AWARD|ప్లాటినం అవార్డ్ అందుకున్న మైహోమ్ టీం..
AWARD| మేళ్ళచెరువు, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మెల్లచెరువు
AGENCY |లస్కర్ పోస్టుకు లక్షల్లో వసూళ్లు..!
AGENCY | లస్కర్ పోస్టుకు లక్షల్లో వసూళ్లు..! –ఇరిగేషన్ లో బాగోతం— AGENCY
సమాచార హక్కు సామాన్యులకు ఎండమావేనా!
ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు నాలుగు గోడల మధ్యలో పాలన చేస్తున్నట్టు కాకుండా పారదర్శకంగా చేస్తున్నట్టు ఉండాలి. పౌరులకు తెలియని స్థలమనేది ఉండకూడదు. రహస్య ప్రాంతాల్లో అవినీతి పెరిగిపోతుంది. అదే బహిరంగ ప్రదేశాల్లోనైతే నిర్మూలించబడుతుంది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ అన్నారు. మన దేశంలో సమాచార హక్కు చట్టం (రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005) అమలులోకి వచ్చి 2025 అక్టోబర్ 12వ తేదీ నాటికి ఇరవై ఏండ్లు పూర్తి అయింది. దేశ ప్రజాస్వామ్య పునాదిని పటిష్టంగా ఉంచే కీలకమైన చట్టాల్లో ఇది ఒకటి. ఓటు హక్కు తర్వాత అంతటి ప్రాధాన్యత కూడా దీనికే ఉంది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలైన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఇన్నేండ్లైనా కానీ.. ఆర్టిఐ అమలు తీరు ‘మేడి పండు చందం’గానే ఉంది. సమాచార పారదర్శకతపై ప్రభుత్వాలు, అధికారులు చెప్పే మాటలకు.. చేతల్లో పొంతనే లేదు. సమాచార హక్కు చట్టంద్వారా ఆఫీసుల్లో పాలన రికార్డుల వివరాలను పొందడానికి ఎన్నో సవాళ్లను, అడ్డంకులను, వైఫల్యాలను ఎదుర్కొం టున్నారు. దీనికి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, పొరపాట్లు, వ్యవస్థాగత లోపాలు వంటివే కారణాలుగా ఉన్నాయని చెప్పొచ్చు. రాజ్యాంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఆర్టిఐకే దక్కింది. పార్లమెంట్ చేసిన చట్టాల్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది. అవినీతి నిర్మూలన, విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడం, సుపరిపాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యాలుగా ఉన్నా యి. పంచాయతీ నుంచి ప్రధాని ఆఫీసు దాకా.. వివిధ స్థాయిల్లో జరిగే అవినీతిని బయటపెట్టడం, జవాబుదారీతనాన్ని పెంచడం, అభివృద్ధి, సంక్షేమాలపై తెలుసుకోవడం, ప్రభుత్వ రికార్డుల తనిఖీ ఆర్టిఐ సామాన్యులకు కల్పించిన ఒక ప్రధాన అస్త్రం కూడా. ఇది అమలులోకి వచ్చి ఇరవైఏండ్లే అయినా.. దీనికి తొలి అడుగుపడినది దశాబ్దాల కిందటే అని చెప్పొచ్చు. 1976లోఉత్తరప్రదేశ్ స్టేట్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ పని తీరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తప్పకుండా ఇవ్వాల్సిందే! సమాచార హక్కు రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని, స్వేచ్ఛ హక్కు 19(1)(ఏ)లో ఇమిడి ఉందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాతనే సమాచార హక్కు చట్టం రూపొందించుకోవాలనే ఆలోచన పాలకుల్లో వచ్చింది. అనంతరం 2005నుంచి అమలులోకి వచ్చింది.రెండు దశాబ్దాల కాలంలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారులు సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ.. 2జీ స్పెక్ట్రం కేటాయింపులు, కామన్వెల్త్ గేమ్స్, కోల్ గేట్ స్కామ్ అవినీతి గుట్టు బయట పెట్టడంలో ఆర్టిఐ కీలకంగా నిలిచింది. జాతీయ ఉపాధి హామీ పనుల సోషల్ ఆడిట్, రికార్డుల తనిఖీలో ఎంతో సమర్థవంతంగా వినియోగించుకునేలా దోహదపడింది. ఇక దరఖాస్తుదారులకు అడ్డంకులు కూడా చాలా ఎక్కువే. సమాచారం ఇచ్చేందుకు అధికారులు కావాలనే ఆలస్యం చేయడం, లేదా అసంపూర్తిగా ఇవ్వడం, లేదంటే దరఖాస్తులను తిరస్కరించే పరిస్థితులను నూటికి తొంభై శాతం మంది ఎదుర్కొంటుంటారు. అవినీతి బహిరంగ పరిచే ఆర్టిఐ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడడం, దాడులు వంటివి చేస్తున్నారు. ఇప్పటివరకు వందల మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వేలమంది దాడులు ఎదుర్కొన్నారు. దేశంలో సామాన్యులు సమాచార హక్కును పొందడంలో ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులను ఎదుర్కొంటున్నట్టు సర్వేలు తేల్చిచెబుతున్నాయి. 30 రోజుల గడువులోపు ఇవ్వాల్సిన సమాచారానికి నెలల, ఏండ్లకు ఏండ్లు ఎదురు చూడాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, పారదర్శకత పాటించకపోవడం కారణాలని సమాచార నిపుణులు సైతం పేర్కొంటున్నారు. దేశంలోని పౌరులకు ఆర్టిఐ ఒక శక్తిమంతమైన సాధనం అయినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో సరిగా అవగాహన కల్పించడం లేదు. ప్రచారమూ చేయడం లేదు.గ్రామీణ ప్రాంతాల్లోని చాలామందికి ఆర్టిఐ ఉందనేదికూడా తెలియదు. తద్వారా ఆఫీసుల్లో సమాచారాన్ని పొందే హక్కు సామాన్యులకు దక్కడం లేదు. పాఠశాలస్థాయి నుంచే సమాచార హక్కు ప్రాధానత్యపై అవగాహన పెంపొందించాలి. కేంద్ర, రాష్ట్రాల కమిషన్ల వెబ్సైట్లు కూడా యూజర్ -ఫ్రెండ్లీగా లేవు. అప్లికేషన్ల ఫాలో అప్, ఒటిపిల్లో లేట్, పేమెంట్ ఫెయిల్యూర్లు వంటి టెక్నికల్ ఇష్యూలు దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారాయి. దరఖాస్తుదారులు కావలసిన సమాచారం పొందేందుకు నగదును చెల్లిస్తున్నా.. సమాచారం ఇవ్వకుండా.. చట్టాన్ని సరిగా అమలు చేయకుండా నీరుగార్చుతున్నారు. ఇలాంటివి కూడా చట్టాన్ని బలహీనం చేస్తూ.. పారదర్శకతకు విఘాతంగా మారాయి. ఆర్టిఐ కమిషన్లను బలోపేతం చేసి.. డిజిటల్ టెక్నాలజీని మెరుగుపరచాలని దరఖాస్తుదారులు, సమాచార నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్టిఐ విజయవంతం అమలవ్వాలంటే కమిషన్లను క్రమానుగతంగా బలోపేతం చేస్తుండాలి. మౌలిక వసతులు కల్పిస్తుండాలి. దరఖాస్తులను, అప్పీళ్లను సకాలంలో పరిష్కరించాలి. ఇలా సమాచారంవేగంగా, స్పష్టంగా పొందినప్పుడే సామాన్యులు ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకుగా భాగస్వాములవుతారు. ఇలా చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. ఆఫీసుల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంటే.. ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తారు. మెరుగైన సేవలను అందడంతోపాటు అధికారుల్లో పారదర్శకత కూడా పెరుగుతుంది. అవినీతి తగ్గుతుంది. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే ప్రజాస్వామ్య విజయవంతానికి ఓటు హక్కు మాదిరిగానే సమాచార హక్కు తయారవుతుంది. దేశంలో కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరుగా సమాచార హక్కు కమిషన్లు ఉన్నప్పటికీ ఎవరూ.. చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్రాల్లోని కమిషన్లలో ఏటేటా లక్షల్లో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. అప్పీళ్లపైనా విచారణ వేగంగా, సరిగా జరగడంలేదు. ఆర్టిఐ కమిషన్ల నియామకాల్లోనూ రాజకీయ అధికార జోక్యం కూడా ఎక్కువే. సకాలంలో నియామకాలు చేయడం లేదు. కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయి. నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించడం లేదు. ఇలాంటి ఆరోపణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. ఇవి సందర్భానుసారం సామాజిక మాధ్యమాల్లోనూ చూస్తుంటాం కూడా. 2019లో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 13, 16లను కేంద్ర ప్రభుత్వం సవరించి.. సమాచార కమిషనర్ల పదవీ కాలాన్ని నిర్ణయించే బాధ్యతను కట్టబెట్టుకుంది. కేంద్రం తీరుతో సమాచార కమిషనర్ల స్వతంత్రతకే ముప్పు తలెత్తిందని, సమాచార హక్కు చట్టం ఉనికి ప్రమాదమని సమాచార నిపుణుల నుంచి విమర్శలెన్నో వచ్చాయి. ఆర్టిఐ జబ్బుపడిన చట్టంగా మారిందని వ్యాఖ్యలు కూడా చేశారు. డా. చంటి ముదిరాజ్ 78010 01004
Rain Alert : మళ్లీ తుపాను ముప్పు.. అటు వైపుగా వస్తుందట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Narendra Modi : మోదీకి విన్నూత్న రీతిలో స్వాగతం
భారత ప్రధాని నరంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు.
AYYAPPA|కటోర దీక్షతో అయ్యప్ప మాలలు..
AYYAPPA| బిక్కనూర్, ఆంధ్రప్రభ: కటోర దీక్ష కోసం అయ్యప్ప మాలలు వేసుకోవడం జరిగిందని
Delhi Bomb Blast Case : 2023 లోనే బాంబు పేలుళ్లకు కుట్ర జరిగిందా?
ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
India vs South Africa : నేటి నుంచి భారత్ - దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్
నేటి నుంచి భారత్ - దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది
Telangana : నేడు కీలక మావోయిస్టు లీడర్లు లొంగుబాటు
ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం
నెల రోజుల్లో మరిది పెళ్లి... ప్రైవేటు అంగాన్ని కట్ చేసిన వదిన
లక్నో: కొన్ని రోజుల్లో మరిది పెళ్లి చేయనున్నారు. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. వదిన మాత్రం మరిదిని బెడ్ రూమ్కు పిలిచి అతడి ప్రైవేటు పార్ట్ను కట్ చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యుపిలోని ఆగ్రాకు చెందిన యోగేష్ అనే యువకుడు ఉత్తరాఖండ్లోని ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యోగేష్ పెళ్లి నిశ్చయం కావడంతో ఇంటి దగ్గర ఉంటున్నాడు. పెళ్లి పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మరిదిని వదిన బెడ్రూమ్లోకి తీసుకెళ్లింది. అనంతరం అతడు ప్రైవేటు అంగాన్ని కట్ చేసింది. దీంతో అతడిని ఎయిమ్స్కు తరలించారు. వైద్యులు సర్జరీ చేసి అతడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వెల్లడించారు. తన చెల్లిని మరిది పెళ్లి చేసుకోకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడనే కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
గుడిలో దండలు మార్చుకుని.. IASల ఆదర్శ వివాహం #TeluguPost #telugu #post #news
IBomma : ఇమ్మడి రవి విచారణలో వెలుగు చూసిన ఆశ్చర్యకరమైన విషయాలివే
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఘనంగా స్మృతి మంధాన హల్దీ వేడుక..#TeluguPost #telugu #post #news
Allari Naresh Delivers a series of Debacles
Allari Naresh has done the most number of films among the new generation of actors. After delivering a series of flops, he was back to track with Naandhi, a serious attempt and the performance of the actor was widely appreciated. The film released in 2021 and Allari Naresh released six films over a period of […] The post Allari Naresh Delivers a series of Debacles appeared first on Telugu360 .
Andhra pradesh : చంద్రబాబుపై పరువు కేసు.. సీఐకి ఊస్టింగ్
చంద్రబాబుపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సీఐ శంకయ్యను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం దుళ్ల దళితవాడ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా నివాసముండే గుర్రపు వెంకట్రావు శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే వ్యవసాయ కూలి పనికి వెళ్లి వచ్చి టివి ఆన్ చేసి చూస్తూ నిద్రకు ఉపక్రమించినట్లు, అయితే టివి ఆఫ్ చేయడం మరచిపోవడం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి వుండొచ్చని భావిస్తున్నారు. ఇల్లంతా పొగ కమ్మేయడంతో గాఢనిద్రలో ఉన్న వెంకట్రావుకు మెలకువ వచ్చి, బయటకు పరుగెత్తడంతో […] The post దుళ్ల లో అగ్ని ప్రమాదం appeared first on Visalaandhra .
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి సఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. శుభ్మన్ గిల్కు గాయం కావడంతో రిషబ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహస్తున్నాడు. గిల్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి తీసుకున్నారు. అక్షర పటేల్కు బదులుగా నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకన్నారు. దక్షిణాఫ్రికా జట్టులోకి కార్బిన్ బాస్చ్కు బదులుగా సెనురన్ ముత్తుస్వామిని జట్టులోకి తీసుకున్నారు.
Gold Price Today : ఆలస్యం.. బంగారం .. మరింత భారం.. ఇప్పుడే కొనుగోలు చేయండి
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
Amaravathi : రాజధానిలో నారాయణ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.
పెర్త్: ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్, ఆ స్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ప్రా రంభమైన తొలి టెస్టులో మొదటి రోజు బౌలర్ల హవా నడిచింది. తొలుత బ్యా టింగ్ చేసిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 32.5 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నిం గ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్ల లో 123 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఇం గ్లండ్ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న ఆనందం ఆస్ట్రేలియాకు ఎక్కువ సేపు నిలువలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆస్ట్రేలియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ జాక్ వెదరాల్డ్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మార్నస్ లబుషేన్ (9) కూడా నిరాశ పరిచాడు. ఉస్మాన్ ఖ్వాజా (2), కెప్టెన్ స్మిత్ (17), ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24), అలెక్స్ కారే (26), స్టార్క్ (12) పరుగులు చేసి పెవిలియ న్ చేరారు. స్కాట్ బొలాండ్ సున్నాకే వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 23 పరుగులకే ఐదు వికెట్లు తీశాడు. ఆర్చర్, కార్స్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ 172 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ అసాధారణ బౌలింగ్తో ఇంగ్లీష్ బ్యాటర్లను హడలెత్తించాడు. అద్భుత బౌలింగ్ను కనబరిచిన స్టార్క్ 58 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓలి పోప్ (46), హ్యారీ బ్రూక్ (52), జేమీ స్మిత్ (33), డకెట్ (21) మాత్రమే రాణించారు.
గౌహతి: సౌతాఫ్రికాతో శనివారం నుంచి జరిగే రెండో, చివరి టెస్టు ఆతిథ్య టీమిండియాకు సవాల్గా మారింది. సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత్కు నెలకొంది. ఈ మ్యాచ్లో భారత జట్టుకు రిష బ్ పంత్ సారథ్యం వహించనున్నాడు. మెడ నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానం లో పంత్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నా డు. తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే రెండో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. గిల్ వంటి కీలక ఆటగాడు దూరమైన నేపథ్యంలో సౌతాఫ్రికా వంటి బలమైన జట్టును ఎదుర్కొవడం భారత్కు అంత తేలిక కాదనే చెప్పాలి. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ టీమ్ సమతూకంగా ఉంది. తొలి మ్యాచ్లో సమష్టిగా పోరాడి భారత్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. గెలవాల్సిందే.. మరోవైపు ఆతిథ్య భారత జట్టుకు ఈ మ్యాచ్లో తప్పక విజయం సాధించాల్సన పరిస్థితి ఏర్పడింది. ఇందులో గెలిస్తేనే సిరీస్ను సమం చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే కొంత కాలంగా వరు స విజయాలతో టెస్టు క్రికెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న డబ్లూటిసి ఛాంపియన్ సౌతాఫ్రికాను ఓడించడం అంత సులువుకాదనే విష యం భారత్ గుర్తుంచుకోవాలి. బ్యాటింగ్, బౌ లింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటా యి. లేకుంటే సిరీస్ను కోల్పోవడం ఖాయం.
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
బెంగళూరులో రూ. 7.11 కోట్ల దోపిడీ... కుప్పంలో దొంగల ముఠా పట్టివేత
అమరావతి: కర్నాటక రాష్ట్రం బెంగళూరులో దోపిడీ చేసిన నగదును కుప్పంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దొంగల ముఠా బెంగళూరులోని ఎటిఎం లాజిస్టిక్ వాహనం నుంచి 7.11 కోట్ల రూపాయలను దోపిడీ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. కర్నాటక పోలీసులు వారిని వెంటాడుతూ కుప్పం చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో కుప్ప మండలం కూర్మానిపల్లి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదు దొరికింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దోపిడీ కేసులో నవీన్ ఒక్కడే లేడని ముఠా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్యం
ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది
రమాదేవి ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు
అనపర్తిలో అత్యవసర వైద్యసేవలకు శ్రీకారం రమాదేవి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఎమ్ .రమాదేవి విశాలాంధ్ర – అనపర్తి:గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తీసుకు రావాలనే సంకల్పంతో స్థానిక రమాదేవి ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్టు ఆసుపత్రి అధినేత , గైనకాలజిస్ట్ , లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఎమ్ .రమాదేవి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనపర్తి , పరిసర గ్రామీణ ప్రాంతాల్లో మొదటిసారిగా అత్యవసర వైద్య సేవలను […] The post రమాదేవి ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు appeared first on Visalaandhra .
Andhra Pradesh : రెండురోజులు పుట్టపర్తిలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి రెండు రోజుల పాటు పుట్టపర్తిలో పర్యటించనున్నారు
Shankarayya Fired for Lapses in Vivekananda Reddy Murder Probe
Former Pulivendula CI J Shankarayya has been dismissed from service after senior police officials concluded that he acted in a manner that brought disrepute to the department during the investigation of the Y S Vivekananda Reddy murder case. Kurnool Range DIG Koya Praveen approved the decision based on a detailed report that outlined several serious […] The post Shankarayya Fired for Lapses in Vivekananda Reddy Murder Probe appeared first on Telugu360 .
ధర్మో రక్షితి రక్షితః’ సినిమా టీమ్
రామవరం గ్రామదేవత బాపనమ్మ తల్లి దర్శించిన ‘ధర్మో రక్షితి రక్షితః’ సినిమా టీమ్. విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి మండలంరామవరం గ్రామదేవత బాపనమ్మ తల్లి అమ్మవారిని ‘ధర్మో రక్షితి రక్షితః’ సినిమా యూనిట్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కట్టా శ్రీకర ప్రసాద్, కన్నడ నటి చైత్రా శివన్న, చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ తదితరులు అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.జగపతిబాబు, రావు రమేష్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ను ఈ […] The post ధర్మో రక్షితి రక్షితః’ సినిమా టీమ్ appeared first on Visalaandhra .
Bigg Boss Telugu 9: Heated Clashes, Emotional Highs and a Twist in Captaincy Task
The latest episode of Bigg Boss Telugu 9 blended deep emotional moments with fiery confrontations and a highly debated twist in the captaincy task. Emanuel’s mother stole the hearts of viewers in the first half, while Tanuja, Divya and Sanjana dominated the second half with intense arguments and accusations. Emanuel’s Mother Wins Hearts The episode […] The post Bigg Boss Telugu 9: Heated Clashes, Emotional Highs and a Twist in Captaincy Task appeared first on Telugu360 .
Andhra Pradesh : విజయానంద్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలల కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
వెళ్లిపోతున్న ప్రియురాలు... భార్య ముందే ప్రియుడు ఆత్మహత్యాయత్నం
అమరావతి: ప్రియురాలితో ఏడబాటు తట్టుకోలేక ప్రియుడు భార్య ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎపినాపి గ్రామంలో కోటపాటి విష్ణువర్ధన్, సరిత అనే దంపతులు కలిసి ఉంటున్నారు. ఈ దంపతులకు కూతురు కూడా ఉంది. ఇటుకబట్టీలో పని చేస్తుండగా విష్ణువర్ధన్కు ధనలక్ష్మి అనే మహిళ పరిచయం కావడంతో వివాహేతర సంబందానికి దారితీసింది. ఈ విషయం భార్యకు తెలియడంతో పలుమార్లు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె తన అత్తమామల దగ్గరే ఉంటుంది. దీంతో విష్ణువర్థన్ తన ప్రియురాలు ధనలక్ష్మితో కలిసి ఇంటికి వచ్చాడు. దీంతో సరిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వేరుగా ఉండాలని సూచించారు. కానీ తనకు ప్రియురాలు కావాలని ఆస్తి వద్దని భార్య పేరు మీద రాశాడు. అదే సమయంలో ప్రియురాలు బంధువులు అక్కడికి వచ్చి ధనలక్ష్మిని తీసుకెళ్లారు. దీంతో ప్రియుడు విష్ణు దుకాణంలోకి వెళ్లి పురుగుల మందు డబ్బాను కొనుగోలు చేశాడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై తాగి కిందపడిపోయాడు. భార్య, బంధువులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో
అక్షరాస్యత అనియత విద్యపై ప్రజలకు అవగాహన కార్యక్రమం విశాలాంధ్ర – నల్లజర్ల : వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆవపాడు, ప్రకాశరావుపాలెం, నల్లజర్ల, తెలికచర్ల, సింగరాజుపాలెం గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక సేవా శిభిరంలో భాగంగా ఆరవ రోజు ప్రకాశరావుపాలెంలో అక్షర విజ్ఞానం, అక్షరాస్యత, అనియత విద్య తదితర అంశాలపై ర్యాలీ నిర్వహించి, ఇంటింటా అవగాహన కలిగించారు. కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో లిటరసీ రేటు, వయోజనుల్లో అక్షరాస్యత, మహిళా అక్షరాస్యత […] The post వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో appeared first on Visalaandhra .
గ్రీన్ అంబాసిడర్లచే పచ్చదనం పరిశుభ్రత విశాలాంధ్ర – సీతానగరం: మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల గ్రీన్ అంబాసిడర్లచే ఎంపిడిఓ ఎమ్ భారతి ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీవో కె వి ఎస్ ఎస్ ఎస్ మూర్తి పర్యవేక్షణలో సీతానగరం గ్రామంలో శుక్రవారం పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా అన్ని గ్రామాల సుమారు 70 మంది గ్రీన్ అంబాసిడర్లచే పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమంలో బాగంగా సీతానగరం గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు పరిశుభ్రం చేశారు. అలాగే చెత్త […] The post ఎంపిడిఓ ఎమ్ భారతి ఆధ్వర్యంలో appeared first on Visalaandhra .
నేడు పుట్టపర్తికి భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పుట్టపర్తిని సందర్శించనున్నారు
గ్రీన్ గార్డుల శిక్షణలో ఎంపీడీవో
పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ అంబాసిడర్లు పాత్ర కీలకం-గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డుల శిక్షణలో ఎంపీడీవో ఝాన్సీరాణివిశాలాంధ్ర – రాజానగరం : గ్రాములు పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ అంబాసిడర్లు పాత్ర ఎంతో కీలకమని ఎంపిడివో జె.ఏ. ఝాన్సీ రాణి అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంపిడివో కార్యాలయ ప్రాంగణంలో క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా గ్రీన్ అంబాసిడర్లు మరియు గ్రీన్ గార్డులుకు సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీవో ఝాన్సీరాణి మాట్లాడుతూ గ్రామాలను […] The post గ్రీన్ గార్డుల శిక్షణలో ఎంపీడీవో appeared first on Visalaandhra .
భాగ్యనగరం వెళ్ళే ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ – ఇంద్ర ఏసీ బస్సుపై ప్రత్యేక రాయితీ – తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి యేలూరి సత్యనారాయణ మూర్తి విశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ : సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రవరం నుండిభాగ్యనగరం(హైదరాబాద్) వెళ్ళే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ కల్పించింది. ఇందుకు సంబంధించి పత్రిక ప్రకటనను శుక్రవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి యేలూరి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ […] The post ఆర్టీసీ బంపర్ ఆఫర్ appeared first on Visalaandhra .
Updates from iBomma Ravi Investigation
Ravi Immadi, the organizer of piracy website iBomma has been arrested recently in Hyderabad and he is in the custody of Cyber Crime cops. He was investigated completely for the second consecutive day and the investigation unfolded several facts about how he purchased films and about the transactions he has done. The investigation is done […] The post Updates from iBomma Ravi Investigation appeared first on Telugu360 .
Hrithik Roshan takes a Dig at his own film War 2
Hrithik Roshan has been extra cautious, quite selective in finalizing projects. He has been waiting to score a massive box-office hit and he teamed up for War 2 and the film also featured NTR playing the other lead role. The film failed to live up to the expectations and it was badly rejected by the […] The post Hrithik Roshan takes a Dig at his own film War 2 appeared first on Telugu360 .
క్లీన్ అండ్ గ్రీన్ పై శిక్షణా కార్యక్రమం. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం జేగురుపాడు గ్రామంలో శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని శుభ్రపరచడం ఎలా అనే అంశంపై రూపొందించబడిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్ర, షెడ్డు మిత్ర లు పాల్గొన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్ర వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంటింట చెత్త సేకరణ, గ్రామ శివార్లలో […] The post క్లీన్ అండ్ గ్రీన్ appeared first on Visalaandhra .
అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
— ఎమ్మెల్యే గోరంట్ల. విశాలాంధ్ర – కడియం : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక గ్రామంలో పల్లాలమ్మ గుడి పక్కన ఉన్న సిసి రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి 31 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జేగురుపాడు పంచాయతీ పరిధిలోని […] The post అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం appeared first on Visalaandhra .
పైడి ఐ.టి.ఐ ప్రాంగణంలో జాబ్ మేళా విశాలాంధ్ర – తాళ్లపూడి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొవ్వూరు నియోజకవర్గం లోని శ్రీ పైడి ఐటీఐ ప్రాంగణంలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ నేతృత్వం లో జరిగిన జాబ్ మేళాలో ప్రముఖ పాటిల్ గ్రూవ్, రాజేంద్ర ఎనర్జీ సొల్యూషన్ నందు […] The post జాబ్ మేళా appeared first on Visalaandhra .
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన నల్లజర్ల విద్యార్థులు విశాలాంధ్ర – నల్లజర్ల :ఇటీవల గోపన్నపాలెం వ్యాయామ విద్యా కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి ఖో ఖో పోటీలలో. అండర్ 17 విభాగంలో నల్లజర్ల హై స్కూల్ ప్లస్ విద్యార్థినిలు బేత ఉదయ పోసేశ్వరి మైనం దుర్గ భవానీలు ప్రతిభ కనబరిచి నందున. ఈనెల 23. 24. 25.వ. తేదీలలో విజయనగరంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తరఫున పాల్గొననున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చాగంటి కోమలి […] The post ఖోఖో పోటీలకు appeared first on Visalaandhra .
పరిసరాల పరిశుబ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రతను పాటించాలి విశాలాంధ్ర – నిడదవోలు : పరిసరాలను పరిశుబ్రత ప్రతి ఒక్కరూ బాధ్యత అని మండల అభివృద్ధి అధికారి టివి సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిశుభ్రం,పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఉనకరమిల్లిలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎంపీడీవో టి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను, పారిశుద్ధ్య పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రతగా ఉంచాలన్నారు. నూరుశాతం […] The post పరిసరాల పరిశుబ్రత ప్రతి ఒక్కరి బాధ్యత appeared first on Visalaandhra .
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా గోకవరం గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ శ్రేణులు విశాలాంధ్ర –గోకవరం: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం,రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, విద్యార్థి విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్, తోట శ్రీ రాంజీ అదేశాలు మేరకు […] The post ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా appeared first on Visalaandhra .
కులమతాలకు అతీతంగా జీవించాలి– సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి– బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావువిశాలాంధ్ర – రాజానగరం : మనమంతా భారతీయులమని కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు,బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావుఅన్నారు. రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భవాని సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం రాత్రి జరిగిన లక్ష దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంబాల శ్రీనివాసరావును ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.అలయంలో […] The post కులమతాలకు అతీతంగా కంబాల appeared first on Visalaandhra .
గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపద
విశాలాంధ్ర – దేవరపల్లి : గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపదని విద్యార్థులు గ్రంధాలయాన్ని సద్విని చేసుకోవాలని దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావుగోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డి సువర్ణ రాజు అన్నారు దేవరపల్లి మండలం దేవరపల్లి శాఖ గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు గ్రంథాలను చదువుకొని విద్య ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు గ్రంధాలయాల్లో వివిధ కాంపిటీషన్ పుస్తకాలు […] The post గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపద appeared first on Visalaandhra .
మన తెలంగాణ/హైదరాబాద్:అనర్హత వేటుకు ముందే తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చే సేందుకు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడి యం శ్రీహరి సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాల విశ్వసనీయవర్గాల సమాచారం. బిఆర్ఎస్ నుం చి ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని 10 మంది ఆరోపణలు ఎ దుర్కొంటున్న విషయం తెలిసింది. వీరిలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీక ర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇదివరకే విచారణ జరిపారు. కాగా, మరో ఇద్దరు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి నెల రోజుల క్రితమే తమకు సమాధానం చెప్పేందుకు గడువు కావాల ని కోరారు. ఈ నేఫథ్యంలో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్ను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ ఎంఎల్ఏల విచారణను వేగవంతం చేయడమే కాకుండా తాజాగా మిగతా ఇద్దరు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి తాజాగా మరోసారి నోటీసు పంపించా రు. ఈ నెల 23 వ తేదీలోగా కౌంటర్ దాఖలు చే యాల్సిందిగా స్పీకర్ తన నోటీసులో పేర్కొన్నా రు. ఈ నేపథ్యంలోనే ఎటూ తేల్చుకోలేక డైలమాలో ఉన్న కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిసి తనకు మరి కొంత గ డువు కావాలని కోరారు. నాలుగు వారాల్లో తా ను నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబ ట్టి తాను ఎక్కువగా సమయం ఇవ్వలేనని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయనతో చెప్పినట్లు తెలిసింది. దీంతో కడియం శ్రీహరి ఈ నెల 27న రాజీనా మా చేస్తారన్న ఊహగానాలు నెలకొన్నాయి. కా గా దానం నాగేందర్ ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ను కలిసి గడువు కోరకుండా రాజీనామా చేస్తారన్న ప్రచారంకూడా జరుగుతున్నది. ఇదిలాఉండగా ఫిరాయింపు ఎంఎల్ఏలు దానం నాగేంద ర్, కడియం శ్రీహరి ,దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ నాయకత్వం సీరియస్గా ఆలోచన చేస్తున్నది. వారిరువురితో రాజీనామా చేయించి, తిరిగి పోటీ చేయించి గెలిపించుకుంటే మంచిదన్న భావనతో ఉంది. వారితో రాజీనామా చేయించకపోతే స్పీకర్కు గత్యంతరం లేక వారిపై అనర్హత వేటు వేస్తే, రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం వారు వచ్చే ఆరేళ్ళ వరకూ చట్ట సభలకు పోటీ చేయకుండా అనర్హులవుతారు. కాబట్టి ముందుగానే రాజీనామ చేయించినట్లయితే ఫిరాయింపుల నిరోధక చట్టం వేటు నుంచి తప్పించుకోవచ్చన్న ఆరోచన చేస్తున్నట్లు సమాచారం. రాజీనామాకు దానం సిద్దం& శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంఎల్ఏ దానం నాగేందర్ ఘంటాపథంగా చెబుతున్నారు. తాను సునాయసంగా విజయం సాధిస్తానన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ నేతల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పవచ్చు. జూబ్లీ ఉత్సాహంతోనే ఖైరతాబాద్లో ఘన విజయం సాధించవచ్చన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దానంకు పొంచి ఉన్న ప్రమాదం కాగా దానం నాగేందర్ రాజీనామా చేయకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. బిఆర్ఎస్ నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన దానం ఆరు నెలల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం బహిరంగ రహస్యమే. ఇంత స్పష్టమైన ఆధారం ఉంది కాబట్టి అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని పార్టీ నాయకులూ ఆందోళనలో ఉన్నారు. కడియంపై సందిగ్ధత.. మరోవైపు కడియం శ్రీహరి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే తిరిగి పోటీ చేయించే విషయంలో సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం, ఎంఎల్ఏగా తనకు ఇదే చివరి ఎన్నికలని పలు పర్యాయాలు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కడియం తిరిగి పోటీ చేసినా గెలుపొందుతారా? అనే సందేహాలూ నేతలకు లేకపోలేదు. కడియం శ్రీహరి కుమార్తె లోక్సభ సభ్యురాలిగా ఉన్నందున, ఇంకా ఆయన్ను గెలిపించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కడియం రాజీనామా చేసినట్లయితే స్టేషన్ ఘన్పూర్ స్థానాన్ని చురుకైన నాయకురాలు ఇందిరకు దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి రాజీనామా చేయడమే ఉత్తమేనన్న భావనతో పార్టీ నాయకత్వం ఉంది. కోల్కత్తా హైకోర్టు కీలక తీర్పు.. ఇదిలాఉండగా ఇటీవల కోల్కత్తా హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి తరపున పోటీ చేసి ఎంఎల్ఏగా గెలుపొందిన ముకుల్ రాయ్ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బిజెపి నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ముకుల్ రాయ్ శాసనసభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: మనదేశంలో కార్మిక రంగంలో అతి పెద్ద సంస్కరణలకు కేంద్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాలుగు కార్మిక కోడ్లను అమలులోకి తె చ్చింది. కొత్త గా అమలులోకి తెచ్చిన కోడ్ లు - వేతనాల కోడ్(2019) పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020) సామాజిక భద్రత కోడ్ (2020) వృత్తి పరమైన భద్రత, ఆ రోగ్యం, పని పరిస్థితుల కోడ్ (ఓఎస్ హెచ్ డబ్లుసి) కోడ్ 2020. ఈ కోడ్ ల తో ఇప్పటికే అమలులో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను రదుచేయడమో, హేతుబద్దీకరించడమో జరుగుతుంది. కొత్త కొడ్లు ఓ చారిత్రాత్మక నిర్ణయం అని కేంద్రప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల దశాబ్దాలుగా అమలులో ఉన్న కార్మిక నియమాలను సులభతరం చేస్తుందని, కార్మిక సంక్షేమాన్ని పెంచడంతో పాటు, భద్రతా ప్రమాణాల ను బలోపేతం చేస్తుందని పేర్కొంది. 2025 నవంబర్ 21నుండి అ మలులోకి వచ్చిన ఈ కోడ్ ల వల్ల భారతదేశ కార్మికవ్యవస్థ ప్రపంచంలో అత్యుత్తమ పద్ధతులకు దీటుగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కోడ్ ల లక్ష్యం భవిష్యత్ లో అవసరాలకు అనుగుణమైన రక్షితమైన శ్రామిక శక్తిని కల్పించడమేనని పేర్కొంది. ఈ విప్లవాత్మక మార్పు ఉపాధి కల్పనకు తోడ్పడమే కాక, ఆత్మనిర్భర్ భారత్ అమలుకు సంబంధించిన కార్మిక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తుందని ప్రభుత్వం పేర్కొంది. నాలుగు కొత్త కోడ్ ల అమలు వల్ల కలిగే ప్రయోజనాలు 1. నియామకాలలో పారదర్శకత కోసం, ప్రతి కార్మికుడికీ నియామక పత్రం జారీ తప్పనిసరి. 2. సార్వత్రిక సామాజిక భద్రతా కవరేజ్ కింద గిగ్ , ప్లాట్ ఫామ్ కార్మికులతో సహా అందరికీ, పెన్షన్ ఫండ్, ఈఎస్ ఐ సి, బీమా, ఇతర ప్రయోజనాలు. 3. కార్మికులు అందరికీ కనీస వేతనాలకు చట్టబద్ధమైన హక్కు. 4. కార్మికులలో 40 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా ప్రతిఏటా ఆరోగ్య పరీక్షలు, రోగ నివారణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రోత్సాహకాలు 5. వేతనాలను సకాలంలో చెల్లించడం తప్పని సరి చేయడం.వివక్షణ తొలగింపు 6. మైనింగ్, ప్రమాదకర పరిశ్రమలతో సహా అన్ని రంగాలలో మహిళల భద్రతా చర్యలు వారి అంగీకారంతోనే రాత్రి షిఫ్టులలో పని చేయడానికి అనుమతి. 7. చిన్న పరిశ్రమలు, ప్రమాదకరమైన సంస్థలతో సహా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో ఈఎస్ఐసి కవరేజ్. 8. సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్ తో సహా చాలా భారాలను తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్కరణలు అమలు చేస్తున్నారు. రంగాలవారీగా ఈ నాలుగు కోడ్ లు భారతదేశంలో సమగ్ర కార్మిక రక్షణకు అద్దంపడతాయి. భారతదేశంలో సామాజిక భద్రత పెరగడంతో 2015లో 19 శాతం ఉన్న శ్రామిక శక్తి, 2025లో 64 శాతం కన్నా పెరిగింది. నాలుగు కోడ్ లు ప్రగతిశీల కార్మిక పరమైన సంస్కరణలు - ప్రధాని స్వాతంత్రం తర్వాత అత్యంత ప్రగతిశీల సంస్కరణలకు ఈ నాలుగు కార్మిక కోడ్ లు సంకేతాలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కార్మికుల సాధికారత కల్పనలో ఇవి తోడ్పడతాయని ఆయన అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని ప్రోత్సహింస్తుందని ఎక్స్ వేదికగా శుక్రవారం నాడు ప్రధాని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల మరిన్ని ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఉత్పాదకత పెరిగి, వికసిత భారత్ వైపు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని కెటిఆర్ ఆరోపించారు.తెలంగాణ భవన్లో శుక్రవా రం బిఆర్ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 9,292 ఎకరాలు అంటే సు మారు 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసుందుకు రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తోందని ఘా టు విమర్శలు చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ము ఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోందని ఆరోపించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్య క్తులకు అప్పజెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియ ల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి) పేరిట ముఖ్యమంత్రి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం అనిపేర్కొన్నారు. క్యాబినెట్ మీటింగ్లోనే ప్రభుత్వం ఈ భారీ స్కామ్కు తెరలేపిందని అన్నారు. ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని పెద్ద పెద్ద గద్దలకు దారాదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. సిఎం రేవంత్ రెడ్డి ట్రాప్లో పారిశ్రామికవేత్తలు పడొద్దని సూచించారు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పెటిఎంగా మార్చుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని, ఇప్పుడు పరిశ్రమల భూములపై దృష్టి సారించారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారని.. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ఐఎల్టిపి వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ విలువైన రియల్ ఎస్టేట్గా మార్చడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇది కేవలం పాలసీ కాదు అని, రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని ఆరోపించారు. ప్రభుత్వ ధర కంటే మార్కెట్ ధర నాలుగైదు రెట్లు ఎక్కువ పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో, రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారని కెటిఆర్ అన్నారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, అజామాబాద్తో సహా హైదరాబాద్లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఆ భూములను రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో 30 శాతానికే అప్పగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ప్రభుత్వ ధర కంటే 100 నుండి 200 అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామన్నారు. మార్కెట్ ధరలు, ఎస్ఆర్ఓ విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, కేవలం 30 శాతానికి మాత్రమే తీసుకుంటున్నారని మండిపడ్డారు. మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆరోపించారు. మేము ఆ ప్రతిపాదనలను తిరస్కరించాం ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి చారిత్రకంగా పారిశ్రామిక భూములను చాలా తక్కువ ధరలకు లేదా ఉచితంగా కేటాయించారని కెటిఆర్ చెప్పారు.ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక భూమిని ఇచ్చాయని, కానీ ఇప్పుడు, అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం తనను సంప్రదించారని, అయితే తాము ఆ ప్రతిపాదనలను తిరస్కరించామని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ప్రయోజనం కోసం చౌకగా ఇవ్వలేము అని చెప్పామని అన్నారు. కానీ,ఇప్పుడు రేవంత్ ఆ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ పాలసీలో 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయమని చెప్పడంపై కెటిఆర్ అనుమానం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందర..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు మరియు మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్ కుదిరాయని తెలిపారు. ప్రజల భూమిని చౌక ధరలకు అప్పగిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్లు, స్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్లో, ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లేదా స్మశాన వాటికలకు కూడా భూమి దొరకని నగరంలో, రేవంత్ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని లేదా ముంబై మాదిరిగా బహిరంగ వేలం వేయాలని అన్నారు. దానికి బదులుగా, వారు రూ. 5 లక్షల కోట్లు దోచుకోవాలని, కనీసం రూ. 50,000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జేబులో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఈ లావాదేవీలు నిలబడవు అని, ఆ భూమిని తిరిగి తీసుకుంటామని చెప్పారు. బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దు చేసి, పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని అన్నారు. ఈ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పందించాలని కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దీనిని వ్యతిరేకించాలి. మౌనంగా ఉంటే, కాంగ్రెస్, బీజేపీ కలసిపోయాయని అర్థం, అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది అభివృద్ధి కాదు, ఇది పగటిపూట దోపిడీ అన్నారు. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు ఫార్ములా ఈ రేసు కేసులో సిఎం రేవంత్రెడ్డి తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చేసుకుపోనివ్వండని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసింగ్లో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహరంపై లై డిటెక్టర్ టెస్ట్కు కూడా తాను సిద్ధమే అని మరోసారి తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏమీ లేదని రేవంత్రెడ్డికి కూడా తెలుసు అని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పరువు పోతుందని, ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ రాజీనామా డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. దానం నాగేందర్తో రాజీనామా చేపించి.. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దానం దొరికిపోయారని చెప్పారు. సాకేంతిక సాకులు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలొస్తాయని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక భూ ముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలు చే యాలని నిర్ణయిస్తే దానిని 5-లక్షల కోట్ల కోణంగా చిత్రీకరిస్తూ కేటీఆర్ దుష్ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం పరిశ్రమల కు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కు లు కల్పిస్తూ ‘ఫ్రీహోల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టు లో మూడు జిఓలు ఇచ్చింది వారి ప్రభుత్వ హ యాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టారు. కేటీఆర్ చెబుతున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4740 ఎకరాలే అని, మిగిలిన భూమి రోడ్లు, డ్రెనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరిగిందన్నారు. ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదని, పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవని, ఆజమాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించినది బిఆరెఎస్ ప్రభుత్వమే అని వెల్లడించారు. కూకట్ పల్లి, ఆజమాబాద్, హఫీజ్ పేట భూములకు సంబంధించి పరిశ్రమల శాఖ జిఓ ఎంస్ 19, 20, 21 లను 2023 ఆగస్టు 29 న జారీ చేసిందని, ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. 30, 50 శాతం శ్లాబ్ లతో ఇంపాక్ట్ ఫీజు నిర్ణయిస్తూ ఈనెల 17 న జరిగిన కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఫ్రీహోల్ హక్కులు కల్పించారని, అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలన్నారు. ఆ జిఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు : జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయని, ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు కుంభకోణమో, స్కామో జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలని, పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జిఓలు ఇచ్చారన్నారు. ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలని, వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే తాము కల్పించామన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30 శాతం, 50 శాతం శ్లాబ్లను ప్రతిపాదించారని వివరించారు. అభూత కల్పనలు ప్రచారం చేస్తారా : సిఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారని, వారెవరూ ప్రభుత్వంలో లేరని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గం అని, ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందని, ఇప్పటికైనా ఆయన ఆలోచనల్లో మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు. కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నామన్నారు. యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకోలేరని, ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు గండికొట్టాలని చూడటమే బిఆరెస్ ప్రధాన కార్యక్రమంగా మారిందని విమర్శించారు. బెదిరింపు ధోరణులు మానుకోవాలి : హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నామని మంత్రి శ్రీధర్బాబు పునరుద్ఘాటించారు. ప్రతిపక్షంగా సహకరించక పోయినా ఫర్వాలేదని, అబద్ధాలతో ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని, బెదిరింపు ధోరణులు మానుకోవాలని హితవు పలికారు. ఓఆర్ ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని, మొదటి నుంచి చెబుతున్నామని, గాలి, నీరు కాలుష్యం లేకుండా చేయడానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించడం చూస్తున్నామన్నారు. విద్యుత్తు, పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నారని, పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టం ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రోజు రోజుకీ కోడిగుడ్డు సామాన్యుడికి అందకుండా పోతోంది. రి టైల్ మార్కెట్లో కోడి గుడ్డు ధర కూరగాయలతో పోటీపడుతోంది. ఇదివరకు కోడి గుడ్డు ధర తక్కు వ ఉండి, కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో కోడి గుడ్లను వినియోగించుకునేందుకు ఆ సక్తి చూపించే వినియోగదారులు ఇప్పుడు కోడి గు డ్డు ప్రస్తుత ధర రూ.8 పైబడే అమ్ముతుండడంతో కొనలేక గుడ్లు తేలేస్తున్నారు. ఇలా కోడిగుడ్లు, కూ రగాయల ధరలు చుక్కలనంటుతుంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హోల్సేల్ మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర రూ. 670 నుంచి రూ.700 వరకు అమ్ముతుంటే, అదే రిటైల్ మార్కెట్లో ఆయా స్థానిక పరిస్థితులను బట్టి వంద కోడి గుడ్లు రూ-.800కి పైగానే అమ్ముతున్నారు. వారం పది రోజుల కిందట రూ.6 ఉన్న కోడి గుడ్డు రిటైల్ ధర శుక్రవారానికి రూ.8కి చేరింది. ఈ ధర ఇంకా పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కోడి గుడ్ల ఉత్పత్తి, వినియోగంలోనూ దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో ఈ పరిస్థితి ఉంటే ఉత్పత్తి చాలా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో రిటైల్ ధర పరిస్థితి ఇంకెలా ఉంటుందని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఉత్పత్తి ఎక్కువ, వినియోగంలోనూ ఎక్కువ ఉండి దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. సహజంగానే ధరతో సంబంధం లేకుండా కోడి గుడ్ల వినియోగం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ అవసరాలైన వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా పెద్ద ఎత్తున జరుగుతుంది. వినియోగదారుల అవసరాలు భారీగా ఉండడంతో డిమాండ్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. దీంతో అటు ఉత్పత్తి తగ్గినా, డిమాండ్ ఒక్కసారి పెరిగినా కోడి గుడ్ల ధరలపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు కూడా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి కోడి గుడ్డు ధర చేరింది. దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉందని ఫౌల్ట్రీ వర్గాల సమాచారం. ఏపి తర్వాత తెలంగాణ కోడిగుడ్ల లభ్యత, వినియోగంలో రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో కోళ్ల పరిశ్రమ ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కామారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. కామారెడ్డిలో అతిపెద్ద పౌల్ట్రీ ఫామ్లు ఉండగా, హైదరాబాద్లో అనేక ఫామ్లు, హేచరీలు, ఫీడ్ మిల్లులు ఉన్నాయి. కోడి గుడ్లకు డిమాండ్ పెరగడం వెనుక కారణం ఇదీ.. మార్కెట్ వర్గాల అంచనా మేరకు కోడిగుడ్ల ధరలు వారం పది రోజుల్లో పెరగడానికి కారణం రెండు రకాలుగా చెబుతున్నారు. కోళ్లు పలు విధాలుగా చనిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే, ఉత్తరాది రాష్ట్రాలకు కోడి గుడ్ల ఎగుమతులు పెరగడం వల్ల డిమాండ్ అనూహ్యంగా పెరగడం మరో కారణంగా విశ్లేషిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణలో కోళ్ల ఫామ్లలో వ్యాధుల కారణంగా అధిక సంఖ్యలో కోళ్లు మరణించడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని చెబుతున్నారు. గుడ్డు పౌష్టికాహారమని, రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుండడంతో వీటి వినియోగం క్రమేణా పెరుగుతూ వచ్చింది. కోడిగుడ్డును తమ రోజువారీ ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే రోజుకు కోటి కోడి గుడ్లకు పైగా ఆహారంలో భాగంగా స్వీకరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రోజుకు వినియోగించే గుడ్ల సంఖ్య మూడు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా. అయితే వర్తక వర్గాల సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా రోజుకు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 6 కోట్లకు పైగానే కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఉత్పత్తి అంచనాలు ప్రతి రోజు స్థిరంగా ఉండకపోయినప్పటికీ కొంచెం ఎక్కువ, తక్కువ ఉన్నా ఇదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచే కోడి గుడ్లు ఉత్పత్తి ఎక్కువ అవుతుండగా, వాటి వినియోగంలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడం వల్ల కోడి గుడ్ల ధరలు పతాక స్థాయికి చేరుతున్నాయని చెబుతున్నారు. కోడిగుడ్లు ఇప్పుడు డజన్ ధర రూ.70 నుంచి 80 మధ్య అమ్ముతుంటే రానున్న నెల రోజుల్లో డజన్ గుడ్లు వందకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కోడిగుడ్లతో సరిపెట్టుకునే మధ్య తరగతి కుటుంబాలకు ఇలా కోడిగుడ్ల ధరలు రోజు రోజుకీ పెరగడం మరింత భారంగా వాపోతున్నారు. కార్తీక మాసం ముగియడంతో కోడిగుడ్ల వినియోగం కూడా పెరగడంతో ధరలు పెరిగేందుకు దోహదపడిందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో వినియోగం ఎక్కువ కోడి గుడ్లను వినియోగించే వారిలో ఏపి, తెలంగాణ తర్వాత మిజోరాం, అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిగుడ్డు వినియోగం, లభ్యతలో దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని కేంద్ర పశు సంవతర్ధక మంత్రిత్వ శాఖ 2022 సర్వే-లో తెలిపింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్లో తలసరి గుడ్ల లభ్యత చాలా ఎక్కువగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి గుడ్ల తలసరి లభ్యత 501గా ఉందని సర్వే వివరాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం గుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. కాగా తెలంగాణలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. తెలంగాణలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా దేశ వ్యాప్తంగా తలసరి గుడ్ల లభ్యత 95గా ఉంది. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్నాటక రాష్ట్రాల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే పేర్కొంది. ఉత్పత్తిలో ఎక్కువ భాగంగా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలకు పంపించడం వల్ల స్థానిక వినియోగానికి తక్కువ అవుతున్నాయి. దీంతో ధరల పెరుగుదలకు దోహదపడుతుందని చెబుతున్నారు.
` విజయవాడలో 15 మంది నిరాయుధుల్ని పట్టుకెళ్లి చంపారు ` 23న దేశవ్యాప్తంగా నిరసన తెలపండి ` మావోయిస్టు పార్టీ పిలుపు ` అధికార ప్రతినిధి అభయ్ …
హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము
బేగంపేట(జనంసాక్షి): భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర …
రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం
` నేడు జీవో విడుదల చేయనున్న పంచాయతీ రాజ్ శాఖ హైదరాబాద్(జనంసాక్షి): గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం …
` అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలు ` అబద్దాల ప్రచారంలో కేటీఆర్ దిట్ట ` గతంలో లాగా అడ్డగోలు నిర్ణయాలకు మేం దూరం ` ఉపాధి, ఉద్యోగాల …
` మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ ` 4 లక్షల కోట్ల విలువచేసే భూమికి రెక్కలు ` భూములపై వాలిపోతున్న రేవంత్ ముఠా ` నన్ను అరెస్ట్ …
శనివారం రాశి ఫలాలు (22-11-2025)
మేషం దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృషభం వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిధునం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్యాలను కొంత బాధిస్తాయి. సింహం మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కన్య మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. తుల ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృశ్చికం వృత్తి వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్రా భరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ధనస్సు ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తవుతాయి. మకరం బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభం ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిని. స్వల్ప అనారోగ్య సమస్యను ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. మీనం సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి.
బ్రెజిల్ లోని బెలెమ్లో నిర్వహిస్తున్న కాప్ 30 సదస్సులో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది గాయాల పాలయ్యారు. మైక్రోవేవ్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. గురువారం బ్లూజోన్లో మంటలు చెలరేగడంతో వేలాది మంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు లోకీ తీసుకురాగలిగారు. ప్రమాద సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఇక్కడే ఉన్నారు. భద్రతా రక్షణ అధికారులు వెంటనే వారిని బయటకు తరలించారు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారతఎ జట్టు పోరాటం సెమీ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీస్ సమరంలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ సూపర్ ఓవర్లో భారత్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ హబిబుర్ రహ్మాన్ ఐదు సిక్సర్లు, 3 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జీషాన్ ఆలం 14 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు. చివర్లో ఎస్ఎమ్ మాహ్బ్ 18 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఒక ఫోర్తో అజేయంగా 48 పరుగులు చేశాడు. యాసిర్ అలీ 17 (నాటౌట్) కూడా చెలరేగడం బంగ్లా భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా ఎ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా అయ్యింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే 38, ప్రియాన్ష్ ఆర్య 23 బంతుల్లో (44) పరుగులు చేసి శుభారంభం అందించారు. జితేశ్ శఱ్మ (33), నెహాల్ వధెరా 32 (నాటౌట్)లు కూడా రాణించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్లో ఫలితాన్ని తేల్చారు. తొలి బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే ఆలౌటైంది. తర్వాత బంగ్లా టీమ్ ఒక పరుగు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది.
I was in Lord Shiva trance during Akhanda 2 – NBK
God of Masses Nandamuri Balakrishna is on a success streak with four back to back blockbusters. Akhanda, directed by Boyapati Srinu began the streak and now, the formidable combination is back with sequel, Akhanda 2. The movie is aiming for Pan-India box office sensation with world class technical and production values. Makers have conducted a […] The post I was in Lord Shiva trance during Akhanda 2 – NBK appeared first on Telugu360 .
. నాలుగు లేబర్కోడ్ల అమలు. ఇకపై పాత 29 కార్మిక చట్టాలుండవు. కార్పొరేట్ యాజమాన్యాలు చెప్పిందే వేదం. కార్మిక సంస్కరణల పేరుతో హక్కుల కోత. కేంద్ర కార్మిక సంఘాల ఆగ్రహం న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదునుచూసి దెబ్బకొట్టింది. ప్రతి కార్మికుడికి గౌరవాన్ని కల్పించాలన్న పేరుతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం నుండి దేశంలో నాలుగు కార్మిక స్మృతులను (లేబర్ కోడ్లను) అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 […] The post కార్మికులపై చావుదెబ్బ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : పదోతరగతి పరీక్షల మార్చి2026 షెడ్యూల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్సీ బోర్టు అధికారులు శుక్రవారం షెడ్యూలు విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 16న ఫస్టు లాంగ్వేజ్ పరీక్ష (గ్రూప్`ఏ), 18న ద్వితీయ లాంగ్వేజ్, 20న ఇంగ్లీషు, 23న మ్యాథ్స్, 25న […] The post మార్చి 16 నుంచి పది పరీక్షలు appeared first on Visalaandhra .
పాకిస్థాన్లో బాయిలర్ పేలి 15 మంది మృతి
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్లో ఓ గ్లూ (గమ్) తయారు చేసే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రమాదం తరువాత ఫ్యాక్టరీ యజమాని పరారయ్యాడు. మేనేజర్ను స్థానిక పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనంతోపాటు చుట్టుపక్కల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పంజాబ్ సిఎం మరయం నవాజ్ షరీఫ్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే ఫైసలాబాద్లో బాయిలర్ పేలి 12 మంది మరణించారు. వారం రోజుల క్రితం కరాచీ లోని ఓ బాణాసంచా తయారీ కేంద్రం లోనూ పేలుడు సంభవించి నలుగురు చనిపోయారు.
Vivekanda Murder case : సీఐ నీరుగార్చాడు
Vivekanda Murder case : సీఐ నీరుగార్చాడు ( కడప , ఆంధ్రప్రభ
అప్పుల బాధతో కూరగాయలు వ్యాపారం చేసే భార్యా భర్తలు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట మార్గదర్శి కాలనీ రోడ్డు నెంబర్ 4లో గడ్డమిది మల్లేష్ (45), సంతోషి (37) భార్యాభర్తలు నివాసం ఉంటూ కూరగాయలు వ్యాపారం చేస్తుంటారు. ఇద్దరు తెల్లవారు జామున 5.30 గంటలకే ప్రతి రోజు వాకింగ్ వెళుతుంటారు. శుక్రవారం ఉదయం వారి కూతుళ్లు మేఘన, మౌనికలు నిద్రపోతుండగా 5ః30 నిమిషాలకే వాకింగ్ బయల్దేరారు. రోజు వచ్చే వారు ఇంత వరకు రాలేదని కూమారుడు 7.45 నిమిషాలకు తండ్రి మల్లేష్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కూమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసి స్పందన లేకపోవడంతో కూమారుడు చైతన్యపురి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతుకుతున్న క్రమంలో నాగోల్ ఠాణా పరిధిలో తట్టిన్నారం ప్రాంతంలో ఓ జంట విషం సేవించారని తెలిసింది. విషం సేవించిన సంతోషి అక్కడిక్కడే మృతి చెందంగా , పోలీసులు విషమంగా ఉన్న మల్లేష్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేష్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
. ప్రతి మూడు నెలలకు సామూహిక గృహప్రవేశాలు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు. సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర […] The post మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు appeared first on Visalaandhra .
. నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. 70 శాతం పడకలు, వైద్యసేవలు ఉచితం. వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకూ ఆధునిక వైద్యం. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు వివరణ. ఏప్రిల్1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపడుతున్నప్పటికీ అది నిర్మాణం వరకేనని, పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వమే చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన […] The post నిర్మాణానికే పీపీపీ appeared first on Visalaandhra .
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
రాంగ్ రూట్లో వచ్చిన కారు నేరుగా వచ్చిన కారును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాండూరుకు చెందిన వంశీధర్రెడ్డి, అతని అత్త సుజాత, బంధువు రోజా, డ్రైవర్ వెంకట్తో కలిసి కారులో ఉదయం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 7 :30 గంటల సమయంలో మొయినాబాద్లోని పెంటయ్య హోటల్ దగ్గర రాగానే హైదరాబాద్ నుండి చేవెళ్ల వైపు ఓ కారు రాంగ్ రూట్లో వేగంగా వచ్చి వంశీధర్రెడ్డి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంగ్రూట్లో వచ్చిన కారు డ్రైవర్ కరీంకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారులో ఉన్న లోకేష్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ అనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో బాబురావు, అఖిల్కు స్వల్ప గాయాలయ్యాయి. వంశీధర్ రెడ్డి, అతని అత్త సుజాత, బంధువు రోజా, డ్రైవర్ వెంకట్ కూడా గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వంశీధర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
. వివాదం నుంచి విజయం వరకు. కిరీటం దక్కించుకున్న ఫాతిమా బాష్ బ్యాంకాక్: విశ్వ సుందరి`2025గా మెక్సికో భామ కిరీటం దక్కించుకున్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ను ఫాతిమా బాష్ గెలుచుకున్నారు. థాయిలాండ్లోని నంతాబురి ప్రావిన్స్లో అందాల పోటీల చివరి అంకం వైభవంగా సాగింది. ఫాతిమాకు కిరీటాన్ని మాజీ మిస్ యూనివర్స్ డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ అందజేశారు. 120 మందికి పైగా భామలు ఈ పోటీల్లో పాల్గొనగా.. 25 ఏళ్ల ఫాతిమా విజేతగా నిలిచారు. ఫస్ట్ […] The post విశ్వ సుందరి మెక్సికో భామ appeared first on Visalaandhra .
రానున్న ఐపిఎల్ సీజన్ 2026 కోసం ఆటగాళ్ల మినీ వేలం పాటను నవంబర్ 27న నిర్వహించనున్నారు. రాజధాని ఢిల్లీ వేదికగా ఈ వేలం పాట జరుగనుంది. వేలం పాటలో పాల్గొనే ఆటగాళ్ల తుది వివరాలను భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈసారి జరిగే వేలం పాటలో 277 మంది క్రికెటర్లు బరిలోకి నిలువనున్నారు. ఇందులో 194 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 52 మంది కాప్డ్ ప్లేయర్లు, మరో 142 మంది అన్ కాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అంతేగాక 66 మంది కాప్డ్ విదేశీ క్రికెటర్లు కూడా వేలం పాటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరో 17 మంది అన్ కాప్డ్ విదేశీ ఆటగాళ్లు కూడా బరిలో నిలువనున్నారు. కాగా, ఐపిఎల్లోని ఫ్రాంచైజీలు కలిపి మినీ వేలం పాటలో 73 మంది క్రికెటర్లను కొనుగోలు చేయనున్నాయి.
Dil Raju’s Big Bet on Akhanda2
Akhanda 2 is the next big film in Telugu cinema and this pan-Indian attempt releases on December 5th across the globe. The makers have been quoting big numbers for the theatrical rights and all the deals for the film are closed except for Nizam. Popular producer and distributor Dil Raju has bagged the Nizam theatrical […] The post Dil Raju’s Big Bet on Akhanda2 appeared first on Telugu360 .
Cartoon 22 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
Cartoon 22 Nov 2025 | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
స్టైలిష్గా వింటేజ్ లుక్లో ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్‘ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‘ ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్గా, వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘రాజా సాబ్‘ సినిమా వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ‘రాజా సాబ్‘ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Breaking |సీఐ శంకరయ్య డిస్మిస్..
Breaking | సీఐ శంకరయ్య డిస్మిస్.. వివేకానంద హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి
Breaking news |సీఐ శంకర్ డిస్మిస్..
Breaking news | సీఐ శంకర్ డిస్మిస్.. వివేకానంద హత్యకేసులో తొలి ఐఓ
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు శ్రీముఖి, నిధి అగర్వాల్
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే విచారించారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు వీరిద్దరితో పాటు అమృత చౌదరీని కూడా సిఐడి అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్తో లావాదేవీలపై వీరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, విష్ణుప్రియలను కూడా సిఐడి సిట్ విచారించింది. సిట్ అధికారుల సూచనల మేరకు బ్యాంకు స్టేట్మెంట్లను రానా సమర్పించారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు? తీసుకున్న పారితోషికం ఎంత? బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది? ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకున్న వివరాలపై సీఐడీ ఆరా తీసింది.
NBK’s Akhanda 2 Trailer: Power of Indian Dharma to World
God of Masses Nandamuri Balakrishna and highly regarded director Boyapati Srinu have formed a formidable combination with blockbuster after blockbuster. Now, they are back with the sequel to Akhanda, and the movie takes the stakes higher than ever with Akhanda 2. 14 Reels Plus have produced this massive visual action epic on a scale never-seen-before. […] The post NBK’s Akhanda 2 Trailer: Power of Indian Dharma to World appeared first on Telugu360 .
SHABARISH |మహబూబాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీ
SHABARISH | మహబూబాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీ నియమితులైన డాక్టర్ పి. శబరిష్
ABUL KALLAM |మౌలానా.. మాఫ్ కరో..!
ABUL KALLAM | మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా
కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఫార్ములా- ఈ రేసు కేసులో కెటిఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన అన్నారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. కెటిఆర్పై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, కూట్రపూరితంగానే ఫార్ములా-ఈరేసు కేసులో ఇరికిస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చారని, ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులతో పాటు 108కి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్ఐ నాగరాజు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. ఈ బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలో దిగారు.
BELLAMPALLI |బెల్లంపల్లిలో గంజాయి కలకలం
1030 గ్రాముల గంజాయి స్వాధీనంవివరాలు వెల్లడించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాస్
క్రేన్ కూలి ఉపాధ్యాయురాలు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజనగరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..పాఠశాల ఆవరణలో కళావేదిక నిర్మాణం జరుగుతోంది.కళావేదిక కు శ్లాబ్ వేసేందుకు క్రేన్ సహాయంతో సామాగ్రిని తరలిస్తుండగా క్రేన్ కూలి ఇంగ్లీష్ టీచర్ జోష్నా భాయ్(45) పై సామాగ్రి పడింది. ఈ ఘటనలో టీచర్ కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చనిపోయారు.పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Tears Farewell : ఎర్రజెండా కన్నీరు
Tears Farewell : ఎర్రజెండా కన్నీరు ఆంధ్రప్రభ, పలాస (శ్రీకాకుళం) : ఆంధ్రా
హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్లోనే వధువుకు తాళి కట్టిన వరుడు#accidente #hospitalmarriage #viralvideo
సెమీ ఫైనల్లో సూపర్ ఓవర్.. భారత్ ఓటమి
దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్లో భారత్ ఎ జట్టు సెమీ ఫైనల్లో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ ఎ జట్టుతో జరిగిన ఈ పోరులో సూపర్ ఓవర్లో ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్లో భారత్ ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ నిర్ణీత 20 ఓశర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో హబీబుర్ రెహమాన్ సోహన్ 65, మెహరబ్ 48 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ను గెలిపించేందుకు అందరూ ఆటగాళ్లు సమిష్టిగా కృషి చేశారు. ప్రియాంశ్ ఆర్య 44, వైభవ్ సూర్యవంశీ 38, జితేశ్ శర్మ 33, నేహల్ వదేరా 32 పరుగులతో రాణించారు. కానీ, భారత్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. సూపర్ ఓవర్లో బంగ్లా బౌలర్ రిపొన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారత్ తరఫున సుయాష్ శర్మ కూడా తొలి బంతికి వికెట్ తీశాడు. కానీ, రెండో బంతి వైడ్గా వేయడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎ, బంగ్లాదేశ్ ఎ మధ్య జరిగే మరో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో బంగ్లాదేశ్ నవంబర్ 23న జరిగే ఫైనల్లో తలపడనుంది.
కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న
పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. బిఆర్ఎస్తో సహా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులతో కలిసి నేతలు రోడ్డుపై రొట్టెలు తిని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులను పూర్తిస్థాయిలో మోహరించిన ధర్నా కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేశారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చి నిరసనలో,భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ..సిసిఐ నిబంధనలు, తొలగించాలని, క్వింటాళ్ల పత్తి పరిమితిని తీసివేయాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ తో పాటు సిసిఐ నిబంధనల కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నప్పటికీ స్థానిక ఎంఎల్ఎ, ఎంపి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది లేదని మాయమాటలు చెప్పిన స్థానిక ఎంఎల్ఎ రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో, సిఎం రేవంత్తో కలిసి ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని, రైతులతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, న్యూడెమోక్రసీ రాష్ట్రనాయకుడు టి. శ్రీనివాస్, సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నంది రామయ్య, అఖిలపక్ష రైతు నాయకులు బండి దత్తాత్రి, విజ్జగిరి నారాయణ, కొండ రమేష్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి, చిలుక దేవిదాస్, కేమ లక్ష్మణ్, జగన్, వెంకట నారాయణ. అలాల్ అజేయ్, యూనిస్ అక్బనీ, సాజిత్ ఉద్దీన్, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సరదాగా చేసిన పాట సూపర్ హిట్ ధనుష్#Dhanush #Kolaveri #CinemaNews #ViralSong #DubaiEvent
భూ భారతి.. భూ హారతిగా మారిందా..?: హరీష్రావు
ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు... రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూమి సమస్యలు పరిష్కరిస్తామని అన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న ఘటనలపై హరీష్రావు ప్రకటన విడుదల చేశారు. ‘ధరణి’పై అడ్డగోలుగా మాట్లాడి గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది..? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూ మేత’ అయ్యిందా... భూ భారతి.. భూ హారతిగా మారిందా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, మీరు తెచ్చిన రెవెన్యూ చెత్త సంస్కరణలు పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నదని విమర్శించారు. భూముల రికార్డులు సరిచేస్తాం, రైతుల హక్కులు కాపాడతామని చెప్పి రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదు..కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసులుబాటు కల్పించడం లేదని అడిగారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని, ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అని పేర్కొన్నారు. ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి... ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంట బోనస్ ఇవ్వక పోవడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని అన్నారు.రిజిస్ట్రేషన్ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు..రైతుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు...? అని అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని హరీష్రావు డిమాండ్ చేశారు.
భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన
భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్లో గెలిచిన సఫారీ జట్టు శనివారం జరిగే రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ల కోసం సౌతాఫ్రికా రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. వన్డే జట్టుకు కెప్టెన్గా టెంబా బవుమా, టి-20 జట్టుకు కెప్టెన్గా ఎయిడెన్ మార్క్రమ్ వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టి-20 జట్టులో ఎంపికయ్యాడు. తాజాగా పాకిస్థాన్పై ఆరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే రాంచీ వేదికగా జరగగా.. డిసెంబర్ 3, 6 తేదీల్లో రాయ్పూర్, విశాఖ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఐదు టి-20ల సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. భారత్తో జరిగే వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్ సుబ్రాయన్. భారత్తో జరిగే టి-20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్.

25 C