SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

అందుకే విడాకులు తీసుకున్నా: నిహారిక

మెగా డాటర్ నిహారిక కణిదెల తొలిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించారు. 'రాకాస' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిహారిక.  విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట ఎవరితో చెప్పాలనుకున్నారని అడగగా.. ఈ నిర్ణయం తీసుకున్నాక మొదట తన తండ్రి నాగబాబుకే చెప్పానన్నారు. ఆయన మొత్తం విని సైలెంట్ అయ్యారని, తాను సంతోషంగా లేననే విషయం వాళ్లకూ తెలుసన్నారు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నే తనకు సలహా ఇచ్చారని తెలిపారు. ఎవరూ విడిపోవాలని పెళ్లి చేసుకోరని.. అయితే, తమ మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించుకోలేనివని, అందుకే విడాకులు తీసుకోవడం మంచిదని ఇద్దరం నిర్ణయించుకున్నామని చెప్పారు. కాగా, నిహారిక, చైతన్య జొన్నలగడ్డ.. 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో 2023లో వీరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తర్వాత నిహారిక సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నిర్మాత మారి 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ఆమె 'కమిటీ కుర్రాళ్ళు' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. రెండో చిత్రంగా 'రాకాస'ను తెరకెక్కించారు. హర్రర్ కామెడీ ప్లస్ ఫాంటసీ' జానర్‌లో రూపొందిన సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మన తెలంగాణ 21 Mar 2026 10:25 pm

అరటి తోటను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశా

అరటి తోటను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశా ఏఈఓ సాయిరామ్ ను సస్పెండ్ చేయాలని

ప్రభ న్యూస్ 21 Mar 2026 9:57 pm

బలి పశువును చేస్తారు.. పాక్ క్రికెట్ బోర్డుపై మాజీ కోచ్ విమర్శలు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తీవ్ర విమర్శలు చేశారు. జట్టు సరిగ్గా ఆడనప్పుడు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారని కిర్‌స్టన్ అన్నారు.పాకిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు నెలలకే.. ఒక్క వన్డేకు కూడా కోచ్ గ వ్యవహరించకుండానే గ్యారీ కిర్‌స్టన్ అక్టోబర్ 2024లో హెడ్ కోచ్ పదవి నుండి వైదొలగాడు. దీనిపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బోర్డులో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉంటుందని.. ఇలాంటి పరిస్థితిని తానెక్కడా చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్‌కు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారన్నారు. వృత్తిపరమైన గౌరవం లేకపోవడంతో రిజైన్ చేసినట్లు తెలిపారు. జట్టు సరిగ్గా ఆడనప్పుడు, కోచ్‌ను సులభంగా బలిపశువును చేస్తారు. 'కోచ్‌ను తొలగిద్దాం' లేదా 'కోచ్‌పై ఆంక్షలు విధిద్దాం' అని అంటారు. ఎందుకంటే జట్టు సరిగ్గా ఆడనప్పుడు చేయడానికి అదే సులభమైన పని. కానీ నా దృష్టిలో అది ప్రతికూల ఫలితాలనిస్తుంది. బయటి నుంచి నిరంతరం గొడవ జరుగుతున్నప్పుడు, ఒక కోచ్ వచ్చి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం చాలా కష్టం. అది చాలా కష్టంగా ఉంటుంది. అయినా, ప్రతీ సందర్భంలోనూ నిందలు వేయాలని చూసేటప్పుడు, అసలు కోచ్‌ను ఎందుకు నియమించుకోవాలి? అని కిర్‌స్టన్ విమర్శించారు. కాగా, ప్రస్తుతం కిర్‌స్టన్, శ్రీలంక జట్టుకు హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. ఏప్రిల్ 15న ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

మన తెలంగాణ 21 Mar 2026 9:55 pm

హర్మూజ్ ను తెరవండి..

హర్మూజ్ ను తెరవండి.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధి తెరవాలని

ప్రభ న్యూస్ 21 Mar 2026 9:46 pm

దానం నాగేందర్‌ను పార్టీ ఫిరాయింపు కేసు.. స్పీకర్ తీర్పును ఛాలెంజ్ చేసిన ఏలేటి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీ ఫిరాయింపు కేసు వదలడం లేదు. దానం పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 11న ఇచ్చిన తీర్పును బిజెపి శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ ఏలేటి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ తర్వాత 2024లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని ఏలేటి పిటిషన్‌లో పేర్కొన్నారు. దానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ‘బి-ఫాం’ దాఖలు చేశారని, ఏఐసిసి ప్రకటించిన జాబితాలోనూ దానం పేరు ఉందని పిటిషనర్ ఏలేటి పేర్కొన్నారు. కాబట్టి దానంపై స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టి వేసి, ఇంత కాలం ఎమ్మెల్యేగా పొందిన జీతభత్యాలను వెనక్కి తీసుకోవాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దానం నాగేందర్‌తో పాటు పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టి వేసిన సంగతి తెలిసిందే. మిగతా తొమ్మిది మంది ఊపిరి పీల్చుకున్నారు.

మన తెలంగాణ 21 Mar 2026 9:40 pm

ఆరుగురు ఎమ్మెల్యేలపై బిజెడి వేటు..

భువనేశ్వర్: ఆరుగురు ఎమ్మెల్యేలపై బిజు జనతా దళ్ (BJD) పార్టీ వేటు వేసింది. ఇటీవల ఒడిశా నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 'క్రాస్-ఓటింగ్'కు పాల్పడ్డారని శనివారం ఆరుగురు ఎమ్మెల్యేలను బిజెడి, పార్టీ నుండి సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఈ పార్టీ, సదరు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే తమ నిర్ణయానికి కారణమని పేర్కొంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ జరిపిన పరిశీలన ఆధారంగానే ఈ సస్పెన్షన్లు విధించినట్లు BJD ప్రకటనలో తెలిపింది. కాగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP), గత సోమవారం పోలింగ్ జరిగిన ఒడిశాలోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని కైవసం చేసుకుంది. కాషాయ పార్టీ మద్దతుతో పోటీ చేసిన మరో స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. మిగిలిన ఒక స్థానాన్ని పట్నాయక్ నేతృత్వంలోని BJD దక్కించుకుంది.

మన తెలంగాణ 21 Mar 2026 9:27 pm

నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో బయో వ్యర్ధాలతో విద్యుత్ తయారీ

నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారీతో పాటు నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానంతో ఫార్యక్టరీకి అవసరమయిన విద్యుత్ స్వయంగా తయారు చేసుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు ఫ్యాక్టరీ ఆవరణలో నీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఫ్యాక్టరీకి అవసరమయిన నీటిని సైతం అక్కడే రీసైక్లింగ్ ద్వారా స్టోర్ చేసి వినియోగించనున్నారు.

మన తెలంగాణ 21 Mar 2026 9:10 pm

అరసవల్లి క్షేత్రానికి మహర్దశ..

అరసవల్లి క్షేత్రానికి మహర్దశ.. రూ. 4 కోట్లతో పుష్కరిణి పునరుద్ధరణ పనులుశంకుస్థాపన చేసిన

ప్రభ న్యూస్ 21 Mar 2026 9:06 pm

ప్రభుత్వ విప్ వీరేశంను సన్మానించిన సర్పంచుల ఫోరం

ప్రభుత్వ విప్ వీరేశంను సన్మానించిన సర్పంచుల ఫోరం చిట్యాల, ఆంధ్రప్రభ : క్రమశిక్షణకు

ప్రభ న్యూస్ 21 Mar 2026 9:01 pm

Hormuz Crisis : హూ ఈజ్ బిగ్ బాస్ Andhra Prabha SPL Story

Hormuz Crisis : హూ ఈజ్ బిగ్ బాస్ Andhra Prabha SPL

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:50 pm

రోడ్డు ప్రమాదంలో 3వేల బాతులు మృత్యువాత

 మండల పరిధిలోని ముష్టిబండ - మొద్దులగూడెం గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ బలంగా ఢీకొట్టిన ఘటనలో సుమారు 3,000 బాతులు మృత్యు వాత పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడువాయి గ్రామం నుండి తిరువూరుకు నాలుగు వేల బాతులతో వెళ్తున్న బొలెరో వాహనం, ముష్టిబండ సమీపంలోని ధాబా వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంది. అదే సమయంలో మొక్కజొన్న లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న బొలెరోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాలు రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో బొలెరోలో తరలిస్తున్న 4,000 బాతులలో సుమారు 3,000 బాతులు అక్కడికక్కడే మరణించాయి. లారీలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సకాలంలో స్పందించిన పోలీసులుహెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అశ్వారావుపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం జేసీబీ సహాయంతో రోడ్డు పక్కన పడిపోయిన బొలెరో వాహనాన్ని, లారీని బయటకు తీయించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.

మన తెలంగాణ 21 Mar 2026 8:50 pm

6గ్యారంటీలు, 420 హామీలు ఎక్కడ?

6గ్యారంటీలు, 420 హామీలు ఎక్కడ? మూడు బడ్జెట్లు వచ్చినా ఎస్సీలకు లాభం లేదుదళిత

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:46 pm

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారం

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారం మునుగోడు, ఆంధ్రప్రభ : కోమటిరెడ్డి

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:43 pm

కల్తీ సమోసాల తయారీ కేంద్రంపై దాడి

పాడైపోయిన వస్తువులతో సమోసాలు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం, కుల్సుంపుర పోలీసులు కలిసి జియాగూడలో దాడి చేశారు. సమోసాలు తయారు చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.5లక్షల విలువైన పాడైపోయిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...జియాగూడలోని ఎస్‌బిఎ గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంటిలో అబ్దుల్ రషీద్(73) అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన గుడ్లు, పదే పదే మరిగించిన నూనెను ఉపయోగించి సమోసాలు తయారు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హెచ్ ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం), కుల్సుంపురా పోలీసులు సమన్వయంతో జియాగూడలోని ఒక అక్రమ ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేసి సీజ్ చేశారు. తయారీ కేంద్రానికి ఎలాంటి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు పాడైన గుడ్లతో ఎగ్ సమోసాలు , స్వీట్ కార్న్ సమోసాలు , ఉల్లిపాయ సమోసాలు తయారు చేస్తున్నాడు. అన్ని వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో అ అప్పగించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 21 Mar 2026 8:39 pm

ఉత్కంఠ పోరు.. మహిళల ఆసియా కప్‌ జపాన్ కైవసం

సిడ్నీ: హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి మహిళల ఆసియా కప్‌ను జపాన్ కైవసం చేసుకుంది. సిడ్నీలో జరిగిన ఈ తుది పోరులో, అతిథి జట్టు అయిన ఆస్ట్రేలియాపై జపాన్ విజయం సాధించింది. ఈ ఉత్కంఠ పోరులో ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతూ పై చేయి సాధించింది ఆస్ట్రేలియా. దీంతో తొలి కొన్ని నిమిషాల్లోనే జపాన్‌ను తీవ్ర ఒత్తిడికి నెట్టేసింది. కానీ జపాన్ ఒత్తిడిని తట్టుకుని నిలబడి విజయాన్ని అందుకుంది.  కాగా, వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరిగే ప్రపంచ కప్‌కు ఇది అర్హత పోటీగా ఉపయోగపడింది. ఫైనల్ కు చేరుకున్న రెండు జట్లతో సహా పలు జట్లు అర్హత సాధించాయి. జపాన్, ఆస్ట్రేలియాతో పాటు, ఆసియా నుండి చైనా పీఆర్, కొరియా రిపబ్లిక్, ఫిలిప్పీన్స్, ఉత్తర కొరియా డీపీఆర్ జట్లు కూడా తదుపరి రౌండ్లకు అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న భారత్, ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడిపోయి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.

మన తెలంగాణ 21 Mar 2026 8:38 pm

Top Actress to shake leg with Ram Charan?

The shoot of Mega Powerstar Ram Charan’s upcoming film Peddi is coming to an end and the film is slated for April 30th release across the globe. A special song will be shot in a massive set in the first week of April. The makers are on a hunt for the right actress to shake […] The post Top Actress to shake leg with Ram Charan? appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 8:37 pm

‘Snake Dance’ from Rākāsā Brings a High-Energy Dance Track with Crowd Appeal

As the soundtrack continues to unfold, “Snake Dance” arrives as a lively addition that shifts Rākāsā into a more spirited and free-flowing zone. Positioned after two contrasting tracks, this one embraces a more immediate, rhythm-led presence, leaning into energy over nuance. With “Snake Dance,” the response is almost automatic—you don’t pause to catch it, it […] The post ‘Snake Dance’ from Rākāsā Brings a High-Energy Dance Track with Crowd Appeal appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 8:35 pm

మోత్కూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు..

మోత్కూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:32 pm

యుటిఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి ఏవీఎస్ కు నివాళి

యుటిఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి ఏవీఎస్ కు నివాళి దర్శి, ఆంధ్రప్రభ : యుటిఎఫ్

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:28 pm

ప్రజలతో కలిసి భోజనం… సేవలపై నేరుగా సమీక్ష

ప్రజలతో కలిసి భోజనం… సేవలపై నేరుగా సమీక్ష అన్న క్యాంటీన్‌లో కలెక్టర్ లక్ష్మీశ

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:23 pm

ఆ వర్గం ఎటువైపు…

ఆ వర్గం ఎటువైపు… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అరడుగుల బుల్లెట్‌కు ఆపద వచ్చిందంట.

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:18 pm

ఒక్కసారిగా 20 కోతుల మూక దాడి.. వృద్ధురాలి మృతి

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కోతుల మూక దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పెద్దిపాలెం గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకొని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి (68) నివాసం ఉంటున్నారు. గేదెకు నీరు పెట్టేందుకు వెళ్లగా అక్కడ కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. 20కి పైగా కోతులు ఒక్కసారిగా దాడి చేయడంతో తప్పించుకొనేందుకు వీలు లేకుండా పోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నబుల్లి తనకు ఉన్న 3 ఎకరాల తోటలో తన కుమార్తె కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. ఈ ప్రాంతంలో కోతుల దాడిలో గాయపడిన ఘటనలు చాలా జరిగాయని.. అయితే ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని గ్రామస్థులు వాపోయారు. 

మన తెలంగాణ 21 Mar 2026 8:13 pm

Temple |ఘనంగా శివ పార్వతుల కల్యాణం…

Temple | ఘనంగా శివ పార్వతుల కల్యాణం… Temple | వెబ్‌డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:08 pm

రాహుల్ గాంధీ.. బిజెపికి బి టీమ్: కేరళ సిఎం సంచలన ఆరోపణలు

తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సిఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి బీ టీమ్ లాంటి వాడని సంచలన ఆరోపణలు చేశారు.  రాహుల్ గాంధీ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడని వ్యక్తి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మెజారిటీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన మతతత్వ శక్తుల మద్దతును కూడగట్టుకోవడమే ఆ పార్టీ లక్ష్యమని విజయన్ ఆరోపించారు. CPI(M), LDF మతతత్వానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. కాగా, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

మన తెలంగాణ 21 Mar 2026 8:06 pm

పుతిన్ అమెరికాకు షరతు..

పుతిన్ అమెరికాకు షరతు.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రష్యా

ప్రభ న్యూస్ 21 Mar 2026 8:02 pm

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని బట్ల

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:56 pm

సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు

విశాలాంధ్ర- హైదరాబాద్ : సోషల్ మీడియా-మంచీ- చెడూ (సోషల్ మీడియా- ఇంపాక్ట్-పాజిటివ్ అండ్ నెగెటివ్) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) ఆదివారం హైదరాబాదులో ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే.విరాహత్ అలీ, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు. […] The post సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 7:52 pm

వచ్చే రంజాన్ నాటికి సీసీ రోడ్డు పూర్తి చేస్తాం…

వచ్చే రంజాన్ నాటికి సీసీ రోడ్డు పూర్తి చేస్తాం… స్టేషన్ ఘన్ పూర్,

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:52 pm

ముస్లీం మైనార్టీలకు రంజాన్ తోఫా అందజేసి సత్యమూర్తి

విశాలాంధ్ర – మల్కాజిగిరి : ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ ప్రశాంత్ నగర్‌లో రంజాన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా అందించిన ఈద్ కా తోఫాను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి ముస్లిం సోదరులకు అందజేశారు. వారిని శాలువాతో సత్కరించి స్వీట్స్ అందజేసి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని, మల్కాజిగిరిలో మైనార్టీల అభ్యున్నతికి సహకరిస్తున్న మాజీ […] The post ముస్లీం మైనార్టీలకు రంజాన్ తోఫా అందజేసి సత్యమూర్తి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 7:50 pm

అంగన్‌వాడీ భవనానికి శ్రీకారం…

అంగన్‌వాడీ భవనానికి శ్రీకారం… స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:49 pm

బాదితునికి ఎలఓసి అందజేత

విశాలాంధ్ర – మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆర్యన్ గౌస్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్యతో బాధపడుతున్నాడు. అతని ఆపరేషన్‌కి అయ్యే ఖర్చులు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ బాబు సహకారంతో రూ. 3 లక్షల ఎలఓసి మంజూరు చేయడం జరిగింది. ఈ ఎలఓసి కాపిని బాదితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్, బి.కె.శ్రీనివవాస్, గుండా నిరంజన్, కపిల్, […] The post బాదితునికి ఎలఓసి అందజేత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 7:46 pm

Smartphones Turning Dangerous for Young Women, Warns Hyderabad CP Sajjanar

Hyderabad Police Commissioner V.C. Sajjanar has raised serious concerns over the growing misuse of social media and smartphones, especially among young women. He warned that what fits in the palm today is slowly becoming a source of danger for many. Sajjanar said the rise in social media usage has led to an increase in interactions […] The post Smartphones Turning Dangerous for Young Women, Warns Hyderabad CP Sajjanar appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 7:44 pm

ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ బదిలీ

ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ బదిలీ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం ట్రాఫిక్

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:35 pm

Video : Producer Niharika Konidela Exclusive Interview

The post Video : Producer Niharika Konidela Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 7:33 pm

రెండు వారాల్లో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం

రానున్న రెండు వారాల్లో రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. పౌరసరఫరాల భవన్‌లో రాష్ట్ర రైస్ మిల్లర్లతో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మిల్లర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదనపు గోదాములను వెంటనే గుర్తించి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రవాణా ఏర్పాటు, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధాన్యం అన్‌లోడ్ చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలను (కార్మికులను) ఏర్పాటు చేయాలని అధికారులు, మిల్లర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పని చేస్తామని రైస్ మిల్లర్లు అంగీకరించారు.

మన తెలంగాణ 21 Mar 2026 7:30 pm

15 ఏళ్ల నిరీక్షణకు తెర….

15 ఏళ్ల నిరీక్షణకు తెర…. రామవరప్పాడులో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:29 pm

పవిత్ర రంజాన్ మాసం మానవాళికి మార్గదర్శిగా నిలుస్తుంది

పవిత్ర రంజాన్ మాసం మానవాళికి మార్గదర్శిగా నిలుస్తుంది కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : పవిత్ర

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:27 pm

మసీద్ అభివృద్ధికి రూ.2.60 లక్షలు విరాళం…

మసీద్ అభివృద్ధికి రూ.2.60 లక్షలు విరాళం… విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:24 pm

Mega Steel Plant in Andhra Pradesh: AMNS India Project Set to Transform Anakapalli

Andhra Pradesh is set to witness a major industrial boost with the launch of a massive steel plant project in Anakapalli district. Global steel giant ArcelorMittal Nippon Steel India has chosen the state for its greenfield integrated steel plant, marking one of the biggest industrial investments in recent years. The project involves an investment of […] The post Mega Steel Plant in Andhra Pradesh: AMNS India Project Set to Transform Anakapalli appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 7:19 pm

ప్రతీ కార్యకర్తకూ టీడీపీ అండ…

ప్రతీ కార్యకర్తకూ టీడీపీ అండ… కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : ప్రతి కార్యకర్తకూ తెలుగుదేశం

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:18 pm

ముస్లిం, మైనార్టీల పక్షపాతి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి……

ముస్లిం, మైనార్టీల పక్షపాతి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి…… ముస్లిం మైనార్టీల కు

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:14 pm

నలభై ఏళ్ళ బంధం తెంచుకుంటున్నా: జీవన్ రెడ్డి

గతంలో సుమారు రెండు సంవత్సరాలుగా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయనకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా జీవన్ రెడ్డి  కాంగ్రెస్‌తో తనకు ఉన్న నలభై ఏళ్ళ బంధాన్ని తెంచుకుంటున్నందుకు బాధగా ఉందన్నారు. ఇరవై నెలలుగా పార్టీలో క్షోభకు గురయ్యానని ఆయన ఆవేదనతో చెప్పారు. మరో నాయకున్ని (ఎమ్మెల్యే కె. సంజయ్) ప్రోత్సహిస్తూ తనను అవమానించారని ఆయన పార్టీ నాయకత్వాన్ని విమర్శించారు. తనకు క్లీన్ ఇమేజ్ ఉందన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా, త్వరలో జగిత్యాలలో తన అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 21 Mar 2026 7:10 pm

వీధి కుక్కల సమస్యల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు…

వీధి కుక్కల సమస్యల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు… విజయవాడ నగరపాలక సంస్థ

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:09 pm

శ్రీ తిరుపతమ్మ ఆలయానికి భక్తులు విరాళం…..

శ్రీ తిరుపతమ్మ ఆలయానికి భక్తులు విరాళం….. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:07 pm

హర్మూజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి..

గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కోట్ల విలువైన ఆస్తిలు ధ్వంసమయ్యాయి. ఇంత జరిగిన ఈ యుద్ధ వాతావరణం చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఇంధన లోటుతో పలు దేశాలు ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధిని తెరవాలని పలు దేశాలు ఇరాన్‌ను కోరాయి. దాడులను ఆపాలని కూడా ఇరాన్‌ను 22 సంయుక్త ప్రకటన చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను పలు దేశాలు ఖండించాయి. యుఎఇ, బహ్రెయిన్, యుకె, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఈ దాడులను ఆపాలని విజ్ఞప్తి చేశాయి. ఇరాన్ చర్యల వల్ల అన్ని దేశాల ప్రజలపై దుష్ర్ఫభావం పడుతోందని ప్రకటించాయి.

మన తెలంగాణ 21 Mar 2026 7:04 pm

టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత…

టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత… నవాబుపేటలో అంత్యక్రియలకు నేతల రాకకుటుంబానికి నెట్టెం రఘురాం

ప్రభ న్యూస్ 21 Mar 2026 7:04 pm

చిన్నారిపై వీధి కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు..

వరంగల్: వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. 35వ డివిజన్‌లోని నాలుగు జెండాల ప్రాంతంలో ఒంటరిగా ఉన్న చిన్నారిపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో చిన్నారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి కుక్కలను తరిమి కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నారిపై కుక్కలు దాడి చేస్తున్న సమయంలో స్థానికులు చూసి గట్టిగా కేకలు వేయడంతో కుక్కలు పారిపోయాయి. ప్రస్తుతం గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మన తెలంగాణ 21 Mar 2026 6:54 pm

ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

ఇంధన సరఫరాపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్ లోకి వస్తుందన్నారు. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు విక్రయించడానికి మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అదనపు ముడి చమురులేదు : ఇరాన్ స్పందన అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందిస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్ తెలిపింది. ఈమేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్ ఇలాంటి ప్రకటన చేసిందన్నారు. 

మన తెలంగాణ 21 Mar 2026 6:43 pm

బిఆర్ఎస్ లోకి వస్తే.. జీవన్ రెడ్డిని భుజాలపై మోసుకుని తీసుకొస్తా

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోరుట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వస్తే స్వాగతిస్తామని సంజయ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతోవ మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి.. ఆయన మా పార్టీలోకి వస్తే, నేను భుజాల మీద మోసుకుని తీసుకొస్తా అని అన్నారు. ఇదిలావుంటే, జీవన్ రెడ్డి.. బిఆర్ఎస్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఆయన అనుచరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన బిఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయమేనని ప్రచారం ఊపందుకుంది.  కాగా, గత 42 ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న తనకు పార్టీలో నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం దక్కడంలేదని జీవన్ రెడ్డి ఇటీవల తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. దీంతో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఈరోజు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్.. ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడారు.

మన తెలంగాణ 21 Mar 2026 6:42 pm

బంగారం, వెండి భారీగా తగ్గుముఖం

 అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం శుక్రవారంనాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు పలుకగా, 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలుగా నడిచింది. శనివాంనాడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్‌ల బంగారంపై 2,940 రూపాయలు, 22 క్యారెట్ బంగారంపై 2,750 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970 రూపాయల దగ్గర.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి.శుక్రవారంనాడు కిలో వెండి 2,60,000 రూపాయలు, 100 గ్రాముల వెండి 26,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. శనివారంనాడు కిలోపై 10 వేల రూపాయలు.. 100 గ్రాములపై వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,50,000 రూపాయల దగ్గర, 100 గ్రాముల వెండి 25 వేల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

మన తెలంగాణ 21 Mar 2026 6:39 pm

மாணவர்கள் உணவை குப்பையில் கொட்டும் வீடியோ.. சம்பவம் தமிழ்நாட்டில் நடந்ததா?

ஆந்திரா பள்ளியில் மாணவர்கள் உணவை குப்பையில் கொட்டும் வீடியோவை, தமிழ்நாட்டில் நடந்த சம்பவம் போல பொய்யாக பரப்பி வருகிறார்கள்.

తెలుగు పోస్ట్ 21 Mar 2026 6:35 pm

రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు.. మహిళ వ్యాపారవేత్తకి టోకరా

హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. ఏదో మార్గంలో కొందరు కేటుగాళ్లు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ వ్యాపారవేత్త, మాజీ డిజిపి మనుమరాలిని సైబర్ నేరగాళ్లు మోసం చేసి పెద్ద మొత్తంలో నగదు కాజేశారు. మహిళ వ్యాపారి దివ్యారెడ్డి, అకౌంటెంట్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. 18 కంపెనీలకు మాజీ డిజిపి మనవరాలు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నెల 13న ఆమె పేరు, ఫోటోతో ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు సందేశం పంపించారు. తాను మీటింగ్‌లో ఉన్నానని.. చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్ మెసేజ్ చేశారని భావించి రూ.1.20 కోట్లను అకౌంటెంట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ అకౌంటెంట్‌కు మళ్లీ వాట్సాప్ సందేశం వచ్చింది. డబ్బులు పంపేందుకు చెక్ అప్రూవల్ కోసం డెరెక్టర్‌ని అకౌంటెంట్ సంప్రదించారు. ఈ సందర్భంగా గతంలో చేసిన రూ.1.20 కోట్ల లావాదేవీ వివరాలను అకౌంటెంట్ వివరించారు. దీంతో తాను ఎలాంటి డబ్బు పంపమని చెప్పలేదని దివ్యారెడ్డి ఖంగు తిన్నారు. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 21 Mar 2026 6:32 pm

Telangana : ఇక వరసగా బీజేపీ అగ్ర నేతల పర్యటనలు.. కారణమిదే

భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధమవుతుంది

తెలుగు పోస్ట్ 21 Mar 2026 6:30 pm

కనుమరుగవుతున్న ప్రకృతి సంపద..

కనుమరుగవుతున్న ప్రకృతి సంపద.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని శాంతినగర్, నవాబుపేట, శివారులోని

ప్రభ న్యూస్ 21 Mar 2026 6:26 pm

పరకాలలో మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నేత పరామర్శ

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో ఇటీవల మరణించిన పలువురు కుటుంబాలను పరకాల పట్టణ

ప్రభ న్యూస్ 21 Mar 2026 6:21 pm

బ్రాహ్మణ వెల్లెంలతో నల్లగొండ సస్యశ్యామలం…

బ్రాహ్మణ వెల్లెంలతో నల్లగొండ సస్యశ్యామలం… నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : బ్రాహ్మణ వెల్లంల

ప్రభ న్యూస్ 21 Mar 2026 6:15 pm

IPL 2026.. KKRకు దెబ్బ మీద దెబ్బ

కోల్‌కతా: IPL 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్(కెకెఆర్)కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా కెెకెఆర్ బౌలర్ హర్షిత్ రాణా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా మరో బౌలర్ కూడా ఈ సీజన్ కు దూరమయ్యాడు. గాయం కారణంగా కెకెఆర్ స్టార్ పేసర్ ఆకాష్ దీప్ IPL 2026 టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. అతను కోలుకోవడానికి 8 నుండి 12 వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనితో అతను IPLకు మాత్రమే కాకుండా, జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన KKR జట్టుకు ఆకాష్ గాయపడటం ఎదురు దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మరో బౌలర్ మతీషా పతిరణ ఏప్రిల్ మధ్యలో జట్టుతో చేరే అవకాశం ఉంది. పతిరణ మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ముగ్గురు కీలక బౌలర్లు జట్టుకు దూరం కావడంతో కోల్‌కతా బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆకాష్ స్థానంలో కెకెఆర్ మరో బౌలర్ ను వెతికే పనిలో ఉంది. ఐదుగురుకి పైగా దేశీయ పేసర్లు ప్రస్తుతం జట్టుతో కలిసి శిక్షణ పొందుతున్నారు.  రాణా, ఆకాష్ స్థానాల్లో బౌలర్లు సిమర్‌జీత్ సింగ్, ఆకాష్ మధ్వాల్, ఆర్.ఎస్. అంబ్రిష్ లలో ఇద్దరిని తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా గత ఏడాది జరిగిన మినీ వేలంలో KKR.. ఆకాష్ దీప్ ను రూ.కోటికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

మన తెలంగాణ 21 Mar 2026 6:09 pm

Breaking : దానం నాగేందర్ పార్టీ మార్పుపై హైకోర్టుకు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు

తెలుగు పోస్ట్ 21 Mar 2026 6:08 pm

SI Chandrasekhar |మొన్న భార్య… నేడు భర్త

SI Chandrasekhar | మొన్న భార్య… నేడు భర్త టూ టౌన్ ఎస్ఐ

ప్రభ న్యూస్ 21 Mar 2026 6:07 pm

Pezheshkian |మారుతున్న పరిస్థితులపై చర్చ

Pezheshkian | మారుతున్న పరిస్థితులపై చర్చ Pezheshkian | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Mar 2026 6:06 pm

సత్వర న్యాయం అందేలా చూడాలి

సత్వర న్యాయం అందేలా చూడాలి సిరిసిల్ల, ఆంధ్రప్రభ : సమస్యలతో పోలీస్ స్టేషన్

ప్రభ న్యూస్ 21 Mar 2026 6:04 pm

పేదలకు గుడ్ న్యూస్... ఒకే సారి మూడు నెలల రేషన్

రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది.

తెలుగు పోస్ట్ 21 Mar 2026 6:01 pm

Andhra Pradesh : రేషన్ కార్డులున్న వారికి గుడ్ న్యూస్

రేషన్‌కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 21 Mar 2026 5:54 pm

ఎర్రకట్ట స్పీడ్ బ్రేకర్ల పై జీబ్రా లైన్స్…… ఏవి?

ఎర్రకట్ట స్పీడ్ బ్రేకర్ల పై జీబ్రా లైన్స్…… ఏవి? 1.2 కిలో మీటర్

ప్రభ న్యూస్ 21 Mar 2026 5:53 pm

Will Prashant Kishor Switch Sides Again? Andhra Politics Heads for Strategic Battle

Political activity in Andhra Pradesh is already heating up as parties begin laying the groundwork for the 2029 elections. The ruling alliance and YS Jagan Mohan Reddy are both sharpening their strategies, each trying to outmanoeuvre the other well in advance. Jagan has been projecting confidence about a return to power, while also hinting at […] The post Will Prashant Kishor Switch Sides Again? Andhra Politics Heads for Strategic Battle appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 5:47 pm

ఉమాదేవి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం..

విశాలాంధ్ర – నార్పల: మండల కేంద్రానికి చెందిన సాకే కృష్ణమూర్తి, కమలమ్మల కుమార్తె బుడగల ఉమాదేవి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుటుంబ సభ్యులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఏడాది క్రితం స్వర్గస్తురాలైన ఉమాదేవి జ్ఞాపకార్థం నార్పల మండల కేంద్రం సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులకు అన్నదానం నిర్వహించేందుకు రూ.4,000 నగదును అందజేశారు.దివంగత ఉమాదేవి భర్త, రాప్తాడు జర్నలిస్ట్ బుడగల శ్రీనివాసులు, కుమారుడు అక్షయ్ సాగర్, కుమార్తె నిత్యశ్రీలు కలిసి ఆశ్రమ నిర్వాహకులకు ఆర్థిక సహాయం […] The post ఉమాదేవి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 5:46 pm

Breaking : కేంద్రం గుడ్ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వచ్చేస్తున్నాయ్

వాణిజ్య సిలిండర్ల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 21 Mar 2026 5:46 pm

Andhra Pradesh : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పదవీ విరమణ వయసు పెంపు

ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగుల కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 21 Mar 2026 5:38 pm

భార్య కోసం వెళ్లి అక్కపై గొడ్డలితో దాడి…

విశాలాంధ్ర – కంబదూర్ మండలం: కంబదూర్ మండలం తిప్పేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల చిరంజీవి తన భార్య జయమ్మతో తరచూ గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. భర్త వేధింపుల కారణంగా జయమ్మ తన అక్క గంగమ్మ వద్దకు వెళ్లి తన బాధను చెప్పుకునేది.ఈ నెల 20వ తేదీన భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ చోటుచేసుకోవడంతో భయపడిన జయమ్మ గ్రామంలో ఎక్కడో దాక్కుంది. ఆమె రాళ్లపల్లి గ్రామంలో ఉన్న తన అక్క గంగమ్మ ఇంటికి వెళ్లి ఉంటుందని అనుమానించిన చిరంజీవి […] The post భార్య కోసం వెళ్లి అక్కపై గొడ్డలితో దాడి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 5:33 pm

మా జోలికి రావొద్దు… బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్, బ్రిటన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడి చేసేందుకు అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తోందన్న నివేదికల నేపథ్యంలో ఇరాన్ శనివారం తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో బ్రిటన్ జోక్యం శ్రుతి మించితే, ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఃఎక్స్ః వేదికగా ఓ పోస్ట్ […] The post మా జోలికి రావొద్దు… బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 5:30 pm

8వ వార్డు కౌన్సిలర్ చొరవ…!

8వ వార్డు కౌన్సిలర్ చొరవ…! స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల

ప్రభ న్యూస్ 21 Mar 2026 5:28 pm

పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 9 మంది అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడించింది. పుదుచ్చేరి హోం మంత్రి ఎ. నమశ్శివాయం మన్నాడిపేట నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. కలపేట నుండి పి.ఎం.ఎల్. కళ్యాణసుందరంను, తిరునల్లార్ నుండి జి.ఎన్.ఎస్. రాజశేఖరన్‌ను అభ్యర్థులుగా నిలబెట్టింది. ఈ జాబితా ప్రకారం, ఎ. నమశ్శివాయం మన్నాడిపేట నుండి, వి.పి. రామలింగం రాజ్‌భవన్ నుండి, ఎ. జాన్‌కుమార్ ముదలియార్‌పేట స్థానాల నుండి పోటీ చేయనున్నారు.  ఎంబాలం ఆర్. సెల్వం మానవేలి నుండి, టి.కె.ఎస్.ఎం. మీనాక్షిసుందరం నెరవి టి.ఆర్. పట్టణం నుండి, ఎ. దినేశన్ మాహే నుండి ఎన్నికల బరిలో నిలవనున్నారు. షెడ్యూల్డ్ కులాలకు (SC) కేటాయించిన రిజర్వ్ స్థానమైన ఔస్సుడు నుండి ఇ. తీప్పైంతన్ పోటీ చేయనున్నారు. కాగా, పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార AINRC పార్టీ, బిజెపి-AIADMK కూటమి శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, AINRC 16 స్థానాల్లో పోటీ చేయగా, మిగిలిన 14 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.

మన తెలంగాణ 21 Mar 2026 5:27 pm

కళ్యాణదుర్గంలో చిరుతల సంచారం… స్థానికులలో భయాందోళనలు

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్: పట్టణంలోని ముదిగల్లు రోడ్‌లో, కంకర మిషన్ ఎదుట ఉన్న కొండ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అక్కడ రెండు చిరుతలను గమనించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండి, జనసంచారం ఎక్కువగా ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొండకు ఆనుకుని ఇళ్లు ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చిరుతలను పట్టుకుని దట్టమైన అడవుల్లో […] The post కళ్యాణదుర్గంలో చిరుతల సంచారం… స్థానికులలో భయాందోళనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 5:22 pm

జీజీహెచ్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ త‌నిఖీలు…

జీజీహెచ్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ త‌నిఖీలు… వైద్యసేవ‌ల‌తో పాటు యూత్ టైం బ్యాంకు సేవ‌ల

ప్రభ న్యూస్ 21 Mar 2026 5:16 pm

ఇరాన్‌లోని నతాంజ్‌ అణుకేంద్రంపై మరోసారి దాడి

ఇరాన్‌ (జనంసాక్షి) : ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేశాయి. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అణుశుద్ధి కేంద్రంపై వైమానిక …

జనం సాక్షి 21 Mar 2026 5:15 pm

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – తిరుమల:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు.తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ […] The post తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 5:14 pm

కొత్త దిశగా అడుగు..

యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ ఫార్మాట్ ‘ది ట్రైటర్స్’ తెలుగు వర్షన్‌కు ఆయన హోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఇండియా ముంబయ్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వరుస సినిమాలతో సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జ, ఇప్పుడు సినిమాలతో పాటు కొత్త ఫార్మాట్స్ వైపు కూడా దృష్టి పెడుతున్నారు. ది ట్రైటర్స్ తెలుగు ద్వారా ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వబోతున్నారు. ఈ రియాలిటీ షో ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక కాన్సెప్ట్‌తో పెద్ద హిట్ అయ్యింది. అదే థ్రిల్, టెన్షన్ తెలుగు వర్షన్‌లో కూడా ఉండబోతోంది. ఈ షోలో తేజ సజ్జ ఒక కొత్త అవతార్ లో కనిపించబోతున్నారు. హోస్ట్‌గా ఆయన స్టైల్, ఎనర్జీ ఈ షోకు మరింత ప్రత్యేకత తీసుకురానుంది.

మన తెలంగాణ 21 Mar 2026 5:13 pm

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

జేఎంసీ ట్రస్టు చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ఆలయంలోని రంగ నాయకుల మండపంలో విరాళం డీడీని అందజేశారు. The post టీటీడీకి రూ.10 లక్షలు విరాళం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 5:10 pm

Cooking Gas Shortage Troubles, Long Queues, and Delays Frustrate Consumers

Residents across the agency region are facing growing difficulties in accessing cooking gas. While officials maintain that there is no shortage, the ground reality tells a different story. Consumers are standing in long queues outside gas agencies, and in some places, “No Stock” boards have been added to the confusion. The problem is being reported […] The post Cooking Gas Shortage Troubles, Long Queues, and Delays Frustrate Consumers appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 5:08 pm

6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించలేదని.. నిధుల మంజూరుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే లాభమేంటని కొందరికి సందేహం ఉండవచ్చు.. చట్టబద్ధత వస్తే లబ్ధిదారులకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుండి వారి బ్యాంకు ఖాతాల్లో పడతాయని చెప్పారు. అందుకే, ఆరు గ్యారెంటీల చట్టబద్ధత కోసం బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారుచేశామని.. ఈ బిల్లును రాష్ట్ర శాసన సభలో, శాసన మండలిలో వచ్చే శుక్రవారం ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. మొన్న రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లు నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ చేసుకుంటామని చెప్పినట్లు.. ప్రజలు కూడా దరఖాస్తులు, దండాలు పెట్టాల్సిన అవసరం లేదని.. మీకు డబ్బులు రాకపోతే ఈ చట్టం ద్వారా డబ్బులు రాలేదని కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయొచ్చని కెటిఆర్ అన్నారు.

మన తెలంగాణ 21 Mar 2026 5:08 pm

మహమ్మద్ ప్రవక్త భోదనలే మార్గదర్శనం

మహమ్మద్ ప్రవక్త భోదనలే మార్గదర్శనం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కర్నూలు బ్యూరో,

ప్రభ న్యూస్ 21 Mar 2026 5:08 pm

Andhra Prabha Smart Edition |TS|ఆయిల్ పామ్ /తగ్గిన ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 21-03-2026, 4.00PM ts సిద్దిపేటలో ఆయిల్ పామ్

ప్రభ న్యూస్ 21 Mar 2026 5:07 pm

విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న…కమల్ హాసన్ ఏమన్నారంటే?

తమిళనాడు (జనంసాక్షి) : సినీ నటుడు విజయ్ పార్టీని స్థాపించడం, తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రముఖ నటుడు కమల్ …

జనం సాక్షి 21 Mar 2026 5:03 pm

Andhra Prabha Smart Edition |AP|పంచతంత్రం/ఉడాన్ పథకం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 21-03-2026, 4.00PM ap బీజేపీ పంచతంత్రం.. ఐదు

ప్రభ న్యూస్ 21 Mar 2026 5:01 pm

నా రాజీనామాకు కారణం అతడే.. జై షాకు సంబంధం లేదు: శివరామకృష్ణన్

తను 23 ఏళ్లుగా నిర్లక్ష్యాన్ని గురి అవుతున్నానని అందుకే బిసిసిఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని పక్కన పెట్టడం వెనుక బిసిసిఐ కార్యదర్శిగా పని చేసిన జై షా ఉన్నారని సోషల్‌మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తను రాజీనామా చేయడానికి బిసిసిఐలో ఓ ఉద్యోగి కారణమని జై షాకు, బిసిసిఐ అడ్మినిస్ట్రేషన్‌కు కానీ ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని శివరామకృష్ణన్ మరో పోస్ట్ పెట్టారు. నా రాజీనామా చిత్రంలోకి బిసిసిఐ అడ్మినిస్ట్రేషన్‌ను తీసుకురావొద్దు. బిసిసిఐలో ఒకే ఒక్క ఉద్యోగి చేసిన నిర్వాకం ఇది. జై షాతో పాటు ఇతర పెద్దలకు ఇందులో ఎలాంటి పాత్ర లేదు. నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’’ అని శివరామకృష్ణన్ వెల్లడించారు.

మన తెలంగాణ 21 Mar 2026 5:01 pm

సమాజంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలి…

సమాజంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలి… నిర్మల్ బీజేపీ జిల్లా

ప్రభ న్యూస్ 21 Mar 2026 4:56 pm

సోషల్ మీడియా పరిచయాలు అమ్మాయిలను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్

హైదరాబాద్ (జనంసాక్షి) :స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన …

జనం సాక్షి 21 Mar 2026 4:51 pm

ఆరు గ్యారెంటీల్లో అరగ్యారెంటీ కూడా అమలు కాలేదు: కెటిఆర్

హైదరాబాద్: అభయహస్తం అనే దస్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో 6 గ్యారెంటీల దస్త్రంపై సంతకం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంలోనూ ఆరు గ్యారెంటీలపై సంతకం జరిగిందని చెప్పించారని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో అరగ్యారెంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదని, ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపి పెట్టిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కోరుతూ ప్రైవేటు మెంబరు ప్రవేశపెట్టనున్నామని తెలియజేశారు. వచ్చే శుక్రవారం నాడు శాసనసభలో తాము ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించామని, తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని, ఆరు గ్యారెంటీలపై సిఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయిందని కెటిఆర్ పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు..వెంటనే అమలు చేయాలని, పింఛను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారు.. వెంటనే పెంచాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలని, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామన్నారు..అదీ అమలు చేయాలని సూచించారు. తాము పెట్టే బిల్లు పాస్ అయితే.. హామీలన్ని చట్టప్రకారంగా అమలవుతాయని, తాము పెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు వారి ఎమ్మెల్యేపై ఒత్తిడి తేవాలని కెటిఆర్ కోరారు.

మన తెలంగాణ 21 Mar 2026 4:48 pm

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు ఎ.కొండూరు మార్కెట్ యార్డులో నైపుణ్య శిక్షణ

ప్రభ న్యూస్ 21 Mar 2026 4:47 pm