SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

5 మండలాల్లో భూభారతి

మన తెలంగాణ/హైదరాబాద్: గత ప్ర భుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతున్నామని, రాష్ట్రం లో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ మేనేజిమెంట్ సిస్టమ్) ను వచ్చే నెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు మం త్రి పొంగులేటి ప్రకటించారు. గురువారం రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్‌ఐసీ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా భూపరిపాలన సేవలను మరింత వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా పోర్టల్ ఉంటుందని ఆయన తెలిపారు. నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్‌లు కేటాయించాం ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్‌ను నారాయణపేట జిల్లా కొస్గీ, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్‌లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి భూ భారతి పోర్టల్‌ను కూడా తీసుకొచ్చామన్నారు. భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్‌ను జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ మాదిరిగానే భూధార్ నంబర్‌ను ఇస్తామన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్‌లను కేటాయించినట్లు తెలిపారు. మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ ఒక క్లిక్‌తో రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా, చాలా సులువుగా, సులభతరంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావలసిన సమాచారం లభిస్తుందని ఆయన తెలిపారు. అదే విధంగా పోర్టల్లో ప్రధానంగా సమాచారం సేవలు, సర్వే సేవలు, కరెక్షన్ సేవలు, అప్పీల్ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలతో పాటు సిటిజన్ డాష్ బోర్డు సేవలకు సంబంధించి మై ల్యాండ్ పోర్ట్ ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్‌బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్‌ఓఆర్, భూధార్ నెంబర్, దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్, ఈసీ, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నంబర్‌కు మ్యాప్, ఆర్‌ఓఆర్, గ్రామాల నక్షా, పాస్ బుక్ కరెక్షన్ వంటి పూర్తి సమాచారం ఉంటుందన్నారు. అన్ని రకాల సేవలు లభించేలా మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ భూ భారతి పోర్టల్‌ను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి స్టేజ్ లో దాని వివరాలను తెలియజేస్తూ ఎస్‌ఎంఎస్ ద్వారా ఖాతాదారునికి సమాచారం అందుతుందన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎన్‌ఐసి అధికారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 4:00 am

తగ్గిన క్యూ లైన్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లు కొంతమే ర కోలుకున్నాయి. బుధవారం మూతపడిన బంక్‌ల్లో కొన్ని తిరిగి గురువా రం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీలతో సమీక్షలు జరిపి ట్యాంకర్‌లను సకాలంలో బంక్‌లకు తీసుకురావడంతో కొంతమేర సఫలీకృతమయ్యింది. దీంతో క్యూ లైన్‌లు కొంతమేర తగ్గాయి. శుక్రవారం నాటికి క్యూ లైన్‌లు లేకుండా చూస్తామని ఫౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నా రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన బంక్‌లు తిరిగి ప్రారంభమయితేనే ఇబ్బందులు ఉండవని వాహనదారులు పేర్కొంటున్నా యి. కొన్ని బంక్‌ల్లో క్యూ అధికంగా ఉండడంతో గురువారం కూడా ఆ యా బంక్‌ల యజమానులు రేషనింగ్ పద్ధతిని ద్విచక్ర వాహనానికి రూ. 200ల పెట్రోల్, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.2 వేల పెట్రోల్, డీజిల్‌ను మాత్రమే పోయడం విశేషం. అధికారులు  నిరంతరం తనిఖీలు చేపట్టంతో బ్లాక్‌మార్కెట్ తగ్గిందని వాహనదారులు పేర్కొంటున్నారు. అయితే, గ్యాస్‌తో నడిచే ఆటోలకు మాత్రం తిప్పడం తప్పడం లేదు. ఆటోల లైన్‌లు మాత్రం కిలోమీటర్ల మేర ఉంటున్నాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో ఆటోలకు పూర్తిస్థాయిలో గ్యాస్ అందడం లేదని బంక్ యజమానులు పేర్కొంటున్నారు. ధరలను పెంచిన నయారా ఎనర్జీస్ ప్రస్తుతం ప్రయివేట్ రంగ సంస్థ అయిన నయారా ఎనర్జీస్ పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచింది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ ’రాస్నెఫ్ట్’ భాగస్వామ్యం కలిగిన నయారా ఎనర్జీ లీటరు పెట్రోల్‌పై దాదాపు రూ. 5లు, డీజిల్‌పై రూ. 3 వరకు పెంచి సామాన్యుడికి షాక్ ఇచ్చింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్థిరంగా లేకపోవడం ఇంధన ధరలు పెంచినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,000 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ పెరిగిన ధరలను అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. వివిధ రాష్ట్రాలు విధించే వ్యాట్ (వ్యాట్) ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈ పెంపు గరిష్టంగా లీటరుకు రూ. 5.30 వరకు చేరింది. మరోవైపు దేశంలో 90 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియ కంపెనీల ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉండడం వాహనదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

మన తెలంగాణ 27 Mar 2026 3:30 am

పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి

` దేశంలో ఇంధనానికి కొరత లేదు.. ` 60 రోజులకు సరిపడా స్టాక్ ` ప్రజలు ఆందోళన చెందొద్దు:కేంద్రం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని కేంద్ర …

జనం సాక్షి 27 Mar 2026 3:14 am

ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ మతి

అబుధాబీలో క్షిపణి దాడి.. భారతీయుడి మతి అమెరికాను ఎదుర్కొనేలా ఇరాన్ ఎత్తులు ఖర్గ్ ఐలాండ్‌లో మందుపాతరలు పశ్చిమాసియా ఘర్షణల వేళ.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..! టెహ్రాన్(జనంసాక్షి):ఇరాన్‌కు …

జనం సాక్షి 27 Mar 2026 3:13 am

అగ్నికీలల మారణహోమం

` టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్ బస్సు ` ఘోర దుర్ఘటనంలో 13మంది ప్రయాణికుల మతి ` పలువురికి తీవ్ర గాయాలు ` మార్కాపురం …

జనం సాక్షి 27 Mar 2026 3:11 am

పేదల వైద్యం.. అత్యంత ప్రాధాన్యం

` ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2,408 కోట్లు చెల్లించాం ` గత ప్రభుత్వం 600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది ` విద్య,వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం ` …

జనం సాక్షి 27 Mar 2026 3:08 am

శుక్రవారం రాశి ఫలాలు (27-03-2026)

మేషం ఇతరులతో ఏర్పడిన వివాదాలలో ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వృషభం ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువర్గంతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. మిధునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కర్కాటకం ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. సింహం నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కన్య సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృశ్చికం స్థిరస్తి వివాదాలు మరింత బాధిస్తాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులలలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహవాతావరణం ఉంటుంది. ధనస్సు స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విషయమైన పెద్దల సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. దైవచింతన పెరుగుతుంది. మకరం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. కుంభం బంధువులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమను ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. మీనం ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వెయ్యవలసి వస్తుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.  

మన తెలంగాణ 27 Mar 2026 12:20 am

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, జగన్మాత సీతాదేవిని వివాహమాడే పర్వదినముగా శ్రీరామ నవమిని జరుపుకుంటారని తెలిపారు. భారతీయ సాంస్కృతిక సామాజిక కుటుంబ జీవన గమనంలో, సంప్రదాయాలు విలువలకు, ధర్మానికి ప్రాధాన్యతనిస్తూ సాగిన శ్రీ సీతారాముల భార్యాభర్తల బంధానికి, హిందూ మత సాంప్రదాయంలో పవిత్రమైన స్థానం ఉన్నదని పేర్కొన్నారు. పలు కష్టాలు త్యాగాలతో కాలపరీక్షలను నెగ్గి నిలిచిన సీతారాముల ప్రేమ బంధం అజరామరం, ఆదర్శనీయం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా శ్రీ సీతారాముల చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలకు అందాలని కెసిఆర్ ప్రార్ధించారు.

మన తెలంగాణ 26 Mar 2026 11:10 pm

నేను అధికారంలో ఉన్న పార్టీలో చేరలేదు : మంత్రి సీతక్క

సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్‌లో ఎంఎల్‌ఎగా గెలిచి, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారని మంత్రి సీతక్క అన్నారు. తాను టిడిపిలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు అని, కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఆ పార్టీ అధికారంలో లేదని చెప్పారు. బిఆర్‌ఎస్ హయాంలో అన్ని చేశాం..అన్నీ బాగున్నాయి అంటున్నారు, ఇపుడు ఒక్క రోడ్డు లేదు, వాటర్ ట్యాంక్ లేదు అంటున్నారు...ఇది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డికి తనపై ద్వేషం ఉండొచ్చు..కానీ తనకు ఎందుకు ఉంటుందని అని ప్రశ్నించారు. “ఆమె కేటగిరీ వేరు,నా కేటగిరీ వేరు, ఆమె రాజ్యం వేరు, నా రాజ్యం వేరు...వాళ్ళది హైదరాబాద్ సిటీ...మేము అడవి బిడ్డలం.. మాకు ఎక్కడ కూడా వాళ్లతో పోలిక లేదు” అని పేర్కొన్నారు. తమకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదు అని, వాళ్లు అన్న మాటలు ఒక్కసారి పరిశీలించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డిలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 26 Mar 2026 11:02 pm

ప్రముఖ నటుడు ఇ.ఏ . రాజేంద్రన్ కన్నుమూత

మలయాళ నాటక, సినీ రంగంలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ. రాజేంద్రన్ (71) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. ఆయన స్వస్థలం త్రిస్సూర్ జిల్లా లోని త్రిత్తల్లూర్ వద్ద శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయి. 1981లో సినీ రంగ ప్రవేశం చేసిన రాజేంద్రన్ సుమారు 60 కి పైగా మళయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రముఖ నటుడు , ఎమ్‌ఎల్‌ఎ ముఖేష్‌కు స్వయానా బావ అయిన రాజేంద్రన్ నరసింహం, మీశమాధవన్, కలియాట్టం వంటి సూపర్‌హెట్ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషించారు. రాజేంద్రన్ భార్య సంధ్య, కుమారుడు  దివ్యదర్శన్ కూడా చిత్ర పరిశ్రమలో నటులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర హార్టికల్చర్ కార్పొరేషన్‌లో కూడా ఆయన పనిచేశారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. 

మన తెలంగాణ 26 Mar 2026 10:30 pm

రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు విమర్శలు..

కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన సలహాదారుల ప్రభావంలో ఉండి, వారు చెప్పినట్లే పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. సభలో టీ-షర్ట్ ధరించి హాజరుకావడం కూడా సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ‘టైమ్స్ నౌ సమ్మిట్’లో మాట్లాడుతూ, వ్యక్తిగతంగా రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి సమస్యలేదని, సభ బయట సౌహార్దంగా మాట్లాడుకుంటామని చెప్పారు. అయితే సభలో అధికారికంగా మాట్లాడేటప్పుడు నియమాలు, సంప్రదాయాలు, మర్యాదలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ మనసు ఆయన కార్యకర్తలైన సలహాదారుల చేతుల్లో ఉంది. వారు చెప్పిందే ఆయన సభలో చెబుతున్నారు అని రిజిజు విమర్శించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు వ్యక్తం చేసినా కొన్ని పరిమితులు పాటించిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ దుస్తులపై ప్రశ్నించగా, ఆ పదవికి తగిన విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉందని, దుస్తులు కూడా అందులో భాగమేనని రిజిజు వ్యాఖ్యానించారు. టీ-షర్ట్ వేసుకోవడంపై అభ్యంతరం లేదు కానీ అది సభలో కాదు అని అన్నారు.లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీని ఉదాహరణగా పేర్కొంటూ, స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన దుస్తుల శైలిని మార్చుకుని మరింత గౌరవప్రదంగా కనిపించేవారని తెలిపారు. ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండటం వల్ల, ఆ పదవికి తగిన ప్రతిష్ఠను ప్రతిబింబించేలా వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీ రాజకీయ విధానం విరుద్ధతలతో నిండి ఉందని, ప్రభుత్వ విజయాలను ప్రతిసారీ ప్రశ్నించడం, ప్రతి చర్యను వ్యతిరేకించడం ఆయన ధోరణిగా కనిపిస్తోందని రిజిజు విమర్శించారు.

మన తెలంగాణ 26 Mar 2026 10:20 pm

హర్మూజ్ నౌకలకు ఇరాన్ టోల్ ఫీజు

హర్మూజ్ జలసంధి మీదుగా చమురు నౌకల ప్రయాణానికి ఇరాన్ భారీ స్థాయిలో టోల్ రుసుం వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని గల్ఫ్ సహకార మండలి సెక్రెటరీ జనరల్ జెసెమ్ మెహమ్మద్ అల్ బుదాయ్వి తొలిసారిగా తెలిపారు. ఇరాన్ చర్యను తప్పుపట్టారు. ఈ మార్గం గుండా ఒక్కసారి వెళ్లితే మొత్తం చమురులో 20 శాతం వరకూ ఫీజుగా ఇరాన్ దండుకొంటోందని ఆయన విమర్శించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గల్ఫ్ దేశాల ఈ కూటమిలో సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, యుఎఇ, కువైట్, బహరైన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సంక్షోభ సమయంలో ఇతరదేశాలను ఈ విధంగా దోచుకుంటున్నారని ఇరాన్‌పై నిప్పులు చెరిగారు.

మన తెలంగాణ 26 Mar 2026 10:10 pm

ఇరాన్‌కు రష్యా భారీ సాయం ?

ప్రస్తుత గల్ఫ్ యుద్ధం దశలో రష్యా ఇరాన్‌కు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తోందా? అధునాతన డ్రోన్లు, ఆహార పదార్థాలు అవసరం అయిన డేటా సమకూరుస్తోందా? అవునని , ఇప్పటికే తొలివిడత సాయం ఇరాన్‌కు రష్యా నుంచి అందిందని పాశ్చాత్య ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనను రష్యా అధికారిక కేంద్రం క్రెమ్లిన్ తోసిపుచ్చింది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా పోరు దశలో తమ దేశం ఎటువైపు నిలబడటం లేదని రష్యా స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియాలో వెలువడుతున్న కథనాలను తోసిపుచ్చింది. ఈ నెలలో డ్రోన్లు సరఫరా చేయడం ఆరంభం అయింది.ఈ ప్రక్రియ వేర్వేరు దశలలో నెలాఖరులోగా పూర్తి అవుతుందని వెల్లడించారు.ఇజ్రాయెల్ ఇటీవలే రష్యా ఇరాన్ మధ్య సైనిక ఆయుధ రవాణా మార్గాన్ని గుర్తించింది. ఈ క్రమంలోనే కాస్పియన్ సముద్రంలోని ఈ మార్గాన్ని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి రహస్యంగా ఇరాన్‌కు బారీ స్థాయిలోనే ఆయుధ సాయం అందుతున్నట్లు పసికట్టారు. చిరకాలంగా రష్యాకు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను, ఖమేనీని అంతమొందించడాన్ని రష్యా బహిరంగంగా ఖండించింది. లక్షాలను ఛేదించేందుకు అవసరం అయిన డేటా, శాటిలైట్ల ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు ఇరాన్‌కు రష్యా మిత్రపక్షంగా చేరవేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ జంటదాడులతో తల్లడిల్లుతున్న దశలో వెంటనే స్పందించడమే మిత్రధర్మమని రష్యా భావించింది. ఈ దిశలోనే సాయానికి దిగిందని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిదేమీలేదని క్రెమ్లిన్ తెలిపింది.

మన తెలంగాణ 26 Mar 2026 9:59 pm

రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రదర్శన

రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రదర్శన హైవే ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:58 pm

అమ్మమ్మ కోసం మనవరాలు సజీవదహనం

ఇల్లు గడిచేదెలా..పిలల్లలను పోషించేదెలా? బస్సు ప్రమాదంలో ఇది ఇంటిపెద్దను కోల్పోయిన వారి ఆక్రందన ఇది! అయ్యో కష్టపడి కొనుక్కున్న వస్తువులు బూడిదయ్యాయే? ప్రాణాలతో బయటపడిన క్షతగాత్రుల ఆవేదన ఇది! మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతుంటే కళ్లు మూసినా, తెరిచినా అగ్నికీలలే గుర్తొస్తున్నాయంటూ క్షతగాత్రులు కలవరపడుతున్నారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద బస్సు ప్రమాద మృతుల కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. ఈ బస్సు ప్రమాదంలో అమ్మమ్మను రక్షించే క్రమంలో మనవరాలు మృతిచెందిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనలో కనిగిరి మండలానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన 80 ఏళ్ల తమ్మిశెట్టి పిచ్చమ్మ, ఆమె మనవరాలు తమ్మిశెట్టి రుక్మిణి మృతి చెందారు. ముందు ప్రాణాలతో బయటపడిన రుక్మిణి అమ్మమ్మను కాపాడేందుకు మళ్లీ బస్సులోకి వెళ్లారు. ఈ క్రమంలో క్షణాల్లో మంటలు వ్యాపించడంతో రుక్మిణీ కూడా ప్రాణాలు కోల్పోయారు. రుక్మిణి భర్త తిరుపాలుకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో చల్లగిరగల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కనిగిరికి చెందిన పద్మ బేల్దారి పనుల నిమిత్తం తెలంగాణ వెళ్లి శ్రీరామనవమికి సొంతూరు వస్తూ బస్సు ప్రమాదానికి బలయ్యారు.

మన తెలంగాణ 26 Mar 2026 9:50 pm

నిర్మల్ లో వైద్యుల రాస్తారోకో

నిర్మల్ లో వైద్యుల రాస్తారోకో వైద్యుని పై దాడి చేసిన వారిని వెంటనే

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:48 pm

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు..

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు.. ఆస్పత్రి ముందు ధర్నా చేస్తున్న బాధితులుభువనగిరిలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:45 pm

markapuram bus accident : రూ.5లక్షల పరిహారం

markapuram bus accident : రూ.5లక్షల పరిహారం మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:41 pm

రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్‌, భట్టి

శ్రీరామనవమి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. భద్రాద్రి రామాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.351 కోట్లు కేటాయించామన్నారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు జరుపుకోవాలన్నారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజలకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి పాలన ఆదర్శంగా రాష్ట్రంలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని, ప్రతి రైతు తలెత్తుకుని జీవించేలా చేయాలని ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృత నిశ్చయంతో పాలన చేస్తోందని చెప్పారు. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 సబ్సిడీకి గ్యాస్ సిలెండర్, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యను అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెల్ రెసిడెన్షియల్ స్కూల్స్, యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్శిటి ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. రూ.586 కోట్లతో ప్రజా ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతుందని, గోదావరి పుష్కరాలకు ఘాట్‌ల అభివృద్ధి, రహదారులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు డిప్యూటి సిఎం వివరించారు.

మన తెలంగాణ 26 Mar 2026 9:40 pm

కౌన్సిలర్లు అంటే లెక్క లేదా…?

కౌన్సిలర్లు అంటే లెక్క లేదా…? వైరా మున్సిపాలిటీ కమిషనర్ తీరుపై మండిపడ్డ కౌన్సిలర్లువాడి

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:37 pm

Dhammaiguda |పొదల్లో మహిళ మృతదేహం..

Dhammaiguda | పొదల్లో మహిళ మృతదేహం.. Dhammaiguda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:34 pm

రేపు మద్యం షాపులు బంద్

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం షాపులు ముసివేయాలని కమిషనర్లు విసి సజ్జనార్, రమేష్, అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, మిలట్రీ క్యాంటీన్లు, క్లబ్బులను మూసివేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మన తెలంగాణ 26 Mar 2026 9:33 pm

Alireza Tangsiri |ఇజ్రాయెల్ ప్రకటనతో ఉత్కంఠ..

Alireza Tangsiri | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ఇరాన్

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:29 pm

bus accident |ప్రాణాలతో బయటపడిన భార్య

bus accident | ప్రాణాలతో బయటపడిన భార్య bus accident | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:25 pm

Ap Heatwave Alert : తస్మాత్​ జాగ్రత్త Andhra Prabha Latest News

Ap Heatwave Alert : తస్మాత్​ జాగ్రత్త Andhra Prabha Latest News

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:25 pm

Gas cylinder |బస్సులో గ్యాస్ సిలిండర్ లభ్యం.. అనుమానాలు

Gas cylinder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:24 pm

అన్ని శాఖల సమన్వంతో వెస్ట్ ను బెస్ట్ గా తీర్చిదిద్దాలి…

అన్ని శాఖల సమన్వంతో వెస్ట్ ను బెస్ట్ గా తీర్చిదిద్దాలి… పశ్చిమ నియోజకవర్గం

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:21 pm

మానవ అక్రమ రవాణా కేసులో మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డికి ఊరట

 కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎంఎల్‌ఎకు ఊరట లభించింది. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత కుసుమ కుమార్‌లపై ఉన్న కేసుకు సంబంధించి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది ఇరువురిపై ఉన్న కేసును కొట్టివేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఎ1 గా ఉన్న తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఎ3గా ఉన్న కుసుమ కుమార్‌ల కేసులో నేరాలు రుజువు కాలేదని పేర్కొన్న కోర్టు వారిని నిర్దోషుషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తరఫున న్యాయవాది జి. సంతోష్ రెడ్డి కేసును వాదించారు. జగ్గారెడ్డి ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో 2004 లో మానవ అక్రమ రవాణాకు పాల్ప డినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడి పేరున పాస్ పోర్టు లు పొందారని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట ఒక మహిళ, యువకుడిని తీసుకెళ్లి ఇండియాకు తిరిగి ఒక్క రే వచ్చినట్లు ఆరోపణలు న్నాయి. ఫేక్ డాక్యుమెంట్లతో ముగ్గురు వ్యక్తులను దేశం దాటించారని. ఈ ప్రక్రియలో ఆర్థికంగా ప్రయోజనం పొందినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో 2018 లో అరెస్టై, ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా కేసును విచారించిన కోర్టు నేరాలు రుజువు కాలేదని కేసును కొట్టి వేస్తూ తీర్పును వెలువరించింది.

మన తెలంగాణ 26 Mar 2026 9:20 pm

హెచ్చరిక బోర్డుల వద్ద సిఐ,ఎస్ఐ

హెచ్చరిక బోర్డుల వద్ద సిఐ,ఎస్ఐ పోలీసుల ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెన్నారావుపేట,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:13 pm

హార్మూజ్ జలసంధిపై పట్టు బిగించిన ఇరాన్

మధ్య ప్రాచ్య యుద్ధంలో యుద్ధ విరమణ కోసం జరుగుతున్న దౌత్య పరమైన ప్రయత్నాలు కుదేలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా తమ తమ వైఖరిని మరింత కఠినతరం చేసుకున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను అధికారికంగా బలోపేతం చేయడానికి అడుగులు వేస్తుండగా, అమెరికా భూభాగ స్థాయిలో చర్యలకు సిద్ధమవుతూ సైనిక దళాలను ప్రాంతానికి తరలిస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల హెచ్చరికగా సైరన్లు మోగగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అబుదాబి వద్ద క్షిపణి అడ్డుకోవడంలో ఏర్పడిన శకలాల వల్ల ఇద్దరు మృతి, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ప్రపంచ చమురు, సహజ వాయువులో సుమారు 20 శాతం రవాణా జరిగే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన ఆధిపత్యాన్ని మరింత కట్టుదిట్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుబంధంగా భావించే నౌకలను అడ్డుకుంటూ, కొన్నింటిని మాత్రమే అనుమతిస్తోంది. పార్లమెంట్ స్థాయిలో నౌకల నుంచి రుసుములు వసూలు చేసే విధానాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భద్రత మేమే కల్పిస్తున్నాం కాబట్టి రుసుములు వసూలు చేయడం సహజమే అని ఇరాన్ నాయకులు పేర్కొన్నారు. కొన్ని నౌకలు చైనా కరెన్సీ యువాన్‌లో చెల్లింపులు చేసి ప్రయాణం కొనసాగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నౌకల వివరాలు, సరుకు సమాచారం, గమ్యస్థానంపై కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. వాస్తవానికి హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఒక టోల్ బూత్‌లా నడుపుతోందని భావిస్తున్నారు. 

మన తెలంగాణ 26 Mar 2026 9:10 pm

Kona Venkat Trolled for his Words

Top writer Kona Venkat is a part of several blockbuster films in Telugu cinema. He even co-produced several films. He co-produced Band Melam after a long gap. During the pre-release event, Kona Venkat was super confident and he asked the audience not to watch his upcoming films written by him if Band Melam fails to […] The post Kona Venkat Trolled for his Words appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 8:59 pm

బిక్కేరు వాగులో ఇసుక రవాణాకి అనుమతి ఇవ్వొద్దు..

బిక్కేరు వాగులో ఇసుక రవాణాకి అనుమతి ఇవ్వొద్దు.. అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:56 pm

బాలయ్యకు మరో అరుదైన గౌరవం

అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో భాగంగా తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని భరత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవంలో తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. 50 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవకు గుర్తింపుగా, నటన కళ పట్ల ఆయనకున్న చెరగని ప్రభావం, బహుముఖ ప్రజ్ఞ, అసమానమైన అంకితభావానికి నివాళిగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక అనిల్ రావిపూడితో బాలకృష్ణ చేసిన ‘భగవంత్ కేసరి’ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా అవార్డుని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చలనచిత్రోత్సవ కార్యక్రమంలో ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో నందమూరి బాలకృష్ణ, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవంలో పాల్గొనడం, పురస్కారాన్ని స్వీకరించడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మా ‘భగవంత్ కేసరి’ సినిమాని ప్రదర్శించడం గర్వంగా ఉంది”అని అన్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 8:54 pm

వందేభారత్ ప్రయాణికుని భోజనం పెరుగులో పురుగులు..

పాట్నాటాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ప్రయాణికునికి అందజేసిన భోజనం లోని పెరుగు ప్యాకెట్‌లో పురుగులు ఉండడం తీవ్ర దుమారం రేపింది. దీంతో రైల్వేశాఖ సంబంధిత కంపెనీకి రూ. 50 లక్షల జరిమానాతోపాటు కాంట్రాక్టు నుంచి రద్దు చేసింది. ఈ సంఘటనకు తీవ్రంగా స్పందించిన రైల్వే మంత్రిత్వశాఖ తన స్వంత కంపెనీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి)ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని ఆక్షేపిస్తూ రూ.10 లక్షల జరిమానా విధించింది. మార్చి 15న ఏడుగురు ప్రయాణికుల బృందం వందేభారత్‌లో ప్రయాణిస్తుండగా,వారికి భోజనంతోపాటు అందించిన పెరుగు ప్యాకెట్‌లో పురుగులు కనిపించాయి. ప్రయాణికుడు రితేష్ సింగ్ తక్షణం ఈ అంశాన్ని తన ఎక్స్ ద్వారా ఐఆర్‌సిటిసికి, రైల్వే మంత్రికి , ఇతరులకు పంపించారు. సంఘటనకు స్పందించి రైల్వే ఐఆర్‌సిటిసి చర్యలు తీసుకుని సమర్పించిన నివేదికలో ఆ పెరుగు ప్యాకెట్ పాట్నా నుంచి సేకరించినట్టు, ఈఏడాది మార్చి 9న దానిని తయారు చేయగా, ఎక్స్‌పైరీ తేదీ ఏప్రిల్ 7న ఉన్నట్టు వివరించింది. ప్రయాణికులకు అధికారులు క్షమాపణ చెప్పి డ్రైఫ్రూట్ మిక్సర్ , కొన్ని స్వీట్లు అందజేశారు. నివేదిక ప్రకారం వెండర్ క్రిష్ణా ఎంటర్‌ప్రైజెస్‌కు మొదట రూ. 25000 జరిమానా విధించి నిర్లక్షానికి హెచ్చరించారు. కానీ ఈ చర్యకు రైల్వే మంత్రిత్వశాఖ సంతృప్తి చెందలేదు. సంబంధిత క్రిష్ణా ఎంటర్‌ప్రైజెస్ కాంట్రాక్టును బుధవారం రద్దు చేసింది. జరిమానాను రూ. 25,000 నుంచి రూ. 50 వేలకు పెంచింది. తన స్వంత సంస్థ ఐఆర్‌సిటిసికి రూ.10 లక్షల జరిమానా విధించింది. ప్రయాణికుల భద్రత,రైల్వే సౌకర్యాల్లో నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యమని రైల్వేశాఖ వివరించింది. 

మన తెలంగాణ 26 Mar 2026 8:50 pm

పరిశ్రమలకు భూములు ఇవ్వలేం

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామంలో పేద రైతుల భూములను ప్రభుత్వం ఇండస్ట్రీయల్ కారిడార్ పేరుతో బలవంతంగా లాక్కుంటుందని రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. కాళ్లాపూర్ రైతులు గురువారం పరిగి పట్టణంలోని కోడంగల్ చైరస్తా నుంచి బహార్‌పేట్, బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజాపూర్ జాతీయ రహాదారిపై రైతులు బైటాయించి పెద్ద ఎత్తున ధర్నా, నిరసనలు చేశారు. వీరికి బిజేపి, బిఆర్‌ఎస్, సిసిఎం పార్టీ నాయకులు మద్దతూ ఇచ్చారు. దీంతో ధర్నా, రస్తారోకోకు మరింత బలం చేకూరింది. సిఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులు, మహిళ రైతులు, వృద్దులు, పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను బలవంతగా ధర్నా విరమింపజేసే ప్రయత్నం చేయగా పోలీస్‌లు, రైతుల మద్య వాగ్వాదాలు మిన్నంటాయి. ఒక్క సారిగా ఉధిృక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీస్‌ల మద్య తోపులాటలు, ఘర్షణలు బలవంతంగా లాక్కెల్లటం వంటి దృశ్యాలు ధర్నా, రస్తారోకోలో కనిపించాయి. మా భూములు మాక్కావాలని రైతులు మొండి పట్టు పడ్డారు. ఉన్న భూములు కోల్పోతే మా కుటుంబాలు రోడ్డున పడుతాయని అందుకు ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలని పలువురు రైతులు కోరారు. పరిగి ఎస్‌ఐ మోహన్‌కృష్ణ కాళ్లు ఓ రైతు పట్టుకుని మొక్కారు. మాకు న్యాయం చేయాలని పోలీస్‌ల కాళ్లు పట్టుకున్నారు. ఈ ధర్నాతో వాహానాలు రోడ్డుపై ఇరు వైపుల భారీగా నిలిచిపోయాయి. ఈ ధర్నాకు బిజేపి, బిఆర్‌ఎస్, సిపిఎం నాయకుల సంపూర్ణ మద్దతూ తెలిపింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, బిజేపి జిల్లా కార్యదర్శి పెంటయ్యగుప్త, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బేత్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్‌లు రవికుమార్, మీదిగడ్డ శ్రీనివాస్‌లు పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాలకు చెందిన 1197 ఎకరాల భూమి అభివృద్ది పేరుతో భూ సేకరణ చేయడం వెంటనే నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారు. కాళ్లాపూర్ గ్రామంలో పేద రైతుల పంట భూములను ఇండస్ట్రీయల్ కారిడార్ పేరుతో బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తీవ్ర అన్యాయమన్నారు. ఈ భూములే రైతులకు జీవనాధారం వాటిని కోల్పోతే కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉందని అవేదన వ్యక్తం చేశారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేయకుండా ముందుకు సాగడం చట్ట విరుద్దమని అన్నారు. రైతుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నోటిఫీకేషన్ జారీ చేయడం ప్రజా స్వామ్యానికి విరుద్దమన్నారు. తక్షణమే భూ సేకరణ ప్రక్రియను నిలిపి వేసి, ఇప్పటి వరకు జారీ చేసిన నోటిఫీకేషన్‌ను రద్దు చేయాలని, రైతుల హక్కులను రక్షించే వరకు మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అనంతరం తహాశీల్‌దార్ కార్యాలయం వద్దకు రైతులు భారీ ర్యాలీగా వెళ్లి పరిగి తహాశీల్‌దార్ వెంకటేశ్వరికి వినతి పత్రం సమర్పించారు.

మన తెలంగాణ 26 Mar 2026 8:42 pm

వంటింట్లో మరో మంట..

 ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ కొరతతో అల్లాడుతున్న ప్రజలపై మరోభారం పడింది. గ్యాస్ కొరత కారణంగా సకాలంలో సిలిండర్‌లు అందక తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్‌మార్కెట్‌లో మూడు రెట్లు అధికధరలు పెట్టి కొనుగోలు చేస్తున్న సామాన్యులపై వంటనూనెల పెంపు మరింత అగాధంలోకి నెడుతోంది. లీటర్ మంచినూనెపై ఏకంగా రూ.30 రూపాయలు పెంచడం విశేషం. గత నెలక్రితం రూ.152 ఉన్న లీటర్ మంచినూనె ధర ప్రస్తుతం రూ.182కి చేరింది.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్యాస్,పెట్రోల్,డిజిల్ కొరత రవాణా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఒక్కొక్కటిగా నిత్యావసర ధరలపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. వంటనూనెలతో పాటు త్వరలో మరిన్ని నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటుండటం విశేషం. కిలో కట్టెలు ఏకంగా రూ.30 : నిన్నటివరకు కిలో కట్టెల ధర రూ. 9 ఉండగా, ఏకంగా రూ.30కి చేరింది. డోమెస్టిక్,కమర్షియల్ సిలిండర్‌ల కొరత కారణంగా బ్లాక్‌మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.3వేలు, కమిర్షియల్ సిలిండర్ ధర రూ.7వేలు పలుకుతున్న విషయం తెలిసిందే. పెరిగిన ధరలతో ఇప్పటికే నగరంలో రెండువేలకు పైగా హోటళ్లు మూసివేయగా, కొన్ని హోటళ్లు గ్యాస్ ధరలు అదనంగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కట్టెలకు భారీగా డిమాండ్ పెరగడంతో కట్టెలవ్యాపారులు భారీగా ధరలు పెంచారు. కిలో కట్టెల ధరలను ఏకంగా రూ.21 పెంచడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 8:36 pm

తెలంగాణ స్పీకర్‌ ట్రైబ్యునల్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత విషయంలో బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హై కోర్టు విచారణ చేపట్టింది. స్పీకర్ ట్రైబ్యునల్‌కు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌కూ నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఇద్దరిపై స్పీకర్ ట్రైబ్యునల్ చర్యలు తీసుకోలేదని బిఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బిఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వాదించారు. స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రద్దు చేయాలని వాదించారు. కడియం, సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.

మన తెలంగాణ 26 Mar 2026 8:30 pm

సర్పంచులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం…

సర్పంచులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం… పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:24 pm

ధర్నా చేస్తున్న విద్యుత్ కార్మికులు

ధర్నా చేస్తున్న విద్యుత్ కార్మికులు విద్యుత్ కార్మికులను కన్వర్షన్ చేయాలి తొర్రూరు,ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:09 pm

మెడికల్ అసోసియేషన్ సేవలు విస్తృతం చేయాలి

మెడికల్ అసోసియేషన్ సేవలు విస్తృతం చేయాలి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యవిద్యార్థుల కు మెడికల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:08 pm

బెల్లంపల్లి పురపాలక బడ్జెట్ రూ.32.42 కోట్లు..

బెల్లంపల్లి పురపాలక బడ్జెట్ రూ.32.42 కోట్లు.. మున్సిపాలిటీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి:

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:06 pm

విద్యుత్‌ఛార్జీలను తగ్గింపుతో పాటుగా నాణ్యమైన విద్యుత్‌….

విద్యుత్‌ఛార్జీలను తగ్గింపుతో పాటుగా నాణ్యమైన విద్యుత్‌…. పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని విద్యుత్‌

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:03 pm

Chandrababu : అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 7:59 pm

ఏసీబీ వలలో మామడ ఎస్సై

ఏసీబీ వలలో మామడ ఎస్సై రూ. 20,వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడిన మామడ

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:58 pm

in2states |బదిలీల కోసం ఎదురు చూపులు

in2states | బదిలీల కోసం ఎదురు చూపులు in2states | డ్యూటీ- ఒక

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:57 pm

దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గొంది మురళి మోహన్

దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గొంది మురళి మోహన్ దమ్మపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:54 pm

శ్రీరామ నవమి స్పెషల్.. ‘ఇరుముడి’ ప్రత్యేక పోస్టర్

ఈ ఏడాది ఆరంభంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు మాస్ మహారాజ రవితేజ. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప దీక్షలో కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భక్తితో పాటు తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కూడా చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో రవితేజ తన కూతురితో కలిసి.. నడుచుకుంటూ వెళ్లడం మనం చూడొచ్చు. దీన్ని పట్టి ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్ చాలానే ఉంటాయని అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. జివి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. Tale of a Doting father & Lovely daughter knotted with love - #IRUMUDI శ్రీరామనవమి శుభాకాంక్షలు ✨ Starring MASS MAHARAJA @RaviTeja_offl A @gvprakash musical @priya_Bshankar @ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh … pic.twitter.com/CNZuTYRLKB — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2026

మన తెలంగాణ 26 Mar 2026 7:32 pm

కళ్యాణానికి ముస్తాబైన ఆలయం..

కళ్యాణానికి ముస్తాబైన ఆలయం.. జన్నారం, ఆంధ్రప్రభ : శ్రీరామనవమిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:25 pm

వరకట్నం చావులు అమానుషం: సుప్రీంకోర్టు

వరకట్నం చావుల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలు అత్యంత దారుణాలు. సభ్య సమాజానికి చెరగని మచ్చలు అని న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం గురువారం పేర్కొంది. ఓ వైపు వరకట్నం పద్థతిపై చట్టపరమైన నిషేధం అమలులో ఉంది. అయితే తెరవెనుక ఈ దురాచారం సాగుతూనే ఉంది. దీనితో వరకట్నం వేధింపులతో వేలాది మంది మహిళలు అకాలమరణం చెందుతున్నారు. ఇది అమానుషం అని తెలిపారు. ఓ వరకట్నం చావు కేసులో వ్యక్తి బెయిల్‌ను రద్దు చేస్తూ బెంచ్ ఈ సామాజిక సమస్య గురించి ప్రస్తావించింది. నిందితుడికి పాట్నా హైకోర్టు బెయిల్ ఎందుకు మంజూరీ చేసిందో అర్థం కావడం లేదు. ఈ బెయిల్ పూర్తి స్థాయిలో కొట్టివేయదగినది. నిలువజాలనిది అని స్పష్టం చేశారు. వరకట్నం చావు వంటి ఉదంతాలలో నిందితులను క్రూర నేరాలకు పాల్పడిన వారిగా పరిగణించాల్సి ఉంటుంది. అటువంటి వారికి బెయిల్ మంజూరీల దశలో హైకోర్టు ఇతర కోర్టులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. విచక్షణారహిత స్పందన అనుచితం అవుతుందని పేర్కొన్నారు. వరకట్నం చావుల విషయంలో తీవ్రస్థాయి మానవ హక్కుల ఉల్లంఘనలు, జీవన మర్యాదల విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వరకట్నం వేధింపులతో హత్యలు, ఆత్మహత్యలకు పురికొల్పడం వేలాది మంది అబలల విషాదాంతానికి దారితీస్తోంది. సమాజం నగుబాటుకు దారితీస్తుందని ధర్మాసనం తెలిపింది. ఇప్పుడు తమ ముందుకు వచ్చిన కేసులో హైకోర్టు తీరు దారుణంగా ఉంది. అన్ని విషయాలను పూర్తిగా సమీక్షించుకోకుండానే బెయిల్ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇది ఏం సంకేతాలకు దారితీస్తుంది? అని నిలదీశారు. 2024లో వరకట్న బాధితురాలు అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండగా గుర్తించారు. శరీరం అంతటా బలీయమైన గాయాలు ఉన్నాయి. తలకు గాయం అయ్యి, రక్తస్రావం కావడంతో చనిపోయినట్లు నిర్థారించారు. దారుణ ఘటనపై న్యాయస్థానం స్పందన సరిగ్గాలేదని మందలించారు. 

మన తెలంగాణ 26 Mar 2026 7:25 pm

బెల్లంపల్లిలో ఘనంగా 2కే రన్..

బెల్లంపల్లిలో ఘనంగా 2కే రన్.. అవయవ దానానికి చైర్ పర్సన్ దంపతుల అంగీకారంనేత్ర,

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:23 pm

విస్తృత అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల నుంచి ర‌క్ష‌ణ‌…

విస్తృత అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల నుంచి ర‌క్ష‌ణ‌… జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న ఫామెక్స్‌)-2026ఈ నెల

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:19 pm

సాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన

సాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన పంటల రక్షణకు వెంటనే నీరు విడుదల

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:15 pm

OG 2: Pressure Mounting on Sujeeth

Pawan Kalyan’s recent offering Ustaad Bhagat Singh has turned out to be a big embarrassment for the actor. Soon after the debacle, Pawan Kalyan announced that he is not taking any new film except OG 2. Sujeeth is the only director who lived up to the expectations in presenting Pawan Kalyan that thrilled his fans. […] The post OG 2: Pressure Mounting on Sujeeth appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 7:13 pm

రామ్ లీలా మైదానంలో కళ్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు

రామ్ లీలా మైదానంలో కళ్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీరామనవమి

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:13 pm

యుద్ధంలో ఇరాన్ కీలక నేతల వరుస హత్యలు

ఇరాన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ ఎలైట్ నౌకాదళ విభాగానికి అధిపతిగా ఉన్న అలీరెజా టాంగ్సిరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన నిజమైతే, ఇరాన్ సైనిక నాయకత్వానికి, ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన పర్షియన్ గల్ఫ్‌లోని నౌకా కార్యకలాపాలకు గట్టి దెబ్బే. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో టాంగ్సిరి మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపాడు. ప్రస్తుతం నాలుగో వారంలోకి ప్రవేశించిన యుద్ధంలో ఇది మరో కీలక మరణంగా భావిస్తున్నారు.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నౌకాదళ విభాగానికి నాయకత్వం వహించిన టాంగ్సిరి, బందర్ అబ్బాస్ పోర్టు నగరంలో జరిగిన దాడిలో హతమైనట్లు సమాచారం. హార్మూజ్ జలసంధి మూసివేతకు సంబంధించిన చర్యలను పర్యవేక్షించే బాధ్యత టాంగ్సిరిదేనని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కీలక సముద్ర మార్గంపై ఇరాన్ నియంత్రణ వల్ల మధ్యప్రాచ్యం నుంచి చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) కూడా ఈ దాడిపై స్పందించలేదు. అలీరెజా టాంగ్సిరి ఇరాన్ దక్షిణంలోని బుషెహర్ ప్రావిన్స్‌లో జన్మించిన అలీరెజా టాంగ్సిరి, ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో సేవలందిస్తూ ఐఆర్‌జీసీ నౌకాదళంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1980లలో జరిగిన ట్యాంకర్ వార్స్‌లో కూడా పాల్గొన్నారు. తర్వాత బందర్ అబ్బాస్‌లోని ఐఆర్‌జీసీ మొదటి నౌకాదళ జిల్లాకు కమాండర్‌గా పనిచేసిన ఆయన, 2010 నుంచి 2018 వరకు ఉప కమాండర్‌గా సేవలందించారు. అనంతరం నౌకాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. యుద్ధంలో కీలక నేతల వరుస హత్యలు ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు హత్యకు గురవుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత ప్రభావం చూపిన ఘటనగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం నిలిచింది. అనంతరం ఇస్లామిక్ రిపబ్లిక్ రాజకీయ, సైనిక ఉన్నత స్థాయి నాయకత్వంపై లక్ష్యిత దాడులు కొనసాగుతున్నాయి. మార్చి 17న ఇరాన్ భద్రతా వ్యవస్థ అధిపతి అలీ లరిజానీ, టెహ్రాన్ పరిసరాల్లో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇక కొద్ది రోజులకే రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ, అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో హతమయ్యారు. యుద్ధ పరిస్థితుల్లోనూ ఇరాన్ క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం తగ్గలేదని జాతీయ టెలివిజన్‌లో వెల్లడించిన కొన్ని గంటలకే ఆయన మృతి చెందడం గమనార్హం.

మన తెలంగాణ 26 Mar 2026 7:10 pm

ట్రాఫిక్ నియమాలే ప్రాణ రక్షణకు కవచం

ట్రాఫిక్ నియమాలే ప్రాణ రక్షణకు కవచం హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం తప్పనిసరిఅధిక వేగం,

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:03 pm

అసెంబ్లీలో మా గళాన్ని వినిపించేందుకు మైక్ ఇవ్వడం లేదు: హరీష్ రావు

రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, మైక్ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకులు కట్‌చేసి తాము చెప్పాలనుకున్న వాస్తవాలను సభ దృష్టికి తీసుకురాకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని అన్నారు. ఆరోగ్యశ్రీ ఖర్చుల పెంపుపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, 2014 జూన్ 2 నాటికి ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.32 కోట్లు ఖర్చయ్యేవి అని, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. కానీ.. ప్రభుత్వం రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతోందని అన్నారు. జనాభా పెరుగుదల, వైద్య ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ పెంపు సహజం అని, ఇందులో కాంగ్రెస్ కొత్తగా సాధించిన ఘనతేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు బాగా పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, పనులు చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఆస్పత్రులన్నీ పూర్తయి ప్రజలకు మెరుగైన సేవలు అందేవి అని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్ అదాయంలో వాటాను పెంచి నిధులను సమకూర్చిందని తెలిపారు. ఈ అంశాలు అన్నీ చెప్పాలని అనుకుంటే సభలో తమకు మైక్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 26 Mar 2026 7:01 pm

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరిట మోసాలు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరిట మోసాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేశ్ వెంకట రామన్, అభిషేక్, విలియమ్స్, మన్మీత్ శర్మ ముఠాగా ఏర్పడి రూ.26 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. క్లోజ్‌ ఎక్స్ పే, ట్రస్ట్లీ పే, అకల్ట్ పే పేర్లతో నకిలీ పేమెంట్ గేట్‌వేలను నిందితులు తయారు చేసినట్లు విచారణలో తేలింది. యుపిఐ, ఐఎంపిఎస్ కార్డ్ ట్రాన్సాక్షన్‌ల ద్వారా డబ్బులు మళ్లించినట్లు వెల్లడైంది. ప్రతి లావాదేవిపై 2 శాతం నుంచి 5 శాతం వరకు కమిషన్ వసూలు చేసినట్లు గుర్తించారు. ఫేక్ కంపెనీల పేర్లతో మ్యూల్ ఖాతాలు సృష్టించి, నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సూర్యోదయ బ్యాంక్ ద్వారా పేమెంట్ గేట్‌వే సేవలు వినియోగించినట్లు ఆధారాలు సేకరించారు. నిందుతుల నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్స్, 9 చెక్‌బుక్‌లు, రూ.6.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 7:00 pm

పనుల్లో వేగం పెంచి రైతులకు సాగునీరు అందించాలి..

పనుల్లో వేగం పెంచి రైతులకు సాగునీరు అందించాలి.. ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:58 pm

సంక్షోభంలో చిత్తూరు గ్రానైట్ పరిశ్రమ

సంక్షోభంలో చిత్తూరు గ్రానైట్ పరిశ్రమ ఆగిన గ్రానైట్ ఎగుమతులు తగ్గిన అమ్మకాలుపెరిగిన ఖర్చులతో

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:57 pm

మొట్టమొదటి సైంటిఫిక్ సాహిత్యాన్ని అభివృద్ధి…

మొట్టమొదటి సైంటిఫిక్ సాహిత్యాన్ని అభివృద్ధి… హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : సైన్సులో బలంగా వేళ్లూనుకున్న

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:52 pm

ఐపిఎల్-2026.. రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల చేసిన బిసిసిఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌.. రెండో ఫేజ్ షెడ్యూల్‌ని బిసిసిఐ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 50 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు దేశంలోని 12 వేదికల్లో ఈ మ్యాచ్‌‌లు జరుగుతాయి. కొద్ది రోజుల కిందటే తొలి ఫేజ్ షెడ్యూల్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపిఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. తొలి దశలో 20 మ్యాచ్‌లు, రెండో దశలో 50 మ్యాచ్‌లు జరుగతాయి. మొత్తం కలిపి 70 మ్యాచులు జరుగుతాయి. ప్లేఆఫ్స్ వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. రెండో దశలో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్ 13న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. రెండో దశలో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. 

మన తెలంగాణ 26 Mar 2026 6:40 pm

ఇంకా ఎన్ని రోజులు నిర్లక్ష్యం..?

ఇంకా ఎన్ని రోజులు నిర్లక్ష్యం..? ప్రమాదకరంగా ముక్తుంకుంట కట్ట కింద 500 మీటర్ల

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:28 pm

శ్రీరాముని జన్మనోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శ్రీరాముని జన్మనోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జుక్కల్,ఆంధ్రప్రభ : జుక్కల్ మండల

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:22 pm

24 Hrs Png Connection : ఇక ఏపీలో పీఎన్జీ శకం Andhra Prabha SPL Story

24 Hrs Png Connection : ఇక ఏపీలో పీఎన్జీ శకం Andhra

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:22 pm

నాణ్యమైన భోజనం అందించాలి…

నాణ్యమైన భోజనం అందించాలి… విద్యార్థినిల భద్రత ముఖ్యంఅదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:16 pm

కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు..

కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు.. తొడిమేలతో కారం పొడి తయారీఫుడ్ సేఫ్టీ,పోలీసుల

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:14 pm

శ్రీరామ నవమి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్: శుక్రవారం జరిగే శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్రం జరగనుంది. ఈ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మారేడుపల్లి ఎక్స్ రోడ్స్‌ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పూరానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జక్షన్ వైపు డైవర్ట్ చేయనున్నారు. ఎంజె బ్రిడ్జ్, బేగం బజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా మళ్లించనున్నారు. అబిడ్స్ జిపిఒ, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్ ప్రధఆన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజె మార్కెట్, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొనేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 6:09 pm

మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు..

మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:07 pm

కన్నతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం

కన్నతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా పాదన. ప్రగతి ప్రణాళిక

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:07 pm

అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:01 pm

Azharuddin : మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం

మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 6:01 pm

4simptoms |మొటిమలు చర్మ సమస్యేనా? శరీరం చెబుతున్న ‘అంతర్గత’ హెచ్చరికలు ఇవే!

4simptoms |మొటిమలు చర్మ సమస్యేనా? శరీరం చెబుతున్న ‘అంతర్గత’ హెచ్చరికలు ఇవే! ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:58 pm

మక్కకు దళారులే దిక్కా..?

మక్కకు దళారులే దిక్కా..? ముందుకు కదలని మార్కెటింగ్ మార్క్ ఫెడ్ అధికారులుసాగు విస్తీర్ణం

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:57 pm

ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-​రాప్తాడు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించాలన్నారు .అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత […] The post ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:43 pm

గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలి, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మరియు పీ4( ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) – జీరో పావర్టీ కార్యక్రమాలు అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆమె గురువారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ.రామమోహన్, రాప్తాడు ఎంపీడీవో బి.విజయలక్ష్మితో కలిసి ప్రత్యేక […] The post గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:39 pm

ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై

-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా […] The post ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:36 pm

నార్పల సహకార సొసైటీ పనుల పరిశీలన….

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ) :- మండల కేంద్రంలోని సహకార సొసైటీ ఆవరణంలో జరిగిన అభివృద్ధి పనులను గురువారం అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవి పరిశీలించారు. సొసైటీ చైర్మన్ ఉమామహేశ్వర్ నాయుడుతో కలిసి ఆయన పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు.ఇటీవల సొసైటీలో నిర్వహించిన పలు పనుల్లో సుమారు రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అయితే పాలకులు, అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.పరిశీలన అనంతరం […] The post నార్పల సహకార సొసైటీ పనుల పరిశీలన…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:33 pm

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని, […] The post క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:29 pm

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి….

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి…. కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్… కర్నూల్,

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:29 pm

YSRCP : అమరావతి అవినీతిపైనే మా పోరాటం

అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:29 pm

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల వడగండ్ల వాన నువ్వు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం రైతు సంగం ఆధ్వర్యంలో అరటి తోటను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్కాపురం గ్రామంలో నాగిరెడ్డి రైతు మూడు ఎకరాల అరటి తోటను సాగు చేయడం జరిగినదని ఈ […] The post రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:26 pm

ముగ్గురి పై జిల్లా బహిష్కరణ …

ముగ్గురి పై జిల్లా బహిష్కరణ … ఇప్పటివరకు 8 మంది జిల్లా బహిష్కరణ

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:23 pm

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

సబ్ రిజిస్టర్ తాయన్నవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ప్రజలు తమ పనుల నిమిత్తం వస్తారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చుతుందని తెలిపారు. ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు పట్ల నిర్వాహకుల్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు. The post సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:22 pm

Andhra Pradesh : ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలివే

రాష్ట్ర మంత్రివర్గం మూడు గంటలపాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:22 pm