Gold Price Today : షాకింగ్ న్యూస్...చెప్పలా.. చెప్పలా.. మళ్లీ బంగారం ధరలు పెరిగాయిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
నవోదయ ఫలితాలు విడుదల.. కుంటాల, ఆంధ్రప్రభ : నవోదయ ఫలితాలు విడుదల కావడంతో
Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది
Andhra Pradesh : దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మోత్కూర్ గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్య గిరి..
మోత్కూర్ గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్య గిరి.. మోత్కూర్, ఆంధ్రప్రభ :
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఇరాన్ మిస్సైల్ దాడులంటూ ప్రచారం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వడగండ్ల వానలు #FarmersLoss #RainImpact #TeluguStates #Agriculture
Andhra Pradesh : నేడు ఏపీలో దివ్యాంగ శక్తి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనుంది
ప్రమాదాలకు కారణం అదే.. చిలుపూర్, ఆంధ్రప్రభ : వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణించడం
Cyber Crime : ఒంటరిగా ఉన్న వాళ్లే టార్గెట్.. సైబర్ నేరగాళ్లు కొత్త దారులు
సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు
ఆరోగ్య కేంద్రంలో.. ఆకస్మిక తనిఖీ..
ఆరోగ్య కేంద్రంలో.. ఆకస్మిక తనిఖీ.. -వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలి-రికార్డులను సమయానికి అప్డేట్
Dhurandhar: The Revenge: Tension for Premiere Shows
Dhurandhar: The Revenge has created new records with the advance sales of the paid premieres that are scheduled today. The film is all set to open on a super strong note but there are last minute hurdles. The second half content is yet to be delivered by the team to the digital service providers. The […] The post Dhurandhar: The Revenge: Tension for Premiere Shows appeared first on Telugu360 .
వరంగల్ లో తండ్రి, కూతురు సజీవదహనం
హనుమకొండ: అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయి తండ్రి, కూతురు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడిపికొండ రాజీవ్ గృహకల్పలో తండ్రి రాజశేఖర్(54) కూతురు రాజశ్రీ, అల్లుడు నివాసం ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున తండ్రి రాజశేఖర్ మంటల్లో కాలిపోతున్నాడు. కూతరు మంటలార్పాడినికి వెళ్లి ఆమె కూడా కాలిపోయింది. వెంటనే అల్లుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి కేకలు వేశాడు. ఇద్దరు తీవ్ర గాయాలతో చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతిపై అనుమానాలు ఉన్నట్టు సమాచారం.
తనపై ఉన్న ప్రేమను జగన్ నిరాకరించడం లేదు : విజయమ్మ
షర్మిలకు తాను బినామీని కాదని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు
Chandrababu : పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంఛార్జి మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
Andhra Pradesh : నేడు చంద్రబాబుతో పవన్ భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలవనున్నారు
ఆదేశాలు ఇవ్వడమే కాకుండా.. -డ్రైనేజ్ కాల్వలను శుభ్రం చేయించిన ఒకటో వార్డు కౌన్సిలర్-ఆలస్యం
ముంబై: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాపై సౌతాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఎబి డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్లోనే బుమ్రా మెరుగైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అతన్ని మించిన బౌలర్ ఎవరూ లేరన్నాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఒక్క బుమ్రాకి మాత్రమే ఉందన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మెరుగైన ప్రదర్శన చేయడం బుమ్రా ప్రత్యేకత అన్నాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్కప్లో భారత్ను విజేతగా నిలుపడంలో అతని పాత్ర చాలా కీలకమని పేర్కొన్నాడు. రానున్న ఐపిఎల్లో బుమ్రా చెలరేగి పోవడం ఖాయమని డివిలియర్స్ జోస్యం చెప్పాడు.
ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోహిత్ సాధనకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ముంబై టీమ్ యాజమాన్యం అభిమానులతో పంచుకొంది. ఈ సీజన్లో అందరి దృష్టి రోహిత్పైనే నిలిచింది. ఇప్పటికే టెస్టులు, టి20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇలాంటి స్థితిలో రానున్న వన్డే ప్రపంచకప్ కోసం ఐపిఎల్ను సాధనగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు. పొట్టి క్రికెట్లో విధ్వంసక బ్యాటర్గా పేరు తెచ్చుకున్న రోహిత్ చాలా కాలంగా ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడి కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా అతను ఇప్పటికీ ముంబైకి ప్రధాన ఆటగాడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెరుగైన బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలవాలనే పట్టుదలతో రోహిత్ ఉన్నాడు.
EU Trade Deal : ప్రపంచంలో అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలకు మార్గం సుగమం
పరాగ్వే మంగళవారం మెర్కోసూర్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన కీలక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్ అభిమానులను కనువిందు చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా సంగ్రామం ముగిసిన కొన్ని రోజులకే మరో క్రికెట్ పండగ అలరించేందుకు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కి మార్చి 28న తెరలేవనుంది. తొలి విడత షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది. మరి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి కూడా పది జట్లు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేతలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ టీమ్లు ఈ సీజన్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. అన్ని జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. స్వదేశీ, విదేశీ క్రికెటర్లతో ఆయా టీమ్లు చాలా బలంగా మారాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు అన్ని జట్లలోనూ ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, డేవిడ్ మిల్లర్, విల్ జాక్స్, క్వింటన్ డికాక్, ఫిలిప్ సాల్ట్, డెవోన్ కాన్వే, స్టోయినిస్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఐపిఎల్ చెలరేగేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్లో అందరి కళ్లు అభిషేక్ శర్మ, శాంసన్, ఇషాన్ కిషన్లపైనే నిలిచాయి. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్కప్లో ఇషాన్ కిషన్, శాంసన్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన సంగతి తెలిసిందే. ఐపిఎల్లోనూ వీరు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లతో సన్రైజర్స్ బ్యాటింగ్ చాలా బలంగా మారింది. గతంలో హెడ్, అభిషేక్లు అసాధారణ బ్యాటింగ్తో సన్రైజర్స్కు చారిత్రక విజయాలు సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక సూర్యకుమార్, శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శుభ్మన్ గిల్, గ్లెన్ ఫిలిప్స్, జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, మాథ్యూ షార్ట్ తదితరులు ఆయా జట్ల తరఫున ఐపిఎల్ బరిలో దిగనున్నారు. ఇక ప్రపంచ స్థాయి బౌలర్లు, ఆల్రౌండర్లు కూడా తమ సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ రోజుల పాటు సాగే ఐపిఎల్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమని చెప్పాలి.
Iran - Israel War : ఇరాన్కు భారీ దెబ్బ: కీలక భద్రతాధికారుల మృతి
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం రెండో వారంలోకి చేరుకుంది.
జామియా మస్జీదులో ఇఫ్తార్ విందు..
జామియా మస్జీదులో ఇఫ్తార్ విందు.. అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఏడో వార్డులోని
ఆ.. నలుగురు నిందితులు అరెస్టు..
ఆ.. నలుగురు నిందితులు అరెస్టు.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని పంతంగి
అప్పుడు దానకర్ణ..ఇప్పుడు కుంభకర్ణ
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘దానకర్ణుడి’లా సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా ‘కుంభకర్ణుడి’లా నిద్రపోతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ మ్మెల్యే కెటిఆర్ విమర్శించారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలని కెటిఆర్ తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం, అసెంబ్లీలో గవర్న ర్ ప్రసంగానికి విలువ ఉండాలని కెటిఆర్ అన్నారు. కానీ, గవర్నర్ ప్రసంగానికి విలువ లేకుండా చేస్తున్నారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కెటిఆర్ సభలో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకు చెప్పాలని కెటిఆర్ ప్రశ్నించారు. రైతులు, వితంతువులు, వృద్ధులు, నిరుద్యోగులు ఎవరు ధన్యవాదాలు చెప్పాలని కెటిఆర్ నిలదీశారు. గ్యారంటీ కార్డులను భద్రపరచుకోవాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేయలేదా అని కెటిఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటుతున్నా హామీలు నెరవేరలేదని ఆయన ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారని,కానీ, నేడు ఆ సంతకానికి, ఆయన చేసిన డిక్లరేషన్లకు జనం దృష్టిలో ‘జీరో వాల్యూ’ ఉందన్నారు. సిఎం సంతకం చేసిన ఫైల్కు దిక్కులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని కెటిఆర్ ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి తొలి సంతకం చేసిన ఫైల్ ఎక్కడికి పోయిందని కెటిఆర్ ప్రశ్నించారు. మాయమైన ఫైల్ కోసం సిట్ ఏర్పాటు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చింది ‘అభయహస్తం’ అని చెప్పుకుంటున్నా, అమల్లో అది ‘భస్మాసుర హస్తం’గా మారిందని కెటిఆర్ విమర్శించారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రతి కుటుంబానికి రావాల్సిన రూ. 2.50 లక్షల లబ్ధి అందిన ఒక్క కుటుంబమైనా రాష్ట్రంలో ఉందా అని కెటిఆర్ ప్రశ్నించారు. ఇటీవల ఇండియా టీ20 వరల్డ్కప్ గెలిచిందని, ఒకవేళ ‘420 వరల్డ్ కప్’ పెడితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గెలుస్తుందంటూ కెటిఆర్ విమర్శించారు. 420 హామీల మేనిఫెస్టో రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిజాలను ప్రస్తావిస్తా గల్లీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతుంటే, పాలకులు మాత్రం ఢిల్లీకి విమానయాత్రలు చేస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు ‘నిల్’ లూటిఫికేషన్లు ‘ఫుల్’ అని కెటిఆర్ ఆరోపించారు. పెన్షనర్లకు టిఏ, డిఏలు రాక నరకయాతన పడుతున్నారని, గ్యారంటీ కార్డులు కాస్త ఇప్పుడు ‘బాకీ కార్డులుగా’ మారి వెక్కిరిస్తున్నాయని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని కెటిఆర్ ఖండించారు. జార్జ్ ఆర్వెల్ మాటలను గుర్తు చేస్తూ మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవమని, తాము కూడా ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిజాలను ప్రస్తావిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము పక్క రాష్ట్రాల్లో ఉగాదులు, ఉషస్సులు వస్తున్నాయ్. పోతున్నాయ్ అని, ప్రజల జీవితాల్లో వెలుగులేవని ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. ప్రభుత్వం డిజాస్టర్ పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు’ అన్న చందంగా ఉందని కెటిఆర్ విమర్శించారు. ఎగనామాలు, పంగనామాలు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని కెటిఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల కోసం కోటి 25 లక్షల మంది చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం చారాణా పని చేసి బారాణా చేసినట్లుగా చెప్పుకుంటుందని కెటిఆర్ అన్నారు. నేనే రాజు నేనే మంత్రి అని మిడిసి పడితే మూటకట్టుకుని పోతారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే కర్ణుడిని అని చెప్పుకుంటున్నారని, ఆయన ఎన్నికల ముందు దానకర్ణ, ఇప్పుడు కుంభకర్ణ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. డిక్లరేషన్ల కోసం ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చారని, కానీ, వాటిని అమలు మాత్రం చేయడం లేదన్నారు. ఇక తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం కోసం వాడుకుంటున్నారని కెటిఆర్ మండిపడ్డారు.
18thMarch2026 |బుధవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
18thMarch2026 | బుధవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 18thMarch2026 |
వాషింగ్టన్: ఇరాన్పై భీకరంగా యుద్ధం సాగుతు న్న నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ కీలక అధికారి రాజీనామా ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని ‘జాతీయ ఉగ్ర నిరోధక కేం ద్రం’ (ఎన్సిటిసి) డైరెక్టర్ జో కెంట్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ పదవి నుంచి వైదొలుగుతున్న ట్టు తెలిపారు. ‘మనదేశానికి ఇరాన్ ఎటువంటి తక్షణ ముప్పును కలిగించలేదు. ఇజ్రాయెల్, దా ని శక్తిమంతమైన అమెరికన్ లాబీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ఈ యుద్ధాన్ని ప్రారంభించామన్నది స్పష్టం’ అని ‘ఎక్స్’లో జో కెంట్ ఓ పోస్ట్ పెట్టారు. చాలా ఆలోచించిన తరువాత ఈ నిర్ణ యం తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు జో కెంట్ లేఖ రాశారు. “ గతంలో మూడు అధ్యక్ష ఎన్నికల సందర్భాల్లో మీరు ప్రచారం చేసిన విలువలకు, మొదటి హయాంలో అమలు చేసిన విదేశాంగ విధానాలకు మద్దతుగా ఉన్నా. మధ్యప్రాచ్యం లోని యుద్ధాలు ఉచ్చులాంటివని, అవి మనపౌరుల ప్రాణాలు తీయడమే కాకుండా , దేశ సంపదనూ క్షీణింప చేశాయని, గతేడాది జూన్ వరకూ అర్థం చేసుకున్నారు. అయితే రెండో పాలన ప్రారంభంలో ఉన్నత స్థాయి ఇజ్రాయెల్ అధికారులు, అమెరికన్ మీడియా లోని ప్రభావవంతమైన కొందరు వ్యక్తులు ఇరాన్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది‘అమెరికా ఫస్ట్ ’ నినాదాన్ని పూర్తిగా దెబ్బతీసి, ఇరాన్తో యుద్ధానికి వెళ్లేలా పురిగొల్పింది. అమెరికాకు ఇరాన్ తక్షణ ముప్పుగా పరిణమించిందని, ఇప్పుడు దాడి చేస్తే వేగంగా విజయం సాధించొచ్చని నమ్మించారు. కానీ ఇదంతా అవాస్తవం. ఇరాక్ యుద్ధం లోకి మనల్ని లాగేందుకు కూడా గతంలో ఇజ్రాయెల్ ఇదే ఎత్తుగడ వేసింది. మనం ఈ తప్పును మళ్లీ చెయ్యొద్దు. 11 సార్లు యుద్ధానికి వెళ్లిన ఓ సైనికుడిగా, ఇజ్రాయెల్ సృష్టించిన యుద్ధంలో భార్యను కోల్పోయిన వ్యక్తిగా అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని ఈ ఘర్షణలకు మన పౌరుల్ని పంపడాన్ని సమర్థించలేను. మనం ఇరాన్లో ఏం చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో మీరు పునరాలోచించాలి.” అని ట్రంప్ను ఉద్దేశించి జోకెంట్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితిని సరిదిద్ది అమెరికాకు ఒక చక్కని దారి చూపాలని తన లేఖలో కోరారు. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు..విచారణకు సిట్
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రంగారెడ్డి జి ల్లా మొయినాబాద్లోని బీఆర్ఎస్ నేత పైలట్ రో హిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ నే తృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కేసును విచారణ చేయడానికి 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ సుధీర్బాబు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేయనున్నట్లు తెలిపింది. 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ వ్యవహారంపై సిట్ విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ వ్యాపారాలు తదితర అంశాలపై సిట్ విచారణ జరపనుంది. మరోవైపు రోహిత్రెడ్డి ఫాంహౌస్పై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితులను కస్టడీకి ఇవ్వండి : పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సిట్ సిఫారసు చేసింది. ఫామ్హౌస్లో సోదాలకు వెళ్లిన పోలీసులపై రియల్టర్ నమిత్ శర్మ, రితేశ్ రెడ్డి లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. తుపాకీ లైసెన్స్ దుర్వినియోగం చేశారని సిట్ అధికారులు సీపీకి లేఖ రాశారు. మరోవైపు ముగ్గురు నిందితులను 7 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని ఫాంహౌస్లో ఈ నెల 14న రాత్రి జరిగిన విందుపై తెలంగాణ ఈగల్, మొయినాబాద్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్, మద్యం పార్టీకి ప్రధాన సూత్రధారిగా తేలింది. కొన్నిరోజులుగా రోహిత్రెడ్డి తన ఫాంహౌస్లో వారాంతపు పార్టీ చేద్దామనే గట్టి ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి బిజినెస్ మీటింగ్లో భాగంగా శిమ్లా వెళ్లినప్పుడు ఓ వ్యక్తి దగ్గర రూ.15 వేలకు కొకైన్ను కొనుగోలు చేశాడు. పార్టీలో మొత్తం 11 మంది : ఈ విషయం పైలట్ రోహిత్ రెడ్డితో చెప్పగా ఈ నెల 14న సాయంత్రం తన ఫాంహౌస్లో పార్టీ చేద్దామనే ఆలోచనకు వచ్చి నిర్ణయించుకున్నాడు. దీనికి తన స్నేహితుడు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్తో సహా ఇతరుల్ని ఆహ్వానించాడు. కౌశిక్ రవి డ్రగ్స్తో నేరుగా ఫాంహౌస్లో జరిగే పార్టీకి వచ్చాడు. మొత్తం 11 మంది పాల్గొన్న పార్టీలో మహేశ్ కుమార్, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ తదితరులంతా మద్యంలో కొకైన్(డ్రగ్స్) కలిపి సేవించారు. గన్తో శర్మ కాల్పులు : ఈ ఫాంహౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ కేసులో ఒక్కోక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాంహౌస్లోకి పోలీసులు రావడాన్ని చూసిన నమిత్శర్మ తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతోనే గన్తో కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు ఫాంహౌస్లోకి ప్రవేశించే సమయంలోనే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో తాము ఫ్యూచర్సిటీ పోలీసులమని, పక్కా సమాచారంతో సోదాలకు వచ్చామంటూ వారు గట్టిగా చెప్పారు. దీన్ని లెక్క చేయకుండా నమిత్ పోలీసు అధికారిని టార్గెట్గా చేసుకుని ఒక రౌండు కాల్పులు జరిపాడు. పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి ఇద్దరూ వాళ్లను కాల్చెయ్, తర్వాత మొత్తం మేం చూసుకుంటాం అంటూ నమిత్ శర్మను రెచ్చ గొట్టినట్లు సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అప్రమత్తతతో అందర్నీ చుట్టుముట్టడంతో తుపాకీ కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్రెడ్డి, నమిత్ శర్మ, రితేశ్ రెడ్డిపై కొత్తగా అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లను జోడించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు చంచల్గూడ జైలు రిమాండ్లో ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసులో వీటిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? ఈ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులు ఎవరు? వారికి మీకు ఉన్నా లింకులు, దుబాయ్ లింకులు తదితర అంశాలపై పలు కోణాల్లో విషయాలను రాబట్టేందుకు ఈ సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి సిట్ నివేదికను అందించనుంది. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్పై ఆదివారం పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ సమయంలో న్యూఢిల్లీకి చెందిన నమిత్ శర్మ.. కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారిని చుట్టిముట్టారు. ఈ సందర్భంగా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. వారిలో పలువురికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సైతం ఉన్నారు. ఆయనకు కూడా డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అలాగే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి వారి వారి పార్టీల నుంచి నోటీసులు అందాయి. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ వారికి ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. అప్పటి వరకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నాయి. పలు అంశాలపై ఆరా : రోహిత్ రెడ్డి పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేశారు? డ్రగ్స్తో పాటు అసలు ఫాంహౌస్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి? గతంలో ఎవరైనా ప్రముఖులు ఇక్కడికి వచ్చారా? వస్తే వారికి ఎలాంటి పార్టీ ఇచ్చారు? ఇదే తరహాలో ఎన్ని పార్టీలు జరిగాయి? అన్న కోణంలో సిట్ విచారణ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ దందాతో పాటు దుబాయ్కు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అన్న లింకులపైనా సిట్ బృందం ఫోకస్ చేయనుంది. సిట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఈ కేసులో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
మన తెలంగాణ/హైదరాబాద్: హ్యామ్(హెచ్ఎ ఎం) రోడ్ల పేరిట రాష్ట్రంలో సుమారు రూ.18వేల కోట్ల స్కాంకు తెరలేపారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు సంచలన ఆరోపణలు చేశారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్అండ్బి)లో రూ.12వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.6వేల కోట్లు కలిపి భారీ స్థాయి లో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి వద్దు అని గొడవ పెట్టారని, ఇప్పుడు అదే ప్రభుత్వం 10శాతం మొబిలైజేషన్ ఇస్తోందని పేర్కొన్నారు. ఇందులో కమిషన్లు తీసుకుని ఎన్నికల ఖర్చు కోసం పంపబోతున్నారని, ఈ వ్యవహారం పెద్ద స్థాయి స్కాంగా మారే ప్రమాదం ఉందని ఆరోపించారు. అసెంబ్లీలో మంగళవారం మాజీ మంత్రులు హరీష్రావు, వేముల ప్రశాంత్రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయని..కానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయని..తేడా 50 శాతం వస్తోందని తెలిపారు. ఈ టెండర్లకు సిఒటి అనుమతి కూడా అవసరం లేకుండా, శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కుతో 20 నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు టెండర్లు వేయించారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజల డబ్బును కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే... ఇప్పుడు పది శాతం పెట్టారని అన్నారు. మొత్తం 34లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని, ముందే రింగ్ అయ్యారని ఆరోపించారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖలోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు టెండర్ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేదని, ఇప్పుడు హ్యాం రోడ్లకు ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చని చెప్పారు. హ్యాం రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగిందని, నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయని అన్నారు. నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి,ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారని, రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారని తెలిపారు. టెండర్లలో కుమ్మక్కు అయ్యారని, సివేట్, సరళ, బృందా, బి.వి.ఎస్.ఆర్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. పంచాయతీ రాజ్ శాఖలో 7 వర్క్లు సివేట్కు 3 వర్కులు జె ఇన్ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సివేట్,బృందాకు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో టెండర్ యక్సెస్కు 5 శాతం సీలింగ్ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాక్సెస్ ఎత్తివేశారని తెలిపారు. టెండర్లలో అవినీతి జరిగిందని, ఆ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, రిజర్వ్ బ్యాంకుకు, అన్ని విచారణ సంస్ధలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడింంచారు. టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై తమ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేసి, పారదర్శంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిఒటి అనుమతి, ఐదు శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలని, మొబిలైజేషన్ అడ్వాన్స్లు రద్దు చేయాలని అన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి పద్దులు చర్చకు వచ్చినపుడు బిఆర్ఎస్ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతామని, హైకోర్టు విచారణకు పట్టుబడతామని వెల్లడించారు. సింగరేణి శ్రీరాంపూర్ టెండర్ వ్యవహారాన్ని తాము బయటపెట్టిన తర్వాత తక్కువకు పోయిందని పేర్కొన్నారు.
కళ్లల్లో కారం కొట్టి..రూ.కోటి కొట్టేశారు
మన తెలంగాణ/కూకట్పల్లి: కూకట్పల్లిలో సోమవారం ఆర్ధరాత్రి హవాలా డబ్బు కలకలం సృష్టించింది. రూ.కోటి నగదుతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులను నిందితులు సినీ ఫక్కీలో వెంటాడి కూకట్పల్లి పిల్లర్ నెం.837 వద్దకు చేరుకోగానే కళ్లలో కారం కొట్టి కోటి రూపాయల నగదుతో పారిపోయారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది సంఘటను గుర్తించేలోగా నిందితులు పారిపోయారు. బాధితుడు మహమ్మద్ అజీముద్దీన్ను కూకట్పల్లి సిఐ వద్దకు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు బాలానగర్ సిసిఎస్ తో సమన్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఈ కేసులో మొత్తం 9 మంది ఉండగా 24 గంటలు కూడా గడవక ముందే అందులోని ప్రధాన నిందితులైన నలుగురుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదును, విమానం టికెట్లను, సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురిని పట్టుకోగాకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిపి రితిరాజ్ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్లోని బహదూర్పురాలోగల సిద్రా ఎంటర్ప్రైజెస్ యజమాని వివిధ వ్యక్తుల నుంచి నగదు వసూలు చేయడానికి ఖుసృద్ధీన్ అతని సహ ఉద్యోగి అయిన మహమ్మద్ అజీముద్దీన్ (ఫిర్యాదుదారుడు) ను నియమించాడు. టోకెన్ చూపించి రహస్యంగా వసూలు చేసిన సొమ్ముపై కన్నేసిన ఖుసృ ద్దీన్ పలువురితో కమ్మక్కై పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేసిన డబ్బుతో పరారీకి ప్రయత్నించాడు.
ఇప్పటి వరకు చూడని క్లైమాక్స్: నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వృషకర్మ. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నాగచైతన్య చేసిన లేటెస్ట్ కామెంట్స్.. అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని చివరి 25 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన తెలిపారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త అంశాన్ని ఈ క్లైమాక్స్ లో చూపించబోతున్నామని చెప్పారు. దీంతో క్లైమాక్స్ లో బిగ్ సర్ప్రైజ్ ఉంటుందనే చెప్పాలి. వృష కర్మలో నాగచైతన్య ఇప్పటి వరకు చేయని విధంగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల్లో కనిపించబోతున్నారని సమాచారం. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నాగచైతన్య, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ అనే పాత్రలో ఆయన నటిస్తున్నారని, ఇది చైతూ కెరీర్ లోనే అత్యంత పవర్ ఫుల్ క్యారెక్టర్ గా నిలుస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సినిమాలో నాగచైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఆయన సరసన మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ గా కనిపించనున్నారు. జయరామ్, సత్య అక్కళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
నైజీరియా మైడుగురి సిటీపై ఆత్మాహుతి బాంబుల దాడి ..23 మంది మృతి
ఈశాన్య నైజీరియా లోని మైడుగురి సిటీని టార్గెట్ చేస్తూ సోమవారం రాత్రి ఆత్మాహుతి బాంబుల దాడికి 23 మంది ప్రాణాలు కోల్పోవగా, 108 మంది గాయపడ్డారు. సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న ఈ నగరంలో అత్యంత ప్రాణాంతక దాడి ఇదేనని చెబుతున్నారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైడుగురిలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్, యూనివర్శిటీ ఆఫ్ మైడుగురి టీచింగ్ ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద పేలుళ్లు జరిగాయని స్థానికులు చెప్పారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించక పోయినప్పటికీ, బొకో హరామ్ జీహాదీ గ్రూప్ ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇస్లామిక్ సిద్ధాంతాన్ని బలవంతంగా అమలు చేయడానికి బోకో హరామ్ జీహాదీ గ్రూప్ 2009 నుంచి తిరుగుబాటు చేస్తోంది. అందులోని భాగమే ఈ దాడులని అనుమానిస్తున్నారు.
రోగులను దోచుకుంటున్న దంపతుల అరెస్టు
ఆస్పత్రుల్లో రోగులకు మత్తుమందు ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న మహిళ, సహకరించిన భర్తను సికింద్రాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, మార్కెట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...వికారాబాద్ జిల్లా, నవాబ్పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష డి ఫార్మసీ చదువుతోంది, ఎడులపల్లి సాయికుమార్ గౌడ్ వ్యాపారం చేస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో దంపతులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా వైద్యురాలిగా నటిస్తూ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు మత్తు మందు ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ ఆప్రాన్ ధరించి ఆస్పత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న ’డయాజెపామ్’ అనే మత్తు ఇంజక్షన్ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారైంది. మార్చి 11న సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి , అలాగే చందానగర్లోని సిటిజన్ ఆస్పత్రిలో రోగులకు మత్తు మందు ఇచ్చి బంగారు ఆభరణాలు చోరీ చేసింది. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్కు ఖర్చు చేసేవారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
ప్రముఖ నటి నయనతారపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీ ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతపై నిర్వహించిన నిరసన సభలో పాల్గొంటూ నటి నయనతార గురించి ఎంపీ చేసిన అవమానకర వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. తమిళనాడు సిఎం స్టాలిన్పై విమర్శ చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసాయి. “మీ కలలను మాకు చెప్పండి. వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.దీన్ని ఉద్దేశించి అన్నాడీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మాట్లాడుతూ అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమన్నారు. మన కలల్ని తనతో పంచుకోమని ఆయన (స్టాలిన్) అడుగుతున్నారు. నాకు నయనతార కావాలి.. దాన్ని ఆయన నెరవేరుస్తారా? నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది. నాలాగే ఎవరో నయనతారతో పెళ్లి చేయమని స్టాలిన్ను అడిగితే ఆ కలను నెరవేర్చుతారా? అని ఆయన వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. మహిళల భద్రత నిరసన సభలోనే వివాదం ఈ వ్యాఖ్యల వివాదాన్ని మరింత పెంచిన అంశం ఏమిటంటే.. మహిళల భద్రత, గౌరవం కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో షణ్ముగం ఒక మహిళ(నయనతార) గురించి అవమానకరంగా మాట్లాడటం. అక్కడే ఉన్న పార్టీ నాయకులు కూడా ఈ వ్యాఖ్యలపై నవ్వుతూ స్పందించడం విమర్శలకు మరింత కారణమైంది. సోషల్ మీడియాలో ఆగ్రహం షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర ప్రతికూల స్పందనలు వచ్చాయి. రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వినియోగదారులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, కొందరు తమిళనాడు పోలీసులను ఈ అంశంపై కేసు నమోదు చేయాలని కోరగా, ఆ ఎంపీపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.మా విధానాలను విమర్శించండి. కానీ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకండి. నయనతారను అవమానించడం ద్వారా మహిళలందరినీ అవమానించారు. ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమెదయోగ్యం కాదు అని డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది. షణ్ముగం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మహిళల ప్రస్తావన తెచ్చి తీవ్ర విమర్శల పాలయ్యారు.
బైద బాటిల్ పబ్లో అగ్నిప్రమాదం
కిచెన్లోని కట్టెల పొయ్యి నుంచి చెలరేగిన మంటలతో పబ్బులో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన జూబ్లీహిల్స్లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 36లో ఉన్న బైద బాటిల్ పబ్బులో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ కొరతతో పబ్లోని కిచెన్లో కట్టెలతో వంట చేస్తున్నారు. రోజు మాదిరిగానే కట్టెల పొయ్యితో వంట చేస్తుండగా పొయ్యి నుంచి ఎగసిపడిన నిప్పు రవ్వలు పబ్బులోని థర్మకోల్కు అంటు కోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పబ్బు మొత్తం అంటుకోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పివేశారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పబ్బులో తక్కువ మంది ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని […] The post జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా appeared first on Visalaandhra .
మరో 15 రోజుల వరకు ఢోకా లేదుప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాంముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు […] The post సరిపడా గ్యాస్ నిల్వలు appeared first on Visalaandhra .
விமான நிலையத்தில் விஜய் கைப்பையில் மதுபாட்டில் பறிமுதல் செய்யப்பட்டதா?
விமான நிலையத்தில் விஜய் கைப்பையில் மதுபாட்டில் பறிமுதல் செய்யப்பட்டதாக தவறான தகவல் பகிரப்படுகிறது.
నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం
. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 40 శాతానికిపైగా వైకల్యముంటే వర్తింపు. 12.76 లక్షల మందికి లబ్ధి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం […] The post నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం appeared first on Visalaandhra .
కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన న్యూదిల్లీ: ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్ట్స్టైల్స్, స్కిల్డెవలప్మెంట్పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈపీఎస్ […] The post ఈపీఎఫ్ కనీసపింఛను పెంచాలి appeared first on Visalaandhra .
. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో […] The post గూడు ఘోష appeared first on Visalaandhra .
గల్ఫ్పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్
వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను […] The post గల్ఫ్పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్ appeared first on Visalaandhra .
బీజింగ్: అమెరికాకు చైనా ఓ షరతు పెట్టింది. పశ్చిమాసియాలో యుద్ధం ఆపేస్తే హోర్ముజ్ జల సంధిలో నౌకల రక్షణకు సిద్ధమని ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో తమకు మద్దతుగా యుద్ధనౌకలు పంపాలంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. ప్రపంచ ఇంధన సరఫరా, ప్రాదేశిక శాంతి, సుస్థిరతకు నష్టం కలిగించవద్దని సూచించింది. ఉద్రిక్తతలు పెరిగితే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటనివ్వద్దని […] The post అమెరికాకు చైనా షరతు appeared first on Visalaandhra .
అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు
కాబూల్: అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ మెరుపు దాడి చేసింది. ఆ దేశ రాజధాని కాబూల్పై విరుచుకుపడింది. అక్కడి ఆసుపత్రిపై వైమానిక దాడి చేయగా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్, పాక్ మధ్య సరిహద్దు ఘర్షణ చాలా కాలంగా సాగుతున్నది. కాబూల్లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్లో ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన తాజా […] The post అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు appeared first on Visalaandhra .
టీ20ల్లో అత్యుత్తమ ఆటగాడు బుమ్రానే: డివిలియర్స్
న్యూదిల్లీ: టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు జస్ప్రిత్ బూమ్రాయేనని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ బ్యాటర్లు రేసులో ఉన్నప్పటికీ డివిలియర్స్ ఒక బౌలర్ను ఎంచుకోవడం విశేషం. ఈ ఎంపిక వెనుక ఉన్న కారణాలను డివిలియర్స్ వివరిస్తూ… “కొత్త బంతి అయినా, పాత బంతి అయినా, ఆఖరికి సూపర్ ఓవర్ అయినా సరే.. బుమ్రా చేతికి బంతి ఇస్తే మ్యాచ్ గెలిపిస్తాడు. ఏ […] The post టీ20ల్లో అత్యుత్తమ ఆటగాడు బుమ్రానే: డివిలియర్స్ appeared first on Visalaandhra .
దెబ్బతిన్న పైప్లైన్ పునరుద్ధరించిన థింక్ గ్యాస్
అనంతపురం: అనంతపురంలోని శ్రీ నగర్ కాలనీలో, ఎంజీ షోరూమ్ వెనుక, ఒక దుకాణ యజమాని విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం గుంత తవ్వేందుకు సమాచారం ఇవ్వకుండా చేతితో తవ్వకాలు జరుపుతుండగా, థింక్ గ్యాస్ (గతంలో ఏజీ అండ్ పీ ప్రథమ్) వేసిన నగర గ్యాస్ పైప్లైన్ దెబ్బతింది. థింక్ గ్యాస్ అత్యవసర ప్రతిస్పందన బృదం వెంటనే స్పందించి, ప్రభావిత ప్రాంతాన్ని వేరుచేసి, తక్కువ సమయంలో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. తద్వారా ప్రజల భద్రతను నిర్ధారించి, నివాసితులకు కలిగే […] The post దెబ్బతిన్న పైప్లైన్ పునరుద్ధరించిన థింక్ గ్యాస్ appeared first on Visalaandhra .
మిరపలో నల్ల తామర పురుగు నియంత్రణకు కొర్టేవా
హైదరాబాదః మిరప రైతులు బ్లాక్ త్రిప్స్ తీవ్రమైన ముట్టడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇది దిగుబడి తగ్గించి, నాణ్యత నష్టాలకు దారితీసేందుకు కారణమవుతుంది. ఒకే విధమైన చర్యతో పురుగుమందులను పదేపదే ఉపయోగించడం ద్వారా పేలవమైన నియంత్రణ లభిస్తుండగా, మిరపలో పురుగుమందుల అవశేషాల స్థాయి పెరుగుతోంది. కొర్టేవా అగ్రిసైన్స్ ఈ సవాలును చురుకుగా పరిష్కరిస్తోంది. స్థిరమైన ఉత్పాదకతను, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు సైంటిఫిక్ ఆధారిత, ఇంటిగ్రేటెడ్ తెగులు నిర్వహణ (ఐపీbం) వ్యూహాల ద్వారా రైతులకు సాధికారత కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ […] The post మిరపలో నల్ల తామర పురుగు నియంత్రణకు కొర్టేవా appeared first on Visalaandhra .
women play key role in politics : పదవులు మహిళలవి Andhra Prabha News
women play key role in politics : పదవులు మహిళలవి Andhra
కేరళ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వీరిలో వి.డి. సతీశన్ పరవూరు నియోజకవర్గం నుండి పోటీ చేయనుండగా, రమేష్ చెన్నితలను హరిపాడ్ నుండి నామినేట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ను పుత్తుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దింపారు. ఇతర కీలక అభ్యర్థులలో వట్టియూర్కావు నుండి కె. మురళీధరన్, చిరాయిన్కీజు నుండి రమ్య హరిదాస్ ఉన్నారు. కాగా, 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) గెలిచి అధికారాన్ని దక్కించుకుంది.
మే 3న పరీక్ష టిజిఆర్జెఎసి సెట్
రాష్ట్రంలో 35 తెలంగాణ గురుకుల(రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియేట్ మొదటి ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఆర్జెసి సెట్కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 3వ తేదీన టిజిఆర్జెఎసి సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’
హైదరాబాద్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు జెమినీ టీవీ సిద్ధమైంది. ‘మాస్ జాతర’ పేరుతో రూపొందించిన ఈ మెగా వీకెండ్ కామెడీ షోను హైదరాబాద్లోని నెక్సస్ మాల్లో సినీ తారలు, కమెడియన్ల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, jట్యూబర్లు, కళాకారులతో కూడిన ఈ వినూత్న స్కిట్ కాంపిటీషన్ ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ […] The post జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’ appeared first on Visalaandhra .
ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు పార్టీ పదవులు, తదితర అంశాల గురించి సిఎం రేవంత్రెడ్డి ఖర్గేతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఏఐసిసి నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కెసి వేణుగోపాల్కు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా సమాచారం.
Jana Nayagan Censor Issue: No Relief
Vijay’s last film Jana Nayagan is packed with hurdles. The Censor officials referred the film to the Revising Committee but the screening for the film was pushed several times. The Revising Committee has pushed the screening for today but it was delayed due to undisclosed reasons. The officials did not watch the film and this […] The post Jana Nayagan Censor Issue: No Relief appeared first on Telugu360 .
సీపీఐ పోరాటాల ఫలితమే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు
ఈ నెల 24న అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు వెల్లడివిశాలాంధ్ర`విజయవాడ: ఉగాదికి టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందజేస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించటాన్ని కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది. ఈ మేరకు సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతత్వంలో సీపీఐ బందం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కపూడి, వేమవరం ప్రాంతంలో లబ్దిదారులకు అందించేందుకు సిద్ధం చేస్తున్న టిడ్కో ఇళ్లను […] The post సీపీఐ పోరాటాల ఫలితమే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు appeared first on Visalaandhra .
పైలట్ రోహిత్రెడ్డికి బిఆర్ఎస్ షోకాజ్ నోటీసులు
మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణల నేపథ్యంలో తాండూరు మాజీ ఎంఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం మంగళవారం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యులు సోమా భరత్ కుమార్ నోటీసు ఇచ్చారు. ఈ అంశం విస్తృతంగా మీడియాలో ప్రచారం పొందడం వల్ల పార్టీ ప్రతిష్ఠకు, ప్రజల్లో ఆందోళనకు దారితీసిందని నోటీసులో పేర్కొన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం : భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలను పాటించడంలో కట్టుబడి ఉందని సోమా భరత్ కుమార్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్నిపార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రోహిత్ రెడ్డి ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉండటంతో ఈ విషయాన్ని పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు స్పష్టమైన,సమగ్ర లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు. నోటీసు లేకుండానే తగిన క్రమశిక్షణా చర్యలు : ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యకలాపాల్లో రోహిత్రెడ్డి పాల్గొనకుండా ఉండాలని కూడా ఆదేశాలు ఇచ్చామని భరత్ కుమార్ పేర్కొన్నారు. నోటీసుకు గడువులోగా సంతృప్తికరమైన వివరణ సమర్పించకపోతే పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
38000 MT Gas Available : ఏపీలో గ్యాస్ కొరత లేదు Andhra Prabha News
38000 MT Gas Available : ఏపీలో గ్యాస్ కొరత లేదు Andhra
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଇରାନ ଉପରେ ଇସ୍ରାଏଲ ଆକ୍ରମଣକୁ ରାଜନାଥ ସିଂହ ସମର୍ଥନ କରୁଥିବା ଭିଡିଓଟି ଏଆଇ ଅଟେ
ମଧ୍ୟପ୍ରାଚ୍ୟ ଯୁଦ୍ଧକୁ ନେଇ ପ୍ରତିରକ୍ଷା ମନ୍ତ୍ରୀ ରାଜନାଥ ସିଂହ ଚିନ୍ତା ପ୍ରକଟ କରିଛନ୍ତି। ଯୁଦ୍ଧ ପାଇଁ ଦେଶରେ ଅର୍ଥନୈତିକ ପ୍ରଭାବ ପଡ଼ିବା ନେଇ ଚେତାବନୀ ଦେଇଛନ୍ତି ରାଜନାଥ। ପର୍ସିଆନ ଗଲ୍ଫ ଅଞ୍ଚଳ ବିଶ୍ୱର ଶକ୍ତି ସୁରକ୍ଷା ପାଇଁ ଅତ୍ୟନ୍ତ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ । ଏହି ଅଞ୍ଚଳରେ ବ୍ୟାଘାତ ହେଲେ ତେଲ ଓ ଗ୍ୟାସ ଯୋଗାଣରେ ପ୍ରଭାବ ପଡ଼ିବ । ଯାହା ଅର୍ଥନୀତି ଏବଂ ବିଶ୍ୱ ବାଣିଜ୍ୟକୁ ପ୍ରଭାବିତ କରିବ ବୋଲି ପ୍ରତିରକ୍ଷା ମନ୍ତ୍ରୀ ରାଜନାଥ କହିଛନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ରାଜନାଥଙ୍କର ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ପ୍ରତିରକ୍ଷା ମନ୍ତ୍ରୀ ରାଜନାଥ ସିଂହ, ଇରାନ ଉପରକୁ ଇସ୍ରାଏଲର ଆକ୍ରମଣକୁ ସମର୍ଥନ କରୁଥିବାର ଦାବି ହୋଇଛି । ଯାହାର ଏକ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ : ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇନାହାଁନ୍ତି ରାଜନାଥ ସିଂହ । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଦାବିକୁ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ରାଜନାଥ ସିଂହ ଏଭଳି ମନ୍ତବ୍ୟ ଦେବାର କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏତେ ବଡ଼ ପ୍ରତିକ୍ରିୟା ରାଜନାଥ ଦେଇ ଥାନ୍ତେ ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ ଏନେଇ ଖବର ପ୍ରସାରିତ କରିଥାନ୍ତା । ଭାଇରାଲ ଭିଡିଓର ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ, ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ସ୍କ୍ରୀନସଟ୍ କରି ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଟ୍ୱିଟରରେ ସେୟାର ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୩ ନଭେମ୍ବର ୨୦୨୬ରେ ଏଏନଆଇ ଉକ୍ତ ଭିଡିଓକୁ ସେୟାର କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଭିଡିଓରେ ପ୍ରତିରକ୍ଷା ମନ୍ତ୍ରୀ ରାଜନାଥ ସିଂହ କିଛି କହୁଥିବାର ଜଣାଯାଉଛି । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ଏଏନଆଇ ଉଲ୍ଲେଖ କରିଛି, ସିନ୍ଧ ବର୍ତ୍ତମାନ ଭାରତ ମାନଚିତ୍ରର ଏକ ଅଂଶ ନହୋଇଥାଇପାରେ ହେଲେ ଏହାର ସଂସ୍କୃତି ଏବଂ ପରମ୍ପରା ସଦା ସର୍ବଦା ଭାରତର ଅଂଶ ବିଶେଷ । #WATCH | Delhi: Defence Minister Rajnath Singh says, ...Today, the land of Sindh may not be a part of India, but civilisationally, Sindh will always be a part of India. And as far as land is concerned, borders can change. Who knows, tomorrow Sindh may return to India again...… pic.twitter.com/9Wp1zorTMt — ANI (@ANI) November 23, 2025 ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶବିଶେଷ ଲାଗିବାରୁ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ପୁନଃ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଲିଙ୍କ୍ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୩ ନଭେମ୍ବର ୨୦୨୫ରେ ଉକ୍ତ ଭିଡିଓଟି ରାଜନାଥ ସିଂହଙ୍କ ଅଫିସିଆଲ ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଯେଉଁଥିରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଦିଲ୍ଲୀ ସିନ୍ଧି ସମାଜ ସମ୍ମିଳନୀରେ ଆରଏମଙ୍କ ବକ୍ତବ୍ୟ । ଉକ୍ତ ଭିଡିଓରେ ସିନ୍ଧି ସମାଜ ସମ୍ପର୍କରେ ଏବଂ ଭାରତରେ ସିନ୍ଧି ସମାଜର ଅବଦାନ ସମ୍ପର୍କରେ କହିଥିଲେ । ଉକ୍ତ ୩୧ ମିନିଟର ଭିଡିଓକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ଦେଖିବାରୁ କୌଣସି ସ୍ଥାନରେ ଇରାକ କିମ୍ବା ଇରାନ ବିଷୟରେ ରାଜନାଥ ଆଲୋଚନା କରିଥିଵାର ପାଇନଥିଲୁ । ଏଥିରୁ ଅନୁମାନ କରାଯାଏ ଯେ,, ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି କୌଣସି ମତେ ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମାଣ କରାଯାଇଥାଇ ପାରେ । ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ହାଇଭ ମଡରେସନ ଟୁଲ୍ ରେ ପରୀକ୍ଷା କରିବାରୁ ଉକ୍ତ ଭିଡିଓଟି ୯୯% ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ଅନ୍ୟପଟେ ପିଆଇବି ଫ୍ୟାକ୍ଟଚେକ୍ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅନୁସନ୍ଧାନ କରି ଏହା ଏକ ଫେକ୍ ଭିଡିଓ ବୋଲି ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଉଲ୍ଲେଖ କରିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଇରାନ ଉପରକୁ ଇସ୍ରାଏଲର ଆକ୍ରମଣକୁ ସମର୍ଥନ ନେଇ କୌଣସି ବାର୍ତ୍ତା ଦେଇ ନାହାଁନ୍ତି ପ୍ରତିରକ୍ଷା ମନ୍ତ୍ରୀ ରାଜନାଥ ସିଂହ । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ ।
ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్#MoinabadDrugsCase#BreakingNews#Puttamahesh#DrugCase
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ను నియమించింది. ఇక, సిట్ సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ ఎం. రవీందర్, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లు సి. హరీష్చంద్రారెడ్డి, ఎన్. బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్ హెచ్ఓ మల్లికార్జునరెడ్డి, ఎస్సైలు కోటేశ్వరరావు, సదాత్ అలీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొయినాబాద్ ఫాం హౌస్లో కలకలం రేపిన డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు బృందం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫాం హౌస్లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయన, పోలీస్లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో అక్కడే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న సిల్వేరి శరత్ కుమార్గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పాయింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు. సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. నిందితుల్లో 11 మంది వ్యక్తులకు మాదకద్రవ్యాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఫామ్హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
గుజరాత్కు చేరిన భారత్ రెండో ఎల్పీజీ నౌక
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పిజి కొరత వెంటాడుతున్న సమయంలో 46,500 టన్నుల గ్యాస్తో కూడిన నందాదేవి నౌక సురక్షితంగా గుజరాత్లోని వదినార్ పోర్టుకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధిని దాటుకుని భారత్ చేరుకున్న రెండో భారీ ఎల్పిజి నౌక ఇది. మొదటి ఎల్పిజి నౌక శివాలిక్ గుజరాత్ లోని ముండ్రా పోర్టుకు సోమవారం చేరుకుంది. ఈ నౌక నుంచి బిడబ్లు బిర్చ్ అనే మరో చిన్న నౌకకు ఈ ఎల్పీజీని అన్లోడ్ చేస్తారు. అక్కడ నుంచి తమిళనాడు లోని ఎన్నోర్, పశ్చిమబెంగాల్ లోని హాల్డియా, పోర్టులకు ఎల్పీజీ రవాణా అవుతుంది. ఈ బదిలీ ప్రక్రియలో గంటకు 1000 టన్నుల వంతున మొత్తం అన్లోడింగ్ పూర్తవడానికి రెండు రోజులు పడుతుంది.
రిలీజ్ కు సిద్ధమైన 'ధురంధర్2'.. రన్ టైమ్ అన్ని గంటలా..
న్యూఢిల్లీ: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ధురంధర్' సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్టు2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన మొదటి పార్టు ఏకంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా హిందీలోనే విడుదలైంది. రెండో పార్టు మాత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ మార్చి 19న రిలీజ్ కానుంది. 'ధురంధర్: ది రివెంజ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మార్చి 18న సాయంత్రం నుంచి పెయిడ్ ప్రివ్యూలు వేయనున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసేందుకు సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీంతో మూవీ టికెట్ల ధరలు కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 నుండి రూ. 2400 వరకు టికెట్ల ధరలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ మూవీ రన్ టైమ్ పై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా, ఈ సినిమా రన్ టైమ్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇండియాలో ఈమూవీ రన్ టైమ్ సుమారు 3 గంటల 49 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఇక, ఓవర్సీస్లో 3 గంటల 49 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పండోర్, రాకేష్ బేడి, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈనెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 9.30 గంటలకు మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఈ మేరకు ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం ఈ సమావేశం ప్రధాన అజెండా కాగా, దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట ప్రెస్
జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట ప్రెస్
నేనే ఇప్పుడు ట్రెండింగ్ స్టార్: ఎంఎల్ఎ మల్లారెడ్డి
నేనే ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ అని, సోషల్ మీడియాను అసలు ప్రమోట్ చేస్తుందే తాను అని, అసలు ఈ ప్లాట్ఫాం అన్నింటికీ తానే అసలైన బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. నేను ఏం మాట్లాడినా సెన్సేషన్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. యువతలో తనకున్న క్రేజ్ను చూసి గర్వపడుతున్నానని, తన వీడియోలు చూసి లక్షలాది మంది నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. సినిమాల్లో నటించే అవకాశం గురించి ఆయన మాట్లాడుతూ తెరపై కనిపించడానికి వేరే దర్శకుడి కోసమో, నిర్మాత కోసమో ఎదురుచూడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. తన వ్యక్తిత్వమే తనకు ఒక ఇమేజ్ తెచ్చిపెట్టిందని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. తన మార్కు డైలాగులతో ఇప్పటికే తను ప్రజల గుండెల్లో స్టార్ఘా నిలిచానని ఆయన అన్నారు. ఒకవేళ తనకు సినిమాల్లో నటించాలని అనిపిస్తే, ఎవరి దగ్గరకో వెళ్లే ప్రసక్తే లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే తానే సొంతంగా సినిమా తీస్తానని, తానే అందులో కథానాయకుడిగా కనిపిస్తానని తన మనసులోని మాటను మల్లారెడ్డి బయటపెట్టారు. ఏదైనా పని మొదలుపెడితే అది గ్రాండ్గా ఉండాలని కోరుకుంటానని మల్లారెడ్డి తెలిపారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తనదైన పంచ్ డైలాగులతో వినోదాన్ని పంచే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో మంగళవారం అదే జోష్తో నవ్వులు పూయించారు.
ఎన్నికల హామీకే పరిమితమైన 9 గంటల విద్యుత్తు
ఎన్నికల హామీకే పరిమితమైన 9 గంటల విద్యుత్తు వ్యవసాయానికి 7 గంటల మాత్రమే
జాతీయ భద్రత, పరిశోధనలకు కీలక ఒప్పందం…
జాతీయ భద్రత, పరిశోధనలకు కీలక ఒప్పందం… ఏర్పేడు, ఆంధ్రప్రభ : దేశ రక్షణ,
వారసిగూడలో కల్తీ చికెన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ను విక్రయిస్తున్న ముషీరాబాద్లోని ఒక చికెన్ సెంటర్పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ బాపూజీ నగర్లోని 'ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్' (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్ను స్థానిక ప్రజలకు మరియు చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో వారసిగూడ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. రామచంద్ర రెడ్డి తన సిబ్బంది మరియు స్వతంత్ర సాక్షులతో కలిసి సదరు చికెన్ సెంటర్పై ఆకస్మిక దాడి నిర్వహించారు. తనిఖీ సమయంలో సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. మానవ వినియోగానికి పనికిరాని ఈ కుళ్లిన మాంసాన్ని నిందితుడు తెలిసి కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. సికింద్రాబాద్ జోన్ డిసిపి శ్రీమతి కె. రక్షిత కృష్ణమూర్తి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, చిలకలగూడ ఏసిపి శ్రీ కె. శశాంక్ రెడ్డి గారి పర్యవేక్షణలో వారసిగూడ ఇన్స్పెక్టర్ శ్రీ జి. రాజేందర్ గౌడ్, ఎస్.ఐ శ్రీ కె. రామచంద్ర రెడ్డి మరియు సిబ్బంది ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు.
17marchassembly |సీతక్క సవాల్… ఆరోపణలకు కౌంటర్
17marchassembly |సీతక్క సవాల్… ఆరోపణలకు కౌంటర్ 17marchassembly | సీతక్క ఘాటు వ్యాఖ్యలు…
సొంతిల్లు కల నెరవేర్చిన ప్రభుత్వం…
సొంతిల్లు కల నెరవేర్చిన ప్రభుత్వం… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి షాక్.. రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మంగళవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ కిషన్ గుజ్జర్ తన పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారు. హర్యానా కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న గుజ్జర్.. పార్టీలోని అన్ని బాధ్యతల నుండి తనను విముక్తి చేయాలని కోరుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజీనామా అనంతరం గుజ్జర్ మాట్లాడుతూ.. పార్టీ నాయకురాలు శైలి చౌదరిని అప్రతిష్టపాలు చేయడానికి 'పెద్ద కుట్ర' జరుగుతోందని ఆరోపించారు. శైలి చౌదరి ఒక విధేయ కార్యకర్త. ఆమెను ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని గుజ్జర్ అన్నారు. తప్పుడు ప్రచారం, అంతర్గత దాడికి నిరసనగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. హర్యానాలో మార్చి 16, 2026న జరిగిన నాటకీయ రాజ్యసభ ఎన్నికల నుండి ఈ వివాదం మొదలైంది. ఫిరాయింపుల ప్రయత్నాలను నివారించడానికి కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్కు తరలించింది. అయినప్పటికీ పోలింగ్ లో క్రాస్-ఓటింగ్ జరిగిందని.. బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు అనుమానిస్తున్న వారిలో చౌదరి పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది.
Two Arrested for Online Abuse Targeting Renu Desai
Cyberabad cybercrime police have arrested two men for posting abusive and obscene comments against actress and filmmaker Renu Desai on social media. The arrests follow her complaint that several accounts were harassing her with vulgar language and false narratives. She said the abuse increased after she spoke about social issues, including her views on street […] The post Two Arrested for Online Abuse Targeting Renu Desai appeared first on Telugu360 .
ఉత్తమ సామాజిక సేవా అవార్డు అందుకున్న వర్కటం
ఉత్తమ సామాజిక సేవా అవార్డు అందుకున్న వర్కటం మక్తల్, ఆంధ్రప్రభ : నిర్వి
మహిళలంటే కెటిఆర్కు చిన్నచూపు: మంత్రి సీతక్క
మహిళలంటే మాజీ మంత్రి కెటిఆర్కు చిన్నచూపని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిండు సభలో మహిళా సంక్షేమంపై ప్రతిపక్ష నేత కెటిఆర్ ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళా రుణాలపై సభలో చర్చ జరిగిన సందర్భంగా కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కుటుంబ సభ్యులైనా, బయట మహిళలైనా ఎదగనీయాలంటూ కెటిఆర్కు మంత్రి సీతక్క చురకలంటించారు. గులాబీ పార్టీలో డ్రగ్స్ తీసుకునే నాయకులు ఉన్నారని, దానిపై ఆయన ముందు స్పందించాలని సీతక్క సవాల్ విసిరారు. యువతకు ఆ పార్టీ నేతలు ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. ముందుగా గులాబీ పార్టీ నేతలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సభలో ప్రశ్నించారు. ఫ్రీ బస్సుపై కెటిఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. కెటిఆర్ సత్యదూరమైన మాటలు, ఎగతాళి మాటలు బంద్ చేయాలని మంత్రి సీతక్క సూచించారు.
భూదాన్ మోసగాళ్లపై కఠిన చర్యలు… పీడీ యాక్ట్కు సిద్ధం
భూదాన్ మోసగాళ్లపై కఠిన చర్యలు… పీడీ యాక్ట్కు సిద్ధం బాధితులకు ఏసీపీ భరోసా…
పరుష పదజాలం–నిర్లక్ష్యం… ప్రజలకు నరకంగా టౌన్ ప్లానింగ్ఖమ్మం కార్పొరేషన్లో గందరగోళ వాతావరణంకింది స్థాయి
రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం...మరో మూడు రోజులు వర్ష సూచన
కర్ణాటక, తమిళనాడు మీదుగా కొరిమన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురువడంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మార్చి మొదటి వారం నుంచి విపరీతమయిన ఎండ, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు వర్షం వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం కలిగింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సైతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో సైతం పలు ప్రాంతాల్లో వరుణుడు పలుకరించడంతో వాతావరణం చల్లబడింది. ద్రోణి ప్రభావంతో వర్షం కంటే అధికంగా గంటకు సుమారు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బుధవారం అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు వీస్తాయని, రైతులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆఫ్ఘాన్పై దాడి పిరికిపంద చర్య..పాక్పై భారత్ ఆగ్రహం
అఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అత్యంత అమానుష ఘటనగా అభివర్ణించింది. ఇది పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ జరిపిన వాయుదాడిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని అందులో పేర్కొంది. ‘ఇది పిరికిపంద చర్య. దుర్మార్గమైన హింసాత్మక చర్య. భారీ సంఖ్యలో పౌరులు మరణించారు. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడులకు పాల్పడటం మరింత దారుణమని, నమ్మకాలు, చట్టాలు, నైతికత లేకుండా ఆసుపత్రులు, రోగులపై దాడి చేశారని విమర్శించింది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలని భారత్ సూచించింది. మృతులు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ విషాద సమయంలో అఫ్ఘాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నామని, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
sensex76000 | పైపైకి ఎగబాకుతూ… sensex76000 | భారీ పతనం తర్వాత రికవరీమెటల్,
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలోని ఒక షాపులో సిలిండర్ దొంగలించిన వ్యక్తి#Khammam
అగ్రిటెక్ ద్వారా రైతు చేతిలో సాంకేతికత
అగ్రిటెక్ ద్వారా రైతు చేతిలో సాంకేతికత ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : సాంకేతికతో
Hyderabad : కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కోటి రూపాయల దోపిడీని పోలీసులు గంటల వ్యవధితో ఛేదించారు
సివిల్స్ విజేత రాముకు కలెక్టర్ ఘన సత్కారం
సివిల్స్ విజేత రాముకు కలెక్టర్ ఘన సత్కారం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ
అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది:రజినీకాంత్
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని, ఆయనను బెదిరించిందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఆరోపణలపై డీఎంకేతో పాటు రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగునున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రజనీకాంత్ తాజాగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు. ఆయన వ్యాఖ్యలు సత్యదూరం అని, కాలమే ఇలాంటి వాటికి సమాదానం చెబుతుందనారు. ‘టీవీకే పార్టీ నేతగా ఉన్న ఆదవ్ ఆర్జున ఇటీవల నాపై ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన పూర్తిగా సత్యదూరం, అవాస్తవం. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిలిచిన తమిళనాడు విపక్ష నేత ఎడప్పాడి కె.పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్.మురుగున్, మీడియా మిత్రులు, నా అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అని పేర్కొన్నారు.
జీజీహెచ్లో యూత్ టైం బ్యాంక్..
జీజీహెచ్లో యూత్ టైం బ్యాంక్.. వినూత్న కార్యక్రమాల ద్వారా సేవాభావం.సేవలను ప్రారంభించిన జిల్లా
ప్రకృతి వ్యవసాయ అమలు పరిశీలన… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రైతు
టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు పై వెంటనే చర్యలు చేపట్టాలి…
టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు పై వెంటనే చర్యలు చేపట్టాలి… చంద్ర బాబు
రూ.32 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ అభివృద్ధి…
రూ.32 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ అభివృద్ధి… రిటైనింగ్ వాల్ నిర్మాణం
కెటిఆర్ తీరును తప్పు బట్టిన మంత్రి పొంగులేటి
కెటిఆర్ వైఖరిని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తప్పుబట్టారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ను అవమానించడం దురదృష్టకరమని మంత్రి పొంగులేటి కెటిఆర్పై మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం కెటిఆర్ అహంకారానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. గతంలో పార్టీ మారడాన్ని ప్రోత్సహించిన చరిత్ర మీది కాదా అని కెటిఆర్ను మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. బిఆర్ఎస్ నిజాయితీగా ఉంటే ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతుందని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. సీనియర్ నాయకులు కట్టుకథలు అల్లుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు.
మార్చి 18 రాష్ట్ర వైసీపీ అధికారిక ఇఫ్తార్ విందు
మార్చి 18 రాష్ట్ర వైసీపీ అధికారిక ఇఫ్తార్ విందు రాష్ట్ర వైసిపి కార్యదర్శి

23 C