ఐసిసి వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో రోహిత్.. టాప్5లో విరాట్, గిల్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని ఐదో ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో ర్యాంక్ను కాపాడుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో రోహిత్ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో ఓ సెంచరీ, మరో అర్ధ శతకం సాధించడంతో రోహిత్ టాప్ ర్యాంక్కు ఢోకా లేకుండా పోయింది. అఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిఛెల్ తన మూడో ర్యాంక్ను నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు. శుభ్మన్ గిల్ కూడా నాలుగో ర్యాంక్ను కాపాడుకున్నాడు. మిఛెల్, గిల్ల మధ్య ఒక పాయింట్ తేడా మాత్రమే ఉండడం గమనార్హం. ఇక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక ర్యాంక్ను మెరుగు పరుచుకుని ఐదో ర్యాంక్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ చివరి వన్డేలో అర్ధ సెంచరీ సాధించడంతో అతని ర్యాంక్ మెరుగు పడింది. భారత్కు చెందిన మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. చరిత్ అసలంక (శ్రీలంక), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), హారీ టెక్టర్ (ఐర్లాండ్) వరుసగా ఆరు, ఏడు, 8 స్థానాల్లో నిలిచారు. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 10వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్లో రషీద్ 710 పాయింట్లతో టాప్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) ఒక ర్యాంక్ను మెరుగు పరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. కేశవ్ మహారాజ్ (దక్షిణాఫ్రికా) ఒక స్థానం కోల్పోయి మూడో ర్యాంక్లో నిలిచాడు. మహీశ్ తీక్షణ (శ్రీలంక) నాలుగో, బెర్నార్డ్ (నమీబియా) ఐదో ర్యాంక్లో కొనసాగుతున్నారు. భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరో ర్యాంక్ను కాపాడుకున్నాడు. రవీంద్ర జడేజా (13వ), సిరాజ్ (15వ) ర్యాంక్లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల విభాగంలో అఫ్గాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత స్టార్ అక్షర్ పటేలో 8వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
గురువారం రాశి ఫలాలు (13-11-2025)
మేషం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృషభం నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిధునం వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కర్కాటకం చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహం కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కన్య ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తుల సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృశ్చికం కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. ధనస్సు బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మకరం చిన్న నాయుడు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కుంభం స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.జ మీనం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు..
భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఈశ్వర్ తర్వాత వరుసగా రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మిర్చి వరకు ప్రభాస్ జర్నీ ఒక దశ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ మొదలైంది. బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో ప్రభాస్ రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ చిత్రాలను ఖాతాలో వేసుకోవడం ఒక అరుదైన రికార్డు. ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్’ 2022, నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజును రెబల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కు స్పెషల్ డేగా గుర్తుంచుకుంటారు. రెబల్ స్టార్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆయన కొత్త సినిమా ‘రాజా సాబ్‘ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సరికొత్త మేకోవర్లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. ఈ పాన్ ఇండియా స్టార్ కెరీర్లో మరో ప్రతిష్టాత్మక మూవీగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్‘ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. మరోవైపు ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ... ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్లు. వీటితో పాటు వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించనున్న కల్కి 2 కూడా ప్రభాస్ లైనప్ లో ఉంది. ఈ పాన్ ఇండియా స్టార్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించబోతున్నాయి.
Cartoon 13th Dec ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
Cartoon 13th Dec ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా ఆంధ్రప్రభలో నేటి “Cartoon
టీమిండియాలోకి మరో హైదరాబాద్ కుర్రాడు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియా అండర్19 ఏ టీమ్లో హైదరాబాద్కు చెందిన మహ్మద్ మాలిక్ చోటు సంపాదించాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ మాలిక్ టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. దీంతో అతని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఇండియా అండర్19 టీమ్లో చోటు కల్పించారు. టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రేరణతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని మాలిక్ వివరించాడు. కఠోర సాధన, అంకిత భావం వల్లే జాతీయ జట్టులో స్థానం సంపాదించే స్థితికి చేరారని వివరించాడు. బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగే సిరీస్లో భారత్ అండర్19 టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు తెలిపాడు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం తన చిరకాల స్వప్నమని, దాని కోసం సర్వం ఒడ్డి పోరాడుతానని పేర్కొన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన బౌలర్గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని మాలిక్ ధీమా వ్యక్తం చేశాడు. తన కొడుకు జాతీయ జట్టులో స్థానం సంపాదించడంపై మాలిక్ తండ్రి మహ్మద్ అబ్దుల్ ఆనందం వ్యక్తం చేశారు. తాను కూడా క్రికెటర్ అని, అయితే జాతీయ జట్టులో స్థానం సంపాదించాలనే తన కల నెరవేరలేదన్నారు. అయితే తన కొడుకు మాలిక్ దాన్ని నెరవేర్చడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, మాలిక్కు ఇండియా అండర్19 టీమ్లో చోటు దక్కడంతో సుభాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
అదరగొట్టిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో...’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి వస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, మొదటి మూడు ట్రాక్లు చార్ట్బస్టర్లుగా మారాయి. మేకర్స్ నాలుగవ సింగిల్ - ఫస్ట్ డే ఫస్ట్ షోను విడుదల చేశారు. ఈ సాంగ్ను అభిమానులు విమల్ థియేటర్లో గ్రాండ్గా లాంచ్ చేశారు. లాంచ్ ఈవెంట్కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ హీరో రామ్ కటౌట్ లాంచ్ చేశారు. సినిమా పట్ల అభిమానుల ఇష్టం, ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభూతిని ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించడం జరిగింది. దినేష్ కాకర్ల రాసిన సాహిత్యం అభిమానుల ప్రేమ, ఆతృత, అంకితభావాన్ని ప్రతీ లైన్ లో ఉత్సవంలా చూపించింది. పాటలో నిజమైన అభిమానుల గొంతులు వినిపించడం మరింత నిజాయితీని, అసలైన ఉత్సాహాన్ని తెస్తుంది. రామ్ పోతినేని ఈ పాటలో ప్రతి అభిమాని సోల్ గా అదరగొట్టారు. తన అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు, ఎలక్ట్రిక్ ఎనర్జీతో స్క్రీన్ మొత్తాన్ని దద్దరిల్లేలా చేశాడు.
ఎస్ఐఆర్ రెండో దశ..37 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
న్యూఢిల్లీ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్) రెండో దశ ప్రక్రియలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకు 37 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను అంటే 72.66 శాతం వరకు ఎన్నికల కమిషన్ పంపిణీ చేసింది. పశ్చిమ బెంగాల్లో 7.66 కోట్ల ఓటర్లు ఉండగా, 6.80 కోట్ల లేదా 88.8 శాతం వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని బుధవారం ప్రకటించింది. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జరగనున్న ఈ ప్రక్రియలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, రాష్ట్రాల్లో 2026 లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం ఓటర్లు 6.41కోట్ల వరకు ఉండగా, 5 కోట్లవరకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ అయ్యాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ఎక్సర్సైజును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
బిజేపి , ఈసి కుమ్మక్కై బహిరంగంగా ఓట్ల చోరీ :రాహుల్
న్యూఢిల్లీ : బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై బహిరంగంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా ఆరోపించారు. ప్రత్యక్షంగా “ప్రజాస్వామ్య ఖూనీ” సాగుతోందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఎక్స్ ఖాతాలో ఆయన అనేక ఆరోపణలు చేశారు. ఒక వ్యక్తి హర్యానా, ఢిల్లీ, బీహార్ ఎన్నికల పోలింగ్ల్లో ఓటు వేశాడని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎక్స్ పోస్ట్లో షేర్ చేశారు. బీహార్ తుది దశ పోలింగ్ పూర్తయి, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఆయన ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాల్లో ఎన్డిఎ మెజారిటీ మార్కు 122 దాటి సులువుగా విజయం సాధిస్తుందని, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బుధవారం చాణక్య కూడా బీజేపీ దాని మిత్రపక్షాలు 160 సీట్లు, ఆర్జేడీ దాని మిత్ర పక్షాలు 77సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. అదే విధంగా మేట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఎన్డిఎ 147167. మహాఘఠ్బంధన్ 7090, జన్సురాజ్ 02 సీట్లు, సాధిస్తాయని వెల్లడించింది. దైనిక్ భాస్కర్ కూడా ఎన్డిఎ అదే స్థాయిలో 145160 సీట్లు, మహాఘఠ్ బంధన్ 7391 స్థానాలు సాధిస్తుందని వివరించింది.
ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం…
ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి
కుప్పకూలిన టర్కీ సైనిక విమానం... 20 మంది మృతి
అంకారా : టర్కీకి చెందిన సీ130 సైనిక రవాణా విమానం 20 మందితో మంగళవారం అజర్బైజాన్ నుంచి టర్కీ వెళ్తూ మార్గమధ్యంలో జార్జియా భూభాగంపై కూలిపోయింది. టర్కీ రక్షణ మంత్రి యాసర్ గులేర్ బుధవారం ఈ సంఘటన గురించి వెల్లడించారు. అజర్బైజాన్ సరిహద్దుకు సమీపంలో జార్జియాలోని సిగ్నాఘి మున్సిపాలిటీ ప్రాంతంలో కుప్పకూలింది. టర్కీ నుంచి దర్యాప్తు బృందం ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. విమాన శిధిలాల కోసం గాలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైనిక బలగాలను తరలించడానికి, లాజిస్టిక్ కార్యకలాపాల కోసం టర్కీ సీ130సైనిక కార్గో విమానాలనే తరచుగా వినియోగిస్తుంది. టర్కీ, అజర్బైజాన్ దేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. బకులో నవంబరు 8న అజర్బైజాన్ విజయోత్సవాలు జరగ్గా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ఇతర టర్కీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రమాదానికి గురైన కార్గో విమానంలోని మిలిటరీ అధికారులు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారో లేదో తెలియదు. అజర్బైజాన్ అధ్యక్షుడు ఈహం ఎలియేవ్, జార్జియా విదేశాంగ మంత్రి మకాబోచ్రిష్విల్లి ఈ ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలియజేశారు.
బీజింగ్ : చైనాలో నిర్మించిన భారీ వంతెన పాక్షికంగా కుప్పకూలింది. సిచూవాన్ ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం జరిగినట్లు చైనా అధికారిక వార్తాసంస్థ తెలిపింది. ఓ నదిపై నిర్మించిన ఈ వంతెనను జాతీయ రహదారుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ చైనా నుంచి టిబెట్కు దగ్గరి దారి ఏర్పడేందుకు దీనితో వీలేర్పడింది. పగుళ్లు తలెత్తిన ఒక్కరోజులోనే ఇది కొంత భాగం వరకూ కూలిపోవడంతో కింద నదిలో టన్నుల కొద్ది కాంక్రీటు పడింది. ఈ ప్రాంతం అంతా గంటల తరబడి దుమ్మూధూళి నెలకొందని వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. గాయపడలేదు. ఇక్కడి ఎతైన కొండప్రాంతంలో తలెత్తిన భూగర్భ కుదుపులతోనే బ్రిడ్జి కూలిందని ప్రాధమిక దర్యాప్తు క్రమంలో వెల్లడైందని అధికారులు తెలిపారు.
నిరుద్యోగ యువతకలల సాకారమే లక్ష్యం
. సివిల్స్ ఇంటర్వ్యూకు 43 మంది ఎంపిక. ఇప్పటివరకు 342 అభ్యర్థులకు రూ.3.61 కోట్ల సాయం: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్: సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకం ద్వారా లబ్ధి పొందిన 43 మంది మెయిన్స్ కు ఎంపిక కావడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 342 మంది రూ.3.62 కోట్ల ఆర్థిక […] The post నిరుద్యోగ యువతకలల సాకారమే లక్ష్యం appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి
శాస్త్రీయ పద్ధతుల్లో బ్యారేజీల పునరుద్ధరణ
మేడిగడ్డ కూలడానికి ‘సుందిళ్ల, అన్నారం’ సాంకేతిక లోపాలే: సమీక్షలో మంత్రి ఉత్తమ్ విశాలాంధ్ర – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనంతో నిర్మించిన ఈ బ్యారేజ్లను వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. అంబేద్కర్ సచివాలయంలో బుధవారం ప్రాజెక్టుల […] The post శాస్త్రీయ పద్ధతుల్లో బ్యారేజీల పునరుద్ధరణ appeared first on Visalaandhra .
నిబంధనలు ఉల్లంఘిస్తేకఠిన చర్యలు
. వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా. జిల్లా స్థాయిలో 33… రాష్ట్ర స్థాయిలో 3 పర్యవేక్షణ బృందాలు. రవాణాశాఖ సమీక్షలో మంత్రి పొన్నం విశాలాంధ్ర – హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినచర్యలు తీసుకొనేం దుకు రవాణాశాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం పనిచేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సచివాలయంలో బుధవారం రవాణా శాఖ ముఖ్య అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు ,రాష్ట్ర స్థాయిలో […] The post నిబంధనలు ఉల్లంఘిస్తేకఠిన చర్యలు appeared first on Visalaandhra .
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నాం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బిసి రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికలపై కేబినెట్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు పలు అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల కేసును ఈనెల 03వ తేదీన హైకోర్టు మూడువారాల పాటు వాయిదా వేయడంతో ఈనెల 07వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లోనూ మాదే అధికారంఓటమి బాధలో బీఆర్ఎస్: మహేశ్కుమార్ గౌడ్ విశాలాంధ్ర – హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మంత్రులతో పాటు ఇంచార్జ్లు ఉన్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేశారని కొనియాడారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో […] The post జూబ్లీహిల్స్లో విజయం ఖాయం appeared first on Visalaandhra .
ఎంపీ బాలశౌరికి చోటు ఆ కమిటీలో చోటు..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ (135వ సవరణ) బిల్లు,
అవును.. అమెరికన్ల ట్యాలెంట్ తక్కువే: ట్రంప్ యూటర్న్
ప్రపంచ ప్రతిభను రప్పిస్తాం ...తప్పదు హెచ్ 1 బి వీసా సమర్థనీయమే ప్రతిభ కొరతతోనే ఇతర దేశాల నుంచి వలస ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో ట్రంప్ యూటర్న్ న్యూయార్క్ : ప్రపంచవ్యాప్త ప్రతిభను అమెరికాకు తీసుకురావడమే తమ ఆలోచన అని ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇంతకాలపు తమ హెచ్ 1 బి వ్యతిరేక విధానం, విదేశీయుల రాకపై ఆంక్షలకు భిన్నంగా ఆయన ఈ యూటర్న్కు దిగారు. ఇతర దేశాల ప్రతిభావంతులను అమెరికాకు రప్పించే హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంను ట్రంప్ తమ మాటలతో సమర్థించారు. అయితే విదేశీ పెట్టుబడిదార్లు ఇక్కడి నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా ఉండరాదు. వచ్చీరాగానే ఇక్కడ మిస్సైల్స్ తయారీకి దిగరాదని వ్యాఖ్యానించారు. స్థానికులకు ప్రాధాన్యత అవసరం అన్నారు. మీరు ఇక్కడికి రావాలని కోరుతున్నానని, ప్రతిభతో నూతన ఆవిష్కరణలతో వచ్చే వారికి అమెరికా స్వాగతం ఉంటుందని తెలిపారు. ఫాక్స్న్యూస్కు ఆయన లౌరా ఇన్గ్రహంతో ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు. తొలిసారిగా ఆయన హెచ్ బి వీసా ప్రోగ్రాంపై సానుకూలత వ్యక్తం చేశారు. తమ అధికార యంత్రాంగానికి హెచ్ బి వీసా ప్రోగ్రాం నెంబర్ ఒన్ ప్రాధాన్యత విధానం కాదని పేర్కొన్నారు. అమెరికన్ వర్కర్లకు వేతనాలు పెంచాలనుకునే వారు ఈ దేశంలో వేలాది మంది విదేశీ వర్కర్లను తీసుకువస్తామంటే కుదరదని తెలిపారు. అమెరికాలోనే బోలెడు ప్రతిభ ఉంది కదా? విదేశీ ప్రతిభ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఇంటర్వూకర్త లౌరా ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ అదేమీ లేదు. కొన్ని రంగాలకు సంబంధించి ఇక్కడ చాలినంత ట్యాలెంట్ లేదనేది తన అభిప్రాయం అని తేల్చిచెప్పారు. ప్రతిభ విషయంలో కొరత ఉందని, మనం నేర్చుకోవల్సి ఉందని స్పష్టం చేశారు. కొన్ని రకాల ఉత్పత్తుల తయారీకి మనం నిరుద్యోగపు క్యూల్లోని వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేం. మిస్సైల్స్ తయారీ కేంద్రాల్లోకి ఎవరిని బడితే వారిని తీసుకోలేం కదా? అని బదులిచ్చారు. జార్జియా ఉదాహరణను తీసుకుంటే అక్కడ విదేశీయులు తిష్టవేసుకుని ఉన్నారు. దక్షిణ కొరియా వారు అక్రమంగా వలస వచ్చి అయినా తిష్టవేసుకున్నారు. బ్యాటరీల తయారీ అంత తేలికకాదు. ప్రమాదకరం, పలు పేలుళ్లు ఉంటాయి. సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఇక్కడి వారు బ్యాటరీల తయారీలో శిక్షణ పొందాల్సిందే. బయటివారిని పంపించచ్చు. ఇది అంతా కోరుకునేదే. అయితే కొన్ని విషయాలలో బయటి ప్రతిభ అవసరం అన్నారు. ట్రంప్ అధికార యంత్రాంగం చాలా కాలంగా హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంలపై అడ్డుకట్టకు దిగుతోంది. విదేశీ ఐటి ప్రతిభావంతులను తమ కంపెనీలలో పనిచేయించుకునేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడు హెచ్ 1 బి వీసాదార్లను గుర్తించి తగు ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతోంది. భారతీయ వృత్తి విద్యానిపుణులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా డాక్టర్లు, నర్సులు హెచ్ 1 బి వీసాల ద్వారా అమెరికాకు వచ్చి ఉద్యోగాలలో ఉంటున్నారు.
దేశంలో ఎక్కువ కాలం ఉండి జాతీయ భద్రతకు ముప్పుగా భావించి మాదకద్రవ్యాల విక్రయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్ న్యూ) బుధవారం ఒన్యుయుక్వు కెలేచి విక్టర్ (28) అనే నైజీరియన్ జాతీయుడిని స్వదేశానికి బహిష్కరించింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాలోని ఎనుగు రాష్ట్రానికి చెందిన విక్టర్, బెంగళూరులోని ఒక కళాశాలలో బిసిఎ కోర్సును అభ్యసించడానికి విద్యార్థి వీసాపై 2021 అక్టోబర్లో భారతదేశానికి వచ్చాడు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా అతను తన చదువును నిలిపివేసి, నైజీరియాకు చెందిన డ్రగ్ సిండికేట్తో సంబంధంలోకి వచ్చాడు. ఇది కమిషన్ ప్రాతిపదికన బెంగళూరు, హైదరాబాద్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. విక్టర్ వీసా 2024 ఏప్రిల్లో గడువు ముగిసిందని పోలీసులు కనుగొన్నా రు, కానీ అతను భారతదేశంలో చట్టవిరుద్ధంగా బస చేయడం కొనసాగించాడు. ఇటీవల, బంజారా హిల్స్లో మాదకద్రవ్యాల వ్యాపారితో తరలిస్తుండగా, అతన్ని హెచ్ న్యూ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ‘అతని నుండి ఎటువంటి నిషేధిత వస్తువులు స్వాధీనం చేసుకోనప్పటికీ, అతను తన బసకు చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించడంలో విఫలమయ్యాడు. విచారణ తర్వాత, అతను భారతదేశంలో గడువుకు మించి ఉన్నట్టు అంగీకరించాడు. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారుల సహాయంతో, ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడింది అతను భారతదేశంలోకి తిరిగి ప్రవేశించకుండా బ్లాక్ లిస్ట్ చేయబడ్డాడు,‘ అని హెచ్ న్యూ డిసిపి వై.వి.ఎస్.సుధీంద్ర అన్నారు. 2022 నుండి హెచ్ న్యూ 23 మంది విదేశీ పౌరులను దేశం నుండి బహిష్కరించింది, వీరిలో 15 మంది నైజీరియన్లు, ముగ్గురు సూడాన్ దేశస్థులు, ఇద్దరు ఐవోరియన్లు, ఒక్కొక్కరు టాంజానియన్, మొరాకో దేశస్థులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది దేశంలో ఉండి మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు తేలింది. 2025లోనే ఎనిమిది మంది నైజీరియన్లు సహా 11 మంది విదేశీయులను దేశం నుండి బహిష్కరించారు. 2022 నుండి మాదకద్రవ్యాల కేసుల్లో ప్రమేయం ఉన్నందుకు హెచ్ న్యూ 33 మంది విదేశీయులను అరెస్టు చేసింది, వారిలో 20 మంది నైజీరియన్లు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని 8712661601 నంబర్కు హెచ్ న్యూ కు నివేదించాలని పోలీసులు కోరారు.
. పెట్టుబడిదారులకు ఆ భూములా…. చట్టానికి తూట్లు… భూ కమిటీ సిఫార్సులు తుంగలోకి…. పేదల హక్కులు లాక్కోవడమేనని ప్రజా సంఘాల ఆందోళన. లీజు లాభమంటున్న ప్రభుత్వం విశాలాంధ్ర-సచివాలయం : అసైన్డ్ చట్టానికి కూటమి ప్రభుత్వం సవరణ తీసుకురావడం పేదలకు అన్యాయం చేయడమేనని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. అయితే పేదలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోగా వారికి మరింత లాభం చేకూరుతుందని ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వాస్తవంగా అసైన్డ్ చట్టం`1977 ప్రకారం అసైన్డ్ భూమి అంటే ప్రభుత్వ భూమి… […] The post అసైన్డ్ భూసంతర్పణ appeared first on Visalaandhra .
ముంబై తరహా దాడులు లక్ష్యం.. వెలుగులోకి సంచలన విషయాలు
200 శక్తివంతమైన ఐఈడీలు సిద్ధం ఎర్రకోట, ఇండియాగేట్ సహా పలు ఆలయాలు, ప్రార్థన మందిరాలు టార్గెట్ జనవరి నుంచే కుట్రలు, అనుమానం రాకుండా డాక్టర్లతో అమలుకు చర్యలు ఫరీదాబాద్ సమీపంలోని దౌజ్, ఫతేపూర్ టాగాలో అద్దె ఇళ్లు దీపావళి రోజునే పేలుడుకు పన్నాగం, చివరి క్షణంలో మార్పు టెర్రర్ మాడ్యూల్ విచారణలో వెలుగుచూస్తున్న సంచలన విషయాలు న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక ప్రాంతాలలో భారీఎత్తున దాడులు నిర్వహించి, విధ్వంసం సృష్టించడమే ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రకోట వద్ద కారు పేలుడులో దాదాపు 12 మంది మరణించిన తర్వాత వరుస దాడులకు ప్రణాళిక చేసినట్లు వెల్లడైంది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో పట్టుబడ్డ నిందితులను విచారిస్తున్న క్రమంలో సంచలన విసయాలు వెల్లడవుతున్నాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్ , గౌరీ శంకర్ ఆలయంతో సహా రాజధాని నడిబొడ్డున పలు కీలక ప్రాంతాలు వాళ్ల టార్గెట్ అని కారుబాంబు పేలుడు ఘటనపై జరుపుతున్న దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఆలయాల్లోనూ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నారని తేలింది. 2008 నవంబర్ 26న ముంబై దాడుల సమయంలో తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్, ట్రెడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, లియోపోల్డ్ హాస్పిటల్ తో సహా 12 ప్రదేశాలలో కాల్పులు జరిపి భారీ విధ్వంసానికి, మారణోమానికి ఉగ్రవాదులు పాల్పడ విషయం తెలిసిందే. ఢిల్లీలో పేలుళ్లకు ఈ ఏడాది జనవరి నుంచే పన్నాగాలు పన్నుతున్నారని, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ఎ-మొహమ్మద్ తో సంబంధం ఉన్న ఉగ్రవాద ముఠా నెలల తరబడి ఈ దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్ లలో కూడా కీలక ప్రాంతాలను టార్గెట్ చేసుకునేందుకు 200 శక్తివంతమైన ఐఈడీలు, బాంబులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడైంది. మతకల్లోలాలూ సృష్టించే కుట్ర.. దేశంలో మతకల్లోలాలు సృష్టించే లక్ష్యంతో ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా పేలుళ్లకు పథకం వేశారని, ఇందుకోసం జమ్మూకశ్మీర్ లోని పుల్వామా, షోపియన్, అనంతనాగ్ కు చెందిన కొందరు డాక్టర్లను ఈ దారుణకాండకు ఎంచుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ కేంద్రంగా వారు ఈ పన్నాగాలు పన్నుతూ వచ్చారని, డాక్టర్లు కావడంతో వారిని పెద్దగా ఎవరూ అనుమానించరని భావించారన్నారు. ఈ బ్యాంక్గ్రౌండ్తోనే దేశరాజధాని ప్రాంతంలో ఎక్కడికైనా వారు సులభంగా తిరగగలిగారని, ఆ ముసుగులోనే దౌజ్, ఫతేపూర్ టాగా ప్రాంతాలలో వారు పేలుడు పదార్థాలు నిల్వ చేయడానికి గదులను అద్దెకు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు. దీపావళి పండుగనాడే రద్దీగా ఉండే ప్రదేశాలలో దాడి చేయాలని టెర్రరిస్ట్లు ముందుగా ప్లాన్ చేసినా, ఆ పథకం ఎందుకో పారలేదు. బాంబు తయారీలో ఉపయోగించే 2,900 కిలోల పేలుడు పదార్థాలతో అరెస్ట్ అయిన ముజిమ్మిల్ ఈ విషయాలు తెలిపినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సయీద్ ముజిమ్మిల్ అల్ - ఫలాహ్ లో పనిచేస్తూ, టచ్ లో ఉండేవారని, సయీద్ కారులో అస్సాల్ట్ రైఫిల్, మందుగుండుసామగ్రి దొరికిన తర్వాత ఆమె అరెస్ట్ అయినట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం (ఆంధ్రప్రభ): ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీసులు పలు నూతన చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్
దేశవ్యాప్త పేలుళ్లకు ఉగ్ర కుట్ర
200 ఐఈడీ బాంబుల తయారీకి యత్నం . 26/11 తరహాలో భారీ దాడులకు పన్నాగం. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం. ఎర్రకోట వద్ద పేలుడు కేసులో సంచలన విషయాలు న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్క చోటుకే పరిమితమైన దాడి కాదని… 26/11 ముంబై దాడుల తరహాలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు […] The post దేశవ్యాప్త పేలుళ్లకు ఉగ్ర కుట్ర appeared first on Visalaandhra .
దోషులకు కఠిన శిక్ష తప్పదుకేంద్రం అధికారిక ప్రకటన న్యూదిల్లీ: దిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ ఖండిరచింది. రెండు నిమిషాలు మౌనం పాటించడం ద్వారా ఈ ఘటనలో మృతిచెందినవారికి సంతాపం తెలిపింది. పేలుడు ఉగ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తామని కేబినెట్ వెల్లడిరచింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి… శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ […] The post ఇది ముష్కరుల చర్యే appeared first on Visalaandhra .
. మూడు లక్షల మంది గృహప్రవేశాలు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం. ఆకాశమే హద్దుగా రాష్ట్రాభివృద్ధి. చంద్రబాబు నాయుడు విశాలాంధ్ర – రాయచోటి రూరల్: సంక్షేమం, అభివృద్ధి, సుపరి పాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపి… ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం దేవగుడి పల్లిలో బుధవారం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లా డారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా […] The post 2029 నాటికిసొంతింటి కల సాకారం appeared first on Visalaandhra .
వైద్య కళాశాలలు అమ్ముకోవడం సిగ్గుచేటని విమర్శ . ఉద్యమం ఉధృతం చేయాలి. ఏఐఎస్ఎఫ్ బస్సు జాత ముగింపు సభలో ఈశ్వరయ్య పిలుపు విశాలాంధ్ర బ్యూరో- అనంతపురం : విద్యారంగాన్ని కాపాడుకోవడానికి విద్యార్థి లోకం ఉద్యమం ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. విద్యారంగ పరిరక్షణ కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అక్టోబరు 22న ఇచ్చాపురంలో ప్రారంభించిన రాష్ట్రవ్యాప్త బస్సుజాత ముగింపు సందర్భంగా బుధవారం అనంతపురంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ […] The post విద్యారంగాన్నికాపాడుకుందాం appeared first on Visalaandhra .
ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల లక్ష్యం
120 బిలియన్ డాలర్లు ఆకర్షించాంసీఐఐ సదస్సుపై దిల్లీలో మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్పై ఆయన బుధవారం దేశ రాజధాని దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ సదస్సుకు ఆహ్వానించేందుకు దిల్లీ వచ్చానన్నారు. ‘ఎన్నికల సమయంలో ఆరు కీలక హామీలు ఇచ్చాం. ఐదేళ్లలో […] The post ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల లక్ష్యం appeared first on Visalaandhra .
సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం..
గోదావరిఖని (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 11 ఇంక్లైన్ బొగ్గు గనిలో
ఢిల్లీ పేలుడు ప్రభుత్వ వైఫల్యమే.. రాజధానిలోనే నిఘా వైఫల్యమా?
గళూరు : ఢిల్లీ పేలుడును ప్రభుత్వం వైఫల్యంగా ఎఐసిసి చీఫ్ మల్లికార్జున అభివర్ణించారు. పేలుడు వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరమని, అయితే దేశ రాజధానిలోనే నిఘా వర్గాలు ఇంత ఘోర వైఫల్యం చెందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అన్ని దర్యాప్తు కేంద్రాలకు వేదికైన ఢిల్లీలోనే ప్రభుత్వం దారుణంగా విఫలం చెందిందన్నారు. బుధవారంనాడు ఇక్కడ ఆయన మీడియాంతో మాట్లాడారు. పేలుడు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. దర్యాప్తును ఎన్ఐఎకు అప్పగించారని, ఆ సంస్థ వెల్లడించే నివేదికను పరిశీలించిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు.
హెచ్1బీ వీసాపై ట్రంప్ యూటర్న్
అమెరికాకు విదేశీ ప్రతిభ అవసరమని అంగీకారంవాషింగ్టన్: హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ విదేశీ ఉద్యోగులపై కొరఢా విధించేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. హెచ్1బీ వీసా విషయంలో స్వరం మార్చారు. తమ దేశానికి విదేశీ నైపుణ్యతప్రతిభ అవసరమని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభను అమెరికాకు తెచ్చుకోవల్సిన అవసరం ఉందని వక్కాణించారు. అయితే విదేశీ ఉద్యోగులపై ఆధారాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా అమెరికాన్లు ప్రతిభ పెంచుకోవాలని, ఆయా నైపుణ్యతలు, మెళకులు […] The post హెచ్1బీ వీసాపై ట్రంప్ యూటర్న్ appeared first on Visalaandhra .
video viral |కర్నూలు బస్సు దుర్ఘటనపై షాకింగ్ వీడియో…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: గత నెల 24న కల్లూరు మండలంలోని చిన్నటేకూరు సమీపంలో
ఐక్యతా స్ఫూర్తితో ముందుకు: ఎన్సీపీ
ఖాట్మండు: ఐక్యతా స్ఫూర్తి`సందేశంతో నేపాలీ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) ముందుకు వెళుతోంది. వామపక్ష పార్టీలు ఏకీకృతంగా నేపాలీ కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించాయి. తమ బలాన్ని సంస్థాగతంగా పెంచుకోనేందుకు, ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఎన్సీపీ నాయకులు నిమగ్నమయ్యారు. ఇదే క్రమంలో ఎన్సీపీ సమన్వయకర్త ప్రచండ నాయకత్వంలో పారిస్దండలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అగ్ని ప్రసాద్ సప్కోట ఓ ప్రకటన […] The post ఐక్యతా స్ఫూర్తితో ముందుకు: ఎన్సీపీ appeared first on Visalaandhra .
ఉత్తర కర్నాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి: కాంగ్రెస్ ఎంఎల్ఎ లేఖ
బెళగావి : 15 జిల్లాలతో ఉత్తర కర్నాటక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజు కాగె రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారు. తమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని, ప్రతి రంగంలో పాలకులు పక్షపాతం చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు అనుగుణంగా సంతకాల సేకరణ కూడా చేపడతానని ఆయన ప్రకటించారు. బీదర్, కలబురగి, విజయపుర, యాద్గిర్, బాగల్కోట్, బెళగావి, ధార్వాడ్, గడగ్ తదితర జిల్లాలతో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
ఆస్పత్రి నుంచి ధర్మేంద్ర, గోవిందా డిశ్చార్జి
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, గోవింద బుధవారంనాడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక్కడి బ్రీచ్కాండీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ఉదయాన్నే ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఇంటి వద్ద చికిత్స జరిపించాలని నిర్ణయించుకున్నారని, తదనుగుణంగా ఆయనకు ఇంట్లోనే చికిత్స అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ధర్మేంద్ర ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తడంతో కుటుంబ సభ్యులు స్పందించారు. ఆయన కోలుకుంటున్నారని, ఫేక్ వార్తలు ప్రసారం చేయవద్దని, ఆయన కోసం ప్రార్ధించిన అందరికీ కృతజ్ఞతలు అని ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ప్రతినిధి ఒక ప్రకటలో తెలిపారు. మరోవైపు స్వల్ప అనారోగ్యానికి గురైన మరో నటుడు గోవిందా(61) మంగళవారంనాడు రాత్రి కొంత స్పృహ కోల్పోవడంతో క్రిటీ కేర్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యుల పరీక్షల అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు బాగానే ఉన్నానని, వైద్యులు అతిగా వర్కౌట్ చేయవద్దని సలహా ఇచ్చారని, యోగా, ప్రాణాయామంతో సరిపెట్టుకోవాలని సూచించినట్లు తెలిపారు. చికిత్స కొనసాగుతుందని, డాక్టర్లు కొన్ని మందులు ఇచ్చి వాడాలని సూచించారని గోవిందా వివరించారు.
Pulivendula Politics Takes Center Stage: Coalition Leaders Challenge YSRCP Dominance
Pulivendula, one of Andhra Pradesh’s most talked constituencies is once again in the political spotlight. With the coalition government led by the Telugu Desam Party (TDP) now in power, a fresh wave of political energy has begun to flow through the region. Once considered an unshakable fort of the YSR Congress Party, Pulivendula is witnessing […] The post Pulivendula Politics Takes Center Stage: Coalition Leaders Challenge YSRCP Dominance appeared first on Telugu360 .
ఎన్నికల సమయం లోనే ఉగ్రదాడులా ?: సిద్ధరామయ్య
బెంగళూరు: దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా సిఎం సిద్ధరామయ్య ఎన్నికల సమయం లోనే ఉగ్రమూకల దాడులు జరగడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. ఈ ప్రకటన మీడియాలో కూడా ప్రసారమైంది. మంగళవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్పూర్తయిన తరువాత సిద్ధరామయ్య వ్యాఖ్యలు వచ్చాయి. మైసూరులో మంగళవారం విలేకరులతో సిద్ధరామయ్య మాట్లాడుతూ దేశంలో బాంబు పేలుళ్లు జరగకూడదని, అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు మంత్రి ప్రియాంక్ ఖర్గే అసమర్ధుడైన హోం మంత్రి అమిత్షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కర్ణాటక విభాగం అధ్యక్షుడు బివై విజయేంద్ర సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమే కాకుండా తక్కువస్థాయి రాజకీయాలని విమర్శించారు.
Priyanka Chopra surprises as Mandakini in GlobeTrotter
The team of GlobeTrotter have been unveiling a bunch of updates from the film on a regular basis. Priyanka Chopra plays a crucial role and the makers have unveiled her look as Mandakini. The actress looks fearless in a traditional avatar. She is dressed in a mustard yellow saree carrying a gun. This is her […] The post Priyanka Chopra surprises as Mandakini in GlobeTrotter appeared first on Telugu360 .
Bihar |బీహార్ లో కొత్త ప్రశ్నలు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బీహార్…. దేశ రాజకీయ భవిష్యత్తును సైతం ప్రభావితం
ఇలాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి:దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన స్పందనతో సినిమాపై మంచి అంచనాలను సృష్టించాయి. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్, రానా విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ “ఇది పూర్తిగా ఫిక్షనల్ కథ. ఆ కాలం నుంచి ప్రేరణ పొంది రాసిన కథ. ఇది ఒక సంఘటన అని చెప్పలేం. ఇద్దరు గొప్ప వ్యక్తులు గొడవలు పడిన నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు. -50ల బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడానికి కారణం ఉంది. ఆ కాలంలో సాహిత్యం, సంగీతానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. ఆ సమయంలో జరిగిన కథ అంటే తెలియని రొమాన్స్ వస్తుంది. భాగ్యశ్రీ ఈ కథకి సరిపోయింది. ఈ సినిమా మాకు చాలా స్పెషల్. మేము సినిమాని జీవితాంతం ప్రేమించే వాళ్ళం. సినిమానే మాకు అంత ఇచ్చింది. సినిమాకి మేము ఇవ్వాలి తిరిగి ఇవ్వాలి. అలాంటి అవకాశం ఈ సినిమాతో వచ్చింది”అని అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “-ఈ ఫిక్షనల్ స్టోరీ నాకు నచ్చింది. నేను ఇంకేది ఆలోచించలేదు. సినిమా చూసినప్పుడు దీన్ని ఒక మంచి కథగానే ఫీలవుతారు.- మహానటి సినిమాలో సినిమా ఉంటుంది. కానీ ఆ సినిమాకి ఒక రిఫరెన్స్ లేదు. ఇక ఈ క్యారెక్టర్ ఎలా చేస్తానని నేను, డైరెక్టర్ మాట్లాడుకునేవాళ్లం. ఒక మ్యాజిక్ అయితే జరిగింది. అది మీరు ట్రైలర్లో చూశారు. రానా, సముద్రఖని, భాగ్యశ్రీ అందరూ కూడా అద్భుతమైన నటులు. వీళ్ళ అందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ జరిగింది. - కాంత నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిలిం. ఇలాంటి సినిమాలు జీవితంలో ఒకేసారి వస్తాయి”అని తెలిపారు.
మోసాల చెంబు ఇది నమ్మితే ముంచేస్తుంది!!
ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారా? కాసులకు కక్కుర్తి పడి నమ్మేశారంటే దారుణంగా మోసపోకతప్పదు.
ఆన్లైన్ ట్రేడింగ్ కి బలైన నిజాం షుగర్స్ మాజీ అధికారి
నకిలీ ట్రేడింగ్ యాప్తో మోసంఅదనంగా అప్పు తీసుకోమని ఒత్తిడి
పోలీసుల అదుపులో హర్యానా మతబోధకుడు
ఫరీదాబాద్లో తన అద్దె ఇంటిలో పేలుడు పదార్ధాలను నిల్వచేయడానికి సహకరించాడన్న నేరారోపణపై హర్యానాకు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్టియాగ్ను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపు లోకి తీసుకుని బుధవారం శ్రీనగర్కు తీసుకు వచ్చారు. ఆయన అద్దె ఇంటి నుంచి పేలుడు పదార్ధాలైన 2900 కిలోల అమోనియా నైట్రేట్, పొటాసియం క్లోరేట్ , సల్ఫర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 360 కిలోలు మండే స్వభావం కలిగిన అమోనియం నైట్రేట్గా గుర్తించారు. దీంతోపాటు ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మేవత్కు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్టియాగ్ ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్శిటీ క్యాంపస్లో మతబోధనలు చేస్తుంటాడు. యూనివర్శిటీకి సమీపాన తాను అద్దెకు ఉంటున్న నివాసంలో పేలుడు పదార్ధాల నిల్వ ఉంచేలా సహకరించాడని పోలీసుల దర్యాప్తు లో తేలింది. ఎర్రకోటవద్ద జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడితో సంబంధం ఉన్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ నేరం కింద ఈ అరెస్టు జరిగింది. ఈ పేలుడు పదార్ధాలను డాక్టర్ ముజమ్మిల్ అలియాస్ ముసాయిబ్ ,డాక్టర్ ఉమర్నబీ నిల్వచేశారు. ఎర్రకోట పేలుడుకు వినియోగించిన కారును డాక్టర్ ఉమర్నడీ డ్రైవ్ చేసినట్టు తెలిసింది. ఎర్రకోట కేసులో ఇంతవరకు అరెస్టు అయిన వారిలో మౌల్వీ తొమ్మిదో వ్యక్తి అవుతాడు.
మీ డ్రైవింగ్ కు 12 పాయింట్ల రక్ష
తెలంగాణ పోలీసుశాఖ ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా ఝళిపించబోతోంది.
పత్తి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 14న చలో వరంగల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ పత్తి రైతుల సంఘం వెల్లడించింది. వరంగల్లోని సిసిఐ రీజనల్ కార్యాలయం ఎదుట జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందు నాయక్, కో కన్వీనర్ మూడ్ శోభన్ పిలుపునిచ్చా రు. ఇందుకు సంబంధించి బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్, మూడ్ శోభన్ లు మాట్లాడుతూ తేమతో నిమిత్తం లేకుండా సిసిఐ ద్వారా రైతుల పత్తి పంటను కొనుగోలు చేయాలని, రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకునే పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేయడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ వల్ల కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావున యాప్ అమలు వెనక్కి తీసుకోవాలన్నారు. సిసిఐ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా ప్రతి ఎకరాకు 12 క్వింటాల్ పత్తిని కొనుగోలు చేయాలని, పతి ఎకరాకు కేవలం 7 క్వింటాల్ కొనుగోలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు 475 బోనస్ అమలు చేయాలని, మ్యాపింగ్ పేరుతో కాటన్ మిల్లుల దగ్గరలో ఉన్న గ్రామాల రైతులను సుదూర ప్రాంతాలకు పంపడం వలన రవాణా ఛార్జీలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున అట్టి మ్యాపింగ్ పద్ధతిని సిసిఐ విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ వాసిరెడ్డి వరప్రసాద్, రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ, యలమంచిలి వంశీ కృష్ణ, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, కందాల శంకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, రాజన్న, ఆముదాల మల్లారెడ్డి, వెంకట్ మావో, చల్లారపు తిరుపతి రెడ్డి, మిల్కురి వాసుదేవ రెడ్డి, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
BJP |బీహార్ లో ఫలితాల ముందే హడావుడి..
BJP ఆంధ్రప్రభ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్
పెన్షనర్లకు సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. మీసేవ ప్లాట్ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవతో ఇప్పుడు పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించుకోవచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.- పెద్దలకు సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, మీసేవా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవ పారదర్శకతతో పాటు గౌరవాన్ని కలిగించే టెక్నాలజీ ఆధారిత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ సేవకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. వినియోగదారుల సంఖ్య సంవత్సరం వారీగా పెరుగుతోందని చెప్పారు. 2022- 23లో 143, 2023- 24లో 31,295, 2024- 25లో 64,612, ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ 11 వరకు 13,214 మంది పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారని వివరించారు. మొత్తం ఇప్పటివరకు 1.09 లక్షలకుపైగా సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షలకుపైగా పెన్షనర్లు ఈ సదుపాయంతో లాభపడుతున్నారని వివరించారు. మీసేవా యాప్లో ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణ వ్యవస్థతో గుర్తింపు పూర్తయిన వెంటనే లైఫ్ సర్టిఫికెట్ ఆటోమేటిక్గా ప్రభుత్వ రికార్డుల్లో అప్డేట్ అవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా అధికారులు ఈ సేవను నిరంతరం అందుబాటులో ఉంచి పెన్షన్ చెల్లింపులు అంతరాయం లేకుండా జరుగుతున్నాయని వెల్లడించారు. పెన్షనర్లకు ప్రయాణం, కాగిత పనులు, క్యూలైన్ల కష్టాలు అన్నీ తొలగిపోయాయని తెలిపారు. తద్వారా మీసేవా రాష్ట్ర డిజిటల్ పాలనలో మరో కీలకమైన దశను అధిగమించింది. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ ద్వారా 300కి పైగా ప్రభుత్వ, వ్యాపార సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
సిఐడి సిట్ విచారణకు హజరయిన ప్రకాశ్ రాజ్
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్పై నమోదయిన కేసులను సిఐడికి బదిలి చేయడంతో విచారణకు హజరు కావాలని సిఐడి సిట్ అధికారులు నోటిసులు ఇచ్చారు. బుధవారం విచారణకు హజరయిన ప్రకాశ్ రాజ్ను గంటపాట్నర పాటు సిట్ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పేనన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారం అధికారులకు ఇచ్చానని తెలిపారు. బెట్టింగ్ యాప్ను 2017లోనే బ్యాన్ చేశారని, 2016లో ఇంకా బెట్టింగ్ మొదలు కాలేదని, గేమ్ అనుకుని యాడ్ చేశానని చెప్పారు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్గా రూపాంతరం చెందిందని తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ యాడ్ నుంచి తప్పుకున్నానని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలోనే కంపెనీతో తన ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు ఆయన వివరించారు. తాను ఎటువంటి డబ్బులు తీసుకోలేదని సిట్ అధికారులకు చెప్పానన్నారు. బెట్టింగ్ యాప్స్ సరైనవి కావని, యువత వాటి జోలికి వెళ్లోద్దని సూచించారు. వీటి వల్ల చాలా మంది యవత ప్రాణాలు కొల్పోవడం బాధకరమయిన విషయమన్నారు. బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టోద్దని కోరారు. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుందనే అప్పుడే డబ్బులు వస్తాయని, అందరం కష్టపడి పని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లపై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్లో నమోదయిన కేసును సిఐడి అడిషనల్ డిజిపి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో సినీనటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి.
హర్యానాలో టెర్రర్ లింక్ ఎర్రకారు ఎకో స్పోర్టు లభ్యం
ఎర్రకోట వద్ద భారీ పేలుడు ఘటనతో లింక్ ఉందని అనుమానిస్తున్న ఎరుపు రంగు ఫోర్డు ఎకోస్పోర్ట్ కారును హర్యానాలో ఓ గ్రామం వద్ద గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఈ రెడ్ కార్ కోసం గాలిస్తున్నారు. ఈ కారులోనే నిందితుడు తిరిగినట్లు సాక్షాధారాలతో వెల్లడి అయింది. దీనితో ఢిల్లీ పోలీసు బృందాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో నెంబరు డిఎల్10సికె 0458 కారును బుధవారం మధ్యాహ్నం ఖండావలీ గ్రామం వద్ద పార్క్ చేసి ఉండగా కనుగొన్నారు. ఈ కారు కోసం పోలీసు ఠాణాలకు సమాచారం అందించారు. చెక్ పోస్టులు, సరిహద్దుల తనిఖీ కేంద్రాల వద్ద గస్తీ ముమ్మరం చేశారు.అనుమానిత ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారని అధికార వర్గాలు తెలిపాయి. హ్యూండాయ్ ఐ20 కారుతో పాటు దుండగులు ఈ రెడ్కారును వాడినట్లు తెలిసింది. ఇప్పుడు దొరికిన కారు ఉమర్ ఉన్ నబీ అనే వ్యక్తి పేరిట 22నవంబర్ 2017 న రాజౌరి గార్డెన్లో నమోదు అయింది. ఈ కారు డాక్టర్ ఉమర్కు చెందిన నివాసం వెలుపలనే కనుగొన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కారు కోసం గాలింపు చర్యలు చేపట్టిన కొద్ది గంటల్లోనే దీనిని గమనించిన ప్రత్యేక పోలీసు బృందాలు కారును చుట్టుముట్టాయి. వాహనంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉండి ఉంటాయనే జాగ్రత్తతో వెంటనే సంబంధిత నిపుణులను రప్పించి లోపల తనిఖీలు చేపట్టారు. ఈ కారు ఉమర్ ఉన్ నబీ అలియాస్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ పేరిట నమోదు అయింది. ఆయన కారుకు రెండో ఓనర్ అని తేలింది. ఈశాన్య ఢిల్లీలో తప్పుడు చిరునామాతో ఉమర్ దీనిని రిజిస్టర్ చేసుకున్నాడని నిర్థారించారు. ఉగ్రపేలుళ్ల చర్యకు ఈ రెడ్కారును రెండో వాహనంగా వాడుకున్నారని వెల్లడైంది. ఈ కారులోనే ఉగ్రవాదులు పలు ప్రాంతాలలో రెకీలు నిర్వహించి ఉంటారని, ఆయుధాల పంపిణీ, సేకరణకు దిగి ఉంటారని అనుమానిస్తున్నారు.
శోకసంద్రంలో జనంవిందువిలాసాల్లో మోదీ
ఏదో ఒక చోట పేలుళ్లు జరగడం దేశ వాసులు నిర్ఘాంత పోవడం పరిపాటి అయిపోయింది. ఈ సారి సోమవారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుళ్లు జరిగాయి. జనం మరోసారి నిర్ఘాంత పోయారు. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మరణించారని, 24 మంది గాయపడ్డారని అంటున్నారు. యథావిధిగా దిల్లీ పోలీసులు, జమ్మూ కశ్మీర్ పోలీసులతో పాటు ఎన్ఐఎ దర్యాప్తు జరుపుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఏ విధ్వంసం జరిగినా దొర్లే మాటలే. మంగళవారం సాయంత్రం దాకా ఈ పేలుళ్లకు […] The post శోకసంద్రంలో జనంవిందువిలాసాల్లో మోదీ appeared first on Visalaandhra .
వాల్ స్ట్రీట్ గుండెల్లో సోషలిజం జెండా!
కానూరి కృష్ణ, సీనియర్ జర్నలిస్టు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు గుండెకాయ, బిలియనీర్లు, వాల్ స్ట్రీట్ ఆర్థిక అహంకారానికి చిరునామా అయిన న్యూయార్క్ నగర మేయర్గా 34 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ విజయం వెనుక దశాబ్దాల తరబడి న్యూయార్క్ నగర రాజకీయాలను మలచిన కమ్యూనిస్టులు, సోషలిస్టులు, పౌర హక్కుల ఉద్యమాల ప్రగతిశీల, రాడికల్ వారసత్వం ఉంది. న్యూయార్క్లోని కమ్యూనిస్టులు, సోషలిస్టులు చారిత్రక కార్మిక సంఘాలు, పౌర హక్కుల ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. మమ్దానీ రాజకీయ లక్ష్యం, […] The post వాల్ స్ట్రీట్ గుండెల్లో సోషలిజం జెండా! appeared first on Visalaandhra .
డాక్టర్ సి.ఎస్ క్షేత్రపాల్రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజా ఉద్యమాలు రగులుతున్నాయి. వెనుకబడ్డ ఉత్తరాంధ్రను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న పాలకులు తమ ఉసురు తీసేలా చేస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాలకుల మాటల్లో కనిపించే అభివృద్ధి మంత్రం చేతల్లో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నదని గ్రహించిన ఉత్తరాంధ్ర ప్రజానీకం పాలకుల కుటిల నీతిపై తిరగబడిరది. విప్లవోద్యమ చరిత్ర ఉన్న శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంత రైతాంగం కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం పేరుతో తమ పచ్చని భూములను లాగేసుకోవాలని చూస్తే […] The post పోరుబాటలో ఉత్తరాంధ్ర appeared first on Visalaandhra .
ఇటీవల ఒక జిల్లా ఉన్నతాధికారి ఒక విలేకరికి ఫోన్చేసి, దుర్భాషలాడారు. చంపేస్తానని బెదిరించారు. ఆ విలేకరికి చెందిన పిల్లల అంతుచూస్తానని కూడా హెచ్చరించారు. కాకపోతే, ఆ ఫోన్కాల్ను విలేకరి తెలివిగా రికార్డుచేసి, పోలీసులకు సమర్పించారు. ఆ తర్వాత అది సోషల్మీడియాలో హల్చల్ అయింది. ఆ విలేకరిపై బీపన్పస్లోని 132, 351(2) రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద కేసుపెట్టారు. ఇండియన్ జర్నలిస్ట్సు jూనియన్ (ఐజేjూ) అనుబంధ ఏపీjూడబ్ల్యుజే ఈ కేసులో విలేకరికి అండగా నిలబడి, పోరాటం చేస్తున్నది. jూనియన్ను […] The post రక్షణలేని జీవితం! appeared first on Visalaandhra .
అద్దె కట్టలేక రోడ్డున పడ్డ కుటుంబం
ఇంటి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి కూతురు మానసలు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ బట్టల దుకాణంలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పని కోల్పోవడంతో గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అద్దె కట్టలేక ఇల్లు వదిలి మండల పరిషత్ కార్యాలయం ముందుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కనీసం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కరువైందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Armour డ్రంక్ అండ్ డ్రైవ్… భారీ జరిమాన…
Armour డ్రంక్ అండ్ డ్రైవ్… భారీ జరిమాన… అర్మూర్, ఆంధ్రప్రభ : ఆర్మూర్(Armour)
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/గణపురం (ఆంధ్రప్రభ) : పేద, ధనిక అనే తేడా లేకుండా
ధర్మేంద్ర డిశ్చార్జ్ మీడియాపై సన్నీ డియోల్ కోరిక #Bollywood #Dharmendra #SunnyDeol #Mumbai
నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు: పొన్నం
హైదరాబాద్: రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన రవాణాశాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీగా పెనాల్టీ విధించాలని.. ఓవర్లోడింగ్ వాహనాలు సీజ్ అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ సేప్టీ మంత్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మహిళ ఆటోలకు అనుమతులిచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.
ఎర్రకోట వద్ద విషాదం బాధితులను పరామర్శించిన మోదీ #DelhiBlast #PMModi #LNJPHospital #RedFort
#SSMB29 నుంచి ప్రియాంక ఫస్ట్ లుక్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ #SSMB29(వర్కింగ్ టైటిల్). ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల చేసేందుకు #GlobTrotter అనే పేరుతో పెద్ద ఈవెంట్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15న రామోజీ ఫిలీంసిటీలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొననున్నారు. కాగా, ఈవెంట్ ను ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా మూవీపై హైప్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా క్రియేట్ అయ్యింది. మరోవైపు, మేకర్స్ అభిమానులకు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ తోపాటు ఆడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పసుపు కలర్ శారీలో గన్ కాలుస్తున్న ప్రియాంక పోస్టర్ ను వదిలారు.ఇందులో ఆమె మందాకిని పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.
Nagarkurnool ముగిసిన ఎస్ఎల్బీసీ ఏరియల్ సర్వే
Nagarkurnool ముగిసిన ఎస్ఎల్బీసీ ఏరియల్ సర్వే అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్(Nagarkurnool)
Dandepalli సస్య రక్షణ పద్ధతులు పాటించాలి…
Dandepalli సస్య రక్షణ పద్ధతులు పాటించాలి… దండేపల్లి, ఆంధ్రప్రభ : ఉద్యానవన పంటల
104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలి
డి యం ఎచ్ ఓ డాక్టర్ ఈ బి దేవివిశాలాంధ్ర – అనంతపురం : 104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలని డి యం ఎచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి పేర్కొన్నారు.. బుధవారం డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి తన కార్యాలయంలో 104 వాహనాల సేవలు కు సంబంధించి సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈ బి దేవి మాట్లాడుతూ… 104 […] The post 104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలి appeared first on Visalaandhra .
Medaram గద్దెల ప్రాంగణంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు…
Medaram గద్దెల ప్రాంగణంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు… తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు
utkur snake|ఇనుప కంచెపై తచ్చాడిన పాము
utkur snake| ఇనుప కంచెపై తచ్చాడిన పాము utkur ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Ootkur ఇనుప కంచెపై తచ్చాడిన పాము
Ootkur ఇనుప కంచెపై తచ్చాడిన పాము ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి:మంత్రి జూపల్లి
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంసృ్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ నిఖిల, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో లక్ష చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని 100 శాతం సబ్సిడీతో అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లల పంపిణీ ప్రారంభమైందని మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు తెలిపారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు. మత్స్యకారులు అలవి వలలను ఉపయోగించరాదని మంత్రి హెచ్చరించారు. అలవి వలలతో చిన్న చేప పిల్లలు పడిపోవడం వలన మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలుగుతోందని, అటువంటి చర్యలకు కఠిన శిక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. చేప పిల్లల సైజు బాగుండేలా, నాణ్యమైన చేప పిల్లలనే మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Kammarpally రూల్స్ తప్పితే కఠిన చర్యలే…
Kammarpally రూల్స్ తప్పితే కఠిన చర్యలే… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
తల్లిదండ్రులు మందలించడంతో కుమారుడి ఆత్మహత్య
తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడు పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ల కుమారుడు విశ్వతేజ (17) కావడంతో పెద్దపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ల కుమారుడైన విశ్వతేజ కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి హాస్టల్కు వెళ్లనని తల్లిదండ్రులతో గొడవ పడడంతో వారు మందలించారు. దీంతో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో విశ్వతేజ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి శివారులోని వ్యవసాయ బావి(ఈత బావి) సమీపంలో అతడి చెప్పులు, సెల్ఫోన్ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటలకుపైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం వ్యవసాయ బావిలో విశ్వతేజ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మృతితో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ దంపతుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ప్రజాప్రతినిధులు, బంధువులు కూడా ఘటనాస్థలానికి చేరుకొని శోకార్తులైన కుటుంబాన్ని ఓదార్చారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సతీమణి పావని మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూపసురేందర్ల నివాసానికి వెళ్లారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సతీమణి పావని మృతుడు విశ్వతేజ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అఎమ్మెల్యే సతీమణి పావని వెంట పరామర్శించిన వారిలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Burgampadu : తల్లి బిడ్డ క్షేమం..
Burgampadu : తల్లి బిడ్డ క్షేమం.. బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం
Indian Medicines |చైనాలో భారతీయ ఫార్మా కంపెనీలకు మనుగడ!
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భారతీయ ఫార్మా కంపెనీలకు చైనాలో మనుగడ సాధించేందుకు
మూడు రోజుల ముందే అజ్ఞాతంలోకి ఉమర్
ఢిల్లీలో ఆత్మాహుతి బాంబు దాడికి మూడు రోజుల ముందు అనుమానితుడు, డాక్టర్ ఉమర్ నబీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు కూడా అందకుండా తన ఫోన్ను స్విచ్చాఫ్ చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్లో డాక్టర్లు అదిల్, ముజమ్మిల్ల అరెస్ట్, 2900 కేజీల పేలుడు పదార్థాల స్వాధీనం తర్వాత జరిగిన విచారణ క్రమంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. జమ్మూ కశ్మీర్లోని ఉమర్ నబీ సొంతూరు కోయల్కు పోలీసులు వెళ్లే వరకు అతడు ఢిల్లీ పేలుళ్లలో ప్రధాన పాత్రధారి అని కుటుంబీకులతో సహా గ్రామస్థులు ఎవరికీ తెలియదు. కోయల్ గ్రామంలోని ఉమర్ నివాసంలో పోలసులు తనిఖీలు నిర్వహించి ఆయన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉమర్ అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉమర్ సన్నిహితుడైన వైద్యుడు డాక్టర్ సజాద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉమర్కు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరీక్షలున్నాయి.. ఫోన్ చేయవద్దన్నాడు ఉమర్ నబీ కుటుంబ సభ్యురాలైన ముజామిల్ మాట్లాడుతూ.. పోలీసుల రాకతో తామంతా షాక్లో ఉన్నామన్నారు. ఢిల్లీ ఘటన వెనక మా ఉమర్ ఉన్నాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ఫరీబాద్లోని ఓ కాలేజీలో ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నాడని, శుక్రవారంనాడు ఫోన్ చేసి తనకు పరీక్షలు ఉన్నాయని, మూడు రోజులు బిజీగా ఉంటానని, తనకు అప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయవద్దని సూచించాడని వివరించారు. పరీక్షలు ముగిశాక మూడు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పాడని తెలిపారు. ఉమర్కు పెద్దగా స్నేహితులు కూడా లేరని, ఎవరితోనూ అంతగా కలుపుగోలుగా ఉండేవాడు కాదని చెప్పారు. ఎంతో కష్టపడి అతడ్ని చదివించామని, ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటాడని ఆశించామని ఆవేదనగా ముజామిల్ వివరించింది. రెండు మాసాల క్రితం ఉమర్ కశ్మీర్కు వచ్చి వెళ్లాడని, ఆ తర్వాత మళ్లీ రాలేదని ఆమె తెలిపింది.
Kaantha, Dark Side Of Great People: Rana
Dulquer Salmaan and Rana Daggubati will be seen sharing the screen in the upcoming film Kaantha, which releases in cinemas on the 14th of this month. Rana Daggubati clarifies that Kaantha is not a biopic but a completely fictional story. “Nowadays, if anything happens in a studio, it spreads instantly. But many such stories occurred […] The post Kaantha, Dark Side Of Great People: Rana appeared first on Telugu360 .
Dandepalli 311 పశువులకు టీకాలు…
Dandepalli 311 పశువులకు టీకాలు… దండేపల్లి, ఆంధ్రప్రభ : పశువులకు తప్పనిసరిగా గాలికుంటు
FDFS From Andhra King Taluka: Mass Song Of The Year
The First Day First Show celebration is no less grand than the festivities of fans for any major star. The makers of Andhra King Taluka, which features Ram Pothineni as a die-hard movie buff with cinema as its backdrop, are leaving no stone unturned. The first three songs from the film, directed by Mahesh Babu […] The post FDFS From Andhra King Taluka: Mass Song Of The Year appeared first on Telugu360 .
మహిళా డాక్టర్ షహీన్కు పెళ్లి.. విడాకులు
ఫరీదాబాద్లో వెలుగుచూసిన అంతర్రాష్ట టెర్రర్ మాడ్యూల్లో అదుపులోకి తీసుకున్న మొత్తం ఎనిమిది మందిలో నలుగురు వైద్యులు ఉన్నారు. వారిలో ఒకరు మహిళా డాక్టర్. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆమెను డాక్టర్ షహీన్ సయీద్గా గుర్తించారు. ప్రస్తుతం షహీన్ పోలీసులు అదుపులో ఉంది. పేలుళ్ల కేసులో ఆమె కూడా అనుమానితురాలిగా ఉంది. మహారాష్ట్రకు చెందిన జఫర్ హయత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. స్వల్ప కాలంలోనే అంటే 2015లో అతనితో విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని జఫర్ వెల్లడించారు. విడిపోయిన తర్వాత షహీన్ ఫరీదాబాద్లో ఒంటరిగా ఉంటున్నట్లు, అక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే మరిన్ని వ్యక్తిగత వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆమె వివాహం, విడాకుల విషయాన్ని లక్నోలోని షహీన్ తండ్రి కూడా ధ్రువీకరించారు.
249 కిలోల గంజాయిని పట్టుకున్న డిఆర్ఐ అధికారులు
విజయవాడ కానూరు వద్ద 249 కిలోల గంజాయిని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీమ్తో కలిసి చేసిన ఆపరేషన్లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి యూపికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఒడిశా నుంచి ఎపికి వాహనంలో నిందితులు గంజాయిని విజయవాడకు తరలించారు. కానూరులో నిల్వ చేసి.. యుపి వాహనంలో ఎక్కిస్తుండగా.. డిఆర్ఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కీలక నిందితుడు సహా ఐదుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.49.76 లక్షలు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు.
Nellikudu : ఒకే నెంబర్ ఇద్దరికి రిజిస్ట్రేషన్..
Nellikudu : ఒకే నెంబర్ ఇద్దరికి రిజిస్ట్రేషన్.. నెల్లికుదురు, ఆంధ్రప్రభ : మండల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (US- India Strategic Partnership Forum) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సిఎం భేటీ అయి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, డిసిసిల నియామకం విషయంలో ఏఐసిసి నేతలతో భేటీ అయి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు సానుకూలత ఉండడంతో సిఎం రేవంత్రెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Nagar Kurnool : నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలే…
Nagar Kurnool : నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలే…
Khammam : మంత్రి ఖమ్మం జిల్లా పర్యటన…
Khammam : మంత్రి ఖమ్మం జిల్లా పర్యటన… మోతె, ఆంధ్రప్రభ : రాష్ట్ర
Manthani : యువత క్రీడల్లో రాణించాలి…
Manthani : యువత క్రీడల్లో రాణించాలి… మంథని, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే
చంచల్గూడ జైల్లో రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ
హైదరాబాద్: చంచల్గూడ జైల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. రౌడీ షీటర్ల జాబ్రిపై మరో రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘర్షణలో ములాఖత్ రూమ్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. జాబ్రి, దస్తగిరిల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే జైల్లో దాడి చేసుకున్నట్లు సమాచారం. రౌడీ షీటర్ జాబ్రి ఓ కేసులో రిమాండ్ ఖైధీగా ఉన్నాడు. అయితే, ఈ ఘటనను జైలు అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
Motkur : ఆర్థిక సాయం అందజేత…
Motkur : ఆర్థిక సాయం అందజేత… మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు(Motkur) మండలం
6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు.. హైదరాబాద్ లో హై అలర్ట్
దేశంలో 6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీతోపాటు, ముంబై, హైదరాబాద్, చెన్నై, త్రివేండ్రం, గోవా విమానాశ్రయాలను బాంబులతో పేల్చేస్తామని మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగో ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు కూడా మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం.. ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసింది. ఆరు ఎయిర్ పోర్టుల్లో బాంబు స్క్వాడ్ తో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాప్ ల వంటి రద్దీ ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
Motkur : నేటికీ పూర్తి కాని మరమ్మతులు…
Motkur : నేటికీ పూర్తి కాని మరమ్మతులు… మోత్కూరు, ఆంధ్రప్రభ : మున్సిపల్
Karimabad : వెంటనే విధుల్లోకి తీసుకోవాలి…
Karimabad : వెంటనే విధుల్లోకి తీసుకోవాలి… కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రామీణ తపాలా
హైదరాబాద్లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ (CCRT), భారత ప్రభుత్వ
ఢిల్లీ పేలుడు ఘటన.. బాధితులను పరామర్శించిన ప్రధాని
దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిని వారిని ప్రధాని మోడీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకొని బుధవారం తిరిగొచ్చిన ప్రధాని మోడీ.. నేరుగా ఎల్ఎన్ జెపి ఆసుపత్రికి వెళ్లి బాధితులకు కలిశారు. ఈ సందర్భంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి అధికారులు, వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనపై మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ కమిటీ పాల్గొననుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో పేలుడు ఘటనలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Dandepally : అదివాసీల ర్యాలీ….
Dandepally : అదివాసీల ర్యాలీ…. దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి(Dandepally)

18 C