SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum

The formal recognition of Amaravati as the capital of Andhra Pradesh by Parliament has marked a decisive moment in the state’s political journey. Following this development, TDP national general secretary and minister Nara Lokesh expressed gratitude to leaders in Delhi who supported the cause. His visit to the national capital was not symbolic. It reflected […] The post Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 3:30 pm

నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు…

నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు… విజయవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:29 pm

ఏడీఈకి వినతి పత్రం అందజేత……

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:29 pm

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

కడెం, ఆంధ్రప్రభ ; బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:24 pm

సాయంత్రం 7 తర్వాత నో ఎంట్రీ

సాయంత్రం 7 తర్వాత నో ఎంట్రీ సలేశ్వరం జాతరకు కఠిన నిబంధనలు —

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:24 pm

గ్రామ సభలో భాగస్వాములైన జుక్కల్ మండల గ్రామస్తులు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:20 pm

రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. చర్చ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. సభ్యులు ఈ సమయంలో బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. […] The post రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 3:16 pm

మూసీ ప్రాజెక్టుపై ఎన్‌జిటిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరట..

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుపై ఎన్‌జిటిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎన్‌జిటి నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే పర్యావరణంపై ప్రభావం చూపే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని బిఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం దీనిపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించినట్లు తెలుస్తోంది. రెండు వైపుల వాదనలు విన్న ట్రిబ్యునల్.. కార్తీక్ రెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌జిటి నుండి మార్గం సుగమమైనట్లే అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

మన తెలంగాణ 2 Apr 2026 3:06 pm

Biker Racing Stunts shot in Indonesia

The promotional content of Sharwanand’s upcoming film Biker and the film is made on a big-budget. The quality of the content is seen in the trailer and there are big expectations on the film. UV Creations have spent a bomb on the film and Biker was under making for two years. Sharwanand’s transformation is appreciated […] The post Biker Racing Stunts shot in Indonesia appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 3:02 pm

TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలి: అమిత్ షా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లో తర్వలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గురువారం అధికార పార్టీ టిఎంసిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలంటూ పిలుపునిచ్చారు. భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా సువేందు అధికారి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సువేందు అధికారితో కలిసి నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు ప్రతిరోజూ బాంబు దాడులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. ఎన్నికల తర్వాత బెంగాల్‌లో మార్పు రాబోతోందని అన్నారు. భవానిపూర్‌లో కూడా మీకు మార్పు కావాలా, వద్దా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. తమ అభ్యర్థి సువేందు అధికారికి ఓట్లు వేసి గెలిపించాలని.. అప్పుడే భవానిపూర్‌లో కూడా మార్పు వస్తుందని ఆయన అన్నారు. TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయడానికి ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని షా పిలుపునిచ్చారు. ఈసారి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఏ గూండా కూడా అడ్డుకోలేడని అన్నారు. కాగా, సువేందు అధికారి..మరోసారి సిఎం మమతపై పోటీ చేయబోతున్నారు. గత 2021ఎన్నికల్లో దీదీ.. సువేందు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 2 Apr 2026 2:49 pm

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:49 pm

హనుమజ్జయంతి రోజున అద్భుత సన్నివేశం.. చిరు డివోషనల్ పోస్ట్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఆంజనేయ స్వామిపై అపారమైన భక్తి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా చిరు ఓ ప్రత్యేకమైన వీడియోని అందరితో పంచుకున్నారు. తన పూజా మందిరంలోని హనుమాన్ విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకిన అద్భుత సన్నివేశాన్ని ఆయన సోషల్‌‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి తమ పూజా మందిరంలో ఉన్న హనుమంతుడి పైనుంచి కింది వరకూ స్పృశిస్తూ ప్రసరిస్తాయని అన్నారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశామన్న చిరు.. కోణార్క్, అరసవెల్లిలో సూర్య కిరణాలు ఆయన విగ్రహాన్నే తాకడం మనందరికీ తెలిసిందే అని అన్నారు. అలాంటి దైవానుభూతి.. మా ఇంట్లో ఆంజనేయుడిని స్పృశించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అనిభావోద్వేగానికి గురయ్యారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్ జై హనుమాన్ #HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL — Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026

మన తెలంగాణ 2 Apr 2026 2:48 pm

Ys Jagan : జగన్ కొత్త నినాదం ప్లస్ లేదా మైనస్?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త నినాదాన్ని కోస్తాంధ్ర ప్రజలు ఎంత వరకూ విశ్వసిస్తారన్నది ప్రశ్న

తెలుగు పోస్ట్ 2 Apr 2026 2:47 pm

మానవీయత చాటుకున్న కలెక్టర్

మానవీయత చాటుకున్న కలెక్టర్ గణపురం, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షల వేళ

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:43 pm

అమరావతికి రైతుల త్యాగం ఎప్పటికి మరువలేనిది: కె. లక్ష్మణ్

ఢిల్లీ: ఓ గొప్ప రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని బిజెపి ఎంపి కె. లక్ష్మణ్ తెలిపారు. వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఎపికి మోడీ కృషి చేస్తున్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభలో కె. లక్ష్మణ్ మాట్లాడారు. అమరావతికి రైతుల త్యాగం ఎప్పటికి మరువలేనిదని, అమరావతి కోసం సుదీర్ఘమైన పోరాటం చేసిన రైతులకు తన నమస్కారం తెలియజేశారు. రాజధాని కోసం పోరాడిన మహిళలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, భవ్య రాజధాని నిర్మాణం కోసం 29 వేల మందికి పైగా రైతులు భూములు ఇచ్చారని అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. తెలుగుజాతి చరిత్ర అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కె. లక్ష్మణ్ సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారని,58 రోజుల తర్వాత ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఎపి, తెలంగాణను కొంతమంది ప్రముఖులు విలీనం చేశారని, తెలంగాణకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వాలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ ది అని చొక్కాలు మార్చినట్లు సిఎంలను కాంగ్రెస్ మార్చిందని మండిపడ్డారు. తెలుగు ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ పార్టీ స్థాపించారని, కాంగ్రెస్ విధానాలపై ఎన్టిఆర్ పోరాటం చేశారని కె. లక్ష్మణ్ పేర్కొన్నారు.  

మన తెలంగాణ 2 Apr 2026 2:40 pm

ఊరు వాడ అభివృద్ధే గ్రామ సభ లక్ష్యం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఊరు వాడ సమగ్ర అభివృద్ధే గ్రామ సభల

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:38 pm

కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పటాన్‌చెరు నియోజకవర్గంలోని

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:19 pm

Amaravati |వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి లక్ష్యం

Amaravati | వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి లక్ష్యం Amaravati | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:16 pm

after10th |సరైన కోర్స్ ఎంచుకోవడం ఎలా?

after10th | సరైన కోర్స్ ఎంచుకోవడం ఎలా? after10th | పదవ తరగతి

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:15 pm

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి..

జగిత్యాల, ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:14 pm

ప్రజాకవి, గాయకుడు ఎండి జహంగీర్ మృతి..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:11 pm

ఫర్నీచర్ షాపు దగ్ధం

ఫర్నీచర్ షాపు దగ్ధం కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; అకస్మాత్తుగా మంటలు వ్యాపించి

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:07 pm

Investigations |బొగ్గు స్మగ్లింగ్ కేసులో….

Investigations | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:00 pm

చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు…

చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు… పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:56 pm

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల్లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల్లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం.. సాధారణ కాన్పులకు పెద్దపీటజిల్లా

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:52 pm

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన.. మార్షల్స్‌తో తగువు

హైదరాబాద్: నగరంలో పెరిగిపోయిన దోమల సమస్యను ఎత్తి చూపుతూ ఎల్బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన చేశారు. అసెంబ్లీకి ఆయన దోమ తెర, ఫాగింగ్ యంత్రంతో వచ్చారు. అయితే ఇందుకు అనుమతి లేదని మార్షల్స్ ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి దోమతెర లాక్కునేందుకు యత్నించారు. దీంతో మార్షల్స్‌పై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని దోమల బెడత తట్టుకోలేక ప్రజలు హైదరాబాద్ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనివల్ల నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని అన్నారు. దోమల సమస్య నుంచి ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. 

మన తెలంగాణ 2 Apr 2026 1:41 pm

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు.. సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు […] The post కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 1:40 pm

అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరు: చంద్రబాబు

అమరావతి: రాజ్యసభలో మన రాజధాని అమరావతిపై బిల్లు ఆమోదం పొందబోతున్నదని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతికి మనకు సెంటిమెంట్ అని అన్నారు. సాయంత్రం అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలని అధికారులకు ఆదేశించారు. నేడు రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో.. నీరు- మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతాన్ని పర్యటించి.. రాజధానిలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్ డిఎ నేతలతో సిఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ జరిపారు. ఐదేళ్ల పాటు ఎపికి రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారని గత ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించారు. అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్టని, అమరావతి పేరు పలకడానికే మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఇష్టపడరని, అందుకే మావిగన్ అనే వింత పేరును తీసుకొచ్చారని మండిపడ్డారు. గతంలోనూ ఎస్ఆర్ఎం అమరావతి అని ఉంటే.. ఎస్ఆర్ఎంగా మార్పించారని, అమరావతి పేరు వింటేనే జగన్ కు కంపరంగా ఉండి నిత్యం విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్ లోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైందని, గత ఐదేళ్లు మీకు 3 రాజధానులా అని చాలామంది ఎగతాళిగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని గౌరవంగా చెప్పేరోజు వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కూడా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని, అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డిఎ ప్రభుత్వం ముందుకెళ్తుందని కొనియాడారు. మా రాజధాని అమరావతి అని ప్రతిఒక్కరిలో భావన రావాలని సూచించారు. బిల్లు ఆమోదించి చేయూత ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, మద్దతు తెలిపిన వారికి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

మన తెలంగాణ 2 Apr 2026 1:33 pm

పూలచెట్లపల్లి పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పూలచెట్లపల్లి పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనంనాణ్యమైన

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:28 pm

Chandrababu : Chandrababu : అమరావతి అలకగానే పండగ అవుతుందా? అసలు పండగ ఎప్పుడంటే?

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినంత మాత్రాన లాభం లేదు

తెలుగు పోస్ట్ 2 Apr 2026 1:28 pm

photogallery |మతిపోగొట్టే అందాల ప్రగతి

photogallery | మతిపోగొట్టే అందాల ప్రగతి photogallery | రకరకాల రంగురంగుల డ్రెస్సుల్లో

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:27 pm

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,530 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరపై రూ.1,400 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,51,420కు చేరుకుంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,38,800కు తగ్గింది. అలాగే, వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఒక్కరోజే రూ.10 వేలు తగ్గడంతో కిలో వెండి ధర రూ.2,55,000కు చేరుకుంది.

మన తెలంగాణ 2 Apr 2026 1:25 pm

TDP MLA |జగన్ వ్యవహారశైలి మార్చుకోవాలి

TDP MLA | జగన్ వ్యవహారశైలి మార్చుకోవాలి TDP MLA | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:24 pm

అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా బదులివ్వడంతో సభలో కాసేపు వేడి రాజుకుంది. ‘‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మీరు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు?్ణ్ణ అని ఖర్గే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇంధన […] The post అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 1:21 pm

Breaking : ఐప్యాక్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

ఐప్యాక్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది.

తెలుగు పోస్ట్ 2 Apr 2026 1:19 pm

రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం శుభ పరిణామం….

రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం శుభ పరిణామం…. యార్లగడ్డ సుచిత్ర విజయవాడ,

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:17 pm

అమరావతి రాజధాని అజరామంగా చరిత్రలో నిలుస్తుంది

అమరావతి రాజధాని అజరామంగా చరిత్రలో నిలుస్తుంది శావల్యాపురం, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:14 pm

చ‌లివేంద్రం ప్రారంభం…

చ‌లివేంద్రం ప్రారంభం… హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మణికొండ డివిజన్లోని మర్రిచెట్టు సర్కిల్ వద్ద

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:10 pm

699 people |నేటితో పదో తరగతి పరీక్షలు పూర్తి…

699 people | నేటితో పదో తరగతి పరీక్షలు పూర్తి… మూల్యాంకనానికి రంగం

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:03 pm

దొంగల కలకలం..

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలంలోని ఎండ్రియల్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున దొంగతనం

ప్రభ న్యూస్ 2 Apr 2026 1:03 pm

చెన్నై ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ధోనీ గురించి లేటెస్ట్ అప్‌డేట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2026ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. అయితే సీజన్ ఆరంభానికి ముందే ఆ జట్టు అభిమానులకు ముఖ్యంగా ధోనీ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే.. స్టార్ ఆటగాడు, అభిమానులు ముద్దుగా ‘తలా’ అని పిలుచుకొనే ఎంఎస్ ధోనీ.. రెండు వారాలు జట్టుకు దూరం అవుతాడని ప్రకటన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. తొలి మ్యాచ్‌లో ధోనీ జట్టులో లేకపోవడమే ఓటమికి కారణం అని కొందరు భావించారు కూడా.. అయితే ఇప్పుడు నిరుత్సాహంలో ఉన్న చెన్నై ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ అందింది. ధోనీ రెండు వారాలు కాకుండా కాస్త ముందుగానే బరిలోకి దిగుతాడని సిఎస్‌కె సూచన అందించింది. ఇందుకు సంబంధించి తమ సోషల్‌మీడియా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ధోనీ తన కిట్‌ని తీసుకెళ్లడం మనం చూడొచ్చు. దీంతో ధోనీ కాస్త ముందుగానే మైదానంలోకి అడుగుపెడతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం రెండు వారాల్లో సిఎస్‌కె నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. శుక్రవారం సొంత మైదానం చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడతుంది. మరి ఈ మ్యాచ్‌లో కాకపోయినా.. మూడో మ్యాచ్ వరకైనా ధోనీ జట్టుతో జతకడితే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. Kodiyil Oruvan! #WhistlePodu #Yellove pic.twitter.com/SuztJYGNzr — Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2026

మన తెలంగాణ 2 Apr 2026 1:01 pm

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: హరీష్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర యువతను తీవ్రంగా దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అమలు కాని హామీలలో అధికారంలోకి వచ్చి ప్రజలలను నిలువునా ముంచారని అన్నారు. సంగారెడ్డిలో బిఆర్ఎస్ లో చేరికలు కొనసాగాయి. హరీష్ రావు సమక్షంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి ఆరిఫ్ సహా 25 మంది చేరారు. గులాబీ కండువాలు కప్పిహరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దుర్మార్గాలను చూడలేకే కాంగ్రెస్ పార్టీ వాళ్లు బిఆర్ఎస్ లో చేరుతున్నారని, జాబ్ క్యాలెండర్ లేదు, కొత్తగా ఉద్యోగాల కల్పన లేదని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ పూర్తిగా బోగస్ అయ్యిందని, అవ్వతాతలకు పెన్షన్లు పెంచలేదని మండిపడ్డారు. మహిళలకు రూ.2500 ఇవ్వలేదని, రైతన్నల హామీలు నెరవేర్చకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియాదే కీలకపాత్రని, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని హరీష్ రావు కోరారు.

మన తెలంగాణ 2 Apr 2026 12:58 pm

Hyderabad : దోమతెర కప్పుకుని వచ్చిన ఎమ్మెల్యే

హైదరాబాద్ ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విన్నూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 2 Apr 2026 12:56 pm

రోయింగ్‌కు బూస్ట్‌కి కీలక నిర్ణయాలు..

రోయింగ్‌కు బూస్ట్‌కి కీలక నిర్ణయాలు.. సూర్యలంక, విజయవాడ, విశాఖలో ప్రధాన సెంటర్లు –

ప్రభ న్యూస్ 2 Apr 2026 12:47 pm

దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం.. : ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపు

అమెరికా- జాయినిస్ట్ (అమెరికా, ఇజ్రాయిల్) శక్తులు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడులు చేసి విధ్వంసం సృష్టించాయని, ఈ దాడిలో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి దేశాన్ని పునర్నిర్మించేందుకు దేశవ్యాప్తంగా కృషి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, జాతీయ ప్రకృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన ఈ సందేశం ఇచ్చినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ప్రెస్ టీవీ ఒక కథనంలో వెల్లడించింది. ఇటీవలి ఘర్షణల తర్వాత […] The post దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం.. : ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:46 pm

కటోర సాధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు…

కటోర సాధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు… కర్నూలు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : క్రీడాకారులు

ప్రభ న్యూస్ 2 Apr 2026 12:42 pm

సిఎం పదవికి రాజీనామా చేసినా.. నితీష్ కుమార్ కు Z+ భద్రతా

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన తర్వాత కూడా నితీష్ కుమార్ 'Z+' స్థాయి భద్రతను పొందనున్నారు. రాష్ట్ర హోం శాఖకు చెందిన ప్రత్యేక విభాగం ఈ మేరకు ఉత్తర్వును జారీ చేసింది. 'బీహార్ ప్రత్యేక భద్రతా చట్టం, 2000' ప్రకారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ Z+ భద్రతను పొందే అర్హత కలిగి ఉన్నారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో నితీష్ కుమార్.. సిఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో, నితీష్ కుమార్ భద్రతా అవసరాలను సమీక్షించిన అనంతరం, ఆయనకు 'Z+' స్థాయి భద్రతను కల్పించాలని నిర్ణయించారు. కాగా, 'Z+' భద్రతాలో పోలీసు సిబ్బందితో పాటు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కు చెందిన 10 మందికి పైగా కమాండోలతో కలిపి దాదాపు 36 మంది సిబ్బంది విధులను నిర్వర్తిస్తారు.

మన తెలంగాణ 2 Apr 2026 12:37 pm

Andhra Pradesh : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 12:33 pm

అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు

అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు […] The post అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:29 pm

TDP : బాబు వార్నింగ్ లు పనిచేయడం లేదా? ఎమ్మెల్యేలు ఎందుకిలా?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో చిక్కుకోవడం పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుంది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 12:25 pm

Green signal |ఉద్యోగులకు భారీ ఊరట

Green signal | ఉద్యోగులకు భారీ ఊరట Green signal | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 2 Apr 2026 12:18 pm

పెద్ద మల్లారెడ్డిలో ఆంజనేయస్వామి ఊరేగింపు…

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఆంజనేయ స్వామి శోభాయాత్ర

ప్రభ న్యూస్ 2 Apr 2026 12:12 pm

Road Accident : పది రోజుల్లో పెళ్లి.. మృత్యువు కబళించింది

పదిరోజుల్లో పెళ్లి ఉండగా వధువు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

తెలుగు పోస్ట్ 2 Apr 2026 12:12 pm

Telangana : మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కు రిలీఫ్

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 12:03 pm

హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్

హర్మూజ్ జలసంధిలో భద్రతను పశ్చిమాసియాపై ఆధారపడిన దేశాలే చూసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు ఆ దేశమే కారణమని తీవ్రంగా ఆరోపించారు. బుధవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఁఇరాన్ పిచ్చి ఉగ్రదాడులకు పాల్పడటం వల్లే గ్యాసోలిన్ ధరలు పెరిగాయి. ఇలాంటి ఇరాన్‌ను అణ్వాయుధాల విషయంలో ఎప్పటికీ నమ్మలేం అని ట్రంప్ […] The post హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:00 pm

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి శోభాయాత్ర

ఊర్కొండ ఏప్రిల్ 02, ( జనం సాక్షి ) ;మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన ఊరుకొండపేట అంజన్న …

జనం సాక్షి 2 Apr 2026 11:59 am

Tiger |పులి సంచారంతో ఆందోళన..

Tiger | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పోలవరం పరిసర ప్రాంతాల నుంచి

ప్రభ న్యూస్ 2 Apr 2026 11:58 am

6 గ్యారంటీల తరహాలోనే 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తాం: యుడిఎఫ్

తిరువనంతపురం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసిందని.. అదే తరహాలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలోకి వచ్చిన వెంటనే తమ హామీలను అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్ చెప్పారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సతీశన్ శుక్రవారం కొచ్చిలో UDF ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమ పథకాలు, యువతకు అండగా నిలిచేందుకు 5+1 హామీని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీశన్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్ర రవాణా బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తిరువనంతపురంలో జరిగిన UDF 'పుతు యుగ యాత్ర' ముగింపు దశలో రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు కీలక హామీల ఆధారంగానే ఈ మేనిఫెస్టో రూపొందించామని సతీశన్ తెలిపారు. UDF అధికారంలోకి వస్తే, ప్రస్తుతం రూ. 2,000 ఉన్న సంక్షేమ పింఛన్లను రూ. 3,000కు పెంచుతామని ఆయన చెప్పారు. అలాగే, వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేస్తామని కూడా సతీశన్ హామీ ఇచ్చారు. కేరళలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా పథకాన్ని తీసుకొస్తామన్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 11:56 am

Kerala : కేరళలో యూడీఎఫ్ ఆరు గ్యారంటీలివే

కేరళలో యూడీఎఫ్ ఎన్నికల మ్యానిఫేస్టోను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు

తెలుగు పోస్ట్ 2 Apr 2026 11:54 am

అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం

: ఎన్డీఏ నేతలతోటెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబుఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే […] The post అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 11:50 am

Sitarama Rath Yatra |యువకుడు మృతి..

Sitarama Rath Yatra | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లాలో

ప్రభ న్యూస్ 2 Apr 2026 11:42 am

Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏడు వేల కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 11:41 am

Road accident |ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

Road accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లాలో జరిగిన

ప్రభ న్యూస్ 2 Apr 2026 11:33 am

Road Accident : తెలంగాణలో ఘో రోడ్డు ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

తెలుగు పోస్ట్ 2 Apr 2026 11:28 am

Tragic incident |తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతి

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హనుమకొండ జిల్లాలో విషాద

ప్రభ న్యూస్ 2 Apr 2026 11:21 am

Telagnana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.

తెలుగు పోస్ట్ 2 Apr 2026 11:20 am

తెలంగాణ ఎగుమతులకు యుద్ధం సెగ

పశ్చిమాసియా యుద్ధ బీభత్సం అంతర్జాతీయ సరఫరా గొలుసులను చిన్నాభిన్నం చేసి చమురు, గ్యాస్ ఇతర కీలక అవసరాలు ఎవరికీ అందకుండా ఎంత కల్లోలం సృష్టిస్తోందో తెలిసిందే. భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి కావలసినవి కాకుండా ఆటంకాలు ఏర్పడి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి అమెరికా, యుఎఇ, సౌదీ అరేబియా, తదితర దేశాలకు ఎగుమతులు స్తంభించిపోతున్నాయి. దీంతో ఎగుమతిదారులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఇతర దేశాలతో ముడిపడి ఉన్న మార్కెట్ వ్యవస్థ తలకిందులవుతోంది. తెలంగాణ నుంచి ఇతర దేశాలకు సంబంధించి మొత్తం పది ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలలో అయిదు ప్రస్తుతం గందరగోళానికి గురవుతున్నాయి. అమెరికా, సౌదీ అరేబియా, కువైట్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఇప్పుడు తెలంగాణ నుంచి కీలకమైన పరికరాలు ఎగుమతికాక స్తంభించిపోతున్నాయి. తెలంగాణ ఎగుమతి మార్కెట్లలో 50% ఈ విదేశీ మార్కెట్లపై నిమగ్నమై ఉంటున్నాయి. అత్యధికంగా ఎగుమతి జరిగే ప్రధాన దేశాల్లో అమెరికా 23.64 శాతం, యుఎఇ 11.74 శాతం, సౌదీ అరేబియా 6.74 శాతం వరకు ఎగుమతి వాణిజ్యంలో పాలుపంచుకుంటున్నాయి. ఇంకా చైనా 3.69 శాతం, ఫ్రాన్స్ 3.38 శాతం, బ్రిటన్ 2.72 శాతం, టర్కీ 2.32 శాతం, జెక్ రిపబ్లిక్ 1.95 శాతం, బంగ్లాదేశ్ 1.83 శాతం, కువైట్ 1.75 శాతం వరకు తెలంగాణతో వాణిజ్యం సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నీ యుద్ధ సంక్షోభంతో వాణిజ్య ఒప్పందాల్లో అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ఇంతవరకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, తెలంగాణ ఎగుమతుల పనితీరు పటిష్టంగానే సాగింది. 2023 24లో రూ. 1,16,182 కోట్ల విలువైన సరకుల ఎగుమతులు జరగ్గా, 202425లో రూ. 1,61,843 కోట్ల విలువైన ఎగుమతులు జరిగి 39.3 శాతం ఆధిక్యాన్ని చూపించాయి. ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, ఫార్మాక్యూటికల్ ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రిక్, ఇంజినీరింగ్ పరికరాలు తదితర ఎగుమతులు విరివిగా జరిగాయి. దీంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు చెప్పుకోదగిన విధంగా ఎగుమతులు అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి 500 రిజిస్టర్డ్ ఎగుమతిదారులు తెలంగాణలో ఉన్నారు. అయినప్పటికీ ప్రస్తుత సంక్షోభంతో గల్ఫ్‌దేశాలకు, ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. వాణిజ్య ఒప్పందాలు ఇంకా ఖరారు కాకపోవడమే ప్రధాన కారణంగా అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడెక్ట్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ) వెల్లడించడం గమనార్హం. నీతి ఆయోగ్ ఎక్స్‌పోర్టు సన్నాహక సూచిక 2024 ప్రకారం ఎగుమతుల్లో అన్ని రాష్ట్రాల కన్నా మొత్తం మీద తెలంగాణ ఎనిమిదో స్థానం వహించింది. లాజిస్టిక్స్ అండ్ సేఫ్టీ 2024 రిపోర్టు ప్రకారం తెలంగాణ ఎచీవర్స్ కేటగిరీలో ఉంది. అయితే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర అస్థిరతకు దారితీస్తోందని ఎగుమతిదారులు చెబుతున్నారు. అయినా తలకు మించిన భారంతో యూరప్ మీదుగా గల్ఫ్‌దేశాలకు నౌకల ద్వారా రవాణా చేస్తుండడం తమకు కష్టం అవుతోందని కొందరు చెబుతున్నారు. పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితి ఏర్పడితేనే కానీ తమకు వెసులుబాటు లభించదని అంటున్నారు. ఇతర ఎగుమతిదారులు విమాన రవాణా ఛార్జీలు భరించలేక పోవడంతో ఇప్పుడు తమకు ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగానే వస్తున్నాయని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు నిర్బంధం ఉండడంతో ఇతర విభాగాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్ దేశాలకు ఎగ్ పౌడర్, ఫ్రోజెన్ ఎగ్ లిక్విడ్ ఎగుమతి చేయడానికి ఇదివరకటిలా నౌకలు లభించడం లేదని దాంతో రవాణా ఛార్జీల భారం పెరిగిపోతోందని కొందరు ఎగుమతిదారులు ఆందోళన వెలిబుచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా చాక్లెట్‌లు రవాణా చేసేవారు తమకు గతం కన్నా ఆర్డర్లు తగ్గాయని చెప్పారు. ఇక పెట్రోలు నుంచి వెలువడే ఉప ఉత్పత్తులతో రసాయనాలు, ఎరువులు తయారు చేసే సంస్థలు తగిన ఉత్పత్తి చేయలేక మూతపడుతున్నాయి. ఫార్మాక్యూటికల్, సెమీకండక్టర్లు, డిటెర్జంట్, రంగులు, ప్లాస్టిక్స్ వంటి ఉత్పత్తుల తయారీకి కూడా ఆటంకం ఏర్పడుతోంది. దేశంలోని ఎరువుల ఉత్పత్తి గత నెల రోజుల్లో నాలుగో వంతు పడిపోయింది. ఇంధనం కొరతతో సూరత్ లోని వస్త్రాల తయారీ యూనిట్లు వారానికి ఐదు రోజులే పనిచేస్తున్నాయి. గుజరాత్ లోని సిరామిక్ హబ్‌గా ఉన్న మోర్జీలో మూడింట ఐదు వంతుల మంది కార్మికులు తమ పనులు సాగక ఇళ్లకు తిరిగి వచ్చేస్తున్నారు. సిరామిక్ బట్టీలను మండించడానికి ఉపయోగించే ప్రొపేన్ కొరతగా ఉండడమే దీనికి కారణంగా దీనికి కారణం. ఎల్‌పిజి గ్యాస్ లేక పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడుతుండడం ప్రతిచోటా చూస్తున్నదే. గ్యాస్ సిలిండర్లకు వాస్తవానికి కొరత లేదని, అనవసరంగా ఆందోళనతో బారులు తీరి నిరీక్షించనక్కర లేదని ప్రభుత్వం ఎంత గట్టిగా చెబుతున్నా కృత్రిమ కొరత తప్పడం లేదు. బ్లాక్‌మార్కెట్‌లో అసలు ధరకు మూడింతలు ఎక్కువ చేసి విక్రయించడం పరిపాటి అవుతోంది. యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. అప్పుడు రేషనింగ్ చివరి మార్గం కావచ్చు. కొవిడ్ మహమ్మారిలా నిజంగానే అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రపంచ దేశాలు ఒకరికి మరొకరు సహకరించుకోవడం, నిల్వలు అధికంగా ఉన్నవారు తోటి వారికి పంపిణీ చేయడం వంటి సమష్టి కార్యాచరణ పాటించక తప్పదు. 

మన తెలంగాణ 2 Apr 2026 11:18 am

జల్లి గ్రామంలో వంటల పోటీలు

చెన్నారావుపేట, ఏప్రిల్ 1 ( జనం సాక్షి): మండలంలోని జల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సెంటర్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో …

జనం సాక్షి 2 Apr 2026 11:16 am

Telagnana : నేటి నుంచి తెలంగాణలో భూభారతి

నేటి నుంచి తెలంగాణలో భూ భారతి అమలు కానుంది.

తెలుగు పోస్ట్ 2 Apr 2026 11:14 am

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏప్రిల్ 2( జనం సాక్షి)జగిత్యాల జిల్లాధర్మపురి పట్టణ శివారులోని జగిత్యాల రోడ్డు వైపు గల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం …

జనం సాక్షి 2 Apr 2026 11:13 am

Telagnana : విద్యుత్ షాక్‌ మృతులకు ఎక్స్‌గ్రేషియా పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 11:09 am

Jubilee Hills |కేర్‌టేకర్‌పై అనుమానంతో…

Jubilee Hills | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతం

ప్రభ న్యూస్ 2 Apr 2026 11:05 am

రాష్ట్రానికో రకం రాజకీయ వైవిధ్యం!

పోలింగ్ తేదీలు సమీపిస్తుంటే ప్రచార హోరు, ఎన్నికల వేడి పెరుగుతున్న అయిదు చోట్ల గెలుపోటములపై అంచనాలు ఆసక్తిని రేపుతున్నాయి. అసోం, కేరళ, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)లలో పోలింగ్ ఈ నెల 9న జరుగనుండగా తమిళనాడులో ఈ నెల 23న, పశ్చిమబెంగాల్‌లో ఈ నెల 23, 29 (రెండు విడతల) తేదీల్లో పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఒక చిత్రమైన పరిస్థితిలో.. అయిదుగురు ప్రస్తుత ముఖ్యమంత్రులు తమ పార్టీలను/కూటములను తిరిగి గట్టెక్కించినా ఆశ్చర్యం లేదనే అంచనాలు కూడా సాగుతున్నాయి. అసోంలో బిజెపి మూడో సారి గెలిచే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. హిమంత బిశ్వశర్మ ఇక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెద్దపోరు తర్వాత కూడా పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగోసారి గెలిచే సంకేతాలున్నాయి. తమిళనాడులో సినీనటుడు విజయ్ రంగప్రవేశంతో రాజకీయం కొంత రంగుమారినా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రధాన భాగస్వామిగా ‘ఇండియా కూటమి’ అధికారం నిలబెట్టుకోవచ్చనే అంచనాలు సాగుతున్నాయి. ఇక పుదుచ్చేరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్.ఆర్. కాంగ్రెస్, -బిజెపి ప్రధాన భాగస్వాములుగా ఎన్‌డిఎ కూటమియే మళ్లీ గెలవటం ఖాయంగా కనిపిస్తోంది. కేరళంలో ఎన్‌డిఎ మూడో కూటమిగానే నిలిచిపోయి, పోటీ ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) మధ్య నువ్వా, నేనా అన్నట్టుంది. ఎన్నికల ప్రకటనకు ముందువరకు యుడిఎఫ్ కొంత ముందంజలో ఉన్నట్టు కనిపించినా, పాలక ఎల్‌డిఎఫ్ క్రమంగా పుంజుకుంటుండటంతో ఈ పోటీ రసవత్తరంగా తయారయింది. అసోం ఎన్‌డిఎ పక్షాల్లో ఐక్యత, ఓటు బదిలీకి అనుకూలించేలా సీట్ల పంపకపు ప్రక్రియ చేపట్టడం వారికి కలిసివస్తోంది. అభివృద్ధి, సంక్షేమం కలగలిపి తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో కూడా వారికి అనుకూలించేదిగా ఉంది. బిజెపి ఇక్కడి ఎజిపి, బిపిఎఫ్ పార్టీలతో కలిసి సయోధ్యతో కూటమి రాజకీయం నెరపుతోంది. కాంగ్రెస్ కేంద్రకంగా ప్రతిపక్ష కూటమి కడదాకా అంతర్గత కలహాలతోనే నలుగుతోంది. 126 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్‌డిఎ కూటమి 90 స్థానాలు కైవసం చేసుకునే అవకాశమున్నట్టు ‘పీపుల్స్‌పల్స్’ ట్రాకర్ పోల్ సర్వే (2)లో వెల్లడయింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నది ఎన్‌డిఎ (డబుల్ ఇంజన్) ప్రభుత్వమే అయినా ప్రజల్లో అంతగా వ్యతిరేకత, ప్రభుత్వాన్ని మార్చాలన్న నిశ్చయం కనిపించడం లేదు. నాయకత్వం ప్రజాదరణ కూడా వారికే అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో 40శాతం మంది ప్రస్తుత సిఎం హిమంత బిశ్వశర్మనే తిరిగి ముఖ్యమంత్రిగా కోరుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ గౌరవ్ గొగోయ్‌ను ముఖ్యమంత్రిగా 33% మంది కోరుకున్నారు. బిజెపి వరుసగా రెండు పర్యాయాలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా వరుసగా 3 పర్యాయాలు ప్రభుత్వం ఏర్పరచింది. అప్పుడు తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రి. ఆ పైన కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. రేపటి ఎన్నికల్లో బిజెపికి 39 శాతం ఓటు వాటా, కాంగ్రెస్‌కు 36.5 శాతం ఓటు వాటా లభించవచ్చని సర్వే వెల్లడించింది. సిఎం మమతా బెనర్జీ ఒకవైపు పిఎం నరేంద్ర మోడీ, మరొక వైపు చాలా కాలంగా పరస్పరం కత్తులు దూసుకునే బరి పశ్చిమబెంగాల్ అసెంబ్లీ. ఇక్కడి ఎన్నిక ఈసారి కూడా దేశ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్శిస్తోంది. కిందటి సారి ఎన్నికల్లో టిఎంసిని ఓడించి బిజెపి అధికారం చేపట్టనుందని మీడియా, పలు సర్వే సంస్థలు వేసిన అంచనాలు తలకిందులై చివరికి భారీ మెజారిటీతో గెలిచి మమతాయే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. పోటీ రసవత్తరంగా ఉన్నా ఈసారి కూడా మమత 7 శాతం ఓటు వాటా వ్యత్యాసంతో స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఇక్కడ వివాదాస్పదమైంది. వ్యతిరేకం అనుకునే ఓట్లను పనిగట్టుకొని తొలగిస్తున్నారని, ఇందుకు బిజెపికి కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) ఏకపక్షంగా సహకరిస్తోందని టిఎంసి ఆరోపిస్తోంది. లేని, చెల్లని, మృతుల, అర్హులు కాని బంగ్లా వలసదారుల ఓట్లతో వరుసగా గెలుస్తూ వస్తున్నారని, దాన్ని అడ్డుకుంటే గగ్గోలు పెడుతున్నారన్నది బిజెపి ప్రతి విమర్శ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసికి మొత్తం 2.89 కోట్ల ఓట్లు రాగా బిజెపికి 2.31 కోట్ల ఓట్లు లభించాయి. వ్యత్యాసం సుమారు 60 లక్షల ఓట్లుగా నమోదయింది. ఈసారి ‘సర్’ ద్వారా తొలగించిన ఓట్లే 65 లక్షల వరకు ఉండటంతో.. తుది ఫలితాలపై ‘ఈ ప్రక్రియ ప్రభావం ఎంత?’ అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 28 నుంచి 30 శాతం వరకున్న ముస్లిం ఓట్లు బెంగాల్ ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతాయి. తన పార్టీ తమిళగ వెట్రి కజగం (టివికె) తరపున మొత్తం 234 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన సినీనటుడు విజయ్ చూపే ప్రభావాన్ని బట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఉండవచ్చు. ప్రస్తుత ప్రభుత్వంపై యువత కొంత అసంతృప్తితో ఉండటం, యువతే ప్రధానంగా విజయ్ వైపు ఆకర్శితులవటం కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక అవకాశాన్ని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2009 ఉమ్మడి ఎపి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని బరిలోకి దింపిన సినీనటుడు ‘చిరంజీవి కారకం’ లాంటిదే ఇది కూడా అని, ఇది పరోక్షంగా పాలకపక్షం డిఎంకెకి అనుకూలించేదే అని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అంతగా లేదని, అన్నాడిఎంకె గాని, బిజెపితో కలిసి ఎన్‌డిఎ కూటమి గానీ బలపడిందీ లేదనే అభిప్రాయం తమిళనాట ముందు నుంచీ ఉంది. దానికి ‘విజయ్’ ఫ్యాక్టర్ తోడవుతోంది. విజయ్ సభలు, ర్యాలీలకు పెద్ద సంఖ్యలో జనం, ముఖ్యంగా మహిళలు, యువత వస్తున్నారు. వారిని నియంత్రించడం ఇబ్బందవుతోంది. గత సంవత్సరం కరూర్ సభ తొక్కిసలాటలో 41 మంది కార్యకర్తలు చనిపోవడం, వారిని పట్టించుకోకుండానే ఆయన వెళ్లిపోవడం వంటివి ఆయనకు కొంత మైనస్ కావొచ్చు. గుడ్డి అభిమానమే తప్ప పార్టీ వ్యవస్థ, యంత్రాంగం అంటూ ఏమీ లేదు. మరో ప్రాంతీయ పార్టీ నామ్ తమిళార్ ఖట్చి (ఎన్‌టికె) కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కిందటి సారి పోటీ చేస్తే సగటున 6 శాతం ఓటు వాటా సాధించింది. ఈసారి అది పది శాతం దాటొచ్చనే అభిప్రాయం ఉంది. సగటు తమిళ ఓటర్ ఉద్విగ్న -ఉద్రేక స్వభావం రీత్యా ‘విజయ్’ సంచలనం సృష్టిస్తారేమో అనే సందేహాలున్నప్పటికీ, ఇతరుల గెలుపోటముల్ని ప్రభావితం చేసే ఉత్ప్రేరకంగానే ఆయన పార్టీ మిగిలిపోవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రకటించిన జాబితా ప్రకారం 106 మంది (45 శాతం) అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే! దీన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ టివికె సభ్యులే నిరసనలు, ఆందోళనలు జరిపారు. జయలలిత మరణానంతరం ఏ ఎన్నికా గెలవని అన్నాడిఎంకె బలహీనపడుతూ వస్తోంది. పార్టీ నాయకులు అటు డిఎంకె వైపో, ఇటు టివికె వైపో వలసబాట పట్టారు. వారిపై ఆధిపత్యంతో పొత్తుకు యత్నించిన బిజెపి, చివరకు ఏదో రకంగా పొత్తుతోనే సర్దుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌డిఎ తిరిగి అధికారంలోకి వచ్చి ఎన్ రంగస్వామి (ఎన్నార్ కాంగ్రెస్) మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా పుంజుకోకపోగా, 30 అసెంబ్లీ స్థానాల పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే ముగ్గురు ఎంఎల్‌ఎలు కీలకం అవుతారు కనుక ఎన్‌డిఎదే ఆధిపత్యం! కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు మొదట్లో స్పష్టమైన ఆధిక్యత కనిపించినా అది క్రమంగా కరిగిపోతున్న జాడలు స్పష్టమవుతున్నాయి. ఆ మేర పాలక ఎల్‌డిఎఫ్ మెరుగుపడటమే కారణం! ప్రజలు ప్రతిసారీ ప్రత్యర్థి పార్టీల కూటమికి అధికారమిచ్చే కిందటి ఎన్నికల్లో అది తప్పింది. కమ్యూనిస్టు కూటమి అధికారాన్ని నిలబెట్టుకొని వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పరచింది. వ్యతిరేకత పెరుగుతూ వచ్చి, 2025 డిసెంబరులో జరిగిన మూడంచెల స్థానిక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ ఎదురీదింది. బిజెపి అక్కడక్కడ పెరిగింది. అదలా కొనసాగి, యుడిఎఫ్ లబ్ధి పొందే సూచనలు ఎన్నికల ప్రకటన వరకు స్పష్టంగానే ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీల్లో మునుపెన్నడు లేనంత వ్యతిరేకత, టిక్కెట్టు లభించని వారు పార్టీ క్రమశిక్షణను ఖాతరు చేయకుండా స్వతంత్రులుగా పోటీ చేయడం, పార్టీ బలంగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టిల్లోని ఉపకులాల్లో వచ్చిన చీలికలు, వ్యతిరేకత వల్ల ఎల్‌డిఎఫ్ బలహీనమవుతూ వచ్చింది. కానీ, ఎన్నికల ప్రకటన తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చి ఎల్‌డిఎఫ్- యుడిఎఫ్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్న స్థితికి చేరింది. ఎన్‌డిఎ, ఇండియా కూటములు బలమైన ప్రత్యర్థులు, సిద్ధాంత వ్యతిరేకులే అయినా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్న అంశాలు స్థానికతను బట్టి వైవిధ్యభరితంగా ఉన్నాయి. - దిలీప్ రెడ్డి( సమకాలీనం) - రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ

మన తెలంగాణ 2 Apr 2026 11:02 am

Chandrababu : ఈరోజు సాయంత్రం దీపాలు వెలిగించండి

ఎన్డీఏ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు

తెలుగు పోస్ట్ 2 Apr 2026 11:01 am

Nidhi agarwal |అలా చేస్తుందా..?

Nidhi agarwal | అలా చేస్తుందా..? Nidhi agarwal | లక్కీ ఛాన్స్‌తో

ప్రభ న్యూస్ 2 Apr 2026 10:57 am

కేరళలో కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసిపోయారు..

కేరళలో కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసిపోయారు.. శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 10:51 am

అగ్రరాజ్యానికి ఆయుధమే ఆహారం యుద్ధమే పెట్టుబడి

ప్రపంచపటంలో తననుతాను ‘ప్రజాస్వామ్య రక్షకురాలు’గా, ‘శాంతి కాపలాదారు’గా చిత్రించుకునే అమెరికా అసలు రంగు యుద్ధం. అమెరికాకు ఆయుధమే ఆహారం, యుద్ధమే పెట్టుబడి. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ చమురుతో కాదు, ఇతర దేశాల్లో చిందే రక్తంపై, ఆయుధాల అమ్మకాలపై ఆధారపడి నడుస్తోంది. శాంతిమంత్రం పైకి జపిస్తూనే, లోపల యుద్ధతంత్రాన్ని నడిపే అమెరికా వైఖరి మానవజాతికే ఒక కళంకం.‘అమెరికా ఆయుధాలు తింటోంది’ అనేది నేడు ఒక చేదు నిజం. అంటే.. అది కేవలం లోహపు ముక్కలను మింగడం కాదు; కోట్లాదిమంది అమాయకుల కలలను, పసిపిల్లల భవిష్యత్‌ను, స్వతంత్ర దేశాల సార్వభౌమత్వాన్ని పచ్చిగా నమిలి మింగుతోందని అర్థం. అమెరికాకు శాంతి అంటే ఒక నినాదం మాత్రమే. కానీ యుద్ధం అంటే ఒక భారీ లాభదాయకమైన వ్యాపారం.ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటల్లో తన ఆయుధాల ఫ్యాక్టరీలను వేడి చేసుకోవడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఒక దేశంపై బాంబులు కురిపించాలన్నా, మరో దేశపు సార్వభౌమత్వాన్ని కాలరాయాలన్నా అమెరికాకు కావాల్సింది ‘ప్రజాస్వామ్య రక్షణ’ అనే ఒక అబద్ధపు సాకు. ఆ దేశపు క్షిపణులపై రాసి ఉండేది శాంతి సందేశం కాదు, రాబోయే వినాశనం తాలూకు ధర. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అది అమెరికా స్టాక్ మార్కెట్‌కు పండగే. శ్మశానాల మీద సౌధాలు నిర్మించుకునే వికృత ఆర్థిక వ్యవస్థ అమెరికాది. డాలర్ విలువ పెరగాలంటే మరో దేశం రణరంగం కావాల్సిందే. మధ్య ప్రాచ్యం నుంచి ఐరోపా వరకు అమెరికా వేసిన ప్రతి అడుగు వెనుక చమురు వేట, ఆయుధాల అమ్మకం తప్ప మానవత్వం ఎక్కడా కనిపించదు. మందుగుండు సామాగ్రిని అమ్మడం కోసం శత్రువులను సృష్టించడం, ఆపై మధ్యవర్తిగా నటిస్తూ ఇరుపక్షాల రక్తాన్ని పీల్చడం - ఇదే వాషింగ్టన్ అనుసరిస్తున్న అసలైన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’.అమెరికా ఆర్థిక వ్యవస్థకు యుద్ధం అనేది ఒక ‘లైఫ్ సపోర్ట్’ లాంటిది; అది ఆగిపోతే ఆ దేశపు జిడిపి వెంటిలేటర్ మీదకు వెళ్తుంది. లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, రేథియాన్ వంటి సంస్థల షేర్లు పెరగాలంటే, మరో దేశంలో పసిపిల్లల హాహాకారాలు వినిపించాలి. శత్రువు లేకపోతే అమెరికా మనుగడ లేదు. అందుకే ఒకవేళ ప్రపంచంలో శత్రువు లేకపోతే, తన ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఒక కొత్త శత్రువును తానే సృష్టించి, అతడిని ప్రపంచానికి విలన్‌గా పరిచయం చేస్తుంది. అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగదు, కానీ యుద్ధం ఆగిపోనివ్వదు. దీనినే ఆ దేశం ‘ప్రాక్సీ వార్’ అని పిలుచుకుంటుంది. రష్యాను దెబ్బకొట్టడానికి ఉక్రెయిన్‌ను ఒక పావుగా వాడుకుంటూ, వేలకోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీనివల్ల ఉక్రెయిన్ నాశనమవుతున్నా, అమెరికా ఆయుధ కంపెనీల లాభాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా తన యుద్ధోన్మాదంతో ప్రపంచదేశాలపై రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాయుధ, సాంకేతిక అణచివేతలకు పాల్పడుతుంది.సుమారు 800 బిలియన్ డాలర్లకు పైగా రక్షణ బడ్జెట్‌తో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనికశక్తిగా ఉంది. ఇది మిగతా టాప్ 10 దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో సుమారు 40% వాటా అమెరికాదే. అభివృద్ధి చెందుతున్న దేశాలు సొంతంగా రక్షణ రంగంలో ఎదగకుండా ఆంక్షలు విధిస్తూ, ప్రపంచ దేశాలన్నీ సాంకేతికత కోసం తనపైనే ఆధారపడేలా చేసుకుంటుంది. ఒకసారి అమెరికా ఆయుధాన్ని కొంటే, ఆ దేశం ఇక దశాబ్దాల పాటు అమెరికాకు బానిసగా ఉండాల్సిందే. ఇది రక్షణ ఒప్పందం కాదు, ఒక దేశంపై రుద్దే ‘డిజిటల్, మిలిటరీ బానిసత్వం’. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్యసమితి, నేడు అమెరికా చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయింది. తన ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ తీర్మానాన్ని అయినా అమెరికా తన ‘వీటో’ అధికారంతో తొక్కిపెడుతుంది. అణ్వాయుధ రాజకీయంలో అమెరికాది అందెవేసిన చెయ్యి. ‘తుపాకీ గొట్టంద్వారా వచ్చే శాంతి శ్మశాన శాంతి మాత్రమే. అది ఎప్పటికీ శాశ్వతం కాదు. ‘దీన్ని అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా తోపాటు ప్రపంచ దేశాలన్నీ గుర్తుంచుకోవాలి. శాంతి అనేది బాంబుల మోత ఆగినప్పుడు వచ్చే నిశ్శబ్దం కాదు.. అది ప్రతి మనిషి భయం లేకుండా బతికే స్వేచ్ఛ. అధికారం కంటే మానవత్వం, ఆయుధాల కంటే సహజీవనం గొప్పవని ప్రపంచ దేశాలు గుర్తించి, అమెరికా సృష్టిస్తున్న ఆయుధ విషవలయం నుండి, ‘సాంకేతిక బానిసత్వం’ నుండి బయటపడినప్పుడే భూమిపై నిజమైన శాంతి వెల్లివిరుస్తుంది. ఆయుధాలు లేని ప్రపంచమే రేపటి తరానికి మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి!  - విశ్వజంపాల, 7793968907

మన తెలంగాణ 2 Apr 2026 10:41 am

పోలీసులు, పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం..

పోలీసులు, పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం

ప్రభ న్యూస్ 2 Apr 2026 10:30 am

అకస్మాత్తుగా కుప్పకూలి..

అకస్మాత్తుగా కుప్పకూలి.. మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలోని బృందావనం గార్డెన్

ప్రభ న్యూస్ 2 Apr 2026 10:24 am

లంబాడీల జాతర లోక మసంద్

తెలంగాణలోని లంబాడీలు జరుపుకునే అతి పెద్ద జాతరలలో లోక మసంద్ జాతర ముందు వరుసలో ఉంటుంది. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో చైత్ర పౌర్ణమి (ఏప్రిల్) సందర్భంగా జరిగే ఈ జాతరలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లోని లంబాడీలు, గిరిజనేతరులు లక్షలాదిగా పాల్గొని జాతరను వైభవంగా జరుపుకుంటారు. శ్రీ లోక మసంద్ తిమ్మారెడ్డిపల్లెలోనే పుట్టాడని కొందరు, రాజస్థాన్‌లో పుట్టాడని కొందరు చెప్తుంటారు. ఆయన పదిపన్నెండు సంవత్సరాల వయసులోనే పశువులను మేపుతూ తోటి బాలురకు, లంబాడీ తండావాసులకు పలు మహిమలు ప్రదర్శించి, వారి బాధలు తీర్చి, బోధలు చేసి మహనీయుడయ్యాడని చెప్తారు. అనంతరం ఆయన రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘడ్‌లో పుష్కర కాలం తపస్సు చేసి కాళికా మాతను ప్రసన్నం చేసుకున్నాడట. అనంతరం క్రీ.శ. 1700 ప్రాంతంలో పంజాబ్‌లోని అమృత్సర్‌లో ఉన్న దేవాలయంలో గురుతేజ్ బహదూర్ సింగ్ దగ్గర కొంతకాలం శిష్యరికం చేశాడు. ఆయనను 1708లో మొఘల్ సామ్రాట్ ఉరి తీసిన తరువాత ఆయన వారసుడు గురు గోవింద్ సింగ్ దగ్గర నాందేడ్‌లో 6 సంవత్సరాలు శిష్యరికం చేసి ఏడుగురు మసంద్ (దశవంద అనే ధార్మిక శిస్తును వసూలు చేసే శిష్యుడు) లలో ఒకడిగా గుర్తింపు పొంది పలు విద్యలు నేర్చుకున్నాడు. ఇతర సిక్కులు అసూయతో లోక మసందును చంపే ప్రయత్నం చేయగా గురు గోవింద్ ప్రసాదించిన జల్దీ ఘోడ్ (గుర్రం) ఎక్కి వచ్చి తెలంగాణలోని తిమ్మారెడ్డిపల్లి సమీపపు కోయిల్సాగర్ వాగు సంగమంలో స్నానం చేసి, అక్కడి పరుపు బండ మీద తపస్సు చేశాడట. ఆ పరుపు బండ మీది ఆయన పాదముద్రలు, ఆయన గుర్రపు డెక్కల ముద్రలను భక్తులు ఇప్పటికీ దర్శించుకుంటారు. శ్రీ లోక మసంద్ సమీపంలోని మారేడు చెట్టు కింద తపస్సు చేస్తూ, భక్తులకు బోధలు చేసేవారు. మద్యమాంసాల సేవనం వల్ల కుటుంబ జీవితాలు నాశనమవుతాయని, కాబట్టి వాటిని విసర్జించి నైతిక జీవితం గడపాలని, హిందూ మత ధర్మ పరిరక్షణకై కృషి చేయాలని బోధించేవారట. చివరకు జీవసమాధి అయి, కొన్ని గడియల తరువాత చూడగా గులాబీ పూల మధ్య కలశం లాగా గోచరించాడట. దాని మీదే భక్తులు సమాధి మందిరం కట్టారు. దాని స్థానంలో రెండున్నర శతాబ్దాల తరువాత.. యాభై ఏండ్ల కిందట.. 1976లో విశాలమైన ఆలయం నిర్మించారు. పక్కన్నే మాత మందిరం కట్టారు. అప్పట్నుంచి గత అర శతాబ్ద కాలంగా నిరంతరాయంగా చైత్ర పౌర్ణమికి జాతర జరుపుతున్నారు. గురు లోక మసంద్ మహరాజ్ రెండవ అన్న డాకు మహారాజ్ కుమారుడు శ్రీ రాంజీ మహారాజ్ అన్నీ తానై పూజలు, సేవలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు.తదుపరి రాంజీ మహారాజుకు నిజాం ప్రభుత్వం కాలంలో దేవాలయ నిర్మాణానికి, పూజలు చేసుకోవడానికి సర్వే నెం. 41లో 2 ఎకరాల 38 గుంటల భూమిని మక్తేదార్ అయిన గత్ప రాంచందర్ రావు సనద్ రాసి ఇచ్చారు. తదుపరి రాంజీ మహారాజ్ కుమారులు అయిన 1) గంగు మహరాజ్ (అవివాహితుడు), 2) భద్రు బావాజీ, 3) లచ్చిరాం బావాజీలకు కూడా పూజలు చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మక్తేదారు గత్ప రాంచందర్రావు అన్ని హక్కులు కల్పిస్తూ మరో సనద్ వాసి ఇచ్చారు. దాంతో భద్రు బావాజీ, ఆయన తమ్ముడు లచ్చిరాం బావాజీ ఎంతో కష్టపడి దేవాలయం, మండపాలు, ధర్మశాలలు, కాళికాదేవి ఆలయం, మండపం మొదలైన పనులు చేశారు. వారి తదనంతరం వారి కుమారులు, వారి వంశస్థులు దేవాలయ పూజలు, వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉండి నేటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. తదుపరి భద్రు బావాజీ మనుమడు శ్రీరాములు నాయక్ (రాములు మహారాజ్), లచ్చిరాం బావాజీ కొడుకు హన్మ్యా నాయక్ (హన్మంతు మహారాజ్) గారలను ఒ.ఎ. నెం. 29/ 2006, తేది: 15 మే, 2009 ద్వారా దేవాదాయ శాఖ వారు వంశపారంపర్య ధర్మకర్తలుగా నియమించారు. వారు ఇరువురి మరణాంతరం హన్మంతు మహరాజ్ కొడుకులు, వారి తమ్ముడు తుక్యా నాయక్ కొడుకులు, రాములు నాయక్ (రాములు మహరాజ్) కొడుకులు, తమ్ముళ్లు (భాగస్థులు) కీ.శే. కిషన్ నాయక్ కొడుకులు, కీ.శే. హిరాలాల్ కొడుకు, తమ్ముళ్లు ధన్ను నాయక్, దేవులా నాయక్... వీరు దేవాలయ కార్యక్రమాలను నిర్వహిస్తూ వంశపారంపర్య పూజారులుగా, ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజులలో జరిగే శ్రీ గురు లోక మసంద్ ప్రభు బ్రహ్మోత్సవాల(జాతర)లో లంబాడీ గిరిజనులు, గిరిజనేతర భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. స్వామివారి దర్శనం అనంతర మాతకు మొక్కి కోళ్లు, మేకలు కోసుకొని విందు చేసుకుంటారు. ఒక అంచనా ప్రకారం ప్రతి జాతరలో యాభై నుంచి అరవై వేల మేకలను బలిస్తారట. దీన్ని బట్టి భక్తజన సందోహం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం (తేరు) మిరుమిట్లుగొలిపే బాణసంచాల పేలుళ్ల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేక అలంకరణలతో, బ్యాండ్ మేళతాళాలతో ప్రభు వారి పల్లకిసేవ జరుగుతుంది. కాళికాదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, హోమం (భోగ్ భండార్), కుంకుమార్చన, పల్లకీ సేవ జరుగుతుంది. జాతరలో ఎన్నో అద్భుత దృశ్యాలు, ప్రభు వారి మహిమలు భక్తులకు సాక్షాత్కరిస్తాయనే విశ్వాసం ఉంది. సాంప్రదాయ నృత్యాలు, బంజార ఆట పాటలు, భజనలు భక్తులను తన్మయత్వానికి గురి చేస్తాయి. భక్తులు ప్రభు వారికి పూలమాలలు, ప్రత్యేక వస్త్రాలు (గాది), మహా భోగ్ భండార్ (నైవేద్యాలు), వెండి, బంగారం సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతర ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 1 ఏప్రిల్ 2026 న ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి అవసరమైన నిధులను విడుదల చేస్తున్నది. - డా. ద్యావనపల్లి సత్యనారాయణ 94909 57078 

మన తెలంగాణ 2 Apr 2026 10:20 am

ఘనంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర..

ఘనంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర.. ఊర్కొండ, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి వేడుకల

ప్రభ న్యూస్ 2 Apr 2026 10:17 am

రణబీర్ కపూర్ 'రామాయణ' టీజర్ వచ్చేసింది..

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రాజెక్టు రామాయణ. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతా దేవిగా సాయిపల్లవి.. రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతన్న ఈ క్రేజీ ప్రాజెక్టును నమిత్ మల్హోత్రా.. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ గెలుచుకున్న DNEG, యష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో కలిసి నిర్మిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఈ మూవీ టీటర్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్భుతమై విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. రాముడి అవతారంలో రణబీర్ కపూర్ లుక్స్ బాగున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక, హనుమంతుడిగా సన్నీ డియోల్.. లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఈ మూవీ మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా IMAXలో విడుదల కానుంది.

మన తెలంగాణ 2 Apr 2026 10:14 am

Namit Malhotra’s Ramayana Rama Glimpse: A Grand Spectacle

Ramayana Movie Teaser The highly anticipated cinematic adaptation of Ramayana has officially unveiled its first glimpse of Ranbir Kapoor as Lord Rama. Directed by Nitesh Tiwari and produced by Namit Malhotra’s Prime Focus Studios alongside Yash’s Monster Mind Creations, this two-part epic promises to be a global event. The newly released teaser introduces audiences to […] The post Namit Malhotra’s Ramayana Rama Glimpse: A Grand Spectacle appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 10:13 am

Hyderabad : హైదరాబాద్ లో ఇళ్లకు తగ్గిన డిమాండ్.. రీజన్ ఇదే

భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో కుదుపుకు లోనయింది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 10:12 am

భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు..

భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు.. చెన్నూర్, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి వేడుకలను

ప్రభ న్యూస్ 2 Apr 2026 10:10 am

Andhra Pradesh : విజయ పాల ధర పెంపు

ఆంధ్రప్రదేశ్ లో విజయ పాల ధరలు పెరిగాయి

తెలుగు పోస్ట్ 2 Apr 2026 10:07 am

Hyderabad : నేడు శోభాయాత్ర..ట్రాఫిక్ ఆంక్షలు అమలు

నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 10:00 am