Vaibhav Sooryavanshi : బుడ్డోడా... మజాకానా...చితక్కొట్టేడేవాడొచ్చాడు.. భారత్ కు వైభవమే
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనకు చూసే వారికి కూడా టీం ఇండియాకు చితక్కొట్టేటోడు దొరికాడనిపించింది
Peddi and Vishwambara: Tollywood is Waiting
Mega fans are eagerly waiting for an official update from the teams of Peddi and Vishwambara about the release dates. Speculations say that Peddi will not hit the screens as per the plan on April 30th. The team is currently tightlipped and they are expected to issue a statement soon. The promotions of the film […] The post Peddi and Vishwambara: Tollywood is Waiting appeared first on Telugu360 .
నేడు పంజాబ్తో పోరు ముల్లాన్పుర్: ఐపిఎల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం జరిగే కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ముల్లాన్పుర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. సన్రైజర్స్కు ఈమ్యాచ్ సవాల్గా మారింది. సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన కిందటి మ్యాచ్లో సన్రైజర్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. పంజాజ్ మూడింటిలో రెండు విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఇక ఈ మ్యాచ్లోనూ పంజాబ్ విజయమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఓపెనర్లే కీలకం.. ఈ మ్యాచ్లో హైదరాబాద్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు కీలకంగా మారారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరు చెలరేగితే సన్రైజర్స్కు భారీ స్కోరు సాధించడం కష్టమేమీ కాదు. అయితే వీరి బ్యాటింగ్లో నిలకడ లోపించడం ఆందోళన కలిగిస్తోంది. విధ్వంసక బ్యాటింగ్కు మరో పేరుగా చెప్పుకునే హెడ్, అభిషేక్లు రాణిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా తన బ్యాట్కు పని చెప్పక తప్పదు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఇషాన్ తన మార్క్ బ్యాటింగ్తో విజృంభిస్తే ఈ మ్యాచ్లో భారీ స్కోరు సాధించడం హైదరాబాద్కు ఇబ్బందేమీ కాదు. నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లు ఫామ్లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. వీరి ఈసారి కూడా జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ సత్తా చాటడం జట్టుకు సానుకూల పరిణామం. లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబె తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక హర్షల్ పటేల్, ఉనద్కట్, మలింగ, హర్ష్ దూబె, నితీశ్ కుమార్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా ఉండనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది. తక్కువ అంచనా వేయలేం.. మరోవైపు పంజాబ్ జట్టులో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధెరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, చాహల్, అర్ష్దీప్, జాన్సన్, బార్ట్లెట్ తదితరులతో పంజాబ్ చాలా బలంగా ఉంది. అగ్రశ్రేణి బ్యాటర్లు, బౌలర్లు ఉండడంతో పంజాబ్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా కనిపిస్తోంది.
IPL 2026 : ఆర్సీబీపై రాజస్థాన్ విక్టరీ.. సమఉజ్జీల సమరంలో పై చేయి రాయల్స్ దే
గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది.
Superstar Rajinikanth’s upcoming film Jailer 2 is said to have a powerful cameo of a cop. The team is keen to finalize a top actor from Telugu or Hindi for the role. Even before the shoot commenced, Nandamuri Balakrishna was approached and he declined the offer. Bollywood Superstar Shah Rukh Khan was in talks and […] The post One More Shock for Jailer2 appeared first on Telugu360 .
Israel- Hezbollah : చర్చలపై దాడుల ప్రభావం.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కుదరని సయోధ్య
హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం దాడులు మరింత ముదిరాయి
Iran - Amrica - Talks : ఇరాన్ - అమెరికా చర్చలు ఫలప్రదం అవుతాయా?
ఇరాన్ - అమెరికాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి
Uttar Pradesh : Uttar Pradesh : యమునా నదిలో పడవ మునక.. పది మంది మృతికి అదే కారణమా?
ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది.
డీలిమిటేషన్తో అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం
మన తెలంగాణ/హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల మనుగడకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరిగితే ప్రజా ఉద్య మం తప్పదని ఆయన హెచ్చరించారు. ఇది పార్టీల సమస్య కాదని, ప్రజా సమ స్య అని ఆయన తెలిపారు. ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం అంతరం తీసుకుని రావాలనుకుంటున్నదని ఆయన విమర్శించారు. ఢిల్లీలో శుక్రవారం సిడబ్లుసి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్సభ ని యోజకవర్గాల పునర్విభజనతో పెద్ద రా ష్ట్రాలు మరింత పెద్దవిగా, చిన్న రాష్ట్రాలు చిన్నవిగా మిగిలిపోతాయని ఆయన ఆం దోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ని యోజకవర్గాల పునర్విభజన అవసరం ఏ మి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవ లం జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం శాస్త్రీయం కాదన్నారు. ఇది దేశ సమగ్రతకు, సమాఖ్య స్పూర్తికి విఘాతం అని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సంపూర్ణ మద్దతు ప్రకటించింద ని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అంశం తొలుత తమ పార్టీ ప్రతిపాదనేనని చెప్పారు. ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ ప్రతిపాదించారని ఆయన తెలిపారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వాలని సిడబ్లుసి తీర్మానం చేసిందని ఆయన వివరించారు. 2023లో బిల్లు తీసుకొచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఇండియా కూటమి పార్టీల నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఆయన చెప్పారు. 50 శాతం సీట్లు పెరిగినప్పుడు మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఒబిసి కోటా కూడా ఇవ్వాలని ఈ సమావేశంలో ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ అన్నారని ఆయన చెప్పారు. ఒబిసిల రిజర్వేషన్ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం 543 లోక్సభ సభ్యుల సంఖ్య ప్రకారం 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తే సరిపోతుందన్నారు. దీని కోసం నియోజకవర్గాల పెంపు ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.' జీవన్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనన్న సిఎం బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ చాలా మంది నాయకులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ కోసం కష్టపడిన వారిని బయటకి పంపించారని, ఆయన దేవేందర్ గౌడ్, ఈటల రాజేందర్, ఆలే నరేంద్ర, విజయశాంతి, జూపలి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లను ఉదహరించారు. జూపల్లి కృష్ణారావు ఓడిపోతే హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని కనీసం వార్డు సభ్యునిగా కూడా నియమించలేదని ఆయన తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల ్లచట్టాలను ఉపసంహరించుకున్నట్లే, డీ-లిమిటేషన్ బిల్లును కూడా ఉపసంహరించుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు 45రోజుల్లో ఇళ్ళ స్థలాలకు మార్గం ఇదిలాఉండగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాబోయే నలభై ఐదు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొంటామని హామీ ఇచ్చారు.
11thApril2026 |శనివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
11thApril2026 | శనివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 11thApril2026 |
లెబనాన్లో హెజ్బోల్లాపై ఇజ్రాయెల్ వీడని దాడులు, హర్మూజ్పై ఇరాన్ మరింత పట్టు దశలో శనివారం పాకిస్థాన్లో శాంతి చర్చలకు రంగం సిద్ధం అయింది. ఇస్లామాబాద్లోని ప్రముఖ సెరెనా హోటల్లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు మధ్యవర్తిత్వ దేశాల ప్రాతినిధ్యం మధ్య పరోక్ష రీతిలో జరుగుతాయి. ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు వేర్వేరు రూంలలో ఉంటాయి. ముఖాముఖీ చర్చలు ఉండవు. పరస్పర ప్రతిపాదనలు, రాజీమార్గాలను మధ్యవర్తుల ద్వారా పరస్పరం అందించడం జరుగుతుంది. ఈ దశలో చర్చలలో ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ స్థాయి దౌత్యవేదికగా మారిన ఈ హోటల్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్ అయింది. ఆదివారం సాయంత్రం వరకూ ఈ హోటల్కు వేరే అతిధులు రాకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారిని ఖాళీ చేయించారు. శుక్రవారం రాత్రి వరకూ కూడా మరుసటిరోజు చర్చలకు సంబంధించి అస్పష్టతనే నెలకొని ఉంది. కాల్పుల విరమణ చర్చల దశలో కూడా కన్పించడం లేదు. ఇరు పక్షాలు పట్టుదలతో ఉన్న కీలక అంశాలతో సీజ్ఫైర్ ముందుకు సాగుతుందా? అనేది ప్రశ్నార్థకం అయింది. ముందు తాత్కాలిక శాంతి, తరువాత శాశ్వత రీతిలో రాజీకి వీటుగా చర్చలు జరగాల్సి ఉంది. అయితే లెబనాన్లోని ఇరాన్ మద్దతు హెజ్బోల్లాపై ఇజ్రాయెల్ దాడులు , గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికీ ఇరాన్ వీడని ప్రతీకార దాడులతో చర్చలకు ముందుగానే సంకట స్థితి ఏర్పడిందని దౌత్యవర్గాలు తెలిపాయి. ఇరాన్ పది అంశాల ప్రతిపాదనను పాకిస్థాన్ దాచిపెట్టిందని అమెరికా విమర్శిస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగేవరకూ చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇది చర్చలకు ముందు తమ షరతు అని తెలిపారు. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ దళాలకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ టాస్నిమ్ తెలిపింది. ఇప్పటి సీజ్ఫైర్ను ఇరాన్ గౌరవించడం లేదని, హర్మూజ్పై పట్టువీడటం లేదని అమెరికా అధ్యక్షులు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ పద్థతి ఏమి బాగా లేదని వ్యాఖ్యానించారు. శాంతిచర్చలకు ఇరాన్ కనీస పక్షంగా అయినా గౌరవం ఇవ్వకపోతే ఇక ఇవి ముందుకు కదులుతాయా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇరాన్ నుంచి తమ గగనతలం ద్వారా డ్రోన్ దాడి జరిగిందని కువైట్ విమర్శించింది. ఇరాన్, ఈ ప్రాంతంలో ఇరాన్ మద్దతు సాయుధ బలగాలు ఈ చర్యకు పాల్పడ్డాయని తెలిపారు. అయితే ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ఈ వాదనను తోసిపుచ్చాయి. తమ నుంచి జరగని దాడులను తాము చేసినట్లుగా చెప్పడం కుదరదని తెలిపారు. పరస్పర వాదోపవాదాలు సాగుతూ ఉన్నా , పాకిస్థాన్ వేదికగా చర్చలకు జోరుగా రంగం సిద్ధం అయింది. పాకిస్థాన్లో చర్చల దశలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్తో తమ దేశ ప్రతినిధి బృందం చర్చలకు అంగీకరించారు. ఇవి వచ్చే వారం అమెరికాలోని వాషింగ్టన్లో జరుగుతాయని యుఎస్ అధికారి ఒకరు తెలిపారు. అయితే నిర్థిష్ట తేదీ, చర్చనీయాంశాల గురించి తాము చెప్పలేమని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య నేరుగానే చర్చలు ఉంటాయని వెల్లడైంది. అయితే హెజ్బోల్లా అనధికారిక సమాంతర బలగాల వ్యవస్థ కావడం,ఈ మిలిటెంట్లతో చర్చల విషయం ప్రస్తావనకు రాకపోవడంతో ఈ వాషింగ్టన్ వేదిక ఫలితం ఇస్తుందా? అనేది సందేహంగా మారింది. చర్చలలో విస్తృత అజెండా ఉంటుంది. ఇరాన్ అణు కార్యక్రమ వివాదాలు, హర్మూజ్ మార్గం, ప్రాంతీయ సుస్థిరత కీలక అంశాలు కానున్నాయి. ఇరాన్పై ఆంక్షల పర్వం కూడా ప్రస్తావనకు వస్తుంది. వీటి నుంచి తమకు పూర్తి స్థాయి ఊరటను కల్పించాలని ఇరాన్ పట్టుపడుతోంది. ప్రాంతీయ శాంతిస్థాపనకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సక్రమ రీతికి హర్మూజ్ పునరుద్ధరణ విషయాలు కీలకం కానున్నాయి.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని శాఖలు 2047 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్షంగా ఆదాయం పెంచుకోవాలని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సచివాలయంలో రెవిన్యూ జనరేషన్, రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. స మావేశంలో సభ్యులు, మంత్రులు ఉత్త మ్ కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ల తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ ఏఐ వంటి ఆధునిక టె క్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో ప న్నుల ద్వారా వస్తున్న ఆదాయంపై ని రంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణ తో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తుందన్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖ ల్లో ఆదాయ వనరులను పెంచుకోగలిగామని తెలిపారు. అధికారులు మరిం త పకడ్బందీగా పనిచేసి ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వంటి అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు. నిరంతరం సమీక్షలు, పన్ను ల నిర్వహణలో పకడ్బందీ చర్యల మూలంగా కమర్షియల్ టాక్స్ శాఖలో జిఎస్టీ ఆదాయం గత మూడు నెలలుగా 15 శాతం పెరుగుదల కనిపించిందని డిప్యూటి సిఎం వివరించారు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ శాఖలో సైతం ఆదాయంలో పెరుగుదల కనిపించిందన్నారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రతి శుక్రవారం రెవిన్యూ జనరేషన్, రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని డిప్యూటి సిఎం తెలిపారు. 2047 వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నామని, ఈ మేరకు అన్ని శాఖలు ఆదాయ సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆయన స్పష్టం చేశారు. భూముల విలువ పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేశారని, ఆ కమిటీల నివేదికలను ముందుగా సబ్ కమిటీకి సమర్పించి ఆ తర్వాత క్యాబినెట్ కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను డిప్యూటి సిఎం ఆదేశించారు. అధికారులు ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు యాక్షన్ రిపోర్టుతో తదుపరి సమావేశానికి రావాలన్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ఈ అంశంపై అందరికీ ముందస్తుగా సమాచారం అందడం మూలంగా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపైన అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవిన్యూ, పరిశ్రమల శాఖలోనూ ఆదాయం పెంపునకు సంబంధించి చేపట్టిన చర్యలు ఫలితాలపై మంత్రులు సమీక్ష చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఇటీవలే కాం గ్రెస్ పార్టీని వీడిన జీవన్రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిం దే. ఆ ప్రకటన తర్వాత తొలిసారిగా శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో ఆయన కెసిఆర్తో సమావేశమయ్యారు. జీవన్రెడ్డిని కెసిఆర్ సాదరంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకుని, శాలువాతో సన్మానించారు. అంతకు ముందు ఎర్రవెల్లికి చే రుకున్న జీవన్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈ శ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు.ఈ సం దర్భంగా జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారు లు, జగిత్యాల జెడ్పి మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. కెసిఆర్ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు..” అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కెసిఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చాలా కాలం తర్వాత కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపు కెసిఆర్, జీవన్రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్న తర్వాత కెసిఆర్ను ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో భవిష్యత్ కార్యచరణతో పాటు పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. బిఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. సిఎం చెప్పినట్లు టిపిసిసి నడుస్తుంది : జీవన్రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు టిపిసిసి నడుస్తుందని జీవన్రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి వల్ల అధిష్ఠానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందని పేర్కొన్నారు. కెసిఆర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, ఆ సభకి కెసిఆర్ను ముఖ్య అతిథులుగా రావాలని విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. తాను అధికార బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళట్లేదని అన్నారు. పదవుల కోసమే బిఆర్ఎస్లోకి వెళ్లాలంటే తాను పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళేవాడిని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అని, ఇచ్చింది 17 వేల ఉద్యోగాలు మాత్రమే అని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని, రెండో సంవత్సరం లక్ష ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లు అయినా ప్రజాహితం కోసం పని చేయాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందని అన్నారు.-
ట్రైబల్ వర్సిటీ కోర్సులకు ఐఐటిహెచ్ సహకారం
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ విశ్వ విద్యాలయాన్ని ములుగు జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతికి ప్రధాని నరేంద్ర మోడీ సుముఖత వ్య క్తం చేశారని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీఆర్డీఓ మాజీ చై ర్మన్ డాక్టర్ జి.సతీష్రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించనున్నారు. అలాగే అధ్యాపకులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించి సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. ఎస్ఎస్సిటియు(సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్శిటి)లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రయోగశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇంటర్న్షిప్, వర్క్షాపు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు. అలాగే ఎస్ఎస్సిటియు అధ్యాపకులకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ అందించనుంది. బోధనలో మెళుకువలు పెంపొందించేందుకు వర్క్షాప్లు, సెమినార్లు, అతిథి ఉపన్యాసాలను నిర్వహిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎస్ఎస్సిటియులో సాంకేతిక కోర్సుల నిర్వహణకు ఐఐటీ హైదరాబాద్ సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బీటెక్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ లో బీఎస్, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్లో బీఎస్ వంటి కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ కోర్సులను బోధించే ఎస్ఎస్సిటియు అధ్యాపకులకు శిక్షణ బాధ్యతను ఐఐటీ హైదరాబాద్ చేపడుతుంది. ఐఐటీ హైదరాబాద్ మార్గదర్శకత్వంలో నిర్వహించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందుతూ, ప్రాంతీయ విద్యా అభివృద్ధికి దోహదం చేయనుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి ‘సమ్మక్క-సారక్క’ అమ్మవార్ల పేరును పెట్టాలని తాను ప్రధాని నరేంద్ర మోడీని కోరడంతో వెంటనే అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల తరఫున ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి తాత్కాలిక క్యాంపస్ను ములుగులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రెండు ప్రముఖ కేంద్ర విద్యాసంస్థలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్కు ఈ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ మొదటి నుంచే అవసరమైన మద్దతు అందిస్తోందని, ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ కూడా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషకరమని ఆయన తెలిపారు. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్, ట్రైబల్ యూనివర్సిటీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం చాలా ప్రాముఖ్యత కలిగినదన్నారు. ప్రధాని దూర దృష్టితో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గించడమే ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశ్యం అని ఆయన స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని ‘జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం’గా నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో రాంజీ గోండు, కొమరం భీమ్ వంటి గిరిజన వీరుల స్మారకంగా ట్రైబల్ మ్యూజియం నిర్మాణం చేపట్టామని భూమి పూజ పూర్తయిందని ఆయన వివరించారు. ఈ సంవత్సరం చివరికి మ్యూజియాన్ని ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ‘ప్రధానమంత్రి జన్ మన్ యోజన’ వంటి పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గిరిజనుల విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై రాజస్థాన్ రాయల్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బర్సాపరా స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. జురేల్ 81, జడేజా 24 నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. సూర్యవంశీ 26 బంతుల్లోనే 8 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును కెప్టెన్ రజత్ పటిదార్ (63), విరాట్ కోహ్లి (32) ఆదుకున్నారు.
శనివారం రాశి ఫలాలు (11-04-2026)
మేషం ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభం వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మిధునం స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహం దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. కన్య దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. తుల ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదర స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చికం వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ధనస్సు నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. మకరం ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది. కుంభం రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మీనం ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతనప్రణాళికలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన జైస్వాల్ 8 బంతుల్లో 2 సిక్స్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ అండతో వైభవ్ జోరును కొనసాగించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన వైభవ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. అసాధారణ బ్యాటింగ్ను కనబరిచిన సూర్యవంశీ 26 బంతుల్లోనే 8 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. తాజా సమాచారం లభించే సమయానికి రాజస్థాన్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును కెప్టెన్ రజత్ పటిదార్ (63), విరాట్ కోహ్లి (32) ఆదుకున్నారు.
రూ.54.90 కోట్లతో బీడీ ఆకు పథకం అమలు
రాష్ట్ర వ్యాప్తంగా బీడీ ఆకుల సీజన్ 2025కి సంబంధించి 30 జిల్లాల్లోని 37 డివిజన్లలో బీడీ ఆకుల పథకం అమలుకు గాను అటవీ, పర్యావరణ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్లో రూ.54.90 కోట్లతో బీడీ ఆకుల పథకం అమలుకు అటవీ శాఖ ప్రధాన సంరక్షునికి అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఏజెంట్గా ఉంటూ బీడీ ఆకుల కొనుగోలు, వ్యాపారానికి బాధ్యత వహిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా అటవీ అభివృద్ధి సంస్థ ఇందుకు అవసరమైన రుణాలను కన్సార్టియం బ్యాంకుల నుంచి పొందేందుకు కూడా అనుమతిచ్చింది.
ఉచిత చీరల తయారీకి టెస్కోకు రూ.450 కోట్ల ఆర్డర్
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కోటి చీరల తయారీకి గాను టెస్కోకి ప్రభుత్వం రూ.450 కోట్ల ఆర్డర్ ఇచ్చిందని అధికార వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్చ్. మెప్మాల సీఈవో దివ్యా దేవరాజ్లు చీరల్లో వివిధ నమూనాలను సిద్ధం చేయగా, ఈసారి చిలకపచ్చ రంగు. ఎరుపు జరీ డిజైన్తో చీరను ముఖ్యమంత్రి ఎంపిక చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నేత కార్మికులకు టెస్కో ద్వారా చీరలు తయారు చేసి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అక్టోబరు నాటికి చీరలను సిద్ధం చేస్తే నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ హై కోర్టులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన ధర్మాసనం వారం రోజుల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటిలోగా సంబంధిత కోర్టులో రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ను ఆదేశించింది. పవన్ ఖేరా మందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ భార్య స్థానిక సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని, ఈ పిటిషన్పై విచారించే పరిధి కోర్టుకు ఉంటుందని తెలిపారు. పిటిషనర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ గురించి అస్సాం సిఎం అనుచితంగా మాట్లాడడంతో పాటు ఢిల్లీలోని ఆయన ఇంటికి సుమారు 100 మంది పోలీసులు పంపించడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. అస్సాం ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ పిటిషనర్పై నమోదయ్యింది సాధారణ పరువునష్టం కేసు కాదని, ఆరోపణలు చేయడానికి పలు నఖిలీ పత్రాలు వినియోగించారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ హైదరాబాద్ నివాసిని అంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. కాగా, అస్సాం సిఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మకు మూడు పాస్ పోర్టులు, విదేశాల్లో ప్రకటించని ఆస్తులు చాలానే ఉన్నాయని, పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై గుహవాటి పోలీస్ స్టేషన్లో పరువునష్టం కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు మంగళవారం ఢిల్లీలోని ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. హైదరాబాద్ లో భార్య నీలిమ ఇంటికి వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరా పిటిషన్ దాఖలు చేశారు.
చినూక్ నుంచి ఎయిర్డ్రాప్ పరీక్ష
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం ప్రతిష్టాత్మక గగన్యాన్ యాత్ర దిశలో ఓ అడుగు వేసింది. అత్యంత కీలకమైన రెండో ఇంటిగ్రేడెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ( ఐఎడిటి 02)ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా నిర్వహించారు. చినూక్ హెలికాప్టర్తో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి క్రూ మాడ్యుల్ను జారవిడిచే ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయాణంలో వ్యోమగాముల సురక్షిత ప్రయాణం దిశలో ఈ ప్రక్రియ అత్యవసరం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం విజయవంత పరీక్ష పట్ల కేంద్ర ఎర్త్సైన్స్ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సిబ్బందిని, సైంటిస్టులను అభినందించారు. వచ్చే ఏడాది గగన్యాన్ మిషన్ నిర్వహిస్తారు. క్రూ మోడల్ రికవరీ గగన్యాన్ ప్రక్రియలో అత్యంత కీలకమైనది. దీనిని పలుసార్లు పరీక్షించిన తరువాత గగన్యాన్ తేదీ వివరాలు ఖరారు అవుతాయి.
కులగణన వ్యాజ్యం కొట్టివేసిన సుప్రీంకోర్టు
కులాల వారి గణనను నిలిపివేయాలనే ప్రజావ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన పిటిషనర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా మందలించారు. పిటిషన్లో వాడిన పదజాలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో అనుచిత భాష వాడారు. ఎవరు ఈ పిటిషన్ మీకు రాసి ఇచ్చారని ప్రదాన న్యాయమూర్తి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2027 జనాభా లెక్కల ప్రక్రియను ప్రకటించింది. ఇందులో కులాల వారిగా జనసంఖ్యను సేకరించడం, తొలిసారిగా డిజిటల్ సెన్సస్ ప్రక్రియలను చేర్చారు. కులగణనకు సరైన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంటూ పిటిషనర్ పిల్లో వాడిన పదాలు వివాదాస్పదం అయ్యాయి.
ఉన్మాది వికృత చేష్టలకు యువతి బలి
తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటుందనే అక్కసుతో ఓ ఉన్మాది వికృత చేష్టలకు ఓ యువతి బలవన్మరణానికి పాల్పిడింది. ఈ సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న కందికొండ చిరంజీవి కుమార్తె రమణి (24)కి సమీప బంధువు వరుసకు బావ అయ్యే మనోహర్ (25)తో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో కొద్ది రోజులకు మనోహర్కు హెచ్ఐవీ ఉందని తెలియడంతో సదరు యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో మనోహర్ ఉన్మాదిగా మారాడు. తనను కాదని వేరే పెళ్లి చేసుకొని ఎలా ఆనందంగా ఉంటావంటూ ద్వేషం పెంచుకొని,గత సంవత్సరం మే నెలలో ఇంజెక్షన్ ద్వారా హెచ్ఐవీ రక్తం రమణికి బలవంతంగా ఎక్కించాడు. ఈ క్రమంలో యువతి అనారోగ్యానికి గురి కావండంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించగా హెచ్ఐవీ అని నిర్ధారణ కావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మనోహర్ను ఆరెస్టు చేసి రిమాండ్కు పంపించగా నాటి నుంచి యువతి మనోవేధనకు గురైంది. దీంతో మనస్థాపంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి అమ్మానాన్న నన్ను క్షమించండి, మరో జన్మంటూ ఉంటే మీ కడుపున పుడతాను, చెల్లి, తమ్ముడు అమ్మానాన్నను మంచిగా చూసుకొండి అని లెటర్ రాసి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రమణిని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కీలక బిల్లుతో కోడ్ ఉల్లంఘన..మోడీ సర్కారు తీరుపై సిడబ్లుసి నిరసన
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళా బిల్లు, చట్టసభలలో సీట్ల పెంపుదలకు కేంద్రంచర్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (కోడ్) ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. శుక్రవారం ఇక్కడ ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సమావేశంలో మాట్లాడారు. డిలిమిటేషన్తో నిమిత్తం లేకుండా మహిళా కోటా పెంపుదలకు, ఎంపీ స్థానాల పెంపుదలకు మోడీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకూ ప్రత్యేక సిట్టింగ్లకు దిగుతోంది. రాజ్యాంగ సవరణల బిల్లులను ఆదరాబాదరగా చేపట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. పైగా కోడ్ నేలరాయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కేంద్రం చర్యలను సంఘటితంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్థిష్ట వ్యూహం రూపొందించుకుంటుందని తెలిపారు. ఇప్పుడు సిడబ్లుసి సమావేశం కూడా ఈ దిశలోనే ఏర్పాటు చేశామని ఖర్గే వెల్లడించారు. శుక్రవారం నాటి సమావేశానికి ఖర్గే అధ్యక్షత వహించారు. పార్టీ ప్రముఖ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, జై రాం రమేష్ ఇతరులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్నాటక సిఎం సిద్ధరామయ్య, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ ఛన్నీ , మాజీ స్పీకర్ మీరా కుమార్, అంబికా సోనీ, ఆనంద్ శర్మ కూడా హాజరయ్యారు. ఇంతకాలం మౌనంగా ఉంటూ వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు మహిళా రిజర్వేషన్లపై వేగం పెంచింది. అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణలను కూడా ఎటువంటి చర్చలకు అవకాశం లేకుండా చేసుకుని ఆమోదింపచేసుకునేందుకు పావులు కదుపుతోందని ఖర్గే ఆరోపించారు. ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని, ఇతర విపక్షాలతో కలిపి దీనిని ఎదుర్కొంటామని ప్రకటించారు.
మైనర్ బాలికపై మైనర్ బాలుడి లైంగిక దాడి
మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక, తులసీరామ్ నగర్కు చెందిన మైనర్ బాలిక (13)కు ఇన్స్ట్రాగ్రామ్ రీల్స్ ద్వారా కాచిగూడ, గోల్నాక ప్రాంతానికి చెందిన బాలుడు పరిచయమయ్యాడు. మైనర్ బాలికతో స్నేహం పెంచుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడిని జువెనైల్ కోర్టులో హాజరు పరిచి జువెనైల్ హోమ్కు తరలించినట్లు ఇన్స్స్పెక్టర్ తెలిపారు.
నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం
విశాలాంధ్ర – విజయవాడ (లబ్బీపేట) : నగరంలోని సీతారాంపురం కేపీ టవర్స్ లో ఐబాకో నూతన బ్రాంచ్ ను కెపి టవర్స్ ఏ బ్లాక్ అసోసియేషన్ సెక్రటరీ వి. రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ఐబాకో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐబాకో కంపెనీ టీమ్ మెంబర్స్ శరత్, రమణ, కేపీ టవర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. The post నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం appeared first on Visalaandhra .
హీరో, టివికె నేత విజయ్ సినిమా జననాయగన్ విడుదలకు ముందే ఐదు నిమిషాల నిడివి సీన్లు లీక్ కావడం దుమారం రేపింది. ఆన్లైన్లో శుక్రవారం సినిమా క్లిప్స్ వాట్సాప్, టెలిగ్రామ్లలో కన్నించాయి. ఈ అంశంపై సినిమా నిర్మాతలు కెవిఎన్ ప్రోడక్షన్స్ వారు వెంటనే స్పందించారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే తమ సినిమాలోని కొన్ని సన్నివేశాలు బయటకు వచ్చాయని, వీటిని ఎవరో అక్రమంగా సేకరించి, దురుద్ధేశపూరితంగా ఆన్లైన్లో పెట్టారని, ముందు కొంత మేరకే లీక్ అయిందని అనుకున్నామని నిర్మాతల తరఫు న్యాయవాది విజయన్ సుబ్రమణ్యం తెలిపారు. అయితే సినిమా మొత్తానికి సంబంధించి లింక్లు తరువాత వెలుగులోకి వచ్చాయని స్పందించారు. ఈ పైరసి చర్యకు వ్యతిరేకంగా నిర్మాతలు చట్టపరమైన చర్యలకు దిగారు. కారకులు కొందరిని గుర్తించామని తెలిపారు. ప్రతి సినిమాను ఎంతో భావోద్వేగంతో తీస్తారని, వందలాది మంది సినీ కార్మికుల నెత్తురు చెమట చిందిస్తారని , దీనిని నీరుగార్చే ఈ విధమైన పైరసీలను నిలిపివేయాలని నటుడు శివకార్తికేయన్ తీవ్రంగా స్పందించారు. సినిమా నిర్మాతలు, పంపిణీదార్లు వెంటనే చెన్నైలోని ప్రాంతీయ సెన్సార్ అధికారితో మాట్లాడారు. తక్షణం ఈ అంశంపై స్పందించాలని కోరారు. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖతో మాట్లాడేందుకు ఆయన అంగీకరించారని, క్లిప్పులు లింక్ల తొలిగింపునకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ చిట్టచివరి చిత్రంగా ప్రచారం పొందిన ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కావల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో సినిమా వాయిదాపడుతూ వచ్చింది. విడుదల కాని ఈ సినిమా సన్నివేశాల లీక్పై పలువురు చిత్రప్రముఖులు స్పందించారు. ఇటువంటి పైరసీలతో చిత్ర పరిశ్రమ దెబ్బతింటుందని అగ్రశ్రేణి నటులు, నిర్మాతలు, దర్శకులు, పంపిణీదార్లు విమర్శించారు.
ఎప్స్టీన్తో సంబంధాలు.. స్పందించిన మెలానియా ట్రంప్
వాషింగ్టన్లో వైట్ హౌస్లో గురువారం విడుదల చేసిన ప్రకటనలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అబ్బద్ధమని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. అలాగే ఆయన నేరాల గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను పూర్తి అసత్యాలుగా పేర్కొంటూ, ఇవి తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలని విమర్శించారు. నన్ను అవమానకర వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్తో అనుసంధానించే అబద్ధాలు ఇవాళ్టితోనే ముగియాలి. నా గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారికి నైతిక విలువలు, వినయం, గౌరవం లేవు. వారి అజ్ఞానంపై నాకు అభ్యంతరం లేదు కానీ నా ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న వారి దుష్ప్రయత్నాలను నేను ఖండిస్తున్నాను అని మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్లో స్వయంగా ప్రకటన చదివిన ఆమె, ఎప్స్టీన్తో తనకు ఎలాంటి అనుబంధం లేదని పునరుద్ఘాటించారు. న్యాయవాదులతో కలిసి ఈ నిరాధార ఆరోపణలను విజయవంతంగా ఎదుర్కొన్నాం అని తెలిపారు. ఇక ఎప్స్టీన్ కేసులో బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రజా విచారణ నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు తన కథను బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండాలి. అప్పుడు మాత్రమే నిజం వెలుగులోకి వస్తుంది అని పేర్కొన్నారు. ఈ ప్రకటన, ఇటీవలి కాలంలో ఎప్స్టీన్ వివాదం తగ్గుముఖం పట్టిన వేళ వెలువడటం గమనార్హం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వివాదం నుంచి బయటపడుతున్నట్టుగా కనిపిస్తున్న సమయంలో, మెలానియా వ్యాఖ్యలు మళ్లీ ఈ అంశాన్ని రాజకీయ చర్చల్లో ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. తనకు ఎప్స్టీన్ లేదా గిస్లేన్ మ్యాక్స్వెల్తో వ్యక్తిగత స్నేహం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే న్యూయార్క్, ఫ్లోరిడా ప్రాంతాల్లో సామాజిక వర్గాల్లో కొంత పరిచయం ఉన్నట్లు తెలిపారు. మ్యాక్స్వెల్కు పంపిన ఈ మెయిల్ సమాధానం సాధారణ మర్యాదపూర్వక స్పందన మాత్రమేనని, దానిని వేరే విధంగా అర్థం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు.
చాలా గర్వంగా ఉంది: అభిమానులపై అల్లు అర్జున్ #AlluArjun#HPVVaccine#FanService#HealthAwareness
Melania Fired : అయ్యో.. మెలానియా Andhra Prabha Top Story
Melania Fired : అయ్యో.. మెలానియా Andhra Prabha Top Story (
యమునా నదిలో పడవ బోల్తా పడి 10 మంది మృతి..పలువురు గల్లంతు
ఉత్తరప్రదేశ్లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. బృందావన్ లోని యమునా నదిలో పడవ బోల్తా పడి, మునిగిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పడవలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది పంజాబ్కు చెందిన యాత్రికులు ఉన్నారు. కేసీ ఘాట్ సమీపంలో రెండు డజన్లకు పైగా పర్యాటకులను తీసుకెళ్తున్న పడవ లోతైన నీటిలోకి వెళ్లిన సమయంలో తేలియాడుతున్న పాంటూన్ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నీటి మట్టం పెరగడంతో అక్కడ ఉన్న పాంటూన్ వంతెనను తొలగించగా, కొన్ని పాంటూన్ డ్రమ్స్ నదిలోనే మిగిలిపోయాయి. వాటిలో ఒకదానిని పడవ ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాశ్ సింగ్ తొలుత ఆరుగురు మృతి చెందినట్లు వెల్లడించగా, అనంతరం మరిన్ని నాలుగు మృతదేహాలను రక్షక బృందాలు వెలికి తీయడంతో మృతుల సంఖ్య 10కు చేరిందని జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. ఇప్పటివరకు 16 నుంచి 17 మందిని సురక్షితంగా రక్షించాం. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది అని ఆయన తెలిపారు. బృందావన్ జాయింట్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 50 మంది స్థానిక గజదళాలను కూడా గాలింపులో పాల్గొనిస్తున్నారు. స్థానిక డ్రైవర్ గులాబ్ తెలిపిన ప్రకారం ఇప్పటివరకు సుమారు 15 మందిని బయటకు తీశారు. ఈ యాత్రికులు పంజాబ్లోని లుధియానా, ముక్తసర్ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది భక్తుల బృందంలో భాగంగా బృందావన్కు చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం గాలివానల ప్రభావంతో పడవ ఒక్కసారిగా అదుపు తప్పి ఊగిసలాడింది. వేగం పెరగడంతో పాంటూన్ నిర్మాణాన్ని ఢీకొని తిరగబడింది. అయితే అధికారులు మాత్రం ఇటీవల తొలగించిన పాంటూన్ వంతెన అవశేషాలైన తేలియాడే డ్రమ్ను ఢీకొనడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. పోలీసులు, జిల్లా అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోతైన ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం గజదళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సిఎం చెప్పినట్లు టిపిసిసి నడుస్తుంది : జీవన్రెడ్డి
సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు టిపిసిసి నడుస్తుందని జీవన్రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి వల్ల అధిష్టానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందని పేర్కొన్నారు. కెసిఆర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, ఆ సభకి కెసిఆర్ను ముఖ్య అతిథులుగా రావాలని విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. తాను అధికార బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళట్లేదని అన్నారు. పదవుల కోసమే బిఆర్ఎస్లోకి వెళ్లాలంటే తాను పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళేవాడిని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అని, ఇచ్చింది 17 వేల ఉద్యోగాలు మాత్రమే అని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని, రెండో సంవత్సరం లక్ష ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లు అయినా ప్రజాహితం కోసం పని చేయాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందని అన్నారు.-
అబిడ్స్లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తాం: కిషన్ రెడ్డి
హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ గిరిజన వర్సిటీ-ఐఐటి హైదరాబాద్ మధ్య ఒప్పందం కుదిరింది. ఎంసిఆర్హెచ్ఆర్డిలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర గిరిజన వర్సిటీని ముందు మహబూబ్నగర్లో పెట్టాలనుకున్నామని.. కానీ కేంద్రం ములుగులోనే గిరిజన వర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ ఏడాది ప్రధాని మోడీ గిరిజన వర్సిటీకి భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. రెండు కేంద్ర సంస్థలు గిరిజన వర్సిటీకి సహకారం అందిస్తాయని అన్నారు. సమ్మక్క-సారలమ్మ యూనివర్సిటీ భవిష్యత్లో గొప్ప అభివృద్ధి సాధిస్తుందని.. గిరిజనులకు కావాల్సిన ఆధునిక సాంకేతికతను అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అబిడ్స్లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్రం రూ.24 వేల కోట్లతో అభివృద్ధి చేస్తుందని అన్నారు.
మద్యం తాగి పట్టుబడితే వాహనం సీజ్ చేయవద్దు: హైకోర్టు
రాష్ట్ర హైకోర్టు వాహనదారులకు ఊరటనిచ్చేలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల్లో ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే, పోలీసులు వారి వాహనాన్ని సీజ్ చేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినంత మాత్రాన మోటారు వాహనాల చట్టం కింద వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. డంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లపై దాఖలయిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ ఈవి వేణుగోపాల్రావు ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయితే, ఆ సమయంలో అతనితో పాటు ఉన్న మద్యం తాగని స్నేహితులకు లేదా బంధువులకు వాహనాన్ని అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ అక్కడ ఎవరూ లేని పక్షంలో సదరు వ్యక్తికి సంబంధించిన బంధువులు లేదా స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించి వాహనాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఒకవేళ ఎవరూ వాహనం తీసుకెళ్లడానికి రాకపోతే మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనల ప్రకారం డ్రైవర్పై చలానా వేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం మాత్రమే చేయాలని, వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించకూడదని ధర్మాసనం తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటూ రోడ్డుపై వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, చట్టం పరిధిలో ఉన్న అధికారాలను మాత్రమే వినియోగించుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే మద్యం తాగుతూ వాహనాలు నడిపి పట్టుబడిన అనేక సందర్భాల్లో పోలీసులు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనం సీజ్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారనే వాదనల నేపథ్యంలో హైకోర్టు ఈ స్పష్టత ఇచ్చింది.
ఇరాన్, అమెరికా మధ్య శనివారం నాటి శాంతిచర్చలకు ఆతిధ్య వేదిక అయిన పాకిస్థాన్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇస్లామాబాద్లోనే కాల్పుల విరమణ చర్చలు జరుగుతాయి. దీనితో విదేశీ దౌత్యకార్యాలయాలు, దేశ పార్లమెంట్, ఇతర దేశాల ఆపీసులు, విలాసవంతమైన హోటల్స్ ఉండే రెడ్జోన్లో హై అలర్ట్ ప్రకటించారు. వాహనాల రాకపోకలను నియంత్రించారు. రెండు రోజులుగా ఇస్లామాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో పలు కీలక మార్గాలు దాదాపుగా నిర్మానుష్యం అయ్యాయి. న్రభుత్వ భవనాలు, కీలక రహదారుల్లో కట్టుదిట్టమైన పహారా ఉంది. పూర్తి తనిఖీల తరువాత కానీ పౌరుల కదలికలకు వీల్లేని పరిస్థితి ఉంది. దీనితో జనం విసుగెత్తారు. శాంతిచర్చలకు యుద్ధ వాతావరణం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. చర్చలు ఫలిస్తే అంతర్జాతీయంగా పాకిస్థాన్ ప్రతిష్ట పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇస్లామాబాద్ , ఇతర చోట్ల గురువారం నుంచే కార్యాలయాలకు సెలువులు ప్రకటించారు. ఇప్పటి చర్చలకు అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ సారధ్యంలో ఒక బృందం హాజరు కానుంది. ఈ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్కు బయలుదేరింది. ఇందులో ప్రత్యేక దూత స్టీవ్ వాట్కిఫ్, సీనియర్ సలహాదారు జెర్డ్ కుష్నేర్ ఉంటారని వెల్లడైంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ ఇస్లామాబాద్కు బయలుదేరారనే పాకిస్థాన్ వార్తలను ఇరాన్ ఖండించింది. వారు టెహరాన్లోనే ఉన్నారని , తొందరపాటు వార్తలు తగవని హితవు పలికింది. అయితే అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇరాన్ ప్రతినిధి బృందం దాదాపుగా పాకిస్థాన్ చేరుకుందని చెపుతున్నాయి. పది అంశాలపై ఇరాన్ పట్టు .. లెబనాన్పై యుద్ధం ఇజ్రాయెల్ బెట్టు అతికష్టంమీద చర్చలకు పాకిస్థాన్ మార్గం కల్పించినా, ఇవి వైరిపక్షాల వైఖరితో డోలాయమానంగానే మారాయి. కాల్పుల విరమణ ప్రాతిపదికగా తాము వెలువరించిన పది అంశాలపై నిర్థిష్టంగా అమెరికా ప్రతినిధి బృందం చర్చకు రావాల్సిందే అని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇక హెజ్బోల్లాపై తమ దాడులను ఆపేది లేదని, ఈ చర్చలకు వీటికి సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే తమ మిత్రపక్షం అయిన హెజ్బోల్లాపై దాడులను సహించేది లేదని, వాటిని నిలిపివేయాల్సిందే అని ఇరాన్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెబనాన్ అంశమే కీలకం లెబనాన్ అంశమే ఇప్పుడు కాల్పుల విరమణకు కీలక విషయం అయింది. పూర్తి స్థాయిలో శాంతిస్థాపన జరగాలంటే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా నిలిచిపోవాలని ఇరాన్ చెపుతోంది. అయితే ఇజ్రాయెల్ ఈ లింక్ కుదరదని స్పష్టం చేస్తోంది. ఇప్పటి కాల్పుల విరమణ ప్రక్రియకు హెజ్బోల్లాపై తమ దేశ దాడులకు ఎటువంటి సంబంధం లేదని నెతన్యాహూ ముందు తెలిపినా తరువాత లెబనాన్తో చర్చలకు అమెరికా వేదికగా అంగీకరించారు. ఇక మధ్యవర్తిగా పాకిస్థాన్ ఉండటంపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. పాక్ మధ్యవర్తిత్వాన్ని తమ దేశం అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ ఇజ్రాయెల్ను దుష్టశక్తి, మానవాళికి శాపం అని తిట్టిపోస్తూ వ్యాఖ్యలకు దిగడం తరువాత వీటిని ఉపసంహరించుకోవడం కీలక పరిణామాలు అయ్యాయి. ఇజ్రాయెల్ పట్ల పాకిస్థాన్ ద్వేషం ఏమిటనేది తెలిసిందని, ఇక ఈ దేశ మధ్యవర్తిత్వాన్ని తాము ఏ విధంగా అంగీకరిస్తామని నిరసనకు దిగారు. ఇక శాంతి చర్చల్లో పాకిస్థాన్ ఏ మేరకు సమతూకత పాటిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. తటస్థదేశంగా వ్యవహరించగలదా? చర్చలలో ఏదో ఒక పక్షం వైపు మొగ్గుచూపుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
Sahu Garapati delivers a 100 cr blockbuster in Malayalam
Telugu Producer Sahu Garapati is making massive waves across the South Indian film industry, adding a monumental achievement to his growing portfolio. His latest Malayalam production, Vaazha 2, has struck gold at the box office, grossing over ₹100 crore worldwide in just seven days. Backed by his renowned banner, Shine Screens, this blockbuster further cements […] The post Sahu Garapati delivers a 100 cr blockbuster in Malayalam appeared first on Telugu360 .
YSRCP Struggles to Respond On Mavigun: Rachamallu Hits Sharmila While She Slams Botsa’s Drama
The political confrontation between Y. S. Sharmila and Y. S. Jagan Mohan Reddy has escalated into a personal battle and Mavigun proposal emerging as a major flashpoint in Andhra Pradesh politics. Mavigun was projected by the YSR Congress Party as a serious developmental alternative to Amaravati, is now increasingly being viewed as an impractical idea […] The post YSRCP Struggles to Respond On Mavigun: Rachamallu Hits Sharmila While She Slams Botsa’s Drama appeared first on Telugu360 .
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బర్సాపరా స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ వేయడం ఆలస్యమైంది. అయితే వర్షం తగ్గు ముఖం పట్టడంతో 8.15 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకూ ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఆడిన మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పాయిట్ల టేబుల్లో మొదటి స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ ఒక మార్పు చేసింది. తుషార్కి విశ్రాంతి ఇచ్చి.. బ్రిజేష్ని జట్టులోకి తీసుకుంది. ఆర్సిబి కూడా ఒక మార్పు చేసింది. డఫ్ఫీ స్థానంలో హేజిల్వుడ్ని జట్టులోకి తీసుకుంది. అయితే టాస్ జరిగిన వెంటనే మళ్లీ వర్షం తిరిగి ప్రారంభమైంది. దీంతో అభిమానులు నిరాశ గురవుతున్నారు. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వీ జైస్శాల్, ధృవ్ జురెల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డానొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ. ఆర్సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్వుడ్.
బాలాపూర్లో బయటపడిన నిజాలు అపరిశుభ్రంగా మేక తలల నిల్వలు… #Balapur#PoliceRaid#SalamiIndustries
రియల్ మాఫియా అడ్డాగా కాంగ్రెస్ సర్కార్: సబితా ఇంద్రారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ మాఫియాకు అడ్డాగా మారిందంటూ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నాదర్గూల్ భూములపై ప్రభుత్వం కుట్రలు చేస్తున్నందంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ బృందం జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని కలసి నాదర్గూల్ భూ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నాదర్గూల్ సర్వే నెంబర్ 613లో గల 373 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కబ్జాకు గురవుతోందంటూ వారు ఫిర్యాదు చేశారు. సదరు భూమిని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సబిత మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గూల్ రెవెన్యూ పరిధిలోని 613 సర్వే నెంబర్లో గల 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని గతంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. హైకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే కొందరు అక్రమార్కులు ఈ భూములను కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సుమారు 600 మంది రైతులు మూడు నాలుగు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న ఈ భూముల్లో రౌడీలు, గూండాలను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నేతలు దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. పేదోళ్ల గుడిసెలపై బుల్డోజర్లతో విరుచుకుపడే హైడ్రాకు రూ.7 వేల కోట్ల విలువ చేసే 373 ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నా కన్పించడం లేదా అంటూ ఆమె మండిపడ్డారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్రెడ్డి, కేసీఆర్ల హయాంలో ప్రభుత్వ భూములను పరిరక్షించే యత్నం జరిగిందని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి భూ దోపిడీకి తెరతీశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా బౌన్సర్లు, గూండాలను అడ్డుపెట్టి రైతులను బెదిరించి బ్లూ షీట్స్ వేసి కండ్లముందే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములు ప్రభుత్వానివా లేక ప్రైవేటువా అన్న విషయం తక్షణమే నిగ్గుతేల్చాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ భూములను కబ్జా చెర నుంర విడిపించేంతవరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య, పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్, గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ కర్నాటి రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నోట్ల కట్టల వ్యవహారం.. జస్టిస్ యశ్వంత్వర్మ రాజీనామా
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసంలో కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఘటన తర్వాత ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్రక్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన 2025 మార్చి 14న హోలీ పండుగ రాత్రి సుమారు 11:35 గంటలకు లూటియన్స్ ఢిల్లీలోని న్యాయమూర్తి వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన సమయంలో భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. ఆ సమయంలో వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. ఏప్రిల్ 9న రాష్ట్రపతికి పంపిన లేఖలో 57 ఏళ్ల వర్మ, గాఢమైన మనోవేదనతో ఈ రాజీనామాను సమర్పిస్తున్నాను. ఈ పదవిలో సేవ చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. తన నిర్ణయానికి గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదని కూడా లేఖలో తెలిపారు. వర్మ రాజీనామాతో ఆయనను పదవి నుండి తొలగించేందుకు చేపట్టిన అభిశంసన ప్రక్రియ ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి ముందు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యలతో కూడిన మూడు సభ్యుల కమిటీ విచారణ నిర్వహిస్తోంది.ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు న్యాయమూర్తుల ప్రతికూల నివేదికల అనంతరం అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఇచ్చిన రాజీనామా సలహాను వర్మ తిరస్కరించారు. దీంతో ఖన్నా రాష్ట్రపతికి లేఖ రాసి అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించిన అభిశంసన తీర్మానాన్ని, దర్యాప్తు కమిటీ చెల్లుబాటు అంశాన్ని సవాలు చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు జనవరి 16న తిరస్కరించింది. పార్లమెంటరీ ప్రక్రియను అడ్డుకునేందుకు చట్టంలోని నిబంధనలను ఉపయోగించలేమని స్పష్టం చేసింది. గత ఏడాది ఆగస్టు 12న బహుళ పార్టీల మద్దతుతో ఆయనను తొలగించే తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. 2025 మార్చి 22న సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో వర్మ నివాసంలో నగదు నిల్వలపై అంతర్గత విచారణ నివేదికను, అసాధారణ చర్యగా ఫొటోలు, వీడియోలతో సహా ప్రచురించింది. అదే రోజు అప్పటి సీజేఐ ఖన్నా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను వర్మ ఖండించారు. నా కుటుంబ సభ్యులు లేదా నేను ఎప్పుడూ స్టోర్రూమ్లో నగదు ఉంచలేదు. ఆ నగదు మాకు సంబంధించినదని చెప్పడం పూర్తిగా తప్పుడు ఆరోపణ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే విచారణ కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయినా అత్యున్నత న్యాయస్థానంలోనూ ఆయనకు ఊరట దక్కలేదు. సుప్రీం ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. ఇక అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖలు రాశారు. జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని చేశారు. ఈ రాజీనామాతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్సభ సెక్రటేరియట్వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
బెంగాల్ ఎన్నికలు: బిజెపి మ్యానిఫెస్టో విడుదల
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ఎన్నికల హామీలను ప్రజల ముందుంచారు. కోల్కతాలో శుక్రవారం విడుదల చేసిన పార్టీ సంకల్ప పత్రాన్ని ఆయన స్పష్టమైన సిద్ధాంతాత్మక అజెండాగా మలుస్తూ, ఆరు నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, బెంగాల్ కుమారుడునే ముఖ్యమంత్రిగా నియమించడం, రాష్ట్రంలో రామ రాజ్యం స్థాపన వంటి హామీలను ప్రకటించారు. సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బెంగాల్లో ప్రతి పౌరుడికి ఒకే చట్టం ఉంటుంది అని షా స్పష్టం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలకు సమాధానంగా, ఇది బీజేపీ ఆలోచన కాదని, రాజ్యాంగ సభ సిఫారసు అని తెలిపారు. ప్రతి పౌరుడిని మతం ఆధారంగా కాకుండా సమానంగా చూడాలన్నది రాజ్యాంగ సూత్రం. ఒకరికి నాలుగు పెళ్లిళ్లు, మరొకరికి ఒక్కటి అనుమతించడం సమానత్వమా? అని ప్రశ్నించారు. బెంగాల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందిస్తూ, తమ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు దూరమని షా పేర్కొన్నారు. దీదీ తర్వాత ఆమె మేనల్లుడు నాయకుడవుతాడనే విధానం మా వద్ద లేదు అని అభిషేక్ బెనర్జీపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి బెంగాల్కు ముఖ్యమంత్రి బెంగాల్కు చెందినవారే అవుతారు. ఆయనకు పరిపాలనా సామర్థ్యం, అర్హత ఉండాలి అని తెలిపారు. రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడిపించాలనే ఆరోపణలను ఖండిస్తూ, బెంగాల్ను ఢిల్లీ నుంచి పాలించం. కానీ ఢిల్లీ నుంచి పాలించడం కన్నా బంగ్లాదేశ్ ప్రభావం ఉండటం మరింత ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ చొరబాటుదారుల అంశం మరోసారి ముందుకు వచ్చింది. చొరబాటుదారులు, శరణార్థుల మధ్య తేడాను స్పష్టం చేస్తూ, భారత పౌరులు కాని వారే చొరబాటుదారులు. వారిని బయటకు పంపిస్తాం. శరణార్థులకు పౌరసత్వం ఇస్తాం అని షా తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చొరబాటుదారులపై వైట్ పేపర్ విడుదల చేస్తామని కూడా చెప్పారు. ఇక టీఎంసీ నేత అఖిల్ గిరి చేసిన రామ రాజ్యం అవసరం లేదు అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, రామ రాజ్యం అంటే మంచి పరిపాలన. స్వాతంత్య్ర సమర కాలంలో మహాత్మా గాంధీ కూడా ఇదే పాలనను ప్రస్తావించారు అని షా పేర్కొన్నారు.
పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను అత్యంత అనుచితమైనవిగా అభివర్ణిస్తూ, శాంతి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకునే దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆందోళనకరమని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందిస్తూ, ఇజ్రాయెల్ నాశనం కావాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి పిలుపునివ్వడం అంగీకారయోగ్యం కాదు. ముఖ్యంగా శాంతి కోసం తటస్థ మధ్యవర్తిగా నిలుస్తున్నట్లు చెప్పుకునే ప్రభుత్వ ప్రతినిధి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యం అని పేర్కొంది. ఈ ప్రకటన గురువారం సాయంత్రం వెలువడింది.అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలికంగా రెండు వారాల కాలపరిమితి ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన దేశంగా పాకిస్తాన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో, రాబోయే వారాంతంలో శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతోంది. అయితే, ఇదే సమయంలో ఆసిఫ్ సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ను దుష్ట దేశం, మానవాళికి శాపంగా అభివర్ణిస్తూ, యూరోపియన్ యూదులను తొలగించాలని పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇస్లామాబాద్లో శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ లెబనాన్లో జన సంహారం జరుగుతోందని ఆసిఫ్ ఆరోపించారు. నిరపరాధ పౌరులు హతమవుతున్నారు. గాజా తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్క్త్రపాతం ఆగకుండా కొనసాగుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. పాలస్తీనా భూమిలో యూదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వారిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ ఖండించారు. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెప్పుకునే ప్రభుత్వ ప్రతినిధి నుంచి వచ్చిన ఈ వ్యతిరేక వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవి అని అన్నారు. ఇజ్రాయెల్ తన వినాశనాన్ని కోరుకునే ఉగ్రవాద శక్తుల నుంచి తనను తాను రక్షించుకుంటుంది అని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంటర్ ఫలితాల సమయం, వేదిక శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. అయితే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఈసారి త్వరగా అడ్వాన్స్డ్ పరీక్షలు ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు.
చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు
దివ్యజ్ఞాన సమాజం వ్యవహారం (విశాలాంధ్ర-చిత్తూరు) : చిత్తూరు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం… చిత్తూరు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కలెక్టరుకు రెండు వారాల గడువు విధించింది.హైకోర్టులో బలమైన వాదనలుబీసీ నేత బుల్లెట్ […] The post చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు appeared first on Visalaandhra .
‘వైశాఖి’ వేడుకలకు కెటిఆర్కు ఆహ్వానం
అమీర్పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ - ‘వైశాఖి’ వేడుకలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ను గురుద్వారా ప్రతినిధులు ఆహ్వానించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అమీర్పేట్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ ఎస్.దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం శనివారం కెటిఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్ 14) మధ్యాహ్నం 1.30 గంటలకు అమీర్పేట్లోని గురు గోవింద్ సింగ్జీ మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు.పంజాబ్కు చెందిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, ఈ వేడుకలకు సుమారు 8,000 నుండి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు వివరించారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని వారు కెటిఆర్ను కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్పేట్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Telangana : ఈ నెల 20న బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి
సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారయింది.
ఆర్సిబి, ఆర్ఆర్ మ్యాచ్.. వర్షం కారణంగా టాస్ వాయిదా..
గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా గౌహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్కి వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా టాస్ వేయడం వాయిదా పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు 6 పాయింట్లతో, +2.403 నెట్ రన్రేటుతో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు బెంగళూరు 4 పాయింట్లతో, +2.501 నెట్ రన్రేటుతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్2లో గెలిచిన జట్టు మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ సజావుగా జరుగుతుందో.. లేక వర్షం కారణంగా రద్దవుతుందో తెలియాలంటే.. ఇంకాసేపు వేచి చూడాల్సిందే.
Love Insurance Kompany (LIK) Review
Lik Movie Review Lik Movie Review Telugu360 Rating: 2/5 Pradeep Ranganathan has delivered blockbusters like Love Today, Dragon and Dude in the past. He emerged as one of the most bankable actors in Tamil and Telugu languages. All his super hit films are aimed for the youth of this generation and are new age love […] The post Love Insurance Kompany (LIK) Review appeared first on Telugu360 .
BRS : తెలంగాణలో కారు స్పీడు అందుకుందా?
తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుంది.
Ravi Babu’s Razor Releasing On A Special Date
Ravi Babu’s forthcoming thriller Razor is all set to hit the theatres this summer. The film, presented by Suresh Babu under the banner of Suresh Productions and produced by Flying Frogs, has already completed its shoot and the post-production works have also wrapped up. The makers have now officially locked May 8 as the theatrical […] The post Ravi Babu’s Razor Releasing On A Special Date appeared first on Telugu360 .
ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా శ్రీనివాస్
టేకుమట్ల, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన సన్మానం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణను ఆర్టిఐ
భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఙప్తి చేశారు
13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడి
హైదరాబద్: నగరంలోని కాచిగూడలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో నిందితుడు బాలికకు పరిచయమయ్యాడు. ఆ పాపతో స్నేహం పెంచుకొని లైంగిక దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడిని జువైనల్ హోమ్కు తరలించారు.
తహసీల్దార్ నరేష్కు ఘన సన్మానం
కొడిమ్యాల, ఆంధ్రప్రభ : కొడిమ్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన
అమరావతిపై పెట్టే ప్రతి పైసా కృష్ణా నదిలో పోసినట్టే
అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
కాన్వాయ్ ఆపి వ్యాపారుల సమస్యలు విన్న ఎమ్మెల్యే
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ : చిరు వ్యాపారుల సమస్యలను తెలుసుకునేందుకు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల
చిన్నపోర్లలో చెక్కులు పంపిణీ..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్లలో సర్పంచ్ గాండ్ల నిఖిత
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి..
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాన్ని పేదలకు పంచాలి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాన్ని పేదలకు పంచాలి సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ
Andhra Pradesh : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు
Chandrababu Warns Ministers After Cabinet Agenda Leak
A serious concern about information leaks dominated the Andhra Pradesh cabinet meeting, led by Chief Minister N. Chandrababu Naidu, in Amaravati. Even before the meeting began, key agenda points reached the media. The Chief Minister expressed strong displeasure and questioned how sensitive information was being leaked. Chandrababu made it clear that such leaks violate government […] The post Chandrababu Warns Ministers After Cabinet Agenda Leak appeared first on Telugu360 .
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని చైతన్య మోడల్
ఉత్తర్ప్రదేశ్లో పడవ ప్రమాదం, 9 మంది మృతి
మథురు: ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మథురలో యమున నదిలో పడప బోల్తా పడి 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పడవ బోల్తా పడటంతో పదుల సంఖ్యలో వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక చ్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొట్టడంతో ఈ పడవ బోల్తా పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కడపలో టెన్షన్.. ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
కడప జిల్లా ఖాజీపేటలో ఉద్రిక్తత నెలకొంది.
తీవ్ర ఆందోళనకు గురయ్యా: ‘జననాయగన్’ లీక్పై చిరంజీవి పోస్ట్ #Jananayagan#Vijay#Chiranjeevi
.. అట్టహాసంగా ప్రారంభమైన సిపిఐ, బీకేఎంయూ పాదయాత్ర .. అడుగడుగునా నీరాజనాలుమహిళల హారతులు, ఆకట్టుకున్న. కళాకారుల నృత్యాలు ఉపాధి హామీని కాపాడాలి.. వి.బి.జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి: నేతల డిమాండ్ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, గ్రామీణ పేదల కష్టార్జితానికి భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వి.బి.జి రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని […] The post కదం తొక్కిన ఎర్రసైన్యం appeared first on Visalaandhra .
హై అలెర్ట్..పాక్..ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్
భారత్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి
స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి జైనూర్, ఆంధ్రప్రభ ; వైద్యాధికారులు
ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు
విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా […] The post ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు appeared first on Visalaandhra .
మూడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్
గంట రవి జన్మదినోత్సవం అభివృద్ధి పనులకు శ్రీకారం
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; పుట్టినరోజు వేడుకలు పెళ్లిరోజు వేడుకలలో ఖర్చులు మాని సేవా
సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది
సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది జైనూర్, ఆంధ్రప్రభ ;
సీనియర్ జర్నలిస్ట్ బుర్ల వెంకటేశం మృతి
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేసిన బుర్ల వెంకటేశం ఆ
రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..
శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి […] The post రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది.. appeared first on Visalaandhra .
జనగణన విధుల కేటాయింపుపై వివాదం
జనగణన విధుల కేటాయింపుపై వివాదం నల్లబెల్లి, ఆంధ్రప్రభ : జనగణన–2027 విధుల నియామకంలో
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; శివారు ప్రాంతాల్లోని
మల్బరీ తోటను సందర్శించిన ఎంపీడీవో
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పట్టు
ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్
ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్ వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; వరంగల్ పోలీస్
‘జననాయగన్’ లీక్.. విజయ్కి మెగాస్టార్ సపోర్ట్
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో, టివికె పార్టీ అధినేత విజయ్ నటించి ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ అయిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించి ఐదు నిమిషాల వీడియో లీక్ అయింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ‘‘జననాయగన్’ చిత్రం దురదృష్టవశాత్తు లీక్ కావడం నన్నెంతో ఆందోళనకు గురి చేసింది. నమ్మకం, శ్రమ, ఎంతో మంది సమష్టి కలల సమాహారమే సినిమా. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్ వర్క్ని కాపాడుకోవడం ఎంత కీలకమో గుర్తు చేస్తుంటాయి. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై కెవిఎన్ ప్రొడక్షన్స్కు మద్దతుగా నిలుస్తాం. సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు మనమందరం మన మద్దతును అందిద్దాం’’ అంటూ మెగాస్టార్ పేర్కొన్నారు. The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me. Cinema is built on trust, effort, and the collective dreams of many. Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work. We stand one with KVN… — Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026
Vishwambara has to Revive UV Creations
Top production house UV Creations has been struggling to deliver a solid box-office success from years. Some of the big-ticket films failed badly and the production house is in a lot of stress. 2026 opened on a decent note with Couple Friendly and the film made decent money in February and ended up as a […] The post Vishwambara has to Revive UV Creations appeared first on Telugu360 .
ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని భుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరంలో 8వ తరగతి చదువుతున్న భాస్కర్ నాయక్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల్లో ఎన్నికై తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు అని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప తెలిపారు. విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ నాలుగు సంవత్సరాల పాటు 12 వేల రూపాయలు వంతున స్కాలర్షిప్ రావడం విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని తల్లిదండ్రులు తెలియజేశారు.2025-26 విద్యా సంవత్సరానికి ఎన్సిసి యూనిట్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ […] The post ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ appeared first on Visalaandhra .
మేడ్చల్లో కమిషనర్ సృజన సుడిగాలి పర్యటన
మేడ్చల్లో కమిషనర్ సృజన సుడిగాలి పర్యటన మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ సర్కిల్
మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు తొలుత ఫిర్యాదు చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడు ఆమెకు స్నాప్చాట్ ద్వారా పరిచయమైన ప్రియుడేనని తేలింది. వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న మహిళ, ఈ నెల 2న తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చిన […] The post మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్! appeared first on Visalaandhra .
పది రోజుల క్రితం ఉద్యోగంలో చేరిక.. కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరియాణాలో దారుణ హత్యకు గురయ్యాడు. బండ్ల రుషికేశ్(27) పది రోజుల క్రితం పంచకులవేది టెక్నాలజీస్ సంస్థలో చేరాడు. ఈ రోజు కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు బేతవోలులోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హరియాణాకు బయలుదేరారు. అయితే హత్యకు గల కారణాలు.. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ రైతు సంఘం మహాసభల కరపత్రం విడుదల
దండేపల్లి, ఆంధ్రప్రభ ; ఈ నెల 23, 24, 25,న భద్రాద్రి కొత్తగూడెం
టెక్ ప్రియులకు షాక్..పెరిగిన శాంసంగ్ ఫోన్ల ధరలు..
దక్షణ కొరియా స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్ భారతదేశంలో స్మార్ట్ఫోన్ల ధరలను మరోసారి పెంచింది. అయితే, ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంట్రీ-లెవల్ నుండి మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్లపై ధరలు పెంచిన కంపెనీ తాజాగా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను సవరించింది. ఇందులో గెలాక్సీ A, F సిరీస్ మూడేళ్లు ఉన్నాయి. ఈ మేరకు టిప్స్టర్ అభిషేక్ యాదవ్ సదరు ధరల పట్టికను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా, నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఏ మోడల్ పై ఎంత పెరిగిందో తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ A07 గెలాక్సీ A07 విషయానికి వస్తే..దీని 4GB + 64GB వేరియంట్ ధర గతంలో ఉన్న రూ.9,749 నుండి ఇప్పుడు రూ.10,999కి పెరిగింది. అంటే, ఇది సుమారుగా రూ.1,250 పెరుగుదలను సూచిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A06 5G గెలాక్సీ A06 5Gలోని వివిధ వేరియంట్లలో రూ.1,000 వరకు పెరిగింది. దీని 4GB + 64GB మోడల్ ధర ఇప్పుడు రూ.13,499. కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.15,499. అలాగే, 6GB + 128GB వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A07 5G గెలాక్సీ A07 5G వేరియంట్ల ధరలు కూడా మారాయి. 4GB + 128GB మోడల్ ధర ఇప్పుడు రూ.16,499. కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.18,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A17 5G అదేవిధంగా గెలాక్సీ A17 5G వేరియంట్ల ధరలు కూడా రూ.1,000- రూ.1,500 వరకు పెరిగాయి. 6GB + 128GB మోడల్ ధర రూ.21,499, 8GB + 128GB వేరియంట్ ధర రూ.23,499, 8GB + 256GB మోడల్ ధర రూ.27,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A36 మిడ్-రేంజ్ విభాగంలో గెలాక్సీ A36 ధర కూడా పెరిగింది. దీని ధరలు రూ.1,500 - రూ.3,000 వరకు పెరిగాయి. 8GB + 128GB వేరియంట్ ధర ఇప్పుడు రూ.33,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.37,999, 12GB + 256GB మోడల్ ధర రూ.43,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A56 గెలాక్సీ A56 ధర రూ.2,000 -రూ.3,500 వరకు పెరిగింది. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ.42,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.46,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ.52,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ F17 5G గెలాక్సీ F17 5G స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్ల ధరలు రూ.1,000 పెరిగింది. దీని 4GB + 128GB వేరియంట్ ధర రూ.17,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ.19,999,, 8GB + 128GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్
కొండగట్టు, ఆంధ్రప్రభ ; కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు
60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం Andhra Prabha News
60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం Andhra Prabha News (ఆంధ్రప్రభ, జెరుసలేం

28 C