దుబాయ్: చర్చల ఆశలు అడుగంటుతుండగా గల్ఫ్ యుద్ధం శనివారం మరింత రాజుకుంది. సౌదీ అరేబియా, కువైట్లపై ఇరాన్ తమ శక్తివంతమైన దేశీయ బాలిస్టిక్ మిస్సైల్స్తో దాడులకు దిగింది. వేయి కిలోమీటర్ల వరకూ దూసుకువెళ్లే సామర్థం ఉన్న ఖ్వాద్ 380 క్రూయిజ్ మిస్సైల్స్తో దాడులు సాగాయి. అమెరికా సైనిక స్థావరాలకు పొరుగుదేశాలు ఆశ్రయం ఇస్తున్నందున వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్ అధ్యక్షులు హెచ్చరించారు.ఈ క్రమంలోనే ఇరాన్ రెవెల్యూషన్ గార్డ్ కార్ప్ ఈ నిర్ణీత పోరుకు దిగాయి. ఈ క్రమంలో దుబాయ్లోని అత్యంత కీలకమైన రెండు అమెరికా సైనిక స్థావరాలను గురి చూసి దెబ్బతీశారు. ఈ రెండు కేంద్రాలలో 500 మందికి పైగా అమెరికా సైనికులు ఉంటున్నారు. ఇక్కడ జరిపిన దాడులలో పది మందికి పైగా అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్య , ప్రయాణ కేంద్రీకృత నగరం దుబాయ్లో శనివారం అంతటా అంబులెన్స్ల కదలికలు, సైరన్ల మోతల నడుమ భయానక వాతావరణం నెలకొంది. ఇరాన్ దాడులలో కొందరు అమెరికా సైనికులు మృతి చెందినట్లు, ఎక్కువ మంది గాయపడ్డట్లు ప్రాధమిక సమాచారంతో వెల్లడైంది. ఇప్పటి దాడులతో ట్రంప్, అమెరికా సైనిక కమాండర్లు పరిస్థితిని గ్రహించి తీరాలి. ఈ ప్రాంతం అమెరికా సైనిక స్థావరాలకు సురక్షితం కాదని గుర్తుపెట్టుకోవాలని ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి ఒకరు టెహరాన్లో తెలిపారు. ఇప్పుడు అమెరికా సైనికులకు ఈ ప్రాంతం ఖననవాటిక అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు వారికి ముందున్న మార్గం ఒక్కటే వీరోచిత ఇరానీయన్లకు, ఇస్లామ్ యోధులకు సరెండర్ అయ్యి తీరాలి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సౌదీకి, ఇతర గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియన్ తమ హెచ్చరికలు వెలువరించారు. ఖతార్లోని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ల దాడి క్రమంలో అక్కడి రాడార్ వ్యవస్థ దెబ్బతింది. ఇరాన్ జరిపిన ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దుబాయ్లోని ఓ హోటల్పై కూడా ఇరాన్ తన కమికాజే డ్రోన్లతో దాడులకు దిగింది. ఆరు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు ఇరాన్ అమెరికాకు చెందిన పలు నౌకా స్థావరాలపై శనివారం దాడులకు దిగింది. కువైట్లోని షువైక్పోర్టుకు అనుబంధంగా ఉన్న అమెరికా ల్యాండింగ్ సౌకర్యాలపై ఇరాన్ గార్డ్ విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో పలువురు అమెరికా సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే దీనిని స్థానిక వార్తాసంస్థలు ధృవీకరించలేదు. ఇరాన్లోని పలు ప్రాంతాలలో ఇజ్రాయెల్ సేనలు దాడులకు దిగాయి. ఈ క్రమంలోనే తొలిసారిగా ఇరాన్ మద్దతుగల హౌతి రెబెల్స్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ రెబెల్ బృందం సైనిక అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ఓ ప్రకటన వెలువరించారు. తాము ఈ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగామని తెలిపారు. ఇజ్రాయెల్కు చెందిన అత్యంత కీలకమైన సైనిక స్థావరాలను ఎంచుకుని పలుసార్లు క్షిపణులను పంపించినట్లు తెలిపారు. ఈ క్షిపణులను దెబ్బతీశామని శనివారం ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు క్రమేపీ ఇజ్రాయెల్ ఆత్మరక్షణ స్థాయికి చేరుకుంటున్న విషయం స్పష్టం అయిందని విశ్లేషకులు తెలిపారు. నేడు ఇస్లామాబాద్లో దౌత్య బృందాల చర్చ దౌత్యవర్గాల ద్వారా గల్ఫ్ యుద్ధ నివారణకు ఓ వైపు ప్రయత్నాలు సాగుతున్నాయి. చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షులు ట్రంప్ శనివారం కూడా ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే గల్ఫ్ ప్రాంతంపై దాడులకు సిద్ధంగా ఉండేందుకు అత్యధిక సంఖ్యలో సైనిక బలగాలను అమెరికా తరలించింది. ఇస్లామాబాద్లో పాకిస్థాన్ అధికారిక ప్రకటన వెలువరించింది. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు దేశాల దౌత్య ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్కు వస్తాయని, యుద్ధం నివారణకు ఈ చర్చలు ఇక జోరందుకుంటాయని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ తెలిపారు. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్, . టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్, ఈజిప్టు విదేశాంగ మంత్రి బద్ అబ్దెలాతీ ఆదివారం పాకిస్థాన్కు వస్తున్నారని డార్ వివరించారు. రెండు రోజుల పాటు విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం స్పందించారు. ఇరాన్ అధ్యక్షులు మసౌద్తో తాను మాట్లాడినట్లు , యుద్ధం ముగింపు విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. ఇరాన్లో పెరిగిన మృతులసంఖ్య నెలరోజుల పోరు క్రమంలో ఇరాన్లో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 1900 దాటింది. ఇజ్రాయెల్లో 20 మంది వరకూ మృతి చెందారు. పౌర ప్రాంతాలపై జరుగుతున్న దాడుల దశలో సంభవిస్తున్న మరణాలపై ఇరాన్ వార్తాసంస్థ ఎప్పటికప్పుడు సంఖ్యలతో వివరాలు వెల్లడిస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటివరకూ 1100 మందికి పైగా మృతి చెందారు. దాడులలో 13 మంది వరకూ అమెరికా సైనికులు ప్రాణాలు వదిలారు. ఇరాక్లో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు జరిపిన దాడులలో భద్రతాబలగాలకు చెందిన 80 మంది మృతి చెందినట్లు నిర్థారణ అయింది. దుబాయ్, గల్ఫ్లోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడులలో బారతీయ పౌరులు ముగ్గురు, కొందరు పాకిస్థానీయులు మృతి చెందారు.
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
మన తెలంగాణ / సంగారెడ్డి : ఆ తల్లికి భర్త లేని జీవితం భారంగా కనిపించింది. కన్నపిల్లలకు విషమిచ్చి తాను కూడా తనువు చాలించింది. కంది మండలంలో జరిగిన ఈ హృద య విదారక ఘటన వివరాలిలా ఉన్నాయి. జుల్కల్ గ్రామానికి చెందిన మమత (28) శనివారం నాడు తన ఇద్దరు పిల్లలు మణికంఠ (5), ప్రళయ (4)కు విషమిచ్చింది. వారు చని పోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత జనవరి లో మమత భర్త పెంటయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో ఆమె పిల్లలను పెంచుతున్నారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురయింది. జీవితం భారంగా అనిపించింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులను చంపి, తాను కూడా చనిపోయింది. ఒక్క సారిగా జుల్కల్ గ్రామంలో విషాదం అలముకున్నది. గ్రామస్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులు, తల్లి బలవన్మరణం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. విషయం తెలియగానే జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్, డిఎస్పి సత్తయ్య,ఇతర పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. దుర్ఘటనపై ఆరా తీశారు. మృతురాలి బంధువులతో మాట్లాడారు. దర్యాప్తు చేస్తున్నారు.
సన్రైజర్స్ పై బెంగళూరు ఘన విజయం
ఐపిఎల్ 2026ను బెంగళూరు ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై 6 వికెట్ల తేడా విజయం సాధించి బోణీ కొట్టింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 69 (38 బంతులు; 5x4, 5x6), దేవ్దత్ పడిక్కల్ 61(26 బంతులు; 7x4, 4x6)లు అర్ధ శతకాలతో చెలరేగగా.. సారథి రజత్ పాటిధర్(31) సయితం మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దీంతో 201 పరుగుల భారీ లక్షాన్ని కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి, 15.4 ఓవర్లలోనే ఛేదించి విజయానందుకుంది బెంగళూరు. సన్ రైజర్స్ బౌలర్లలో డెవిడ్ పెయిన్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టగా.. జైదేవ్ ఉనద్కట్, హర్ష్ దూబె తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 (38 బంతులు; 8x4, 5x6 ) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనికేత్ వర్మ 43 (18 బంతులు; 3x4, 4x6 ), హెన్రీచ్ క్లాసెన్(31) దూకుడుగా రాణించడంతో సన్రైజర్స్ భారీ స్కోరు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో జాకో డఫీ(3/22), రొమారియో షెఫెర్డ్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. శుభారంభం దక్కలేదు.. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ పేలవ ఫామ్ను ఐపిఎల్ 2026 సీజన్లోనూ కొనసాగించాడె. ఆ మ్యాచ్లో అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. 8 బంతుల్లో ఒక సిక్సర్తో 7 పరుగులే చేసి వెనుదిరిగాడు. జబోబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. జాకోబ్ డఫీ వేసిన షార్ట్ బాల్ను అభిషేక్ శర్మ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా.. కీపర్ జితేష్ శర్మ పరుగెత్తి క్యాచ్ తీసుకున్నాడు. దాంతో సన్రైజర్స్ 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇదే ఓవర్ ఆఖరి బంతికి ట్రావిస్ హెడ్(11) సయితం క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. నితీశ్ కుమార్ రెడ్డి(1), సలీల్ అరోరా(9) కూడా రాణించలేక పోయారు.
దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం . భూములిచ్చిన రైతులకు పాదాభివందనం. అమరావతిపై జగన్ ఊసరవెల్లి రాజకీయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర-సచివాలయం: అమరావతి అజేయం… అద్భుతం… అజరామరమని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శనివారం తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతు పలికిన శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ఇక ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్నారు. […] The post అజేయం…అజరామరం appeared first on Visalaandhra .
ఫ్యాక్ట్ చెక్: ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ పోస్టు పెట్టలేదు
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ
ఇళ్లు, భూములు లాక్కుంటే చూస్తూ కూర్చోవాలా..?: ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి
ఇళ్లు, భూములు లాక్కుంటే చూస్తూ కూర్చోవాలా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరిగితే ఆరు నూరైనా అడ్డుకొని తీరుతామని ఆమె పేర్కొన్నారు. మమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారని సిఎం అంటున్నారని ఆయన మాటలకు భయపడేది లేదని ఆమె అన్నారు. రెండేళ్లు ఆగితే ప్రజలే కాంగ్రెస్ బహిష్కరిస్తారని ఆమె విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో 10 వేల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడు వేల ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆమె విమర్శించారు. తాము మూసీకి వ్యతిరేకం కాదని, ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకమని ఆమె అన్నారు. ఇళ్లు, భూములు లాక్కుంటే చూస్తూ కూర్చోవాలా కోర్టులకే కాదు ఎంత దూరమైనా వెళ్తామని ఆమె తెలిపారు.
జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం
. తప్ప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఐజేయూ ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మీడియాలో వచ్చే కథనాలను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అదేసమయంలో పత్రికా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుత మీడియా పోకడల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా తనకు […] The post జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం appeared first on Visalaandhra .
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ యొక్క 19వ ఎడిషన్ ఈ సాయంత్రం బెంగళూరులో ప్రారంభమైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్లైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్ ఆహ్వానం అందుకున్న సన్రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది. మొదటి మ్యాచ్లో ఇషాన్ కిషన్(80) రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్(80: 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. హెన్రిచ్ క్లాసెన్(31) జతగా 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ భారీ స్కోర్కు బాటలు వేశాడు. అనికేత్ వర్మ(43 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచేశాడు.ఇషాన్, అనికేత్ మెరుపులతో ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్ధికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
సీపీఐ, సీపీఎంకుచెరో ఐదు సీట్లు
డీఎంకే 164, కాంగ్రెస్ 28తమిళనాట పూర్తయిన సీట్ల పంపిణీ చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాల్లో మిత్ర పక్షాలకు 70 సీట్లు ఇచ్చి… మిగిలిన 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగుతోంది. సీపీఐ, సీపీఎంకు చెరో ఐదు సీట్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్కు 28 సీట్లు కేటాయించింది. వాటిలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్కోడ్, శివకాశి, […] The post సీపీఐ, సీపీఎంకుచెరో ఐదు సీట్లు appeared first on Visalaandhra .
ట్రైన్ లో గోల్డ్ చైన్ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ నిజమైనవి కాదు
. మా మాట వింటేనే దాడులు ఆపుతాం. నమ్మకం కుదిరితేనే శాంతి చర్చలు. అమెరికా`ఇజ్రాయిల్కు మద్దతిస్తే ప్రతీకారమే. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక తెహ్రాన్/వాషింగ్టన్/తెలఅవీవ్:ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం మొదలై నెల రోజులైంది. వైమానిక దాడులు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇరాన్ కూడా దీటుగా ప్రతిఘటిస్తూ, ప్రతి దాడులతో ఇజ్రాయిల్గల్ఫ్ను బెంబేలెతిస్తోంది. తమ మాట వినకపోతే శాంతిని మర్చిపోవల్సిందేనని హెచ్చరిస్తోంది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేస్తే తప్ప దాడులు ఆపబోమని తేల్చి చెబుతోంది. అయితే ఇరాన్ను లొంగదీసుకోవడం కోసం […] The post నిప్ప్పుతో చెలగాటం వద్దు appeared first on Visalaandhra .
సిఎం రేవంత్రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
ఫుట్బాల్ ఆటలో సీఎం టీమ్ నుంచి నాగార్జునసాగర్ ఎంఎల్ఏ జైవీర్ గోల్ కొట్టారు. స్పీకర్ టీమ్ను గెలిపించేందుకు సీఎం రేవంత్రెడ్డి జట్టు మారారు. ఎంఎల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. స్పీకర్ టీమ్ కోసం సీఎం గోల్ కొట్టారు. సీఎం రేవంత్రెడ్డి ఫుట్ బాల్లో 4 గోల్స్ సాధించి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచినారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. కబడ్డీలో టీమ్ బీపై టీమ్ ఏ విజయం సాధించింది. స్పోర్ట్ మినిస్టర్ శ్రీహరి టీమ్కు విజయం వరించింది.
భారతదేశం వద్ద కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపడ ఇంధనం ఉందని ప్రభుత్వం ఎలాంటి ప్రకటన
ఫుడ్ సెక్యూరిటీ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదు: సిఎం రేవంత్రెడ్డి
దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అందుకే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారాన్ని తమ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగానే ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ స్కీంను కూడా ప్రారంభించామని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ‘తొలి ముద్ద’ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీ చిన్నారులకు ఇక నుంచి రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్ గా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్కు మొబైల్ ఫోన్లను కూడా పంపిణీ చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమేనని అన్నారు. అందుకే ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టిందని పేర్కొన్నారు. అంగన్వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని, మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీళ్లేదని, సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుందని అన్నారు.పోష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని, భవిష్యత్లో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపారు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
కేడీసీసీ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకం
కేడీసీసీ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకం – కేడీసీసీ బ్యాంక్ చైర్మన్,
అమరావతికి చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేయడం హర్షణీయం
అమరావతికి చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేయడం హర్షణీయం విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Just-18Hrs : నేపాలీ పీఎం తొలి షాక్ Andhra Prabha Latest News
Just-18Hrs : నేపాలీ పీఎం తొలి షాక్ Andhra Prabha Latest News
గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి -రఘునాథపల్లి ఎస్ఐఐ డి.నరేష్ రఘునాథపల్లి,
జైశెట్టి రమణయ్య మృతి తీరనిలోటు
జైశెట్టి రమణయ్య మృతి తీరనిలోటు చరిత్ర పితామహుడు మృతి పై చరిత్రకారులకు తీరనిలోటుఅస్మక
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ “నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ టీం మీద ఉన్న నమ్మకంతోనే సినిమాకి ఓకే చెప్పాను. ఇదివరకే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం” అని అన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ “విలేజ్ డ్రామాగా, స్పోర్ట్ బ్యాక్డ్రాప్లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతోన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది”అని తెలిపారు. యదు వంశీ మాట్లాడుతూ “వాలీబాల్ బ్యాక్డ్రాప్తో ఓ ఐడియా రాగానే నాకు వరుణ్ గుర్తుకువచ్చారు. అలా కొంత కథ అయ్యాక నిహారిక వద్దకే వెళ్లాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను సిద్ధంచేసి వరుణ్కి వినిపించగా ఆయనకి కథ చాలా నచ్చింది. షూటింగ్ త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనుదీప్ దేవ్, చిన్నా పాల్గొన్నారు.
గ్రామాభివృద్దికి నిధులు ఇవ్వండి…
గ్రామాభివృద్దికి నిధులు ఇవ్వండి… రెండు దఫాలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించలేదునిధుల ఇవ్వాలని కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన
యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి…
యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి… ఈగల్ చీఫ్ ఐజీ రవికృష్ణ కర్నూలు
రైతుల త్యాగాలకు గౌరవం… అమరావతి తీర్మానం చారిత్రాత్మకంమహిళల ధైర్యానికి గుర్తింపుప్రజా ఉద్యమానికి అసెంబ్లీ
అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మకం
అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మకం వైసీపీ గైర్హాజరు ద్వారా కుట్రకోణం బహిర్గతం:
32 లక్షల మంది సభ్యులకు రూ.23 వేల కోట్ల రుణాలు
స్త్రీనిధి రుణాలను 2011 నుంచి సుమారు 32 లక్షల సభ్యులకు రూ.23 వేల కోట్లు అందించగా, 2025 మార్చి 31 నాటికి రుణ నిల్వ రూ.5,107 కోట్లుగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. 2025.26లో రూ.2,350 కోట్ల ప్రణాళికలో రూ.2,125 కోట్లు (దాదాపు 90%) అమలు చేసి, ఆ ఏడాది 2026-.27 రూ.2,530 కోట్ల ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అలాగే 2024-.25లో రూ.154 కోట్ల నికర లాభంతో 14 శాతం డివిడెండ్ ప్రకటించడం స్త్రీనిధి విజయాన్ని ప్రతిబింభిస్తుందని తెలిపారు. సెర్ప్, మెప్మా సమన్వయంతో మరిన్ని సేవలు అందించేందుకు స్త్రీనిధి కట్టుబడి ఉంది అని అన్నారు. మారుమూల గ్రామాల సంఘాలకు మన స్త్రీనిధి యాప్ ద్వారా స్వయంగా రుణాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించి, తక్కువ ఖర్చుతో సరైన సమయంలో రుణాలు పొందే విధంగా స్త్రీనిధి చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో పోస్టాఫీసులు ద్వారా నగదు చెల్లింపులకు అవకాశం ఉందని చెప్పారు. స్త్రీనిధిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు 163 మంది నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదేవిధంగా సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ ఏడాది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కష్టాల్లో ఎస్ఆర్ హెచ్… ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్ : 19వ సీజన్ IPLలో, చినస్వామి
అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీష్ రావు
అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు అని పేర్కొన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డి అని చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో కలిసి హరీష్రావు అసెంబ్లీ లాబీలో నిరసనకు దిగారు . మైనింగ్ స్కాం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ బిఆర్ఎస్ ఎంఎల్ఎలు నినాదాలు చేశారు. అనంతరం హరీష్రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని అన్నారు. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా..? అని అడిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయం అని పేర్కొన్నారు.
Amaravati Resolution Marks a Clear Political Line in Andhra Pradesh
The Andhra Pradesh Legislative Assembly has sent a strong and unified message on the future of the state’s capital. In a rare display of consensus, the House passed a resolution that seeks legal backing for Amaravati as the sole capital of the state. The move reflects both political clarity and administrative intent. Chief Minister N […] The post Amaravati Resolution Marks a Clear Political Line in Andhra Pradesh appeared first on Telugu360 .
Dacoit: Adivi Sesh Fires Up Chicchubuddi
With just days left for the arrival of Adivi Sesh’s Dacoit, directed by Shaniel Deo, the buzz around the film is soaring. The glimpse, teaser and first single from the movie received superb response. Meanwhile, they released the electrifying second single, Chicchubuddi. This track turns the spotlight onto Adivi Sesh in a never-before-seen avatar, as […] The post Dacoit: Adivi Sesh Fires Up Chicchubuddi appeared first on Telugu360 .
మద్యానికి బానిసై నిత్యం తల్లి, చెల్లిని వేధిస్తున్నాడనే ఆక్రోశంతో తండ్రిని హతమార్చాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని బాయిమీది తండాలో జరిగింది. శనివారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాయిమీది తండాకు చెందిన రాథోడ్ లోక్యనాయక్(50), బిక్కిబాయి దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో మద్యం చిచ్చురేపింది. మద్యానికి మద్యానికి బానిసైన లోక్యనాయక్ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. మద్యానికి బానిసైన లోక్యనాయక్ తరుచుగా మద్యం సేవించి భార్య బిక్కిబాయి, చిన్నకుమార్తె సుప్రియను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన భార్య బిక్కిబాయి, కుమార్తె సుప్రియను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని తల్లి బిక్కిబాయి తక్షణమే హైదరాబాద్లో ఆటో నడుపుకుంటు జీవనం సాగిస్తున్న కుమారుడు రాథోడ్ సునీల్(34)కు ఫోన్లో సమాచారం చేరవేశారు. దీంతో సునీల్ నాయక్ ఆక్రోశంతో స్వగ్రామం బాయిమీది తండాకు చేరుకున్నాడు. తన తల్లి బిక్కిబాయి, చెల్లెలు సుప్రియను వేధిస్తున్న విషయంపై తండ్రి లోక్యనాయక్ను మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరుగడంతో ఆగ్రహానికి గురైన రాథోడ్ సునీల్ నాయక్ తన ఇంట్లో ఉన్నటువంటి గొడ్డలితో తండ్రి లోక్యనాయక్ మెడ, దవడ, తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో లోక్యనాయక్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తల్లి హేమ్లీబాయి ఫిర్యాదు మేరుకు పోలీసులు 58/2026 యూ/ఎస్ 103(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుడు రాథోడ్ సునీల్ నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ
జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ చెన్నూర్, ఆంధ్రప్రభ :
ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సన్రైజర్స్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా.. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుగున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్లో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన సన్రైజర్స్కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. డఫీ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ (7) జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్(11) ఔట్ అయ్యాడు. మళ్లీ డఫీ ఓవర్లోనే నితీశ్ రెడ్డి (1) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ మూడు వికెట్లు నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజ్లో ఇషాన్ కిషన్(23), క్లాసెన్(3) ఉన్నారు.
తాగి మెట్రో ఎక్కితే రూ. 2500 ఫైన్
మెట్రో ప్రయాణికులకు కేంద్రం షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వేసేలా శుక్రవారం లోక్సభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. మద్యం తాగి రైలెక్కడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, ఉమ్మి వేయడం వంటి వాటికి ఇప్పటివరకు విధిస్తున్న రూ. 500 జరిమానాను రూ. 2,500కు పెంచింది. అలాగే రైల్లో అసభ్య రాతలు రాయడం, పోస్టర్లు అతికిస్తే విధించే ఫైన్ వెయ్యి రూపాయల నుంచి రూ. 10 వేలకు పెంచింది. మహిళా కోచ్లలోకి ప్రవేశించే పురుషులకు ఫైన్ను రూ. 250 నుంచి ఏకంగా రూ. 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జన విశ్వాస (సవరణ) బిల్లు 2026ను వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభలో ప్రవేశ పెట్టారు.
అక్రమంగా సిలిండర్లు స్వాధీనం.. ఎర్రమట్టి తవ్వకాలకు బ్రేక్
అక్రమంగా సిలిండర్లు స్వాధీనం.. ఎర్రమట్టి తవ్వకాలకు బ్రేక్ వికారాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్
గుడిమల్కాపూర్లో అక్రమ బేకరీపై పోలీసులు దాడి #Gudimalkapur #IllegalBakery #FoodSafety #PoliceRaid
104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు రీలీజ్
104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు రీలీజ్ 20.05 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
వేడెక్కిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరింత వేడెక్కాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం బిజెపి తరఫున రాష్ట్రంలోని మమత బెనర్జీ సారధ్య టిఎంసి ప్రభుత్వంపై ఛార్జీషీట్ విడుదల చేశారు. బెంగాల్ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం అయినవి కావు. ఇది దేశ భద్రత సమగ్రతకు సంబంధించిన విషయం అయిందని తెలిపారు. ఎన్నికల దశలో బిజెపి తరఫున ఆయన జోరు పెంచారు. ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్ షా మమత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 15 సంవత్సరాలుగా సాగుతున్న టిఎంసి సర్కారు హయాంలో పలు అక్రమాలు జరిగాయని విమర్శించారు. ప్రత్యేకించి టిఎంసి ప్రభుత్వ వైఖరితో దేశంలోకి అక్రమ వలసలు ముమ్మరం అయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు ఈ ప్రాంతం చొరబాట్ల ముఖద్వారం అయిందని విమర్శించారు. బిజెపి ఛార్జీషీట్లో సంబంధిత విషయాలను ప్రస్తావించామని వివరించారు. టిఎంసి ప్రభుత్వ బుజ్జగింపుల రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసాకాండతో పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. ప్రత్యేకించి దేశ భద్రతకు సవాలు విసిరేలా చొరబాట్ల వ్యవహారం మారిందని అమిత్ షా చెప్పారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారశైలి చివరికి అరాచక వీధిరౌడి స్థాయికి మారింది. ఇటువంటి ధోరణిని వెంటనే నీరుగార్చి తీరాల్సి ఉందన్నారు. పైగా మమత దీదీ ఎప్పుడూ తాను దాడులకు దిగుతూ , రాజకీయ బాధితురాలు డ్రామాలకు దిగుతారు. ఒక్కోసారి ఆమె తనకు తగలని గాయాలను చూపుతూ సానుభూతికి ప్రయత్నిస్తారు. ఎన్నికల సంఘంపై తిట్లకు దిగుతారు. ఇప్పుడు ఈ మహానుభావురాలి కపట నీతి గురించి బెంగాలీలందరికీ తెలిసిపోయింది. ఆమె తరచూ బాధితురాలనే డ్రామాలో ప్రధాన పాత్రధారి అని గుర్తించారని చెప్పారు. టిఎంసి మైనార్టీ ఓటుబ్యాంకు రక్షణకు ఆమె ఎన్నికల సంఘం చేపట్టిన సర్ను వ్యతిరేకించారని చెప్పారు.
మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రోను విస్తరించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఫేజ్-2ఎ 76.4 కి.మీ., ఫేజ్-2బి 86.1 కి.మీ విస్తరణకు తీర్మానం జరిగింది. మెట్రో విస్తరణలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం చేసుకునే నిర్ణయానికి సభ ఆమోదం తెలిపింది. మెట్రో ఫేజ్-2కు కేంద్ర ఆమోదం త్వరగా లభించేలా కృషి చేయాలని తీర్మానం చేశారు.
కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా..
కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా.. ఎల్ పి హెచ్ ఎస్
మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళలు
నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..!
నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..! స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్
సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ
సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ కరీమాబాద్, ఆంధ్రప్రభ
నేపాల్లో మాజీ ప్రధాని ఓలి అరెస్టు
నేపాల్లో దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలిని శనివారం అరెస్టు చేశారు. కొత్తగా ఏర్పడ్డ బాలేంద్ర షా ప్రభుత్వం ఈ తీవ్ర చర్యకు దిగింది. 2025 జన్ జడ్ నిరసనల అణచివేతల అంశంపై దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా మాజీ ప్రధాని, సిపిఎన్యుఎంఎల్ ఛైర్మన్ కూడా అయిన ఓలిని అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయననుఖాట్మాండుకు సమీపంలోని భక్త్పూర్ జిల్లాలోని గుండూ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. కటుంజెలోని ఆయన నివాసం నుంచి మాజీ హోం మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత రమేష్ లేఖక్కు నూడా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో యువతరం నుంచి అధికార పక్షానికి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇది జన్జడ్ ఉద్యమంగా మార్మోగింది. అప్పుడు అధికారంలో ఉన్న ఓలి , లేఖక్ల ప్రోద్బలంతో ఉద్యమం అణచివేతకు దమననీతిని ప్రదర్శించారనే అభియోగాలపై దర్యాప్తు జరిగింది. కమిటీ నివేదిక వెలువరించింది. వీరిపైనా ఇతరులపైనా నేరపూరిత చర్యల కేసులు దాఖలు అయ్యాయి. ఇటీవలే పగ్గాలు చేపట్టిన బాలేంద్ర షా ఆధ్వర్యంలో శుక్రవారమే నూతన మంత్రి మండలి సమావేశం జరిగింది. దర్యాప్తు కమిటీ నివేదికను తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పుడు పోలీసు చర్యకుదిగారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఇప్పటి అరెస్టులపై నూతన హోం మంత్రి సుధాన్ గురుంగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
సీతానగరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు…
సీతానగరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు… చక్రస్నానం, వసంతోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతి..పుష్పయాగం, డోలోత్సవంతో మహోత్సవాలు… ఇంద్రకీలాద్రి,
ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News
ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News (
కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి
కల్తీ బేకరీ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 12,54,280 విలువైన మైదాపిండి, చెక్కెర బస్తాలు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, కేడి కాలనీకి చెందిన అహ్మద్ రజా బేకరీ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు అహ్మద్ రజా ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు,బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు తయారీ కేంద్రంపై దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్స్పెక్టర్ ఆర్. వెంకటేష్, గుడిమల్కాపూర్ ఇన్స్స్పెక్టర్ రామయ్య, ఎస్సైలు కె. వెంకటరమణ, సురేష్, సిబ్బంది దాడులు చేశారు.
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సిబి
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సిబి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సిబి జట్టు సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడటం ఇది ఏడోసారి. మరోవైపు ఎస్ఆర్హెచ్కు ఇది రెండోసారి. తుది జట్లు: ఆర్సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకడ్ డఫీ, సుయాశ్ శర్మ. ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగా.
హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలోనే: సిఎం రేవంత్రెడ్డి
మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మూసీనది పునరుజ్జీవిం గురించి చాలా మంది ప్రయత్నించారని, కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని, ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తారని, తెలంగాణ పౌరులకు తన విజ్ఞప్తి ఒక్కటేనని, చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందని, సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని సిఎం అన్నారు. దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదని, మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్య కారకంగా మారింది గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం…
ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర
ఈనెల 30న అసెంబ్లీలో సన్నబియ్యంతో విందు భోజనం
సన్నబియ్యంతో విందు భోజనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30వ తేదీన అసెంబ్లీ సెంట్రల్ హాల్లో సన్నంబియ్యంతో వండిన విందు భోజనాన్ని వడ్డించనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 3.39 కోట్ల మందికి దీనిద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీన మధ్యాహ్నాం ఒంటిగంటకు ఈ విందు భోజనం నిర్వహించనుండగా ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్రెడ్డి, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
Sri Rama Navami |ఘనంగా శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం
Sri Rama Navami | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భక్తి, వేడుకలు, సంగీతం,
బిసి రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు.. రాహుల్ గాంధీకి విహెచ్ వినతి
బిసి రిజర్వేషన్ల కోసం పార్లమెంటు లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు ఏఐసిసి అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరారు. ఈ మేరకు విహెచ్ శనివారం రాహుల్ గాంధీకి లేఖ రాశారు. బిసిలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీని కోరాలని ఆయన రాహుల్ గాంధీని కోరారు. బిసి బిల్లు పెట్టకపోతే ప్రతిపక్షాలు ప్రయోజనం పొందుతాయని, బిసిల పట్ల కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదని విమర్శలు వెల్లువెత్తుతాయని ఆయన తెలిపారు. పైవేట్ మెంబర్ బిల్లు పెట్టేలా చూడాలని ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కసి వేణుగోపాలను కోరారు. బిసి ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి ఆమోదం పొందినా పొందకపోయినా బిసిల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి బిల్లు పెట్టడం ద్వారా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరిస్తేనే బిసిలకు రిజర్వేషన్లు సాధ్యం అవుతుందని ఆయన వివలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో శ్రీ రాముని కళ్యాణం జరిపించాలని విహెచ్ కోరారు.
లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ…
లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ… విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ మున్సిపల్
BJP : తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్లాన్ సిద్ధం చేసిందటగా?
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది
వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం
వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తజనం ఉరవకొండ రూరల్,
ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఇచ్చి.. రూ.15 కోట్లు దక్కించుకున్నాడు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీ పరిహారం అందినట్లు తెలుస్తోంది. తద్వారా ఆ భూమల రైతుల జీవితాలు రాత్రికి రాత్రే బంగారు మయం అయ్యాయని పలు నివేదికల సమాచారం. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఓ రైతుకు దాదాపు రూ.15 కోట్లు పరిహారం లభించింది. ఈ భారీ సొమ్ము ఆయన ఏకంగా ఒక హెలికాఫ్టర్ను కొనుగోలు చేయడమే కాకుండా, విహార యాత్ర కోసం థాయ్లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ముఖ చిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి.
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ . డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి
శిక్షణ పూర్తి చేసిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్ల పంపిణీ
బాసర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీలలో వార్డుల అభివృద్ధికి వార్డు సభ్యులు కీలక పాత్ర
మార్కెట్లో అన్ని సైజుల టీవీల ధరలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్, రాగి ధరలు పెరగడం వల్ల ఏసీల రేట్లు కూడా ప్రియం కానున్నాయి. గతంలో రూ.28,000 లభించే 65 అంగుళాల టీవీ ధర ఇప్పుడు రూ.32 వేలకు చేరిందని సమాచారం. అలాగే 32 అంగుళాల టీవీ ధర రూ. 5,700 నుండి రూ.6,400 కు పెరిగింది. ధరలు పెరగడంతో సగానికి పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, సిలిండర్ల కొరత కూడా వేధిస్తోంది.
స్టూడెంట్గా మారిన ఎస్ఐ.. ఆకతాయిలకు చెక్
టేకుమట్ల, ఆంధ్రప్రభ : పోలీసు అంటే కేవలం లాఠీ పట్టి విధులు నిర్వహించడం
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి సాగు–తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంఏపీ రైతు సంఘం
నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి
నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి: కలెక్టర్ డా.ఏ.సిరి.
Lenin Team Breaks Silence on Release
Akhil Akkineni has been completely occupied with the shoot of Lenin from a long time. The last schedule is currently happening and there were strong speculations that the film releases on May 1st. There is a debate on social media that the team is tight-lipped about the release. With Ram Charan’s Peddi slated for April […] The post Lenin Team Breaks Silence on Release appeared first on Telugu360 .
పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు
పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు రవీంద్ర రావు అదనపు కమిషనర్ విజయవాడ కార్పోరేషన్,
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు జిల్లా క్రీడాకారులు ఎంపిక
నిజామాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు శనివారం
Change of Plan from Anudeep KV
Anudeep KV made an impressive debut with Jathi Ratnalu. The comic timing in the film was hilarious and all the actors from the film are quite busy now. Anudeep did films like Prince and Funky. Prince ended up as a below average film while Funky brought him a lot of criticism. Anudeep KV was trolled […] The post Change of Plan from Anudeep KV appeared first on Telugu360 .
Revanth Reddy : మైనింగ్ అక్రమాలకు సీఐడీ విచారణకు సిద్ధం
మైనింగ్ పై జరిగిన అక్రమాలన్నింటిపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు
వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…
వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మిద్దాం… విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన
Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం Andhra Prabha Assembly News
Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం Andhra
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : గిరిరాజ్
ఆరో తరగతి బాలికపై దారుణం ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ : ఎన్టీఆర్
దళిత హక్కుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ..
కరిమాబాద్, ఆంధ్రప్రభ ; దళిత కుల పోరాట సమితి రెండవ మహాసభ వాల్పోస్టర్
జీజీహెచ్లో ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం
జీజీహెచ్లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం కర్నూలు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan : వైసీపీ అధికారంలోకి రావడం జరగని పని
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా
Amaravathi : అమరావతి అందరిదీ.. అందుకే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేశాం
అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించేలా కేంద్రానికి పంపే తీర్మానంపై శాసనసభలో కొనసాగుతున్న చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు
మైనింగ్, ఇసుక తవ్వకాలపై సిబిసిఐడి విచారణ: సిఎం రేవంత్
హైదరాబాద్: మైనింగ్, ఇసుక తవ్వకాలపై సిబిసిఐడి విచారణకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. ‘‘సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపై విచారణ జరిపిస్తాం. సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై, గంగుల కమలాకర్ అక్రమ గ్రానైట్ మైనింగ్, వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్పై, రాఘవ కన్స్స్ట్రక్షన్తో పాటు అన్నింటిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నాం’’ అని సిఎం అన్నారు. విచారణలో నిజాలు నిగ్గు తేల్చి శాసనసభలో నివేదిక పెడతామని స్పష్టం చేశారు. ‘‘అక్రమాలకు పాల్పడింది బిఆర్ఎస్ నేతలు, వారి బంధువులే. వద్దిరాజు రవిచంద్ర వంటివారిని బెదిరించి దారిలోకి తెచ్చుకున్నారు. స్వయంగా హరీశ్ రావు తమ్ముడు మహేశ్వర్రావు ఇసుక మాఫియా నడిపారు. అతడి అక్రమాల వల్లే కెటిఆర్ మైనింగ్ శాఖ తీసుకున్నారు’’ అని సిఎం పేర్కొన్నారు.
పాడి రైతులకు భారీ లాభం… కృష్ణా మిల్క్ యూనియన్ కీలక నిర్ణయంపాల సేకరణ
Gas cylinders | 30సిలిండర్లతో…
Gas cylinders | 30సిలిండర్లతో… Gas cylinders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఆలేరు, ఆంధ్రప్రభ : రైతాంగ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని
టీడీపీ కుటుంబానికి సహాయం… రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు మండలంలోని మారూరు గ్రామనికి
అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష….
అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష…. అప్పట్లో మూడు రాజధానులను వ్యతిరేకించాను.అసెంబ్లీలో ఎమ్మెల్యే వసంత
అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది..
అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి..అమరావతి సీఎం
ముందస్తు అడ్మిషన్లను అరికట్టండి…
ముందస్తు అడ్మిషన్లను అరికట్టండి… కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలి.పి.డి.ఎస్.యు
ఆర్థిక సాధికారతకు స్వయం ఉపాధి చేయూత…
ఆర్థిక సాధికారతకు స్వయం ఉపాధి చేయూత… రైజ్ శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లను సద్వినియోగం
జనవరిలో భర్త మరణం.. పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య
సంగారెడ్డి: కంది మండలం జూలకల్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులు చనిపోయిన తర్వాత ఉరేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు తల్లి మమత (28), మణికంఠ(5), ప్రళయ(4)గా గుర్తించారు. జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడనే మనస్తాపంతో పిల్లలతో సహా మమత ఆత్మహత్య చేసుకుంది. ఈ ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుంది: రేవంత్
హైదరాబాద్: బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయటం వెనుక సహేతుక కారణం ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ పౌష్టికాహారం అందట్లేదు అని అన్నారు. అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా ‘తొలి ముద్ద’ పథకాన్ని సిఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కొండా సురేఖ, సీతాదయాకర్ రెడ్డి పాల్గొన్నారు. రెడీ టూ కుక్ ఫుడ్ ( ఉప్మా, కిచిడీ మిక్స్) ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీ వర్కర్స్ కు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నాం అని..పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుందని రేవంత్ తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందని, అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు అని..అంగన్వాడీ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించే చర్యలు చేపట్టామని అన్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి..
అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి.. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
IPL betting apps |బలి పశువులుగా మారుతున్న యువత..
IPL betting apps | బలి పశువులుగా మారుతున్న యువత.. IPL betting

26 C