స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్
విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సిద్ధం చేసిన పుస్తకాలను అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ నిర్వహించిన విలువల విద్య సదస్సులో ఆయన చాగంటితో కలిసి పాల్గొన్నారు.పిల్లలను సరైన దారిలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతో ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల్లో చాలావరకు పరిష్కారం చూపాం: లోకేశ్పిల్లల్లో మార్పు ముందుగా ఇంటి పరిసరాల నుంచే రావాలి. మహిళలకు గౌరవం ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. […] The post స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్ appeared first on Visalaandhra .
మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్ ముచ్చల్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లలో ఒకరైన స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది.పెళ్లి వేడుకల మధ్యలోనే మంధాన తండ్రికి గుండెపోటు లక్షణాలు కనిపించడంతో, వెంటనే ఆయనను సాంగ్లీలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరిణామాల నేపథ్యంలో పెళ్లిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంధాన నిర్ణయించిందని, ఆమె మేనేజర్ వెల్లడించారు.అసలు ఈ వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా, పలాశ్ ముచ్చల్ […] The post మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్ ముచ్చల్ appeared first on Visalaandhra .
festival|శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె
festival| తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం
బంగాళాఖాతంలోని తాజా వాతావరణ మార్పులు నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఇప్పటికే ఒక అల్పపీడనం క్రియాశీలంగా ఉండగానే, మరో కొత్త అల్పపీడనం ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడవచ్చని, రాబోయే రోజుల్లో ఇవి కలిసిపోయే అవకాశమున్నట్లు సూచనలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం మలక్కా జలసంధి దగ్గర తీవ్ర అల్పపీడనం చురుగ్గా కొనసాగుతోంది.ఇది పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణించి, మంగళవారం నాటికి వాయుగుండంగా మారి, గురువారానికి తుపానుగా అభివృద్ధి చెందవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తుపానుగా మారడానికి […] The post బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం appeared first on Visalaandhra .
Ayodhya | రామయ్య క్షేత్రంలో.. Ayodhya, మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో
Sirisilla |డబుల్ సముదాయంలో కుంగిన ఫ్లోరింగ్
Sirisilla | డబుల్ సముదాయంలో కుంగిన ఫ్లోరింగ్ విప్, కలెక్టర్ కు తప్పిన
sarees|ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..
sarees| కాటారం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం
ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం
ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు ఢిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పడిపోయిన ఏక్యూఐప్రైవేటు ఆఫీసుల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయించాలని ఆదేశాలుఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 300 పైగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రతిరోజూ 50 […] The post ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం appeared first on Visalaandhra .
పోరాడుతున్న భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ప్రోటీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. నాలుగో రోజు రవీంద్ర జడేజా ఓపెనర్ రికెల్టన్(35)ను పెవిలియన్కు పంపించాడు. అనంతరం మరో ఓపెనర్ మార్క్రమ్(29)ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొంత సమయానికే కెప్టెన్ బవుమా(3) సుందర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. నాలుగో వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తీవ్రస్థాయిలో పోరాడుతున్నారు. ప్రస్తుతం 49 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజ్లో స్టబ్స్(23), జోర్జి(37) ఉన్నారు. సౌతాఫ్రికా ప్రస్తుతం 420 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఆయన ఏ38గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే, గత రెండు రోజులుగా తన కాళ్లకు వాపు వస్తోందని, వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నానని చెవిరెడ్డి జైలు అధికారులకు తెలిపారు. వాస్కులర్ సర్జన్కు […] The post అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు appeared first on Visalaandhra .
High School |కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక
High School | కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక High School |
బీహార్లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రిమండలి కూర్పులో కానీ, మంత్రి పదవుల కేటాయింపులో కానీ జెడి(యు) కన్నా బిజెపి ఆధిపత్యమే స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరువాత రెండోస్థానంలో జెడి(యు) పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని జెడి(యు) సుప్రీం నితీశ్కుమార్ తిరిగి పొందగలిగారు. అయినప్పటికీ తన ఇరవై ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఇప్పుడు హోం శాఖపై తన ఆధిపత్యానికి అవకాశం లేక దూరం కావలసి వచ్చింది. బిజెపికి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన సమ్రాట్ చౌదరి ఇప్పుడు అత్యంత అధికార శక్తియుతమైన హోంశాఖ పగ్గాలు చేపట్టారు. అలాగే బిజెపికి చెందిన మరో ఉపముఖ్యమంత్రి విజయ్కుమార్ సిన్హా రెవెన్యూ, భూసంస్కరణలు, గనులు, భౌగోళిక విభాగాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా పాలనా విభాగాలపై బిజెపి నియంత్రణను మరింత బలోపేతం చేసింది. అంటే నితీశ్ కుమార్ను ఒక విధంగా బలహీనుడిని చేయడమే. మొత్తం 26 మంత్రి పదవుల్లో 14 బిజెపి పట్టులోనే ఉన్నాయి. ఆరోగ్యం, న్యాయం, రోడ్ల నిర్మాణం, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం వంటి కీలకమైన శాఖలు బిజెపి నియంత్రణలో ఉండటం విశేషం. బిజెపి తన మిత్రపక్షం జెడి(యు) సోపానక్రమాన్ని తనకు అనుకూలంగా తారుమారు చేయడంలో అత్యంత సమర్థవంతంగా, చాకచక్యంగా నిర్ణయాత్మకమైన చర్య తీసుకోగలిగింది. 2020 లో బిజెపి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ నితీశ్కుమార్ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను తన వద్దనే ఉంచుకోగలిగారు. ఇదివరకటి అసెంబ్లీలో సామాజిక న్యాయం అనే ముఖ్యమైన సూత్రం ప్రకారం జెడి(యు) కు తన మిత్రపక్షం ఆర్జెడికి చోటు కల్పించడానికి అవకాశం ఉండేది. అయితే ఈసారి నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ సాధించిన అఖండ విజయం బిజెపిని అగ్రస్థానంలో పటిష్టంగా ఉంచగలగడమే కాక, సాధ్యం కాకపోయినా జెడి(యు) ద్వారా ప్రత్యామ్నాయాల అన్వేషణను కష్టతరం చేసింది. నితీశ్కుమార్ అనారోగ్యంతో పోరాటం సాగిస్తున్నారు. అయినా బిజెపికి నితీశ్ తప్పనిసరిగా అనివార్యం అవుతున్నారు. మరోవైపు బిజెపి తన దీర్ఘకాలిక మార్గాన్ని సుస్థిరం చేసే ప్రయత్నంలో ఉంటోంది. సామాజిక వర్గాలకు జెడి(యు) యే తమకు అనుకూల వేదిక అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావడానికి బిజెపి విస్తారమైన లోతైన కులాల సంకీర్ణాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తోంది. లాలూప్రసాద్ యాదవ్కు ఒకనాటి అత్యంత విధేయుడైన రామ్కృపాల్ యాదవ్ను బిజెపి ఇప్పుడు అక్కున చేర్చుకుని యాదవ సామాజిక వర్గానికి కూడా బిజెపిలో చోటు ఉందన్న సంకేతాలను అందించింది. సామాజిక వర్గాలను బుజ్జగించడం, పరిపాలనా యుక్తి, తదితర వ్యూహాలతో బీహార్ రాజకీయాల్లో బిజెపి తనకు తాను కేంద్ర స్థానంగా నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ముఖ్యమంత్రి నితీశ్కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ఆర్థిక సాయం చేయడమే . అందుకే ఎన్డిఎ కూటమి విజయంలో మహిళలే కీలక పాత్రదారులయ్యారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఊరించే పథకాలతో అభివృద్ధి జరగదు. ఇప్పుడు ముందున్న అసలైన సవాలు చక్కని పరిపాలన.ఇదివరకటి తమ పరిపాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం, ఆదరణ ఉన్నందునే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలిగామని బిజెపి వాదించవచ్చు. కానీ బీహార్ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందన్నది వాస్తవం. బీహార్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నితీశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదెంతవరకు సాధ్యమో ఇప్పుడు ఆలోచించవలసి ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్ల జారీలో విపరీత జాప్యం ఇవన్నీ గత కొన్నేళ్లుగా వెంటాడుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసువారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం వరకు ఉంది. దీన్ని బట్టి బీహార్లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో ఊహించాల్సిందే. కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మహిళల విషయానికి వస్తే ఆ సంఖ్య ఇంకా తక్కువ. ఉద్యోగాలు, ఉపాధి కరువై లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం సర్వసాధారణం. అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొని బీహార్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు ప్రగతి పథంలో కొత్త మంత్రి మండలి తీసుకెళ్తుందో ఒక అగ్నిపరీక్ష. దేశ జనాభాలో పదోవంతు జనాభా బీహార్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రపురోగతి సానుకూలంగా యావత్ దేశాన్నే ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు పాలనలో లోపాలు కనిపిస్తున్నా అవన్నీ నిజాయితీగా సరిదిద్ది చక్కని పాలన అందిస్తారని ఓటర్లు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎన్డిఎ కూటమికి పట్టం కట్టారు. కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పాలన వల్లనే ప్రగతి సాధ్యం అనే నినాదం పదేపదే వల్లెస్తోంది. మరి ఈసారి అదెంతవరకు ఆచరణలో నెరవేరుతుందో చూడాలి.
AP | అసెంబ్లీకి విద్యార్థి.. AP, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాజ్యాంగ
collector| రైతులను ఆదుకోవాలి.. collector| అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా రైతులను ఆదుకోవాలని
Narendra Modi : అయోధ్య మందిరంలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు
మరోసారి వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన
ఢిల్లీ పేలుళ్లే తాజా వాయిదాకు కారణమని వెల్లడిఈ ఏడాది నెతన్యాహు టూర్ రద్దు కావడం ఇది మూడోసారివచ్చే ఏడాది కొత్త తేదీని ప్రకటించే అవకాశంఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, తదనంతర భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.వాస్తవానికి, ఈ ఏడాది సెప్టెంబర్ 9న నెతన్యాహు […] The post మరోసారి వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన appeared first on Visalaandhra .
Bigg Boss 9 : బంధాలు తెగిపోయినట్లేనా.. నామినేషన్లు అలా జరిగినట్లే
బిగ్ బాస్ 9వ సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది
భారతదేశంలో సమాఖ్యవాదం ఏమేరకు మనుగడ సాగిస్తుంది. మార్పులేకుండా కొనసాగుతుందా. సహకార స్ఫూర్తి క్రమంగా చనిపోతుందా అన్నదే నేటి ప్రశ్న. సుప్రీంకోర్టు 2023 శర్మ కమిటీ తీర్పుతో మొదలై 2024, 2025లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై ఇచ్చిన తీర్పులలో కేంద్రం అధికారాలు అనంత స్థితిస్థాపకత (ఇన్ఫినిటి ఎలాస్టిసిటీ)- అన్నపదం వాడింది. ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో జస్టిస్ (రిటైర్డ్) బి.ఆర్. మెహతా తీవ్ర పదజాలంతో రాసిన వ్యాసంలో ఆ తీర్పులలో కోర్టు సాంప్రదాయ సిద్ధాంతాలను విడిచి పెట్టి ఆక్రమణ కొత్త ప్రమాణాలకు అనుకూలంగా వ్యవహరించిందన్నారు. ఇది దాదాపు ఏ పాలనా రంగంలోనైనా జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసినట్లే. రాజ్యాంగం రాష్ట్రాలకు స్పష్టంగా కేటాయించిన రంగాలలో కూడా కేంద్రానికి శాశ్వతంగా, తిరుగులేని ఆధిపత్యాన్ని స్పష్టంగా ఆమోదించడం ఇబ్బందికరమైన అంశమే. ఈ న్యాయపరమైన మార్పు ఆందోళన కలిగిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు. దశాబ్దాలుగా సాగుతున్న పరిణామాలకు పరాకాష్ట. గతంలో కాంగ్రెస్ అయినా, నేడు బిజెపి అయినా కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ పార్టీ కూడా నిజమైన ఫెడరలిజం అనుసరిస్తూ, సుఖంగా ఉండలేదు. ప్రతి పార్టీ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ ప్రాథమిక విలువగా కాక, ఇబ్బందికరంగానే భావించాయి. కేంద్రప్రభుత్వాల పెత్తనం చెలాయింపు కొత్తకాదు. రిపబ్లిక్ గా అవతరించిన తొలి దశాబ్దాలనుంచి ఆర్టికల్ 356ను తరచు పక్షపాత ధోరణితో కేంద్రప్రభుత్వం వాడుకుంది. తమను ధిక్కరించిన రాష్ట్రప్రభుత్వాలను కూల్చివేసేందుకు, రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆర్టికల్ 356ను ఆయుధంగా ప్రయోగించింది. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టి రామారావు, కర్ణాటకలో ఎస్ఆర్బొమ్మై సర్కార్లను రాత్రికిరాత్రి తొలగింపులే ఇందుకు ఉదాహరణ. ఎమర్జెన్సీ హయంలో 42వ రాజ్యాంగ సవరణతో మరింత దూకుడుగా వ్యవహరించింది. విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చడంతోపాటు పలు రంగాలపై కేంద్రం ఆధిపత్యం విస్తరించింది. ముఖ్యమంత్రులు నిజానికి ప్రణాళికా సంఘం ఫీల్డ్ ఆఫీసర్ల స్థాయికి దిగజారారు. కేంద్రం రూపొందించిన కేంద్రం స్పాన్సర్ చేసిన పథకాలనే అమలు చేయాల్సి వచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారమే నిధులు సమకూరుతాయి. 1990వ దశకం, 2000 దశకంలో సంకీర్ణ ప్రభుత్వాల పెరుగుదలతో ఫెడరలిజం పునరుజ్జీవనం జరుగుతుందన్న భ్రమ కల్పించింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం, జ్యోతిబసు, లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎన్టి రామారావు, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, నవీన్పట్నాయక్ వంటి నాయకుల రాకతో కేంద్రంతో బేరసారాలు ఆడే శక్తివచ్చింది. కేంద్ర -రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి సర్కారియా, పుంచి కమిషన్లు చక్కటి సిఫార్సులు చేశాయి. అయినా ఆ కాలంలోనూ ఆర్థిక సమాఖ్యవాదం క్షీణించింది. సర్వీస్ టాక్స్, తర్వాత జిఎస్టి, రాష్ట్రాల స్వతంత్ర ఆదాయ అధికారాలను క్రమంగా తగ్గించాయి. కేంద్రం అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా జిఎస్టి కౌన్సిల్లో ఓటింగ్ వ్యవస్థతో కేంద్రానికి పూర్తి ఆధిపత్యం వచ్చేసింది. 2014లో కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రీకరణ వేగం పుంజుకుంది. ఆర్టికల్ 360 రద్దు, జమ్మూకశ్మీర్ను, దాని అసెంబ్లీ అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలుగా చేయడం రాజ్యాంగాన్ని తూట్ల పొడవడమే. ఎన్నికైన ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నియంత్రణలోకి ఉంచే ఢిల్లీ ఎన్సిటి సవరణ చట్టం పెడరల్ విధానం సూచించిన సరిహద్దులను ఏకపక్షంగా చెరిపి, తిరగరాయడానికి కేంద్రం కొత్త సంసిద్ధతను సూచిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల విషయంలో కేంద్రం చొరబాట్లు పెరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ మార్కెట్లో దూసుకొచ్చింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక కోడ్లు కార్మిక నియంత్రణలో పెద్దఎత్తున పనిచేస్తున్నాయి. నీట్ ప్రవేశపెట్టడం, వివిధ విద్యా సంస్కరణలు రాష్ట్రాల పరిధిని దాటవేశాయి. కొవిడ్19 మేనేజిమెంట్ సాకుతో ప్రజారోగ్యంలో కేంద్రం ఆధిపత్యం మరింత పెరిగింది. ప్రతిపాదిత విద్యుత్(సవరణ)బిల్లు, ముసాయిదా ప్రసారబిల్లుతో కేంద్రం చొరబాటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఆర్థిక నియంత్రణ మరో శక్తివంతమైన కేంద్రీకరణ సాధనంగా మారింది. కేంద్రం అందించే పథకాలకు నిధులు ఇప్పుడు 8, 9,- 10 లేదా 100 నిష్పత్తులలో పనిచేస్తున్నాయి. ఈ దెబ్బతో కేంద్రం రాష్ట్రాలను కేవలం పథకాలను అమలు చేసే ఏజెన్సీల స్థాయికి దిగజార్చింది. జిఎస్టిలో వాటా చెల్లింపులు పదేపదే ఆలస్యం కావడంతో రాష్ట్రాలు కనీసం జీతాలు చెల్లింపు, ఇతర బాధ్యతల నిర్వహణకు కూడా భారీగా రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆఫ్- బడ్జెట్ రుణాలు మాత్రం ఆర్థికలోటు లెక్కలనుంచి మినహాయింపబడడం విశేషం. ఈ విషయం లో రాష్ట్రాలపై పర్యవేక్షణ పెరిగింది. అప్పడప్పుడు జరిమానాలు కూడా తప్పడం లేదు. రాష్ట్రాలలో గవర్నర్లను రాజకీయంగా ఆయుధాలుగా మార్చడం పెడరలిజానికి మరో పెద్ద విఘాతం. అసెంబ్లీలు ఆమోదించిన, కేబినెట్ సిఫార్సు చేసిన బిల్లులను గవర్నర్లు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి నిర్ణయించకుండా పెండింగ్లో పెట్టడం నిత్యకృత్యంగా మారింది. తమిళనాడులో దాదాపు పది బిల్లులను గవర్నర్ మూడేళ్లపాటు ఆమోదించకుండా తొక్కిపెట్టారు.సుప్రీంకోర్టు బలవంతం చేస్తూ నిర్ణయం తీసుకునే వరకూ ఈ ఉదంతం సాగింది. పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలలోనూ గవర్నర్లు వ్యవహరించిన తీరువల్ల దీర్ఘకాలిక ప్రతిష్టంభనలు తప్పలేదు. గవర్నర్లు తమ ఇష్టానుసారం బిల్లులను రాష్ట్రపతికి రిజర్వు చేసుకోవచ్చునని ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు బొమ్మై కేసులో తీర్పు సందర్భంగా మూసివేసిన అధికార దుర్వినియోగం తలుపులు తిరిగి తెరిచినట్లు కనిపిస్తోంది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు చెప్పనవసరం లేదు. కేంద్రంతో ఘర్షణకు దిగే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులపై తలచినంతనే.. అన్నట్లు దాడులు చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్లు, మనీష్ సిసోడియా, సత్యేంత్ర జైన్ వంటి వారిని సుదీర్ఘకాలం పాటు జైలులో ఉంచడంతో.. అసమ్మతిని సహించరని, దానిని నేరంగా పరిగణించే వాతావరణం ఏర్పడిందని తేటతెల్లమైంది. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్రం ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారులను రీకాల్ చేయడానికి వీలు కల్పించే అఖిల భారత సర్వీస్ నిబంధనల మార్పు ప్రతిపాదన పాలనా యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వం పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఒకప్పుడు ఫెడరల్ వ్యవస్థకు కాపలాదారుగా ఉన్న న్యాయవ్యవస్థ ఇప్పుడు ఈ దిగజారిన పరిస్థితులను అరికట్టేందుకు ఇష్టపడడం లేదు. ఆ విషయంలో న్యాయవ్యవస్థ సామర్థ్యం దశాబ్దాలుగా తగ్గింది. ఒకప్పుడు ఎస్ఆర్ బొమ్మై, రామేశ్వర్ ప్రసాద్ వంటి కేసుల్లో బలమైన తీర్పులు, 2018 ఎన్సిటీ ఢిల్లీ తీర్పు కేంద్రం అధికారాలను మితిమీరి వినియోగానికి వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచాలు అందించాయి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు స్వరం మారిపోయింది. ఆర్టికల్ 370పై జరిగిన విచారణలు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణను సమర్థించే మొగ్గును సూచిస్తున్నాయి. ఢిల్లీ సర్వీసుల తీర్పు, తమిళనాడు గవర్నర్ కేసులోని పరిశీలనలు, బొమ్మై తీర్పునకు ముందు శకాన్ని గుర్తుచేసే విసృ్తత కేంద్ర ఆధిపత్య సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప జేస్తున్నాయి. అనంతమైన స్థితిస్థాపకత అనే భావన ఒక హెచ్చరికగా కాక, రాజ్యాంగ వాస్తవికతగా మారే ప్రమాదం ఉంది. భారతదేశపు ఫెడరల్ వ్యవస్థ ఒక రాజీ. ఓ గిఫ్ట్ కాదు. నెహ్రూ, పటేల్ వంటి కేంద్రీకరణ వాదులు, మద్రాస్, బెంగాల్, ఇతర రాచరిక రాష్ట్రాలనుంచి బలమైన ప్రాంతాల స్వరాల మధ్య జరిగిన చర్చలలో ఆవిర్భవించి వ్యవస్థ. రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే, కేంద్రానికి రాష్టాలు అవసరమైనప్పుడు లేదా రాష్ట్రాలపై ఆధారపడాల్సి న పరిస్థితి తలెత్తినప్పుడే సమాఖ్యపరమైన సమతుల్యతలు పునరుద్ధరించబడతాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఫెడరల్ వ్యవస్థను ఎవరు కాపాడతారు? ఏ జాతీయ పార్టీ కూడా నిజంగా ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి కొనసాగాలని కోరుకోవడం లేదని రికార్డులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం పెత్తనం కేంద్రీకృతమైంది. ప్రస్తుతం బిజెపి మరింత ఆత్యాధునికంగా రాజకీయ క్రమశిక్షణతో పెత్తనాన్ని కేంద్రీకృతం చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడే ఫెడరలిజాన్ని సమర్థిస్తాయి. ఇక పౌర సమాజం మీడియా సమాఖ్యవాదాన్ని సంక్షేమ పంపిణీ, పోలీసింగ్, స్కూళ్లలో పాఠ్యాంశాలు, మార్కెట్ వ్యవస్థలు, సాంసృ్కతిక హక్కుగా కాక, రాజ్యాంగ ఆలోచనగా పరిగణిస్తాయి. సమాఖ్య విధానం మనుగడ సాధించాలంటే, సాధారణ పౌరులే శ్రద్ధ వహించాలి. తమిళులు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి ఎంత విలువ ఇస్తారో, ఉత్తరప్రదేశ్ లోని ఓటర్లు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి అంతే విలువ ఇవ్వాలి. కేంద్రం రూపొందించిన వ్యవసాయ విధానం తమ అవసరాలను ప్రతిబింబించకపోవచ్చునని బీహార్ రైతులు గ్రహించాలి. అసోం వాసులు తమ సంసృ్కతి, భూమి, భాష, విద్యపై స్థానిక నియంత్రణ కేంద్రం ఇస్తున్న తాయిలం కాదనీ, రాజ్యాంగబద్ధమైన హక్కు అని అర్థం చేసుకోవాలి. భారతదేశం నేడు ఒక కీలకమైన దశలో ఉంది. మనం కో ఆపరేటివ్ ఫెడరలిజం నుంచి సమ్మతితో కూడిన సమాఖ్యవాదానికి మారాం. మనం కేంద్రం లాగుతున్న వైపు కదులుతున్నాం. న్యాయవ్యవస్థ అనంత స్థితి స్థాపకత వంటి సిద్ధాంతంతో కేంద్రానికి తోడ్పడుతోంది. అందరికీ ఆమోదయోగ్యమైన ఫెడరల్ వ్యవస్థ పరిఢవిల్లాలని రాజ్యాంగ సభ కోరింది. అదే సమయంలో సభ వ్యక్తం చేసిన ఆందోళననే జస్టిస్ మెహతా హెచ్చరిక ప్రతిధ్వనిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ సంపూర్ణ నియంత్రణనే కోరుకుంటున్నప్పుడు.. పిల్లి మెడ లో గంటకట్టేది ఎవరు? భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ వ్యవస్థపై సమాధానం బాధాకరంగానే కన్పిస్తోంది. కేంద్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలంటే, దానిని సుప్రీంకోర్టో, రాష్ట్ర అసెంబ్లీలు మాత్రమే కాదు 140 కోట్ల మంది ప్రజల రాజకీయ చైతన్యం తోడవ్వాలి. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
JC Pawan Reddy’s Next Political Stop? YSRCP Seems More Interested Than Ever
Andhra Pradesh politics has entered a new season of surprises. Parties are already polishing their strategies for the 2029 elections, and every influential leader suddenly looks like a prized catch. Interestingly, YSRCP, which was blindsided by its shocking defeat in 2024, now appears to be operating with a little more caution and a lot more […] The post JC Pawan Reddy’s Next Political Stop? YSRCP Seems More Interested Than Ever appeared first on Telugu360 .
భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
టి-20 ప్రపంచకప్ షెడ్యూల్.. ఎప్పుడు విడుదలంటే..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి-20 ప్రపంచకప్ షెడ్యూల్కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి-20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఈ టోర్నమెంట్కి సంబంధించిన షెడ్యూల్ మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు విడుదల కానుంది. ఈసారి ఈ మెగా టోర్నమెంట్లో 20 జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యుఎఇ, ఒమన్, వెస్టిండీస్, యుఎస్ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ఈసారి భారత్ మరియు శ్రీలంక వేదికగా జరగుతుంది. భారత్లో ఐదు వేదికల్లో(అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలో మూడు వేదిక జరుగనున్నట్లు సమాచారం. ఇక టోర్నీ ప్రారంభ, ముగింపు వేడుకలు అహ్మదాబాద్లో నిర్వహిస్తారని టాక్. అయితే ఒకవేళ పాక్ ఫైనల్స్కి చేరితే ఆ మ్యాచ్ శ్రీలంకకు షిఫ్ట్ అవుతుంది. టీం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర (89) హీ మ్యాన్గా, యాక్షన్ కింగ్గా, రొమాంటిక్ హీరోగా త నకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ రో జుల నుంచీ 70 ఎంఎం రోజుల వరకు ఈ లెజెండరీ నటుడు తనదైన నటనతో ప్రే క్షకులను ఎంతగానో అలరించారు. 300 కు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర ఎవర్గ్రీన్ బ్లాక్బస్టర్ మూ వీ షోలే, అన్పడ్, బందినీ, అనుపమ, ఆయా సావన్ జూమ్ కే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దే శ్, డ్రీమ్ గర్ల్ తదితర హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ధర్మేంద్రకు భా ర్యలు ప్రకాశ్ కౌర్, హేమామాలిని, తనయులు స న్నీ డియోల్, బాబీ డియోల్, కూతుళ్ళు ఇషా, అహనా ఉన్నారు. తిరుగులేని స్టార్డమ్... బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని లుథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జ న్మించారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. ఆయన తండ్రి ఓ స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేసేవారు. ధర్మేంద్ర కూడా తండ్రి వద్ద చదువుకొనే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. మెట్రిక్యూలేషన్ పూర్తయ్యాక కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగా రు. 1954లో ప్రకాశ్ కౌర్తో ధర్మేంద్ర వివాహం జరిగింది. అయితే సినిమాలపై మక్కువతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆయన ముంబై వెళ్లారు. అదే సమయంలో ’ఫిలిమ్ ఫేర్’ మ్యాగజైన్ న్యూ టాలెంట్ సర్చ్ నిర్వహించగా అందులో ధర్మేంద్ర విజేతగా నిలిచారు. 1960లో ’దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో ఈ లెజెండరీ నటుడు సినీ రంగ ప్రవే శం చేశారు. షోలా ఔర్ షబ్నమ్ (1961), అన్ పడ్ (1962), బందిని (1963) చిత్రాలు ధర్మేంద్రకు నటునిగా మంచి గుర్తింపును తీసుకువచ్చి పెట్టాయి. అనంతరం రాజేంద్ర కుమార్ హీరోగా నటించిన ’ఆయీ మిలన్ కీ బేలా’లో విలన్గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆతర్వాత 1966లో హిట్ మూవీ ’ఫూల్ ఔ ర్ పత్తర్’లో కథానాయకుడిగా నటించి స్టార్ హీరోగా రాణించారు. ఈ సినిమా ఆధారంగా తెలుగులో ఎన్టీఆ ర్ హీరోగా విజయవంతమైన ’నిండుమనసులు’ (1967) చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇక షికార్, ఇజ్జత్, ఆంఖే, ఆద్మీ ఔర్ ఇన్సాన్, సత్యకామ్, మేరా గావ్ మేరా దేశ్, సీతా ఔర్ గీతా, దోస్త్, యాదోంకీ బారాత్, జుగ్ను, షోలే, మా, చరస్ వంటి బ్లాక్బస్టర్ మూ వీస్లో ధర్మేంద్ర నటించి తిరుగులేని స్టార్డమ్ను సం పాదించారు. ఆల్టైమ్ బ్లాక్బస్టర్ మూవీ ‘షోలే’ చి త్రంలో అమితాబ్ బచ్చన్తో కలి సి ధర్మేంద్ర నటించా రు. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం ఇండి యా సినిమా గతినే మార్చేసింది. తెలుగు వారు నిర్మించిన జానీ దోస్త్, వీరూ దాదా చిత్రాల్లో నటించారు ధ ర్మేంద్ర. తెలు గు దర్శకుడు తాతినేని ప్రకాశరావు రూ పొందించిన ’ఇజ్జత్’ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేసి అలరించారు. హేమామాలినీతో రెండవ వివాహం... 1970లలో అందాల తార హేమామాలినీతో కలిసి ధ ర్మేంద్ర పలు హిట్ చిత్రాలలో నటించారు. చివరికి తన కు హిట్ పెయిర్గా సాగిన హే మామాలినిని ఆయన రెండో వి వాహం చేసుకున్నారు. ఆ సమయంలో భా ర్యాబిడ్డలు ఉండి మరో పెళ్ళి చేసుకోవడం వివాదానికి దారి తీ సింది. అయితే ముస్లిమ్ సంప్రదాయంలో పె ళ్ళి చేసుకోవడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు ధర్మేం ద్ర, హేమామాలిని జోడీ. వీరికి ఇషా, అహనా సంతానం. ఎన్నో అవార్డులు అందుకొని... చిత్ర పరిశ్రమకు ధ ర్మేంద్ర చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభు త్వం 2012లో పద్మభూషణ్ అవార్డుతో ఘ నంగా సత్కరించిం ది. 1997లో ఫిల్మ్ఫేర్ లై ఫ్టైమ్ అచీవ్మెంట్ అ వార్డును అందుకున్నారు. ఫాల్కే రత్న అవార్డును సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. ఇక బిజెపిలో చేరి 2004లో రాజస్థాన్లోని బికనేర్ నుంచి లోక్సభ ఎం పీగా గెలుపొందారు. ధర్మేంద్ర 1983లో విజేత ఫి ల్మ్ ఫేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. తన పెద్ద కు మారుడు సన్నీ డియోల్ హీరోగా ఈ నిర్మాణ సం స్థలో ‘బేతాబ్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఘ నవిజయం సాధించి భారీ వసూళ్లను సాధించింది. 1990 లో నిర్మించిన ‘ఘాయల్’ సినిమా ఏకంగా ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. రెండ వ కుమారుడు బాబీ డియోల్ను సొంత ప్రొడక్షన్ సం స్థలో హీరోగా పరిచయం చేస్తూ 1995లో ‘బర్సాత్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఘన విజయం సా ధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కురిపించింది. సినీ ప్రముఖుల సంతాపం... ధర్మేంద్ర మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. “ధర్మేంద్ర ఒక దిగ్గజ నటుడు మాత్ర మే కాదు. సహృదయం కలిగిన వ్యక్తి. ఆయనను కలిసి న ప్రతిసారీ ఎంతో ఆప్యాయతతో పలకరించేవారు. నా మిత్రులు సన్నీ డియోల్, బాబీ డియోల్ సహా ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా”అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ మా ట్లాడుతూ “ప్రముఖ నటులు ధర్మేంద్ర కన్నుమూశార ని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీ చిత్ర పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా ధర్మేంద్ర సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అందుకే ఆ యన్ని యాక్షన్ కింగ్, హీమ్యాన్ అని అభిమానంగా పిలుచుకునేవారు”అని పేర్కొన్నారు.
Development|సమగ్ర అభివృద్ధి దిశగా విజయవాడ..
అభివృద్ధికి రూ. 2 వేల కోట్ల నిధులుతయారవుతున్న డీపీఆర్డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాంవిజయవాడ పార్లమెంటు
From the past few weeks, there is a mad rush of releases on several OTT platforms for the Indian audience. From the originals to the regional movies, there are a lot of options. Ravi Teja’s Mass Jathara and Sasivadane are the Telugu films that will be streaming this weekend. Karimulla Biryani Point from ETV Win […] The post OTT Picks for this Weekend appeared first on Telugu360 .
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది కొత్త డేటాను సృష్టించగల అత్యాధునికి పరిజ్ఞానం. అంతర్జాతీయ స్థాయిలో ఎఐ టెక్నాలజీకి గణనీయమైన ప్రాచుర్యం కొనసాగుతున్న తరుణంలో భారతదేశం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని వినియోగించుకోవడంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రతికూల ప్రభావాలను నివారించుకుంటూ... ఎఐ ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి సిద్ధపడాలి. రాకెట్ కంటే పదిరెట్ల వేగంతో పుంజుకుంటున్న ఆర్ట్టిఫిషియల్ టెక్నాలజీలో మంచి చెడులను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటురంగ సంస్థల నిర్వహణ, ఉద్యోగుల భద్రతపై నిశితంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భారత్ తన ఆధిపత్యాన్ని ఒక్కో రంగంలో చేజిక్కించుకుంటూ.. శతృదేశాల నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. అదే సమయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలోనూ ఆచితూచి అడుగులు వేయకపోతే.. తప్పులో కాలేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం. ఆవస్యకత ఎంతో ఉంది. అయితే.. ఈ ఎఐ టెక్నాలజీ మంచికి దారి తీస్తుందా? చెడును దరికి చేరుస్తుందా? అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది! ఈ రోజు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏఐ వాడకంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, వినియోగదారుల అభ్యర్థనలకు ప్రతిస్పందనగా టెక్స్, ఇమేజ్లు, కోడ్లను రూపొందించడానికి ఈ టెక్నాలజీని సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే రోజురోజుకూ విస్తృతమైన వాడకం పెరగడంతో పాటు ఎఐ సంస్థల ఏర్పాటుకు, టెన్నాలజీని దత్తత తీసుకోవడానికి ప్రపంచ దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఆయా దేశాల సామర్థ్యాలను టెన్నాలజీతో అలంకరిస్తున్నాయి.ఈ విషయం కాస్తంత విస్మయానికి, ఆందోళనకు దారితీసింది. ఓపెన్ ఎఐ (ఓపెన్ ఎఐ) ఛాట్ జిపిటి (ChatGPT), చాట్సాట్ మేధస్సును ఇప్పుడున్న జనరేషన్ ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎఐ టెన్నాలజీ అనేది క్రమేణా అతిపెద్ద ఉత్పాదక సామర్థ్యం కలిగిన టెక్నాలజీ సంస్థగా అడుగులు వేస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ టెక్నాలజీ డేటా సెట్లపై శిక్షణ పొందిన న్యూరల్ నెటవర్కర్ల మద్దతుతో, తగినంత కంప్యూటింగ్ పవర్తో కూడిన ఎఐ మోడల్స్, కొత్త యాంటీబయాటిక్, మిశ్రమాలను కనుగొనడంలో ముందుంది. అలాగే ప్రస్తుత అత్యాధునికకాలంలో అన్నితరాల వారికి పసందైన వినోదాన్ని అందించడం కోసం వినూత్న రీతిలో, వినోదంతోపాటు సాంస్కృతిక కార్యకలాపాలను రూపొందించి ప్రశంసలు అందుకుంటోంది. అయితే చాలా సామాన్యమైన టాస్క్ల కోసం మంచి చేయడానికి ఉపయోగించారు. కానీ డేటాను తప్పుగా మార్చే సామర్థ్యంతో ఇది చాలా కంపెనీల వారి దృష్టిని ఆకర్షించింది. వాస్తవికతను విశ్వసనీయంగా ప్రతిబింబించే డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడంలో కొన్ని సందర్భాలలో సమాజంలోని చెడును విస్తరింపజేయడానికి కొంతమంది వినియోగించడం బాధాకరం. ఎఐతో రూపొందించే కథనాలు, స్కిట్స్, మినీ వీడియో క్లిప్లింగ్స్తో సమాజంపై దుష్ప్రభావం పెడేలా ఉంటున్నాయన్న విమర్శలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపించడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో చెడు -విశ్వాసలపై ప్రభావం చూపించడంతో ఎఐ టెన్నాలజీ ఆధారంగా రూపొందించిన డేటా మధ్య ప్రపంచం విశ్వసనీయతకు దూరంగా ఉంటుందన్న తేడాను గుర్తించగలిగింది. దీంతో ఈ టెక్నాలజీపై ఉన్న అభిప్రాయాలు రోజురోజుకూ రూపుమార్చుకుంటున్నాయి. ఇతర పరిణామాలు ఎఐ టెక్నాలజీ రూపకర్తల సమూహంలో హెచ్చరికల గంటలు మారుమ్రోగుతున్నాయి. దీంతో ఎఐ నుండి అంతరించిపోయే ప్రమాదాన్ని తగ్గించడం అనేది మహమ్మారి అణుయుద్ధం వంటిదనే సంకేతాలను ప్రముఖులు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇతర సామాజిక- స్థాయి ప్రమాదాలతో పాటు ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని, ఎఐని ఉపయోగించే వారు తగిన క్రమశిక్షణతో లేకుంటే అదే సమాజంపై తీవ్ర పరిణామాలను తీసుకురావడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కమ్యూనిక్యూలలో పేర్కొన మరికొన్ని నిర్దిష్టమైన ఆందోళనలను కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాలి. అయితే ఎఐ మోడల్స్ అంతర్గత పని తీరు అస్పష్టత, కాపీరైట్చేసిన డేటాను ఉపయోగించడం, మానవ గౌరవం, గోప్యతతోపాటు తప్పుడు సమాచారంనుండి రక్షణ కల్పించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉంది. నేడు అభివృద్ధి చేనసిన టెక్నాలజీతో పాటు, వివిధ సంస్థలు ఉపయోగిస్తున్న మోడళ్లు అనుసరించడం తప్పనిసరి కాదని వివరిస్తున్నాయి. ఎందుకంటే వాటిలో ఎదురయ్యే ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి ఎటువంటి మార్గం లేదు కాబట్టి. ఎఐ మోడళ్లను పూర్తిగా అమలు చేయడానికి అవసరమైన వనరుల వినియోగదారులు కేవలం ఎలక్ట్రానిక్స్ విభాగంలోని వారే అందుబాటులో ఉన్న వాటితో సమస్యలను, ఇబ్బందులను సరిచేయడానికి వీలుంటుంది. అలాగే. పరిష్కారానికి వీలుగా ఉన్నప్పుడు కూడా, ప్రమాదకరమైన సంస్థలపై బ్రేకులు వేయడానికి ప్రజాస్వామ్య సంస్థల కు తలుపులు తెరిచి ఉంచే కనీసం రోలింగ్ విధానాలు ఈ ఎఐ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ సమయంలో, భారత ప్రభుత్వం ముందుగానే ఓపెన్ సోర్స్ ఎఐ రిస్క్ ప్రొఫైల్స్ ప్రారంభించి, ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిర్వహించాలి. అధిక- రిస్క్ ఉన్న ఎఐ మోడల్స్ పరీక్షించడానికి శాండ్బాకస్డ్ రిసెర్చి అండ్ డెవలప్మెంట్ (ఆర్ ఆండ్ డి) పరిసరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలతో కూడిన సంస్థలు మన దేశంలో వినియోగించే టెక్నాలజీని వినియోగించేందుకు తగిన ఎఐ అభివృద్ధిని ఆచితూచి పరిశీలించిన తరువాతే ప్రోత్సహించాలి. - వివి వెంకటేశ్వరరావు 63008 66637
BRS | నిరసన.. BRS, హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీని
Murder Case : భార్య లిద్దరూ కూడబలుక్కుని .. భర్తను హత్య చేసిందిలా?
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యలు భర్తను కలిసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది
Peddapalli | ఆత్మహత్య.? Peddapalli , పెద్దపల్లి, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ
జోష్ రవిని పరామర్శించిన పూరి జగన్నాధ్ తనయుడు.#TeluguPost #telugu #post #news
ఆరేళ్ల క్రితం కేంద్రంలో గృహ వ్యవహారాల మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని ఆయన నోట దృఢంగా వినిపిస్తూ వస్తోంది. ఉట్టి మాటగా కాకుండా దానికి తగిన కార్యాచరణను కూడా ఆయన రచిస్తూ వచ్చారు. ప్రభావిత రాష్ట్రాల పోలీసులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఫలితాలను డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల లెక్కలు, వాటి పెరుగుదల తప్ప మరో మాట ఆయన వినదలుచుకోలేదు. లొంగిపోవాలని ఏడాది నుండి పోలీసులు మైకులు పెట్టి చెప్పినా మావోయిస్టులు మాత్రం యథావిధిగా పోలీసులతో తలపడడానికే సిద్ధపడ్డారు. పెరిగిన బలగాలను ఎదుర్కొనే క్రమంలో చాలామంది పోలీసు తూటాలకు బలి అయ్యారు. చివరకు వారు దిగివచ్చి శాంతిచర్చలు జరపాలని కోరినా అలాంటి ప్రసక్తే లేదని ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. మే నెలలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో యుద్ధం ఏకపక్షమైంది. ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు పార్టీపై భారీ ప్రభావాన్ని చూపింది. ప్రాణభయంతో లొంగిపోతున్న వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టకుండా సామాజిక జీవనం గడిపేందుకు వీలు కల్పిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. పట్టుబడినవారిని జైలుకు పంపుతున్నందువల్ల లొంగిపోవడమే ఉత్తమ మార్గమమైంది. అయితే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ క్షమాభిక్ష రూల్ మడావి హిడ్మాకి మాత్రం దక్కలేదు. మావోయిస్టుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ముద్ర పడిన హిడ్మాను ప్రాణాలతో వదిలేందుకు ప్రభుత్వం, పోలీసులు సిద్ధంగా లేరనే విషయం ఆయన ఎన్కౌంటర్ తర్వాత అర్థమవుతోంది. హిడ్మా విషయంలో మాత్రం కంటికి కన్ను అనే సిద్ధాంతాన్నే పోలీసులు అనుసరించారు. సర్కారు దృష్టిలో హిడ్మా మావోయిస్టు అనే పదానికే పర్యాయంగా కనబడ్డాడు. ఎందరో పోలీసు జవాన్ల మరణాల ధ్వంస రచనకు మూలమని భావిస్తున్న హిడ్మాపై భద్రతా దళాల కోపం సహజంగానే తారస్థాయిలో ఉంటుంది. హిడ్మాలో కొందరు వీరుణ్ణి చూస్తే ప్రభుత్వం మాత్రం ఆయన్ని ఓ క్రూరుడిగా భావించింది. అందుకే ఆయన్ని ఓ సెపరేట్ టార్గెట్గా పరిగణించారు. ఎంతకూ ఆచూకీ దొరకని హిడ్మాను దారిలోకి తెచ్చుకోవడానికి ఆయన తల్లిని వాడుకున్నారు. తనను వదిలి పెట్టరు అని తెలిసి మొండిగా అడవిలో తప్పించుకుంటున్న హిడ్మా మనసు మెత్తపడేలా ఆయన తల్లితో కొడుకు గురించి మాట్లాడించారు. మనమంతా ఒక్కటే అనే భావన కలిగేలా చత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ వారి గ్రామానికి వెళ్లి హిడ్మా తల్లితో కలిసి పక్కన కూచొని భోజనం చేశాడు. దగ్గరి బంధువులా చేతులు కలిపి, దండం పెట్టి నమ్మకాన్ని పెంచాడు. ఈ సంఘటన వల్ల తల్లితో ఊర్లో అందరితో కల్సి బతకాలనే ఆశ హిడ్మా మనసులో కలగవచ్చు. హిడ్మా లొంగిపోవాలనుకొని అనుకున్నాక దానికి సరియైన మార్గం కోసం ప్రయత్నించినట్లు కథనాలు ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలోనే తెలంగాణలో పోలీసుల ముందుకు రావాలనుకున్నాడు కానీ ప్రభుత్వం సహకరించలేదని ఒక వాదన ఉంది. అయితే ఆ సంప్రదింపుల మూలంగా మధ్యవర్తి ద్వారా హిడ్మా దళం కదలికలు కొందరు అధికారుల దాకా చేరాయి. కేసుల ఎత్తివేత, పునరావాసానికి ఎపిలోని కూటమి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చేలా చేశారు. ఆ విషయం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు సమాచారం వెళ్ళింది. బతుకుమీద తీపి హిడ్మాను దుర్బలుణ్ణి చేసింది. లొంగుబాటు అవకాశాన్ని పూర్తిగా నమ్మి వేరే దళంలో ఉన్న తన భార్య రాజేను కూడా రప్పించుకొని అందరూ కలిసి మారేడుమిల్లి చేరుకున్నారు. పొంచి ఉన్న పోలీసులు దాడి చేసి అందరిని ఎన్కౌంటర్ చేశారని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే విషయాన్ని ఎవరు వివరించడం లేదు. తనకు ఎదురైన పోలీసులపై హిడ్మా దళం ఆయుధాలతో తలపడినట్లు ఆధారాలేవీ లేవు. లొంగిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నవాడు యుద్ధానికి తలపడే అవకాశమే లేదు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. చికిత్స కోసం విజయవాడలోని హాస్పిటల్కు వచ్చిన ఆయన్ని పట్టుకెళ్లి కాల్చి చంపారని పార్టీ ప్రకటించింది. ఇప్పుడు పార్టీ పూర్తిగా బలహీనపడింది. లొంగుబాట్లు జరుగుతున్నా ఎన్కౌంటర్లు ఆగడం లేదు. ఎవరికి ప్రాణభిక్ష పెట్టాలి, ఎవరిని మట్టుపెట్టాలి అనే నిర్ణయాధికారం పూర్తిగా పోలీసుల చేతుల్లోకిపోయింది. కొందరు నాయక స్థాయి వ్యక్తులు పోలీసుల అధీనంలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. వారి లొంగుబాటు ప్రక్రియను ఎప్పుడు, ఎలా చేపట్టాలో పోలీసులే నిర్ణయిస్తారని అంటున్నారు. లొంగుబాటుకు సిద్ధపడ్డవాళ్లను కాల్చేస్తే ప్రభుత్వం మాటపై విశ్వాసం పోతుంది. మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు పాల్పడుతున్న ఘటనలేవీ వార్తల్లోకి రాలేదు. ఎన్కౌంటర్లలో పోలీసు జవాన్లు గాయపడిన సందర్భాలు కూడా లేవు. మావోయిస్టులపై పైచేయి సాధించిన పోలీసులు ఈ కీలక సమయంలో కాల్పులను పూర్తిగా ఆపివేయాలి. అడవి బాట వీడాలనుకున్నవారికి ప్రాణభిక్షయే ప్రభుత్వ ధర్మం. - బి.నర్సన్, 9440128169
BRS : కల్వకుంట్ల కవితపై నిరంజన్ రెడ్డి ఫైర్.. లిక్కర్ రాణి అంటూ...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి, సీనియర్ నేత ఎస్. నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్: హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తన నివాస భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీచైతన్య పాఠశాలలో బాలిక చదువుకుంటుంది. తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించారని సమాచారం ఇచ్చారు. మృతురాలు శ్రీవైష్ణవి (15) గా పోలీసులు గుర్తించారు. నివాస భవనం పై నుంచి దూకి
పాతబస్తీ శాలిబండలో భయానక అగ్నిప్రమాదం#FireAccident #Hyderabad #Shalibanda #FireService #viralvideo
Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్..రెండు అల్పపీడనాలు రెడీ
ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని తెలిపింది.
Telangana : పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయింది
పోలీస్ వాహనంపై కూర్చుని రీల్స్#TeluguPost #telugu #post #news
NTR | టైటిల్ మారబోతుందా..? NTR, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Nara Lokesh : వచ్చే నెలలో అమెరికాకు లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళుతున్నారు
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Thaman back to his Testing Time
Top music composer Thaman is habitual of staying in news for wrong reasons. He was trolled badly for his work several times and he admitted the same during media interactions. The top music composer is working without breaks and he has two prestigious films lined up for release: NBK’s Akhanda 2 and Prabhas’ Raja Saab. […] The post Thaman back to his Testing Time appeared first on Telugu360 .
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయం
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
Karate | బంగారు పతకం.. Karate, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర
Tirumala : తిరుమలకు నేడు వచ్చే భక్తులు ఎన్ని గంటల వేచి ఉండాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు
శాలిబండలో .. గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద భారీగా అగ్ని ప్రమాదం
హైదరాబాద్: శాలిబండలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణంలోకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పలువాహనాలు దగ్ధమయ్యాయని లక్ష్మీ వస్త్రాలు యజమానులు ఆవేదన చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.
BRS | గంగపుత్రుల కోసం.. BRS, బాల్కొండ, ఆంధ్రప్రభ : కుల వృత్తి
Ys Jagan :నేటి నుంచి మూడు రోజులు కడపలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు
Telangana : నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ
నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ జరగనుంది.
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
An Emotional Tribute for Dharmendra
At the age of 89, Bollywood legendary actor Dharmendra breathed his last and his last rites were held in Mumbai yesterday. Most of the top Bollywood celebrities have rushed to offer their last condolences and goodbye for the legendary actor. Condolence messages poured in from all the corners. All the celebrities, actors who are associated […] The post An Emotional Tribute for Dharmendra appeared first on Telugu360 .
Hyderabad : కోకాపేట్ లో భూములను కొనలేమా?
హైదరాబాద్ లోని కోకాపేటలో రికార్డు ధరలు ప్లాట్లు పలికాయి.
Nara Lokesh Calls for Gender Equality and Moral Education to Shape a Progressive Society
Andhra Pradesh HRD and IT Minister Nara Lokesh has reiterated the need for a major societal shift towards gender equality and value-based education. Speaking at a state-level seminar on Moral Values at Tummalapalli Kalakshetram in Vijayawada, Lokesh said that meaningful change begins at home and extends into classrooms, culture, and public behaviour. “Respect Starts at […] The post Nara Lokesh Calls for Gender Equality and Moral Education to Shape a Progressive Society appeared first on Telugu360 .
Congress |మహిళల సంక్షేమం కోసం..
Congress | మహిళల సంక్షేమం కోసం.. కామారెడ్డి జిల్లాలో10.92 కోట్ల పంపిణీ..రాష్ట్ర ప్రభుత్వ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బో ర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో కి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బా బు.పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఈ సినిమా 2002 సమయంలో జరుగుతుంది. అప్పు డు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టడం జరిగింది. - -సినిమాలోని సూర్య పాత్రలో ఉపేంద్ర సరిగ్గా సరిపోయారు. సూర్యలో అందరు స్టార్స్ కనిపిస్తారు. అభిమాని ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాల్లో వచ్చాయి. కానీ ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇందులో నేను చెబుతున్న కథ పూర్తిగా డిఫరెంట్, చాలా యూనిక్. రామ్ చాలా విలక్షణ నటుడు. ఆయన నటనలో చాలా ఎనర్జీ ఉంటుంది. నేను రాసుకున్న పాత్రకి గొప్ప ఎనర్జీ కావాలి. ఇలాంటి క్యారెక్టర్కి రామ్ పర్ఫెక్ట్. -భాగ్యశ్రీ పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ... ఇలా ప్రతి క్యారెక్టర్ ఒక భావోద్వేగంతో ఉంటుంది. -వివేక్, మెర్విన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాలో మ్యూజిక్ను ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు.
Narendra Modi : నేడు అయోధ్యలో మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు
Hyderabad : తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ మంగళవారం జరుగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే, ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు, అలాగే డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు, సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థల బలోపేతం, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు కెటిఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Cyclone | తుఫాను హెచ్చరిక.. Cyclone, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Bigg Boss Telugu 9: Secret Nominations and Explosive Confrontations
This week’s Bigg Boss episode delivered one of the fiercest nomination rounds of the season. With two stages of nominations—private and open—the house turned into a battleground of confrontations, emotional eruptions, strategic attacks, and even physical chaos. By the end, eight contestants landed in danger. Stage 1: Secret Nominations Begin the Firestorm Emanuel nominated Pavan. […] The post Bigg Boss Telugu 9: Secret Nominations and Explosive Confrontations appeared first on Telugu360 .
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2 : తాండవం’. రామ్ ఆ చంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రా మ్, -లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి... బాలయ్య విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా బలంగా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి కూడా అద్భుతంగా నటించారు. -టీజర్, ట్రైలర్ లో గన్, త్రిశూలంతో ఉన్న యాక్షన్ సీ క్వెన్స్కు అద్భుతమైన స్పందన వచ్చిం ది. ఓ సన్నివేశం కోసం బాలకృష్ణ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చే శారు. ఒక పాత్రలో అంతగా లీనమైపో యే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ లాంటి నటుడు ఉండడం మనందరికీ గర్వకారణం”అన్నారు.
SS Rajamouli |రాజకీయాల్లోకి రాజమౌళి..?
SS Rajamouli | రాజకీయాల్లోకి రాజమౌళి..? SS Rajamouli హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్
భూం..ధాం.. కోకాపేటలో ఎకరం ధర రూ.137.25 కోట్లు
9.90 ఎకరాలకు రూ.1,350 కోట్ల ఆదాయం హెచ్ఎండిఎ ఇవేలానికి భారీ స్పందన 28న రెండో విడత వేలానికి ఏర్పాట్లు మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీస్ లే ఔట్1లోని రెండు ప్లాట్లకు ప్రభుత్వం సోమవారం ఈ-వేలం నిర్వహించింది. ఈ- వేలంలో ప్లాట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం విశేషం. కోకాపేటలో ఎకరం ధర 137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18లకు సోమవారం అధికారులు ఈ వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరా లు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్ల ధర పలకడం గమనార్హం. సోమవారం జరిగిన ఈ వేలంలో 9.90 ఎకరాల వేలానికి గాను రూ. 1,356 కోట్ల ఆదాయం హెచ్ఎండిఏకు రావడం విశేషం. కాగా, అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించింది. గతంలో కోకాపేట్లో ఎకరం రూ.100 కోట్ల వరకు వేలం వేయగా, ఈసారి కూడా దానికి మించి ధర పలకడం విశేషం. అంతర్జాతీయ హంగులతో ఈ లే ఔట్ ఉండగా మరోవైపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండడంతో నియో పోలీస్ లే ఔట్lలో భూముల ధరలకు రెక్కలొచ్చాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధర కోకాపేట నియోపోలీస్1లో ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఈనెల 28వ తేదీన, డిసెంబర్ 3, (నియోపోలీస్1లో) 5వ తేదీన (గోల్డెన్మైన్లో) మిగతా ప్లాట్లకు హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి రూ.99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు రూ.70 కోట్లు, మూసాపేట్ ప్లాట్లకు రూ.75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది. కోకాపేటలోని నియోపోలీస్ లే ఔట్లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఎన్ని అంతస్థులైనా నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ లే ఔట్లో ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. దాదాపు రూ.300 కోట్లతో ఈ లే ఔట్లో అభివృద్ధి పనులు చేపట్టారు. 40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్, 45 మీ.ల వెడల్పు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్టైన్మెంట్ల అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు. అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించింది. ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాలు ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాల వరకు ఉంది. 2023లో కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరానికి 100.75 కోట్లు పలికింది. ఈసారి కూడా దానికి మించి ధర పలకడం విశేషం. తాజా వేలానికి బిడ్డింగ్లోనే ప్రభుత్వం నిర్ణయించిన ధర కోకాపేటలో ఎకరానికి రూ.99 కోట్లు కాగా, గోల్డెన్మైన్లో లే ఔట్లో రూ.70 కోట్లు, మూసాపేటలో రూ.75 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్లాట్ల వేలం ద్వారా దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని హెచ్ఎండిఏ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం జరిగిన వేలంలో 10 మంది ప్రముఖ జాతీయ, స్థానిక డెవలపర్లు పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ వేలం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.
ముసాయిదా దశలోనే ఉత్తర్వుల్లోని సమాచారం బయటికి పొక్కడంపై ప్రభుత్వం ఆగ్రహం లీకు వీరులపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా వివిధ శాఖల యూజర్ ఐడిలు, పాస్వర్డ్లు మార్పు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు భూముల కేటాయింపుపై ఇటీవల కెటిఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కలకలం మన తెలంగాణ/హైదరాబాద్: సచివాలయంలో డ్రాఫ్ట్ దశలోనే ఉత్తర్వులు మాయమవుతుండటం, అవి కాస్తా బిఆర్ఎస్ ఆఫీసుకు చేరుతుండటాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది. సమాచారాన్ని లీక్ చేస్తున్నదెవరు? జీఓ బయటకు రాకముందే ఎక్కడి నుంచి ఈ సమాచారం బయటకు వెళుతుందన్న అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన యూజర్ ఐడిలను, పాస్వర్డ్లను మార్చివేసింది. దీంతోపాటు ప్రభు త్వం తీసుకునే నిర్ణయాలు, డ్రాప్ట్లు, జిఓలు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే వరకు బ యటకు రాకూడదని ఒకవేళ వస్తే ఆ శాఖ ఉన్నతాధికారులనే బాధ్యులను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఆ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని విభాగాల ఇన్చార్జీలను ఆదేశించింది. దీంతో రానున్న రోజుల్లో ఆయా విభాగాలు తీసుకునే నిర్ణయాలు, మంత్రిమండలి ఆమోదాలు, జిఓలు తదితర విషయాల ను లీక్ చేయకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలని ప్రభుత్వం అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ప్ర భుత్వం హెచ్చరించింది. ఇటీవల భూముల కే టాయింపు అంశంపై మాజీ మంత్రి కెటిఆర్ ప్రెస్మీట్ పెట్టి హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ వెనుక రూ.5లక్షల కోట్ల భూ కుంభకోణం ఉందని ఆరోపించారు. కెటిఆర్ ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీఓనే తాము ఫాలో అవుతున్నామని క్లారిటీ ఇచ్చారు. తాము ఇంకా అలాంటి జీఓనే ఇవ్వలేదంటూ వివరణ ఇచ్చారు. మీరు జీఓ ఇవ్వకుండానే బిఆర్ఎస్ పార్టీకి ఎలా చేరిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన దాట వేశారు. ఈ క్రమంలోనే ఇంటిదొంగలెవరో తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇలా ప్రతిపక్షానికి ఎలాంటి సమాచారం లీకవుతోంది..? డ్రాఫ్ట్ దశలో ఉన్న జీఓలు ఎలా బయటకు వెళ్తున్నాయన్న అంశంపై ఆరా తీసే పనిలో ఇంటెలిజెన్స్ నిమగ్నమైనట్టుగా తెలిసింది.
ఎస్హెచ్జిలకు నేడు వడ్డీలేని రుణాల పంపిణీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సిఎం భట్టి సిఎం, డిప్యూటీ సిఎంలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ.304కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వము జమ చేసింది. మొత్తం 3,57,098 సంఘాలకు ఈ నిధులు చేరాయి. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సిఈఓ దివ్యా దేవరాజన్, జిల్లా డిఆర్డిఎ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా ప ర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మం త్రి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ, వాటికి వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తరఫునే వడ్డీలను చెల్లించడం కొనసాగుతోందని తెలిపారు. తాజాగా రూ.304 కోట్ల వడ్డీలను చెల్లించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు గ్రామీణ సంఘాలకు రూ.1,118 కోట్ల వడ్డీ రహిత రుణాలు చేరాయన్నారు. ఇవి కాకుండా పట్టణ మహిళా సంఘాలకు సుమారు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాలను చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఆడబిడ్డల ఆర్థిక భద్రత కోసం వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తూ, వారి అభివృద్ధికి దారితీసే పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలపై వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తోందని, మహిళల సాధికారతను శాశ్వతంగా నిలబెట్టే విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని, స్వయం సహాయక మహిళలు కష్టపడి పొదుపుగా పెట్టుకున్న అభయహస్తం నిధులను కూడా కాజేసిందని గుర్తు చేశారు. మహిళల కష్టాన్ని దోచుకున్న బిఆర్ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కే లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు నిధులను పారదర్శకంగా, సకాలంలో అందిస్తూ వారి ఆర్థిక శక్తిని మరింతగా పెంచే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు.
సిజెఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గైర్హాజరు తొలి రోజే 17 కేసులు విచారించిన జస్టిస్ సూర్యకాంత్ న్యూఢిల్లీ : భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోజరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం నాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదా రద్దు కావడం, బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష తదితర అనేక చారిత్రక తీర్పులు వెలువరించిన ఘనత సాధించుకున్న సూర్యకాంత్ తదుపరి సిజేఐ గా అక్టోబర్ 30న నియామకమయ్యారు. ఈ పదవిలో దాదాపు 15 నెలల పాటు తన వయస్సు 65 ఏళ్లు పూర్తయ్యేవరకు 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోడీ, తదితర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ఫోటోలను ప్రధాని మోడీ తన ఎక్స్ పోస్ట్లో షేర్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ కూడా కార్యక్రమంలో పాల్గొని కొత్త సిజెఐ కి అభినందనలు తెలిపారు. ఆదివారం బాధ్యతలనుంచి వైదొలగిన జస్టిస్ గవాయ్ కొత్త సిజెఐని ప్రేమాభిమానాలతో హత్తుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో తొలిసారిగా భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్,శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావడం విశేషం. జస్టిస్ సూర్యకాంత్1962 ఫిబ్రవరి 10న హర్యానా లోని హిసార్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో రోహ్తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా, హైకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. వివిధ ధర్మాసనాల్లో పలు కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 370 వ అధికరణను రద్దు చేయడం, స్వేచ్ఛగా భావ ప్రకటన, పౌరసత్వం హక్కులు కల్పిస్తూ తీర్పులు వెలువరించారు. కొత్తచట్టం వచ్చేవరకు వలసవాద దేశద్రోహ చట్టం కింద ఎలాంటి కేసులు దాఖలు కాకుండా ఆపివేయించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణలో తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించారు. తొలిరోజు 17 కేసుల విచారణ ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు సోమవారమే సిజెఐ సూర్యకాంత్ 17 కేసులు విచారించారు. అదే విధంగా ఓ కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకొచ్చారు. ఇకపై అర్జెంట్ లిస్టింగ్ కేసులను తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లోనే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నట్టు చెప్పారు. రాహుల్ గైరుహాజరు సిగ్గుచేటు: బీజేపీ ఆగ్రహం నూతన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ప్రమాణస్వీకారానికి లోక్సభ విపక్షనేత రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంపై బీజేపీ మండిపడింది. హర్యానా రాష్ట్రం వేడుక చేసుకుంటోంద ని, మోడీ, రాష్ట్రపతి ముర్ము తదితర అగ్రనేతలు హా జరు కాగా, విపక్షనేత హాజరుకాకపోవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్పూనావాలా విమర్శించారు.
Rahul Sipligunj |సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్..
Rahul Sipligunj | సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. Rahul Sipligunj, హైదరాబాద్,
ఉప ఎన్నిక గురించి ఆలోచించొద్దు స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా.. ఎదుర్కొనేందుకు సిద్ధం నా బ్రాండ్ విలువ ఢిల్లీ వరకు తెలుసు నాకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంది కార్యకర్తలు తలదించుకునే పని చేయను స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు మన తెలంగాణ/స్టేషన్ ఘనపూర్: బిఫాంలు, పదువులు అమ్ముకునే అలవాటు తనకు లేదని, తాను ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయడం లేదని, తన ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలోని ఈఆర్ఎల్ గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల దించికునే పని ఎప్పటికీ చేయనని గల్లా ఎగేరుకునేలానే పనిచేస్తానని అన్నారు. స్పీ కర్ నిర్ణయం ఎలా ఉన్నాఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నానని, తనకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ని యోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కడియం శ్రీహరి అంటేనే ఒక బ్రాండ్ అని, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. ఢిల్లీ వరకు బ్రాండ్ విలువ బ్రాండ్ కే ఉంటుందని అన్నారు. అందుకు కారణం నిజాయితీగా కచ్చితత్వంలో పనిచేయడమేనని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత గ్రామ స్థాయి నాయకులదేనని, వారిని గెలిపించే బాధ్యత కూ డా గ్రామ నాయకులదేనని స్పష్టం చేశారు. గ్రా మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తు ల ఏకాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఒకే అభ్యర్థి పోటీలో ఉండే విధంగా గ్రామ నాయకులు మండల స్థాయి నాయకుల సహకారంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పాత, కొత్త అనే బేధం లేకుండా అందరూ కలిసి పని చే యాలని కోరారు. గ్రామంలోని మహిళా, యువజన, అన్ని కుల సంఘాల మద్దతు కూడగట్టుకొ ని అందరిని కలుపుకొనిపోవాలని సూచించారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణలు, ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం అందరి చూపు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వైపే ఉందని, అందరికీ నియోజకవర్గంలో కాం గ్రెస్కు తిరుగులేదని నిరూపించాలని పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలను గెలిపించి కానుకగా ఇచ్చి మరిన్ని అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతీ ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీ ముఖ్యమేనని అన్నారు. గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ తరపున ఒక్కరికే అవకాశం వస్తుందని, ఇప్పుడు అవకాశం రాలేదని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి చాలా అవకాశాలు వస్తాయని, పార్టీకి విధేయులుగా పనిచేసేవారికి అవకాశం కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చని సూచించారు. ఫలానా వారే అభ్యర్థి అని తాను ఎవరికీ చెప్పానని అభ్యర్థి ఎంపిక నిర్ణయం మీదే... అభ్యర్థి గెలుపు బాధ్యత కూడా మీదేనని వెల్లడించారు. ఇది మీ ఎన్నికలని పార్టీని గెలిపించుకునే బాధ్యత కూడా మీదేనని సూచించారు. అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 10లక్షలు, సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత తీసుకుంటానన్నారు.
బృందాలుగా ఢిల్లీ బాట పడుతున్న డిప్యూటీ సిఎం డికె అనుచరవర్గం హైకమాండ్కు కట్టుబడి ఉంటా: సిఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి మాటే నాకు వేదవాక్కు: డికె బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత తగాదా ఇప్పుడు ఢిల్లీ వరకూ తారాస్థాయికి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వర్గీయులైన ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. డికెకు సిఎం పీఠం అప్పగించాలని తమ డిమాండ్ను అధిష్టానం వద్ద తీవ్రతరం చేయనున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు డికె కోసం ఢిల్లీలో ఉన్నారు. వీరికి తోడుగా ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రావడంతో ఇక హై కమాండ్ స్పందన ఏమిటనేది కీలకం అయింది. కాగా సిఎం పదవిలో కొనసాగడం అనేది అధిష్టానం నిర్ణయం బట్టి ఉంటుందని, వారు ఏది నిర్ణయిస్తారనేది కీలకం అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తెలిపారు. పార్టీ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. సోమవారం శివకుమార్ వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చారు. హై కమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి తానే కాకుండా తన డిప్యూటి డికె కూడా కట్టుబడి ఉంటారని విలేకరులకు సిద్ధరామయ్య చెప్పారు. డికె సిఎం కానున్నారా? అనే ప్రశ్నకు ఆయన విసుక్కున్నారు. తాను చెపుతున్నది వినకుండా పదేపదే ఈ ప్రశ్ననే ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. డికె క్యాంప్ ఢిల్లీలో మకాం వేయడంతో క్రమేపీ సిద్ధరామయ్యలో టెన్షన్ పెరుగుతోంది. 2023 అధికారం దశలో చెరో సగం సిఎం పదీకాలం అనే ఫార్మూలా కుదిరింది. ఇప్పుడు ఈ గడువు రావడంతో కర్నాటకలో సిఎం పీఠం కోసం తగవు నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డికె శివకుమార్ ఉన్నారు. ఆయన ఇప్పటి పరిణామాలపై ఎక్కడా స్పందించడం లేదు. కానీ ఆయన వర్గీయులు ఢిల్లీకి వెళ్లడం, మార్పు కోసం పట్టుపట్టడంతో ఇప్పుడు నాయకత్వ అంశం బహిరంగ విషయం అయింది. కాగా ఈ ఇద్దరు కాదు . తానే సిఎం ఎందుకు కాకూడదని పార్టీ సీనియర్ నేత, కెపిసిసి మాజీ చీఫ్ , హోం మంత్రి జి పరమేశ్వరన్ కొత్తగా తమ వాదన విన్పిస్తున్నారు. దళితులకు ఈ పదవి దక్కడం న్యాయం అన్నారు. సిఎం చెప్పిందే వేదవాక్యం: డికె ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పిందే తనకు వేదవాక్యం అని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ చెప్పారు. పార్టీ హై కమాండ్ ఏది నిర్ణయిస్తే అదే పాటిస్తానని సిద్ధరామయ్య చెప్పడంపై డికె సోమవారం స్పందించారు. ఆయన ఆ విధంగా చెప్పి ఉంటే , అది తనకు శిరోధార్యమని, దీనిపై తాను చెప్పేందుకు ఏదీ లేదని వివరించారు. పార్టీలో సిఎం పీఠం కోసం ఎమ్మెల్యేల వేట సాగుతోందనే బిజెపి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అది వారి సంస్కృతి అని, అదేవిధంగా మాట్లాడుతారని చికబళ్లాపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన దశలో తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలు, పార్టీల ఫిరాయింపులు పద్ధతి వారికే తెలిసిన విషయం అని వ్యాఖ్యానించారు.
కూంబింగ్ ఆపితే.. ఆయుధాలు అప్పగిస్తాం
అంతర్గత చర్చల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వండి పునరావాసానికి అంగీకరిస్తాం కేంద్ర కమిటీ సభ్యుడు సోనూదాదా నిర్ణయంతో ఏకీభవిస్తున్నాం పిఎల్జిఎ వారోత్సవాలు కూడా నిర్వహించబోం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్టుల ప్రతిపాదన స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ విడుదల మన తెలంగాణ/హైదరాబాద్, చర్ల: మావోయిస్టు పార్టీ ఆయుధ విరమణపై కీల క ప్రకటన చేసింది. మహారాష్ట్ర-, మధ్యప్రదేశ్, -ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్ పేరు తో బహిరంగ లేఖ రాసింది. గడువు ఇస్తే ఆయుధ విరమణ చేస్తామని ప్రకటించింది. అప్పటి వరకు భదత్రా దళాల కూబింగ్ నిలిపివేయాలని కోరింది. ఇంకా లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పో రాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. సిసిఎం సతీష్ దాదా, మరొక సిసిఎం కామ్రే డ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేసింది. ఎంఎంసి(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్) స్పెషల్ జో నల్ కమిటీ ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. తాము ఆయుధాలు విడిచిపెట్టడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సమయం ఇవ్వాలనిఅభ్యర్థించింది. పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, ఈ నిర్ణయాన్ని అందరితో పంచుకోవడానికి కొంత సమయం పడుతుందని, సహచరులను సంప్రదించి, పార్టీ పద్దతి ప్రకారం ఈ సందేశాన్ని తెలియజేయడానికి సమయం కోరింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమ యం ఇవ్వాలని అభ్యర్థించింది. సమయం కోరడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదని, సమాచారం చేరవేసేందుకు ఈ సమయం కోరామని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మావోయిజం నిర్మూలనకు విధించిన గడువు (మార్చి 31, 2026)లోపే తాము కోరిన సమయం ఉందని, అప్పటి వరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించి, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది. కాగా, పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహించబోమని, ఈ క్రమంలో రాబోయే పిఎల్జిఏ వారంలో ఎటువంటి కార్యకలాపాలను కూడా ప్రభుత్వం నిర్వహించకూడదని, ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను సైతం నిలిపివేయాలని, ఇతర సమాచారం ఆధారంగా దళాలను నియమించకూడదని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇరువైపులా ఇలాంటి ప్రయత్నాలతో సంభాషించుకోవడానికి మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి సాధ్యమవుతుందని, ఆహ్లాదకరంగా, సానుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు జోన్ల్ కమిటీలు తమ కార్యకలాపాలన్నింటిని నిలిపివేయాలని అనంత్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలోని సారాంశాన్ని మీడియా ద్వారా సహచర మావోయిస్టులకు తెలియజేయాలని అనంత్ కోరారు. ఆయుధ విరమణపై త్వరలోనే తేదీ ప్రకటిస్తాం ఆయుధ విరమణపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని అనంత్ లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాలని కోరారు. సమిష్టిగా ఆయుధ విరమణ చేసి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాల కార్యకలాపాలను నిర్ణీత తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని అనంత్ పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి చూస్తామని లేఖలో తెలిపారు. సహచరులు సోను దాదా, సతీష్ దాదా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తగిన సమయం ఇవ్వాలని కోరారు.
GHMC general meeting |కౌన్సిల్.. సాఫీగా సాగేనా!
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి సమావేశమే చివరిదో, మరో సమావేశం
Illegal construction’s |అక్రమ నిర్మాణాలు మిగిలిన వాటి పరిస్థితేంటి..
Illegal construction’s | అక్రమ నిర్మాణాలు మిగిలిన వాటి పరిస్థితేంటి.. ఆంధ్రప్రభ నిఘా
AI |త్వరలో ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స చెల్లింపులు…
AI | త్వరలో ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స చెల్లింపులు… హైదరాబాద్ సిటీ బ్యూరో,
Editorial |విఫల ప్రయోగంగా డోజ్
Editorial | విఫల ప్రయోగంగా డోజ్ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి
మాడ్గుల, (ఆంధ్రప్రభ) : విద్యార్హత కలిగి నైపుణ్యత లేని యువత ఒక ప్రక్కన
TG |నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓపెన్ స్కూల్ సొసైటీ…
TG | నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓపెన్ స్కూల్ సొసైటీ… హైదరాబాద్, (ఆంధ్రప్రభ) :
మంగళవారం రాశి ఫలాలు (25-11-2025)
మేషం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. వృషభం నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. మిధునం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కర్కాటకం వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సింహం వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కన్య కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తుల వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృశ్చికం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ధనస్సు వృత్తి, వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు. మకరం వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుంభం వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. మీనం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
TG |బీసీ జపం.. కానీ బీసీలకే వెూసం..!
TG | బీసీ జపం.. కానీ బీసీలకే వెూసం..! కొందుర్గు, (ఆంధ్రప్రభ) :
25 Nov 2025 Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్
. ఆర్టీజీఎస్ డేటా లేక్ ద్వారా వివరాల సేకరణ. ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ. కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ […] The post కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ appeared first on Visalaandhra .
మహిళల కబడ్డీ ప్రపంచకప్ విశ్వవిజేత భారత్
ఫైనల్ పోరులో చైనీస్ తైపీపై ఘనవిజయంవరుసగా రెండోసారి కప్ కైవసం ఢాకా: మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనీస్ తైపీ జట్టును భారత్ చిత్తుగా ఓడిరచి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ మహిళలజట్టు చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడిరచింది. వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టైటిల్ పోరులో భారత్ తొలి అర్ధ […] The post మహిళల కబడ్డీ ప్రపంచకప్ విశ్వవిజేత భారత్ appeared first on Visalaandhra .
Shalibanda |పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
Shalibanda | పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం ఆంధ్ర్రప్రభ : పాతబస్తీ శాలిబండ
సీఎం ఆదేశించినా కదలని పదోన్నతుల ఫైలు. అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులు. 3 వేల మందికి పైగా ఎదురుచూపులు విశాలాంధ్ర-సచివాలయం: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై సందిగ్ధత వీడటం లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులకు ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారంటూ ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున హడావుడి చేశారు. రోజులు తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ పదోన్నతులపై ఆర్టీసీలో స్పందన లేదు. రాష్ట్రంలోని పదోన్నతులకు అర్హులైన ఉద్యోగుల జాబితా నాలుగు నెలల క్రితమే అధికారులు రూపొందించారు. వీరిలో డ్రైవర్, […] The post వీడని సందిగ్ధం appeared first on Visalaandhra .
పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై రీల్స్…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ
ഫാക്ട് ചെക്ക്: അസമിൽ മതപരിവർത്തനത്തിനെതിരെ പ്രതിഷേധം? വസ്തുത അറിയാം.
ജാർഖണ്ഡിൽ ആദിവാസി വിഭാഗം നടത്തിയ പ്രതിഷേധത്തിൽ നിന്നുള്ള ദൃശ്യങ്ങളാണ് പ്രചരിക്കുന്നത്
Medak |రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి…
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, మిరుదొడ్డి (ఆంధ్రప్రభ): సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మిరుదొడ్డి
చేతులెత్తేసిన బ్యాటర్లు.. టీమిండియాకు మరో వైట్ వాష్ తప్పదా?
గౌహతి: సొంత గడ్డపై ఎదురులేని శక్తిగా ఉన్న టీమిండియా ఇటీవల కాలంలో టెస్టుల్లో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైన భారత జట్టుకు మరోసారి అలాంటి చేదు అనుభవాన్ని చవిచూసే పరిస్థితి నెలకొంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య భారత జట్టు చెత్త ఆటతో గడ్డు స్థితినిఎదుర్కొంటోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి పాలైనటీమిండియా రెండో టెస్టులోనూ ఓటమి బాటలో ప్రయాణిస్తోంది. ఏదైనఅద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో భారత జట్టు మ్యాచ్లో ఓటమిని తప్పించుకోవడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. రెండు విభాగాల్లోనూ విఫలం కావడంతో భారత్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేయగా, భారత్ 210 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన సౌతాఫ్రికా మ్యాచ్ను శాసించే స్థితికి చేరుకుంది.
ధర్మేంద్ర ఒక ఐకానిక్ ఫిగర్ : సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : ధర్మేంద్ర మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.ధర్మేంద్ర మరణం తీవ్ర విచారానికి గురి చేసిందన్నారు. భారతీయ సినిమాకు ఆయన ఒక ఐకానిక్ ఫిగర్ అని, అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధర్మేంద్ర మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు తమ సంతాపం తెలిపారు. ‘మరపురాని నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర’ ధర్మేంద్ర మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని వారు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, ‘ధర్మేంద్ర జీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక లెజెండరీ నటుడిగా తన మరపురాని నటనతో ఆయన కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. భారత సినిమాకు ఆయన చేసిన సేవ తరతరాలు గుర్తుంచుకుంటాయి‘ అని పేర్కొన్నారు. తొలి తరం యాక్షన్ హీరో ధర్మేంద్ర : పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ సైతం ధర్మేంద్ర మృతికి నివాళులర్పించారు. ‘హిందీ చిత్ర పరిశ్రమలో తొలితరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. అందుకే అభిమానులు ఆయన్ను ’యాక్షన్ కింగ్’, ’హీ-మ్యాన్’ అని పిలుచుకున్నారు. ‘షోలే’, ‘ధరమ్ వీర్’ వంటి చిత్రాలతో ఆయన తనదైన ముద్ర వేశారు‘ అని పవన్ గుర్తు చేసుకున్నారు. ఎంపిగా ధర్మేంద్ర చేసిన సేవలు చిరస్మరణీయం: వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కూడా ధర్మేంద్ర మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తనకు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్తో పాటు ప్రజా జీవితంలో ఎంపీగా కూడా ధర్మేంద్ర చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
డిజిటల్ అరెస్ట్.. మూడు రోజులు నిర్భందంలో డాక్టర్ కుటుంబం..
సైబర్ ఉచ్చు నుంచి డాక్టర్ కుటుంబాన్ని రక్షించిన టిజిసిఎస్బి డిజిటల్ అరెస్ట్లు ఉండవు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ మన తెలంగాణ/హైదరాబాద్: సిబిఐ అధికారులమని సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడి డిజిటల్ అరెస్టు ఉచ్చును నుంచి డాక్టర్ కుటుంబాన్ని కాపాడినట్లు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాచలంలో నీలా నర్సింగ్ హోమ్ను నిర్వహిస్తున్న 80 ఏళ్ల డాక్టర్ బుద్ధరాజు సుబ్బరాజు ఆయన కోడలు, మనవరాలు ఈ సైబర్ మోసానికి బాధితులయ్యారన్నారు. నవంబర్ 20వ తేదీ డాక్టర్ సుబ్బరాజుకు సిబిఐ అధికారులమని వాట్సాప్ వీడియో కాల్ వచ్చిందని, ఆయన ఆధార్ కార్డుతో ముంబైలో ఓ బ్యాంకు ఖాతా ఉందని, అది ఏకంగా 100కు పైగా క్రిమినల్ కేసులలో ఉపయోగించబడిందని అబద్ధాలు చెప్పి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసినట్లు చెప్పారు. దీంతో పాటు సిబిఐ పర్యవేక్షణలో కుటుంబాన్ని ఉంచామని హెచ్చరించి, ఎవరితోనూ మాట్లాడకూడదని, ప్రతి గంటకూ వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉండాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో వారి బ్యాంకు ఖాతాల వివరాలు, ఎఫ్డిలు, ఇంట్లో ఉన్న నగదు వివరాలను మోసగాళ్లు తెలుసుకున్నారు. ఎఫ్డిలను వెంటనే రద్దు చేసి, ఆ డబ్బును వారికి పంపడానికి సిద్ధం కావాలని మూడు రోజులుగా కుటుంబాన్ని ఒత్తిడికి గురిచేశారు. ఈ కారణంగా ఆ కుటుంబం మూడు రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇంట్లోనే ఉన్నారని డైరెక్టర్ శిఖా గోయొల్ వెల్లడించారు. సహాయకుడి అప్రమత్తతతో కాపాడిన పోలీసులు కుటుంబం ఫోన్ ఎత్తకపోవడం, డాక్టర్ సుబ్బరాజు ఆసుపత్రికి రాకపోవడాన్ని గమనించిన ఆయన సహాయకుడు అనుమానం వ్యక్తం చేశాడు. పదేపదే ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ సహాయకుడు నవంబర్ 23 రాత్రి కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిఎస్పి అశోక్ బాబుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్లు డాక్టర్ సుబ్బరాజు ఇంటికి చేరుకున్నారు. వెంటనే మోసగాళ్లతో ఆ కుటుంబానికి ఉన్న సమస్యను అడ్డుకున్నారు. అధికారుల వేగవంతమైన చర్యల వల్ల ఆ కుటుంబానికి జరగాల్సిన పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం తప్పినట్లు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ వెల్లడించారు. ప్రస్తుతం, సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక దర్యాప్తును ప్రారంభించారని, మోసగాళ్ల ఐపి చిరునామాలు, కాల్ రూటింగ్ వివరాలు, పరికరాల గుర్తింపు సంఖ్యలను విశ్లేషిస్తున్నామన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు, జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్తో సమన్వయం చేసుకుంటూ మోసగాళ్ల నెట్వర్క్ను ధ్వంసం చేయడానికి చర్యలు కొనసాగుతున్నట్లు ఆమె తెలిపారు. డిజిటల్ అరెస్టులు ఉండవు ఈ సంఘటల సందర్భంగా టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ పలు సూచనలు చేశారు. పోలీసులు, సిబిఐ, ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఎప్పుడూ డిజిటల్ అరెస్టులు, వాట్సాప్ విచారణలు చేయదని, ఏ అధికారికి కూడా డబ్బును ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పే అధికారం చట్టంలో లేదని స్పష్టం చేశారు. సైబర్ మోసం జరిగిందని అనుమానం వస్తే వెంటనే 1930కు కాల్ చేయాలని, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. సమయోచితంగా స్పందించి వృద్ధుడి కుటుంబాన్ని రక్షించిన డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు.
TG |మహిళలకు వడ్డీ లేని రుణాలు….
ఆసిఫాబాద్, (ఆంధ్రప్రభ) : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను
తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 14 కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లకు సంబంధించి రంగారెడ్డిలో తొమ్మిది, హైదరాబాద్లో మూడు, సంగారెడ్డిలో 1, వరంగల్ జిల్లాల్లో ఒక్కో ఎక్సైజ్ స్టేషన్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్లోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో బంజారాహిల్స్ ఎక్సైజ్ స్టేషన్ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రారంభించగా, చిక్కడపల్లి ఎక్సైజ్ స్టేషన్ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్ సుప్రియలు, మారేడుపల్లి ఎక్సైజ్ స్టేషన్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, ఈఎస్ పంచాక్షరీ, ఏఈఎస్ శ్రీనివాసరావులతో పాటు మూడు స్టేషన్ల సిఐలు బానోతు పటేల్, రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. శంషాబాద్ ఈఎస్ పరిధిలోని గండిపేట్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ను ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, కొండపూర్ స్టేషన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ కృష్ణప్రియ ఇతర అధికారులు పాల్గొన్నారు. సరూర్నగర్ ఈఎస్ పరిధిలోని మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్ను రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, పెద్ద అంబర్పేట్ స్టేషన్ ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డిలు ప్రారంభించారు. మేడ్చల్ ఈఎస్ పరిధిలోని కొంపల్లి, కూకట్పల్లి ఎక్సైజ్ స్టేషన్లను ఎక్సైజ్ సూపరింటెండ్ ఫయాజుద్దీన్, ఏఈఎస్ మాధవయ్యలు ప్రారంభించారు. మల్కాజిగిరి ఈఎస్ పరిధిలో కాప్రా పోలీస్స్టేషన్ను ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, నాచారం స్టేషన్ను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు, అల్వాల్ స్టేషన్ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు ప్రారంభించగా ఈఎస్ నవీన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్లోని అమీన్పూర్ ఎక్సైజ్ స్టేషన్ను ఎంపి రఘునందన్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో మెదక్ డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, ఏఈఎస్ శ్రీనివాస్లు పాల్గొన్నారు. హసన్పర్తి స్టేషన్ను వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో డిసి అంజన్రావు, ఈఎస్ చంద్రశేఖర్లు పాల్గొన్నారు.

24 C