తెలంగాణలో చికెన్ షాపులు బంద్..
తెలంగాణలో చికెన్ షాపులు బంద్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర
దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు వందేళ్లకు దగ్గర కావస్తున్నది. అయినా ఈ సమాజంలో దళిత, అణగారిన వర్గాల పరిస్థితి, బతుకుల్లో ఆశించినంత ఫలితాలు మాత్రం రాలేవనడానికి అనేక సాక్ష్యాలు నేటికీ కన్పిస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం తరువాత దళిత జనాభాలో అత్యధిక సంఖ్య గల మాదిగల బతుకుల్లో ఇంకా రావాల్సినంత సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన హక్కులకు ఇంకా అందనంతా దూరంలోనే ఉన్నారు. అంటరానితనం, అసమానతల పేరిట తీవ్రమైన అణచివేతలతో మాదిగ సమాజంలో రావాల్సినంత మార్పు ఇంకా రాకుండా పోయింది. రోజురోజుకు శాస్త్రసాంకేతిక పెరుగుతున్నప్పటికీ అంతే స్థాయిలో వివక్ష పెరుగుతూనే ఉంది. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లో అత్యంత దిగువ ఉన్నది మాదిగలు. అటువంటి మాదిగలను తరతరాలు బతుకుకు, ఉనికికి అధికారానికి, దూరంగానే ఉంచుతున్నారు. ఆధిపత్య కులాల పెత్తనం కింద మాదిగలు సమాజం నుంచి వెలివేయబడ్డారు. అటువంటి పరిస్థితులను అధిగమించి ఊరి అవతల ఉండి.. సబ్బండ కులాలకు కావాల్సిన ఉత్పత్తులను అందించిన ఘనత మాదిగలకు ఉంది. ముఖ్యంగా తోలు ఉత్పత్తులను తయారు చేసి వస్తుమార్పిడి విధానంతో శ్రమను దారబోసి ఎన్నో ఉత్పత్తులను ఈ సమాజానికి అందించారు మాదిగలు. ఊళ్లో జంతు కళేబరాలను తొలగించి శుద్ధి చేయడంతోపాటు ఆ జంతు చర్మాన్ని ఒలిచి చెప్పులు, వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన చరిత్ర ఉన్నది. వ్యవసాయానికి తొండెం బొక్కెన, నీటి నిల్వకోసం తోలు తిత్తి, వ్యవసాయంలో ప్రధానంగా తోడుగా ఉండే ఎడ్ల కాళ్లకు జోళ్లు లాంటి పరికరాలను తయారు చేసి ఇచ్చిన ఘనత వాస్తవానికి ఓ సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగిన మాదిగలను, వారి ఉత్పత్తులను వాడుకున్నారే తప్ప ఏనాడు మనుషులుగా గుర్తించలేదు.. మాదిగ సమాజం వారి వృత్తి ప్రధానంగా తోలును శుద్ధి చేయడం, పాదరక్షలు, బెల్టులు, సంచులు, కల్లు డబ్బాలు, సంచులను తయారు చేయడంతో ముడిపడి ఉంది. వీటిని అవసరమైనప్పుడు వివిధ కులాల వారికి అందించేవారు. అదనంగా మాదిగ సమాజం డప్పు అనే సాంప్రదాయ డ్రమ్ను తయారు చేయడంలో వారి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. మాదిగ జనాభాలో గణనీయమైన భాగం సాంప్రదాయకంగా చెప్పులు కుట్టేవారిగా పనిచేశారు. వారు గ్రామ డ్రమ్మర్లు కూడా, వీరు పండుగలు, మరణ, వివాహ వేడుకలు ప్రకటనలలో దండోరా కోసం సృష్టించబడిన డప్పు శబ్దం నేటి సంగీతానికి, వివిధ వాయిద్యాలకు ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం అటువంటి సామాజిక పరిస్థితులు నేటికీ ఆధునిక కాలంలో కన్పించకుండా బుసలు కొడుతూనే ఉంది. దేశంలో, ఇటు తెలుగు రాష్ట్రాలలో చమార్లు, మాదిగల జనాభా అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ దేశంలో ఇంకా బాధితులుగానే ఈ సమాజం ఉంటుంది. తమ ఓటు తాము వేసుకుంటే రాజకీయ అధికారాన్ని శాసించే సత్తా ఉన్నా.. ఆ దిశగా ఏకం కాలేకపోతున్నారు. అటువంటి ఆకాంక్షను కాన్షీరాం తొలిసారి దళిత, బడుగు వర్గాలకు రాజ్యాధికార రుచి చూపగలిగారు. మన ఓటు మనకే అనే నినాదం రాజ్యాధికారానికి సాక్ష్యంగా నిలిచింది. అయినప్పటికీ ఏకం కాలేకపోతున్నారు. బీహార్లోని మారుమూల పల్లెలో పుట్టిన బాబు జగ్జీవన్ రామ్ తనకు ఎదురైన వివక్షలను జయిస్తూ.. ఉప ప్రధానిగా ఎదగగలిగారు. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పని చేసి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ గతిని మార్చాడు. అయినప్పటికీ బాబు జగ్జీవన్రామ్ను వివక్ష వదలలేదు. ప్రధానమంత్రిగా ఎదిగే సత్తా ఉన్నా కాకుండా నియంత్రించగలిగారు. అయినప్పటికీ ఒకానొక దశలో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్తో 14 స్థానాలను గెలిపించి కింగ్ మేకర్గా రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర ఉన్నప్పటికీ .. అంతే వేగంగా దళితుల చైతన్యాన్ని ఆధిపత్య రాజకీయాలు అంతం చేస్తూ వస్తున్నాయనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు ఒక్కసారిగా దళితుల చైతన్యాన్ని వేటకొడవళ్లు, గొడ్డళ్లతో నరికి చంపిన చరిత్ర ఉంటే... నేడు రాజకీయంగా విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎదుగుదల లేకుండా అడ్డుకోగలుగుతున్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి తెలంగాణ ఏర్పాటు వరకు దళిత, మాదిగ వర్గాలు ఎన్నో అవమానాలు, అణచివేతలు ఎదుర్కొన్నాయి. సామాజిక సమానత్వం కోసం మాదిగల రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలు మించి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు మాదిగల న్యాయమైన ఆకాంక్షను గుర్తించి ఎస్సి వర్గీకరణ చట్టం అమలుకు నోచుకుంది. ఇంతటితోనే మాదిగల బతుకుల్లో పూర్తి స్థాయిలో ఆశించినంత ఫలితాలు మాత్రం రావు. తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే సత్తా ఉన్న మాదిగలకు ఇప్పుడు వాటా కావాలి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఉపాధి రంగాలలో అవకాశాలు లభించాలి. తెలంగాణ రాజకీయాలలో మాదిగల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా మారకుండా తరతరాల మాదిగల బతుకుల్లో మార్పు అసాధ్యం. ఇప్పుడు మాదిగ సమాజానికి హక్కులు అడిగే బలమైన రాజకీయ శక్తి అవసరం ఉంది. ఆ శక్తిని చాటితే తప్పా మాదిగలకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత దక్కదు. రాజకీయ రంగంలో ప్రాధాన్యత దొరకనంత కాలం శాసించే శక్తిగా ఉన్న మాదిగ సమాజం యాచించే స్థితిలోనే ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మాదిగల జనాభా ఆనాడే 50 లక్షలకు చేరింది. ఇప్పుడు పెరిగిన జనాభాను తీసుకుంటే తెలంగాణ జనాభాలో సుమారు 70 లక్షల జనాభా మాదిగలు ఉంటారు. ఇంత జనాభా ఉండి అచేతనంగా ఉన్న ఈ వర్గానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులకోసం సరికొత్త శక్తి ఏర్పాటు అవుతోంది. అదే మాదిగ మహా శక్తి. 30 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అనేక సామాజిక కార్యక్రమాల్లో నిలబడిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింలు నేతృత్వంలో హక్కుల సాధన దిశగా మాదిగ మహాశక్తి పురుడుబోసుకుంది. ఇప్పటికే మాదిగ మేధావి, ఉద్యోగ, వివిధ రంగాల వారితో నిత్యం మేధో మథనం తరువాత ఇప్పుడు ఓ రాజకీయ, హక్కుల పోరాటానికి తోవ పరిచాడు. మాదిగలను చైతన్యం చేస్తూనే కలిసివచ్చే బడుగు, బలహీన వర్గాలతో రేపటి రోజుల్లో తెలంగాణలో మాదిగ మహాశక్తి తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన జెండా రూపకల్పన, విధివిధానాలు వంటివి సిద్ధం చేసి ఏప్రిల్ 5న జెండా ఆవిష్కరణ జరగనుంది. ఇది ఒక్క మాదిగ సమాజానికి మాత్రమే పరిమితం కాదు, మాదిగలను ఏకతాటిపైకి తెస్తూ కలిసివచ్చే మిగతా బహుజన వర్గాలను కలుపుకొని రాజకీయశక్తిగా నిలవనుంది. స్వల్ప జనాభా కలిగినవారు నాయకులుగా అధికారాన్ని చెలాయిస్తున్న తరుణంలో.. శాసించే సత్తా కలిగే జనాభా కలిగిన మాదిగలు మరో అస్తిత్వ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మన ఓటును మన వారికే వేసి రాజకీయ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఓ గొప్ప సంకల్పంతో ముందుకువస్తున్న మోత్కుపల్లి నర్సింలు వెంట మాదిగ సమాజం ప్రవాహంలా ప్రయాణించాలి.. మాదిగల అభివృద్ధి ధ్యేయంగా.. మానవతా వాదమే లక్ష్యంగా బలమైన సంకల్పానికి మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. సంపత్ గడ్డం 78933 03516
Revanth Reddy : నేడు కేరళంలో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళంలో పర్యటించనున్నారు
Telangana : తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల బాదుడు
తెలంగాణలో నేటి నుంచి కొత్త కరెంట్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి
తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఇఒ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Andhra Pradesh : చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది
గరుడ వాహనం పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి..
గరుడ వాహనం పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి.. బెజ్జంకి, ఆంధ్రప్రభ :
నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన
నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది
తల్లి పక్కన నిద్రిస్తున్న పసికందును లాక్కెళ్లిన చిరుత #Maharashtra #LeopardAttack #Infant #Jalgaon
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో పగలు ఎండ.. సాయంత్రం వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి
Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి
ఛైర్మన్ ఛాంబర్ లో.. మందు పార్టీ..
ఛైర్మన్ ఛాంబర్ లో.. మందు పార్టీ.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర #LPGPriceHike #CommercialGas #BreakingNews #IndiaNews
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
Gold Prices Today : యుద్ధం కొనసాగితే బంగారం 70 వేలకు చేరుకుంటుందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి
American-Journalist-Kidnapped : లేడీ జర్నలిస్ట్ కిడ్నాప్ Andhra Prabha News
American-Journalist-Kidnapped : లేడీ జర్నలిస్ట్ కిడ్నాప్ Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
కొండను ఢీకొట్టిన విమానం: 29 మంది మృతి
మాస్కో: రష్యా దేశంలో నల్ల సముద్రంలోని క్రిమియా ద్వీపకల్పంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పెనున్సులాలో కొండచరియను విమానం ఢీకొట్టడంతో 29 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో 23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని విమానయాన అధికారులు వెల్లడించారు. 2014లో యుక్రెయిన్ దేశంలో నుంచి క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఎఎన్-26కి చెందిన సైనిక విమానంగా గుర్తించారు. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
పనికి వెళ్లి తిరిగి వస్తుంటే..
పనికి వెళ్లి తిరిగి వస్తుంటే.. కడెం, (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం
RBI : ఆర్బీఐ కొత్త రూల్స్.. ఖాతాదారులకు ఊరట
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది
Amaravathi : నేడు అమరావతికి చట్టబద్ధత
ఈరోజు పార్లమెంట్లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రానుంది.
యువత, మహిళల కోసం.. జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ ఎస్టిపిపిలో నిర్వహిస్తున్న కంప్యూటర్
Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి తీపికబురు
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది.
ఒకే రకమైన పంటలు వేస్తే.. కుంటాల, ఆంధ్రప్రభ : పంటల సాగు పద్ధతులపై
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. ట్రాఫిక్ ఆంక్షలివే
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరగనుం
Chandrababu : నేడు నెల్లూరు, కడప జిల్లాలకు చంద్రబాబు
నేడు నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
గద్దర్ అంటేనే అణగారిన కన్నీళ్లకు స్వరం: పొన్నం
హైదరాబాద్: 'తెలంగాణ గర్వకారణం గద్దర్ అన్న.. జోహార్ గద్దర్ అన్న…మీ గొంతు నిశ్శబ్దం కాలేదు… ప్రజల గుండెల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పొన్నం తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను ధైర్యంగా ప్రస్తావిస్తూ, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితులను దేశం ముందుకు తీసుకువచ్చారన్నారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల్లో గద్దర్ వంటి మహానుభావుడి పేరు ప్రస్తావన రావడం బాధాకరమైన విషయమని చెప్పారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే నాయకుడు అని, గద్దర్ లాంటి ప్రజాకళాకారులు, ఉద్యమయోధుల విలువను అర్థం చేసుకుని, వారి పోరాటాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి అని పొన్నం తెలియజేశారు. అణగారిన వర్గాల స్వరం వినిపించేందుకు, వారి బాధలను దేశం ముందుకు తీసుకురావడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారని, ప్రజల కోసం పాట పాడిన గొంతుకలను గౌరవించడం అని, ప్రజల కోసం పోరాడిన నాయకులను ఆదరించడం రాహుల్ గాంధీ ప్రత్యేకత అని కొనియాడారు. గద్దర్ లాంటి మహానుభావులు సమాజానికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభాలు అని, అలాంటి వారిని కాపాడటం, గౌరవించడం, వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం గొప్ప అని పొన్నం పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచే బాధ్యతను రాహుల్ గాంధీ నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. గద్దర్ అంటే కేవలం ఒక కళాకారుడు కాదు అని, ప్రజల బాధలను తన గొంతులో మోసిన గొంతుక అని, అణగారిన వారి కన్నీళ్లకు స్వరం ఇచ్చిన పోరాటయోధుడు అని, ఆయన పాటలు వినిపించేవి కాదని, వేడి రక్తాన్ని కదిలించేవని, అన్యాయంపై తిరుగుబాటు రగిలించేవని, తెలంగాణ మట్టిలో ప్రతి గుండె చప్పుడు లా మారేవని మెచ్చుకున్నారు. ఈ నేల కోసం…నీళ్ల కోసం…నిజమైన హక్కుల కోసం…తన జీవితం మొత్తం అంకితం చేసిన మహానుభావుడు గద్దర్ అని ప్రశంసించారు. అలాంటి మహోన్నత వ్యక్తిని అవమానించడం అంటే ఒక్క వ్యక్తిని కాదు అని, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూడటమేనని, గద్దర్ పాటలు కేవలం స్వరాలు కావు అని, అవి ఒక ఉద్యమ చరిత్ర, అవి ఒక తరానికి ప్రేరణ, అవి న్యాయం కోసం ఎప్పటికీ మసకబారని జ్యోతి అని పొన్నం తెలిపారు.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో భారీ డ్రగ్స్ బస్ట్ వెలుగులోకి #Hyderabad #RGIAirport #DrugBust #DRI
Andhra Pradesh : ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి: గడ్డం స్వప్న
మన తెలంగాణ/మోత్కూర్: మున్సిపల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య కోరారు. మంగళవారం 8 వ వార్డ్ అంగడి బజార్ లో లో వోల్టేజ్ నివారణకు నూతనంగా ఏర్పాటు చేసిన 100 కె వి ట్రాన్స్ఫార్మర్ ని చైర్మన్ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఏ డి ఈ బాలు నాయక్, ట్రాన్స్కో ఎఇ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, కౌన్సిలర్లు పన్నాల శ్రీ విద్య , బీసు శ్రీకాంత్ గౌడ్, కారుపోతుల వెంకన్న గౌడ్, మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి ఇంటర్ క్లాసులు.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా
మై విలేజ్ షో అనిల్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు
సిద్దిపేట: మై విలేజ్ షో అనిల్ గీలా కుటుంబాన్నిహరీష్ రావు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో అనిల్ గీలా తండ్రి మృతి చెందాడు. స్వగ్రామం సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం దర్గపల్లి గ్రామంలోని ఇంటికి వెళ్ళి అనిల్ కుటుంబ సభ్యులను హరీష్ పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సాహస యాత్ర.. నేటి నుంచి సలేశ్వరం జాతర
దక్షిణ భారత దేశంలో తెలంగాణ అమరనాథ్ యాత్ర, నేటి నుండి 3 వరకు సలేశ్వరం జాతర గత ఏడాది 3 లక్షల మంది భక్తులు, మార్గమధ్యలో అభయారణ్యం, వైద్యశిబిరాలు, చలివేంద్రాలు ఏర్పాటు మన తెలంగాణ/అచ్చంపేట : నల్లమల్ల అటవీ ప్రాంతం అనేక శివాలయ క్షేత్రాలకు పుట్టినిల్లు. కొండల గుట్టల మధ్యన శివ క్షేత్రాలకు నిలయమై భక్తుల చేత ఆయా సందర్భాలలో పూజలు అందుకుంటున్న శైవ క్షేత్రాలు అనేకం. రాష్ట్రంలో అతిపెద్ద ఆదివాసీల జాతర సమ్మక్క సార క్క. సలేశ్వరం జాతర రెండోది అని చెప్పవచ్చు. సమ్మక్క సారలమ్మ జా తర రెండేళ్లకొకసారి జరిగితే.. సలేశ్వరం జాతర ప్రతి ఏడాది జరగడం విశేషం. రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం పరిధిలో ని నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో కొండలు, కోనలు, రెండో ఎత్తయిన గుట్టల సరికల మధ్యన వెలిసిన సలేశ్వరం శివలింగయ్యను ద ర్శించుకోవాలంటే సాహసోపేతమైన యాత్ర చేయాల్సి ఉంటుంది. లిం గమయ్య దిగువన దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జలపాతాన్ని తాకిన భక్తులు మైమరిసిపోతూ గుండంలో పుణ్య స్థానాలు చేస్తారు. ఈ యాత్రను దక్షిణ భారతదేశంలో తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలువబడుతున్న ఈ సాహస యాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి కాకుం డా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు, ప్రకృతి ప్రేమికు లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా దర్శించుకుంటారు. యాత్ర ప్రతి ఏ డాది చైత్ర పౌర్ణమి ఒక్క రోజే దాదాపు లక్ష మందికి పైగా భక్తులు శివనామ స్వరంతో దర్శించుకుంటారు. ఏప్రిల్ 1 నుండి 3 వరకు సలేశ్వ రం జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది సలేశ్వరం జాతర వే డుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా ప్లాస్టిక్ నియంత్రణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరువ చూపుతున్నారు. - ఆలయ చరిత్ర నాగార్జున కొండలో బయటపడిన ఆధారాలను బట్టి ఇక్ష్వాకుల కాలం క్రీస్తు శకం 360 కాలపు నిర్మాణాలు లింగమయ్య గుడికి ఏర్పాటుచేసి న ఇటుకలను బట్టి అర్థమవుతుంది. అలాగే గర్భగుడి ముఖద్వారం నా టి విష్ణు కుండీల శిలాఫలకం ఉన్నది. ఆలయాన్ని ద్వారానికి కుడివైపు న వీరభద్రుడు దక్షకుడి విగ్రహాలు, ఎడమవైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి ముందు భాగంలో 10 అడుగుల క్రింద సలేశ్వ రం గుండం ఉన్నది. వస్తున్నాం లింగమయ్య అంటూ భక్తులు నల్లమల ప్రతి ధ్వనించే విధంగా ప్రయాణం కాలి నడకన కొనసాగుతోంది. నల్లమల్ల కొండల్లో కోనల్ల మధ్యన వెలిసిన లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన సుమారు 4 కి.మీ కొండలు గుట్టలను ఎక్కు తూ, దిగుతూ లోయల సరికలకుండా భక్తులు వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య, హర హర శంభో శంకర అంటూ భక్తులు గొంతు ఎత్తు తూ కొండల మధ్యన శివనామ స్వరంతో దరులు దద్దరిల్లేలా యాత్రను కొనసాగిస్తారు. సాహసోపేతమైన యాత్ర చైత్ర మాసం పౌర్ణమి సందర్భంగా నల్లమల్ల అడవుల్లో కొలువుదీరిన శి వలింగయ్యను దర్శించుకునే యాత్ర అమరనాథ్ను తలపించేలా ఈ యాత్ర ఉంటుంది. అమరనాథ్ యాత్ర మంచు కొండలలో కొనసాగితే ఈ యాత్ర మాత్రం అడవులు, కొండలు, గుట్టలు, లోయలు మార్గంలో కొనసాగుతది. స్వామిని దర్శించుకునే సమీప ప్రదేశంలో రెండు గుట్టల మధ్యన ఇరుకైన బాటలో భక్తులు సాహసోపేతంగా నడుస్తూ అలసిపోయిన భక్తులకు గుండం వద్దకు చేరుకోగానే సుమారు వెయ్యి అడుగుల ఎత్తు నుండి దూకే జలపాతాన్ని తాకగానే కాలినడకన వచ్చిన బాధను మరిచిపోయి మైమరసిపోతూ లింగమయ్య దర్శించుకుంటారు. ఆది నుంచి ఆదివాసులే పూజారులు. సమ్మక్క సారలమ్మ జాతరలో ఆదివాసులే పూజారులు ఎలా ఉత్సవాలను కొనసాగిస్తారు. నల్లమల్ల అడవి ప్రాంతంలో కొండల మధ్యన ఉన్న సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలంటే నాగర్ర్నూల్ జిల్లాలో ఒక మార్గం లింగాల మండలం అ ప్పాయిపల్లి గ్రామం మీదుగా 30 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సి ఉం టుంది. మరో మార్గం శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి వెంట అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చేరుకోవాలి. అక్కడ ను ంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుం చి అడవి మార్గంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ పెంట వద్దకు వాహనాలు ద్వారా చేరుకోవచ్చు. అక్కడనుండి నాలుగు కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు లోయలు దాటుకుంటూ సాహసోపేతమైన యాత్ర కాలినడకన లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం భక్తులు సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలంటే నాగర్కర్నూల్ జిల్లాలో ఒక మార్గం లింగాల మండలం అప్పాయి పల్లి గ్రామం మీదుగా 30 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మరో మార్గం శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి వెంట అమ్రాబాద్ మ ండలం మన్ననూరు గ్రామానికి చేరుకోవాలి. అక్కడ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుంచి అడవి మా ర్గంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ పెంట వద్దకు వాహనాలు ద్వారా చేరుకోవచ్చు. అక్కడనుండి నాలుగు కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు లోయలు దాటుకుంటూ సాహసోపేతమైన యాత్ర కాలినడకన లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శా తం భక్తులు మన్ననూరు ఫరహాబాద్ చౌరస్తా నుంచి సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు. - ప్రత్యేక బస్సులు సలేశ్వరం జాతర వేడుకలకు భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కాకుండా నల్గొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు రాంపూర్ పేట వద్దకు మాత్రమే చేరుకుంటాయి. అక్కడ నుండి భక్తులు కాలినడకతో 4 కి.మీ పాదయాత్ర చేసి.. అక్కడ అన్నదానంలో పాల్గొని గుట్టల్లో మరో నాలుగు కి.మీ వరకు వెళ్లి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటారు. - భారీ బందోబస్తు సలేశ్వరం జాతర వేడుకలకు లక్షలాది భక్తులు వస్తున్న నేపథ్యంలో భ క్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్, అడవి శాఖ సమన్వయంతో పెద్ద మొత్తంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ శాఖ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మ రోవైపు ఇటీవల నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏర్పాట్లు చే యాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు, వైద్యం, శానిటేషన్ తదితర సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జాతర ఏర్పాట్లకు రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో ముందుకు పోతున్నారు. గత సంవత్సరం 3 లక్షల మంది భక్తులు వచ్చారని ఈ సంవత్సరం భక్తులు పెరిగే అవకాశం వుండవచ్చుని అధికారులు అంచనా వేస్తున్నారు. - అభయారణ్యం మార్గమధ్యలో వైద్యశిబిరాలు, చలివేంద్రాలు రాంపూర్ పేట నుండి భక్తులు కాలినడకతో గుట్టల్లో మరో నాలుగు కి.మీ వరకు పోవాల్సిఉంది. తదనంతరం సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. మార్గమధ్యంలో భక్తులు ఎండలకు సొమ్మసిల్లీ పడి పోయాప్రమాదం వుంది కనుక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రలు ఏర్పాటు చే యడం ఆనవాయితీగా వస్తుంది.
నేటి నుండి జనగణన.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన-2027
Israel - Iran War : ఇరాన్పై దాడులు… బెరూట్, ఖతార్, సౌదీ, యుఏఈలో ఉద్రిక్తత
ఇజ్రాయిల్, అమెరికా కలిసి మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్ పై మరో దఫా దాడులు జరిపాయి
మహిళా పోలీస్ త్రివేణికి తీవ్ర గాయాలు..
మహిళా పోలీస్ త్రివేణికి తీవ్ర గాయాలు.. తుగ్గలి, ఆంధ్రప్రభ : పత్తికొండ మండలం
Israel - Iran War : యుద్ధం నెలరోజులు దాటినా ముగిసేట్లు లేదుగా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మిత్రదేశాలపై తీవ్ర విమర్శలు చేశారు
Israel - Iran War : ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు..యుద్ధం ఆగినా తగ్గవట
ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు, గ్యాస్ ధరలు యూరప్లో ఒక్కసారిగా పెరిగాయి
తక్షణ చర్యలు తీసుకోవాలి –డాక్టర్ మెహబూబ్ షేక్..
తక్షణ చర్యలు తీసుకోవాలి – డాక్టర్ మెహబూబ్ షేక్.. విజయవాడ, ఆంధ్రప్రభ :
1stAprilchintana |దేవాలయ ప్రాముఖ్యతపై ఆధ్యాత్మిక విశ్లేషణ..
1stAprilchintana | దేవాలయ ప్రాముఖ్యతపై ఆధ్యాత్మిక విశ్లేషణ.. 1stAprilchintana | ఇల్లు మరియు
1stAprileditorial |ఇరాన్ యుద్ధం.. ప్రపంచం పై ఆర్థిక ప్రభావం..
1stAprileditorial | ఇరాన్ యుద్ధం.. ప్రపంచం పై ఆర్థిక ప్రభావం.. 1stAprileditorial |
మూసీ ప్రక్షాళనపై ప్రజాభిప్రాయ సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ బుధవారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొ న్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా ప్రాజెక్టు పురోగతి, ప్రజల భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. మూసీ ప్రాజెక్టు రూపకల్పన, అమల్లో ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈనెల 15వ తేదీ వరకు ప్రజలు తమ సలహాలను, సూచనలను ప్రభుత్వానికి పంపవచ్చని కమిటీ వెల్లడించింది. ప్రాజెక్టుపై అభిప్రాయాలు ఉన్నవారు musrirdc@gmail.com అనే అధికారిక ఇమెయిల్ ఐడీకి తమ సూచనలను పంపాలని కేబినెట్ సబ్ కమిటీ కోరింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పునరావాస ప్యాకేజీలు, అభివృద్ధి పనుల విషయంలో పారదర్శకత పాటించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోం ది. ఈ క్రమంలో ప్రజలు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ప్రాజెక్టు విజయవంతానికి ఎంతో దోహదపడతాయని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మంత్రు లు అభిప్రాయపడ్డారు.
1stApril2026 |బుధవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
1stApril2026 | బుధవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 1stApril2026 |
దుబాయ్: ఇరాన్లోని ప్రధాన అణు కేంద్రాలు ఉ న్న నగరం ఇస్ఫహాన్పై అమెరికా మంగళవారం భారీ వైమానిక దాడులు జరిపింది. ఆయుధ నిల్వ లు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడి చేసింది. ఈ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడికి సంబంధించి న వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అదే సమయంలో పెర్షియన్ గల్ఫ్లో పూర్తిగా చమురు లోడ్తో వెళ్తున్న కువైట్ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలతో అమెరికా-ఇజ్రాయెల్ మొదటి దాడులు ప్రారంభమైన దాదాపు నెల తర్వాత కూ డా యుద్ధం తీవ్రత తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోం ది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 3,000 మందికి పైగా మరణించగా, ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్కు 4 డాలర్లను దాటడం కూడా ఈ యుద్ధ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు మార్కెట్లలో కలకలం పెర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ చమురులో ఐదవ వంతు రవాణా జరిగే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం, అలాగే ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం వల్ల గ్లోబల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 106 డాలర్ల వద్ద ఉండగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 45 శాతం పెరుగుదల నమోదైంది.ఈ ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ త్వరలో ఆపకపోతే, హా ర్మూజ్ మార్గం తెరవకపోతే దాడులను మరింత విస్తరించనున్నట్లు హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై మరోసారి దాడులు ప్రారంభించాయి. రాజధాని తెహ్రాన్తో పాటు ఇస్ఫహాన్ ప్రాంతం లక్ష్యంగా భారీ దాడులు జరిగినట్లు సమాచారం. ఇస్ఫహాన్ ప్రాంతంలో భారీ స్థాయిలో యురేనియం నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఈ ప్రాంతం లక్ష్యంగా మారింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, శుద్ధి చేసిన అధిక యురేనియాన్ని ట్రక్కుల ద్వారా భూగర్భ సొరంగాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ తీరానికి సమీపంలో కువైట్ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ట్యాంకర్లో మంటలు చెలరేగినా, తరువాత అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దాడిలో చమురు లీకేజీ జరగలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ మిగులు భాగాలు నివాస ప్రాం తంలో పడటంతో నలుగురు గాయపడ్డారు. బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగగా, సౌదీ అరేబియా తన రాజధాని వైపు దూసుకొచ్చిన మూడు క్షిపణులను అడ్డుకుంది. ఇజ్రాయెల్లో కూడా భారీ పేలుళ్లు వినిపించాయి. లెబనాన్లో శాంతి బలగాలు మృతి ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం కొనసాగుతున్న లెబనాన్లో, 24 గంటల్లో ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ టనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర స మావేశం నిర్వహించనుంది. ఇరాన్లో 1,900 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్లో కూడా మరణాలు నమోదయ్యాయి. లెబనాన్లో 1,200 మందికి పై గా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితు లు కొనసాగుతుండగా, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్ర భావం చూపుతోంది.
మా హెచ్చరికతోనే ఆంధ్ర వెనకడుగు
మన తెలంగాణ/హైదరాబాద్: ‘శ్రీశైలంలో నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మా హెచ్చరికతోనే విరమించుకుంది..’ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్లో కనిష్ఠ నీటి మట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు)కు చేరుకున్నప్పుడు శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. మన రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాలు పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా నీటిని వినియోగించుకుంటున్నదని మంత్రి జూపల్లి విమర్శించారు. ఈ అంశంపై ఎన్ని సార్లు ఆ రాష్ట్రానికి విన్నవించినా ఏపీ సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. అందుకే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, రైతులు అదే విధంగా కృష్ణా పరివాహక ప్రాంత జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామని వారు చెప్పారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిందని వారు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వారు వివరించారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ - ప్రజాప్రతినిధులంతా దేనికైనా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. పాలమూరు జిల్లాకు నష్టం జరిగితే- రైతు పక్షాన ప్రభుత్వం పోరాడుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని మంత్రి జూపల్లి అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇలాగే వ్యవహరిస్తే ఆందోళన చేపటామని, హై కోర్టునాశ్రయించామని ఆయన గుర్తు చేశారు. అప్పుడు, ఇప్పుడ, ఎప్పుడైనా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు
బిఆర్ఎస్పై బురద జల్లేందుకు కాళేశ్వరంపై కట్టుకథలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు పెద్దగా తేడా లేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు అన్నారు. పార్లమెంట్లో కాళేశ్వరంపై సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ పా ర్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. బిఆర్ఎస్పై బురదజల్లేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీల ఫెవికాల్ బంధం బయటపడిందని ఆరోపించా రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అ న్ని అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. అ సెంబ్లీ మీడియా హాలులో మంగళవారం బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో కలిసి హరీష్రావు మీడియా తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మం త్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించాయని అన్నారు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం వల్ల గత రెండేళ్లలో వేల ఎకరాల సాగు భూమి విస్తీర్ణత పెరిగిందని నివేదిక పెట్టారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్టుకు, ముసీలో తెచ్చే గో దావరి నీళ్లు కాళేశ్వరం నుండి వస్తున్నాయని తెలిపారు. సీఆర్ పాటిల్ తెలంగాణకు వచ్చి ఇ క్కడ రైతులను నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ ని అడిగితే సమాధానం వస్తుందని అన్నారు. కేవలం బిఆర్ఎస్ పార్టీ మీద బురదజల్లడానికే కాళేశ్వరం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రూ.50 కోట్లు ఖర్చు చేస్తే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుందని తెలిపారు. రెండేళ్ల నుంచి దాదాపు 20 లేఖలు రాస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదని ఆరోపించారు. తమ మీద కోపం ఉంటే తీర్చుకోవచ్చు... కానీ ఆ కోపాన్ని రైతుల మీద చూపించవద్దని కోరారు. కెసిఆర్ ఆదేశాల మేరకు, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బిఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. కేరళ ఎన్నికల కోసం శాసనసభను వాయిదా వేశారు కేరళ ఎన్నికల కోసం శాసనసభను 30వ తేదీనే నిరవధిక వాయిదా వేశారని హరీష్రావు ఆరోపించారు. కేరళ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అవసరమేమో కానీ బిఆర్ఎస్కు ప్రజా సమస్యలు ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజా సమస్యలు ముఖ్యమా..లేక కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా..? అని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు ఒక దిశా నిర్దేశం లేకుండా ముగిశాయని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలపై స్పష్టత వస్తుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ప్రభుత్వం తీవ్ర నిరాశనే మిగిలించిందని అన్నారు. బడ్జెట్, బిల్లులు పాస్ చేసుకోవడానికి, రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి మాత్రమే తూతూ మంత్రంగా సభను నడిపారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే.. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీలను గాలికి వదిలేసి, పహిల్వాన్ల భాషను మాట్లాడారని హరీష్రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహిల్వాలు, కుస్తీ పోటీలు ఉండవని విమర్శించారు. అసెంబ్లీని కుస్తీల పోటీగా మార్చారని మండిపడ్డారు. కత్తులతో కోలాటంలో తలలు తీసేస్తామని మరో ఎంఎల్ఎ వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో రేవంత్ రెడ్డి సభలో మాట్లాడిన ఎన్నో అనాగరిక వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం వైఫల్యాలను నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయంలో మూడు శాఖలు దూసుకుపోతున్నాయి.2025-26 ఆర్థి క సంవత్సరానికి గానూ వాణిజ్య పన్నుల శాఖ, ఎ క్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు గతేడాది కన్నా ఈసారి ఆదాయంలో అధిక వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలో మొ దటిస్థానం కమర్షియల్ ట్యాక్స్ది కాగా, రెండోస్థా నం ఎక్సైజ్ శాఖ, మూడో స్థానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు ఉంటాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) గానూ కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం సుమారు రూ.78,655 కోట్ల పైచిలుకు రాగా, ఎక్సైజ్ శాఖకు రూ.39,494 కోట్లు, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.15,925కోట్ల ఆదా యం వచ్చినట్టు ఆ శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ గణాంకాలు 31వ తేదీ రాత్రి వ రకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఈ గణాంకాల్లో స్వల్పమార్పులు ఉంటాయని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం (2024-25)లో కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం రూ.75,149 కోట్లు కాగా, ఎక్సైజ్ శాఖకు రూ.34,603 కోట్లు, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.14,214 కోట్ల ఆదా యం వచ్చింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం గతేడాది కన్నా ఈసారి రూ.3,506 కోట్ల ఆదాయం అధికంగా వ చ్చింది. ఇక, ఎక్సైజ్ శాఖకు గతేడాది కన్నా ఈసారి రూ.4,891 కోట్ల అధిక ఆదాయం రాగా, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.1,711 కోట్ల అధిక ఆదాయం రావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) కమర్షియల్ ట్యాక్స్ ఆదాయంలో జిఎస్టీ వసూళ్ల ద్వారా రూ.43 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ఈ శాఖకు రాగా, పెట్రోల్ ఉత్పత్తుల ట్యాక్స్ ద్వారా సుమారుగా రూ.32 వేల కోట్ల పైచిలుకు ఆదాయం, ఇతర ట్యాక్స్ల ద్వారా మొత్తంగా ఆ శాఖకు రూ.78,655 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్టుగా ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి ఎక్సైజ్ శాఖ 14శాతం వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) గానూ ఎక్సైజ్ శాఖకు జనవరిలో రూ.3,325 కోట్లు, ఫిబ్రవరిలో రూ.3,208 కోట్లు, మార్చిలో రూ.3,425 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరిలో 34 లక్షల బీర్ల కేసులను, 32 లక్షల మద్యం పెట్టేలను, ఫిబ్రవరిలో 38 లక్షల బీర్ల కేసులను, 29 లక్షల మద్యం పెట్టేలను, మార్చిలో 25 లక్షల మద్యం కేసులను, 44 లక్షల బీ ర్ల కేసులను ఎక్సైజ్ శాఖ విక్రయించింది. దీంతోపా టు 2025 అక్టోబర్లో కొత్త మద్యంషాపుల కోసం వచ్చిన దరఖాస్తుల రూపంలో సుమారుగా రూ.2,868 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.39,494 కోట్లు ఆదాయం రాగా, గతేడాది ఈసారి 14 శాతం వృద్ధిని ఆ శాఖ నమోదు చేసింది. 18.05లక్షల డాక్యుమెంట్లతో.. ఈ ఆర్థిక సంవత్సరం (2025,26) గాను (సుమారుగా 18.05లక్షల) డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.15,925 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి 31వ తేదీ, బుధవారం ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం రాత్రి వరకు రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వినియోగదారులు భారీగా స్లాట్లు బుక్ చేశారు. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేయడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పనిగంటలు పెంచడంతో సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్లను పూర్తి చేశారు. ఆర్థిక సంవత్సరం నేటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూడు రోజుల పాటు ఉదయం 9.30ల నుంచి రాత్రి 8.30ల వరకు పనిగంటలను పెంచింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ మూడు రోజుల పాటు రెగ్యులర్గా జరిగే రిజిస్ట్రేషన్ల కంటే 60 శాతం అదనంగా స్లాట్లను కేటాయించారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బు ధవారం నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వ రకు నిర వధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతం లో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లు గా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మా ర్జిన్ రూ.16కు తగ్గించారని, దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు బుధవారం నుంచి నిరవ ధిక బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ధరలు పడిపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు, ఈ బంద్ పిలుపు పెద్దదెబ్బగా మారనుంది. బుధ వారం నుండి మాంసం లభ్యత ఉంటుందో లే దో అన్న సందేహంతో చాలామంది ఈరోజే మార్కెట్లకు క్యూ కడుతున్నారు. ఈ తరు ణం లో చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పౌ ల్ట్రీ కంపెనీలు రిటైల్ షాప్లకు ఇస్తున్న మార్జిన్లో ఇప్పుడు కోత విధించి చిన్న చిన్న దుకాణాలను లేకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇలాంటి ఆలోచనను పౌల్ట్రీ కంపెనీలు మానుకోవాలని సూచిం చారు. బుధవా రం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధ ర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఐపిఎల్ సీజన్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కూపర్ కొనొలి అద్భుత బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కూపర్ 44 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ (37) తనవంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 6 ఫోర్లతో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ (38), గ్లెన్ ఫిలిప్స్ (25) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ మూడు, చాహల్ రెండు వికెట్లను పడగొట్టారు.
బుధవారం రాశి ఫలాలు (01-04-2026)
మేషం వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృషభం సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. మిధునం దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. కర్కాటకం దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. సింహం చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కన్య దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తుల అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. వృశ్చికం ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ధనస్సు ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మకరం చుట్టుపక్కలవారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున స్థిరత్వం కలుగుతుంది. కుంభం ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి. మీనం సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అమెరికాకు మరోదేశం షాక్ ఇచ్చింది. స్పెయిన్ బాటలోనే ఇటలీ నడిచింది. ఇరాన్పై దాడులకు దిగుతున్న అగ్రదేశం విమానాలకు తమ గగనతలం మీదుగా అనుమతి లేదని తాజాగా ఇటలీ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడయ్యాయి. బాంబర్ విమానాలు నిలపడం, అక్కడి నుంచి ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి సిసిలీలోని వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుంటామని అమెరికా ఇటీవల ఇటలీకి చేసిన విజ్ఞప్తిని ఆ దేశం ప్రభుత్వం తిరస్కరించిందని మీడియా తెలిపింది. ఇప్పటికే మిత్రదేశాలు ఇరాన్పై యుద్ధంలో కలిసి రావడం లేదని ఆరోపణలు చేస్తున్న ట్రంప్కు తాజాగా ఇటలీ తీసుకున్న నిర్ణయం ఎదురుదెబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్పై అమెరికా దాడులను ఐరోపా యూనియన్ దేశాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటలీ తాజా నిర్ణయం వెలువడడం విశేషం.
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.
వర్స్ ఇన్నోవేషన్ బోర్డులో పి.ఆర్. రమేష్ నియామకం ఆడిట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగింత
పాలన బలోపేతంపై దృష్టితదుపరి వృద్ధి దశకు సంస్థ సిద్ధం
srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News
srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News
తడబడిన గుజరాత్.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే?
ఐపిఎల్ 2026లో భాగంగా పంజాప్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్(11) విఫలం కాగా.. శుభ్ మన్ గిల్(39), జోస్ బట్లర్(38), గ్లెన్ ఫిలిప్స్(25)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీంతో గుజరాత్, పంజాబ్ జట్టుకు కేవలం 163 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ మూడు వికెట్లతో రాణించగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు, జాన్సెన్ ఒక వికెట్ తీశారు.
మేడ్చల్ లో శ్రీరామ బేకరీలో కాలం చెల్లిన కేకులు
మేడ్చల్ లో శ్రీరామ బేకరీలో కాలం చెల్లిన కేకులు మేడ్చల్, ఆంధ్రప్రభ :
పంజాబ్ కింగ్స్ విజయ లక్ష్యం 163
మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి.తొలుత పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. జయ్కుమార్ వైశాక్ (3/34) పంజాబ్కు ప్రధాన వికెట్లు తీయగా, గుజరాత్ తరపున శుభ్మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ కింగ్స్ గెలవడానికి 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. పంజాబ్
ఉడుంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఉడుంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారు బైక్ ఢీ ఒకరు మృతి
ఈద్ గిఫ్ట్ విషయంలో గొడవ.. భార్య, పిల్లలను చంపి..
ముజఫర్నగర్: ఓ గిఫ్ట్ విషయంలో గొడవపడి.. తన భార్య, పిల్లలను హత్య చేసిన ఓ వ్యక్తి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్నగర్లోని సరవత్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితులను ఇర్షాద్ (32), అతని భార్య నోరీన్ (30), వారి రెండేళ్ల కుమారుడు అహిల్, రెండు నెలల కుమార్తె అక్షగా గుర్తించారు. నలుగురి మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్ష నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ తెలిపారు. ఇర్షాద్ సోదరి షాహీన్ కోసం ఉద్దేశించిన ఒక ఈద్ బహుమతి విషయంలో ఆ దంపతుల మధ్య గొడవ జరిగిందని బంధువులు అధికారులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బిజెపిలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్..
టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో మంగళవారం చేరారు. కేంద్ర మంత్రులు రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లియాండర్ పేస్ పోటీ చేసే అవకాశం ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో ఏప్రిల్ 23,29 తేదీల్లో జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి. పార్టీలో చేరే అవకాశం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, తదితర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది టికెట్ వ్యవహారం కాదని, ఇదో బాధ్యతని చెప్పారు. ‘ ఖేలో ఇండియా’తో దేశానికి, యువతకు సేవ చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. యువతకు ప్రధాన మంత్రి ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని అదే అంకిత భావంతో యువతపై తాను దృష్టిసారిస్తానని చెప్పారు. లియాండర్ పేస్కు కోల్కతా వంటి అర్బన్ ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉండటంతో ఆయనను పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. పేస్కు ఉన్న క్లీన్ ఇమేజ్తో ఎగువ మధ్య తరగతి ఓటర్లు, పట్టణ ప్రాంత నియోజక వర్గాలు, క్రీడాభిమానులను మరింతగా ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది. దేశం లోని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన లియండర్పేస్, టెన్నిస్ డబుల్స్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. బెంగాల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు. కోల్కతాలో పుట్టిన పేస్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్ వైపు నడిచారు. తన కెరీర్లో ఏకంగా 18 గ్రాండ్స్కామ్ టైటిళ్లు గెలిచారు. అందులో 10 మిక్స్డ్ డబుల్స్లో 8 పురుషుల డబుల్స్లో నెగ్గారు. రాకెట్ వదిలి, 2021లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.
దివంగత సిఎం జయలలిత భవనంను సీజ్ చేసిన జిహెచ్ఎంసి
ఆస్తిపన్ను చెల్లింపులో బకాయిపడిన తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవనాన్ని జీహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని జయలలిత అపార్ట్మెంట్ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులు బకాయిపడుతున్నట్టు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు పన్ను చెల్లించనందుకుగానూ ఆ భవనాన్ని సీజ్ చేశారు. ఈ విషయం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఆసక్తికరమైన చర్చకు కేంద్రబిందువైంది. ఇక అధికారులు ఇటీవల ఆస్తిపన్ను చెల్లింపులు పెండింగ్ పడినందున కమర్షియల్ భవనాలను సీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడక్కడ పన్ను బకాయిపడిన వారికి చెందిన ఆస్తులను సీజ్ చేయడం ద్వారా పన్ను వసూళ్ళను రాబడుతున్నారు. ఇదిలా ఉండగా జయలలిత ఇల్లు అని కూడా తెలియదని అధికారులు చెప్పడం గమనార్హం. మొదట కమర్షియల్ ప్రాపర్టీగా గుర్తించిన అధికారులు సీజ్ చేసిన ఈ భవనాన్ని, తరువాత రెసిడెన్షియల్ భవన నిబంధనల ప్రకారం సీజ్ తొలగించారు. సీజ్ చేయడం... ఈ భవనంపై మొత్తం రూ.1.59 కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉంది. ముందుగా భవనాన్ని సీజ్ చేయడంతో పన్ను వసూలుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రూ.78 లక్షలు అసలు పన్ను కాగా రూ.81 లక్షలు వడ్డీగా ఉంది. ఈ బకాయిలు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పేరుకుపోయి ఉన్నాయి. ఈ భవనం వాస్తవానికి రెసిడెన్షియల్ ప్రాపర్టీ కేటగిరీలోకి వస్తుందని తర్వాత అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం నివాస గృహాలను సీజ్ చేయకూడదనే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సీజ్ను తొలగించినట్టు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా భవనం ఖాళీగా ఉండటం వల్ల పన్ను చెల్లింపులు జరగలేదనేది సమాచారం. సంబంధిత భవన హక్కుదారులు జీహెచ్ఎంసీ అధికా రులను సంప్రదించి, పెండింగ్లో ఉన్న బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీనిచ్చారు. ఈ హామీతో పాటు, నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీలపై సీజ్ విధించడం తగదనే కారణంతో అధికారులు సీజ్ను ఎత్తివేశారు. పన్ను బకాయిల వసూళ్లపై జీహెచ్ఎంసీ కట్టుదిట్టంగా చర్యలు కొనసాగి స్తోందని తెలిపారు.
బెంగాలీలను వేధిస్తున్నారు.. బిజెపిపై విరుచుకుపడిన మమత
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో రాజకీయం వేడెక్కుతోంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి)పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమ మేదినీపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సిఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బిజెపిపై మాటల దాడి చేశారు. బిజెపి ఒక అనాగరిక పార్టీ అంటూ ధ్వజమెత్తారు. బిజెపి.. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వలసదారులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో బెంగాల్ నుండి వలస వచ్చిన వారిని వేధిస్తున్నారని, వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత అభ్యర్థులను పక్కనపెట్టి, తన నాయకత్వానికి మద్దతుగా నిలవాలని బెనర్జీ ప్రజలను కోరారు. మొత్తం 294 నియోజకవర్గాలలో నన్ను మీ అభ్యర్థిగా భావించండి అని దీదీ అన్నారు.కాగా, ఏప్రిల్ 23, 29 తేదీలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సిఎం మమతపై మరోసారి బిజెపి నాయకుడు సువేందు అధికారి పోటీ చేస్తున్నాడు. 202 1లో నందిగ్రామ్, భవానిపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన సువేందు.. మమతను ఓడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మమతపై సువేందు పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది: కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసిందన్నారు. కాగ్ 2024-25 నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెల్లడించిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు సంపద పెంచుతాం.. పేదలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా మిగతా అన్ని రోజులు ఆర్బీఐ నుంచి చేబదులుగా డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని నెట్టుకురావడం సిగ్గుచేటని అన్నారు. ఏడాది కాలంలో రూ.1.30 లక్షల కోట్లు చేబదులు అప్పులు తెచ్చి సర్కారును నడిపించటమంటే కచ్చితంగా అది చేతకాని తనమే అని విమర్శించారు. తెచ్చిన అప్పుల్లో మరో 6 వేల కోట్లు ఆర్థిక సంవత్సరం ముగిసినా చెల్లించలేదనే విషయాన్ని కాగ్ బట్టబయలు చేసిందని చెప్పారు. నెలకు రూ. 12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న తెలంగాణలో రోజువారీ కనీస అవసరాల కోసం రూ. 1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటెన్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఆరు లేన్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఎయిమ్స్ బీబీనగర్ వద్ద ఆరులైన్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ట్రాఫిక్ జామ్తో అత్యంత క్లిష్టంగా ఉన్న ఈ ప్రాంతంలో భారీ ఆరు లైన్ల ఎలివేటెడ్ ఫ్లై ఓర్లు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు అవకాశం కలిగింది. ఈ ప్రాజెక్టు వల్ల వరంగల్ హైవేపై ట్రాఫిక్ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని అంచనా. జాతీయ రహదారి 163పై ట్రాఫిక్ భద్రత, సౌకర్యాల మెరుగుదల లక్ష్యం చేపడుతున్న ఈ ప్రాజెక్టును రూ.98.26 కోట్ల వ్యయంతో 23 స్పాన్లతో 690 మీటర్లు పొడవైన ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఎయిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేట్, ఎమర్జెన్సీ గేట్లకు రాకపోకలకు సులభంగా ఉండేవిధంగా 1.70 కిమీ పరిధిలో పనులు చేపడతారు. హైవే రెండు వైపులా 1.48 కి.మీ సర్వీస్ రోడ్లు నిర్మాణంతో పాటు హైస్పీడ్ ట్రాఫిక్, ఆసుపత్రికి వచ్చే వాహనాల రాకపోకలు వేరు చేసేలా ప్రణాళికను రూపొందించారు. దీనికి తోడు ఆధునిక లైటింగ్, బస్ షెల్టర్లు, ట్రాఫిక్ సైన్లు, సేఫ్టీ మార్కింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు కల్వర్టుల పునర్నిర్మాణం కూడా చేపడతారు. ప్రమాదాల నివారణతో పాటు భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఫ్లై ఓవర్ రూపకల్పన జరుగుతోందని హైవే అథారిటీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా హైదరాబాద్- నుంచి యాదాద్రి ఎన్హెచ్163 పై బీబీనగర్ ఎయిమ్స్ వద్ద తరచుగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2019.-21 మధ్యకాలంలో జాతీయ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రదేశంగా గుర్తించి, ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉందని కేంద్రానికి నివేదించింది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశంగా గుర్తించి నివారణ కోసం ఇక్కడ ఫ్లై ్లఓవర్ నిర్మాణం చేపట్టాలని సూచించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎన్హెచ్ఐ ఈ ఆరు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
జాతీయ రహదారిపై రుధిరధారలు వెలికట్ట శివారులో రోడ్డు మరమ్మతు పూర్తికాక ప్రమాదాలుద్విచక్ర వాహనాలు
అంతుచిక్కని వైరస్తో వేల సంఖ్యలో కోళ్లు మృతి...
పౌల్ట్రీ రంగాన్ని ఒక అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా చనిపో వడం ఇప్పు డు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పెద్దకొత్తపల్లికి చెందిన రైతు వెంకటస్వామి పౌల్ట్రీ ఫాంలో గత మూడు రోజులుగా కోళ్లు వింతగా ప్రవర్తిస్తూ ప్రాణాలు వదులుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 5,000 కోళ్లు మృతి చెందాయి. దీనివల్ల సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మందులు వాడినా ఫలితం ఉండటం లేదని, రోజురోజుకూ చనిపోయే కోళ్ల సంఖ్య పెరుగుతోందని ఆయన వాపోతున్నారు. ఈ వార్త బయటకు రావడంతో స్థానికంగా ఇది బర్డ్ ఫ్లూ కావచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీంతో పెద్దకొత్తపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లోని నాన్-వెజ్ ప్రియులు చికెన్ కొనాలంటేనే భయపడుతున్నారు. చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. అయితే, ఇది బర్డ్ ఫ్లూనా లేక మరేదైనా కొత్త వైరస్సా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కోళ్ల మరణాల వార్త తెలుసు కున్న పశువైద్య శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ను సేకరించి పోస్ట్మార్టం నిమిత్తం ల్యాబ్ కు పంపారు. వైరస్ మరింత వ్యాపించకుండా చనిపోయిన కోళ్లను లోతైన గుంతలు తీసి పూడ్చివేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ల్యాబ్ నివే దిక వస్తుందని, అప్పటి వరకు రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పెట్టుబడి పెట్టిన సొమ్ము కూడా తిరిగి రాకపోవడంతో పౌల్ట్రీ రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైరస్ను గుర్తించాలని, నష్టపోయిన తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరు తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా లక్షలాది కోళ్లు ఇలాగే చనిపోతున్నాయని వస్తున్న వార్తలు పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్నాయి.
సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు
సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు
ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల విడుదలు రెండో వారంలో విడుదల కానున్నాయి. ముందుగా ఏప్రిల్ 6వ తేదీనే ఫలితాలు విడుదల చేయాలని భావించినా, బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాల వల్ల రెండో వారానికి వాయిదా వేశారు. ఫలితాల ప్రకటనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి సమాధాన పత్రాల రీ వెరిఫికేషన్ చేయించనున్నారు. సింగిల్ సబ్జెక్టు ఫెయిలైన వారితోపాటు ఒక్కో సబ్జెక్టులో కొన్ని జవాబుపత్రాలను ర్యాండమ్గా వెరిఫికేషన్ చేయించనున్నారు. ఆ తర్వాత సిజిజిలో ట్రయల్స్ నిర్వహించి అంతా సవ్యంగా ఉంటేనే ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్ ఫలితాలు విడుదలైన వారం పది రోజుల తర్వాత డిగ్రీ ప్రవేశాల కోసం ఇచ్చే దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Hectic Prabhas heads for a Holiday
Pan-Indian star Prabhas delivered his career’s biggest debacle Raja Saab this year. The actor is juggling between the sets of Fauzi directed by Hanu Raghavapudi and Spirit directed by Sandeep Reddy Vanga. He is yet to join the sets of Kalki 2898 AD sequel directed by Nag Ashwin. The shoot commenced recently and Prabhas will […] The post Hectic Prabhas heads for a Holiday appeared first on Telugu360 .
విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఎర్ర జాన్సన్
విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఎర్ర జాన్సన్ ఆలేరు, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమంలో
ఘనంగా మెట్టుగుట్ట రాములవారి రథోత్సవం..
ఘనంగా మెట్టుగుట్ట రాములవారి రథోత్సవం.. కాజీపేట, ఆంధ్ర ప్రభ : కాజీపేట మండలం
ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగిన వరి పంటలు
ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగిన వరి పంటలు ఎడపల్లి,ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో
మైనర్ బాలున్ని డీ డిక్షన్ తరలింపు
మైనర్ బాలున్ని డీ డిక్షన్ తరలింపు చెన్నూర్ ఆంధ్రప్రభ : గంజాయి కి
Longford |బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి
Longford | బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి Longford | హైదరాబాద్, ఆంధ్రప్రభ
మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..
మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : అకాల వర్షాలు, ఈదురుగాలులకు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల వద్ద 24.45 కిలోల హైడ్రోపోనిక్ ( గాంజా) ను డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఎయిరోపోర్టు అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించిన డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుల లగేజీ బ్యాగేజ్ లో ఆకుపచ్చిని రంగులో ప్యాకెట్లు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్ష చేయగా హైడ్రోపోనిక్ (గంజా) గా తేలింది . హైడ్రోపోనిక్ (గాంజా) స్వాధీనం చేసుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ విలువ 8.9 కోట్లు ఉంటుందని డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆధికారులు అంచనా వేశారు.
చత్తీస్గఢ్ ఇక నక్సల్స్ రహిత రాష్ట్రం: సిఎం విష్ణుదేవ్ సహాయ్
చత్తీస్గఢ్ ఇప్పుడు నక్సల్స్ రహిత రాష్ట్రమని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సహాయ్ ప్రకటించారు. కేంద్రం విధించిన గడువు మార్చి 31కి అనుగుణంగా చర్యలు చేపట్టామని, తద్వారా లక్షంగా చేరుకున్నామనారు. మంగళవారంనాడు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో విష్ణుదేవ్ మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రత్మక రోజని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ నక్సల్స్తో వేదిక పంచుకున్నారని, ఇప్పుడు ఆయన పార్టీ తమపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్ష తీవ్రవాదంపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు 3కోట్ల మంది ఈ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. అభివృద్ధికి తీవ్రవాదం ఇన్నాళ్లూ ఆటకంగా మారిందని అన్నారు. మావోయిస్టలకు గత 40 సంవత్సరాలుగా పెట్టనికోటగా మారిన బస్తర్ ఇప్పుడు పూర్తిగా బయటి ప్రపంచంతో మమేకం కాబోతోందని, తద్వారా పురోభివృద్ధికి బాటలు పడతాయని విష్ణుదేవ్ అభిప్రాయపడ్డారు
Top Actors in Salman Khan’s Next
Bollywood Superstar will soon work with Telugu director Vamshi Paidipally who has directed class films in the past. The combination is surprising and it raised curiosity across Telugu cinema and Hindi cinema. South Indian top beauty Nayanthara is finalized as the leading lady in this untitled film. This project also has several top-rated actors playing […] The post Top Actors in Salman Khan’s Next appeared first on Telugu360 .
ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం
ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం ద్వాదశ జ్యోతిర్లింగాల అభిషేకంభక్తులతో కిటకిటలాడిన దేవాలయంప్రత్యేక పూజలు
దుర్గమ్మ భక్తులకు పార్కింగ్ టోల్ తాత్కాలిక మినహాయింపు
దుర్గమ్మ భక్తులకు పార్కింగ్ టోల్ తాత్కాలిక మినహాయింపు కొత్త టెండర్ దారుడు బాధ్యతలు
ఎంత సంపాదించామన్నది కాదు.. ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం రాప్తాడు, ఆంధ్రప్రభ :
అద్భుతమైన విజువల్స్.. అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పలకరించిన హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతోంది. అనుష్క, జయసూర్య కలిసి నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్- ది వైల్డ్ సోర్సెరర్’. మంగళవారం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, శాండీ మాస్టర్, వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పార్కింగ్ టోల్ టెండర్ తో భారీ ఆదాయం.
పార్కింగ్ టోల్ టెండర్ తో భారీ ఆదాయం. ఇంద్రకీలాద్రి పార్కింగ్ టోల్ టెండర్
ఇరాన్ అణు కేంద్రం ఉన్న నగరంపై అమెరికా దాడులు..
ఇరాన్లోని ప్రధాన అణు కేంద్రాలు ఉన్న నగరం ఇస్ఫహాన్పై అమెరికా మంగళవారం భారీ వైమానిక దాడులు జరిపింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడి చేసింది. ఈ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అదే సమయంలో పెర్షియన్ గల్ఫ్లో పూర్తిగా చమురు లోడ్తో వెళ్తున్న కువైట్ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలతో అమెరికా -ఇజ్రాయెల్ మొదటి దాడులు ప్రారంభమైన దాదాపు నెల తర్వాత కూడా యుద్ధం తీవ్రత తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 3,000 మందికి పైగా మరణించగా, ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్కు 4 డాలర్లను దాటడం కూడా ఈ యుద్ధ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు మార్కెట్లలో కలకలం పెర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ చమురులో ఐదవ వంతు రవాణా జరిగే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం, అలాగే ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం వల్ల గ్లోబల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 106 డాలర్ల వద్ద ఉండగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 45 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ త్వరలో ఆపకపోతే, హార్మూజ్ మార్గం తెరవకపోతే దాడులను మరింత విస్తరించనున్నట్లు హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై మరోసారి దాడులు ప్రారంభించాయి. రాజధాని తెహ్రాన్తో పాటు ఇస్ఫహాన్ ప్రాంతం లక్ష్యంగా భారీ దాడులు జరిగినట్లు సమాచారం. ఇస్ఫహాన్ ప్రాంతంలో భారీ స్థాయిలో యురేనియం నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఈ ప్రాంతం లక్ష్యంగా మారింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, శుద్ధి చేసిన అధిక యురేనియాన్ని ట్రక్కుల ద్వారా భూగర్భ సొరంగాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ తీరానికి సమీపంలో కువైట్ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ట్యాంకర్లో మంటలు చెలరేగినా, తరువాత అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దాడిలో చమురు లీకేజీ జరగలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ మిగులు భాగాలు నివాస ప్రాంతంలో పడటంతో నలుగురు గాయపడ్డారు. బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగగా, సౌదీ అరేబియా తన రాజధాని వైపు దూసుకొచ్చిన మూడు క్షిపణులను అడ్డుకుంది. ఇజ్రాయెల్లో కూడా భారీ పేలుళ్లు వినిపించాయి. లెబనాన్లో శాంతి బలగాలు మృతి ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం కొనసాగుతున్న లెబనాన్లో, 24 గంటల్లో ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఇరాన్లో 1,900 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్లో కూడా మరణాలు నమోదయ్యాయి. లెబనాన్లో 1,200 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరల పెరుగుదలతో పాటు, భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి.
టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం
టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం రాప్తాడు, ఆంధ్రప్రభ : ఒక కార్యకర్త
వారం రోజుల అమెరికా పర్యటనకు కెటిఆర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వారం రోజుల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో కెటిఆర్ ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూహాలపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గతంలో కెటిఆర్ సాధించిన విజయాలు, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకుని ఈ ఆహ్వానం అందింది. వ్యాపార సదస్సుతో పాటు, ఈ పర్యటనలో కెటిఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలవనున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, కొంత సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుమారు వారం రోజుల పాటు అమెరికాలో ఉండనున్న కెటిఆర్, తిరిగి వచ్చాక తన రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు.
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2025.-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టైడ్ గ్రాంట్స్ రూ.371.91 కోట్లు, అన్టైడెడ్ గ్రాంట్స్ రూ.247.94 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా కేంద్రం నుంచి మరో వెయ్యి కోట్ల వరకు ఇంకా రావాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను దశల వారీగా విడుదలకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక స్వపరిపాలనను మెరుగుపరచడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించింది. ఈ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 12,600 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయించిన అభివృద్ధి పనులకు ఈ నిధులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వినియోగించుకోవాల్సి ఉంటుంది.
అటవీశాఖ ఆధ్వర్యంలో నూతన బోరు పంపు
అటవీశాఖ ఆధ్వర్యంలో నూతన బోరు పంపు బోర్ పంపు వేయిస్తున్న దృశ్యం లింగాపురం,
నేలకొరిగిన మొక్కజొన్న జొన్న పంట…..
నేలకొరిగిన మొక్కజొన్న జొన్న పంట….. రైతన్న కష్టం నేలపాలు.. కుబీర్, ఆంధ్రప్రభ :
Sharwa’s Biker Gets A Power Boost From Prabhas
Charming Star Sharwa’s sports and family drama Biker is already racing ahead with strong buzz, and the makers have now added more fuel to the excitement with a special promotional video featuring Prabhas. The video cleverly begins with Prabhas’ social media post praising the trailer, before shifting to a stylish sequence featuring a rider walking […] The post Sharwa’s Biker Gets A Power Boost From Prabhas appeared first on Telugu360 .
రాజకీయ మార్పుల దిశగా అడుగులు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి శ్రీ సత్యసాయి

28 C