లెబనాన్ పాపం చేసినట్లే: హెజ్బోల్లా
ఇజ్రాయెల్తో లెబనాన్ ప్రభుత్వ ప్రత్యక్ష చర్చలు పాపం అంతకు మించి ఘోర తప్పిదం అని హెజ్బోల్లా అధినేత హుస్సేన్ హాజ్ హస్సన్ గురువారం స్పందించారు. లెబనాన్, ఇజ్రాయెల్ పది రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయనే ట్రంప్ ప్రకటనపై ఆయన స్పందించారు. ఇజ్రాయెల్ దారుణ యుద్ధ నేరాలకు , అంతకు మించి అఘాయిత్యాలకు పాల్పడింది. ఇందుకు బదులుగా లెబనాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు భారీ రాయితీలు ప్రకటించడం యుద్ధాన్ని మించిన నేరం అని వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజల శత్రువుపై ఔదార్యం అంతకు మించి ఆదరణ చూపడం క్షమించరాని నేరం అన్నారు. తమ పార్లమెంటరీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అమెరికా కోరికలకు అనుగుణంగా, ట్రంప్ పొగడ్తలకు ఆశపడి ఈ విధంగా వ్యవహరించారని విమర్శించారు.
డీలిమిటేషన్ కాపీని తగలబెట్టిన స్టాలిన్
చెన్నై/నామక్కల్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు కాపీని తగుల బెట్టారు. ఈ సందర్భంగా దీన్ని “బ్లాక్బిల్” ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ గురువారం నామక్కల్లో పర్యటించారు. డీ లిమిటేషన్కు వ్యతిరేకంగా నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. నల్లజెండాను ఎగురవేసి బిల్లు కాపీని తగుల బెట్టారు. అనంతరం “ కలిసి పోరాడదాం. గెలుద్దాం ” అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్టాలిన్ ఎక్స్లో పోస్టు చేశారు. స్టాలిన్ తరువాత పార్టీ నాయకులు, సిబ్బంది, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, డీలిమిటేషన్ బిల్లు కాపీలను తగులబెట్టారు. డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మదురైలో బిల్లు కాపీని తగుల బెట్టారు. రాష్ట్ర రాజకీయ ప్రాతినిధ్యానికి కోతపెట్టేందుకు కేంద్రం చేతిలో ఇది ఒక ఆయుధమని వ్యాఖ్యానించారు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల సహాయంతో తాను ఏది కోరుకుంటుందో దాన్ని అమలు చేయడానికి కేంద్రం తమిళనాడును నిరంతరం మోసగిస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బాగా తగ్గించాలని కేంద్రం కోరుకుంటోందన్నారు. ఆత్మాభిమానానికి ప్రఖ్యాతి చెందిన తమిళనాడు భూమి బీజేపీ దురహంకారం ముందు తలవంచదని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు ఆర్ఎస్ భారతి, టికెఎస్ ఇలాంగోవన్ ఆధ్వర్యంలో డిఎంకె ప్రధాన కార్యాలయం అన్నాఅరివలయం వద్ద బిల్లు కాపీలు తగల బెట్టారు. సేలంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ చీఫ్ కె సెల్వపెరుందగై నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. ద్రవిడార్ కజగమ్ చీఫ్ కె వీరమణి నల్లజెండాను ఆవిష్కరించారు. బిల్లు కాపీని తగలబెట్టారు. సిపిఐ, సిపిఎం తదితర డిఎంకె మిత్రపక్షాలు ఈ నిరసనలో పాల్గొని నల్లజెండాలు ప్రదర్శించారు.
భార్యకు తగు భరణం భర్త బాధ్యత: సుప్రీంకోర్టు
జీవిత భాగస్వామి నిర్వహణ భర్తకు ఉన్న ప్రాధమిక, నిరంతర బాధ్యత అని సుప్రీంకోర్టు గురువారం తేల్చిచెప్పింది. భార్య గౌరవప్రదంగా సమాజంలో తలెత్తుకుని జీవించే విధంగా భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భర్త ఉండే బాధ్యత , ఇందులో వేరే ప్రశ్నకు తావులేదని తేల్చిచెప్పారు. న్యూఢిల్లీలో 2023లో భార్యాభర్తలు అయిన దంపతుల కేసులో న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఆగస్టీన్ జార్జి మాసిహ్తో కూడిన ధర్మాసనం స్పందించింది. భార్యకు భార్య నుంచి నెలవారి ఖర్చులను ఇప్పుడున్న రూ 15000 నుంచి రూ 25000కు పెంచింది. అయితే ఈ నిర్వహణకు అయ్యే మొత్తం ఖరారు అనేది సముచిత రీతిలో ఉండాలి. ఆమె గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవల్సి ఉంటుంది. అయితే ఇదే క్రమంలో ఆయనకు శక్తికి మంచిన భారం మోపేలా ఈ నిర్వహణ మొత్తం ఉండరాదని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల సంధి..
వాషింగ్టన్: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గురువారం తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. లెబనాన్ అధ్యక్షులు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ మధ్య చర్యలు అత్యద్భుతంగా జరిగాయి. ఫలితంగా కాల్పుల విరమణ నిర్ణయానికి వచ్చారని ట్రంప్ తెలిపారు. లెబనాన్ ప్రభుత్వానికి , ఇజ్రాయెల్కు మధ్య 34 ఏండ్ల వ్యవధి తరువాత జరిగిన చర్చలు ఫలించడం కీలకమని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దౌత్యపరంగా అత్యంత కీలక పరిణామం అన్నారు. కాల్పుల విరమణ తక్షణం అమలులోకి వచ్చిందని తెలిపారు. అయితే ఈ చర్చల గురించి ఇజ్రాయెల్ నుంచి కానీ హెజ్బోల్లా నుంచి కానీ ఎటువంటి నిర్థారణ వెలువడలేదు. ఈ రెండు పక్షాల మధ్యనే ఇప్పుడు నిత్య సమరం సాగుతోంది.
పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన ముంబయి..
ఐపిఎల్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు, ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్, 3.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది. ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్(80 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(66)లు భారీ అర్ధ శతకాలతో రాణించారు. దీంతో పంజాబ్ జట్టు 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో ముంబయిపై పంజాబ్ ఏడు వికెట్లతో గెలుపొందింది. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు వికెట్లు పడగొట్టగా.. శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. కాగా, పంజాబ్ కు వరుసగా నాలుగో విజయం ఇది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(110 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. డికాక్ తోపాటు నమన్ ధీర్(50) అర్ధశతకంతో రాణించాడు. ర్యాన్ రికెల్టన్(2), హార్దిక్ పాండ్యా(14), రూథర్ ఫోర్డ్(1)లు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా..జాన్సెన్, శశాంక్ సింగ్ లకు చెరో వికెట్ దక్కింది
బిజెపి ఎంపి తేజస్విపై చర్యలు తీసుకోవాలి: పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్లో తెలంగాణ విభజన పై భారత్ పాకిస్థాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి తేజస్వి సూర్య పై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం డిజిపికి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఒక ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగిందని ఆయన తెలిపారు. దీనిని భారతదేశపు బాధాకరమైన, హింసాత్మక విభజనతో పోల్చడం ఆ ప్రక్రియ పవిత్రతను తగ్గించడమే కాక, తెలంగాణ ప్రజల మనోభావాలను విస్మరించినట్లు అవుతుందని మంత్రి అన్నారు. ఇలాంటి ప్రకటనలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ప్రాంతీయ కలహాలను పెంచడానికి, చారిత్రక, రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించడానికి అవకాశం ఉందని మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ప్రజా శాంతి, సామరస్యాలను కాపాడటానికి, ఈ విషయాన్ని పరిశీలించి, చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిజిపిని కోరారు.
తెలంగాణ ఏర్పాటుపై బిజెపి విషం: కెటిఆర్
పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-, పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బిజెపి నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ బిజెపి చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు. తెలంగాణ అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కెటిఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాట ఫలితం: హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని, అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బిజెపి ఎంపి తేజస్వి సూర్య వాఖ్యలు హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనన్నారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బిజెపి తట్టుకోలేకపోతుందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యునిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్, సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ సంఘ్వీ, మరో 13 మంది కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి , రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ బీహార్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలకు చెందిన మొత్తం 16 మంది నూతన ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ 16 మందిలో ఎనిమిది మంది బీజేపీకి చెందిన వారు కాగా, ముగ్గురు బీజేపీ మిత్ర పక్షాల వారు. మిగతా ఐదుగురు ఎంపీలు కాంగ్రెస్కు చెందినవారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నబీన్ ఎన్నికైన తరువాత బీహార్ శాసనసభకు రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపీ అయ్యారు. అధికార సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ నుంచి తిరిగి ఎన్నికైన కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఉపేంద్ర కుష్వాహా (ఆర్ఎల్ఎం), శివేష్ కుమార్ (బీజేపీ) కూడా బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు . అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాష్ గోవల్లా (బీజేపీ) , జోగెన్ మోహన్ (బీజేపీ) ప్రమోద్బోరో (యుపిపిఎల్) ప్రమాణస్వీకారం చేశారు. ఛత్తీస్గఢ్కు చెందిన లక్ష్మీవర్మ (బీజేపీ) ,ఫూలోదేవి నేతమ్ (కాంగ్రెస్) , హర్యానా ఎంపీలైన కరమ్వీర్ సింగ్ బౌధ్ ’( కాంగ్రెస్ ) ,సంజయ్ భాటియా (బీజేపీ) ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సంఘ్వీ, వేమ్ నరేంద్రరెడ్డి, ఈ ఇద్దరూ కాంగ్రెస్ ఎంపీలే. ఒడిసా ఎంపి సుజీత్ కుమార్ ’(బీజేపీ) హిమాచల్ ప్రదేశ్ ఎంపీ అనురాగ్శర్మ(కాంగ్రెస్) ప్రమాణస్వీకారం చేశారు.
షా తెలివికి చాణక్యుడికే షాక్ ః ప్రియాంక గాంధీ
మహానుభాడు చాణక్యుడు బతికి ఉంటే, ఈ సభకు వచ్చి ఉంటే మీ వక్రబుద్ధికి కంగుతిని పోయి ఉండేవాడని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ లోక్సభలో చురకలకు దిగారు. హోం మంత్రి అమిత్ షాను ఉద్ధేశించి ఆమె స్పందించారు. కేంద్రం డిలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా పెంపుదల జోడిస్తూ తీసువచ్చిన బిల్లులపై చర్చలో ప్రియాంక పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును సమర్థిస్తుంది. అయితే ఈ బిల్లు వెనుక రాజకీయ దురుద్ధేశాలను వ్యతిరేకిస్తుంది. మొత్తం మీద ఎన్నికలలో రాజకీయ ట్రంప్ కార్డు మాదిరిగా ఈ బిల్లును వాడుకుంటున్నందుకు చివరికి చాణుక్యుడు అయినా విస్తుపోయి తీరాల్సిందే అని అమిత్ షాను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. దీనికి అమిత్ షాతో పాటు బిజెపి, మిత్రపక్షాల ఎంపిలు చిరునవ్వులు చిందించారు. ప్రియాంక కూడా నవ్వుతూనే ఘాటుగా విమర్శలకు దిగారు. రాజకీయ ఎత్తుగడలతో సభకు విజెపి వారు బాగా సిద్ధం అయి వచ్చినట్లు ఉందని స్పందించారు. ఆడవారికి ఎవరు నిజాలు చెపుతున్నారో, ఎవరు అసత్యాలకు దిగుతారో అన్ని తెలుసునని స్పష్టం చేశారు.
తండ్రి మరణం తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన పేట్ బషీరాబాద్ మైసమ్మగూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పి. జ్ఞానశ్రీ (21) అనే విద్యార్థిని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె మైసమ్మగూడలోని ‘వైభవ్ ఉమెన్స్ హాస్టల్’లో నివాసం ఉంటున్నారు. గత నెల మార్చి 31వ తేదీన జ్ఞానశ్రీ తండ్రి చెన్నకేశవరెడ్డి మృతి చెందారు. తండ్రి అంత్యక్రియల అనంతరం, పరీక్షలు ఉండటంతో రెండు రోజుల క్రితమే ఆమె హైదరాబాద్కు తిరిగి వచ్చారు. బుధవారం నాటి పరీక్షకు హాజరైన ఆమె, గురువారం మాత్రం పరీక్ష రాయకుండా మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో హాస్టల్కు చేరుకున్నారు. గదిలోకి వెళ్లిన జ్ఞానశ్రీ తన చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించడంతో గమనించిన తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, అక్కడ ఒక ‘సూసైడ్ నోట్’ దొరికింది.నాన్న మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది, ఆయన లేని లోటును తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని మృతురాలు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పెట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ తెలిపారు.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గురువారం తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. లెబనాన్ అధ్యక్షులు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ మధ్య చర్యలు అత్యద్భుతంగా జరిగాయి. ఫలితంగా కాల్పుల విరమణ నిర్ణయానికి వచ్చారని ట్రంప్ తెలిపారు. లెబనాన్ ప్రభుత్వానికి , ఇజ్రాయెల్కు మధ్య 34 ఏండ్ల వ్యవధి తరువాత జరిగిన చర్చలు ఫలించడం కీలకమని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దౌత్యపరంగా అత్యంత కీలక పరిణామం అన్నారు. కాల్పుల విరమణ తక్షణం అమలులోకి వచ్చిందని తెలిపారు. అయితే ఈ చర్చల గురించి ఇజ్రాయెల్ నుంచి కానీ హెజ్బోల్లా నుంచి కానీ ఎటువంటి నిర్థారణ వెలువడలేదు. ఈ రెండు పక్షాల మధ్యనే ఇప్పుడు నిత్య సమరం సాగుతోంది.
రిజర్వేషన్లతో.. లోక్సభలో మహిళలకు 272 సీట్లు: మేఘ్వాల్
లోక్సభ సభ్యుల సంఖ్యను 815కు పెంచి, అందులో 272 స్థానాలను మహిళలకు కేటాయించనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం వెల్లడించారు. ఈ మహిళా రిజర్వేషన్ అమలుతో పురుషులకు గానీ, ఏ రాష్ట్రానికి గానీ ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. మహిళల రిజర్వేషన్ చట్టంలో సవరణలు చేయడం, డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై లోక్సభలో ప్రారంభ ప్రసంగం చేస్తూ, మొత్తం స్థానాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించే సులభ సూత్రం ప్రకారం 272 స్థానాలు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతిపాదిత చట్టాల ప్రకారం ప్రస్తుత లోక్సభ బలం కంటే సుమారు 50 శాతం పెరగనుంది. మహిళల రిజర్వేషన్ అమలైన తరువాత పురుషులు గానీ, ఏ రాష్ట్రం గానీ నష్టపోరు అని ఆయన పునరుద్ఘాటించారు.లోక్సభతో పాటు రాష్ట్ర శాసనసభల్లో కూడా మహిళల కోటాలోనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రి తెలిపారు. ‘నారి శక్తి వందన్ అధినియమ్ 2023’ ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగితే, 2026 తర్వాత లభించే జనగణన డేటా ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల రిజర్వేషన్ సాధ్యమవుతుందని, అందువల్ల 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్ అమలు కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చామని తెలిపారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు తగిన హక్కులు కల్పించడమే ప్రధాన లక్ష్యం అని మేఘ్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఓటు హక్కులు భారతదేశంతో పోలిస్తే ఆలస్యంగా వచ్చినట్టు మేఘ్వాల్ చెప్పారు. అమెరికాలో పురుషులకు ఓటు హక్కు వినియోగించుకున్న144 సంవత్సరాల తరువాత మహిళలకు ఓటు హక్కు లభించిందని, యునైటెడ్ కింగ్డమ్లో 1918లో కొన్ని షరతులతో, 1928లో పూర్తిస్థాయిలో మహిళలకు ఓటు హక్కు కల్పించారని వివరించారు. భారతదేశంలో మాత్రం తొలి ఎన్నికల నుంచే మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు లభించింది అని అన్నారు. ఈ బిల్లుకు అన్ని పార్టీలు, సభ్యులు పూర్తి మద్దతు ఇవ్వాలని మెఘ్వాల్ కోరారు. లోక్సభ గురువారం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2026, డీలిమిటేషన్ బిల్లు 2026లను చర్చించి ఆమోదం కోసం తీసుకుంది. సుమారు 40 నిమిషాల తీవ్ర చర్చ అనంతరం బిల్లులు ప్రవేశపెట్టగా, రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. తరువాత జరిగిన ఓటింగ్లో 251 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా, 185 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ప్రవేశపెట్టబడింది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ప్రకారం, 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి, 2029 లోక్సభ ఎన్నికలకన్నా ముందే మహిళల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి లోక్సభ స్థానాల సంఖ్యను పెంచనున్నారు. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు స్థానాల సంఖ్యను పెంచుతారు. మహిళలకు కేటాయించిన స్థానాలు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విభిన్న నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయించబడతాయని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాజ్యాంగ సవరణ బిల్లులోని డీలిమిటేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా ఓటు వేయాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే శాసనసభల్లో మహిళల రిజర్వేషన్కు తాము వ్యతిరేకం కాదని అవి స్పష్టం చేశాయి.
సిడ్నీ: ఐపిఎల్లో ఆడేందుకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ పాట్ కమిన్స్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కొంత కాలంగా ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న కమిన్స్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అతను ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యాడు. దీంతో ఐపిఎల్ ఆడేందుకు అడ్డంకులు తొలగి పోయాయి. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు కమిన్స్ సారథిగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిట్నెస్ సమస్య తలెత్తడంతో కమిన్స్ ప్రస్తుతం ఐపిఎల్కు దూరంగా ఉన్నాడు. కాగా, వైద్య పరీక్షల్లో పాస్ కావడంతో హైదరాబాద్ బయలుదేరి రానున్నాడు. త్వరలోనే కమిన్స్ సన్రైజర్స్ టీమ్లో చేరే అవకాశాలున్నాయి. హైదరాబాద్ చేరిన సిఎస్కె టీమ్ ఐపిఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గురువారం నగరానికి చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిఎస్కె జట్టుకు ఘన స్వాగతం లభించింది. చెన్నై శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్రైజర్స్తో తలపడనుంది. సిఎస్కె సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. కాగా, తమ ఆరాధ్య క్రికెటర్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. దీంతో విమానాశ్రయం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. కాగా, సిఎస్కె టీమ్ రాక నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే సిఎస్కె జట్టు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సాధన చేయనుంది.
డీలిమిటేషన్లో దక్షిణానికి నష్టం లేదు.. 50% పెంపుతో లాభమే: బీజేపీ ఎంపీ
డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు స్థానాలు తగ్గుతాయనే ఆందోళనల మధ్య, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఈ ప్రక్రియ దక్షిణాదికి నష్టాన్ని కాకుండా లాభాన్నే కలిగిస్తుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకూ సమానంగా 50 శాతం సీట్ల పెంపు చేయనున్నందున దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తరువాత హోంమంత్రి అమిత్ షా కూడా తన ప్రసంగంలో హామీ ఇచ్చారు. పార్లమెంట్లో చర్చ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయి. జనాభా నియంత్రణలో మెరుగ్గా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఈ బిల్లు ఉత్తమమైన అవకాశమని అన్నారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం కేంద్రం మూడు బిల్లులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లు కీలక వివాదంగా మారింది. ఈ బిల్లు ప్రకారం 2011 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ ప్రక్రియతో లోక్సభ సీట్ల సంఖ్య 543 నుంచి సుమారు 850కి (రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35) పెరగనుంది. వీటిలో 273 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. దక్షిణ రాష్ట్రాల ప్రధాన ఆందోళన ఏమిటంటే, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ లాభం చేకూరుతుందని.. జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తమ వాటాను కోల్పోతామని భావిస్తున్నాయి. దీని వల్ల పార్లమెంట్లో తమ ప్రభావం, అలాగే పన్నుల పంపిణీలో వాటా తగ్గే ప్రమాదం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ వంటి ఆరు రాష్ట్రాలు కలిపి దేశ జనాభాలో సుమారు 24 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఈ ఆందోళనలను తేజస్వి సూర్య కొట్టిపారేస్తూ, అన్ని రాష్ట్రాలకు ప్రస్తుత వాటా ప్రకారం సమానంగా 50 శాతం సీట్ల పెంపు ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2) ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ పనిచేస్తుంది. అందువల్ల ప్రతి రాష్ట్రానికి దాదాపు 50 శాతం అదనపు సీట్లు ఇవ్వడం మాత్రమే సాధ్యమైన మార్గం అని ఆయన చెప్పారు. కర్ణాటక ఉదాహరణగా అమిత్ షా వివరించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి 28 లోక్సభ సీట్లు ఉండగా, కొత్త బిల్లుతో అవి 42కు పెరుగుతాయని చెప్పారు. మొత్తం 816 స్థానాల్లో కర్ణాటక వాటా దాదాపు మారకుండా ఉంటుందని, అందువల్ల వాస్తవంగా ఎలాంటి నష్టం ఉండదని పేర్కొన్నారు. ఈ 50 శాతం సూత్రం ప్రకారం దక్షిణ రాష్ట్రాలకు లభించే సీట్లు ఇలా ఉండే అవకాశముంది: తమిళనాడు: ప్రస్తుతం 39 సీట్లు సుమారు 59 సీట్లు కేరళ: ప్రస్తుతం 20 సీట్లు సుమారు 30 సీట్లు ఆంధ్రప్రదేశ్: ప్రస్తుతం 25 సీట్లు సుమారు 37 సీట్లు ఒడిశా: ప్రస్తుతం 21 సీట్లు సుమారు 31 సీట్లు తెలంగాణ: ప్రస్తుతం 17 సీట్లు సుమారు 25 సీట్లు కర్ణాటక: ప్రస్తుతం 28 సీట్లు సుమారు 42 సీట్లు మొత్తంగా చూస్తే, 2011 జనగణన ఆధారంగా లెక్కిస్తే.. సూత్రం ద్వారా దక్షిణ రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెరిగే అవకాశముందని కేంద్రం వాదిస్తోంది.
సెంచరీతో చెలరేగిన డికాక్.. పంజాబ్ కు భారీ టార్గెట్
ఐపిఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(110 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ స్టేడియంలో ప్రేక్షకులను అలరించాడు. డికాక్ తోపాటు నమన్ దీప్(50) అర్ధశతకంతో రాణించాడు. ర్యాన్ రికెల్టన్(2), హార్దిక్ పాండ్యా(14), రూథర్ ఫోర్డ్(1)లు విఫలమయ్యారు. దీంతో ముంబై 200 మార్కో స్కోరును చేరుకోలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా..జాన్సెన్, శశాంక్ సింగ్ లకు చెరో వికెట్ దక్కింది.
బాహుబలి, అవతార్ సినిమాల్లా ’రావు బహదూర్’ మైమరపిస్తుంది
సూపర్స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్... వెంకటేష్ మహా దర్శకత్వంలో, సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ’రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ’ఓ సుందరి’ని రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ “మహేష్ బాబు, నమ్రత కథ విని ఓకే చెప్పగానే మేము ఈ సినిమాను మొదలుపెట్టాం. గోపాలకృష్ణ రావడంతో పని ఇంకా సులభమైంది. ఈ సినిమా కోసం సత్య ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. ఈ పాత్ర కోసం 30 టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీప ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఆమె పాత్ర గుర్తుండిపోతుంది. స్మరణ్ సాయి సంగీతం సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ‘ఓ సుందరి’ పాట దానికి నిదర్శనం. ఈ సినిమా అందరికీ మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నాను”అని అన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ “ఓ సుందరి పాట వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నేను సినిమాలకు వచ్చిన కొత్తలో కమల్ హాసన్ లాంటి పాత్రలు ఎప్పుడైనా వస్తుందా అని అనుకునేవాడిని. ఒక రోజు వెంకటేష్ మహా ఈ కథ చెప్పారు. షూటింగ్ మొదటి రోజు ఉదయం మూడు గంటలకు సెట్లోకి వెళ్లి రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ చేశాను. ఇలా ఐదు రోజులు గడిచాక టెన్షన్ వచ్చి ఇంకా ఎన్ని రోజులు ఇలా? అని అడిగాను. దాదాపు 85 రోజులు అని చెప్పారు. అప్పుడు నా పని అయిపోయింది అనుకున్నాను. అలాంటి సమయంలో ‘ఓ సుందరి’ పాట వినిపించారు. ఆ పాట మాకు డిటాక్స్లా అనిపించింది. ఈ పాట మహిళలు సెలబ్రేట్ చేసేలా ఉంటుంది. మా నిర్మాతలు ఇంత ఆనందంగా ఉన్నారంటే, దర్శకుడు మహా ఎంత అద్భుతంగా ఈ సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి, అవతార్ లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో మా రావు బహుదూర్ సినిమా కూడా మిమ్మల్ని అంతే స్థాయి లో అలరిస్తుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దీప థామస్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, గోపాలకృష్ణారెడ్డి, స్మరణ్ సాయి, విజయ్ యేసుదాస్ పాల్గొన్నారు.
హైదరాబాద్ రావాల్సిన ఆకాశ విమానాన్ని ఢీకొన్న స్పైస్జెట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో గురువారం పెను ప్రమాదం తప్పింది. రన్వే పై టాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ ఎయిర్ , స్పైస్ జెట్కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. విమానాలు టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు ఆకాశ ఎయిర్ విమానం రన్వేపై ఉంది. అదే సమయంలో పార్కింగ్వైపు ప్రయాణిస్తున్న స్పైస్జెట్ విమానం, ఆకాశ విమానాన్ని పక్కనుంచి తాకుతూ వెళ్లింది. ఈ ప్రమాదంలో స్పైస్జెట్ విమానం కుడివైపు రెక్కభాగం దెబ్బతినగా, పార్క్ చేసి ఉన్న ఆకాశ ఎయిర్ విమానం ఎడమవైపు భాగం దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు కానీ, సిబ్బందికి కానీ ఎలాంటి గాయాలు తగల లేదు. ఈ సంఘటనపై డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా స్పందించింది. రన్వే పై విమానాల కదలికలో ఎక్కడ లోపం జరిగిందో దర్యాప్తునకు ఆదేశించింది. ఆకాశ ఎయిర్ అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ“ ఈ సంఘటనలో ప్రయాణికులు, సిబ్బందిని వెంటనే కిందకు దింపాం. వారి భద్రత మా ప్రథమ ప్రాధాన్యం. ప్రయాణికులను హైదరాబాద్ పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం ” అని వెల్లడించారు.
కేంద్రం కుట్రలు సాగనివ్వము: కల్వకుంట్ల కవిత
నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రలు సాగనివ్వమని గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ పార్లమెంట్ లో తెలంగాణకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మహిళ బిల్లుకు, డీలిమిటేషన్ బిల్లుకు అసలు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మహిళ బిల్లును ఎప్పుడో ఆమోదించారని డీలిమిటేషన్, మహిళ బిల్లు వేర్వేరు అంశాలని చెప్పారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ లో తెలంగాణకు రాజకీయ ప్రాతినిధ్యం 3.13 శాతంగా ఉందని, డీలిమిటేషన్ను ఏ ప్రాతిపదికన తీసుకున్నా సరే తెలంగాణ ప్రాతినిధ్యం ఏ మాత్రం తగ్గొద్దని తేల్చి చెప్పారు. మొత్తంగా 50 శాతం సీట్లు పెంచుతామంటూ ప్రతిపాదించటం కూడా సరైన పద్దతి కాదని కవిత పేర్కొన్నారు. కేంద్రం చెప్పే లెక్కల కారణంగా పెద్ద రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం జరుగుతుందన్నారు. ఇప్పటికే నిధులు, జాతీయ ప్రాజెక్ట్ లకు హోదా ఇచ్చే విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని, తెలంగాణ ప్రాతినిధ్యం మరింత తగ్గితే ఇంకా అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే ఉరుకునేదే లేదని తేల్చి చెప్పారు. మరో తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఉద్యమాన్ని చేపడతామని కేంద్రాన్ని హెచ్చరించారు. మహిళ బిల్లుకు డీలిమిటేషన్ ను లింక్ చేయటాన్ని తప్పు పట్టారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే మహిళ బిల్లుకు బిసి సబ్ కోటాను లింక్ చేయాలని సూచించారు.
2023లో మద్దతిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు కొర్రీలు పెడుతోంది: పురందేశ్వరి
న్యూఢిల్లీ: మహిళ రిజర్వేషన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని రాజమండ్రి లోక్సభ ఎంపి పురందేశ్వరి అన్నారు. గతంలో చాలాసార్లు బిల్లు పెట్టినా సాకారం కాలేదని, అప్పట్లో సమాజ్వాదీ పార్టీ మద్దతివ్వలేదని తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో ఆమె మాట్లాడారు. రాజకీయాల్లో మహిళ పాత్ర పెరిగిందని గ్రహించాలన్నారు. ‘‘ఈ బిల్లు పాస్ కావడం మహిళల దశాబ్ధాల కల. 2023లో మద్దతిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం కొర్రీలు పెడుతోంది. జనగణన పేరుతో అభ్యంతరాలు చెబుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు మొట్టమొదట 1996లో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది’’ అని అన్నారు.
లష్కరే కోఫౌండర్ ఆమిర్ హమ్జాపై కాల్పులు..
లాహోర్ : లష్కరే తయ్యిబా సహ వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై గుర్తు తెలియని సాయుధులు కాల్పులు జరిపారు. లాహోర్ లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ బయట ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని మీడియా కథనాలు వెల్లడించాయి. సిసిటివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. 24 న్యూస్ హెచ్డి టివి అనే ప్రయివేట్ టివి ఛానల్ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన జస్టిస్ (రిటైర్డ్( నజీర్ అహ్మద్ ఘాజీ తోపాటు అమిర్ హమ్జా ప్రయాణిస్తున్న ఛానల్ వాహనంపై ఈ కాల్పులు జరిగాయి. ఘాజీ మాత్రం గాయపడకుండా తప్పించుకోగలిగారు. ఈ దాడిని పాకిస్థాన్ మర్కజి ముస్లిం లీగ్ తీవ్రంగా ఖండించింది. దాడులకు పాల్పడిన వారిని తక్షణం అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని లీగ్ కోరింది. ఆమిర్ హమ్జాను ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్లో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లో అతడి పాత్రపై ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి, ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో పది జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలంగాణ వెథర్ మ్యాన్ వెల్లడించారు. రాష్ట్రంలో విపరీతమయిన ఎండలకు జగిత్యాలలో అత్యధికంగా 44.4 డిగ్రీలు నమోదు కాగా, వరుసగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక మెదక్, సిరిసిల్ల 43.8, పెద్దపల్లి 43.6, ములుగు, నాగర్ కర్నూల్ 43.5, గద్వాల్, రంగారెడ్డి 43.1, నారాయణ పేటలో43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలంగాణ వెధర్ మ్యాన్ పేర్కొన్నారు. ఈ ఉష్ణోగ్రతలు మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, దీంతో పాటు వడగాలలు వీస్తాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో సైతం బానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్లో అత్యధికంగా ఆర్సి పురంలో 42.3, ఆసిఫ్నగర్, హిమాయత్ నగర్ 42 డిగ్రీలు నమోదు కాగా, 15 ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలపైగా నమోదయ్యాయి. ఈ పరిస్ధితులు మరో మూడు రోజుల పాటు నగరంలో కొనసాగుతాయని వెధర్ మ్యాన్ పేర్కొన్నారు. దీని తొడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతాయని, ఎండలకు తోడు వడగాలులు వీస్తాయని 30 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండ వేడిని దృష్టిని ఉంచుకుని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
దైవదర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు
ఆధ్యాత్మిక యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. భక్తి పారవశ్యంతో రాఘవేంద్రుడి దర్శనం కోసం బయల్దేరిన ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. తెల్లవారు జామున ప్రశాంతంగా సాగుతున్న ప్రయాణాన్ని మృత్యువు లారీ రూపంలో కబళించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. భక్తులతో వెళ్తు న్న బొలెరో వాహనం, ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ లారీ అత్యంత వేగంతో ఒకదాని కొకటి ఢీకొనడంతో క్షణాల్లో రక్తపాతం చోటు చేసుకుంది. కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన సుమారు 21 మంది భక్తులు మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనం కోసం బొలెరో వాహనంలో బయల్దేరారు. గమ్యస్థానానికి చేరువవుతున్న సమయంలో చిలకలడోన వద్ద ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద దాటికి బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు విడవగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు కన్ను మూశా రు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉండటం అందరినీ కలిచివేస్తోం ది. మరో 13 మంది తీవ్ర గాయాలతో ఎమ్మిగనూరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా భక్తుల హాహాకారాలతో దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపటా ్టరు. వాహన శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజాము న వెలుతురు సరిగ్గా లేకపోవడం, వాహనాల వేగం ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పవిత్ర పుణ్య క్షేత్ర దర్శనానికి వెళ్తూ, గమ్యానికి కూతవేటు దూరంలో ఉండగా ఇలా విగతజీవులుగా మారడం చిక్మంగళూరులో ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. మృతులను కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీ లించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బొలెరో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఘట నపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై ఎపి సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఎపి మంత్రులు భరత్, జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సేవలు అందిం చాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. బాధితులకు పరిహారం ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
కట్ట మైసమ్మ చెరువులో ఆటో డ్రైవర్ మృతదేహం లభ్యం
మానసిక ఆందోళనతో ఓ ఆటో డ్రైవర్ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా నగర్కు చెందిన మరాటి సాయిలు (54) గత 20 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సాయిలు, అనారోగ్యం కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఈనెల 15న మధ్యాహ్నం ఆటో నడపడానికి వెళ్తున్నానని భార్య స్రవంతికి చెప్పి బయలుదేరారు. రాత్రి అయినా ఆయన తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయింది.గురువారం మధ్యాహ్నం సూరారంలోని కట్ట మైసమ్మ చెరువు సమీపంలో సాయిలు ఆటో నిలిపి ఉంచడాన్ని గమనించారు. పోలీసులు స్థానికుల సాయంతో గాలించగా చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సూరారం సిఐ సుధీర్ కృష్ణ తెలిపారు.
పిన్నధరిలో అంగరంగ వైభవంగా వనభోజనాల మహోత్సవం..
తాడిమర్రి, విశాలాంధ్ర: మండల పరిధిలోని పిన్నధరి గ్రామంలో బుధవారం వనభోజనాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటల సమయంలో గ్రామస్థులంతా కలిసి గ్రామాన్ని ఖాళీ చేసి శ్రీ రామస్వామి, అతకల్లప్ప స్వామి విగ్రహాలను ఊరి బయటకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర శర్మ స్వామి ఆధ్వర్యంలో రామాయణ పురాణాలను భక్తులకు వినిపించారు. అనంతరం గ్రామస్థులు తమ బంధువులతో కలిసి ఆనందంగా వనభోజన కార్యక్రమాన్ని జరుపుకున్నారు.శ్రీరామనవమి పండుగ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో […] The post పిన్నధరిలో అంగరంగ వైభవంగా వనభోజనాల మహోత్సవం.. appeared first on Visalaandhra .
రెండో భార్యతో కలిసి పిల్లలను చంపడానికి ప్రయత్నించిన తండ్రి
విషం కలిపిన బిస్కెట్లతో సొంత పిల్లలను చంపేందుకు తండ్రి, అతని రెండో భార్య ప్రయత్నించారు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. అనిత తరిగొప్పుల మండలం ఆంక్షాపూర్ గ్రామానికి చెందినది. తన ఇద్దరి కుమారులతో కలిసి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో నివసిస్తున్నది. అయితే అనిత భర్త శ్రీనివాస్ సంవత్సరం కిత్రం ముడావత్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో అనిత పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయగా పెద్దమనుషుల సమక్షంలో పిల్లల పేరిట 20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని భర్త శ్రీనివాస్ ఒప్పుకున్నాడు.పిల్లలను చూసుకుంటూ , భూమిని సాగు చేసుకుంటూ, అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్తూ అనిత జీవనం సాగిస్తుండగా ఈ మధ్య తన భూమి తనకు ఇవ్వాలని అనితను శ్రీనివాస్ వేధించడం ప్రారంభించాడు. మరోసారి పోలీసులను ఆశ్రయించిన అనిత ఫిర్యాదుతో, శ్రీనివాస్ భూమిని దక్కించుకోవాలనే కక్షతో పిల్లలను హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందుకోసం రెండో భార్య మమత సహాయం తీసుకున్నాడు.స్కల్ కు వెళ్తున్న పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లను తినిపినించాలని ఓ వ్యక్తి సుపారీ ఇచ్చాడు. అయితే ఆ విషయం సుపారీ తీసుకున్న వ్యక్తి అనితకు చెప్పాడు.దీంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్తో పాటు అతని రెండో భార్య మమతను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Kangana Ranaut Comes Out to Support Deepika Padukone
Kangana Ranaut is known for her outspoken nature and she always made sensational statements. Known for expressing opinions on a strong note, Kangana Ranaut has come out to support actress Deepika Padukone. A debate took place about the eight-hour work culture in Indian cinema. After Deepika Padukone lost a couple of big films because of […] The post Kangana Ranaut Comes Out to Support Deepika Padukone appeared first on Telugu360 .
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు..
విశాలాంధ్ర, పెనుకొండ: మండల పరిధిలోని వెంకటగిరిపాలెం గ్రామానికి చెందిన రమేష్ (35) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామం నుంచి పని నిమిత్తం గుట్టూరు గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బొలెరో వాహనానికి అతని మోటార్ బైక్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రమేష్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.రమేష్ తల్లి వెంకటరత్నమ్మ […] The post రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు.. appeared first on Visalaandhra .
వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బొల్లపల్లి కృష్ణ
వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బొల్లపల్లి కృష్ణ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ
బైపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు..
బైపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలు
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలు నిర్వహిస్తున్న పశ్చిమ తహశీల్దార్ డి.రిబ్కా రాణి
కరెంటు షాక్ తగిలి మహిళ మృతి కడెం, ఆంధ్రప్రభ : కూలర్లో నీళ్లు
రక్త దానం.. ప్రాణదానం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రక్త దానం.. ప్రాణదానంతో
అబ్బుర పరిచేలా కొండపల్లి బొమ్మల పండుగ ..
అబ్బుర పరిచేలా కొండపల్లి బొమ్మల పండుగ .. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర
సుజనా చౌదరి కార్యాలయంలో సీయం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ….
సుజనా చౌదరి కార్యాలయంలో సీయం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ…. భవానిపురం, ఆంధ్రప్రభ
అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర
శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం…
శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం… అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ప్రత్యేక కార్యక్రమాలకు మినహా
Hyderabad : మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక నిందితుడి అరెస్ట్
మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు అరెస్ట్ చేశారు
అక్రమ కల్లు దుకాణాన్ని ప్రోత్సహిస్తున్న అధికారులు …
అక్రమ కల్లు దుకాణాన్ని ప్రోత్సహిస్తున్న అధికారులు … సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
ఒక్క దెబ్బతో నౌకలన్నీ ముంచేస్తాం
16 పరశురాం అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక సందేశం పంపింది. హర్మూజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సన్నిహితుడు, సైనిక సలహాదారు రెజాయి ఒక ప్రకటన విడుదల చేశారు. హర్మూజ్లో అమెరికా పెత్తనం కొనసాగితే తమ తొలి క్షిపణ దాడికే అమెరికా నౌకలన్నీ మునిగిపోతాయని హెచ్చరించారు. ప్రాణనష్టం కూడా తీవ్రంగా ఉంటుందన్నారు. హర్మూజ్కు సెక్యూరిటీ గార్డ్ పనిచేయడమే మీ పనా? ఒక అమెరికా అధక్షుడు ఈ స్థాయికి దిగజారి పోతారా? అని ఎద్దేవా చేశారు. జలసంధిపై ఆధిపత్యం కోసం ఒక శక్తివంతమైన దేశం, శక్తివంతమైన సైన్యం చేయాల్సిన పని ఇదేనా? అని ప్రశ్నించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా క్షిపణి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. విమానాలు రద్దు చేయాల్సి వస్తుందేమో? హర్మూజ్ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానయాన రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఇఎ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపా వద్ద విమానాల ఇంధనం కేవలం వారం రోజులకు సరిపోయేంత మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే విమాన సరీసులు రద్దు చేసే పరిస్థితి తలెత్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హర్మజ్లో గ్యాస్, ఇంధన సరఫరా నిలిపివేయడంతో మునుపెన్నడూ లేని కొరత వేధిస్తోందని ప్రకటించింది.
Spirit Deals: Sandeep Reddy Vanga’s Big No
Sandeep Reddy Vanga emerged as one of the top directors of Indian cinema in no time. After the super success of Animal, he is now in a commanding stage. He is directing the country’s biggest star Prabhas in Spirit. The film is an action drama and Prabhas plays the role of a cop. Right after […] The post Spirit Deals: Sandeep Reddy Vanga’s Big No appeared first on Telugu360 .
ఆన్లైన్ స్నేహం… ప్రమాదపు అంచుల దాకా పయనం48 గంటల్లో ఇద్దరు బాలికలను కాపాడిన
మహిళ హక్కులకు బీజేపీ ఛాంపియన్ కాదు : ప్రియాంక
బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు
Prime Minister Narendra Modi delivered a clear message in the Lok Sabha as concerns over the proposed delimitation exercise continued to grow across political circles. Addressing Members of Parliament, he assured the nation that no state would face discrimination and that the existing balance of representation would remain intact. The Prime Minister stated that the […] The post Modi Assures No State Will Lose Representation in Delimitation Push, Calls for Unity on Women’s Reservation appeared first on Telugu360 .
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో దారుణం..
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది.కామినేని హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నరేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంకు చెందిన నరేష్ (38) అనే వ్యక్తి నారాయణ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తాడు. గుండెలో చిన్న నొప్పి ఉందని నడుచుకుంటూ హాస్పిటల్ కి వచ్చాడు. పరీక్షించిన వైద్యులు 8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. 5 లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ చేశాక నరేష్ మృతి చెందాడు. జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేశారని, మాకు న్యాయం చేయాలంటూ కామినేని హాస్పిటల్ ముందు మృతుడి బందువులు ఆందోళన చేపట్టారు. నారాయణ కాలేజీ లెక్చరర్స్ కలసి కామినేని ఆసుపత్రి ముందు న్యాయం మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా.. మా నారాయణ లెక్చరర్స్ మృతి కి కామినేని ఆసుపత్రి వైద్యులు కారణమని వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని కామినేని డౌన్ కామినేని డౌన్ తోటి ఉద్యోగులు. నినాదాలు చేశారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రీ-సర్వే సమస్యల పరిష్కారమే ధ్యేయం
రీ-సర్వే సమస్యల పరిష్కారమే ధ్యేయం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జలుమూరు(నరసన్నపేట),
Andhra Pradesh : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం..
మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం.. మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి
ముస్లింలకు మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండదు: అమిత్ షా
గురువారం లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా మాట్లాడుతూ ముస్లింలకు మత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వబోమని, అలాంటి కోటా రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను లోక్సభ ముందుకు తెచ్చింది. ఈ సందర్భంగా విపక్షాలు తమ అభ్యంతరాలను లేవనెత్తగా.. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్షా తోసిపుచ్చారు. లోక్సభ చర్చల్లో తీవ్ర వాదోపవాదాల మధ్య, మహిళల రిజర్వేషన్ చట్టంలో సవరణలు చేయడం, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కోసం మూడు బిల్లులు ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన ప్రక్రియలో జనాభా లెక్కింపుతో పాటు కుల గణన కూడా చేపడతామని ఆయన వెల్లడించారు. సభలో సమాజ్వాదీ పార్టీ నేతలు అఖిలేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ ముస్లింలకు కోటా ఇవ్వాలని వాదించిన తరువాత అమిషా, మతం ఆధారంగా ముస్లిం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రశ్నే లేదు. మన రాజ్యాంగం మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడానికి అనుమతించదు. ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వబోమన్నది మా ప్రభుత్వ దృఢ సంకల్పం. అలాంటి రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని ఘాటుగా స్పందించారు. సమాజ్వాదీ పార్టీ సభ్యులు కుల గణన కోసం డిమాండ్ చేస్తున్నారని, అయితే ప్రభుత్వం ఇప్పటికే కుల గణన చేపట్టే నిర్ణయం తీసుకుందని, అది జనాభా లెక్కింపుతో పాటు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం గృహాల లెక్కింపు జరుగుతోందని, గృహాలకు కులం ఉండదని పేర్కొంటూ, సమాజ్వాదీ పార్టీకి అవకాశం దొరికితే గృహాలకే కులం నిర్ణయించేవారు అని విమర్శించారు. అలాగే, సమాజ్వాదీ పార్టీ తమ టికెట్లన్నింటినీ ముస్లిం మహిళలకు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని షా వ్యాఖ్యానించారు. జనగణన సమయంలో కుల గణనకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తామని, అది వ్యక్తిగతంగా తాను కూడా కోరుకుంటున్న విషయమని ఆయన తెలిపారు. ఈ జనగణన కుల గణనతో కలిపి నిర్వహిస్తామని స్పష్టంగా చెబుతున్నాను అని పేర్కొన్నారు. 2027 జనగణనలో భాగంగా గృహాల లెక్కింపు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. గత సంవత్సరం ఏప్రిల్ 30న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ, రాబోయే జనగణనలో కుల గణనను చేర్చే నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్రం తర్వాత నిర్వహించిన అన్ని జనగణనల్లో కుల గణనను తప్పించారు. లోక్సభ గురువారం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2026, డిలిమిటేషన్ బిల్లు 2026లను ప్రవేశపెట్టి, చర్చించింది. ప్రతిపాదన ప్రకారం లోక్సభ సభ్యుల సంఖ్యను 815కు పెంచాలని, అందులో 272 స్థానాలను మహిళలకు కేటాయించాలని నిర్ణయించారు. ఇది మొత్తం స్థానాలలో 33 శాతం ఉంటుంది.
తోడికోడలి నాలుగేళ్ల కుమారుడిని చంపేందుకు పిన్ని కుట్ర
మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమారుడిని తాత పట్టించుకోవడం లేదన్న కోపంతో.. తోడికోడలి నాలుగేళ్ల కుమారుడిని చంపేందుకు పిన్ని కుట్ర చేసింది. ఎవరూ లేని సమయం చూసి జ్యూస్ అని చెప్పి చిన్నారికి యాసిడ్ తాగించింది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులు బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో నివసిస్తున్నారు. వీరికి నాగరాజు, జగదీష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరి కుమారులకు వివాహాలు అయ్యాయి. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు నాగరాజుకు నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే ఇంట్లో తాత సతీష్ కుమార్ పెద్ద కుమారుడి కొడుకుపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తన కుమారుడిని పట్టించుకోవడం లేదని చిన్న కోడలు మంజుల మనసులో కక్ష పెంచుకుంది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యూస్ అని చెప్పిబాలుడికి యాసిడ్ తాగించింది. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలి..
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలి.. బాలనగర్, ఆంధ్రప్రభ
ఒక్క దెబ్బతో నౌకలన్నీ ముంచేస్తాం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్ : అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక సందేశం పంపింది. హర్మూజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సన్నిహితుడు, సైనిక సలహాదారు రెజాయి ఒక ప్రకటన విడుదల చేశారు. హర్మూజ్లో అమెరికా పెత్తనం కొనసాగితే తమ తొలి క్షిపణ దాడికే అమెరికా నౌకలన్నీ మునిగిపోతాయని హెచ్చరించారు. ప్రాణనష్టం కూడా తీవ్రంగా ఉంటుందన్నారు. హర్మూజ్కు సెక్యూరిటీ గార్డ్ పనిచేయడమే మీ పనా? ఒక అమెరికా అధక్షుడు ఈ స్థాయికి దిగజారి పోతారా? అని ఎద్దేవా చేశారు. జలసంధిపై ఆధిపత్యం కోసం ఒక శక్తివంతమైన దేశం, శక్తివంతమైన సైన్యం చేయాల్సిన పని ఇదేనా? అని ప్రశ్నించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా క్షిపణి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. విమానాలు రద్దు చేయాల్సి వస్తుందేమో? హర్మూజ్ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానయాన రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఇఎ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపా వద్ద విమానాల ఇంధనం కేవలం వారం రోజులకు సరిపోయేంత మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే విమాన సరీసులు రద్దు చేసే పరిస్థితి తలెత్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హర్మజ్లో గ్యాస్, ఇంధన సరఫరా నిలిపివేయడంతో మునుపెన్నడూ లేని కొరత వేధిస్తోందని ప్రకటించింది.
ప్రతినిత్యం ప్రజాసేవ… ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం
ప్రతినిత్యం ప్రజాసేవ… ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం తనదైన మార్క్ అభివృద్ధితో
ఉస్మానియా ఆస్పత్రి హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య, కుటుంబసభ్యుల ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని పిజి హాస్టల్లో సురేశ్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో మత్తు ఇంజిక్షన్, నిద్ర మాత్రలు తీసుకున్నాడు. అయితే, అతడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితమే ఉస్మానియా కళాశాలలో పిజిలో చేరినట్లు చెబుతున్నారు. ర్యాగింగ్ వల్లే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద సురేశ్ కుటుంబసభ్యులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.
పాలకమండలి సభ్యునిగా ప్రియదర్శిని నవీన్ బాబు….
పాలకమండలి సభ్యునిగా ప్రియదర్శిని నవీన్ బాబు…. ఖమ్మం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్
యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా సుధాకర్ గౌడ్.
బిక్కనూరు, ఆంధ్రప్రభ ; తెలంగాణ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా సుధాకర్ గౌడ్
రహదారి నిర్మాణంలో వేగం పెంచాలి…
రహదారి నిర్మాణంలో వేగం పెంచాలి… కేంద్ర మంత్రికి చొప్పదండి ఎమ్మెల్యే వినతి హైదరాబాద్,
రోడ్డు భద్రతకు పోలీసుల వినూత్న చర్యలు
రోడ్డు భద్రతకు పోలీసుల వినూత్న చర్యలు అచ్చంపేట, ఆంధ్రప్రభ ; రహదారి ప్రమాదాల
Swayambhu Ra Ra Dheevara: Goosebumps Galore Song
Nikhil Siddhartha has undeniably set a new benchmark for cinematic grandeur with his upcoming Pan-India film, Swayambhu. Directed by Bharat Krishnamachari the movie is an orchestrated magnificent epic, brought to life on a staggering scale by producers Bhuvan and Sreekar. The makers have now unveiled first single, Ra Ra Dheevara from this highly anticipated film. […] The post Swayambhu Ra Ra Dheevara: Goosebumps Galore Song appeared first on Telugu360 .
బ్లేజ్వాడ ఎండల్లోనూ ఇంద్రకీలాద్రి పటిష్టత…
బ్లేజ్వాడ ఎండల్లోనూ ఇంద్రకీలాద్రి పటిష్టత… ముమ్మరంగా సాగుతున్న ఎన్ ఐ ఆర్ ఎం
ఏఐ నగరాన్ని ఏర్పాటు చేస్తాం: ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విజయ్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్.. గురువారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ పథకాలను విజయ్ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా విజయ్ మాట్లాడుతూ..టీవీకే నిజాయితీతో కూడిన పరిపాలనను తన సిద్ధాంతంగా స్వీకరించింది. అందుకే మా పార్టీ తొలి ఎన్నికల మేనిఫెస్టో కూడా నిజాయితీకి హామీ అని మేము చెబుతున్నాము. మేము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించము. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టోను తయారు చేయలేదు. డిఎంకెతోపాటు మిగతా పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలను తీసుకుని పోల్చి చూడండి. ఒకటి రెండు అంశాలు ఒకేలా ఉన్నా ఫర్వాలేదు. కానీ వారు ఏం చేశారో మీకు తెలుసా? ఒకరు రూ.10,000 ఇస్తామని వాగ్దానం చేస్తే, మరొకరు రూ.8,000 కూపన్ను అందిస్తున్నారు. ఒకరు రిఫ్రిజిరేటర్ ఇస్తే, మరొకరు రిఫ్రిజిరేటర్ కొనడానికి టోకెన్ ఇస్తున్నారు. ఇందులో ఏ విధంగా చూసినా, వారిద్దరూ కేవలం పేరు, రంగు మార్చి ఒకే ఎన్నికల ప్రణాళికను సమర్పించారు. మేము వారి లాగా.. ప్రజలను ఎన్నటికీ మోసం చేయము అని చెప్పారు. రాష్ట్రంలో 60 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని విజయ్ తెలిపారు. ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత ఎల్పిజి సిలిండర్లను కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు మద్దతుగా, టీవీకే అధినేత వివాహానికి సహాయం, 8 గ్రాముల బంగారం, నాణ్యమైన పట్టు చీరతో సహా అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే అవినీతి రహిత, సమర్థవంతమైన పాలన అందిస్తామని హామీ ఇస్తూ, ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ విశ్వవిద్యాలయం, ఏఐ నగరాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ప్రతి కళాశాల విద్యార్థికి మద్దతుగా, అండర్ గ్రాడ్యుయేట్ నుండి డాక్టరేట్ వరకు విద్యా రుణాల కోసం రూ. 20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణ హామీని అందిస్తాము. ఏఐ సహకారంతో ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ అందిస్తాము. ఉపాధి కార్యాలయాలలో నమోదు చేసుకున్న ప్రతి గ్రాడ్యుయేట్ యువతకు నెలకు రూ.5,000 అందుతాయి. 5 వార్షిక కేటాయింపు గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.10,000, ఐటిఐ, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ. 8,000 స్టైపెండ్తో లక్షల ఇంటర్న్షిప్లు అందిస్తాం అని విజయ్ హామీలను ప్రకటించారు. కాగా.. తమిళనాడులో పోలింగ్ ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనుంది, కాగా ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.
రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి
స్వీయ గణనకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు…
స్వీయ గణనకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు… శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : స్వీయ గణన
బల్మూర్లో గుర్తుతెలియని వృద్ధుడి మృతి
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం
Jeevan Reddy : కారులో ప్రయాణం సాఫీగా సాగేనా? గతుకుల రోడ్డు పయనమేనా?
సీనియర్ నేత జీవన్ రెడ్డి మరికొంత కాలం కాంగ్రెస్ లో వేచి చూస్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు
ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన కాంగ్రెస్..
చండీగఢ్: హర్యానాలో ఐదుగురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 'క్రాస్-ఓటింగ్'కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 16) కాంగ్రెస్.. ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. మాజీ ఎంపీ ధరంపాల్ మాలిక్ నేతృత్వంలోని పార్టీ హర్యానా విభాగపు క్రమశిక్షణా చర్యల కమిటీ (DAC), ఎమ్మెల్యేలు మహమ్మద్ ఇలియాస్ (పునహానా), మహమ్మద్ ఇస్రాయిల్ (హథిన్), రేణు బాలా (సధౌరా), షాలీ చౌదరి (నరైన్గఢ్), జర్నైల్ సింగ్ (రాటియా) లను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రావు నరేందర్ సింగ్ తెలిపారు. రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్య తీసుకున్నామని, దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు.
ఆలయంలోని స్వయంగా లడ్డు ప్రసాదం తయారీ…
ఆలయంలోని స్వయంగా లడ్డు ప్రసాదం తయారీ… ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు
ఎయిర్పోర్టులో అకాసా, విమానాన్ని ఢీకొట్టిన స్పైస్జెట్ విమానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో స్పల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న అకాసా విమానాన్ని రన్వేపై స్పైస్జెట్ విమానం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. రన్వేపై ఉన్న అకాసా విమానాన్ని పార్కింగ్ వైపు వెళ్తున్న స్పైస్ జెట్ విమానం తాకుతూ వెళ్లింది. ఈ ప్రమాదంలో స్పైస్జెట్ కుడివైపు రెక్క భాగం ధ్వంసమవ్వగా.. అకాసా విమానం ఎడమవైపు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంపై అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బందిని వెంటనే విమానం నుంచి కిందికి దింపాం. వారి భద్రత మా ప్రథమ ప్రాధాన్యం. ప్రయాణికులను హైదరాబాద్ పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని వెల్లడించారు. అటు స్పైస్జెట్ కూడా ఈ ఘటనను ధృవీకరించింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు.
Chandrababu : సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న చంద్రబాబు
స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు
ఘనంగా చేనేత కార్మిక సంఘం 90 వ ఆవిర్భావ దినోత్సవం
విశాలాంధ్ర -ధర్మవరం; చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం లో స్థానిక కదిరి గేట్ దగ్గర గల చేనేత విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 90వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి […] The post ఘనంగా చేనేత కార్మిక సంఘం 90 వ ఆవిర్భావ దినోత్సవం appeared first on Visalaandhra .
తేజస్వి సూర్య ఒక తెలివిలేని మూర్ఖుడు : మంత్రి పొన్నం
ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
Akhil Akkineni’s Lenin: Yetta Yetta is a Peppy Melody
The makers of Lenin are clearly aiming to strike a chord with the masses through their music. The film starring Akhil Akkineni and Bhagyashri Borse in lead roles. Thaman composed the chartbuster first single titled VaareVaa VaareVaa. Now, he brings another groovy melody full of vibrant beats. This is a high-energy track that leans into […] The post Akhil Akkineni’s Lenin: Yetta Yetta is a Peppy Melody appeared first on Telugu360 .
ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల..
కళాశాల డైరెక్టర్ లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని డైరెక్టర్లు డోలా పెద్దారెడ్డి, భగవంతు రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎం సీతారామయ్య, ఏ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులందరికీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ఎం మోక్షిత్ విజ్ఞామానసీ 463 మార్కులు, […] The post ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల.. appeared first on Visalaandhra .
Delhi Airport |స్వల్ప ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం
Delhi Airport | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎయిర్పోర్టులో రెండు
రాష్ట్ర విభజనపై తేజస్వి సూర్య సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు
One More Biopic for Aamir Khan?
Bollywood Mr Perfect Aamir Khan is lining up a bunch of new projects. He was last seen in Sitaare Zameen Par that released last year. As per the reports, Aamir Khan will soon feature in the biopic of Ashneer Grover. The discussions have been going on from sometime and Aamir Khan has given his nod […] The post One More Biopic for Aamir Khan? appeared first on Telugu360 .
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషువిశాలాంధ్ర ధర్మవరం;;జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో -2026 సైన్స్ ప్రయోగాల పోటీలలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ , సత్యనిర్ధారన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు అరుణా దేవి, కల్యాణి,పద్మశ్రీ, కవిత , ఉమాదేవి […] The post యురేకా సైన్స్ ఎక్స్పో- 2026 లో రాష్ట్ర స్థాయి విజేతలు గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు.. appeared first on Visalaandhra .
Ponnam |అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్
Ponnam | అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్ Ponnam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఇంటర్ ఫలితాలలో విజయదుందుభి మోగించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు..
ప్రిన్సిపాల్ వనిత వాణివిశాలాంధ్ర ధర్మవరం; ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు విజయదుందుభి మోగించడం జరిగిందని ప్రిన్సిపాల్ వనిత వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరపు లో 141 మంది పరీక్షలు రాయగా 117 మంది ఉత్తీర్ణత సాధించి 83 శాతంనమోదు కావడం జరిగిందన్నారు. ఒకేషనరీ విభాగంలో 85 మంది కు గాను 71 మంది ఉత్తీర్ణులు కాగా 84 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. టాపర్లుగా ఎస్. భవాని […] The post ఇంటర్ ఫలితాలలో విజయదుందుభి మోగించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు.. appeared first on Visalaandhra .
Narendra Modi : ఈ బిల్లు చారిత్రాత్మకం.. వ్యతిరేకిస్తే ఓటమి తప్పదు
దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయని, ఇది అలాంటి సమయమేనని ప్రధాని మోదీ అన్నారు
Setback for Tamannaah in Madras High Court
Today, the Madras High Court has dismissed an appeal that was filed by actress Tamannaah in which the actress challenged rejecting the payment of Rs 1 crores as damage claims against Power Soaps Limited. The actress filed the plea over unauthorized use of her images to promote the brand. The brand used the pictures of […] The post Setback for Tamannaah in Madras High Court appeared first on Telugu360 .
అఖిల్ ‘లెనిన్’ నుంచి ‘ఎట్టా ఎట్టా’ వీడియో సాంగ్ రిలీజ్
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అఖిల్.. ఇప్పటికీ సరైన హిట్ దొరక్క ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకూ అతను చేసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. ఇప్పుడు అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రం గురించి ప్రకటన వచ్చి చాలాకాలమే అయినా.. సరైన అప్డేట్స్ మాత్రం రాలేదు. అయితే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని నెలల క్రితం చిత్రం నుంచి తొలి సాంగ్ని విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా’ అంటూ సాగే పాట వీడియో సాంగ్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్లో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేతో కలిసి స్టెప్పులు ఇరగదీశాడు. ఇక తమన్ అందించిన సంగీతం పాటని నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లింది. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా.. శ్రీకృష్ణ అలపించారు. ఇక కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత
విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు గురువారం కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు మాలకొండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కే సునీత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు […] The post గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత appeared first on Visalaandhra .
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ రెడ్డి
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ చురుకైన
పెన్నహోబిలం దేవస్థానంలో లడ్డు ప్రసాదంపై కీలక సంస్కరణలు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : భక్తుల సౌకర్యం, విశ్వాస పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇకపై దేవస్థానం ఆవరణంలోనే శుచిశుభ్రతతో, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తయారు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రేగాటి నాగరాజు ప్రకటించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవస్థాన ప్రతిష్టను మరింతగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి […] The post పెన్నహోబిలం దేవస్థానంలో లడ్డు ప్రసాదంపై కీలక సంస్కరణలు appeared first on Visalaandhra .
మహిళల స్వావలంబన ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్: మోడీ
న్యూఢిల్లీ: దేశ పార్లమెంటరీ చరిత్రలో ఈరోజును మరిచిపోలేం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లోక్సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మోడీ మాట్లాడారు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం తన అదృష్టంగా మోడీ అభివర్ణించారు. మహిళ రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప బిల్లు అని అన్నారు. 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం కాలేదని తెలిపారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర చాలా కీలకమైందని పేర్కొన్నారు. మహిళలను కలుపుకుని ముందుకెళ్తున్నామని అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని స్పష్టం చేశారు. దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నామని తెలిపారు. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని.. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే.. అది సంపూర్ణ వికసిత్ భారత్ అని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకమని ప్రధాని మోడీ అన్నారు. ‘‘మహిళా బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలు బుద్ధి చెబుతారు. మహిళల బిల్లు విషయంలో అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. మహిళ రిజర్వేషన్ బిల్లును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఈ బిల్లును తేవటంలో ఎలాంటి రాజకీయ దురుద్ధేశం లేదు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదు.. దేశ ప్రజల కోసం తెచ్చిన బిల్లు. 30 ఏళ్ల క్రితమే మహిళా బిల్లు తెచ్చామంటున్నారు.. మరి ఎవరికైనా మేలు జరిగిందా? తమకు అన్యాయం చేసిన వారిని మహిళలు సమయం చూసి దెబ్బ కొడతారు. మహిళా బిల్లుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. మహిళలు తమ హక్కులపై 30 ఏళ్లుగా గొంతు విప్పుతున్నారు. క్షేత్రస్థాయిలో మహిళలు 30 ఏళ్లుగా పోరాడుతున్నారు’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాజకీయాల్లో శక్తిసామర్ధ్యాలు చూపించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని.. ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుందని మోడీ వివరించారు. ‘‘మహిళా బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే మనుగడ ఉంటుంది. గ్రామీణస్థాయిలో రిజర్వేషన్ల వల్ల మహిళలకు రాజకీయ అవగామన వచ్చింది. ఇప్పటికే గ్రామీణస్థాయి మహిళలు నాయకులుగా రాణిస్తున్నారు. ఒక్కసారి 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చూస్తే.. మహిళ శక్తి ఏంటో చూస్తారు. మహిళా బిల్లు నిర్ణయం ఒక్క రాత్రిలో జరిగింది కాదు.. ఈ బిల్లును అందరం మనస్ఫూర్తిగా స్వాగతించాలి. 2023లో అందరి ఏకగ్రీవంగా నారీ శక్తి బిల్లును ఆమోదించుకున్నాం. కొవిడ్ వల్ల 2021లో జనగణన చేపట్టలేకపోయాం’’ అని మోడీ తెలిపారు. ఈ బిల్లు తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారని మోడీ ధ్వజమెత్తారు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ‘‘విభజన రాజకీయాలు చేసే వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం.. అనే భేదాలు మాకు లేవు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం. ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని వాగ్దానం చేస్తున్నాం. దేశంలోని మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నాం. అనేక పార్టీలు మహిళల హక్కులను ఇన్నాళ్లూ అడ్డుకున్నాయి. దాన్ని గుర్తించే మేం ఇప్పుడు మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నాం’’ అని మోడీ స్పష్టం చేశారు.
Ntr – Rukmini |త్యాగానికి ఫలితం దక్కేనా..?
Ntr – Rukmini | త్యాగానికి ఫలితం దక్కేనా..? Ntr – Rukmini
Stimulate |వేడికి గురైన వెంటనే చల్లటి నీరు తాగితే శరీరానికి ఏం జరుగుతుంది?
Stimulate | వేడికి గురైన వెంటనే చల్లటి నీరు తాగితే శరీరానికి ఏం
కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరిగింది.గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, ప్రముఖులు కొర్రపాటి మల్లికార్జున ఆధ్వర్యంలో హిటాచీ, జేసీబీ యంత్రాలతో సుమారు 40 రోజుల పాటు నిరంతర […] The post కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి appeared first on Visalaandhra .
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని ఎస్ఎన్ఎల్ కాలనీలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి భీమ లింగయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురికాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు […] The post అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ appeared first on Visalaandhra .
BJP MP |కాంగ్రెస్ నిర్ణయాల వల్లే ఇప్పటికీ విభేదాలు…
BJP MP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్సభలో డీలిమిటేషన్ అంశంపై

33 C