యురేనియం శుద్ధి నిలిపివేతే లక్ష్యం: ట్రంప్
ఇరాన్తో కాల్పుల విరమణ అనంతరం కొత్త దశ చర్చల్లో యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్న పట్టుదలతో అమెరికా ముందుకు వెళ్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో టారిఫ్ తగ్గింపులు, ఆర్థిక ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ ఒప్పందం విసృ్తత పరిధిలో ఇప్పటికే కొన్ని కీలక అంశాలు అంగీకారానికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో, ఇరాన్లో యురేనియం శుద్ధి పూర్తిగా నిలిచిపోతుంది. అమెరికా, ఇరాన్తో కలిసి లోతుగా దాచిన అణు మౌలిక సదుపాయాల అవశేషాలను వెలికితీసి తొలగిస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలు ఉపగ్రహాల ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయని, దాడి జరిగినప్పటి నుంచి వాటిలో మార్పులేమీ లేవని కూడా ఆయన పేర్కొన్నారు. ఇరాన్తో ఆర్థిక చర్చలు కీలక పాత్ర పోషిస్తాయని ట్రంప్ సూచించారు. టారిఫ్లు తగ్గించడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 15 అంశాల్లో చాలా వరకు ఇప్పటికే అంగీకారానికి వచ్చాయి అని పేర్కొన్నప్పటికీ, వాటి వివరాలు వెల్లడించలేదు. అలాగే, ఇరాన్కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికాకు ఎగుమతులపై వెంటనే 50 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నిర్ణయానికి ఎలాంటి మినహాయింపులూ ఉండవని స్పష్టం చేశారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం చివరి క్షణంలో సాధ్యమైంది. అయితే దీని అమలు, షరతులపై ఇంకా స్పష్టత లేదు. ఒప్పందం ప్రకటించిన కొద్ది గంటల్లోనే యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో క్షిపణి హెచ్చరికలు నమోదయ్యాయి. ఇరాన్లో చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు కూడా సమాచారం వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని సున్నితమైన తాత్కాలిక విరమణగా అభివర్ణించారు. లెబనాన్లోని హెజ్బొల్లాపై యుద్ధం కూడా ఒప్పందంలో భాగమా అనే విషయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదంలో ప్రధాన కేంద్రంగా మారింది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై ఫీజులు విధించే విధానాన్ని ఇరాన్ అమలు చేయవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఒమాన్తో కలిసి ఈ వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మార్గంలో రాకపోకలు ఇరాన్ సైన్య పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. అయితే గల్ఫ్ దేశాలు దీనికి వ్యతిరేకంగా నిలిచే అవకాశముంది. ఇరాన్ అణు కార్యక్రమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఇరాన్ గతంలో యురేనియంను 60 శాతం వరకు శుద్ధి చేసింది, ఇది ఆయుధ స్థాయి శుద్ధికి దగ్గరగా ఉంటుంది. అధిక శుద్ధి యురేనియం నిల్వలు ఇంకా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరాన్ విడుదల చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనలో ఫార్సీ, ఇంగ్లీష్ పత్రాల్లో వ్యత్యాసాలు కనిపించాయి. ఫార్సీ వెర్షన్లో శుద్ధి కొనసాగుతుందని సూచనలు ఉండగా, ట్రంప్ దానిని తప్పుడు పత్రంగా కొట్టిపారేశారు. అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ఇంకా వెలుగులోకి రాలేదు. యుద్ధం ముగియాలంటే అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, ఆంక్షలు ఎత్తివేయడం, నిల్వ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను ఇరాన్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి అమెరికాకు ఆమోదయోగ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టెహ్రాన్లో కాల్పుల విరమణ అనంతరం ప్రభుత్వ అనుకూల నిరసనలు కొనసాగడం, అమెరికాఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు వినిపించడం, దేశంలో కఠిన వైఖరి ఇంకా కొనసాగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో శాశ్వత ఒప్పందంపై చర్చలు త్వరలో ఇస్లామాబాద్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఐపిఎల్ 2026: ఢిల్లీ ముందు భారీ టార్గెట్ ఉంచిన గుజరాత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు, గుజరాత్ టైటాన్స్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) అర్ధ శతకాలతో చెలరేగారు
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సంచలన దర్శకుడు అట్లీ, టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ముందు వరుసలో ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్ను, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి ‘రాకా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇక ‘రాకా’ టైటిల్తో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ అప్డేట్లతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ కొత్త అవతారంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండుతో, వింత శరీరాకృతితో అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు. అల్లు అర్జున్ చూపుల్లో వాడివేడి, పోస్టర్ను డిజైన్ చేసిన తీరు అందరిలోనూ అంచనాల్ని రెట్టింపు చేసింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.అభిమానులు ఐకాన్ స్టార్ పుట్టినరోజును ఈ అప్డేట్లతో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపు కుంటున్నారు. దాదాపు ఏడాది పాటు అభిమానులను ఎదురుచూసేలా చేసిన తర్వాత అట్లీ, అల్లు అర్జున్ ఈ అప్డేట్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ‘పుష్ప: ది రూల్’ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ‘రాకా’తో అందరినీ మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ‘రాకా’ ఒక భారీ సాంకేతిక చిత్రంగా ఉంటుందని, హాలీవుడ్ దిగ్గజాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్, ప్రపంచ నిర్మాణాన్ని సృష్టించాలని అట్లీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ‘జవాన్’, ‘తేరి’, ‘బిగిల్’, ‘మెర్సల్’ వంటి భారీ బ్లాక్బస్టర్లతో సక్సెస్కు కేరాఫ్ అడ్రెస్గా అట్లీ నిలిచారు. అలాంటి అట్లీ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన మీడియా పవర్హౌస్లలో ఒకటైన సన్ టీవీ నెట్వర్క్తో కలిసి ‘రాకా’ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథనాన్ని మేళవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా ‘రాకా’ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఖరీఫ్ సబ్సిడీ కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో రెండు ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో రూ 40000 కోట్ల వ్యయ అంచనాలతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన అంశం కూడా ఉంది. 2026 ఖరీఫ్ సీజన్కు ఎన్బిఎస్ సబ్సిడీ రేట్లకు ఆమోదం, జైపూర్ మెట్రోరైలు రెండో దశకు కూడా ఆమోదం వెలువడిందని కేబినెట్ తరువాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. వెస్ట్బెంగాల్ జార్ఖండ్ మల్టీ ట్రాకింగ్ రైలు ప్రాజెక్టుకు కూడా గ్రీన్సిగ్నల్ వెలువడింది.
లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. తీవ్రంగా స్పందించిన ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. మిస్సైల్స్ తో పెద్ద ఎత్తున దాడులకు దిగింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో లెబనాన్లోని పలు ప్రాంతాలపై 100 వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. లెబనాన్పై దాడి చేస్తూ.. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కొనసాగిస్తే, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం నుండి వైదొలుగుతామని ఇరాన్ హచ్చరించింది. లెబనాన్లో ఇజ్రాయెల్, యుద్ధ విరమణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ దేశాన్ని శిక్షిస్తామని ఇరాన్ పేర్కొంది. ఈ యుద్ధ విరమణ ఒప్పందం లెబనాన్ కూ వర్తిస్తుంది. ఇజ్రాయెల్ వాగ్దానాలను ఉల్లంఘించడంలో పేరుగడించింది. దానిని తూటాలతో మాత్రమే ఆపగలం అని ఇరాన్ తెలిపింది.
ఇరాన్కు ఆయుధాలిచ్చే దేశాలపై 50 శాతం టారిఫ్లు : ట్రంప్
ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తూ తమ దేశానికి ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవంటూ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. ఇరాన్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ట్రంప్ ప్రయోజనకరమైన పాలనాపరమైన మార్పుగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పని చేస్తామన్నారు. భూగర్భ అణు కేంద్రాలపై బి2 బాంబర్లతో చేసిన దాడుల వల్ల ఏర్పడిన అణువ్యర్థాలను టెహ్రాన్ సహాయంతో పూర్తిగా వెలికి తీసి తొలగిస్తామన్నారు. దాడులు జరిగిన నాటి నుంచి ఆ ప్రాంతంలో దేనినీ కదిలించలేదని, అమెరికా స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాల ద్వారా నిరంతరం ఆ ప్రదేశంపై నిఘా ఉంచామని తెలిపారు. ఇరాన్లో ఇకపై ఎలాంటి యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగబోవని తేల్చి చెప్పారు. సుంకాలు, ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించే అంశంపై ప్రస్తుతం ఆ దేశంతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రతిపాదన లోని అనేక అంశాలపై ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.
భభానీపూర్తోనే ఏదైనా నామినేషన్ దశలో మమత బెనర్జీ
తన జీవితంలో అంతా ఇక్కడి నుంచే ఆరంభమయిందని సొంత నియోజకవర్గం భభానీపూర్ నుంచి నామినేషన్ సందర్భంగా తెలిపారు. బుధవారం ఆమె మమత బెనర్జీ జిందాబాద్, జాయ్ బంగ్లా, టిఎంసి జిందాబాద్ నినాదాల మధ్య మమత బెనర్జీ ఆకర్షణీయమైన ప్రదర్శన సాగింది. తాను ఇక్కడనే పుట్టానని, ఇక్కడనే ఏడాది పొడవునా ఉంటానని, తన జీవితం ఇక్కడ ఆరంభమైంది. ఉద్యమాలు, జయాపజయాలు అన్నింటికీ ఈ ప్రాంతం కేంద్రీకృతం అయిందని , ఇక్కడి వారికి ధన్యవాదాలు అని మమత తెలిపారు. తమ కాళీఘాట్ నివాసం నుంచి అలీపోర్ సర్వే బిల్డింగ్ వరకూ ప్రదర్శన సాగింది. 2021లో మమత ఎన్నికల రాజకీయ ప్రక్రియ ఆరంభమైంది. ముకుళిత హస్తాలతో, తనదైన చిరునవ్వుతో పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు వెంటరాగా మమత నామినేషన్ దాఖలు కార్యక్రమం సాగింది. పార్టీ కార్యకర్తలు టిఎంసి జెండాలు పట్టుకుని, ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడిన మమత బిజెపిపై, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. సర్ ప్రక్రియతో అర్హులైన ఓటర్లపై వేటు వేశారని మమత ఆరోపించారు. ఈ వ్యవహారంపై తమ పార్టీ కోర్టుకు వెళ్లుతుందని హెచ్చరించారు. పేర్ల తొలిగింపుతో రాష్ట్రంలో తమ టిఎంసి ఓడిపోదని, జనం గుండెల్లో నిలిచి ఉందని తెలిపారు. బెంగాల్లో ఈ 23, 29 తేదీలలో రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. రాష్ట్రంలో అధికార పరివర్తనకు బిజెపి పిలుపు నిచ్చింది. మమత ప్రతిష్టాత్మక స్థానం నుంచి బెంగాల్ బిజెపి నేత సువేందు అధికారి గత వారం నామినేషన్ దాఖలు చేశారు. దీనితో ఇక్కడ పోటీ కీలకమైంది.
గోవాలో పాండా అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను బొంబాయి హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఏప్రిల్ 9న ఎన్నికల నిర్వహణ ప్రకటన చెల్లనేరదని హైకోర్టు న్యాయమూర్తులు వాల్మీకి మెనెజెస్, అమిత్ జంసన్దెకర్తో కూడిన ధర్మాసనం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది లోపే గడువు ఉందని,ఈ లోగా ఈ ఉప ఎన్నిక ఎందకుని ఇద్దరు ఓటర్లు పెట్టుకున్న పిటిషన్లపై కోర్టు స్పందించింది. గోవా మాజీ మంత్రి రవి నాయక్ మృతితో , ఏర్పడ్డ ఖాళీ భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది. దీని మేరకు గురువారం జరగాల్సిన ఉప ఎన్నిక ఒక్కరోజు ముందు రద్దు అయింది.
కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ చమురు శుద్ధి కేంద్రంపై దాడి
యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్లోని లావన్ దీవిలో ఉన్న ఒక చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. ఈ దాడి కారణంగా శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. దాడిని ఎవరు నిర్వహించారు అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు.
Dacoit Censor Report: Adivi Sesh is back with a blockbuster
Adivi Sesh has consistently delivered blockbusters with his unique style of films and consistent performances at the box office. Taking a four-year gap to deliver perfect love story with thriller elements, he brought us the highly anticipated Dacoit, hitting theaters on this April 10, 2026. The movie completed censor formalities with a U/A certification with […] The post Dacoit Censor Report: Adivi Sesh is back with a blockbuster appeared first on Telugu360 .
హెజ్బొల్లాపై యుద్ధం కొనసాగుతూనే ఉంది: ఇజ్రాయెల్
లెబనాన్కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై యుద్ధంలో పోరాటం, భూభాగ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి అని ఇజ్రాయెల్ సైన్యం బుధవారం స్పష్టం చేసింది. ఇరాన్ యుద్ధానికి సంబంధించి రెండు వారాల కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ దాడులను నిలిపివేస్తుందని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ, యుద్ధం కొనసాగుతుందనే విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. కాల్పుల విరమణ అమలులోకి వచ్చే వరకు ఇరాన్పై కూడా దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ వర్గాలు అంగీకరించాయి. ఇరాన్పై కాల్పుల విరమణను గౌరవిస్తూనే, హెజ్బొల్లాపై యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ముందుగా పేర్కొన్నారు. ఈ పరిణామాలపై హెజ్బొల్లా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనా వెలువడలేదు.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం
పశ్చిమాసియా రణరంగంగా మారింది. ప్రపంచమంతా పెట్రోల్ ధరల మంటలు.. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు.. వీటన్నింటి నడుమ హార్మూజ్ను తెరవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన డెడ్లైన్ దగ్గరపడుతోంది. గడువు ముగిస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో అని ప్రపంచమంతా ఆందోళనగా ఎదురుచూసింది. ఈ సమయంలోనే ట్రంప్ ‘ఓ నాగరికత అంతమవుతోంది’ అని విరుచుకుపడ్డారు. మరోవైపు.. ఏమాత్రం తొణకని ఇరాన్.. సంధికి మాత్రం ససేమిరా అంటూ కూర్చుంది.. దీంతో భీకరదాడులు తప్పవనే ఉత్కంఠ పరిస్థితుల్లోకి ప్రపంచం వెళ్లిపోయింది.డెడ్లైన్ ముగిసేది రాత్రి ఎనిమిది గంటలకు.. ఆ తర్వాత వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులకు టార్గెట్ లిస్ట్ సిద్ధమైంది. టెహ్రాన్ సమీపంలోని ఒక భారీ వంతెనను ధ్వంసం చేశామని.. జరగబోయే విధ్వంసానికి ఇది నిదర్శనమంటూ ట్రంప్ చేసిన ప్రచారం, ఖార్గ్ ద్వీపంపై దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. యుద్ధంలో వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేని ఇరాన్.. ఈ బెదిరింపులను మరింత సీరియస్గా తీసుకుంది. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాలన్నీ యుద్ధం తీవ్రరూపం దాల్చొచ్చనే సంకేతాలను ఇచ్చాయి. ఈ సమయంలో ట్రంప్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. డెడ్లైన్కు కేవలం 90 నిముషాల ముందు సాయంత్రం పోస్టు పెట్టారు. హార్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ పది పాయింట్ల ప్రతిపాదనలు, చర్చలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇరాన్ స్పందించింది. అలా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. చివరి క్షణాల్లో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్పై భారీ బాంబుదాడుల హెచ్చరికల నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిందా? దాని షరతులు ఏమిటి? దీర్ఘకాలిక శాంతికి దారి తీస్తుందా? అనే అంశాలపై స్పష్టత లేదు. పక్షాలు ఒప్పంద నిబంధనలను భిన్నంగా వివరిస్తున్నాయి. ఒప్పందం ప్రకటన అనంతరం గంటల వ్యవధిలోనే ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు ఇరాన్ నుంచి క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం రావడంతో పాటు, కువైట్ సైన్యం డ్రోన్ దాడులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఇరాన్లోని ఒక చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు సమాచారం వెలువడింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని సున్నితమైన తాత్కాలిక విరమణగా అభివర్ణించారు. ఒప్పందంపై చర్చలు త్వరలో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నప్పటికీ, కీలక అంశాలు ఇంకా అనిశ్చితంగా ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఫీజులు వసూలు చేసే విధానాన్ని చట్టబద్ధం చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఇరాన్ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన షరతులు ఇంకా వెల్లడి కాలేదు. ఇతర దేశాలు దీనికి అంగీకరించాయా, లేదా అన్నదీ తెలియరాలేదు. ఇదే సమయంలో లెబనాన్లోని పోరాటాలను ఈ ఒప్పందం నిలిపివేస్తుందని పాకిస్తాన్ పేర్కొనగా, ఇజ్రాయెల్ మాత్రం అంగీకరించలేదు. టెహ్రాన్ వీధుల్లో ప్రభుత్వం అనుకూలంగా నిరసనకారులు అమెరికా మృతి, ఇజ్రాయెల్ మృతి అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామాలు తీవ్రవాద వర్గాల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒప్పందం కుదరకపోతే ఒక నాగరికత అంతరించిపోతుంది అని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ షరతులపై విభిన్న వాదనలు ట్రంప్ చెప్పిన ప్రకారం, ఇరాన్ 10 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఫార్సీ భాషలో బయటకు వచ్చిన ఈ పత్రంలో ఇరాన్ యురేనియం శుద్ధిని కొనసాగిస్తుందని పేర్కొనడంతో, ట్రంప్ దానిని తప్పుడు పత్రంగా పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిలో అమెరికా యుద్ధనౌకలు కొనసాగుతాయని కూడా ఆయన సూచించారు. ఇరాన్ మాత్రం యుద్ధం ముగియాలంటే అమెరికా, తమ సైన్యాన్ని ఆ ప్రాంతం నుంచి ఉపసంహరించుకోవాలని, ఆంక్షలను ఎత్తివేయాలని, తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇవి అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో శాశ్వత శాంతి చర్చలు త్వరలో ఇస్లామాబాద్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఈ ఒప్పందాన్ని మద్దతు ఇచ్చినా, లెబనాన్లోని హెజ్బుల్లా పై యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధిలో వసూళ్లకు అవకాశం యుద్ధంలో సాంకేతికంగా ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కంటే వెనుకబడి ఉన్నప్పటికీ, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ ఇరాన్కు వ్యూహాత్మకంగా లాభించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం నియంత్రణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. ఒప్పందం ప్రకారం, ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్, ఒమన్ దేశాలు ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని పునర్నిర్మాణానికి వినియోగిస్తామని ఇరాన్ భావిస్తోంది. అయితే ఇది అంతర్జాతీయ నావిగేషన్ సంప్రదాయాలకు విరుద్ధమని గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశముంది. ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణు, క్షిపణి కార్యక్రమాలపై స్పష్టత లేదు యుద్ధంలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేసినప్పటికీ, అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమని చెబుతున్నప్పటికీ, అధిక శుద్ధి యురేనియం నిల్వలు ఇంకా ఉన్నట్లు అంచనా. అమెరికా, ఇజ్రాయెల్ ప్రకారం ఈ ముప్పులను తొలగించడమే యుద్ధానికి ప్రధాన కారణం. ఇజ్రాయెల్ అధికారులు, అమెరికా ఈ ఒప్పందాన్ని ముందుగానే సమన్వయం చేసిందని, ఇరాన్ మౌలిక వసతులపై దాడులు ఈ ఒప్పందానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఒప్పందం తర్వాత కూడా దాడులు ఒప్పంద ప్రకటన తర్వాత కూడా పలు దేశాల్లో క్షిపణి హెచ్చరికలు జారీ అయ్యాయి. అబుదాబిలో గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కువైట్, యుఏఇ దేశాలు డ్రోన్, క్షిపణి దాడులను అడ్డుకున్నట్లు వెల్లడించాయి. ఇరాన్లోని లావన్ దీవిలో చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్లో 1,900 మందికి పైగా మరణించగా, లెబనాన్లో 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో కూడా పలువురు మృతిచెందినట్లు సమాచారం. అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
గత ప్రభుత్వంలోనే నాదర్గుల్ భూములకు మ్యుటేషన్: మంత్రి పొంగులేటి
నాదర్గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. ఈ భూమి బాగోతం మొత్తం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి, రేకుల షెడ్లు వేయించింది బిఆర్ఎస్ నాయకులేనని ఆయన మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని గత ప్రభుత్వమని, కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వం తరపు కౌంటర్ దాఖలు చేశామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.
మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నగరంలో సామాన్య ప్రయాణికుడిలా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రోటోకాల్స్కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు. నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లారు. స్టేషన్ చేరుకున్న మంత్రి స్వయంగా టికెట్ తీసుకుని ప్లాట్ఫాంపైకి వెళ్లారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మంత్రి సీటు కోసం ప్రయత్నించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణీకులతో ఆయన ముచ్చటించారు. ప్రయాణీకులతో ఆయన ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని తమ మధ్య చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడారు. పలువురు ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా మంత్రి ఎంతో ఓపికగా వారితో ఫొటోలు దిగారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు.
వెల్డింగ్ చేస్తుండగా పేలిన కెమికల్ ట్యాంకర్.. వ్యక్తి దుర్మరణం #Sangareddy#BuderaAccident
విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి…
విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి… 11 గ్రామాల విలీనం… చిట్యాల,
Vijay’s TVK To Reshape Tamil Nadu Poll Dynamics ?
In a significant political observation ahead of the April 23 Tamil Nadu Assembly election, Durai Vaiko stated that actor Vijay and his party Tamilaga Vettri Kazhagam (TVK) could secure close to 15 percent vote share in their debut electoral outing. He said such a performance could alter the balance of power in the state. Speaking […] The post Vijay’s TVK To Reshape Tamil Nadu Poll Dynamics ? appeared first on Telugu360 .
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
Powerstar to attend Mega158 Launch
Megastar Chiranjeevi is all set to launch his 158th film in a grand manner. The film will be directed by Bobby Kolli and this is their second collaboration after Waltair Veerayya. The film will have its launch in a grand manner in Hyderabad on April 11th. Powerstar Pawan Kalyan will attend the event as Special […] The post Powerstar to attend Mega158 Launch appeared first on Telugu360 .
‘ధురంధర్’ కథ కాపీ వివాదం.. హైకోర్టులో అదిత్యకు ఊరట..
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘ధురంధర్’ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే జోరుతో ఆ సినిమా సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ చిక్కుల్లో పడ్డారు. సంతోష్ కుమార్ అనే దర్శకుడు.. అదిత్య తన కథను కాపీ కొట్టి సినిమా తీశారంటూ ఆరోపణలు చేశాడు. ‘స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’లో తన కథ రిజిస్టర్ అయి ఉందని అదిత్య పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిచాడు. దీంతో ఆదిత్య తనపై సంతోష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని.. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నాడని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తాజాగా హై కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ చేపట్టే వరకూ ఆదిత్య గురించి ఏం మాట్లాడకూడదంటూ సంతోష్కు న్యాయస్థానం సూచించింది. ఇలాంటి పునరావృతం కాకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీన జరుగనుంది.
స్నేహితున్ని పరామర్శించిన మాజీ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్
స్నేహితున్ని పరామర్శించిన మాజీ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ
ఇరాన్ కు ఆయుధాలు ఇస్తే.. భారీగా సుంకాలు విధిస్తా: ట్రంప్ వార్నింగ్
ఇరాన్ తో కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ హెచ్చరికలు ఇరాన్ కు కాదు.. ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు. ఇక నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ.. అమెరికాకు ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని తన ట్రూత్ సోషల్ లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇరాన్ ఎట్టకేలకు అమెరికాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. కాల్పుల విరమణ డీల్ తర్వాత రెండు వారాల పాటు ఇరాన్పై దాడులకు ట్రంప్ విరామం ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్ అంగీకారించడంతోపాటు 10 ప్రతిపాదనలను ఇరాన్.. అమెరికా ముందు ఉంచింది. దీనికి ట్రంప్ ట్రంప్ అంగీకరించడంతో రెండు వారాలపాటు హార్ముజ్ లో రాకపోకలకు అనుమతి ఇస్తామని భద్రతామండలికి ఇరాన్ తెలిపింది.
జుక్కల్ ఎస్సైగా మురళి నియామకం జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ పోలీస్ స్టేషన్
విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు
విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు గీసుగొండ, ఆంధ్రప్రభ : ఈ వంచనగిరి
బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి…
బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి… రూ 38 లక్షలతో కేజీబీవీలో పలు పనులకు
మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి
మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి చిలుపూర్, ఆంధ్ర
సురక్షిత మాతృత్వమే లక్ష్యం.. సర్పంచ్ డ్యాగల రాజశేఖర్
సురక్షిత మాతృత్వమే లక్ష్యం.. సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ఆరోగ్యవంతమైన
పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి
పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్ నిజామాబాద్ స్పోర్ట్స్,
మాహగం సబ్ సెంటర్కు ఉత్తమ అవార్డు…
మాహగం సబ్ సెంటర్కు ఉత్తమ అవార్డు… సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : కొమరం
అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు
అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు గీసుగొండ, ఆంధ్రప్రభ
న్యాయవాదులు విధుల బహిష్కరణ యువ న్యాయవాది హత్యకు దమ్మపేట బార్ అసోసియేషన్ ఖండన
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఢిల్లీ.. హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన గుజరాత్ జట్టు తొలి విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ తన జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. గుజరాత్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. కుమార్ కుషాగ్రా స్థానంలో శుభ్మాన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. తుది జట్లు ఢిల్లీ క్యాపిటల్స్: కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్. గుజరాత్ టైటాన్స్: శుభ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ.
బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి.
విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ […] The post బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి. appeared first on Visalaandhra .
విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం….
విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం…. మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన
కొలనూరులో సన్న బియ్యం పంపిణీ… పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి
వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం….
వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం…. చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల
పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలి..!
పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలి..! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : పిల్లలను
వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్…
వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్టు: రామ్మోహన్ నాయుడు
ఎయిర్పోర్టులపై వస్తున్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫీజబులిటి ఉన్న చోట ఎయిర్పోర్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మామునూరు ఎయిర్పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఉంటుందని అన్నారు. సివిల్ ఏవియేషన్తో కలిసి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ చెప్పిందని తెలిపారు. ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని పేర్కొన్నారు. రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆదిలాబాద్లో రక్షణశాఖకు 360 ఎకరాలు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు కావాల్సిన అనుకూలతలు ఆదిలాబాద్కు ఉన్నాయని.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఏయిర్పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వివరించారు. పెద్దపల్లి ఎయిర్పోర్టు ప్రతిపాదనపై ఫీజబులిటీ నివేదిక సానుకూలంగా ఉందని అన్నారు.
మహిళా రిజర్వేషన్లతో చట్ట సభలకు ఎన్నికలు: బిజెపి రాంచందర్ రావు
చట్ట సభలకు రాబోయే ఎన్నికలు తప్పని సరిగా మహిళా రిజర్వేషన్లతోనే జరుగుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.కొండాపూర్లోని శిల్పా పార్క్ అపార్ట్మెంట్స్ నివాసితులు బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ చట్టం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని, రాబోయే 2029 ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఇది పెద్ద అడుగు అని ఆయన అభివర్ణించారు.దేశవ్యాప్తంగా త్వరలో డీ-లిమిటేషన్ ప్రక్రియ జరగనుందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ అనేది పూర్తిగా ఎలక్టోరల్ ప్రాసెస్లో భాగమని ఆయన తెలిపారు. ఓటర్ లిస్టును శుద్ధి చేయడానికి చేపట్టే ప్రక్రియ మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానమని ఆయన వివరించారు. సర్ ప్రక్రియ గతంలో 1956, 1965, 1970, 1980, 1990లలో జరిగిందని, చివరిసారిగా 2002లో జరిగిందని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఓటర్లు వేరే ప్రాంతానికి మారడం, మరణించడం వంటి కారణాలతో ఓటర్ లిస్టులో లోపాలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ఈ సమస్యలను సరిచేయడానికి ఎన్నికల సంఘం ఫార్మ్-6, ఫార్మ్-7, ఫార్మ్-8లను ప్రవేశపెట్టిందని, వీటి ద్వారా కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు జరుగుతాయని అందువల్ల ప్రతి ఓటరు తమ వివరాలను సరిచేసుకోవడం చాలా అవసరమని ఆయన చెప్పారు. మరోవైపు హైదరాబాద్ పాతనగరంలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు నమోదై ఉండడం వంటి అనుమానాస్పద అంశాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు అక్రమంగా ప్రవేశించి, స్థానికంగా మజ్లీస్ మద్దతుతో ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పొందడం చూస్తూనే ఉన్నామన్నారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలి. రెండు చోట్ల ఓటు ఉండటం చట్ట విరుద్దమని, అలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించడం తప్పనిసరి అని రాంచందర్ రావు అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలోనూ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని రాంచందర్ రావు ఆయన తెలిపారు. --==--
అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి…
అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి… కోర్టు ముందు న్యాయవాదులు ధర్నాబార్ అసోసియేషన్
చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి
చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ
Telangana : యాష్కీకి ఇక పదవులు లభించడం కష్టమేనా?
మధుయాష్కీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్యున్నత పదవి లభిస్తుందని భావించారు
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ…
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ… జవహర్ నగర్, ఆంధ్రప్రభ : కీసర
రైల్వే బ్రిడ్జి పనుల్లో ఒక్కసారిగా కూలిన నిర్మాణం.. బ్రిడ్జిలో ఇరుకున్న కార్మికులు #Kagaznagar
నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి
నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రె
మొట్టమొదటి ‘వరల్డ్ డైమండ్ డే’ వేడుకలు…
మొట్టమొదటి ‘వరల్డ్ డైమండ్ డే’ వేడుకలు… వారసత్వ సంపద నుండి ఆధునిక మైలురాళ్ల
రైల్వే స్టేషన్లలో పోలీసుల విస్తృత తనిఖీలు…
రైల్వే స్టేషన్లలో పోలీసుల విస్తృత తనిఖీలు… రామగుండం, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణ,
YSRCP : చంద్రబాబు ప్రసంగాలు కామెడీగా ఉంటున్నాయ్చంద్రబాబు ప్రసంగాలు కామెడీగా ఉంటున్నాయ్
చంద్రబాబుకు రాయలసీమ అంటే ద్వేషమని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు
కొత్తపల్లి పాఠశాలకు దాతల చేయూత…
కొత్తపల్లి పాఠశాలకు దాతల చేయూత… పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రాయపోల్, ఆంధ్రప్రభ
ఎన్టీఆర్ వైద్య సేవలో రావలసిన బకాయిలకు ప్రభుత్వం స్పష్టమైన హామీ..
ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మె విరమణ.. డాక్టర్ బషీర్విశాలాంధ్ర ధర్మవరం;; ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించవలసిన బకాయిల్లో సుమారు 1000 కోట్ల రూపాయలను 10 రోజుల్లో చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు విరమించడం జరిగిందని డాక్టర్ బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యవర్గం తెలిపిన మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుతీరులు ఆశా ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం […] The post ఎన్టీఆర్ వైద్య సేవలో రావలసిన బకాయిలకు ప్రభుత్వం స్పష్టమైన హామీ.. appeared first on Visalaandhra .
ఆ విషయంలో అందుకే హరీశ్ రావు దుష్ప్రచారం: పొంగులేటి
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాదర్గుల్ భూముల విషయంలో హరీశ్ దుష్ప్రచారం చేస్తున్నారని పొంగులేటి అన్నారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన హరీశ్రావు, బిఆర్ఎస్ సర్కార్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. సర్వే నంబర్.613లోని భూములను 2014లో మూడు సంస్థలకు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని.. భూముల మ్యుటేషన్ 2016లో జరిగినప్పుడు కూడా బిఆర్ఎస్యే అధికారంలో ఉందని తెలిపారు. 2014, 2016లో జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ‘‘హరీశ్రావు చెబుతున్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభించారు. భూములు పొందిన వారు నాలా కన్వర్షన్ ఇవ్వట్లేదని 2022లోనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాళ్లు కోర్టుకు వెళ్తే, బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అవి ప్రభుత్వ భూములు అని చెప్పి మం కౌంటర్ వేశాం. ఆనాడు వాటాల ఒప్పందం చేసుకుని భూములు కట్టబెట్టి ఇలాళ మా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాదల్గుల్ వాటా రాకపోవడంతో హరీశ్ రావు ఇవాళ తెరపైకి తెచ్చారు. ప్రొహిబిటెడ్ భూముల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. హరీశ్ రావు చెబుతున్న కంపెనీల్లో నా కుటుంబ సభ్యులు లేరు. నా కుటుంబ సభ్యులు ఉన్నారని నిరూపించాలని సవాల్ చేస్తున్న. వట్టి నాగులపల్లి భూముల్లోనే హరీశ్ రావు పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారు’’ అని పొంగులేటి విరుచుకుపడ్డారు.
హెయిర్ కటింగ్ సెలూన్ యజమానికి 72 లక్షల జీఎస్టీ
విజయవాడలోని హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు 72 లక్షలు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు అందాయి
Instagram Subscriptions: What Are You Really Paying For?
Once a simple social media platform has now turned into a full-fledged monetization machine. Instagram is no longer just about sharing photos or staying connected. Celebrities and influencers are now selling access. The rise of subscriptions has changed the game. Earlier, users followed accounts and engaged with content freely. Now, many creators have locked their […] The post Instagram Subscriptions: What Are You Really Paying For? appeared first on Telugu360 .
గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించాలి: ఎంపీడీవో
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎంపీడీవో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గ్రామంలో తలెత్తే త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు వంటి ఇతరత్రా ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే సోషల్ మీడియా గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డ్రైనేజీలు చెత్తతో పేరుకుపోయినా, పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిర్ణీత ప్రాంతాలకు రాకపోయినా లేదా వేసవి దృష్ట్యా ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఏర్పడితే […] The post గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించాలి: ఎంపీడీవో appeared first on Visalaandhra .
Iran - America Cease Fire : కాల్పుల విరమణతో దిగివచ్చిన చమురు ధరలు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన తర్వాత చమురు ధరలు తగ్గాయి
సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి…
సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి… ఉప సర్పంచ్ ల సంఘం
ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా): మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోగ్రామాల్లో ఉపాధి అవసరమైన వారిని గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న పనుల గురించి వారికి వివరించి, వారు పనికి వచ్చేలా (లేబర్ మొబలైజేషన్)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల మన రాప్తాడు […] The post ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి appeared first on Visalaandhra .
Rs 72 lakhs |నకిలీ కంపెనీ మోసం
Rs 72 lakhs | నకిలీ కంపెనీ మోసం Rs 72 lakhs
రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..
అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […] The post రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం.. appeared first on Visalaandhra .
ఆర్టిజన్స్ అనుమ్యాన్ సమ్మెలో పాల్గొన్న విద్యుత్ కార్మికులు…
ఆర్టిజన్స్ అనుమ్యాన్ సమ్మెలో పాల్గొన్న విద్యుత్ కార్మికులు… తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ :
ఒక్కరోజే రూ.10,000 పెరిగిన వెండి ధర వెండి ధరలకు రెక్కలు.. బంగారం కంటే నేను ఏం తక్కువ అంటూ దూసుకుపోతున్న వెండిహైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి రేటు ఏకంగా రూ.10,000 ఎగబాకింది.దీంతో ప్రస్తుతం వెండి ధర రూ.2,65,000కు చేరింది. The post వెండి.. మహా మొండి! appeared first on Visalaandhra .
సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలి..
సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం… మునుగోడు, ఆంధ్రప్రభ
శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది..
వైద్యాధికారులు దిలీప్ కుమార్, పుష్పలత విశాలాంధ్ర ధర్మవరం;; మానవ శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది అని, దానిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం అందరి కనీస బాధ్యత అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ దిలీప్, డాక్టర్ పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవము సందర్భంగా గ్రామంలో ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కావున ప్రతిరోజు ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటూ, […] The post శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది.. appeared first on Visalaandhra .
ఫ్లెక్సీల నిర్వహణపై సమావేశం.. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఫ్లెక్సీల నిర్వహణపై పట్టణంలోని రాజకీయ నాయకులకు, ఫ్లెక్సీ నిర్వాహకులకు, మేదర సంఘ నాయకులతో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటరమణయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ధర్మవరం ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా సరే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ఫ్లెక్సీలను […] The post ఫ్లెక్సీల నిర్వహణపై సమావేశం.. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య appeared first on Visalaandhra .
Ham Roads |ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం….
Ham Roads | ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం…. Ham Roads |
*గ్రానైట్ క్వారీల్లో నలిగిపోతున్న జీవితాలు*అనారోగ్యంతో అర్థంతర చావులు*వలస జీవుల వెతలు… పట్టించుకోని పాలకులు ‘‘కొండలు పగలేసినం…బండలనే పిండినంమా నెత్తురు కంకరగాప్రాజెక్టుల కట్టినంశ్రమ ఎవరిదిరోసిరి ఎవరిదిరో’’…ప్రముఖ కవి చెరబండరాజు రాసిన ఈ అక్షరాలు చిత్తూరు జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో రక్తాన్ని చెమటగా మార్చి, రాళ్లను రత్నాలుగా మారుస్తున్న వలస జీవుల బతుకులకు అక్షరాలా సరిపోతాయి. ఇక్కడ సంపద సృష్టించబడటం వెనుక వేలాది మంది కార్మికుల అస్థిపంజరాలు దాగి ఉన్నాయి. మెరిసే గ్రానైట్ పలకల వెనుక వారి కన్నీటి గాథలు […] The post బతుకు ‘బండ’ బారుతోంది appeared first on Visalaandhra .
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు…
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు… ఎన్ ఏం ఎన్ ఎఫ్ కిట్ల పంపిణీ…
ఆ అభ్యర్థి ఆస్తి విలువ రూ. 5863 కోట్లు
తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థిచెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు ఎవరో తేలిపోయింది. తిరుచిరాపల్లి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న లీమా రోజ్ తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.5,863 కోట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ అఫిడవిట్లో వివరాలు పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం లీమా రోజ్ పేరిట రూ.139 కోట్ల చరాస్తులు, రూ.910 కోట్ల […] The post ఆ అభ్యర్థి ఆస్తి విలువ రూ. 5863 కోట్లు appeared first on Visalaandhra .
ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రావాలి
ప్రిన్సిపాల్ పద్మశ్రీ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి లోగల ఏపీమోడల్ స్కూల్, ధర్మవరం లో 6 వ తరగతి,(2026-2027) ప్రవేశానికి దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రోజున హాజరుకావాలని తెలిపారు. The post ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రావాలి appeared first on Visalaandhra .
అల్లు అర్జున్ అభిమానుల రక్తదానం
అల్లు అర్జున్ అభిమానుల రక్తదానం చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రముఖ తెలుగు హీరో
మద్యం మత్తులో అతివేగంతో కారు… ముగ్గురిని ఢీకొట్టిన కనకాల రామ్ కుమార్ రెడ్డిఇద్దరు
ఇన్స్పెక్టర్ ఇంట్లో ఎసిబి సోదాలు.. భారీగా నగుదు, ఆస్తి పత్రాలు సీజ్
శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇన్స్పెక్టర్ కనకయ్య ఇంట్లో ఎసిబి సోదాలు చేపట్టింది. బుధవారం ఆయన నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి.. దాదాపు రూ.35 లక్షల నగదు, పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకయ్య, సబ్ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వర్లను ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ఇవాళ ఇన్స్పెక్టర్ కనకయ్య ఇంట్లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి నాయకులు కేశవ నాయుడు మృతి
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం పట్టణానికి చెందిన టిడిపి నాయకులు నెట్టెం కేశవ నాయుడు (50) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. వీరి స్వగ్రామం నెట్టo కేశవ నాయుడు స్వస్థలం తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందినవారు కాగా 30 ఏళ్ల క్రితం ధర్మవరం పట్టణo శాంతినగర్ కు కుటుంబంతో వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. బొలెరో వాహనం డ్రైవర్గా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడుగా పనిచేశారు. మార్చి నెల 31వ […] The post రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి నాయకులు కేశవ నాయుడు మృతి appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08: (జనం సాక్షి ) మాజీ రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ పుండ్ర …
‘పెద్ది’ ఐటమ్ సాంగ్ కోసం టాలీవుడ్ యంగ్ బ్యూటీ..?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు విడుదలైన సాంగ్స్, టీజర్కి కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా.. అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫ్యాన్స్లో మరింత జోష్ని నింపుతోంది. ఎఆర్ రెహమాన్ సంగీతం తమకూరుస్తున్నా ఈ సినిమాలో ఉండే ఐటమ్ సాంగ్ కోసం ఓ యంగ్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్నారని పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఇటీవలే ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ప్రేక్షకుల మనస్సు దోచేసిన మానస వారణాసి. తొలుత ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్ని అనుకున్నారట. అయితే మృణాల్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మానసకు ఈ ఛాన్స్ దక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ హీరోగా చేసిన ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో మానస హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇక జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు మేకలబాబు, ముకుంద, కోశాధికారి లక్ష్మీ ఓబులేసు, రెగ్యులర్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, పుల్లన్న, మాట్లాడుతూ మునిసిపల్ పారిశుద్ధ్య విభాగానికి చెందిన అప్కాస్ కార్మికులకు మార్చి నెలకు సంబంధించిన జీతాన్ని ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి […] The post మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. సిఐటియు నాయకులు appeared first on Visalaandhra .
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్
పూడూర్ ఏప్రిల్ 08(జనం సాక్షి): పరిగి డివిజన్ పరిధిలోని మిట్ట కోడూరు గ్రామంలో విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత కళలను వెలికి తీయడానికి …
అంగన్వాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి మొబైల్స్ …
అంగన్వాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి మొబైల్స్ … జైనూర్, ఆంధ్రప్రభ : అంగన్వాడి
కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08 (జనం సాక్షి ):నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి …
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ….
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…. మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని
ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోట పురపాలక ప్రాథమిక పాఠశాలలో (ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా) ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయ్ భాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ పెరుమాళ్ళ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలిలో కరపత్రాలను విడుదల చేశారు. […] The post ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ద్వారా 499 మార్కులు..
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల పదవ తరగతి పరీక్షలు జరిగాయి. పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో కూడిన మార్కులు కైవసం చేసుకోవడానికి యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరిగిందని, తద్వారా 600 మార్కులకు గాను 499 మార్కులు తమ స్టడీ మెటీరియల్ ద్వారా రావడం పట్ల యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర నారాయణరెడ్డి, […] The post పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ద్వారా 499 మార్కులు.. appeared first on Visalaandhra .
బాపట్ల జిల్లా సూరేపల్లిలో సీఎం పర్యటన
బాపట్ల జిల్లా సూరేపల్లిలో సీఎం పర్యటన – ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్…
నిధులు వినియోగించడంలో ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి….
నిధులు వినియోగించడంలో ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి…. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
కర్నూలులో ఉద్రిక్తతలు… ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణుల ఆందోళన…. కర్నూలు, ఆంధ్రప్రభ
Andhra Prabha Smart Edition |TS|కాళేశ్వరం/దెబ్బతింటాయ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-04-2026, 4.00PM ts కాళేశ్వరం తీర్పు.. రెండు
‘జన నాయగన్’ రిలీజ్ వివాదం.. రజనీ రియాక్షన్ ఇదే..
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్-2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. 2023లో వచ్చిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్లోని ఓ షెడ్యూల్ని పూర్తి చేసుకొని రజనీ బుధవారం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయం వద్ద విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆసక్తికరంగా విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఆలస్యంపై ఓ ప్రశ్న తలెత్తింది. దీనికి రజనీ ‘సారీ.. నో కామెంట్స్’ అంటూ సమాధానాన్ని దాటవేశారు. ఇక తాను, కమల్హాసన్ కలిసి నటించనున్న సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని తెలిపారు. ‘జైలర్ 2’ షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని.. నిర్మాణ సంస్థ త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తుందని చెప్పారు. ఇక, ‘జన నాయగన్’ విషయానికొస్తే.. నటుడు, టివికె పార్టీ అధినేత విజయ్ నటించిన చిత్రమిది. ఈ సినిమా నిజానికైతే.. ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది. ఇంకా సినిమా కొత్త విడుదల తేదీలో స్పష్టత రాలేదు.
కర్నూలులో యువకుడి దారుణ హత్య….
కర్నూలులో యువకుడి దారుణ హత్య…. స్నేహితుల మధ్య మద్యం మత్తులో ఘర్షణప్రాణాలు కోల్పోయిన

34 C