SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

Ys Jagan : ఈ నెల 17న గవర్నర్ తో జగన్ భేటీ

ఈనెల 17న గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

తెలుగు పోస్ట్ 7 Dec 2025 8:22 am

కొత్త సారథులు

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా దేవరపల్లి గ్రామానికి చెందిన తంగేళ్ల మునీశ్వర రావు ప్రధాన కార్యదర్శిగా దేవరపల్లి గ్రామానికి చెందిన ఉప్పులూరి రామారావులూ నియమితులయ్యారు ఈ మేరకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు ఇదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎర్రం శెట్టి ముత్యాలరావు (త్యాజం పూడి )బాదంపూడి ఇందిర( ఎర్నగూడెం) మండల కార్య నిర్వాహక కార్యదర్శులుగా ఎర్రగుల్ల వెంకటేశ్వరరావు […] The post కొత్త సారథులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Dec 2025 8:21 am

Scrub Typhus | 12 పాజిటీవ్ కేసులు..

Scrub Typhus | 12 పాజిటీవ్ కేసులు.. Scrub Typhus, మచిలీపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Dec 2025 8:17 am

బాలూ విగ్రహం చుట్టూ.. భావోద్వేగాల చిటపటలు

కళలకు, కళాకారులకు కులం, మతం, ప్రాంతం ఉండవు. అయితే కళలు, కళాకారులు ఆయా సందర్భాలలో ఎందుకు వివాదాస్పదం అవుతుంటారు? శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం అనే ప్రఖ్యాత నేపథ్య సినీ గాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రస్తుతం వివాదాంశం అయింది. డిసెంబర్ 15 బాలసుబ్రమణ్యం జయంతి. ఆ సందర్భంగా ఆయన అభిమానులు, బంధుమిత్రులు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. తెలంగాణకు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లుతున్న రవీంద్రభారతిలో ఆ విగ్రహ ప్రతిష్ఠకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఇది తెలంగాణావాదులు కొందరికి అభ్యంతరకరం అయింది.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎస్‌పి బాలు విగ్రహం బదులు ఉత్తరాంధ్రకు చెందిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు విగ్రహం పెడితే ఇప్పుడు అభ్యంతరం చెప్తున్న తెలంగాణ క్రాంతి దళ్ ఫౌండేషన్ నాయకుడు పృథ్వి ఆ పని చేసేవాడు కాదేమో. అంతెందుకు, బాలు విగ్రహం స్థానంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో సినీ నేపథ్య గాయకుడు రామకృష్ణ విగ్రహం పెడితే తాను రెండు తట్టల మట్టి కూడా ఆ విగ్రహ ప్రతిష్ఠకోసం మోసి సంఘీభావం తెలిపేవాడినన్నారు పృథ్వి. అంటే, ఇటువంటి భావోద్వేగాలు ఆయా సందర్భాలలో అప్పటి పరిస్థితులను బట్టి, ఆయా వ్యక్తుల వ్యవహార శైలిని బట్టి ఉంటాయి అన్నట్టే కదా. బాలసుబ్రమణ్యం విగ్రహం పెట్టబోతున్న ప్రాంగణంలోనే మరో ప్రముఖ గాయకుడు ఘంటసాల విగ్రహం కూడా ఉన్నది. దానిని తీసేయాలని ఉద్యమకారులు అడగడం లేదు. ఆ మాటకొస్తే ఒక్క రవీంద్రభారతి ఆవరణలోనే కాదు, హైదరాబాద్ నగరంలో చాలాచోట్ల అనేకమంది విగ్రహాలు ఉన్నవి. పలు ప్రాంతాలకు కూడా ఎందరో తెలంగాణకు చెందనివారి పేర్లు ఉన్నవి. అందులో చాలామంది ఆంధ్ర ప్రాంతంవారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకంటే కూడా ఆంధ్ర ప్రాంతంవారివి ఎక్కువ ఉండే అవకాశం ఎందుకు ఉందంటే పది పన్నెండేళ్ల క్రితంవరకు ఆ ప్రాంతానికి కూడా హైదరాబాదే రాజధానిగా ఉండింది కాబట్టి. భావోద్వేగాలు ఎల్లవేళలా అందరి విషయంలో ఒకేలాగా ఉండవు. నిజానికి ఘంటసాల విగ్రహం పెట్టింది 2012లో. అప్పుడు దాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమం తారస్థాయికి చేరిన రోజులవి. కిరణ్ కుమార్ రెడ్డి ‘తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని శాసనసభ సాక్షిగా తన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించుకుంటున్న రోజులు అవి. అయినా ఎవరూ అడ్డుకోలేదు. ఘంటసాల తెలంగాణ వాస్తవ్యుడు కాకపోయినా ఇక్కడి అత్యధిక సంఖ్యాకుల ఆకాంక్షలను వ్యతిరేకించిన వ్యక్తి కాదు, కనీసం బహిరంగంగా కాదు. ఈ విగ్రహాల తగాదా జరుగుతున్న రవీంద్రభారతికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టారు. మరి ఆయన బెంగాలీ కదా అనే వితండవాదం చేసేవాళ్లకు చెప్పాల్సిందేమిటంటే విశ్వకవికి తెలంగాణ ఉద్యమ వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ఇది ఒక తొండివాదన తప్ప మరోటి కాదు. అంతెందుకు, తొలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న రోజుల్లో ప్రఖ్యాత నటుడు ఎన్‌టి రామారావు తెలంగాణ ఉద్యమకారులు అందరినీ రెచ్చగొట్టే విధంగా ఒక సినిమాలో, తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే అని ఒక పాట పెట్టి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై థియేటర్ల తెరలు తగలబెట్టించుకున్నారు. నిజానికి ఈ పాట రాసింది తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత సి నారాయణరెడ్డి కాగా, నటించింది మాత్రం ఎన్‌టిఆర్. అదే ఎన్‌టి రామారావు పార్టీ పెడితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకంటే ఎక్కువ ప్రజాదరణ ఆయనకు తెలంగాణలో లభించింది. ఎక్కువ సంఖ్యలో స్థానాలు గెలుచుకున్నారు. తెలుగు సినిమా రంగం మద్రాసు నుండి హైదరాబాద్ తరలి రావడానికి ముఖ్యకారకుడు, వీర తెలంగాణవాది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కదా. 1978లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే సినిమావారికి అవసరమైన అనేక సదుపాయాలు ప్రభుత్వం తరఫున కల్పించినప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్న సినీ ప్రముఖులు దాదాపు అందరూ ఆంధ్ర ప్రాంతం వారే. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ఫిలింనగర్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు సినిమా రంగంవారు. 1969 తొలి దశ ఉద్యమంలో కేంద్ర బలగాలను కూడా రప్పించి దాదాపు 350మంది యువతీయువకులు ఆ బలగాల కాల్పుల్లో మరణించడానికి కారకుడయ్యాడని ఉద్యమకారులు ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని విపరీతంగా ద్వేషించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కాలంలో చిరాన్ పార్క్‌కు కెబిఆర్ పార్క్ అని నామకరణం చేసి, దాని ప్రవేశద్వారం వద్ద బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇన్ని దశాబ్దాలు గడిచినా మలిదశ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా ఎవరూ దాన్ని తొలగించాలని కోరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలి ముఖ్యమంత్రి కాగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్ది కాలం పార్క్ పేరు కెబిఆర్ అని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకపోయినా తర్వాత రోజుల్లో తత్వం బోధపడి మిన్నకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్క్‌లో రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వాళ్లలో మెజారిటీ ఆంధ్ర ప్రాంతం వారే. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర విభజనకు బద్ధ వ్యతిరేకి. కానీ ఆయన చేసిన ప్రజాహిత కార్యక్రమాల కారణంగా ఇప్పటికీ తెలంగాణలో అసంఖ్యాకులు ఆయనను ప్రేమిస్తారు. తెలంగాణలో కూడా ఆయన విగ్రహాలు లెక్కకు మించినన్ని. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిందని ఆనాటి హోమ్ మంత్రి చిదంబరం ప్రకటించగానే ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుతో రాత్రికి రాత్రి గుసగుసలాడి శాసనసభ్యులచేత మూకుమ్మడి రాజీనామాలు చేయించి విభజన ప్రక్రియను తాత్కాలికంగా వెనక్కు నెట్టిన ఆనాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహం హైదరాబాద్ నగర వీధుల్లో నిక్షేపంగా నిలిచే ఉంది కదా. ఇన్ని ఉండగా, ఒక్క బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉదంతానికి వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తున్నది, అందరిపట్ల, అన్ని సమయాలలో తెలంగాణ ప్రాంత ప్రజల భావోద్వేగాలు ఒకే రకంగా ఉండవు. జరిగిందేమిటంటే, ఇటీవలే మరణించిన ప్రముఖ తెలంగాణ గాయకుడు, కవి, రచయిత అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ప్రభుత్వం రాష్ట్రగీతంగా ప్రకటించింది. 2004లో అప్పటి ఉద్యమ సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ గీతాన్ని బాలసుబ్రమణ్యంతో పాడించి రికార్డు చేయడానికి నిర్ణయించుకుని అడ్వాన్స్ డబ్బు కూడా చెల్లించి ఒక బృందం చెన్నై వెళ్ళింది. గీతం అంతా చదివిన బాలసుబ్రహ్మణ్యం అందులో చివరగా వచ్చే స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఎదగాలి అన్న వాక్యం తొలగిస్తే తప్ప పాడనని అన్నారు. దానికి ఉద్యమకారులు అంగీకరించలేదు. బాల సుబ్రహ్మణ్యం తనకు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేశారు. అదే పాటను ఆ ప్రాంతానికి చెందిన మరో నేపథ్య గాయకుడు రామకృష్ణ పాడారు. ఉద్యమ కాలంలో ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ పాట పాడినందుకు గాయకుడు రామకృష్ణకు ఆంధ్ర ప్రాంతంలో అవమానం జరిగిందని తెలంగాణవాదుల ఫిర్యాదు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలనుకుంటున్న తరహాలోనే రామకృష్ణ శ్రేయోభిలాషులు, మిత్రులు, రాజమండ్రిలో ఆయన విగ్రహం సొంతంగా ఏర్పాటు చేయదలచుకున్నప్పుడు అక్కడి రాజకీయ పక్షాలు దాన్ని వ్యతిరేకించి ఆ పని జరగనివ్వలేదన్నది ఆ ఫిర్యాదు. తెలంగాణ ఉద్యమం మీద తీసిన ఒక సినిమాలో నటించినందుకు ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన వాటిని లెక్క చెయ్యలేదు. ఉద్యమ సమయంలో ఆ పాటను అంతగా ఉపయోగించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాటను, ఆ పాట రచయిత అందెశ్రీని అంతగా పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించి అందెశ్రీని, ఆయన పాటను అక్కున చేర్చుకున్నారు. అంతేకాదు, దురదృష్టవశాత్తు ఇటీవల అందెశ్రీ మరణిస్తే అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి ఆయన పాడెకు తన భుజాన్ని ఇచ్చారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, రాష్ట్ర గీతంగా గుర్తించిన తర్వాత ఆ పాటకు సంగీతాన్ని సమకూర్చడానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణిని అందెశ్రీ స్వయంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో జరగబోయే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్ లో కూడా కీరవాణి కచేరి ఉండబోతున్నది. కీరవాణిని ఎవరూ అడ్డుకోబోవడం లేదు. ఆయనను కళాకారునిగానే తెలంగాణవాళ్ళు గుర్తిస్తున్నారని అర్థం. ఇక్కడ ఇంకో విషయం తప్పకుండా చెప్పుకోవాలి. జూబిలీహిల్స్ ప్రాంతంలో 1984 ప్రాంతాల్లో ఏర్పాటయిన జర్నలిస్టుల కాలనీకి ఎం. చలపతిరావు నగర్ అని పేరు పెట్టుకున్నారు. 2007 డిసెంబరులో ఆ కాలనీ చౌరస్తాలో చలపతిరావు విగ్రహాన్ని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. గత 18 ఏళ్ళుగా ప్రతి యేటా ఆయన విగ్రహం నివాళులు అందుకుంటూనే ఉన్నది. నెహ్రూ సమకాలికుడు, సన్నిహితుడు, జాతీయస్థాయిలో ప్రఖ్యాతుడయిన చలపతిరావు శ్రీకాకుళంలో పుట్టాడు కాబట్టి హైదరాబాద్ లో విగ్రహం పెట్టొద్దని ఎవరయినా అన్నారా? కాబట్టి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఏర్పడిన వివాదాన్ని అనవసరంగా ఆంధ్ర ప్రాంత వ్యతిరేకతగా చిత్రించకుండా ఉంటే మంచిది. ముందే చెప్పుకున్నట్టు, ఇటువంటి భావోద్వేగాలు ఆయా సందర్భాలలో అప్పటి పరిస్థితులు, ఆయా వ్యక్తుల వ్యవహార శైలినిబట్టి ఉంటాయి. నిజానికి ఎవరి విగ్రహాలు ఎక్కడ పెట్టాలనే విషయం ప్రస్తుతం ఆలోచించవలసిన అంశమే కాదు. ఈ విగ్రహాల విషయంలో ఇంకొక వాదన కూడా ఉంది. తెలంగాణవాదులు అంటున్నది ఏమిటంటే, ఆంధ్ర ప్రాంతాల్లో తెలంగాణనుంచి ప్రఖ్యాతి చెందిన వ్యక్తులెవరి విగ్రహాలు ఎందుకు లేవు అని. నిజమే, తెలంగాణ ప్రాంతంవాడైన పివి నరసింహారావు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లోకసభకు పోటీ చేసింది కూడా రాయలసీమలోని నంద్యాల లోకసభ నియోజకవర్గం నుండి. కనీసం పివి నరసింహారావు విగ్రహమైన ఆంధ్రలో ఉండాలి కదా. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరికొందరు ప్రముఖులు కూడా తెలంగాణవారున్నారు. వారెవరి విగ్రహాలూ ఆంధ్రప్రాంతంలో లేవు కదా. మరి దానికి సమాధానం ఏముంటుంది? అయితే రాష్ట్రం విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక 11 సంవత్సరాలు గడిచినా ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని అపశ్రుతులు వినిపిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలు ఎండిపోతే తెలంగాణ వారి దిష్టి తగిలిందని ఒక బాధ్యతారహితమైన, పనికిమాలిన వ్యాఖ్య చేశారు. పొద్దున లేస్తే తన నివాసంతో సహా, తన సినిమా కార్యకలాపాలన్నీ హైదరాబాదులోనే కొనసాగిస్తూ, ఇక్కడి సౌకర్యాలు అన్నీ అనుభవిస్తూ కూడా తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంత ప్రజల మీద పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు అక్కసు వెళ్ళగక్కడం ఇవాళ కొత్త కాదు. అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నప్పుడు దానికి జవాబు అన్నట్టుగా పృథ్వీలాంటివాళ్లు బాలసుబ్రహ్మణ్యంవంటి వారి విగ్రహాల ఆవిష్కరణను అడ్డుకుంటారు. ఇప్పుడు కావాల్సింది విగ్రహాల వివాదం కాదు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలం గడిచిపోయినా సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం, అందెశ్రీ పాటను రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించడం వంటి కొన్ని చర్యలు తప్ప తెలంగాణ కళలు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి, వికాసానికి, వాటికి శాశ్వత కీర్తి తేవడానికి అవసరమైన విధానమే ఇప్పటివరకు ప్రభుత్వాలు రూపొందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఒక కమిటీ వేసినట్టు గుర్తు. ఆ కమిటీ నివేదిక పరిశీలించి,దాని అమలుకు తగిన చర్యలు తీసుకుంటే ఇటువంటి చిన్న చిన్న వివాదాలకు ఆస్కారం ఉండకుండా పోతుంది.  

మన తెలంగాణ 7 Dec 2025 8:17 am

కొవ్వూరు డివిజన్లో దూసుకెళ్తున్న మహిళా ఉన్నతాధికారి

సమస్యలను పరిష్కరించడంలో దిట్ట.. అక్రమార్కుల గుండెల్లో హడలు.. విశాలాంధ్ర – కొవ్వూరు: ఆమె డివిజన్ కు మహిళా ఉన్నతాధికారి.. నిత్యం తన కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటమే కాక వారి సమస్యలను పరిష్కరించడంలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా కు పాల్పడుతున్న అక్రమాలను అరికడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఆమె కొవ్వూరు డివిజనల్ అధికారి (ఆర్డీవో) రాణి సుస్మిత. ప్రతి సోమవారం తన కార్యాలయంలో జరిగే పీజీ ఆర్ఎస్ కార్యక్రమం […] The post కొవ్వూరు డివిజన్లో దూసుకెళ్తున్న మహిళా ఉన్నతాధికారి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Dec 2025 8:16 am

‘కామాఖ్య’ ఫస్ట్ లుక్ విడుదల

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ మూవీ ’కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంత్రి సీతక్క ’కామాఖ్య’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి టీంకు అభినందనలు తెలియజేశారు. ఇంటెన్స్, థ్రిల్లింగ్‌గా కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు.

మన తెలంగాణ 7 Dec 2025 8:10 am

Ghantasala |మరో శంకరాభరణం కానుందా..?

Ghantasala | మరో శంకరాభరణం కానుందా..? Ghantasala, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 7:58 am

23 people killed in Goa nightclub fire

A tragic mishap at a nightclub in Goa has killed 23 people after a cylinder blast took place on Saturday midnight in Arpora of North Goa. The unfortunate incident happened at nightclub named Birch by Romeo Lane, which opened to its customers last year. Out of the 23 casualties, there are three tourists and all […] The post 23 people killed in Goa nightclub fire appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 7:48 am

విభిన్నమైన హారర్ థ్రిల్లర్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఎంఎస్‌కె ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించనున్నామని ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందని, సూపర్ స్టార్ కృష్ణపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.  

మన తెలంగాణ 7 Dec 2025 7:40 am

Avanigadda |నీటిపారుదల శాఖ ఏఈ మృతి..

Avanigadda | నీటిపారుదల శాఖ ఏఈ మృతి.. Avanigadda, ఆంధ్రప్రభ : చల్లపల్లిలో

ప్రభ న్యూస్ 7 Dec 2025 7:31 am

Goa Accidnet : గోవాలో ఘోర అగ్ని ప్రమాదం ..23 మంది మృతి

గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై మూడు మంది మరణించారు

తెలుగు పోస్ట్ 7 Dec 2025 7:31 am

గోవాలో భారీ అగ్నిప్రమాదం: 23 మంది దుర్మరణం

పనాజి: గోవా రాష్ట్రం ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 'బర్చ్ బై రోమియో లేన్' నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి సిలిండర్ పేలడంతో 23 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో నలుగురు పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు సజీవదహనంకాగా 20 మంది ఊపిరాడక చనిపోయారు. రాజధాని పనాజీకి 25 కిలో మీటర్ల దూరంలో నైట్ క్లబ్ ఉంది. 11 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానిక ిచేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షత్రగాత్రులకు యాబైవేల రూపాయల పరిహారం ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నైట్ క్లబ్ భద్రతా చర్యలు పాటించలేదని, నైట్ క్లబ్ కు అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సిఎం హెచ్చరించారు. 

మన తెలంగాణ 7 Dec 2025 7:15 am

Mahanati |సావిత్రికి మరణం లేదు..

Mahanati | సావిత్రికి మరణం లేదు.. Mahanati, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 7:07 am

Goa fire accident |గోవాలో ఘోర ప్రమాదం..

Goa fire accident | గోవాలో ఘోర ప్రమాదం.. Goa fire accident,

ప్రభ న్యూస్ 7 Dec 2025 6:45 am

ఫిఫా వరల్డ్ కప్ డ్రా విడుదల

వాషింగ్టన్: ఫిపా వరల్డ్ కప్ 2026 ఫైనల్ డ్రా విడుదల చేశారు. 48 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను వాషింగ్టన్ డిసిలోని ఎఫ్ కెన్నెడీ సెంటర్ ఫర్ ఫెర్మార్మింగ్ ఆర్ట్‌లో విడుదల చేశారు నిర్వహకులు. ఈ మెగా ఫుట్‌బాల్ సంగ్రామానికి అమెరికా, మెక్సికో, కెనెడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా.. ఆర్జిరియాతో తలపడనుంది. 48 జట్లు బరిలోకి దిగడంతో ఫార్మాట్‌లో కొన్ని మార్పులు చేశారు. మొత్తం 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూపులో 4 జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆ డాల్సి ఉంటుంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శన చేసినన 8 జట్లు తదుపరి రౌండ్‌లోకి చేరుకుంటాయి. టాప్-2లో నిలిచిన 24 జ ట్లు.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో 8 జట్లు నాకౌట్ దశకు చేరుతాయి. ఈ నాకౌట్ స్టేజిలో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్ మ్యా చ్‌లలో జరుగుతాయి. ప్రపంచ కప్‌ను గెలిచే జట్టు (గ్రూపు దశలో 3 మ్యాచ్‌లు, నాకౌట్ దశలో 5 మ్యాచ్‌లు మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే, గతంలో విజేతగా నిలిచే జట్లు 7 మ్యాచ్‌లే ఆడేవి. 

మన తెలంగాణ 7 Dec 2025 6:30 am

Karthi |అన్నగారు వస్తారు ట్రైలర్ రివ్యూ..

Karthi | అన్నగారు వస్తారు ట్రైలర్ రివ్యూ.. Karthi, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 7 Dec 2025 6:28 am

టీమిండియాకు సిరీస్

 సెంచరీతో చెలరేగిన యశస్వి  రాణించిన కోహ్లీ, రోహిత్  చివరి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు విశాఖ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి వన్డేలో సమష్టిగా రాణించిన భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్ చెరేగి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. అనంతరం లక్ష ఛేదనకు దిగిన టీమిండియా బ్యాటర్లు అద్భుతమైనర బ్యాటింగ్‌తో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్(106) సెంచరీతో రాణించగా.. మరో స్టార్ ఆటగాడు టెంబా బవుమా(48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ నాలుగేసి వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసి సఫారీ ఇన్నింగ్స్‌కు శుభం కార్డు వేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ 44 ఓవర్లలో వికెట్ నష్టానికి 271 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్(107) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(57), రోహిత్ శర్మ(75) అర్ధ శతకాలతో విజృంబించారు. ఇక, గత రెండు వన్డేల్లో చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు ఈ మ్యాచ్‌లో రాణించలేక పోయారు. కేశవ్ మహరాజ్ ఒక్కడే అద్భుత డెలివరీ వికెట్ దక్కించుకోగా.. మిగతా బౌలర్లు తేలిపోయారు. తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత్‌కు శుభారంభం.. లక్ష్య ఛేదనలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్నా.. కుదురుకున్నాక సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇన్నాళ్లు ఫామ్‌లేమితో తిప్పలు పడ్డ జైశ్వాల్.. సెంచరీ సాధించి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ దూకుడు కనబర్చగా.. జైస్వాల్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. 54 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. యశస్వి జైస్వాల్ 75 బంతుల్లో అర్థ శతకం అందుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడేక్రమంలో రోహిత్ శర్మ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. విరాట్ అండతో జైస్వాల్ కూడా బ్యాట్‌తో చెలరేగాడు. దీంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత పోటాపోటీగా పరుగులు రాబట్టిన ఈ జోడీ.. 61 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తిచేసింది. 

మన తెలంగాణ 7 Dec 2025 6:20 am

వెనుజువెలా వినాశనానికి అమెరికా కంకణం

వెనుకబడిన, బలహీమైన చిన్న దేశాలను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాటవినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యంకాకపోతే దురాక్రమణ, యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా సామ్రాజ్యవాదం అవలంబిస్తున్న విధానంగా ఉంది. నేడు వెనిజువెలాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్ షిప్‌లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, క్షిపణులు మొదలైన ఆయుధ సామాగ్రితోపాటు 10 వేలమంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి ట్రంప్ పంపాడు. వీరిలో 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200 మంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా 2-9-20 25న వెనిజువెలా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజువెలా మారకద్రవ్యాల రవాణా చేస్తున్నదని సాకులు చెబుతున్నది. మారకద్రవ్యాలకు నిలయంగా ఉన్న వెనిజువెలా అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని, అందుకే దానిపై దాడి చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ, దాని దోపిడీ విధానాలను, యుద్ధోన్మాదాన్ని మరుగుపరుస్తున్నది. వెనిజువెలా దేశంపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగుతున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం మొదలైనవి అపారంగా ఉన్నాయి. తన బహుళజాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకుపోతున్న అమెరికాకు 1999 లో తొలిసారి ఆటంకం ఎదురైంది. 1999లో హ్యూగో చావేజ్ వెనిజువెలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఒక సంవత్సరం తర్వాత తనను సోషలిస్టు గాను, సామ్రాజ్యవాద వ్యతిరేకిగా ఆయన ప్రకటించుకున్నాడు. అమెరికా దోపిడీకి అడ్డుకట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ పై తిరుగుబాటు ప్రయత్నాన్ని ఆనాటి జార్జిబుస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని వెనిజువెలా పేర్కొంది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బొలీవియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో వెనిజువెలా అమెరికా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది. దీని ద్వారా అమెరికా చర్యలను వెనిజువెలా వ్యతిరేకించింది. చావేజ్ మరణం తర్వాత 2013 ఏఫ్రిల్ లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో నికోలస్ మదురో విజయం సాధించి వెనిజువెలా అధ్యక్షుడు అయ్యాడు. 2024లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి మూడవ సారి అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు.ఈయన పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు, పెట్రోలియం పరిశ్రమల వంటివి ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నాయి. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. 2014లో దేశంలో హింసను ప్రోత్సహించిన ముగ్గురు అమెరికా దౌత్యవేత్తలను దేశం నుంచి మదురో ప్రభుత్వం బహిష్కరించింది. 2019లో వెనిజువెలా సంక్షోభ సమయంలో మదురో ప్రభుత్వ వ్యతిరేకి అయిన జువాన్ గైడోనూ తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నికోలస్ మదురో ప్రభుత్వం అమెరికాతో సంబంధాలు తెచ్చుకున్నట్లు ప్రకటించింది. 2023లో ప్రతిపక్ష జాతీయ అసెంబ్లీ గైడ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించరాదని ఓటు వేయడంతో ఆ వాదన వెడల అమెరికా మౌనం వహించింది. అమెరికా తమ చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుంటున్నదని వెనిజువెలా వెల్లడించడంతో అమెరికాకు చెందిన డెలా వేర్ న్యాయమూర్తి అప్పులు తీర్చడానికి చమురు అమ్మకం గురించి వెనిజువెలాను ఆదేశించాడు. బిలియన్ల డాలర్ల అప్పు తీర్చడానికి మోసపూరితంగా చమురు కంపెనీ సిట్గోను విక్రయించడానికి అధికారం ఇస్తూ అమెరికా కోర్టు నిర్ణయాన్ని వెనిజువెలా ఉపాధ్యక్షుడు, ఆ దేశ పెట్రోలియం మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ ఖండించి ఆ తీర్పును తిరస్కరించాడు. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ అయిన వెనిజువెలా పెట్రోలియోన్ డి వెనిజులా (పిడియుఎస్‌ఎ) హ్యూస్టన్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన సిట్గో, రుణదాతలకు 20 బిలియన్ల అమెరికా డాలర్లకు పైగా బాకీ ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఇంతకు ముందు ఇది లాభదాయకంగా ఉన్న చమురు పరిశ్రమ. దీన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా పెట్టిన అనేక ఆంక్షల వల్ల సంక్షోభంలో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కంపెనీల రుణదారుల్లో కెనడియన్ సంస్థ క్రిస్టలిక్స్ కూడా ఉంది. బంగారం, వజ్రాలు, ఇనుము, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న క్రిస్టినాస్ గనిని 2008లో స్వాధీనం చేసుకుని జాతీయం చేసినందుకు 2019లో వెనిజువెలా ప్రభుత్వం క్రిస్టలెక్స్‌కు 1.2 బిలియన్లు బాకీ ఉందని మరొక అమెరికా కోర్టు పేర్కొంది. సార్వభౌమాధికారం గల ఒక స్వతంత్ర దేశం ఆ దేశానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు, ఆ దేశ ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజువెలా అలాంటి దేశం కాబట్టి పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి. తీర్పు ఇచ్చే అధికారం కూడా వెనిజువెలా కోర్టులకే ఉంటుంది. అమెరికా ప్రపంచ పోలీసు పాత్ర పోషిస్తూ లేని అధికారాలను తీసుకుంటున్నది. 2023 నాటికి 303 బిలియన్ బ్యారెళ్ల్లగా అంచనాతో ప్రపంచం లోనే అత్యధిక చమురు నిల్వలను వెనిజువెలా కలిగి ఉంది. అయినా ఆ దేశం 2023లో కేవలం 4.05 బిలియన్ల ముడిచమురును మాత్రమే ఎగుమతి చేసింది. ఇది ఇతర చమురు ఉత్పత్తి దేశాల ఎగుమతి కన్నా చాలా తక్కువ. ఇంతకు ముందు ట్రంప్ ప్రభుత్వ పాలనలో ఇతర దేశాలు వెనిజువెలా నుంచి చమురు కొనవద్దని చేసిన హెచ్చరికలే అందుకు కారణంగా ఉంది. ఈ విధంగా వెనిజువెలా దేశాన్ని సైనికంగా బెదిరించడమే కాకుండా దాని ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్రలు అమెరికా చేసింది. వెనిజువెలాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టిపోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు హెరాల్ అనే అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం ప్రకటనను వెనిజువెలా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్యను చూపిస్తోందని పేర్కొంది. డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతో అమెరికా హద్దులు దాటుతోందని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచేలా ఉందని మండిపడింది. వెనిజువెలా ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ట్రంప్ చర్యలు ఉన్నాయని పేర్కొంది. సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరుద్ధమైనది. అమెరికా ఎప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకుండా ఉల్లంగిస్తూనే ఉంది. వాస్తవంలేని సాకులతో ఇరాక్ దాడి చేసింది. కొద్ది నెలల క్రితం ఇరాన్‌పై దాడి చేసింది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (430 కోట్ల రూపాయలు) బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి బెదిరింపుల ద్వారా వెనుకబడిన దేశాలన్నీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నదే అమెరికా విధానం. వెనిజువెలాపై సైనిక చర్యను 70% మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని సిబిఎన్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యాలతో ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్ల అయ్యిందని, వెనిజువెలాపై సైనిక జోక్యం చేసుకోవద్దని అమెరికన్లు కోరుతున్నారు. వెనిజువెలాపై అమెరికా ఆంక్షలను, దాడి చేసే ప్రయత్నాలను తక్షణమే విడనాడాలని, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదని, వెనుకబడిన దేశాలను బెదిరించే విధానాలను మానుకోవాలని ప్రపంచ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. బొల్లిముంత సాంబశివరావు 98859 83526 

మన తెలంగాణ 7 Dec 2025 6:10 am

Nellore |వ్యభిచార ముఠా గుట్టురట్టు..

Nellore | వ్యభిచార ముఠా గుట్టురట్టు.. Nellore, ఆంధ్రప్రభ : నెల్లూరు నగరంలోని

ప్రభ న్యూస్ 7 Dec 2025 6:05 am

ఎస్‌ఎల్‌బిసిని మేమే పూర్తిచేస్తాం

మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు అవసరమైనన్నీ నిధులు కేటాయించి, తమ పార్టీ హయాంలోనే పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. నల్లగొండ జిల్లా, దేవరకొండలో ప్రజాపాలన ప్ర జావిజయోత్సవాల సభ శనివారం జరిగింది. ఈ సభకు ము ఖ్యఅతిథిగా హాజరైన సిఎం మాట్లాడుతూ..ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ కాంగ్రెస్ హయాంలో ముందుకు తీసుకుపోతే పది కిలోమీటర్లు మిగిలిఉంటే బిఆర్‌ఎస్ పాలనలో ఏమాత్రం పనులు చేయలేదన్నారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది చనిపోతే బిఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందారని, మామ, అల్లుళ్ళు డ్యాన్సులు చేశారని ఎద్దేవా చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ‘కెసిఆర్.. నువ్వు.. నీ కొడుకు.. నీ బిడ్డ.. నీ అల్లుడు తెలంగాణను పీక్క తిన్నారు.. పదేళ్ళలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేస్రిండు.. అయినా తెలంగాణపై మీ ఆశ తీరలేదా?’ అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌కు మంచి రోజులు రావు.. బిడ్డ, కొడుకు, అల్లుడు పార్టీని ముంచేరోజులు వస్తాయి అని వ్యాఖ్యానించారు. ‘ఆ పార్టీకి కెటిఆర్ గుదిబండలా మారాడు..గులాబీ పార్టీని బొందపెట్టడానికి నీ కొడుకుచాలు.. కెటిఆర్ ఉన్నంతకాలం నీ పని అంతే.. కెసిఆర్.. బిఆర్‌ఎస్ పనే ఖతం..’ అని అన్నారు. పదేళ్ళ తెలంగాణను పట్టిపీడించిన గడీల పాలనను ఓటే ఆయుధంగా మార్చి కుప్పకూల్చి ఇందిరమ్మ రాజ్యం తెచ్చామని అన్నారు. ప్రజాపాలనలో ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోతున్నామని చెప్పారు. ‘పదేళ్ళు నష్టపోయాం.. పదేళ్ళు కష్టపడ్డాం.. అందరి కష్టంతో అధికారంలోకి వచ్చాం.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది’ అని చెప్పారు. దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా మార్చి తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి రెండు కళ్ళు అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని, కనీసం కార్డులో పేరు మార్చలేదన్నారు. దేశంలో పేదలకు సన్నబియ్యం తెలంగాణలో మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకుఇవ్వడం లేదో చెప్పాలి? బిజెపి పాలిత, ఎంపి, యుపి, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలన్నారు. ‘ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన చోట మేం ఓట్లు అడుగుతాం.. డబుల్ బెడ్‌రూం ఇళ్ళు ఇచ్చినచోట కేసిఆర్ ఓట్లు అడగాలి’ అని అన్నారు. తెలంగాణలో పేదలకు ఇళ్ళు ఇవ్వలేని మాజీ సిఎం కెసిఆర్ రెండు వేల కోట్లతో గడీ కట్టుకున్నారని ఆరోపించారు. 2004 నుండి 2014 వరకు 22 లక్షల ఇళ్ళు రాష్ట్రంలో ఇచ్చామని చెప్పారు. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. రాష్ట్రమంతా కరెంట్ ఇస్తున్నామని, కెసిఆర్ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదని, ఫీజు, స్టార్టర్‌ను ప్రజలు కట్ చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేవరకొండ అభివృద్ధికి నిధులు.. దేవరకొండ అభివృద్ధికి నిధుల వరద పారిందని, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దేవరకొండ అభివృద్ధి బాధ్యత మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌లకు అప్పగిస్తున్నానని, వారు దేవరకొండకు వచ్చి రివ్యూ పెట్టి చర్చిస్తారని చెప్పారు. అభివృద్ధి చేసేటోళ్ళను సర్పంచ్‌లుగా ఎన్నుకోండి మంత్రులతో కలిసి ఉండెటోళ్ళు.. ఎంఎల్‌ఎలతో కలిసి పనిచేసే వాళ్ళను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉన్నోళ్ళకు అవకాశం కల్పించాలని కో రారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇందిరమ్మ చీరలు ఇం టికే పంపిస్తానని చెప్పారు. చీర కట్టుకోండి.. సర్పంచ్‌కు ఓ టేయండన్నారు. ఈ సభలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, ఎంఎల్‌లు బా లునాయక్, బిఎల్‌ఆర్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు 20 కోట్ల రూపాయలతో దేవరకొండ పట్టణంలో అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. మెప్మా మహిళా సంఘాలకు 11.33 కోట్ల రూపాయల లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. 

మన తెలంగాణ 7 Dec 2025 6:00 am

అంతర్జాతీయ వేడుకకు అంతా సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 202 5కు దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సం స్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్ర త్యేక ప్యానల్ చర్చలు జ రుగుతాయి. ప్యానల్ చర్చల్లో భాగంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ- సెమీకండక్ట ర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బ న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమ లు, మ హిళా వ్యాపారవేత్తల ప్రోత్సా హాం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షే మం, స్టార్టఫ్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉ ం టా యి. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ప్రతినిధుల తో పాటు తేరి, బిసిజి, మైక్రాన్ ఇండి యా, హిటాచ్చీ ఎనర్జీ, ఓ2 పవర్, గ్రీన్ కో, అపో లో హాస్పిటల్స్, ఐఐటి హైదరాబాద్, నాస్‌కాం, సాప్రాన్, డిఆర్‌డిఓ, స్కై రూట్, ధృవ స్పేస్, అ మూల్, లావుర స్ ల్యాబ్స్, జిఎంఆర్, టాటా రియాల్టీ, కోటాక్ బ్యాంక్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్, బ్లాక్‌స్టోన్, డిలైట్, క్యాపిటల్ ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్లూఎస్, రెడ్. హె ల్త్, పివిఆర్ ఇనోక్స్, సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్, తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. చర్చల్లో పాల్గొననున్న సినీ ప్రముఖులు పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వం టి క్రీడా ప్రముఖులు ఒలంపిక్ గోల్డ్ క్వీ స్ట్ సెషన్‌లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ సాఫ్ట్ ప వర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ చర్చలో పా ల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటారు. దావోస్‌లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సద స్సు జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇప్పటికే ప లుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సదస్సు వేదికలో రెండో రోజున డి సెంబర్ 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రా ష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందు పరిచారు.

మన తెలంగాణ 7 Dec 2025 6:00 am

నెట్‌ఫ్లిక్స్ ప్రతిపాదనపై ఎంఎఐ ఆందోళన

న్యూఢిల్లీ : వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఎఐ) శనివారం ఆందోళన వెలిబుచ్చింది. ఇది భారతదేశ థియేట్రికల్ మరియు విస్తృత చలనచిత్ర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష పోటీతో పాటు ఆర్థిక ముప్పును తెచ్చిపెడుతుందని హెచ్చరించింది. భారతదేశ విస్తృత చలనచిత్ర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష ఆర్థిక ముప్పుగా మారుతుందని ఎంఎఐ ఒక ప్రకటనలో తెలిపింది. వారసత్వ హాలీవుడ్ దిగ్గజం యొక్క స్టూడియో మరియు స్ట్రీమింగ్ వ్యాపారాన్ని 72 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం వెల్లడించింది. ఎంఎఐ అధ్యక్షుడు కమల్ జ్ఞాన్‌చందానీ మాట్లాడుతూ, భారతీయ థియేట్రికల్ మార్కెట్ ఎంపిక, స్థాయి, సాంస్కృతిక వైవిధ్యంపై వృద్ధి చెందుతుందని అన్నారు. 

మన తెలంగాణ 7 Dec 2025 5:50 am

ప్రాంగణంలో పక్కాగా ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. తొలుత హెలీకాఫ్టర్ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంత రం ప్రాంగణానికి చేరుకున్న సిఎం ప్రతి హాల్‌ను సందర్శించారు. వివిధ సదస్సులు, స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన హాళ్లను నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవనం, ఇతర కార్యక్రమాలకు సం బంధించి ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్‌ను ఆయన వీక్షించారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్‌కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, సదుపాయాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రా కపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణం మొత్తాన్ని గంటకుపైగా ఆయన కలియతిరిగారు. సిఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 7 Dec 2025 5:30 am

Sunday Magazine 07 DEC 2025 |ఆదివారం సంచిక 07 డిసెంబర్ 2025

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్

ప్రభ న్యూస్ 7 Dec 2025 4:40 am

ఇండిగో సిఇఓపై వేటు?

న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ సిఇఒ వై ఫల్యమే ప్రధాన కారణమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ సిఇఒ పీటర్ ఎల్బర్స్‌కు ఉద్వాసన పలకాలని విమానయాన శాఖ కోరిన ట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై వేటు వేసేందు కు ఇండిగో కూడా సిద్ధమైందని సమాచారం. సం స్థ చేపట్టిన సంస్కరణలు, తద్వారా ఎదురయ్యే ప రిణామాలను పసిగట్టలేకపోయిన ఇండిగోపై కేం ద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంక్షోభం పై వివరణ ఇవ్వాలని పౌరవిమానయాన శాఖ ఇండిగోకు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు పౌర విమానయాన శాఖ ఆదేశించింది. నలుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించిం ది. అందులో డిజిసిఎ డైరెక్టర్ సంజయ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా. విమాన ఆపరేషన్స్ సీనియర్ కెప్టెన్ కపిల్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ రాంపాల్ ఉన్నారు. వీరు ప్రస్తుత సంక్షోభానికి కారణాలు అన్వేషించడంతో పాటు భవిష్యత్ ఇలా ంటివి పునరావృతం కాకుండా సూచనలు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో ఆదివారం వరకు రద్దు చేసిన అన్ని విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు రీఫండ్ ప్రక్రియను అదే రోజు రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే తక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. టికెట్ రద్దు ఫీజును కూడా ఇండిగో వసూలు చేస్తోందని పలువురు ప్రయాణికుల నుంచి సోషల్ మీడియాలో ఫిర్యాదులు, విమర్శలు రావడంతో ఇండిగో వెనక్కి తగ్గింది. పూర్తిగా రీఫండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సయంలో లగేజీలను కూడా 48 గంటల్లో ప్రయాణికులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తాజా పరిస్థితిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. దీనిపై ఇండిగో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. విచారణకు ఒక కమిటీని నియమించామని, కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, రైల్వేశాఖను కూడా అప్రమత్తం చేశామని, ఆ దిశగా కూడా చర్యలు మొదలయ్యాయని తెలిపారు. ఇదిలావుండగా శనివారంనాడు దేశవ్యాప్తంగా 800 విమానసర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. శుక్రవారంనాటితో పోల్చితే తక్కువ అని వివరించింది. విమాన సర్వీసుల క్రమబద్దీకరణ క్రమంగా పుంజుకుంటోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ని కిలో మీటర్లకు ఎంత ధర అంటే..? అంతేకాదు టికెట్ రేట్లు పెంచితే ఊరుకునేది లేదని ఇండిగోతో పాటు మిగిలిన విమాన సంస్థలను విమానయాన శాఖ హెచ్చరించింది. ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని మిగతా విమానయాన సంస్థలు భారీగా టికెట్ ధరలు పెంచేశాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం వాటిపై నియంత్రణ విధించింది. ప్రయాణికులపై భారాన్ని మోపితే సహించేది లేదని స్పష్టం చేసింది. కి.మీటర్ల వారిగా చార్జీలను ఖరారు చేసింది. ఎకానమీ క్లాస్‌లో 500 కి.మీ వరకు రూ.7,500, 5000 నుంచి 1000 కి.మీటర్ల వరకు రూ.12, 000, 1000నుంచి1500 కి.మీ వరకు రూ.15,000, ఆపైన కి.మీటర్లకు రూ.18,000 ఖరారు చేసింది. ఆర్‌సిఎస్‌ఉడాన్ విమానాలు, బిజినెస్ క్లాస్‌లకు తాజా నియంత్రణలు వర్తించవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో పిల్.. ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల పడుతున్న కష్టాలపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విమానల రద్దీ, తదితర ఇబ్బందులపై పిల్ దాఖలైంది. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మన తెలంగాణ 7 Dec 2025 4:30 am

పంచాయతీ అభ్యర్థుల డిజిటల్ ప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నిలకు సంబంధించి మూడు విడతల నామినేషన్ల గడువు ముగిసింది. దాంతో గ్రామాలలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ఏ గ్రామంలో ఎవరు పోటీ చేస్తున్నారనేది తెలవడంతో పాటు ఈ విడతలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. తాజాగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు సమయం తక్కువగా ఉండటంతో వివిధ మార్గాలలో ఓటర్లను చేరువ అవుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యేలా, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రణాళికతో ముందడగు వేస్తున్నారు. చాలా వరకు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో యువత, ప్రజలు వివిధ పనులు, ఉద్యోగ ఉపాధి అవసరాల రీత్యా ఉదయం వెళ్లి సాయంత్రం లేదంటే రాత్రి సమయాల్లో తిరిగి ఇళ్లకు వస్తున్నారు. దీంతో వారిని ప్రత్యక్షంగా కలిసే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న వారిని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి ప్రచారం చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వీడియోలను ఆయా గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లు గుర్తుంచుకునేలా వాటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుని ఫొటోలు, వీడియోలతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రత్యేక ఆకృతులను రూపొందించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థులు కొత్తగా వాట్సాప్ గ్రూపులను పోటాపోటీగా క్రియేట్ చేస్తున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాలను నిలిపివేసే ప్రక్రియ ఉన్నప్పటికీ వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగే అవకాశం ఉన్నది. మూడో విడతలో 27,277 సర్పంచి నామినేషన్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండో విడత తరహాలోనే మూడో విడతలోనూ సర్పంచి, వార్డు స్థానాలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మూడో విడతలో 4,150 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 36,452 వార్డుల స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, 89,603 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చివరి రోజు శుక్రవారం ఒక్కో రోజే సర్పంచి స్థానాలకు 17,405 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 269 సర్పంచి స్థానాలకు 1,962 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో 169 స్థానాలకు 1,185, నిజామాబాద్ జిల్లాలో 165 స్థానాలకు 1,077 మంది పోటీపడుతున్నారు. ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. ఈనెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది. 

మన తెలంగాణ 7 Dec 2025 4:00 am

లేబర్ కోడ్‌లు మనకొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్ : మనదేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో తెస్తున్న సంస్కరణలు స్థానిక పరిస్థితులను విస్మరిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని విమర్శించారు. అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించిన చట్టాలను, విధానాలను గుడ్డిగా ఇక్కడ అమలు చేయడం సరికాదని, మన దేశంలోని భిన్నమైన సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉండటమే ఇక్కడి పేదరికానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం కొత్త లేబర్ కోడ్‌లపై కార్మిక సంఘాల రౌండ్ టేండ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి వినోద్‌కుమార్, మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేండ్ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగిందని తెలిపారు. ఢిల్లీలో సోనియా గాంధీ వ్యతిరేకించిన బిల్లును తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని కెటిఆర్ ప్రశ్నించారు. కొత్త లేబర్ కోడ్‌లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతో పాటు, అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను స్తంభింపజేస్తామని తెలిపారు. వరంగల్‌లో తదుపరి సమావేశం నిర్వహిస్తామని కార్యాచరణను ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున, రాజకీయాలకు అతీతంగా ఏ కార్మిక సంఘంతోనైనా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ ఏకాధిపత్యం(మోనోపోలీ) ప్రమాదకరమని కెటిఆర్ హెచ్చరించారు. ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయని, విమానాశ్రయాలు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లను తలపించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం.. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని అన్నారు. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదని పేర్కొన్నారు. అంబేద్కర్‌కు ఘన నివాళి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బా బాసాహెబ్ చొరవతో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3 దోహదపడిందన్నారు. 

మన తెలంగాణ 7 Dec 2025 3:30 am

విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా

 కాంగ్రెస్ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు నరకం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం శుక్రవారం పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం ధర్మరావు పేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్నఅగచాట్లు ఇవి అంటూ ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. రైతులకు యూరియా సరఫరా చేయడం చేతగాని రేవంత్ రెడ్డి, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా చేస్తూ.. చేసింది లేక, చెప్పకునేది లేక గప్పాలు కొట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ అంటూ, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న రేవంత్ రెడ్డి, ముందు రైతులకు యూరియా సరఫరా చేయడంప దృష్టి సారించాలని సూచించారు. గత సీజన్ యూరియా కష్టాలు, చేదు అనుభవాల నుంచి సిఎం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నేర్చుకోకపోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది..? అని ప్రశ్నించారు.

మన తెలంగాణ 7 Dec 2025 3:00 am

వార ఫలాలు (07-12-2025 నుండి 13-12-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టిన నిదానంగా సాగుతుంది. ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది లాభాలు తక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాల వలన శ్రమ అధికమవుతుంది. రావలసిన ధనం అని చేతికి అందకపోవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. మీరు నూతనంగా ప్రారంభించిన వ్యాపారం లాభాల బాటలో ఉంటుంది. బంధువులతో ఆ కారణంగా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహా రాలను ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారి లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ గాని ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. కెరియర్ పరంగా ఉన్నత స్థానానికి వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కీలకమైన విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం మీకు దక్కుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సినీ కళా రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రేమ సంబంధమైన విషయ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు బ్లూ. మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ కష్టాన్ని ఎవరు గుర్తించరు. ఒక రకంగా చెప్పాలంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. భయానాలలో నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా కొంతవరకు పురోగతి సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కొంత సమయం తీసుకుని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహన సంబంధిత విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వాహనం కొనుగోలు వాయిదా పడుతుంది. నిరాశలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మృతి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. అత్యవసరమైతేనే దూర ప్రాంత ప్రయాణాలు చేయండి. వృత్తి ఉద్యోగాలపరంగా సాధారణంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు లాభసాధిగా సాగుతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. పంచముఖి హనుమాన్ లాకెట్ ను మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా కలుసుబాటు ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి లాభాలు బాగానే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. తల్లి గారి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కొన్ని విషయాలలో మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసిక వేదనకు కారణం అవుతాయి. ఆర్థికపరమైన విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్వగృహ నిర్మాణం చేపడతారు. ధనం సర్దుబాటు అవుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని గ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసే వచ్చే రంగు తెలుపు. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. గుత్తి ఉద్యోగాలపరంగా అనుకూలత సాధించగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. స్థిరాస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఒకసారి వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్. తులా రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. నడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. నూతన రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఖర్చులను నియంత్రిస్తారు. మీ రాశి వారు అంగారక పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. వృశ్చిక రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. సుత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. నరదిష్టి అధికంగా ఉంటుంది. కెరియర్ పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. పొదుపు పైన దృష్టి పెడతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందిస్తుంది. కాంట్రాక్టులు లీజులు రెన్యువల్స్ లభిస్తాయి. సహోదరీ సహోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. వ్యాపార పరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ప్రతి పనిని ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీ బస్సులలో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఆర్థిక భారం తగ్గుతుంది. వివాహాది ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈవారం చాలా బాగుందని చెప్పవచ్చు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు చేతి వరకు వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వ్యాపారాలలో ఏర్పడినటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా గౌరవిస్తారు. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. నలుగురిలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ఈ రాశి వారికి కలసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేతి వరకు వచ్చిన ధనం చేజారిపోతుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. వ్యాపారంలో నూతన భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. వారాంతంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. అప్పుచేసి నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. మీరు సొంతంగా చేసుకున్న వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతిరోజు కూడా శని గ్రహ సూత్రాన్ని చదవండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. పది రోజు కూడా నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీసా పాస్పోర్టు లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్స్ లభిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు విహారయాత్రలు చేస్తారు. కుటుంబ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. సాధ్యమైనంతవరకు పొదుగుపైన దృష్టి పెడతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నీ జీవిత ఆశయం నెరవేరుతుంది అనే భావన కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రాణి సాధ్యమైనంత వరకు పొదుపు చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపార విస్తరణ చేస్తారు నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఉద్యోగపరంగా ఊహించని స్థానచలన సూచనలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.  

మన తెలంగాణ 7 Dec 2025 12:10 am

కొత్తింట్లోకి రణబీర్, అలియా.. ఎన్నికోట్లో తెలుసా?

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ తాజాగా తమ కొత్త ఇంటిలోకి అడుగు పెట్టారు. ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అలియా భట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముంబయ్‌లోని పాలిహిల్స్ రెసిడెన్సీలోని ’కృష్ణరాజ్’ బంగ్లా’లో జరిగిన ఈ గృహ ప్రవేశం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. తన మనసుకు నచ్చినట్టుగా అలియా భట్ నిర్మించుకున్న ఈ ఇంటి విలువ రూ.250 కోట్ల నుండి 400 కోట్ల మధ్య ఉంటుందని తెలిసింది. 

మన తెలంగాణ 6 Dec 2025 11:41 pm

విద్యార్థినిని గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

ఎపిలోని తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ప్రొఫెసర్ లక్ష్మణ్ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరిచిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్శిటీ విసికి ఫిర్యాదు చేసి యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌ను విసి సస్పెండ్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో లక్ష్మణ్ కుమార్‌పై ఫిర్యాదు చేయడానికి యూనివర్సిటీ స్టాఫ్ వెళ్లగా బాధిత విద్యార్థినిని ఫిర్యాదు చేయమని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్లిపోయింది.

మన తెలంగాణ 6 Dec 2025 11:32 pm

అమెరికాలో అగ్ని ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదంలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి ఉడుముల సహజారెడ్డి (24) మృతి చెందారు. జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న ఆమె తల్లిదం డ్రులకు అధికారులు ఈ విషాద వార్తను తెలియజేశారు. సహజారెడ్డి ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం అమె రికా వెళ్లారు. ఆమె చదువులు పూర్తవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సహ జారెడ్డి మృతితో శ్రీనివాస కాల నీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని భారత ఎంబసి ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపింది. స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల ప్రాంతం గుంటూ రుపల్లికి చెందిన ఉడుముల జయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని టిపిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తు న్నారు. ఆయన భార్య శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పని చేసి, డిప్యుటేషన్‌పై ఇటీవల హైదరాబాద్ వచ్చారు. కొన్నేళ్లుగా వీరి కుటుం బం జోడిమెట్లలో నివాసం ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె హైదరాబాద్‌లోనే బిబిఎస్ కోచింగ్ తీసుకుం టోంది. పెద్ద కుమార్తె సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికా వెళ్లారు. సహజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్కనున్న మరో భవ నం నుంచి మంటలు వేగంగా వ్యాప్తి చెందా యి. ఆ సమయంలో నిద్రలో ఉన్న సహజారెడ్డి మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది.

మన తెలంగాణ 6 Dec 2025 11:29 pm

గిరిజనులకు కెసిఆర్ చేసిన సేవలు చిరస్మరణీయం

గిరిజనులకు కెసిఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు.తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించి, గిరిజనులకు పోడు భూములపై హక్కులను కల్పించే విధంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతుబందు పథకాన్ని అనువర్తింపజేశారని అన్నారు. ఎన్నో ఏండ్ల గిరిజన కలలను సాకారం చేసిన స్వాప్నికుడు కెసిఆర్ సేవలను తండాలలో గూడాలలో గిరిజన జాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన గిరిజనుల ఆత్మబంధువు అనే పుస్తకాన్ని కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన తండాలు, గూడాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన రోజు ఆగస్టు 2వ తేదీన అన్ని గిరిజన గ్రామాలలో గిరిజన సంబురం కార్యక్రమాన్ని నిర్వహించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవిప్రసాద్, బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 11:24 pm

ఒపెన్ టెన్త్,ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల

 రాష్ట్రంలో ఒపెన్ టెన్త్,ఇంటర్మీడియేట్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 11 నుంచి 26 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పి.వి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుంతో ఈ నెల 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో జనవరి 3 నుంచి 7 జనవరి వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. తత్కాల్ కింద జనవరి 8 నుంచి జనవరి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఒపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు 2026 మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 11:19 pm

కెటిఆర్‌కు పగ్గాలు అప్పగించి పరీక్షిస్తున్న కెసిఆర్: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు పగ్గాలు అప్పగించి పరీక్షిస్తున్నారన్న అనుమానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే బిజెపి, బిఆర్‌ఎస్‌కు లేదని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. కెసిఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రానంత కాలం ఆ పార్టీ మనుగడ కష్టమేనని అయన తెలిపారు. కెటిఆర్‌కు పగ్గాలు అప్పగించి ఎంత వరకు సక్సెస్ అవుతారో చూద్దామని పరీక్షిస్తున్నారని అన్నారు. కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను బయటకు పంపించారని, టి. హరీష్ రావు అనుమానాస్పదంగా ఉన్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని అద్దంకి దయాకర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం తనకు రెండు కళ్ళవంటివని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారని, జరుగుతున్న అభివృద్ధిని చూసి బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు.

మన తెలంగాణ 6 Dec 2025 11:16 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల పక్షపాతి

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:53 pm

అభివృద్ధి నా లక్ష్యం… మీ ఆశీర్వాదం కావాలి

జైనూర్, ఆంధ్రప్రభ : గత పంచాయతీ ఎన్నికల్లో 94 ఆక్ట్ కారణంగా తాను

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:50 pm

రష్యాతో పతంజలి గ్రూప్ ఎంఓయూ

న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ శనివారం రష్యా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఆ దేశంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు, ఆరోగ్య పర్యాటకం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల మార్పిడి మరియు పరిశోధన సంబంధిత కార్యక్రమాలను ప్రోత్సహించడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం. పతంజలి గ్రూప్ తరఫున రాందేవ్, ఇండో-రష్యా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్, రష్యా వాణిజ్య మంత్రి సెర్గీ చెరెమిన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. బాబా రాందేవ్ మరియు ఆచార్య బాలకృష్ణ స్థాపించిన పతంజలి గ్రూప్, పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్స్(గతంలో రుచి సోయా)తో కూడిన ఆయుర్వేద మరియు ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన భారతీయ సమ్మేళనం.ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రాందేవ్.. రష్యాలో ప్రజలు యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యాన్ని ఆదరిస్తున్నారని, చురుకుగా అభ్యసిస్తున్నారని అన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 10:42 pm

జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో..

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:37 pm

ఒకే వేదికపై సిఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఒకే వేదికపై మెరిశారు. శనివారం గచ్చిబౌలిలోని జీఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్-2 కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిధుల హర్షద్వానాల మధ్య బైకర్స్ చేసిన విన్యాసాలు చూపురులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సిఎం రేవంత్, సల్మాన్ ఖాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మన తెలంగాణ 6 Dec 2025 10:12 pm

తొగర్‌పల్లిని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : తొగర్‌పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:09 pm

ఐదో రోజు కొనసాగిన విమాన సర్వీసుల రద్దు

ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఐదో రోజు కొనసాగింది. శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (శంషాబాద్) విమానాశ్రయంలో 69 సర్వీసులు రద్దు అయ్యాయి. హైదరాబాద్ నుండి వెళ్లాల్సిన 43 సర్వీసులు, ఇక్కడికి రావాల్సిన 26 విమానాలు రద్దు ఇండిగో రద్దు చేసింది.దీంతో ఇండిగో కౌంటర్ల వద్ద తమ ప్రయాణాలకు సంబంధించిన టికెట్ల వివరాలు, రీఫండ్, ప్రత్యామ్నాయ ప్రయాణాల కోసం బారు తీరారు. అధికారుల సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు నిరసనలు, నినాదాలతో శంషాబాద్ విమానాశ్రయం దద్దరిల్లింది. సరయిన సమాధానం చెప్పకుండా ఇండిగో సిబ్బంది దాటవేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల పడిగాపులు, ఆందోళనలతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. డిజిసిఏ నిబంధనలు విరమించు కున్నప్పటికి సమస్య విమాన సర్వీసులు రద్దు కొనసాగడం పట్ల ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన తొమ్మిది విమానాలు రద్దయ్యాయి. ఇందులో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. కాగా, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరో 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా శనివారం వరకు 400కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లు సంస్థ వెల్లడించింది. 00000

మన తెలంగాణ 6 Dec 2025 10:06 pm

భట్టి విక్రమార్కతో చిరంజీవి, నాగార్జున కీలక భేటీ

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని భట్టి విక్కమార్క ఆహ్వానించారు. తప్పకుండా వస్తామని చిరంజీవి, నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది.

మన తెలంగాణ 6 Dec 2025 10:03 pm

తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్​కు సాదర ఆహ్వానం

మక్తల్ , ఆంధ్రప్రభ : హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,

ప్రభ న్యూస్ 6 Dec 2025 10:00 pm

బయోకాన్‌లో బయోలాజిక్స్ విలీనం

బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ బయోలాజిక్స్ యూనిట్ బయోకాన్‌లో విలీనం కానుంది. దాని విలువ 5.5 బిలియన్ డాలర్లు. బయోకాన్ బయోలాజిక్‌ను తనతో పూర్తిగా అనుసంధానించనున్నట్లు బయోకాన్ శనివారం తెలిపింది. బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ లో మిగిలిన వాటాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆప్ లైఫ్ సైన్సెస్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్2 మరియు యాక్టీవ్ పైన్ ఎల్‌ఎల్‌పిల నుండి వాటా స్వాపింగ్ ద్వారా కొనుగోలు చేస్తుంది. దీని విలువ 5.5 బిలియన్ డాలర్లు అని బెంగళూరుకు చెందిన కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రతి 100 బయోకాన్ బయోలాజిక్స్ షేర్లకు 70.28 బయోకాన్ షేర్ల చొప్పున, ప్రతి బయోకాన్ షేర్‌కు 405.78 రూపాయల చొప్పున షేర్-స్వాప్ నిష్పత్తి నిర్ణయించారు. ఇంకా, బయోకాన్ మైలాన్ ఇంక్ (వయాట్రిస్) కలిగి ఉన్న మిగిలిన వాటాను మొత్తం 815 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తుంది, ఇందులో 400 మిలియన్ డాలర్లు నగదు రూపంలో మరియు 415 మిలియన్ డాలర్లు షేర్ స్వాప్ ద్వారా చెల్లించనున్నట్లు వెల్లడించింది.  

మన తెలంగాణ 6 Dec 2025 9:57 pm

ఒక్క అవకాశం ఇవ్వండి..గ్రామాభివృద్ధి చేసి చూపిస్తా

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క అవకాశం

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:53 pm

వైభవంగా అయ్యప్ప పడిపూజోత్సవం..

కరీంనగర్, ఆంధ్ర‌ప్ర‌భ : అయ్యప్ప స్వామి మహా పడిపూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:33 pm

రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో అర్ధ శతకంతో రాణించిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాల్గవ భారత బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్(34,357 పరుగులు), విరాట్ కోహ్లీ(27,910 పరుగులు), రాహుల్ ద్రవిడ్‌(24,064 పరుగులు)లు ఈ ఫీట్ సాధించారు. ఇక, వన్డేలో రోహిత్ 11,441 పరుగులు, టెస్ట్‌లలో 4,301, T20Iలో 4,231 పరుగులు సాధించాడు.  ఇక, మూడో వన్డే మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో తొలి శతకం నమోదు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 75 పరుగులతో రాణించాడు. ఇక, విరాట్ కోహ్లీ 65 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ 10 ఓవర్ల ఉండగానే మ్యాచ్ ను ముగించేసింది. ఈ విజయంతో టీమిండియా 2-1తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

మన తెలంగాణ 6 Dec 2025 9:32 pm

దేవస్థానం కాంట్రాక్టర్ల పై నియంత్రణ..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : నిత్యం వేల సంఖ్యలో కనకదుర్గమ్మ వారి దర్శనానికి

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:28 pm

ప్రజా పాలనకు ఓటేయ్యాలి

ప్రజా పాలనకు ఓటేయ్యాలి రాజాపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ పాలనలో పల్లెలు సుబిక్షంగా

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:16 pm

ఆత్మీయత వెల్లివిరిసిన ఆతిధ్యం.. పుతిన్ విందుపై శశిథరూర్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందుకు ప్రతిపక్షం లోని రాహుల్‌ను లేదా ఖర్గేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌ను పిలవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శశిథరూర్ విందుపై స్పందిస్తూ ఆ వాతావరణం ఆత్మీయత వెల్లివిరిసిన ఆతిథ్యంగా అభివర్ణించారు. విందులో పాల్గొన్న అనేక మంది ప్రతినిధులతో ముఖ్యంగా రష్యా ప్రతినిధులతో చర్చించే అవకాశం ఎంతో ఆనందం కలిగించిందని తన సామాజిక మాధ్యమ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మండిపడింది. ఈ విందులో థరూర్ పాల్గొనడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ నేత పవన్‌ఖేడా విమర్శించారు. తామంతా పార్టీలోనే ఉన్నప్పుడు మన నాయకులను ఆహ్వానించకుండా మనం పాల్గొనడాన్ని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 9:15 pm

Kishan Reddy |కేంద్ర నిధులు దుర్వినియోగం…

Kishan Reddy | కేంద్ర నిధులు దుర్వినియోగం… ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి :

ప్రభ న్యూస్ 6 Dec 2025 9:13 pm

Exclusive: Mahesh Babu’s Pay for Varanasi

Superstar Mahesh Babu has been extremely dedicated and is focused on Varanasi, his next attempt directed by SS Rajamouli. Apart from a pan-Indian release, the film will have an international release and Rajamouli has big plans which will be chalked out at a later date. There are discussions about the remuneration of Mahesh Babu. Superstar […] The post Exclusive: Mahesh Babu’s Pay for Varanasi appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 9:13 pm

బాబ్రీ తరహా మసీదుకు ఎమ్‌ఎల్‌ఎ కబీర్ శంకుస్థాపన

సస్పెండ్ అయిన టిఎంసి ఎమ్‌ఎల్‌ఎ హుమయూన్ కబీర్ శనివారం అయోధ్య బాబ్రీ మసీదు మోడల్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముషీరాబాద్ జిల్లా లోని రెజినగర్‌లో భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం రాజకీయంగా వేడి పుట్టించింది. రాష్ట్రపోలీసులు, ఆర్‌ఎఎఫ్, కేంద్ర బలగాలు బందోబస్తు మధ్య ఇస్లాం మతపెద్దలుతో కలిసి కబీర్ శంకుస్థాపన నిర్వహించారు. వాస్తవానికి నిర్మాణ ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో రెజినగర్‌లో ఏర్పాటైన వేదిక వద్ద రిబ్బన్ కట్ చేశారు. “ నారాఇతక్‌బీర్, అల్లాహు అక్బర్ ”అని వేలాది మంది నినాదాలు హోరెత్తించారు. మసీదు నిర్మాణకోసమని చాలా మంది ఇటుకలు మోసుకొచ్చారు. 1992 లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన సంఘటనకు గుర్తుగా శనివారం (డిసెంబర్ 6) ఈ కార్యక్రమం జరిగింది. ప్రతిపాదించిన నిర్మాణం ఎట్టిపరిస్థితుల్లోనైనా ఆగకుండా జరుగుతుందని కబీర్ వేదికపై నుంచి వెల్లడించారు. దీనికి నిధుల కొరత లేదని ఒక పారిశ్రామిక వేత్త రూ. 80 కోట్లు విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 9:02 pm

‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ ప్రారంభం

పేదల పక్షపాతి, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్.సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సాంబశివరావు, కవిత, గుమ్మడి నర్సయ్య, పరమేశ్వర్ హివ్రాలే, ఎన్.సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు స్క్రిప్ట్ అందించారు. హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ”మా నాన్న గారు కూడా గుమ్మడి నర్సయ్య లాగే ప్రజాసేవ చేసిన మనిషి. మన కోసం కాదు.. ఇతరుల కోసం బతకాలి’అని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటా.. నేనే స్వయంగా డబ్బింగ్ చెబుతా”అని తెలిపారు. గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి.. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతులు మారాలి.. ఇదే నేను కోరుకునేది అని తెలియజేశారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:56 pm

మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్ కైవసం

వైజాగ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మరో 10 ఓవర్లు ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కెరీర్ లో తొలి శతకం నమోదు చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో జైస్వాల్ సెంచరీ అందుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా 75 పరుగులతో రాణించాడు. ఇక, విరాట్ కోహ్లీ మరోసారి తనదైన శైలిలో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగుల అజేయ అర్ధ శతకంతో చెలరేగాడు. దీంతో భారత్ 2-1తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ డికాక్ 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ బవుమా 48 పరుగులు, బ్రెవిస్ 29 పరుగులు, మహరాజ్ (నాటౌట్) 20 పరుగులు, యాన్సెన్ 17 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:51 pm

లోక్ అదాలత్‌లతో కోర్టులపై భారం తగ్గుతుంది

లోక్ అదాలత్‌లతో కోర్టులపై భారం తగ్గుతుందని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. శ్యామ్ కోషి అన్నారు. శనివారం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో ఈ నెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై డిజిపి శివధర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), ఎక్సైజ్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్, ఎక్సైజ్, ఆర్టీసి, చెక్ బౌన్స్, ఇతర కేసులతో సహా వివిధ వర్గాల కేసుల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చోరవ చూపాలన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే జాతీయ లోక్-అదాలత్‌లో పరిష్కరించడానికి మరిన్ని కేసులను గుర్తించాలని ఎక్సైజ్ కమిషనర్‌ను ఆదేశించారు. త్రిపుర, జార్ఖండ్‌లలో అనుసరించిన విధానంలో బాగంగా కాంపౌండింగ్ ఫీజును తగ్గించడానికి, మద్యం పరిమాణాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కాగా, రాష్ట్ర కోర్టులలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులను తగ్గించడంలో తమ పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తామని డిజిపి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీసు అధికారులకు అవసరమయిన అన్ని సూచనలను జారీ చేస్తామని డిజిపి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి, అడిషనల్ డిజిపిలు మహేష్ భగవత్, చారు సిన్హా , అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:50 pm

వంపుతండా సర్పంచ్ గా ధరావత్ వినోద ఏకగ్రీవం..

పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని వంపుతండా గ్రామ సర్పంచ్ గా ధరావత్

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:40 pm

నెహ్రూ చరిత్ర లేకుండా చేయాలన్న కుట్ర: జగ్గా రెడ్డి

దేశ ప్రజల్లో జవహర్‌లాల్ నెహ్రూ చరిత్ర కనపడకుండా చేయాలని బిజెపి కుట్ర చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. యాభై ఆరేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలకు ఏమి చేశామో తాము చెప్పగలమని, పదకొండేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేశారో చెప్పగలరా? అని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్రజలు మూడు పూటలా భోజన చేసేలా చేసి, రెండు వందల దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి చేరిన ఘనత నెహ్రూది అని అన్నారు. నెహ్రూ ఆలోచనలతో పరిపాలన, వారి భావాలను అనుసరించి పదేళ్ళు యూపిఏ చైర్మన్‌గా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్‌తో పాలన చేయించారని ఆయన తెలిపారు. అయితే నెహ్రూ మీద అబద్దాలు చెప్పి చరిత్రను మార్చే కుట్రలు చేస్తున్న మోడీ చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీలా ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధాని కాలేదన్నారు. బిజెపి శ్రీ రాముడి ఫొటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నదని ఆయన విమర్శించారు. అయోధ్యలో రామాలయం కట్టామని చెప్పడం తప్ప ఏమి చేయలేదని జగ్గారెడ్డి విమర్శించారు. నెహ్రూను కించపరచడం బిజెపి అజెండాగా పెట్టుకున్నదని అన్నారు. నెహ్రూ సిద్ధాంతాలను తాము అమలు చేస్తామని జగ్గా రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:39 pm

హాజీపల్లిని సుందరంగా తీర్చిదిద్దుతా..

షాద్ నగర్, ఆంధ్ర‌ ప్రభ : హాజిపల్లి గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చి

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:32 pm

బుట్టాపూర్ గ్రామన్ని రంగల్లో అభివృద్ధి చేసి చూపిస్తా…

దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ : గ్రామ అభివృద్ధి వేగంగా జరగాలంటే ఈనెల 11న

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:28 pm

గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప‌నిచేస్తా

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామ పంచాయ‌తీ అభివృద్ధే ధ్యేయంగా ప‌నిచేస్తాన‌ని తాళ్ల‌ప‌ల్లి

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:24 pm

జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి..

జనగామ, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతి సర్పంచ్, వార్డు సభ్యుల

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:22 pm

అభివృద్ధికి పట్టం కట్టండి…

సదాశివపేట రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : అభివృద్ధికి పట్టం కట్టండి.. వెల్టూర్ గ్రామంలో అన్ని

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:13 pm

డీప్‌ఫేక్‌ను నియంత్రించేలా లోక్‌సభలో ప్రైవేట్ బిలుల

న్యూఢిల్లీ : డీప్‌ఫేక్ నియంత్రణకు సంబంధించిన ప్రైవేట్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఇలాంటి కంటెంట్ కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ డీప్‌ఫేక్‌తో వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం ఇలా ఎంతో దుర్వినియోగం అవుతోందని, తక్షణ దీని నియంత్రణకు చర్యలు చేపట్టాలని శిండే అన్నారు. దురుద్దేశంతో ఇలాంటి కంటెంట్‌ను రూపొందించినా, లేదా వ్యాప్తి చేసినా, అలాంటి నేరస్థులకు శిక్షలు కఠినంగా విధించాలన్నారు.ఈ సందర్భంగా వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రత గురించి ప్రస్తావించారు. కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో డీప్‌ఫేక్ టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ కలవరపెడుతోందని, ఈ డీప్‌ఫేక్‌తో సైబర్ నేరగాళ్లు అవలీలగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. .

మన తెలంగాణ 6 Dec 2025 8:09 pm

దక్షిణాఫ్రికా బార్ వద్ద తుపాకీ కాల్పులు...11 మంది మృతి

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా పాలనా రాజధాని ప్రిటోరియా సమీపాన టౌన్‌షిప్ లోని ఓ బార్ వద్ద తుపాకీ కాల్పులు చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారి వయసు వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ప్రిటోరియాకు పశ్చిమ వైపు ఉన్న సౌల్స్ విల్లే లోని లైసెన్సు లేని బార్‌లో శనివారం తెల్లవారు జామున కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు చెప్పారు. మృతుల్లో మూడేళ్ల పసివాడు, 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారని వివరించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 8:05 pm

బొత్తల తండా సర్పంచ్ ఏకగ్రీవం..

పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని బొత్తలతండా గ్రామ సర్పంచ్ గా జాటోత్

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:05 pm

భారత్-రష్యా సంబంధాలు సుస్థిరం: జైశంకర్

న్యూఢిల్లీ: గత 70, 80 ఏళ్లుగా భారత్-రష్యాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని, ఆర్థిక సంబంధాలపై దృష్టి సారించి సంబంధాలను తిరిగి పటిష్టపర్చుకొనే లక్షం తోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ను సందర్శించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ శనివారం వెల్లడించారు. పుతిన్ పర్యటన అమెరికాతో భారత్ నెరపుతున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను సంక్లిష్టం చేయవచ్చన్న అభిప్రాయాలను ఆయన కొట్టివేశారు. ప్రపంచం లోని ప్రధాన దేశాలన్నిటితోనూ భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలున్నాయన్న సంగతి అందరికీ తెలుసని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పర్చుకునే హక్కు, స్వేచ్ఛ భారత్‌కు ఉన్నాయని, భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏదేశానికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందన్నారు. తమ ప్రభుత్వానికి కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు తగ్గట్టుగానే ఒప్పందం ఉంటుందన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 7:59 pm

పకడ్బందీగా నాకాబందీ ‘ఆపరేషన్ కవచ్’

పకడ్బందీగా నాకాబందీ ‘ఆపరేషన్ కవచ్’ ఖైరతాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లో శాంతి

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:58 pm

రోహిత్ శర్మ ఔట్.. విజయం దిశగా భారత్

వైజాగ్: దక్షిణాఫ్రికాతో మూడో చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో 271 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్ల రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో రోహిత్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(74), కోహ్లీ(2)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 109 పరుగులు చేయాల్సి ఉంది.  అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ డికాక్ మాత్రం 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ బవుమా 48 పరుగులు, బ్రెవిస్ 29 పరుగులు, మహరాజ్ (నాటౌట్) 20 పరుగులు, యాన్సెన్ 17 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 6 Dec 2025 7:48 pm

Will Priyanka step into the shoes of Deepika Padukone?

The team of Kalki 2898 AD announced the exit of Deepika Padukone from the film’s sequel which has been a huge shock for the actress. This is because of the demands of the actress and her big remuneration quote. Speculations soon said that the team is considering Alia Bhatt for the role and the makers […] The post Will Priyanka step into the shoes of Deepika Padukone? appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 7:38 pm

గంటలోపే భవానీలకు అమ్మ దర్శనం..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రం నలుమూలల నుండి…. పొరుగు రాష్ట్రాల నుండి

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:38 pm

Bhagyashri Borse’s Big Hopes on Lenin

Bhagyashri Borse made her debut with Ravi Teja’s Mr Bachchan and the film ended up as a disaster. The actress soon featured in films like Kingdom and Kaantha but these could not bring her success. But the performance of Bhagyashri Borse in all her films was appreciated. She recently featured in Ram’s Andhra King Taluka. […] The post Bhagyashri Borse’s Big Hopes on Lenin appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 7:28 pm

Indigo crisis costs Ram Mohan Naidu his reputation

The Civil Aviation Minister Kinjarapu Ram Mohan Naidu is facing a crisis, as massive disruption of flight services by Indigo Airlines has put lakhs of passengers to serious inconvenience and also raised questions over the performance of Aviation Ministry. Owing to the gross negligence and mismanagement of Indigo Airlines, about 1000 flights were cancelled on […] The post Indigo crisis costs Ram Mohan Naidu his reputation appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 7:21 pm

గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా…

తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : చిట్యాల గ్రామ అభివృద్ధే తన ధ్యేయమని, సర్పంచ్

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:11 pm

అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చుస్తా

గొల్లపల్లి, ఆంధ్ర‌ప్రభ : అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చుస్తాన‌ని, సర్పంచ్ గా

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:02 pm

పోతిరెడ్డిపాడు–బనకచర్ల కాంప్లెక్స్ లక్ష్యం దారి తప్పింది…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: రాయలసీమ సాగునీటి అవసరాల కోసం అత్యంత కీలకంగా నిర్మించిన

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:59 pm

దేవనగర్ సర్పంచ్‌గా సలుగుల సంతోష్ ఏకగ్రీవం..

ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామపంచాయతీలో

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:58 pm

రాయపట్నంను అభివృద్ధి పథంలో నడిపిస్తా..

ధర్మపురి, ఆంధ్రప్రభ : రాయపట్నం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాయపట్నం సర్పంచ్

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:56 pm

మంత్రి ఉత్తమ్ ను కలిసిన పాశం సంజయ్ బాబు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:54 pm

హైదరాబాద్ సిటీ వీకెండ్ డెస్టినేషన్స్: కేఫ్స్, బ్రూవరీస్ చూసొద్దాం రండి

హైదరాబాద్‌లో వీకెండ్స్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు సరైన కేఫ్ లేదా బ్రూవరీని కనుగొనడంలో ఈ కథనం మీకు సహాయపడుతుంది. స్నేహితులతో సరదాగా గడిపేందుకు, ప్రశాంతంగా పుస్తకం చదువుకోవడానికి, లేదా ఉత్సాహంగా సాయంత్రం గడపడానికి ఉత్తమమైన ప్రదేశాలను డియర్ అర్బన్ మీ కోసం ఇక్కడ పొందుపరిచింది. రండి.. హైదరాబాద్ సోషల్ లైఫ్‌ను కలిసి అన్వేషిద్దాం. 1. ప్రశాంతమైన వాతావరణం కోసం అద్భుతమైన కేఫ్‌లు ఈ సందడిగా ఉండే నగరంలో శాంతి, విశ్రాంతిని అందించే కొన్ని ప్రశాంతమైన ప్రదేశాలను […] The post హైదరాబాద్ సిటీ వీకెండ్ డెస్టినేషన్స్: కేఫ్స్, బ్రూవరీస్ చూసొద్దాం రండి appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 6 Dec 2025 6:53 pm

సుప్రీం కోర్టు సామాన్యుల కోసమే: సిజెఐ సూర్యకాంత్

న్యూఢిల్లీ : సామాన్యులకు న్యాయం కల్పించడం కోసమే సుప్రీం కోర్టు అన్న బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శనివారం స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్ధిష్ట సమయంలో త్వరగా పరిష్కరించడమే తన ప్రాధాన్యంగా ఆయన వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సామాన్యులకు న్యాయం అందుబాటులోకి రావలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. న్యాయపరమైన ఖర్చులు ఎలా తగ్గించాలి ? వ్యాజ్యాల పరిష్కారానికి సహేతుకమైన కాలపరిమితిని ఎలా నిర్ణయించాలి? అన్నవే తన ప్రాధాన్యంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి అడగ్గా, రాజ్యాంగంలో అధికార విభజన ఎలా జరిగిందో ప్రస్తావించారు. ప్రభుత్వశాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల పాత్రలను రాజ్యాంగం చక్కగా నిర్వచించిందని వివరించారు. ఒకదానిపై మరొకటి అతిక్రమించే అతివ్యాప్తి లేదన్నారు. కొన్ని వ్యాజ్యాల ప్రాధాన్యతతో సహా రానున్న రోజుల్లో సుప్రీం కోర్టులో కొన్ని సంస్కరణలు రావలసి ఉందన్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్స్ వంటి కేసులను ఉదహరిస్తూ న్యాయవ్యవస్థ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని , అందువల్ల న్యాయవ్యవస్థ అప్‌డేట్ కావలసి ఉందన్నారు. నాణ్యమైన న్యాయసహాయం అందించడానికి దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించవలసి ఉందని, ఈమేరకు ఎవరికైతే సహాయం అవసరమో వారికి న్యాయం అందించడానికి సమర్థులైన న్యాయవాదులు నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 6:52 pm

హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌గా కర్నూలు జట్టు

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో గత రెండు

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:50 pm

‘బడంగ్‌పేట్’ చార్మినార్‌లో విలీనంపై స్థానికుల ఆందోళన

 గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా బడంగ్‌పేట్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు శనివారం మహాధర్నా నిర్వహించారు. ‘బడంగ్‌పేట్ బచావో’పేరిట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ మెప్పుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని బడంగ్‌పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ను చార్మినార్ జోన్‌లో విలీనం చేయోద్దని, ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మహేశ్వరం బిజెపి ఇన్‌చార్జీ అందెల శ్రీరాములు, కార్పోరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డిలతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Dec 2025 6:46 pm

భారత్‌కు 40 వేల ఇజ్రాయెల్ లైట్‌మెషిన్ గన్స్

జెరూసలెం: వచ్చే ఏడాది ఆరంభంలో దాదాపు 40 వేల లైట్‌మెషిన్‌గన్స్‌ను భారత్‌కు సరఫరా చేయనున్నట్టు ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. వీటితోపాటు దాదాపు 1.70 లక్షల కార్బైన్‌లకు సంబంధించిన ఒప్పందం ఖరారు చివరిదశలో ఉందని తెలిపింది. పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్‌గన్స్ సహా ఇతర రక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు భారత హోంశాఖ లోని వివిధ ఏజెన్సీలతో సంప్రదింపులు చేస్తున్నట్టు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఐడబ్లు సీఈవో షుకి స్కాట్జ్ పేర్కొన్నారు. కార్బైన్స్‌కు సంబంధించి 60 శాతం ఆయుధాలను భారత్‌ఫోర్జ్ నుంచి మిగతా నలభై శాతం (1.70 లక్షల ఆయుధాలు) అదానీ గ్రూపు అనుబంధ సంస్థ పీఎల్‌ఆర్ సిస్టమ్స్ సరఫరా చేయనుంది. ఇక ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ అర్బెల్ టెక్నాలజీని భారత్‌కు అందించేందుకు సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నామని షుకి స్కాట్జ్ పేర్కొన్నారు. యుద్ధ భూమిలో సైనికులు అత్యంత కచ్చితత్వంతో , చురుగ్గా వ్యవహరించేందుకు ఇదెంతో ఉపకరిస్తుందన్నారు. ఒప్పందం పూర్తి కాగానే ఇజ్రాయెల్‌తోపాటు భారత్ లోనూ వీటి తయారీ చేపడతామన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 6:44 pm

గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించాలి: సిఎం మమతా బెనర్జీ

ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆహ్వానం అందుకోవడం ఎంతో గౌరవప్రదమైనదని తెలంగాణ సిఎంకు పంపిన ప్రత్యేక లేఖలో పేర్కొన్నారు. అయితే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న తేదీల్లో తనకు ముందుగానే నిర్ణయించిన జిల్లా పర్యటనలు ఉండటం వల్ల, ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఈ గ్లోబల్ సమ్మిట్ సార్థక చర్చలకు వేదికగా నిలవాలని, రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశంగా మారాలని మమతా బెనర్జీ ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఘన విజయం సాధించాలని చెబుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మమతా బెనర్జీని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు అప్పగించారు. దీనిలో భాగంగా మంత్రి సీతక్క, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లాల్లో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో మమతా బెనర్జీ బిజీగా ఉండటంతో, వ్యక్తిగతంగా కలవడం కష్టమని ఆమె ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పంపించాలని మమతా బెనర్జీ కార్యాలయం సూచించింది. అనుగుణంగా మమతా బెనర్జీ కార్యాలయంతో సమన్వయం సాధించిన మంత్రి సీతక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అధికారిక ఆహ్వాన పత్రికను ఇ-మెయిల్ ద్వారా పంపించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న అనంతరం మమతా బెనర్జీ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లేఖ పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఘన విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

మన తెలంగాణ 6 Dec 2025 6:43 pm

BJP : రాజా.. పాయల్.. ఇంకెవరు భయ్యా?

తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు కట్టుతట్టుతప్పుతున్నట్లు కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 6 Dec 2025 6:41 pm