారు. మొత్తం మీద రెండున్నర ఏండ్ల కిందట జరిగిన ఎ మ్మెల్యేలకు డబ్బుల ఎర కేసు, తాజాగా డ్రగ్స్ పార్టీ కేసులో బీఆర్‌ఎస్ నేత పైలెట్ రోహిత్‌రెడ్డి కేంద్ర బింధువుగా మారడం గమనార్హం. అప్పుడు ఏం జరిగింది అంటే అక్టోబర్ 26. 2022లో మొయినాబాద్‌లో బీఆర్‌ఎస్ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు (రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి) డబ్బుల ఎరచూపడానికి వచ్చిన రామచ్ంర ద భారతీ (ఢిల్లీ), సింహయాజులు (తిరుపతి), నందకుమార్ (హైదరాబాద్) చర్చిస్తోన్న సమయంలో సైబరాబాద్ పోలీసులు వచ్చి ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడటానికి వచ్చిన ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఉదంతంఅప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన ఫామ్ హౌస్‌లో ముందుగానే నాలుగు సీక్రెట్ కెమెరాలను అమర్చి ఎమ్మెల్యేలతో బేరసారాలను ఆడటానికి వచ్చినవారిని రోహిత్‌రెడ్డినే పట్టించిన విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. వారిని పోలీసులకు పట్టించడానికి అప్పుడు రోహిత్‌రెడ్డి వాడిన కోడ్ భాష (నారియల్ పానీ లే అయియే) అని సంకేతం ఇచ్చినట్టు కూడా పోలీసులు బయటపెట్టారు. కాగా తాజాగా బయటపడిన డ్రగ్స్ పార్టీపై అగంతకులు ఇచ్చిన పక్కా సమాచారంతో పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు 11 మందిని ఫ్యూచర్ సిటీ పోలీసులు, ఈగల్ టీమ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం విశేషం.

మన తెలంగాణ 16 Mar 2026 3:30 am

సోమవారం రాశి ఫలాలు (16-03-2026)

మేషం ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృషభం చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మిధునం వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తికావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కర్కాటకం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సింహం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కన్య వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. తుల ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వృశ్చికం రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ధనస్సు దైవచింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. మకరం అనుకోని అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుంభం నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. మీనం నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. గో సేవ చేస్తారు.  

మన తెలంగాణ 16 Mar 2026 12:20 am

UBS Will Become Big Hit Like Gabbar Singh: Pawan

The pre-release event was Ustaad Bhagat Singh was organized in a majestic manner, and of course, Power Star Pawan Kalyan’s presence is the biggest attractions. Director Harish Shankar opened up about the long and emotional journey of Ustaad Bhagat Singh. “I initially thought of making it as an extension of Khushi. But as the script […] The post UBS Will Become Big Hit Like Gabbar Singh: Pawan appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 12:05 am

కారుణ్య మరణం అనే మెర్సి కిల్లింగ్

భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ లేక కారుణ్య మరణం అనేది చట్టం ప్రకారం నేరం. కేవలం కోర్టులు మాత్రమే దానికి అనుమతించాలి. అప్పుడే డాక్టర్లు ఆ పేషెంట్ కు మరణాన్ని నిర్ధారించవచ్చు. పేషెంట్ మరణశయ్య పై ఉన్నాడని లేక వైద్యానికి రెస్పాండ్ కాలేదనో, కోమాలో ఉన్నాడనో వైద్యాన్ని ఆపేసే హక్కు వైద్యులకు లేదు. పాసివ్ యూధనేషియా అంటే కారుణ్య మరణం ప్రసాదించాలి అంటే కేవలం కోర్టులు మాత్రమే జోక్యం చేసుకొని ప్రసాదించాలి. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో అవిభాజ్యంగా ఉంటుంది అనేది కోర్టు తీసుకున్న నిర్ణయం. ఇది చాలా దేశాలలో ఉన్నప్పటికీ మన భారత దేశంలో మొట్టమొదటిసారిగా దీనిని అమలు చేశారు. ప్రజలు కానీ డాక్టర్లు గాని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెర్సి కిల్లింగ్ అనేది కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలి. వైద్యులు ఇక పేషెంట్ ఏమాత్రం వైద్యానికి రెస్పాండ్ కాడు అతను జీవచ్ఛవమే అతను బ్రతికినప్పటికీ అతనికి ఎటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అని మాత్రమే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. తరువాత వారికి మరణాన్ని ప్రసాదించాలి అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. ఇది మేము మెడికల్ ఎథిక్స్ లో ఒక భాగంగా చెబుతూ ఉంటాం. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 15 Mar 2026 10:54 pm

NtrTrust |నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ

NtrTrust | నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ NtrTrust | ఎన్‌టీఆర్ ట్రస్ట్: ప్రాంతాలకతీతంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 10:34 pm

ఉప్పల్ లో ప్లే గ్రౌండ్‌లో ఘర్షణ… మెయిన్ రోడ్డుపై కానిస్టేబుల్ హత్య

చిల్కానగర్‌లో దారుణ ఘటన పిలిపించి పబ్లిక్ చూస్తుండగానే కత్తులతో వెంటపడి దాడి భయంతో పరుగులు తీసిన స్థానికులు మన తెలంగాణ / ఉప్పల్: ఉప్పల్ పరిధిలోని చిల్కానగర్ రోడ్డులో ఆదర్శనగర్ సాయిబాబా గుడి వద్ద ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం… చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న సుధీర్ రెడ్డి (35) హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం చిల్కానగర్ రోడ్డులోని ఆదర్శనగర్ ప్లే గ్రౌండ్ వద్ద కొంతమంది యువకులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం దుండగులు సుధీర్ రెడ్డిని వెంబడిస్తూ మెయిన్ రోడ్డువరకు వచ్చి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. పలుమార్లు కత్తులతో పొడవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఘటన అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. పబ్లిక్ చూస్తుండగానే ఈ దాడి జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడు సుధీర్ రెడ్డి స్నేహితుడైన సంతోష్ నాయక్ అనే వ్యక్తి పేరు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చిల్కానగర్ ప్రాంతానికి పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:13 pm

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. పరీక్షకు కెటిఆర్ సిద్ధమా ?

ప్రశ్నించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మన తెలంగాణ/హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా? అని ఆయన ఆదివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పట్టుబడడంపై కెటిఆర్, ఇంకా ఆయన బృందం స్పందించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేదని, ఈగల్ టీంకు లభించిన సమాచారం మేరకు తన కర్తవ్యాన్ని నిర్వహించిందని ఆయన చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఈగల్ టీం తమకు లభించిన పక్కా సమాచారం, ఆధారాలతో దాడులు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరి కొందరు నాయకులు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం తెలిసే ఈగల్ టీం దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. నో-డ్రగ్స్- సేవ్ తెలంగాణ ఇదిలాఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణలో నో-డ్రగ్స్&సేవ్ తెలంగాణ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ కెటిఆర్‌ను, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తూర్పారబట్టారు. డ్రగ్స్ సంస్కృతి తెచ్చిందే కెటిఆర్ ఎంతో ప్రశాంతంగా ఉండే మొయినాబాద్‌లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను డ్రగ్స్ వైపు కెటిఆర్ ఉసిగొల్పారని పిసిసి అధికార ప్రతినిధి గౌరి సతీష్ ఆరోపించారు. సమాజంలో సంఘవిద్రోహ శక్తులుగా కెటిఆర్ నిలిచిపోతారని ఆయన హెచ్చరించారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:07 pm

డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం

ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా నా పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుంది బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. డ్రగ్స్ వాడేవారు ఎవరైనా, ఏ పార్టీకి చెందినవారైనా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ఏ టెస్టుకైనా తాను సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయించుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని, మనమే ఉదాహరణగా నిలుద్దాం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అని పేర్కొన్నారు. డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా తాను వ్యతిరేకం అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని బిఆర్‌ఎస్ పార్టీపై బురద చల్లడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా తన పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మన తెలంగాణ 15 Mar 2026 9:57 pm

ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు

మొదటి విడతలో ఒక ఎకరం వరకు 70 లక్షల మంది ఖాతాల్లో రూ.3,590 కోట్లు 20 రోజుల్లో రూ.2,650 కోట్లు సిఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేయనున్నట్లు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈమేరకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సిఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాల్లో నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి నుండే రైతు భరోసా తొలి విడుత నిధులు విడుదల చేయనున్నారు. తొలి విడత రైతు భరోసాలో ఒక ఎకరం భూమి కలిగిన 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తరువాత రెండో విడత రైతు భరోసా నిధులు రూ. 2,650 కోట్ల రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివర వరకు మూడోవిడతగా మొత్ంత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని, మూడు విడతలుగా మొత్తం సుమారు తోమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

మన తెలంగాణ 15 Mar 2026 9:36 pm

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందాం

ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు హాజరైన సిఎం, మంత్రులు, పిసిసి చీఫ్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహాభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. ఎల్.బి.స్టేడియంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రంజాన్ పవిత్ర మాసం సమాజంలో సఖ్యత, సోదర భావం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని మనమంతా కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి అవసరం అని ముస్లీంలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వందలాది మంది మైనార్టీ యువతీ యువకులకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు తీసుకువచ్చిన 4 శాతం రిజర్వేషన్లే కారణం అని సిఎం పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ద్వారా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి, షబ్బీర్ అలీకి సలహాదారుగా, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డిఎస్‌పిగా ఉద్యోగ కల్పించడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. 8 మంది మైనారిటీ నాయకులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ రంజాన్ పండుగ ప్రజల్లో సఖ్యత, సోదరభావం తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ మత సామరస్యంతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు అని, విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం అని వ్యాఖ్యానించారు. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత అని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు. ఈ ఇఫ్తార్ విందులో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.  

మన తెలంగాణ 15 Mar 2026 9:23 pm

పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది

పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది నమిలిగొండలో పారిశుధ్య కార్మికులకు ఘనంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:20 pm

ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి

ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:05 pm

కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి

కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి చౌటుప్పల్,ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:58 pm

వైసిపి నేత ఇఫ్తార్ విందు..

విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత […] The post వైసిపి నేత ఇఫ్తార్ విందు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 8:56 pm

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:54 pm

బాబాపూర్ లో వరకట్నం నిషేధం

బాబాపూర్ లో వరకట్నం నిషేధం ఇంటింటికి తోచినంత సహాయం వధువుకు అందజేత ఉట్నూర్,

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:50 pm

కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి

విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్ వెల్ కూలీ సంతురాం (35) మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా బోర్ వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న సంతురాం, పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో సంతురాం వాహనం కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ […] The post కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 8:44 pm

వృద్ధురాలి కాళ్లపై ఎక్కిన ఆర్టీసీ బస్సు

వృద్ధురాలి కాళ్లపై ఎక్కిన ఆర్టీసీ బస్సు పలమనేరు,ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:42 pm

వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి

వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి అప్పుతీసుకొన్న వ్యక్తికి తెగిన చేతివేళ్లు గంగవరం,

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:39 pm

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం […] The post అప్పుల బాధతో రైతు ఆత్మహత్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 8:37 pm

ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి

ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన మర్రి ప్రశాంత్, శ్రావణి అనే దంపతులు హైదరాబాద్ లోని రాంనగర్ లో నివసిస్తున్నారు. దంపతులు తమ కుమారుడు సహస్రాతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి ఎరుపు రంగు కారు ఢీకొట్టడంతో వారు కిందపడిపోయారు. భార్యభర్తలు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో ఉద్యోగిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజీకి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మన తెలంగాణ 15 Mar 2026 8:28 pm

రేపటి నుంచి ఒంటిపూట బడులు

ఉ.8 నుంచి మ.12:30 వరకు తరగతులు టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లకు పరీక్షలు జరిగే రోజుల్లో మ.1 గంట నుంచి సా. 5 వరకు క్లాసులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం ఒంటిపూట బడులు (హాఫ్‌డే స్కూల్స్) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. అయితే, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. అలాగే, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కేంద్రాలు కూడా 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.

మన తెలంగాణ 15 Mar 2026 8:20 pm

పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక

పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:11 pm

మూసీ భూములు ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే యత్నం

రేవంత్‌రెడ్డి చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారు పూర్తి డిపిఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన పేరుతో దాని పరివాహక ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటి వరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డిపిఆర్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదని, ఫేజ్ -1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను మాత్రమే చూపించిందని అన్నారు. పూర్తి వివరాలు ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని విమర్శించారు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో ఈ ప్రాజెక్టుకు రూ. 5,641 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపిందని, అయితే ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు రూ. 1,400 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగిందని అన్నారు. ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ, సిఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి అరాచకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇప్పటివరకు ఆరు ఫిర్యాదులు చేశామని ప్రస్తావించారు. అవసరమైతే హైడ్రా కమిషనర్, ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నాళాలను ఆక్రమించి విల్లాలు నిర్మిస్తున్న సంస్థ తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు పెడుతున్నారని.. మీరేమైనా కంటెంట్ రైటర్లా ...? అంటూ ధ్వజమెత్తారు. హైడ్రా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. తాను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం, హైడ్రా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. హైడ్రా చేసిన ట్వీట్లు వెంటనే డిలీట్ చేయాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం చిన్న మోదీలా ఉంది గాంధీ విగ్రహం కోసం రూ.70 కోట్లు, రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే ప్రభుత్వం, సిఎం ఇంటి నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇళ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో చిన్న మోదీలా ఉందని వ్యాఖ్యానించారు. 2017లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును తిరస్కరించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అనుమతులు ఇచ్చిందని అన్నారు. మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నగరంలోని 16 నాళాల నుంచి మురికి నీరు మూసీలోకి వస్తోందని, నగర వ్యర్థాలన్నీ మూసీలోకే వెళ్తున్నాయని తెలిపారు. 1,430 ప్రాపర్టీలను కూల్చివేస్తామని ప్రభుత్వం చెబుతోందని, దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, అసలైన బాధితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాను, విశారదన్ కలిసి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఖమ్మంలో పర్యటిస్తామని కవిత తెలిపారు. వెలుగుమట్లలో నిజమైన బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తాను, విశారదన్ కలిసి చేసిన పోరాటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆమె పేర్కొన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 8:06 pm

బడ్జెట్ సమావేశాలకు కెసిఆర్ వస్తారా..?

ఎప్పటిలానే దూరంగానే ఉంటారా...? మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా...? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెసిఆర్ సభకు హాజరవడంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలకు రాకపోవచ్చని పలువురు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. తర్వాత రెండు రోజులు మంగళ, బుధవారాలు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇతర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 15 Mar 2026 8:03 pm

డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ పుట్ట మహేష్, రోహిత్ రెడ్డి పై చర్య తీసుకోవాలి

క్రీడలను యువత అభివృద్ధి కోసం వినియోగించాలి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా. కె. నారాయణ మన తెలంగాణ / హైదరాబాద్ : డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన టిడిపి ఎంపి పుట్ట మహేష్, మాజి ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి పై కఠిన చర్యలు, తీసుకోవాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా.కె. నారాయణ డిమాండ్ చేశారు. క్రీడలను కార్పొరేట్ లాభాల కోసం కాకుండా యువత అభివృద్ధి కోసం వినియోగించాలని ఆయన కోరారు. ఐపిఎల్ పేరుతో క్రీడాకారులను సంతలో సరుకుల్లా కొనుగోలు చేసే క్రీడా వ్యాపారాన్ని అరికట్టాలని నారాయణ కోరారు. ఎఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్ లో ఈ నెల 12నుండి 17వరకు నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్(బిపిఎల్) టోర్నీ నాల్గవ రోజు నారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి మొలుగురం కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా నారాయణ మాట్లాడుతూ దేశంలో క్రీడల అభివృద్ధి విషయంలో పాలక వర్గాలు అవలంబిస్తున్న విధానాలను తప్పుపట్టారు. దేశ యువతలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడా సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు వాటిని కార్పొరేట్ లాభాల కోసం ఉపయోగించే విధంగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ వంటి విప్లవ వీరుల ఆశయాలు యువతకు ప్రేరణ కావాలని నారాయణ పేర్కొన్నారు. యువత క్రీడలు, విద్య, సామాజిక బాధ్యతల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడలను కూడా వ్యాపారంగా మార్చి బెట్టింగ్ యాప్స్, మాదకద్రవ్యాల సంస్కృతి యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని హెచ్చరించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, పోరాటస్ఫూర్తి పెంపొందించే గొప్ప సాధనమని అన్నారు. భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ యువతలో చైతన్యం కలిగించే మంచి కార్యక్రమమని అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి మొలుగురం కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన సమస్యగా మారిందని, విద్యార్థులు, యువత అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యలో ముందుండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు, యువత ముందుండాలని, ఈ దిశగా యువతలో చైతన్యం కలిగించడానికి రెఐవైఎఫ్ నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అభినందనీయమని ఉప కులపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. సత్య ప్రసాద్, శ్రీమాన్, ఎఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్, రాజ్ కుమార్, మహేష్, భాను, సక్రి భాయి, హరీష్ లతో పాటు 5 టీమ్ ల క్రీడాకారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 7:59 pm

చికెన్ ధరలు పైపైకి...!

ప్రస్తుతం కిలో రూ.320..రానున్న రోజుల్లో రూ.380కి చేరే ఛాన్స్? మన తెలంగాణ/హైదరాబాద్ : అన్‌సీజన్‌లోనూ చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ట్రిపుల్ సెంచరీ దాటడంతో సామాన్యులకు చికెన్ కూర దూరమవుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సాధారణంగా డిమాండ్ తక్కువగా ఉండే అన్ సీజన్‌లోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటేసి కిలోకు రూ.320 వరకు అమ్ముడవుతున్నాయి. స్థానిక మార్కెట్లలో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం తో.. సామాన్య జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ ధర ఎంత అని అడిగి మరీ కొనకుండా వెళ్లిపోతున్నారని వ్యాపారాలు అంటున్నా రు. ఇదే ధరకు హాఫ్ కేజీ మటన్ వస్తది కదా అంటూ కొనకుండా కొనుగోలు దారులు వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం షాప్స్ అన్ని ఖాళీగా దర్శన మిస్తు న్నాయి. గతంలో ఇదే సమయంలో చికెన్ ధరలు తక్కువగా ఉండేవి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాపారులు చెబుతున్నా రు. పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా తగ్గిపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వారు వాపోతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో మార్కెట్‌లో చికెన్‌కు కొరత ఏర్పడిందని వ్యాపారుల మాటగా వినవస్తోం ది. ఈ కారణాల వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశ ముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనే కిలో చికెన్ ధర రూ.380 వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత భారంగా మారే అవకాశముందని సామాన్యులు ఆందోళన వ్యక్తపరుస్తు న్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 7:54 pm

సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం…

సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:46 pm

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:42 pm

సీఎం చంద్రబాబు సీరియస్‌

సీఎం చంద్రబాబు సీరియస్‌ ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:36 pm

పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న క‌లెక్ట‌ర్‌…

పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న క‌లెక్ట‌ర్‌… అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం…95,598 మంది

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:24 pm

సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ

సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ మోత్కూర్, ఆంధ్రప్రభ : జిల్లా రచయితల

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:15 pm

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ కాంగ్రెస్

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:14 pm

జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం

జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:11 pm

నెతన్యాహు క్షేమంగా ఉన్నారు

వదంతుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటన టెల్ అవీవ్ : ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలో మరణించి ఉంటారని వస్తున్న ఊహాగానాలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. నెట్టింట ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేసింది. ఇక నెతన్యాహు తనయుడు కూడా కొన్ని రోజులుగా కనిపించట్లేదన్న వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన మార్చ్ 9 నుంచి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత శుక్రవారంనాడు నెతన్యాహు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన వీడియో సందేశంతో కూడిన పోస్ట్‌పై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ వీడియోలో పలు మార్లు నెతన్యాహు చేతి వేళ్లు ఆరు ఉన్నట్లు కనిపించాయి. అది ఏఐ వీడియో అని, నెతన్యాహు మరణించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 15 Mar 2026 7:07 pm

రైతన్నా మీకోసం.. రైతుల్లో అవ‌గాహ‌న‌…

రైతన్నా మీకోసం.. రైతుల్లో అవ‌గాహ‌న‌… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:58 pm

నెతన్యాహు బతికి ఉంటే వెంటాడి చంపుతాం

నెతన్యాహు చిన్నారుల హంతకుడు ఇప్పటికీ ఆయన ఉనికిపై అనుమానాలు ఉన్నాయి ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరిక టెహ్రాన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బయటి ప్రపంచానికి కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఉనికిపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతుతన్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఘాటు హెచ్చరిక చేసింది. నెతన్యాహు బతికి ఉన్నట్టయితే ఆయనను వెంటాడి మరీ అంతమొందిస్తామని హెచ్చరించింది. చిన్నారులను పొట్టనపెట్టుకున్న హంతకుడిగా నెతన్యాహును అభివర్ణించింది. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారా అనేది మాత్రం అనుమానమేనని ఇరాన్ అభిప్రాయపడింది. నెతన్యాహు మరణించి ఉంటాడని?.. లేకపోతే కుటుంబంతో పాటు దేశాన్ని వీడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇటీవల నెతన్యాహు పత్రికా సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వీడియోలో నెతన్యాహు చేతికి ఏకంగా ఆరు వేళ్లు ఉండటం గమనించిన కొందరు అది ఏఐతో చేసిన వీడియో అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో అమెరికా రాజకీయాల విశ్లేషకురాలు కాండిస్ ఓవెన్స్ కూడా నెతన్యాహు ఎక్కడ? అని ప్రశ్నించడం మరింత కలకలం రేపింది.

మన తెలంగాణ 15 Mar 2026 6:51 pm

అనాధ పిల్లలకు అభిమన్యు గ్రూప్ ఆత్మీయ సహాయం

అనాధ పిల్లలకు అభిమన్యు గ్రూప్ ఆత్మీయ సహాయం రూ. 90,500 సహాయం చేసి

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:50 pm

Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry Polls Scheduled

The Election Commission of India has announced the schedule for the upcoming Assembly elections in five states. The elections will take place in Tamil Nadu, Kerala, West Bengal, Assam, and the Union Territory of Puducherry. The current terms of these assemblies are set to end in May and June, so the polling process will be […] The post Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry Polls Scheduled appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 6:46 pm

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:42 pm

10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున

10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:40 pm

ఎడపల్లి మండలంలో అకాల వర్షం…

ఎడపల్లి మండలంలో అకాల వర్షం… ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో ఆదివారం

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:38 pm

ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:28 pm

ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం

ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం జనగామ అర్బన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:23 pm

మాన్యవర్ కాన్షీరాంకు వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలి….

మాన్యవర్ కాన్షీరాంకు వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలి…. బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:23 pm

దూడల రాములు గౌడ్ కు ఘన నివాళి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన సీనియర్

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:22 pm

சிலிண்டர் இலவசமாக வழங்கப்படும் என பிரதமர் மோடி அறிவித்தாரா?

இலவச சிலிண்டர் வழங்கப்படும் என பிரதமர் மோடி அறிவித்ததாக தவறான தகவலுடன் டீப்பேக் வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது.

తెలుగు పోస్ట్ 15 Mar 2026 6:21 pm

జానకీబాయి యూత్ సేవలు ఆదర్శం

ఎడపల్లి, ఆంధ్రప్రభ: రాణి శీలం జానకీబాయి పేరుతో ఏర్పడిన జానకంపేట గ్రామంలో యువకులు

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:19 pm

పోలీసుల తనిఖీ నుంచి తప్పుంచుకోబోయి.. లారీ ఢీకొని యువకుడు మృతి

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఔటుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ట్యూషన్‌కు వెళ్లి అన్నదమ్ములు తిరిగి ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు వాహనాల తనఖీలు చేపట్టారు. యువకుడు భయపడి బైక్‌ను వెనక్కి తిప్పే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దర్నీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రణయ్ మరణించాడు. అతడు కీసరపల్లివాసిగా పోలీసులు గుర్తించారు. అయితే బైక్‌ను ఆపే క్రమంలో.. కానిస్టేబుల్ వెంటపడి బైక్ హ్యాండిల్‌ను పట్టుకొని లాగారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 6:14 pm

కాంగ్రెస్ తోనే ముస్లింల అభివృద్ధి సాధ్యం

తొర్రూరు, ఆంధ్రప్రభ : ముస్లింల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:14 pm

మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత…

మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత… రాయపర్తి, ఆంధ్రప్రభ : కొండూరు గ్రామ మత్స్యకార

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:11 pm

నేత్రదానంతో ‘సజీవం’.. సత్యప్రకాష్ కుటుంబీకుల ఆదర్శం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తన నేత్రాల

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:08 pm

నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీలివే.. షెడ్యూల్ ఇదే

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది

తెలుగు పోస్ట్ 15 Mar 2026 6:08 pm

ఇల్లు దగ్దం.. కుటుంబానికి స‌హాయం…

ఇల్లు దగ్దం.. కుటుంబానికి స‌హాయం… 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ హసన్

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:07 pm

డ్రగ్స్ కేసులో టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేష‌న్ బెయిల్‌

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేష‌న్ బెయిల్‌ లభించింది. టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి రోహిత్ రెడ్డిని తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.  రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే టిడిపి ఎంపిని వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండడంతోనే స్టేషన్ బెయిల్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపి పుట్టా మ‌హేష్‌కు సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురికి పాజిటివ్ రాగా అందులో  బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ పెలైట్ రోహిత్ రెడ్డి తో పాటు అయన సోదరుడికి పాజిటివ్ వచ్చింది. 

మన తెలంగాణ 15 Mar 2026 5:59 pm

ధ్యానంతో మానసిక ప్రశాంతత..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రతినిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు సంపూర్ణ

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:28 pm

గ్రామ పంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానం

ములకలపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ కార్మికుల ను కమాలపురం సర్పంచ్ వగ్గేల

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:22 pm

నాలుగు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ వివరాలను వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో అంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. కాగా మే 4న కౌంటింగ్ జరుగనుంది. పుదుచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్‌లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు షెడ్యూల్ ప్రకటించారు.

మన తెలంగాణ 15 Mar 2026 5:19 pm

Biotechnologies |పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు..

Biotechnologies | పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు.. జిల్లాలో విజ‌య‌వంతంగా పీ4

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:15 pm

పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం..

పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:12 pm

అండర్-19 ఎంపిక ట్రయల్స్..

అండర్-19 ఎంపిక ట్రయల్స్.. కే డి సి ఏ ఆధ్వర్యంలోమార్చి 19న విజయవాడలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:00 pm

అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి

అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; అంబేద్కర్

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:00 pm

దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్..

దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్.. విజయవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:58 pm

Ex BRS MLA Named A2, TDP MP A7 in Moinabad Farmhouse Drug Case

The FIR registered by Moinabad Police in the alleged drug party case at the farmhouse in Aziz Nagar village lists 11 accused, including political figures from BRS and TDP. MP Putta Mahesh Yadav was granted station bail in the Moinabad drug case. Bail was also given to Priyanka Reddy along with the MP. Police cited […] The post Ex BRS MLA Named A2, TDP MP A7 in Moinabad Farmhouse Drug Case appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 4:55 pm

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం: కెటిఆర్

హైదరాబాద్: టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరినట్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం మని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. డ్రగ్స్ వాడకం, చట్ట విరుద్ధ కార్యకలాపాలను బిఆర్ఎస్ ఖండిస్తుందని చెప్పారు. డ్రగ్స్ వినియోగించేది ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘‘రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలి. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశా. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలి. డ్రగ్స్ కేసులో నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా’’ అని కెటిఆర్ అన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 4:52 pm

పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది

పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గ్రామం పరిశుభ్రంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:51 pm

ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు..

ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు.. చారిత్రక ఆధారాలను పరిశీలించిన దేవస్థానం బృందంఇంద్రకీలాద్రి పర్వత శిఖరం

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:51 pm

Moinabad Drugs Case: Putta Mahesh Granted Station Bail; KTR Accepts Drug Test Challenge

The drugs case linked to former MLA Pilot Rohith Reddy’s farmhouse in Moinabad is creating fresh political and legal controversy. Police carried out a raid at the farmhouse after receiving specific information about a drugs party. The Eagle Team conducted the operation and detained ten people who were present at the location. Among those at […] The post Moinabad Drugs Case: Putta Mahesh Granted Station Bail; KTR Accepts Drug Test Challenge appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 4:33 pm

భజరంగ్ దళ్ కన్వీనర్ గా కొమ్ము శ్రావణ్

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ భజరంగ్ దళ్

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:29 pm