SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

19    C
... ...View News by News Source

గిరిజనులకు కెసిఆర్ చేసిన సేవలు చిరస్మరణీయం

గిరిజనులకు కెసిఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు.తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించి, గిరిజనులకు పోడు భూములపై హక్కులను కల్పించే విధంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతుబందు పథకాన్ని అనువర్తింపజేశారని అన్నారు. ఎన్నో ఏండ్ల గిరిజన కలలను సాకారం చేసిన స్వాప్నికుడు కెసిఆర్ సేవలను తండాలలో గూడాలలో గిరిజన జాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన గిరిజనుల ఆత్మబంధువు అనే పుస్తకాన్ని కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన తండాలు, గూడాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన రోజు ఆగస్టు 2వ తేదీన అన్ని గిరిజన గ్రామాలలో గిరిజన సంబురం కార్యక్రమాన్ని నిర్వహించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవిప్రసాద్, బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 11:24 pm

ఒపెన్ టెన్త్,ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల

 రాష్ట్రంలో ఒపెన్ టెన్త్,ఇంటర్మీడియేట్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 11 నుంచి 26 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పి.వి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుంతో ఈ నెల 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో జనవరి 3 నుంచి 7 జనవరి వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. తత్కాల్ కింద జనవరి 8 నుంచి జనవరి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఒపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు 2026 మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 11:19 pm

కెటిఆర్‌కు పగ్గాలు అప్పగించి పరీక్షిస్తున్న కెసిఆర్: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు పగ్గాలు అప్పగించి పరీక్షిస్తున్నారన్న అనుమానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే బిజెపి, బిఆర్‌ఎస్‌కు లేదని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. కెసిఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రానంత కాలం ఆ పార్టీ మనుగడ కష్టమేనని అయన తెలిపారు. కెటిఆర్‌కు పగ్గాలు అప్పగించి ఎంత వరకు సక్సెస్ అవుతారో చూద్దామని పరీక్షిస్తున్నారని అన్నారు. కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను బయటకు పంపించారని, టి. హరీష్ రావు అనుమానాస్పదంగా ఉన్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని అద్దంకి దయాకర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం తనకు రెండు కళ్ళవంటివని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారని, జరుగుతున్న అభివృద్ధిని చూసి బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు.

మన తెలంగాణ 6 Dec 2025 11:16 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల పక్షపాతి

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:53 pm

అభివృద్ధి నా లక్ష్యం… మీ ఆశీర్వాదం కావాలి

జైనూర్, ఆంధ్రప్రభ : గత పంచాయతీ ఎన్నికల్లో 94 ఆక్ట్ కారణంగా తాను

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:50 pm

రష్యాతో పతంజలి గ్రూప్ ఎంఓయూ

న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ శనివారం రష్యా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఆ దేశంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు, ఆరోగ్య పర్యాటకం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల మార్పిడి మరియు పరిశోధన సంబంధిత కార్యక్రమాలను ప్రోత్సహించడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం. పతంజలి గ్రూప్ తరఫున రాందేవ్, ఇండో-రష్యా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్, రష్యా వాణిజ్య మంత్రి సెర్గీ చెరెమిన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. బాబా రాందేవ్ మరియు ఆచార్య బాలకృష్ణ స్థాపించిన పతంజలి గ్రూప్, పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్స్(గతంలో రుచి సోయా)తో కూడిన ఆయుర్వేద మరియు ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన భారతీయ సమ్మేళనం.ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రాందేవ్.. రష్యాలో ప్రజలు యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యాన్ని ఆదరిస్తున్నారని, చురుకుగా అభ్యసిస్తున్నారని అన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 10:42 pm

జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో..

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:37 pm

ఒకే వేదికపై సిఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఒకే వేదికపై మెరిశారు. శనివారం గచ్చిబౌలిలోని జీఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్-2 కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిధుల హర్షద్వానాల మధ్య బైకర్స్ చేసిన విన్యాసాలు చూపురులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సిఎం రేవంత్, సల్మాన్ ఖాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మన తెలంగాణ 6 Dec 2025 10:12 pm

తొగర్‌పల్లిని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : తొగర్‌పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:09 pm

ఐదో రోజు కొనసాగిన విమాన సర్వీసుల రద్దు

ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఐదో రోజు కొనసాగింది. శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (శంషాబాద్) విమానాశ్రయంలో 69 సర్వీసులు రద్దు అయ్యాయి. హైదరాబాద్ నుండి వెళ్లాల్సిన 43 సర్వీసులు, ఇక్కడికి రావాల్సిన 26 విమానాలు రద్దు ఇండిగో రద్దు చేసింది.దీంతో ఇండిగో కౌంటర్ల వద్ద తమ ప్రయాణాలకు సంబంధించిన టికెట్ల వివరాలు, రీఫండ్, ప్రత్యామ్నాయ ప్రయాణాల కోసం బారు తీరారు. అధికారుల సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు నిరసనలు, నినాదాలతో శంషాబాద్ విమానాశ్రయం దద్దరిల్లింది. సరయిన సమాధానం చెప్పకుండా ఇండిగో సిబ్బంది దాటవేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల పడిగాపులు, ఆందోళనలతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. డిజిసిఏ నిబంధనలు విరమించు కున్నప్పటికి సమస్య విమాన సర్వీసులు రద్దు కొనసాగడం పట్ల ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన తొమ్మిది విమానాలు రద్దయ్యాయి. ఇందులో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. కాగా, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరో 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా శనివారం వరకు 400కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లు సంస్థ వెల్లడించింది. 00000

మన తెలంగాణ 6 Dec 2025 10:06 pm

భట్టి విక్రమార్కతో చిరంజీవి, నాగార్జున కీలక భేటీ

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని భట్టి విక్కమార్క ఆహ్వానించారు. తప్పకుండా వస్తామని చిరంజీవి, నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది.

మన తెలంగాణ 6 Dec 2025 10:03 pm

తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్​కు సాదర ఆహ్వానం

మక్తల్ , ఆంధ్రప్రభ : హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:00 pm

బయోకాన్‌లో బయోలాజిక్స్ విలీనం

బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ బయోలాజిక్స్ యూనిట్ బయోకాన్‌లో విలీనం కానుంది. దాని విలువ 5.5 బిలియన్ డాలర్లు. బయోకాన్ బయోలాజిక్‌ను తనతో పూర్తిగా అనుసంధానించనున్నట్లు బయోకాన్ శనివారం తెలిపింది. బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ లో మిగిలిన వాటాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆప్ లైఫ్ సైన్సెస్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్2 మరియు యాక్టీవ్ పైన్ ఎల్‌ఎల్‌పిల నుండి వాటా స్వాపింగ్ ద్వారా కొనుగోలు చేస్తుంది. దీని విలువ 5.5 బిలియన్ డాలర్లు అని బెంగళూరుకు చెందిన కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రతి 100 బయోకాన్ బయోలాజిక్స్ షేర్లకు 70.28 బయోకాన్ షేర్ల చొప్పున, ప్రతి బయోకాన్ షేర్‌కు 405.78 రూపాయల చొప్పున షేర్-స్వాప్ నిష్పత్తి నిర్ణయించారు. ఇంకా, బయోకాన్ మైలాన్ ఇంక్ (వయాట్రిస్) కలిగి ఉన్న మిగిలిన వాటాను మొత్తం 815 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తుంది, ఇందులో 400 మిలియన్ డాలర్లు నగదు రూపంలో మరియు 415 మిలియన్ డాలర్లు షేర్ స్వాప్ ద్వారా చెల్లించనున్నట్లు వెల్లడించింది.  

మన తెలంగాణ 6 Dec 2025 9:57 pm

ఒక్క అవకాశం ఇవ్వండి..గ్రామాభివృద్ధి చేసి చూపిస్తా

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క అవకాశం

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:53 pm

వైభవంగా అయ్యప్ప పడిపూజోత్సవం..

కరీంనగర్, ఆంధ్ర‌ప్ర‌భ : అయ్యప్ప స్వామి మహా పడిపూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:33 pm

రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో అర్ధ శతకంతో రాణించిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాల్గవ భారత బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్(34,357 పరుగులు), విరాట్ కోహ్లీ(27,910 పరుగులు), రాహుల్ ద్రవిడ్‌(24,064 పరుగులు)లు ఈ ఫీట్ సాధించారు. ఇక, వన్డేలో రోహిత్ 11,441 పరుగులు, టెస్ట్‌లలో 4,301, T20Iలో 4,231 పరుగులు సాధించాడు.  ఇక, మూడో వన్డే మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో తొలి శతకం నమోదు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 75 పరుగులతో రాణించాడు. ఇక, విరాట్ కోహ్లీ 65 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ 10 ఓవర్ల ఉండగానే మ్యాచ్ ను ముగించేసింది. ఈ విజయంతో టీమిండియా 2-1తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

మన తెలంగాణ 6 Dec 2025 9:32 pm

దేవస్థానం కాంట్రాక్టర్ల పై నియంత్రణ..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : నిత్యం వేల సంఖ్యలో కనకదుర్గమ్మ వారి దర్శనానికి

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:28 pm

ప్రజా పాలనకు ఓటేయ్యాలి

ప్రజా పాలనకు ఓటేయ్యాలి రాజాపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ పాలనలో పల్లెలు సుబిక్షంగా

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:16 pm

ఆత్మీయత వెల్లివిరిసిన ఆతిధ్యం.. పుతిన్ విందుపై శశిథరూర్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందుకు ప్రతిపక్షం లోని రాహుల్‌ను లేదా ఖర్గేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌ను పిలవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శశిథరూర్ విందుపై స్పందిస్తూ ఆ వాతావరణం ఆత్మీయత వెల్లివిరిసిన ఆతిథ్యంగా అభివర్ణించారు. విందులో పాల్గొన్న అనేక మంది ప్రతినిధులతో ముఖ్యంగా రష్యా ప్రతినిధులతో చర్చించే అవకాశం ఎంతో ఆనందం కలిగించిందని తన సామాజిక మాధ్యమ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మండిపడింది. ఈ విందులో థరూర్ పాల్గొనడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ నేత పవన్‌ఖేడా విమర్శించారు. తామంతా పార్టీలోనే ఉన్నప్పుడు మన నాయకులను ఆహ్వానించకుండా మనం పాల్గొనడాన్ని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 9:15 pm

Kishan Reddy |కేంద్ర నిధులు దుర్వినియోగం…

Kishan Reddy | కేంద్ర నిధులు దుర్వినియోగం… ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి :

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:13 pm

Exclusive: Mahesh Babu’s Pay for Varanasi

Superstar Mahesh Babu has been extremely dedicated and is focused on Varanasi, his next attempt directed by SS Rajamouli. Apart from a pan-Indian release, the film will have an international release and Rajamouli has big plans which will be chalked out at a later date. There are discussions about the remuneration of Mahesh Babu. Superstar […] The post Exclusive: Mahesh Babu’s Pay for Varanasi appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 9:13 pm

బాబ్రీ తరహా మసీదుకు ఎమ్‌ఎల్‌ఎ కబీర్ శంకుస్థాపన

సస్పెండ్ అయిన టిఎంసి ఎమ్‌ఎల్‌ఎ హుమయూన్ కబీర్ శనివారం అయోధ్య బాబ్రీ మసీదు మోడల్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముషీరాబాద్ జిల్లా లోని రెజినగర్‌లో భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం రాజకీయంగా వేడి పుట్టించింది. రాష్ట్రపోలీసులు, ఆర్‌ఎఎఫ్, కేంద్ర బలగాలు బందోబస్తు మధ్య ఇస్లాం మతపెద్దలుతో కలిసి కబీర్ శంకుస్థాపన నిర్వహించారు. వాస్తవానికి నిర్మాణ ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో రెజినగర్‌లో ఏర్పాటైన వేదిక వద్ద రిబ్బన్ కట్ చేశారు. “ నారాఇతక్‌బీర్, అల్లాహు అక్బర్ ”అని వేలాది మంది నినాదాలు హోరెత్తించారు. మసీదు నిర్మాణకోసమని చాలా మంది ఇటుకలు మోసుకొచ్చారు. 1992 లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన సంఘటనకు గుర్తుగా శనివారం (డిసెంబర్ 6) ఈ కార్యక్రమం జరిగింది. ప్రతిపాదించిన నిర్మాణం ఎట్టిపరిస్థితుల్లోనైనా ఆగకుండా జరుగుతుందని కబీర్ వేదికపై నుంచి వెల్లడించారు. దీనికి నిధుల కొరత లేదని ఒక పారిశ్రామిక వేత్త రూ. 80 కోట్లు విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 9:02 pm

‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ ప్రారంభం

పేదల పక్షపాతి, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్.సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సాంబశివరావు, కవిత, గుమ్మడి నర్సయ్య, పరమేశ్వర్ హివ్రాలే, ఎన్.సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు స్క్రిప్ట్ అందించారు. హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ”మా నాన్న గారు కూడా గుమ్మడి నర్సయ్య లాగే ప్రజాసేవ చేసిన మనిషి. మన కోసం కాదు.. ఇతరుల కోసం బతకాలి’అని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటా.. నేనే స్వయంగా డబ్బింగ్ చెబుతా”అని తెలిపారు. గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి.. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతులు మారాలి.. ఇదే నేను కోరుకునేది అని తెలియజేశారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:56 pm

మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్ కైవసం

వైజాగ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మరో 10 ఓవర్లు ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కెరీర్ లో తొలి శతకం నమోదు చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో జైస్వాల్ సెంచరీ అందుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా 75 పరుగులతో రాణించాడు. ఇక, విరాట్ కోహ్లీ మరోసారి తనదైన శైలిలో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగుల అజేయ అర్ధ శతకంతో చెలరేగాడు. దీంతో భారత్ 2-1తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ డికాక్ 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ బవుమా 48 పరుగులు, బ్రెవిస్ 29 పరుగులు, మహరాజ్ (నాటౌట్) 20 పరుగులు, యాన్సెన్ 17 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:51 pm

లోక్ అదాలత్‌లతో కోర్టులపై భారం తగ్గుతుంది

లోక్ అదాలత్‌లతో కోర్టులపై భారం తగ్గుతుందని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. శ్యామ్ కోషి అన్నారు. శనివారం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో ఈ నెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై డిజిపి శివధర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), ఎక్సైజ్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్, ఎక్సైజ్, ఆర్టీసి, చెక్ బౌన్స్, ఇతర కేసులతో సహా వివిధ వర్గాల కేసుల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చోరవ చూపాలన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే జాతీయ లోక్-అదాలత్‌లో పరిష్కరించడానికి మరిన్ని కేసులను గుర్తించాలని ఎక్సైజ్ కమిషనర్‌ను ఆదేశించారు. త్రిపుర, జార్ఖండ్‌లలో అనుసరించిన విధానంలో బాగంగా కాంపౌండింగ్ ఫీజును తగ్గించడానికి, మద్యం పరిమాణాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కాగా, రాష్ట్ర కోర్టులలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులను తగ్గించడంలో తమ పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తామని డిజిపి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీసు అధికారులకు అవసరమయిన అన్ని సూచనలను జారీ చేస్తామని డిజిపి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి, అడిషనల్ డిజిపిలు మహేష్ భగవత్, చారు సిన్హా , అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:50 pm

వంపుతండా సర్పంచ్ గా ధరావత్ వినోద ఏకగ్రీవం..

పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని వంపుతండా గ్రామ సర్పంచ్ గా ధరావత్

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:40 pm

నెహ్రూ చరిత్ర లేకుండా చేయాలన్న కుట్ర: జగ్గా రెడ్డి

దేశ ప్రజల్లో జవహర్‌లాల్ నెహ్రూ చరిత్ర కనపడకుండా చేయాలని బిజెపి కుట్ర చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. యాభై ఆరేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలకు ఏమి చేశామో తాము చెప్పగలమని, పదకొండేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేశారో చెప్పగలరా? అని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్రజలు మూడు పూటలా భోజన చేసేలా చేసి, రెండు వందల దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి చేరిన ఘనత నెహ్రూది అని అన్నారు. నెహ్రూ ఆలోచనలతో పరిపాలన, వారి భావాలను అనుసరించి పదేళ్ళు యూపిఏ చైర్మన్‌గా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్‌తో పాలన చేయించారని ఆయన తెలిపారు. అయితే నెహ్రూ మీద అబద్దాలు చెప్పి చరిత్రను మార్చే కుట్రలు చేస్తున్న మోడీ చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీలా ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధాని కాలేదన్నారు. బిజెపి శ్రీ రాముడి ఫొటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నదని ఆయన విమర్శించారు. అయోధ్యలో రామాలయం కట్టామని చెప్పడం తప్ప ఏమి చేయలేదని జగ్గారెడ్డి విమర్శించారు. నెహ్రూను కించపరచడం బిజెపి అజెండాగా పెట్టుకున్నదని అన్నారు. నెహ్రూ సిద్ధాంతాలను తాము అమలు చేస్తామని జగ్గా రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:39 pm

హాజీపల్లిని సుందరంగా తీర్చిదిద్దుతా..

షాద్ నగర్, ఆంధ్ర‌ ప్రభ : హాజిపల్లి గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చి

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:32 pm

బుట్టాపూర్ గ్రామన్ని రంగల్లో అభివృద్ధి చేసి చూపిస్తా…

దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ : గ్రామ అభివృద్ధి వేగంగా జరగాలంటే ఈనెల 11న

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:28 pm

గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప‌నిచేస్తా

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామ పంచాయ‌తీ అభివృద్ధే ధ్యేయంగా ప‌నిచేస్తాన‌ని తాళ్ల‌ప‌ల్లి

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:24 pm

జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి..

జనగామ, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతి సర్పంచ్, వార్డు సభ్యుల

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:22 pm

అభివృద్ధికి పట్టం కట్టండి…

సదాశివపేట రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : అభివృద్ధికి పట్టం కట్టండి.. వెల్టూర్ గ్రామంలో అన్ని

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:13 pm

డీప్‌ఫేక్‌ను నియంత్రించేలా లోక్‌సభలో ప్రైవేట్ బిలుల

న్యూఢిల్లీ : డీప్‌ఫేక్ నియంత్రణకు సంబంధించిన ప్రైవేట్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఇలాంటి కంటెంట్ కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ డీప్‌ఫేక్‌తో వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం ఇలా ఎంతో దుర్వినియోగం అవుతోందని, తక్షణ దీని నియంత్రణకు చర్యలు చేపట్టాలని శిండే అన్నారు. దురుద్దేశంతో ఇలాంటి కంటెంట్‌ను రూపొందించినా, లేదా వ్యాప్తి చేసినా, అలాంటి నేరస్థులకు శిక్షలు కఠినంగా విధించాలన్నారు.ఈ సందర్భంగా వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రత గురించి ప్రస్తావించారు. కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో డీప్‌ఫేక్ టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ కలవరపెడుతోందని, ఈ డీప్‌ఫేక్‌తో సైబర్ నేరగాళ్లు అవలీలగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. .

మన తెలంగాణ 6 Dec 2025 8:09 pm

దక్షిణాఫ్రికా బార్ వద్ద తుపాకీ కాల్పులు...11 మంది మృతి

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా పాలనా రాజధాని ప్రిటోరియా సమీపాన టౌన్‌షిప్ లోని ఓ బార్ వద్ద తుపాకీ కాల్పులు చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారి వయసు వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ప్రిటోరియాకు పశ్చిమ వైపు ఉన్న సౌల్స్ విల్లే లోని లైసెన్సు లేని బార్‌లో శనివారం తెల్లవారు జామున కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు చెప్పారు. మృతుల్లో మూడేళ్ల పసివాడు, 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారని వివరించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 8:05 pm

బొత్తల తండా సర్పంచ్ ఏకగ్రీవం..

పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని బొత్తలతండా గ్రామ సర్పంచ్ గా జాటోత్

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:05 pm

భారత్-రష్యా సంబంధాలు సుస్థిరం: జైశంకర్

న్యూఢిల్లీ: గత 70, 80 ఏళ్లుగా భారత్-రష్యాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని, ఆర్థిక సంబంధాలపై దృష్టి సారించి సంబంధాలను తిరిగి పటిష్టపర్చుకొనే లక్షం తోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ను సందర్శించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ శనివారం వెల్లడించారు. పుతిన్ పర్యటన అమెరికాతో భారత్ నెరపుతున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను సంక్లిష్టం చేయవచ్చన్న అభిప్రాయాలను ఆయన కొట్టివేశారు. ప్రపంచం లోని ప్రధాన దేశాలన్నిటితోనూ భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలున్నాయన్న సంగతి అందరికీ తెలుసని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పర్చుకునే హక్కు, స్వేచ్ఛ భారత్‌కు ఉన్నాయని, భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏదేశానికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందన్నారు. తమ ప్రభుత్వానికి కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు తగ్గట్టుగానే ఒప్పందం ఉంటుందన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 7:59 pm

పకడ్బందీగా నాకాబందీ ‘ఆపరేషన్ కవచ్’

పకడ్బందీగా నాకాబందీ ‘ఆపరేషన్ కవచ్’ ఖైరతాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లో శాంతి

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:58 pm

రోహిత్ శర్మ ఔట్.. విజయం దిశగా భారత్

వైజాగ్: దక్షిణాఫ్రికాతో మూడో చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో 271 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్ల రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో రోహిత్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(74), కోహ్లీ(2)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 109 పరుగులు చేయాల్సి ఉంది.  అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ డికాక్ మాత్రం 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ బవుమా 48 పరుగులు, బ్రెవిస్ 29 పరుగులు, మహరాజ్ (నాటౌట్) 20 పరుగులు, యాన్సెన్ 17 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 6 Dec 2025 7:48 pm

Will Priyanka step into the shoes of Deepika Padukone?

The team of Kalki 2898 AD announced the exit of Deepika Padukone from the film’s sequel which has been a huge shock for the actress. This is because of the demands of the actress and her big remuneration quote. Speculations soon said that the team is considering Alia Bhatt for the role and the makers […] The post Will Priyanka step into the shoes of Deepika Padukone? appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 7:38 pm

గంటలోపే భవానీలకు అమ్మ దర్శనం..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రం నలుమూలల నుండి…. పొరుగు రాష్ట్రాల నుండి

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:38 pm

Bhagyashri Borse’s Big Hopes on Lenin

Bhagyashri Borse made her debut with Ravi Teja’s Mr Bachchan and the film ended up as a disaster. The actress soon featured in films like Kingdom and Kaantha but these could not bring her success. But the performance of Bhagyashri Borse in all her films was appreciated. She recently featured in Ram’s Andhra King Taluka. […] The post Bhagyashri Borse’s Big Hopes on Lenin appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 7:28 pm

Indigo crisis costs Ram Mohan Naidu his reputation

The Civil Aviation Minister Kinjarapu Ram Mohan Naidu is facing a crisis, as massive disruption of flight services by Indigo Airlines has put lakhs of passengers to serious inconvenience and also raised questions over the performance of Aviation Ministry. Owing to the gross negligence and mismanagement of Indigo Airlines, about 1000 flights were cancelled on […] The post Indigo crisis costs Ram Mohan Naidu his reputation appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 7:21 pm

గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా…

తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : చిట్యాల గ్రామ అభివృద్ధే తన ధ్యేయమని, సర్పంచ్

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:11 pm

అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చుస్తా

గొల్లపల్లి, ఆంధ్ర‌ప్రభ : అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చుస్తాన‌ని, సర్పంచ్ గా

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:02 pm

పోతిరెడ్డిపాడు–బనకచర్ల కాంప్లెక్స్ లక్ష్యం దారి తప్పింది…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: రాయలసీమ సాగునీటి అవసరాల కోసం అత్యంత కీలకంగా నిర్మించిన

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:59 pm

దేవనగర్ సర్పంచ్‌గా సలుగుల సంతోష్ ఏకగ్రీవం..

ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామపంచాయతీలో

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:58 pm

రాయపట్నంను అభివృద్ధి పథంలో నడిపిస్తా..

ధర్మపురి, ఆంధ్రప్రభ : రాయపట్నం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాయపట్నం సర్పంచ్

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:56 pm

మంత్రి ఉత్తమ్ ను కలిసిన పాశం సంజయ్ బాబు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:54 pm

హైదరాబాద్ సిటీ వీకెండ్ డెస్టినేషన్స్: కేఫ్స్, బ్రూవరీస్ చూసొద్దాం రండి

హైదరాబాద్‌లో వీకెండ్స్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు సరైన కేఫ్ లేదా బ్రూవరీని కనుగొనడంలో ఈ కథనం మీకు సహాయపడుతుంది. స్నేహితులతో సరదాగా గడిపేందుకు, ప్రశాంతంగా పుస్తకం చదువుకోవడానికి, లేదా ఉత్సాహంగా సాయంత్రం గడపడానికి ఉత్తమమైన ప్రదేశాలను డియర్ అర్బన్ మీ కోసం ఇక్కడ పొందుపరిచింది. రండి.. హైదరాబాద్ సోషల్ లైఫ్‌ను కలిసి అన్వేషిద్దాం. 1. ప్రశాంతమైన వాతావరణం కోసం అద్భుతమైన కేఫ్‌లు ఈ సందడిగా ఉండే నగరంలో శాంతి, విశ్రాంతిని అందించే కొన్ని ప్రశాంతమైన ప్రదేశాలను […] The post హైదరాబాద్ సిటీ వీకెండ్ డెస్టినేషన్స్: కేఫ్స్, బ్రూవరీస్ చూసొద్దాం రండి appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 6 Dec 2025 6:53 pm

సుప్రీం కోర్టు సామాన్యుల కోసమే: సిజెఐ సూర్యకాంత్

న్యూఢిల్లీ : సామాన్యులకు న్యాయం కల్పించడం కోసమే సుప్రీం కోర్టు అన్న బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శనివారం స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్ధిష్ట సమయంలో త్వరగా పరిష్కరించడమే తన ప్రాధాన్యంగా ఆయన వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సామాన్యులకు న్యాయం అందుబాటులోకి రావలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. న్యాయపరమైన ఖర్చులు ఎలా తగ్గించాలి ? వ్యాజ్యాల పరిష్కారానికి సహేతుకమైన కాలపరిమితిని ఎలా నిర్ణయించాలి? అన్నవే తన ప్రాధాన్యంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి అడగ్గా, రాజ్యాంగంలో అధికార విభజన ఎలా జరిగిందో ప్రస్తావించారు. ప్రభుత్వశాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల పాత్రలను రాజ్యాంగం చక్కగా నిర్వచించిందని వివరించారు. ఒకదానిపై మరొకటి అతిక్రమించే అతివ్యాప్తి లేదన్నారు. కొన్ని వ్యాజ్యాల ప్రాధాన్యతతో సహా రానున్న రోజుల్లో సుప్రీం కోర్టులో కొన్ని సంస్కరణలు రావలసి ఉందన్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్స్ వంటి కేసులను ఉదహరిస్తూ న్యాయవ్యవస్థ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని , అందువల్ల న్యాయవ్యవస్థ అప్‌డేట్ కావలసి ఉందన్నారు. నాణ్యమైన న్యాయసహాయం అందించడానికి దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించవలసి ఉందని, ఈమేరకు ఎవరికైతే సహాయం అవసరమో వారికి న్యాయం అందించడానికి సమర్థులైన న్యాయవాదులు నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 6:52 pm

హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌గా కర్నూలు జట్టు

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో గత రెండు

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:50 pm

భారత్‌కు 40 వేల ఇజ్రాయెల్ లైట్‌మెషిన్ గన్స్

జెరూసలెం: వచ్చే ఏడాది ఆరంభంలో దాదాపు 40 వేల లైట్‌మెషిన్‌గన్స్‌ను భారత్‌కు సరఫరా చేయనున్నట్టు ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. వీటితోపాటు దాదాపు 1.70 లక్షల కార్బైన్‌లకు సంబంధించిన ఒప్పందం ఖరారు చివరిదశలో ఉందని తెలిపింది. పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్‌గన్స్ సహా ఇతర రక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు భారత హోంశాఖ లోని వివిధ ఏజెన్సీలతో సంప్రదింపులు చేస్తున్నట్టు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఐడబ్లు సీఈవో షుకి స్కాట్జ్ పేర్కొన్నారు. కార్బైన్స్‌కు సంబంధించి 60 శాతం ఆయుధాలను భారత్‌ఫోర్జ్ నుంచి మిగతా నలభై శాతం (1.70 లక్షల ఆయుధాలు) అదానీ గ్రూపు అనుబంధ సంస్థ పీఎల్‌ఆర్ సిస్టమ్స్ సరఫరా చేయనుంది. ఇక ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ అర్బెల్ టెక్నాలజీని భారత్‌కు అందించేందుకు సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నామని షుకి స్కాట్జ్ పేర్కొన్నారు. యుద్ధ భూమిలో సైనికులు అత్యంత కచ్చితత్వంతో , చురుగ్గా వ్యవహరించేందుకు ఇదెంతో ఉపకరిస్తుందన్నారు. ఒప్పందం పూర్తి కాగానే ఇజ్రాయెల్‌తోపాటు భారత్ లోనూ వీటి తయారీ చేపడతామన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 6:44 pm

గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించాలి: సిఎం మమతా బెనర్జీ

ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆహ్వానం అందుకోవడం ఎంతో గౌరవప్రదమైనదని తెలంగాణ సిఎంకు పంపిన ప్రత్యేక లేఖలో పేర్కొన్నారు. అయితే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న తేదీల్లో తనకు ముందుగానే నిర్ణయించిన జిల్లా పర్యటనలు ఉండటం వల్ల, ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఈ గ్లోబల్ సమ్మిట్ సార్థక చర్చలకు వేదికగా నిలవాలని, రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశంగా మారాలని మమతా బెనర్జీ ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఘన విజయం సాధించాలని చెబుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మమతా బెనర్జీని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు అప్పగించారు. దీనిలో భాగంగా మంత్రి సీతక్క, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లాల్లో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో మమతా బెనర్జీ బిజీగా ఉండటంతో, వ్యక్తిగతంగా కలవడం కష్టమని ఆమె ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పంపించాలని మమతా బెనర్జీ కార్యాలయం సూచించింది. అనుగుణంగా మమతా బెనర్జీ కార్యాలయంతో సమన్వయం సాధించిన మంత్రి సీతక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అధికారిక ఆహ్వాన పత్రికను ఇ-మెయిల్ ద్వారా పంపించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న అనంతరం మమతా బెనర్జీ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లేఖ పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఘన విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

మన తెలంగాణ 6 Dec 2025 6:43 pm

BJP : రాజా.. పాయల్.. ఇంకెవరు భయ్యా?

తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు కట్టుతట్టుతప్పుతున్నట్లు కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 6 Dec 2025 6:41 pm

సాధించాడు.. ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన గౌరవం లభించింది. ఫుట్‌బాల్ క్రీడను నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఫిఫా కొత్తగా ఏర్పాటు చేసిన “శాంతి బహుమతి” (పీస్ ప్రైజ్) ని ఆయన అందుకున్నారు. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీ లోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. శుక్రవారం జరిగిన డ్రా వేడుకల్లో ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ఈ పురస్కారాన్ని ట్రంప్‌కు ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, ఐక్యతను ప్రోత్సహించేందుకు ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్టు ఇన్ఫాంటినో తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు బంగారు పతకం, ఆయన పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీని బహూకరించారు. “ ఒక నాయకుడి నుంచి మనం కోరుకునేది ఇదే. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కావాలి. ఇది మీ బహుమతి, మీ శాంతి బహుమతి ” అని ఇన్ఫాంటినో ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ పురస్కారం అందుకోవడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో లభించిన గొప్ప గౌరవాలలో ఒకటని పేర్కొన్నారు. “అవార్డులతో సంబంధం లేకుండా నా దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగోశాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ. కాంగోరువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాను. ఇది ఎంతో గర్వకారణం. అంతేకాకుండా ఇండియాపాకిస్థాన్ యుద్ధాన్ని సైతం నేనే ఆపాను. నాచర్యలతో ఎన్నో దేశాల మధ్య యుద్దాలు ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రాంరంభం కాకముందే ముగిశాయి” అని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ ఫుట్‌బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్టు నవంబర్ 5 న ప్రకటించింది. ఇది ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా వర్ణించింది. ఈ బహుమతి ఫిఫా గౌరవాన్నిమాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానుల తరఫున అందజేసేదిగా గియాని అభివర్ణించారు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆశలు వమ్ము చేస్తూ నార్వే నోబెల్ కమిటీ వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోకు ప్రకటించింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైన విషయం తెలిసిందే. ఈ శాంతి బహుమతి కాస్త రాజకీయ రంగు పులుముకుందన్న విమర్శలు వస్తున్నాయి. శాంతి బహుమతిపై విమర్శలు ట్రంప్‌నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ ఫిఫాబాడీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు ,జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్టు తెలిపింది. 48 జట్లు.. 12 గ్రూపులు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు 2026 జూన్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మెక్సికో, కెనడా, అమెరికాలు ఈసారి ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. జులై 19న న్యూజెర్సీలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఫిఫా చరిత్ర లోనే తొలిసారి 48 జట్లు గ్రూప్ స్టేజీలో తలపడబోతున్నాయి. మొత్తం 12 గ్రూపులు విభజించగా, ఒక్కో గ్రూపులో నాలుగేసి దేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే 42 జట్లు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లకు అర్హత సాధించగా, 22 జట్లు మిగతా ఆరు స్తానాల కోసం బరిలో దిగనున్నాయి. 

మన తెలంగాణ 6 Dec 2025 6:39 pm

విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన ఉడుమల సహజారెడ్డి(24) అనే యువతి.. అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. సహజారెడ్డిది జననగాం జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం గుంటూరుపల్లి గ్రామం. నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె బర్మింగ్‌హామ్ ప్రాంతంలో ఉంటుందోంది. అయితే, గురువారం తన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సహజారెడ్డి.. మంటల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచింది. దీంతో సహజారెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహజారెడ్డి మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యువతి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ.. వారితో సంప్రదింపులు జరుపుతున్నామని.. అవసరమైన సాయాన్ని అందిస్తామని వెల్లడించింది.

మన తెలంగాణ 6 Dec 2025 6:29 pm

పవన్ వ్యాఖ్యలపై ఉండవల్లి ఏమన్నారంటే?

తెలంగాణపై పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు

తెలుగు పోస్ట్ 6 Dec 2025 6:20 pm

Mini conference |స్మార్ట్ సిటీపై… కలెక్టర్ విస్తృతస్థాయి సమావేశం

Mini conference | స్మార్ట్ సిటీపై… కలెక్టర్ విస్తృతస్థాయి సమావేశం Mini conference

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:14 pm

Kiran |గ్రామాభివృద్ధే లక్ష్యం

Kiran | గ్రామాభివృద్ధే లక్ష్యం నేరడిగుంట సర్పంచ్ అభ్యర్థి ఒగ్గుసాయి కిరణ్Kiran |

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:02 pm

సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టు.. కేసు నమోదు

ఎంఐఎం అధినేత ఒవైసీపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కేసు నమోదయింది

తెలుగు పోస్ట్ 6 Dec 2025 6:02 pm

Dharmapuri |ముమ్మరంగా వాహన తనిఖీలు

Dharmapuri | ముమ్మరంగా వాహన తనిఖీలు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:58 pm

బాలీవుడ్ నటితో భారత అల్‌రౌండర్ ప్రేమాయణం..

బాలీవుడ్ నటులతో క్రికెటర్లు ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. చాలా మంది అలా ప్రేమలో పడ్డారు. కొందరు వివాహ బంధంతో ఒకటైతే.. మరికొందరు బ్రేక్ అప్ చేసుకున్నారు. తాజాగా మరో క్రికెటర్, బాలీవుడ్ నటి ప్రేమలో ఉన్నారని వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లు ఎవరంటే.. భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, నటి సాహిబా బాలీ. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి కాఫీ షాపులో కనిపించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలి. ఇక కెరీర్‌ల విషయానికొస్తే.. వాషింగ్టన్ సుందర్ కెరీర్ ఒడిదుడుకులు ఎదురుకుంటోంది. ఆల్ రౌండర్‌గా జట్టులోకి వస్తున్న అతడు ఊహించినంత ప్రధర్శన కనబర్చ లేకపోతున్నాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఫర్వాలేదు అనిపించినా, సౌతాఫ్రికా‌తో టెస్ట్, వన్డే సిరీస్‌ తొలి రెండు మ్యాచుల్లో మాత్రం తేలిపోయాడు. దీంతో మూడో వన్డేకి అతడిని పక్కన పెట్టారు. ఇక సాహిబా అటు నటిగా, ఇటు కంటెంట్ క్రియేటర్‌గా బిజీగా ఉంటోంది. కశ్మీరీ నేపథ్యం గల ఈ అమ్మాయి.. ఇటీవల స్పోర్ట్స్ ఈవెంట్స్‌ హోస్టింగ్ కూడా చేస్తోంది. దీంతో స్పోర్ట్స్ ఫాలో అయ్యే వారికి ఈ అమ్మాయి సుపరిచితమే. ఇక సాహిబా, సుందర్‌లు కలిసి దిగిన ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి వీరిద్దరి ప్రేమాయణం చర్చకు వచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమనా..? లేక కేవలం స్నేహం మాత్రమేనా అని తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 6 Dec 2025 5:56 pm

Patrolling |ఇసుక ట్రాక్టర్ సీజ్

Patrolling | ఇసుక ట్రాక్టర్ సీజ్ Patrolling | సంగెం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:53 pm

Raghavapur |జిల్లా కోర్టు స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి

Raghavapur | జిల్లా కోర్టు స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి Raghavapur |

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:50 pm

MPP |ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు….

MPP | ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు…. MPP | బిక్కనూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:46 pm

అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి

అమెరికాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తెలంగాణకుచెందిన విద్యార్థిని మృితి చెదారు..

తెలుగు పోస్ట్ 6 Dec 2025 5:44 pm

Collector |స్క్రబ్ టైఫస్‌ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించండి

Collector | స్క్రబ్ టైఫస్‌ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించండి Collector

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:37 pm

పేట్రేగిపోతున్న ధరలు.. కల్తీలు…

దిక్కు తోచని స్థితిలో పేద మధ్యతరగతి కుటుంబాలుకల్తీ పదార్థాలు తిని ఆసుపత్రి పాలుప్రేక్షక పాత్రలో అధికారులువిశాలాంధ్ర- చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : నియోజకవర్గ వ్యాప్తముగా ప్రజలకు అవసరమైన నిత్యవసరాలు ధరలతో పాటు కల్తీలు పేట్రేగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు కల్తీ పదార్థాలు భుజించి ఆసుపత్రి పాలవుతున్నారు, అధికారులు ఉదాసీనత కారణంగా నిత్యవసరాలు సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇదే అదునుగా వ్యాపారుల పదార్థాలు కల్తీ మయంగా మారాయి దీంతో దిక్కు తోచని స్థితిలో మధ్య […] The post పేట్రేగిపోతున్న ధరలు.. కల్తీలు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 5:35 pm

ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం రహస్యాలు: ఫీడ్, స్టోరీస్, రీల్స్‌లో మీ కంటెంట్ ఎలా కనిపిస్తుంది?

ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం వెనుక ఉన్న మ్యాజిక్‌ను అర్థం చేసుకొని మీ ఇన్‌ఫ్లుయెన్సర్ జర్నీ సక్సెస్ చేసుకోవడానికి ఈ గైడ్ ఉపయోగపడుతుంది.మీరు ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు, ఒక పోస్ట్‌ను చూసి, మరొకటి ఎందుకు కనిపించలేదని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది యాదృచ్ఛికంగా జరగదు, కానీ “అల్గారిథంలు” అని పిలిచే నియమాలు దీనిని నియంత్రిస్తుంది. చాలామంది అనుకున్నట్లుగా, ఇన్‌స్టాగ్రామ్ వాస్తవానికి ఒకే అల్గోరిథంను ఉపయోగించదు. బదులుగా, మీ ఫీడ్, స్టోరీలు, రీల్స్ కోసం వేర్వేరు, ప్రత్యేకమైన సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది. ఈ గైడ్ […] The post ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం రహస్యాలు: ఫీడ్, స్టోరీస్, రీల్స్‌లో మీ కంటెంట్ ఎలా కనిపిస్తుంది? appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 6 Dec 2025 5:33 pm

One chance |కొత్తపల్లి అభివృద్ధే నా లక్ష్యం…

One chance | కొత్తపల్లి అభివృద్ధే నా లక్ష్యం… ఒక్క ఛాన్స్ ఇవ్వండి..మార్పు

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:30 pm

ఘంటసాలకు గంభీరమైన స్వరము కలవారు.. కళావతి అధ్యక్షులు నారాయణ

విశాలాంధ్ర ధర్మవరం; ఘంటసాలకు గంభీరమైన స్వరం దేవుడు ఇచ్చిన వరమని అందుకే ఆయన దేశవ్యాప్తంగా మంచి గాయకుడిగా గుర్తింపు పొందడం జరిగిందని కళాజ్యోతి అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు గంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జయంతి సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గంటశాల సంగీత దర్శకులుగా గాయకుడిగా శాస్త్రీయ సంగీతములో క్షున్న మైన శిక్షణతో తెలుగు సినిమా సంగీతానికి విశేషమైన కృషి చేయడం జరిగిందన్నారు. […] The post ఘంటసాలకు గంభీరమైన స్వరము కలవారు.. కళావతి అధ్యక్షులు నారాయణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 5:29 pm

Bikkanoor |ప్రజాసేవకే జీవితం అంకితం…

Bikkanoor | ప్రజాసేవకే జీవితం అంకితం… Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:26 pm

అప్పుల బాధతో చేనేత కార్మికుడు మృతి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలోని రాంనగర్ వద్ద చేనేత కార్మికుడు నీలూరి కృష్ణమూర్తి (60 సంవత్సరాలు) అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. స్థానికులు భార్య గుర్తించి పోలీసులకు టూ టౌన్ సీఐ రెడ్డప్పకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలను తెలుసుకొని భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. మృతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. […] The post అప్పుల బాధతో చేనేత కార్మికుడు మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 5:25 pm

నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోండి..

ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం ; ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం లో స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జె.వి. సురేష్ బాబు , జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి. హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నేపథ్యంలో అప్లికేషన్ డెవలపర్,( వెబ్ అండ్ మొబైల్ అనే ఉచిత కంప్యూటర్ కోర్సును డిసెంబర్ 17 […] The post నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 5:23 pm

Parade |శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర ముఖ్యమైంది..

Parade | శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర ముఖ్యమైంది.. Parade |

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:21 pm

Nomination |ఉద్యోగానికి రాజీనామా చేసి..

Nomination | ఉద్యోగానికి రాజీనామా చేసి.. సర్పంచ్ నామినేషన్ వేసి..! రాంపూర్ సర్పంచ్

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:17 pm

సర్వే నెంబర్ లో అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలి

ధర్మవరం లో రూ. 60 కోట్ల విలువైన 650-2 సర్వే నెంబర్ లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో 60 కోట్లు విలువైన 650-2 సర్వే నెంబర్లు జరిగిన భారీ అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారుపట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తరువాత ఎమ్మార్వో కార్యాలయ అధికారికి […] The post సర్వే నెంబర్ లో అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 5:16 pm

vote |ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా..

vote | ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా.. సర్పంచ్ అభ్యర్థి కోరంగ సుంకట్రావ్.. ఇంద్రవెల్లి,

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:14 pm

Sangareddy |ఉద్యమ నాయకులను గుర్తించని బీఆర్ఎస్

Sangareddy | ఉద్యమ నాయకులను గుర్తించని బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో మేం

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:12 pm

Congress |పొనకల్ వాడల్లో ఇంటింటా విస్తృత ప్రచారం

Congress | పొనకల్ వాడల్లో ఇంటింటా విస్తృత ప్రచారం సర్పంచి అభ్యర్థిని గెలిపించాలని

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:08 pm

నాలుగు టన్నుల బియ్యం పట్టివేత

కేసు నమోదు చేసిన రెవెన్యూ అధికారులువిశాలాంధ్ర ధర్మవరం;! మండల పరిధిలోని గుడ్ షెడ్ కొట్టాల వద్ద గుడ్లురికి పోయే దారిలో ఒక బోలోరో వాహనం ఆటోలో 4 టన్నుల స్టోర్ బియ్యం తరలిస్తుండగా, ఆర్ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు సాకే హరి, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి నాగార్జున తదితరులు అడ్డుకొని సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందించారు. సి ఎస్ డి టి చెన్నకేశవ నాయుడు ఘటన స్థలానికి చేరుకొని నాలుగు టన్నుల […] The post నాలుగు టన్నుల బియ్యం పట్టివేత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 5:07 pm

అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:04 pm

POLICE |హోంగార్డుల సేవలు కీలకం

POLICE | హోంగార్డుల సేవలు కీలకం పోలీస్ కమిషనర్ సునీల్ దత్POLICE |

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:03 pm

Minister Anam Ramanarayana Reddy Slams Jagan Over Tirumala Parakamani Remarks

Endowments Minister Anam Ramanarayana Reddy strongly criticised former chief minister YS Jagan Mohan Reddy for calling the Tirumala Parakamani theft a small incident. He said Jagan insulted the sanctity of the TTD and hurt the faith of millions of devotees. Anam questioned how a man who stole seventy thousand rupees could suddenly offer assets worth […] The post Minister Anam Ramanarayana Reddy Slams Jagan Over Tirumala Parakamani Remarks appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 5:02 pm

న‌వ‌భార‌త నిర్మాత‌ అంబేద్క‌ర్

కాశీబుగ్గ, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత, మహానుభావుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి

ప్రభ న్యూస్ 6 Dec 2025 5:01 pm