పవన్ కల్యాణ్కు తీవ్ర అస్వస్థత
ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షిం చిన వైద్యులు, శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించి విజయవంతంగా పూర్తి చేశారు. వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత పవ న్ కల్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వైద్యులు వెల్లడించారు. అయితే, ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి గణనీ యమైన సమయం పడుతుందని, దీర్ఘకాలికంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాలను జనసేన అధ్యక్షుడి రాజకీ య కార్యదర్శి పి. హరిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా, పవన్ కల్యాణ్కు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వ హించినట్టు తెలుస్తోంది.
8వేల మంది సిబ్బందిపై మెటా వేటు?
ముంబయి: ఫేస్బుక్ అనుబంధ సంస్థ మెటా ఈ సంవత్సరం భారీ ఎత్తున్న లే ఆఫ్లకు సిద్ధపడుతోంది. సుమారు 8వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు ఆ కంపెనీ వర్గాలను ఊటంకిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మెటాలో ఉన్న సిబ్బందిలో 20శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో లే ఆఫ్ లెటర్స్ సిబ్బంది అందుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై మెటా ఇప్పటి వరకు స్పందించలేదు. 2022లో కూడా మెటా 11వేల మంది సిబ్బందిని మెటా తొలగించింది. ఆ తర్వాత జరగబోయే లే ఆఫ్ ఇదే పెద్దది అవుతుంది.
సిఎం మేడిగడ్డ పర్యటన ఒక బోగస్: ఎర్రవెల్లి దయాకర్రావు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభను ఫెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారని, సీఎం మేడిగడ్డ పర్యటన ఒక బోగస్ పర్యటన అని మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్రావు ఆరోపించారు. కేసీఆర్ నల్గొండలో మీటింగ్ పెడితే అప్పుడు మేడిగడ్డకు వచ్చాడని, ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తున్నాడని, కేసీఆర్ బయటకు వెళ్తే రేవంత్రెడ్డికి వణుకుపుడుతుందని ఎద్దేవా చేశారు. మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజ్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో కలసి శనివారం ఆయన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మట్లాడుతూ.. కేసీఆర్ జగిత్యాలలో వాలంటీర్లతో సమావేశం పెడితే, రేవంత్ అధికార యంత్రాంగాన్ని కదిలించి అధికారిక సమావేశం పెడుతున్నారని ఆరోపించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా మూడేండ్లు రైతులను గోసపెట్టారని విమర్శించారు. 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లో 20వ పిల్లర్ కుంగిపోయిన సంగతి తెలిసిందే కాగా దానికి మరమ్మతులు చేస్తే బీఆర్ఎస్కు, కేసీఆర్కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం రూ.94 వేల కోట్లయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ విష ప్రచారం చేస్తున్నదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదని, ఈ ప్రాంత ప్రస్తుత ఎమ్మెల్యే నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటానని దుద్దిళ్ల శ్రీధర్బాబుకు సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్పాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజయ్య, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎంమ్మెల్యేలు పుట్ట మధు, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్, భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ జెడ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహరిని రాకేష్, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
పౌరసత్వ వివాదంలో రాహుల్కు ఊరట
ద్వంద్వ పౌరసత్వం వివాదంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉపశమనం కల్గింది. ఈ కేసులో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ దాఖలు వాయిదా పడింది. ఇంతకు ముందు వెలువరించిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సంబంధిత లక్నో బెంచ్ ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందటి ఆదేశాలను నిలిపివేసింది. న్యాయమూర్తులు సుభాష్ విద్యార్థితో కూడిన బెంచ్ ఇప్పుడు రాహుల్పై ఎఫ్ఐఆర్ దాఖలుకు ముందస్తు నోటీసు ఇవ్వడం చట్టపరంగా అవసరమా ? లేదా అనేది ఖరారు చేస్తుంది. ఇప్పటి ప్రాధమిక సాక్షాధారాల మేరకు చూస్తే నిందితుడు నేరానికి పాల్పడినట్లు భావించాల్సి వస్తోంది. కేంద్రీయ దర్యాప్తు సంస్థ పరిధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును అప్పగించేందుకు సమ్మతిస్తోంది. అయితే దీనికి ముందు నోటీసు జారీ గురించి ఖరారు చేయాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ‘ఎలక్ట్రిక్ సోనా వీకెండ్’ ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ముందుకొచ్చింది. అన్ని వాహనాలపై రూ.50వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త వాహనాలపై రూ.40వేల డిస్కౌంట్ అందిస్తున్న ఓలా... హెచ్ఎస్బిసి, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంకు తదితర క్రెడిట్ కార్డులపై రూ.10వేల వరకు అదనపు డిస్కౌంట్ అందజేస్తోంది. ఆఫర్లు నేడు ఆదివారంతో ముగియనున్నాయి.
భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ : హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరపడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమం లోనే భారత్ లోని ఇరాన్ రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హార్ముజ్ను ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించి 24 గంటలు గడవక ముందే ఇరాన్ మళ్లీ జలసంధిని మూసేసింది. ఇదే సమయంలో జలసంధి నుంచి వెళ్లేందుకు జగ్ అర్నవ్, సాన్మర్ హెరాల్డ్ అనే భారత నౌకలు ప్రయత్నించగా,వాటిలో జగ్ అర్నవ్ అనే చమురు నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై తీవ్ర నిరసన తెలియజేస్తూ ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. భారత పతాకం ఉన్న ఈ చమురు నౌక ఇరాక్ నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకొస్తోంది.
Allu Arjun’s Raaka will release in 2027
Icon Star Allu Arjun is completely occupied with the shoot of his upcoming film Raaka. Atlee is the director of this unique attempt and the team is maintaining utmost secrecy about the film right from the genre to the shoot. The film started rolling last year and there are a lot of speculations about the […] The post Allu Arjun’s Raaka will release in 2027 appeared first on Telugu360 .
2023 మహిళా చట్టం అమలు చేయండి.. ప్రధానికి విపక్షాల లేఖ
న్యూఢిల్లీ: ఇంతకు ముందటి 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నాయి. ఇండియా కూటమి వేదిక ద్వారా ఈ మేరకు ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ 33 శాతం మహిళా కోటా చట్టం అమలులోకి వచ్చింది. దీనిని క్షేత్రస్థాయిలో తక్షణం అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్షాలు సమగ్ర లేఖ రాసేందుకు సిద్ధం అయ్యాయి. చట్టసభలలో మహిళలకు 33 శాతం కోటా విషయంలో ప్రతిపక్షాలు వ్యతిరేకతతో ఉన్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, దీనిని ఎదుర్కొవాలని సంకల్పించారు. ఇదే దశలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాలలో మహిళా బిల్లుపై ప్రతిపక్షాల పార్టీల తరఫున ఇండియా కూటమి వేదికగా విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి తరువాత తొలిసారిగా అధికార పక్షం సభా ముఖంగా ఎదురుదెబ్బ తింది. ఈ విషయాన్ని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే 2023 చట్టం అమలుకు ముందుకు రావాలని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సోమవారం ఈ చట్టం అమలు విషయంలో చర్చించేందుకు సోమవారమే (20వ తేదీ) పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయాలి. మహిళా చట్టం మునుపటి స్థాయిలో ఉన్నదే అమలు చేస్తామని ప్రతిపాదించాలి. అప్పుడు ఈ కోటాకు ఎవరు వ్యతిరేకం? ఎవరు బాసటగా నిలుస్తున్నారు? అనేది స్పష్టం అవుతుందని ప్రియాంక తేల్చిచెప్పారు.
ట్రంప్ నియంత్రణలో మోడీ: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణలో ఉంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అదే విధంగా ఎఐఎడిఎంకె ద్వారా తమిళనాడులో అధికారం చేజిక్కించుకుని తమిళనాడు ముఖ్యమంత్రిని తన నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. మన రైతులను, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అమెరికాకు ధారాదత్తం చేయడమే కాకుండా మన ఇంధన భద్రతను, డేటాను అమెరికాకు అప్పగించేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. “పార్లమెంట్లో నిన్న మీరు మోడీ ముఖాన్ని చూసే ఉంటారు. పూర్తిగా నమ్మకం కోల్పోయినట్టు కనిపించింది. విపక్షాలను ఆయన ఎదుర్కోలేకపోయారు. పక్కదారుల్లో కూర్చున్నారు. దీనికి కారణం ఆయన అమెరికా నియంత్రణలో ఉండడమే” అని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆయన సంతకం చేశారని, అది పూర్తిగా మనదేశాన్ని అమ్ముడుబోయేలా చేసిందని విమర్శించారు. ట్రంప్ నియంత్రణలో మోడీ ఉండడానికి ఎపిస్టెయిన్ ఫైల్స్ వ్యవహారమే కారణమని ఆరోపించారు. మోడీ ఆర్థిక సంబంధాలు ట్రంప్కు తెలుసునని, ఆదానీతో మోడీకి ఉన్న సంబంధాలు ట్రంప్కు తెలుసునని ధ్వజమెత్తారు.
తడబడిన సన్రైజర్స్ మిడిలార్డర్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ లో జరుగుతున్న మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 195 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(59) మెరుపు అర్ధశతకంతో అలరించాడు. ఆ తర్వాత క్లాసెన్(59) కూడా హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ 23 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, మిడిలార్డర్ విఫలమవ్వడంతో సన్రైజర్స్ 200 మార్క్ ను చేరుకోలేకపోయింది. ఇక, చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్, కాంబోజ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేష్ చౌదరి రెండు వికెట్లు, గుర్జప్నీత్ సింగ్ ఒక వికెట్ తీశాడు.
Mythri, Prashanth Neel’s Film Titled Impressively 418
Mythri Movie Makers is stepping into darker territory with its latest venture, 418, a film that aims to revive the true essence of horror. Presented by Prashanth Neel, and directed by Kirtan Nadagouda, the project has been unveiled with a spooky poster that immediately sets it apart from the recent wave of horror-comedy entertainers. The […] The post Mythri, Prashanth Neel’s Film Titled Impressively 418 appeared first on Telugu360 .
బ్యాంకాక్లో ప్రతిరోజూ 8 గంటల కఠోర శిక్షణ తీసుకుంటున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన దశలోకి అడుగుపెడుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ’మైసా’లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు శారీరక దృఢత్వం అవసరం. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు రూపొందుతున్నాయి. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతోంది. కథ విన్న తర్వాత రష్మిక ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకోవాలని ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. రా, రియల్గా అనిపించే యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆమె బ్యాంకాక్కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందుకు అనుగుణంగా ఆమె ట్రైనింగ్ సాగుతోంది.
80%norules |స్లీపర్ బస్సుల ట్రెండ్ వెనుక వాస్తవం
80%norules | స్లీపర్ బస్సుల ట్రెండ్ వెనుక వాస్తవం 80%norules | ప్రమాదాలకు
Telangana Speeds Up Airport Plans for Warangal, Adilabad and Bhadrachalam Regions
The Telangana government has intensified efforts to develop new airports in Warangal, Adilabad and Bhadradri Kothagudem as part of its broader infrastructure and regional growth strategy. Revenue, Housing and Information & Public Relations Minister Ponguleti Srinivasa Reddy said the state, under the leadership of Chief Minister Revanth Reddy, is taking key decisions to ensure balanced […] The post Telangana Speeds Up Airport Plans for Warangal, Adilabad and Bhadrachalam Regions appeared first on Telugu360 .
క్షణాల సుఖం కోసం ఐదేండ్ల బాలుడి దారుణ హత్య
అక్రమ సంబంధానికి అలవాటుపడ్డ ఓ వ్యక్తి క్షణాల సుఖం కోసం ఐదేండ్ల బాలుడిని బలిపీఠం ఎక్కించాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకున్నది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి వివాహం కాగా ఆమెకు ఐదేండ్ల శ్రావణ్, ఎనిమిదేండ్ల కూతురు ఉన్నారు. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె భర్తకు దూరంగా, పిల్లలతో కలసి వేరుగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. లక్ష్మీ శుక్రవారం పని మీద బయటికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న బాలుడు శ్రావణ్పై నిందితుడు నర్సింలు అమానుషంగా దాడి చేశాడు. గొంతు పిసికి, నోరు, ముక్కు మూసి, నేలకేసి కొట్టి, కళ్లలో కారంపొడి పోసి దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. బాలుడిని ఇలా క్రూరంగా హింసించి చంపడం నిందితుడి రాక్షతత్వానికి పరాకాష్ఠ అని పరిసరాల వ్యక్తులు వాపోతున్నారు. రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మీ బంధువు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన చిన్నారుల భద్రత, కుటుంబ పరిసరాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది.
టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన స్మృతి మంధాన..
డర్బన్: అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును భారత మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన బ్రేక్ చేసింది. అంతేకాదు, ఈ ఫార్మాట్ లో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా స్మృతి నయా రికార్డు నెలకొల్పింది. డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా జరిగిన తొలి మ్యాచ్లో మంధాన ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్కు ముందు 4,231 పరుగులతో రోహిత్ శర్మతో సమానంగా మంధాన ఉంది. ఈ మ్యాచ్ లో 13 పరుగులు చేయడంతో మొత్తం 4,244 పరుగులతో రోహిత్ ను అధిగమించింది. మంధాన..155 ఇన్నింగ్స్లలో 30.31 సగటు, 124.38 స్ట్రైక్ రేట్తో ఈ స్కోరును అందుకుంది. ఇందులో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వారి ఆల్-టైమ్ జాబితాలో 4,717 పరుగులతో సూజీ బేట్స్ అగ్రస్థానంలో ఉంది. ఆమె తర్వాత రెండో స్థానంలో మంధాన నిలిచింది. పురుషుల విభాగంలో, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బాబర్ అజామ్ పేరిట ఉంది. ఇదిలావుంటే.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ అజేయంగా 47 పరుగులతో రాణించగా.. షఫాలీ వర్మ 34 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 36 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక, దక్షిణాఫ్రికా బౌలింగ్లో అయబోంగా ఖాకా కీలక పాత్ర పోషించింది. ఆమె కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. తుమీ సెఖుఖునే రెండు వికెట్లు పడగొట్టగా, నాన్కులేకో మ్లాబా ఒక వికెట్ తీసింది. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.
బ్రిటన్ ట్యాంకర్పై ఇరాన్ గన్బోట్లు కాల్పులు
హర్మూజ్ జలసంధిపై తిరిగి ఆంక్షలు విధిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించిన తరువాత ఆ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్పై శనివారం ఇరాన్ రివల్యూషనరీకి చెందిన రెండు గన్బోట్లు కాల్పులు కాల్పులు జరిపాయని బ్రిటిష్ మిలిటరీ వెల్లడించింది. ఆ ట్యాంకర్ ఏమిటో గుర్తింపు కానీ, గమ్యం కానీ వివరించలేదు. అయితే ట్యాంకర్, సిబ్బంది క్షేమమేనని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది.
ఒంటరిగా జీవించడానికి ఓటు వివాహ బంధానికి లేటు #SingleLife #CityTrend #Hyderabad #YouthLife
పవర్ప్లేలో రాణించిన అభిషేక్.. చివర్లో వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కి అభిషేక్ శుభారంభం అందించాడు. 15 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. దీంతో పవర్ప్లే చివరి ఓవర్ వరకూ ఎస్ఆర్హెచ్ నిలకడగా రాణించింది. కానీ పవర్ప్లే చివరి రెండు బంతుల్లో వరుసగా హెడ్ (23), కిషన్(0) పెవిలియన్ చేరాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజ్లో అభిషేక్ (52), క్లాసెన్ (1) ఉన్నారు.
2yrs boy |పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..
2yrs boy | పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. 2yrs
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ, షా అబద్ధాలు : రాహుల్
రానీపేట్ (తమిళనాడు): మహిళల ప్రాతినిధ్యం కల్పనకు రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయడానికి ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా దేశానికి అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ధ్వజమెత్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ వారి క్రూరమైన ఆలోచన వెనుక దేశ ఎన్నికల చిత్రాన్ని మార్చి, రాష్ట్రాలను బలహీనపర్చడమేనని రాహుల్ వ్యాఖ్యానించారు. వారి ప్రయత్నం జాతికి, రాష్ట్రాల సమైక్యతకు వ్యతిరేకమైన చర్య అని రాహుల్ ఆరోపించారు. బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వం అస్సాం, జమ్ముకశ్మీర్ ఎన్నికల చిత్రాన్ని మార్చి వేసిందని, దేశంలో మిగతా ప్రాంతాలను కూడా ఆ విధంగా మార్చాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. చెన్నైకు 120 కిమీ దూరంలో గల ఉత్తర తమిళనాడు పట్టణంలో రెండోసారి ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగించారు. శుక్రవారం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిందని గుర్తు చేశారు.
దుర్గమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి..
దుర్గమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల
దోపిడీ కేసు ఛేదన.. ఐదుగురు యువకులు అరెస్టు.18 గ్రాముల బంగారం స్వాధీనం. పాయకాపురం,
హర్మూజ్ మళ్లీ మూసివేత.. భారత నౌకలపై కాల్పులు
తిరిగి వెళ్తూ భారత నౌకలపై ఇరాన్ గన్బోట్ల కాల్పులు సిబ్బంది, నౌకలు సురక్షితం ఒమన్ ఈశాన్యం నుంచి వెనక్కి మళ్లింపు జలసంధిపై ట్రంప్ వైఖరితో మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితి టెహ్రాన్ : హర్మూజ్ జలసంధి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెరిచినట్టే తెరిచే గంటల వ్యవధిలో ఇరాన్ తిరిగి మూసివేసింది. దానికి అమెరికా అనుసరిస్తున్న వైఖరే కారణమని స్పష్టం చేసింది. శుక్రవారంనాడు జలసంధిని తెరిచిన ఇరాన్ శనివారంనాడు మూసివేసింది. హర్మూజ్ను తెరిచినప్పటికీ ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ పేర్కొంది. ‘ హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తిరిగి మొదటికి వచ్చింది. ప్రస్తుతం మా సాయుధ దళాల నియంత్రణలో ఉంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంత కాలం జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుంటాం’ అని ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేవరకు హర్మూజ్లో దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. ఆ వెంటనే హర్మూజ్లో రాకపోలను ఇరాన్ నియంత్రించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న భారతీయ జెండాతో కూడిన రెండు నౌకలపై ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కాల్పులు జరిపారు. ఐఆర్జిసికి చెందిన రెండు గన్బోట్లు కాల్పులు జరిపాయని బ్రిటీష్ మిలిటరీ వెల్లడించింది. అయితే ఈ ఘటనలో నౌకల్లోని సిబ్బందికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ గార్డ్ జలసంధిని మూసివేసి తిరిగి వెళ్తూ కాల్పులకు పాల్పడ్డట్లు కథనాలు వెలువడ్డాయి. నౌకలు, సిబ్బంది క్షేమమేనని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్తో పాటు ప్రభుత్వం వెల్లడించింది. నౌకల్లో ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 2మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని, భారత నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, ఒమన్కు ఈశాన్యంగా వెనక్కి మళ్లించినట్లు ట్యాకంర్ ట్రాకర్స్ డాట్ కామ్ వెల్లడించింది. మరోవైపు కాల్పులు ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నాం... మరోవైపు దేశం లోని పలు ఎయిర్ పోర్టులను తిరిగి తెరవడంతోపాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యురేనియంను అమెరికాకు అప్పగించేది లేదు: ఇరాన్ అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శుద్ధి చేసిన యురేనియ ం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్జడేహ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భవిష్యత్లో జరగనున్న చర్చలకు యురేనియం ప్రధాన అంశమని ట్రంప్ చేస్తున్న వాదనలను కొట్టి పారేశారు. టర్కీ లోని అంటల్యా సిటీలో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సయీద్ అమెరికాతో మరో దఫా ముఖాముఖి చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని వెల్లడించారు. ఎందుకంటే అమెరికా తన గరిష్టవాదాన్ని విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని శుక్రవారం ట్రంప్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో సయీద్ఖతిబ్జ్దేహ్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రత్యేక నిష్పల సిట్టింగ్ తరువాత ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలు శనివారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. డిలిమిటేషన్, సంబంధిత మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లుల కోసం మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సెషన్ కొనసాగింపుగా ఈ ప్రత్యేక సిట్టింగ్స్ సందర్భంగా ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య వాడివేడి రాజకీయ దుమారాలు చెలరేగాయి. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడ్డట్లు శనివారం అధికారికంగా ప్రకటన వెలువడింది. బడ్జెట్ సమావేశాలు జనవరిలో ఆరంభమయ్యాయి. ఈసారి అత్యంత ఉధృత స్థాయిలో లెజిస్లేటివ్ బిల్లులు నాటకీయ పరిణామాల మధ్య ఆమోదం పొందాయి. అయితే అధికార పక్షానికి చివరి దశలో కీలక బిల్లు ఆమోదం విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. దీనితో తొలిసారిగా మోడీ ప్రభుత్వం చట్టసభలో గణనీయ స్థాయి రాజకీయ వైఫల్యం మూటకట్టుకుంది. శనివారం ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో అధ్యక్ష స్థానంలో ఉన్న సిపి రాధాకృష్ణన్ సభల నిరవధిక వాయిదాలను ప్రకటించారు. సభల తీరు ఫలప్రదంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ శుక్రవారం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ల కోసం ఈ నెల 16 నుంచి మూడు రోజుల సెషన్ ఏర్పాటు అయింది. లోక్సభ స్థానాల పెంపు, మహిళా కోటా అమలు వంటి విస్తృత అంశాలు మూలకుపడిన దశలో పార్లమెంట్ వాయిదా పడింది. తుది దశలో సంకల స్థితిని చవిచూసినా ఈ బడ్జెట్ సమావేశాలలో పలు కీలక మైలురాయి ఫలితాలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇంధన రంగ పరివర్తన లిథియం ఐయాన్ ఉత్పత్తి ప్రోత్సాహకాలు , పన్నుల వ్యవస్థల క్రమబద్ధీకరణ వంటి కీలక అంశాలు జోడించారు. సిఎపిఎఫ్ బిల్లు, జన విశ్వాస్ సవరణ బిల్లు వంటివి కీలకం అయ్యాయి. ఇక సభలో తుది దశలో నెలకొన్న నాటకీయ పరిస్థితులు, భారీ స్థాయి భావోద్వేగాలు , మహిళా బిల్లు అంశం ప్రధాన అస్త్రంగా మలుచుకునేందుకు వీలైన పూర్వ రంగంతో పార్టీలు ఇప్పుడు ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నాయి. తమ తమ వాదనలను ప్రజల ముందుకు ఉంచేందుకు సమాయత్తం అయ్యాయి. లోక్సభ స్థానాల పెంపు, మహిళా కోటా ముందుకు పడకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బిజెపి మిత్రపక్షాల ఎన్డిఎ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ రెండింటిని అధికార పక్షం తన రాజకీయ స్వార్థానికి వాడుకుందని ప్రజలకు వివరించేందుకు విపక్షాలు సిద్ధం అయ్యాయి.
ఆలయ కమిటీ అధ్యక్షుడుగా గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక …
ఆలయ కమిటీ అధ్యక్షుడుగా గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక … భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలోని ఓ బ్యాంకులో సినీ ఫక్కీలో దోపిడీ సంఘటన జరిగింది. ఐదుగురు సాయుధులు బ్యాంక్లోకి దూసుకెళ్లి సిబ్బంది, కస్టమర్లను బందీలుగా ఉంచి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. కేవలం 20 నిమిషాల్లో మొత్తం కానిచ్చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో ఈ ఘటన జరిగింది. మొదట ఇద్దరు ఖాతాదారుల్లా బ్యాంక్లోకి ప్రవేశించారు. తుపాకులు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. మరికొన్ని క్షణాల్లో మరో ముగ్గురు వచ్చి బ్యాంక్పై పూర్తిగా నియంత్రణ సాధించారు. దుండగులు తుపాకీలు చూపించి సిబ్బంది, కస్టమర్లను ఒకచోట కూర్చోబెట్టారు. బెదిరించేందుకు పలు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. బ్యాంక్ మేనేజర్పై దాడి చేసి లాకర్ల తాళాలు లాక్కున్నారు. సుమారు రూ.35 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. చోరీ అయిన మొత్తం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఘటన సమయంలో బ్యాంక్లో సెక్యూరిటీ గార్డు లేకపోవడం గమనార్హం. సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్లే దుండగులు సులభంగా దొంగతనం పూర్తి చేయగలిగారని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు.
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు….
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు…. నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ
ఢిల్లీ పోలీసులు మరో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమై దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కీలు నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ ఫ్లాట్ఫాంల ద్వారా పలువురిని రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. నిఘా ఆధారిత ఆపరేషన్ ద్వారా ఇద్దరు నిందితులు మోసైబ్ అహ్మద్, హహమ్మద్ హమాద్లను మహారాష్ట్రలో, షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఒడిశాలో, మహమ్మద్ సోహైల్ను బిహార్లో అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఐఈడీ అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మ కారు తయారీకి యత్నిస్తుండగా పట్టుకున్నారు. నలుగురు నిందితులు తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. నిందితులలో ఒకడు ఎర్రకోట తమ లక్ష్యమని తెలిపే సంకేతంతో నల్లజెండాతో కూడిన ఎర్రకోట మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసినట్టు గుర్తించామని చెప్పారు. షేక్ ఇమ్రాన్ అనే నిందితుడు 2025లో ఎర్రకోట, ఇండియా గేట్ సహా కీలక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్టు తెలిపారు. మోసైబ్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఆటో ఎలక్ట్రీషియన్గా పనిచేశాడని, ఐఈడీ అమర్చిన రిమోట్ కంట్రోల్ కారు డిజైన్కు అవసరమైన సాంకేతిక నైపుణ్యం అతనికి ఉందని గుర్తించామని వివరించారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి నిందితుల నెట్వర్క్ ఛేదించేందుకు, ఇతర ముఠాలతో సంబంధాలను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
ఉత్కంఠ పోరులో ఆర్సిబిపై ఢిల్లీ ఘన విజయం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే నిస్సాంక ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్లోనే భువనేశ్వర్ మరో రెండు వికెట్లు తీశాడు. కానీ, ఢిల్లీ బ్యాటర్లు పట్టువదలకుండా బ్యాటింగ్ చేశారు. కెఎల్ రాహుల్ 57, స్టబ్స్ 60, అక్షర్ పటేల్ 26, డేవిడ్ మిల్లర్ 22 పరుగులతో తమ జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో 19.5 ఓవర్లలో ఢిల్లీ 179 పరుగులు చేసి ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది.
మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే…
మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే… ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు
మూడురోజుల్లో దారికి రాకపోతే తిరిగి దాడులే: ట్రంప్
బుధవారం నాటికి ఇరాన్ తన సైనిక చర్యలను నిలిపివేయాలని , లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి ఒప్పందానికి రావల్సిందే. లేకపోతే ఇక అమెరికా నుంచి బాంబుల దాడుల ఉధృతిని అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఓ వైపు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగుతోందని, హర్మూజ్ పెత్తనం వీడటం లేదని, వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, అమెరికా సేనల చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ను హెచ్చరించారు. అరిజోనా నుంచి వాషింగ్టన్కు తిరిగి వస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ తమ ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానం నుంవి మీడియాతో మాట్లాడారు. హర్మూజ్ను అమెరికా తమ పూర్తి స్వాధీనంలోకి తీసుకుంటుందని, ఈలోగా ఇరాన్ సరైన రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు ప్రతిగా ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్మూజ్పై అమెరికా బెదిరింపులు లెక్కలోనికి రావని, తరచూ అసమంజస ప్రకటనలకు దిగుతున్నారని ఇరాన్ ఎదురుదాడికి దిగింది. ఇప్పుడు ఇక హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకలను తక్షణం నిలిపివేస్తున్నామని, ఈ నిర్ణయానికి అమెరికా అతి చర్యలే కారణం అని విమర్శించారు.
Flash : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది
కేంద్ర ఉద్యోగుల డిఎ 2 శాతం పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దార్లకు 2 శాతం మేర కరువు భత్యం (డిఎ), కరువు ఉపశమనం (డిఆర్) పెంచారు. ఈ నిర్ణయానికి శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించింది. తరువాత ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. డిఎ, డిఆర్ పెంపుదల నిర్ణయంతో దేశంలోని దాదాపు 50.46 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 68.27 లక్షల మంది పెన్షనర్లకు ఉపయోగం చేకూరుతుంది. ఈ రెండింటి హెచ్చింపు భారం ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపుగా రూ 6791.24 కోట్ల మేర ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిఎ, డిఆర్ పెంపుదల ఉద్యోగులకు వర్తింపచేస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు, ఇప్పటి ధరల పెంపుదల , ఇతర కారణాలను విశ్లేషించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగుల మూల వేతనం/ పింఛన్లపై అమలులో ఉన్న 58 శాతం డిఎ రేటుకు అదనంగా ఈ రెండు శాతం జోడింపు జరుగుతుంది.
రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్
రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్ భార్య తరపున మధ్యవర్తుల వేధింపులతో
2026entry |సుప్రీత నాయుడు సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర నటి వరకు!
2026entry | సుప్రీత నాయుడు సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర నటి
ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత… పాయకాపురం, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి సహాయ నిధి
ఈ నెల 20న జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 304 నగరాలలో 566 పరీక్షా కేంద్రాలతోపాటు విదేశాలలోని 14 నగరాలలో ఈ నెల 2 నుంచి 8 వరకు జెఇఇ మెయిన్ 2 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా, ఆదివారం రాత్రి లేదా సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జెఇఇ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు జరగగా, ఫిబ్రవరి 16న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి: సిఎం రేవంత్ రెడ్డి
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సిఎం కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను సిఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతలతో దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తుందని కేంద్ర మంత్రులకు సిఎం వివరించారు. హైదరాబాద్లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మెషిన్టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సిఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సిఎం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
ఈనెల 21న వాహనాల బహిరంగ వేలం డీటీసీ యం పురేంద్ర… విజయవాడ, ఆంధ్రప్రభ
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సిఎస్కె
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి ఫుల్ జోష్లో ఉన్న చెన్నై జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్తో సొంత మైదానంలో గెలిచిన ఎస్ఆర్హెచ్.. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తుది జట్లు: ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సాలిల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేస్, ఇషాన్ మలింగ. సిఎస్కె: సంజు శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.
ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర.. నలుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి టెర్రరిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఢిల్లీ నగరంలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడం, లక్ష్యంగా చేసుకునేందుకు సున్నితమైన ప్రాంతాలపై రెక్కీ నిర్వహించడం, ఎన్క్రిప్టెడ్ ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఇతరులను నియమించుకునేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలతో మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన నలుగురు తీవ్రవాద భావజాలం గల వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED), దానికి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు, నిందితులలో ఇద్దరు IED అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మ కారును తయారు చేసే ప్రక్రియలో ఉన్నారని చెప్పారు. నిఘా ఆధారిత ఆపరేషన్లో మహారాష్ట్ర నుండి ఇద్దరు నిందితులను.. ఒడిశా, బీహార్ నుండి ఒక్కొక్కరిని స్పెషల్ సెల్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచన చుట్టూ కేంద్రీకృతమైన తీవ్రవాద భావజాలంతో ఈ నలుగురు ప్రభావితులయ్యారని, గజ్వా-ఎ-హింద్ వంటి నినాదాలను ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు.
తాచుపాముల స్వైరవిహారం.. సింగ్ నగర్లో ఇద్దరికి పాముకాటు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్
మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది…
మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
ఈ వేసవిలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి…
ఈ వేసవిలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : ఈ
Took Cash, Showed Fake Payment Screenshot: ATM Fraudster Held in Hyderabad
Hyderabad Police have arrested a 25-year-old man accused of cheating ATM users by showing fake PhonePe payment screenshots and escaping with cash. The accused, Abdallah Obaid Al Katheri alias Abdullah, was arrested by Chandrayangutta Police on April 17 near the same ATM centre where one of the frauds had taken place. How the Scam Worked […] The post Took Cash, Showed Fake Payment Screenshot: ATM Fraudster Held in Hyderabad appeared first on Telugu360 .
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది ఎన్డీయే సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 2శాతం డిఎ పెంచేందుకు కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. పెంచిన డిఎ జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
శ్రీధర్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం
శ్రీధర్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మాజీ
Hyderabad Police Raid 558 Shops Near Schools in Massive Anti-Tobacco Drive
In one of the largest enforcement drives in recent times, Hyderabad City Police on Saturday conducted simultaneous raids on 558 shops located near schools and colleges as part of a citywide crackdown titled Operation Safe School. The special operation was launched to curb the sale of tobacco products near educational institutions and protect students from […] The post Hyderabad Police Raid 558 Shops Near Schools in Massive Anti-Tobacco Drive appeared first on Telugu360 .
అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం
అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం కార్మికులకు అగ్నిప్రమాదాల పై అవగాహన కార్యక్రమం చిట్టినగర్,
ఎల్లుండి రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల..
హైదరాబాద్: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ సర్కార్, రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీన రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండో విడతలో 45,11,947 రైతులకు రూ.5,653 కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ చేయన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారనే దానిపై స్పస్టత రావాల్సి ఉంది. కాగా, తొలి విడతలో ఒక ఎకరం వరకు రైతులందరికీ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అనకాపల్లి రైల్వేస్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
అనకాపల్లి: అనకాపల్లి రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫుట్పాత్ వంతెన కూలిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వంతెన నిర్మిస్తున్న క్రమంలో స్తంభాలు కూలిపోయి.. విద్యుత్ వైద్యు తెగిపడ్డాయి. అయితే, ఆ సమయంలో ప్లాట్ఫామ్పై రైలు లేకపోవడంతో భారీ నష్టం తప్పింది. క్షతగాత్రులైన కూలీలను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పదవులకే వన్నె తెచ్చే నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమా…
పదవులకే వన్నె తెచ్చే నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమా… పాయకాపురం, ఆంధ్రప్రభ :
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బిజెపి నిరసనలు.. రాహుల్ దిష్టిబొమ్మ దహనం
న్యూఢిల్లీ: లోక్సభలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా కోటా చట్టాన్ని సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవాతో సహా పలువురు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. తర్వాత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు.. బీజేపీ ఎంపీలు కమల్జీత్ సెహ్రావత్, బన్సూరి స్వరాజ్తో సహా పలువురు కార్యకర్తలను, నాయకులను అదుపులోకి తీసుకుని, నిరసనకారులను చెదరగొట్టారు. ఈ నిరసన సందర్భంగా ఎంపి బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ.. “వారి వ్యాఖ్యలను బట్టి, నిన్న బిల్లును వ్యతిరేకించడం కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ అని స్పష్టమైంది. రాహుల్ గాంధీ, ఆయన సహచరులకు, మొత్తం ఇండియా కూటమికి మహిళలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కనిపిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. మహిళలు కేవలం ఓటింగ్కు మాత్రమే పరిమితం కావాలని వారు కోరుకుంటున్నారు” అని విమర్శించారు.
కేడీసీసీ బ్యాంక్కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్…
కేడీసీసీ బ్యాంక్కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్… నాణ్యతలో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. ప్రజల నుంచి వచ్చే సమస్యలను
LokSabha | రాజకీయ అనివార్యతలా? LokSabha | లోక్సభ బిల్లు వీగిపోవడం: కొత్త
నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు
శానిటేషన్పై దృష్టి సారించాలి…
శానిటేషన్పై దృష్టి సారించాలి… స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్ర ద్వారా అవగాహన..సెంట్రల్ ఎమ్మెల్యే
పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో పిచ్చి కుక్క
నటుడు ప్రకాశ్ రాజ్ పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా..
నటుడు ప్రకాశ్ రాజ్ పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా.. టీటీడి బోర్డు
హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి
హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా
BRS : కేసీఆర్ కీలక ప్రకటన.. పార్టీ పై నిర్ణయం వెలువరించే ఛాన్స్
భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తడబడిన ఆర్సిబి.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..
బెంగళూరు: ఐపిఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సిబి బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సిబిని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్కి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సిబి బ్యాటింగ్లో సాల్ట్ 63, డేవిడ్ 26, కోహ్లీ, 19, పడిక్కల్ 18 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్లో ఎంగిడి, కుల్దీప్, అక్షర్ చెరి 2, ముఖేశ్ 1 వికెట్ తీశారు. అయితే 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో నిస్సాంకా ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 1 ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ 1 వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. క్రీజ్లో రాహుల్(1), కరుణ్ నయర్ (0) ఉన్నారు.
మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు : చంద్రబాబు
మహిళల ఆత్మగౌరవాన్ని విపక్షాలు దెబ్బతీశాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది
కాంగ్రెస్ ది రెండు నాల్కల ధోరణి : కిషన్ రెడ్డి
మహిళా రిజర్వేషన్పై కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని వ్యవహరించిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు
Health |మహిళల్లో ఆస్టియోపోరోసిస్..
Health | మహిళల్లో ఆస్టియోపోరోసిస్.. Health | మెనోపాజ్.. అసలైన మలుపుసైలెంట్ డిసీజ్గా
నీటి వృథా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి..
– ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్.. విశాలాంధ్ర – నార్పల:- స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ పంచాయతీలలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్ మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీటి అనవసర […] The post నీటి వృథా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి.. appeared first on Visalaandhra .
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పార్థసారథి..
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పార్థసారథి.. మంత్రి కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలికిన ఈవో..అమ్మవారికి
బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసింది: కిషన్ రెడ్డి
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరోసారి అన్యాయం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాకు న్యాయం జరిగేలా మంచి ఫార్ములాను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చారని తెలియజేశారు బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసిందని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ కాంగ్రెస్ లో కనిపిస్తోందని అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళల ఉత్సాహంపై నీళ్లు చల్లారని, సర్జికల్ స్ట్ర్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ను కూడా అవమానించేలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని జాదుగర్ అంటూ రాహుల్ గాంధీ అవమానించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన
గట్టుప్పల, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా
ముమ్మరంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల పరిశీలన…
ముమ్మరంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల పరిశీలన… లైవ్ డెమో ద్వారా పరీక్షల పనితీరును వీక్షించిన
ప్రజా ప్రయోజనార్థం SRR ఫౌండేషన్ మరో ముందడుగు
రాయపర్తి, ఆంధ్రప్రభ : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల
హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!…….
ప్రారంభంలో వరాల జల్లులు… ముగింపులో ఫీజులు ముక్కుపిండి!….. విశాలాంధ్ర – నార్పల :- మండలంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు హామీలు ఇస్తుండగా, విద్యా సంవత్సరం ముగిసే సరికి పాఠశాల యాజమాన్యాలు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని చెబుతూ ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్న ఘటనలు షరా మామూలుగా మారాయి.ఈ సమస్యను పాత్రికేయులు పలుమార్లు విద్యాధికారుల […] The post హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!……. appeared first on Visalaandhra .
కవ్వాల టైగర్ జోన్లో 30కి మించి వాహనాలు నడపరాదు..
కవ్వాల టైగర్ జోన్లో 30కి మించి వాహనాలు నడపరాదు.. జన్నారం, ఆంధ్రప్రభ :
Razor Trailer: Tale Of Fury & Survival
Ravi Babu is coming up with Razor, a film that pushes him into one of the boldest avatars of his career, both as the lead actor and as the creative force behind the camera as a director. Backed by Flying Frogs and presented by Suresh Productions, the team has dropped the theatrical trailer as the […] The post Razor Trailer: Tale Of Fury & Survival appeared first on Telugu360 .
Telangana |మాజీ మంత్రి హరీశ్రావు
Telangana | మాజీ మంత్రి హరీశ్రావు Telangana | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రేమ్ చందు
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
భక్తుల సేవతో పాటు సిబ్బంది సంక్షేమమూ ప్రాధాన్యమైనదే
భక్తుల సేవతో పాటు సిబ్బంది సంక్షేమమూ ప్రాధాన్యమైనదే ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ
Video : Actor Tharun Bhascker Exclusive Interview
The post Video : Actor Tharun Bhascker Exclusive Interview appeared first on Telugu360 .
వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం!
సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్ అమలు అవగాహనతో సాధ్యమని, మన ఆసుపత్రి వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మార్చడానికి సమిష్టి కృషి అవసరం అని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో మాట్లాడుతూ…“నీటిని సంరక్షించడం, వ్యర్థ నీటిని పునర్వినియోగం చేయడం, భూగర్భ జలాలను పెంచడం ఆవశ్యకతను […] The post వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం! appeared first on Visalaandhra .
పోషక ఆహారం తో సంపూర్ణ ఆరోగ్యం…సూపర్వైజర్ సునీత
విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు,బాలింతలు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారని అంగన్వాడి సూపర్వైజర్ సునీత అన్నారు. శనివారం కందుకూరు ప్రాజెక్టు వలే టివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు చెర్లోపాలెం అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడా పక్షోక్షవాలు కార్యక్రమం కార్యకర్త రమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్త రమా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా స్కూల్ వలేటివారిపాలెం ఎస్ ఐ […] The post పోషక ఆహారం తో సంపూర్ణ ఆరోగ్యం… సూపర్వైజర్ సునీత appeared first on Visalaandhra .
భాష్యం,నారాయణ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేదిలేదు నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాలు సీజ్ చేసిన ఎంఈఓ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్ విశాలాంధ్ర_అచ్యుతాపురం: ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, కనీస అనుమతులు లేకుండా అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెగబడుతున్న నారాయణ, భాష్యం వంటి కార్పొరేట్ విద్యా సంస్థల తీరును వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం అచ్యుతాపురంలో వద్ద ఉన్న నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.ఈ నిరసనకు అచ్యుతాపురం మండల విద్యాశాఖ […] The post భాష్యం,నారాయణ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు appeared first on Visalaandhra .
గుడ్న్యూస్ చెప్పిన రషీద్ ఖాన్.. తండ్రిగా ప్రమోషన్..
అఫ్గానిస్థాన్ ఆటగాడు.. రషీద్ ఖాన్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు. అతడి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. తన చిన్నారికి ‘అస్లాన్ ఖాన్’ అని నామకరణం చేశాడు. ఈ ప్రపంచంలోకి నా లిటిల్ ప్రిన్స్కు స్వాగతం అంటూ రషీద్ పోస్ట్ పెట్టాడు. ఈ నేపథ్యంలో రషీద్కు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, రషీద్ ఖాన్ 2024లో పష్తూన్ ఆచారాల ప్రచారం మొదటి వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు అప్గానిస్థాన్ క్రికెటర్లు అందరూ హాజరయ్యారు. కానీ, ఏడాది తిరగకముందే వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత రషీద్ రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఇక రషీద్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న అతడు ఐదు మ్యాచుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Rashid Khan (@rashid.khan19)
పరిశ్రమల్లో వ్యవసాయ యూరియా వాడితే కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి ఎం. రవి హెచ్చరిక విశాలాంధ్ర – రాప్తాడు: పరిశ్రమల్లో వ్యవసాయానికి వాడే యూరియాను ఉపయోగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (ఎం. రవి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామ పారిశ్రామిక వాడ (ఎం.ఎస్.ఎం.ఈ)లో ఉన్న ‘ఎం.ఎస్ పెయింట్స్’ తయారీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని తయారీ విభాగంతో పాటు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. […] The post పరిశ్రమల్లో వ్యవసాయ యూరియా వాడితే కఠిన చర్యలు appeared first on Visalaandhra .
నీటి సంరక్షణతోనే సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధ్యం
ఎంపీడీవో విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం రాప్తాడు పంచాయతీలో ‘జలధార, జలహారతి’ కార్యక్రమాన్ని నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం” అనే నినాదంతో నిర్వహించారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటి, వాటికి నీరు […] The post నీటి సంరక్షణతోనే సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధ్యం appeared first on Visalaandhra .
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రపంచ
వనపర్తిలో ‘జనసమయం’ పక్షపత్రిక ఆవిష్కరణ
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి శనివారం
మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ఎందుకు లింక్ చేశారు: హరీష్ రావు
హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణకు ఎంతో బలాన్నిస్తుందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణకు అవమానించిన లోక్ సభ సభ్యుడు తేజస్వీసూర్యను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమర్థించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమరుల త్యాగాలను కించపరుస్తూ..తెలంగాణపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, తేజస్వీతో క్షమాపణ చెప్పించాల్సిన కిషన్ రెడ్డి వెనకేసుకు వస్తున్నారని విమర్శించారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ఎందుకు లింక్ చేశారని హరీష్ రావు ప్రశ్నించారు. బిజెపికి మూడో వంతు మెజార్టీ లేదని తెలిసీ బిల్లు పెట్టారని, మహిళా రిజర్వేషన్లపై బిజెపికి చిత్తశుద్ధి లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

33 C