అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ నూతన సుప్రీం మొజ్తాబా ఖమేనీ సురక్షితం
టెహ్రాన్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గాయపడినట్టు వార్తలు వచ్చాయి. వీటిని ఇరాన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగా, సురక్షితంగానే ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమారుడు యూసఫ్ వెల్లడించారు. మొజ్తాబా గాయపడినట్టు వస్తున్న వార్తలు తన దృష్టికి వచ్చాయని, ఆయన సన్నిహితుల నుంచి ఆరా తీయగా ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వారు చెప్పారని యూసఫ్ పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టిన తొలి రోజులోనే మొజ్తాబా తన భార్య, తండ్రి ఖమేనీతో సహా పలువురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఈ దాడుల్లో ఆయన కూడా గాయపడినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. పశ్చిమాసియాలో భీకరంగా పోరు సాగుతున్నా ఆయనకు కనిపించకపోవడం , ప్రజలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. సుప్రీం నేతగా ఇటీవల ఆయన ఎన్నికైనా ఆయన కార్యాలయం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో తలెత్తిన సందేహాలన్నీ తాజాగా ఇరాన్ అధ్యక్షుడి కుమారుడి ప్రకటనతో దూరమయ్యాయి.
పల్నాడులో నెదర్లాండ్స్ బృందం పర్యటన
పల్నాడులో నెదర్లాండ్స్ బృందం పర్యటన పల్నాడులో ప్రకృతి వ్యవసాయ నమూనాలపై నెదర్లాండ్స్ నిపుణుల
కావూరి సాంబశివరావు కన్నుమూత..ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను గురువారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహిం నున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కావూరి చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5 సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీ పట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు.యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. కావూరి సాంబశివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు అయిన శ్రీ భరత్... కావూరి సాంబశివరావుకు స్వయానా మనవడు (కుమార్తె కుమారుడు). రాష్ట్ర విభజన సందర్భంలో ఆయన సమైక్యాంధ్రకు మద్దతిచ్చారు. కావూరి సాంబశివరావు వరంగల్లోని ఆర్ఇసిలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. కావూరి మృతి పట్ల పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు. ఎపి సిఎం చంద్రబాబు సంతాపం ‘సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కావూరి సాంబశివరావు మృతి పట్ల ఎపి బిజెపి అధ్యక్షుడు మాదవ్ సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి పల్నాడు ప్రగతే చంద్రబాబు ధ్యేయం: ఎమ్మెల్యే
Hansika Motwani is now Divorced
Actress Hansika Motwani got married to businessman Sohael Khaturiya four years ago and they have been granted divorce by the Bandra Family Court in Mumbai today. Hansika appeared before the court and she appealed for separation by mutual consent. The family members and the friends tried to reconcile them but the efforts were not successful. […] The post Hansika Motwani is now Divorced appeared first on Telugu360 .
ఈ నెల 13న గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఈ నెల 13న గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన సూరంపల్లిలో ‘అన్నదాత సుఖీభవ’
మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు ఘన నివాళులు..
మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు ఘన నివాళులు.. పార్ధివ దేహానికి పూలమాల అర్పించిన
సమాజ సేవలో ఆదర్శం.. స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్
సమాజ సేవలో ఆదర్శం.. స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రామలింగేశ్వర
ప్రియుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా #Monalisa #Wedding #Thiruvananthapuram #NewsUpdate #TeluguNews
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM కిసాన్) లబ్ధిదారులకు శుభవార్త. 22వ విడత పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మార్చి 13న గౌహతి పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 22వ విడత నిధులను విడుదల చేస్తారు. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు సుమారు రూ.19,000 కోట్లు విడుదల చేయనున్నట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఫిబ్రవరి 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan)ను ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశంలోని అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు వాయిదాలలో రూ.6,000 పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
లోక్సభ స్పీకర్పై వీగిన అవిశ్వాసం..
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణం మూజువాణి ఓటుతో వీగిపోయింది. స్పీకర్ సభలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తు విపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి నేటి వరకూ సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్షాలు చేసిన విమర్శలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్పై మండిపడ్డారు. అనంతరం సభ గురువారానికి వాయిదాపడింది.
‘జైలర్- 2’ లో పోలీసు ఆఫీసర్ గా షారుఖ్ ఖాన్
సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రం ‘జైలర్- 2’. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. 2023లో విడుదలైన జైలర్కు సీక్వెల్గా ఈ చిత్రం రూపుదిద్దు కుంటోంది. ఈ సినిమాలో షారుఖ్ ప్రత్యేక పాత్రలో ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. ఈనెల చివరి వారంలో సెట్స్లోకి షారుఖ్ వస్తాడనీ, ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించనున్న సన్నివేశాలతో షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో శివరాజ్కుమార్, మోహన్లాల్ వంటి స్టార్ నటులు కథను మలుపు తిప్పే అతిథి పాత్రల్లో నటించారు.
ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు : జగపతిబాబు
ప్రముఖ నటుడు జగపతి బాబు బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ’వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బుధవారం మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరో జగపతిబాబు మాట్లాడుతూ “అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా భోపాల్లో చేశాం. భరద్వాజ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కార్తిక్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. తన నుంచే వదలా అనే టైటిల్ కూడా వచ్చింది. లయ ‘వదలా’లో అద్భుతంగా నటించింది. ఆముద పాత్రలో హ్రితిక కూడా చాలా చక్కగా నటించింది”అని అన్నారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ “డైరెక్టర్ వంశీ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి కథ నేనెప్పుడూ కూడా వినలేదు. చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు”అని తెలిపారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “జగపతి బాబుకి ఈ కథ చాలా నచ్చింది. కథ పై నమ్మకంతో ఈ సినిమా మొదలుపెట్టాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హృతికా శ్రీనివాస్, కిషోర్ నాయుడు, చోటా కె నాయుడు, కార్తీక్ పాల్గొన్నారు.
Jagapathi Babu’s Vadhala Teaser: Haunting Thriller
Jagapathi Babu who is busy with multiple films as a character artist is back to playing the lead in Vadhala, a suspense drama. Directed by Akella V Krishna and backed by producers Kishore Naidu Chirumamilla and Tammareddy Bharadwaj, the film also features Laya and Hrithika Srinivas in key roles. The newly released teaser opens with […] The post Jagapathi Babu’s Vadhala Teaser: Haunting Thriller appeared first on Telugu360 .
హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నర్సింహులపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన
స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే…
స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే… స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
విజయవంతంగా 100 రోజులు 100 గ్రామాలు
విజయవంతంగా 100 రోజులు 100 గ్రామాలు వంద రోజులు 100గ్రామాలు 50వ రోజు
విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తా…
విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తా… చిట్యాల,, ఆంధ్రప్రభ : పెద్ద కపర్తి
భద్రాద్రికి గోటి బియ్యం తలంబ్రాలు…
భద్రాద్రికి గోటి బియ్యం తలంబ్రాలు… చిట్యాల, ఆంధ్రప్రభ : శ్రీరామదాసు భక్తమండలి చేల్పూర్
శివాజీ వర్ధంతి వేడుకలు.. విజయవాడ, ఆంధ్రప్రభ: పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో
రక్షించండి.. ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు 'కుంభమేళా' మోనాలిసా
2025లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో దండలు అమ్ముకుంటూ కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా.. మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి తిరువనంతపురం పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. తమను రక్షించాలంటూ మోనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మోనాలిసా, కేరళకు చెందిన ఫర్హాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్తో మోనాలిసా డేటింగ్ చేస్తోంది. మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమను మోనాలిసా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తమకు రక్షణ కల్పించాలని మోనాలిసా కోరినట్లు తెలుస్తోంది. ప్రియుడితో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయవాడ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి
విజయవాడ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ నగర అభివృద్ధికి వైఎస్సార్
CM Revanth Reddy to Attend ‘Moosi Invites’ Event in Hyderabad on March 13
The Musi Riverfront Development Corporation Limited (MRDCL) will organise a special event titled “Moosi Invites” on March 13 at Taj Krishna Hotel in Hyderabad to present the proposed plans for the Musi River rejuvenation and riverfront development project. Chief Minister A. Revanth Reddy will participate in the event and outline the government’s vision for restoring […] The post CM Revanth Reddy to Attend ‘Moosi Invites’ Event in Hyderabad on March 13 appeared first on Telugu360 .
ముగిసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం
ముగిసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం డేటా సైన్స్, ఏఐ విద్యార్థులకు
Medha Patkar Urges CM Revanth to Halt Musi Event, Traces Back to Chandrababu Era
Social activist Medha Patkar, representing the National Alliance of People’s Movements (NAPM), has written to Telangana Chief Minister A. Revanth Reddy urging the government to halt the planned March 13 unveiling of the Detailed Project Plan for the Musi River Rejuvenation (Phase II) and initiate a broader democratic consultation process. Referring to the project’s background, […] The post Medha Patkar Urges CM Revanth to Halt Musi Event, Traces Back to Chandrababu Era appeared first on Telugu360 .
Fire Near Amaravati Secretariat Raises Suspicion During Collectors Conference
A fire broke out near the Seed Access Road in Amaravati and caused concern among officials. The incident occurred near the N9 road at Velagapudi Junction, where plastic pipes meant for capital construction works were stored. Large quantities of these pipes were destroyed in the blaze. Fire department officials reached the spot immediately after receiving […] The post Fire Near Amaravati Secretariat Raises Suspicion During Collectors Conference appeared first on Telugu360 .
రైతులకు ప్రభుత్వ రాయితీలపై అవగాహన
రైతులకు ప్రభుత్వ రాయితీలపై అవగాహన సూక్ష్మ నీటి సాగులో ఆటోమేషన్ యూనిట్ ప్రదర్శన
ఐపిఎల్-2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026కి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి 20 మ్యాచ్ల షెడ్యూల్ని ప్రకటించారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య, మార్చి 30వ తేదీ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మిగితా షెడ్యూల్ని విడుదల చేస్తామని ఐపిఎల్ బోర్డు పేర్కొంది. News Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 ️ Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections. More details ▶️… pic.twitter.com/8Iq492v8TE — IndianPremierLeague (@IPL) March 11, 2026
నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు…..
నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు….. రోడ్డెక్కిన అన్నదాతలు. రాయపోల్, ఆంధ్రప్రభ : సాగునీరు
అంగడి వేలంపాట రూ.24 లక్షల 4వేలు
అంగడి వేలంపాట రూ.24 లక్షల 4వేలు నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట అంగడి
Pawan Kalyan’s UBS Mass-Bang Update
The hype around Ustaad Bhagat Singh has officially hit the next gear. The team behind Power Star Pawan Kalyan’s much-awaited mass entertainer has dropped a mass-bang update, setting the stage for an explosive promotional run. The makers have now confirmed the big reveal. The theatrical trailer arrives on March 14th, kick-starting a high-voltage countdown ahead […] The post Pawan Kalyan’s UBS Mass-Bang Update appeared first on Telugu360 .
హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి.
హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి. ఎస్సీ సంక్షేమ హాస్టల్ తనిఖీ
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం… హైదరాబాద్ వ్యాపారికి రూ.5.4 లక్షల నష్టం
జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మబలికిన వ్యక్తిఎనిమిది మందికి వర్క్ పర్మిట్ పేరిట డబ్బులు వసూలు
టీ20లో విధ్వంసం.. టాప్-2కు దూసుకెళ్లిన ఇషాన్ కిషన్
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచ కప్ 2026లో విధ్వంసకర ఆటతో చెలరేగిన టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటాడు. బుధవారం ఐసిసి, టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో ఇషాన్ ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ప్రపంచ కప్కు ముందు ఇషాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిన కిషన్ 871 రేటింగ్ పాయింట్లు సాధించిన నంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక, భారత మరో స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. అభిషేక్ 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 848 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ శ్రీలంక బ్యటార్ పాతుమ్ నిస్సాంక వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు. ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. T20 ప్రపంచ కప్ 2026లో టిమిండియా తరపున బుమ్రాతోపాటు అత్యధిక వికెట్లు పడగొట్టినప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో తన వరుణ్.. 740 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 753 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు.పాకిస్తాన్కు బౌలర్ అబ్రార్ అహ్మద్ మూడో స్థానానికి ఎగబాకగా.. ఆదిల్ రషీద్, కార్బిన్ బాష్ వరుసగా నాలుగు, ఐదు స్థానంలో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని 702 రేటింగ్ పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు.
ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ
ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ గ్లకోమా పట్ల అప్రమత్తంగా ఉండాలి:
ఎర్రగట్టు జాతరలో సేవలందించిన వైద్యాధికారి
ఎర్రగట్టు జాతరలో సేవలందించిన వైద్యాధికారి హసన్ పర్తి, ఆంధ్రప్రభ : కిట్స్ వాకర్స్
కేసీఆర్కు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా?
కేసీఆర్కు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా? స్టేషన్ ఘన్ పూర్ , ఆంధ్రప్రభ:
ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ధోనీ సీజన్ మొత్తం ఆడుతాడు..: సిఎస్కె సిఇవొ
ఇటీవలే టి-20 ప్రపంచకప్ ముగిసింది. భారత్ విశ్వవిజేతగా నిలవడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో క్రికెట్ ఫ్యాన్స్కి ఫుల్ మజా ఇచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం కానుంది. ఈసారి తమ అభిమాన జట్టు అద్భుతంగా ఆడాలని.. కప్పు కొట్టాలని అభిమానులు ఇప్పటి నుంచే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ఓ ప్రశ్న నెలకొంది. ఆ జట్టు మాజీ సారథి.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్లో ఆడుతాడా.? లేదా.? అనే సందేహం నెలకొంది. దీనిపై ఆ జట్టు సిఇవొ కాశీ విశ్వనాథ్ ఓ శుభవార్త తెలిపారు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ.. ఈ సీజన్ మొత్తం ఆడుతాడని ఆయన వెల్లడించారు. తాజాగా కాశీ విశ్వనాథ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ధోనీని సీజన్ మొత్తం మైదానంలో చూడొచ్చా.? అని రిపొర్టర్ అడిగిన ప్రశ్నకు.. ‘‘ధోనీ ఈ సీజన్ మొత్తం ఆడతాడు. అన్ని మ్యాచుల్లోనూ బరిలోకి దిగుతాడు’’ అని సమాధానం ఇచ్చారు. అయితే ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్గా వినియోగిస్తారా? అనే ప్రశ్నకు ‘‘ఆ ప్రశ్న గురించి నేనేం మాట్లాడలేను. అది క్రికెట్కు సంబంధించిన నిర్ణయం. స్టాఫ్ నిర్ణయం తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ తీసుకొనేది కాదు. బ్యాటర్గా ఆడతాడా? వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గానా? ఇంపాక్ట్ ప్లేయర్గానా అనేది వారు డిసైడ్ చేస్తారు’’ అని సమాధానం ఇచ్చారు.
భీమ్గల్ కు రానున్న ప్రసిద్ధ వేద విద్వాంసులు
భీమ్గల్ కు రానున్న ప్రసిద్ధ వేద విద్వాంసులు భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
ఆ భూముల్లోనే నిరుపేదలకు ఇళ్లు ఇస్తాం: మంత్రి తుమ్మల
వెలుగు మట్ల భూదాన్ భూముల్లో కొందరు ముఠాగా ఏర్పడి పేదలను అడ్డంపెట్టుకొని మోసం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కోర్టు తీర్పు మేరకే ప్రభుత్వం ఆదేశాలతో ఖాళీ చేయించి కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సమాంతర వ్యవస్థ నడుపుతూ ముఠా సభ్యులు ఎవరిని లోపలికి రానీయకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని.. అయినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కోర్టులో కేసు ఉండటంతో అక్కడ తాము ఎలాంటి సౌకర్యాలు కల్పించలేక పోయామని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భూదాన్ ట్రస్టు లేదు..అది సీసీఎల్ఏకు బదలాయించిందన్నారు. ముఠా చేతిలో నుంచి బాదితులను రక్షించేందుకు తాము అనేక ప్రయత్నాలు చేసామని తెలిపారు. భూదాన్ భూముల్లోనే బాధితులకు ఇళ్లు ఇవ్వాలని సిఎం, ముగ్గురు మంత్రులం నిర్ణయించామని.. డిసెంబర్ 9న సిఎం చేతుల మీదుగా ఇళ్ల గృహ ప్రవేశం చేస్తామని.. అక్కడ అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.
లోక్ సభ స్పీకర్ పై వీగిన అవిశ్వాసం
లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది
Gudivada Cricket Betting Racket Exposed, Associates of Kodali Nani Arrested
Police in Krishna district recently uncovered an online cricket betting racket in Gudivada. Five people were arrested during the operation. Among them is Masala Shiva, who is known to be a close associate of former YSR Congress Party minister Kodali Nani. The police seized ₹1.05 lakh in cash and eight mobile phones from the accused. […] The post Gudivada Cricket Betting Racket Exposed, Associates of Kodali Nani Arrested appeared first on Telugu360 .
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్- అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడనున్నట్లు వస్తున్న వార్తలపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందించారు. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ముడి చమురు, గ్యాస్ సరఫరాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోపే డెలివరీ అవుతుందని అధికారి వెల్లడించారు. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు. భారత ముడి చమురు సరఫరా స్థిరంగా ఉందని తెలిపారు. దేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుందని.. భారత్, దాదాపు 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. అంతేకాదు, భారత్ కు రెండు ముడి చమురు కార్గోలు రాబోతున్నాయని ఆమె తెలిపారు.
యర్రపల్లిలో “కాఫీ విత్ క్యాడర్”తో వైసీపీ
యర్రపల్లిలో “కాఫీ విత్ క్యాడర్”తో వైసీపీ గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరించిన మాజీ
చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి…
చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి… అంగన్వాడీ కేంద్రాలు, నాలా క్లీనింగ్
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. పరీక్షలు రాయనున్న 550 మంది విద్యార్థులు.. జన్నారం,
పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయం
పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయం మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం. మునుగోడు, ఆంధ్రప్రభ
నా పొట్టను దాచలేక విసిగిపోయాను.. కెటిఆర్ పోస్ట్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ సోషల్మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు సంబంధించిన విషయాలు, పార్టీ వ్యవహారాలు, ఇతర విషయాలను ఆయన సోషల్మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టారు. జిమ్లో దిగిన ఫోటోని షేర్ చేసిన కెటిఆర్.. ఇంతకాలం తన పొట్టని దాచలేక విసిగిపోనని.. పేర్కొన్నారు. ‘‘ఆరు నెలల తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలు పెట్టాను జూలైలో నాకు 50 సంవత్సరాల వచ్చే నాటికి మంచి షేప్లోకి రావాలని ఆశిస్తున్నా’’ అని కెటిఆర్ రాసుకొచ్చారు. Tired of hiding my paunch Started training again after a gap of 6 months. Hoping to be in better shape by July when I turn 50 #FitnessGoals pic.twitter.com/o99hm3tEj4 — KTR (@KTRBRS) March 11, 2026
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవo
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవo నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : ఆడపిల్లలను ఉన్నతంగా
ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం
ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం మోపిదేవి, ఆంధ్రప్రభ: ఔషధ మొక్కల సాగుతో
Telangana : 14 నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి
కనకదుర్గమ్మకు కానుక వర్షం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ
విపక్షాలు కుట్ర చేస్తున్నాయి: భట్టి విక్రమార్క
ఖమ్మం: పేదలకు మేలు జరగకుండా విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్రంలోని పేదలపై ప్రేమ లేదని... పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు మాఫియాగా ఏర్పడి.. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని డిప్యూటీ సిఎం ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ పేదల గురించి ఆలోచించే ప్రభుత్వమని.. నిజమైన పేదలు అయ్యుంటే.. ఇళ్లు లేని వారు ఉండొద్దనేది తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. పేదలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని చెప్పారు. తొలి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. త్వరలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు.
రద్దీగా ఉన్న రహదారిపై విమానం అత్యవసర ల్యాండింగ్
19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన విమానాన్ని రద్దీగా ఉన్న రహదారిపై సురక్షితంగా దించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన 2026 మార్చి 6వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన స్నేహితుడితో కలిసి చిన్న సింగిల్ ఇంజిన్ విమానంలో (Cessna 150) ప్రయాణిస్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ శక్తిని కోల్పోయింది. విమానం నేల నుండి కేవలం 500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోవడంతో పైలట్ ఏమాత్రం కంగారు పడకుండా మొదట బీచ్ దగ్గర ఉన్న A1A రోడ్డుపై దించాలని అనుకున్నా, అది ఇరుగ్గా ఉండటంతో వెడల్పుగా ఉన్న ఇండియన్ టౌన్ రోడ్డును ఎంచుకున్నాడు. విమానం కిందికి రావడం గమనించిన ఒక ట్రక్కు డ్రైవర్ రోడ్డుపై ట్రాఫిక్ను ఆపి విమానం దిగడానికి ఖాళీ ప్రదేశం కల్పించారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఏ వాహనాన్ని ఢీకొట్టకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఈ ఘటనలో పైలట్, అతని స్నేహితుడు మరియు రోడ్డుపై ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. 19 ఏళ్ల వయసులోనే నికో బ్రే ప్రదర్శించిన ధైర్యం మరియు నైపుణ్యాన్ని స్థానిక అధికారులు, ప్రజలు మెచ్చుకున్నారు.
ప్రజల సమస్యల పరష్కారానికి అధిక ప్రాధాన్యత..
ప్రజల సమస్యల పరష్కారానికి అధిక ప్రాధాన్యత.. 18వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె
₹14,500కే అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి టూర్ #IRCTC#DivyaDakshinaYatra#TempleTour#Arunachalam
Hyderabad : పెళ్లిళ్ల సీజన్ పై ఎల్.పి.జి ఎఫెక్ట్.. ఆల్టర్నేటివ్ చూస్తున్న హోటల్స్ యజమానులు
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత వెంటాడుతోంది.
వెలగపూడిలో అగ్ని ప్రమాదం.. రోడ్డుపక్కన భారీగా మంటలు..
అమరావతిలో వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన భారీగా మంటలు చెలరేగి.. ఎల్ అండ్ టి సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. భారీ మంటలు ఎగసి పడటంతో పరిసర ప్రాంతంలో దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Farmers |జూన్- ఆగస్టు మధ్య మండే ఎండలు
Farmers | జూన్- ఆగస్టు మధ్య మండే ఎండలు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందిజిల్లాల్లోనూ
అంగనవాడి కేంద్రంలో అస్వస్థకు గురైన చిన్నారులు
అంగనవాడి కేంద్రంలో అస్వస్థకు గురైన చిన్నారులు వీఆర్ పురం పోలవరం జిల్లా, ఆంధ్రప్రభ
ఇంటిపన్ను చెల్లించలేదని గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లి
ఇంటి పన్ను చెల్లించలేదని అధికారులు గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లారు
మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు
మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కరీమాబాద్,
మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా జన్ సున్వాయ్
మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా జన్ సున్వాయ్ వేగవంతంగా, పారదర్శకంగా సమస్యల పరిష్కారానికి
Attacks | నలుగురికి గాయాలు Attacks | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Hyderabad : హైదరాబాద్లో ఓన్లీ ఇడ్లీ...ఉప్మా.. నో దోశ, పూరి, వడ
ఎల్.పి.జి గ్యాస్ కొరతతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది
సాయిపల్లవి తొలి హిందీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది..
హీరోయిన్గా పరిచయమైన అనతి కాలంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. దక్షిణాది ఇండస్ట్రీలతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది సాయి పల్లవి. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలో జునైద్, మీరా పాత్రలో సాయిపల్లవి నటించారు. స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా ఈ చిత్రానికి రచనా సహకారం అందించగా.. మన్సూర్ ఖాన్, అమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మించారు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
KVN Productions |బడా స్టార్స్ తో క్రేజీ సినిమాలు..
KVN Productions | బడా స్టార్స్ తో క్రేజీ సినిమాలు.. KVN Productions
శ్రీసమర్థరామదాసు స్వామి పాదుకపూజలు
శ్రీసమర్థరామదాసు స్వామి పాదుకపూజలు జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రతి సంవత్సరం శ్రీరామనవమి
ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి..
మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం ; ఆర్ఓబి పనులను ఆర్ అండ్ బి అధికారులు, ఆర్ఓబి కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తన ఛాంబర్ లో వారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణంలో వెళుతుంటారని అటువంటి వారికి ఆర్ఓబి పనులు జరగకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాక […] The post ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి.. appeared first on Visalaandhra .
2027 జనగణనపై అధికారులకు శిక్షణ
2027 జనగణనపై అధికారులకు శిక్షణ ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: రాబోయే 2027
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పది….
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పది…. బిక్కనూర్, ఆంధ్రప్రభ : సమాజాభివృద్ధిలో మహిళలు
మహేశ్ ఫ్యాన్స్కు సారీ చెప్పిన హరీశ్ శంకర్.. ఒత్తిడి వల్లే అని..
మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్, పవర్స్టార్ పవన్కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ చిత్రం మార్చి 19వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ కామెంట్ వల్ల దర్శకుడు హరీశ్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. ఓ వ్యక్తికి ఆయన పెట్టిన కామెంట్ వల్ల సూపర్స్టార్ మహేశ్ బాబు అభిమానుల నుంచి ఆగ్రహాన్ని ఎదురుకున్నారు. అయితే ఆ కామెంట్పై ఆయన వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి పెట్టిన పోస్ట్ను మొత్తం చదవకుండానే కామెంట్ చేశానని.. ఒత్తిడి వల్లే అది జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు అభిమానులకు ఆయన క్షమాపణ చెప్పారు. ‘‘కొన్ని రోజులుగా పని ఒత్తిడిలో ఉన్నాను. సెన్సార్ పనులు, బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సాంగ్ ప్రోమో ఫైనల్ చెక్ చేయడం.. ఇలా ఎంతో బిజీగా ఉన్నాను. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో సినిమా ప్రోమోపై వస్తున్న స్పందనలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ీమడియాలో రిప్లైలు ఇస్తున్నాను. ఆ హడావుడిలో ఒక ట్వీట్ పూర్తిగా చదవకుండానే పోరపాటున కోట్ చేశాను. వెంటనే నా టీం అప్రమత్తం చేయడంతో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ రిప్లెని తొలగించాను’’ ‘‘సూపర్స్టార్ మహేశ్ బాబు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ‘వారణాసి’ చిత్రంలో ఆయన మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నా. గతంలో ‘పోకిరి’ గురించి నేను పెట్టిన పోస్టులు చూస్తే.. మహేశ్పై నాకున్న అభిమానం అర్థమవుతుంది. ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బ తీయాలనే ఉధ్దేశం నాకు లేదు’’ అని తన లేఖలో హరీశ్ రాసుకొచ్చారు. సినిమా విడుదలకు మరో 10 రోజులు మాత్రం ఉన్న సమయంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకొనేంత అవివేకిని కాదని హరీశ్ పేర్కొన్నారు. అందరు హీరోల అభిమానులు ఆదరిస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుందని ఆయన అన్నారు. పొరపాటున తన వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని.. అందరూ పెద్ద మనస్సుతో అర్థం చేసుకొని ‘ఉస్తాద్ భగత్సింగ్’ను అదరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రి వరకు: 1943లో జన్మించిన కావూరి సాంబశివరావు వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్ఈసీ) నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. […] The post కావూరి సాంబశివరావు కన్నుమూత.. appeared first on Visalaandhra .
క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి
క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నదుండగులునిర్వహకులపై పోలీసులు
తెలంగాణ గర్వం! కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలుగులోనే ప్రమాణ స్వీకారం #TelanganaGovernor
25th Division |సెంట్రల్లో అభివృద్ధి జోరు…
25th Division | సెంట్రల్లో అభివృద్ధి జోరు… అయ్యన్న నాయుడు వీధిలో డ్రైనేజీ
ఏజెన్సీలో నూతన ఓరవడికి శ్రీకారం..
ఏజెన్సీలో నూతన ఓరవడికి శ్రీకారం.. ఉట్నూర్, జైనూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఏజెన్సీ
Hindi Deals kept Markets of these Actors at Risk
The Hindi Rights of Telugu stars have turned out to be a gold mine for the producers. The Hindi rights included the satellite rights, YouTube rights along with the streaming rights of the films. Actors like Ravi Teja, Ram, Gopichand, Bellamkonda Sreenivas and others enjoyed a terrific craze and their films did well on small […] The post Hindi Deals kept Markets of these Actors at Risk appeared first on Telugu360 .
సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీరామ్ రవి కన్నుమూత
సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీరామ్ రవి కన్నుమూత భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
సీఎంను కలిసిన బీర్ల అయిలయ్య సీఎం రేవంత్ రెడ్డికి లక్ష్మీ నరసింహస్వామి లడ్డు
కోర్టు తీర్పు మావైపే వస్తుంది..
కోర్టు తీర్పు మావైపే వస్తుంది.. జంపింగ్ ఎమ్మెల్యేలపై అనాహారత వేటు తప్పదుకడియం, దానం
Andhra Prabha Smart Edition |AP|ఆర్థిక విధ్వంసం/వచ్చే జులైనాటికి..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-03-2026, 4.00PM ap వచ్చే జులైనాటికి వెలిగొండ,
Andhra Prabha Smart Edition |TS|. స్పీకర్ తీర్పు/కేటీఆర్ ఫైర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-03-2026, 4.00PM ts దానం, కడియం పార్టీ
నేల ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమం…
నేల ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమం… పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లోని
13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి
గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటంతో హరీశ్ రాణా మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా, పూర్తిగా […] The post 13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి appeared first on Visalaandhra .
ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు
శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని, అలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండబోమని స్పష్టం చేశారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు […] The post ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు appeared first on Visalaandhra .
హైదరాబాద్–ఫుకెట్ ఎయిర్ ఇండియా విమానం రన్వేపై నోస్ వీల్ విరిగి... #AirIndiaExpress#HyderabadFlight
హైదరాబాద్ నర్స్కు మ్యాట్రిమోని మోసం… ₹7.76 లక్షలు దోచిన నకిలీ యూకే డాక్టర్
ఎయిర్పోర్టు, పన్నులు, కరెన్సీ మార్పిడి పేర్లతో డబ్బు వసూలుసైబర్ క్రైమ్ యూనిట్లో ఫిర్యాదు…
RGV’s Big Statement on South Cinema
It has been known that several films from South are making it to the pan-Indian stage and are dominating Bollywood. Gone are the days when Hindi films were top grossers. South films like Baahubali, KGF, RRR, Pushpa and others have surpassed the lifetime numbers of Hindi films. Sensational filmmaker Ram Gopal Varma has made a […] The post RGV’s Big Statement on South Cinema appeared first on Telugu360 .
చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం
మంచిర్యాల జిల్లా, చెన్నూరు: చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ తివారీ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహేశ్ ప్రసాద్ తివారీతో పాటు కమిటీ సభ్యులు కూడా పదవీ ప్రమాణం చేశారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ మరియు సభ్యులకు అభినందనలు తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలని సూచించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొత్త చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.

30 C