SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

ఏఐఏఎఫ్‌లో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్‌’

భారతీయ చిత్రానికి దక్కిన అరుదైన గౌరం: రాజమౌళిహైదరాబాద్: రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీ నుంచి ఆయన దర్శకత్వంలోనే రూపొందుతోన్న సరికొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ఎటర్నల్ వార’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రం ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మాక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్`2026 (ఏఐఏఎఫ్)లోని వర్క్ ఇన్ ప్రోగ్రస్ విభాగంలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. దీనిపై దర్శకుడు రాజమైళి స్పందిస్తూ… ‘ఇది […] The post ఏఐఏఎఫ్‌లో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్‌’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:29 pm

గంభీర్‌ను తప్పిస్తే టీమిండియాలో సంక్షోభమే!

బీసీసీఐకి భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ హెచ్చరికటీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల గంభీర్ సారథ్యంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టెస్ట్ […] The post గంభీర్‌ను తప్పిస్తే టీమిండియాలో సంక్షోభమే! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:24 pm

ముంబై ఇండియన్స్‌కు షాక్

మరో రెండు మ్యాచ్‌లకు రోహిత్ దూరంముంబై: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస సవాళ్లను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ…గాయం కారణంగా రాబోయే కనీసం మరో రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల సమాచా రం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ శర్మ గాయపడటమే దీనికి ప్రధాన కారణం.ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న […] The post ముంబై ఇండియన్స్‌కు షాక్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:23 pm

రిలయన్స్ జ్యువెల్స్ అక్షయ తృతీయ ఆఫర్లు

ముంబై: భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్, పండుగ కొనుగోళ్లను మరింత స్మార్ట్‌గా, అందుబాటులోకి తీసుకువచ్చేలా రూపొందించిన కొత్త బంగారం, వజ్రాల కలెక్షన్‌లను పరిచయం చేస్తూ, ఒక సరికొత్త, విలువ ఆధారిత విధానంతో అక్షయ తృతీయను స్వాగతిస్తోంది. వినియోగదారులు బంగారు ఆభరణాలపై ఫ్లాట్ 9% మేకిం> ఛార్జీతో మరియు వజ్రాల ఆభరణాలపై బంగారం విలువపై 99% తగ్గింపుతో పొందవచ్చు, తద్వారా వారు ప్రధానంగా వజ్రాలకే చెల్లించేలా ఇది నిర్ధారిస్తుంది. ఇది నిజంగా ఆకర్షణీయమైన, […] The post రిలయన్స్ జ్యువెల్స్ అక్షయ తృతీయ ఆఫర్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:17 pm

ఫ్లిప్‌కార్ట్‌తో ఉబర్ భాగస్వామ్యం

బెంగళూరు: భారతదేశపు స్వదేశీ ఈ`కామర్స్ మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్, భారతదేశంలోని ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఉబర్‌తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు అర్హత కలిగిన ప్రతి ఉబర్ ప్రయాణంపై సూపర్‌కాయిన్‌లను సంపాదించవచ్చు. ఈ కార్యక్రమం, సూపర్‌కాయిన్‌లను ఒక జీవనశైలి లాయల్టీ ప్రోగ్రామ్‌గా ముందుకు తీసుకువెళుతుంది. ఇది వినియోగదారులు తమ రోజువారీ ప్రయాణాలపై సంపాదించడానికి వీలు కల్పిస్తూనే, భారతదేశపు లాయల్టీ వ్యవస్థను పోలిన రివార్డ్స ప్రోగ్రామ్‌ను నిర్మించాలనే ఫ్లిప్‌కార్ట లక్ష్యంను మరింత ముందుకు […] The post ఫ్లిప్‌కార్ట్‌తో ఉబర్ భాగస్వామ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:13 pm

దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ

న్యూదిల్లీ: దల్జీత్ దోసాంజ్, జాన్వీ కపూర్‌లతో కూడిన తన ప్రచార కార్యక్రమాన్ని కోక కోలా బుధవారం ప్రకటించింది. ఇది దైనందిన జీవితంలోని క్షణాల్లోకి “కోకకోలా హాఫ్ టైమ” అనే భావనను సజీవంగా తీసుకువస్తుంది. ఈ ఆలోచనకు వలాధారం ఒక నమ్మకం: అదేమిటంటే, ఒక ‘హాఫ్ టైమ’ (విరామ సమయం) కేవలం ఆ రోజు కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని తిరిగి ఆ కార్యకలాపాల్లోకి ఉత్సాహంగా తీసుకువ్లెలా ఉండాలి. కోకాకోలా తన రుచికరమైన, ఉత్తేజకరమైన […] The post దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:11 pm

టాటా మోటార్స్ లక్నో ప్లాంట్‌లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయి

లక్నో: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ లిమిటెడ్, ఉత్తరప్రదేశ్‌లో ఏడున్నర దశాబ్దాలకు పైగా తన ఉనికిని, పారిశ్రామిక శ్రేష్ఠత, ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, నిరంతర జీవనోపాధి కల్పనకు తన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, తాజాగా తన లక్నో ప్లాంట్ నుండి 10వ లక్ష వాణిజ్య వాహనాన్ని విడుదల చేసి ఒక కీలకమైన మైలురాయిని చేరుకుంది. భారతదేశ వాణిజ్య వాహన పరిశ్రమ పరిశుభ్రమైన, స్మార్ట, మరింత సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాల వైపు వేగంగా […] The post టాటా మోటార్స్ లక్నో ప్లాంట్‌లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:05 pm

మారుతి సుజుకి తయారీ కేంద్రాలలో మహిళల భాగస్వామ్యం పెంపు

న్యూదిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ లింగ వైవిధ్యం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. గత రెండేళ్లలో, ఈ సంస్థ తన గురుగ్రామ్, మనేసర్ కేంద్రాలలో వాహన తయారీ, ఇంజన్ ట్రాన్స్‌మిషన్ విభాగాలలో మహిళల నియామకాలను క్రమపద్ధతిలో పెంచింది. ఈ మహిళా నియామకాలు వాహన తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. వీరు కచ్చితత్వంపై గట్టి దష్టి పెడుతూ, అసెంబ్లీ, నాణ్యత నియంత్రణ విభాగాలలో బాధ్యతలు స్వీకరిస్తారు. వారు తమ పురుష సహోద్యోగులతో సమాన స్థాయిలో ఉద్యోగంలోనే […] The post మారుతి సుజుకి తయారీ కేంద్రాలలో మహిళల భాగస్వామ్యం పెంపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:02 pm

ఎసిబికి చిక్కిన ఏఈ

కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పురపాలక సంఘంలో అసిస్టెంట్ ఇంజినీర్ (AE)గా పనిచేస్తున్న నుసుం సుధాకర్‌రెడ్డిని బుధవారం రూ.50,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ తుపాను నీటి కాలువ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన తుది బిల్లును ప్రాసెస్ చేయాలన్నా, మెజర్మెంట్ బుక్‌లో వివరాలు నమోదు చేయాలన్నా తనకు లంచం ఇవ్వాలని ఏఈ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనితో విసిగిపోయిన బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పథకం రచించిన ఏసీబీ అధికారులు, బుధవారం హుజూరాబాద్‌లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద ఏఈ సుధాకర్ రెడ్డి బాధితుడి నుంచి రూ.50,000 నగదు తీసుకుంటుండగా మెరుపు దాడిచేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని కరీంనగర్‌లోని స్పెషల్ జడ్జి ఫర్ ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోంది. పభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు గానీ, ఏసీబీ వాట్సాప్ నంబర్ 9440446106కు గానీ సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 15 Apr 2026 10:00 pm

రాయల్ ఛాలెంజర్స్ టార్గెట్ 147

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(40), ఆయూష్ బధోని(38), ముకుల్ చౌదరి(39) పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో రసిక్ సలాం 4,భువనేశ్వర్ కుమార్ 3,కృనాల్ పాండ్యా 2 , జోష్ హజీల్ వుడ్ 1 వికెట్ తీశారు.

మన తెలంగాణ 15 Apr 2026 9:42 pm

పోతి రెడ్డిపల్లి శివారులో గేద దూడపై చిరుత దాడి

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతి రెడ్డిపల్లి గ్రామ అటవీ శివారు ప్రాంతంలో బుద వారం తెల్లవారు జామున గేద దూడపై చిరుతపులి దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. అను నిత్యం జనసందోహం ఉండే ప్రాంతంతోల చిరుత దాడి భయాందోళనలకు గురి చేసింది. అదే గ్రామానికి చెందిన సదుల పూర్ణ అనే రైతు అటవీ శివారులో గల తన పశువుల పాకలో రాత్రిపూట రెండు మాసాల వయస్సుగల దూడను కట్టి వేసి ఇంటికి చేరాడు. ఉదయం వెల్లగా కళేబరం కనిపించడంతో ఆందోళనకు గురై గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. దాడి చేసి దూడను చంపి వేసిన కౄర జంతువు పై ఆరాతీశారు. ఈసంఘటనపై సిరిసిల్ల పారెస్ట్ అధికారి మోహన్‌లాల్ తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పాద ముద్రల అనవాల్లను సేకరించి వేటాడిన తీరును నిర్దారించారు. దాడికి పాల్పడింది చిరుత పులి అని తేల్చి చెప్పారు. శివారు అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నందున రైతులు, ప్రజలు ఒంటరిగా వెల్లకూడదని సూచించారు. పశువులను పాకలలో ఒంటరిగా కట్టి వేయరాదని హితవు చెప్పారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మలకపేట రిజర్వాయర్ సమీప అడవిలో గుహ ఏర్పాటు చేసుకొని ధర్మారం, వెంకటాపూర్ చిట్టడువుల్లో సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేగ దూడలు,కుక్కలను పసి గట్టి దాడులు చేస్తున్నట్లు వాపోతున్నారు. సిరిసిల్ల రేంజ్ పరిదిలో చిరుతుల సంఖ్య పేరగడంతో పశులు, గొర్రెల మందలపై దాడులు జరుగుతున్నాయి.మలకపేట రాజర్వాయర్ నిర్మాణంతో వాటికి రక్షణ పెరిగి యదేచ్చగా సంచరిస్తున్నాయి. అనేక మందికి చిరుతలు తారస పడుతున్నాయి. ఒ చిరుత గత సంవత్సరం మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

మన తెలంగాణ 15 Apr 2026 9:20 pm

బిహార్ సిఎంగా సమ్రాట్ చౌధరీ ప్రమాణం

 భాజాపా సీనియర్ నేత సమ్రాట్ చౌధరి బిహార్ 21 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అలా హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో భాజాపాకు చెందిన కీలక నాయకులు, కూటమి భాగస్వాములు పాల్గొన్నారు. బిహార్‌లో భాజాపా నుంచి సీఎం పదవి చేపట్టిన తొలి నాయకుడిగా సమ్రాట్ రికార్డు సృష్టించారు. రాజ్యసభకు ఎన్నికైన జేడీ అధినేత నితీష్‌కుమార్ మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్‌కు ఆ పదవిని కట్టబెట్టేందుకు భాజాపా మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే సమ్రాట్ చౌధరి సీఎంగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాజీ బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన చౌధరి, రాష్ట్ర సుసంపన్నత కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తానని తెలిపారు. బీహార్ అభివృద్ధి నిరంతర ప్రక్రియ. మోదీనితీశ్ మోడల్‌లోనే పాలన కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీఏ నేతలు అభినందనలు తెలుపుతూ, చౌధరి నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పించిన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో బీహార్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్డీఏ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో చౌధరి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌సరౌగీ మాట్లాడుతూ, చౌధరి నాయకత్వంలో రాష్ట్రం ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి దోహదం చేస్తుందని అన్నారు. నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన న్యాయపాలన, అభివృద్ధి పునాదులను కొత్త సీఎం మరింత బలోపేతం చేస్తారని తెలిపారు. చౌధరి తండ్రి, సీనియర్ రాజకీయ నేత శకుని చౌధరి ఈ పరిణామాన్ని దైవకృపగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నితీశ్ కుమార్ ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 15 Apr 2026 9:00 pm

మేడిగడ్డ ఎందుకు కూలిందో కెసిఆర్‌ను నిలదీయండి : ఎమ్మెల్సీ బల్మూరి

మేడిగడ్డ ఎందుకు కూలిందో ముందు బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నీలదీయండి..అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇటీవల బిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి సూచించారు. జీవన్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నుంచి 14 సార్లు బి-ఫామ్ తీసుకున్నారని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష కారణంగానే జీవన్ రెడ్డి ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాలు మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మారిందని జీవన్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కాని జీవన్ రెడ్డి కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరానన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆ కంపెనీలో కెసిఆర్, కెటిఆర్ తప్ప మరొకరు ఉండరన్న సంగతి జీవన్ రెడ్డికి తెలియదా ? అని ఆయన ప్రశ్నించారు. కన్న కూతురును కూడా ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పంపించిన విషయం జీవన్ రెడ్డికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఎవరైనా కెసిఆర్‌తో చేతులు కలుపుతారా? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన ఘనత కెసిఆర్‌దేనని ఆయన విమర్శించారు. మేడిగడ్డ రిపేర్ చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వచ్చే తరాలు క్షమించవని జీవన్ రెడ్డి మాట్లాడటం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్ష మేరకే బిఆర్‌ఎస్‌లో చేరుతున్నానని జీవన్ రెడ్డి అంటున్నారని, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ అవసరమే లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డి నిర్ణయాన్ని జగిత్యాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, బిఆర్‌ఎస్‌లో చేరడంతోనే ఆయన రాజకీయంగా భూస్థాపితం అయ్యారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.

మన తెలంగాణ 15 Apr 2026 8:50 pm

హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థిని స్కూల్లోకి రానివ్వని హెడ్‌మాస్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాల వేసుకున్న 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాల లోనికి రాకుండా అడ్డుకున్నారు. మాలతీసి పాఠశాలకు రావాలని హుకుం జారీ చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్‌దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రశ్నించిన తల్లిదండ్రులపై హెడ్‌మాస్టర్ దుర్బాషలాడటం హేయనీయం. హెడ్‌మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని భజరంగ్‌దళ్ నాయకులు శ్యామ్‌లాల్, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 15 Apr 2026 8:40 pm

బిసి వసతిగృహంలో 8వ తరగతి విద్యార్థిని మృతి..

వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని ర్యాపని శ్రావణి (14) అనుమానాస్పద స్థితిలో బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. మృతదేహం వసతి గృహం వరండాలో పడి ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నసురుల్లాబాద్ మండలం హాజీపూర్‌కు చెందిన శ్రావణి బీసీ వసతిగృహంలో 8వ తరగతి చదువుతున్నది. పలువురు విద్యార్థినిలు ఉదయం ఐదు గంటల తర్వాత బాత్రూం వైపు వెళ్తుండగా వరండాలో శ్రావణి అచేతనంగా పడి ఉంది. ఆమెను గమనించిన విద్యార్థినిలు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా డాక్టర్లు శ్రావణి మరణించినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుమార్తె శ్రావణి మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. అయితే, అనుమానస్పద స్థితిలో మృతిచెందిన శ్రావణి గుండెపోటు గురై మృతి చెందిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానిక ఆర్డీవో ప్రభాకర్, తహశీల్దార్ ప్రేమ్‌కుమార్, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. శ్రావణి మరణించిన విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ, ఏబీవీపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 15 Apr 2026 8:30 pm

సిఎం రేవంత్ రెడ్డి ‘హైబ్రిడ్’ ముఖ్యమంత్రి: కెటిఆర్

హైదరాబాద్: పార్లమెంట్‌లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. మహిళ రిజర్వేషన్లకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళ బిల్లును డీలిమిటేషన్‌తోె ముడి పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్’ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని విమర్శించారు. ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా, సాయంత్రం బిజెపి నేతగా ఉంటారని కెటిఆర్ అన్నారు. హైబ్రిడ్ విధానం రేవంత్ రెడ్డి పాలనలో కూడా కనిపిస్తుందని తెలిపారు. కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బిల్లులో అస్పష్టత ఉందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు 24 శాతంగానే కొనసాగాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిస్తే తీవ్రమైన తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. కేంద్రం రాజకీయాలు వదిలేసి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. 

మన తెలంగాణ 15 Apr 2026 8:28 pm

సిబిఎస్‌ఇ 10 ఫలితాలు విడుదల..బాలికల అత్యుత్తమ ప్రతిభ

సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని బోర్డు సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఈసారి పరీక్షలలో మొత్తం 93.7 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఈ బోర్డు పరీక్షలలో బాలికలే బాలురతో పోలిస్తే రాణించారు. బాలికలలో మొత్తం 94.99 శాతం మంది పాసయ్యారు. ఈ సారి సిబిఎస్‌ఇ రెండు దఫాల బోర్డు పరీక్షలు నిర్వహించింది. పదవ తరగతి పూర్తికి విద్యార్థులు తప్పనిసరిగా తొలి రౌండ్ పరీక్షకు హాజరుకావల్సి ఉంటుంది. ఈ మేరకు జరిగిన మొదటి దఫా ఫలితాలు ఇప్పుడు విడుదల అయ్యాయి.ఈసారి మొత్తం 8074 కేంద్రాలలో 24.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణులైన వారిలో దాదాపు 55,368 మందికి 95 శాతం పైగా మార్కులు, రెండు లక్షల మందికి పైగా 90 శాతం పైగా మార్కులు సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువ సంఖ్యలో లక్షా 47 వేల మంది వరకూ కంపార్ట్‌మెంట్ కేటగిరి లో స్థానం దక్కించుకున్నారని అధికారి వివరించారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకూ తొలి ఎడిషన్ పరీక్షలు జరిగాయి మే నెలలో రెండవ విడత పరీక్షలు ఉంటాయి. సిబిఎస్‌ఇ అధికారిక వెబ్‌సైట్ సిబిఎస్‌ఇ . ఎన్‌ఐసి. ఇన్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు . ఈసారి పరీక్షలలో కూడా కేంద్రీయ విద్యాలయ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు. 

మన తెలంగాణ 15 Apr 2026 8:19 pm

ఆప్ ఎంపి మిట్టల్ విద్యాసంస్థలపై ఇడి దాడులు

 ఆప్ ఎంపి అశోక్ మిట్టల్ సంబంధిత విద్యాసంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం సోదాలు నిర్వహించింది. ఫెమా దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ఈ రాజ్యసభ ఎంపికి చెందిన పది బిజినెస్, నివాసస్థలాలు దాదాపు పదింటిపై ఏకకాలంలో అధికారులు దాడులు సాగించారు. జలంధర్, గురుగ్రామ్‌లలో ఈ చర్యలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబందనల పరిధిలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఆప్ ఎంపి మిట్టల్ ఇటీవలే రాజ్యసభలో పార్టీ ఉప నేతగా నియమితులు అయ్యారు. ఇంతకు ముందు ఈ స్థానంలో సీనియర్ ఎంపి రాఘవ చద్ధా ఉన్నారు. ఇడి దాడులు జరిగిన మిట్టల్ ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

మన తెలంగాణ 15 Apr 2026 8:17 pm

అండమాన్ వద్ద పడవ బోల్తా: 250 మందికి పైగా గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెలుతున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 250 మందికి పైగా గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమీషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్‌లు సంయుక్తంగా ప్రకటించాయి. గల్లంతయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. మలేషియాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వారికోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుండి బయల్దేరినట్లు ఈ ప్రకటనలో ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. మలేషియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు కెరటాల ఉదృ్ధతి కారణంగా పడవ మునిగిపోయినట్లు వెల్లడించారు. కాగా.. ఈ పడవలో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి ఒక కారణమై ఉండొచ్చని వారు తెలిపారు. ఈ పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుండి బయలుదేరినట్లు తెలుస్తోంది. కాక్స్బజార్‌లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేషియాకు వలసన వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోయినా, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కమాండర్ సబ్బిర్ ఆలం సుజాన్ తెలిపిన ప్రకారం, ఏప్రిల్ 9న ముగ్గురు రోహింగ్యాలు, ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులు సహా తొమ్మిది మందిని రక్షించారు. బంగ్లాదేశ్ జెండా కలిగిన వాణిజ్య నౌక ‘ఎం.టి. మేఘ్నా ప్రైడ్’ సిబ్బంది సముద్రంలో తేలియాడుతున్న ఈ వ్యక్తులను గుర్తించి రక్షించినట్లు ఆయన తెలిపారు. పడవ ఎప్పుడు మునిగిందో, ప్రస్తుతం అధికారిక శోధన చర్యలు కొనసాగుతున్నాయా, లేదా అన్న విషయాలు స్పష్టంగా తెలియరాలేదు. మరో కోస్ట్ గార్డ్ మీడియా అధికారి తెలిపిన ప్రకారం, రక్షించిన ఎనిమిది మంది పురుషులు, ఒక మహిళను టెక్నాఫ్‌లో పోలీసులకు అప్పగించారు. ఈ రక్షణ చర్య అధికారిక శోధనలో భాగం కాదని, బంగ్లాదేశ్ నుండి ఇండోనేషియాకు వెళ్తున్న సమయంలో మేఘ్నా ప్రైడ్ నౌక సిబ్బంది వీరిని కాపాడినట్లు తెలిపారు.రోహింగ్యాల గల్లంతు ఘటన వారి దీర్ఘకాల నిరాశ్రయ స్థితిని ప్రతిబింబిస్తోందని యుఎన్‌హెచ్సిఆర్, ఐఓఎం పేర్కొన్నాయి. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింస కారణంగా రోహింగ్యాల భద్రమైన పునరావాసం అనిశ్చితంగా మారిందని వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లో మయన్మార్ నుంచి వచ్చిన 10 లక్షలకుపైగా రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తున్న నేపథ్యంలో, వారికి ప్రాణ రక్షణ సహాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం మరింత నిధులు, ఐక్యతతో ముందుకు రావాలని యుఎన్‌హెచ్సిఆర్, ఐఓఎం విజ్ఞప్తి చేశాయి.

మన తెలంగాణ 15 Apr 2026 8:14 pm

పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు వెలువరించిన తాత్కాలిక వారం రోజుల యాంటిసిపేటరీ బెయిల్‌పై సుప్రీంకోర్టు బుధవారం స్టే వెలువరించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మ భార్య రింకి భూయాన్ శర్మపై ఖేరా వెలువరించిన ఆరోపణలు, పాస్‌పోర్టును ప్రశ్నిండంపై ఆయనపై కేసు దాఖలు అయింది. అసోం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా ఖేరా తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఏప్రిల్ 10వ తేదీన యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, ఎఎస్ చంద్రశేఖర్‌తో కూడిన ధర్మాసనం స్టే విధించింది. ఈ విషయంపై ఖేరాకు , సంబంధితులు ఇతరులకు నోటీసులు వెలువరించారు. ఖేరా ఈ కేసులో అసోం పరిధిలో తమ పిటిషన్ దాఖలు చేసుకుని ఉంటే, సుప్రీంకోర్టు కలుగచేసుకునే పరిస్థితి ఉండేది కాదని ధర్మాసనం తెలిపింది. అసోం పోలీసుల తరఫున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఖేరా తనకు ఉపశమనం గురించి అసోం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారేది తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఖేరా తనకు ఉపశమనం గురించి అసోం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారేది తెలియడం లేదని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 15 Apr 2026 8:07 pm

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన బాసర సీఐ కిరణ్ కుమార్ బాసర, (నిర్మల్

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:51 pm

హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ..,.

హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ..,. రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన….ఎస్ఐ కృష్ణయ్య మాడుగుల

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:49 pm

ఈ తొమ్మిది ప్రతిజ్ఞలను పాటించండి:పిఎం మోడీ

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి తొమ్మిది పనుల గురించి సామూహిక హామీ తీసుకున్నారు. నీటి సంరక్షణ నుంచి సహజ వ్యవసాయం, ఆరోగ్యం, సేవా భావం వరకు విస్తరించే ఈ ప్రతిజ్ఞలతో వికసిత కర్ణాటక, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రధాని అడిగిన హామీలు ఏంటంటే.. మొదటిగా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుందాం. ‘తల్లి పేరుతో మొక్కలు నాటుదాం(ఏక్ పేడ్ మా కే నామ్)’. పబ్లిక్ ప్రదేశాల్లో పరిశుభ్రతను పాటిద్దాం. వోకల్ ఫర్ లోకల్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ స్వదేశీయతను చాటుదాం. జాతీయ పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేద్దాం. దేశీయ పర్యాటకాన్ని పెంపొందిస్తూ, రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ఆచరిద్దాం. మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకుందాం. వంటలో నూనె వినియోగాన్ని తగ్గిద్దాం. యోగా, ఫిట్‌నెస్‌ను అలవర్చుకుని బరువును అదుపులో ఉంచుకుంటూ ప్రకృతికి సేవ చేద్దాం. ఈ తొమ్మిది సంకల్పాలపై నిజాయితీతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే, వికసిత కర్ణాటకతో పాటు వికసిత భారత్ వైపు వేగంగా పురోగమించవచ్చు అని మాండ్యలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో నిర్మితమైన శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడతో కలిసి ‘సౌందర్య లహరి శివ మహిమ స్తోత్రం’ అనే పుస్తకాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:46 pm

మరింత మంది సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలి

మరింత మంది సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలి చలివేంద్రం ప్రారంభంలో ఎస్సై రవికుమార్

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:45 pm

గుంతకల్లు సంత మార్కెట్ లో యాచకుడి మృతి..

గుంతకల్లు (విశాలాంధ్ర):స్థానిక సంత మార్కెట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక షాపు ముందు యాచకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామాంజనేయులు (67) అనే యాచకుడు ఎండ తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుడు పెద్దవడుగూరు మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందినవాడని తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి బంధువులు మృతదేహాన్ని స్వగ్రామం గోపరాజుపల్లికి తీసుకువెళ్లినట్లు […] The post గుంతకల్లు సంత మార్కెట్ లో యాచకుడి మృతి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 7:45 pm

Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్

కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు

తెలుగు పోస్ట్ 15 Apr 2026 7:43 pm

కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, వైఫల్యం

కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, వైఫల్యం భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : పసుపు

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:42 pm

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

వికారాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను వికారాబాద్ పిఎస్‌కు తరలించారు. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణను నిరసిస్తూ ఉదయం నుంచి కవిత ఆందోళన చేశారు. బలవంతంగా భూములు తీసుకోవద్దన్నారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు స్థానిక ఎన్టిఆర్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:42 pm

తాగునీటి సమస్యకు పరిష్కారం…

విశాలాంధ్ర – విడపనకల్లు.. మండల కేంద్రంలోని సుంకులమ్మ గుడి ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, వి.కొత్తకోట రస్తా నుంచి సుంకులమ్మ గుడి వరకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.భూమి పూజ అనంతరం జేసీబీ యంత్రంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సత్యబాబు, పంచాయతీ […] The post తాగునీటి సమస్యకు పరిష్కారం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 7:38 pm

ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం..

ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రాథమిక

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:31 pm

Video : Exclusive F2F with Producer Supriya Yarlagadda

The post Video : Exclusive F2F with Producer Supriya Yarlagadda appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 7:31 pm

మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్..

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు హాజరై తమ సమస్యలను మంత్రి కి వివరించారు. మంత్రి స్వయంగా ప్రజల వినతులను శ్రద్ధగా విని, వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, […] The post మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 7:28 pm

టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు…

టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:27 pm

గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం..

గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం.. సంఘం నేతల నివాళి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:25 pm

వ్యభిచారం కేసులో నలుగురిపై కేసు నమోదు

వ్యభిచారం కేసులో నలుగురిపై కేసు నమోదు భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : హైదరాబాద్

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:22 pm

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ …

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ … లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:16 pm

పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాలమూరు రిజర్వాయర్లను వచ్చే వానాకాలంలో కచ్చితంగా నింపాలని, దానికి కావాల్సిన పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. మే మొదటివారంలో ప్రత్యక్ష యుద్దానికి పూనుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తామని, పాలమూరును ఎందుకు పడావు పెట్టారో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బిఆర్‌ఎస్ నేతలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్‌ఐ నీళ్లు ఎలాంటి ఆంటంకం లేకుండా ఆ ప్రాంతానికి నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 1956కు ముందు పాలమూరు అత్యధిక వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలు, బావులతో సస్యశ్యామలంగా ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అవలంభించిన విధానాల మూలంగా తెలంగాణ వచ్చే నాటికి పాలమూరు జిల్లా వలసల జిల్లా , కరువు జిల్లా, ఆకలి జిల్లా, పేదల జిల్లా, వెనకబడిన జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధలు, కష్టాల ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమంలో పాటలు, సాహిత్యం, వ్యాసాలు అన్నీ పాలమూరు వెతలను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడో ఏడాది నడుస్తుందని.. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జిల్లా వాసి అయిన సిఎం కనీసం ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రులు హైలెవెల్ రివ్యూ కోసం ఎందుకు అడగడం లేదు..? అని అడిగారు. పాలమూరు ప్రజల శాశ్వత ప్రయోజనాల కోసం పాలమూరు మంత్రులు, ఎంఎల్‌ఎలు పనిచేయాలని సూచించారు. మొండి వాదనతో పనులు చేస్తామన్న దోరణిని వదులు కోవాలని హితవు పలికారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలన్న తపనతో తాము పనిచేశామని, గతంలో తాము చొరవ తీసుకుని చేసిన పనుల కారణంగానే భీమా ద్వారా కొల్లాపూర్ ప్రాంతానికి 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని చెప్పారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:15 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్‌లో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సిబి ఈ మ్యాచ్‌లో గెలిస్తే నెట్‌ రన్‌రేట్ ప్రకారం మొదటిస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు గుజరాత్‌తో ఓటమి ఎదురుకున్న ఎల్‌ఎస్‌జి ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఒక మార్పు చేసింది. డఫీ స్థానంలో హేజిల్‌వుడ్ జట్టులోకి వచ్చాడు. లక్నో అదే జట్టుని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తుంది. తుది జట్లు: ఆర్‌సిబి: ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయేష్ శర్మ, రషిక్ సలామ్ దర్. ఎల్‌ఎస్‌జి: ఎయిడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్.

మన తెలంగాణ 15 Apr 2026 7:12 pm

ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..!

ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..! లారీ డ్రైవర్, యజమానులపై కేసు

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:08 pm

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందాడు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుండగా విజయవాడ-హైదరబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి  వద్ద తను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి వేగంగా డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జావీద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి రూరల్ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:08 pm

ఎమ్మెల్యే వసంతకు టీడీపీ నేతల అభినందనలు..

ఎమ్మెల్యే వసంతకు టీడీపీ నేతల అభినందనలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:04 pm

రెండేళ్ల కన్న కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (మ) హనుమాపురం లో దారుణం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవ మళ్లీ వివాదం తలెత్తడంతో  రెండేళ్ల కన్న కూతురిని  తండ్రి శ్రీ రాములు గొంతు నులిమి హత్య  చేశాడు. ఈ ఏడాది ఉగాదికి తల్లిగారింటి నుంచి భార్య హనుమాపురంకు వచ్చింది. ఈ క్రమంలో గొడ‌వ‌లు ఎక్కువ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో శ్రీ‌రాములు త‌న కూతురిని హ‌త‌మార్చిన‌ట్లు స‌మాచారం. శ్రీరాములుకు  మాటలు రావు,చెవులు విన‌బ‌డ‌వు. హ‌త్య అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:01 pm

స్మార్ట్‌టీవీ లవర్స్‌కి పండగే.. షియోమీ కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్!

షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) భారత మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల డిస్‌ప్లే సైజులలో అందుబాటులో ఉంది. అన్ని మోడళ్లలో 4K రిజల్యూషన్‌తో కూడిన క్యూడీ-మినీ ఎల్ఈడీ ప్యానెల్స్ ఉన్నాయి. వీటిలో సరికొత్త ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్, షియోమీ సౌండ్‌కు అనుగుణంగా ట్యూన్ చేయబడిన 34W క్వాడ్-స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.  షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) ధర, లభ్యత కంపెనీ ఈ సిరీస్‌లోని 55-అంగుళాల మోడల్ ధర రూ.51,999గా, 65-అంగుళాల మోడల్ ధర రూ.71,999గా పేర్కొంది. ఇక 75-అంగుళాల మోడల్ ధర రూ.71,999గా నిర్ణయించింది. ఇప్పటికే ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న ఈ కొత్త సిరీస్ ఏప్రిల్ 22వ తేదీ నుండి Mi.com, అలాగే ఈ-కామర్స్ సైట్లు, షియోమీ రిటైల్ స్టోర్లలో సేల్స్ కి వస్తుంది.  ప్రీ-బుకింగ్ సమయంలో షియోమీ రూ.10,000 వరకు బ్యాంక్ ప్రయోజనాలను, అలాగే రెండు సంవత్సరాల పొడిగించిన వారంటీని అందిస్తోంది. దీనితో మొత్తం కవరేజ్ నాలుగు సంవత్సరాల సమగ్ర వారంటీ అవుతుంది. అలాగే, 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) ఫీచర్లు 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల డిస్‌ప్లే ఆప్షన్లలో లభించే ఈ సిరీస్ 4K రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ లైనప్‌లో 178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 60Hz రిఫ్రెష్ రేట్, DLG 120Hz ఉన్నాయి. ఈ టీవీలలో మల్టిపుల్ డిమ్మింగ్ జోన్‌లు, లైట్ సెన్సార్, డైనమిక్ బ్యాక్‌లైట్ ఉన్నాయి. మెరుగైన స్పష్టత కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 ఉపయోగించారు. ఈ సిరీస్‌లో 34W క్వాడ్-స్పీకర్ సెటప్ ఉంది. ఇందులో రెండు ట్వీటర్లు, రెండు ఫుల్-రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఇది డాల్బీ ఆడియో, DTS:X, DTS వర్చువల్:X, షియోమీ సౌండ్‌కు సపోర్ట్ చేస్తుంది.  ఇక కనెక్టివిటీ కోసం ఈ సిరీస్‌లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ ఉన్నాయి. ఇందులో మాలి-G52 GPUతో కూడిన క్వాడ్-కోర్ A55 CPU, 2GB RAM, 32GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ సిరీస్ షియోమీ సరికొత్త ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. ఇందులో ప్యాచ్‌వాల్+, ఉచిత లైవ్ టీవీ ఛానెళ్లు, తల్లిదండ్రుల నియంత్రణలతో కూడిన కిడ్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మన తెలంగాణ 15 Apr 2026 6:55 pm

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్…

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్… హుజురాబాద్, ఆంధ్రప్రభ : లంచం తీసుకుంటూ.. మరో

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:53 pm

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి…

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి… వృద్ధులకు ఇలాంటి వాతావరణం కల్పించిన నిర్వాహకులను

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:48 pm

కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం…

కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రపంచ వారసత్వ

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:44 pm

ముంబై ఇండియన్స్‌కి షాక్.. స్టార్ ఆటగాడు దూరం..

ఐపిఎల్ 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కి చేరాలంటే.. ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ మరో షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో భారీ లక్ష్యఛేదన చేస్తుండగా స్టార్ బ్యాటర్‌ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ మరో రెండు మ్యాచ్‌లకు జట్టుకు దూరం అవుతాడని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో రోహిత్ శర్మ 4 మ్యాచుల్లో 137 పరుగులు స్కోర్ చేశాడు. 

మన తెలంగాణ 15 Apr 2026 6:44 pm

Fall In Love With Rao Bahadur’s O Sundari Instantly

Starring Satya Dev and directed by Venkatesh Maha, the upcoming psychological thriller Rao Bahadur is presented by Mahesh Babu and Namrata Shirodkar’s GMB Entertainment, and produced by A+S Movies and SriChakraas Entertainments. The makers today released the film’s first song, O Sundari, that brings a soft and romantic flavour to its world. The listeners will […] The post Fall In Love With Rao Bahadur’s O Sundari Instantly appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 6:39 pm

Srinivasa Mangapuram Teaser: Love In The Line Of Fire

Ajay Bhupathi, who delivered a blockbuster with his last film Mangalavaram, is now directing Srinivasa Mangapuram, which marks the debut of Superstar Krishna’s grandson Jaya Krishna Ghattamaneni. It also marks Rasha Thadani’s entry into Telugu cinema. The teaser, unveiled by Mahesh Babu, offers a raw and emotional glimpse into this powerful, love-driven drama. Set against […] The post Srinivasa Mangapuram Teaser: Love In The Line Of Fire appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 6:36 pm

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి టెక్కలి, ఆంధ్రప్రభ : విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:27 pm

దానిమ్మ తొక్కలతో అద్భుత ఆరోగ్య లాభాలు.. తెలిస్తే వదిలిపెట్టారు!

హెల్తీగా ఉండాలంటే డైట్ లో పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇక పండ్ల విషయానికి వస్తే దేని ప్రత్యేకత దానిదే! అయితే, మనం తరచుగా దానిమ్మ పండును తిన్న తర్వాత వాటి తొక్కలను పనికిరానివని భావించి పడేస్తుంటాం. అయితే, ఈ తొక్కలు అనేక విధాలుగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దానిమ్మ తొక్కలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి దానిమ్మ తొక్కలు ఏ విధంగా ప్రభావవంతంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్కల ఆరోగ్య ప్రయోజనాలు ఇవే చర్మంపై సహజమైన కాంతి: దానిమ్మ తొక్కలను ఎండబెట్టి, పొడిగా నూరిన పొడిలా తయారు చేసుకోవాలి. దీనిని పెరుగు లేదా రోజ్ వాటర్‌తో కలిపి ఫేస్ ప్యాక్‌గా అప్లై చేయాలి. ఇది చర్మాన్ని నిర్మలంగా, కాంతివంతంగా ఉంచుతుంది. మచ్చలను సైతం తగ్గిస్తుంది. జుట్టును బలపరుస్తుంది: దానిమ్మ తొక్కల పొడి జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీనిని హెయిర్ ప్యాక్‌లో కలుపుకోవడం వల్ల జుట్టు బలపడి, చుండ్రు తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఎండిన దానిమ్మ తొక్కల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దుర్వాసన నుండి ఉపశమనం కలిగిస్తుంది: దానిమ్మ తొక్కలను ఉడకబెట్టి, ఆ నీటితో పుక్కిలించాలి. ఇది దుర్వాసనను తొలగించి, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది: గొంతులో నొప్పి ఉంటే దానిమ్మ తొక్కల కషాయం తయారుచేసుకుని తాగవచ్చు లేదా ఆ నీటితో   పుక్కిలించవచ్చు. ఇది గొంతుకు ఉపశమనం కలిగించి, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

మన తెలంగాణ 15 Apr 2026 6:24 pm

పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు

పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:23 pm

IPL 2026 : మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 6:18 pm

బాషా, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..

బాషా, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. ఎంపీ గోడం నగేష్ ఉట్నూర్,

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:08 pm

వరుణ్ కాలికి గాయం.. శస్త్ర చికిత్స జరిగింది: నిహారిక

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బరి’. ఈ సినిమాలో వరుణ్ వాలీబాల్ క్రీడాకారుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో వరుణ్ తేజ్ద్ వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తండగా అతడి కాలికి గాయమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, వరుణ్ సోదరి నిహరికా కొణిదెల వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్‌కు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని తెలిపారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. మరింత శక్తిమంతంగా తిరిగి వస్తారని, ఇలాంటి సమయంలో తమ అభిమానం, ప్రేమ, అప్యాయత ఎప్పుడూ వరుణ్‌పై ఉండాలని నిహారిక అన్నారు. ‘కమిటీ కుర్రాళ్లు’తో మంచి సక్సెస్ అందుకున్న యదు వంశీ దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం ‘బరి’. 

మన తెలంగాణ 15 Apr 2026 6:05 pm

America - Iran - Ceasefire : వచ్చే వారంతో కాల్పుల విరమణ గడువు పూర్తి

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశముంది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 6:04 pm

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్‌లు

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్‌లు టెక్కలి, ఆంధ్రప్రభ : పేదలు, పట్టణానికి

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:03 pm

Anil Ravipudi: కృతిశెట్టి ఆశలన్నీ ఆయనమీదే!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది కృతిశెట్టి. మొదటి సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు, డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డులను బద్ధలు కొట్టాడు. దర్శకుడు బుచ్చిబాబుకి ఉప్పెన మొదటి సినిమా. ఆయన కూడా ఊహించని సక్సెస్‌ను ఈ మూవీతో అందుకున్నాడు. అయితే, దర్శకుడికి రెండవ సినిమా ఛాన్స్ రావడానికి, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టింది. కానీ, హీరో హీరోయిన్స్ కి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చి […] The post Anil Ravipudi: కృతిశెట్టి ఆశలన్నీ ఆయనమీదే! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 15 Apr 2026 6:00 pm

చిరు వ్యాపారులకు అండగా బొండా సిద్ధార్థ ..

చిరు వ్యాపారులకు అండగా బొండా సిద్ధార్థ .. పి.4 పథకం ద్వారా జీవనోపాధి

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:58 pm

అల్లం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలలో అల్లం ఒకటి. దీనిని కాలంతో సంబంధం లేకుండా అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, చాలామంది అల్లాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉండటానికి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు. ఎందుకంటే అల్లం రెండు మూడు రోజుల తర్వాత ఎండిపోవడం మొదలవుతుంది.అంతేకాదు కుళ్ళిపోవడం కూడా  ప్రారంభమవుతుంది. కాబట్టి అల్లాన్ని సరిగ్గా ఎలా నిల్వ చేయాలో తప్పక తెలుసుకోవాలి. ఈ క్రమంలో అల్లాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి కొన్ని సులభమైన నిల్వ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం.  అల్లాన్ని ఎక్కువ రోజులు తాజాగా నిల్వ చేసే పద్ధతులు ఇవే పేపర్ టవల్స్:  అల్లాన్ని నిల్వ చేయడానికి పేపర్ టవల్స్ లేదా గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించవచ్చు. ఇలా గాలి చొరబడకుండా ఉంచడం వల్ల అది పాడైపోకుండా లేదా ఎండిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా దాని తాజాదనాన్ని కూడా కాపాడుకుంటుంది. జిప్‌లాక్ బ్యాగ్‌లు: అల్లం తాజాగా ఉండటానికి దానిని జిప్‌లాక్ బ్యాగ్‌లలో కూడా నిల్వ చేయవచ్చు. ఇది అల్లంలోకి గాలి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల దానిని ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. మట్టిని ఉపయోగించడం: ఈ పద్ధతి వింతగా అనిపించిన ఇది ఒక పాత, ప్రభావవంతమైన పద్ధతి. చల్లని ప్రదేశంలో అల్లాన్ని పొడి మట్టిలో లేదా ఇసుకలో పాతిపెట్టిలి. అల్లం అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ చిట్కా దానిలోని తేమను నిలుపుకోవడానికి, ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫ్రీజ్‌లో నిల్వ చేయడం:  అల్లాన్ని ఒక నెల కంటే ఎక్కువ కాలం నిల్వ  చేయాలంటే దానిని ఫ్రీజర్‌లో ఉంచాలి. ఈ చిట్కా అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చేస్తుంది. తద్వారా దానిని ఉపయోగించడం సులభం అవుతుంది. అల్లాన్ని ముక్కలుగా కోసి కూడా ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చు. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

మన తెలంగాణ 15 Apr 2026 5:55 pm

ఉప్లూర్‌లో ఉచిత వైద్య శిబిరం.

ఉప్లూర్‌లో ఉచిత వైద్య శిబిరం. కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:51 pm

అశ్రునయనాల మధ్య లింగారెడ్డి అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య లింగారెడ్డి అంత్యక్రియలు మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని న్యూ సాంగ్వి

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:47 pm

మతపరమైన కట్టడాలకు అనుమతి తీసుకోవాల్సిందే

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 15 Apr 2026 5:43 pm

కేసీఆర్ డీ లిమిటేషన్ బిల్లుపై ఏమన్నారంటే?

మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 5:36 pm

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్‌ చేసి తమ రోల్‌ నంబర్‌, స్కూల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, అడ్మిట్‌ కార్డు ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు పొందొచ్చు. అలాగే, డిజీ లాకర్‌ ద్వారా కూడా రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. పెరిగిన ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయిఈ పరీక్షల్లో […] The post సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 5:33 pm

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం..

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రజాపాలన

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:27 pm

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందు క్రీడా ప్రాంగాణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం నారా రామ్మూర్తినాయుడు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తో కలిసి బ్యాడ్మింటన్ […] The post నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 5:26 pm

YSRCP : డీ లిమిటేషన్ బిల్లుకు అనుకూలమే : వైసీపీ

డీ లిమిటేషన్ బిల్లుకు తాము అనుకూలమని వైసీపీ ప్రకటించింది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 5:25 pm

Charan’s Peddi Postponed, Targets June Release

Mega Power Star Ram Charan’s next big outing Peddi is nearing completion. Except for a special song, the entire shoot has been wrapped up. The film will no longer hit screens on April 30, as the makers have officially rescheduled its release to June. The team stated that after reviewing the rushes, they are immensely […] The post Charan’s Peddi Postponed, Targets June Release appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 5:23 pm

108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన జిల్లా అధికారులు కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:22 pm

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక!

క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తాం స్పోర్ట్స్ హబ్ గా రాయలసీమ హామీకి కట్టుబడి ఉన్నాం జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారుల భేటీలో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ తిరుపతి: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తిరుపతి స్పోర్ట్స్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ […] The post రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 5:20 pm

Varun Tej sustains Severe Knee Fracture

Mega Prince Varun Tej will soon commence the shoot of his next film titled Bhari. The film is a sports drama with the backdrop of volleyball. The team of actors along with Varun Tej are trained in the sport on a regular basis. During the training sessions, Varun Tej sustained a severe knee fracture and […] The post Varun Tej sustains Severe Knee Fracture appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 5:18 pm

విలేకరులపై దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

విలేకరులపై దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో నాలుగో

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:16 pm

ఇండి కూటమి కీలక నిర్ణయం.. డీ లిమిటేషన్ కు వ్యతిరేకం

ఇండి కూటమి కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 5:16 pm

సైనిక్ స్కూల్‌కు విద్యార్థిని ఎంపిక…

సైనిక్ స్కూల్‌కు విద్యార్థిని ఎంపిక… జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:12 pm

Politics |ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ‘పదం’.. పాత యుద్ధం!

Politics | ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ‘పదం’.. పాత యుద్ధం! Politics |

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:06 pm

మామడలో 108 వాహనం తనిఖీ..

మామడలో 108 వాహనం తనిఖీ.. మామడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని 108

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:03 pm

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నాయకుల సన్మానం

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నాయకుల సన్మానం ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:59 pm

టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం

*పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల ప్రసాదరావు*జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్*జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్*రాష్ట్ర కమిటీలో 17మందికి చోటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఎంపికలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ […] The post టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:55 pm

విద్యార్థులతో తల్లిదండ్రులకు లేఖలు రాయించిన సీఐ

విద్యార్థులతో తల్లిదండ్రులకు లేఖలు రాయించిన సీఐ కరీమాబాద్, ఆంధ్రప్రభ: ప్లీజ్ డాడీ హెల్మెట్

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:54 pm

తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది..

తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జహీరాబాద్ నియోజకవర్గ

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:53 pm

అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచడమే లక్ష్యం

అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచడమే లక్ష్యం బస్టాండ్ ఆవరణలో మాక్ డ్రిల్స్.. కరపత్రాల పంపిణీ

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:52 pm

ప్రపంచంలో ఎక్కడా లేని పాలసీని రేవంత్ ప్రతిపాదించారు: ఏలేటి

హైదరాబాద్: జనాభా ప్రకారమైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం తెచ్చారని రాష్ట్ర బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగాలనే కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టాలు చేసిందన్నారు. ‘‘1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల ఎపికి ఒక లోక్‌సభ సీటు తగ్గింది. ప్రస్తుత సీట్ల ప్రకారమైతే మహిళలకు 170 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సీట్లు పెంచి మహిళ రిజర్వేషన్లు అమలు చేస్తే 270కి పైగా సీట్లు వస్తాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైబ్రిడ్ పాలసీని సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు’’ అని ఏలేటి విమర్శించారు. 

మన తెలంగాణ 15 Apr 2026 4:50 pm

ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో అగ్నిమాపక కేంద్ర కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక జిల్లా అధికారి, స్థానిక ధర్మవరం ఫైర్ ఆఫీసర్ నరసింహులు ఆదేశాల మేరకు ఘనంగా ప్రారంభమయ్యాయి.తొలుత అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కూడా కమిషనర్ తో పాటు సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. తదుపరి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవికాలంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడైనా ప్రమాదం […] The post ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:40 pm

ఇంటర్ బైపీసీ ఫలితాల్లో మెరిసిన జర్నలిస్టు తనయ నిత్యశ్రీ

​- 1000కి 978 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ The post ఇంటర్ బైపీసీ ఫలితాల్లో మెరిసిన జర్నలిస్టు తనయ నిత్యశ్రీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:36 pm

కేజీబీవీ నార్పలలో ప్రథమ సంవత్సరంలో 100 శాతం ఫలితం నమోదు..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), నార్పలలో 2025–26 ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రథమ సంవత్సరంలో 39 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో 27 మంది విద్యార్థులకు గాను 24 మంది ఉత్తీర్ణత సాధించగా, 3 మంది అనుతీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో జి. సురేఖ 472/500 మార్కులు సాధించి అత్యధిక మార్కులు పొందింది. ఆమె […] The post కేజీబీవీ నార్పలలో ప్రథమ సంవత్సరంలో 100 శాతం ఫలితం నమోదు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:28 pm