SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

వేసవి తరువాతే పరిషత్ ఎన్నికలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవి కాలం ముగిశాకే జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగవచ్చని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. పలు కీలక అంశాలపై ఆయన స్పందిస్తూ ఎన్నికలు ఈ సమ్మర్ అయ్యా కే ఉండే అవకాశం ఉందని, కేబినెట్ విస్తరణపై చ ర్చ ఉందని విడతల వారీగా జరుగుతుందని ఆ యన తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయ న్న విషయమై ఆయన మాట్లాడుతూ ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని, అయితే, ఆయా శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమని ఆయన అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం త్వరలోనే ఉండబోతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మార్కెట్ వాల్యూ.. రాష్ట్రంలో త్వరలోనే భూముల విలువ పెరగనుందని ఈ మేరకు కసరత్తు జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూముల మార్కెట్ వ్యాల్యూ పెంచలేదన్నారు. ధరణి సమస్యలు భూ-భారతితో పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్‌ల సమయంలో మ్యాప్‌ను జతపరచడం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. మ్యాప్‌తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతుందని రెవెన్యూలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామని ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. నాలుగు రకాల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని ఆయన తెలిపారు. నాకు మంత్రులు మద్ధతుగా నిలిచారు.. అసెంబ్లీలో తనపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రతిపక్షం ట్రాప్‌లో తాను పడనని అందుకే ఎంత విమర్శించినా ఓపికగా ఉండి సమాధానం చెప్పానని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల జాబితా తయారవుతోందని సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయని మంత్రి హెచ్చరించారు.

మన తెలంగాణ 19 Apr 2026 4:00 am

ఎల్లుండి రైతు భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ఈనెల 20న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో 20న జరి గే బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులను రైతుల ఖాతా ల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.50కోట్ల ఎకరాలకు ‘రైతు భరోసా’ కింద ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఈ నిధులు జమ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడతగా ఒక్కో ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. మొదటి విడతలో దాదాపు రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో 45.11 లక్షల మందికి లబ్ధి రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకోనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. దీంతో రూ.5,653 కోట్లు రెండవ విడత రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి మాత్రమే సాయం అందించగా, రెండో విడతలో మిగిలిన భూమికి అర్హత మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం, మూడో విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గి సకాలంలో సాగు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో పారదర్శకత ఉంటోందని అధికారులు చెబుతున్నారు.

మన తెలంగాణ 19 Apr 2026 3:30 am

అటు వర్షం.. ఇటు వడగాలులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మండుతున్న ఎండల నుంచి కొంత ఉపశమనం ల భించనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే నాలుగు రోజులు పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఉపరితల చక్రవాక ఆవర్తనం, ద్రో ణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెపుతున్నారు. అయితే వర్షాలు కురిసినా పలు జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణలో వడగాలులు వీస్తున్నాయని దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబా ద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 3040 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జి ల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో 3రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా శనివారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5, జగిత్యాల జిల్లా ఎండపల్లి, నిర్మాల్ జిల్లా ఖానాపూర్‌లో 44.4 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సూర్యుడి ఎండ వేడిమికి కొంత విరామం లభించింది. శనివారం సాయంత్రం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. జయశర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో పెద్ద అంబర్‌పేట్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం నుంచే నగరంలో ఆకా శం మేఘావృతమయి చల్లబడింది. రాష్ట్రంలో మార్చి చివరి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రస్తుతం సా ధారణం కంటే మూడు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావర ణ శాఖ తెలిపింది. ఏప్రిల్ మొదటి వారంలో రా ష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆ తర్వాత ఎండలు మళ్లీ తీవ్రరూపం దాల్చా యి. ఏప్రిల్ చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత గా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఎల్ నినో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 0.51 డిగ్రీ మేర పెరగడంతో ఎల్ నినో ప్రభావం ఏర్పడిందని, దీని కారణంగా దక్షిణ భారతదేశంపై ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం తగ్గే అవకాశం ఉంది.

మన తెలంగాణ 19 Apr 2026 3:00 am

నాచారం లోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం

నాచారం పారిశ్రామిక వాడలోనీ డ్యూరో ఫెక్స్ పరుపుల కంపెనీలో శనివారం రాత్రి  భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద పేలుడు శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.  మంటలను గమనించిన స్థానికులు పోలీసులకి,అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు, రెండు ఫైర్ ఇంజన్ల తో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.నాచారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, డ్యూరుఫ్లెక్ పరుపుల కంపెనీ లో అగ్ని ప్రమాదం కాదు, అందులో ఉన్న మరో కంపెనీ హైదరాబాద్ టెంట్ హౌస్ అను గోదాం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది అని తెలిపారు. నాచారం ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం. డ్యూరో ఫెక్స్ పరుపుల కంపెనీలో ఉన్న టెంట్ గోదాం లో అగ్ని ప్రమాదం జరగడం తో మంటలు వ్యాపించినట్టు తెలిపారు. అందులో ఉన్న కుర్చీలు, టెంట్ బట్టలకు మంటలు పెద్ద ఎత్తున అంటుకోవడం తో ప్రమాదం జరిగింది అని, ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలిపారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 19 Apr 2026 12:40 am

అందరికీ చేరువయ్యే కథనంతో ‘రేజర్’.. ట్రైలర్ విడుదల

కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లై యింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవి బాబు ఒక డాగ్ గ్రూమర్‌గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్ ని కొనసాగిస్తూ, ఈసారి అందరికీ చేరువయ్యే కథనంతో ముందుకొచ్చారు. 

మన తెలంగాణ 19 Apr 2026 12:30 am

పాక్ హెడ్ కోచ్‌గా సర్ఫరాజ్ అహ్మద్

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును గాడిలో పెట్టేందుకు కీలక చర్య లు చేపట్టింది. ప్రపంచ క్రికెట్‌లో వరుసగా విఫలమవుతున్న జట్టును పటిష్టం చేసేందుకు ప్రణాళికను రూ పొందించిం ది. అందులో భాగంగా శనివారం కొత్త కోచ్‌లను నియమించుకుం ది. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూనియార్ స్థాయిలో కోచ్ గా సక్సెస్ అయిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రదాన కోచ్‌గా ఎంపిక చేయగా.. బౌలింగ్ కోచ్‌గా పేసర్ ఉమ మ్ గుల్, బ్యాటింగ్ కోచ్‌గా అసద్ ఫసిక్‌లకు బాధ్యలను ఒప్పజెప్పింది. కాగా, పాకిస్థాన్ జట్టు వచ్చే నెలలో బంగ్లాతో రెండు మ్యాచ్ టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో బంగ్లా పర్యలనలోనే జట్టును గాడిలో పడేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మన తెలంగాణ 18 Apr 2026 11:57 pm

ఉత్కంఠ పోరులో చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం

ఉప్పల్ స్టేడయంలో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే, చివర్లో హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో తిరిగి పట్టు సాధించింది. ఈక్రమంలో విజయం కోసం ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు ఆడటంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో చివరి ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో చెన్నైపై హైదరాబాద్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

మన తెలంగాణ 18 Apr 2026 11:42 pm

రాజేంద్రనగర్ ఆర్‌డిఓకు ఆరు నెలల జైలు

అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు భూమి విచారణ చేపట్టిన ఆర్డీఓ తీర్పు వెల్లడించకపోవడం పట్ల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీలింగ్‌లో లేని భూమిలో హక్కుదారులను వెలువరచకపోవడంతో రెవెన్యూ డివిజనల్ అధికారి నిర్లక్ష్య వైఖరిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణగా పరిగణించి ఆర్డీఓ వెంకట్‌రెడ్డికి నెల రోజుల జైలుశిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించింది. అయితే అప్పీలు నిమిత్తం తీర్పు అమలును రెండు వారాలు వాయిదావేశారు. వివరాల్లోకి వెళ్తే... రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సుమారు 74 ఎకరాల పైచిలుకు భూమి సీలింగ్‌లో ఉన్నట్లు చూపారు. దాంతో సదరు భూమి హక్కుదారు మహ్మద్ యూసఫుద్దీన్ భూ సంస్కరణల అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా 2017లో కోర్టు రాజేంద్రనగర్ భూ సంస్కరణల అధీకృత అధికారి (ఆర్డీవో)ను విచారించాలని ఆదేశించింది. దాంతో విచారణ చేపట్టిన ఆర్డీవో తీర్పును వెలువరుచకపోవడంతో కోర్టు ఆరు వారాలలో తీర్పు వెలువరుచాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను ఆర్డీవో ఖాతరు చేయలేదు. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది. ఆర్డీవో వెంకట్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేస్తూ ఈ వివాదాన్ని మరో అధికారికి కేటాయించాలని జిల్లా కలెక్టరును ఆదేశించింది. కాగా, అప్పీలు నిమిత్తం తీర్పు అమలును రెండు వారాలు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే రాజేంద్రనగర్ ఆర్డీవో శనివారం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా, పెద్దషాపూర్ పరిధిలోని 74 ఎకరాల పైచిలుకు భూమి ప్రస్తుతం చాలా విలువైనదిగా స్థానికుల ద్వారా తెలిసింది. పాలమాకుల నుంచి పెద్ద గోల్కోండ ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లే రేడియల్ రోడ్డు ఇరువైపులా చిన్నజీయర్ ఆశ్రమం ఉన్నదని, దానిన తర్వాత ఉండే ఈ భూములున్నాయని తెలిసింది.

మన తెలంగాణ 18 Apr 2026 11:23 pm

సల్మాన్ ఖాన్-నయనతార కాంబోలో వంశీ పైడిపల్లి మూవీ షురూ..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ‘ఎస్‌విసి63’ ప్రాజెక్టు శనివారం సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో నయనతార కూడా ప్రధాన తారాగణంలో చేరారు. బలమైన భావోద్వేగాలతో కూడిన హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2027లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 11:00 pm

హాలీవుడ్ స్థాయిలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. పోస్టర్ రిలీజ్

ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న భారీ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ ఎరిక్ డస్ట్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది. ఇక శనివారం రిలీజ్ చేసిన వీడీ శౌర్యువ్ మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు పెట్ డాగ్స్ ను తీసుకుని నడుచుకుంటూ వస్తుండటం, ఆసక్తి కలిగిస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.

మన తెలంగాణ 18 Apr 2026 10:50 pm

పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత

ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షిం చిన వైద్యులు, శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించి విజయవంతంగా పూర్తి చేశారు. వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత పవ న్ కల్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వైద్యులు వెల్లడించారు. అయితే, ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి గణనీ యమైన సమయం పడుతుందని, దీర్ఘకాలికంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాలను జనసేన అధ్యక్షుడి రాజకీ య కార్యదర్శి పి. హరిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా, పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వ హించినట్టు తెలుస్తోంది.

మన తెలంగాణ 18 Apr 2026 10:09 pm

8వేల మంది సిబ్బందిపై మెటా వేటు?

ముంబయి: ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ మెటా ఈ సంవత్సరం భారీ ఎత్తున్న లే ఆఫ్‌లకు సిద్ధపడుతోంది. సుమారు 8వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు ఆ కంపెనీ వర్గాలను ఊటంకిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మెటాలో ఉన్న సిబ్బందిలో 20శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో లే ఆఫ్ లెటర్స్ సిబ్బంది అందుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై మెటా ఇప్పటి వరకు స్పందించలేదు. 2022లో కూడా మెటా 11వేల మంది సిబ్బందిని మెటా తొలగించింది. ఆ తర్వాత జరగబోయే లే ఆఫ్ ఇదే పెద్దది అవుతుంది. 

మన తెలంగాణ 18 Apr 2026 10:08 pm

సిఎం మేడిగడ్డ పర్యటన ఒక బోగస్: ఎర్రవెల్లి దయాకర్‌రావు

 తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభను ఫెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్‌రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారని, సీఎం మేడిగడ్డ పర్యటన ఒక బోగస్ పర్యటన అని మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కేసీఆర్ నల్గొండలో మీటింగ్ పెడితే అప్పుడు మేడిగడ్డకు వచ్చాడని, ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తున్నాడని, కేసీఆర్ బయటకు వెళ్తే రేవంత్‌రెడ్డికి వణుకుపుడుతుందని ఎద్దేవా చేశారు. మహదేవ్‌పూర్ మండలం అంబట్‌పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజ్‌ని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో కలసి శనివారం ఆయన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మీడియాతో మట్లాడుతూ.. కేసీఆర్ జగిత్యాలలో వాలంటీర్లతో సమావేశం పెడితే, రేవంత్ అధికార యంత్రాంగాన్ని కదిలించి అధికారిక సమావేశం పెడుతున్నారని ఆరోపించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా మూడేండ్లు రైతులను గోసపెట్టారని విమర్శించారు. 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్‌లో 20వ పిల్లర్ కుంగిపోయిన సంగతి తెలిసిందే కాగా దానికి మరమ్మతులు చేస్తే బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం రూ.94 వేల కోట్లయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ విష ప్రచారం చేస్తున్నదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదని, ఈ ప్రాంత ప్రస్తుత ఎమ్మెల్యే నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటానని దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజయ్య, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎంమ్మెల్యేలు పుట్ట మధు, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్, భూపాలపల్లి బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ జెడ్పి చైర్‌పర్సన్ జక్కు శ్రీహరిని రాకేష్, బీఆర్‌ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 10:06 pm

పౌరసత్వ వివాదంలో రాహుల్‌కు ఊరట

 ద్వంద్వ పౌరసత్వం వివాదంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉపశమనం కల్గింది. ఈ కేసులో రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ దాఖలు వాయిదా పడింది. ఇంతకు ముందు వెలువరించిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సంబంధిత లక్నో బెంచ్ ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందటి ఆదేశాలను నిలిపివేసింది. న్యాయమూర్తులు సుభాష్ విద్యార్థితో కూడిన బెంచ్ ఇప్పుడు రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ముందస్తు నోటీసు ఇవ్వడం చట్టపరంగా అవసరమా ? లేదా అనేది ఖరారు చేస్తుంది. ఇప్పటి ప్రాధమిక సాక్షాధారాల మేరకు చూస్తే నిందితుడు నేరానికి పాల్పడినట్లు భావించాల్సి వస్తోంది. కేంద్రీయ దర్యాప్తు సంస్థ పరిధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును అప్పగించేందుకు సమ్మతిస్తోంది. అయితే దీనికి ముందు నోటీసు జారీ గురించి ఖరారు చేయాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. 

మన తెలంగాణ 18 Apr 2026 10:01 pm

భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు

న్యూఢిల్లీ : హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరపడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమం లోనే భారత్ లోని ఇరాన్ రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హార్ముజ్‌ను ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించి 24 గంటలు గడవక ముందే ఇరాన్ మళ్లీ జలసంధిని మూసేసింది. ఇదే సమయంలో జలసంధి నుంచి వెళ్లేందుకు జగ్ అర్నవ్, సాన్మర్ హెరాల్డ్ అనే భారత నౌకలు ప్రయత్నించగా,వాటిలో జగ్ అర్నవ్ అనే చమురు నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై తీవ్ర నిరసన తెలియజేస్తూ ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. భారత పతాకం ఉన్న ఈ చమురు నౌక ఇరాక్ నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకొస్తోంది.

మన తెలంగాణ 18 Apr 2026 9:58 pm

బిజెపి డౌన్‌ఫాల్ మొదలైంది: మమతా బెనర్జీ

హౌరా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం బీజేపీపై , ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌షాలపై విరుచుకు పడ్డారు. 2029 నుంచి అమలు చేయాలనుకున్న మహిళా రిజర్వేషన్ కోటాకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపచేయడంలో వైఫల్యం కావడం తో కాషాయం పార్టీ డౌన్‌ఫాల్ ప్రారంభమైందన్నారు. హౌరా, సౌత్ 24 పరగణాల్లో యులుబెరియా, బరుయుపూర్‌ల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. పార్లమెంటులో శుక్రవారం నాటి పరిణమాలు బీజేపీ స్వంతంగా మెజార్టీ అంటూ లేని మైనార్టీ అని, మిత్రపక్షాల పొత్తుతో మనుగడ సాగిస్తోందని తేటతెల్లం చేస్తున్నాయని మమత ధ్వజమెత్తారు. ఎన్‌డిఎ లోని కేవలం రెండుపార్టీల మద్దతు పైనే బీజేపీ ఆధారపడి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇది పెద్ద లోపమన్నారు. డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్ ఎందుకు ముడిపెట్టారని ఆమె నిలదీశారు. “లోక్‌సభలో మీ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఓడి పోతారు. ఈ మార్గాని బెంగాల్ చూపిస్తుంది ” అని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 9:50 pm

Allu Arjun’s Raaka will release in 2027

Icon Star Allu Arjun is completely occupied with the shoot of his upcoming film Raaka. Atlee is the director of this unique attempt and the team is maintaining utmost secrecy about the film right from the genre to the shoot. The film started rolling last year and there are a lot of speculations about the […] The post Allu Arjun’s Raaka will release in 2027 appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 9:47 pm

2023 మహిళా చట్టం అమలు చేయండి.. ప్రధానికి విపక్షాల లేఖ

న్యూఢిల్లీ: ఇంతకు ముందటి 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నాయి. ఇండియా కూటమి వేదిక ద్వారా ఈ మేరకు ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ 33 శాతం మహిళా కోటా చట్టం అమలులోకి వచ్చింది. దీనిని క్షేత్రస్థాయిలో తక్షణం అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్షాలు సమగ్ర లేఖ రాసేందుకు సిద్ధం అయ్యాయి. చట్టసభలలో మహిళలకు 33 శాతం కోటా విషయంలో ప్రతిపక్షాలు వ్యతిరేకతతో ఉన్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, దీనిని ఎదుర్కొవాలని సంకల్పించారు. ఇదే దశలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాలలో మహిళా బిల్లుపై ప్రతిపక్షాల పార్టీల తరఫున ఇండియా కూటమి వేదికగా విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి తరువాత తొలిసారిగా అధికార పక్షం సభా ముఖంగా ఎదురుదెబ్బ తింది. ఈ విషయాన్ని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే 2023 చట్టం అమలుకు ముందుకు రావాలని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సోమవారం ఈ చట్టం అమలు విషయంలో చర్చించేందుకు సోమవారమే (20వ తేదీ) పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయాలి. మహిళా చట్టం మునుపటి స్థాయిలో ఉన్నదే అమలు చేస్తామని ప్రతిపాదించాలి. అప్పుడు ఈ కోటాకు ఎవరు వ్యతిరేకం? ఎవరు బాసటగా నిలుస్తున్నారు? అనేది స్పష్టం అవుతుందని ప్రియాంక తేల్చిచెప్పారు.

మన తెలంగాణ 18 Apr 2026 9:40 pm

ట్రంప్ నియంత్రణలో మోడీ: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణలో ఉంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అదే విధంగా ఎఐఎడిఎంకె ద్వారా తమిళనాడులో అధికారం చేజిక్కించుకుని తమిళనాడు ముఖ్యమంత్రిని తన నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటున్నారని రాహుల్  ఆరోపించారు. మన రైతులను, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అమెరికాకు ధారాదత్తం చేయడమే కాకుండా మన ఇంధన భద్రతను, డేటాను అమెరికాకు అప్పగించేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. “పార్లమెంట్‌లో నిన్న మీరు మోడీ ముఖాన్ని చూసే ఉంటారు. పూర్తిగా నమ్మకం కోల్పోయినట్టు కనిపించింది. విపక్షాలను ఆయన ఎదుర్కోలేకపోయారు. పక్కదారుల్లో కూర్చున్నారు. దీనికి కారణం ఆయన అమెరికా నియంత్రణలో ఉండడమే” అని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆయన సంతకం చేశారని, అది పూర్తిగా మనదేశాన్ని అమ్ముడుబోయేలా చేసిందని విమర్శించారు. ట్రంప్ నియంత్రణలో మోడీ ఉండడానికి ఎపిస్టెయిన్ ఫైల్స్ వ్యవహారమే కారణమని ఆరోపించారు. మోడీ ఆర్థిక సంబంధాలు ట్రంప్‌కు తెలుసునని, ఆదానీతో మోడీకి ఉన్న సంబంధాలు ట్రంప్‌కు తెలుసునని ధ్వజమెత్తారు. 

మన తెలంగాణ 18 Apr 2026 9:32 pm

తడబడిన సన్‌రైజర్స్ మిడిలార్డర్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2026లో భాగంగా ఉప్పల్ లో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్‌ ముందు 195 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(59) మెరుపు అర్ధశతకంతో అలరించాడు. ఆ తర్వాత క్లాసెన్(59) కూడా హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ 23 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, మిడిలార్డర్ విఫలమవ్వడంతో సన్‌రైజర్స్ 200 మార్క్ ను చేరుకోలేకపోయింది. ఇక, చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్, కాంబోజ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేష్ చౌదరి రెండు వికెట్లు, గుర్జప్నీత్ సింగ్ ఒక వికెట్ తీశాడు.

మన తెలంగాణ 18 Apr 2026 9:22 pm

Mythri, Prashanth Neel’s Film Titled Impressively 418

Mythri Movie Makers is stepping into darker territory with its latest venture, 418, a film that aims to revive the true essence of horror. Presented by Prashanth Neel, and directed by Kirtan Nadagouda, the project has been unveiled with a spooky poster that immediately sets it apart from the recent wave of horror-comedy entertainers. The […] The post Mythri, Prashanth Neel’s Film Titled Impressively 418 appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 8:48 pm

బ్యాంకాక్‌లో ప్రతిరోజూ 8 గంటల కఠోర శిక్షణ తీసుకుంటున్న రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన దశలోకి అడుగుపెడుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ’మైసా’లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు శారీరక దృఢత్వం అవసరం. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు రూపొందుతున్నాయి. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతోంది. కథ విన్న తర్వాత రష్మిక ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకోవాలని ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. రా, రియల్‌గా అనిపించే యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆమె బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందుకు అనుగుణంగా ఆమె ట్రైనింగ్ సాగుతోంది.

మన తెలంగాణ 18 Apr 2026 8:47 pm

Telangana Speeds Up Airport Plans for Warangal, Adilabad and Bhadrachalam Regions

The Telangana government has intensified efforts to develop new airports in Warangal, Adilabad and Bhadradri Kothagudem as part of its broader infrastructure and regional growth strategy. Revenue, Housing and Information & Public Relations Minister Ponguleti Srinivasa Reddy said the state, under the leadership of Chief Minister Revanth Reddy, is taking key decisions to ensure balanced […] The post Telangana Speeds Up Airport Plans for Warangal, Adilabad and Bhadrachalam Regions appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 8:34 pm

Pawan Kalyan undergoes a Surgery

Andhra Pradesh Deputy Chief Minister and Tollywood actor Pawan Kalyan underwent a surgery and the actor-turned-politician has been advised to rest for ten days. Pawan Kalyan has been busy with the officials in his camp office this morning and he fell ill. He has been suffering with health-related issues for the past few months. All […] The post Pawan Kalyan undergoes a Surgery appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 8:32 pm

క్షణాల సుఖం కోసం ఐదేండ్ల బాలుడి దారుణ హత్య

 అక్రమ సంబంధానికి అలవాటుపడ్డ ఓ వ్యక్తి క్షణాల సుఖం కోసం ఐదేండ్ల బాలుడిని బలిపీఠం ఎక్కించాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకున్నది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి వివాహం కాగా ఆమెకు ఐదేండ్ల శ్రావణ్, ఎనిమిదేండ్ల కూతురు ఉన్నారు. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె భర్తకు దూరంగా, పిల్లలతో కలసి వేరుగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. లక్ష్మీ శుక్రవారం పని మీద బయటికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న బాలుడు శ్రావణ్‌పై నిందితుడు నర్సింలు అమానుషంగా దాడి చేశాడు. గొంతు పిసికి, నోరు, ముక్కు మూసి, నేలకేసి కొట్టి, కళ్లలో కారంపొడి పోసి దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. బాలుడిని ఇలా క్రూరంగా హింసించి చంపడం నిందితుడి రాక్షతత్వానికి పరాకాష్ఠ అని పరిసరాల వ్యక్తులు వాపోతున్నారు. రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మీ బంధువు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన చిన్నారుల భద్రత, కుటుంబ పరిసరాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది.

మన తెలంగాణ 18 Apr 2026 8:32 pm

టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన స్మృతి మంధాన..

డర్బన్: అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును భారత మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన బ్రేక్ చేసింది. అంతేకాదు, ఈ ఫార్మాట్ లో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా స్మృతి నయా రికార్డు నెలకొల్పింది. డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సందర్భంగా జరిగిన తొలి మ్యాచ్‌లో మంధాన ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు 4,231 పరుగులతో రోహిత్ శర్మతో సమానంగా మంధాన ఉంది. ఈ మ్యాచ్ లో 13 పరుగులు చేయడంతో మొత్తం 4,244 పరుగులతో రోహిత్ ను అధిగమించింది. మంధాన..155 ఇన్నింగ్స్‌లలో 30.31 సగటు, 124.38 స్ట్రైక్ రేట్‌తో ఈ స్కోరును అందుకుంది. ఇందులో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వారి ఆల్-టైమ్ జాబితాలో 4,717 పరుగులతో సూజీ బేట్స్ అగ్రస్థానంలో ఉంది. ఆమె తర్వాత రెండో స్థానంలో మంధాన నిలిచింది. పురుషుల విభాగంలో, ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బాబర్ అజామ్ పేరిట ఉంది. ఇదిలావుంటే.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయంగా 47 పరుగులతో రాణించగా.. షఫాలీ వర్మ 34 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 36 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక, దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో అయబోంగా ఖాకా కీలక పాత్ర పోషించింది. ఆమె కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. తుమీ సెఖుఖునే రెండు వికెట్లు పడగొట్టగా, నాన్‌కులేకో మ్లాబా ఒక వికెట్ తీసింది. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.

మన తెలంగాణ 18 Apr 2026 8:28 pm

బ్రిటన్ ట్యాంకర్‌పై ఇరాన్ గన్‌బోట్లు కాల్పులు

హర్మూజ్ జలసంధిపై తిరిగి ఆంక్షలు విధిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించిన తరువాత ఆ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై శనివారం ఇరాన్ రివల్యూషనరీకి చెందిన రెండు గన్‌బోట్లు కాల్పులు కాల్పులు జరిపాయని బ్రిటిష్ మిలిటరీ వెల్లడించింది. ఆ ట్యాంకర్ ఏమిటో గుర్తింపు కానీ, గమ్యం కానీ వివరించలేదు. అయితే ట్యాంకర్, సిబ్బంది క్షేమమేనని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. 

మన తెలంగాణ 18 Apr 2026 8:23 pm

పవర్‌ప్లేలో రాణించిన అభిషేక్.. చివర్లో వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కి అభిషేక్ శుభారంభం అందించాడు. 15 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. దీంతో పవర్‌ప్లే చివరి ఓవర్‌ వరకూ ఎస్‌ఆర్‌హెచ్ నిలకడగా రాణించింది. కానీ పవర్‌ప్లే చివరి రెండు బంతుల్లో వరుసగా హెడ్ (23), కిషన్(0) పెవిలియన్ చేరాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ (52), క్లాసెన్ (1) ఉన్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 8:10 pm

2yrs boy |పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

2yrs boy | పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. 2yrs

ప్రభ న్యూస్ 18 Apr 2026 8:04 pm

దుర్గమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి..

దుర్గమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:56 pm

యురేనియంను అమెరికాకు అప్పగించేది లేదు : ఇరాన్

అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శుద్ధి చేసిన యురేనియ ం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్‌జడేహ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భవిష్యత్‌లో జరగనున్న చర్చలకు యురేనియం ప్రధాన అంశమని ట్రంప్ చేస్తున్న వాదనలను కొట్టి పారేశారు. టర్కీ లోని అంటల్యా సిటీలో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సయీద్ అమెరికాతో మరో దఫా ముఖాముఖి చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని వెల్లడించారు. ఎందుకంటే అమెరికా తన గరిష్టవాదాన్ని విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్‌లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని శుక్రవారం ట్రంప్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో సయీద్‌ఖతిబ్జ్‌దేహ్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 7:54 pm

దోపిడీ కేసు ఛేదన..

దోపిడీ కేసు ఛేదన.. ఐదుగురు యువకులు అరెస్టు.18 గ్రాముల బంగారం స్వాధీనం. పాయకాపురం,

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:52 pm

హర్మూజ్ మళ్లీ మూసివేత.. భారత నౌకలపై కాల్పులు

తిరిగి వెళ్తూ భారత నౌకలపై ఇరాన్ గన్‌బోట్ల కాల్పులు సిబ్బంది, నౌకలు సురక్షితం ఒమన్ ఈశాన్యం నుంచి వెనక్కి మళ్లింపు జలసంధిపై ట్రంప్ వైఖరితో మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితి టెహ్రాన్ : హర్మూజ్ జలసంధి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెరిచినట్టే తెరిచే గంటల వ్యవధిలో ఇరాన్ తిరిగి మూసివేసింది. దానికి అమెరికా అనుసరిస్తున్న వైఖరే కారణమని స్పష్టం చేసింది. శుక్రవారంనాడు జలసంధిని తెరిచిన ఇరాన్ శనివారంనాడు మూసివేసింది. హర్మూజ్‌ను తెరిచినప్పటికీ ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ పేర్కొంది. ‘ హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తిరిగి మొదటికి వచ్చింది. ప్రస్తుతం మా సాయుధ దళాల నియంత్రణలో ఉంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంత కాలం జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుంటాం’ అని ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేవరకు హర్మూజ్‌లో దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. ఆ వెంటనే హర్మూజ్‌లో రాకపోలను ఇరాన్ నియంత్రించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న భారతీయ జెండాతో కూడిన రెండు నౌకలపై ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కాల్పులు జరిపారు. ఐఆర్‌జిసికి చెందిన రెండు గన్‌బోట్లు కాల్పులు జరిపాయని బ్రిటీష్ మిలిటరీ వెల్లడించింది. అయితే ఈ ఘటనలో నౌకల్లోని సిబ్బందికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ గార్డ్ జలసంధిని మూసివేసి తిరిగి వెళ్తూ కాల్పులకు పాల్పడ్డట్లు కథనాలు వెలువడ్డాయి. నౌకలు, సిబ్బంది క్షేమమేనని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్‌తో పాటు ప్రభుత్వం వెల్లడించింది. నౌకల్లో ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 2మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని, భారత నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, ఒమన్‌కు ఈశాన్యంగా వెనక్కి మళ్లించినట్లు ట్యాకంర్ ట్రాకర్స్ డాట్ కామ్ వెల్లడించింది. మరోవైపు కాల్పులు ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నాం... మరోవైపు దేశం లోని పలు ఎయిర్ పోర్టులను తిరిగి తెరవడంతోపాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యురేనియంను అమెరికాకు అప్పగించేది లేదు: ఇరాన్ అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శుద్ధి చేసిన యురేనియ ం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్‌జడేహ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భవిష్యత్‌లో జరగనున్న చర్చలకు యురేనియం ప్రధాన అంశమని ట్రంప్ చేస్తున్న వాదనలను కొట్టి పారేశారు. టర్కీ లోని అంటల్యా సిటీలో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సయీద్ అమెరికాతో మరో దఫా ముఖాముఖి చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని వెల్లడించారు. ఎందుకంటే అమెరికా తన గరిష్టవాదాన్ని విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్‌లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని శుక్రవారం ట్రంప్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో సయీద్‌ఖతిబ్జ్‌దేహ్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 7:51 pm

పార్లమెంట్ నిరవధిక వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రత్యేక నిష్పల సిట్టింగ్ తరువాత ముగిశాయి. లోక్‌సభ, రాజ్యసభలు శనివారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. డిలిమిటేషన్, సంబంధిత మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లుల కోసం మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సెషన్ కొనసాగింపుగా ఈ ప్రత్యేక సిట్టింగ్స్ సందర్భంగా ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య వాడివేడి రాజకీయ దుమారాలు చెలరేగాయి. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడ్డట్లు శనివారం అధికారికంగా ప్రకటన వెలువడింది. బడ్జెట్ సమావేశాలు జనవరిలో ఆరంభమయ్యాయి. ఈసారి అత్యంత ఉధృత స్థాయిలో లెజిస్లేటివ్ బిల్లులు నాటకీయ పరిణామాల మధ్య ఆమోదం పొందాయి. అయితే అధికార పక్షానికి చివరి దశలో కీలక బిల్లు ఆమోదం విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. దీనితో తొలిసారిగా మోడీ ప్రభుత్వం చట్టసభలో గణనీయ స్థాయి రాజకీయ వైఫల్యం మూటకట్టుకుంది. శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో అధ్యక్ష స్థానంలో ఉన్న సిపి రాధాకృష్ణన్ సభల నిరవధిక వాయిదాలను ప్రకటించారు. సభల తీరు ఫలప్రదంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభ శుక్రవారం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ల కోసం ఈ నెల 16 నుంచి మూడు రోజుల సెషన్ ఏర్పాటు అయింది. లోక్‌సభ స్థానాల పెంపు, మహిళా కోటా అమలు వంటి విస్తృత అంశాలు మూలకుపడిన దశలో పార్లమెంట్ వాయిదా పడింది. తుది దశలో సంకల స్థితిని చవిచూసినా ఈ బడ్జెట్ సమావేశాలలో పలు కీలక మైలురాయి ఫలితాలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఇంధన రంగ పరివర్తన లిథియం ఐయాన్ ఉత్పత్తి ప్రోత్సాహకాలు , పన్నుల వ్యవస్థల క్రమబద్ధీకరణ వంటి కీలక అంశాలు జోడించారు. సిఎపిఎఫ్ బిల్లు, జన విశ్వాస్ సవరణ బిల్లు వంటివి కీలకం అయ్యాయి. ఇక సభలో తుది దశలో నెలకొన్న నాటకీయ పరిస్థితులు, భారీ స్థాయి భావోద్వేగాలు , మహిళా బిల్లు అంశం ప్రధాన అస్త్రంగా మలుచుకునేందుకు వీలైన పూర్వ రంగంతో పార్టీలు ఇప్పుడు ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నాయి. తమ తమ వాదనలను ప్రజల ముందుకు ఉంచేందుకు సమాయత్తం అయ్యాయి. లోక్‌సభ స్థానాల పెంపు, మహిళా కోటా ముందుకు పడకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బిజెపి మిత్రపక్షాల ఎన్‌డిఎ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ రెండింటిని అధికార పక్షం తన రాజకీయ స్వార్థానికి వాడుకుందని ప్రజలకు వివరించేందుకు విపక్షాలు సిద్ధం అయ్యాయి. 

మన తెలంగాణ 18 Apr 2026 7:49 pm

ఆలయ కమిటీ అధ్యక్షుడుగా గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక …

ఆలయ కమిటీ అధ్యక్షుడుగా గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక … భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:48 pm

సినీ ఫక్కీలో బ్యాంకు దోపిడీ

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలోని ఓ బ్యాంకులో సినీ ఫక్కీలో దోపిడీ సంఘటన జరిగింది. ఐదుగురు సాయుధులు బ్యాంక్‌లోకి దూసుకెళ్లి సిబ్బంది, కస్టమర్లను బందీలుగా ఉంచి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. కేవలం 20 నిమిషాల్లో మొత్తం కానిచ్చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో ఈ ఘటన జరిగింది. మొదట ఇద్దరు ఖాతాదారుల్లా బ్యాంక్‌లోకి ప్రవేశించారు. తుపాకులు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. మరికొన్ని క్షణాల్లో మరో ముగ్గురు వచ్చి బ్యాంక్‌పై పూర్తిగా నియంత్రణ సాధించారు. దుండగులు తుపాకీలు చూపించి సిబ్బంది, కస్టమర్లను ఒకచోట కూర్చోబెట్టారు. బెదిరించేందుకు పలు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేసి లాకర్ల తాళాలు లాక్కున్నారు. సుమారు రూ.35 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. చోరీ అయిన మొత్తం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఘటన సమయంలో బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డు లేకపోవడం గమనార్హం. సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్లే దుండగులు సులభంగా దొంగతనం పూర్తి చేయగలిగారని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు. 

మన తెలంగాణ 18 Apr 2026 7:40 pm

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు….

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు…. నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:38 pm

ఉత్కంఠ పోరులో ఆర్‌సిబిపై ఢిల్లీ ఘన విజయం

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సిబి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే నిస్సాంక ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌లోనే భువనేశ్వర్ మరో రెండు వికెట్లు తీశాడు. కానీ, ఢిల్లీ బ్యాటర్లు పట్టువదలకుండా బ్యాటింగ్ చేశారు. కెఎల్ రాహుల్ 57, స్టబ్స్ 60, అక్షర్ పటేల్ 26, డేవిడ్ మిల్లర్ 22 పరుగులతో తమ జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో 19.5 ఓవర్లలో ఢిల్లీ 179 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

మన తెలంగాణ 18 Apr 2026 7:35 pm

రాజమండ్రి రైల్వే ట్రాక్..నౌకలకు బీమా పథకం

కేంద్ర కేబినెట్ ఇప్పటి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన మూడో దశను 2028 సంవత్సరం వరకూ పొడిగించారు. దీనికి రూ 83,977 కోట్ల రూపాయల వ్యయ అంచనాలు వేశారు. భారత్ మ్యారీ టైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. గజియాబాద్, సీతాపూర్ మూడు, నాలుగవ రైలు మార్గ విస్తరణకు రూ 14,926 కోట్లు కేటాయించారు. నిరంతర సముద్రయాన బీమా కల్పనకు రూ 12,980 కోట్లు కేటాయించారు. ఈ పథకం వల్ల ప్రస్తుత ప్రపంచ అస్థిరత, భౌగోళిక , రాజకీయ పరిస్థితుల దశలో మన నౌకలు దెబ్బతింటే వారికి సరైన రీతిలో బీమా కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సముద్ర యానం దశలో జరిగే యుద్ధ ఇతరత్రా ప్రమాదాల నష్టాల భర్తీకి కూడా వీలేర్పడుతుంది.  ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి , నిడదవోలు, దువ్వూరు మధ్య 3,4ద రైల్వే లైన్ ట్రాక్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు అయ్యే 458 కిలోమీటర్ల ట్రాక్ కోసం రూ 9889 ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపారు.

మన తెలంగాణ 18 Apr 2026 7:34 pm

మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే…

మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే… ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:32 pm

మూడురోజుల్లో దారికి రాకపోతే తిరిగి దాడులే: ట్రంప్

బుధవారం నాటికి ఇరాన్ తన సైనిక చర్యలను నిలిపివేయాలని , లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి ఒప్పందానికి రావల్సిందే. లేకపోతే ఇక అమెరికా నుంచి బాంబుల దాడుల ఉధృతిని అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఓ వైపు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగుతోందని, హర్మూజ్ పెత్తనం వీడటం లేదని, వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, అమెరికా సేనల చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇరాన్‌ను హెచ్చరించారు. అరిజోనా నుంచి వాషింగ్టన్‌కు తిరిగి వస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ తమ ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానం నుంవి మీడియాతో మాట్లాడారు. హర్మూజ్‌ను అమెరికా తమ పూర్తి స్వాధీనంలోకి తీసుకుంటుందని, ఈలోగా ఇరాన్ సరైన రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు ప్రతిగా ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్మూజ్‌పై అమెరికా బెదిరింపులు లెక్కలోనికి రావని, తరచూ అసమంజస ప్రకటనలకు దిగుతున్నారని ఇరాన్ ఎదురుదాడికి దిగింది. ఇప్పుడు ఇక హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకలను తక్షణం నిలిపివేస్తున్నామని, ఈ నిర్ణయానికి అమెరికా అతి చర్యలే కారణం అని విమర్శించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 7:30 pm

Flash : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 7:26 pm

కేంద్ర ఉద్యోగుల డిఎ 2 శాతం పెంపు

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దార్లకు 2 శాతం మేర కరువు భత్యం (డిఎ), కరువు ఉపశమనం (డిఆర్) పెంచారు. ఈ నిర్ణయానికి శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించింది. తరువాత ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. డిఎ, డిఆర్ పెంపుదల నిర్ణయంతో దేశంలోని దాదాపు 50.46 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 68.27 లక్షల మంది పెన్షనర్లకు ఉపయోగం చేకూరుతుంది. ఈ రెండింటి హెచ్చింపు భారం ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపుగా రూ 6791.24 కోట్ల మేర ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిఎ, డిఆర్ పెంపుదల ఉద్యోగులకు వర్తింపచేస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు, ఇప్పటి ధరల పెంపుదల , ఇతర కారణాలను విశ్లేషించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగుల మూల వేతనం/ పింఛన్‌లపై అమలులో ఉన్న 58 శాతం డిఎ రేటుకు అదనంగా ఈ రెండు శాతం జోడింపు జరుగుతుంది. 

మన తెలంగాణ 18 Apr 2026 7:26 pm

రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్

రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్ భార్య తరపున మధ్యవర్తుల వేధింపులతో

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:25 pm

2026entry |సుప్రీత నాయుడు సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర నటి వరకు!

2026entry | సుప్రీత నాయుడు సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర నటి

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:20 pm

ఈ నెల 20న జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు

 దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 304 నగరాలలో 566 పరీక్షా కేంద్రాలతోపాటు విదేశాలలోని 14 నగరాలలో ఈ నెల 2 నుంచి 8 వరకు జెఇఇ మెయిన్ 2 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా, ఆదివారం రాత్రి లేదా సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జెఇఇ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు జరగగా, ఫిబ్రవరి 16న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

మన తెలంగాణ 18 Apr 2026 7:18 pm

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ…

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ… నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:16 pm

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి: సిఎం రేవంత్ రెడ్డి

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సిఎం కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను సిఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతలతో దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తుందని కేంద్ర మంత్రులకు సిఎం వివరించారు. హైదరాబాద్‌లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మెషిన్‌టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సిఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సిఎం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 7:14 pm

ఈనెల 21న వాహనాల బహిరంగ వేలం

ఈనెల 21న వాహనాల బహిరంగ వేలం డీటీసీ యం పురేంద్ర… విజ‌య‌వాడ‌, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:11 pm

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సిఎస్‌కె

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌తో సొంత మైదానంలో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తుది జట్లు:  ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సాలిల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేస్, ఇషాన్ మలింగ. సిఎస్‌కె: సంజు శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.

మన తెలంగాణ 18 Apr 2026 7:10 pm

ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర.. నలుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి టెర్రరిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఢిల్లీ నగరంలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడం, లక్ష్యంగా చేసుకునేందుకు సున్నితమైన ప్రాంతాలపై రెక్కీ నిర్వహించడం, ఎన్‌క్రిప్టెడ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇతరులను నియమించుకునేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలతో మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన నలుగురు తీవ్రవాద భావజాలం గల వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED), దానికి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు, నిందితులలో ఇద్దరు IED అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మ కారును తయారు చేసే ప్రక్రియలో ఉన్నారని చెప్పారు. నిఘా ఆధారిత ఆపరేషన్‌లో మహారాష్ట్ర నుండి ఇద్దరు నిందితులను.. ఒడిశా, బీహార్ నుండి ఒక్కొక్కరిని స్పెషల్ సెల్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచన చుట్టూ కేంద్రీకృతమైన తీవ్రవాద భావజాలంతో ఈ నలుగురు ప్రభావితులయ్యారని, గజ్వా-ఎ-హింద్ వంటి నినాదాలను ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు.

మన తెలంగాణ 18 Apr 2026 7:07 pm

తాచుపాముల స్వైరవిహారం..

తాచుపాముల స్వైరవిహారం.. సింగ్ నగర్లో ఇద్దరికి పాముకాటు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:04 pm

మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది…

మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:00 pm

Took Cash, Showed Fake Payment Screenshot: ATM Fraudster Held in Hyderabad

Hyderabad Police have arrested a 25-year-old man accused of cheating ATM users by showing fake PhonePe payment screenshots and escaping with cash. The accused, Abdallah Obaid Al Katheri alias Abdullah, was arrested by Chandrayangutta Police on April 17 near the same ATM centre where one of the frauds had taken place. How the Scam Worked […] The post Took Cash, Showed Fake Payment Screenshot: ATM Fraudster Held in Hyderabad appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 6:55 pm

Telangana : రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 6:55 pm

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది ఎన్డీయే సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 2శాతం డిఎ పెంచేందుకు కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. పెంచిన డిఎ జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

మన తెలంగాణ 18 Apr 2026 6:51 pm

శ్రీధర్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం

శ్రీధర్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మాజీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:50 pm

Hyderabad Police Raid 558 Shops Near Schools in Massive Anti-Tobacco Drive

In one of the largest enforcement drives in recent times, Hyderabad City Police on Saturday conducted simultaneous raids on 558 shops located near schools and colleges as part of a citywide crackdown titled Operation Safe School. The special operation was launched to curb the sale of tobacco products near educational institutions and protect students from […] The post Hyderabad Police Raid 558 Shops Near Schools in Massive Anti-Tobacco Drive appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 6:49 pm

అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం

అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం కార్మికులకు అగ్నిప్రమాదాల పై అవగాహన కార్యక్రమం చిట్టినగర్,

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:46 pm

ఎల్లుండి రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల..

హైదరాబాద్: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ సర్కార్, రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీన రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండో విడతలో 45,11,947 రైతులకు రూ.5,653 కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ చేయన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారనే దానిపై స్పస్టత రావాల్సి ఉంది. కాగా, తొలి విడతలో ఒక ఎకరం వరకు రైతులందరికీ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 18 Apr 2026 6:40 pm

అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

అనకాపల్లి: అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫుట్‌పాత్ వంతెన కూలిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వంతెన నిర్మిస్తున్న క్రమంలో స్తంభాలు కూలిపోయి.. విద్యుత్ వైద్యు తెగిపడ్డాయి. అయితే, ఆ సమయంలో ప్లాట్‌ఫామ్‌పై రైలు లేకపోవడంతో భారీ నష్టం తప్పింది. క్షతగాత్రులైన కూలీలను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 6:33 pm

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బిజెపి నిరసనలు.. రాహుల్ దిష్టిబొమ్మ దహనం

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా కోటా చట్టాన్ని సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాతో సహా పలువురు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. తర్వాత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు.. బీజేపీ ఎంపీలు కమల్‌జీత్ సెహ్రావత్, బన్సూరి స్వరాజ్‌తో సహా పలువురు కార్యకర్తలను, నాయకులను అదుపులోకి తీసుకుని, నిరసనకారులను చెదరగొట్టారు. ఈ నిరసన సందర్భంగా ఎంపి బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ.. “వారి వ్యాఖ్యలను బట్టి, నిన్న బిల్లును వ్యతిరేకించడం కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ అని స్పష్టమైంది. రాహుల్ గాంధీ, ఆయన సహచరులకు, మొత్తం ఇండియా కూటమికి మహిళలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కనిపిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. మహిళలు కేవలం ఓటింగ్‌కు మాత్రమే పరిమితం కావాలని వారు కోరుకుంటున్నారు” అని విమర్శించారు.

మన తెలంగాణ 18 Apr 2026 6:24 pm

నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు!

నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు! నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:23 pm

కేడీసీసీ బ్యాంక్‌కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్…

కేడీసీసీ బ్యాంక్‌కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్… నాణ్యతలో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:18 pm

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. ప్రజల నుంచి వచ్చే సమస్యలను

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:14 pm

LokSabha |రాజకీయ అనివార్యతలా?

LokSabha | రాజకీయ అనివార్యతలా? LokSabha | లోక్‌సభ బిల్లు వీగిపోవడం: కొత్త

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:11 pm

నారా భువనేవ్వరి సంచలన నిర్ణయం

నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 6:11 pm

శానిటేషన్‌పై దృష్టి సారించాలి…

శానిటేషన్‌పై దృష్టి సారించాలి… స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్ర ద్వారా అవగాహన..సెంట్రల్ ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:10 pm

పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో పిచ్చి కుక్క

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:08 pm

హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి

హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:05 pm

2029 Election |తర్వాత ఎవరి అడుగులు ఎటువైపో?

2029 Election | తర్వాత ఎవరి అడుగులు ఎటువైపో? 2029 Election |

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:04 pm

BRS : కేసీఆర్ కీలక ప్రకటన.. పార్టీ పై నిర్ణయం వెలువరించే ఛాన్స్

భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 6:00 pm

తడబడిన ఆర్‌సిబి.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

బెంగళూరు: ఐపిఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సిబి బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్‌సిబిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్‌సిబి బ్యాటింగ్‌లో సాల్ట్ 63, డేవిడ్ 26, కోహ్లీ, 19, పడిక్కల్ 18 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్‌లో ఎంగిడి, కుల్దీప్, అక్షర్ చెరి 2, ముఖేశ్ 1 వికెట్ తీశారు. అయితే 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో నిస్సాంకా ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 1 ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ 1 వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్(1), కరుణ్ నయర్ (0) ఉన్నారు. 

మన తెలంగాణ 18 Apr 2026 5:45 pm

మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు : చంద్రబాబు

మహిళల ఆత్మగౌరవాన్ని విపక్షాలు దెబ్బతీశాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 5:40 pm

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 5:29 pm

కాంగ్రెస్ ది రెండు నాల్కల ధోరణి : కిషన్ రెడ్డి

మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్‌ రెండు నాల్కల ధోరణిని వ్యవహరించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 5:22 pm

Health |మహిళల్లో ఆస్టియోపోరోసిస్..

Health | మహిళల్లో ఆస్టియోపోరోసిస్.. Health | మెనోపాజ్.. అసలైన మలుపుసైలెంట్ డిసీజ్‌గా

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:22 pm

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పార్థసారథి..

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పార్థసారథి.. మంత్రి కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలికిన ఈవో..అమ్మవారికి

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:19 pm

జనగణన-2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాయపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనగణన-2027 సర్వే నిర్వహణపై

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:17 pm

బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసింది: కిషన్ రెడ్డి

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరోసారి అన్యాయం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాకు న్యాయం జరిగేలా మంచి ఫార్ములాను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చారని తెలియజేశారు బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసిందని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ కాంగ్రెస్ లో కనిపిస్తోందని అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళల ఉత్సాహంపై నీళ్లు చల్లారని, సర్జికల్ స్ట్ర్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ను కూడా అవమానించేలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని జాదుగర్ అంటూ రాహుల్ గాంధీ అవమానించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

మన తెలంగాణ 18 Apr 2026 5:16 pm

రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

గట్టుప్పల, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:15 pm

ముమ్మరంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల పరిశీలన…

ముమ్మరంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల పరిశీలన… లైవ్ డెమో ద్వారా పరీక్షల పనితీరును వీక్షించిన

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:14 pm

ప్రజా ప్రయోజనార్థం SRR ఫౌండేషన్ మరో ముందడుగు

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:12 pm

హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!…….

ప్రారంభంలో వరాల జల్లులు… ముగింపులో ఫీజులు ముక్కుపిండి!….. విశాలాంధ్ర – నార్పల :- మండలంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు హామీలు ఇస్తుండగా, విద్యా సంవత్సరం ముగిసే సరికి పాఠశాల యాజమాన్యాలు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని చెబుతూ ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్న ఘటనలు షరా మామూలుగా మారాయి.ఈ సమస్యను పాత్రికేయులు పలుమార్లు విద్యాధికారుల […] The post హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!……. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 5:11 pm

కవ్వాల టైగర్ జోన్లో 30కి మించి వాహనాలు నడపరాదు..

కవ్వాల టైగర్ జోన్లో 30కి మించి వాహనాలు నడపరాదు.. జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:10 pm

Razor Trailer: Tale Of Fury & Survival

Ravi Babu is coming up with Razor, a film that pushes him into one of the boldest avatars of his career, both as the lead actor and as the creative force behind the camera as a director. Backed by Flying Frogs and presented by Suresh Productions, the team has dropped the theatrical trailer as the […] The post Razor Trailer: Tale Of Fury & Survival appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 5:09 pm

Telangana |మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Telangana | మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:08 pm

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రేమ్ చందు

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:04 pm