Andhra Pradesh : నేడు ఏసీబీ కోర్టులో లొంగిపోనున్న ఏపీ లిక్కర్ కేసు నిందితులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నేడు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలు లొంగిపోనున్నారు
Grain|కోనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..
Grain| ఘంటసాల, ఆంధ్రప్రభ : రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించుకోవాలని
Tributes|డా.బి.ఆర్.అంబేడ్కర్ కు ఘన నివాళులు
Tributes| ఘంటసాల, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘంటసాలపాలెంలోని చిన
స్మతి మంధాన తండ్రి ఆరోగ్యం పై కీలక అప్ డేట్
ఇండియన్ వుమెన్ టీం సభ్యురాలు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు తాజాగా అప్ డేట్ ఇచ్చారు
మహిళతో వివాహేతర సంబంధం... భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
వేరే మహిళతో వివాహేతర సంబంధం న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మన తెలంగాణ /సిద్దిపేట రూరల్: వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను పిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేసిన సంఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన బాల్ లక్ష్మి అనే మహిళ తన భర్త భూంరాజు ఇంటి ముందు పిల్లలతో కలిసి శనివారం నిరసనకు దిగింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను, తన పిల్లలను బాధింపజేసి చివరికి ఇంటి బయటకు నెట్టేశాడని ఆమె ఆరోపించింది. 2005లో పెద్దల సమక్షంలో భూంరాజుతో తన వివాహం జరిగింది. ప్రస్తుతం 18 ఏళ్ల కుమారుడు, 16 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా భూంరాజు తమ ఇంటి సమీపంలోని మరో మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తూ, తనపై తరచూ దాడులకు పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. పలుమార్లు పెద్దల సమక్షంలో జరిగిన సమావేశాల్లో భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ బాల్ లక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో భూంరాజుపై అధికారిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
హెచ్పీలో భారీ లేఆఫ్లు.. 6 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
ప్రముఖ టెక్ కంపెనీ హెచ్పీలో భారీ లేఆఫ్లు టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో మొదలైన ఈ ప్రక్రియ, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) వైపు మళ్లుతోంది. తాజాగా, ప్రపంచ ప్రఖ్యాత పీసీ, ప్రింటర్ల తయారీ సంస్థ హెచ్పీ (HP) కూడా భారీ లేఆఫ్లను ప్రకటించి టెక్ వర్గాల్లో కలకలం రేపింది. రాబోయే రెండు, మూడేళ్లలో సుమారు 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది.2028 ఆర్థిక […] The post హెచ్పీలో భారీ లేఆఫ్లు.. 6 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం appeared first on Visalaandhra .
The post Photos: NBK111 Movie Launch appeared first on Telugu360 .
Mandali Buddha Prasad |భూమి పూజ..
Mandali Buddha Prasad | భూమి పూజ.. Mandali Buddha Prasad, నాగాయలంక,
అసత్య కథనాలు ప్రసారం చేశారంటూ జగన్ మీడియాపై కేసుపొన్నూరు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడి ఫిర్యాదుతో చర్యలు గుంటూరు జిల్లా పొన్నూరులో జగన్ మీడియా యాజమాన్యం మరియు ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ పరువుకు భంగం కలిగేలా అసత్య కథనాలను ప్రచురించి, ప్రసారం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు పొన్నూరు అర్బన్ సీఐ ఎల్. వీరానాయక్ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.సీఐ వెల్లడించిన […] The post జగన్ మీడియాపై కేసు నమోదు appeared first on Visalaandhra .
రివాల్వర్ ను తాకట్టు పెట్టిన ఎస్ఐ?
హైదరాబాద్: అంబర్ పేట ఎస్ఐ భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ కనిపించడంలేదు. ఎస్ఐ భాను నిర్లక్ష్యంగా వ్యవహరించి తన సర్వీస్ రివాల్వర్ ను పోగొట్టుకున్నాడు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో డిఎస్ఐగా భాను విధులు నిర్వహించాడు. డిఎస్ఐ గా ఉన్న సమయంలో పలు కేసులకు సంబంధించి రికవరీ చేసిన దొంగ బంగారాన్ని కుదువ పెట్టినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బంగారంతో పాటు రివాల్వర్ ను సైతం డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతోనే ఎస్సై ఈ పని చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ లో భారీగా డబ్బు పోగొట్టుకొని తన సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ భాను ప్రకాష్ పై అంబర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ భాను కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. భాను ప్రకాష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.
AP |రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
AP | రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. AP, పెడన, ఆంధ్రప్రభ : పెడన
Smart move from Andhra King Taluka Team
Energetic Star Ram has been struggling for success. All his previous films have been mass entertainers and they failed to live up to the expectations because of the loud and senseless action. He changed path and did Andhra King Taluka which is releasing tomorrow. The film is carrying decent buzz and the result completely depends […] The post Smart move from Andhra King Taluka Team appeared first on Telugu360 .
Gira Gira From Champion: Pure With Earthy Vibes
Swapna Cinemas, along with Anandi Art Creations and Concept Films, is producing a period drama woven with sports, romance, and action—Champion. Starring Roshan and Anaswara Rajan, the film is directed by National Award–winner Pradeep Advaitham. Presented by Zee Studios, the project is gearing up for a Christmas release on December 25th. Following the excitement generated […] The post Gira Gira From Champion: Pure With Earthy Vibes appeared first on Telugu360 .
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా... 69/5
గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 36 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 69 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సౌతాఫ్రికా ప్రస్తుతం 480 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సిమన్ హర్మర్ దాటికి టీమిండియా బ్యాట్స్మెన్లు చెత్తులేత్తేశారు. కుల్దీప్ యాదవ్ 38 బంతుల్లో ఐదు పరుగులు చేసి హర్మర్ బౌలింగ్లో క్లీన్బౌల్డయ్యాడు. ధృవ్ జురెల్ రెండు పరుగులు చేసి హర్మర్ బౌలింగ్లో మర్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 13 పరుగులు చేసి హర్మర్ బౌలింగ్లో మర్క్రమ్ క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్(13), రవీంద్ర జడేజా(07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హర్మర్ నాలుగు వికెట్లు తీయగా మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీశాడు.
Cyclone Alert : తుపాను ప్రభావం.. ఈ జిల్లాల్లో అలెర్ట్ గా ఉండాల్సిందేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది
Current shock |బ్రహ్మోత్సవాల్లో అపశృతి..
Current shock | బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. Current shock, కొడిమ్యాల, ఆంధప్రభ :
Hyderabad : సంక్రాంతికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీ జేబులు లూటీ
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ బస్సులకు డిమాండ్ పెరిగింది. ఛార్జీలు భారీగా పెంచారు.
وائرل ویڈیو میں دوبئی میں دکھایا گیا اے آئی ہیئر کٹ پوڈ میں کوئی حقیقت نہیں۔جانچ پڑتال سے پتہ چلا کہ وائرل ویڈیو سورا نامی اے آئی ٹول سے بنایا گیا ہے
Former | అన్నదాతల ఆవేదన.. Former, ఊట్కూర్, ఆంధ్రప్రభ : చేతికొచ్చిన పంటలు,
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా మొబైల్ ఫోన్స్ ఇస్తామని ఎలాంటి ప్రకటన చేయలేదు
జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
టీ20 ప్రపంచకప్ ఫైనల్ వివాదం #T20WorldCup #ICC #AdityaThackeray #Ahmedabad #Cricket #Sports
Mumbai : ముంబయిలో 39 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
Amaravathi : క్వాంటం వ్యాలీ.. ఇక అమరావతికి కొత్త రూపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణం పై దృష్టి సారించింది
మంథనిలో బోర్డుతో పరుగెత్తిన గేదె కలకలం#Manthani #Peddapalli #Traffic #LocalUpdates #ViralVideo
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో ఐబొమ్మ రవి లైవ్ లో జడ్జికి వివరణ ఇస్తున్న నిజమైన వీడియో కాదు
వైరల్ అవుతున్న వీడియో ఐబొమ్మ రవి సంబంధించింది అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
Kavitha |జాగృతి సందోహం గులాబీ సంకటం..
Kavitha | జాగృతి సందోహం గులాబీ సంకటం.. Kavitha, హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్
బిసిలకు 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించారు: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొప్ప చెప్పారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి కెటిఆర్ ఎక్స్లో పోస్టు చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రూ.160 కోట్లు ఖర్చు చేశారని, పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు కేవలం 17 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని దుయ్యబట్టారు. బిసిలకు గతంలో 24 శాతం ఉండేదని, ఇప్పుడు 17 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. రిజర్వేషన్ల తగ్గింపు ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ స్పందిస్తారా? అని ప్రశ్నించారు.
ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
కాలువులోకి దూసుకెళ్లిన కారు: ఐదుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖింపుర్ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాఖేర్వా- గిరిజపురి జాతీయ రహదారిపై శార్థా కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడడంతో ఆస్పత్రి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సంతాపం తెలిపారు.
నేటి నుంచి కస్టడీకి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను నేటి నుంచి ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించనున్నారు
Yellamma: Dil Raju’s Big Announcement on Cards
Top Producer Dil Raju has a strong belief in Yellamma, a rooted Telangana based love story which also has a strong emotional drama. After the super success of Balagam, Venu Yeldandi worked on the script of Yellamma and narrated it to Dil Raju. The top producer is all excited about the project and he revealed […] The post Yellamma: Dil Raju’s Big Announcement on Cards appeared first on Telugu360 .
Gold Rates Today : బ్యాడ్ న్యూస్.. ఇక బంగారాన్ని సొంతం చేసుకోవడం కష్టమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
Railway | గేటు మూసివేత.. Railway, నరసరావుపేట, ఆంధ్రప్రభ : గుంటూరు (Guntur)
ఏపీ స్కూళ్లకు 9 రోజులు సంక్రాంతి సెలవులు! #Education #AndhraPradesh #Sankranthi #SchoolHolidays
Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి సూచనలివే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం... కారుతో ఢీకొట్టి హత్య
కుకునూరుపల్లి: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్లుడిని తమ్ముడితో కలిసి భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో షాహిద్(25) అనే యువకుడు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహ్మద్ ఖదీర్ అనే వ్యక్తి జూనయర్ లైన్మన్ పని చేస్తున్నాడు. ఖదీర్ భార్యతో షాహిద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఖదీర్కు తెలియడంతో పలుమార్లు షాహిద్ను హెచ్చరించాడు. అతడిలో మార్పు రాకపోవడంతో షాహిద్ను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 22న షాహిద్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చిన్న కిష్ణాపూర్ సమీపంలో ఖధీర్ను కారుతో ఢీకొట్టాడు. అనంతరం అతడిపై నుంచి పలుమార్లు కారు పోనిచ్చాడు. అతడు చనిపోయాడు అని నిర్థారించుకున్న తరువాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. షాహిద్ తీవ్ర గాయాలతో రోడ్డుపై కనిపించడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షాహిద్ మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఖదీర్ తమ్ముడు షబ్బీర్ తానే షాహిద్ను హత్య చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. ఇద్దరు సోదరులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
IBomma : నేడు రవి కస్టడీపై న్యాయస్థానంలో
ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్ వేశారు
NTR and Koratala have to Break Silence on Devara 2
For every two weeks, someone starts a debate on social media about Devara 2 and it continues for days. NTR fans divide themselves into groups and some of them oppose the sequel while some of them argue that the film will unleash the potential of Tarak. Koratala Siva has completed the script of Devara 2 […] The post NTR and Koratala have to Break Silence on Devara 2 appeared first on Telugu360 .
అద్భుతమైన భావోద్వేగం ఉన్న సినిమా
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్బస్టర్లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “-ఈ కథని ఒక ప్రేక్షకుడిగా విన్నాను. స్టొరీ చెప్పగానే ఫ్యాన్స్ కి కనెక్ట్ అయిపోయాను. ఇందులో చాలా అద్భుతమైన భావోద్వేగం ఉంది. అందరి జీవితంలో ఇలాంటి భావోద్వేగం వుంటుంది. అది నాకు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యింది. అసలు అభిమానుల ప్రేమకు లాజిక్ వుండదు. ఎందుకు ఇంతగా ప్రేమిస్తారు? దానికి మనం అర్హులమేనా? అనిపిపిస్తుంటుంది కదా. అందుకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో సూపర్ స్టార్ సూర్య క్యారెక్టర్... ఒక స్టార్ జీవితం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనిషి భావోద్వేగాలు, ప్రేమ, ధనవంతుడు, పేదవాడికి మధ్య ఉండే ఒక సంఘర్షణ నేపథ్యంలో అన్ని కమర్షియల్ యాంగిల్లో చేసిన సినిమా ఇది. అవన్నీ సినిమాకి అద్భుతంగా కలిసి వచ్చాయి. ఒక స్టార్ కి అభిమానికి మధ్య ఉండే ఎమోషన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యాన్స్కి ఏదైనా చెప్పాలని ఒక కోరిక ఉంటుంది. అది ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. -రామ్ అద్భుతమైన నటుడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన యాక్షన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆయన రియల్గా ఒక ఫ్యాన్ లాగా నటించారు. ఇందులో రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది. ఒక రెట్రో ఫీలింగ్ని కలిగించే ఆ లవ్ స్టోరీ మనసును తాకే విధంగా ఉంటుంది. డైరెక్టర్ మహేశ్ బాబు.పి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు” అని అన్నారు.
భద్రాద్రిలో భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టురట్టు
భద్రాద్రి కొత్తగూడెం: భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టురట్టు జరిగిన సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. భక్తులు స్వామివారికి సమర్పించే వస్త్రాల అమ్మకాల్లో గోలుమాల్ జరిగింది. వస్త్ర దుకాణాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలను భక్తులకు అమ్మవారి చీరలు అని చెప్పి కొందరు అమ్ముతున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్ రావు పట్టుకున్నారు. సాధారణంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను తిరిగి కొనుగోలు చేసే విధానం ఒకటి ఉంటుంది. ఈ వ్యవస్థను బ్రష్టు పట్టించడమే కాకుండా మార్కెట్లోని దుకాణాల నుంచి కొనుగోలు చేసి బట్టలను భక్తులకు అమ్మేందుకు కొందరు సిద్ధం చేయడంతో వారిని అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన వస్త్రాలను తనిఖీ చేయడంతో పాటు స్వాధీనం చేసుకున్నామని భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలచడం దారణమని ఇఒ మండిపడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.
Andhra king taluka |ఇది వేరే లెవెల్..
Andhra king taluka | ఇది వేరే లెవెల్.. Andhra king taluka,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు
Bigg Boss Telugu 9: BB Alumni Led Captaincy Games
The aftermath of yesterday’s explosive nomination episode continued to reverberate through the Bigg Boss house. Sharp remarks, physical aggression and emotional breakdowns left the atmosphere tense, and today’s episode dealt with the consequences. Even as former contestants visited the house to conduct fun but competitive captaincy tasks, the emotional rifts between housemates remained visible. Continued […] The post Bigg Boss Telugu 9: BB Alumni Led Captaincy Games appeared first on Telugu360 .
India Vs South Africa : ఇక అవతలకు బోయి ఆడుకోండి భయ్యా..ఓటమి అంచున భారత్
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి దిశగా పయనిస్తుంది
Ys Jagan : నేడు రెండో రోజు పులివెందులలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది
‘పూరిసేతుపతి’ చిత్రీకరణ పూర్తి
వర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘పూరిసేతుపతి’ షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్కి సంబంధించిన వీడియోను టీం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.
జనసేన పార్టీ కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన
అమరావతి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు కోరుతున్నారు. ఇప్పటికే 20సార్లు జనసేన కార్యాలయం వద్దకు వచ్చామని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎపిఐఐసికి తమ వ్యవసాయ భూములు ఇచ్చి నిరాశ్రయులుగా మారామన్నారు. ఇప్పటి వరకు పరిహారం అందలేదని వాపోయారు. 11వ తేదీన ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. 10 రోజుల్లో న్యాయం చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. 15 రోజులు అయినా న్యాయం చేయలేదని రైతులు మండిపడుతున్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ తమని ఇప్పటివరకు కలవడం లేదని వాపోయారు. పవన్ ను కలిసిన తరువాతే ఇక్కడి నుంచి వెళ్తామని జనసేన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
AP |పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు..
AP | పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు.. AP, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్
ఫిబ్రవరి 27 నుంచి టి20 వరల్డ్ కప్..
ముంబై: వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. వరల్డ్కప్లో పాల్గొంటున్న జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు ఒకే గ్రూప్లో ఉన్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 16న కొలంబో వేదికగా లీగ మ్యాచ్ జరుగనుంది. మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐసిసి చైర్మన్ జైషా, భారత మాజీ సారథి రోహిత్ శర్మ, ప్రస్తుత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మహిళా జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ తదితరులు వరల్డ్కప్ ట్రోఫీ షెడ్యూల్ను ప్రకటించారు. భారత్లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో వరల్డ్కప్ జరుగనుంది. వరల్డ్కప్లో పాకిస్థాన్ ఆడే అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఇక ఫైనల్ వేదికగా అహ్మదాబాద్ను ఎంపిక చేశారు. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్కు చేరుకుంటే తుది పోరును కొలంబోలో నిర్వహిస్తారు. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్లను ముంబై, కోల్కతా నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ సెమీస్కు చేరితే వేదికల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాగా, లీగ్ దశలో ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్8కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్8లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సెమీస్కు చేరుకుంటాయి. కాగా, భారత్లోని ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లో వరల్డ్కప్ మ్యాచ్లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న యూఎస్ఎ టీమ్తో ఆడుతుంది. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. తొలి రోజు పాకిస్థాన్, నెదర్లాండ్స్, భారత్, అమెరికా, వెస్టిండీస్బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్ఎలో భారత్, పాకిస్థాన్ వరల్డ్కప్లో పాల్గొనే జట్లను ఎ, బి,సి, డి గ్రూపులుగా విభజించారు. గ్రూప్ఎలో భారత్తో పాటు పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్సిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇటలీ, నెపాల్, వెస్టిండీస్, గ్రూప్డిలో అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యుఎఇ జట్లు ఉన్నాయి. కాగా, ఇటలీ తొలి సారి వరల్డ్కప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. ఐసిసి అంబాసిడర్గా రోహిత్ శర్మ టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఐసిసి నియమించింది. వరల్డ్కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొంటాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్కప్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి జరిగే విశ్వకప్ కోసం రోహిత్ను ఐసిసి తన అంబాసిడర్గా నియమించింది.
భారీ టార్గెట్.. ఓటమి దిశగా టీమిండియా
గౌహతి: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించిన సఫారీ టీమ్ ఆతిథ్య భారత జట్టు ముందు 549 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే బుధవారం చివరి రోజు భారత్ మరో 522 పరుగులు చేయాలి. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (6), యశస్వి జైస్వాల్ (13) ఇప్పటికే పెవిలియన్ చేరారు. జైస్వాల్ను జాన్సన్, రాహుల్ను సిమన్ హార్మర్ వెనక్కి పంపారు. కీలకమైన ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆట ముగిసే సమయానికి సాయి సుదర్శన్ (2), కుల్దీప్ యాదవ్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు 26/0 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికాను ట్రిస్టన్ స్టబ్స్, టోని డి జోర్జి ఆదుకున్నారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్టబ్స్ 180 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో 94 పరుగులు చేశాడు. జోర్జి (49), ముల్డర్ 35 (నాటౌట్), రికెల్టన్ (35), మార్క్రమ్ (29) పరుగులు సాధించారు. కాగా, సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేయగా భారత్ 201 పరుగులకే కుప్పకూలింది.
నేడు నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
మన తెలంగాణ/హైదరాబాద్ః జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన నవీన్ కుమార్ యాదవ్ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరవుతారు.
అమరావతి, ఆంధ్రప్రభ: శెనగ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మద్దతు ధరలకు కొనేందుకు
Naveen Yadav |ప్రమాణ స్వీకారం..
Naveen Yadav | ప్రమాణ స్వీకారం.. Naveen yadav, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్
ఉమ్మడిరంగారెడ్డి,ఆంధ్రప్రభబ్యూరో: ఏ కార్యక్రమం చేయాలన్నా మంచి ముహూర్తం ఉండాలి. ముహూర్తాలు లేకపోతే పెళ్లి,
Rains |ఒకేసారి 2 వాయుగుండాలు..
Rains | ఒకేసారి 2 వాయుగుండాలు.. Rains, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
మేడ్చల్, (ఆంధ్రప్రభ) : మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలి టీలో అక్రమ నిర్మాణదారులు
ఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం 19వ తేదీ …
` 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ ` రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సిఎం రేవంత్ ` రాత్రికి రాత్రే బిలియనీర్ కావాలన్న …
హైదరాబాద్ కార్పొరేటర్లకు శుభవార్త
` ప్రతి డివిజన్ కు రూ.2 కోట్ల అభివృద్ధి నిధులు ` జిహెచ్ఎంసి జనరల్ బాడీ తీర్మానం హైదరాబాద్(జనంసాక్షి):గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను …
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తుదిమెరుగులు
` విభాగాల వారీగా సీఎం సమావేశాలు హైదరాబాద్(జనంసాక్షి):డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ …
జీహెచ్ఎంసీ పరిధి మరింత విస్తరణ
` 27 మున్సిపాలిటీల విలీనం ` ఓఆర్ఆర్ లోపలా, బయట ఉన్నవి విలీనం ` కొత్తగా మరో విద్యుత్ డిస్కమ్ ఏర్పాటుకు నిర్ణయం ` ఎన్టీపీసీ ఆధ్వర్యంలో …
` తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ విడుదల ` మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ ` డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ` అమల్లోకి …
న్యాయం సత్వరం, సకాలంలో పొందడం పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ, భారతదేశంలో న్యాయస్థానం గడప తొక్కిన ఏ పౌరుడికైనా, కేసు చిన్నదా పెద్దదా అనే విషయంతో సంబంధం లేకుండా పరిష్కారానికి ఏళ్లూపూళ్లూ పడుతోందంటే అతిశయోక్తి కాదు. న్యాయం జరగడంలో ఆలస్యమైతే అది అన్యాయంతో సమానమన్న హితోక్తి ఆచరణలో అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసుల పరిష్కారం, మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడం తన ముందున్న రెండు ప్రధాన ప్రాధాన్యతలని జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు చేసిన ప్రకటన న్యాయ వ్యవస్థ ప్రక్షాళనకు సమయం ఆసన్నమైందని సూచిస్తోంది. వివాదాలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం గేమ్ ఛేంజర్ కావచ్చునన్న ఆయన అభిప్రాయం నూటికి నూరుపాళ్లూ వాస్తవం. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ కేసుల సంఖ్య జస్టిస్ సూర్యకాంత్ మాటల్లో చెప్పాలంటే 90 వేలకు పైమాటే. ఇక జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ప్రకారం దేశవ్యాప్తంగా కిందిస్థాయి కోర్టులలో 4.78 కోట్ల కేసులు, హైకోర్టులలో 63.80 లక్షల కేసులు పరిష్కారం కావలసి ఉంది. ఒక్క తెలంగాణ హైకోర్టులోనే దాదాపు 2.36 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. కేసులు ఇలా కొండల్లా పేరుకుపోవడానికి కారణం న్యాయమూర్తులు, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సవరణలకు నోచని చట్టాలు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశంలోని 25 హైకోర్టులలో ఉండాల్సిన 1122 మంది న్యాయమూర్తులకు గాను మొన్న జులై నాటికి 751 మందే ఉన్నారు. ఈ లెక్కన పెండింగ్ కేసులు పరిష్కారం కావాలంటే ఒక్కొక్క న్యాయమూర్తి 8,400కు పైగా కేసుల విచారణ జరపాల్సి ఉంటుంది. ఇక జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మొత్తం 25,741 న్యాయమూర్తుల పోస్టులకు 5262 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనాభాకు సరైన నిష్పత్తిలో న్యాయమూర్తులు లేకపోతే, ప్రజలలో న్యాయస్థానాలపై విశ్వసనీయత సన్నగిల్లుతున్న ఇంగితం పాలకుల్లో కొరవడిన కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కల్పనకు, ఇతరత్రా సౌకర్యాలకూ బడ్జెట్లో చాలినన్ని నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కేసుల సత్వర పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం కొత్త రకం విధానాలను అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. న్యాయమూర్తుల కొరతను అధిగమించేందుకు హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవాలన్న ఆలోచన ఈ కోవకు చెందినదే. 224ఎ రాజ్యాంగ అధికరణ ఇందుకు అనుమతినిస్తున్నా, ఈ తరహా నియామకాలు త్వరితగతిన జరగడం లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 89కి సవరణ జరపడం ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి బాట వేయడం, ప్రత్యేక లోక్ అదాలత్ల ఏర్పాటు వంటివి కూడా చెప్పుకోదగిన పరిణామాలే. కానీ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈ చర్యలు ఏ మాత్రం చాలవని చెప్పడంలో సందేహం అక్కరలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భారతీయ న్యాయస్థానాలు వెనకబడి ఉన్నాయి. చైనా, ఎస్టోనియా, జర్మనీ వంటి దేశాలు కృత్రిమ మేధ సహాయంతో చిటికెలో వందలాది కేసులను పరిష్కరిస్తున్నాయి. ఈ దేశాల్లో అమలవుతున్న న్యాయ నమూనాలను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలించి, కొందరు జిల్లా న్యాయమూర్తులను ఎంపిక చేసి సింగపూర్లో శిక్షణ ఇప్పించింది. ముంబయి, బెంగళూరు, ఢిల్లీల్లో ఎఐ టెక్నాలజీని వినియోగించి కేసుల పరిష్కారానికి ఓ పైలట్ ప్రాజెక్టునూ నిర్వహించారు. దీనివల్ల పెండింగ్ కేసులు 20 శాతం మేర తగ్గినట్లు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ అధ్యయనంలో తేలింది. అయినప్పటికీ ఈ విధానాలు అమలుకు నోచుకోకపోవడం మన దేశంలో పాలనాపరమైన అలసత్వానికి ఒక నిదర్శనం. ఈ నేపథ్యంలో న్యాయం పొందడమనేది ఒక సుదీర్ఘమైన, కాలాతీతమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా సగటు భారతీయుడు భావిస్తున్నాడంటే ఆశ్చర్యమేముంటుంది? వివాదం ఎంతటి తీవ్రమైనదైనా దేశంలో 40% మంది న్యాయస్థానాల గడప తొక్కకుండా, పెద్ద మనుషుల సాయంతోనో, ఇతరేతర విధానాల ద్వారానో పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపుతున్నారని ఆ మధ్య ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి ఇతోధికంగా కృషి చేస్తారని ఆశిద్దాం.
Supreme Court |కస్టడీ మరణాలు వ్యవస్థకే మచ్చ…
Supreme Court | కస్టడీ మరణాలు వ్యవస్థకే మచ్చ… న్యూఢిల్లీ: పోలీస్ కస్టడీలో
Avatar 3 |సెన్సేషన్ క్రియేట్ చేసేనా..?
Avatar 3 | సెన్సేషన్ క్రియేట్ చేసేనా..? Avatar 3, హైదరాబాద్, ఆంధ్రప్రభ
తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో : తినేవారికి తీపిని పంచే అరటిపండు పండించిన
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జిహెచ్ఎంసిలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. అందుకు అవసరమై న జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ ము న్సిపల్ యాక్ట్లకు సవరణలు చేసేందు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసిలోకి విలీనం చేయాలని జీహెచ్ఎంసి కౌన్సిల్ ప్రతిపాదించడంతో దీనిపై స్టడీ చేసి సమగ్రమైన రిపోర్టు అందించాలని కౌన్సిల్ను మంత్రివర్గం ఆదేశించింది. మేడ్చల్ మ ల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కు చెందిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనమయ్యే 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్)లకు సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలు కలిపి 27 మొత్తంగా జీహెచ్ఎంసిలో విలీనం చేయనున్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,000 మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. అయిదేళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ భేటీలో భాగంగా హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ ఈ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే పదేళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలించింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల కాల పరిమితితోనే ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కమ్ల వద్ద ఉన్న ఎంఓయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయిం చింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ ను ముందుగా మన డిస్కమ్లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. కొత్త పరిశ్రమల యాజమాన్యాలు క్యాప్టివ్ పవర్ జనరేషన్కు రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్ను తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్త పరిశ్రమల యాజమాన్యాలు క్యాప్టివ్ పవర్ జనరేషన్కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. పాల్వంచ, మక్తల్లోనూ ఎన్టీపిసి అధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ను ఎన్టీపిసి అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాల్వంచ, మక్తల్లోనూ ఎన్టీపిసి అధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఎన్టీపిసికి ఈ యూనిట్ నిర్మాణం అప్పగిస్తే ఎంత విద్యుత్ యూనిట్ రేట్ పడుతుంది, జెన్ కో ద్వారా చేపడితే ఎంత రేట్ పడుతుందో ముందుగా అంచనాలు వేసుకొని తుది పరిశీలన చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగుళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14 వేల 725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టి ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్ వైర్లన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీ లతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల స్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటిసిలతో పాటు కొత్తగా 6 ఐటీఐల్లో ఏటిసిలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఒకే వరలో రెండు కత్తులు... ఇదేం ‘పంచాయతీ’?
ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిస్థితి అలాగే ఉంది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నదన్న నేపథ్యంలో మన పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉన్నంత గందరగోళంగా ఏ రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. ఒకేవరలో రెండు కత్తులు ఇమడలేని విధంగా మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకే అధికార పరిధిలో రెండు పదవులు సృష్టించి అధికారులు, ప్రభుత్వాలు తమాషా చూస్తున్నారు తప్ప మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో అధికార విభజన సమస్యలు లేకుండా చూసేందుకు ఇష్టపడడం లేదు? ఉన్న లోపభూయిష్టమైన పంచాయతీ రాజ్ వ్యవస్థ స్వరూపాన్ని మూడంచెల అధికారస్థాయిగా వికేంద్రీకరణ చేయడానికి బదులు, నాలుగు అంచెలుగా అస్తవ్యస్త అధికార విభజన చేయడంతోపాటు, అధికార విభజనలో అస్పష్టతతో చోద్యం చూస్తున్నారు. ఒకే అధికార పరిధిలో రెండు పదవులు పెట్టి రాజకీయ సవతి పోరుకు తెరలేపడమేకాక, ఒకే అధికార పరిధిలో రెండు ఎన్నికలను జరిపి, ఎన్నికల పేరుతో ఎంతో ప్రజాధనం వృథా చేస్తున్నారు. అదేమిటో పరిశీలన చేద్దాం. వాస్తవంగా గ్రామ సర్పంచ్, మండలం ప్రాదేశిక నియోజకవర్గం సభ్యుల (ఎంపిటిసి) అధికార పరిధి ఒక్కటే, అయితే, పదవులే వేర్వేరు. ఎన్నికలు మాత్రం రెండు పదవులకు జరగాలి. సర్పంచ్, ఎంపిటీసి ఇద్దరూ ఒకే మండల పరిషత్తులో సభ్యులుగా ఉండి ఆయా గ్రామాల నుండి ద్విప్రాతినిధ్యం వహించుతారు. ఎవరు సమావేశంలో సమస్య లేవనెత్తినా ఒక్కటే అంశం. ఇకపోతే మండల స్థాయిలో మండల పరిషత్తు అధ్యక్షుడు, జిల్లా ప్రాదేశిక నియోజికవర్గం సభ్యులది ఒకే అధికార పరిధి. అంతేకాదు ఒకే మండలం నుండి జిల్లా పరిషత్తులో రెండు ప్రాతినిధ్యాలు అవసరమా? అంతేకాదు, మండలంలో ఎంపిటిసి, జిల్లాలో జడ్పిటిసిలకు మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వరకే ప్రాధాన్యత ఉంటుంది. అటుతర్వాత వారి అధికారాలు తాలింపులో కరివేపాకు మాదిరే! ఇకపోతే గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపిటిసి ఎన్నిక, మండలస్థాయిలో జెడ్పిటిసి, మండల పరిషత్తు ఎన్నికల వలన రెండు ఎన్నికల నిర్వాహణ ఖర్చుతోపాటు, ఐదేండ్ల పాటు ఎంపిటిసి, సర్పంచ్, జెడ్పిటిసిలకు నెల సరిగా ఇచ్చే గౌరవ వేతనం, సౌకర్యాలు కల్పనకు అవుతున్న ఖర్చు ప్రజలపైనే అదనపు భారం మోపుతున్నారు తప్ప నిక్కచ్చిగా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాణం, ఎన్నికల పద్ధతి మార్పు చేసుకుంటే! ఈ అధికార విభజన గందరగోళం, ఎన్నికలు, గౌరవ వేతనం పేరుతో చేసే ఖర్చులు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మన మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులను పరిశీలన చేసినట్లైతే మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంత గందరగోళంగా ఎందుకు తయారైంది? అనే అంశం అవగతం అవుతుంది. మనకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1955లో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకు రూపకల్పన చేసి, అధికార విభజన కూడా చేశారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికల ద్వారా ఎన్నిక అవుతారు. ఎన్నికైన సర్పంచ్లు బ్లాక్ అధ్యక్షుడును పరోక్ష పద్ధతిలో ఎన్నిక అవుతారు. ఈ బ్లాకు అధ్యక్షులు అందరూ కలిసి పరోక్ష ఎన్నిక ద్వారానే జిల్లా పరిషత్తు చైర్మన్ను ఎంపిక చేసుకునేవారు. అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగితే, పరోక్షంగా బ్లాకు, జిల్లాస్థాయి ఎన్నికలు అన్ని పూర్తి అయ్యేవి. అటు తర్వాత 1970 దశకంలో మాధ్యమిక వ్యవస్థ అయిన బ్లాకు స్థానంలో పంచాయతీ సమితి ఏర్పాటు చేశారు. ఇక 1977 నుండి 1987 మధ్య అనేక మార్పులు జరిగాయి. పంచాయతీ సమితి అధ్యక్షుడు, జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నిక పరోక్ష ఎన్నిక నుండి ప్రజలే నేరుగా ఎన్నుకునే విధంగా ఎన్నికల విధానం మార్చారు. అటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టిఆర్ అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీ రాజ్, రెవెన్యూ వ్యవస్థ స్వరూపం మార్చివేశారు. పాలనా సౌలభ్యం పేరుతో పంచాయతీ సమితి వ్యవస్థను రద్దుచేసి మండలం ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పేర్లతో నామకరణం చేశారు. మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు ఎన్నికకు నేరుగా ఎన్నికలు జరిపించారు. అటు తర్వాత ఆయనే మండల ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పిటిసి) లుగా విభజించి ఎన్నికలు జరిపించారు. దీనితో మూడంచెల వ్యవస్థ కాస్తా గందరగోళంగా మారిపోతుంది. అటు తర్వాత 1992 లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా, రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ ఆర్టికల్ 243 ననుసరించి స్థానిక స్వపరి పాలనా సంస్థలకు స్వయం పాలనా హక్కుగా గిరిజనులకు పీసా చట్టం లాంటి హక్కులు సంక్రమింపజేయడంతో మన స్థానిక స్వపరిపాలన వ్యవస్థ బలోపేతం అయింది. అయితే ఎంపిటిసి, జెడ్పిటిసి, సర్పంచ్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపి, ఎంపికైన వారి ద్వారా పరోక్ష ఎన్నిక ద్వారా మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అధ్యక్షులు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 2018లో కెసిఆర్ నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చినప్పటికీ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడంతప్ప అందులో కొత్తదనం పెద్దగా ఏమీ లేదు. ఉన్న ఎన్నికల విధానాన్నే యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. ఫలితంగా పంచాయతీ, మధ్యమ స్థాయి, ఉన్నత స్థాయి లో రెండు రకాల ప్రజాప్రతినిధులు వ్యవస్థలు వచ్చి గందరగోళంగా, ప్రజలకు భారంగా మారింది. వాస్తవంగా గ్రామ సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికల పరిధి దరిదాపు ఒక్కటే! ఇక అధికారాలు విషయానికి వేస్తే ఎంపిటిసిలకు మండలాధ్యక్షుల ఎంపిక, తొలగింపు అంశాలలో ప్రాధాన్యత తప్ప గ్రామ పంచాయతీపై మరే అధికారాలు లేవు. ఇక సర్పంచ్ గ్రామ పరిపాలనపై పూర్తి ఆధిపత్యం ఉంటుంది. మండల పరిషత్తు సమావేశంలో పాల్గొనే హక్కు ఉంటుంది కానీ, ఓటింగ్ విషయంలో, బిల్లుల, బడ్జెట్ ఆమోదం లాంటి ఎలాంటి హక్కులు లేకపోవడం వలన, మండల పరిషత్తు సమావేశంలో తమ సమస్యలు ప్రశ్నించడం తప్ప, మండల అధ్యక్షుడు, అధికారులను నియంత్రణ చేసే ఎలాంటి అధికారం లేని నామమాత్రపు సభ్యులుగా సర్పంచ్లు మండల పరిధిలో ఉంటారు. ఇక జిల్లా స్థాయి లో కూడా అదే పరిస్థితి ప్రత్యేకంగా ఎన్నికైన జెడ్పిటిసి సభ్యులు జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నిక చేసే, లేక అవిశ్వాసం పెట్టగల అధికారం కలిగి ఉంటారు. ఇక జిల్లా పరిషత్తు సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షలు పాల్గొన్నా, మండలంలో సర్పంచ్లు ప్రాతినిధ్యం మాదిరే ఇక్కడ మండలం అధ్యక్షుడు అధికారాలకు కత్తెర వేయబడుతుంది. అంటే దీన్ని బట్టి మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల విధానం, అధికారాల విభజన, అధికార పరిధి అంతా గందరగోళంగా మార్చివేశారు. ప్రభుత్వాలు మారుతున్నా అదే అధికార విభజన, అదే ఎన్నికల విధానం తప్ప అనర్థదాయకం అయిన, ఖర్చుతో కూడిన ఎన్నికల విధానం సంస్కరణ చేద్దామనే ఆలోచనకు ఎవరూ సాహసించడం లేదు. ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రత్యక్షంగా నిర్వహిస్తే, పరోక్ష ఎన్నికల ద్వారా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాణం అయ్యే అవకాశం ఉన్నా కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా మన పంచాయతీ రాజ్ వ్యవస్థను చూస్తూ, అధికారాలు విభజన గందరగోళం, మూడంచెల వ్యవస్థకు బదులు, ఆరో వేలులాగా నాలుగంచెల వ్యవస్థను ఏర్పరచి చేతులు దులిపేసుకుంటున్నారు. కనుక స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ప్రాధాన్యత ఇటీవల కాలంలో పెరిగింది. పనికి ఆహార పథకం, సమీకృత గ్రామీణ అభివృద్ధి నిధులుకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యం, పచ్చదనం పేరుతో గ్రాంట్లు విడుదల చేయడంతో కాస్తా గ్రామీణ ప్రాంతం రూపురేఖలు మారాయి. వైకుంఠధామాలు, రైతువేదికలు, సచివాలయాలు, క్రీడా ప్రాంగణాలు, పారిశుద్ధ్య సిబ్బంది, సిమెంట్ రోడ్లు లాంటి సౌకర్యాలు మెరుగైన నేపథ్యంలో మన స్థానిక స్వపరిపాలన సంస్థల్లో స్పష్టమైన మార్పులు చేయడం, తప్పులు సరిదిద్దడం, స్పష్టమైన అధికార విభజన చేయడం అత్యవసరమే! అందుకు వివిధ రాష్ట్రాలలో ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థ అధ్యయనం ఎంతో కొంత తోడ్పడే అవకాశం ఉంది. స్థానిక స్వపరిపాలన వ్యవస్థను సరైన మార్పులు తో పటిష్టం చేయవలసిన కనీస బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఎన్ తిర్మల్ 94418 64514
నితీశ్ ప్రభుత్వం నిలకడగా సాగేనా?
ఇరవైఏళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతతో, వయస్సు పైబడి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న నితీశ్కుమార్ మరోసారి బీహార్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసంభవం అని ఎన్నికల ముందు చాలామంది అంచనా వేశారు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో ఘనవిజయం సాధించడమే కాకుండా, ప్రతిపక్షాల ఉనికిని ప్రశ్నార్థకం కావించారు. 2025 బీహార్ ఎన్నికల పోరాటంలో నితీశ్ నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూలేని విధంగా సంపూర్ణ మద్దతు అందించారు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు కేవలం నితీశ్ రాజకీయ భవిష్యత్ను మాత్రమే కాకుండా తన రాజకీయ భవిష్యత్పై సైతం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. బహుశా నితీశ్కు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. ఫలితాలు రాగానే ప్రధానితో కనిపించిన ఉత్సాహం, మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపిన విధానం చూస్తే గతంలో ఆయన ఆ విధంగా వ్యవహరింపలేదని గుర్తింపవచ్చు. గత ఏడాది లోక్సభ ఎన్నికలలో బిజెపికి 400 సీట్లు గెలిపించబోతున్నట్లు దేశమంతా ప్రచారం చేసుకుంటే, 240కు మించి సీట్ల సాధించలేకపోయారు. మోడీ ‘ప్రజాకర్షణ’ ఓవిధంగా మసకబారింది. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో బిజెపి ఘనవిజయాలు సాధించినా అందుకు ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో అమలు చేసిన వ్యూహాలే ఎక్కువ కారణంగా అందరూ భావించారు. బీహార్లో గెలుపు సాధింపలేకపోతే ఇక ఓటర్లపై ‘మోడీ ఆకర్షణ’ ప్రభావం ఉండబోదనే నిర్ణయానికి దేశంలో అందరూ వచ్చే ప్రమాదం ఉంది. ముందుగానే ఈ ప్రమాదం గుర్తించడంతో, గత ఎన్నికలలో చిరాగ్ పాశ్వాన్ని చీల్చి, నితీశ్ పార్టీ పోటీచేస్తున్న సీట్లలో అభ్యర్థులను నిలబెట్టి ఆ పార్టీ అతి తక్కువ సీట్లు గెలుపొందేటట్లు చేశారు. ఈసారి కూడా ప్రశాంత్ కిషోర్తో జట్టుకట్టి నితీశ్ను ఓడించేందుకు చిరాగ్ సిద్ధ్దమవుతున్న సమయంలో బిజెపి కట్టడిచేసింది. గతంలో ఎన్డిఎ నుండి విడిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చి అభేద్యమైన కూటమిని ఏర్పాటు చేసి, చెల్లాచెదురైన ఇండియా కూటమిని చిత్తు చేయడంలో బిజెపి ప్రత్యేక శ్రద్ద చూపింది. గతంలో మాదిరిగా జెడి(యు)ను మరింత బలహీనంగా చేస్తే మోడీ నాయకత్వంకే ముప్పు అని భయపడ్డారు. దానితో ఆ పార్టీ స్థానాల సంఖ్య రెట్టింపు అయింది (2020లో 43 సీట్ల నుండి 2025లో 85 సీట్లకు). బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా ఆ పార్టీ స్థానాల సంఖ్య 74 నుండి 89కి మాత్రమే పెరిగాయి. మహిళలు, ఇబిసిలు, మహాదళితులలో నితీశ్ ఇప్పటికీ ఎదురులేని మద్దతు పొందుతూ ఉండడంతో ఆయన నాయకత్వానికి మద్దతు ఇస్తూ, ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించక తప్పని పరిస్థితులు బిజెపికి ఏర్పడ్డాయి. 2014 ఎన్నికల ముందు కేవలం మోడీ నాయకత్వానికి మద్దతు ఇవ్వలేకనే ఎన్డిఎకు దూరమైన నితీశ్ కుమార్, ఇప్పుడు మోడీ నాయకత్వం జాతీయ స్థాయిలో బలపడేందుకు కీలకమైన వ్యక్తిగా మారారు. గత ఏడాది జనవరిలో లోక్సభ ఎన్నికల ముందు కూడా ఇండియా కూటమి నుండి నితీశ్ ఎన్డిఎ కూటమిలోకి మారకపోయి ఉంటే, మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ప్రశ్నార్థకంగా మారి ఉండెడిది. బిజెపి సీట్ల సంఖ్య 240 నుండి మరింతగా తగ్గిపోయి ఉంటే ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు మోడీ వెనుకడుగు వేసి ఉండేవారని చాలామంది భావిస్తున్నారు. బీహార్ లోని 40 సీట్లలో 30 సీట్లను నితీశ్ రావడంతో ఎన్డిఎ గెల్చుకుంది. ఆ విధంగా మోడీని రాజకీయంగా నితీశ్ రెండు సార్లు ఆదుకున్నారని చెప్పవచ్చు. అసలు మోడీకి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షాలను ఓ వేదికపైకి తీసుకు వచ్చి, ఇండియా కూటమి ఏర్పాటుకు బలమైన కృషి చేసింది నితీశ్ కావడం గమనార్హం. దానితో సహజంగానే ఆయన ఆ కూటమికి నాయకత్వం వహించాలని ఆశించారు. అయితే, అదే జరిగితే ఆయనే కాబోయే ప్రధాని అభ్యర్థి కాగలరనే భయంతో ఒకవంక రాహుల్ గాంధీ, మరోవంక మమత బెనర్జీ అడ్డుతగలడంతో ఆయనకు ఆ కూటమి నుండి బైటకురాక తప్పలేదు. ఆ విధంగా ప్రధాని అభ్యర్థిగా దాదాపు దశాబ్దంపాటు ప్రచారంలో ఉన్న నితీశ్ తన రాష్ట్రానికి పరిమితం కావలసివచ్చింది. గతంలో సైతం కాబోయే ప్రధానిగా ప్రచారం పొందిన సర్దార్ పటేల్, ఎన్డి తివారి, శరద్పవర్, ఎల్కె అద్వానీ, ప్రణబ్ ముఖర్జీ వంటి వారు రాజకీయంగా ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది. అయితే నితీశ్ స్వరాష్ట్రంలో తన పట్టును మాత్రం నిలబెట్టుకుంటూ వచ్చారు. నితీశ్ను ఇండియా కూటమి నుండి వెళ్లకుండా అడ్డుకోగలిగి ఉంటె బిజెపి సీట్ల సంఖ్య మరింతగా తగ్గిఉండెడిది. నితీశ్ రాకతో సీట్లు 240కు తగ్గినా, నితీశ్, చంద్రబాబు నాయుడుల కీలక మద్దతుతో మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. నితీశ్ను కోల్పోయిన కారణంగానే ఇండియా కూటమి బీహార్లో సైతం ఘోర పరాజయం ఎదుర్కోవలసి వచ్చింది. తనకు ప్రతికూలంగా మారిన పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చుకోవడంలో బిజెపి కొంతకాలంగా రాటుతేలుతుంది. అదే కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల్లో విజయంకోసం కన్నా తమ కుటుంబం పట్టు కాపాడుకొనే ప్రయత్నంలో రాజకీయంగా వరుస పరాజయాలకు గురికావాల్సి వస్తుంది. బీహార్ ఫలితాలతో ఇండియా కూటమి రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి ఓ నాయకత్వం గాని, అజెండా గాని, కనీసం తరచూ సమావేశాలు జరుపుతూ ఉండటం గాని లేకుండాపోయింది. చివరకు పార్లమెంట్ సమావేశాల్లో చెప్పుకోదగిన ఉమ్మడి ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు. బీహార్ ఎన్నికల ఫలితాలు రాగానే ప్రధాని మోడీ ప్రసంగం వింటే కాంగ్రెస్కు, ప్రాంతీయ పార్టీలు మధ్య మరింత అగాధం పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ‘ప్రతికూల రాజకీయాల్లో’ మునిగిపోవద్దని, దాని నుండి దూరంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ తన మిత్ర పార్టీల ఓటు బ్యాంకులను మింగేసే ‘పరాన్నజీవి’ అని ఆయన హెచ్చరించారు. కొద్దీరోజులలో కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక అనివార్యం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జరుగబోయే రాష్ట్రాలలో కాంగ్రెస్, -బిజెపియేతర పార్టీలు బలమైన ఉనికి కలిగి ఉండడంతో కాంగ్రెస్ గురించి ప్రాంతీయ పార్టీలను హెచ్చరించే ప్రయత్నం చేశారు. టిఎంసి పాలిత పశ్చిమ బెంగాల్, డిఎంకె పాలిత తమిళనాడు, వామపక్ష పాలిత కేరళలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పుడు బిజెపి ప్రధానంగా బీహార్ తర్వాత బెంగాల్ పై దృష్టి సారిస్తోంది. అక్కడ టిఎంసితో కాంగ్రెస్ చేతులు కలపకుండా నివారించే ప్రయత్నంచేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. మరోవంక, ఇంతటి ఘనమైన విజయం సాధించినా బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని భావించలేం. వచ్చే ఐదేళ్లలో అక్కడ ఎన్ని రాజకీయ మార్పులైనా జరిగే అవకాశం లేకపోలేదు. బీహార్లో తమ నేత ముఖ్యమంత్రి కావాలని బిజెపి బహిరంగంగానే తమ లక్ష్యాన్ని వెల్లడిస్తూ వస్తుంది. కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి దక్కించుకోవడం ద్వారా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రజలలో ఆయనకు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభమైనదని చెప్పవచ్చు. నితీశ్ కుమార్ గెలుపుకు ప్రధానమైన కొన్ని సామాజిక వర్గాలలో ఆయనపట్ల తిరుగులేని నమ్మకం ఏర్పడటంతో పాటు పరిపాలన దక్షుడిగా, ‘జంగిల్ రాజ్’ లో శాంతిభద్రతలు కొనసాగేటట్లు చేయడం, మహిళల సంక్షేమంపట్ల ప్రత్యేక దృష్టి సారించడం ప్రధాన కారణం అన్నది అందరికీ తెలిసిందే. పైగా, సుదీర్ఘకాలం కులాల సమీకరణలో రాజకీయాలు కేంద్రీకృతం అయిన రాష్ట్రంలో మొదటిసారి మహిళా సంక్షేమం, యువత, ఉద్యోగాలు వాటిని సామాజిక అంశాలను ప్రధాన రాజకీయ అజెండాగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఈ విషయంలో ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ సొంత పార్టీలోనే విశ్వాసం పొందలేకపోయారు. ఇప్పటికే పరిపాలనలో మంచి అనుభవం ఉన్న ఇబిసి వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి హోం మంత్రిగా శాంతిభద్రతల విషయంలో సైతం చెరగని ముద్ర వేసేటట్లు చూడటం ద్వారా బీహార్ ప్రజలలో ప్రజాకర్షణ గల నాయకుడిగా ఎదిగే విధంగా బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అది జరిగితే, జెడి(యు)లో చీలిక తీసుకురావడం, నితీశ్ కుమార్ ను ఒంటరి చేయడం పెద్ద కష్టం కాబోదు. ఇప్పటికే జెడి(యు) నాయకులు అనేకమంది బిజెపికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ప్రజావ్యతిరేకత రానివిధంగా బీహార్లో పాగావేయాలని బిజెపి వ్యూహంగా కనిపిస్తుంది. చలసాని నరేంద్ర, 98495 69050
HYD |ఈ ఏరియాలో కరెంట్ కట్ !!
HYD | ఈ ఏరియాలో కరెంట్ కట్ !! మియాపూర్, (ఆంధ్రప్రభ) మియాపూర్
అణగారిన వర్గాలనుండి వచ్చినవారు రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలుగుతున్నారంటే అది కేవలం రాజ్యాంగ చలువేనని, మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతంలో జన్మించి దేశ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థాయికి ఎదిగిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అనడాన్ని బట్టి రాజ్యాంగ ప్రాముఖ్యత మనకు అవగతం అవుతుంది. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో దోపిడీకి గురియై అస్తవ్యస్తమైన ఈ భారతదేశం స్వాతంత్య్రానంతరం ఏకతాటిపై నడిపించడానికి రాజ్యాంగం కీలకభూమిక వహించింది. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించి స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని గుర్తు పెట్టుకోవాలని ఆలోచన 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.ఎం. సింగ్వికి వచ్చింది. దీంతో నవంబర్ 26ను న్యాయవాద దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించింది. అప్పటినుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవం రోజున పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. చిన్నప్పటినుంచి అంబేద్కర్ కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. అందువల్ల ఆ అంశాలను విద్యార్థులు, ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకొని ఈ ఏడాది నవంబర్ 26 కు 76ఏళ్లు పూర్తవుతోంది. ఎన్నో సంవత్సరాల నాగరికత కలిగిన భారతదేశానికి ఏడున్నర దశాబ్దాలు పెద్ద విషయం కాదు. కానీ పరాయి పాలననుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారని తెలిసిన తర్వాత రాజ్యాంగ రచనకు సన్నాహాలు జరిగాయి. ఇందుకోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలతోపాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా, రచనా కమిటీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో ఏర్పడింది. కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. 299 మంది సభ్యులు ఉండగా తుది ప్రతి మీద మాత్రం 284 మంది సంతకం చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం లభించింది. అయితే 1930 జనవరి 26ను కాంగ్రెస్ భారతదేశానికి పూర్ణ స్వరాజ్ దివస్గా తీర్మానించింది. జనవరి 26వ తేదీకి చిరస్థాయి కీర్తి అందించుటకుగాను 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. గత 76 సంవత్సరాలుగా దేశాన్ని అఖండంగా ఉంచటం రాజ్యాంగం సాధించిన ఘనవిజయం. విచ్ఛిన్నకరశక్తులు లౌకిక ఐక్యతను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వారు కృతకృత్యులు కాలేకపోవడం ఒక ప్రగతి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం శుభపరిణామం. సాంఘిక, ఆర్థిక, సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం సాధించలేమని, జాతి నిర్మాణంలో సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొనాలన్న అంశం ఆధారంగా రాజకీయ సమానత్వం సాధించాలన్నదే బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్ష. భారత ప్రజలమైన మేము అంటూ రాసుకున్న రాజ్యాంగం ఏదో కొన్ని నియమ నిబంధనల పుస్తకం కాదు. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత విలువలతో ప్రజల ఆశలు ఆశయాలకు ప్రతిరూపంగా ఉంటూ, ఆసేతుహిమాచలం, ఆబాలగోపాలం సమైక్యంగా పురోగమించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని మున్ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత భారత పౌరులమైన మన అందరిదీ. ములక సురేష్, 94413 27666
నేడు రాజ్యాంగ దినోత్సవం.. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఘనంగా ఏర్పాట్లు
పాల్గొననున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ తెలుగు సహా 9 భాషల రాజ్యాంగ అనువాద సంపుటాల ఆవిష్కరణ 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం ఆమోదించిన 76వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నాడు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహణకు ఘనంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఉభయసభల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన రాజ్యాంగ సభ వార్షికోత్సవాలు సాగుతాయి. భారత రాజ్యాంగాన్ని తాజాగా తొమ్మిది భాషలలో అనువదించారు. ఈ సందర్భంగా, తెలుగు, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడిశా, కశ్మీరీ, అస్సామీ, నేపాలి, బోడో అనువాద సంపుటాల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారత్ కే సంవిధాన్ మై కాలా ఔర్ కాలిగ్రఫీ అనే స్మారక బుక్ లెట్ ను కూడా విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. సామాన్యులు రాజ్యాంగ ప్రవేశికను చదివేందుకు ఆన్ లైన్ లో ఏర్పాట్లు చేశారు. అలాగే సోషల్ మీడియాలో దీనిని ఏర్పాటు చేశారు. హమారా సంవిధాన్ - హమారా స్వాభిమాన్ పై జాతీయ ఆన్ లైన్ క్విజ్ లు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. సామాన్య పౌరులు ఈ పోటీలలో పాల్గొనే అవకాశం ఉంది. భారత రాజ్యంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది.దీని జ్ఞాపకార్థం 2015 నుంచి ప్రతిఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు, రాజ్యాంగం లోని కొన్ని నిబంధనలు వెంటనే అమలులోకి వస్తే, 1950 జనవరి 26న అధికారికంగా రాజ్యాంగం అమలులోకివచ్చింది. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిష్కృతమైంది.
Tandur |జోరుగా ఇసుక అక్రమ రవాణా …
Tandur | జోరుగా ఇసుక అక్రమ రవాణా … తాండూరు రూరల్, (ఆంధ్రప్రభ)
మంత్రి దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు
మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు. విశాలాంధ్ర – కడియం : రేషన్ డీలర్స్ కు ప్రస్తుతం ఇచ్చే ఒక రూపాయి కమిషన్ షాపు నిర్వహణకే సరిపోతుందని తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్స్ అధ్యక్షులు రాజు అన్నారు. రేషన్ డీలర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని, డీలర్స్ తో త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారని, త్వరలోనే […] The post మంత్రి దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు appeared first on Visalaandhra .
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నగా రా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం అడిషనల్ డిజిపి మహేష్ భగవత్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన, కార్యదర్శి మకరందు తదితరులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి) రాణికుముదిని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎ న్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ ర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని వెల్లడించారు. గత సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్పై హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 27) నుంచి తొలి విడత పోలింగ్కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనునున్నట్లు చెప్పారు. అలాగే రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో నోటా గుర్తు ఉంటుందని తెలిపారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా గ్రివియెన్స్ విభాగం రూపొందించినట్లు కమిషనర్ రాణికుముదిని తెలిపారు. త్వరలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఫోన్ నెంబర్ 9240021456కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు పోలింగ్ నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 27 స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 29 పరిశీలన: నవంబర్ 30 నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 3 ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 11(ఉ.7 నుంచి మ. 1 వరకు) రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డులకు పోలింగ్ నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 30 స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 2 పరిశీలన: డిసెంబర్ 3 నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 6 ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 14(ఉ.7 నుంచి మ. 1 వరకు) రెండో విడతలో 4,150 సర్పంచ్ స్థానాలకు 36,452 వార్డులకు పోలింగ్ నామినేషన్ల స్వీకరణ: డిసెంబర్ 3 స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 5 పరిశీలన: డిసెంబర్ 6 నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 9 ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 17(ఉ.7 నుంచి మ. 1 వరకు) మొత్తం గ్రామపంచాయతీలు : - 12,728 మొత్తం వార్డుల సంఖ్య -: 1,12,242 తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య - 16,655,186 పురుష ఓటర్లు -: 81,42,231 మహిళా ఓటర్లు - : 85,12,455 ఇతరులు : 500
Medak | వెూగిన ఎన్నికల నగారా.. ఉమ్మడి మెదక్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) :పంచాయతీ
రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం
రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం” కార్యక్రమమా?–వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఎద్దేవా. విశాలాంధ్ర – కడియం : రైతులను అన్నివిధాలా చావగొట్టి చెవులు మూసిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఏమి ఎరగనట్టు “రైతన్నా మీకోసం” కార్యక్రమం పెట్టి రైతులకు ఏదో చేసినట్టు మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం కడియం లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి రైతులకు వ్యతిరేకమే […] The post రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం appeared first on Visalaandhra .
కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు
మురమండ, దుళ్ల కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మురమండ, దుళ్ల గ్రామ పంచాయతీలలో గ్రేడ్ 2 గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న రావిపాటి సత్యనారాయణ, బిక్కి సత్యానందకుమార్ లకు గ్రేడ్-1 కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. జోన్ 2 పరిధిలో ఉన్న వీరిలో సత్యనారాయణ ను అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నియమించగా సత్యానంద కుమార్ ను తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ […] The post కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు appeared first on Visalaandhra .
యాప్ వినియోగిస్తే ప్రయోజనాలు ఎన్నో.. విశాలాంధ్ర -కొవ్వూరు: మున్సిపల్ పరిధిలోని పట్టణాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పురమిత్ర యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మున్సిపల్ శాఖ సంచాలకుడు, కమిషనర్ నేరుగా యాప్ను పర్యవేక్ష తుండడడంతో అధికారులు పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి సంబంధిత సమాచారాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను చెల్లింపు, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపు, నీటి చార్జీలు చెల్లింపు, నీటి సరఫరా కులాయిల కనెక్షన్ల దరఖాస్తులు, వ్యాపార లైసెన్స్ […] The post ప్రజలు చెంతకే పుర సేవలు appeared first on Visalaandhra .
బాలల ఆనంద వేదిక కు మరమ్మత్తులు
విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామంలో పశువుల హాస్పిటల్ పక్కన ఉన్న బాలల ఆనంద వేదిక పార్కుకు మరమ్మత్తులు చేపట్టిన్నట్లు బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు తెలిపారు. గతంలో విశాలాంధ్ర పత్రికతో పాటు పలు పత్రికలలో పార్కు నిర్వహణ గురించి వార్తలు వచ్చినప్పటికీ పంచాయతీ వారు పట్టించుకోలేదన్నారు. పార్కు ఆవరణ చెత్తాచెదారాలతో వ్యర్థ పదార్థాలతో నిండి ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆట పరికరాలు పాడైపోయి పార్కు నిరుపయోగంగా ఉన్నట్లు తన దృష్టికి […] The post బాలల ఆనంద వేదిక కు మరమ్మత్తులు appeared first on Visalaandhra .
GHMC | మహా బల్దియా.. హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్ర ప్రభ :
HYD |ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం…
HYD | ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం… హైదరాబాద్, (ఆంధ్రప్రభ) :
వైద్యం ఒకరికి అయితే, ప్రిస్క్రిప్షన్ లో మరొకరి పేరు
విశాలాంధ్ర – కడియం : కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో దామిశెట్టి రత్నకుమారి పేరుకు బదులుగా వేరొకరి పేరుతో వైద్య పరీక్షలు, ఎక్సరే పరీక్షలు నిర్వహించి, మందులు రాసారని రత్నకుమారి భర్త నాగరాజు ఆరోపించారు. వైద్య పరీక్షలు నిమిత్తం దామిశెట్టి రత్నకుమారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో తమ భార్య మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను మరొకరి పేరుతో చేయించారని ఆరోపించారు. ఎక్స్ రే, రక్త పరీక్షలు చేసి, మందులు కూడా వేరొకరి పేరు […] The post వైద్యం ఒకరికి అయితే, ప్రిస్క్రిప్షన్ లో మరొకరి పేరు appeared first on Visalaandhra .
సినిమా డైరెక్టర్ గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.— రాజమండ్రి రూరల్ దళిత నాయకులు. విశాలాంధ్ర – కడియం : దళితుల మనోభావాలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సినిమా డైరెక్టర్ అన్నందేవుల గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం దళిత నాయకులు కడియం పోలీస్ స్టేషన్ లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాయల సత్యనారాయణ, దమ్ము కృష్ణంరాజు, మంగమూరి చినబాబు, జల్ది కృపారావు, కనికల్ల బుల్లియ్య, ఇప్పర్తి శ్రీను తదితర […] The post చర్యలు తీసుకోవాలి appeared first on Visalaandhra .
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 12,728 సర్పంచ్ స్థానాలకు 2,176 స్థానాలు బిసిలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన బిసిలకు 17.08 శాతం బిసిలకు సర్పంచ్ స్థానాలు దక్కాయి. 27.45 శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకుగానూ 70 సర్పంచ్ స్థా నాలు బిసిలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో 26.77 శాతం బిసిల కు సర్పంచ్ కేటాయించారు. ఈ జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. నా రాయణపేట జిల్లాలో 272 గ్రామ పంచాయతీలకు గానూ 72 (26.47 శాతం) బిసిలకు కేటాయించగా, కరీంనగర్ జిల్లాలో 318 గ్రామ పంచాయతీల్లో బిసిలకు 84(26.41 శాతం) కేటాయించారు. పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలకుగానూ 69(26.23 శాతం) బిసిలకు రిజర్వ్ అయ్యాయి. అదిలాబాద్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో బిసిలకు 5 శాతం లోపే సర్పంచ్ స్థానాలు కేటాయించగా, 10 శాతం లోపు ఉన్న జిల్లాల్లో అసిఫాబాద్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 471కి గాను బిసిలకు ఒక్క స్థానం కూడా దక్కలేదు.
రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విశాలాంధ్ర – నల్లజర్ల : రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని వాటిని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతన్నల ఇంటికి వెళ్లి కరపత్రాలను […] The post రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం appeared first on Visalaandhra .
వివాహ వేడుకలో పాల్గొన్న జనసేన నేత సువర్ణ రాజు విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం సుబద్రపాలెం గ్రామ జన సైనికుడు వెలుగంటి వినయ్ కుమార్వివాహ మహోత్సవమునకు హాజరైన గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజుఐటీ కోఆర్డినేటర్ ఉన్నమట్ల సత్య కిరణ్ ,జనసేన పార్టీ మండల కార్యదర్శి కొత్తపల్లి హరిబాబు ,చీపురుగూడెం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గుండాబత్తుల వరుణ్ కుమార్,పోతవరం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గాజుల గణేష్ , చీపురుగూడెం […] The post జనసేన నేత సువర్ణ రాజు appeared first on Visalaandhra .
మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష(డిసిసి) ఎంపిక కొత్తచిచ్చుకు దారితీసింది. డిసిసి అ ధ్యక్ష పదవి కోసం చాలామంది ముఖ్యులు పోటీపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓయు ఉద్యమనేత పున్న కైలాశ్నేతకు డిసిసి బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచరులు కష్టపడి పనిచేసే వారికి పదవులు ఇవ్వరు.. పార్టీని, ముఖ్యులను తిడితేనే పదవులు ఇస్తారా? అంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రధానంగా మంత్రి ప్రధాన అనుచరుడు గుమ్ముల మోహన్రెడ్డి అధిష్ఠానం తీరును తప్పుబట్టారు. కష్టకాలంలో పనిచేసిన వా రికి గుర్తింపు ఇవ్వకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. అయితే డిసిసి అధ్యక్షుల ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రకేబినేట్ సమావేశానికి ముందు సీఎం రేవంత్తో చర్చించినట్లు చెపుతున్నారు. గతంలో తనను, తనకుటుంబాన్ని అసభ్య పదజాలంతో తిట్టడం.. పార్టీకోసం ఏనాడు కష్టపడని వ్యక్తికి డిసిసి పీఠం కట్టబెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షుడిగా పున్న కైలాశ్నేతను వెంటన తొలగించాలని మంత్రి పట్టుపడుతున్నారు. సీఎం రేవంత్తో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు లేఖ రాసినట్లు చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే గతంలో తనను దూషించిన వ్య క్తికి జిల్లాపీఠం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు వెంట నే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు (డిసిసి) పదవుల చిచ్చు నల్లగొండ జిల్లాలో తారాస్థాయికి చేరిందని చెప్పవ చ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీఎం రేవంత్కు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఈపరిణామాలతో వారిబంధం బెడిసికొడుతుందా? అనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లో పై ర్బ్రాండ్గా ఉంటూ విపక్షంతో పాటు స్వపక్షంపై విమర్శలు చేయడం వారికి అలవాటు. అయితే ఈ పరిస్థితుల్లో డిసిసి ఎంపిక సీఎం రేవంత్తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతుందా అనే చర్చ ప్రారంభమైంది. ఎట్టిపరిస్థితుల్లో డిసిసి అధ్యక్షులుగా పున్న కైలాశ్ను ఒప్పుకునేది లేదని వెంటనే తొలగించాలని మంత్రి కోమటిరెడ్డి పట్టుపడుతున్నారు. డిసిసి ఎంపిక చిచ్చు నల్లగొండ కాంగ్రెస్లో ఏవైపుకు దారితీస్తుందోనన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ అధిష్టానం ఏనిర్ణయం తీసుకుంటుంది? కోమటిరెడ్డిని బుజ్జగిస్తుందా? కైలాశ్నేతకు నచ్చచెపుతుందా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనని అందరూ ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు.
మన తెలంగాణ/ ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం కూలిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని.. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తీసుకుపోతున్న నీళ్లు కాళేశ్వరంవి కా వా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హ రీశ్రావు ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్ను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదా సు లక్ష్మణ్ రావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బ్లా స్టింగ్స్ చూస్తే కాళేశ్వరం కూడా పేల్చారని అనుమానం వస్తుందని అన్నారు. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్నుకూల్చివేసింది కాంగ్రెస్ నేతలేనన్నారు. కాంగ్రెస్ హయాంలో చెరువు లు, చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య చర్యగా మా రిందన్నారు. గతంలో పెద్దపల్లి భోజన్నపేట వద్ద హుస్సేన్ మియావాగుపై కూడా చెక్ డ్యామ్ పేల్చివేశారని ఆరో పించారు. గుంపుల వద్ద చెక్ డ్యామ్ కూడా కులలేదని.. పేల్చారని ఇక్కడి రైతులే చెప్తున్నార న్నారు. ఇసుక మాఫియానే కూల్చివేసిందని, కాంగ్రెస్ పాలనలో వేల కొద్ది లారీల్లో ఇసుక తరలిస్తున్నారన్నారు.రాత్రికి రాత్రి చెక్ డ్యామ్ పేల్చేశారని.. భోజన్న పే టలో హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యామ్ పేల్చివేస్తుంటే రైతులే పట్టుకున్నారన్నా రు. అప్పుడు రైతులే కేసులు పెట్టా రని.. పోలీసులు ఇప్పటివరకు దోషులను పట్టుకోలేదని ఆరో పించారు. తాజాగా మరో చెక్ డ్యామ్ పేల్చారని..అప్పుడే పోలీసులు దోషులను శిక్షిస్తే..ఈ రోజుగుంపుల చెక్ డ్యామ్కు ఈ పరిస్థితి రాకుండేదన్నారు. ఈరోజు వరకు పోలీసులు వాళ్లను పట్టుకోలే దని.. మూడు రోజు లు అయిన ఇక్కడి పేల్చవేత దోషులను పోలీసులు పట్టుకోలే కపోయారని ఆరోపించారు. కాం గ్రెస్ పార్టీ వాళ్లను కాపాడుతుందని.. ఆనాడు గుండాలను అరెస్ట్ చేస్తే ఈ రోజు ఇక్కడి చెక్ డ్యామ్ పేల్చకపోయేవాళ్లని.. హైదరాబాద్లో ఇండ్లు, ఇక్కడ చెరువులు, చెక్ డ్యామ్లు కూలగొ డుతున్నారన్నారు. కేసీఆర్ కట్టుడు..కాంగ్రెసోళ్ల కూలగొ ట్టూడని.. మానేరు నది మీద చెక్ డ్యామ్లు కట్టి సస్యశ్యామలం చేశామన్నారు. పొంగులేటి శ్రీనివాస్కు చెందిన రాఘవ కన్స్ట్రక్ష న్ కట్టిందని..చర్యలు తీసుకోవాలంటే పొంగులేటిపై తీసుకోవాలన్నారు.రాఘవ కంపెనీని బ్లాక్ చేయాలన్నారు. పొంగులేటి నుంచి రికవరీ చేయా లని డిమాండ్ చేశారు. ఏడాదికి 6 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పిండ ని..ఎక్కడ ఇచ్చారోచెప్పా లన్నారు. కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారని..రెండేళ్లు అయి న కాళేశ్వరం రిపేర్ చేయడం లేదని.. కాళేశ్వరం కింద ఉన్న కాలువలు తవ్వడం లేదన్నారు. కాలువలు తవ్వితే కేసీఆర్కు పేరు వస్తుందని రైతును గోసపెడుతున్నారన్నారు. పెద్దపల్లిలో జిలిటెన్ స్టిక్స్తో కాంగ్రెస్ నాయకులు రెడ్ హ్యాండెడ్గా దొరికారని.. ఇసుక మాఫి యాతో రూ. 24 కోట్లు రికవరీ చేయాలన్నా రు. ఎండాకాలం లోపే చెక్ డ్యామ్ నిర్మించాలని.. ఇసుక మాఫియాలో మంత్రుల వాటా ఉందని.. రాత్రిపూట పెద్దశబ్దం వినపడిందని అని మత్స్యకారులు చెప్తున్నారన్నారు. లక్ష క్యూసెక్కుల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యామ్ చెక్కు చెదరలేదన్నారు. కూలితే రాత్రే ఎందుకు కూలింది? కూలలేదు కూల్చారు అంటూ ఆరోపిం చారు. కాంగ్రె స్కు రైతుల కన్నా ఇసుక మాఫియా ముఖ్యమన్నారు. టెర్రరిస్టులు కూడా ఇ లాంటి పనులు చేయరని, టెర్రరిస్టులకు మిం చిపోయారని.. ఇసుక మాఫియా దోషులను శిక్షించకుంటే రాష్ట్రంలో మరిన్ని చెక్ డ్యా మ్లు పేలుస్తారన్నారు. కేసీఆర్పై కోపంతో రాష్ట్ర రై తుల నోట్లో మట్టికొడుతున్నారని. కాళేశ్వరం కూలిందని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి రూ.8 వేల కోట్లతో హైదరాబాద్కు పైపులైన్ వేస్తా అంటున్నాడన్న హరీష్రావు.. మల్ల న్న సాగర్ ఎవరు కట్టారు నీ తాత కట్టిండా..? కేసీఆర్ కాదా? అంటూ ప్రశ్నించారు.ఇసుక మాఫియాపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిందేనన్నారు. నిందితులు ఎవరైనా వారి నుం చి రూ.24 కోట్లు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరంలోని పారిశ్రామిక భూములపై రచ్చ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ భూములను గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ ప్రకారమే తాము నడుచుకుంటున్నామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా ప్రతిపక్ష బిఆర్ఎస్ మాత్రం కోట్ల రూపాయలను దోచుకునేందుకు పారిశ్రామిక భూములపై ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. దీని కో సం పరిశ్రమల శాఖ రూపొందించించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పా లసీ పాలసీని ఇటీవల మంత్రిమండలి ఆమోదిం చి జీవో కూడా జారీ చేసింది. పారిశ్రామికవాడల ను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ‘హిల్టప్’ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రా న్స్ఫార్మేషన్ పాలసీ) పేరుతో ఓ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పారిశ్రామిక ప్రాంతాల్లో జనజీవనం పెరగడంలో కాలుష్య ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరం నడిమధ్యలో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపల నూతన పారిశ్రామికవాడలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే హిల్టప్ విధానాన్ని తీసుకువచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) లోపల, సమీపంలోని అన్ని టీజీఐఐసీ/ఐఏఎల్ఎ పరిధిలోని అన్ని పారిశ్రామిక ఎస్టేట్లు, ఆటోనగర్లు స్వతంత్ర పరిశ్రమల భూములకు ఈ విధానం వర్తిస్తుంది. దీని పరిధిలోకి వచ్చే భూముల్లో అపార్టుమెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, కార్యాలయాలు, రిటైల్ సెంటర్లు, హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఐటీ/ ఐటీఈఎస్ పార్కులు, రిక్రియేషన్ సౌకర్యాలు వంటివి నిర్మించడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. హైదరాబాద్లోని పాత పారిశ్రామిక ఎస్టేట్లు పార్కులు ఇప్పుడు అత్యంత విలువైన భూములుగా మారాయి. పెట్టుబడులు, పరిశ్రమలు రావాలనే లక్ష్యంతో 50- నుంచి 60 ఏండ్ల కిందట ప్రభుత్వం సబ్సిడీ ధరలకు పరిశ్రమలకు భూములను కేటాయించింది. దీంతో అప్పట్లో నగర శివారు ప్రాంతాలుగా ఉన్న 22 చోట్ల పారిశ్రామికవాడలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో నగరం వేగంగా విస్తరించడంతో అప్పట్లో శివారు ప్రాంతాలుగా ఉన్న పారిశ్రామికవాడల చుట్టూ ఇప్పుడు జనావాసాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఏమాత్రం ధర పలకని భూములు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో చాలావరకు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. టెక్నాలజీ మారడంతో చాలా పరిశ్రమలు ఖాయిలా పడగా అనేక పరిశ్రమలు మార్కెట్ పోటీని తట్టుకోలేక మూతబడ్డాయి. దీంతోపాటు ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న పారిశ్రామికవాడలను ఔటర్ వెలుపలికి తరలించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, సమీపంలోని పాత పారిశ్రామికవాడలు ప్రస్తుతం హైదరాబాద్ నగరం మధ్యలో చిక్కుకున్నాయి. బాలానగర్, కూకట్పల్లి, కాటేదాన్ వంటి ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. వేర్వేరు ప్రాంతాల్లోని పారిశ్రామిక జోన్లలో సుమారు 9,292 ఎకరాలను పరిశ్రమల శాఖ గుర్తించింది. వీటిలో సుమారు 4,740 ఎకరాల చదును భూముల్లో అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. ఈ భూములను నివాస, వాణిజ్య, ఐటీ, ఆసుపత్రులు, పార్కులతో కూడిన బహుళ ప్రయోజన ప్రాంతాలు (మల్టీయూజ్ జోన్లు)గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ వెలుపల పలు పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసి నగరంలోని పరిశ్రమలకు సబ్సిడీ ధరలకు అక్కడ భూములు కేటాయించారు. ఇలా నగరంలోని పారిశ్రామిక వాడలకు చెందిన వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈఈ భూములను మల్లీయూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు ప్రక్రియ ఇలా టీజీ-పాస్ పోర్టల్ ద్వారా హిల్టప్ విధానానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మొదట 20 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టీజీఐఐసీ 7 రోజుల్లో ప్రాథమిక పరిశీలన చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు) అధ్యక్షతన ఆమోద కమిటీ మరో 7 రోజుల్లో అనుమతి ఇస్తుంది. మిగిలిన 80 శాతం ఫీజును రెండు విడతలుగా 45 రోజులకోసారి మొత్తంగా 90 రోజుల్లో చెల్లించవచ్చు. సబ్సిడీ ధరలకు కేటాయించిన భూములను లీజు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడమో, బహిరంగ మార్కెట్ ధర ప్రకారం వారివద్ద ధర వసూలు చేసి వారికి యాజమాన్య హక్కులు కల్పించడమో చేయాలి. ప్రభుత్వం ‘హిల్టప్’లో భాగంగా రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం ఫీజుగా వసూలుచేసి వారికి భూ వినియోగ మార్పిడి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. 9292 ఎకరాల్లో హిల్టప్ పాలసీ నగరంలోని మొత్తం 22 పారిశ్రామికవాడల్లో 9292.53 ఎకరాల భూమి ఉంది. నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, మౌలాలీ, ఉప్పల్, కూకట్పల్లి, ఐపీ జీడిమెట్ల, ఎస్వీసీఐఈ జీడిమెట్ల, ఐపీ బాలానగర్, టీఐఈ బాలానగర్, ఎస్వీసీఐఈ బాలానగర్, ఐపీ సనత్నగర్, ఐపీ మేడ్చల్, కుషాయిగూడ, సీఐఈ గాంధీనగర్, పటాన్చెరు, ఐడీఏ పాశమైలారం, రామచంద్రాపురం, కాటేదాన్, హయాత్నగర్, స్టాండ్ ఎలోన్ ట్యాండ్స్, చందూలాల్ బారాదరి తదితర పారిశ్రామికవాడల్లో ఈ భూములు ఉన్నాయి. ఈ భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పాలసీ ద్వారా వేల ఎకరాల నిరుపయోగమైన భూమి వినియోగంలోకి రావడంతోపాటు ఐటి, రియల్ ఎస్టేట్, హౌసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రానికి వేల కోట్ల నాన్ ట్యాక్స్ ఆదాయం రావడం వల్ల సేకరించిన డబ్బులో 25 శాతం మళ్లీ కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతాయని ఈ పాలసీని తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. లీకు వీరులపై కఠిన చర్యలు తప్పవు : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చల సారాంశం మొత్త ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్న లీకు వీరుల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు స్పందిస్తూ ఈ లీకుల విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని కేబినెట్ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాల లీకులపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో కేబినెట్ సైతం ఇదే ఆలోచనతో ఉందన్నారు. కేబినెట్ నిర్ణయాలు చాలా కాన్ఫిడెన్షియల్ అని అలాంటిది ఇంకా జీవోలు రాకముందే వాటి సారాంశం ఇతరులకు చేరవేయడమంటే చాలా తీవ్రమైన నేరమని, అలాంటి ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో ఐఎఎస్ అధికారుల పాత్ర ఉన్నా చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్బాబు హెచ్చరించారు.

23 C