భట్టి ఇంట్లో మంత్రుల భేటీపై పీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో మంత్రుల భేటీపై పీసీసీ చీఫ్ మహేష్కుమార్ స్పందించారు
Republic Day Weekend: MSVPG and Border 2 tops the Show
There are no new Telugu films that released during the Republic Day weekend in Telugu cinema. Megastar Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu continued to dominate the show over the Republic Day weekend in the Telugu states. Among the other Sankranthi releases, Nari Nari Naduma Murari and Anaganaga Oka Raju have been decent across the […] The post Republic Day Weekend: MSVPG and Border 2 tops the Show appeared first on Telugu360 .
Andhra Pradesh : నేడు టీడీపీ కీలక సమావేశం
తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది
ఫ్యాక్ట్ చెక్: పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోలేదు
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడి ఆశీర్వాదం
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో స్టార్ హీరోలతో ఓ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో ప్రారంభం కానుంది. అదే ‘సోల్ ట్రిప్’. ఈ అడ్వెంచరస్ టాక్ షో మన టాలీవుడ్ స్టార్ హీరోలతో ప్రేక్షకులను అలరించనుంది. ఇది వరకు పోస్టర్, అన్వేషి వంటి సినిమాలు చేసిన హీరో, నిర్మాత విజయ్ దాట్ల తన సొంత బ్యానర్ గండభేరుండ ఆర్ట్పై ఈ సెలబ్రిటీ టాక్షో సీజన్1ను ముగించుకుని, త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఛానల్లో రిలీజ్ చేయబోతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘సోల్ ట్రిప్’ టాక్ షో పోస్టర్ను విడుదల చేశారు. ఈ మొదటి సీజన్లో జగపతిబాబు, శ్రీకాంత్, స్టార్ కమెడియన్ అలీ, హీరోయిన్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వర్ష బొల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Sanju Samson : సంజూ శాంసన్ కు చోటు దక్కే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి?
టీం ఇండియా ఆటగాడు సంజూ శాంసన్ కు వరల్డ్ కప్ లో చోటు దక్కే అవకాశాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి.
బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు
కర్నూలులో.. కావేరి ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
అమరావతి: కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు సమీపంలో టిడ్కో ఇళ్ల వద్ద ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎదురుగా వాహనాలు రాకపోవడంతో సురక్షితంగా బయటపడటం కారణంగా వారంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ ప్రయాణికులను మరో బస్సుకు పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపాయి
America : అమెరికాలో భీకర మంచు తుపాన్.. ఇప్పటి వరకూ 30 మంది మృతి
అమెరికాలో భారీ మంచు తుపాను తీవ్రత కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 27వతేదీ మంగళవారం అఖిలపక్ష భేటీ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ ఆదివారం తెలిపారు. పార్లమెంట్ హౌస్ అనెక్స్లోని మొయిన్ కమిటీ రూంలో ఉదయం 11 గంటలకు దీనిని ఏర్పాటు చేశారు. అందరికి సమాచారం పంపించారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఈ నెల 28వ తేదీన ప్రారంభం అవుతుంది. తొలిదశ ఫిబ్రవరి 13న ముగుస్తుంది. అయితే విరామం తరువాత తిరిగి మార్చి 9న ఆరంభం అయ్యే సెషన్ ఏప్రిల్ 2 వరకూ ఉంటుందని మంత్రి వివరించారు. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెడుతారు. సెషన్ ఆరంభం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ, లోక్సభ సంయుక్త సమావేశాన్ని ఉద్ధేశించి ప్రసంగిస్తారు. పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆదివారం అయినప్పటికీ సమర్పిస్తారు. ఇక ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టే తొమ్మిదవ కేంద్ర బడ్జెట్ ఇది. రికార్డుగా మారుతుంది. బడ్జెట్ సమర్పణ తరువాత ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకూ మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చ జరుగుతుంది. జనవరి 28, ఫిబ్రవరి 1వ తేదీలలో జీరో అవర్ ఉండదని అధికారిక వర్గాలు తెలిపాయి.
భారత ఉపఖండంలో క్రికెట్ పిచ్లు వేడెక్కుతున్నాయి. సెగలు పొగలు కక్కుతున్నాయి. దీనికి కారణం మరో పది రోజుల్లో భారత్ - శ్రీలంక వేదికగా జరగబోయే టి20 ప్రపంచ కప్ కారణమని అనుకుంటే పొరబాటు. ఉపఖండం ప్రజలు తమ ప్రాణం కంటే ఎక్కువగా క్రికెట్ను అభిమానిస్తారు.. ఆరాధిస్తారు. అలాంటి ఆటలో రాజకీయాలు చొరబడి, ఆటను శాసించే స్థాయికి చేరుకోవడంతో ఒకప్పుడు దేశాలను దగ్గర చేసే ఆటగా పేరొందిన క్రికెట్ ఇప్పుడు దేశాల మధ్య చిచ్చు రాజేసే స్థితికి చేరింది. భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ రెండు జట్లూ తలపడేందుకు తటస్థ వేదికలే దిక్కవుతున్నాయి. తాజాగా టి20 ప్రపంచ కప్ పోటీలనుంచి వైదొలగిన బంగ్లాదేశ్తో భవిష్యత్తులో భారత్ ఆడే మ్యాచ్లకూ తటస్థ వేదికలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఆటలోకి రాజకీయాలు చొరబడిన ఫలితమిదంటే అతిశయోక్తి కాదు. బంగ్లాదేశ్తో రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యం బంగ్లా క్రికెటర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను తమ జట్టులోకి తీసుకున్నందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడం ద్వారా తేనెతుట్టెను కదిపింది. కేంద్రంలోని రాజకీయ పెద్దలను సంతోషపెట్టేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయంతో వివాదానికి అంకురార్పణ జరిగింది. బిసిసిఐ నిర్ణయానికి ప్రతిగా రానున్న టి20 ప్రపంచ కప్లో భారత్లో జరిగే మ్యాచ్లలో పాల్గొనబోమంటూ బంగ్లాదేశ్ భీష్మించడంతో పరిస్థితి చినికి చినికి గాలివానగా మారింది. నిజానికి బంగ్లాదేశ్ ఊహించినంత భద్రతాపరమైన సమస్యలేవీ భారత్లోలేవు. భారత్లో భద్రతా ఏర్పాట్లపై ఐసిసి నియమించిన కెనడా ఏజెన్సీ, భారత్లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్లకు భద్రతాపరంగా ఎలాంటి ముప్పు వాటిల్లే ప్రమాదం లేదని తేల్చి చెప్పిన తర్వాతైనా బంగ్లాదేశ్ దిగిరాకపోగా, మొండిగా తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని కోరడం ద్వారా వివాదాన్ని తెగేదాకా తెచ్చుకుంది. ఒకవేళ బంగ్లా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుందామనుకున్నా, ఇప్పటికే భారత్లో తాము ఆడే మ్యాచ్ల కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఇతర దేశాల జట్ల మాటేమిటి? తగినంత వ్యవధి ఇవ్వకుండా ఆయా జట్లన్నింటినీ శ్రీలంకకు వెళ్లి ఆడమనడం సమంజసమేనా? పేదవాడి కోపం పెదవికి చేటన్నట్లు.. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును, మరీ ముఖ్యంగా ఆ దేశ ఆటగాళ్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. టి20 ప్రపంచ కప్ నుంచి వైదొలగినందున బంగ్లా క్రికెట్ బోర్డుకు 240 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లవచ్చునని అంచనా. స్పాన్సర్షిప్, బ్రాడ్ కాస్ట్ రూపేణా వచ్చే ఆదాయంలో 60 శాతం కోతపడే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో గోరుచుట్టుపై రోకటిపోటు అన్నట్లు బంగ్లా- భారత్ మధ్య ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరగవలసిన ద్వైపాక్షిక సిరీస్ కూడా రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. రాజకీయ కక్ష సాధింపుకోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం కొరివితో తలగోక్కున్న ఫలితమిది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని రాజకీయ పార్టీలు ఈ పరిణామాలపై కిమ్మనకపోయినా, అక్కడి మీడియా మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబడుతోంది. పేరుకు క్రికెట్కు సంబంధించిన వ్యవహారాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చక్కబెడుతున్నా, పెత్తనం చెలాయించేది మాత్రం బిసిసిఐ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఐసిసి చైర్మన్ పదవిలో కేంద్ర హోం మంత్రి తనయుడే కొనసాగుతున్నందున బిసిసిఐ చెప్పినట్టల్లా ఐసిసి ఆడుతోందనే విమర్శలూ లేకపోలేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే క్రీడా సంఘాల్లోనే కాదు, ఆటల్లోనూ రాజకీయ నేతల జోక్యం తగ్గాలి. ఆటను వేరుగా, రాజకీయాలను వేరుగా చూసే పరిస్థితి రావాలి. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పటిష్టంచేసే ఆటగా క్రికెట్ను మాజీ ప్రధాని వాజపేయి పేర్కొనేవారు. 2004లో పాక్ లో పర్యటించబోయే భారత జట్టును ఉద్దేశించి ‘ఆటనే కాదు, అక్కడివారి మనసులనూ గెలుచుకు రండి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. ఇరు దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలను పెంపొందించే దిశగా క్రికెట్ ను రూపొందించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.
న్యూఢిల్లీ: సర్వసత్తాక, అతి పెద్ద ప్రజాస్వామిక భారతదేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవంతో దేశ భక్తిని చాటుకుంది. ప్రధాన ఉత్సవం దేశ రాజధాని ఢిల్లీలో కనుల పండువగా పరేడ్తో సాగింది. ఉగ్రవాద ఉన్మాదంపై భారతీయ సైన్యం విరుచుకుపడ్డ ఘట్టం ఆపరేషన్ సిందూర్ త్రివర్ణ పతాకాల రెపరెపల మధ్య మరోసారి రాజధానిలోని కర్తవ్యపథ్లో కళ్లముందుకు తీసుకువచ్చారు. ఆపరేషన్ సిందూర్లో వీర భారతీయ సైన్యం వాడిన ఆయుధాలు, క్షిపణులు, యుద్ధ విమానాల శ్రేణులను ప్రదర్శించారు. ఈ ఏటి గణతంత్ర దినోత్సవం జాతీయ గీతం వందేమాతరం ఆవిష్కరణానికి 150 ఏండ్లు నిండిన ఘట్టం ప్రధాన ఇతివృత్తం అయింది. భారత దేశ సరిహద్దుల రక్షణకు ఆయువుపట్టు అయిన భారతీయ సైనిక పాటవానికి ప్రతీక సిందూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. తెగబడి ఉగ్రవాద చర్యలకు దిగితే , వెంటబడి దెబ్బతీస్తామనే సిందూర్ సైనిక చర్య కేంద్ర బిందువు అయింది. వందేమాతరం ఇతివృత్త కవాతుపై పూల వర్షం నేలపై సాగుతున్న వందేమాతరం థీమ్ పరేడ్పై ఉన్నట్లుండి ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు. వాయుసేన ఆధ్వర్యంలో గగనతలం నుంచి నాలుగు ఎంఐ 17 హెలికాప్టర్లతో పూల వర్షం ఆకట్టుకుంది. వాయుసేనకు చెందిన 129 హెలికాప్టర్ల దళం గగనంలో ధ్వజం ఆవిష్కరించింది. రాష్ట్రపతి ముర్ము శాల్యూట్ తరువాత పరేడ్ ఆరంభం అయ్యింది . పరేడ్కు కమాంవర్ లెఫ్టినెంట్ జనరల్ ఢవనీష్ కుమార్ నాయకత్వం వహించారు. . పరేడ్లో ముందు వరుసలో గౌరవప్రదంగా పరమ వీర చక్ర గ్రహీతలు నిలిచారు. పరేడ్లో ఈసారి యూరోపియన్ యూనియన్కు చెందిన చిన్న దళం కూడా పాల్గొంటుంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈసారి పరేడ్లో కళ్లముందుకు సైనిక యుద్ధ క్షేత్రం ముందుకు తీసుకువచ్చారు. సిందూర్లో వాడిన పలు స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. దీనిని బ్యాటిల్ అరే ఫార్మాట్గా పేర్కొన్నారు. పరేషన్ సిందూర్ పేరిట సాగిన భారతీయ సైన్యపు శకటం విశేష ఆకర్షణగా నిలిచింది. త్రివిధ బలగాలు సమన్వయంతో ఎంతటి శక్తివంతంగా ఉంటాయనేది తెలిపారు. సిందూర్లో వాడిన మన ఆయుధాలు, నిఘా వ్యవస్థల్లోని పరిజ్ఞానం పరిచయం చేశారు. బ్రహ్మోస్ , ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు, 300 కిలోమీటర్ల దూరం లక్షాలు ఛేదించే సూర్యాస్త్ర రాకెట్ లాంఛర్, యుద్ధ ట్యాంక్ అర్జున్ పటిమ చాటారు. ఈసారి కొత్తగా ఏర్పడిన భైరవ్, లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్ , రెండు మూపురాల ఒంటెలు, జన్స్కార్ అశ్వాలు మొదటిసారి కవాతులో పాల్గొన్నాయి. అశ్వికదళం, అపాచీతో పాటు ప్రచండ్ హెలికాప్టర్లు, నాగ్ క్షిపణి, దనుష్ గన్స్, హైటెక్ డ్రోన్లు తాము సైతం అంటూ ముందుకు వచ్చాయి. నేలపై ఈ కవాతు దశలోనే గగనతలంలో యుద్ధ విమానాలు వివిధ ఆకృతులతో సాహసాలకు దిగాయి. ధ్రువ్ చాపర్ సిందూర్ జండాను సగర్వంగా ఎగురవేసింది. 90 నిమిషాల ఇక్కడి పరేడ్ను పలు దేశాల ప్రజలు టీవీ ఛానళ్ల ద్వారా ఆసక్తితో తిలకించారు. భారత సైన్యం శక్తి, బహుముఖ సాంస్కృతిక రీతికి సలాం కొట్టారు. ఈసారి పరేడ్లో సైనిక కవాతు దశలో మన దేశీయ ఆయుధ వ్యవస్థను ప్రదర్శించారు. దీనికి తోడుగా మిత్రపక్ష దేశం రష్యా తయారీ ఆయుధాలను, సమానంగా అమెరికా ద్వారా తెప్పించుకున్న రక్షణ వ్యవస్థలను నిలిపారు. శబ్ధ వేగాన్ని మించి దూసుకువెళ్లే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి అస్త్రాలు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ , సూర్యశస్త్ర వంటివి ప్రధానంగా నిలిచాయి. పలు ట్యాంకులు ముందుకు సాగాయి. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశపు శాంతిసమయపు సాహస పురస్కారం అశోక చక్రను వ్యోమగామి, గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రదానం చేశారు. అభినందించారు. ఇతివృత్తం చాటుతూ దాదాపు వంద మంతి కళాకారులు వివిధత మే ఏకతా అనే శీర్షికతో ప్రదర్శన నిర్వహించారు. భారతీయ నావికాదళానికి 144 మంది గగనతల విన్యాసాలలో మొత్తం 29 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వీటిలో రాఫెల్, స్యూ 30 ఎంకెఐ, మిగ్ , జాగ్వార్లు తమ బలం ప్రదర్శించాయి. ఈసారి పరేడ్ దశలో ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లకు దేశంలోని నదుల పేర్లు పెట్టారు. బియాస్, గంగ, బ్రహ్మపుత్ర సింధు, యమున, పెరియార్, రావి, చెనాబ్ వంటి నదులతో బోర్డులు పెట్టారు.
మణిపూర్లో జాతిపరమైన హింస చెలరేగి దాదాపు రెండేళ్లు గడిచినా, ఇప్పటికీ రాష్ట్రం అసాధారణ రాజకీయ, సామాజిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతోంది. ఎన్. బీరేన్ సింగ్ ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గి, అధికారం కుప్పకూలిన తర్వాత అసెంబ్లీ సస్పెన్షన్, రాష్ట్రపతి పాలన అమలుతో మణిపూర్ నేడు రాజ్యాంగపరంగా లాంఛనంగా మిగిలింది. ప్రజాస్వామ్యం నామమాత్రంగా మిగిలింది. బఫర్ జోన్లు సమాజాలను విభజించాయి, సాయుధ గ్రూప్లు రోజువారీ జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులై శాశ్వత పునరావాసం కోసం ఎదురు చూస్తున్నాయి. మణిపూర్లో విషాదానికి కారణం. హింస మాత్రమే కాదు. నమ్మకం లేకపోవడం, దీర్ఘకాలంగా సాధారణ స్థితి పునరుద్ధరణ జరగకపోవడం, రాజకీయ చట్టబద్ధత పునరుద్ధరణలో ఘోర వైఫల్యం. 2023 మే లో మెయితీ, కుకీ- జో గ్రూప్ల మధ్య జరిగిన హింసాకాండ హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. భూ వివాదాలు, రాజకీయ ప్రాధాన్యత, గుర్తింపు లోపించిన అభివృద్ధి, చాలా కాలంగా నెలకొన్న మనోవేదనలకు పరాకాష్ట. అధికారంలో ఉన్న ప్రభుత్వం పక్షపాత ధోరణి వల్ల ఇది మరింత క్లిష్ట స్థితికి చేరింది. బీరేన్ సింగ్ సర్కార్ తటస్థంగా వ్యవహరించడంలో ఘోరంగా విఫలమైంది. స్వల్ప విభేదాలు జాతులమధ్య సాయుధ ఘర్షణగా మారేందుకు అనుమతించిందనే ఆరోపణలు ఉన్నాయి. హింస చెలరేగిన తర్వాత, జిల్లాలలో పరిపాలన చట్టబద్ధంగా అమలు చేయడం అసమర్థంగా వ్యవహరించారని రుజువైంది. సాయుధ వాలంటీర్లు, మిలిటెంట్ గ్రూప్ల రక్షణలో వాస్తవానికి ఆయా జాతుల ప్రాంతాలుగా భూభాగాన్ని విభజించారు. రాష్ట్రపతి పాలన విధించడం సమంజసమే. పాలన స్థిరీకరణకు, వైషమ్యాలు నివారించేందుకు అత్యవసర దిద్దుబాటు చర్యగా భావించారు. చాలా కాలంపాటు కేంద్రం పాలన వల్ల ఆటోమేటిక్గా సయోధ్య సాధ్యం కాలేదు. రాజకీయ పరంగా స్వస్థత చేకూరలేదు. భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించడం వల్ల ఘర్షణల జోరు తగ్గి ఉండవచ్చు. కానీ, జాతుల మధ్య, పౌరులు, ప్రభుత్వం మధ్య నమ్మకం నెలకొని సంక్షోభం ఇంకా పరిష్కారం కాలేదు. మార్కెట్లు, స్కూళ్లు, రవాణా నెట్వర్క్ ఇప్పటికీ ఆయా అనధికార జాతి సరిహద్దులకే పరిమితమయ్యాయి. రాజకీయ సంభాషణలు పరిష్కారానికి దారితీయడం లేదు. నిరంతరం అస్థిరతనుంచి ప్రయోజనం పొందే తీవ్రవాదుల వల్ల అవి విఫలమవుతున్నాయి. ఇటీవలి పరిణామాలు ఈ దౌర్భాగ్య స్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. కుకీ ప్రాబల్యం గల చురచంద్ పూర్లో మెయితీ వ్యక్తి హత్యను రాజకీయ హెచ్చరికగా నమోదు చేసి ప్రచారం చేసినట్లు తెలిసింది. ఇది కేవలం నేరపూరిత చర్య కాదు, రాజకీయ ప్రక్రియకు విఘాతం కలిగించే లేదా ప్రభుత్వాన్ని సవాల్ చేసే చర్య. హింసాత్మక చర్యలకు పాల్పడేవారు చర్చలను పక్కదారి పట్టించేందుకు, సమాజాలను బెదిరించి ఒంటరిగా ఉంచేలా చేస్తారని ఇది సూచిస్తున్నది. ఇలాంటి సంఘటనలు విశ్వసనీయమైన రాజకీయ పరిష్కారం తక్షణ అవసరాన్ని వెల్లడిస్తాయి. రాజకీయ సంభాషణలు చిన్నగా మొదలైన, చక్కటి అవకాశాలను చూపాయి. కేంద్రం మెయితీ, కుకీ -జో శాసనసభ్యుల మధ్య, అలాగే తిరుగుబాటు గ్రూప్ల మధ్య జరిపిన చర్చలు, ఆ కార్యకలాపాలు నిలిపివేయాలన్న ఒప్పందాలకు సూత్రప్రాయంగా దారితీస్తున్నా, నిరవధికంగా కేంద్రం పాలన ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగపరంగా కూడా సబబు కాదనే అభిప్రాయం వెల్లడైంది. ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న మెయితీల డిమాండ్ సమాజానికీ, రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతకు వివాదాస్పదమై అంశం అయినప్పటికీ, గిరిజన సంస్థలు మొదటి సారిగా ప్రజాదరణ ప్రభుత్వంలో పాల్గొనేందుకు షరతులతో సంసిద్ధత వ్యక్తం చేయడం విశేషం. అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనను మూడేళ్ల వరకూ కొనసాగవచ్చు. ఒక సంవత్సరం గడువు దాటితే, దానిని పొడిగించాలంటే, ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ధ్రువీకరించవలసి ఉంటుంది. ఎన్నికల రాజకీయాలను నిరవధికంగా వాయిదా వేయడం వల్ల అత్యవసర పాలన సాధారణమైపోతుంది. ప్రజాస్వామ్యపరమైన జవాబుదారీ తనం క్షీణిస్తుంది. ఈ పరిస్థితుల్లో సామాన్య పౌరులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించలేరు. ఇది శాంతియుత చర్చలు జరపడానికి రాజకీయ మార్గాలను దూరం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ మిగిలి ఉన్న పదవీకాలం కోసం పునరుద్ధరించడం వల్ల కొత్త నాయకత్వం లో ప్రభుత్వం ఏర్పాటు వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్నది కీలక మైన ప్రశ్న. ఇన్ని అనర్థాలకు కారణమైన అదే రాజకీయ నాయకత్వాన్ని తిరిగి నియమించడం వల్ల ముఖ్యంగా కుకీ- జో వర్గాలలో అపనమ్మకం మరింత తీవ్రమవుతుంది. ప్రస్తుత అసెంబ్లీ నెట్వర్క్లో నాయకత్వం మార్పు, స్పష్టమైన సయోధ్య, నిబద్ధతలవల్ల రాజకీయ సాధారణీకరణకు అవకాశం ఏర్పడవచ్చు. అలాంటి ప్రభుత్వం పక్షపాత రహితంగా పనిచేస్తూ, ప్రజల విశ్వాసాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలి. దాని చట్టబద్ధత మానవతా దృష్టితో పునరావాస సమస్యలు పరిష్కరించడం, నిష్పాక్షిక పోలీసింగ్ను నిర్ధారించడం, ఉద్యమ స్వేచ్ఛను రక్షించడం, కమ్యూనిటీల సమూహాలతో నిరంతరం సంభాషించడంపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు లేకుండా ఎన్నికైన ప్రభుత్వం పునరుద్ధరణ వల్ల ప్రయోజనం ఉండదు. మణిపూర్లో కేంద్రం పాత్ర ఇప్పటికీ కీలకమైనది. శాంతి భద్రతలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం అంశం అయినా, మణిపూర్ సంక్షోభం, తిరుగుబాటు కార్యకలాపాలు, సరిహద్దు భద్రత, మానవతా బాధ్యతల వల్ల జాతీయ కోణాలు సంతరించుకుంది. కేంద్రం దృఢమైన దృక్పథంతో ముందుకు సాగాలి. పాలనా సంస్కరణలు, ఆర్థిక పునర్నిర్మాణాల విషయంలో స్థిరమైన శాంతి యుత నెట్వర్క్ను అవలంబించాలి. పునరావాస ప్యాకేజీలు పారదర్శకంగా ఉండాలి. భద్రతా దళాలకు సంస్థాగత జవాబుదారీతనం అన్నీ ఈ ప్రక్రియలో ముఖ్యం. స్థానిక భాగస్వాముల పాత్ర అంతే కీలకమైనది. ఈశాన్య భారతంలో సంఘర్షణ పరిష్కారంలో మేధావులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, చర్చలు, పౌర సమాజం గతంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాయి. మణిపూర్లో పౌరసమాజం జాతులకు అతీతంగా లేదు. ఇక్కడి సమాజాన్నిచక్కదిద్దాలంటే, అంతర్ - సమాజ చర్చావేదికల పునరుద్ధరణ, తటస్థ శాంతి కమిటీల పునరుద్ధరణ, వృత్తిపరమైన సంస్థలను రాజ్యాంగ హక్కులపై మాట్లాడేందుకు ప్రోత్సహించడం, సామాజిక ఐక్యత పునరుద్ధరణ కీలకం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పక్షపాతంతో కూడిన కథనాలు, తప్పుడు సమాచారం విస్తరణ సయోధ్యను దెబ్బ తీస్తాయి. దీనిని ఎదుర్కోవడానికి నిరంతర పర్యవేక్షణ, వాస్తవ తనిఖీలు, బాధ్యతా యుతమైన జర్నలిజం కూడా అవసరం. విశ్వవిద్యాలయాలు, ఉపాధ్యాయ సంఘాలు, సాంసృ్కతిక సంస్థలు, శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పౌరనీతిని చర్చలలో తీసుకు వచ్చేందుకు సహాయపడతాయి. మణిపూర్లో ఆర్థిక సంక్షోభం, స్తబ్ధతను ఎవరూ పట్టించుకోలేదు. పెట్టుబడులు నిలిచిపోయాయి. టూరిజం కుప్పకూలింది. ఎందరో జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. దీర్ఘకాలంగా పునరావాస శిబిరాలలో బతకడం యువతరాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వారికి హింస అనేది అధికారం, ఆదాయ మార్గంగా మారే ప్రమాదం ఉంది. వారికి ఉపాధి, అభివృద్ధి ప్యాకేజీలలో భాగస్వాములను చేయడం, నైపుణ్యాభివృద్ధి, ఉమ్మడి ఆర్థిక ప్రాజెక్టులను అనుసంధానం చేయాలి. ఇవి సమాజాల మధ్య సహకారం అవసరం. మణిపూర్ విషాదానికి మూలం రాజకీయ ఊహాశక్తి వైఫల్యం. పాలనకు ప్రత్యామ్నాయంగా జాతి గుర్తింపును అనుమతించారు. భద్రతను సంభాషణలకు ప్రత్యామ్నాయంగా పరిగణించారు. ఎంత పోలీసింగ్ చేసినా, రాజకీయ చట్టబద్ధతకు ప్రత్యామ్నాయం కాదు. భూమి హక్కులు, పరిపాలన స్వయం ప్రతిపత్తి, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం అవసరం. ప్రత్యేక పరిపాలన డిమాండ్లు, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన ఆకాంక్షలు, కొన్ని వర్గాలలో భయాలు రాజ్యాంగపరమైన సంభాషణలలో చోటుచేసుకోవాలి. బహుశా, అన్నివర్గాలతో కూడిన పార్లమెంటు పర్యవేక్షణతో కూడిన సాధికారక కమిషన్ ద్వారా ఇది సాధ్యపడుతుంది. మణిపూర్ ప్రస్తుతం ఓ క్రాస్రోడ్లో ఉంది. గవర్నర్ పాలన తాత్కాలిక పరిపాలనా స్థిరత్వాన్ని అందించవచ్చు. కానీ, అది రాజకీయ సయోధ్యకు ప్రత్యామ్నాయం కాదు. కొత్త నాయకత్వంతో ఎన్నికైన ప్రభుత్వానికి నాయకత్వం అప్పగించడం, ప్రజాస్వామ్యం సాధారణ స్థితికి తీసుకురావడం, కొత్త మార్గాన్ని సూచిస్తుంది. ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకుంటారా లేక చక్కటి అవకాశాన్ని వృథా చేస్తారా అనేది రాజకీయ పార్టీల స్వల్పకాలిక ఎన్నికల లెక్కల కంటే, దీర్ఘకాలిక శాంతికి ఇచ్చే ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. మణిపూర్ను రక్షిత ప్రాంతంగా విభజించినంతకాలం, సమాజాల మధ్య విభజన మరింత తీవ్రతరం అవుతుంది. పునరేకీకరణ కష్టతరం అవుతుంది. చికిత్స అనేది కేవలం ఆదేశాల వల్ల సాధ్యం కాదు. ఓర్పు, సహనం అవసరం. సూత్రప్రాయ రాజకీయాల ద్వారా దానిని పరిష్కరించాలి. మణిపూర్లో కేవలం హింస సద్దుమణగడమే కాదు. ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. అన్నివర్గాలకు ధైర్యం కల్పిచాలి. రాజీధోరణి, రాజ్యాంగం పట్ల విశ్వసనీయత అవసరం. గీతార్థ పాఠక్
వివాదాలమయంగా సిఎం ఖమ్మం పర్యటన
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన మంత్రుల మధ్య విభేదాలకు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ పలు కొత్త వివాదాలకు తెరతీసినట్లయింది. సిపిఐ వందేళ్ళ ఉత్సవంలో పాల్గొనడానికి జనవరి 18న ఖమ్మం జిల్లాలో పర్యటించిన సిఎం పర్యటన యాదృచ్ఛికంగా పలు అంశాలు కలిసి వచ్చినప్పటికీ ఇప్పుడు అవే వివాదాస్పదం అయ్యాయి. సందర్భోచితంగా అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ కొత్త వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది. సిపిఐ వందేళ్ళ ఉత్సవంతోపాటు అదే రోజు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ రెండు సభలో ముఖ్యమంత్రి చేసిన ఉద్వేగపూరితమైన ప్రసంగం అక్కడ కాంగెస్ కార్యకర్తలను, ఇక్కడ సిపిఐ శ్రేణులను పరోక్షకంగా తెలుగుతమ్ముళ్ళను ఉత్సాహపర్చినట్లయింది. ఒకే వేదికపై దివంగత ముఖ్యమంత్రులు ఎన్టి రామారావును, డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డిలను కీర్తిస్తూ చేసిన ప్రసంగంలో గులాబీ దిమ్మెలను కూల్చివేయాలని తెలుగు తమ్ముళ్ళకు పిలుపు ఇవ్వడం కొంత వివాదంగా మారగా, ఒక కాంగ్రెస్ పార్టీ సిఎం కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాన్పూర్లో పుట్టిన సిపిఐ పార్టీ వందేళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం గుమ్మంలో గత నాలుగు రోజులపాటు జరగగా, ముగింపు ఉత్సవాలను ఉత్సాహపూరితంగా జరుపుకొన్న ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపినట్లయింది. ఈ ఉత్సవాలకు తొలిరోజు ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సిఎం రేవంత్రెడ్డిని సౌహార్ద్ర సందేశం ఇవ్వడానికి ఆహ్వానించారు. మిత్రపక్ష పార్టీ కావడంతో సిపిఐ పార్టీ అడగగానే సిఎం అంగీకరించి ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభకు సిఎంను ఆహ్వానించడంపై అటూ సిపిఐ, ఇటూ కాంగ్రెస్ పార్టీలో ఒకింత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం బయట ఉన్న సిపిఐ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ఆ పార్టీ ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు చేసిన విమర్శలతో కొంతమంది కాంగ్రెస్ నేతల మనస్సు నొచ్చుకొని సిఎం ఆ సభకు వెళ్ళడాన్ని అంతర్గతంగా తప్పు పట్టినప్పటికీ కమ్యూనిస్టుల సభలకు కమ్యూనిస్టుయేతర సిఎంలు పాల్గొన్న సందర్భాలు ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇతర పార్టీల సిఎంలు పాల్గొన్న ఉదంతాలు భారత రాజకీయాల్లో అనేకం ఉన్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ రాజకీయాల్లో భావసారూప్యత కలిగిన పార్టీల మధ్య లేదా రాజకీయ అవసరాల రీత్యా ఇటువంటి కలయికలు అరుదుగా జరుగుతుంటాయి. యాదృచ్ఛికంగా ఇదే జనవరి 18న 2023 సంవత్సరంలో నాటి టిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)గా అవిర్భవించిన సందర్భంగా ఇదే ఖమ్మం నగరంలో కొత్త కలెక్టరేట్ సమీపంలో కెసిఆర్ పార్టీ ఏర్పాటు చేసిన తొలిభారీ బహిరంగ సభకు, ఆనాటి సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కేరళ సిఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సభలో పాల్గొన్నారు. రేవంత్రెడ్డి గత ఏడాది సిపిఎం పార్టీ అనుబంధ పత్రిక దశమ వార్షికోత్సవ వేడుకల్లో సిఎం హోదాలో పాల్గొన్నారు. అంతేగాక 2022లో కేరళలోని కన్నూర్లో జరిగిన సిపిఎం 23వ జాతీయ కాంగ్రెస్ (ప్లీనరీ)కు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. కేంద్ర -రాష్ట్ర సంబంధాలపై జరిగిన సెమీనార్లో కూడా ఆయన ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల్లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్న సమయంలో 2004లో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తులో ఉన్నప్పుడు, అప్పటి సిఎం వై.ఎస్. రాజశేఖర రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించిన పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభా వేదికద్వారా సిఎం రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం కామ్రేడ్లను ఉత్సహ పరిచిందని చెప్పుకోవచ్చు. గడిచిన వందేళ్ళ కాలంలో కమ్యూనిస్టులు చేసిన ఫోరాటాల ఫలితంగానే అటూ కేంద్రం, ఇటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక చట్టాలను, పథకాలను తీసుకొచ్చిందని చెప్పకనే చెబుతూ మరో వందేళ్ళు ప్రజలకోసం పోరాటాలు చేయాలనే ఇదే సభ వేదిక ద్వారా కమ్యూనిస్టు శ్రేణులకు పిలుపు ఇచ్చారే గాని మీ పోరాటాలు అవసరం లేదు. మీ ఉద్యమాలతో పని లేదు, మీరు ఏమి కోరినా, ప్రజల కోసం మీరు ఏం అడిగినా తమ ప్రజాప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని మాత్రం ఈసభా వేదిక మీద ద్వారా రేవంత్రెడ్డి చెప్పలేకపోయారు. మీరు పోరాటాలు చేస్తుంటే తాము చట్టాలను చేసుకుంటూ వెళ్తామని ఆయన చేసిన ప్రసంగం కామ్రేడ్లను సైతం అకట్టుకుంది. అదే రోజు సిపిఐ సభకు ముందు ఇదే ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి. తెలంగాణలో హైదరాబాద్ తరువాత ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కొంతమేర టిడిపి బలంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సిఎం రేవంత్రెడ్డి ఆనాడు తెలంగాణలో టిడిపి లేకుండా కక్ష కట్టి కుట్ర చేసిన బిఆర్ఎస్ పార్టీ దిమ్మెలను సమూలంగా కూల్చివేయాలని ఈ సభావేదిక ద్వారా సిఎం రేవంత్రెడ్డి టిడిపి కార్యకర్తలకు బహిరంగ పిలుపు ఇచ్చి త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం కొంత వివాదాస్పదమైంది. ఒక సిఎం హోదాలో రెచ్చగొట్టే విధంగా బహిరంగ పిలుపు ఇవ్వడంపై బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టి ఏకంగా పలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. అంతేగాక తెలంగాణలో మట్టికరిచిన టిడిపిని తిరిగి బతికించడానికి రేవంత్రెడ్డి ఎత్తుగడలకు పాల్పడుతున్నారా? అనే అనుమానాలను ఈ సందర్భంగా గులాబీ నేతలు వ్యక్త పరచగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపిని మళ్ళీ తెలంగాణలో పునఃప్రతిష్టించే విధంగా సిఎం మాట్లాడిన తీరును సీనియర్ కాంగ్రెస్ నేతలుసైతం తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ఖమ్మం, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతలలో మాత్రమే ఈనాటికీ తెలుగుదేశం పార్టీ బలంగా వుంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందేలా ఎన్టిఆర్ వర్ధంతి రోజున సిఎం రేవంత్ వ్యూహాత్మకంగా మాట్లాడినప్పటికీ అది రెండు వైపులా విమర్శలకు తావిచ్చినట్లయింది. ఇది ఇలా ఉంటే యాదృచ్ఛికంగా ఇదే రోజు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ ఒక పత్రికలో వచ్చిన వార్తకు, అంతకుముందు మరో మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ అదే పత్రిక, టివిలో వచ్చిన కథనాలకు ఇదే సభా వేదిక ద్వారా మంత్రుల మధ్య ఉన్న విభేదాలను పుల్స్టాప్ పెట్టేందుకు సిఎం చేసిన ప్రయత్నం కొంతమేర ఫలించినట్లయింది. ఏదైన సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొచ్చి వివరణ తీసుకొని ప్రచురించాలని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని చెబుతూ, సింగరేణి బొగ్గుగనుల టెండర్లలో అణాపైసా అవకతవకలకు ఆస్కారం లేదని ఉద్దేశపూర్వకంగా మంత్రుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తేలేదని మీడియాకు హెచ్చరిస్తూ సంబంధం లేని వ్యవహారాల్లోకి మంత్రులను లాగి బద్నాం చేయవద్దని, మరోసారి మంత్రుల జోలికొస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండని సిఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభావేదిక ద్వారా మీడియాను కోరడంతో అప్పటివరకు మంత్రులు, మీడియా మధ్య ఉన్న వివాదానికి తాత్కాలికంగా తెర దించినట్లయింది. మొత్తం మీద ఒక్క రోజు ఖమ్మం జిల్లా సిఎం పర్యటన పలు విభేదాలకు చెక్ పెట్టగా, మరికొన్ని వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది. వనం వెంకటేశ్వర్లు 98489 97240 (ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)
27th jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు
ప్రతి సంవత్సరం మాదిరిగా, ఈ ఏడాది పదవ తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షల సందడి మొదలయ్యాయి. ఈ సమయంలో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో ఒక రకమైన ఆందోళన, ఒత్తిడి మొదలవుతుంది. ఈ ఒత్తిడినే సాధారణంగా పరీక్షల ఫీవర్ అని అంటాం. ఇది సరైన దిశలో లేకపోతే విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పనితీరు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే సరైన ప్రణాళిక, సానుకూల దృక్పథం, పరస్పర సహకారం ఉంటే ఈ పరీక్షల ఫీవర్ను సులభంగా అధిగమించవచ్చు. పరీక్షల ఫీవర్ అనేది పరీక్షల ముందు లేదా సమయంలో కలిగే భయం, ఆందోళన, ఒత్తిడి, ఆత్మవిశ్వాస లోపం వంటి భావాల సమాహారం. ఎక్కువ మార్కులు సాధించాలనే ఆశ, ఇతరులతో పోలిక, కుటుంబ ఆశలు, భవిష్యత్ భయం ఇవన్నీ దీనికి కారణాలు. కొందరు విద్యార్థుల్లో ఇది నిద్రలేమి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి శారీరక లక్షణాలూ కనిపిస్తాయి. వీటిని అధిగమించాలంటే విద్యార్థులు ముందుగా పరీక్షలను ఒక భారంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. తమ నైపుణ్యం, సామర్థ్యాలను రుజువు చేసుకునే వేదికగా భావించాలి. దానికి చక్కటి ప్లానింగ్ అవసరం. సిలబస్ను భాగాలుగా విభజించి, రోజువారీ టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలి. చివరి నిమిషంలో అన్నీ చదవాలనే ప్రయత్నం వృథా ప్రయాస అవుతుంది. నిరంతర రివిజన్లో భాగంగా ఒకసారి చదివిన విషయాన్ని మళ్లీమళ్లీ పునశ్చరణ చేయడం వల్ల భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, సరిపడ నిద్ర, పోషకాహారం, తగినంత మంచినీరు తాగడం చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే చదువు సక్రమంగా సాగుతుంది. సానుకూల ఆలోచనలు నేను చేయగలను, నాకు తెలుసు అనే ధైర్య వాక్యాలు (Positive Affirmations) మనసుకు బలం ఇస్తాయి. ఇతరుల మార్కులతో పోల్చుకోవడం ఒత్తిడిని పెంచుతుంది. ప్రతి ఒక్కరి సామర్థ్యం వేరు అన్నది గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వారి మాటలు విద్యార్థుల్లో భయం కూడా కలిగించవచ్చు, ధైర్యమూ నింపవచ్చు. ప్రేరణాత్మకంగా బోధన జరగాలి, భవిష్యత్ ఆశలు చిగురించేలా ఆశలు పుట్టాలి. మార్కుల కంటే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. తప్పులను భయపెట్టేలా కాకుండా సరిదిద్దేలా చెప్పాలి. కఠినమైన పాఠాలను సులభమైన ఉదాహరణలతో వివరించాలి. ఇది విద్యార్థులలో నమ్మకాన్ని పెంచుతుంది. బ్లూప్రింట్, అకడమిక్ స్టాండర్డ్ ఆధారంగా బోధన జరిగితే మరింత ప్రయోజనం అని విద్యార్థులకు తెలియజేయాలి. పరీక్ష వాతావరణాన్ని ముందే అలవాటు చేయడానికి నమూనా పరీక్షలు, స్లిప్ టెస్టులు ఎక్కువగా నిర్వహించాలి. కొందరు విద్యార్థులు భయంతో తమ సమస్యలు చెప్పలేరు. అలాంటి వారిని గమనించి స్నేహపూర్వకంగా మాట్లాడి, ప్రధాన అంశాలపై దృష్టిపెట్టాలి. ప్రతి రోజూ మానిటరింగ్ తప్పక జరగాలి. ఈ పరీక్షే జీవితం అనే భావన రాకుండా పరీక్షలు జీవితంలో ఒక భాగమే అన్న సందేశాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రుల ఆశలు సహజమే. కానీ అవి ఒత్తిడిగా మారితే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకొని ఆశలు పెట్టుకోవాలి. అసాధ్యమైన లక్ష్యాలు భయాన్ని పెంచుతాయి. మరికొద్ది మంది విద్యార్థులు ఇప్పటివరకు ఏమి చదవకుండా కాలయాపన చేస్తున్న వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలపట్ల కోపగించుకోవడం, పొరుగింటి పిల్లలతో లేదా బంధువుల పిల్లలతో పోల్చడం పూర్తిగా మానుకోవాలి. వారి మానసిక స్థితిని బట్టి ప్రోత్సాహించాలి. మేము నీతో ఉన్నాం అనే భావన పిల్లలకు గొప్ప ధైర్యం ఇచ్చేలా ఉండాలి. ఇంట్లో ప్రశాంతమైన, సానుకూల ధ్యాన వాతావరణం కల్పించాలి. అనవసర విమర్శలు, గొడవలకు దూరంగా ఉంచాలి. మార్కులు తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా మనం సపోర్ట్ గా ఉండాలే తప్ప, పిల్లల మనసు బలహీన పరిచేదిగా ఉండకూడదు. సమాజం కూడా పరీక్షల ఫీవర్ను తగ్గించడంలో పాత్ర వహించాలి. మార్కుల ఆధారంగా పిల్లల విలువ నిర్ణయించే ధోరణి తగ్గాలి. క్రీడలు, కళలు, నైపుణ్యాలు కూడా సమానంగా గౌరవించాలి. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పరీక్షలు జీవితానికి ముగింపు కాదు, ఒక దశ మాత్రమే. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముగ్గురూ కలిసి సానుకూలంగా ఆలోచిస్తే పరీక్షల ఫీవర్ను సులభంగా అధిగమించవచ్చు. భయం కాకుండా ధైర్యం, ఒత్తిడి కాకుండా ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడే విద్యార్థులు నిజమైన విజయం సాధిస్తారు. పరీక్షల్లో మాత్రమే కాదు, జీవితంలో కూడా నిలబడగల శక్తిని వారు పొందుతారు. ఎల్. ఉపేందర్ 99494 92677
చారిత్రక ఒప్పందాలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: నేడు జరగనున్న భారత్, యురోపియన్ యూనియన్ (ఇయు) సమ్మిట్లో చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ)పై కీలక ప్రకటన వెలువడనుంది. ఈ సమ్మిట్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల ముగింపు ప్రకటన, వ్యూహాత్మక రక్షణ ఒప్పందం, అలాగే మొబిలిటీ కార్మికులపై అవగాహన ఒప్పందం ఉండనున్నాయి. అమెరికా విధానాలతో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సంక్షోభం నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్డర్ లెయెన్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా భారత్కు విచ్చేశారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇవ్వగా, సోమవారం జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కోస్టా, వోన్డర్ లెయెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్సులా మాట్లాడుతూ, విజయవంతమైన భారత్ ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సురక్షితంగా, సంపన్నంగా మారుస్తుంది. ఈ ప్రయోజనం అందరికీ అందుతుందని అన్నారు. ఆమె గత వారం మాట్లాడుతూ, భారత్, యూరోపియన్ యూనియన్ ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాయని తెలిపారు. ఈ ఒప్పందం అమలైతే దాదాపు 2 బిలియన్ల జనాభాతో, ప్రపంచ జిడిపిలో సుమారు పావు వంతు వాటా ఉన్న మార్కెట్ ఏర్పడనుంది. భారత్, ఇయు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదటిసారిగా 2007లో ప్రారంభమయ్యాయి. అయితే ఆశయాల్లో భిన్నాభిప్రాయాల కారణంగా 2013లో ఈ చర్చలు నిలిచిపోయాయి. మళ్లీ 2022 జూన్లో ఈ చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈ ఒప్పందం అమలైతే వాణిజ్యం, పరిశ్రమలు, ఉద్యోగాలు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు. సమ్మిట్లో వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పు, కీలక సాంకేతికతలు, అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్, ఇయు 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత భద్రతా, రక్షణ భాగస్వామ్య ఒప్పందం ద్వారా రక్షణ రంగంలో సమన్వయం పెరుగుతుంది. అలాగే యూరోపియన్ యూనియన్ సేఫ్ (సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్) కార్యక్రమంలో భారత కంపెనీలు పాల్గొనే అవకాశాలు ఏర్పడతాయి. భారత కార్మికులు యూరప్కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసే మొబిలిటీ ఒప్పందం కార్యరూపం దాల్చనుంది.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందని బిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు అని, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాక్షస పాలన అని దుయ్యబట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భం గా సోమవారం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ కుమార్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ ఉల్లంఘనలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన లఘు నాటిక అందరినీ ఆలోచింపజేసింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, హెచ్సియు విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చేశారని అభినందించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిసారీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని కెసిఆర్ అద్భుతంగా ఆకళింపు చేసుకొని తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు. అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3, అంబేద్కర్ ఆలోచనా విధానం వల్లనే నేడు అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయం జరుగుతున్నదని, ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని అన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీపడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తి సరైనోడు కాకుంటే ప్రయోజనం శూన్యమని ఆనాడే అంబేద్కర్ వెల్లడించారని చెప్పారు. సరిగ్గా అదే పరిస్థితి కేంద్రం, రాష్ట్రాల్లో కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి ఒకవైపు, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్ మరోవైపు దేశానికి పెనుముప్పుగా మారాయని అన్నారు. న్యాయ పత్రం కాదు.. అది అన్యాయ పత్రం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తుక్కుగూడలో విడుదల చేసిన న్యాయ పత్రంలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడారని..కానీ, ఆ వేదికపైనే బిఆర్ఎస్ నుండి పార్టీ ఫిరాయించిన వారు ఆయన పక్కనే కూర్చున్నారని గుర్తు చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, కాంగ్రెస్ న్యాయ పత్రంలో న్యాయం అంతే ఉందని ఎద్దేవా చేశారు. దానిని అన్యాయ పత్రంగా పిలవాలని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి జెండా గద్దెలను కూల్చేయండి అని బహిరంగ సభల్లో పిలుపునివ్వడం శాంతిభద్రతలను, రాజ్యాంగ విలువలను సమాధి చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలపై దాడులు..లాకప్ డెత్ల ప్రభుత్వం రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, జర్నలిస్టులపై జరుగుతున్న అకృత్యాలను కెటిఆర్ ఏకరువు పెట్టారు. కోదాడలో దళిత యువకుడు కర్రా రాజేష్ను పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపారని, ఇది జరిగి 60 రోజులు గడిచినా ముఖ్యమంత్రి కానీ, స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడలో కర్ర రాజేష్ లాకప్ డెత్కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఉగ్రవాదుల మాదిరిగా అరెస్ట్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విలువల హననం కాదా..? అని ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల ఇళ్లలోకి చొరబడి వారి వ్యక్తిత్వ హననం చేయడం, భూముల కోసం పోరాడుతున్న రైతులను జైళ్లలో పెట్టడం ఈ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని అన్నారు. హైడ్రా, మూసీ పేరిట పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం, లగచర్లలో గిరిజన ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం చేయడం రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. రైతు, యువజన, ఎస్సి, ఎస్టి, బిసి డిక్లరేషన్ల పేరుతో అందరినీ మోసం చేశారని, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారో కళ్లకు కట్టేలా తమ లఘు నాటిక ద్వారా వివరించారని అన్నారు. తమ యూనివర్సిటీ భూముల పైన దౌర్జన్యం చేసిన రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వంపైన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఇందులో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్సియు భూముల్లో కుంభకోణం విషయంలో ఆ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని కెటిఆర్ అభినందించారు. బాధ్యత గల విద్యార్థులుగా తమ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి కాపాడుకోవడానికి వారు చేస్తున్న కృషి దేశాన్నే కదిలించిందని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చెరబట్టే ప్రయత్నం చేశారని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ. 10,000 కోట్లు ఉంటుందని, తనకు సంబంధం లేని భూములను, చెరువులను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ఫ్రాడ్కు పాల్పడ్డారని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు కెటిఆర్ పేర్కొన్నారు. హెచ్సియు భూముల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని కెటిఆర్ నిలదీశారు. తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకలు గణతంత్ర దినోత్సవం సోమవారం బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ సీనియర్ నేత మధుసూదనాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మున్సిపోల్స్కు నేడే షెడ్యూల్?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ నేడు వెలువడే అవకాశం ఉంది. ఉద యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, డిజిపి శివధర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. మధ్యా హ్నం తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిప ల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తు పూర్తిచేసింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేసిన ఎస్ఇసి.. అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. పోలింగ్, కౌం టింగ్ కేంద్రాల ఎంపిక వంటి కీలక అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన వివరాలు ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నివేదించిన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి.
మాజీ ఎంపి సంతోష్కు సిట్ నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు బిఆర్ఎస్ నాయకులు, మాజీ రాజ్యసభ స భ్యులు జోగినపల్లి సంతోష్ రావుకు సోమవారం నోటీసులు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నాం మూడు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల ని సిఆర్పిసి 160 నోటీసులు అందచేశారు. కా గా, ఇప్పటికే సిట్ అధికారులు హరీష్ రావు, కెటిఆర్లను ఏడు గంటల చొప్పున విచారించి వాం గ్మూలం నమోదు చేశారు. ఈ క్రమంలో సంతోష్ రావు ను విచారణకు పిలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, సిట్ అధికారులు జారీ చేసిన నోటీసు ల్లో మాజీ రాజ్య సభ్యుడిగా ఉన్న సంతోష్ రావును రాజ్యసభ్యుడిగా పేర్కొనడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. సిట్ విచారణకు హాజరవుతా సిట్ నోటీసులపై మాజీ రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు స్పందించారు. నోటీసులు అందాయని, విచారణకు హాజరవుతానని తెలిపారు. సిట్ విచారణకు సహకరిస్తానని, కేసుకు సంబంధించి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవిస్తానని, విచారణను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
యూరప్ తనపై యుద్ధానికి తానే నిధులు సమకూరుస్తోంది
` భారత్`ఈయూ వాణిజ్య ఒప్పందం వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు న్యూయార్క్(జనంసాక్షి):భారత్, యురోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ.. అమెరికా ఆర్థికశాఖ …
` ఫ్యూచర్ సిటీదే ఫ్యూచర్ ` మూడు ఎకనమిక్ జోన్లుగా రాష్ట్ర విభజన ` తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్తో పెరిగిన ఇమేజ్ ` సర్వతో ముఖాభివద్దికి ప్రభుత్వం …
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన శకటాలు ` జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ` ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ` ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ …
యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
మల్టీ టాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌ మిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. ఈ రీమేక్ సినిమాలో మన తెలుగు నేటివిటికి తగ్గట్టు కథలో పాత్రల్లో చాలా మార్పులు చేశారు. ఇందులో ఉండే భావోద్వేగాలు అందరికీ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటా యి. నాకు శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తెరపై మీకు ఓంకార్ నాయుడు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మంచి సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ చేశాము. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఒక సీన్ చేశాము. నాకు నీళ్లంటే భయం. ఆ సీన్ చేస్తున్నప్పుడు నిజంగా భయపడ్డాను. అయితే ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు సజీవ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు”అని అన్నారు.
మంగళవారం రాశి ఫలాలు (27-01-2026)
మేషం కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మిధునం బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలగుతాయి. కర్కాటకం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహం వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. తుల వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. వృశ్చికం నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనస్సు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మకరం నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంత పెరుగుతుంది. కుంభం ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. మీనం ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. వ్యాపారాల్లో నూతన విధానాలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది.
సీవర్ నయా చరిత్ర.. డబ్లూపిఎల్లో తొలి శతకం నమోదు
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్ 2026) సీజన్లో అరుదైన రికార్డు నమోదైంది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ సెంచరీ సాధించి నయా చరిత్ర సృష్టించింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బ్రంట్ 57 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్తో అజేయంగా 100 పరుగులు చేసింది. దీంతో డబ్లూపిఎల్ చరిత్రలోనే తొలి సెంచరీ సాధించిన బ్యాటర్గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్లో ఓ బ్యాటర్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సివర్ అజేయ శతకానికి ఓపెనర్ హేలీ మాథ్యూస్ (56) అర్ధ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
ఆ ముగ్గురితో భారత్ ట్రేడ్ డీల్కు బ్రేక్..
ఆ ముగ్గురితో భారత్ ట్రేడ్ డీల్కు బ్రేక్ ట్రంప్పై రిపబ్లికన్ సెనెటర్ మండిపాటు వాషింగ్టన్ : భారత్ అమెరికా ట్రేడ్ డీల్కు వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో, ఉపాధ్యక్షులు వాన్స్, ప్రెసిడెంట్ ట్రంప్ అడ్డుపడుతున్నారని రిపబ్లిక్ సెనెటర్ టెడ్ క్రూజ్ విమర్శించారు.అధికార పార్టీ సభ్యుడే ఈ దాడికి దిగారు. పార్టీ డోనర్స్తో జరిగిన సమావేశంలో ఈ సెనెటర్ ప్రత్యేకించి ట్రేడ్ డీల్ విషయం ప్రస్తావించినట్లు అమెరికా మీడియా తెలిపింది. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అత్యవసరం. అయితే దీనిని ముందుకు సాగకుండా, నాన్చడం వెనుక ప్రముఖుల పాత్ర ఉందని ఈ రిపబ్లికన్ ఎంపి మండిపడ్డారు. అంతర్గత సమావేశంలో ప్రస్తావిత అంశాల ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ సెనెటర్ అయిన క్రూజ్ 2028 ప్రెసిడెంట్ ఎన్నికలపై కన్నేసి ఉంచారు. ట్రంప్ టారీఫ్లతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. చివరికి ఇది ఆయన అభిశంసనకు దారితీస్తుందని కూడా హెచ్చరించినట్లు వెల్లడైంది. సెనెటర్ల నుంచి ట్రంప్పై కీలక విషయాల్లో ఒత్తిడి వస్తోంది. అయితే ఆయన తప్పుడు మాటలకు తలొగ్గుతున్నారు తప్పితే మంచి విషయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమెరికాలో ట్రంప్ నిర్ణయాలతో ఇకపై భారీగా ధరలు పెరుగుతాయి. పరిస్థితి తలకిందులు అవుతుందని ఆయన హెచ్చరించారు. ...............................
భారీ మంచుతుపాన్.. అమెరికాలో పదివేల విమానాలు రద్దు
వాషింగ్టన్: మంచుతుపాన్ ఉధృతితో అమెరికాలో ఆదివారం పదివేలకు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో సర్వీసులకు జాప్యం ఏర్పడింది. దేశంలోని అత్యంత రద్దీగల విమానాశ్రయాలు మంచుధాటికి నిర్మానుష్యం అయ్యాయి. దేశ వ్యాప్తంగా 18 కోట్ల మంది వరకూ మంచు తుపాన్, భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నారు. న్యూయార్క్ , బోస్టన్ ఇతర ప్రాంతాల్లో 1 నుంచి రెండు అడుగుల వరకూ మంచు పేరుకుపోయింది.
మంచు తుపాను కారణంగా కూలిన విమానం.. ఏడుగురు మృతి
మంచు తుపాను కారణంగా విమానం కూలిన సంఘటన అమెరికాలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. ఎనిమిది మందితో ఓ ప్రవేటు బిజినెస్ విమానం ఆదివారం రాత్రి 7.45 గంటల( భారత కాలమానం ప్రకారం) సమయంలో బాంగోర్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. విమానాశ్రయం నుంచి కొంతదూరం వెళ్లగానే విమానం కూలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారిలో ఏడుగురు మంటల్లో కాలి చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు విమానాశ్రయంను మూసివేశారు. ఘటన సమయంలో దట్టంగా మంచు కురుస్తున్నట్లు సమాచారం.
బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశం నిషిద్ధం
న్యూదిల్లీ: ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ధ్రువీకరించారు. ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే మిగతా దేవాలయాల్లోనూ ఇదే ప్రవేశ నిబంధన వర్తించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే […] The post బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశం నిషిద్ధం appeared first on Visalaandhra .
బద్రీనాథ్ కేదారినాథ్ల్లో హిందువులకే ప్రవేశం
హరిద్వార్ ః ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు ఇకపై కేవలం హిందువులనే అనుమతిస్తారు. హిందూయేతరులకు నిషేధం విధించాలని ఆలయాల నిర్వాహక కమిటీ నిర్ణయించింది. తొందర్లో జరిగే బద్రీనాథ్ కేదారినాథ్ ట్రస్టు కమిటీ (బికెటిసి) బోర్డు సమావేశంలో తీర్మానం చేసిఆమోదించనున్నారు. కమిటీ ప్రతిపాదన వివరాలను మీడియాకు ఛైర్మన్ సురేష్ సెమ్వాల్ సూచనప్రాయంగా తెలిపారు. ఆదివారం కమిటీ కమిటీ బోర్డు పూర్తి స్థాయి సమావేశంలో నిర్ణయం వెలువడుతుంది. దీనిని పూర్తి స్థాయిలో ఆలయాల బోర్డు పరిధిలోకి వచ్చే ఇతర క్షేత్రాలు గంగోత్రి , ముఖుంబకు కూడా వర్తిస్తాయి. ఆలయాల పురాతన సాంప్రదాయాలకు కట్టుబడి వ్యవహరించాలనే ఆలోచనలతోనే ఇతర మతస్తులకు ఆలయ నిషేధం విధించనున్నట్లు తెలిసింది. ఈ రెండు ఆలయాలు ఉత్తరాఖండ్లో నెలకొని ఉన్నాయి, ఛార్ధామ్ యాత్రలో భాగంగా ఆలయాలను ఏటా లక్షలాది భక్తులు సందర్శిస్తారు. శీతాకాలం లో ఆరు నెలల పాటు ఆలయాలు మూసివేస్తారు. తిరిగి ఏప్రిల్ 23న తలుపులు తెరుచుకుంటాయి. గతంలో మతాచారాలకు విరుద్ధంగా ఆలయాల్లోకి అందరిని అనుమతిస్తూ వచ్చారు. దీనిని గుర్తించి చక్కదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.
వారి రాకతో ఐరోపా బంధానికి రెక్కలు: మోడీ
న్యూఢిల్లీ: ఇండియా ఇయూ మధ్య బలోపేత సంబంధాలు రిపబ్లిక్ డే వేడుకలకు ఇయూ నేతల రాకతో స్పష్టం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇయూ కౌన్సిల్ , కమిషన్ సారధులు ఈసారి వేడులకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. రెండు పక్షాలూ ఉమ్మడి విలువలకు కట్టుబడి ఉన్నాయి. ఇదే క్రమంలో ఐరోపా సమాఖ్యతో భారతదేశ అనుబందం విస్తరించుకొంటోందని తెలిపారు. ఆంటోనియో కోస్టా, ఉర్సులా వా అతిధులుగా రావడం గర్వకారణం అన్నారు. విభిన్న రంగాలలో భారత్ ఐరోపా దేశాల మధ్య స్నేహ సహకారం విస్తరణకు ఇయూ నేతల భారత్ సందర్శన దోహదం చేస్తుందని ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.
. ప్రశ్నార్థకంగా నిరుద్యోగ భతి, ఆడబిడ్డ నిధి. ప్రతి నెలా అప్ప్పుల కోసం దిల్లీవైపు చూపు. అమలుకు చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ విమర్శనాస్త్రాలు సూపర్ సిక్్స హామీల్లో ప్రధానంగా నిరుద్యోగ భతి, ఆడబిడ్డ పథకం అమలు కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ఎన్నికల ముందు ఈ రెండు పథకా లను ఆశగా చూపి నిరుద్యోగులు, మహిళల ఓట్లు దండుకుని అధికారం లోకి వచ్చారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షమైన వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. నిరుద్యోగ భతి నెలకు […] The post కూటమికి కత్తిమీద సామే! appeared first on Visalaandhra .
చంద్రబాబు, పవన్కల్యాణ్, బొత్స, ఈశ్వరయ్య హాజరు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి ఎన్.భువనేశ్వరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, […] The post లోక్భవన్లో తేనీటి విందు appeared first on Visalaandhra .
. పునరుద్ధరణ మార్పు ప్రారంభమైంది. శరవేగంగా అభివద్ధి, సంక్షేమం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. 77వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్. రాజధాని గడ్డపై త్రివర్ణ పతాక రెపరెపలు విశాలాంధ్ర-సచివాలయం:2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని, కలిసి కట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని గవర్నర్ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర స్థాయి 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజధాని అమరావతి నేలపాడులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా […] The post సౌభాగ్యాంధ్ర దిశగా… appeared first on Visalaandhra .
బిజెపికి మాజీ ఎంఎల్ఎ అరూరి రమేష్ గుడ్బై
వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిఆర్ఎస్ ఆహ్వానం మేరకు త్వరలో పెద్ద ఎత్తున అనుచరులతో ఆ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. బిఆర్ఎస్లో చేరడం అంటే తన సొంత ఇంట్లోకి వెళ్ళినట్లేనని ఆయన పేర్కొన్నారు. బిజెపిలో తనకు ఇంత కాలం సహకరించిన వారందరికీ అరూరి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
సంతోష్కు సిట్ నోటీసులు యాదృచ్ఛికం కాదు: కెటిఆర్
టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్ ప్లాప్ టివి సీరియల్ను తలపిస్తోందని ఒక ప్రకనటలో పేర్కొన్నారు. అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్షసాధింపు, అటెన్షన్ డైవర్షన్లో భాగమేనని విమర్శించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఈ కేసు, విచారణ డ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న భారీ అవినీతి, కుంభకోణాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణను ఒక ఆయుధంగా వాడుకుంటోందని మండిపడ్డారు. ముఖ్యంగా నైని బొగ్గు గనుల కుంభకోణం బయటపడటంతో ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో ఉందని, దానిని పక్కదారి పట్టించేందుకే ఈ నోటీసుల డ్రామా అని పేర్కొన్నారు. గతంలో హరీష్ రావును, తనను కూడా ఇదే కేసు పేరుతో విచారించినా ఏమీ సాధించలేకపోయారని, ఇప్పుడు సంతోష్ కుమార్నుని లక్ష్యంగా చేసుకున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. మంగళవారం రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్కు బొగ్గు కుంభకోణంపై వినతిపత్రం ఇస్తామని తాము ప్రకటించిన వెంటనే సంతోష్కు నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అటెన్షన్ డైవర్షన్ అని ఆరోపించారు. సంతోష్ కుమార్కు పార్టీ అండగా ఉంటుందని, న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులను ఎదుర్కొంటామని కెటిఆర్ తెలిపారు.
పద్మశ్రీ విజేతలను సన్మానించిన మెగాస్టార్
పద్మశ్రీ విజేతలను సన్మానించిన మెగాస్టార్ రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందంతో వెలిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది. ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ల నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు, జ్ఞాపకాలు పంచుకోవడం.. దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించాయి. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి... ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా కూడా చిరంజీవి పద్మ అవార్డు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టీ, మాధవన్తో పాటు క్రీడారంగం నుంచి రోహిత్ శర్మ, వరల్ కప్ విజేత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, అలాగే డాక్టర్ దత్తాత్రేయుడు నోరికి అభినందనలు తెలియజేశారు.
గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సోమవారం బంగారం 5,100 డాలర్లను దాటి చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకుంది. భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక విధానాలపై అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా బంగారంపై ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్లు తగ్గవచ్చనే అంచనాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు బంగారం ర్యాలీకి కారణమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య, టారిఫ్ హెచ్చరికలతో అమెరికా ఆస్తులపై నమ్మకం తగ్గిందని విశ్లేషకులు తెలిపారు. వెండి, ప్లాటినం, పల్లాడియం ధరలూ కొత్త గరిష్టాలను తాకాయి. 2026లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐక్యతకు అర్థం చెప్పిన అమ్తుస్సలామ్
తాడి ప్రకాష్, 9704541559 “…ఆ కత్తులు దొరికేదాకా నేను పచ్చిమంచినీళ్లు ముట్టను…” అంది ఆమె.చడీచప్పుడూ లేకుండా, పిడుగు పడినట్టుగా ఉంది ఆమె మాట. 1946 – తూర్పు బెంగాల్లోని మారుమూల కుగ్రామం అది. మతవిద్వేషాలతో మనసులు మసిబారిపోతున్న సమయం…ఆ విపరిణామాలతో తనకేమీ సంబంధం లేనట్టుగా డిసెంబర్ నెల చలిగాలి రివ్వున వీస్తోంది. చలికి తువ్వాళ్లు, మఫ్లర్లు చెవులకు చుట్టుకున్నవాళ్లు, ఒళ్లంతా దుప్పట్లతో పైపంచెలతో కప్పుకున్నవాళ్లు ఆమె మాటలకి ఉలిక్కిపడ్డారు.“ఏమన్నారూ…!” … ఖురాన్ పఠనం చేసే కరీం సాహెబ్ […] The post ఐక్యతకు అర్థం చెప్పిన అమ్తుస్సలామ్ appeared first on Visalaandhra .
జయహో గణతంత్ర పతాక! జనప్రియ జాతి జాగత గీతిక!!కేతన రెపరెపలు ప్రతీవాడలా స్వేచ్ఛస్వచ్ఛతల ప్రతీకలుసు“తంత్రపు”మువ్వన్నెల రంగుల్లోంచి సంభ్రమ్మాలికలు!! అర్థవంతమైన స్వాతంత్య్రం కోసం పరితపించి అసువులు బాసిన త్యాగధనులెందరో కదా?! బానిసయుగాల పరదాశ్య శంఖలాల్నించి విడివడిన స్వతంత్రం గణతంత్రం ఫలాలునేటికీ దేశభక్తిజాతీయతల అస్తిత్వ మూలాలు ఆనాటి పోరాటాలు పోరుబావుటాలు వర్తమానంచరిత్రగతి నిర్దేశనకు ఆలంబనలే కదా?!I I Iలౌకిక భావనల నిర్మితుల రాజ్యాంగ నిర్దేశనంతోశాసనాలుచట్టాలు నిజాచరణం ఆశయాలుజాతిజాతీయతల భారతీయతకు నిదర్శనం మతాలుఅభిమతాలు భిన్నత్వాల్నించిమనం నుంచి జనం భావనలు కొరవడ్తూంటేపాలితులుపాలకుల నడుమ […] The post పతాక వందనం!! appeared first on Visalaandhra .
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా హై టెన్షన్ మ్యాచ్ జరుతుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సిబి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పొయి 199 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (100: 57 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్(56:39 బంతుల్లో 9 ఫోర్లు) హఫ్ సెంచరీ చేయగా, హర్మన్ ప్రీత్ కౌర్(20) పరుగులు చేసింది. నాట్ సీవర్, హేలీ 73 బంతుల్లో 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్సిబి బౌలర్లలో లారెన్ బెల్ 2, శ్రేయాంక పాటిల్, నదైన్ డి క్లర్క్ తలో వికెట్ పడగొట్టారు.
పేపకాయల ప్రసాద్, 9490712967 ‘మూను కన్న మొల్ల కన్న/ నీదు మోము బ్రైటట…./టటట టా/టటట టా /టటట టా’ అరమోడ్పు కనులతో పాడుకుంటున్నాడు గిరీశం. పక్కనపెట్టిన చుట్ట నుంచి లేచిన పొగ అక్కడంతా వ్యాపిస్తోంది.ఏమివాయ్ మై డియర్ షేక్స్పియర్… మొఖం మళ్ళీ వేలవేసినావ్… దూరం నుంచి నీరసంగా నడిచివస్తున్న శిష్యుణ్ణి పలకరించాడు గిరీశం.ఛ… వూరుకోండి గురూగారూ… ఎప్పుడూ అదే పిలుపా! ముఖం వేలవేసే వాడు ఈ ప్రపంచంలో షేక్స్పియర్ ఒక్కడేనా ఏంటి…మీరు అప్డేట్ అవ్వడం లేదండి… విసుక్కున్నాడు […] The post వంట-వార్పూ అవార్డులు appeared first on Visalaandhra .
Video : Director & Actor Tharun Bhascker Exclusive Interview
The post Video : Director & Actor Tharun Bhascker Exclusive Interview appeared first on Telugu360 .
ఆస్ట్రేలియా ఓపెన్.. క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్, రిబకిన
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ జన్నిక్ సినర్ (ఇటలీ), నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), నాలుగో సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా), ఐదో సీడ్ ఎలినా రిబకిన (కజకిస్థాన్) తదితరులు ప్రిక్వార్టర్ ఫైనల్ పోటీల్లో విజయం సాధించి ముందంజ వేశారు. రెండో సీడ్ స్వియాటెక్ 60, 63 తేడాతో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మాడిసన్ ఇంగ్లిస్ను ఓడించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన స్వియాటెక్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే తొలి సెట్ను దక్కించుకుంది. రెండో సెట్ కూడా అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. రిబకిన 61, 63తో ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. అనిసిమోవా మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చి నెగ్గింది. చైనాకు చెందిన వాంగ్తో జరిగిన పోరులో అనిసిమోవా 76, 64తో జయకేతనం ఎగుర వేసింది. మరో పోటీలో ఆరో సీడ్ జెస్సిక పెగులా (అమెరికా) జయభేరి మోగించింది. అమెరికాకే చెందిన మాడిసన్ కీస్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పెగులా 63, 64తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో సినర్ 61, 63, 76తో ఇటలీకే చెందిన డార్డెన్ను ఓడించాడు. మూడో సెట్లో సినర్కు గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఇక చెక్ రిపబ్లిక్ ఆటగాడు మెన్సిక్తో జరిగిన పోరులో జకోవిచ్కు వాకోవర్ లభించింది. మరో పోటీలో 8వ సీడ్ బెన్ షెల్టన్(అమెరికా) విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కుచేరుకున్నాడు. ఐదో సీడ్ ముసెట్టి (ఇటలీ) కూడా ముందంజ వేశాడు.
విశాలాంధ్ర- ఎ కొండూరు మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు గడ్డి కృష్ణారెడ్డికి జిల్లా ఉత్తమ మార్గదర్శి అవార్డును సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ చేతుల మీదగా ఉత్తమ మార్గదర్శి అవార్డును అందించడం జరిగిందని గడ్డి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోనే కాకుండా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని ఆదరించే […] The post సేవకు దక్కిన అరుదైన గౌరవం appeared first on Visalaandhra .
పోలీసు ఆపరేషన్..10 వేల కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం
జైపూర్ : రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో పోలీసుల వేటలో 10000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల దశలోనే ఈ మందుగుండు సామాగ్రి ఒకటే చోట దొరకడం సంచలనానికి దారితీసింది. థావ్లా పోలీసు స్టేషన్ పరిధిలోని హర్సౌర్ గ్రామంలో నిర్మానుష్యపు ఫార్మ్హౌస్లో దీనిని గుర్తించారు. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై తనిఖీల సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ సోదాల సందర్భంగా సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక్కడ భారీ స్థాయిలో స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎర్రకోట వద్ద ఉగ్రవాదుల బాంబు పేలుడుకు వాడిన మందుగుండు సామాగ్రి రాజస్థాన్ నుంచే సరఫరా అయిందని ప్రాధమికంగా తెలిసింది. అయితే ఇప్పటి రికవరికి ఎర్రకోట ఘటనకు సంబంధం ఉన్నదీ లేనిదీ నిర్థారణ కాలేదు. అక్రమ మైనింగ్కు ఈ పేలుడు పదార్థాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడైందని జిల్లా ఎస్పి మృదుల్ కచ్చావా తెలిపారు. ఇక్కడ పోలీసుల తనిఖీలో 187 సంచుల్లో అమ్మోనియం నైట్రేట్ను కనుగొన్నారు. పలు డిటోనేటర్లు, వైర్లు కూడా లభ్యం అయ్యాయి. అక్రమ తవ్వకాలకు అవసరం అయిన వస్తువులను తాను ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్లు అరెస్టు అయిన సులేమాన్ ఖాన్ తెలిపాడు.
అంతరాయంలేని విద్యుత్ సరఫరా లక్ష్యం
గణతంత్ర వేడుకల్లో పుల్లారెడ్డి విశాలాంధ్రవిజయవాడ: ప్రజలకు అంతరాయంలేని నాణ్యమైన విద్యుత్ను అందించి వినియోగదారుల మన్ననలను చూరగొనాలని ఏపిసిపిడిసియల్ సీయండీ పి పుల్లారెడ్డి సూచించారు. సోమవారం కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ అందరి కషితో జాతీయ స్ధాయిలో కార్పొరేషన్ బి గ్రేడ్క చేరుకుందని, మరింతగా కష్టపడి ఎ గ్రేడ్ సాధించాలని అభిలాషించారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ ను ఆలస్యం లేకుండా త్వరితగతిన ఇవ్వాలని […] The post అంతరాయంలేని విద్యుత్ సరఫరా లక్ష్యం appeared first on Visalaandhra .
మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ పవర్ఫుల్ లుక్..
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్డ్రాప్తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి‘ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి‘ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్స్లో రూత్లెస్, బ్రూటల్ అనే రెండు లుక్స్లో మంచు మనోజ్ ఇంటెన్స్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు లుక్స్ చూస్తే మూవీలో అద్భుతమైన యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. మంచు మనోజ్ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, నటనతో డేవిడ్ రెడ్డి పాత్రకు లైఫ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని ‘డేవిడ్ రెడ్డి‘ సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిటీష్ క్రూర పాలనకు ఎదురునిలిచి పోరాడిన యోధుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారు.
మండల వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
ఎ కొండూరు విశాలాంధ్ర మండల కేంద్రమైన ఎ కొండూరు మండల పరిషత్ అభివృధి కార్యాలయంలో ఎంపిడిఓ బొజ్జగని శ్రీనివాసరావు తాహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎన్ అరవింద్ అధ్యవరంలో 77 వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఎగుర వేశారు అలానే మండలం పోలీస్ స్టేషన్ లోస్టేషన్ హౌస్ ఆఫీసర్ గంధం మలక్ష్మణుడు గణతంత్ర వేడుకలు సందర్భంగా స్టేషన్ లో సిబ్బంది తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.. అలానే మండల కేంద్రలో వెలుగు కార్యాలయంలో […] The post మండల వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు appeared first on Visalaandhra .
మహనీయుల స్ఫూర్తితో అభివృద్ధికి ముందడుగు
–ఎన్టీఆర్ జిల్లా ప్రగతికి సమష్టిగా కృషి `ఆకట్టుకున్న శకటాలు..ఈ వేడుకలలో ప్రదర్శించిన మొత్తం 18 శాఖల శకటాలు స్వర్ణాంధ్ర పది సూత్రాల కార్యాచరణను కళ్లకుకట్టాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, స్వర్ణాంధ్ర 2047 , జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , పౌరసరఫరాల శాఖ, పర్యాటక శాఖ, పాఠశాల విద్యా,, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఈగల్ టీం, వైద్య ఆరోగ్య , జిల్లా మహిళా శిశు సంక్షేమ, నీటి పారుదల, అటవీ, వ్యవసాయం, పంచాయతీరాజ్ , పశుసంవర్థక, ఉద్యాన, […] The post మహనీయుల స్ఫూర్తితో అభివృద్ధికి ముందడుగు appeared first on Visalaandhra .
రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం... దోనేపూడి శంకర్విశాలాంధ్రవిజయవాడ: నగరంలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. తొలుత భారత జాతీయ పతాకాన్ని గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు దోనేపూడి శంకర్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు సభ్యులతో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విలువలతో కూడిన రాజ్యాంగ విలువలను […] The post వైభవంగా గణతంత్ర వేడుకలు appeared first on Visalaandhra .
Anil Sunkara’s AIRFORCE – Bezawada Batch Announces First Cast Member with a Fun, Grounded Welcome
Producer Anil Sunkara has consistently been at the forefront of encouraging fresh talent and original storytelling, and his latest announcements reaffirm that commitment. His much-talked-about movie-making reality show, Show Time – Cinema Teeddam Randi, has already generated a strong buzz, inspiring countless hopefuls across the film community. Carrying this spirit forward, Anil Sunkara has unveiled […] The post Anil Sunkara’s AIRFORCE – Bezawada Batch Announces First Cast Member with a Fun, Grounded Welcome appeared first on Telugu360 .
Teja Sajja | 3 సీక్వెల్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న తేజ సజ్జ
Teja Sajja | 3 సీక్వెల్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న తేజ సజ్జ
Why are Tollywood Stars not ready to Face Media?
Gone are the days when stars were excited to interact with the media and reveal interesting updates about their films. With the social media era and digital media replacing the world, most of our stars are not much interested in facing the media. A section of the media too is biased and are targeting the […] The post Why are Tollywood Stars not ready to Face Media? appeared first on Telugu360 .
డిజిపి సిల్వర్ మెడల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు
విశాలాంధ్ర – పార్వతీపురం:పార్వతీపురం మన్యంజిల్లాలో పోలీస్ శాఖలో విశేష సేవలు అందించిన ఎనిమిదిమందికి డిజిపి సిల్వర్ మెడల్స్, ప్రశంసపత్రాలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డిలు సోమవారం నాడు అందజేశారు. సిల్వర్ మెడల్ తీసుకున్న వారిలో సాలూరు సిఐ రామకృష్ణ, ఏఎస్ఐ టి శారద, ఆర్ఎస్ఐ కే రమేష్, బి విజయభాస్కరరావు, పి లావణ్య, పి గోవర్ధన్ కుమార్, వి గణపతి, పతివాడ శ్రీనులు ఉన్నారు. వారందరిని […] The post డిజిపి సిల్వర్ మెడల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు appeared first on Visalaandhra .
Vishwak Sen has delivered disasters and he was badly criticised for his script selection. He also landed into controversy for his statements during the promotions of his previous films. This time the actor is focused on Funky, a comic entertainer directed by Jathi Ratnalu fame Anudeep KV. The promotional activities started recently and the film […] The post Good Chance for Vishwak Sen appeared first on Telugu360 .
Big Test for Bobby Kolli and Gopichand Malineni
Young and talented Anil Ravipudi is racing ahead with back-to-back hits. Bobby Kolli and Gopichand Malineni are directing the upcoming projects of Chiranjeevi and Balakrishna respectively. Bobby Kolli and Gopichand Malineni did not direct great films but they did not miss any commercial aspects in their films. Their previous films with these veteran actors ended […] The post Big Test for Bobby Kolli and Gopichand Malineni appeared first on Telugu360 .
కూకట్ పల్లిలో ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా
కూకట్ పల్లి వివేకానంద నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద నగర్ ప్రధాన రహదారిపై చైనా మాంజా (నైలాన్ దారం) మెడకు చుట్టుకోవడంతో ఐదేళ్ల చిన్నారి నిషిక దరియా దుర్మరణం చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రహదారిపై తేలియాడుతున్న చైనా మాంజా చిన్నారి మెడకు చిక్కుకుని తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా వినియోగం ప్రాణాంతకంగా మారుతోందని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Technology Is the Backbone of Transparent and Fast Governance: Chandrababu Naidu
Technology is not just about convenience. It is a powerful tool for transparent and fast governance, said Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Monday. He made these remarks during a high level review meeting of the Real Time Governance Society at the camp office, where he outlined a clear roadmap for the state’s […] The post Technology Is the Backbone of Transparent and Fast Governance: Chandrababu Naidu appeared first on Telugu360 .
ఆ ముగ్గురి వల్లే ఈ విజయాలు.. టీమిండియాపై గవాస్కర్ ప్రశంసల వర్షం
ముంబై: న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరుగుతున్న టి20 సిరీస్లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కివీస్ సిరీస్లో హ్యాట్రిక్ విజయాలతో భారత జట్టు చాటిందన్నాడు. రానున్న టి20 వరల్డ్కప్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ప్రదర్శన చాలా అద్భుతమన్నాడు. యువ సంచలనం అభిషేక్ శర్మ సిరీస్లో విధ్వంసక బ్యాటింగ్తో చెలరేగి పోతుండడం తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ల బ్యాటింగ్ను కూడా గవాస్కర్ కొనియాడాడు. ఈ ముగ్గురి వల్లే టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిందని ప్రశంసించాడు.
వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను డాక్టర్ దిడ్డి స్వప్న లత కు ప్రశంసా పత్రం
కలెక్టర్ చేతుల మీదుగా డాక్టర్ స్వప్నలతకు ప్రశంసా పత్రం అందజేత కరీమాబాద్ జనవరి
బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం ఓ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం దివిటిపల్లి వద్ద చోటుచేసుకుంది. దీంతో జాతీయ రహదారిపై 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్టున్నారు.
బిసిసిఐ మాజీ అధ్యక్షుడు బింద్రా కన్నుముత
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (84) ఆదివారం తుదిశ్వాస విడిచారు. బింద్రా 1993 నుంచి 1996 మధ్య బిసిసిఐ అధ్యక్షుడిగా పని చేశారు. అంతేగాక 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన సేవలకు గుర్తింపుగా పిసిఎ క్రికెట్ స్టేడియానికి ఐఎస్ బ్రిందా పేరు పెట్టారు. తన పదవీ కాలం సమయంలో బింద్రా భారత క్రికెట్లో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. క్రికెట్ ప్రసారంలో దూరదర్శన్ గుత్తాధిపత్యానికి పుల్స్టాప్ పెట్టి ఈఎస్పిఎన్, టెన్ టివి వంటి ప్రపంచ సంస్థలను భారత మార్కెట్కు తేవలంలో ముఖ్య భూమిక పోషించారు. అంతేగాక 1987 ప్రపంచకప్ టోర్నీ భారత్లో నిర్వహించడంలో తనవంతు సహకారం అందించారు.
విశాలాంధ్ర – పార్వతీపురం: జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిపిపి గా పనిచేస్తున్న మంతిని మానస ఉత్తమ అధికారిగా ఎంపికై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డిల చేతుల మీదుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారంనాడు ప్రశంసాపత్రాన్నీ తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయవిభాగంలో చేసినకృషికి గాను ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్నీ తీసుకున్నారు. ఆమెను జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ, జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎం ఎం.శ్రావణ్ […] The post ఉత్తమ డిపిపిగా మంతిని మానస appeared first on Visalaandhra .
Padma Awards |పవన్ కళ్యాణ్ అభినందనలు..
Padma Awards | పవన్ కళ్యాణ్ అభినందనలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ
విశాలాంధ్ర- డుంబ్రిగుడ : మండలంలోని కండ్రుం ప్రాథమికోన్నత పాఠశాల 108 మంది విద్యార్థులకు అక్షర ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం ఫౌండర్ ప్రియ బాంధవి ఆధ్వర్యంలో సోమవారం గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి 2 గెన్ను చేతులు మీదుగా విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా విద్యాసామాగ్రిని అందించిన వెల్ఫేర్ సొసైటీ కు కృతజ్ఞతలు తెలిపారు. అందించిన విద్యాసామగ్రిని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు […] The post విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ appeared first on Visalaandhra .
కర్రగుట్టలో ఐఈడీల మోత..11మంది భధ్రాతా సిబ్బందికి గాయాలు
దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్న సందర్బంలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఐఈడీ పేలుళ్ళు కలకలం రేపాయి. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్-తెలంగాణ సరిహద్దు సమీపంలోని కర్రెగుట్ట కొండల ప్రాంతంలో మావోయిస్టులు సోమవారం పలుచోట్ల ఐఈడీ పేలుళ్లకు పాల్పడటంతో.. 11మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరో పదిమంది ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడ్డారు. ఆదివారం జరిగిన వరుస పేలుళ్లు నేపధ్యంలో ఛత్తీస్గఢ్ పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్, సిఆర్పిఎఫ్ ఎలైట్ కోబ్రా యూనిట్ సిబ్బందితో కూడిన ఉమ్మడి యాంటీ-నక్సల్ ఆపరేషన్ బృందం లక్ష్యంగా సోమవారం పలుచోట్ల ఐఈడీ పేలుళ్ళకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లు చోటుచేసుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హెలిక్యాప్టర్ ద్వారా రాయఫూర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11మంది జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ పోలీసులు అధికారికంగా వెల్ల డించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా బీజాపూర్లోని కర్రెగుట్ట కొండతోసహా 13 ప్రదేశాలలో సోమవారం ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతకాన్ని పోలీసు భద్రాతా సిబ్బంది ఎగురవేశారు. కర్రెగుట్ట కొండను నక్సలైట్ల నుండి విముక్తి చేయడానికి, 22,000 మంది సైనికులు 21 రోజులపాటు యాంటీ-నక్సల్ ఆపరేషన్ ప్రారంభించి 36మంది నక్సలైట్లను హతమార్చి అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తడ్పల క్యాంప్ వద్ద 196 సిఆర్పిఎఫ్ బెటాలియన్ 204వ బెటాలియన్ కోబ్రా సైనికులు మువ్వెన్నల జెండాను ఎగురవేశారు. కర్రెగుట్ట ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలుడులో 11మంది సైనికులు గాయపడ్డినప్పటికీ, సైనికులు ధైర్యంగా ఉండి నక్సలైట్ కోటపై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు. బీజాపూర్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలడంతో భద్రతా దళాలకు చెందిన 11మంది జవాన్లు తీవ్రంగా గాయపడగా, మరో పది మంది భద్రతా సిబ్బంది గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారని, పేలుడులో గాయపడిన వారు ప్రాణహాని నుంచి బయటపడ్డారని ఛత్తీస్గఢ్ హోంమంత్రి శర్మ తెలిపారు. ఐఈడి పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రిపబ్లిక్ డే ఆఫర్.. రూ.26 వేలకే కారు
రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే పాత కారు అంటూ ఇచ్చిన సూపర్ బంపర్ ఆఫర్ చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారం చేసిన ఈ ఆఫర్ను నమ్మి హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి వందలాది జనం నాచారం, మల్లాపూర్లోని ట్రస్ట్ కార్స్ కార్యాలయాలకు రెండు రోజులుగా తరలివచ్చారు. ఒక దశలో రాత్రి వచ్చి ఇక్కడే నిద్రకు ఉపక్రమించారు. మరీ క్యూలో గంటల తరబడి వెయిట్ చేశారు. కానీ, ప్రచారంలో చెప్పినట్టుగా కార్లు ఇవ్వకపోవడం, కార్లు లేవని మోసానికి పాల్పడటంతో కొనుగోలుదారులు ఆగ్రహానికి గురయ్యారు. తమను మోసం చేశారంటూ ట్రస్ట్ కార్స్ కార్యాలయాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కొన్ని కార్లు, కార్యాలయాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణలో ఆఫర్ పేరుతో ప్రజలను ఆకర్షించి, స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా గందరగోళం సృష్టించినట్లు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ట్రస్ట్ కార్స్ ఎండీని నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తక్కువ ధరకు కారు అనే ఆశతో వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా ప్రకటనలపై నమ్మకం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
Why Vijayasai Reddy Turned Rebel Against YSRCP and His June Padayatra Plan
For years, Vijayasai Reddy was regarded as the sharp strategist and most trusted aide of the YS family. From the era of YS Rajasekhara Reddy to the rule of Y. S. Jagan Mohan Reddy, Vijayasai Reddy stood firmly beside the party leadership. He shared prison time with Jagan and emerged as the undisputed number two […] The post Why Vijayasai Reddy Turned Rebel Against YSRCP and His June Padayatra Plan appeared first on Telugu360 .
Republic |పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
Republic | పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు Republic | లక్షేట్టిపేట, ఆంధ్ర
అవినీతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి
విశాలాంధ్ర – ధర్మవరం ; ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఏఐటియుసి సిపిఐ నాయకులు సిడిపిఓ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలోని ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారినిపై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి అని, దీనిపైన జిల్లా కలెక్టర్ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , రాష్ట్ర ఐసిడిఎస్ […] The post అవినీతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి appeared first on Visalaandhra .
VD14: పవర్ఫుల్గా.. విజయ్ సినిమా టైటిల్, గ్లింప్స్
హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘VD14’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. కాగా, సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘రణబాలి’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఓ గ్లింప్స్ని కూడా విడుదల చేశారు. ఈ కథ స్వాతంత్ర్యం గురించి కాదని.. స్వాతంత్ర్యం ముందు జరిగిన ఓ చీకటి చరిత్ర గురించి అని గ్లింప్స్ ఆరంభంలో పేర్కొన్నారు. ఇక ఆ సమయంలో జరిగిన దారుణాల గురించి.. భారతదేశం నుంచి బ్రిటీషర్లు దోచుకెళ్లిన సంపద గురించి టీజర్లో చూపించారు. ఈ కథ 1878 ప్రాంతంలో జరిగినదిగా టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సర్ థియోడర్ హెక్టర్గా ఆర్నాల్డ్ వోస్లో, జయమ్మగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్-అతుల్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.
Collector |ఉత్తమ సేవలకు ఉత్తమ అవార్డులు
Collector | ఉత్తమ సేవలకు ఉత్తమ అవార్డులు Collector | జైనూర్, ఆంధ్రప్రభ
Vijay Deverakonda as Ranabaali: A Powerful Pre Story to the Revolutionary tale
Rowdy Vijay Deverakonda and director Rahul Sankrityan, previously collaborated for blockbuster Taxiwaala and now bringing a revolutionary tale VD14. The film titled Ranabaali is releasing in theatres on September 11th, 2026 across Pan India. The title was officially announced today with a powerful prelude that introduces the Cursed Land and its Hero, featuring striking visuals […] The post Vijay Deverakonda as Ranabaali: A Powerful Pre Story to the Revolutionary tale appeared first on Telugu360 .
appreciation |ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సంగెం ఏఎస్ఐ
appreciation | ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సంగెం ఏఎస్ఐ appreciation | సంగెం,
High school |ఆలేరు ఎన్ సిసి విద్యార్థులకు అభినందనలు
High school | ఆలేరు ఎన్ సిసి విద్యార్థులకు అభినందనలు High school
Certificate |జిల్లాస్థాయి ఉత్తమ ఆర్డీవోగా శేఖర్ రెడ్డి …
Certificate | జిల్లాస్థాయి ఉత్తమ ఆర్డీవోగా శేఖర్ రెడ్డి … Certificate |
అమెరికా రహస్య ఆయుధం డిస్కోంబోబుటర్
అమెరికా వెనెజువెలాలో నిర్వహించిన సైనిక చర్యలో భాగంగా, యూఎస్ సైనికులు వాడిన రహస్య ఆయుధం పేరును ట్రంప్ ఎట్టకేలకు వెల్లడించారు. ఆ ఆయుధం పేరును డిస్కోంబోబుటర్ అని తెలిపారు. వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించినప్పుడు ఆ దేశపు సైనిక వ్యవస్థను స్థంభింపజేసేందుకు ఈ ఆయుధాన్ని ఉపయోగించినట్లు ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా మెక్సికోతో సహా డ్రగ్ ను వ్యాపింపజేసే దేశాలపై దాడులు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా వద్ద పల్స్డ్ ఎనర్జీ ఆయుధం ఉందనే నివేదికలపై వ్యాఖ్యానిస్తూ, ది డిస్కోంబోబుటర్ ఆ ఆయుధం అనీ, దాని గురించి మాట్లాడేందుకు తనకు అనుమతి లేదని పేర్కొన్నారు. వెనెజువెలా వద్ద చైనా, రష్యా కు చెందిన రాకెట్లు ఉన్నాయని, వారు ఎప్పుడూ ఉపయోగించలేదని పేర్కొన్నారు. తాము బటన్ నొక్కినప్పుడు ఆవి ఏవీ పనిచేయలేదని, అలాగే తాము ప్రయోగించిన ఆయుధం వల్ల కారకస్ లోదాదాపు అన్ని లైట్లు ఆగిపోయాయని పేర్కొన్నారు. అసలు అది ఎలా సాధించారో మాత్రం వివరించలేదు. తూర్పు ఫసిఫిక్ మహా సముద్రంలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణాచేస్తున్న పడవపై శుక్రవారం అమెరికా దాడి చేసింది. మదురు పట్టుబడిన తర్వాత ఇలాంటి దాడి చేయడం ఇదే తొలిసారి.
దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలి
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర – ధర్మవరం;; దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కార్యాలయ అధికారులు, సిబ్బంది నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్రం తేవడం వల్లనే ఈరోజు మనం ఇలా ఉన్నామని వారు తెలియజేశారు. ఉద్యోగులందరూ తమ విధులను నిజాయితీతో, బాధ్యతతో సేవా భావంతో నిర్వర్తించాలని తెలిపారు. తదుపరి అందరికీ గణతంత్ర దినోత్సవ […] The post దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలి appeared first on Visalaandhra .
Minister |మధుసూదన్ రెడ్డి మృతి తీరని లోటు…
Minister | మధుసూదన్ రెడ్డి మృతి తీరని లోటు… Minister | వెబ్
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించిన వారిని గుర్తించి శాఖ తరపున ప్రశంస ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి గిరిజ మనోహర్రావు, […] The post రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
WPL-2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సిబి
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా హై టెన్షన్ మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సిబి జట్టు ముంబైని బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో ముంబైని ఆర్సిబి చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలని స్మృతి మంధన సేన భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు తప్పుకుండా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్పై తారాస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. తుది జట్లు: ముంబై: సజీవన్ సజన, హేలీ మ్యాథ్యూస్, నాట్ స్కీవర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమిలియా కెర్ర్, రహిలా ఫిర్దౌస్(కీపర్), అమంజోత్ కౌర్, సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్నిమ్ ఇస్మాయిల్, పూనమ్ ఖేమ్నార్. బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మంధన(కెప్టెన్), జార్జియా వోల్, గౌతమి నాయక్, రిచా ఘోష్(కీపర్), రాధా యాదవ్, నదీన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.
కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి
రహదారి పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెంటపాడు గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. పెంటపాడు గ్రామానికి చెందిన మహిళలు పాంగి సావిత్రి,కొర్ర సుశీల రహదారి పక్కన రోజూ కూరగాయలు అమ్ముతుంటారు. ఈ క్రమంలో రింతాడ గ్రామనికి చెందిన ఉపాధ్యాయుడు తన కారులో చింతపల్లి నుంచి రింతాడకు వెళ్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కొర్ర సుశీల ఘటనాస్థలిలోనే మృతి చెందింది. సావిత్రి తీవ్రంగా గాయపడింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముద్దాయి లకు అన్ని వసతులు కల్పించాలి
సీనియర్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ టి. వెంకటేశ్వర్లు విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణంలోని సబ్ జైల్లో గల ముద్దాయిలకు అన్ని వసతులు కల్పించేలా సబ్జైలర్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ టి. వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం జడ్జి ఆకస్మికంగా సబ్ జైలును తనిఖీ చేశారు. ఖైదీలు ఉండే గదులు పరిశీలించారు, తదుపరి ఖైదీలకు పెట్టే భోజనంను స్వయంగా వారు […] The post ముద్దాయి లకు అన్ని వసతులు కల్పించాలి appeared first on Visalaandhra .
At home |ఏపీ లోక్భవన్లో ఎట్ హోం కార్యక్రమం
At home | ఏపీ లోక్భవన్లో ఎట్ హోం కార్యక్రమం At home
Social service |మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానం
Social service | మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానం Social service |
భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం, పలువురు మిస్సింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని నజీరాబాద్ ప్రాంతంలో సోమవారం ఒక గిడ్డంగిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేూసుకుంది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పన్నెండు అగ్నిమాపక యంత్రాలతో దాదాపు 7గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీస్, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి కాలిపోయిన ముగ్గురి మృతదేహాలను వెలికితీశాయని.. మృతులను ఇంకా గుర్తించలేదని బరుయ్పూర్ పోలీస్ జిల్లా ఎస్పీ శుభేందు కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలోఆరుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం శిథిలాలు తొలగిస్తున్నారని.. పూర్తిగా తొలగించబడిన తర్వాత ఎంతమంది వాటి చిక్కుకున్నారో తెలుస్తుందని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన విద్యుత్ మంత్రి అరూప్ బిశ్వాస్ మాట్లాడుతూ.. దట్టమైన పొగ కారణంగా గిడ్డంగి లోపల మరెవరైనా ఉన్నారో లేదో ధృవీకరించడం కష్టమైందని...పొగను బయటకు పంపడానికి గోడలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
ఆ విషయంలో విరాట్ రికార్డును సమం చేసిన సంజూ
ఐదు టి-20ల సిరీస్లో భాగంగా గువాహటి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టి-20లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో ప్రత్యర్థి జట్టును 153 పరుగులకే కట్టడి చేసిన టీం ఇండియా ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే చేధించింది. దీంతో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ని 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే భారత జట్టులో సంజూ శాంసన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్లో ఓపెనర్గా బరిలోకి దిగుతున్న సంజూ.. చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తొలి టి-20లో 10 పరుగులు, రెండో టి-20లో 6 పరుగులు చేసి ఔట్ అయిన సంజూ.. మూడో మ్యాచ్లో ఏకంగా తొలి బంతికే ఔటై.. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో జట్టులో అతడి స్థానంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ క్రమంలో సంజూ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టి-20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డక్లుగా వెనుదిరిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ మొత్తం ఏడుసార్లు గోల్డెన్ డక్ కాగా.. సంజూ కూడా 7 సార్లు తొలి బంతికే ఔట్ అయ్యాడు. విరాట్ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్లు తీసుకుంటే, శాంసన్ కేవలం 47 మ్యాచ్ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ లిస్ట్లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ 151 మ్యాచుల్లో మొత్తం 12 సార్లు గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు.

22 C