SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

ఇజ్రాయిల్‌ను శిక్షించాలి

ద్వంద్వ ప్రమాణాలు తిరస్కరించాలిప్రపంచానికి ఖతార్‌ ప్రధాని పిలుపు దోహా: ద్వంద్వ ప్రమాణాలు తిరస్కరించాలని, ఇజ్రాయిల్‌ను శిక్షించాలని ఖాతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ బిన్‌ జస్సిమ్‌ అల్‌ థాని పిలుపునిచ్చారు. ఖతార్‌ రాజధాని దోహాలో హమాస్‌ సభ్యులపై ఇజ్రాయిల్‌ దాడిని ఖండిరచారు. ఇదే అంశమై సోమవారం అరబ్‌, ఇస్లామిక్‌ నాయకుల ఐక్యతను ప్రతిబింబించేలా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఖతార్‌ ప్రధాని మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ జవాబుదారీ తనాన్ని డిమాండ్‌ చేశారు. ద్వంద్వ ప్రమాణాలు తిరస్కరించేందుకు, అన్ని […] The post ఇజ్రాయిల్‌ను శిక్షించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 11:29 pm

ఇమిగ్రేషన్ దుష్ఫలితం.. భారతీయుడి హత్యపై ట్రంప్ స్పందన

హుస్టన్: అమెరికాలోని డల్లాస్‌లో మోటెల్ మేనెజర్ అయిన ఓ భారతీయ సంతతి వ్యక్తి దారుణ హత్యను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది గర్హనీయం అన్నారు. దేశంలో అక్రమ రీతిలో ఉన్న ఇమిగ్రేషన్ విధానంతోనే ఇటువంటి దురాగతాలు జరుగుతున్నాయని విమర్శించారు. అక్రమ విదేశీయుడు, ఇంతకు ముందు నేరచర్యల రికార్డు ఉన్న క్యూబా వలసదారు చేతిలోనే అత్యంత క్రూరంగా ఈ భారతీయ సంతతి వ్యక్తి హతుడు కావడం బాధాకరం అన్నారు. కర్నాటకు చెందిన 50 సంవత్సరాల చంద్రమౌళి బాబ్ […]

మన తెలంగాణ 15 Sep 2025 11:18 pm

కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి

తిరువనంతపురం ః కేరళలో మనిషి మెదడు కణాలను తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవి అమీబా విరుచుకుపడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమీబా బాధిత కేసులు 67 వరకూ అధికారికంగా వెలుగులోకి వచ్చాయి, ఈ ఏడాది ఇప్పటికే 18 మంది వరకూ ఈ సూక్ష్మజీవుల కాటుతో మృతి చెందారు. సవరించిన లెక్కలను ఇప్పుడు సోమవారం అధికారికంగా మీడియాకు వెలువరించారు. సంబంధిత కేసులు పెరిగిపోతూ ఉండటంతో పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి స్పందించారు. అత్యవసర రీతిలో మంచినీటి […]

మన తెలంగాణ 15 Sep 2025 11:09 pm

అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్‌ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయబోతోంది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్‌లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ […]

మన తెలంగాణ 15 Sep 2025 10:54 pm

వంతరాపై సుప్రీం కోర్టు క్లీన్‌చిట్

న్యూఢిల్లీ : గుజరాత్ లోని జామ్‌నగర్‌లో జులాజికల్ రిస్కు, రీహేబిలిటేషన్ (వన్యమృగ ప్రమాద నివారణ, పునరావాస ) కేంద్రం వంతరాపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్ ఇచ్చినట్టు సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. ఈ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం విచారించింది. వంతరాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై […]

మన తెలంగాణ 15 Sep 2025 10:26 pm

కోటి రూపాయల రివార్డున్న మావో కమాండర్ మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో కోటి రూపాయల రివార్డు ఉన్న సహదేవ్ సోరెన్ అనే మావోయిస్టు సహా మొత్తం ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోర్‌హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సహదేశ్ అలియాస్ ప్రవేశ్ నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఆయనపై కోటి రూపాయల […]

మన తెలంగాణ 15 Sep 2025 10:08 pm

ముగిసిన హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025

హెల్త్ ఆర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌డబ్ల్యుఈ సెర్చ్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ -2025 సోమవారం ముగిసింది. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్‌లో 13 దేశాల నుండి 2,800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 62 మంది ప్రముఖులు, 42 అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆరోగ్యరంగంలో వాస్తవ ప్రపంచ సాక్ష్యాలు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ హెల్త్, ఇన్నోవేషన్ పై చర్చలు జరిపారు. ఈ సమ్మిట్‌ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ […]

మన తెలంగాణ 15 Sep 2025 10:00 pm

ఐసిసిప్లేయర్ ఆఫ్‌ది మంత్‌గా సిరాజ్

దుబాయి: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన సిరాజ్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతని ప్రతిభకు గుర్తింపుగా ఆగస్టు నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. […]

మన తెలంగాణ 15 Sep 2025 9:57 pm

వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతించిన కెటిఆర్

వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై బిఆర్‌ఎస్ మొదటి నుంచి తన ఆందోళనలను గట్టిగా వినిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ప్రగతిశీలత ముసుగులో దేశంలో విభజన రాజకీయాలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తోందని తాము ఎప్పుడూ చెబుతూనే ఉన్నామని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని సమస్యలపైన తాము పోరాడామని తెలిపారు. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు […]

మన తెలంగాణ 15 Sep 2025 9:45 pm

17వ మినీ హ్యాండ్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ గోడపత్రికను ఆవిష్కరించిన సిఎం

తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 29 వరకు నిజాం కళాశాలలో జరిగే 17వ హెచ్‌ఎఫ్‌ఐ మినీ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం ఆవిష్కరించారు. క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, రాష్ట్రంలోని యువత క్రీడల వైపు మరింత ఆసక్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను […]

మన తెలంగాణ 15 Sep 2025 9:30 pm

ఎవ్వరైనా కలవొచ్చు

ప్రతి క్షణం అందుబాటులో ఉంటా నేర రహిత జిల్లానే లక్ష్యం చట్లాన్ని ఉల్లంఘిస్తే

ప్రభ న్యూస్ 15 Sep 2025 9:22 pm

One more shock for UV Creations

UV Creations was once one of the top production houses of Telugu cinema. After delivering debacles, the production house failed to stay on the top. Saaho and Radhe Shyam left the production house in stress. Miss Shetty Mr Polishetty is the only profitable film for UV Creations in the recent years. They have invested big […] The post One more shock for UV Creations appeared first on Telugu360 .

తెలుగు 360 15 Sep 2025 9:14 pm

కొడంగల్‌లో అంగన్‌వాడీల మెరుపు ధర్నా

ప్రీప్రైమరీ వ్యవస్థతో అంగన్‌వాడీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని, ప్రీప్రైమరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు వికారాబాద్ జిల్లా, కొడంగల్‌లో కదం తొక్కారు. కొడంగల్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముందు భారీ ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు గుమికూడి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఒక దశలో పోలీసులపై […]

మన తెలంగాణ 15 Sep 2025 9:10 pm

దాయాదుల పోరులో కనిపించన జోష్.. చప్పగా సాగిన భారత్-పాక్ మ్యాచ్

దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ గ్రూప్‌ఎలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరిగిన సంగతి తెలిసిందే. దుబాయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చాలా సప్పగా సాగింది. దాయాదుల సమరం అంటే ఇరు దేశాల అభిమానుల్లో ఎనలేని జోష్ నెలకొంటోంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు రెండు దేశాల క్రికెట్ ప్రేమీలు ఎంతో ఆసక్తి చూపుతారు. వేదిక ఏదైనా చిరకాల ప్రత్యర్థుల సమరం చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగడం అనవాయితీ. కానీ […]

మన తెలంగాణ 15 Sep 2025 9:00 pm

OG and Kantara 2 waiting for Ticket Hikes

The government of Telangana has made it clear that there would be no ticket hikes and special premiere shows. However, the government of Andhra Pradesh has been granting hikes and special shows for all the films. OG and Kantara: Chapter 1 are the upcoming biggies that will release during the Dasara holiday season. OG will […] The post OG and Kantara 2 waiting for Ticket Hikes appeared first on Telugu360 .

తెలుగు 360 15 Sep 2025 8:46 pm

నేపాల్ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణం

ఖాట్మాండు: నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సోమవారం నియమితులైన ముగ్గురు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ ముగ్గురిని కొత్తగా నియమితులైన తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి(73) తన మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. కర్కి నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆమె కుల్మాన్ ఘీసింగ్, రామేశ్వర్ ఖనాల్, ఓం ప్రకాశ్ ఆర్యల్‌ను మంత్రులుగా చేర్చుకున్నారు. ఇదిలావుండగా ముగ్గురు నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఇక్కడి మహారాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగింది. ప్రమాణస్వీకారం […]

మన తెలంగాణ 15 Sep 2025 8:44 pm

20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంపు

కాలం చెల్లిన వాహనాలు (20 ఏళ్లు దాటిన) వాహనాల పునరుద్ధరణ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం కింద నూతన నియమాలను జారీ చేసింది. 20 సంవత్సరాలు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు భారీగా ఫీజులు విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో దివ్యాంగుల వాహన రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో రూ. 100లు ఉండగా, ప్రస్తుతం అదే ఫీజును కొనసాగించింది. […]

మన తెలంగాణ 15 Sep 2025 8:41 pm

ఆ ప్రాంతంలో నక్సలిజం అంతమైంది: అమిత్ షా

న్యూఢిల్లీ: ఉత్తర జార్ఖండ్‌లోని బోకారో ప్రాంతంలో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అన్నారు. సోమవారం ఉదయం జార్ఖండ్‌కు చెందిన హజారీబాగ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోవడంతో నక్సలిజం ఈ ప్రాంతంలో తుడిచిపెట్టుకపోయినట్లేనని పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేశ్, రఘునాథ్ హేంబ్రమ్ అలియాస్ చంచల్, బీర్‌సేన్ గంఝు అలియాస్ రామ్‌ఖేలవన్ హతయ్యారని, వారి మీద బూరి బహుమతి కూడా ఉందని పోలీసులు […]

మన తెలంగాణ 15 Sep 2025 8:40 pm

ఢిల్లీ ఎర్రకోటకు కాలుష్య నష్టం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో ప్రసిద్ధ ఎర్రకోటకు వేగంగా నష్టం కలుగుతోందని ఇటీవలి అధ్యయనం కనుగొంది. 17వ శతాబ్దపు స్మారక చిహ్నం ఎర్ర ఇసుకరాయి గోడలపై నల్లటి కాలుష్య కారకాలు ఏర్పడుతున్నాయని, ఇది దాని నిర్మాణ, సౌందర్య సమగ్రతను దెబ్బతీసేదిగా ఉందని ఇండోఇటాలియన్ నూతన అధ్యయనం పేర్కొంది. చారిత్రక స్మారకం అయిన ఎర్రకోటను 16391648 మధ్య కాలంలో మొగలు చక్రవర్తి షాజహాన్ కట్టించారు. నల్లటి కాలుష్య కారకాలలో జిప్సమ్, బాస్సనైట్, వెడ్డెలైట్, […]

మన తెలంగాణ 15 Sep 2025 8:34 pm

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోంది: హరీష్‌రావు

రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని, రైతులు తమ భూములు కోల్పోకుండా నిలదీస్తామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు.సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు సోమవారం హరీష్ రావును కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అలైన్‌మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు […]

మన తెలంగాణ 15 Sep 2025 8:31 pm

చట్ట విరుద్ధంగా ఉంటే.. ‘సర్’ను రద్దు చేస్తాం: సుప్రీం హెచ్చరిక

రాజ్యాంగబద్ధ సంస్థ నిబంధనలు పాటించిందనే భావిస్తున్నాం 7న తుది వాదనలు వింటాం, ఆ తర్వాత తీర్పు దేశ వ్యాప్తంగా నిలుపదల చేయలేం బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల […]

మన తెలంగాణ 15 Sep 2025 8:30 pm

ద్వారకాతిరుమలలో ఇంజనీర్లను సత్కరిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు

ఘనంగా ఇంజనీర్ల దినోత్సవం వేడుకలు విశాలాంధ్ర – ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్ల దినోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ద్వారకాతిరుమల ఎలక్ట్రికల్ ఏఈ ఘంటా సోమేశ్వరరావు, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ ఎన్. రాజేంద్ర ప్రసాద్, గృహనిర్మాణ శాఖ ఏఈ కె. వెంకటేశ్వరరావు, మైనర్ ఇరిగేషన్ ఏఈఈ సతీష్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు అందుగుల ప్రవీణ్ కుమార్, జి శిరీషను ఘనంగా సత్కరించారు. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు లైన్స్ క్లబ్ అధ్యక్షులు […] The post ద్వారకాతిరుమలలో ఇంజనీర్లను సత్కరిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 8:30 pm

దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. విదేశీ ఉద్యోగులను నియమించుకోండంటూ పోస్ట్

వాషింగ్టన్ : అమెరికా పరిశ్రమలలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యూఎస్‌లో పెట్టుబడుల గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అధ్యక్షుడు దెబ్బకు దిగొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అక్రమ వలసల విషయంలో కఠినవైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదార్లను నిర్బంధించినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. […]

మన తెలంగాణ 15 Sep 2025 8:25 pm

సినిమాల చిత్రీకరణ మరింత సులభతరం: దిల్ రాజు

రాష్ట్రంలో సినిమాల తయారీ ఇక సులభతరమని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు అన్నారు. సినిమాల చిత్రీకరణ, సినిమాల చిత్రీకరణలకు కావాల్సిన అన్ని అనుమతులు, సినిమా థియేటర్ ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులు అన్నీ సింగిల్ విండో ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ రూపొందిస్తోందని ఆయన వెల్లడించారు. సినిమా అనుమంతులపై రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్ సైట్ ’ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ‘ పై […]

మన తెలంగాణ 15 Sep 2025 8:22 pm

వక్ఫ్ చట్టం 2025లో ఓ ప్రొవిజన్ నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం 2025 లో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్ (సవరణ)చట్టం2025 పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత […]

మన తెలంగాణ 15 Sep 2025 8:17 pm

బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేశారని పేర్కొంటూ రూ. 10 కోట్లకు సిటిసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు 11వ తేదీన సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పడానికి బండి సంజయ్ నిరాకరించడంతో కెటిఆర్ సిటిసివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను […]

మన తెలంగాణ 15 Sep 2025 8:16 pm

ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వేస్టేషన్ల అభివృద్ధి: బండి సంజయ్‌

మంచిర్యాలలో రూ.26 కోట్లతో అమృత్ భారత్ పనులు రూ.3.50 కోట్లతో పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడి మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజీ ప్రారంభం మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ 20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైలు స్టాపేజీని రాష్ట్ర […]

మన తెలంగాణ 15 Sep 2025 8:13 pm

ఈనెల 17న ప్రజా పాలన దినోత్సవం

ఈనెల 17వ తేదీని ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జీ మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. సిఎం రేవంత్ రెడ్డి సైతం 17వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జెండా ఆవిష్కరించనుండగా మంత్రులు వివేక్ మెదక్ జిల్లాలో, కొండా సురేఖ, వరంగల్‌లో, […]

మన తెలంగాణ 15 Sep 2025 8:11 pm

కొడుకు పోషించడం లేదని పురుగుల మందు తాగిన వృద్ధుడు..

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: కన్న కొడుకు తమను పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన అధికారులు వెంటనే అతనిని కలెక్టర్ వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. వివరాల్లోకి వెళ్తే…జిల్లా లోని రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీర విఠల్, అతని భార్య వీరవ్వ సోమవారం సిరిసిల్లలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొనేందుకు వచ్చారు. ఏమైందో ఏమో.. తన […]

మన తెలంగాణ 15 Sep 2025 8:07 pm

అంధకారంలో 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు : కెటిఆర్

రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సిఎం చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల ఫీజుల కోసం లేని డబ్బులు, కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో […]

మన తెలంగాణ 15 Sep 2025 8:06 pm

ఆడిట్ జరపండి.. క‌ర్నూలు జేసీ డా.బీ.నవ్య

ఆడిట్ జరపండి.. క‌ర్నూలు జేసీ డా.బీ.నవ్య క‌ర్నూలు ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ : ప్రజల

ప్రభ న్యూస్ 15 Sep 2025 7:37 pm

ఇదొక అంతరాష్ట్ర దొంగల ముఠా

ఇదొక అంతరాష్ట్ర దొంగల ముఠా శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల‌, ఆంధ్రప్రభ : బ్యాంకుల్లో

ప్రభ న్యూస్ 15 Sep 2025 7:24 pm

రవితేజ వారసుడి నెక్ట్స్‌ మూవీ.. ఫస్ట్‌లుక్ అదుర్స్

టాలీవుడ్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా హీరోగా ఎదిగారు మాస్ మహారాజా రవితేజా. ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మాధవ్ భూపతిరాజు(Maadhav Bhupathiraju). మిస్టర్ ఈడియట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మాధవ్. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మారెమ్మ’. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈరోజు మాధవ్ పుట్టినరోజు కావడంతో గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్‌లో మాధవ్ (Maadhav […]

మన తెలంగాణ 15 Sep 2025 7:21 pm

ప్రియుడితో కలిసి..

ప్రియుడితో కలిసి.. మహబూబాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : మూడుముళ్ల బంధంతో ఒకటైన భార్యాభర్తలు(husband

ప్రభ న్యూస్ 15 Sep 2025 6:59 pm

‘ఒజి’ నుంచి మరో పాట.. ‘గన్‌ అండ్ రోజెస్’ అదిరిపోయిందిగా..

పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఒజి’. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గన్‌ అండ్ రోజెస్’ (Guns n Roses) అనే పాటను విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ పాట పవన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. యానిమేషన్‌లో ఉన్న ఫైటింగ్ సీక్వెన్స్‌లు […]

మన తెలంగాణ 15 Sep 2025 6:42 pm

కనీస ధర కోసం కదం తొక్కిన రైతులు

కనీస ధర కోసం కదం తొక్కిన రైతులు చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 15 Sep 2025 6:39 pm

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ రామకృష్ణ మృతి ?

పోలీసుల హింస వల్లే మరణించాడని బంధువుల ఆరోపణ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా విశాలాంధ్ర శింగనమల… మండల పరిధిలోని నాగలగుడ్డం తాండ గ్రామంలో ఆదివారం సాయంకాలం పేకాట ఆడుతున్నాడన్న నెపంతో రామకృష్ణ నాయక్ ని పట్టుకొని పోలీసులు కొట్టి హింసించారని రామకృష్ణా బంధువులు ఆరోపించారు. మరుసటి రోజు ఉదయాన్నే స్టేషన్ కు రమ్మని భయభ్రాంతులకు గురి చేశారన్నారు, పోలీసులు కొట్టిన దెబ్బలకు అస్వస్తత గురైన రామకృష్ణా సోమవారం శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు […] The post పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ రామకృష్ణ మృతి ? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 6:38 pm

Chandrababu : యూరియా వాడకంపై చంద్రబాబు ప్రకటన సాధ్యమేనా?

యూరియా వాడకం తగ్గించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు

తెలుగు పోస్ట్ 15 Sep 2025 6:18 pm

సింగనమలలో సంచలనం

సింగనమలలో సంచలనం సింగనమల, ఆంధ్రప్రభ : పేకాటను అడ్డుకునే పయ్నంలో… పోలీసుల(Police) కఠిన

ప్రభ న్యూస్ 15 Sep 2025 6:17 pm

సైబర్ నేరాలపై అవగాహన..

విశాలాంధ్ర….డి.హీరేహాళ్ మండల కేంద్రంలోని పలు పాఠశాలలో సురక్ష వెహికల్ ద్వారాసోమవారం సైబర్ నేరాలపై అవగాహన జిల్లా ఎస్పీ ఆదేశాలతో విద్యార్థుల్లో చైతన్యం జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS ఆదేశాల మేరకు… డి.హీరేహాళ్ మండల కేంద్రంలోని కె.జి.బి.వి, బిసి హాస్టల్ మరియు జడ్పీ ఉన్నత పాఠశాలలలో సైబర్ నేరాలు- అనర్థాలపై పోలీసులు అవగాహన చేపట్టారు. “సురక్ష” LED డిస్ప్లే బొలేరో వాహనాన్ని ఆయా గ్రామాలు మరియు పాఠశాలలకు తీసికెళ్లి నేరాలపై ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూయిస్తూ ప్రజలు/ […] The post సైబర్ నేరాలపై అవగాహన.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 6:09 pm

వన్ నేషన్ వన్ కార్డు పంపిణీ..

విశాలాంధ్ర… డీ హి రే హల్ ..మండలం కేంద్రమైన డి.హి రే హల్ గ్రామంలో వన్ నేషన్ వ న్ కార్డ్ (రేషన్ కార్డ్) టిడిపి మండల నాయకులు ఇంటింటికి వెళ్లి కార్డులో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆర్యవైశ్య స్టేట్ డైరెక్టర్ నాగల్లి రాజు మండల కన్వీనర్ కాదలూరు మోహన్ రెడ్డి శ్రీరాములు తాసిల్దార్ శ్రీనివాసులు మా కాశి వెంకటేష్ బెలగల్ బసవరాజ్ బెంచి బసప్ప డిష్ దేవ […] The post వన్ నేషన్ వన్ కార్డు పంపిణీ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 6:04 pm

Telangana : బెదిరింపులకు దిగుతున్న కార్పొరేట్ సంస్థలు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికేనా?

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వైద్య, విద్య విషయాల్లో ప్రయివేటు సంస్థలు షాక్ ఇస్తున్నాయి. బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాయి

తెలుగు పోస్ట్ 15 Sep 2025 5:58 pm

ట్రక్కును ఢీకొన్న స్కార్పియో వాహనం

ముగ్గురికి తీవ్ర గాయాలు… విశాలాంధ్ర, గోరంట్ల,.. శ్రీ సత్యసాయి జిల్లా. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిలోని గోరంట్ల మండలంలోని పాలసముద్రం క్రాస్ సమీపంలో ఆదివారం ఉదయం ట్రక్కును స్కార్పియో వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది, సీఐ బోయ శేఖర్ తెలిపిన వివరాల మేరకు…బెంగళూరు నుంచి అనంతపురం వెళుతున్న స్కార్పియో వాహనం ఎదురుగా వెళుతున్న ట్రక్కు వాహనమును దాటబోయి ట్రక్కు వెనుక భాగంలో ఢీ కొనడంతో విజయ కుమారి తో పాటు […] The post ట్రక్కును ఢీకొన్న స్కార్పియో వాహనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 5:57 pm

యుఎఇతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఒమాన్

అబుదాబి: ఆసియా కప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా యుఎఇతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒమాన్ (OMAN) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఈ రెండు జట్లు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లను కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఒమాన్ బ్యాటింగ్‌కి ఆహ్వానించడంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన యుఎఇ వికెట్ కాపాడుకుంటూ […]

మన తెలంగాణ 15 Sep 2025 5:53 pm

భూములిస్తే ఉద్యోగం ఇస్తామని పంగనామం..

విశాలాంధ్ర పుట్టపర్తి:- భూములు ఇస్తే భూమి ఇచ్చిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి లెదర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పంగనామం పెట్టిందని రైతులు వాపోయారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ఈమెరకు మహిళల ఇన్చార్జి డిఆర్ఓ కు ఫిర్యాదు చేశారు.శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం రాళ్ల అనంతపురం వద్ద సర్వే నంబర్లు 28,29,32,33 లో 23.89 ఎకరాల భూమిని లెదర్ ఫ్యాక్టరీ కోసం కేటాయించారన్నారు .భూములు ఇచ్చే క్రమంలో భూములు ఇచ్చిన ప్రతి కుటుంబంలోనూ […] The post భూములిస్తే ఉద్యోగం ఇస్తామని పంగనామం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 5:48 pm

Karan Johar moves to Delhi High Court

Aishwarya Rai Bachchan has recently received legal protection for her personal rights from the Delhi High Court. According to this decision, any unauthorized commercial use of her name, likeness, voice, or other characteristics would breach her right to live with respect. The court mentioned, “The balance of convenience favors the plaintiff, and if an injunction […] The post Karan Johar moves to Delhi High Court appeared first on Telugu360 .

తెలుగు 360 15 Sep 2025 5:46 pm

వైసిపి దుష్ప్రచారం మానుకోవాలి..ఎమ్మెల్యే కందికుంట

విశాలాంధ్ర,కదిరి…అభివృద్ధి సంక్షేమంపై వైసిపి దుష్ప్రచారం మానుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా లో నియోజకవర్గం లోని 33మందికి రూ. 29,82,196 సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణి చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి, ప్రజాసంక్షేపం పరుగులు పెడుతుందన్నారు. దీన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక అడ్డగోలు […] The post వైసిపి దుష్ప్రచారం మానుకోవాలి..ఎమ్మెల్యే కందికుంట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 5:42 pm

Hyderabad : హైదరాబాద్ మెట్రో రైలును వదిలించుకునేందుకు సిద్ధమైన ఎల్ అండ్ టి

హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తన వాటాను విక్రయించేందుకు ఎల్ అండ్ టి సంస్థ సిద్ధమని ప్రకటించడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.

తెలుగు పోస్ట్ 15 Sep 2025 5:36 pm

ఘనంగా జరిగిన రోటరీ క్లబ్ 508 వ ఇంజనీర్స్ డే వేడుకలు

అధ్యక్షులు నాగభూషణంవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని జి.ఎస్.పి ఫంక్షన్ హాల్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 58వ ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్లో ఇంజనీరుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి రోటరీ క్లబ్లో, ఇన్నర్ వీల్ క్లబ్బులో కొన్ని సంవత్సరాలుగా ఎనలేని సేవలు నిర్వహించినందున, వారిని రోటీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తనవంతుగా రోటరీ క్లబ్ కు గత కొన్ని సంవత్సరాలుగా సేవలు కొనసాగిస్తున్నానని, భవిష్యత్తులో […] The post ఘనంగా జరిగిన రోటరీ క్లబ్ 508 వ ఇంజనీర్స్ డే వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 5:35 pm

పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకా

–జిల్లా పశుసంవర్తక శాఖ సంయుక్త అధికారి డాక్టర్ టీవీ సుధాకర్ విశాలాంధ్ర-రాప్తాడు : పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణకు టీకా కార్యక్రమం చేపట్టామనిజిల్లా పశుసంవర్తక శాఖ సంయుక్త అధికారి డాక్టర్ టీవీ సుధాకర్ తెలిపారు. జాతీయ పశువ్యాధి నివారణ పథకం కింద అక్టోబర్ 15 వరకు ఏడవ రౌండ్, గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం రాప్తాడు, బండమీదపల్లి, ఎం చెర్లోపల్లి గ్రామాల్లో ప్రారంభించగా, రాప్తాడు గ్రామంలో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి డివిజనల్ అధికారి […] The post పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 5:31 pm

‘మిరాయ్’కి ఆర్‌జివి రివ్యూ.. ఏమన్నారంటే..

తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ గ్రాండ్ సక్సెస్‌ను సాధించింది. భారీ రాకలెక్షన్లు రాబడుతూ.. బాక్పాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ విశ్లేషకులు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. ‘‘విఎఫ్ఎక్స్ ఇంత గ్రాండ్‌ చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. 400 కోట్లకు పైగా చిత్రాల్లో […]

మన తెలంగాణ 15 Sep 2025 5:27 pm

మూడు నెల‌లు ముప్పు తిప్పలు పెట్టి…

మహబూబ్‌నగర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మహబూబ్‌నగర్‌ (Mahbubnagar) జిల్లా కేంద్రంలో మూడు నెలలుగా ముప్పు

ప్రభ న్యూస్ 15 Sep 2025 5:20 pm

Maadhav looks dynamic from Maremma glimpse

Mass Maharaja Ravi Teja’s nephew Maadhav, son of actor Raghu, is debuting with a rural actioner Maaremma. The makers have released a terrific glimpse, on the occasion of Maadhav’s birthday. The young actor’s screen presence and his looks perfectly match for an on-screen big star. In the glimpse, we see him walking out on to […] The post Maadhav looks dynamic from Maremma glimpse appeared first on Telugu360 .

తెలుగు 360 15 Sep 2025 5:19 pm

Epic Visual fantasy Jatadhara release date is locked

Mythology and traditional values in Indian Cinema have been represented with great value. In the recent times, the trends have been evident in bringing such powerful tales of divine power vs evil darkness to the big screens across Indian Cinema. Promising a never-seen-before epic experience, Jatadhara is gearing up for delivering another mesmerising tale. Sudheer […] The post Epic Visual fantasy Jatadhara release date is locked appeared first on Telugu360 .

తెలుగు 360 15 Sep 2025 5:17 pm

Telangana : బోనులో చిక్కిన చిరుతపులి

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భయపెట్టిన చిరుతపులి చివరకు చిక్కింది.

తెలుగు పోస్ట్ 15 Sep 2025 5:14 pm

మరో 10 మందికి గాయాలు

మరో 10 మందికి గాయాలు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలులోని కవాడి(Kavadi)

ప్రభ న్యూస్ 15 Sep 2025 4:59 pm

ఇంచార్జ్ వద్దు శాశ్వత తహసిల్దారును ఏర్పాటు చేయండి..సిపిఐ డిమాండ్

విశాలాంధ్ర – చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో ఇంచార్జ్ తహసిల్దార్ వద్దు శాశ్వత తహసిల్దార్ ను ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఐ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరెడ్డి డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసిల్దార్ జగన్నాథ్ కు వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంచార్జ్ తహసిల్దార్ సకాలంలో ఉండకపోవడంతో రైతులకు వన్ బీలు, అడంగల్లు, ఇన్ కంసర్టిఫికెట్లు, […] The post ఇంచార్జ్ వద్దు శాశ్వత తహసిల్దారును ఏర్పాటు చేయండి..సిపిఐ డిమాండ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 4:55 pm

రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం: హరీశ్

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ కోసం అలైన్ మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. అలైన్ మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమని, కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి సొంత భూములకు మేలు కలిగేలా అలైన్ మెంట్ మార్చడం […]

మన తెలంగాణ 15 Sep 2025 4:54 pm

హైదరాబాద్ వాసులకు దసరా కానుక.. ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించనున్న సీఎం రేవంత్

సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రారంభంహైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న వారికి రేవంత్ సర్కార్ దసరా కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నగర వాసులు చాలా రోజులుగా ఎదురు చూస్తోన్న రూ.5కే టిఫిన్ అందించే ఇందిరమ్మ క్యాంటీన్లను దసరా పండుగ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లు రోజువారి కూలీలు, నిరుద్యోగులు, విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఈ పథకం ప్రారంభం కోసం నగర వాసులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 15 నాడే వీటిని ప్రారంభిస్తారని […] The post హైదరాబాద్ వాసులకు దసరా కానుక.. ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించనున్న సీఎం రేవంత్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 4:43 pm

రూ. ఏడు కోట్లు మంజూరు

రూ. ఏడు కోట్లు మంజూరు యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ : భువనగిరి నుంచి

ప్రభ న్యూస్ 15 Sep 2025 4:38 pm

జగిత్యాలలో వ్యక్తి …

జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల రూరల్ (Jagtial Rural) మండలం పొలాస- గుల్లపేట

ప్రభ న్యూస్ 15 Sep 2025 4:37 pm

Aarogyasri scheme: No betterment even in Congress regime

The famed Aarogyasri scheme, introduced by late YS Rajashekara Reddy during Congress regime in 2000s, is facing troubles even after the party came back to power in Telangana. The private hospitals offering health care services for Aarogyasri patients warned of stopping services from September 16 midnight, demanding clearance of pending bills by Revanth Reddy Sarkar. […] The post Aarogyasri scheme: No betterment even in Congress regime appeared first on Telugu360 .

తెలుగు 360 15 Sep 2025 4:35 pm

ORRపై పల్టీలు కొట్టిన కారు.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి!

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడి ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ప్రమాదంలో ఇన్ఫోసిస్ టెకీ సౌమ్య రెడ్డి (25) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్‌పై వీరు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. కారులో సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతురాలు సౌమ్య రెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలగా పోలీసులు గుర్తించారు. The post ORRపై పల్టీలు కొట్టిన కారు.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 4:25 pm

10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : జగదీశ్ రెడ్డి

హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ నిర్ణయం చెప్పాలని తమకు 3 రోజులు గడువు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను తమకు తెలియజేశారని అన్నారు. శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై శాసనసభాపక్షం అభిప్రాయం అందించారు. 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో […]

మన తెలంగాణ 15 Sep 2025 4:23 pm

ఆర్మీ.. పోలీసు చేతిల్లో!

ఆర్మీ.. పోలీసు చేతిల్లో! మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశాన్నిరక్షించే ఆర్మీ, చట్టాన్నికాపాడే

ప్రభ న్యూస్ 15 Sep 2025 4:20 pm

నేటి నుంచి కాలేజీల బంద్‌కు పిలుపు.. సీఎం రేవంత్ రియాక్షన్..

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ నగదు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యం నేటి నుంచి బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సమావేశానంతరం ఈ అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా […] The post నేటి నుంచి కాలేజీల బంద్‌కు పిలుపు.. సీఎం రేవంత్ రియాక్షన్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 4:05 pm

Fact Check: Viral Video does not show Nepalese protestors supporting Indian PM Modi, it is from Sikkim

Protests against political corruption and the entrenched elites in Nepal, triggered by a recent social media ban led to

తెలుగు పోస్ట్ 15 Sep 2025 4:00 pm

కో-ఆప‌రేటివ్ బ్యాంక్ ప్రారంభం

కో-ఆప‌రేటివ్ బ్యాంక్ ప్రారంభం యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ : పోచంపల్లిలో కో-ఆపరేటివ్(Co-operative) అర్బన్

ప్రభ న్యూస్ 15 Sep 2025 3:55 pm

దయచేసి డబ్బులు పంపకండి.. ఫ్యాన్స్‌కి హీరో విజ్ఞప్తి

కన్నడ సూపర్‌స్టార్ హీరో ఉపేంద్రకు (Upendra) ఊహించని సమస్య ఎదురైంది. ఆయన ఫోన్ హ్యాకింగ్‌కి గురైంది. దీంతో తన ఫోన్‌ నుంచి కాల్స్‌ని ఎవరూ లిఫ్ట్ చేయవద్దని.. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆయన పేర్కొన్నారు. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన […]

మన తెలంగాణ 15 Sep 2025 3:55 pm

తెలంగాణలో మరోసారి నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు..

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో.. తెలంగాణలో మరోసారి ఆ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం నాడు హైదరాబాద్‌లో ప్రకటించింది. మంగళవారం.. అంటే సెప్టెంబర్ 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఆరోగ్య శ్రీ సేవల ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1400 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఈ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి సానుకూల ప్రకటన […] The post తెలంగాణలో మరోసారి నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Sep 2025 3:50 pm

ఫ్యాక్ట్ చెక్: చంద్రబాబుకు అవసరమైనప్పుడు తన కుమారుడు రాజా రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల అనలేదు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

తెలుగు పోస్ట్ 15 Sep 2025 3:26 pm

The Raja Saab: Rap song as Prabhas’ intro

Music director SS Thaman seems to be pulling all stops to deliver his best for Prabhas’ much awaited horror thriller The Raja Saab. As per reliable sources, Thaman has onboarded rapper-singer Hanumankind aka Sooraj Cherukat to give vocals for the introduction song of Prabhas in this film. It is learnt that Thaman and director Maruthi […] The post The Raja Saab: Rap song as Prabhas’ intro appeared first on Telugu360 .

తెలుగు 360 15 Sep 2025 3:13 pm

వర్షార్పణం.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మూడో టి-20 రద్దు.. సిరీస్ డ్రా

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్. సౌతాఫ్రికా (Eng VS SA) మధ్య మూడు టి-20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత జరిగి రెండో టి-20ల్ ఇంగ్లండ్, భారీ తేడతో నెగ్గింది. అయితే ఆదివారం నాటింగ్‌హామ్ వేదికగా సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టి-20 మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణం ఈ మ్యాచ్ రద్దైంది. దీంతో సిరీస్ 1-1గా సమంగా ముగిసింది. కనీసం టాస్‌ […]

మన తెలంగాణ 15 Sep 2025 2:59 pm

క్యాడ‌ర్‌కు కేటీఆర్ పిలుపు..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills Bypoll) త‌మ

ప్రభ న్యూస్ 15 Sep 2025 2:34 pm

ఆ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారు: కెటిఆర్

హైదరాబాద్: గత సిఎంలు తీసుకువచ్చిన మంచి పథకాలను మాజీ సిఎం కెసిఆర్ కొనసాగించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారటీ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ వెంగళరావు డివిజన్ బిఆర్ఎస్ శ్రేణులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో రూ. 20 వేల కోట్ల ఫీజు రీయింబెర్స్ మెంట్, 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 3 వేల […]

మన తెలంగాణ 15 Sep 2025 2:31 pm

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో టెన్షన్ టెన్షన్

స్టేషన్‌ ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ ఎంఎల్ఎ రాజయ్య పాదయాత్ర (Tatikonda rajaiah padayatra) కాంగ్రెస్‌ వర్సెస్ బిఆర్‌ఎస్‌గా మారింది. రాజయ్యహనుమకొండ నుంచి పాదయాత్రకు బయల్దేరారు. రాజయ్య వెంట దాస్యం వినయ్‌, నన్నపునేని నరేందర్ ఉన్నారు. రాఘవపురం దగ్గర ఎంఎల్ఎ కడియం శ్రీహరి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. Also Read: నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో) ఈ […]

మన తెలంగాణ 15 Sep 2025 2:27 pm

Ys Jagan : వైసీపీలో వంద మంది నేతలు దూరం... వారందికీ జగన్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే నేతలను దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి

తెలుగు పోస్ట్ 15 Sep 2025 2:21 pm

Ideal Runtime for Pawan Kalyan’s OG

Powerstar Pawan Kalyan is all set to take the box-office by storm with his next offering OG and the film is all set for a grand release on September 25th. The makers have locked the final edit and the post-production work reached the final stages. Pawan Kalyan also completed dubbing for his part recently and […] The post Ideal Runtime for Pawan Kalyan’s OG appeared first on Telugu360 .

తెలుగు 360 15 Sep 2025 2:18 pm

పాక్‌పై ఘన విజయం.. అభిషేక్ నయా రికార్డు

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma).. క్రీజ్‌లో ఉన్నంతసేపు పాక్ బౌలర్లను షేక్ ఆడించాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీం ఇండియా ఇన్నింగ్స్‌లో అభిషేక్ (Abhishek Sharma) తొలి బంతినే బౌండరీగా మలిచాడు. ఆ తర్వాతి బంతికి సిక్సర్‌ బాదాడు. ఇన్నింగ్స్‌లో […]

మన తెలంగాణ 15 Sep 2025 2:12 pm

శ్రీశైలం క‌బురు..

శ్రీశైలం క‌బురు..

ప్రభ న్యూస్ 15 Sep 2025 2:09 pm

క‌రీంన‌గ‌ర్‌లో ధ‌ర్నా

మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే గంగుల‌ ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పంటలు పొట్టకొచ్చిన

ప్రభ న్యూస్ 15 Sep 2025 2:05 pm

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన సూర్యాపేట, ఆంధ్రప్రభ : ఖమ్మం జర్నలిస్ట్ సాంబశివ

ప్రభ న్యూస్ 15 Sep 2025 1:40 pm