Telangana |కవిత పార్టీపై కాంగ్రెస్ స్పందన
Telangana | కవిత పార్టీపై కాంగ్రెస్ స్పందన Telangana | ఆంధ్రప్రభ, వెబ్
Nayanthara locked for Salman Khan’s Film
Top South Indian actress Nayathara was seen in Shah Rukh Khan’s Jawan and the actress played a crucial role in Yash’s Toxic that is due for release. The actress has been approached to play the lead role beside Salman Khan in his upcoming film that will be helmed by Tollywood director Vamshi Paidipally. The actress […] The post Nayanthara locked for Salman Khan’s Film appeared first on Telugu360 .
ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు…
ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు… అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఉమ్మడి
ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..
ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది. న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పిక్క కండరాల గాయంతో ధోనీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాను వేదికగా తెలియజేసింది. ప్రస్తుతం ధోనీ చికిత్స పొందుతున్నాడని.. దీంతో ఈ సీజన్లోని మొదటి రెండు వారాల మ్యాచ్లకు దూరం కానున్నట్లు వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. మార్చి 30న గువహటిలోని బర్సపరా స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ లకు ధోనీ దూరం కానున్నాడు. ఎప్పుడు తిరిగి జట్టులోకి అడుగుపెడతాడు అన్న విషయాలను గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. కాగా, టీమిండియాకు వీడ్కోలు పలికిన తర్వాత గత కొన్నేళ్లుగా ధోనీ కేవలం IPLలో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయాలు వేధిస్తున్నప్పటికీ తరచుగా మ్యాచ్లు ఆడుతూ.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ అండగా నిలిచాడు. 2023లో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి జట్టుకు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
గొంది మురళికి ప్రముఖుల సన్మానం
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్
CM Chandrababu |రైతుల సహకారంతో రాజధాని నిర్మాణం
CM Chandrababu | రైతుల సహకారంతో రాజధాని నిర్మాణం CM Chandrababu |
TG |భద్రాచలంలో గవర్నర్ శుక్లాకు ఘనస్వాగతం
TG | ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి
AP |నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం..
AP | నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం.. AP |
Why did Rishab Shetty Unfollow Rukmini Vasanth?
Kannada actor Rishab Shetty emerged as a pan-Indian star with Kantara. The second installment is a huge success and Rishab Shetty has several feature films lined up in various languages. Rishab Shetty recently unfollowed Hombale Films, the producers of Kantara. There are strong speculations that there are financial differences between the Kantara star and his […] The post Why did Rishab Shetty Unfollow Rukmini Vasanth? appeared first on Telugu360 .
Peddi Release: Ram Charan strict on his Stand
Mega Powerstar Ram Charan’s upcoming movie Peddi is slated for April 30th release across the globe. The film’s shoot is yet to be wrapped up and the team is working round the clock to meet the deadlines. The shoot will continue till the mid of April. At this time, Ram Charan suffered a minor injury […] The post Peddi Release: Ram Charan strict on his Stand appeared first on Telugu360 .
Thieves |అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి..
Thieves | అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి.. Thieves | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
పంచాయితీ కార్మికులకు దుస్తులు పంపిణీ
దమ్మపేట, ఆంధ్రప్రభ : పంచాయితీ పారిశుధ్య కార్మికులకు దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ
ఇది దేవుడి నిర్ణయం.. ఓంకారేశ్వర ఆలయానికి సిఎం రేవంత్ శంకుస్థాపన
మూసీ ప్రక్షాళన అత్యవసరమని ముఖ్యమంత్రి రేవ్ంత్ రెడ్డి అన్నారు. మంచిరేవులలో పర్యటన సందర్భంగా శనివారం సిఎం రేవంత్రెడ్డి.. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని.. ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామని అన్నారు. మంచిరేవులలో ఈ కార్యక్రమం దేవుడి నిర్ణయమని చెప్పారు. హైదరాబాద్ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలిసి.. నల్గొండ వరకూ వెళ్తోంది. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు చాలా బాధపడుతున్నారు. పుట్టిన ఊరి నుంచి పిల్లలను బయటకు పంపే దుస్థితి ఈ ప్రాంతంలో ఉంది. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలిస్తున్నాం. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. మూసీ నదిని బాగుచేయాలని గతంలో అనేకమంది ప్రయత్నించారు. ఈ అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం మా అదృష్టం అని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణంతోపాటు ఆధునిక గోశాల నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రూ.700 కోట్ల వ్యయంతో 8 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించనున్నారు. వంద అడుగులతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
Rushya Datta debut with an entertainer Don Bosko: Shoot Completed
Radha Krishna Entertainments, a rising banner recognized for its strong distribution network across overseas markets and Telugu states, is now stepping into production with the comedy entertainer Don Bosko. Backed by producer Venkat Upputuri, the film marks an exciting new chapter for the banner. The film introduces successful producer Naga Vamsi’s Brother in law Rushya […] The post Rushya Datta debut with an entertainer Don Bosko: Shoot Completed appeared first on Telugu360 .
మూసాపేటలో కుళ్లిన మాంసం దందా బట్టబయలు #Hyderabad #FoodSafety #TaskForceRaid #SpoiledMeat #HFAST
Hyderabad : హైదరాబాద్ లో గంట సేపు నేడు లైట్లు ఆఫ్
హైదరాబాద్ వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు అలర్ట్ చేసింది
అక్రమ ఇసుక రవాణాపై ఆందోళన వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అక్లూర్
పగటి నాటకాలకు, సాయంత్రం నాటకాలకు తేడా ఏమిటి? నాటకం అదే అయినా పగలు వేస్తే ప్రజలు తమ పనుల్లో ఉంటారు గనుక తీరిక ఉండే కొద్ది మంది తప్ప రారు. సాయంత్రమైతే చాలా మంది వెళతారు. ఇరాన్ యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం చేసిన ప్రతిపాదనలు పగటి నాటకం వంటివే. ఎందుకంటే, వాటిని అమెరికన్లతో సహా ఎవరూ విశ్వసించటం లేదు గనుక. అందువల్లనే, తన జీవితంలో టివి షో మ్యాన్ పాత్ర కూడా వహించిన ఆయన పగటి నాటకానికి ఎవరూ పోవటం లేదు. తన ధోరణికి పరాకాష్ఠ అన్నట్లు ట్రంప్ ఈ నెల అన్న మాటలను గమనించండి. ఇరాన్లో నాయకత్వ లోటు ఏర్పడినందున తనను సుప్రీం లీడర్గా రావలసిందని కోరుతున్నారట. తాను ఒప్పుకోవటం లేదట. ఇది హాస్యం కోసం అన్నదని ఎవరైనా కొట్టి వేయవచ్చు. కాని, వెనిజువెలాను ఇక తానే నడపనున్నానని, క్యూబాను చేతిలోకి తీసుకోగలనని, పనామా కాల్వను, కెనడాను, గ్రీన్లాండ్ను ఆక్రమించగలనని ఆ దిశలో ప్రయత్నాలు కూడా చేసిన వ్యక్తికి మనసులో అటువంటి ఆలోచనలు ఉన్నాయన్న మాట. తన స్వభావమే అదన్నమాట. అందుకే ఆయన తనకు ఎటువంటి అంతర్జాతీయ చట్టాలన్నా లెక్కలేదని, తన మనసుకు తోచిందే చేస్తానని బాహాటంగా ప్రకటించారు. దీనంతటిని బట్టి అనిపించేదేమిటి? ఇరాన్ విషయమై తను, ఇజ్రాయెల్ ప్రధాని కలిసి ఒక లక్షంగా ప్రకటించిన రాజ్య వ్యవస్థ మార్పు (రెజీమ్ ఛేంజ్) ఒకవేళ నిజంగా జరిగినట్లయితే, అపుడు ట్రంప్ ఆ దేశానికి తనను తానే సుప్రీం లీడర్గా ప్రకటించుకుంటే ఆశ్చర్యపడవలసింది ఉండదు. ఈ రహస్య ఉద్దేశంతోనే కావచ్చు, ఇరాన్లో నాయకత్వ శూన్యత ఏర్పడిందని, మాజీ రాజవంశానికి చెందిన రెజా పహ్లవీకి దేశంలో తగినంత మద్దతు లేదని ఆయన ఈ మధ్య అంటున్నారు. ట్రంప్ వంటి వ్యక్తి ఎందుకైనా తగును. ఇతర విషయాలలోకి వెళ్లే ముందు, ఇరాన్తో చర్చల కోసం షరతులంటూ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వాటిని, తన షరతులంటూ ఇరాన్ ముందు పెట్టిన వాటిని గమనించండి. వాటిలో అత్యధికం రాజీకి వీలుపడనివే. ఎపుడైనా చర్చలంటే ఇరుపక్షాలు మొదట కొన్ని షరతులు పెట్టడం, చర్చల క్రమంలో కొన్ని రాజీలు కుదరటం సాధారణంగా జరిగేదే. కాని, ఉభయులకూ వారి మౌలిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. వాటిపై రాజీ అన్నది అసంభవం. అటువంటి అంశాలు ప్రస్తుతం అమెరికా, ఇరాన్లు రెండింటి జాబితాలలో ఉన్నాయి. అమెరికా 15 షరతులలో 4 విధాలైనవి ఉన్నాయి. ఒకటి, అణుశక్తి. రెండు, క్షిపణులు. మూడు, హెజ్బొల్లా, హూతీ వంటి అనుబంధ మిలిటెంట్ సంస్థలు. నాలుగు, హర్మూజ్ జలసంధి. అమెరికా ఈ నాలుగింటిని షరతులుగా మార్చిందంటేనే రెండవ వైపు నుంచి చూసినపుడు ఇరాన్కు అవి అంత కీలకమైనవి అన్నమాట. బయటి వారుగా ఆలోచించినట్లయితే మనకు అనిపించేది కూడా అదే. అటువంటపుడు ఇరాన్ ఎట్లా రాజీ పడగలదు. ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయాలని, ఇప్పటికే శుద్ధి అయిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలని, భవిష్యత్లో ఎన్నడు కూడా అణ్వస్త్రాలు తయారు చేయబోమంటూ ఒప్పుకోవాలని అమెరికా అంటున్నది. ఇందుకు ఇరాన్ గతం నుంచే చెప్తూ వస్తున్న దేమిటో తెలిసిందే. సామూహిక మానవ హననం చేసే అణ్వస్త్రాల తయారీ ఇస్లాం మతానికే విరుద్ధమన్న గత సుప్రీం లీడర్ ఖమేనీయే వాటి ఉత్పత్తిని నిషేధిస్తూ ఫత్వా జారీ చేశారు. దేశ రక్షణకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ముప్పు పెరుగుతున్నందున ఆ నిషేధాన్ని సడలించాలంటూ అంతర్గతంగా ఒత్తిడులు పెరుగుతుండినా అంగీకరించిలేదు. అదే ఫత్వాకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నందున అణ్వస్త్రాల తయారీ ప్రసక్తే లేదు. కనుక ఆ షరతును ఇప్పుడు కొత్తగా అంగీకరించవలసిన అవసరం లేదు. అదట్లుండగా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తాము 1970 లోనే సంతకం చేశాము. ఆ ఒప్పందంలో సభ్యులైన దేశాలకు యురేనియంను శాంతియుత వినియోగం కోసం శుద్ధి చేసుకునే హక్కు పూర్తిగా ఉంటుంది. అటువంటి శుద్ధిని పర్యవేక్షించే అధికారం అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉంటుంది. అదే ప్రకారం జరుగుతూ వస్తున్నది కూడా. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి అవసరం కాగా, తాము ఎప్పుడూ 60 శాతానికి మించలేదు. దానిని అంతకన్న కూడా తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ప్రస్తుత యుద్ధానికి ముందు అమెరికాతో ఒమన్ మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతుండిన చర్చలతో సూచించాము. అదే మాట అమెరికన్ ప్రతినిధులూ అన్నారు. అటువంటపుడు, మేమసలు అణుశుద్ధి చేయరాదని, శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేయాలని షరతులు విధించటంలో ఉద్దేశమేమిటి? అది మాకెట్లా ఆమోదయోగ్యమవుతుంది? ఎన్పిటి సంతకందారులుగా, ఒక స్వతంత్ర దేశంగా మా అవసరాల రీత్యా, మా హక్కుల మాటేమిటి? అసలు మాకు ఈ షరతులు విధించటానికి అమెరికా గాని, మరొకరు గాని ఎవరు? అన్నది ఇరాన్ గతం నుంచి చేస్తున్న వాదన. ఈ సూటి ప్రశ్నలకు అమెరికా సూటి సమాధానాలు ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు తిరిగి చర్చలు జరిగినా చెప్పగలగటం అనుమానమే. ఇందులోని విచిత్రమేమంటే, ఇజ్రాయెల్ అణ్వాయుధాల తయారీకి పాశ్చాత్య దేశాలు స్వయంగా సహకరించాయి. ఆ దేశం ఎన్పిటిపై సంతకం నేటికీ చేయకపోయినా అందుకు ఒత్తిడి చేయటం లేదు. ఈ ద్వంద్వ నీతిలో రహస్యమేమీ లేదు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక స్వతంత్ర విధానం గల దేశం కాగా, ఇజ్రాయెల్ తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం నమ్మినబంటుగా వ్యవహరిస్తున్నది. అది ఏ మాత్రం దాపరికం లేకుండా వారే చెప్తున్న మాట. ఈ వివరాలన్నీ చూసిన మీదట, ఇపుడు అమెరికన్ల అణు సంబంధ షరతులకు ఇరాన్ అంగీకరించేదీ లేనిదీ ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. ఆ తర్వాత అంశం క్షిపణులు. యుద్ధాలలో గాని, ఆత్మరక్షణకు గాని ఒకప్పుడు పదాతి దళాలు, నావికా బలం, ట్యాంకులు, సాయుధ శకటాలు, వైమానిక బలం ప్రధానంగా ఉండేవి. క్రమంగా క్షిపణులు, వార్హెడ్స్, సైబర్ నైపుణ్యాలు మొదటి వరుసలోకి వస్తున్నాయి. డ్రోన్స్ కూడా. ప్రస్తుతం ఇరాన్ ఆత్మరక్షణ యుద్ధం క్షిపణులు, వార్హెడ్స్, డ్రోన్లపై ఆధారపడి అసమతుల వ్యూహం (అసిమ్మెట్రిక్గా) సాగుతున్నది. అటువంటప్పుడు, ఇరాన్ తన క్షిపణి శక్తిని పరిమితం చేయాలని, తాము నిర్ణయించిన శక్తి మాత్రమే ఉండాలని అమెరికా షరతు విధించడమంటే అర్థమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆ తర్వాత డ్రోన్ల ఉత్పత్తినీ పరిమితం చేయాలంటారు. వరుస దాడులతో సైనిక స్థావరాలను, వైమానిక, నౌకా స్థావరాలను, ఆయుధ కర్మాగారాలను ఇప్పటికే ధ్వంసం చేస్తున్నారు. ఇక ఇరాన్కు మిగిలేదేమిటి? ట్రంప్ తనతో ఒక మాట అన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వెల్లడించారు. తాము ఏ లక్షాలనైతే యుద్ధం ద్వారా సాధించాలనుకుంటున్నామో వాటినన్నింటిని యుద్ధ విరమణ ఒప్పందం ద్వారా నెరవేర్చజూస్తున్నామని. అందుకు నెతన్యాహూ సంతృప్తి చెందారట. ఇటువంటి షరతులకు ఇరాన్ నాయకత్వం అంగీకరించటమంటే ఆత్మహత్య చేసుకోవటమే. ఆ తర్వాత ఇరాన్ జాతి అమెరికాకు సామంత జాతిగా మారటమే. ఇక పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్లకుగాని, ఇప్పటికే వారి సామంతులుగా మారిన గల్ఫ్ షేక్లకు గాని ఇక ఎదురులేకపోవటమే. అంతే ముఖ్యంగా, ఇక పాలస్తీనా ఎప్పటికీ స్వతంత్ర దేశం కాకపోవటం, గ్రేటర్ ఇజ్రాయెల్ అవతరణకు మార్గం సుగమం కావటమే. బహుళ ధ్రువ ప్రపంచ లక్షం సాకారం కావటంలో ఒక ప్రధాన శక్తి అయిన ఇరాన్ పరిస్థితి అట్లా కావడమంటే, ఆ లక్ష సాధన ఆ మేరకు దెబ్బతిని సామ్రాజ్యవాదం బలపడినట్లే. ఇటువంటి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అమెరికా ప్రతిపాదించిన ఈ సోకాల్డ్ శాంతి ప్రతిపాదనలలో చివరి ఎత్తు గత, ఇరాన్ భౌగోళిక సమగ్రతలో భాగమైన హర్మూజ్ జలసంధిపై హక్కును వదలుకోవాలనటం. ఆ జలసంధి, అందులోని ఖర్గ్ తదితర దీవులు ఇరాన్కు భౌగోళిక సమగ్రత, ఆర్థిక ప్రయోజనాల కోసం అతి కీలకమైనవి. వాటన్నింటిని వదలుకోవాలన్న ట్రంప్ చాలా తెలివికలవాడే కావచ్చుగాని, ఆ షరతులను అంగీకరించేందుకు ఇరాన్ నాయకత్వం తెలివి తక్కువదని భావించగలమా? అంతేకాదు, అసమతల యుద్ధ వ్యూహాలతో నెల రోజుల పాటు ధిక్కరించి ఎదురు నష్టాలు చేస్తూ, ఏవో కొన్ని రాజీలకు సమ్మతించవచ్చుగాని, ఆత్మహత్యాసదృశమైన వాటికి కూడానా? చర్చలకోసం ట్రంప్ షరతులు 15 కాగా, ఇరాన్ 5 మాత్రమే ప్రతిపాదించింది. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశుద్ధి హక్కు తమకు ఉండాలి. క్షిపణి పరిమితులను అంగీకరించబోము. హర్మూజ్ తమది మాత్రమే. తమ అనుబంధ మిలిటెంట్ సంస్థలపై దాడులు జరపరాదు. తమపై గల ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేయాలి. చివరన కీలకమైనది, గల్ఫ్ దేశాలలోని సైనిక స్థావరాలన్నీ రద్దు చేయాలి. వీటికి ట్రంప్ అవునంటారని భావించగలమా? దీనంతటి అర్థం స్పష్టమే. ఏవైనా అరకొరగా తప్ప ప్రధానమైన అంశాలపై రాజీలు కుదిరే అవకాశాలు కన్పించవు. యుద్ధం ఇదే విధంగా కొనసాగితే ఎవరికి కలిగే నష్టాలు ఎంత? ప్రపంచానికి నష్టాలేమిటి? చివరకు యుద్ధం ఏ విధంగా ముగియవచ్చునన్నది ఊహించలేని విషయం. ఆలోగా ఒత్తిడి మాత్రం అందరిపైనా పెరగనున్నది. అమెరికా, ఇజ్రాయెల్ అంచనా ప్రకారం ఇరాన్ కుప్పకూలిపోలేదన్నది మాత్రం ఈ మొదటి నెల యుద్ధం తర్వాత కనిపిస్తున్న వాస్తవం. - టంకశాల అశోక్ ( దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు
Andhra Pradesh : రాజధానికి సహకరిస్తారనుకున్నా : అయ్యన్నపాత్రుడు
ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం కొనసాగించిన విధానాలను కొనసాగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు
Fire Accident |కాటన్ గోడౌన్లో మంటలు…
Fire Accident | కాటన్ గోడౌన్లో మంటలు… Fire Accident | నందిగామ,
Chittoor | ముగ్గురు దుర్మరణం Chittoor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
RGIAను భూతాల ప్రదేశంగా చూపించిన యూట్యూబ్ వీడియోలు… యూట్యూబర్లపై పోలీసులు కేసులు #HyderabadAirport
Revanth Reddy |రూ.700 కోట్లతో భారీ ఆలయ నిర్మాణం
Revanth Reddy | రూ.700 కోట్లతో భారీ ఆలయ నిర్మాణం Revanth Reddy
TG | ఇప్పగూడెం శివారులో..! ప్రాణాలకు ముప్పుగా మారిన ట్రాన్స్ఫార్మర్దాసుకుంట వద్ద చెట్ల
ఎంఎల్ఎలు పెరిగితే ఎవరికి లాభం?
పార్లమెంట్, శాసనసభల్లో సభ్యుల సంఖ్య పునర్విభజన ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న వారిని తృప్తిపరిచే వార్తను హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎం పి, ఎంఎల్ఎ స్థానాలను గంపగుత్తగా 50% పెంచాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లు ఉభయసభల్లో ఆమోదానికి మూడొంతుల మెజారిటీ కావాలి కాబట్టి అన్ని విపక్ష పార్టీలతో సమావేశాలకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని చట్టబద్ధత కల్పిస్తుంది. 2029లో జరగబోయే సాధారణ, శాసనసభ ఎన్నికల నుండి ఈ మార్పు వర్తిస్తుంది. ఈ పెంపుదలతో దేశంలో ఉన్న 4123 అసెంబ్లీ స్థానాలు 6186కి చేరుతాయి. 543 ఉన్న లోక్సభ స్థానాలు 816 కు పెరుగుతాయి. దక్షిణాదికి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో జనాభా ప్రాతిపదికన కాకుండా సమన్యాయం కోసం అన్ని ప్రాంతాలకు 50% సీట్లు పెంచడం జరుగుతుందని కేంద్రం అంటోంది. దేశంలో ఇంతకు క్రితం 1952, 1962, 1972, 2002 లలో చట్ట సభల సీట్ల సర్దుబాటు కోసం డీలిమిటేషన్ కమిషన్ల ఏర్పాటు జరిగింది. జనాభా నియంత్రణ మూలంగా వివిధ రాష్ట్రాల్లో మారిన జనాభా వృద్ధి వ్యత్యాసం సభల్లో ప్రజాప్రాతినిధ్యానికి అడ్డంకి కావద్దని 2001 జనగణన తర్వాత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు ముందుకు రాలేకపోయింది. అయితే కాలం గడిచినా కొద్దీ జనాభా పెరుగుదల, వలసల కారణంగా ఒకచోట 30లక్షల ఓటర్లు ఉంటే, మరోచోట ఆ సంఖ్య 50వేలకు పడిపోయింది. దీని వల్ల సీట్ల సర్దుబాటు అనివార్యమైంది. అయితే చట్టసభ సీట్ల పెంపుదలకు ఇంతవరకున్న జనసంఖ్య సూత్రం ఇప్పుడు పనికిరాదు. ఆ లెక్కన సీట్ల పునర్విభజన జరిగితే జనాభా పెరగని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ విధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు పూర్తిగా వ్యతిరేకించాయి. అదే జరిగితే జనాభా పెరుగుదల గల ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగి కేంద్ర పాలనలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దక్షిణ ప్రాంతంలో సీట్లు రాకున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధిక్యతతో ఏ పార్టీ అయినా దేశాన్ని ఏలవచ్చు. విపులంగా చెప్పాలంటే దక్షిణాదిలో పట్టులేని బిజెపి కేవలం ఉత్తరాదిలోని నాలుగు, అయిదు రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించి ఢిల్లీ గద్దెను ఎక్కవచ్చు. ఇలా జరిగితే దక్షిణ రాష్ట్రాలు అభివృద్ధిని సాధించలేవు. ప్రతి దానికి కేంద్రంలోని పార్టీ దయ దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. సీట్ల సవరణ చేపట్టి 24 ఏళ్ళు దాటుతున్నందువల్ల పాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటు కోసం ఏదో లెక్కన ఓ అడుగువేయక తప్పనిస్థితి ప్రభుత్వానిది. అయితే ఏ శాస్త్రీయ దృక్పథం లేకుండా ఉన్న సీట్లను 50% పెంచేద్దామనడం ప్రయోజనశూన్య ఆలోచనే అవుతుంది. ఇంతవరకు జరిగిన పునర్విభజనలకు జన సంఖ్య, భౌగోళిక మార్పులు తదితర అంశాలు ప్రాతిపదికగా ఉండేవి. 1952లో జరిగిన డీలిమిటేషన్లో అప్పటివరకున్న లోక్సభ సీట్లలో 5 పెంచి 494కి స్థిరీకరించారు. రెండోసారి 1963 లో ఆ సంఖ్య 28 సీట్లు పెరిగి 522 కి చేరింది. 1973లో చేపట్టిన పునర్విభజనలో 21 సీట్లు పెరిగి లోక్సభ స్థానాలు 543 అయ్యాయి. 2002 లోని డీలిమిటేషన్ కమిషన్ కేవలం అసెంబ్లీ స్థ్థానాలను పెంచింది. చివరి పునర్విభజన 2001 నాటి జనగణన ఆధారంగా జరిగింది. ఇప్పటి సీట్ల సవరణకు జనగణన -2011 ప్రాతిపదికన జరగాలి. 2001 2011 మధ్య కాలంలో దేశజనాభా 18 కోట్లు పెరిగింది. ప్రస్తుత జనాభా 145 కోట్లు అంటున్నారు. కాబట్టి 2011 నుండి 2026 నాటికి మరో 24 కోట్లు పెరిగినట్లు. 1952 నుండి 2001 మధ్యకాలంలో అంటే యాభై ఏళ్లకు పెరిగిన ఎంపిల సంఖ్య 54 మాత్రమే. 25 ఏళ్ల కాలానికి ఏకంగా 273 పెరగడం అశాస్త్రీయమే. ఏ లెక్కన చూసినా ఒకేసారి సగం సీట్లు పెంచేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా నష్టకారకమే. ప్రస్తుతం ఎంపిల నెల జీతభత్యాలు కలిపితే రూ. 3 లక్షల దాకా ఉంటోంది. మాజీలకు నెలకు రూ. 31 వేల పెన్షన్ లభిస్తోంది. వారి సంఖ్య 50% పెరిగితే ఏడాదికి మరో వంద కోట్లు వారి ఖర్చులకు కేటాయించాలి. ఇలా దేశవ్యాప్తంగా ఎంఎల్ ఎల లెక్క తీస్తే అన్ని రాష్ట్రాల్లో కలిపి వేయి కోట్లయినా ఉంటుంది. వారందరికీ రాజధానుల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయ తదితర వసతుల కల్పన ఎంతో వ్యయభారాలతో కూడుకున్నది. దీనికోసం ప్రజలపై పన్నుల భారం మోపడమే తప్ప ఆ ప్రజాప్రతినిధులతో ప్రజలకు కలిగే మేలు ఏమీ ఉండదు. ఇప్పుడున్న పాలనా స్థితిగతుల్లో పెద్దగా మార్పేమీ ఆశించలేం. సీట్ల పెంపువల్ల పార్టీ టికెట్ కోసం రాజకీయ పార్టీలపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. చట్ట సభలో ‘అధ్యక్షా!’ అని మైకులో అనాలని తపించేవారికి మార్గం సుగమమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనను అన్ని రాజకీయ పక్షాలు అంత తేలిగ్గా ఒప్పుకుంటాయనుకోం. ఇప్పటికైతే ఎన్డిఎ మిత్రపక్షాలతో చర్చలు జరిగాయి. విపక్షాలతో సంప్రదింపుల పర్వం మొదలుకానుంది. ఇందులోని సానుకూల అంశమేమిటంటే అన్నిరాజకీయ పార్టీలకు ఈ పెంపు సంబరమే. బిజెపి ప్రభుత్వ ప్రతిపాదనను అంత తేలిగ్గా ఒప్పుకోవద్దని కాంగ్రెస్ బెట్టు చేయవచ్చు. కానీ మొదటికే వ్యతిరేకించదు. భారమంతా ప్రజలపైనే కాబట్టి ఉభయసభల ఆమోదం కూడా సాధ్యమే. - బి. నర్సన్, 94401 28169
బస్సు, లారీ ఢీకొని… 25మందికి గాయాలు వైరా, మార్చి 28 (ఆంధ్రప్రభ )
Ram Charan’s Peddi Pehlwan transformation shocks everyone
Mega Powerstar Ram Charan has been director’s actor doing whatever is asked from him by the directors for a character. He proved yet again with his beastly transformation for Peddi Pehlwan portions. The actor worked doubly hard to achieve the physique in the guidance of renowned experts. When the director Buchi Babu Sana narrated the […] The post Ram Charan’s Peddi Pehlwan transformation shocks everyone appeared first on Telugu360 .
భారత బడా బూర్జువా వర్గం, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక ప్రభుత్వాలు సామ్రాజ్యవాదంతో రాజీపడి దేశ సహజ వనరులను కట్టబెట్టటమేకాక, దేశ కరెన్సీ అయిన రూపాయి విలువను కూడా అమెరికా సామ్రాజ్యవాదుల దయకు వదిలివేశారు. దాని ఫలితమే రూపాయి విలువ పతనమై నేడు డాలర్కి 94.84 రూపాయలుగా ఉంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి నిదర్శనం. అధికార మార్పిడి జరిగిన తర్వాత 1947లో ఒక డాలర్తో రూపాయి మారకం విలువ 3.50 ఉంది. 1948 నుండి 1980 వరకు కొంచెం అటుయిటుగా ఉంది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనతర్వాత రూపాయి విలువ పతనం ఎక్కువగా జరిగింది. అధికార మార్పిడి దగ్గర నుంచి 2022 వరకు రూపాయి విలువ 79 సార్లు పడిపోయింది. ప్రపంచ చమురు వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉన్న భారత్కు 85% చమురు దిగుమతిగా ఉంది. చమురే కాకుండా ఫార్మా, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర రంగాలకు అవసరమైన ముడిసరుకులు, వంటనూనెలు, ఆహారధాన్యాలు, పప్పులు, లోహాలను భారతదేశం దిగుమతి చేసుకుంటున్నది. ఈ దిగుమతులకు చెల్లింపులు డాలర్ల లోనే జరపాలి. రూపాయి విలువ తగ్గిన ప్రతిసారి దిగుమతుల కోసం చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ ఉంటుంది. రూపాయి విలువ పడిపోవటంవల్ల దిగుమతి అయ్యే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరల పెరుగుదల భారం ప్రజలపైనే పడుతుంది. డీజిల్ ధరలు పెరిగితే రవాణా చార్జీలు పెరిగి ఉప్పు, పప్పు, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. అంతేకాకుండా ప్రయాణ ఖర్చులు, ఆటో చార్జీలు, బట్టలు, పిల్లల స్కూలు ఫీజులు, ఫోన్లు, టివిలు, ల్యాప్ టాపుల, వాహనాల ధరలు పెరుగుతాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతుంది. రూపాయి పతనం ఫలితంగా బడ్జెట్ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. విదేశాలకు ఎగుమతి చేసే వారికి మాత్రం ఆదాయం పెరుగుతుంది. ప్రపంచ దేశాలపై ఏ దేశ పెత్తనం ఉంటుందో, ఆ దేశ కరెన్సీ ఆధిపత్యం చలాయిస్తుంది. 1947 దాకా ప్రపంచ ఆధిపత్యం బ్రిటన్ చేతుల్లో ఉంది. దాని ఫౌండ్ కరెన్సీ, ఇతర దేశాల కరెన్సీపై ఆధిపత్యం చలాయించింది. బ్రిటన్ బలహీన పడిన తర్వాత అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యహరిస్తూ, తన డాలర్ కరెన్సీ ఆధిపత్యాన్ని ఇతర దేశాలపై నెలకొల్పింది. చమురును డాలర్లలో చెల్లించాలనే ఒప్పందం కుదరటానికి ముందు అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్ద నున్న బంగారం నిల్వలతో ముడిపడి ఉంది. 1974లో సౌదీ అరేబియా తదితర దేశాలు చమురు ఉత్పత్తిని పరిమితం చేయటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. సౌదీ అరేబియా డాలర్ల లోనే చమురు అమ్మకాలు జరపాలని, మిగులు ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయాలని, దానికి బదులుగా సైనిక, ఆర్థిక సహాయం అందిస్తామని ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాను తన వ్యూహంలో అమెరికా ఇరికించింది. అప్పటి నుండి చమురు ఉత్పత్తి దేశాల్లో డాలర్లలోనే చమురు విక్రయం కొనసాగింది. ముడి చమురుకు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈ ఒప్పందం తర్వాత డాలరు ప్రాధాన్యత బాగా పెరిగింది. ముడి చమురుకు అన్నిదేశాలు డాలర్లలో చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రాచుర్యం పొందింది. వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలు బ్రిక్స్ దేశాల కూటమిగా ఏర్పడ్డాయి. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ ఎమిరేట్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా 30 దేశాలు బ్రిక్స్లో చేరాలనే ఆలోచన చేస్తున్నాయి. ఐఎంఎఫ్కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ దీని ఏర్పాటు లక్ష్యం. అంతర్జాతీయ వాణిజ్యం ఆయా దేశాల కరెన్సీలలోనే జరగాలనే డిమాండ్ ను బ్రిక్స్ ముందుకు తెచ్చింది. బ్రిక్స్ దేశాల జనాభా 310 కోట్లకు పైగా ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ వ్యవసాయంలో 45% కలిగి ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు, తమ ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోని, సమానత్వంతో కూడిన, పరస్పర ప్రయోజనాల ఆధారంగా నిర్వహించు కుంటాయి. అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంకును నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు సన్నద్ధ మవుతున్నాయి. వీటి ప్రయోజనాలు వీటికి ఉన్నా, అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకోగలిగితే ప్రపంచ వాణిజ్యంలో మార్పులు సంభవిస్తాయి. డాలర్ ఆధిపత్యాన్ని సహించని రష్యా, చైనాలు డాలర్కి ప్రత్యామ్నాయంగా ఆ దేశాల కరెన్సీలోనే చెల్లింపులు జరపాలని నిర్ణయించాయి. బ్రిక్స్ వేదికగా సమర శంఖం పూరించాయి. పెట్రోల్ విక్రయంలో డాలర్కు సౌదీ అరేబియా స్వస్తి చెప్పటం బ్రిక్స్కి బలం చేకూరుతుంది. ఇక నుంచి డాలర్లతో పాటు చైనా యువాన్, ఐరోపా సమాఖ్య (ఇయు) యూరో, జపానీస్ యెన్లలోను చెల్లింపులు స్వీకరిస్తామని చెప్పింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కలసి ఉమ్మడి కరెన్సీ వెలువరించే ప్రయత్నంలో ఉన్నాయి. ఆ కరెన్సీ స్వభావం గురించి ఉమ్మడి అభిప్రాయ రావాల్సి ఉంది. డాలర్ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యం జరగాలన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అలా వ్యతిరేకిస్తున్న దేశాలను బెదిరించటానికి ట్రంప్ పూనుకున్నాడు. అమెరికాకు ఆ దేశాలు ఎగుమతి చేసే సరుకులపై 100% సుంకాన్ని విధిస్తామనే బెదిరింపులు చేస్తున్నాడు. ట్రంప్ బెదిరించగానే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ‘ఆర్థిక’ వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశం డాలర్ రహిత వాణిజ్యంపట్ల ఆసక్తి లేదని ప్రకటించటం అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ లొంగుబాటును వెల్లడి చేస్తున్నది. భారత రూపాయి విలువ పతనానికి అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి నేటి వరకు పాలక ప్రభుత్వాలు అనుసరించిన, అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలతో, డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించకపోవటం, దేశం స్వయం సమృద్ధిని సాధించే విధానాల అనుసరించకపోవటం, పెద్ద ఎత్తున చేసిన విదేశీ అప్పులకు డాలర్ల రూపంలో చెల్లించటమే కారణం. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించటం ద్వారానే రూపాయి పతనం ఆగుతుంది. - బొల్లిముంత సాంబశివరావు 98859 83526
చిత్తూరు జిల్లా హైవేపై ఘోర ప్రమాదం, ముగ్గురు మృ*తి #Chittoor #RoadAccident #HighwayCrash
పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వరుణ్, నిహారిక మూవీ ప్రారంభం..
మెగా డాటర్ నిహారకి కొణిదెల మరో క్రేజీ ప్రాజెక్టును ప్రకటించారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో నిర్మాతగా మారి తొలి మూవీతో మంచి విజయం సాధించిన నిహారిక.. ప్రస్తుతం తన రెండో చిత్రం రాకాస మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే తన మూడో సినిమాను అనౌన్స్ చేశారు. తన సోదరుడు, హీరో వరుణ్ తేజ్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు నిహారిక. శనివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి బరి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు కమిటీ కుర్రాళ్లు డైరెక్టర్ యదువంశీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
తిరుపతి వెళ్తుండగా యాక్సిడెంట్
మార్చి 27 ( జనం సాక్షి ): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద …
Amaravathi : నేడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం... అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం నేడు జరగనుంది
నేటి బందుకు సంపూర్ణ మద్దతు.. జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల
Telangana : నేడు నిర్మల్ పట్టణం బంద్
నేడు నిర్మల్ పట్టణంలో బంద్ జరగనుంది
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం.. కొత్తగూడ, ఆంధ్రప్రభ : పేద మధ్య తరగతి కుటుంబాలకు
నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం
నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది
లోయలో పడిపోయిన టూరిస్ట్ బస్సు.. ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదవంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నయాగఢ్ జిల్లాలోని దసపల్ల తకరఘాటీ దగ్గర చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుని గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సుల్లో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.
Telangana : మంచిరేవులలో వంద అడుగుల శివుడి విగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు
IPl : సిక్సర్లు.. ఫోర్లు.. అద్భుతమైన క్యాచ్ లు...నిజమైన ఫీస్ట్
ఐపీఎల్ సీజన్ నేడు ప్రారంభం కానుంది
‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంలో హీరోగా అరంగేట్రం చేసి ఆకట్టుకున్న బాలనటుడు, హీరో దీపక్ సరోజ్, ఇప్పుడు హరి హరన్ గోధగాని దర్శకత్వంలో తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హరి తన్నిరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక నటిస్తున్నారు. పవిత్రమైన శ్రీరామ నవమి సందర్భంగా, చిత్ర బృందం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ’శ్రీమహా విష్ణు’ అనే టైటిల్తో వస్తున్న ఈ రొమాంటిక్ ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్లీ మూమెంట్ ని చూపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు హరి హరన్ గోధగాని మాట్లాడుతూ ఈ సినిమా ప్రేమను వేడుకలా చూపిస్తూ, కుటుంబ విలువల ప్రాముఖ్యతను కూడా సున్నితంగా తెలియజేస్తుందని అన్నారు. ఈ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను మేకర్స్ మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Road Accident : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
ఐపిఎల్ 2026: నేడు బెంగళూరుతో సన్ రైజర్స్ ఢీ..
బెంగళూరు: ఐపిఎల్ సీజన్ 2026కి సర్వం సిద్ధమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగ ళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నమెంట్ కు ప్రారంభం కాబోతోంది. ఇక ఇటు హైదరాబాద్.. అటు బెంగళూరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి. రజత్ పటిదార్ సారథ్యంలోని బెంగళూరు భారీ ఆశలతో టోర్నీలోకి అడుగుపెడుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెర తెరదించుతూ 2025లో బెంగళూరు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే.ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిం చాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ, పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, బెథెల్, భువనేశ్వర్ కుమార్, జోర్డాన్, డఫీ, కృనాల్ పాండ్య, షెఫర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరులో ఉన్నారు. ఇక ఈ టోర్నీకి కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. మరోవైపు హైదరాబాద్ లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు.హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో సన్ రైజర్స్ కూడా విజయమే లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది.
వరంగల్లో కల్తీ కారం తయారీ బట్టబయలు #Warangal #FoodSafety #Adulteration #ChilliPowder
మార్కెట్ రేటుకు మూడు రేట్లు పరిహారం ఇవ్వాలి..
మార్కెట్ రేటుకు మూడు రేట్లు పరిహారం ఇవ్వాలి.. భూములు కోల్పోతున్న రైతులుఎమ్మెల్సీ నెలికంటి
Summer Effect : పగటి వేళ బయటకు వస్తే మటాష్.. సాయంత్రం వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్గా కంపోజ్ చేసి న ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నా యి. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ “అనుమాన పక్షి సినిమా కంటెంట్ చాలా నచ్చింది. రాగ్ మయూర్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా కంటెంట్ కొంత చూశాను, చాలా ఫన్ వుంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు”అని అన్నా రు. డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ “ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. దీంతోపాటు చిన్న సైకాలజికల్ సస్పెన్స్ ఉం టుంది”అని తెలిపారు. కార్యక్రమంలో రాగ్ మయూర్, రాశి, మెరీన్, రాజీవ్ చిలకా, భరత్, శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు.
Video : JEEVAN REDDY Exclusive Interview
The post Video : JEEVAN REDDY Exclusive Interview appeared first on Telugu360 .
పహారి గోడ నిర్మాణానికి భూమి పూజ..
పహారి గోడ నిర్మాణానికి భూమి పూజ.. ప్రభుత్వ పాఠశాల పహరి గోడ నిర్మాణానికి
Farmers |విద్యుత్ శాఖ నిర్లక్ష్యం..
Farmers | విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ప్రాణాలపై వేలాడుతున్న కరెంట్ స్తంభాలు…!విద్యుత్ శాఖ
Gold Prices Today : గుడ్ న్యూస్...బంగారం, వెండి ఇప్పుడు కొంటే లాభమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర భారీగా తగ్గింది
TG |త్రీఫేస్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సతమతమవుతున్న రైతులు
TG | త్రీఫేస్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సతమతమవుతున్న రైతులు కేవలం 2
28thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
28thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 28thMarchCartoon | ట్రంప్ విరామం
28marcheditorial |ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం
28marcheditorial | ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం 28marcheditorial | ట్రంప్ అత్యుత్సాహం –
Mega Prince Varun Tej will feature for the first time in a film that is produced by his sister Niharika Konidela. Yadhu Vamsi of Committee Kurrollu fame is the director and the film is all set for a grand launch today with a pooja ceremony. The film is set in the backdrop of Volleyball and […] The post Varun Tej’s Bhari appeared first on Telugu360 .
lPl 2026: నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు
నేటి నుంచి ఐపీఎల్ 19 వ సీజన్ ప్రారంభం కానుంది.
28marchchintana |విశ్వనాథ కల్పవృక్షంలో రావణుడు
28marchchintana | విశ్వనాథ కల్పవృక్షంలో రావణుడు 28marchchintana | రావణుడు కాముకుడా? సాధకుడా?సీతాదేవి
Tirumala : తిరుమలకు శనివారం వెళ్లేవారికి తీపికబురు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
'Gen Z' నిరసనల్లో హింస.. నేపాల్ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి అరెస్టు
నేపాల్ మాజీ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి అరెస్టు అయ్యారు. గత ఏడాది జరిగిన 'Gen Z' నిరసనల్లో ఓలి పాత్ర ఉందన్న ఆరోపణలపై నేపాల్ పోలీసులు ఆయనను శనివారం అరెస్టు చేశారు. భక్తపూర్ జిల్లాలోని గుండులో ఉన్న ఓలి నివాసం నుండి నేపాల్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓలితో పాటు, ఆయన హయాంలో హోం మంత్రిగా పనిచేసిన రమేష్ లేఖక్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గత సెప్టెంబర్లో జరిగిన 'Gen Z' నిరసనలను అణచివేసే క్రమంలో హత్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓలిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు, తదుపరి ప్రక్రియ చట్టం ప్రకారం ముందుకు సాగుతుందని కాఠ్మండు లోయ పోలీసుల ప్రతినిధి ఓం అధికారి తెలిపారు. 'Gen Z' నిరసనల సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో విద్యార్థులు మరణించడంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఒక కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. కమిషన్ సమర్పించిన నివేదికలో ఈ ఇద్దరు నాయకులను బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి బలేన్ షా అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే, విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. విచారణ కమిషన్ నివేదికలో నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు దళం (Armed Police Force) మరియు సైన్యంలోని కొంతమంది అధికారుల ప్రవర్తనపై కూడా ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, ప్రస్తుతానికి ఆ భద్రతా దళాలపై ఎటువంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు.
గుజరాత్ తీరానికిమరో ఎల్.పి.జి గ్యాస్ నౌక
భారత్కు మరో ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా చేరుకుంది
Andhra Prdesh :నేడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది
ఢిల్లీకి సమీపంలో నేడు మరో అంతర్జాతీయ విమానాశ్రయం
ఢిల్లీకి సమీపంలో నేడు మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుం
AP | హృదయ విదారక ఘటన.. తల్లి మరణించిన ఐదు రోజులైనా బయటికి
భారత్కు ఊరటనిచ్చేలా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది
వినియోగదారులకు షాక్ .. పెట్రోలు ధరలు తగ్గవు
వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఎలాంటి ఊరట లభించలేదు
ఆదాయపు పన్ను శాఖ కంట్లో బంగారు బాబు
ఆదాయపు పన్ను శాఖ కంట్లో బంగారు బాబు
ఇరాన్ భీకర దాడి..10 మంది అమెరికా సైనికులకు గాయాలు, విమానాలు ధ్వంసం
రియాద్: పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్, గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది.సౌదీ అరేబియాలోని అమెరికాకు చెందిన సైనిక స్థావరంపై శుక్రవారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో దాదాపు 10 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ జరిపిన దాడిలో తమ సైనికులు గాయపడ్డారని.. పలు అమెరికా ఇంధన సరఫరా విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, ఇరాన్ను తుడిచిపెట్టేశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్ దాడులు చేసింది. క్షిపణితో పాటు మానవరహిత డ్రోన్లను ఉపయోగించి ఇరాన్ ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి భీకర దాడులు జరిగే అవకాశం ఉంది.
Israel - Iran War : క్షిపణి దాడులను కొనసాగిస్తున్న ఇరాన్...సౌదీ సైనిక స్థావరంపై అటాక్
ఇరాన్ శుక్రవారం కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణి దాడులు కొనసాగించింది
Israel - Iran War : నెల రోజులు దాటినా.. ఆగని యుద్ధం.. ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు
ఇజ్రాయెల్ ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు చేసింది.
న్యూఢిల్లీ: ప్రస్తుత ఎడతెగని పశ్చిమాసియా యుద్ధం, సంబంధిత సంక్షోభం దశలో భారతదేశం టీమిండియాగా వ్యవహరిస్తుందని , అ త్యంత ప్రాధాన్యత క్రమంలో ముందుగా సరఫరాల గొలుసుకట్టు వ్యవస్థల సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సంక్షోభ దశలో పరిస్థితి సమీక్షకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నతస్థాయిలో కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర మంత్రిమండలిలోని కీలక మంత్రిత్వశాఖల మంత్రులు , కేబినెట్ సెక్రెటరీలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత వహిస్తూ ఖరారు చేసుకున్న ప్రాధాన్యతాక్రమాలను ముఖ్యమంత్రులకు వివరించారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత నిర్వహణ కుంటుపడరాదు..ఇంధన భద్రతకు తిరుగులేకుండా చేయాలి. దేశ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించాలి. అన్నింటికి మించి నిత్యావసరాలు, చమురు ఇంధన సరఫరా వ్యవస్థలను పటిష్టపర్చుకోవాలి. పారిశ్రామిక వ్యవస్థకు ప్రతికూలత ఏర్పడరాదనేవి కలిసికట్టు బృందంగా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలు కావల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చత ఎటు నుంచి ఎటు దారితీస్తుందో తెలియని స్థితికి తీసుకువెళ్లుతోంది. ఈ దశలో మనమంతా మరింత జాగరూకత, అంతకుమించిన సమన్వయంతో , సవాళ్లపై తక్షణ స్పందనతో ముందుకు వెళ్లాల్సి ఉందని పిలుపు నిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహాయించి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని అధ్యక్షతన జరిగిన భేటీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠత , ఆసక్తి నెలకొంది. కఠిన నిర్ణయాలు ఉంటాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. లాక్డౌన్ వార్తలను కేంద్రం ఖండించింది. టీం ఇండియా స్ఫూర్తితో ఏదైనా ఎదుర్కొవచ్చు ః ప్రధాని పిలుపు సంక్షోభ సమయంలో మనం కలిసికట్టుగా పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ తెలిపారు. టీం ఇండియా స్ఫూర్తి ఇంతకు ముందు కోవిడ్ దశలో ప్రదర్శించామని, ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం నుంచి తలెత్తిన సవాళ్ల దశలో కూడా ఇదే విధానం అవలంభించాలని కోరారు. ఈ విధంగా మనం విజయం సాధించగలమనే నమ్మకం తనకు ఉందన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంది. పరిణామాలు గణనీయంగా ఉంటున్నాయి. నిరంతర పర్యవేక్షణ అవసరం అన్నారు. ఈ దిశలో తమ ప్రభుత్వం ఇప్పుడు అంతర్గత మంత్రుల బృందం ఏర్పాటు చేసిందని వివరించారు. పరిస్థితిని ఈ నెల 3వ తేదీ నుంచి సమీక్షిస్తున్నారని, చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. బ్లాక్మార్కెటీర్లపై ఉక్కుపాదం తప్పనిసరి ఇప్పుడు నిత్యావసర సరుకుల సరఫరా అత్యంత కీలక విషయం అని ప్రధాని మోడీ చెప్పారు. ఈ క్రమంలో సరఫరాల వ్యవస్థ క్రమపద్థతిలో ఉండాలి. నిర్వహణ గతి తప్పరాదని హితవు పలికారు. ప్రత్యేకించి బ్లాక్ మార్కెట్, సరుకుల నిల్వలకు దిగే వారిపై రాష్ట్రాలలో పూర్తి స్థాయి కఠిన చర్యలు అవసరం అని ప్రధాని తెలిపారు. రాష్ట్రాల ప్రధాన కేంద్రాలలోనే కాకుండా, జిల్లా పంచాయతీ స్థాయిల్లో కూడా అధికార నిర్వహణ యంత్రాంగం సరిగ్గా పనిచేయాల్సి ఉంటుందని, పనిచేసేలా చేసే బాధ్యత రాష్ట్రాలపై ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ తమ సమీక్షలో వ్యవసాయ రంగంలో ముందస్తు ఏర్పాట్లు అవసరం అని , ఎప్పటికప్పుడు ఎరువుల కొరత , విత్తనాల పంపిణీలపై చర్యలు అవసరం అని ప్రధాని సూచించారు. ఖరీఫ్ పంటకాలం ముందున్నందున రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని , సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికననే మేల్కొల్పాపాల్సి ఉంటుందని ప్రధాని ముఖ్యమంత్రులకు తెలిపారు. వదంతులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆన్లైన్ మోసాలు, మోసాల రాయుళ్ల పనిపట్టేందుకు క్షేత్రస్థాయిలో నిఘా పెంచాల్సి ఉందని సిఎంలకు తెలిపాఈ రు. సరిహద్దులు, తీర ప్రాంతాల రాష్ట్రాలకు ప్రత్యేకమైన రీతిలో జాగ్రత్త చర్యలు అవసరం అని ప్రధాని సూచించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు తమతమ శాఖలకు సంబంధించి ఇప్పటి సవాలును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలో పలు ప్రాంతాలలో వంటగ్యాసు, పెట్రోలు డీజిల్ కొరత రాకుండా చేయడంలో కేంద్రం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఇప్పుడు ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపును అభినందించారని అధికారులు వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభ తీవ్రత దశలో కేంద్ర ప్రభుత్వం అనధికారిక అంతర్గత మంత్రుల బృందం (ఐగామ్) ఏర్పాటు చేసింది. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాయకత్వం వహిస్తారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీ సభ్యులుగా ఉంటూ సహకరిస్తారు. గల్ఫ్ సంక్షోభంపై బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. తీసుకోవల్సిన చర్యలను నివేదిస్తుంది. ఇప్పటి యుద్ధం చమురు సంక్షోభాన్ని తద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ఆగిపోయే సూచనలు కూడా వెలువడటం లేదు. నాలుగు వారాలు దాటిన ఈ యుద్ద ప్రభావంపై ఈ మంత్రుల బృందం స్పందించాల్సి ఉంటుంది.
28thMarch2026 |శనివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
28thMarch2026 | శనివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 28thMarch2026 |
మన తెలంగాణ/ భద్రాచలం: భద్రాచలంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా సాగింది. ఉదయం 9:45 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ మొదలైన ఊరేగింపు మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపా నికి స్వామి వారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను 10.42 కి మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, ఎదురుగా అమ్మవారిని ఆసీనులను చేశారు. అలాగే కళ్యాణం సందర్భంగా భక్తరామ దాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజే శారు. తొలుత వంశ గోత్రాలకు సంబందించి ప్రవరలు చదివారు. ఈ సమయంలో ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పష్పోదక స్నానం జరిపి వరపూజ నిర్వహించారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామ దాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజే శారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున చైర్మన్ బీఆర్ నాయుడు, శృంగేరి శారదా పీఠం, చినజీయర్ స్వామి తరపున, భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసరావులు, తూము నరసింహదాసు వంశీ కులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిం చారు. భద్రాద్రి రాముని కల్యాణ వైభవ ప్రాశస్త్యంతో పాటు భక్తరామదాసు చేయించిన ఆభరణాల విశిష్టతను దేవస్థా నం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వివరించారు. అర్చక స్వా ములు మధుపర్కం ప్రాశసన ఆనం తరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించి నూతన వస్త్రాలంకరణ చేశా రు. లోక పర్యంతాన్ని, విశ్వసృష్టిని దానిలో ఉన్న కాలాన్ని, దేశా న్ని తెలుపుతూ సంకల్పం చెప్పి కన్యాదాన కరిష్యే అంటూ ముగించారు. ఈ సమయంలో కన్యావరణలు. కొబ్బరిబొండం, తాంబూ లం, దక్షిణ స్వామి వారికి సమర్పించారు. కన్యాదానంతో పాటు గోదానం, భూదాన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వ హించారు. రామ భద్రుడికి, సీతామాతకు వేర్వేరుగా మంగళాష్టకం చదివారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వివరిస్తూ ఉత్సవమూర్తుల శిరస్సుపై ఉంచారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం రేవంత్రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం దశరధు డు, జనకమహారాజు తరపున, భక్తుల తరపున భక్తరామదాసు చే యించిన మూడు మంగ శసూత్రాలతో కూడినసూత్రధారణను క న్నుల పండువగా నిర్వహించారు. ఆ తరువాత తలంబ్రాల ప్రాశ స్త్యం వివరిస్తూ తలంబాల కార్యక్రమం సంప్రదాయబ ద్ధంగా అర్చకస్వాములు నిర్వహించారు. చివరగా భాగవోత్తముల ఆశీర్వచనంతో కళ్యాణం ముగిసింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కొండా సురేఖ , వాకాటి శ్రీహరి కుటుంబ సమేతంగా తిలకించారు. అలాగే ఎంపీ పోరిక బరాంనాయక్, వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, కో రం కనకయ్య, దుబ్బాక కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్, రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజు, ఐటీడీఏ పీవో రాల్, దేవస్థానం ఈవో కె.దామోదరావులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ వీడలేదు. ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చి న తీర్పును హైకోర్టులో బిఆర్ఎస్ సవాల్ చేయడంతో కేసు ఎటు దారి తీస్తుందోనన్న అనుమానా లు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. పశ్చిమ బెంగాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని కోల్కత్తా హైకోర్టు రద్దు చేసిన ఉదంతంతో ఇక్కడా పునరావృత్తమవుతుందా? అనే చ ర్చ ఆరంభమైంది. అనర్హత పిటిషన్లపై మీరు ఇ చ్చిన తీర్పుపై తమకు వివరణ ఇవ్వాలని హైకోర్టు స్పీకర్ ప్రసాద్ కుమార్కు నోటీసు జారీ చేస్తూ కేసును ఈ నెల 16న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ను మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకూ కోర్టు నో టీసులు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చడంతో ఊపిరి పిల్చుకున్న ఎమ్మెల్యేలు టి.ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రా వు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రె డ్డి, అరికెపూడి గాంధీ, కె.సంజయ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్ గుం డెల్లో గుబులు ఆరంభమైంది. అందుకు కారణం లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి టిక్కెట్పై గెలుపొందిన ముకుల్ రాయ్ కొంత కా లానికి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బిజెపి నేతలు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయించిన ట్లు అన్ని సాక్షాధారాలు ఉన్నాయంటూ హైకోర్టు ధర్మాసనం సదరు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెం గాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరగదని బిజెపి తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదన వినిపించారు. కానీ కోర్టు తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగించింది. రాష్ట్రంలోని పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలోనూ అనేక మలుపులు తిరిగి చివరకు ఈ నెల 11న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించినట్లు సరైన సాక్షాధారాలు లేవంటూ స్పీకర్ పేర్కొంటూ ఆ పది మందిపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. దీంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి.కేసు పూర్వాపరాల్లోకి వెళితే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రమేణా వేర్వేరుగా కాంగ్రెస్లో చేరారు. అంతేకాకుండా 2024లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (ఖైరతాబాద్) పోటీ చేశారని, ఆయన పోటీ చేసినట్లు ‘బి-ఫాం’ జిరాక్స్ ప్రతినీ స్పీకర్కు అందజేశామని, ఏఐసిసి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దానం పేరు ఉండడాన్నీ సాక్షాధారంగా చూపించామని బిఆర్ఎస్ అప్పటి పిటిషన్లో పేర్కొంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్) తన కుమార్తె కడియం కావ్య లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు బాజప్తా ప్రచారం చేశారని బిఆర్ఎస్ మరో పిటిషన్లో పేర్కొంది. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లు ప్రకటించుకోవడం, ముఖ్యమంత్రితో ఫొటోలు దిగడం, కండువాలు కప్పించుకోవడం వంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వార్తల క్లిప్పింగ్స్నూ స్పీకర్కు సమర్పించామని బిఆర్ఎస్ వాదన. చివరకు స్పీకర్ వారెవ్వరూ పార్టీ మారినట్లు తమకు సరైన సాక్షాధారాలు చూపించనందున కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానంపై తొలుత ఏలేటి ఇదిలాఉండగా స్పీకర్ తీర్పు వెలువరించిన తర్వాత బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తొలుత ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత ఏడు మంది ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. అనంతరం రెండో రోజున మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కె. సంజయ్, కడియం శ్రీహరిపై పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున గండ్ర మోహన్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహీయుద్దీన్తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారణ చేపట్టనున్నది.
పెట్రో ఉత్పత్తులపై సుంకంలో కోత
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పెట్రోలు, డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం అర్థరాత్రి నోటిఫికేషన్ వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ సంక్షోభం, హర్మూజ్ జలసంధి మారంగంలో రవాణాకు అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగకుండా ఉండేందుకు, క్రమేపీ గణనీయంగా తగ్గేందుకు ఈ సుంకం తగ్గింపు నిర్ణయం దారితీస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పెట్రోలుపై ఇంతకు ముందు ఉన్న లీటర్కు రూ.13 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఇకపై రూ.3గా కుదించారు. డీజిల్పై ఇది ఇంతకు ముందు రూ 10 ఉండగా దీనిని ఇప్పుడు పూర్తిగా ఎతివేశారు. ఈ చర్యతో ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా రూ 1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ సుంకం భారీ స్థాయి తగ్గింపు వల్ల ముందుగా చమురు పంపిణీ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. క్రమేపీ దీని పరిణామాలలో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీ స్థాయిలోనే తగ్గుతాయి. పైగా చమురు సంక్షోభం దశలో వెనువెంటనే దేశంలో ఇందన ధరలు పెరగకుండా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి నిర్ణయాలలో భాగంగా ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్)పై సుంకాలను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో డీజిల్పై ఇది లీటర్కు రూ 21.5గా ఉంటుంది. ఎటిఎఫ్పై ఇది రూ 29.5గా పడుతుంది. ధరల్లో మార్పు ఉండదు: ఆర్థిక మంత్రి కేంద్రం పెట్రోల్పై సుంకాలను తగ్గించినా డీజిల్పై లేకుండా చేసినా వెనువెంటనే ఈ సవరణలతో పెట్రోల్ పంపులలో ధరలలో మార్పు ఉండదు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో వినియోగదారులపై ఇంధన ధరల పెంపు ప్రభావం పడకుండా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. సరఫరాల హెచ్చుతగ్గులు, సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పడకుండా చేయడానికే ఈ నిర్ణయం ఉపకరిస్తుందన్నారు. ఈ దిశలోనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ముడిచమురు ధరల ప్రభావంతో అంతర్జాతీయంగా పలు దేశాలలో గడిచిన నెలరోజుల్లో విపరీత ప్రభావం పడిందన్నారు. అంతకు ముందు బ్యారెల్కు 70 డాలర్లు ఉండగా ఇది ఇప్పుడు 100 డాలర్లు దాటుతోందని అన్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులపై పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం అన్ని దేశాలలో పడుతోందన్ని, ఆగ్నేయాసియా దేశాలలో ఈ ధరలు దాదాపుగా 30 నుంచి 50 శాతం పెరిగాయన్నారు. ఆఫ్రికా దేశాలలో ఇది 20 నుంచి 50 శాతంగా పెరిగాయని, ఈ దశలో భారత్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, దానిని నివారించేందుకు ప్రభుత్వం వద్ద రెండే మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటి ధరలు గణనీయంగా పెంచడం లేదా ప్రభుత్వ సంస్థలుఈ భారం భరించడం అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం వెలువడిందని మంత్రి తెలిపారు. ఇప్పటికిప్పుడు ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఇంధన ధరలు వెంటనే మార్కెట్లో దిగకపోవచ్చు. అయితే ఇప్పుడు సుంకం కుదింపుతో వెనువెంటనే అనివార్యంగా జరగాల్సిన రీతిలో ఇంధనల ధరలు పెరిగే అవకాశం ఉండదు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ విషమ పరిస్థితికి కళ్లెం పడిందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికలపై దృష్టితోనే : కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాల కోతకు దిగింది కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లాభం పొందేందుకే అని కాంగ్రెస్ విమర్శించింది. గతంలో పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు ఏడుసార్లు పడిపోయినా దేశంలో వినియోగదారులకు ధరల వెసులుబాటు కల్పించలేదని , ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం ఈ నాటకమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఎప్రిల్ 30 వరకూ చూడండీ ఈ ప్రభుత్వమే తిరిగి ఏ విధంగా దెబ్బ తీస్తుందో అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం: బిజెపి ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి దిగుతున్నాయని బిజెపి ఎదురుదాడికి దిగింది. కేం ద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇకపై వినియోగదారులకు ఇంధనం తక్కువ ధరలకు దొరుకుతుందని, కాంగ్రెస్ ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
మనతెలంగాణ/మాదాపూర్ : ఒంటిపై కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో తిరిగే బంగారుబాబుకు ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లగా ఢిల్లీ ఎ యిర్పోర్టులో అనుమానం వచ్చి ఆదాయం పన్ను శాఖ అధికారులు అడ్డుకున్నారు. సుమారు నాలుగున్నర కిలోలకు పైగా ఉన్న ఈ ఆభరణాల విలు వ రూ.7 కోట్లకుపైగా ఉండటంతో ఐటి అధికారు లు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించా రు. ఇందుకు సంబంధించిన బిల్లులు చూపించాలని అధికారులు కోరగా బిల్లులు హైదరాబాద్లో ఉన్నాయని, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వ చ్చానని, తర్వాత బిల్లులు ఇస్తానని చెప్పడంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని వదిలినట్లు సమాచారం. శేరిలింగంపల్లి చందానగర్కి చెందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ న్యూఢిల్లీలో జరుగుతున్న హకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లారు. వంటినిండా బంగారంతో కనిపించిన ఆయనను ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆదాయపుపన్ను అధికారులు గురువారం నాడు అడ్డుకున్నారు. బంగారం గు రించి ఆరా తీశారు. ఈ మేరకు రెండు గొలుసుల ను తీసుకుని వాటికి సంబంధించిన బిల్లులు చూ పించాలని నోటీసులు ఇచ్చారు. అనంతరం న్యూ ఢిల్లీలో జరిగిన హకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న అనంతరం శుక్రవారం సా యంత్రం హైదరాబాద్కు తిరిగి వచ్చారు.
న్యూఢిల్లీ: పశ్చిమాసి యా సంక్షోభం నేపథ్యం లో లాక్డౌన్ విధిస్తారన్న ఊహాగానాలపై కేంద్ర ఆ ర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర పెట్రోలి యం మంత్రి హర్దీప్ సింగ్ పురి అలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభు త్వం వద్ద లేదని స్పష్టం చేశారు.మంత్రి సీతారామన్ రాజ్యసభలో ఆర్థిక బిల్లు 2026పై చర్చకు సమాధానం ఇస్తూ మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ఆ భారం సామాన్య ప్రజలపై పడకుండా ప్రభు త్వం ఆర్థిక లోటును నియంత్రిస్తోందని చెప్పారు. అనేక దేశాలు మోటా ర్ ఇంధనం ధరలు 2ం నుంచి 50 శాతం వరకు పెంచాయని, కానీ భారత్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా అదుపులో ఉంచగలిగినట్టు వివరించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బంకుల వద్ద పెట్రోలు, డీజిల్ ధరలు పెంచకుండా ఉండేలా ప్రభుత్వం వాటిపై ఎక్సయిజ్ డ్యూటీని రూ. 10 వంతున తగ్గించింది. గతంలో ఎలా ఆర్థిక క్రమశిక్షణ పాటించడమైందో అదే విధంగా పాటిస్తున్నట్టు మంత్రి వివరించారు. పన్నుయేతర ఆదాయాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. తరువాత మూజువాణీ ఓటు ద్వారా రాజ్యసభ ఆర్థిక బిల్లును లోక్సభకు తిప్పి పంపించింది. కేంద్ర మంత్రి పురి స్పందన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా కేంద్రమంత్రి పురి ఇంధనం సరఫ రా, నిత్యావసరాలు సరైన సమయంలో అందుబాటులోకి రావడంపై అత్యంత సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇంధ నం, ఇతర అవసరాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
శనివారం రాశి ఫలాలు (28-03-2026)
మేషం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వృషభం ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిధునం ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కర్కాటకం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. సింహం ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కన్య ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. తుల సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చికం ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. ధనస్సు ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మకరం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. కుంభం ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. మీనం బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
దుబాయ్: ఓ వైపు ట్రంప్ ఇరాన్తో చర్చలు పురోగతిలో ఉన్నాయని చెపుతున్నా , క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నంగా ఉంది. వాస్తవికంగా శాంతిప్రతిపాదనల ఫార్మూలాపై ఇటు అమెరికా, అటు ఇరాన్ తమ పట్టువీడని ధోరణినే కనబరుస్తున్నాయి. మరో వైపు ఇరాన్కు మరింత సవాలు విసురుతూ అమెరికా గల్ఫ్ ఇతర ప్రాంతాలలోకి వేలాదిగా అ దనపు సైనిక బలగాలను తరలిస్తోంది. పలు యు ద్ధ నౌకలు హర్మూజ్ జలసంధి వద్దకు చేరాయి. ఇజ్రాయెల్ ఇప్పటి చర్చల విషయంతో తమకు ని మిత్తం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. సదర్న్ లెబనాన్లోని ఇరాన్ మద్దతు గల హెజ్బోల్లా మిలిటెంట్ల బృందాల నిర్మూలనకు మరిన్ని బలగాలను తరలించింది. హర్మూజ్ మార్గానికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇరాన్ ఈ మార్గంలో తన పట్టు బిగించింది. కేవలం మిత్రదేశాలనే ఈ మార్గం ద్వారా అనుమతిస్తోంది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణి దాడులు సాగుతూనే ఉన్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ దాడులను చేస్తూనే ఇరాన్ క్షిపణులను , డ్రోన్లను దెబ్బతీసేందుకు తమ గగనతల వలయాన్ని పటిష్టపర్చుకుంది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు, చమురు నష్టం నివారణకు గల్ప్దేశాలు అన్ని కూడా అనుక్షణ నిఘాతో వ్యవహరిస్తున్నాయి. శుక్రవారం టెహరాన్ ఇతర నగరాలలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇరాన్పై తమ దాడులు నిర్విరామంగా సాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇజ్రాయెల్లో ప్రజల నివాస ప్రాంతాలపై దాడులు నిలిపివేయాలని , లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని తాము, ప్రధాని నెతన్యాహూ ఇరాన్కు హెచ్చరికలు వెలువరిస్తున్నామని గుర్తు చేశారు. ఇకనైనా ఇరాన్ ఉగ్రవాద పాలకపక్షం విధ్వంస చర్యలకు దిగకుండా ఉంటే మంచిదని కట్జ్ స్పష్టం చేశారు. తాము హెచ్చరిస్తూ వస్తున్నా, ఇరాన్ వైఖరిలో మార్పు రావడం లేదని, దీనితో ఇక తమ పోరు మరింత విస్తరించుకుంటామని, ఇరాన్లోని పలు కొత్త ప్రాంతాలను లక్షం చేసుకుని తీరుతామని వెల్లడించారు. ఇజ్రాయెల్ శుక్రవారం టెహ్రాన్ నడిబొడ్డున నిర్ణీత ప్రాంతాలను ఎంచుకుని దాడులకు దిగింది. ఆయా ప్రాంతాలలో ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ తయారీ కేంద్రాలు , అధునాతన ఆయుధాల కర్మాగారాలు ఉన్నాయని నిర్థారించుకుని ఈ దాడులు జరిపారు. ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో తమ సేనలు అక్కడి ఇరాన్ మిస్సైల్ లాంఛర్లు, గిడ్డంగులను ఎంచుకుని దాడులకు దిగాయి. ఇక లెబనాన్లోని బీరూట్పై దాడులు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు దట్టమైన పొగ కమ్ముకుంది. గల్ఫ్పై ఆగని ఇరాన్ దాడులు.. సైరన్ల మోత గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. బహరైన్, ఖతార్, యుఎఇలలో సైరన్ల మోతతో జనం వణికిపోయారు. రియాద్ వైపు దూసుకువచ్చిన ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్రు తాము కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. సౌదీ రాజధాని రియాద్ను గురిచేసుకుని ఇరాన్ శుక్రవారం దాడులు విస్తృతం చేసింది. కువైత్లోని కువైత్ సిటి అనుబంధ షువైక్ పోర్టు, ఉత్తరాన ఉన్న ముబారక్ అల్ కబీర్ పోర్టు ఇరాన్ దాడులలో దెబ్బతిన్నాయి. ఇందులో కబీర్ పోర్టును చైనా నిర్మాణపు బెల్ట్ అండ్ రోడ్ ఏర్పాటు క్రమంలో నిర్మిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రి దెబ్బతింది. టెహరాన్లో పాక్ ఎంబసీ వద్ద దాడులు శుక్రవారం టెహరాన్పై ఇజ్రాయెల్ దాడుల క్రమంలో అక్కడి పాకిస్థాన్ దౌత్యకార్యాలయం వద్ద వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో పాక్ ఎంబసీకి ఎటువంటి నష్టం జరగలేదు. అధికారులు ,సిబ్బందికి కూడా ఎటువంటి హానీ జరగలేదు. అయితే ఈ ఘటనపై వెంటనే పాకిస్థాన్ తీవ్రస్థాయిలో ఇజ్రాయెల్కు హెచ్చరికలు వెలువరించింది. తమ దేశాన్ని ఖతార్ అనుకోరాదని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యసిబ్బందికి,ఆస్తులకు నష్టం జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులలో దౌత్యకార్యాలయం సమీపంలోని పలుభవనాలు దెబ్బతిన్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందనే వార్తలు నేపథ్యంలో ఇక్కడ ఈ దాడి జరిగింది. అయితే ఈ ఘటనపై అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ స్పందించలేదు.
సైబర్ క్రైమ్పై సర్జికల్ స్ట్రైక్
మన తెలంగాణ/కరీంనగర్ క్రైం: సైబర్ నేరగాళ్ల నెట్వర్క్పై కరీంనగర్ పోలీసులు సర్జికల్ స్ట్రైక్ చేశారు. ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’ పేరుతో చేపట్టిన భారీ ఆపరేషన్లో రూ.138కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర సైబర్ ముఠాను పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం 24మంది నిందితులను గుర్తించగా, అందులో మేనేజర్తో సహా 13మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనరేట్ హా ల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. సిపి తెలిపిన వివరాల ప్రకారం నిందితులు రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ కొన్ని వర్చువల్ ఖాతాల ద్వారా భారీ ఎత్తున నిధులను మళ్లించినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆర్బిఎల్ మ్యూల్ ఖాతాల ద్వారా: రూ.125.80 కోట్లు, వర్చువల్ ఖాతాల ద్వారా రూ.12.25 కోట్లు. సుమారు రూ.138 కోట్లు నేరగాళ్ల చేతులు మారినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. నేరగాళ్ల పద్ధతి సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, కొద్దిపాటి కమిషన్ ఆశచూపి వారి పేరుతో ’మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ను ఈ ముఠా తెరిపిస్తోంది. ఈ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్ వివరాలను నేరగాళ్లు తమ ఆధీనంలో ఉంచుకుని, సైబర్ మోసాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశాలకు మళ్లిస్తున్నారు. ఈ ప్రక్రియలో సమన్వయకర్తలు, మధ్యవర్తులు,ఖాతాదారులు ఒక గొలుసుకట్టుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అరెస్టయిన వారిలో కీలక సూత్రధారులతో పాటు బ్యాంక్ అధికారులు అయినా భువనగిరి కళ్యాణ్ (ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజర్, హన్మకొండ), అయేషా బేగం (కరీంనగర్)ఉండటం గమనార్హం.ముఖ్య నిందితులు అయినా బండారి సాయిరాం, అనుమాండ్ల రంజిత్, అలిగేటి మల్లేశం, బోగ రాకేష్, బండి ప్రణయ్ లను అరెస్ట్ చేశారు. ఖాతాదారులు విభూది రాంకుమార్, నతర్ల శ్రీనివాస్, కర్రే రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి, కల్లెడ రాజేష్ వీరిపై భారత న్యాయ సంహిత సెక్షన్లు 112, 318(4) ఐటీ యాక్ట్ సెక్షన్ 66- డి కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ హెచ్చరిక ‘డబ్బుల ఆశతో మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను, ఏటీఎం కార్డులను ఇతరులకు అప్పగించకండి. అలా చేస్తే మీరు కూడా నేరస్థులుగా పరిగణించబడతారని పోలీస్ కమిషనర్ ప్రజలను హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు.ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన 11 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
فیکٹ چیک: بیلجیم کی ٹرین پر 'اسرائیلی فورسس کی موت' کی تحریر کی جانئے پوری حقیقت
وائرل پوسٹس میں دعویٰ کیا گیا کہ بیلجیم ریل محکمے نے ایران جنگ کے تناظر میں ٹرین پر 'آئی ڈی ایف کی موت' کی گریافیٹی تحریر کی۔ تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو اکتوبر 2025 کا ہے جسے من گھڑت دعوے کے ساتھ شیئر کیا گیا۔
రేపు హైదరాబాద్తో బెంగళూరు తొలి పోరు
ఐపిఎల్ సీజన్ 2026కి సర్వం సిద్ధమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేత సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఈ టోర్రమెంట్కు తెరలేస్తోంది. ఇక ఇటు హైదరాబాద్ అటు బెంగళూరు జట్లు విజయమే లక్షంగా పెట్టుకున్నాయి. రజత్ పటిదార్ సారథ్యంలోని బెంగళూరు భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో బెంగళూరు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ, పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, బెథెల్, భువనేశ్వర్ కుమార్, జోర్డాన్, డఫీ, కృనాల్ పాండ్య,షెఫర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరులో ఉన్నారు. ఇక ఈ టోర్నీకి కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. మరోవైపు హైదరాబాద్లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో సన్రైజర్స్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రాత్రి 7.30 గంటల నుంచి స్టార్ నెట్వర్క్..జియో హాట్స్టార్లో..
మంచు చరియలు విరిగిపడి ఏడుగురు మృతి
శ్రీనగర్లేహ్ జాతీయ రహదారిపై శుక్రవారం మంచు చరియలు విరిగి పడటంతో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదు మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జీరో పాయింట్ నుంచి మినిమార్గ్ మధ్య మధ్యాహ్న సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీగా కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ (బీఆర్వో), పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మంచును తొలగించడంతో పాటు ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై లద్దాఖ్ గవర్నర్ వీకే సక్సేనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
IrIrgc Warning : వాళ్లని వదలం Andhra Prabha Detail Report
Irgc Warning : వాళ్లని వదలం Andhra Prabha Detail Report (
ఈనెల 31న మహిళా రైతు రాష్ట్ర సదస్సు
ఈ నెల 31న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జరిగే మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, టి సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఆర్టిసి క్రాస్ రోడ్ లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మహిళా రైతుల రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు వివిధ జిల్లాల నుండి మహిళా రైతులు హాజరవుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్న కొద్ది పురుషుల సంఖ్య తగ్గి మహిళల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. వ్యవసాయాన్ని మహిళలే కొనసాగిస్తున్న పరిస్థితి ఉందని, వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే విత్తనబిల్లు, మార్కెట్ ముసాయిదా బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులు తీసుకొచ్చారు. గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న అవకాశాలను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు భూమిపై ఎలాంటి హక్కులు లేవు, జాయింట్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికి ఎన్నికలకు ముందు పాలకులు వాగ్ధానాలు చేస్తున్నారే తప్ప ఆచరణలో అమలు కావడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి సందర్భంగానైనా ఈ అంశం ఉండే విధంగా చూసుకుంటే ఉపయోగకరంగా ఉండేదని సూచించారు. కౌలు రైతులలో కూడా మహిళలు గణనీయంగా ఉన్నారని, వీరికి పెట్టుబడి కోసం జాయింట్ లయబుల్ గ్రూపులను ఏర్పాటు చేసి వీటి ద్వారా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అరిబండి ప్రసాద రావు, పెసరగాయల జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితలులు పాల్గొన్నారు.
కేరళ స్టార్ క్యాంపెయినర్గా సిఎం రేవంత్ రెడ్డి
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. కేరళ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం ఆ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్గా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాషపై పట్టు ఉండడం, హావభావాల పట్ల ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ముగ్దుడైనందున ప్రత్యేకించి ఆ రాష్ట్రానికి ఎంపిక చేసి ఉంటారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం కూడా ఆ రాష్ట్రంలోనే ఉండడం గమనార్హం. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ కూటమిని అధికారంలోకి తీసుకుని రావాలన్న పట్టుదలతో అధిష్టానం ఉంది.ఇదిలాఉండగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు జరిగనున్న ఎన్నికలకు రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్నూ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు. అయితే ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రభృతులు ఉన్నారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
వారం రోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరట్వాడ నుంచి కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమయిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
కొండగట్టుకు హనుమాన్ భక్తుల పాదయాత్ర
కొండగట్టుకు హనుమాన్ భక్తుల పాదయాత్ర కొండగట్టుకు పాదయాత్రకు బయలుదేరుతున్న హనుమాన్ భక్తులు కుంటాల,ఆంధ్రప్రభ
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటా
ఎపిలోని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఆరోపణలు గుప్పిస్తున్న బాధితురాలు హర్షవీణ మరో కొత్త వీడి యోను విడుదల చేశారు. తన సమస్యపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాలని, ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ కార్యా లయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు సంబంధించి తాను ఎన్ని వీడియోలను రిలీజ్ చేసిన జన సేన పార్టీ తన సమస్యను పట్టించుకోలేదని, పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధిష్టానం ఆదే శాలను ధిక్క రించి కార్యక్రమాలలో పాల్గొంటున్న అరవ శ్రీధర్కు, జనసేన పార్టీకి విలువలు లేవా? అంటూ ఆమె ప్రశ్నించింది.
చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య గీసుగొండ, ఆంధ్రప్రభ : మద్యానికి బానిసైన వ్యక్తి
కర్నూల్లో ఎండల తీవ్రత . 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు… .. రాబోయే
ఎన్హెచ్-44 పై ఘోర రోడ్డు ప్రమాదం
ఎన్హెచ్-44 పై ఘోర రోడ్డు ప్రమాదం ఎల్ఐసీ ఏజెంట్ మృతి కర్నూలు బ్యూరో,ఆంధ్రప్రభ

33 C