మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్పై వార్నింగ్
దక్షిణాదికి ఇప్పుడున్న 24 శాతం సీట్లు తగ్గకూడదని వార్నింగ్మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే […] The post మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్పై వార్నింగ్ appeared first on Visalaandhra .
ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు..
ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు.. సస్పెన్షన్ కు రంగం సిద్ధమా?..విధులకు హాజరుకాని
Nara Lokesh : ముఖ్యమంత్రి పదవి చేరువలోకి లోకేశ్.. ఎవరైనా కాదంటారా?
నారా లోకేశ్ ముఖ్యమంత్రి పదవికి చేరువవుతున్నట్లే కనిపిస్తుంది.
అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు!ఇరాన్పై అమెరికా విధించిన కఠినమైన నౌకా దిగ్బంధనాన్ని ఛేదించుకుని ఇరాన్ నౌకలు చాకచక్యంగా ముందుకు సాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక నిఘా కళ్లుగప్పి, తమ గమ్యస్థాన వివరాలను మార్చివేసి కనీసం రెండు నౌకలు విజయవంతంగా ఇరాన్ పోర్టుల వైపు ప్రయాణించాయి. ఈ పరిణామం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ విషయాన్ని బ్రిటన్కు చెందిన ప్రముఖ షిప్పింగ్ మీడియా లాయిడ్స్ […] The post హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. appeared first on Visalaandhra .
డిలిమిటేషన్తో దక్షిణాదిలో పెను ఉద్యమం : కేటీఆర్
డీ లిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రామ్చరణ్కు బుచ్చిబాబు రిక్వెస్ట్ హైదరాబాద్: అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా 30న విడుదల కానుంది. ఈ సినిమాను బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ఇప్ప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా రామ్చరణ్ ‘ఎస్క్వైర్ ఇండియా’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రామ్చరణ్ ఫొటోను బ్యానర్ ఐటమ్గా ప్రచురించారు. దీనికి సంబంధించిన వీడియోను చరణ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో చరణ్ స్టైలిష్ లుక్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. […] The post మరో అవకాశం ఇవ్వండి సార్ appeared first on Visalaandhra .
YSRCP |కళ్లుమూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయ్…
YSRCP | కళ్లుమూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయ్… YSRCP | ఆంధ్రప్రభ, వెబ్
ఇరాన్ ను తిరిగి నిర్మించేందుకు 20 ఏళ్లు పడుతుంది: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత రెండో విడత చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దాడులతో ధ్వంసమైన ఇరాన్ తిరిగి తమ దేశాన్ని నిర్మించుకోవాలంటే 20 ఏళ్లు పడుతందని ట్రంప్ అన్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. కానీ, ఈ ఆపరేషన్ ఇంకా ముగియలేదని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇరాన్లో సైనిక చర్యలు ప్రారంభించకపోయి ఉంటే, ఆ దేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేసి ఉండేదని అన్నారు. అమెరికా దాడులు కొనసాగిస్తే, ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరాన్కు దాదాపు 20 ఏళ్లు పడుతుందన్నారు. వాషింగ్టన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని తాను భావిస్తున్నానని.. ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని లోకేశ్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఏన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని […] The post ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. appeared first on Visalaandhra .
రవాణా, భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు వాహనం మూడు వైపులా అతికించాల్సిందే#RoadSafety #RadiumStickers
Is Koratala Siva focused on Production?
Koratala Siva was once the most wanted director of Telugu cinema. His last directorial Devara released during Dasara 2024. The sequel plans for Devara are on but it is unclear if NTR will take up the film in his big lineup. Koratala Siva too wanted to work with other actors but he was not lucky […] The post Is Koratala Siva focused on Production? appeared first on Telugu360 .
చట్టసభలలో మహిళా కోట అభినందనీయం
చట్టసభలలో మహిళా కోట అభినందనీయం వికారాబాద్, ఆంధ్రప్రభ: నారీ శక్తి వందన్ సనాతన
వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలి
వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలి కరీమాబాద్, ఆంధ్రప్రభ: రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ
today ipl 2026 match|బెంగళూర్ వర్సెస్ లక్నో
today ipl 2026 match| బెంగళూర్ వర్సెస్ లక్నో ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
Kerala |పీటా ఇండియా వినూత్న చర్య
Kerala | పీటా ఇండియా వినూత్న చర్య Kerala | ఆంధ్రప్రభ, వెబ్
Andhra Pradesh Government Issues Clear Order on “Amaravati” Spelling Usage
The Government of Andhra Pradesh has issued a formal directive to ensure uniform usage of the capital city’s name as “Amaravati” across all official communications. The order was released by the General Administration Department to eliminate spelling inconsistencies in government records and correspondence. According to the circular, the government observed that different spellings of Amaravati […] The post Andhra Pradesh Government Issues Clear Order on “Amaravati” Spelling Usage appeared first on Telugu360 .
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయ్యాలి. సర్పంచ్ పోరిక సరిత.
ఏటూరునాగారం,మార్చి 15(జనంసాక్షి).మండలంలోని కోయగూడ గ్రామ పంచాయితీ లో మొదటి విడుత మంజూరైన ఇందిరమ్మ ఇండ్లని జూన్ 2 వరకు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయ్యాలని లబ్ధిదారులకు …
బిహార్ కొత్త సిఎంగా సమ్రాట్ ప్రమాణం
పాట్నా: బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా నాయకుడు సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్లో బీహార్ 21వ సిఎంగా చౌదరితో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్కు మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా చౌదరి అయ్యారు. జేడీయూ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా బీహార్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ వంటి కీలకమైన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీహార్ లోనూ కాషాయ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. కాగా, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌదరిని, మంగళవారం నితీష్ కుమార్ సమక్షంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా నియమించారు.
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
గంభీరావుపేట ఏప్రిల్ (15) (జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ …
TDP | కొత్త కమిటీల ప్రకటన.. విస్తృత స్థాయిలో నియామకాలు TDP |
పడకల్,లో వరి ధాన్యం,మొక్కజొన్న,ప్రొద్దు తిరుగుడు,కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తలకొండపల్లి ఏప్రిల్ 15(జనంసాక్షి):ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న,వరి,ప్రొద్దు తిరుగుడు,ధాన్యాన్ని …
ఉపాధి కూలీల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
ఉపాధి కూలీల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ:
రోడ్డు ప్రమాదాల నివారణ కు విద్యార్థులచే అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణ కు విద్యార్థులచే అవగాహన పరకాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర
ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు
రైతు కుటుంబంలో పుట్టి క్రికెటర్గా ఎదిగిన సకిబ్ హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా తళుక్కుమాన్నారు. బంతితో ప్రత్యర్ధి నడ్డి విరిచారు… ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. తలో నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారకులయ్యారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే… తర్వాత సకిబ్ ప్రత్యర్థి పని పట్టాడు. 4 ఓవర్లలో సకిబ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న […] The post ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు appeared first on Visalaandhra .
మహిళా బిల్లు దేశ పురోగతికి మైలురాయి
మహిళా బిల్లు దేశ పురోగతికి మైలురాయి విజయవాడ , ఆంధ్రప్రభ: పార్లమెంటు ముందుకు
బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదురి
బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదురి ప్రమాణం చేశారు
Telangana |నామినేటెడ్ పదవులపై చర్చ..
Telangana | నామినేటెడ్ పదవులపై చర్చ.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
హైదరాబాద్లో దోమల బెడద… సెక్యూరిటీ గస్తీకి తెరలు! #telugupost #mosquitos #viralvideo
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు
మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్
మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ ఊట్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర
YSRCP Leader’s Former PRO Srihari Arrested Over Controversial Post
P. Srihari, former Chief Public Relations Officer to Y. S. Jagan Mohan Reddy, has been arrested by police in Tadepalli. The action follows a case registered in Chittoor over a controversial social media post that allegedly showed Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu in a violent graphic. Police took Srihari into custody and seized […] The post YSRCP Leader’s Former PRO Srihari Arrested Over Controversial Post appeared first on Telugu360 .
నేడు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు బయలుదేరి వెళ్లనున్నారు
Students |రికార్డు స్థాయి ఉత్తీర్ణత..
Students | రికార్డు స్థాయి ఉత్తీర్ణత.. Students | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బైక్..
అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బైక్.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా
ఏపీ పోలీసులకు బర్త్ డే మ్యారేజ్ డే కి సెలవు #APPolice #SpecialLeaves #DGPOrder #PoliceWelfare
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ
భీమదేవరపల్లి:ఏప్రిల్ 14(జనం సాక్షి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని వంగర గ్రామంలో ఎస్సీ రైతులకు …
Andhra Pradesh : నేడు అన్నా క్యాంటిన్ల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అన్నా క్యాంటిన్లను ప్రారంభించనున్నారు
అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు
జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 15తరిగొప్పుల మండల కేంద్రంలోని బోత్తలపర్రే గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు …
శ్రీశైలం లో భారీగా మద్యం పట్టివేత #srisailam #alcohol #viralvideo #telugupost
పరస్పర విమర్శలకు దిగుతోన్న అధికార, విపక్ష నేతలు రాయ్గంజ్(కోల్కతా): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో పశ్చిమబెంగాల్లో ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో రెడు విడతలుగా 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 2,926 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారని ఈసీ వెల్లడించింది. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 1,478 మంది పోటీ చేస్తున్నారని, రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాల నుంచి 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపింది. 13తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. […] The post బెంగాల్లో ప్రచార హోరు appeared first on Visalaandhra .
బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం
బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం కోడూరు, ఆంధ్రప్రభ : వేసవికాలంలో బాటసారుల దాహార్తి
Lok Sabha seats |తమిళనాడు సీఎం స్టాలిన్కు రేవంత్ రెడ్డి కీలక లేఖ
Lok Sabha seats | తమిళనాడు సీఎం స్టాలిన్కు రేవంత్ రెడ్డి కీలక
విషాదం: పడవ బోల్తా..250కి పైగా ప్రయాణికులు గల్లంతు
ఢాకా: అండమాన్ సముద్రంలో ఘరో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులతో ప్రయాణిస్తున్న ఓ పడవ.. అండమాన్ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్న పిల్లలతో సహా సుమారు 250 మంది గల్లంతైనట్లు సమాచారం. వారికోసం సముద్రంలో ముమ్మర గాలింపు చర్చలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ బంగ్లాదేశ్లోని టెక్నాఫ్ నుండి మలేషియాకు పడవ బయలుదేరి వెళ్తుండగా.. బలమైన గాలులు, అల్లకల్లోల సముద్ర కెరటాలతోపాటు అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడంతో మునిగిపోయినట్లు తెలిపింది.
రాఘవేంద్ర చిత్రకళకు దక్కిన అరుదైన గుర్తింపు
రాఘవేంద్ర చిత్రకళకు దక్కిన అరుదైన గుర్తింపు గట్టుప్పల, ఆంధ్రప్రభ: హైదరాబాద్లోని స్టేట్ గ్యాలరీ
Divine Mystic “Agadha” To Bring Back MS Raju Glory!
Veteran filmmaker M. S. Raju, celebrated for producing landmark Telugu films such as Manasantha Nuvve, Okkadu, Varsham, and Nuvvostanante Nenoddantana, is now stepping into bold new creative territory with a mystical divine thriller titled Agadha. The project, developed with complete dedication over the past year, is being presented in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi, […] The post Divine Mystic “Agadha” To Bring Back MS Raju Glory! appeared first on Telugu360 .
Delimitation and Women’s Reservation: Why the South Wants a Fair Deal
India is moving towards two big changes in politics. One is delimitation. The other is the Women’s Reservation Bill. Both look like good reforms. But when they are linked together, they raise serious concerns, especially in southern states. Delimitation means redrawing parliamentary seats based on population. This process has been paused for many years to […] The post Delimitation and Women’s Reservation: Why the South Wants a Fair Deal appeared first on Telugu360 .
మంత్రులచే సబ్ స్టేషన్ శంకుస్థాపన
మంత్రులచే సబ్ స్టేషన్ శంకుస్థాపన వేంసూరు, ఆంధ్రప్రభ : వేంసూరు మండలం వెంకటాపురం
Andhra Pradesh : రెండేళ్ల పాలన విజయోత్సవాల్లో మరో కొత్త పథకం రెడీ.. మూడు వేలు వారి ఖాతాల్లో
రెండేళ్ల పాలన విజయోత్సవాల్లో మరో కొత్త పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని తెలిసింది
నగర పిల్లల వైద్యురాలు మద్దతు లేక IAP నుంచి రాజీనామా #ORS #Paediatrician #IAP #FSSAI #HealthNews
రేపు పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టనుంది
విద్యుత్ శాఖ ఆహ్వానం –పోలీస్ శాఖ అరెస్ట్..
విద్యుత్ శాఖ ఆహ్వానం – పోలీస్ శాఖ అరెస్ట్.. వేంసూరు, ఆంధ్రప్రభ :
Summer Effect : నిప్పుల వానలో బతికి బట్టకట్టడం కష్టమేనా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఇస్లామాబాద్లో నిర్వహించే యోచన వాషింగ్టన్: అమెరికా-ఇరాన్Ž మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21 వరకు ఉన్నప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హోర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లో ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అక్కడ చర్చలు జరిపేందుకు తాము సుముఖంగా […] The post మరోసారి శాంతి చర్చలు: ట్రంప్ appeared first on Visalaandhra .
మాంద్యం ముంగిట్లో ప్రపంచం #IMF #GlobalEconomy #Inflation #GDP #OilPrices #IndiaGrowth
Tollywood Actors into Profit-Sharing Gamble
Gone are the days where digital platforms are offering big deals. The theatrical rights of any film depends on the buzz that is created before the release. The financial burden falls completely on the producer and several Tollywood filmmakers are rejecting films during the scripting stage if they are risky. All the young and top […] The post Tollywood Actors into Profit-Sharing Gamble appeared first on Telugu360 .
Amaravathi : నేడు అమరావతిలో కూటమి నేతల భేటీ
అమరావతిలో నేడు కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది
వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో అరెస్ట్
వైఎస్ జగన్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం కలిగించిం
ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు స్పాట్ డెడ్
ఫతేగఢ్ సాహిబ్: పంజాబ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేగఢ్ సాహిబ్ నగరంలో బుధవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఢీకొట్టింది. బస్సీ పఠానా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
నేస్తం బడికి రా కార్యక్రమం ర్యాలీ
నేస్తం బడికి రా కార్యక్రమం ర్యాలీ ఘంటసాల, ఆంధ్రప్రభ : నేస్తం బడికి
Gold Rates Today : వారం రోజుల తర్వాత బంగారాన్ని అసలు కొనలేరట
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి.
Zodiac Signs : నేడు ఈ రాశుల వారికి శుభదినం..మిగిలిన వారికి?
ఉదయం రాశిఫలాలను చూసుకుని కానీ చాలా మంది ముందుకు అడుగు వేయరు
Producers Mounting Pressure on Yash
With big plans in Indian cinema, real estate tycoon K Venkata Narayana floated KVN Productions. After producing small films, he is now busy with Vijay’s Jana Nayagan and Yash’s Toxic. Both these films have completed shoot long ago and are occupied with their own hurdles. The censor clearance of Jana Nayagan is expected to be […] The post Producers Mounting Pressure on Yash appeared first on Telugu360 .
నేడు హిందూ ధర్మ సమ్మేళనం చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రామాలయం
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయాలివే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది
15thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
15thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 15thAprilCartoon | ఎన్నికల వేడి,
నేడు ఇండి కూటమి నేతల కీలక భేటీ
నేడు ఇండి కూటమి నేతల భేటీ ఢిల్లీలో జరగనుంది
సెన్సార్ బోర్డు సభ్యుడుగా మెరుగు మధు
సెన్సార్ బోర్డు సభ్యుడుగా మెరుగు మధు భువనగిరి /ఆంధ్రప్రభ : కేంద్ర సమాచార
కోల్ కతాకు తీరని కష్టాలు.. కెప్టన్ రహానెకు భారీ జరిమానా
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వరుస ఓటములతో సతమతమవుతోంది. మరోవైపు, కెప్టెన్ అజింక్యా రహానెకు భారీ జరిమానా విధించారు. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా IPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అజింక్య రహానేకు జరిమానా విధించారు. చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో CSKపై మొదట బౌలింగ్ ఎంచుకున్న KKR జట్టు, నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తి చేయడంలో (slow over-rate) విఫలమవడంతో రహానేకు ఈ జరిమానా పడింది. IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 (కనీస ఓవర్-రేటు ఉల్లంఘనలకు సంబంధించినది) ప్రకారం కెప్టెన్ రహానెకు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఒక సీజన్లో ఇటువంటి ఉల్లంఘనలు మూడుసార్లు జరిగితే కెప్టెన్పై నిషేధం కూడా పడుతుంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.అనంతర బ్యాటింగ్ కు దిగిన కెకెఆర్.. CSKపై వారు 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో కెకెఆర్ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించినప్పటికీ, బ్యాటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆ జట్టు టాప్-6 బ్యాటర్లలో ఒక్కరూ కూడా చెప్పుకోదగ్గ భారీ స్కోరు చేయలేకపోయారు. సునీల్ నరైన్, రహానే, అంగక్రిష్ రఘువంశీ వంటి బ్యాటర్లు 20కి పైగా పరుగులు చేసినప్పటికీ, దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యారు. మిడిలార్డర్ లో బ్యాటింగ్కు వచ్చిన రమన్దీప్ సింగ్, రోవ్మన్ పావెల్ ప్రయత్నించినప్పటికీ.. KKR 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కెకెఆర్ కు ఆడిన ఐదో మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది.
99 రోజుల ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా..
99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా.. వికారాబాద్, ఆంధ్రప్రభ
తిరుమలలో భారీగా రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఇక, ం తిరుమల వెంకన్నను 79,426 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 25,889 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Ys Jagan : నేడు జువ్వల దిన్నెకు జగన్
నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు
Andhra Pradesh : నేడు ఇంటర్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి
అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణిలోని మంగేరామ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఒక గిడ్డంగిలో మం(ఏప్రిల్ 14) రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గిడ్డంగి ఆవరణలో నిర్మించిన అనేక గుడిసెలు కాలి బూడిదైపోయాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటంతో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బుధ్ విహార్లో మురికివాడలు నిర్మించి, స్క్రాప్ మెటీరియల్ సేకరించే ఒక ప్లాట్లో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 1.25 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఎవరికీ గాయాలు కాలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి అని ఫైర్ ఆఫీసర్ అజయ్ శర్మ తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉంచి, అనేక తాత్కాలిక గుడిసెలను ఏర్పాటు చేసిన 400 చదరపు గజాల ప్లాట్లో ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలోని ఇరుకైన వీధుల కారణంగా పెద్ద అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకోవడం కష్టమైందని.. అగ్నిమాపక శాఖ మూడు మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్
IPL 2026 : కోల్ కతా కల చెదిరింది.. చెన్నై మళ్లీ మురిసింది
న్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది
15thAprilchintana |ఆధ్యాత్మికతతో సార్థక జీవన మార్గం
15thAprilchintana | ఆధ్యాత్మికతతో సార్థక జీవన మార్గం 15thAprilchintana | జీవితం ఒక
15thaprileditorial |డీలిమిటేషన్, మహిళా బిల్లుల మధ్య తేడా ఏమిటి..?
15thaprileditorial | డీలిమిటేషన్, మహిళా బిల్లుల మధ్య తేడా ఏమిటి..? 15thaprileditorial |
న్యూఢిల్లీ : భారతదేశ చరిత్రలో రాజకీయంగా, సామాజికంగా చరిత్రాత్మక సన్నివేశాలకు సమయం ఆసన్నమైంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 131వ రాజ్యాంగ సవరణ పేరిట ఈ నెల 16న(గురువారం) సంబంధిత మూడు కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సభ్యులందరికీ బిల్లులకు సంబంధించిన ముసాయిదా ప్రతులను మంగళవారంనాడు పంపించింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాల వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి చేరవచ్చునని తెలుస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఉభయసభల్లో ఇందుకు సంబంధించిన బిల్లులకు ఆమోదం పొందిన తరువాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. సుప్రీంకోర్టు జడ్జి స్థాయి వ్యక్తి నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న ఈ కమిషన్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. 33శాతం మహిళా రిజర్వేషన్తో పాటు ఎస్, ఎస్టి రిజర్వేషన్లను కూడా డీలిమిటేషన్ కమిషన్ ఖరారు చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఇదంతా జరుగుతుంది. కమిషన్ సిఫారసుల మేరకు సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలినుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యంగా దక్షిణాది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి జనాభా దామాషా ప్రకారం చేస్తే తీవ్రంగా నష్టపోతామని, హైబ్రిడ్ పద్ధతిలో డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సగం జనాభా ప్రాతిపదిక, మిగతా సగం ఆయా రాష్ట్రాల జిడిపి వృద్ధి రేటు ఆధారంగా చేపడితే ప్రాతినిధ్యంలో ఎలాంటి నష్టం వాటిల్లదని సూచించారు. తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా కేంద్రాన్ని హెచ్చరించారు. నియోజకవర్గా పునర్విభజనలో దక్షిణ భారతానికి నష్టం జరిగితే ప్రజా ఉద్యమం తీసుకువస్తామన్నారు. నేడు ఇండియా కూటమి సమావేశం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అధికారికంగా సమాచారం అందినందున బుధవారం ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. బిల్లులో ప్రతిపాదించిన అంశాలపై సమాచారం అందిన నేపథ్యంలో వాటిపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని నేతలు ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.
15thApril2026 |బుధవారం నేటి పంచాంగం
15thApril2026 | బుధవారం నేటి పంచాంగం 15thApril2026 | ఈరోజు తిథి, నక్షత్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశం అయినందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళల రిజర్వేషన్, పునర్విభజన,లోక్సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారని, అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టం చేశారు. మహిళల రిజర్వేషన్ బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లలోనే 33 శాతం మహిళల రిజర్వేషన్ను యథాతథంగా వెంటనే అమలు చేయాలని, అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అవసరమని వ్యాఖ్యానించారు. పునర్విభజనకు సంబంధించి గతంలో కూడా సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుతూ డిలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపారు. లోక్సభ సీట్లను 850కు పెంచే ప్రతిపాదన అసలైన వివాదాస్పద అంశం అని పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని ప్రో రేటా పద్ధతిలో కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్కు పూర్తి మద్దతు ఇవ్వటంతో పాటు, సీట్ల సంఖ్య పెంపు లేకుండా డిలిమిటేషన్కు తాము పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. ప్రో రేటా మోడల్ రాజకీయ అసమతుల్యతకు దారి తీస్తుంది జనాభా లేదా ప్రో రేటా పద్ధతిలో లోక్సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రో రేటా పద్ధతిలో అమలు చేస్తే దేశంలో తలెత్తబోయే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1970ల నుంచి దేశం జనాభా నియంత్రణ విధానంపై దృష్టి పెట్టినప్పటికీ, రాష్ట్రాల వారీగా జనాభా నియంత్రణ అమలు జరిగిన తీరు భిన్నంగా ఉందని అన్నారు. జనాభాలో తేడాల వల్ల జాతీయ ఐక్యతపై ప్రభావం పడే ప్రమాదాన్ని గుర్తించి ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి వంటి నాయకులు ఈ అంశాన్ని ఒక్కోసారి 25 సంవత్సరాల పాటు వాయిదా వేసినట్లు తెలిపారు. ఆర్థిక సహకారం, సామాజిక, మానవ అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రో రేటా పద్ధతిలో సీట్ల పెంపు చేస్తే దేశ ఫెడరల్ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిథ్యం దేశానికి అత్యంత కీలకమని అన్నారు. సీట్ల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయని తెలిపారు. ఇవన్నీ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలు అని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోతాయని, రాజకీయంగా బలహీనపడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రో రేటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా, రాజకీయ అసమతుల్యతకు దారి తీస్తుందన్నారు. అభివృద్ధిలో పాలుపంచుకున్న రాష్ట్రాలకు శిక్ష పడుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఇప్పటికే పక్షపాతం, వివక్ష ఉన్నట్లు సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతుంటే, తెలంగాణకు తక్కువ నిధులు వస్తున్నాయని ఉదాహరించారు. ఇది దక్షిణాది- ఉత్తరాది అసమానతకు సంకేతమని పేర్కొన్నారు. నిధుల వివక్షకు అదనంగా ఇప్పుడు సీట్ల పెంపు కారణంగా రాజకీయంగా అన్యాయం జరుగుతుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించినప్పటికీ, పార్లమెంట్లో వారి ప్రాధాన్యం తగ్గిపోతుందని, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది మధ్య ప్రాంత రాష్ట్రాలు లాభపడతాయని తెలిపారు. అభివృద్ధిలో పాలుపంచుకున్న రాష్ట్రాలకు శిక్ష పడుతుందని, జనాభా పెరిగిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది అంకెల విషయం కాదని, దేశ సమగ్రత, సమానత్వం, న్యాయానికి సంబంధించిన ప్రాథమిక అంశమని స్పష్టం చేశారు. దక్షిణ రాష్ట్రాలు జాతీయ ఆదాయానికి నిరంతరం సహకరిస్తూ, సుపరిపాలన, అభివృద్ధి ప్రమాణాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ కృషిని పట్టించుకోకుండా దేశ ఐక్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.ప్రో రేటా మోడల్ను దక్షిణ రాష్ట్రాలు అంగీకరించవని, ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుందని పేర్కొన్నారు. అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరమని సూచించారు. హైబ్రిడ్ మోడల్ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అందరి ప్రాతినిధ్యంతో పాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతుల్యం చేస్తుందని వివరించారు. సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం- ...50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.హైబ్రిడ్ మోడల్ ప్రకారం, కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రో రేటా పద్ధతిలో, మిగతా సగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (జిఎస్డిపి), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా, మన ఆలోచనలకు తలుపులు తెరిచి కొత్త భావనలు స్వీకరిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రక్రియ అందరికీ న్యాయంగా, ఆమోదయోగ్యంగా ఉండే ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. హైబ్రిడ్ మోడల్ ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతో పాటు ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందని అన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, అన్ని రాష్ట్రాలు మరియు రాజకీయ పార్టీలతో కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఏకత్వాన్ని బలోపేతం చేసేలా ఉండాలని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని సిఎం రేవంత్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త సీట్లలో గ్రేటర్కు పెద్ద పీట
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన స్థానాలను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు నగరాన్ని ఆనుకుని ఉన్న ఇరుగుపొరుగు జిల్లాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు నగర కేంద్రంగానే సాగేలా కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ప్రస్తుతం తెలంగాణలో 119గా ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య, పునర్విభజన అనంతరం 179కి చేరే అవకాశం ఉంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య 182 వరకు కూడా వెళ్లవచ్చని తెలుస్తోంది. అంటే అదనంగా దాదాపు 60 కొత్త నియోజకవర్గాలు రాష్ట్ర రాజకీయ తెరపైకి రానున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ స్థానాలు 26కు పెరగనున్నారు. అదనంగా మరో 9 స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రేటర్ పరిసరాల్లో భారీగా పెరగనున్న సీట్లు నియోజకవర్గాల పునర్విభజనలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు భారీ లబ్ధి చేకూరనుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య అమాంతం పెరగనుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 15 స్థానాల నుంచి 20కి పెరిగే అవకాశం ఉంది. అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న 5 అసెంబ్లీ స్థానాలు నుంచి 13 స్థానాలకు పెరగనున్నాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 8 అసెంబ్లీ స్థానాలు 13కి చేరే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోనే దాదాపు 51 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా పెరిగే కొత్త సీట్లలో మూడింట ఒక వంతు (సుమారు 22 సీట్లు) కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. ఐదు జిల్లాల పరిధిలో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలతో పునర్విభజన జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు కానున్న 63 శాసనసభ నియోజకవర్గాల్లో 22 ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. అంటే మూడో వంతుకు పైగా ఇక్కడే ఏర్పడనున్నాయి. మహిళా రిజర్వేషన్లతో కొత్త కళ పునర్విభజనతో పాటు మూడింట ఒక వంతు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. లోక్సభలో తెలంగాణకు కేటాయించే 26 స్థానాల్లో సుమారు 9 స్థానాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. అలాగే దాదాపు 60 మంది మహిళా ఎంఎల్ఎలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ మార్పులతో అటు పార్టీల బలాబలాలు, ఇటు నియోజకవర్గాల సరిహద్దులు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు ఉన్న ప్రాధాన్యం, వాడుక దృష్ట్యా కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ సీట్లు కొత్త పేర్లతో ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల కోసమే 50 శాతం జనగణన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే దక్షిణాది ప్రాంతానికి అన్యాయం జరగుతుందనే వాదనలు ఉన్నాయి. మొదటి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం.
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యావ్యాప్తి కోసం గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన ఆఫ్షోర్ క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. నగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ సంస్కృతి, అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ లండన్ ముందుకొచ్చింది. హైదరాబాద్ను ఎంచుకున్న తొలి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా చరిత్రలో ఈ యూనివర్సిటీ నిలవనుంది. యూకేలోని కింగ్స్ కాలేజ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఈ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలుగా ఉన్నాయి. తాజాగా, ఆ విశ్వవిద్యాలయమే తెలంగాణలో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఈ విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి ఆఫ్షోర్ క్యాంపస్గా హైదరాబాద్ ప్రాంగణం నిలువనుండడం విశేషం. తెలంగాణను అన్ని రంగాలకు తగినట్టుగా నిలిపేందుకు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకువచ్చేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలిస్తూ వచ్చారు. రాబోయే రెండేళ్ల కాలంలో ప్రపంచ ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థల ఆఫ్-షోర్ క్యాంపస్లతో కూడిన ఒక నాలెడ్జ్ తరువాయి 9లో
అధికార వ్య వస్థలు.. రాజకీయ పార్టీలు... కార్పొరేట్ సంస్థలు కుమ్మక్కయితే వచ్చిన ఫలితమే రూ.6 లక్షల కోట్ల విలువైన భూ స్కాం. మహా నగర నడిబొడ్డున ఉన్న కూకట్పల్లి ప్రాంతంలో జరిగిన ఈ భారీ భూ కుంభకోణం దేశ చరిత్రలో సంచలనాత్మక స్కాంగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. పరిశ్రమల ముసుగులో రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములను రియల్ వ్యాపారానికి మళ్లించిన తీరుపై ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించకపోవడం, అధికార వ్యవస్థలు పట్టించుకోకపోవడం, నిఘా సంస్థలు నిగ్గుతేల్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థతో కుమ్మక్కైన ఫలితంగానే కూకట్పల్లి ఐడీఎల్ భూములను బడా నిర్మాణ సంస్థలకు దోచిపెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.6 లక్షల కోట్ల విలువైన ప్రజా సంపద ఎవరి జేబుల్లోకి వెళ్లిందనేది అతిపెద్ద ప్రశ్న. ‘రూ.6 లక్షల కోట్ల భూ స్కాం’ అనే ఆరోపణలే యావత్ దేశాన్ని కలవరపెడుతున్నది. ఈ వ్యవహారంలో లక్షల కోట్లు చేతులు మారాయాని, 6 లక్షల కోట్ల భారీ భూ దోపిడీపై నిగ్గుత్చేలాలని కోరుతూ ఇటీవల బోడుప్పల్ మునిసిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు చింతల శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎసీబీ, సీబీఐ లాంటి విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్పల్లి ఐడీఎల్ భూముల స్కాం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నాటి రైతుల త్యాగం.. నేటి కార్పొరేట్ సంస్థల భోగం: కూకట్పల్లి భూమికి ఉన్న విలువ బంగారం కంటే ప్రియమైనది. ఇక్కడ ఎకరం రూ.200 కోట్లకు తక్కువ పలుకదంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలో ఏడు దశాబ్దాల క్రితం.. అంటే 1965లో డిటోనేటర్ల పరిశ్రమ ఏర్పాటు కోసం 870.13 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూమితోపాటు రైతులు, ఆధ్మాత్మిక సంస్థల నుంచి సేకరించి పరిశ్రమకు కట్టబెట్టింది. పరిశ్రమ ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నాడు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, యాదవ, మున్నూరు కాపులకు చెందిన చిన్న, సన్నకారు రైతుల నుంచి ఎకరానికి రూ.50 ధర ఖరారు చేస్తే బాధితులు కోర్టు మెట్లెక్కారు. దీంతో కోర్టు రూ.వెయ్యి ఇవ్వాలని ఆదేశించింది. కానీ, నాటి ప్రభుత్వం ఎకరానికి రూ.500 చేతుల పెట్టి బలవంతంగా భూ సేకరణ చేశారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఉదరగొట్టి నమ్మబలికారని నాటి భూ బాధిత కుటుంబాలు, వారి వారసులు వాపోతున్నారు. ఐడీఎల్ కంపెనీ పేరుతో...: 1965లో రక్షణ రంగానికి అవసరమైన డిటో నేటర్ల తయారీ కోసం ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ (ఐడీఎల్) పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నగర శివారులోని కూకట్పల్లి గ్రామ శివారులోని 870.13 ఎకరాల భూమిని సేకరించి సంస్థకు అప్పగించింది. ఇందులో 181.04 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 151.08 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించారు. అత్యంత ప్రమాదకరమైన డిటోనేటర్ల పరిశ్రమ కావడంతో కంపెనీ చుట్టూ బఫర్జోన్ ఉండాలన్న నిబంధన మేరకు నిజాంకాలంలో అప్పటి నైజాంరాజు ఉదాసీన్ మఠంకు ఇచ్చిన 538. 01 ఎకరాల భూమిని 99 ఏండ్ల లీజు పద్ధతిలో ఏడాదికి రూ.56 వేలను మఠంకు చెల్లించే ఒప్పందంతో ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఉదాసీన్ మఠం వారు సుప్రింకోర్టు మెట్లెక్కి పదేళ్లు పోరాడి హిందూజా చెర నుంచి బయటపడ్డారు. ఇది వేరే విషయం. పరిశ్రమ కోసం పచ్చటి పసిడి పంటలు పండించుకొని జీవనం సాగించే కూకట్పల్లి రైతులే బలి పశువులుగా మారారు. తమకున్న ఒకటి, రెండు ఎకరాలను లాక్కుంటే తాము ఎలా బతకాలని అప్పట్లోనే భూ బాధితులు ప్రశ్నిస్తే భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఐడీఎల్ కంపెనీలో ఉద్యోగం ఇస్తామన్న గ్యారంటీ ఇచ్చారు. కానీ, ఉద్యోగం కాదు కదా ఏ ఒక్క కుటుంబానికి ఒనగూడిన ప్రయోజనం ఏమీ లేదు. భూములను త్యాగం చేసిన రైతుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. అనాడే సామాజిక న్యాయానికి ఘోరమైన అన్యాయం జరిగింది. ఇప్పటికీ భూ బాధిత కుటుంబాలు, వారసులు న్యాయస్థానాల్లో న్యాయం దక్కుతుందని లక్షల వెచ్చించి కేసులు వేసి కొట్లాడుతున్నారు. భూములను కొల్లగొట్టేందుకు హిందూ ‘జాదు’ వ్యవహారం: ఐడీఎల్ కంపెనీ రెండు దశాబ్దాల పాటు డిటోనేటర్ల తయారీలో అగ్రగామిగా నిలిచినప్పటికీ అనేక కారణాల వల్ల 2003లో హిందూజా గ్రూపునకు చెందిన గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మిటెడ్ చేసుకుంది. హిందూజా సంస్థ పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుంచి కంపెనీలో తరచూ ప్రమాదాలు సంభవించడం, పదుల సంఖ్యలో కార్మికులు మృతిచెందడం, క్రమంగా సంస్థ తన ఉత్పత్తిని, ఉద్యోగులను తగ్గించుకుంటూ వచ్చిందని అందులో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ఉత్పత్తి పూర్తిగా తగ్గించివేయడంతో కంపెనీ కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయింది. నగర నడిబొడ్డున ఉన్న ఎంతో విలువైన భూములను దృష్టిలో పెట్టుకునే హిందూజా సంస్థ ఐడీఎల్ నుంచి కంపెనీని ంపెనీని చేసుకుందని రైతు బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అపార అనుభవం కలిగి ఉన్న హిందూజా సంస్థ కూకట్పల్లిలో ఉన్న ఎంతో విలువైన భూములపై కన్నేసి వ్యవహారాన్ని చాకచాక్యంగా నడిపించుకుంటూ వస్తోంది. బెంగుళూరు తరహాలోనే...: బెంగళూరులోని ఐడీఎల్ కంపెనీనీ స్వాధీనం చేసుకుని అక్కడి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగానే ఐడీఎల్ కంపెనీనీ హిందూజా స్వాధీనం చేసుకుంది. కంపెనీ నిర్వహణ కష్టం కావడంతో అక్కడి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది. ఇందుకోసం అక్కడ ఎల్లంక, చిక్కజాల, నవరత్న అగ్రహారాల్లో భూములను ఓ పద్ధతి ప్రకారం రియల్ వ్యాపారం చేసి కమర్షియల్ నిర్మాణాలతో అభివృద్ధి చేసింది. అదే తరహాలో కూకట్పల్లి ఐడీఎల్కు చెందిన 333 ఎకరాలను రాజకీయ, అధికార వ్యవస్థలను మేనేజ్ చేసుకొని రియల్ సంస్థలకు కట్టబెట్టిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. జీవో నెంబర్ ౩౦2 ఆధారంగా కంపెనీకి చెందిన 100 ఎకరాలను మొదట పారిశ్రామికేతర అవసరాలకు మళ్లించిన సంస్థ తర్వాత 2022లో మిగతా 233 ఎకరాలను ప్లాట్లుగా చేసి బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సొమ్ము చేసుకున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్లో ఫైల్ను పక్కన పెట్టింది. రెండో టర్మ్లో అధికారంలోకి వచ్చిన తరువాత 2022లో వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ౩౦2 ఆధారంగా అని పేర్కొంటూ కంపెనీకి చెందిన మిగతా 233 ఎకరాలను పారిశ్రామికేతర అవసరాలకు ఉపయోగించుకోవడానికి కూకట్పల్లి గ్రామ శివారు సర్వే నెం.627, 629, 1011/1, 1011, 1011/3, 1011/4, 1011/12, 1013 నుంచి 1023, 1031, 1032లలోని మొత్తం 333 ఎకరాలను విక్రయించడానికి 2021 అక్టోబర్ 29న ఎండార్స్మెంట్ నెం.ఎల్సీ/22881/2008, 2023 సెప్టెంర్ 26న ఎన్ఓసి/ ఎల్సీ /2281/ 2008 అప్పటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ జారీ చేశారు. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన 151.08 ఎకరాలు, ప్రభుత్వానికి చెందిన 181.04 ఎకరాలు కలిపి మొత్తం 333 ఎకరాలకు కార్పొరేట్ బడా నిర్మాణ సంస్థలకు విక్రయించిన వాటిలో ఉన్నాయి. ప్రభుత్వ అధికార వ్యవస్థలు చట్టాన్ని తుంగలో తొక్కి దాసోహం కావడంతో హిందూజా దేశంలోనే పెరిన్నికగన్న 14 నిర్మాణం సంస్థలకు లే అవుట్ చేసి భూములను రిజిస్ట్రేషన్లు చేసి అప్పగించడం... సదరు నిర్మాణసంస్థలు వేగంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు పొంది విల్లాస్లతో పాటు, హైరైజ్డ్ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణాలను జెడ్ స్పీడ్తో చేపడుతుండటం గమనార్హం. రాజ్యాంగం కల్పించిన హక్కులను అపహస్యం చేసే విధంగా... కూకట్పల్లి ఐడీఎల్ భూముల కుంభకోణం భారత రాజ్యాంగంలోని పలు మౌలిక సూత్రాలను అపహస్యం చేసేవిధంగా రాష్ట్రంలో అధికార వ్యవస్థలు వ్యవహరించాయని స్పష్టమవుతోంది. ఆర్టికల్ 14- (సమానత్వం) 21 (జీవనహక్కు) 300 ఏ (ఆస్తి హక్కు) మౌలిక సూత్రాలను పూర్తిగా ఉల్లంఘించాయి. ప్రజా ప్రయోజనం పేరిట భూమిని స్వాధీనం చేసుకొని తరువాత కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు లాభం చేకూర్చడం ఆర్టికల్ 14కు విరుద్ధం. రైతుల జీవనాధారమైన భూమిని అన్యాయంగా హరించడం, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కోల్పోయేలా చేశారు. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఎవరిని వారి ఆస్తి హక్కులను హరించరాదు. భూమి స్వాధీనం తర్వాత దాని ఉద్దేశాన్ని మార్చడం ఆర్టికల్ 300 ఏకు విరుద్ధమని సుప్రిం ఇదే తరహా కేసుల్లో అనేక మార్లు స్పష్టం చేసింది. దేశంలోని భౌతిక వనరులు సమాజానికి సమానంగా ఉపయోగపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ప్రజా సంపదను ప్రైవేటు సంస్థల లాభాల కోసం వినియోగించడం ఆర్టికల్ 39 (బీ) ప్రకారం రాజ్యాంగ మూల సూత్రానికి విరుద్ధమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంపదను కొద్ది మంది వ్యక్తులకు, సంస్థలకు ప్రయోజనం కల్గించేవిధంగా చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రిం కోర్టు తీర్పులకు భిన్నంగా ..: భాతర రాజ్యంగ పరిరక్షకులుగా ఉన్న అతున్నత న్యాయస్థానం ఇచ్చిన పలు తీర్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూమిని ఆ ఉద్దేశ్యం నెరవేరకపోతే మరే ఇతర ప్రయోజనాలకు మళ్లించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని, అవిచెల్లవని పలుమార్లు అనేక తీర్పుల్లో స్పష్టంచేసినా రాష్ట్ర అధికార వ్యవస్థలు, సంస్థలు మాత్రం పెడచెవిన పెడుతూ కార్పొరేట్ సంస్థలకు దాసోహమవుతున్న తీరుపై న్యాయ నిపుణులు, ప్రజలు మండిపడుతున్నారు. రాయల్డ్ ఆర్చిల్డ్ హోటల్స్ వర్సెస్ జయరామిరెడ్డి (2011) కేసులో ప్రజా ప్రయోజనం పేరిట స్వాధీనం చేసుకున్న భూమిని ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు మళ్లించడం ‘ప్రాడ్ ఆన్ పవర్’గా పరిగణించబడుతుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా పుణె మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ హరక్చంద్ మిశ్రీమాల్ సోలంకీ (2014) కేసులో భూములను త్యాగంచేసిన వారికి సరైన నష్టపరిహారం అందించకపోయినా, అసంపూర్తిగా నష్టపరిహారంతో సరిపుచ్చినా చెల్లదని స్పష్టం చేసింది. భూమి వినియోగాన్ని ఇండస్ట్రీయల్ నుంచి రెసిడెన్సియల్ లేదా కమర్షియల్గా మారినప్పుడు, అసలు రైతులు పెరిగిన పరిహారం, పునరావాస ప్రయోజనాలకు అర్హులని భూ సేకరణ చట్టం 2013లోని పలు సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు, రాజకీయ నాయకుల పాత్రపై ప్రభుత్వం ఆరా..: కూకట్పల్లిలో లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూమిని పారిశ్రామికేతర (రియల్ ఎస్టేట్) అవసరాలకు మళ్లించడంపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హిందూజా సంస్థ అధీనంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ విభాగం భూములను కన్వర్షన్కు ఎన్ఓసీల జారీ, భారీ నిర్మాణ సంస్థలకు విక్రయించడం పెద్ద స్కాం జరిగిందని ప్రభుత్వం భావిస్తున్నది. భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసిన తీరు, అప్పటి జిల్లా కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం, జీహెచ్ఎంసీల పాత్ర, చట్టాల ఉల్లంఘన, రాజకీయ నాయకుల పాత్రపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ఈ భారీ భూ స్కాంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా లేక గతంలో మాదిరిగానే మిన్నకుంటుందా అనేది వేచిచూడాలి. ఫోటో రైటప్ః 13కేపీహెచ్బి 1 నుంచి 10వరకు ఫోటోలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024 నుండి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని బందీగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము 14 రోజుల క్రితం హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ నుండి భారీ కాన్వాయ్తో హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వద్దకు కెటిఆర్, బిఆర్ఎస్ నాయకులు వెళ్లి బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ బిఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేద్కర్ సిద్ధాంతమే పునాదిగా తాము రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. కేవలం మాటల్లోనే కాకుండా, చేతల్లో గౌరవం చూపించాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ హయాంలో దళిత బిడ్డల కోసం 1000 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టి గౌరవించుకున్నామని వ్యాఖ్యానించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటే, కాంగ్రెస్ మాత్రం రూ. 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి కనీసం 12 పైసలు కూడా విదిల్చలేదని విమర్శించారు. చేవెళ్ళ ఎస్సి,ఎస్టి డిక్లరేషన్తో పాటు బిసి, రైతు డిక్లరేషన్లను అమలు చేసే వరకు అంబేద్కర్ స్ఫూర్తితో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.అనంతరం కెటిఆర్, ఇతర బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విగ్రహం కింది భాగంలో ఉన్న భవనంలోని మ్యూజియంను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత విశేషాలను, చారిత్రక ఘట్టాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మే, జూన్ నుంచి ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభిస్తాం : కెటిఆర్ మే, జూన్ నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభించనున్నట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెల్లడించారు. ప్రధానంగా ఎస్సి, ఎస్టి వర్గాల సమస్యలపై తొలుత దృష్టి సారించబోతున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 20న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధినేత కెసిఆర్ హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. తెలంగాణ భవన్లో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ముఖ్య నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి,మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్,ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ,శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి,మాజీ మంత్రులు, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎస్సి,ఎస్టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఏయే ప్రాంతాల్లో ఏయే హామీలు ఇచ్చారో, తిరిగి అదే ప్రాంతాల్లో సభలు పెట్టి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల కోసమే వాడుకుందని మండిపడ్డారు. అంబేద్కర్ పార్లమెంట్కు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆయనకు భారతరత్న ఇవ్వడంలోనూ, పార్లమెంటులో ఫొటో పెట్టడంలోనూ కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించకుండా గేట్లు వేస్తే, తాము హెచ్చరించిన తర్వాతే గేట్లు తెరుచుకున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎస్సి, ఎస్టిలు మోసపోయారని అన్నారు. వెయ్యికి పైగా గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనపై బిఆర్ఎస్ గట్టిగా నిలదీస్తుందని అన్నారు.
బుధవారం రాశి ఫలాలు (15-04-2026)
మేషం వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. వృషభం రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు. మిధునం పాత ఋణ ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. చిన్న నాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట చికాకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. కర్కాటకం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్ధికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహం ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన సమస్యలతో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్య సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. ఆర్ధిక లాభం కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అన్ని విషయాలలో బంధు మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. తుల ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృశ్చికం చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనస్సు సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. ఖర్చులను అదుపు చెయ్యడం కష్టంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. కుంభం వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారములలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీనం నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తవహించాలి.
కోల్కతా నైట్రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
ఐపిఎల్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శాంసన్ 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేశాడు.193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
హైకోర్టుకు నలుగురు శాశ్వత అదనపు న్యాయమూర్తులు
మన తెలంగాణ/హైదరాబాద్ : 2025లో తెలంగాణ హైకోర్టుకు నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వతం చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మంగళవారం జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాశ్వత నియామకానికి సిఫార్సు చేయబడిన అదనపు న్యాయమూర్తులలో జస్టిస్ యారా రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ ఇ. తిరుమల దేవి, - జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావులు ఉన్నారు. 42 మంది న్యాయమూర్తుల మంజూరైన బలం ఉన్న తెలంగాణ హైకోర్టు, ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులతో పనిచేస్తోంది, దీంతో 14 ఖాళీలు ఉన్నాయి.
మంత్రివర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటే తప్పేంటీ?:జగ్గా రెడ్డి
రాష్ట్ర మంత్రివర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటే తప్పేంటీ? అని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికీ చెబుతానని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నందున ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇవ్వరాదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు.మహేష్ గౌడ్ పేరును పిసిసి చీఫ్గా ప్రతిపాదించింది తానేనని ఆయన తెలిపారు. రెడ్లు అందరూ మద్దతు ఇచ్చినందుకే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ అయ్యారని ఆయన అన్నారు. తాము అంత ఫ్రెండ్లీగా ఉన్నామని, ఎవరూ మిత్రత్వాన్ని చెడగొట్టవద్దని ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు లేకుండా రాజకీయం లేదన్నారు. ఎవరు డబ్బు పెడితే వాళ్ళు నాయకుడు అవుతున్నారని ఆయన తెలిపారు.ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే వంద కోట్లు ఖర్చు అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల కోసం పని చేశానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 30న సంగారెడ్డికి రావాల్సిందిగా ఆహ్వానించానని ఆయన తెలిపారు. ఇంకా అభివృద్ధి పనులపై నివేదిక ఇచ్చామని, అభివృద్ధి పనులపై ఈ నెల 21న సమీక్ష ఉంటుందన్నారు. 10 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చామని ఆయన తెలిపారు. గతంలో పేదలకు ఇచ్చిన భూములు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతరులకు ధారదత్తం చేసిందని ఆయన విమర్శించారు. ఇంకో 15 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఏమీ మాట్లాడలేరని, ఏమీ చేయలేరని ఆయన విమర్శించారు. కాంగ్రెస్లో ఏదైనా సోనియా గాంధీకి చెప్పుకోవడానికి స్వాతంత్య్రం ఉందని, బిజెపిలో ఆ స్వేచ్ఛ ఉండదని ఆయన విమర్శించారు. రెండున్నర ఏళ్ళలో తాను సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి తీసుకున్నట్టు లేదా జోక్యం చేసుకున్నట్లు సమాచారం ఉందా..? అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగారని ఆయన చెప్పారు. అటువంటిదేమీ తమ జిల్లాలో లేదని సర్టిఫికెట్ ఇచ్చానని ఆయన తెలిపారు. తనకు ఎదుటి వారిపై ఆరోపణలు చేసే అలవాటు లేదన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు మళ్లీ ఆరోపణలు చేస్తే వాళ్ళ బండారం బయటపెడతానని ఆయన హెచ్చరించారు. పటాన్చెరువులో ఎవరు దందా చేశారో చెబుతానని అన్నారు. 2014 నుంచి తాను ఎక్కడైనా భూములు సంపాదించాని బిఆర్ఎస్ నాయకులు వెతికారని, జల్లెడ పట్టినా ఏమీ దొరకలేదని జగ్గారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాను రద్దు చేయాలని, ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితున్ని సీఎం ఎందుకు చేయలేదని ఎవరైనా అడిగారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

39 C