SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

Janasena : నాగబాబుకు మంత్రి పదవి దక్కనిది అందుకేనా? అందుకే ఆపారా?

జనసేనలో తాజాగా ఒక టాక్ వినిపిస్తుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 1:25 pm

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్‌ సరఫరాలో కొరత ఏర్పడుతోంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 1:13 pm

Gold and Silver : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు

భారీగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 1:04 pm

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న భారీ స్టీల్ ప్లాంట్

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న భారీ స్టీల్ ప్లాంట్ కూటమి ప్రభుత్వ విజన్‌కు నిదర్శనంటీడీపీ

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:51 pm

csk captain|రిటైర్మెంట్‌పై ధోనీ స్పంద‌న‌

csk captain| రిటైర్మెంట్‌పై ధోనీ స్పంద‌న‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ప్రారంభానికి

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:46 pm

కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’

గౌహతి: అసోం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ అసోం కమలానికి గట్టి దెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన నందితా ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 2022 నుంచి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వంలో విద్యుత్, […] The post కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:45 pm

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద సందడి మొదలైంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 5,950 తగ్గి, ప్రస్తుతం రూ. 1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) […] The post భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:42 pm

శాసన సభ స్పీకర్ ను కలిసిన ప్రభుత్వ విప్

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వ విప్ గా నియామకమైన సందర్భంగా

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:40 pm

Telangana : ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:40 pm

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం బిల్లులు

తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త అందించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులను ఇకపై ప్రతీ వారం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో నిర్మాణ పనుల్లో జాప్యం తొలగిపోయి, ఇళ్ల నిర్మాణం వేగవంతం కానుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క… ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వీలైనంత త్వరగా తమ […] The post ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం బిల్లులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:38 pm

Assembly |రీల్ లైఫ్ లోనైనా సీఎం కావాలనుంది..

Assembly | రీల్ లైఫ్ లోనైనా సీఎం కావాలనుంది.. Assembly | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:35 pm

నార్సింగిలో సేవా కార్యక్రమాలతో బీజేపీ సంబరాలు

నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ నియోజకవర్గానికి ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్న రఘునందన్ రావు

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:34 pm

రామన్న ఉత్సవాలకు ఆహ్వానం..

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈ నెల 27న భీంగల్ మండలం పిప్రి

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:30 pm

AP |నీటి సంఘాల సమావేశం..

AP | నీటి సంఘాల సమావేశం.. AP | మచిలీపట్నం – ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:30 pm

Two Big Shocks for Koratala Siva

Koratala Siva is one of the finest writers of Telugu cinema and he soon turned director and delivered blockbusters like Mirchi, Srimanthudu, Janatha Garage and others. Acharya has been a huge dent and embarrassment for Koratala Siva and he bounced back with Devara featuring NTR in the lead role. He has been working on the […] The post Two Big Shocks for Koratala Siva appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 12:29 pm

లండన్‌లో ఘనంగా TAL వార్షికోత్సవం – ఉగాది వేడుకలు సందడి

తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా వేడుకలుసంగీతం, జానపద కళలతో సందడి

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:28 pm

TDP : టీడీపీ అగ్రనేతల మధ్య గ్యాప్.. కీచులాటలు... కుమ్ములాటలు

నెల్లూరు జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలయింది.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:27 pm

పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గొఱ్ఱె కాపరులు ధర్నా..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సోమవారం గొఱ్ఱె కాపరులు

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:27 pm

మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టి ముందుకు రాలేదు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మానవ తప్పిదాల వల్లే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.  హైదరాబాద్ చారిత్రక నగరం అనేక గొప్ప కట్టడాలు ఉన్నాయని తెలియజేశారు. ఆదాయ మార్గాలు పెరిగి ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయని, ట్రాఫిక్ రద్దీ పెరగడంతోనే మెట్రోలు, ఎంఎంటిఎస్‌లు పెంచుకున్నామని వివరించారు. శాసన మండలిలో రేవంత్ ప్రసంగించారు. క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించి ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నామన్నారు. కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చేలా చేశారని ప్రశంసించారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని, కాలుష్య వెదజల్లే పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తున్నామని, రోడ్లను అండర్‌పాస్‌లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించామని, మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టి ముందుకు రాలేదని, కేంద్ర ప్రభుత్వ నిబంధనతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు మెట్రోను స్వాధీనం చేసుకుందని తెలియజేశారు. మెట్రోను మరో 76 కిలో మీటర్లకు విస్తరిస్తామని, నగర శివార్ల నుంచి వచ్చే ఉద్యోగుల సంఖ్య భాగా పెరిగిందని, మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. శామీర్‌పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నామని, ఎలివేటెడ్ కారిడార్ల కోసం కేంద్ర సంస్థలతో మాట్లాడి భూమి తీసుకుంటున్నామని, పైన విమానాలు ఎగిరితే కింద అండర్ టన్నెల్ వస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  మూసీ నదీ ప్రక్షాళన మనకు అత్యవసరంగా మారిందని, గుజరాత్ అభివృద్ధిలో బిజెపికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చిందని, అభివృద్ధి విషయంలో అన్ని పార్టీల నేతలు ఒక్కటవ్వాలని సూచించారు. మూసీ నదిలో నల్లగొండ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పనులు చేయనివ్వం, ఆపేస్తాం అని మాత్రం అనవద్దని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో రోడ్ల విస్తరణఖు అనేక ఇబ్బందులు ఉన్నాయని, రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నామని, చిరు వ్యాపారులకు ఇతర చోట్ల స్థలం కేటాయిస్తున్నామని వివరించారు. 

మన తెలంగాణ 23 Mar 2026 12:23 pm

దానం నాగేందర్ కు హైకోర్టుకు నోటీసులు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:23 pm

హిందూ సమ్మేళనం విజయవంతం చేయండి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:23 pm

Suicide |కంటతడి పెట్టించే విషాద విషయాలు

Suicide | కంటతడి పెట్టించే విషాద విషయాలు Suicide | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:21 pm

ఇరాన్ యుద్ధం ట్రంప్ తప్పిదమే.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై సొంతగడ్డపైనే విమర్శల సెగ తగులుతోంది. ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ట్రంప్ మొండి వైఖరి, దూకుడు నిర్ణయాలే కారణమని సాక్షాత్తూ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధానాల వల్ల అమెరికా ఇప్పుడు బయటకు రాలేని ఒక ఊబిలో చిక్కుకుపోయిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ శక్తిసామర్థ్యాలను, వారి […] The post ఇరాన్ యుద్ధం ట్రంప్ తప్పిదమే.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:17 pm

బాంబు బెదిరింపు కాల్స్..

బాంబు బెదిరింపు కాల్స్.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; మచిలీపట్నం కోర్టుకు వచ్చిన బాంబు

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:15 pm

Revanth Reddy : హిల్ట్ పాలసీని అందుకే తీసుకు వచ్చాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో పలు అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:14 pm

PORT |ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్‌చంద్‌ గార్గ్‌కు ఏమీ సంబంధం లేదు

PORT | ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్‌చంద్‌ గార్గ్‌కు ఏమీ సంబంధం లేదు PORT

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:13 pm

సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు

సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ టూ

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:10 pm

బీజేపీ నాయకులు ముందస్తుగా అరెస్ట్..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో బీజేపీ నాయకులను

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:08 pm

బాంబు కలకలం..

బాంబు కలకలం.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లా జిడ్జి జి.గోపి కి మెయిల్

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:07 pm

ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రం మనదే: ఉత్తమ్

హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలోని అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వమే బియ్యం కుంభకోణానికి పాల్పడింది అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ బియ్యం విషయంపై  ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రేమ్ చంద్ గార్గ్ కు, ఫిలిపీయన్స్ కు ఎలాంటి సంబంధం లేదని, సన్నబియ్యానికి బోనస్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. 72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నగదు చెల్లించామని, ఈ రబీలో కూడా ప్రతి గింజనూ కొంటాం అని అన్నారు. తమది రైతుపక్షపాత ప్రభుత్వం అని.. ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రం మనదే అని ఉత్తమ్ కొనియాడారు. రైతుల నుంచి రికార్డు స్థాయిలో బియ్యం సేకరించామని, ఇంకా మిగిలిన బియ్యం కొంటామని అన్నారు. 86 లక్షల టన్నుల బియ్యం నిల్వ ఉందని.. పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తాము మాత్రం బియ్యాన్ని మంచి ధరకే విక్రయించామని పేర్కొన్నారు. ఇలీవల 72 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేశామని, ఛత్తీస్ గఢ్, ఎపి కంటే మన బియ్యానికే డిమాండ్ ఉందని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా తాము మాత్రం ధాన్యం కొంటున్నామని, మన బియ్యాన్ని థాయిలాండ్, వియత్నాం, కంబోడియాకు పంపిస్తున్నామని అన్నారు. మన సోనామసూరి, బాస్మతి బియ్యానికి మంచి డిమాండ్ ఉందని, రైతుల వద్ద ప్రతి గింజను కొనేందుకు కట్టుబడి ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.   

మన తెలంగాణ 23 Mar 2026 11:55 am

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.... భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. తులం బంగారం రూ.5,950 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350కు తగ్గింది. కిలో వెండి ధర 20 వేల వరకు తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,30,000లుగా ఉంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణ భయాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ట్రేడింగ్ అంతర్జాతీ గోల్డ్ ఔన్సు ధర 4377.95 డాలర్లకు దిగి రావడంతో నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. బంగారం ధర తగ్గడం వరసగా తొమ్మిదో రోజు కావడం గమనార్హం. 

మన తెలంగాణ 23 Mar 2026 11:46 am

Tharun Bhascker’s GPS Locks Perfect Date In Summer

Actor-filmmaker Tharun Bhascker is gearing up with his next youthful entertainer Gaayapadda Simham, and the project has received a major support with top producer Dil Raju stepping in to acquire the worldwide theatrical rights. Impressively, this is the first film since Happy Days that he has chosen purely after watching and trusting the content. The […] The post Tharun Bhascker’s GPS Locks Perfect Date In Summer appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 11:42 am

ఇంట్లో తినడానికి తిండి ఉంటే వాళ్లు స్కూల్లో ఎందుకు తింటారు?

గరికపాటి వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్.. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. గరికపాటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివేది అత్యంత నిరుపేద, సామాజికంగా అణగారిన వర్గాల పిల్లలే. ఇంట్లో తినడానికి తిండి ఉంటే వాళ్లు స్కూల్లో ఎందుకు తింటారు? కడుపు మండుతుంటే టీచర్ […] The post ఇంట్లో తినడానికి తిండి ఉంటే వాళ్లు స్కూల్లో ఎందుకు తింటారు? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:42 am

హొర్మూజ్ తెరవకపోతే పవర్ ప్లాంట్ ధ్వంసం చేస్తాం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికదాడి చేస్తే దీటుగా జవాబు: ఇరాన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్ప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కాదు. నియంతత్వమో, ఆకతాయితనమో తెలియదు. యుద్ధాన్ని ముగించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన మరుసటిరోజే ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. 48 గంటల్లోగా ీVAర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ీVAర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్‌కు ఇది సరైన సమయం అని తన […] The post హొర్మూజ్ తెరవకపోతే పవర్ ప్లాంట్ ధ్వంసం చేస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:34 am

ముంబయికి అతడిని కెప్టెన్‌గా ఎంచుకోండి: కృష్ణమాచారి

ముంబయి: ఐపిఎల్ 19వ సీజన్ ఇంకా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సిబి వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. పలు జట్లు ఐపిఎల్ టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ముంబయి ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హార్ధిక్ పాండ్యాకు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పలు సూచనలు చేశాడు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్ధిక్ పాండ్యా తప్పుకోవాలని సలహా ఇచ్చాడు. ఎంఐ యజమాన్యం రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలతో కలిసి చర్చించాలని సూచించాడు. ప్రపంచ కప్ అందించిన ఇద్దరు కెప్టెన్లు హార్ధిక్ సారథ్యంలో ఆడుతున్నారని, సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అందిస్తే బాగుంటుందని కృష్ణమాచారి తెలియజేశారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఉన్న టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో హార్ధిక్ ఆటగాడిగా ఉన్నాడని, సూర్యకు కెప్టెన్సీ అప్పగిస్లే ఎంఐ జట్టు పని తేలిక అవుతుందని స్పష్టం చేశారు. తాను మాత్ర సూర్యకు కెప్టెన్సీకే మొగ్గు చూపుతానని కృష్ణమాచారి తెలిపాడు. 

మన తెలంగాణ 23 Mar 2026 11:33 am

Incident |అప్రమత్తమైన పోలీసులు

Incident | అప్రమత్తమైన పోలీసులు Incident | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:24 am

ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం

ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియకు ఇంటర్ విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. ఈరోజు నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుండగా, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మార్చి 25తో పరీక్షలు పూర్తిగా ముగియనున్న నేపథ్యంలో, ఫలితాలను త్వరితగతిన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంజిత్ బాషా వివరించారు. ఇప్పటికే ప్రధాన పరీక్షలు […] The post ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:22 am

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఆరోగ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ తో బీజేపీ

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:22 am

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : భగత్ సింగ్

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:17 am

Radar24 |ప్రమాద సమయంలో విమానంలో 100మంది…

Radar24 | ప్రమాద సమయంలో విమానంలో 100మంది… Radar24 | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:17 am

యుద్ధప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల యుద్ధ మేఘాలు మరింత దట్టమవడంతో యుద్ధప్రభావం ప్రపంచవ్యాప్తంగాఅనిశ్చితి నెలకొన్నది.ఇవాళ‌ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. ఈరోజు ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1243.00 పాయింట్లు పతనమై 73,289.96 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 413.85 పాయింట్లు నష్టపోయి 22,700.65 వద్ద ట్రేడ్ అయ్యాయి.పశ్చిమాసియాలో యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించినా, ఎప్పుడు […] The post యుద్ధప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:14 am

ఐపిఎల్ చరిత్రలో తొలిసారి... పది జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లు

ముంబై: మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా 2026 సీజన్ ప్రారంభంకానుంది. ఈనెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి), సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు టైటిలే లక్ష్యంగా వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమయ్యాయి. అయితే ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 ఫ్రాంచైజీలు భారత కెప్టెన్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇలా భారత సారథులతో ఒక సీజన్ ప్రారంభం కావడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి. తుది జట్టులో ఆడేది నలుగురే అయినా.. విదేశీ ఆటగాళ్ల ప్రభావం ఈ లీగ్‌పై ఎక్కువ. పలువురు విదేశీ ఆటగాళ్లు కెప్టెన్లుగా కూడా వ్యవహరించారు. కానీ, ఈ ఒరవడికి చెక్ పెడుతూ తొలిసారి భారత ఆటగాళ్ల సారథ్యంలో 10 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. అయితే పలువురు విదేశీ కెప్టెన్లు గాయపడటంతో ఇది సాధ్యమైనట్టు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మోకాలి గాయంతో ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో ఇషాన్ కిషన్‌ను తాత్కలిక సారథిగా సన్‌రైజర్స్ నియమించుకుంది. మిగతా 9 జట్లకు భారత ఆటగాళ్లే సారథులు. 10 జట్ల కెప్టెన్లు వీరే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రజత్ పటీదార్ సన్‌రైజర్స్ హైదరాబాద్ -ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ - హార్దిక్ పాండ్యా కోల్‌కతా నైట్‌రైడర్స్ -అజింక్యా రహానే పంజాబ్ కింగ్స్ -శ్రేయస్ అయ్యర్ చెన్నై సూపర్ కింగ్స్ -రుతురాజ్ గైక్వాడ్ లక్నో సూపర్ జెయింట్స్ -రిషభ్ పంత్ గుజరాత్ టైటాన్స్ -శుభ్‌మన్ గిల్ రాజస్థాన్ రాయల్స్ -రియాన్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్స్-అక్షర్ పటేల్

మన తెలంగాణ 23 Mar 2026 11:13 am

బీసీలకు బడ్జెట్ లో తీరని అన్యాయం..

బీసీలకు బడ్జెట్ లో తీరని అన్యాయం.. యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; మహాత్మ జ్యోతిబాపూలే

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:10 am

Young Man |ఎక్కడంటే…

Young Man | ఎక్కడంటే… Young Man | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:07 am

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకుల అరెస్ట్

నార్సింగి, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పిలుపు

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:03 am

IRAN |హర్మూజ్‌ను తెరిచేదే లేదు…

IRAN | హర్మూజ్‌ను తెరిచేదే లేదు… IRAN | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:01 am

క్యూనెట్ కేసులో సీసీఎస్‌ పోలీసుల సోదాలు

మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ కేసులో సీసీఎస్‌ పోలీసుల సోదాలు చేశారు

తెలుగు పోస్ట్ 23 Mar 2026 10:59 am

టిప్పర్ ఢీకొని యువకుడు మృతి

టిప్పర్ ఢీకొని యువకుడు మృతి భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని మంగళపల్లి గ్రామం

ప్రభ న్యూస్ 23 Mar 2026 10:57 am

అమెరికాతో చర్చలు జరపడం అనేది ఇక ‘‘ముగిసిపోయిన అధ్యాయం‘‘

స్పష్టం చేసిన ఇరాన్ అమెరికాతో చర్చలు జరపడం అనేది ఇక ‘‘ముగిసిపోయిన అధ్యాయం ‘‘ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చి చెప్పారు. గతంలో వాషింగ్టన్‌తో జరిపిన చర్చలు తమకు కేవలం విశ్వాసఘాతుకం, చేదు అనుభవాన్ని మాత్రమే మిగిల్చాయని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇకపై అమెరికాతో ఎలాంటి రాయబారాలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.గతంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడాన్ని ప్రస్తావిస్తూ అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన […] The post అమెరికాతో చర్చలు జరపడం అనేది ఇక ‘‘ముగిసిపోయిన అధ్యాయం‘‘ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 10:45 am

మధురమైన ‘అరెరే.. అరెరే..’

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల వేడుకకు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, హీరో పూరి ఆకాష్, సినీ ప్రముఖులు సమీర్, సాగర్, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు, మిమిక్రి శివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఆడియోను విడుదల చేసి చిత్రబృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద్భ్రంగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. ‘దియా ఒక వండర్‌ఫుల్ టాలెంట్. ఈ అరెరే.. అరెరే.. మ్యూజిక్ ఆల్బమ్ చాలా హృద్యంగా ఉంది. ఆమె గాత్రం, నటన రెండింట్లోనూ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కొత్త ప్రతిభలు ముందుకు రావడం తెలుగు సంగీత రంగానికి మంచి సంకేతం. ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ మ్యూజిక్ వీడియోకు క్రాంతి వర్మ దర్శకత్వం వహించగా, కెఅండ్‌ఎం రైటింగ్స్ కథను అందించారు. నిర్మాతగా నూతన్ చెకురి, సంగీతాన్ని శరవణ వాసుదేవన్ సమకూర్చారు. త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌తో పాటు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

మన తెలంగాణ 23 Mar 2026 10:31 am

అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే..

అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే.. చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నెరవేర్చని

ప్రభ న్యూస్ 23 Mar 2026 10:26 am

Tamil Superstar Badly Needs a Producer

Tamil Superstar Ajith Kumar is one of the leading actors in Tamil. Though he did not deliver many debacles, Ajith’s big and fat pay cheque has been putting his producers to stay away. Top Telugu producers Mythri Movie Makers produced Good Bad Ugly with Ajith and they did not make any profits. But the production […] The post Tamil Superstar Badly Needs a Producer appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 10:25 am

‘కొరియన్ కనకరాజు’లో కీలక పాత్రలో..

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్ర క్లైమాక్స్‌లో వస్తోందని తెలుస్తోంది. ఈ పాత్రలో కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు, ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మన తెలంగాణ 23 Mar 2026 10:22 am

Telangana : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? అయితే మీరు ఈ పని చేయాల్సిందే

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 10:19 am

మత విద్వేషాలను సృష్టించడం సరికాదు..

మత విద్వేషాలను సృష్టించడం సరికాదు.. నెక్కొండ, ఆంధ్రప్రభ : కొంత మంది వ్యక్తులు

ప్రభ న్యూస్ 23 Mar 2026 10:16 am

Zodiac Signs : ఈరోజు రాశిఫలాలను చూసుకుని పనిని ప్రారంభించాల్సిందే

దినఫలాలు చూసుకుని మరీ చాలా మంది పనులు ప్రారంభిస్తారు.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 10:15 am

నేడు విచారణకు సునీల్ నాయక్

ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్ విచారణకు హాజరుకానున్నారు.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 10:05 am

నాన్నకు ప్రేమతో.... జనం కోసం నాన్న స్థలం

ప్రేమను నిరూపించుకున్న కుమారులు మన తెలంగాణ/మద్దిరాల : గజం జాగా కోసం పేగు బంధాన్ని మరచి, సొంత తోబుట్టువుల రక్తం చూడడానికి కూడా వెనకాడని రోజుల్లో.... తండ్రి పేరు గ్రామ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నారు ఇద్దరు సుపుత్రులు. పరమో సేవా ధర్మః అనే శ్లోకాన్ని ఆచరించి, ఎంతోమందికి సేవలను అందించడానికి బాటలు వేశారు. వివరాల్లోకెళితే మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామంలో కొన్నేండ్లుగా కిరాయి గదుల్లో, చెట్ల కింద, పాత పెచ్చులూడే భవనాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది వైద్య సేవలు అందిస్తూ ఉండేవారు. చికిత్స చేస్తున్నప్పుడు పై కప్పు పెచ్చులు.. రోగుల పై, వ్యాక్సిన్ కోసం వచ్చే పిల్లల పై పడుతాయేమో అనే భయాలతో సేవలు అందిస్తూ వచ్చారు . అలాంటి భయానక పరిస్థితుల నుంచి తమ గ్రామస్థులను దూరం చేసేందుకు దోహదహ పడ్డారు నాయిని రాజేశ్వర్ రావు మరియు రామేశ్వర్ రావు లు. వాళ్ళ నాన్న నాయిని వెంకటేశ్వర్ రావు జ్ఞాపకార్ధం, గ్రామ నడిబొ డ్డున ఉన్న లక్షల విలువ గల 14 గుంటల స్థలాన్ని జిల్లా వైద్య ఆరో గ్య శాఖ కు దానం చేశారు.   గ్రామంలోని కొంతమంది నాయకులకు, గ్రామానికి బహుమతి గా ఇస్తున్నట్లు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి, కుల మతాలకు అతీతంగా తమ నాన్న స్థలంలో ఉచిత ఆరోగ్య సేవలకు మాత్రమే ఉపయోగపడాలని దాతలు కోరారు. స్థలాన్ని దుర్వినియోగం కాకుండా హుటాహుటిన ఆరోగ్య శాఖకు అందించి, గ్రామ స్థాయి ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని నిర్మించాల్సిందిగా గ్రామంలోని కొంతమంది నాయకులు అధికారులను కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే పనిచేస్తున్న రెడ్డిగూడెం గ్రామానికే చెందిన ఓ అధికారి, దాతలకు సంతృప్తి కలిగేలా భవనం ఉండాలని ప్రయత్నం చేస్తూ... చిన్న ఉప కేంద్రం కాదు జాతీయ ప్రమాణాలతో కూడిన ఆదర్శ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను నిర్మించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కలెక్టర్ ల ద్వారా రాష్ట్ర అధికారుల నుంచి నిధుల మంజూరు సాకారం చేసుకున్నారు. ఎక్కడో ఊరి చివరన, చెరువు దగ్గరో, స్మశాన వాటిక దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టిన ఆరోగ్య భవనాల నిర్మాణం కు గ్రామస్తుల ప్రోత్సాహమే కరువయ్యే పరిస్థితుల్లో, రెడ్డిగూడెం గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పాలుపంచుకోవడం ఆనంది ంచదగ్గ విషయం. దాతలు నాయిని రాజేశ్వర్ రావు మరియు రామే శ్వర్ రావు లాంటి మంచి మనసున్న వ్యక్తులు అన్ని గ్రామాల్లో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారి క్షేత్ర సిబ్బందికి రెడ్డిగూడెం గ్రామ పెద్దలు, నాయకులు, దాతలు చేస్తున్న కృషిని ఇతర గ్రామాల్లో చర్చించేలా చేసి, మరికొంత మంది ముందుకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మంజూరు అయిన భవన నిర్మాణాన్ని గ్రామ ఆరోగ్య సిబ్బంది డాక్టర్ పరమ్యా నాయక్, అదే గ్రామానికి చెందిన ఏ ఎన్ ఎం హసానబాద ఉమా, ఆశా కార్యకర్త పద్మ లతో పాటు ఇతర ఆశాలు నిబంధనలకు అనుగుణంగా, రోగులకు సౌలభ్యం గా ఉండేలా నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ, త్వరితగతిన పూర్తి కావడానికి సమన్వయ పరిచారు.   భవన నిర్మాణం పూర్తి కాగానే సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు ను గ్రామ నాయకుల సహకారం తో ఆహ్వానించి, దాతల సమక్షంలో ప్రారంభం చేయించారు. ప్రారంభోత్సవం రోజున దాతలు నాయిని రామేశ్వరరావు మరియు నాయిని రాజేశ్వరరా వులను గ్రామస్తుల కరతాల ధ్వనుల మధ్య ఘనంగా సత్కరించి, ఆరోగ్య శాఖ సిబ్బంది వారు చేసిన మేలును కొనియాడారు. దాతలు కూడా తమ నాన్న కలలు కన్నట్లుగా, ఈ భవనంలో ప్రతి గ్రామస్తుడు ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నరు. జిల్లా డి ఎం హెచ్ ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ దాతల దాతృత్వాన్ని, గ్రామ నాయకుల సంకల్పాన్ని, ఆరోగ్య మందిర్ సిబ్బంది సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఎవరు ఏ స్థాయిలో ఎంత సహకారం అందించాలో, అంతకుమించిన పట్టుదలతో అందించడంతోనే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. జిల్లాలో బెస్ట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మాత్రమే కాకుండా, జాతీయస్థాయిలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సర్వీస్ అందిస్తున్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందే వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది కష్టపడతారని ఆయన హామీ ఇచ్చారు. ఇది తెలుసుకున్న దాతలు వారి తండ్రి నాయిని వెంకటేశ్వరరావు ను తలుచుకొని, వారి స్థలంలో గ్రామస్తులకు జరుగుతున్న మేలును కళ్ళారా చూస్తూ ఆనందభాష్పాలతో కళ్ళు చెమర్చాయి. ప్రభుత్వ సహకారంలో కొంత ఆలస్యం వలన, ఏదైనా మందుల సరఫరా ఆలస్యం ఉంటే గ్రామస్తుల కోసం తామే మందులు కూడా పంపిస్తామని స్థల దాతలు ప్రకటించడం అభినందనీయం. దగ్గుల మల్లయ్య నేలను చదును చేయడం జరిగింది. మరికొంత మంది గ్రామస్థులు సైతం ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కుక్క కాటు మరియు టీటీ లాంటి ఇంజెక్షన్ ల కోల్డ్ చైన్ ప్రక్రియ కోసం స్థల దాతలే ఫ్రిజ్ ను కూడా బహుకరించడం విశేషం. ఈ నిజ సంఘటనలో అంతా మూకుమ్మడిగా, ఎలాంటి భేద భావాలకు తావు లేకుండా, వారు అనుకున్నది సాధించడంలో రెడ్డిగూడెం టీమ్ చూపించిన ఐకమత్యం పలువురికి ఆదర్శం. జ్ఞాపకార్ధకంగా కట్టే ఎవరికీ పనికిరాని సిమెంట్ కట్టడాల కన్నా... నలుగురికి ఉపయోగపడే హెల్త్ సెంటర్, బస్ స్టాండ్, గ్రంథాలయం, తాగు నీరు పంపిణీ లాంటి సేవలకు స్థలాన్ని ఇవ్వడమో, లేక నేరుగా నిర్మాణాలు చేయడమో చేస్తే అదే నిజమైన జ్ఞాపకార్ధం. వారి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని పలువురు చర్చిస్తున్నారు. ప్రజా ఆరోగ్యం మెరుగు పరిచేందుకు సిద్ధం - తీగల ఉపేంద్ర వెంకన్న, గ్రామ సర్పంచ్ రెడ్డిగూడెం గ్రామ ప్రజల ఆరోగ్యానికి దోహదపడే హెల్త్ సెంటర్ కి కావాల్సిన సహకారం అందిస్తాం. గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది ద్వారా భవనం లోపల మరియు చుట్టు పక్కల పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తాం. స్థల దాతల ఉద్దేశాన్ని అమలు అయ్యేలా చేసి, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకుని, వైద్యాన్ని మరింత చేరువయ్యేలా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామస్తుల సహాకారం మరువలేనిది.

మన తెలంగాణ 23 Mar 2026 9:59 am

పరిశీలన పాక్షికత

పరిశీలన పాక్షికత మన దృష్టి కిటికీ కాదు మనసు రంగుతో పూయబడిన అద్దం చూస్తున్నామనుకునేది ప్రపంచం కాదు మనలో ముందే వ్రాసిన భావనల ప్రతిబింబం సాక్ష్యం ఒకటే అయినా నమ్మకం దానికి వేరే రూపం ఇస్తుంది భావాలు మబ్బులైతే,తర్కం సూర్యుడు కావాలి నిజం బయట దాగి ఉండదు మన పక్షపాతపు పొరలలో చిక్కుకుపోతుంది గత అనుభవం గీతలు గీస్తే ప్రస్తుతం వాటి మధ్యే నిలుస్తుంది పక్షపాతం తెలియని చూపు బంధనం పక్షపాతం తెలిసిన చూపు విముక్తి మన అద్దం శుభ్రం అయినప్పుడే ప్రపంచం కాదు సత్యమే మనలో ప్రతిఫలిస్తుంది - డాక్టర్ నూకరాజు బెందుకుర్తి

మన తెలంగాణ 23 Mar 2026 9:58 am

Iran - Israel War : అమెరికా–ఇరాన్ హెచ్చరికలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత

మధ్యప్రాచ్యంలో యుద్ధం నాలుగో వారంలోకి చేరిన వేళ పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారాయి

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:52 am

గోవులొస్తున్నాయి జాగ్త్త్రత్త!

ఇరానీ కేఫ్‌లో నల్లమబ్బుల తెల్ల చొక్కా టేబుల్ మీద టీ కప్పులోంచి లేచి జోగుతూనే పడగలు విప్పి ఆడే పాములు ఎక్కడో కరెంటు తీగమీంచి పడిన కాకి చుట్టూ మూగిన కాకుల అరుపులు చమురు మబ్బుల పొగలు కేఫ్‌లో తారూ, చమురు కలిసి నల్లటి వర్షం నల్లమబ్బుల తెల్ల చొక్కా నెత్తిమీది టోపీ తీసి మీద పెట్టే సరికి టోపీతో పాటు వచ్చేసిన పుర్రె మీది చిప్ప టేబుల్ మీది టీ కప్పు లేచి డిప్పలేని తలని కప్పులా అందుకుని సిప్పు చేస్తుంది సుళ్లు తిరుగుతూ తలల్ల్లోంచి లేస్తాయి ఆకాశంలోకి రంకెలు వేస్తూ ఆబోతుల ప్రవాహాలు సుడి మధ్యలోనేమో కొండ దిగే గంగిగోవులు, గోధూళి జలపాతంలో విస్తరించే విద్యుల్లతలు తల లోపలి మనిషి కల భగ్నమౌతుంది సవ్యాపసవ్యంగా మనిషి అణువులు కొంటాయి తలలోపలి మనిషి తలపగిలి విలపిస్తాడు రెండు శతగ్నులుపైకి లేచి గర్జిస్తాయి మొబైల్ తుపుకూ తుపుకూ విరామం లేకుండా ఆకాశంలోకి మిసైళ్లని ఉమ్మేస్తాయి పెంటగన్లో నూక్లియర్ లేవు డిప్పల్లేని తలకాయల్లో, ఎప్పటికీ ఆకలి తీరని డైనోసార్లున్నాయి కుప్పల కుప్పల వార్‌హెడ్స్ మధ్య నుంచి చమురు సముద్రం మీద తేలే స్కూలు పిల్లల సమాధుల మధ్య నుంచి శిశువును ఎత్తుకుని పరుగెడుతోన్న ఓ పిచ్చి తల్లి ఆమెను మిసైళ్లతో బీ12 బాంబర్లతో వెంటాడే సామ్రాజ్యం ఆపండ్రా బాబూ ఆపండి, అరుస్తోంది ఓ చిన్నారి సమాధి ఇరానీ కేఫ్ ముందు సింహం తన వెన్నెముకలోంచి ఓ కొవ్వొత్తిని తీసిచ్చి చేపల్లో కలిసి పోయింది కొవ్వొత్తిని కపాలంలో వెలిగించింది టీకప్పు తల లాంతరుగా మారిపోయింది ఇరానీ కేఫ్ అద్దాల్లో లాంతరు ముఖం గోడ్ల నిండా లాంతర్లు టేబుళ్ల చుటూ లాంతర్లు కేఫ్‌కి వచ్చిపోయే శబ్ధాలన్నీ లాంతర్లు కేఫ్ బయట రోడ్డు మీద ప్రవహించే లాంతర్లు భూగోళమంతా లాంతర్లు లాంతర్లు పిచ్చి తల్లినీ, ఆమె చేతిలో శిశువునీ వెంటాడే వేటాడే ఉన్మాదుల నుంచి లాంతర్లే రక్షించాలి లాంతర్ల కాంతిలోంచి దూకే సిక్కోలు గంగిగోవులే రక్షించాలి హరిత గోళాన్ని పొదుగుల్లో మోసే గోమాతలే రక్షించాలి - వసీరా

మన తెలంగాణ 23 Mar 2026 9:52 am

లిటిల్ ధియేటర్ కొన్ని అనుభవాలు

(గత సంచికతరువాయి) స్విస్ నాటక రచయిత Friedrich Durren matt రాసిన In the Matter of J.Robert Oppenheimer నుంచి కొన్ని భాగాలు కూడా లిటిల్ థియేటర్ బృందం రీడింగ్ చేసింది. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ గా ఆయన్ని పిలుస్తారు. ఇక్కడ ’మాక్స్ ముల్లర్ భవన్’ డైరెక్టర్ గారి భార్య ఈ రీడింగ్ సెషన్ ఏర్పాటు చేయించారు. బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ లో కూడా ఇదే ప్రదర్శన ఇచ్చారు. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందట! “హైదరాబాద్‌లోని ఇఫ్లూ (English and Foreign Languages University)లో కూడా ఈ ప్రదర్శన ఇచ్చాం. ఇఫ్లూకి బ్రిటీష్ కౌన్సిల్ వాళ్లు కొందరు ప్రొఫెసర్స్‌ని పంపేవాళ్లు. అందులో John Irving అని ఒక ప్రొఫెసర్ ఉండె. షేక్సియర్ వర్స్ స్కాలర్. జాన్ ఇర్వింగ్ తాత Henry Irving. ఆయన ‘The Henry Irving Shakespeare’ పేరిట ఎనిమిది సంపుటాలు రాశారు. అంతటి మహనీయుడి మనవడైన John Irving కూడా మాతో కలిసి In the Matter of J.Robert Oppenheimer రీడింగ్ చేశాడు” అని మరో జ్ఞాపక పుట నా ముందు తెరిచారు శంకర్ మెల్కొటె. ఇలాంటిదే మరో సందర్భం. శాంతా రామేశ్వరరావు ఒక కథ రాశారు. అచ్చవడానికి ముందే ఆ కథని శంకర్ చదివారు. ‘ద కాన్సర్ట్ (The Concerts) పేరుతో రాసిన ఆ కథ ఆయనకు చాలా నచ్చింది. ‘లిటిల్ థియేటర్’ తరపున దానిని ప్రదర్శిస్తానని ఆమెని అడిగితే “నీ మీద నమ్మకం ఉంది. చేయి” అన్నారట. ఆ కథ ఆమె ఫ్యామిలీలో నిజంగా జరిగిన ఘటన. మహారాష్ట్రలోని ఓ గ్రా మీణ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటుంది. భా ర్య, భర్త, ఇద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి. వాళ్లు చిన్నపిల్లలు. ఆ అబ్బాయికి క్యాన్సర్ ఉందని నిర్ధారణ అవుతుంది. ఆ అబ్బాయి చదువులో, ఆటల్లో చురుకైనవాడు. కానీ క్యాన్సర్! ఆ ఫ్యామిలీ మొత్తం మ్యూజిక్ లవర్స్. కచేరీ చూడ్డానికి ఆ తండ్రి రెండు టిక్కెట్లు కొంటాడు. కొడుకు రాలేడు గనుక తల్లిని తోడుగా ఉంచుతారు. తండ్రీ ‘కూతుళ్ళు కచేరీకి వెళతారు. కచేరీ ముగిసిన తర్వాత చూస్తే అతనికి తన కూతురు కనిపించదు. ఆడిటోరియంలో ఎక్కడ వెతికినా ఫలితం ఉండదు. చివరికి స్టేజ్ మీదకు వెళ్లి తెర వెనుక చూస్తే ఆ పాప పండిట్ రవిశంకర్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది. “మా అన్నయ్యకి ఆరోగ్యం బాగోలేదు. బాగుంటే తప్పక వస్తుండె. తనకి సంగీతమంటే పిచ్చి.. తనకి క్యాన్సర్‌” అని చెప్తూ ఉందట. అది విన్న రవిశంకర్ జాకీర్ హుసేన్ వైపు తిరిగి “ఉస్తాద్ ఏమంటావ్‌” అన్నారట. అతను “ఛలో” అని బదులిచ్చాడట. తర్వాత రోజు వాళ్లిద్దరు టాక్సి కట్టుకుని ఆ చిన్న ఇంటికి వస్తారు. ఆ పిల్లవాడి కోసం గంటసేపు కచేరీ చేస్తారు. అతని మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. కొనాళ్లకి ఆ బాబు చనిపోతాడు. ఇదీ ‘ద కాన్సర్ట్’ స్టోరీ సంక్షిప్తంగా. “ఈ కథని కూడా లిటిల్ థియేటర్ ఎంతో బాగా పెర్ఫార్మ్ చే సింది. ప్రముఖ ఎకనమిస్ట్ రాజా అంగార ఇందు లో పాల్గొని సితార్ ప్లేచేశారు. మంచి స్పందన వ చ్చింది” అంటూ ఆ మొత్తాన్ని కళ్లకు కట్టినట్టు చె ప్పుకొచ్చారు శంకర్ మెల్కొటె. అనంతర కాలంలో పబ్లిష్ అయిన ఈ కథని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ 10వ తరగతి ఇంగ్లీషు పాఠ్యాంశంగా స్వీకరించడం మరో ఆసక్తికర అంశం. ఇక ఇటీవలి సంగతికి వస్తే... ఈ మధ్య జర్మన్ కల్చరల్ సెంటర్ గోథెజెంత్రం (goethe-zentrum)లో పర్యావరణం గురించి ఒక రీడింగ్ చేశారు. దీంట్లో కూడా మ్యూజిక్ ని బాగా ఉపయోగించారు. కోల్ కతాలో జూనియర్ డాక్టర్ ని రేప్ చేసి చంపిన ఘటనకి నిరసనగా జాదవ్ పూర్ యూనివర్శిటీ విద్యార్ధులు స్ట్రీట్ డాన్స్ మాదిరిగా ఒక ప్రొటెస్ట్ నిర్వహించారు. దీనికి భూపేన్‌హజారికా రాసిన O Ganga Behti Ho KYun అనే పాటని ఉపయోగించారు. ఆ వీడియోతో రీడింగ్ మొదలుపెట్టారట. వారు ఎంచుకున్న సబ్జెక్టుకి సూటయ్యే పాట అది. ఆ తర్వాత పర్యావరణం మీద అయిదారు పీసెస్ చదివారట. చివర్లో అమెరికన్ ఫోక్ సింగర్ Joanbaez వర్షం గురించి పాడిన WHAT HAVE THEYDONE TO THE RAIN అనే పాటతో ముగించారట. దీనికి కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందని శంకర్ చెప్పారు. తమకి తటస్థపడే గురించి ఆయన వివరిస్తూ “మమ్మల్ని పురికొల్పే అంశాలు కొన్ని ఉంటాయి. ఎవరైనా ప్రసిద్ధ రచయిత హైదరాబాద్ వస్తే ఆ రచయిత వర్‌క్స్ చదువుతాం. ఎవరిదైనా వర్ధంతి వస్తే వారి రచనలు చదువుతాం. వరల్డ్ లిటరేచర్ డే వచ్చిందనుకోండి. లేదా ఏదైనా కొత్త మ్యాగజైన్ విడుదలైనా మాకు సందర్భమే” అన్నారు. ఇందుకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తావించారు కూడా. ITC గ్రూపు ఒక మ్యాగజైన్ తెస్తుంటుంది. ఒకసారి వాళ్లు సంగీతం గురించి ఒక ప్రత్యేక సంచిక తెచ్చారట. అందులోంచి మూడు కథలను ఎంచుకుని అదే హోటల్లో రీడింగ్ చేశారట. సంగీత విద్వాసురాలు మాలినీ రజుర్కర్ ముందు వరుసలో కూర్చుని తాళం వేశారట. “ఆ దృశ్యం మరచిపోలేనిది..” అన్నారాయన ఎంతో తృప్తిగా. ‘ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ స్ఫూర్తితో తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో కొందరు రీడింగ్స్ చేస్తున్నారిప్పుడు. శంకర్ మెల్కొటె అండ్ కో చూపిన మార్గానికి ఇది అర్ధవంతమైన కొనసాగింపుగా భావిస్తూ ‘ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ కృషికి మనసారా అభినందనలు తెలియచేద్దాం. - ఒమ్మి రమేష్ బాబు

మన తెలంగాణ 23 Mar 2026 9:46 am

పలవరింత

ప్రబంధ సాహిత్యం అనగానే స్త్రీల అంగాంగ వర్ణనలు గుర్తొస్తే అది చదువరి తప్పు కాదు. పాఠకులకు చేరువయ్యేందుకు దేహ వర్ణన అవస రం అనుకొని ఉంటారు ఆ కాలం కవులు. భాగవతం రాసిన పోతన భోగినీ దండకం కూడా రా శాడని గుర్తొస్తే ప్రాణం చివుక్కుమంటుంది. స్త్రీని భోగ వస్తువుగా చూసిన కాలం నుండి దూ రంగా జరగటం కాల్పనిక ప్రపంచానికి పునర్జన్మ లాంటిది. అలా దూరంగా జరిగిన ఇరవయ్యో శతాబ్దిలో స్త్రీ సంబంధ ఉద్వేగాన్ని వస్తువుగా చేసుకున్నవాడు కృష్ణ శాస్త్రి. ‘ఆమె కన్నులలో ననంతాంబరపు నీలినీడలు కలవు’ తరహా వాక్యా లు అంతకు పూర్వం ఎవరూ రాయలేదు. ఈ ‘అనంతాంబరాల నీలి నీడలు’ అనే మా ట దగ్గర లక్కలా అతుక్కుపోతాం. వస్తువులోకి దూరి దాన్ని పొట్టులా చెక్కటం, పద్యానికి చెఱకు తీపి అద్దటం అతడి కవిత్వ లక్షణం.పద్యమైనా, గేయమైనా ఒక్కలాగే సానబెడతాడు. కనులు మూసి నేను కలత నిద్దురపోవ జాజిపూవుల మాల జారి చెక్కిలి తాక వెదకేనునలుదిశలు అతనేమొ అనుకొని అంటాడు. ఎవరి సమీపాలు మనను జాజిపూల మాలలా తాకుతాయో వాళ్ళు వద్దన్నా మన ఆవరణలో నిండి ఉంటారు. అక్కడ నిద్ర లేమి కూడా పద్యంగా మారుతుంది. ఐతే కృష్ణ శాస్త్రి పలవరించే అజ్ఞాత స్త్రీ మూర్తి జీవన్ నందదాస్ కలవరించే వనలతాసేన్వంటిది కాదు. వాళ్ళిద్దరి ఆవరణలు ఒక్కటి కావు. జీవన్ దా తన పద్యాన్ని వనలతాసేన్ ఎదురుగా కూర్చొని చెపుతున్నట్టు చెబుతాడు. కృష్ణ శాస్త్రి తనలో సొమ్ముసిల్లిన స్త్రీ మూర్తి హృదయాన్ని పద్యంగా చేస్తాడు. కన్నీటి కెరటాలకు వెన్నెలద్దటం, నిట్టూర్పు గాడ్పులకునెత్తావి పులమటం లాంటి మాయలెన్నో చేస్తాడు. తనలో నిశ్శ్వాస తాళవృంతాలున్నాయని, కన్నీటిసరుల దొంతరలున్నాయని చెప్పుకుంటాడు. కోమల త్వం, స్త్రీత్వం ఏక కాలంలో ముప్పిరిగొంటాయేమో రాసినంత మేరా కంపించి పోతాడు కృష్ణ శాస్త్రి. ఇంతటి లాలిత్యం ఉన్న వాక్యాలు తన సమకాలీన కవులెవరూ రాయలేదు. ఈ క్రింది పంక్తి ఒకసారి చూడండి-. తమిబిగిసిపోవు నొక్క సంధ్యావసాన సాంద్ర కాశ్మీరదృఢపరిష్వంగ మందు నిమిడి, నిలు వెల్ల ఒదిగి శోషిలినయామె నేను తొలిసారి కాంచి కంపిలితి నాడు. శోషిల్లటం, కంపించటం అనే సాధారణ విషయా లు కవిలో ఒదిగినప్పుడు అవి చదువరికి కూడా బట్వాడా కావాలి. లేనప్పుడు ఆరాతలు కృతకం గా ఉంటాయి. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం సంపుటాలలో కృష్ణశాస్త్రి ఉద్వేగాలు పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 1925లో వచ్చిన కృష్ణ ప క్షానికి ఇప్పటికి వందేళ్ళు. విశ్వనాథ చెప్పినట్టు నా రుచి బతుకు నాది కనుక ఉబికిందొక పలవరింత. - రఘు 9676144904

మన తెలంగాణ 23 Mar 2026 9:40 am

Weather Report : చల్లటి వాతావరణం.. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:38 am

Telangana : నేడు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు

భారతీయ జనతా పార్టీ నేడు ఆందోళనకు దిగనుంది.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:33 am

సర్వ అమానవీయ రుగ్మతలకు.. ఏకైక ఔషధం పుస్తకం ఒక్కటే!

నేను నా సాహితీ యాత్ర: సరిగ్గా ఆరేళ్ళ క్రితం మనోధర్మ పరాగం అనే నవలను రాస్తున్నప్పుడు, ఆ కథను తెలుగు వాళ్ళదిగా చేయడం కోసమని నేను దా ని భూమికను మదురై నుంచీ కొన్నేళ్ల పాటు చిత్తూరుకు తీసుకొచ్చా ను. అయితే ఆ నవల పురివిప్పే కొద్దీ ఒకనాటి తొండనాడులోని భాగమైన చిత్తూరు జిల్లాలోని దక్షిణ ప్రాంతానికీ, కన్యాకుమారి నుంచీ మద్రాసు వరకూ వ్యాపించిన కర్ణాటక సంగీత ప్రపంచానికీ మధ్య వుండే అవిభాజ్యమైన సంబంధాన్ని తెలుసుకోగలిగాను. నేటి తమిళనాడులోని విల్లుపురం నుంచీ యిటు తిరుపతి వరకూ విస్తరించిన తొండనాడు అనే ప్రాంతానికున్న భిన్నమైన, విశిష్టమైన సాంస్కృతిక వారసత్వమేమిటో అప్పుడే నాకు అర్ధమైంది. కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీ రత్నత్రయమని పిలిచే వారిలో ఒకరైన డి.కె.పట్టమ్మాళ్ బాల్యం చిత్తూరులోనే గడచింది. మరో విదుషీమణి ఎమ్.ఎల్. వసంత కుమారి తల్లిగారు చిత్తూరు నుంచే మద్రాసుకెళ్లారు. ఆధునిక కర్ణాటక ప్రముఖ వాగ్గేయకారుడు మైసూరు సదాశివరావు చిత్తూరులోనే పుట్టాడు. చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై నుంచీ నాగయ్య వరకూ ఎందరో చిత్తూరులోనే పుట్టిపెరిగారు. చిత్తూరుకు కేవలం అరవై మైళ్ళ దూ రంలో వుండే కంచి కర్ణాటక సంగీతాని కే కాదు, తొండనాడుకే రాజధానిగా ఉండే ది. స్వతంత్రం వచ్చేముందు వరకూ తెలు గూ, తమిళమూ ఎంతో స్నేహంగా కలిసి జీవించాయి. ఆ స్నేహం లోంచే తిరువయ్యూరు సంగీతత్రయం, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రీ పుట్టారు. మదురై తెలుగు సాహిత్యానికి శతా బ్దం పాటూ వేదికయ్యింది. భరతనాట్యం సదర్ పేరుతో వెలుగొందింది. తొండనాడులోని జనాలకు రెండు మాతృ భాషలుంటాయని చెప్పడం ఉత్ప్రేక్ష కాదు. కంబరామాయణం తెలుగు అనువాదానికి ముందుమాట రాస్తూ కట్టమంచి రామలింగారెడ్డి గారు ‘జాతి చేత తెనుగువారును అరవ వారును ఒక్కరని శాస్త్రజ్ఞుల సిద్ధాంతము. వీరిరువురకును ఎన్ని యోతరముల క్రిందట సామాన్యమైన తెగ ఒక్కటి యుండెడిది’ అని చెప్పారు. 1850 ప్రాంతంలో మాముత్తాత ఇప్పటి చిత్తూరు జిల్లాలోని రవణయ్యగారి పల్లి అనే పాతిక యిండ్ల గ్రామపు రైతుల ఆహ్వానం మేరకు తెలుగు పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయుడుగా నాటి అదే దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని జింజికోట దగ్గరి వెంకటాపురం గ్రామం నుంచి వలసవచ్చి స్థిరపడ్డాడు. అయితే ఆయనప్పుడు చేసిన నూరుమైళ్ళ ప్రయాణం తీసుకొచ్చిన ఉపద్రవాలేమిటో తరువాతే నాకు తెలిసివచ్చాయి. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలుగా విభజించడం అవసరం. అయితే భాషను కొలబద్దగా చేసుకుని భాషాప్రయుక్త రాష్ట్రాల యేర్పాటు చేసుకోవడం తెలుగువాళ్లు చేసిన నేరం. కన్యాకుమారి నుంచీ నాగపూరు వరకూ తమిళ, కన్నడ, మలయాళ, మహారాష్ట్రులతో కలసి జీవిస్తున్న తెలుగువాళ్ళను ఒకటో లేక రెండు భాషాప్రయుక్త రాష్టాలలోకి తీసుకురావడం జరగని పని. ఈ రాజకీయ విభజనల వల్ల సగంమంది మాతృభాషను పరిరక్షించుకోవడం కోసం ఉద్యమాలు చేయవలసిన దుర్గతి సంభవించింది. తొండనాడుకైతే తన మూలాల్ని కోల్పేయే ప్రమాదం వచ్చింది. మనోధర్మపరాగం నవల నన్ను నా వేర్లను వెతుక్కోవలసినదిగాహెచ్చరించింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జరిగిన అనేక సాంఘిన , సాంస్కృతిక విధ్వంసాలు ‘దాయాదుల తోట’ అనే నవలను రాసేలా చేసింది. తొండనాడు చెరువుల కింద వ్యవసాయం చేసేప్రాంతం. ఏడాదికి యిరవై పదున్ల వానలు పడితేయేర్లు పారి చెరువులు నిండి రైతుకు ఒక పంటైనా యిల్లుచేరేది. యిక్కడి రైతులందుకే ఒకప్పుడు సుఖంగానే జీ వించారు. అయితే తొండనాడును రాయలసీమ గొడుగుకిందికి తోసి, ఇక్కడ కూడా యేర్లకు చెక్డాముల్ని గట్టేసారు. దాని తోడాముల దగ్గర వందల ఎకరాల్లో ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయి. కానీ ఆయే ర్ల దిగువ పరీవాహిక ప్రాం తాల్లో వేల ఎకరాల్లో భూగర్భ జలాలు ఎండిపోయి, వందల అడుగుల బోర్లుదించి నా నీళ్లు అందక తాగే నీళ్ళు కూడా లేక ప్రజలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోంచే కొత్తగా ‘నీరు పల్లమెరుగు’ అనే నవల రూపొందింది. మా ముత్తాత నెలకొల్పిన ప లు కూటంలో పెద్దబాలశిక్ష, బాల రామాయణం, అమ రం, ఆంధ్ర నామసంగ్రహం, భారతంలోని ఆదిపర్వం పా ఠ్య పుస్తకాలుగా ఉండేవి. వీటితోబాటు నాటి ఉపాధ్యాయుడు గ్రామీణులకు భారత రామాయణాలలోని కథల నాధారంగా చేసుకున్న నాటాకాలను (వాటిని ఆట అనేవాళ్ళు) నేర్పించాలి. విరాట పర్వం, నలచరిత్ర ఏడాదికోసారైనా రైతులు పారాయణం చేసేవాళ్ళు. యివి కాకుండా పజ్జెనిమిది రోజుల భారత యజ్ఞాలు, వీరగాధలు, పేరంటాల కథలు, కాంభోజ రాజుకథ, బాలనాగమ్మ కథ, ముగ్గురు మరాఠీలు, పల్లెపడుచులు పాటలు, జంగం దేవర్ల పాటలు మొదలైన తొండనాడు జానపద సంస్కృతి తన రచనలకంతా గంభీరమైన నేపధ్యాన్ని సమకూర్చిందని మా నాన్న చెప్పుకున్నారు. ఈ పాదులోంచి పుట్టినవాడిని నేను. మా నా న్న మాటల్లోనే చెప్పాలంటే కొత్త నీటికి ఎక్కొచ్చిన చేప పిల్లలా నేను సాహిత్యంలోకి ప్రవేశించాను. తొలి నుంచీ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేసి రూపుదిద్దిన మార్కిస్టు మానవీయ దృక్పథం నాకూ జవసత్వాలనిచ్చింది. నా పదహారవ సంవత్సరంలో 1973లో నా మొదటి కథ వచ్చింది. పెద్ద మాటల్లో చెప్పాలంటే నా సాహిత్య స్వర్ణోత్సవం రెండేళ్ల క్రితమే జరిగిపోయింది. సృజనాత్మక రచన తొలిరోజుల్లో నాకు సాహి త్య సాధన గానూ, వ్యక్తిగత శోధన గానూ, ప్రాపంచికావగాహనా వేదిక గానూ, సత్యాన్వేషణా వాహిక గానూ తోడ్పడింది. క్రమంగా అది మానసికావసరంగా (pscychological necessity)గా కూడా మారింది. నిస్సిమ్ ఏజె కిఎల్ అ న్నట్టుగా నన్ను నేను యెదుర్కోవడానికీ, నన్ను నేను అదుపులో పెట్టుకోడానికి రచన తప్పనిసరి అవసరమైపోయింది. చాలామంది లాగే నేనూ నా కోసమే రాసుకుంటాను. అయి తే ఈ క్రమంలో సహృదయుడైన పాఠకుడికీ చేరువవ్వాలని గాఢంగా కోరుకుంటాను. పాఠకుడనే వాడు లేకుంటే ఏ రచనకైనా అస్తిత్వముండదు. అయితే రచయితగా నేను ప్రారంభించినప్పుడున్నంత సౌలభ్యం, సౌకర్యం యిప్పుడు లేదు. నేటి తెలుగుసాహిత్య మూ, సంస్కృతులు సోదర దక్షిణ భారత భాషలతో పోల్చడానికి వీల్లేనంత దయనీయంగా వున్నాయి. యిరవై కోట్ల మంది వుండే తెలుగు కు ఒక సాహిత్య పత్రికైనా లేదు. మనలో సగమైనా జనాభా లేని ఆ భాషల్లో వున్న పాఠకుల్లో మనకు నాలుగో వంతయినా లేరు. ఆ ప్రభుత్వాలు భాషా సాహిత్యాలకిచ్చే ప్రాముఖ్యత మనకు మచ్చుకైనా లేదు. మనలో వున్న విద్యావంతులకు వ్యాపార సినిమాల పైన వున్నంత మోజు మరిదేనిపైనా లేదు. భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి పత్రికలు కేవలం మనకు చరిత్ర మాత్రమే! ఇప్పుడు కూడా పదికిపైగా సాహిత్య పత్రికలున్న సోదర దక్షిణ భారత భాషల్లో విందు భోజనాల్లాంటి పెద్ద ప్రత్యేక సంచికలూ వస్తున్నాయి. ఒకప్పుడు మారుమూల పత్రికలో కథ వచ్చినా చదివి స్పందించే వాళ్లు ఎందరో ఉండేవారు. యిప్పుడు యింకా రాస్తున్నావా అని అడిగే వాళ్లే కనబడుతున్నారు. తెలుగు సాహిత్యంలో యిది ఒక చీకటి కాలం. ఇటీవలి కాలంలో జరిగిన గ్రంధాలయ పునరుజ్జీవనోద్యమం, బుక్ బ్రహ్మ పుస్తకోత్సవం లాంటివి కొద్దిగా కాంతి కిరణాల్ని ప్రసరిస్తున్నాయి. కొత్తగా వచ్చిన యువ ప్రచురణకర్తలు చాలా పుస్తకాల్ని ప్రచురించి పెద్ద సంఖ్యలో పుస్తకాల్ని అమ్మగలగడం ఆశాజనకంగా వుంది. కాలక్షేప పుస్తకాలతో, ఊహా ప్రేమ కథలతో మురిసిపోతున్న పాఠకులలో కొందరైనా మంచి సాహిత్య పాఠకులయి తీరుతారనే నమ్మకముంది. వాచకాని (text) కున్న ప్రాముఖ్యతను తెలుగు సినిమా విస్మరించినట్టుగా మరే యితర భాష రాష్ట్రాల్లోనూ నిర్లక్ష్యం చేయలేదు. కంప్యూట ర్లూ, ఇంటర్నెట్, సినిమాల లాంటి ఆధునిక మాధ్యమాలెన్ని వచ్చినా అవి వాచకపు మారు రూపాలే గానీ, వాచకపు ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు. యిప్పుడు ప్రపంచంలో వున్న సర్వ అమానవీయ రుగ్మతలకూ వున్న ఏకైక ఔషధం పుస్తకం ఒక్కటే! యిన్ని విపత్కర పరిస్థితులలోనూ సా హిత్యాన్ని నిష్కామకర్మగా భావించే రచయితలిందరుండడం తెలుగు వాళ్ళు గర్వించవలసిన విషయం. అయితే వాళ్ల మాటల్ని వినే పాఠకలోక మొకటి బలపడకపోతే, అది అరణ్య రోదనమే అవుతుంది. పుస్తకాలు చదవడమనే ఈ పనిని స్వయంగా రచయితలూ, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ బలంగా కొనసాగించినప్పుడే పిల్లలూ, వి ద్యార్థులూ పాఠకులుగా ఎదుతారు. తెలుగువాళ్లిప్పుడు మిగిలిన భా షల వాళ్ళ నుంచీ నేర్చుకుని, తమను తాము నాగరికులమని అవసరం అత్యవసరమైంది. - మధురాంతకం నరేంద్ర  

మన తెలంగాణ 23 Mar 2026 9:31 am

Tirumala : సోమవారం కూడా తిరుమల కిటకిట

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:25 am

Ustaad Bhagat Singh: Why Outright Rejection?

Pawan Kalyan’s recent offering Ustaad Bhagat Singh has turned out to be a big shock for the audience, fans and the film industry. After being released during Ugadi holiday season, Ustaad Bhagat Singh failed to register minimum numbers and the film was badly rejected. What really happened? Pawan Kalyan: The actor has sent clear signs […] The post Ustaad Bhagat Singh: Why Outright Rejection? appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 9:20 am

అక్రమ అరెస్టులతో ఆపలేరు..

అక్రమ అరెస్టులతో ఆపలేరు.. చిట్యాల, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు

ప్రభ న్యూస్ 23 Mar 2026 9:18 am

20 సార్లు మటన్ ఉడికించిన ఉడకలేదు సర్... కేసు నమోదు చేయండి

అమరావతి: మటన్ ఉడక లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. ఉగాది సందర్భంగా సోడాల హాజీ అనే వ్యక్తి కిలో మేక తలకాయ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లిన తరువాత కుక్కర్ లో వేసి ఉడికించాడు. 20 సార్లు ఉడికించినా ఉడకకపోవడంతో మటన్ గిన్నెతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మటన్ అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాడు. పోలీసులు అతడికి సర్ది చెప్పి పంపించారు. అనంతరం హాజీ మటన్ అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్లి గొడవకు దిగాడు. తన గిరాకీకి ఎసరు పెట్టేటట్లు ఉన్నాడని తల కాయ కూరకు బదులుగా కిలో మటన్ ఇచ్చి అతడిని మాంసపు వ్యాపారి పంపించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మన తెలంగాణ 23 Mar 2026 9:17 am

Telangana : నేడు కేబినెట్ సమావేశం

నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరడనుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:09 am

బీజేపీ నాయకులు అరెస్ట్.. ఎందుకంటే..

బీజేపీ నాయకులు అరెస్ట్.. ఎందుకంటే.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 23 Mar 2026 9:08 am

Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ విడుదలయింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 9:02 am

మత్స్యకారుల నేత చెన్ను గురుమూర్తి మృతి..

మత్స్యకారుల నేత చెన్ను గురుమూర్తి మృతి.. అవనిగడ్డ, ఆంధ్రప్రభ : జాతీయ మత్స్యకారుల

ప్రభ న్యూస్ 23 Mar 2026 8:53 am

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:49 am

కన్న కొడుకే… కాటికి పంపాడు..

కన్న కొడుకే…కాటికి పంపాడు.. అవుకు రూరల్, ఆంధ్రప్రభ : కుమారుడు కాదు.. తల్లిదండ్రుల

ప్రభ న్యూస్ 23 Mar 2026 8:45 am

Positive response for Guvvala Cheruvu Ghat & Kiran Abbavaram’s OTT Entry

The recently released glimpse of Guvvala Cheruvu Ghat has garnered strong and largely positive attention across digital platforms, setting the tone for what could be one of the most intriguing Telugu OTT debuts in recent times. Viewers and netizens have particularly appreciated the raw, rustic visuals and grounded setting, which hint at a gritty, rooted […] The post Positive response for Guvvala Cheruvu Ghat & Kiran Abbavaram’s OTT Entry appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 8:45 am

Gold Prices Today : గుడ్ న్యూస్...బంగారం లక్షకు దిగి వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే?

ఈరోజు దేశంలో బంగారం ధర తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:39 am

అమ్మ పాలివమ్మ నాకు ఆకలి అవుతుంది... రాత్రంతా మృతదేహం వద్ద చిన్నారి

మన తెలంగాణ షాదనగర్: అక్రమ సంబంధంతో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం రంగారెడ్డిగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ షాదనగర్ డిజిపి శిరీష సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామపంచాయతీ రంగారెడ్డిగూడకు చెందిన పోతుల శోభారాణి (30)  మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన రాజుతో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితం కొన్నేండ్ల పాటు సాఫీగా సాగింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నర్సింహులుతో శోభారాణికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం భర్త రాజును వదిలేసి శోభారాణి పిల్లలతో కలిసి తల్లిగారింటికి వచ్చింది. అప్పటి నుంచి నర్సింహులు శోభారాణిని పెళ్లి చేసుకుంటానని కుల పెద్దలు, భర్తతో మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త రాజు శోభారాణిని శనివారం రాత్రి అత్యంత దారుణంగా చంపి రంగారెడ్డిగూడ- తంగడపల్లి రహదారిలో చెట్ల పొదల్లో పడేశాడు. ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలం పనులు వెళ్తుండగా తల్లి శవం వద్ద రోదిస్తూ మూడేళ్ల చిన్నారి గమనించి గ్రామ సర్పంచ్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రంతా తల్లి శవం వద్ద వద్ద చిన్నారి రోదనలతో గడపడం చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. హత్య ఘటనపై పట్టణ సిఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 23 Mar 2026 8:23 am

Andhra Pradesh : ఏపీఐఐసీ భూముల విషయంలో కీలక నిర్ణయం

ఏపీఐఐసీ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:19 am

Weekend Box-office: Dhurandhar overshines UBS

It is a surprising weekend for Telugu cinema during the Ugadi weekend. Pawan Kalyan’s Ustaad Bhagat Singh and Bollywood film Dhurandhar: The Revenge released across the globe. Ustaad Bhagat Singh was preponed by a week to take the advantage of Ugadi weekend but the film has been badly rejected by the audience. The biggest surprise […] The post Weekend Box-office: Dhurandhar overshines UBS appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 8:19 am

Andhra Pradesh : ఏపీలో రేషన్ షాపుల్లో కిరోసిన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 8:13 am

33 కేవీ వోల్టేజ్ బూస్టర్ ఏర్పాటు..

33 కేవీ వోల్టేజ్ బూస్టర్ ఏర్పాటు.. ఆళ్లపల్లి/ గుండాల, ఆంధ్రప్రభ : ఉమ్మడి

ప్రభ న్యూస్ 23 Mar 2026 8:10 am

ఔటర్ రింగ్ రోడ్ పై డిసిఎంను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిఎస్ పిఎ సమీపంలో ముందుగా వెళ్తున్న డిసిఎంను కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రోడ్డుపై ప్రమాదం జరగడంతో ఔటర్ రింగ్ రోడ్ పై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపు నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా  స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. 

మన తెలంగాణ 23 Mar 2026 8:05 am