మార్చి నెల@ 2.24 లక్షలు ట్యాంకర్ ట్రిప్పులు... నీటిని పొదుపుగా వాడుకోవాలి
ఈనెల 12 రోజుల్లోనే 95,454 ట్రిప్పులు నీటిని పొదుపుగా వాడుకోవాలి ప్రతి కుటుంబం 20 శాతం నీటిని ఆదాచేయాలి ఎండీ అశోక్రెడ్డి మనతెలంగాణ, సిటీబ్యూరో ః ఈ సంవత్సరం మార్చి నెలలో మొత్తం 2,24,421 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్రెడ్డి వెల్లడించారు. ఈ నెలలో 12వ తేదీ నాటికే 95,454 ట్రిప్పులు సరఫరా చేసినట్టు తెలిపారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ నీటి వినియోగంపై ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. నీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున, నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్మెంట్పై అశోక్ రెడ్డి జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్తో పాటు రీజినల్ ఈడీలు, డైరెక్టర్లలు, సీజీఎంలు, జీఎంలతో జూమ్ మీటింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ ఘననీయంగా పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు. పెరిగిన బుకింగ్స్.. గత ఏడాదికంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్లో నీటిసరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్ని డెలివరీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి పొదుపుపై ఎండీ విజ్ఞప్తి: ------------------------------------హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు .. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజులలో నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి పౌరుడు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. పౌరులకు ముఖ్య సూచనలు: ----------------------------------విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు, ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు. బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి. స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు. లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి. అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి. జలమండలి ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని ఎండీ తెలిపారు. అయినప్పటికీ, వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. నీరు అమూల్యమైన వనరు. ప్రతి చుక్కను విలువైనదిగా భావించి వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలం అని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి పౌరుడు నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను పాటిస్తూ జలమండలికి సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో లో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, డైరెక్టర్లు ఆపరేషన్స్-1,2,3 వినోద్ భార్గవ, నారాయణ, శీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా
మోడీ సర్కార్ కు సిపిఐ హెచ్చరిక… విశాలాంధ్ర.. ప్రత్యేక ప్రతినిధి/అనంతపురం బ్యూరో.. నూతన ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన “విబిజీ రాంజీ” చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.అనంతపురం […] The post ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా appeared first on Visalaandhra .
Exclusive: Peddi to take up Toxic Date
Ram Charan’s Peddi will not release as per the plan on April 30th. Though the team hasn’t made any official statement yet, the industry insiders, producers and filmmakers are well aware that the film’s release is pushed. For now, the team of Peddi is considering two dates in June. Yash’s Toxic is slated for June […] The post Exclusive: Peddi to take up Toxic Date appeared first on Telugu360 .
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి... సెకన్లలో కారు నంబర్ ప్లేటు మార్పు
స్వాప్ నంబర్ ప్లేట్స్ పట్టుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఫొటొః బిఎం పేరుతో ఉంది... మనతెలంగాణ, సిటిబ్యూరో: ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి కారు యజమాని చేసిన పని చూసి ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బిఎండబ్లూ కారుకు స్వాప్ నంబర్ ప్లేట్ అమర్చి తిరుగుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ వచ్చాడు. అతడికి బ్రీత్ పరీక్ష నిర్వహించగా మద్యం తాగి వాహనం నడిపినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు కారును స్వాధీనం చేసుకునేందుకు పరిశీలిస్తుండగా కారుకు ఉన్న నంబర్ ప్లేట్ మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారుకు చైనీస్ ఫ్లాగ్షిప్ నంబర్ ప్లేట్ అమర్చిన కారు యజమాని దానిని రిమోట్ సాయంతో మార్చుతుండడంతో డిఎల్ 6 సిఎం 7097, టిఎస్ 9 ఎఫ్క్యూ 9999 నంబర్ ప్లేట్లు మారుతున్నాయి. వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి ఖరీదైన బిఎండబ్లూ కారు నంబర్ ప్లేట్ మార్చడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటివి చూడలేదని, ఇదే మొదటిసారి పోలీసులు తెలిపారు. గతంలో ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ను డ్యామెజ్ చేయడం, మాస్కువేయడం చేసేవారు. ఇప్పుడు ఏకంగా రిమోట్ సాయంతో నంబర్ ప్లేట్ను మార్చుతున్నారు. దీనిని చూసి ఎంతమంది అనుసరిస్తారోనని, ప్రతి కారును ఇక నుంచి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.
ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష
ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష ఎన్టీఆర్ జిల్లా
రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరాకరించడంతో భూతులు తిట్టారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు ఫొటొః మంగ్లీ పేరుతో ఉంది... మనతెలంగాణ, సిటిబ్యూరో: డబ్బులు ఇవ్వలేదని అడ్వకేట్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని సింగర్, యాక్టర్ ముదావత్ సత్యవతి అలియాస్ మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదని, తనవి అని చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. గత నెల 22వ తేదీన అడ్వకేట్ సింగపోగు సుబ్బు ఆఫీస్కు వెళ్లానని, అక్కడ సుబ్బతోపాటు ముగ్గురు ఉన్నారని పేర్కొన్నారు. అడ్వకేట్ సుబ్బు తనతో అసభ్యంగా మాట్లాడారని, దీంతో తాను అడ్వకేట్ను నిలదీశానని తెలిపింది. తనపై యూట్యూబ్, ఇన్స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తొలగించాలని అడ్వకేట్ను అడిగితే, రూ.10లక్షలు ఇస్తేను వాటిని తొలగిస్తానని చెప్పాడని తెలిపారు. తాను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అడ్వకేట్ సుబ్బ, అక్కడ ఉన్నవారు అసభ్యంగా తనను తిట్టారని, డబ్బులు ఇవ్వకుంటే వేధిస్తామని, రెప్యుటేషన్ డ్యామెజ్ చేస్తామని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్తో సంబంధం లేదు: సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్తో తనకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ తెలిపారు. తన పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేశారో తెలియదని తెలిపారు. అడ్వకేట్ సుబ్బుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంగ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుబ్బు భరత నాట్యం డ్యాన్సరని, బిగ్బాస్లోకి వెళ్లేందుకు తన పేరు వాడుకుంటున్నాడని తెలిపారు. తనను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. ఆరోపణలు అన్నీ నిరాధారమని తెలిపారు. నా పేరు చెప్పి ఎవరూ వసూలు చేశారో నాకు తెలియదని, వారికి తనకు సంబంధం లేదని తెలిపారు. మధుకు తన సోదరుడికి సంబంధంలేదని తెలిపారు.
ఇంటర్ ఫలితాల భయంతో… మూడు రోజుల ముందే విద్యార్థి ఆత్మహత్య..తీరా ఫలితాలలో 347
ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల ప్రభంజనం…
ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల ప్రభంజనం… ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు
కొత్త కార్పొరేషన్లకు రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..?
మొదటి కమిటీలో స్పెషలాఫీసర్ ప్రకటన రెండో మీటింగ్లో ఊసేలేని నజరానా రాష్ట్ర బడ్జెట్లోనూ కనిపించని ప్రస్తావన మనతెలంగాణ, సిటీబ్యూరో ః కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్లకు ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రకటించిన రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్లో హాట్టాపిక్గా మారింది. కొత్తగా ఏర్పడిన కొద్దిరోజుల్లోనే కార్పోరేషన్ల అధికారులతో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన స్పెషలాఫీసర్.. నూతనంగా ఆవిర్భవించిన రెండు కార్పోరేషన్లకు ఒక్కొక్క కార్పోరేషన్కు రూ. 500 కోట్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆ ప్రకటన కాస్త కార్యరూపంలోకి రాకుండా ప్రకటనగానే మిగిలిపోయినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషలాఫీసర్గా నియమితులైన మొదటి సమావేశంలోనే ఆయన ఈ ప్రకటనను ఎందుకు చేసినట్టు..? ఎందుకు నిధులు మంజూరు చేయలేకపోతున్నట్టు..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్లో ఆసక్తికరమైన చర్చకు కేంద్రబిందువుగా మారింది. ప్రకటనచేసి నెల రోజులకుపైగా గడిచినా.. అనంతరం మరోమారు స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగినా.. ప్రకటించిన రూ. 500 కోట్లకు సంబంధించి కార్పోరేషన్ల ప్రత్యేకాధికారి ప్రస్తావించకపోవడంపై పలురకాలుగా వ్యాఖ్యానాలకు కేరాఫ్గా మారింది. బడ్జెట్లో ప్రస్తావనేది..? సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్లకు ఊరటనిచ్చేందుకే రూ. 500 కోట్లను మంజూరు చేయనున్నట్టు ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ ప్రకటించారా..? లేక ప్రభుత్వం నుండి వచ్చిన సంకేతాల మేరకు ప్రకటించారా..? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండానే ఆయన ఈ ప్రకటనను చేశారా..? అనేది ఇప్పుడు ఇటు అధికారులను, అటు పాలకులను తొలుస్తున్న ప్రశ్న. ఇదిలా ఉండగా గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ అంచనాల కేటాయింపుల్లోనూ కొత్తగా ఏర్పడిన కార్పోరేషన్లు సైబారాబద్, మల్కాజిగిరిలకు నిధుల కేటాయింపుపై ఊసే లేకపోవడం కూడా అధికారులను, మాజీ పాలకులను ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. కేవలం హెచ్సిటీ ప్రాజెక్టులకు మాత్రమే రూ. 2654 కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. మరి ఈ రూ. 500 కోట్ల ప్రస్తావన చేయలేదు. గతంలో జీహెచ్ఎంసి వరకు మాత్రమే హెచ్సిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసిలో శివారులోని 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. అదనంగా పెరిగిన ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ధి పథకాలను చేపట్టడం జరగాల్సి ఉంది. మరి వీటిని నిధుల సహాకారం చేయాల్సిన ప్రభుత్వం కాస్త వార్షిక బడ్జెట్ అంచనాలలో కొత్త మున్సిపల్ కార్పోరేషన్లకు నిధులను కేటాయించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఆస్తి పన్ను, ప్లానింగ్పైనే.. ఎర్లీబర్డ్ స్కీంతో వచ్చే ఆస్తిపన్ను వసూలు, టౌన్ప్లానింగ్ విభాగం వసూలు చేసే భవన నిర్మాణాల ఫీజుల నుండి వస్తున్న ఆదాయంపైనే ఈ రెండు కొత్త కార్పోరేషన్లు ఆధారపడి ఉన్నాయి. వచ్చే ఆదాయం మేరకు కార్పోరేషన్ ఉద్యోగుల జీతభత్యాలను అందించనున్నది. ఈ రెండు విభాగాల నుండి ఆదాయం వస్తేనే ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు తమతమ బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయని, లేదంటే జాప్యం కావడం ఖాయమనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. గత ఏడాది ఆస్తిపన్ను వసూలు సిఎంసిలో రూ. 1000.36 కోట్లుగా ఉంటే మల్కాజిగిరి కార్పోరేషన్కు రూ. 962.62 కోట్లు వసూలైనట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క మార్చినెలకు సైబారాబాద్లో ఆస్తిపన్ను రూ. 143.69 కోట్లుగా ఉంటే ఎంఎంసిలో రూ.107.09 కోట్లు వసూలైంది. 202526 టౌన్ప్లానింగ్ విభాగం ద్వారా సిఎంసికి రూ. 538.09 కోట్లు, ఎంఎంసికి రూ.198.24 కోట్లు ఆదాయంగా వచ్చాయి. ఇప్పుడు ఈనెల(ఏప్రిల్)లో ఎర్లీబర్డ్ స్కీం అమలులో ఉన్నందున ఆస్తిపన్ను కొంతమేర ఖజానాకు చేరే అవకాశాలున్నాయి. అనంతరం ఇక టౌన్ప్లానింగ్ నుండి వచ్చే ఆదాయంపైనే ఈరెండు కార్పోరేషన్లు ఆధారపడాల్సి ఉంటుందనేది అధికారులు వివరిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’విద్యార్థుల ప్రభంజనం..
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’ విద్యార్థుల ప్రభంజనం.. భీమారం, ఆంధ్ర ప్రభ : స్థాపించిన
Guruthundha Magic: Massive 10 Million views & Counting
“Guruthundha” from Chennai Love Story has turned into a massive sensation dominating charts and social media feeds with reels, shorts, and fan recreations. Crossing over 10 million views, it has firmly established itself as one of the most talked-about songs in recent times. The song has become an addiction to everyone. Both Kiran Abbavaram and […] The post Guruthundha Magic: Massive 10 Million views & Counting appeared first on Telugu360 .
ట్రాఫిక్ సీఐని కలసిన టీడీపీ అధ్యక్షుడు రవికుమార్….
ట్రాఫిక్ సీఐని కలసిన టీడీపీ అధ్యక్షుడు రవికుమార్…. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి.
ఫెయిల్ అయిన మనస్థాపంతో సౌజన్య ఆత్మహత్య
ఫెయిల్ అయిన మనస్థాపంతో సౌజన్య ఆత్మహత్య ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా
KTR : బీఆర్ఎస్ కాదు.. మళ్లీ టీఆర్ఎస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఇంటర్ ఫలితాల్లో బెల్లంపల్లి విద్యార్థిని మెరుపులు..
ఇంటర్ ఫలితాల్లో బెల్లంపల్లి విద్యార్థిని మెరుపులు.. బైపీసీలో స్టేట్ థర్డ్ ర్యాంక్!440కి 436
గ్రేటర్లో విద్యుత్ ఆటో కొనుగోళ్ళు అంతంత మాత్రమే
నిబంధనలు సడలించాలంట్ను యూనియన్ నాయకులు మన తెలంగాణ,సిటీబ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల కొనుగోళ్ళకు ఎన్ని రాయితీలు ప్రకటిస్తున్నా వాటి అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఇతర వావాహనాలు కొనుగోళ్ళు ఎలా ఉన్నా ప్రవేట్ ట్రాన్స్పోర్టులో కీలక పాత్ర పోషిస్తూ, ప్రయాణికులకు ఆర్టిసితో సమానంగా సేవలు అందిస్తున్న ఆటోలకొనుగోళ్ళు ఇతర వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి.డీజిల్, పెట్రోల్, సీఎన్జీ ధరలు పెరుగుతుండటంతో విద్యుత్ కోనుగోళ్ళు అధికం అవుతాయని, ముఖ్యంగా ఆటో కొనుగోళ్ళ అధికంగా ఉంటాయని భావించిగా ఇతర వాహనాల కోనుగోళ్ళకంటే విద్యుత్ ఆటోలు కొనుగోళ్ళుమాత్రమే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఉపాధి కోసం ఆటోలను కొనుగోలు చేయాలంటే తప్పకుండా పర్మిట్ ఉండాల్సిందే. కేవలం పర్మిట్కోసమే సుమారు రూ.3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఆటో ఖరీదు సుమారు రూ ః 2 లక్షల 20 వేలకు మించి లేదు. కానీ వీటిని బ్లాక్ మార్కెట్లో రూ సుమారు మూడు లక్షలకు విక్రయిస్తున్నారు. అదే విద్యుత్ ఆటోలు కోనుగోలు చేయాలంటే ముందుగా షోరూమ్ నిర్వాహకులకు ఆధార్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్లు, రెండు ఫోటోలతో అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఆయా ప్రాంతానికి చెందిన రవాణాశాఖకు పంపిస్తారు. దరఖాస్తుదారునికి ముందుగామరో అటోలేక పోతే విద్యుత్ ఆటోల కొనుగోళ్ళకు అనుమతి ఇస్తారు. వాస్తవానికి ట్రాన్స్పోర్టు వాహనాలు ఎన్ని కొనుగోలు చేసిన అనుమతించే పాలకులు ఆటోల కొనుగోళ్ళను ఎందుకు నియంత్రిస్తున్నారో ఆర్దం కావడం లేదని ఆటో యూని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలో పాత ఆటో డ్రైవర్లు పేరున ఆటో ఉన్నప్పటికి అవి ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీ వద్దనే ఉంటుంది.దీంతో సదరు డ్రైవర్ ఆటోకోనుగోలుకు అవకాశం లేకుండా పోతోంది. ఇటువంటి నిబంధన కారణంగా ఆటో డ్రైవర్లు వాటి కోనుగోళ్ళకు వెనుకాడుతున్నారు. ట్రాన్స్పోర్టుకు ఉపయోగించే విద్యుత్ ఆటోల కొనుగోళ్ళకు ఎటువంటి నిబంధనలు విధించకుండా నేరుగా షోరూమ్కు వెళ్ళగానే సాధారణ వాహనాల మాదిరిగా విద్యుత్ ఆటోల కోనుగోళ్ళకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. విద్యుత్ ఆటోలకు అనుమతిస్తే గ్రేటర్లో వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా ఆటోల బ్లాక్ పర్మిట్ల దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆటోలతో ఉపాధి అవకాశాలు ఎక్కువ ః విద్యుత్ ఆటోలను కోనుగోలు చేయడం ద్వారా ఆటో డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా వారికి మెరుగైన జీవనోపాధి కలిగించినట్లు అవుతుందని ఆటోయూనియన్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆటోలను ఒక్క సారి చార్జ్ చేస్తే 100 నుంచి 120 కిలో మీటర్ల వరకు నడుస్తాయన్నారు. అదే గ్యాస్ ఆటోలు రూ.80లతో 30 కిలో మీటర్లు మాత్రమే నడుస్తాయనింటున్నారు.ఇక ధర విషయానికి వస్తే విద్యుత్ ఆటోకు రూ. 3 లక్షలు అవుతుందని దీనికి పర్మిట్ అవసరం లేకపోవడంతో పర్మిట్కు పెడుతున్న ఖర్చుకే విద్యుత్ ఆటో కొనుగోలు చేయవచ్చంటున్నారు. విద్యుత్ ఆటో కొనుగోళ్ళపై ఉన్న నిబంధన వెంటనే ఎత్తివేస్తే ఎంతోమంది ఆటో కార్మికులకు జీవనోపాది కలిగించినట్లు అవుతుందంటున్నారు. రెండో వాహనం కొంటే అదనపు ట్యాక్స్ను రద్దు చేసిన విధాంగానే ఆటో కొనుగోళ్ళకు పర్మిట్ విధానాన్ని ఎత్తివేయాలని పలువురు ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తూన్నారు. ఆటో పర్మిట్ విధానంతో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని, తద్వారా షోరూం నిర్వహకులకు ప్రయోజనం చేకూరుతుందనేకాని సాధారణ ఆటో డ్రైవర్లకు ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. అంతే కాకుండా ఆటో పర్మిట్ విధానం ఎత్తివేయడంతో విద్యుత్ వాహనాలు కోనుగోళ్ళు పెరగడమే కాకుండా రవాణాశాకు ట్యాక్స్ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
ప్రజలకు చేరువగా పోలీసింగ్.. కన్నెపల్లి ఠాణా ప్రారంభం…
ప్రజలకు చేరువగా పోలీసింగ్.. కన్నెపల్లి ఠాణా ప్రారంభం… నూతన భవనాన్ని ప్రారంభించిన డీజీపీ
వృద్ధులు, నిరాశ్రయుల సేవతో 5వ వార్షికోత్సవం..
వృద్ధులు, నిరాశ్రయుల సేవతో 5వ వార్షికోత్సవం.. విజయవాడ, ఆంధ్రప్రభ : గత ఐదు
మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలి…
మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలి… కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : సామాన్య
ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ప్రభుత్వం…
ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ప్రభుత్వం… కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ :
ఐపిఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఎల్ఎస్ జిపై జిటి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. శుభమన్ గిల్, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది. గుజరాత్ జట్టు 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్ మన్ గిల్(56), జోస్ బట్లర్(60) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు తీసి లక్నో నడివిరిచాడు. ప్రసిద్ధి కృష్ణకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
పాదచారులకు రస్నా పంపిణీ… పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక పైపుల రోడ్డు, సింగ్
“నేను ఆడపిల్లనే” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న మంగ్లీ #Mangli#Emotional#GirlPower#IamAGirl
Breaking : లక్నోపై గుజరాత్ సూపర్ విక్టరీ
గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలం... యుద్ధం కొనసాగుతుందా?
21 గంటల చర్చలు విఫలం పాకిస్తాన్లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కూలిపోయాయి ఇస్లామాబాద్: పాకిస్తాన్లో జరిగిన చారిత్రాత్మక 21 గంటల అమెరికాఇరాన్ శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. దీంతో రెండు వారాల సున్నితమైన కాల్పుల విరమణ భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. చర్చలు విఫలమయ్యేందుకు ఒకరినొకరు బాధ్యులుగా రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. ఇస్లామాబాద్లో జరిగిన ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్ పెట్టిన షరతులను ఇరాన్ అంగీకరించలేదని తెలిపారు. అమెరికా తమది చివరి, ఉత్తమ ప్రతిపాదన అని సమర్పించినప్పటికీ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడంలో ఆసక్తి చూపలేదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికాతో చర్చలు విఫలం కావడానికి ఆ దేశమే కారణమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ, 21 గంటల పాటు జరిగిన చర్చల సందర్భంగా తమ ప్రతినిధి బృందం సానుకూల ప్రతిపాదనలను అందించింది. అయినప్పటికీ.. అమెరికన్లు తమ నమ్మకాన్ని సంపాదించగలదా లేదా అన్నది అమెరికా నిర్ణయించుకోవాల్సిన విషయం అని ఎక్స్ వేదికగా చెప్పారు. “యుద్ధం ముగింపు విషయంలో మాకు సదుద్దేశం, సంకల్పం ఉన్నాయని చర్చలకు ముందే చెప్పాం. కానీ గత రెండు యుద్ధాల అనుభవం కారణంగా మాకు అవతలి పక్షంపై నమ్మకం లేకుండా పోయింది. చర్చల సమయంలో మా ప్రతినిధులు దూరదృష్టితో కూడిన కొన్ని ప్రతిపాదనలు చేశారు. కానీ మా నమ్మకాన్ని పొందండంలో అమెరికా విఫలమైంది. ఇరాన్ అంటే 9 కోట్ల ప్రజల సముదాయం. సుప్రీం లీడర్ పిలుపుకు స్పందించి వారంతా వీధుల్లోకి వచ్చారు. మా ప్రజల హక్కుల సాధనకు సైనిక పోరాటంతో పాటు దౌత్యం కూడా ఒక మార్గమని భావిస్తున్నాం. అదేవిధంగా 40 రోజుల యుద్ధంలో సాధించిన విజయాలను సుస్థిరం చేసుకునే దిశగా మా ప్రయత్నాలను విరమించుకోం అని ఘాలిబఫ్ అన్నారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా అధికమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను పెట్టిందని విమర్శించింది. ఈ చర్చలు విఫలమవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల స్థిరీకరణకు కీలకమైన హార్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై ఆశలు తగ్గిపోయాయి. అమెరికా మళ్లీ ఇరాన్పై సైనిక చర్యలు ప్రారంభిస్తుందా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇరాన్ హామీ ఇవ్వలేదు.. పాకిస్థాన్ వేదికగా ఇరాన్అమెరికాల మధ్య నిర్వహించిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ, 21 గంటలపాటు మేము ఇరానీయులతో గంభీర చర్చలు జరిపాం. ఇది మంచి విషయం. అయితే ఒప్పందం కుదరలేదు. ఇది అమెరికాకంటే ఇరాన్కే ఎక్కువ నష్టం అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదనే స్పష్టమైన హామీ అవసరం అని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం ఇరాన్కు అణ్వాయుధాలు అందకుండా నిరోధించడమేనని వాన్స్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చర్చలు జరిపినట్టు చెప్పారు. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అణు కార్యక్రమం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ, ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలపై విభేదాలు చర్చల విఫలానికి దారితీశాయి. ఘాలిబాఫ్ సోషల్ మీడియాలో పేర్కొంటూ, ఇరాన్ పక్షం ముందుచూపు కలిగిన ప్రతిపాదనలు చేసినప్పటికీ, ప్రత్యర్థి పక్షం విశ్వాసాన్ని పొందలేకపోయిందని తెలిపారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడటానికి రాజనీతితో పాటు సైనిక పోరాటం కూడా కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. హార్మూజ్జలసంధి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ మాట్లాడుతూ, చర్చల విజయవంతం అవ్వడం ప్రత్యర్థి పక్షం నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. అధికమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నివారించాలి అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా రవాణా అంశం కూడా చర్చల్లో అడ్డంకిగా మారిందని తెలిపారు. 40 రోజుల యుద్ధం తర్వాత, అనుమానాలు, అవిశ్వాసం నడుమ ఈ చర్చలు జరిగాయి. ఒకే సమావేశంలో ఒప్పందం సాధ్యమవుతుందని ఆశించలేం. అమెరికా, ఇరాన్ అభిప్రాయాలను దగ్గర చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయి అని బఘాయ్ అన్నారు. ఇక పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ, ఇరాన్అమెరికా శాంతి చర్చలకు తమ దేశం మధ్యవర్తిత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను అంగీకరించినందుకు రెండు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా బృందంలో వెస్ట్ ఆసియా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు మరియు వైట్ హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు రోజుల తరువాత ఇవి జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికాఇరాన్ మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష, ఉన్నత స్థాయి చర్చలు ఇవే. ఇరాన్ చర్చల కోసం 10 పాయింట్ల ప్రణాళికను సమర్పించింది. ఇందులో పశ్చిమ ఆసియాలో నుంచి అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ వంటి డిమాండ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో ఈ ఘర్షణ మొదలైంది. దీంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు దెబ్బతిని, అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమైంది. పశ్చిమ ఆసియా భద్రత, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు, అంతర్జాతీయ రాజనీతిపై దీర్ఘకాల ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ఈ చర్చలను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు.
యాదవ సంఘం అభివృద్ధికి కృషి… చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ
సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత.. విజయవాడ, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం
మహానగరంలో మళ్లీ వరుస దొంగతనాలు
తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు మనతెలంగాణ / సిటిబ్యూరోః మహానగరంలో మళ్లీ దొంగలు రెచ్చిపోతున్నారు, తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని వరుసగా దొంగతనాలు చేసుకుంటున్నారు. తాళం వేసిన ఇళ్లను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేసుకుని చోరీ చేస్తున్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్, బోడుప్పల్ పరిధిలోని పలు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీ చేస్తున్నారు. ఇళ్లల్లో ఉన్న బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుని వెళ్తున్నారు. గతంలో మాదిరిగానే వేసవి వచ్చిందంటే అంతరాష్ట్ర ముఠాలు నగరంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. వేసవి సెలవుల్లో చాలా మంది ఇంటికి తాళం వేసి గ్రామాలకు వెళ్లడంతో వాటిని టార్గెట్గా చేసుకుంటున్నారు. తాళాలు పగులగొట్టి ఇంట్లోని బంగారు ఆభరణాలు,వెండి వస్తువులు, నగదును చోరీ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన తర్వాత అంతరాష్ట్ర ముఠాలు చోరీలు చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లలో నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు. కాలనీలు, కాలేజీలు, గేట్ కమ్యూనిటీలను వదలకుండా దొంగలు చోరీ చేస్తున్నారు. దొంగలు గ్రేటర్ హైదరాబాద్ను టార్గెట్గా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఇనుపరాడ్లు, కట్టర్లు, వేటకొడవళ్లు, మారణాయుధాలతో దొంగలు ఎక్కడో ఒక చోట చోరీలు చేస్తున్నారు. దొంగలు మారణాయుధాలతో తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన వాస్తు నిపుణులు విఎల్ఎన్ కుటుంబంతోపాటు మధురానగర్లో ఉంటున్నారు. ఇంటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకులో ఉన్న నగదు రూ.4కోట్లను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టారు. పనిమీద కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని రూ.4కోట్ల రూపాయలు, బంగారు ఆభరణాలు దొంగలు చోరీ చేశారు. వెంటనే మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాలైన కొంపల్లి, పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండమూడి ఎన్క్లేవ్లో ముసుగు దొంగలు గంట వ్యవధిలోనే ఐదు ఇళ్లల్లో చోరీలు చేశారు. గంట వ్యవధిలోని ఐదు ఇళ్లల్లో చోరీ చేసి కిలో వెండి, నగదును దోచుకుని పోయారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్లోని సదాశివ ఎన్క్లేవ్, గేట్ కమ్యూనిటీలో చోరీ చేసి మూడు తులాల బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు ఎత్తుకుని వెళ్లారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేసి 43తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. చందానగర్లో ఇంటి తాళాలు పగులగొట్టి 17తులాల బంగారు ఆభరణాలు, 60తులాల వెండి వస్తువులు, నగుదును ఎత్తుకుని వెళ్లారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన పోలీసులు రూ.5.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దొంగలు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా చోరీలు చేస్తున్నారు. అంతరాష్ట్ర ముఠాల పనా...? మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా చోరీలు జరుగుతుండడంతో పోలీసులు అంతరాష్ట్ర ముఠాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్కువగా చోరీలు చేసిన వారిలో అంతరాష్ట్ర ముఠాలు ఉన్నాయి. వీరిపై పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో కొంత కాలం నుంచి అంతరాష్ట్ర ముఠాలు గ్రేటర్ హైదరాబాద్ వైపు చోరీలు చేసేందుకు రావడంలేదు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని భావించిన దొంగలు ఇటువైపు వస్తే పట్టుబడతామని కొంత కాలం నుంచి దొంగతనాలకు రాకుండా ఉన్నారు. కానీ మళ్లీ శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతుండడంపై పోలీసులు అంతరాష్ట్ర ముఠాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు సిటీ మధ్యలో కాకుండా శివారు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో చోరీ చేసే సులభంగా ఇక్కడి నుంచి తప్పించుకుని పోవచ్చని అంతరాష్ట్ర ముఠాలు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు చేస్తుంటారు. పెట్రోలింగ్ పెంచాలి.. పోలీసుల నిఘా తగ్గడంతోనే దొంగలు రెచ్చి పోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని, కాలనీల్లోకి వచ్చిన వారిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు. దొంగతనాలు జరగడంలేదని పోలీసులు కొంత నిర్లక్షంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. దొంగలపై పోలీసులు మరింత దృష్టి సారించి చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతరాష్ట్ర ముఠాలపై మరింత నిఘా పెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేసవి దొంగలు వచ్చారా... వివిధ రాష్ట్రాలకు చెందిన దొంగలు వేసవి కాలంలో నగరంలో చోరీలు చేసేందుకు వస్తుంటారు. ఎక్కువగా నగరవాసులు వేసవి సెలవులకు గ్రామాలకు వెళ్తారని భావించి చోరీలు చేసేవారు. కానీ ఈసారి మాత్రం ముందుగా దొంగలు నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా చోరీలు జరుగుతుండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేజీబీవీ జూనియర్ కళాశాల బాలికల హవా..
కేజీబీవీ జూనియర్ కళాశాల బాలికల హవా.. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
పనిభారం తడిసి మోపెడు..!... భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు.
అసహనంలో ఇంజనీర్లు సెలవులపై వేళ్ళేందుకు ప్రయత్నాలు భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు.. కార్యరూపంలోకి వస్తోన్న ప్రాజెక్టులు పెరిగిన జీహెచ్ఎంసి చ.కి.మీ.లు.. తగ్గిన అధికారులు మనతెలంగాణ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసిలో ఇంజనీర్లు పనిభారంతో అసహనానకి లోనవుతున్నారనీ, బదిలీపై ఇక్కడకు వచ్చేందుకు సీనియర్ ఇంజనీర్లు ఆసక్తిని చూపడంలేదనే ఆసక్తికరమన చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇంజనీర్ల కొరతతో ఉన్నవారిపైనే తీవ్రమైన పనిభారం పెరుగుతుంది. ఫలితంగా పలువురు ఇంజనీర్లు సెలవులపై వెళ్ళేందుకు సిద్దమవుతున్నారనేది సమాచారం. ఓవైపు ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకురావాల్సిన పరిస్థితులు... మరోవైపు నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యతలు.. ఇంకోవైపు నెలనెలకు పదవీ విరమణ పొందుతున్న సీనియర్ ఇంజనీర్లు.. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంజనీర్లకు పనిభారం కాస్త తడిసి మోపెడవుతోంది. ఇది తెలిసి కూడా ఖాళీ పోస్టులను భర్తీచేసే దిశగా జీహెచ్ఎంసి ప్రయత్నాలు చేయడంలేదనే విమర్శలు అధికారుల్లో వినిపిస్తున్నాయి. కనీసం 400 మంది ఇంజనీర్లు ఉండాల్సిన జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంలో కేవలం 100 మంది వరకు మాత్రమే ఉన్నారనేది అధికార వర్గాల సమాచారం. ఈ ఎప్రిల్తో పాటు మే, జూన్ నెలలోనూ మొత్తం 14 మంది ఇంజనీర్లు పదవీ విరమణ చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ 14 మందికి బదులుగా మరో 14 మంది జీహెచ్ఎంసికి వస్తారా..? అంటే.. అదీ లేదు. ఇటీవల రిటైర్మెంట్ అయినవారి పోస్టుల్లో ఇతరులు వచ్చి చేరలేదు. దీంతో పదవీ విరమణ చేసిన వారి బాధ్యతలు కూడా ప్రస్తుతమున్న వారే చేపట్టాల్సి వస్తోందని ఆవేదిన చెందుతున్నారు. 426 ఇంజనీర్లు ఇవ్వండి... జీహెచ్ఎంసిలో స్టాఫింగ్ పాట్రన్పై అధ్యయనంచేసి నివేదిక అందించిన ప్రసాదరావు కమిటీ నివేదిక మాత్రం.. ఇంజనీరింగ్ విభాగానికి అదనంగా కనీసం 426 పోస్టు(ప్రాజెక్ట్169, మేయింటనెన్స్257)లను రెండు దశల్లో మంజూరు చేయాలని స్పష్టంచేసింది. మొదటి దశలో ప్రాజెక్ట్కు 144, మేయింటనెన్స్కు 257. రెండో దశలో ప్రాజెక్ట్కు 25 పోస్టులను సాంక్షన్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు తేది 03.04.2013లో జీఓ. ఎంస్ నెం. 92ను అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం వెలువరించింది. ఈ జీవో నెం. 92 ప్రకార ఇప్పటి వరకు ఏఈఈ పోస్టుల్లోకి119 మంది మాత్రమే జీహెచ్ఎంసికి వచ్చినా, నేటికి ఏఈఈ, డిఈఈ, ఈఈ, ఎస్ఈ పోస్టులు ఖాళీలతో అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నవి. ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం మూడు కార్పోరేషన్లుగా జీహెచ్ఎంసి విభజించబడింది. దీంతో ఇంజనీరింగ్ విభాగంలోని ఇంజనీర్లు మూడు కార్పోరేషన్లకు వెళ్ళారు. ఒక్కొక్క కార్పోరేషన్లో ప్రాజెక్ట్, మేయింటనెన్స్లలో ఇంజనీర్ల కొరత తీవ్రత మరింత పెరిగింది. జీహెచ్ఎంసి మాత్రం 650 చ.కి.మీ.ల నుండి 689.76 చ.కి.మీ.లకు పెరిగి 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 వార్డులుగా ఆవిర్భవించింది. దీంతో ఉన్న ఇంజనీర్లకు అదనపు భాధ్యతలు పెరిగాయి. ఈఈలు ఎస్ఈలుగా, ఎస్ఈలు సీఈలుగా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అదనపు బాధ్యతలు ఇటు ఈఈగా.. అటు ఎస్ఈగా రెండేసి బాధ్యతలను నిర్వర్తించడమే కష్టమవుతోందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భర్తీచేయడం అవసరం.. ప్రస్తుత అధికార వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ నెలలో ఎస్ఈలు4, ఈఈలు 3, మే నెలలో ఎస్ఈలు3 మంది ఇలా ప్రతినెల సీనియర్ ఇంజనీర్లు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో జీహెచ్ఎంసిలో సీనియర్ ఇంజనీర్ల కొరత తీవ్రంగామారి ప్రాజెక్టులు, నిర్వహణ పథకాలు తీవ్ర జాప్యానికి కారణమవుతుందనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. ప్రాజెక్ట్లో నాలుగు జోన్లకు ఎస్ఈలు4, ఈఈ 4 డీఈఈ8, ఏఈఈ 8, ఫీల్డ్ లేవల్ స్టాఫ్గా డీఈఈలు, ఏఈఈలు, మేయింటనెన్స్లో జోన్కు ఒక ఎస్ఈ, సర్కిల్కు ఒక ఈఈ, సర్కిల్కు ఇద్దరు డీఈఈలు , ఏఈఈలు 120. క్వాలిటీ కంట్రోల్ సెల్లో ఎస్ఈ, ఈఈ, డీఈఈలు, డిజైన్ వింగ్లో, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లోనూ ఇంజనీర్ల పోస్టులను భర్తీచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ, ఉన్నవారిపై పనిభారం మోపుతోన్న జీహెచ్ఎంసి అధికారులు ప్రభుత్వం నుండి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు చేయడంలేదని, తద్వారా తాము పనిచేయడంకన్నా.. సెలవుపై వెళ్ళడమే ఉత్తమమని భావిస్తున్నారు. ప్రాజెక్టులు, మేయింటనెన్స్ విధులు కార్యాలయాల్లో కూర్చుని చేసే పనులు కాదని సాంకేతికంగా పరిశీలించడం, క్షేత్రస్థాయిలో వెళ్ళి తనిఖీలు చేయడం, పర్యవేక్షణ చేపట్టడం వంటి విధులుంటాయని, దానిని గుర్తించి సరిపడా స్టాఫ్ను తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యతను విస్మరించడంతో ఇంజనీర్లలో అసహనం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అటకెక్కించింది: కెటిఆర్
మంచిర్యాల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ‘దాచుకో.. దోచుకో’ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా అదే పని మీద ఉన్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో కెటిఆర్ పర్యటించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన క్యాతనపల్లి పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ.. బిఆర్ఎస్-సిపిఐ కూటమి తరఫున గెలిచి కౌన్సిలర్లు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అటకెక్కించిందని ధ్వజమెత్తారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట.. సింగరేణి సంపదను దోచుకుంటున్నారని కెటిఆర్ ఆరోపించారు.
త్రాగునీరు రాని నల్లాలు పరిశీలించిన కార్పొరేటర్…
త్రాగునీరు రాని నల్లాలు పరిశీలించిన కార్పొరేటర్… సమస్య పరిష్కారానికి కృషి చేస్తానునేడు నిర్వహించే
ఇంటర్ ఫలితాలలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల
ఇంటర్ ఫలితాలలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల ప్రతిభ ఫస్ట్ సెకండ్
టీజీఆర్ ఎస్ కళాశాల విద్యార్థుల హవా…
టీజీఆర్ ఎస్ కళాశాల విద్యార్థుల హవా… మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా
ఇంటర్లో కేజీబీవీ బాలికల సత్తా…
ఇంటర్లో కేజీబీవీ బాలికల సత్తా… చిట్యాల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో
రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకుతో చిట్యాల విద్యార్థినిలు…
రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకుతో చిట్యాల విద్యార్థినిలు… చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా
నందిగామలో ఘనంగా 33వ ఉర్సు మహోత్సవం…
నందిగామలో ఘనంగా 33వ ఉర్సు మహోత్సవం… పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు నందిగామ,
నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు…
నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు…
అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి
పెదబయలు: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు మత్స్యగెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా.. మరొకరు బయటకు వచ్చి సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్య్సకారులు తక్షణమే స్పందించి.. ఒకరిని కాపాడగలిగారు. మిగిలిన ముగ్గురూ మృతి చెందారు. మృతులను హర్షిత్(12), ప్రదీప్(11), పొంగి బబులు(10)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ తిరువూరు, ఆధ్రప్రభ : స్థానిక కుమ్మరబజారులో ఈ
Sumanth Prabhas’ Godari Gattupaina gets perfect release date
Sumanth Prabhas, who scored a hit with his previous film Mem Famous, is returning to the screen with a rural love story titled Godari Gattupaina. The makers have officially announced that the film is scheduled to release in theaters worldwide on May 8th. Directed by Subash Chandra and produced by Abhinav Rao, the movie features […] The post Sumanth Prabhas’ Godari Gattupaina gets perfect release date appeared first on Telugu360 .
పోలీస్ స్టేషన్కు ప్రభుత్వ వాహనం కరువు….
పోలీస్ స్టేషన్కు ప్రభుత్వ వాహనం కరువు…. అత్యవసర సమయాలలో ఇబ్బందులు పడుతున్న స్థానిక
సినీ ప్రముఖుల పేర్లతో కామెడీ… అనుదీప్పై ఫ్యాన్స్ ఫైర్ #Anudeep#Tollywood#StandUpControversy
ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నఅధికారులు..
ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నఅధికారులు.. పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని నూతన
Auto Driver’s Son Who Studied Abroad Dies in US Accident
Sai Sri Harikrishna, a young man from Piridi village in Bobbili mandal of Vizianagaram district, died in the United States after a drowning accident. Harikrishna had moved to the US two years ago to pursue higher studies. He completed his MSc and recently secured a job as an engineer at Elicent Clean Technologies. On Saturday, […] The post Auto Driver’s Son Who Studied Abroad Dies in US Accident appeared first on Telugu360 .
ముగిసిన లక్నో బ్యాటింగ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..
లక్నో: ఐపిఎల్ 19వ జీజన్లో ఏకనా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన లక్నో.. ఆరంభంలో వేగంగా ఇన్నింగ్స్ ఆడినా.. గుజరాత్ బౌలర్లు కట్టడి చేస్తూ వచ్చారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో మార్క్రమ్ 30, పూరన్ 19, పంత్, సమాద్, ముకుల్ తలో 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలింగ్లో ప్రసిద్ధ్ 4, అశోక్ 2, రబాడా, సిరాజ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే.. గుజరాత్ 165 పరుగులు చేయాలి.
కస్తూర్బా గాంధీ బాలికల హవా.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి… బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అమలు చేస్తున్న
మంత్రి పదవి రావాలని రాజశ్యామల యాగం…
మంత్రి పదవి రావాలని రాజశ్యామల యాగం… మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా
ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన…
ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
చెట్ల మధ్య చిక్కుకున్న సూచిక బోర్డు..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : “నన్ను చెట్ల మధ్యలో ఉంచితే ప్రమాదాలు జరుగుతాయి.. బయటికి
రాష్ట్రంలోని పద్మశాలీలు, చేనేతలు ఏకం కావాలి
రాష్ట్రంలోని పద్మశాలీలు, చేనేతలు ఏకం కావాలి కరీమాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ చేనేత
పంజాగుట్ట ps లో గాయని మంగ్లీ ఫిర్యాదుతో కేసు నమోదు #Mangli #Hyderabad #Panjagutta #BreakingNews
గ్రావిటీ కాల్వ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతి
కొడిమ్యాల, ఆంధ్రప్రభ : కొడిమ్యాల మండలంలోని పోతారం చెరువు నుంచి నాచుపెల్లి జేఎన్టీయూ
ఇన్స్టాగ్రామ్ వీడియోలతో వివాదం.. విష్ణుప్రియపై షాకింగ్ ఆరోపణలు #Vishnupriya #InstagramControversy
డగౌట్లో నిబంధన ఉల్లంఘించిన వైభవ్ గార్డియన్.. బిసిసిఐ సీరియస్
ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. బౌలర్ ఎవరైనా సరే బంతిని బౌండరీలు దాటిస్తున్నాడు. అయితే వైభవ్ ఓ విషయంలో చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుంది. అతడి టీమ్ మేనేజర్ రోమీ భిందర్పై బిసిసిఐ ఫోకస్ పెట్టింది. డగౌట్లో ఫోన్ వాడుతూ కనిపించడంతో బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాంచైజీ ప్లేయర్లు, సిబ్బంది డ్రెస్సింగ్ రూంలో ఫోన్లు వినియోగించవచ్చు. కానీ, డగౌట్లో మాత్రం అందుకు అనుమతి లేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సమయంలో రోమీ ఫోన్తో ఉన్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఓ ఇన్ఫ్లూయన్సర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిపై బిసిసిఐ స్పందించింది. ‘‘అవును ఆటగాళ్లు మ్యాచ్ అధికారుల ప్రదేశం (పిఎంఒఎ) వద్ద ఎవరూ సెల్ ఫోన్లు వాడకూడదు. కానీ, భిందర్ మాత్రం నిబంధనను ఉల్లంఘించారు. టీమ్ మేనేజర్ కూడా డ్రెస్సింగ్ రూమ్లో ఫోన్ను వినియోగించే అవకాశం ఉంది. కానీ, డగౌట్లో వాడకూడదు. అయితే, భిందర్ విషయంలో అనుకోకుండా ఇలా జరిగిన ఉండొచ్చు. నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. కాబట్టి, చర్య తీసుకోవాలి. హెచ్చరిక ఇస్తారా.? లేదా ఏదైనా చర్య తీసుకుంటారా? అనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్ రిఫరీతో పాటు అవినీతి నిరోధక యూనిట్ నివేదిక ప్రకారమే ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని బిసిసిఐ పేర్కొంది.
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. చల్లని మజ్జిగ పంపిణీ..చేస్తున్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా
14న ఫతేగడ్ గురుద్వారా లో బైసఖి పండగ…
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; సిక్కుల నూతన సంవత్సర పండగ ఈనెల 14న
చలో తర్లువాడ.. గూగుల్ డేటా సెంటర్ భూ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిఘటనసిపిఎం
సత్తా చాటిన ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
ఆలేరు,ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరు విద్యార్థులు ఆదివారం
ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే వ్యక్తి అంబేద్కర్
ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే వ్యక్తి అంబేద్కర్ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి
గుజరాత్తో మ్యాచ్.. రెండు వికెట్లు కోల్పోయిన లక్నో
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఏకనా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్.. లక్నోని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన లక్నోకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. రబాడా బౌలింగ్లో వరుసగా సిక్సు, ఫోరు బాదిన మార్ష్(11) ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్(18).. మహ్మద్ సిరాజ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి రాహుత్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పవర్ప్లే(6 ఓవర్లు) ముగిసేసరికి లక్నో 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజ్లో బదోనీ(5), మార్క్రమ్(22) ఉన్నారు.
Reservations |కేంద్రమంత్రి బండిసంజయ్
Reservations | కేంద్రమంత్రి బండిసంజయ్ Reservations | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : మహిళా
పేదల ఇళ్ల కల నెరవేర్చడమే లక్ష్యం: సంపత్ కుమార్
ఇటిక్యాల, ఆంధ్రప్రభ ; పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
Papam Prathap Trailer: A Hilarious, Heartfelt Ride
Thiruveer, who is enjoying the success of his last movie The Great Pre-Wedding Show, returns with another content-driven entertainer, Papam Prathap. The film hits theatres on the 17th of this month, and its newly released trailer sets the tone for a hilarious and heartfelt ride. Set against the rustic charm of 1998 Godavari, the story […] The post Papam Prathap Trailer: A Hilarious, Heartfelt Ride appeared first on Telugu360 .
KTR |క్యాతనపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ కుట్రలు..
KTR | క్యాతనపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ కుట్రలు.. KTR | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
మూడు కాదు.. ముఫ్ఫై నెలలైంది..!
మూడు కాదు.. ముఫ్ఫై నెలలైంది..! మంచిర్యాల ప్రతినిధి – ఆంధ్రప్రభ : ”మేము
ఇంటర్ ఫలితాలలో వీఆర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వీఆర్ జూనియర్ కళాశాల
రాఘవేంద్ర కరిమల కళాశాల ఇంటర్ ఫలితాల ప్రభంజనం
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర
మేరా యువ భారత్ కు తారా విద్యార్థులు
మేరా యువ భారత్ కు తారా విద్యార్థులు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఫుల్ జోష్లో ఉంది లక్నో. ఇప్పుడు ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 1 పరుగు తేడాతో గెలిచిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో ఇరు జట్లు గత మ్యాచ్లోని జట్లనే కొనసాగిస్తుంది. తుది జట్లు : జిటి: సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్(కెప్టెన్), జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్, ప్రసిద్ధ్ కృష్ణ. ఎల్ఎస్జి: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), అయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్.
Allu Aravind’s Wish for Mrunal Thakur
Mrunal Thakur is one of the finest performers of Indian cinema and doing Telugu films has been her priority. After Hi Nanna, the actress is seen beside Adivi Sesh in Dacoit. Her performance is winning the hearts of the audience and Dacoit is doing decent all over. During the film’s success meet, ace producer Allu […] The post Allu Aravind’s Wish for Mrunal Thakur appeared first on Telugu360 .
ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఇకలేరు! #AshaBhosle#RIPLegend#IndianMusic
asha bhosle|ఎన్నో అవార్డులు ఆమె సొంతం..
asha bhosle| ఎన్నో అవార్డులు ఆమె సొంతం.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గానకోకిల,
పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందే: బండి
హైదరాబాద్: పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు అని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని, మహిళలు ఆశలు, ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ బిల్లని బండి తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకీయాల్లో..33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని కొనియాడారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్ లో బిల్లుకు మద్దతివ్వాలని, మహిళలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు దశాబ్దాల నాటి కల అని బండి సంజయ్ పేర్కొన్నారు.
summer| మండుతున్న ఎండలు తెలుగు రాష్ర్టాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలుబయటకు రావడానికి భయపడుతున్న
ఇన్స్పైర్ ఐఐటీ, నీట్ అవార్డ్స్లో వికాస్ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ఇన్స్పైర్ ఐఐటీ & నీట్ ఫౌండేషన్ నిర్వహించిన
Legendary Singer Asha Bhosle Passes Away at 92
Asha Bhosle passed away on April 12, 2026, in Mumbai at the age of 92. She was undergoing treatment for health complications before breathing her last at a private hospital. She had a career of over seven decades. She recorded over 11,000 songs in multiple languages, making her one of the most versatile singers in […] The post Legendary Singer Asha Bhosle Passes Away at 92 appeared first on Telugu360 .
గంజాయి మత్తులో యువకుల వీరంగం.. ఆటో డ్రైవర్పై దాడి..
హైదరాబాద్: కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధి మంగా గంజాయి లో వీరంగం సృష్టించారు. జియాగూడలోని ఓ సందులో బైక్పై నుంచి అతి వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. వివాదం క్రమంగా హింసకు దారి తీసింది. దీంతో ఆటో డ్రైవర్తో పాటు ఆటోలోని వృద్ధులపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. అడ్డుకునేందకు వచ్చిన స్థానికులపై కూడా యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, కొద్ది సేపటి తర్వాత గ్యాంగ్తో ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి మళ్లీ దాడులు చేశారు. భయంతో గేట్లు మూసుకున్నప్పటికీ.. నిందితులు రాళ్లతో దాడి చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు…
యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు… విజయవాడ, ఆంధ్రప్రభ : మాజీ ఆర్థిక
మోడల్ స్కూల్లో మెరుగైన ఫలితాలు
జైనూర్/సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్
Amaravati Back on Track: Legal Clarity Restores Investor Confidence
Amaravati is witnessing a strong revival. With legal clarity and policy stability now in place, uncertainty around the capital has largely faded. The recent constitutional backing has restored confidence among investors and projects once stalled are now moving forward at a pace. The government has taken decisive steps to rebuild Amaravati’s image. Approval of the […] The post Amaravati Back on Track: Legal Clarity Restores Investor Confidence appeared first on Telugu360 .
వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన…
వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన… హెల్మెట్ అనే రక్షణ కవచం ధరించండి…అజిత్ సింగ్
పేదలకు సేవే పరమావధి… కళ్ళే లలిత వీధిలో 53నెలలు నుండి ప్రతి నెల
Telangana | షెడ్యూల్ విడుదల Telangana | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణ
విశాఖకు మరింతగా ఐటి పెట్టుబడులు పెరిగే అవకాశం: లోకేష్
అమరావతి: అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ ఏర్పాటు చిన్న చిన్న అడుగులు కాదని.. ఓ మహత్తర ముందడుగని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. సిఎం చంద్రబాబు దూరదృష్టి ప్రతి రోజుసి మమల్ని ఆశ్చపరుస్తునే ఉంటుంతని తెలిపరు. ఐటి దిగ్గజం ఐబిఎంకు విశాఖకు స్వాగతం పలుకతూ ఎక్స్ పోస్ట్ పెట్టారు. ఐబిఎం కార్యకలాపాలు ప్రారంభమవుతున్న సంకేతాలతో విశాఖ నగరానికి ఐటి పట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖ ఐటి హబ్గా మరింత బలపుడుతోందని ధీమా వ్యక్తం చేశారు.
Youth |మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 బైక్
Youth | మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 బైక్ Youth | ఆంధ్రప్రభ
20వరకు ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ ఫీజుల చెల్లింపు…
20వరకు ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ ఫీజుల చెల్లింపు… మే 13 నుంచి ఇంటర్
తొర్రూరులో పాంచజన్య స్కిన్, హెయిర్ క్లినిక్ ప్రారంభం
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : దినదినాభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణంలో ప్రజలకు అన్ని
ఆస్తికోసం అన్నను హత్య చేసిన తమ్ముడు..
ఆస్తికోసం అన్నను హత్య చేసిన తమ్ముడు.. రోకలి బండతో కొట్టి చంపిన వైనం…నంద్యాల

34 C