SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

UBS Shock: Pawan Kalyan Extra Cautious

Powerstar Pawan Kalyan has completed all his acting assignments. His last release Ustaad Bhagat Singh is a big shock for the actor as the film failed to register decent footfalls. The film has turned out to be a huge shock for the actor-turned-politician and he also received huge criticism for his acting. After the first […] The post UBS Shock: Pawan Kalyan Extra Cautious appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 10:25 am

Male Breast Cancer Often Detected Late, Says Hyderabad Study

Hyderabad, April 14: Male breast cancer, though rare, is frequently diagnosed at an advanced stage, highlighting the urgent need for greater awareness and earlier detection, according to a new study conducted at ESIC Medical College and Hospital, Hyderabad. Published in the Journal of the Association of Physicians of India, the retrospective study analysed 15 male […] The post Male Breast Cancer Often Detected Late, Says Hyderabad Study appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 10:24 am

Telangana RTC Strike From April 22: Govt Seeks Talks, Unions Stand Firm

Hyderabad, April 14: A confrontation is brewing over Telangana RTC after employee unions announced a statewide strike from April 22, while the state government appealed to workers to withdraw the protest and resolve pending issues through talks. According to the Joint Action Committee (JAC) representing RTC employees, the strike call was given after neither the […] The post Telangana RTC Strike From April 22: Govt Seeks Talks, Unions Stand Firm appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 10:22 am

Summer Effect : రెండు తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్.. బయటకు రావద్దండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 10:19 am

తల్లిని సజీవదహనం చేసిన కుమారుడు

అమరావతి: కన్న తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమారుడు ఇల్లును తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఒంగోలులో వెంకటరమణమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తోంది. చిన్నకుమారుడు చెన్నైలో జాబ్ చేస్తుండగా పెద్ద కుమారుడు కిషోర్ బాబు తల్లితో ఉంటూ మాంసం దుకాణం నడుపుతున్నాడు. మంగళవార తెల్లవారుజామున తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమారుడు ఇల్లును తగలబెట్టాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి అతడు పారిపోయాడు. గ్రామస్థులు మంటలను ఆర్పేశాడు. అప్పటికే వెంకటరమణ సజీవదహనమయ్యారు. కిషోర్ బాబు మానసిక స్థితి సరిగా లేదని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 14 Apr 2026 10:16 am

భారీగా పెరిగిన బంగారం, వెండి!

భారీగా పెరిగిన బంగారం, వెండి! ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్

ప్రభ న్యూస్ 14 Apr 2026 10:15 am

బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవు: మమత

కోల్‌కతా: కేంద్ర బలగాలను వాడుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి చూస్తోందని, బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని స్పష్టం చేశారు. ‘టీఎంసీ ఈసారి 226 సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’ అని మమత ధీమా వ్యక్తం చేశారు. బీర్‌భుమ్ జిల్లాలోని సూరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఎన్డీఏ పాలనలో ఉన్న 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి […] The post బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవు: మమత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 10:15 am

అవయవదానంపై అపోహలు తొలగాలి

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రోడ్లపై నిర్దిష్ట 14 కి.మీ దూరంలోని ఆసుపత్రికి 22 నిమిషాల్లో చేరుకుని ఐదుగురు రోగుల ప్రాణాలను కాపాడిన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి అవయవాలను దానం చేస్తుడడం నిత్యం చదువుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ‘అవయవ దానం’కు ప్రాణం పోస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మనిషికి, మరణించిన మనిషి ప్రాణంపోయడం మానవత్వానికి ఉన్న గొప్ప గుణంగా భావించాలి. మరణించిన మనిషి తాలూకూ అవయవాలను నిర్దిష్ట సమయంలో మరో మనిషికి అమర్చడంవల్ల ఓ కొత్త జీవితం అందుతుంది. మరణం అంచున ఉండేవారికి రెండవ జీవితాన్ని ప్రసాదించడం ‘పునర్జన్మ’గానే భావించాలి. ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా అవయవ దానంపై కొంతసానుకూల వాతావరణం ఏర్పడుతోంది. 2013లో అవయవదాతల సంఖ్య 5 వేల లోపు ఉండగా, 2025లో నాలుగు రెట్లు పెరిగి 20 వేలకు చేరింది. దేశవ్యాప్తంగా పన్నెండు వందల కుటుంబాలు అవయవాలు దానం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపారు. అత్యధిక అవయవదానం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువ కావడం విశేషం. మధుమేహం, అధిక రక్తపోటు తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కిడ్నీ, కాలేయం, గుండె తదితర వ్యాధులకు గురవుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. సరిపడ అవయవాల లభ్యత లేనందువల్ల ఏటా అయిదు లక్షలమంది నిస్సహాయస్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. మనిషి జీవించినప్పుడు రక్తదానంతో పాటు కిడ్నీ, కాలేయం, గర్భాశయం, గర్భధారణ కణజాలం దానం చేయవచ్చు. బ్రెయిన్‌డెడ్ అయితే మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, గుండె కవాటాలు, పేగులు, క్లోమం, కార్నియా ఇతరులకు ఉపయోగపడుతాయి. గుండె ఆగి మరణించిన వారైతే కళ్లు, చర్మం, గుండె, కవాటాలు, ఎముకలు వంటి కణజాలాలు వంటి అవయవాలు మాత్రమే కాకుండా, మొత్తం శరీరాన్ని కూడా దానం చేయవచ్చు. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను నిర్దేశిత సమయాల్లో అవసరమైన వారికి అమర్చాలి. ఆలస్యమైతే అవి పాడైపోయే ప్రమాదముంది. ఒక దాత ఎనిమిదిమంది ప్రాణాలను కాపాడటానికి ఆస్కారముంది. అలాగే సహజ మరణం చెందిన కొద్ది నిమిషాల్లో కళ్లు. కణజాలం (టిష్యూ) సేకరించవచ్చు. కానీ, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపోహల వల్ల అవయవదానం చేస్తున్నవారి సంఖ్య ఆశించినమేరకు పెరగడం లేదు. 2023లో పదివేల మంది మహిళలు జీవించి ఉండగానే అవయవదానం పత్రాలమీద సంతకం చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక తెలిపింది. పురుషులతో పోల్చితే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు. దేశవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఒకటిన్నర లక్షల మందికిపైగా మరణిస్తున్నారు. సంబంధిత కుటుంబాలకు నచ్చజెప్పి మృతుల్లో కొందరి అవయవాలను మార్పిడి చేసినా అభాగ్యులెందరికో కొత్త ఊపిరి అందుతుంది. కానీ, బ్రెయిన్‌డెడ్ కేసులను సత్వరం గుర్తించడంతోపాటు వారి కుటుంబ సభ్యులను ఒప్పించడంలో నిర్లక్ష్యం నెలకొంటోంది. అవయవ దానం చేసేందుకు ఎవరైనా ముందుకు రావచ్చు. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి అవయవదానం కోసం తమ పేరును నమోదు చేసుకోవచ్చు. 18 ఏళ్లలోపు ఉండేవారు తమ అవయవాలను దానం చేయడానికి అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి ఉండాలి. మరణానంతరం అవయవ దానం కోసం నమోదు చేసుకుంటే, ముందుగా ఆ వ్యక్తిని వైద్యులు తనిఖీ చేస్తారు. ఆ వ్యక్తికి ఉన్న అనారోగ్య సమస్యలను అంచనా వేసి ఏ అవయవాలను దానం చేయవచ్చో తెలియజేస్తారు. తీవ్ర ప్రమాదం లేదా ఏదైనా వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లి, మళ్లీ స్పృహలోకి రాలేని పరిస్థితిలో ఉన్న బాధితుడిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారిస్తారు. ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో వారి గుండె ఇంకా కొట్టుకుంటూ, ఇతర ముఖ్య అవయవాలు మాత్రం కొన్ని గంటలపాటు పనిచేస్తూనే ఉంటాయి. వీటిని కుటుంబ సభ్యుల అనుమతితో సేకరించి, బ్లడ్‌గ్రూప్ తదితర అంశాలు సరిపోలిన వారికి నిర్దేశిత సమయంలో అమర్చుతారు. బ్రెయిన్‌డెడ్‌గా ధ్రువీకరించడానికి ఒకరి కంటే ఎక్కువ మంది వైద్యనిపుణులతో కూడిన బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అవయవాల సేకరణ, నిల్వ, తరలింపు, వాణిజ్యపరంగా వాటి దుర్వినియోగం వంటివాటిని నియంత్రించడానికి 1994లో మానవ అవయవాలు, కణాల మార్పిడి చట్టం తీసుకువచ్చింది. 2011లో దీనికి సవరణలు చేశారు. అవయవాల సేకరణ, కేటాయింపు, తరలింపును జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌ఒటిటిఒ) పర్యవేక్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానానికి ‘జీవన్‌దాన్’ ఎంతగానో కృషి చేస్తొంది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలూ పాటుపడుతున్నాయి. మరణించిన వ్యక్తుల అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు 2019లో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈమేరకు అవయవాల అందుబాటును పెంచాలనేది జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమ ఉద్దేశం. జాతీయ, ప్రాంతీయ, రాష్ర్ట స్థాయి అవయవ, కణజాల మార్పిడి సంస్థలు అవయవాల సేకరణ, పంపిణీకి సంబంధించిన సమన్వయ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాయి. అవయవాలను అత్యంత తక్కువ సమయంలో సురక్షితంగా అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈమేరకు ప్రజలు వెబ్‌సైట్ ద్వారా అవయవ దానానికి ‘ఎన్‌ఒటిటిఒ’ను తీసుకొచ్చింది. దాత నుంచి సేకరించే అవయవాలను గ్రహీత ఉండే ఆస్పత్రికి చేర్చే ప్రక్రియలో అంబులెన్సులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా గ్రీన్‌కారిడార్ పేరిట ప్రత్యేక మార్గాన్ని కల్పించారు. అంతేకాకుండా ‘ఒకే దేశం ఒకే విధానం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీంతో భారతీయులంతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 65 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని తొలగించడం వల్ల ఎవరైనా, ఎక్కడైనా గ్రహీతలుగా అర్హులే. ఈ నేపథ్యంలో అవయవ దానంపైన ప్రచారోద్యమం ముమ్మరంగా సాగాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విదార్థులకు అవయవదానంపై అవగాహన కల్పించాలి. ఎవరికైనా అపోహలుంటే తొలగించాలి. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా వేదికల ద్వారా ప్రచారం పెంచాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలి. - కోడం పవన్‌కుమార్ - 9848992825

మన తెలంగాణ 14 Apr 2026 10:11 am

పోలీసులకు స్పెషల్ లీవ్స్.. ఏపీ డీజీపీ కీలక ఉత్తర్వులు

పోలీసులకు స్పెషల్ లీవ్స్.. ఏపీ డీజీపీ కీలక ఉత్తర్వులు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 14 Apr 2026 10:09 am

Nara Lokesh : నేడు, రేపు మంత్రి తిరుపతిలో పర్యటన

తిరుపతిలో ఈరోజు, రేపు మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 14 Apr 2026 10:06 am

బుమ్రా అందుకే బౌలింగ్ చేయలేకపోతున్నాడు: ఫాప్ డుప్లెసిస్

ముంబై: సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, అందుకే ఈ ఐపిఎల్ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేక పోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాప్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో బుమ్రా ఇప్పటి వరకు ఒక్క వికెట్ తీయలేక పోయిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై విమర్శలు వెత్తుతున్నాయి. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బుమ్రా వేసిన తొలి బంతికే కళ్లు చెదిరే సిక్సర్ కొట్టిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి బుమ్రా ఎంత ఒత్తిడిలో ఉన్నాడో అర్థమవుతుందన్నాడు. ఇక ముంబై కూడా బుమ్రాపై ఎక్కువగా ఆధారపడ కూడదన్నాడు. కీలకమైన మ్యాచుల్లో మాత్రమే అతన్ని ఆడించాలన్నాడు. అప్పుడే అతను ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహాజసిద్ధ బౌలింగ్‌ను చేసే అవకాశం ఉంటుందని డుప్లెసిస్ పేర్కొన్నాడు.

మన తెలంగాణ 14 Apr 2026 10:02 am

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణంలోని

ప్రభ న్యూస్ 14 Apr 2026 10:00 am

Andhra Pradesh : నేటి నుంచి చేపల వేట నిషేధం

సముద్రంలో చేపలవేటను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 9:57 am

భక్తులకు కాషాయ టీ షర్ట్ ల పంపిణీ

భక్తులకు కాషాయ టీ షర్ట్ ల పంపిణీ మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్

ప్రభ న్యూస్ 14 Apr 2026 9:55 am

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తా..

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తా.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి,

ప్రభ న్యూస్ 14 Apr 2026 9:50 am

వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్‌ఎస్ పంపిణీ

భీమదేవరపల్లి:ఏప్రిల్ 14 (జనం సాక్షి)వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ సూచించారు. …

జనం సాక్షి 14 Apr 2026 9:49 am

ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి‌‌ – డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద

ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి‌‌ – డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద చౌటుప్పల్,

ప్రభ న్యూస్ 14 Apr 2026 9:46 am

రెండవ పాట వచ్చేస్తోంది

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘సుర సుర...’ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ’సుర సుర’ పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌లతో ఈ పాట సినిమాలో ఒక మెయిన్ హైలెట్ గా నిలవనుంది. ఈ పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, అభే అందించగా, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత జోష్ తీసుకురానుంది. అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు ఈ పాటకు గాత్రం అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం వేడుకలు, సంప్రదాయం, కలిసికట్టుగా ఉండే ఆనందాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగి రెడ్డి ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బి.ఎస్. అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ‘నాగబంధం’ చిత్రం జూలై 3న విడుదల కానుంది.

మన తెలంగాణ 14 Apr 2026 9:41 am

Crucial Meetings in Tollywood: Exhibitors Vs Producers

The tussle between the producers and exhibitors of Telugu cinema happened several times in the past. The Telangana exhibitors have been demanding a percentage system and they have released a statement about the implementation. Soon all the Active Producers who are busy producing big-budget films made it clear that they are against the percentage system. […] The post Crucial Meetings in Tollywood: Exhibitors Vs Producers appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 9:41 am

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ రైల్వే జీఆర్పీ

ప్రభ న్యూస్ 14 Apr 2026 9:35 am

భావోద్వేగపూరిత కథనం, గొప్ప యాక్షన్‌తో ‘భరతవర్ష’

హీరో టి.గోపీచంద్.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ డ్రామా ‘గోపీచంద్33’తో తన కెరీర్‌లో ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో, పవన్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, గోపీచంద్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్, శూల భూమిలో ప్రారంభమై, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేసింది. భారీ యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఆరితేరిన యోధు ల క్లోజప్‌లు, కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు కనువిందు చేసే విజువల్ ఫీస్ట్ ని అందించాయి. భరత భూమికి (భారతదేశానికి) ప్రతీకగా నిలిచే ’భరత వర్ష’ టైటిల్ తెలియజేయ డం పవర్‌ఫుల్‌గా ఉంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన విజన్ ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ, భారత చరిత్రలో ఎక్కువగా పరిశీలించని ఒక అధ్యాయాన్ని గొప్పగా ఆవిష్కరించారు. భారీ స్థాయి, భావోద్వేగపూరిత కథనం, గొప్ప యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. హీరో గోపీచంద్ ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఆయన ఫిజిక్, నటన అన్నీ క లిసి పాత్రను ఎంతో నిజాయితీగా కనిపించేలా చే శాయి. ఇది ఆయన గత చిత్రాల నుండి పూర్తిగా భిన్నమైన పాత్రగా నిలుస్తోంది. హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివ రి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా కొనసాగుతోంది. భరత వర్ష భారతీయ సినిమాల్లో గుర్తుండిపోయే హిస్టారికల్ డ్రామాగా నిలవబోతోంది. 

మన తెలంగాణ 14 Apr 2026 9:31 am

పేదల సంక్షేమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం –దాసరి శ్రీహరి గౌడ్

పేదల సంక్షేమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – దాసరి శ్రీహరి గౌడ్ చిట్యాల,

ప్రభ న్యూస్ 14 Apr 2026 9:23 am

విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

ఎన్టీఆర్ ‘దేవర’తో సంచలనం సృష్టించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్ బ్యానర్ మరో భారీ సినిమాను రూపొందించటానికి సిద్ధమైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతానికి యువ సుధ ఆర్ట్ ప్రొడక్షన్ నెం.3 అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించటంతో పాటు సమర్పకుడిగానూ వ్యవరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి, స్క్రిప్ట్‌ను అందించారు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు రజత్ దర్శకత్వం వహిస్తున్నారు. 

మన తెలంగాణ 14 Apr 2026 9:21 am

Vaibhav Sooryavanshi’s Impact Role Debate After First IPL 2026 Failure

Young sensation Vaibhav Sooryavanshi has taken IPL 2026 by storm with fearless batting, but his role as an impact player has now become a talking point after his first failure in this season. The 15-year-old player has been used only as a batter in recent matches for the Rajasthan Royals, staying off the field during […] The post Vaibhav Sooryavanshi’s Impact Role Debate After First IPL 2026 Failure appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 9:19 am

కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశా.. కో ఆప్షన్ పదవి ఇవ్వండి

కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశా.. కో ఆప్షన్ పదవి ఇవ్వండి మోత్కూర్,

ప్రభ న్యూస్ 14 Apr 2026 9:16 am

Tirumala : తిరుమలకు నేడు వెళుతున్న వారికి హై అలెర్ట్

తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 9:14 am

ఇంటర్ పరీక్షలలో ఫెయిల్... ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య

హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత మూడు రోజుల నుంచి13 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎన్.జీ. హంక్రాన్ గ్రామంలో రమేష్(17), నాగల్‌గిద్ద మండలం కారముంగి గ్రామానికి చెందిన నందిని(17), నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన మణివర్ధన్, సిద్దిపేట జిల్లా రంగనాయకపురం గ్రామానికి చెందిన పొట్ల ప్రత్యూష(17), నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో భూక్యా ఆకాష్(18) అనే విద్యార్థులు బలవన్మరణం చెందారు.  సోమవారం హైదరాబాద్ లోని వారసిగూడలో కళ్యాణి(16), మేడ్చల్ జిల్లాలోని నాచారంలో లక్ష్య(16), మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో సాయిరాం(16), ఉట్నూర్ గ్రామంలో సౌజన్య(17), భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో శ్రావణి(17), సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో సౌజన్య(17), రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ గ్రామంలో అభియాదవ్ అనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 

మన తెలంగాణ 14 Apr 2026 9:10 am

గొర్రెలుగా కాదు… సింహాలుగా జీవించండి

గొర్రెలుగా కాదు… సింహాలుగా జీవించండి స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గొర్రెలుగా కాదు..

ప్రభ న్యూస్ 14 Apr 2026 9:02 am

Petrol Prices : భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగనున్నాయా? ఎప్పటి నుంచి అంటే?

భారత్ లోనూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలను కొట్టి పారేయలేం

తెలుగు పోస్ట్ 14 Apr 2026 8:59 am

హెల్మెట్ తప్పనిసరి… ఎస్సై రాజు

అరైవ్ అలైవ్ ప్రచారానికి ప్రజల మద్దతు భీమదేవరపల్లి:ఏప్రిల్ 13 (జనం సాక్షి) రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ …

జనం సాక్షి 14 Apr 2026 8:51 am

సంగారెడ్డిలో పిఎస్ లో ఎఎస్ఐని ఢీకొట్టిన పోలీస్ వాహనం... హత్యా?

సంగారెడ్డి:  పోలీస్ వాహనం ఢీకొని ఎఎస్ఐ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మనూరు పోలీస్ స్టేషన్ లో గోవింద్ నాయాక్ అనే వ్యక్తి ఎఎస్ఐగా పని చేస్తున్నాడు.  పోలీస్ వాహనం అదుపుతప్పి గోవింద్ పైకి దూసుకెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోవింద్ దుర్మరణం చెందాడు. పోలీస్ వాహనం డ్రైవర్ రామారావు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలపిారు. నిందితుడి కక్షపూరితంగానే హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 14 Apr 2026 8:49 am

స్ఫూర్తి ప్రదాత.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

స్ఫూర్తి ప్రదాత.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వైరా, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ

ప్రభ న్యూస్ 14 Apr 2026 8:48 am

Amravathi : ఊపందుకున్న అమరావతి పనులు.. మరిన్ని నిధులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఒక కీలకమైన ఆర్థిక ముందడుగు పడింది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 8:48 am

చేతన్ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న యోగాజి అనే పేద వ్యక్తికి ఆర్థిక సహయం …డాక్టర్ హకీమ్

జనం సాక్షి.నిజమాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామానికి చెందిన ఆదిల్ అన్సార్ చదువులో మంచి ప్రతి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నిజామాబాద్ లోని …

జనం సాక్షి 14 Apr 2026 8:47 am

100%increased |ఎండల ఎఫెక్ట్ తో బీరు అమ్మకాల జోరు లిక్కర్‌ బేజారు..

100%increased | ఎండల ఎఫెక్ట్ తో బీరు అమ్మకాల జోరు లిక్కర్‌ బేజారు..

ప్రభ న్యూస్ 14 Apr 2026 8:41 am

జనసైనికుల ఆత్మీయ సమావేశం

జనసైనికుల ఆత్మీయ సమావేశం చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 14 Apr 2026 8:38 am

హర్మూజ్ వద్ద భారతీయ నౌకలు

హర్మూజ్‌ దగ్గరే నిలిచిపోయిన పదిహేను భారతీయ నౌకలు నిలిచిపోయాయి.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 8:35 am

Vijay’s Promise for Jana Nayagan Producers

KVN Productions, the makers of Jana Nayagan have spent lavishly on the film and there is a big bet involved. The real struggles started after the film’s release was pushed from Sankranthi 2026. The censor issues are cleared recently and the makers are now waiting for the Censor Certificate. The entire film was leaked recently […] The post Vijay’s Promise for Jana Nayagan Producers appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 8:28 am

Andhra Pradesh : క్వాంటం విప్లవానికి ఆంధ్రప్రదేశ్ పునాది

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 8:22 am

14thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

14thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 14thAprilCartoon |మహిళా బిల్లుతో కొత్త

ప్రభ న్యూస్ 14 Apr 2026 8:11 am

Kavya Maran : కావ్య ఫీలింగ్స్ చూశారా.. ఒక కెమెరా ఆమె పైనే ఉందిగా

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ వికెట్లు టపా టపా పడుతుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి

తెలుగు పోస్ట్ 14 Apr 2026 7:56 am

వివాహేతర సంబంధం... వేధింపులు తట్టుకోలేక జిమట్రైనర్ ఆత్మహత్య

బెంగళూరు: ఓ వివాహిత వేధింపులకు గురి చేయడంతో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు ప్రాంతంలోని నెలమంగలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వాహరహళ్లి ప్రాంతంలో దిలీప్ అనే వ్యక్త జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. ఓ వివాహిత జిమ్‌లో జాయిన్ కావడంతో ఆమెకు దిలీప్ ట్రైనర్‌గా ఉన్నాడు. దీంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఇరువర్గాలకు రాజీ కుదిర్చి పంపించారు. దీంతో ఆమెను దిలీప్ దూరం పెట్టాడు. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు మహిళ సహజీవనం చేయాలని వేధించడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని దిలీప్ తండ్రి రమేశ్ ఆరోపణలు చేశాడు. 

మన తెలంగాణ 14 Apr 2026 7:52 am

జెసి దివాకర్ రెడ్డి చింత తోటకు నిప్పుపెట్టిన దుండగులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని జూటూరు గ్రామంలో మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డికి చెందిన చింత చెట్ల తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తొట కాపలాదారులు చెప్పిన వివరాల ప్రకారం..... జెసి దివాకర్ 60 ఎకరాలలో చింత చెట్లను పెంచుతున్నారు. బిందు సేద్యం ద్వారా చింత చెట్లకు నీళ్లు పోసి కాపాడుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొటకు నిప్పు పెట్టారు. దీంతో 30 ఎకరాలలో చింత చెట్లు కాలిపోవడంతో పాటు బిందు సేద్యం పరికారాలు కాలి బూడిదగా మారాయి. జెసి దివాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదు లక్షల మేరు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. జెసి దివాకర్ రెడ్డి ప్రత్యర్థి వర్గం వారు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మన తెలంగాణ 14 Apr 2026 7:47 am

IPL 2026 : రాజస్థాన్ కు తొలి షాక్ ఇచ్చిన హైదరాబాద్.. అద్గదీ దెబ్బంటే?

రాజస్థాన్ రాయల్స్ జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుమట్టి కరిపించింది.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 7:41 am

America - Iran - War : ఆరు వారాల యుద్ధానికి ముగింపు ఒప్పందానికి సిద్ధం కావాల్సిందే

ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా సైన్యం ఇరాన్ పోర్టులపై దిగ్బంధం ప్రారంభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు

తెలుగు పోస్ట్ 14 Apr 2026 7:25 am

పొగాకు రంగంలో ప్రపంచ మార్పులు: భారత ఎగుమతులకు కొత్త సవాళ్లు

పొగాకు రంగంలో ప్రపంచ మార్పులు: భారత ఎగుమతులకు కొత్త సవాళ్లు ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:10 am

తుని నుండి గుంటూరుకు అక్రమ రవాణా

తుని నుండి గుంటూరుకు అక్రమ రవాణా మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:56 am

మానవ సమాజపు ఆత్మీయబంధమే చాగంటి రామలింగేశ్వరరావు.

మానవ సమాజపు ఆత్మీయబంధమే చాగంటి రామలింగేశ్వరరావు. వీడ్కోలు వేడుకలో కుమార్ చొరవకు పురాణపండ

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:48 am

14thAprilchintana |ధైర్యం, ఆత్మవిశ్వాసం ద్వారా విజయ మార్గం

14thAprilchintana | ధైర్యం, ఆత్మవిశ్వాసం ద్వారా విజయ మార్గం 14thAprilchintana | భయం

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:39 am

14thaprileditorial |ట్రంప్ చర్యలు.. ప్రపంచ ఆందోళనలు

14thaprileditorial | ట్రంప్ చర్యలు.. ప్రపంచ ఆందోళనలు 14thaprileditorial | ఇరాన్‌పై దాడులు:

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:21 am

14thApril2026 |మంగళవారం నేటి పంచాంగం

14thApril2026 | మంగళవారం నేటి పంచాంగం 14thApril2026 | రోజు విశేషాలు మరియు

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:08 am

డీలిమిటేషన్‌కు హైబ్రిడ్ ఫార్ములా

మన తెలంగాణ/హైదరాబాద్: హైబ్రిడ్ ప్రాతిపదికన సీట్లు పెంచాలన్నదే తమ డిమాండ్ సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలను గౌరవించాలని ఆయన కోరారు. కొత్తగా వచ్చే 272 సీట్లలో 50 శాతం జీడిపి ప్రాతిపదికగా తీసుకోవాలని, మరో 136 సీట్లను జనాభా ప్రాతిపదికగా పెంచాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేలా గతంలో సీట్ల కేటాయింపు జరిగిందని ఆయన తెలిపారు. మొదటగా మహిళా బిల్లు ఆమోదించి తర్వాతే డీలిమిటేషన్‌పై చర్చ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అనేవి దేశ ప్రజలకు సంబంధించిన అంశాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ, బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ను కలిపి తీసుకురావడం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అన్నారు. సీట్ల పునర్విభజనలో పర్సంటేజీలు కాదు నెంబర్ ముఖ్యమని, రాజకీయాల్లో నెంబర్ ముఖ్యమని, వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయిందని నెంబర్ లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు చేయరని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీట్ల పెంపు తర్వాత దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు 195 అవుతాయని, సీట్ల పెంపు తర్వాత ఉత్తరాదిలో  సీట్లు 620కి పెరుగుతాయని, ఉత్తరాది, దక్షిణాది మధ్య ప్రస్తుతం 412 సీట్ల గ్యాప్ ఉందని, అది రానున్న రోజుల్లో 620 సీట్ల గ్యాప్‌నకు పెరుగుతుందని, అప్పుడు ఉత్తరాదికి 208 సీట్లు అదనంగా వస్తాయని సిఎం రేవంత్ వివరించారు. ప్రస్తుతం 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపికి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమేనని, కానీ యాభై శాతం పెంచితే ఈ రెండు రాష్ట్రాల మధ్య 90 సీట్ల గ్యాప్ పెరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గింది ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని కీలకశాఖల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బిజెపి వెళుతోందని ఆయన వివర్శించారు. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి పన్నులు కట్టడం, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి అన్నట్లుగా ఉందని, పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి అనే విధానానికి తాము వ్యతిరేకమని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే, దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయాన్ని, జీఎస్‌డిపిని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశ మనుగడకే ప్రమాదకరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెంచాలనుకుంటున్న 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధిరేటు ఆధారంగా కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో మాత్రం తొందరపాటు వద్దని సూచించారు. దీనికి 2028 వరకు సమయం ఉన్నందున, హడావిడి చేయకుండా అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కావాలనే ఈ రెండు అంశాలను కలిపి బిజెపి రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు రెండూ కీలక అంశాలని ఆయన చెప్పారు. దేశ ప్రజలందరికీ సంబంధించి ఈ రెండూ కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందన్నారు. మహిళలకు ఓటు హక్కు సహా సమాన హక్కులను కల్పించింది కాంగ్రెస్ అని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కావాలని, కుట్రపూరితంగా దేశ వ్యాప్తంగా కేంద్రం హడావిడి చేస్తోందని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు 33 శాతం మహిళా రిజర్వేషన్‌లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పాత జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండింటిని కలిపి 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేయా లని కేంద్రం చూస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను చేయాలన్నదే తమ డిమాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2026 వరకు సీట్ల పెంపు వద్దని 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని ఆయన గుర్తు చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, మహిళా రిజర్వేషన్లను ఆర్నెళ్లలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దని ఆయన కోరారు. ప్రమాదకర దిశలో డీలిమిటేషన్ ప్రమాదకర దిశలో డీలిమిటేషన్ వెళుతోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రను మోడీ చేస్తున్నారని, కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయని, ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ సరిగా జరగకపోవటంతో జనాభా విపరీతంగా పెరిగిందని ఆయన ఆరోపించారు. జనాభా అంతరం వల్లనే నియోజకవర్గాల పెంపును కేంద్రం గతంలో వాయిదా వేసిందని, జనాభా ప్రాతిపదికన చేస్తే చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వద్దని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా చెప్పాయని, దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత వల్ల మోడీ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారని, ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామని మోడీ చెబుతున్నారని ఆయన తెలిపారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీట్లు భారీగా పెరగనున్నాయని, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని పార్టీలకు, సిఎంలకు లేఖలు రాస్తా డీలిమిటేషన్ అన్యాయంపై అన్ని పార్టీలకు, సిఎంలకు లేఖలు రాస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడి పెట్టొద్దని, సీట్లు పెంచాలనుకుంటే అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఏ ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు?. సీట్లు 50 శాతం పెంచాలని మోడీకి ఏ దేవుడు చెప్పాడు, 50 శాతం సీట్లు పెంచితే ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ శాసనసభల్లోనూ చర్చ జరగాలని, డీలిమిటేషన్‌పై ఒక కమిటీ వేసి ప్రజాసంఘాల అభిప్రాయాలు కూడా సేకరించాలని ఆయన సూచించారు. 2026లో జనగణన పూర్తి చేసి సమగ్ర చర్చ తర్వాత సీట్ల పెంపు చేయాలని, నియోజకవర్గాల పెంపునకు 2028 వరకు గడువు ఉందని, అప్పటివరకు ఎక్స్‌పర్ట్ కమిటీని వేయాలని, అసెంబ్లీ అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన వివరించారు. వివక్ష వల్ల భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలు, ఉద్యమాలకు 1967లో 520గా ఉన్న లోక్‌సభ స్థానాలను, 1976లో ఇందిరాగాంధీ 542కు పెంచారని సిక్కిం చేరికతో అది 543కు చేరిందని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సీట్లు తగ్గడం వల్ల రాజకీయంగా బలహీనవర్గాలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచేలా కేంద్రం వ్యవహారించవద్దని ఆయన హితవు పలికారు. బిజెపి నేతలు ముఖ్యంగా ఎంపి లక్ష్మణ్ వంటి వారు యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం వల్ల ఆ ప్రాంత ప్రమోజనాల కోసం దక్షిణాదికి ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వివక్ష వల్ల భవిష్యత్‌లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలకు, ఉద్యమాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు బిజెపి అధ్యక్షురాలిగా ఒక్క మహిళను నియమించలేదు 60 ఏళ్లలో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 46 ఏళ్లలో ఒక్క మహిళ ను పార్టీ అధ్యక్షురాలిగా బిజెపి చేయలేదని, కనీసం జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మహిళలను చిన్న చూపు చూడటమే బిజెపి లక్షణమని, ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళలను చూస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన బిజెపి పార్టీ ఏర్పాటైంది, ఇప్పటి వరకు 15 మంది బిజెపి అధ్యక్షుల నియామకం జరిగింది, కానీ, ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియామించలేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేస్తుందా..? బిజెపికి మహిళా నాయకురాలిని అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పునర్విభజనపై పోరాడుతాం బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మా ఎంపిలు తెలంగాణను సాధించారని, ఇప్పుడు పునర్విభజనపై పోరాడుతారని ఆయన తెలిపారు. దక్షణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తామని, పార్లమెంట్ లో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్‌దేనని, యాభై శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు మోడీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుందని, వాళ్ల అవసరం ఇక ముందు ఉండదని, అన్ని దక్షణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపైన లేఖ రాస్తానని ఆయన తెలిపారు. 2001లో వాజ్‌పేయి పునర్విభజనపై చట్ట సవరణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 181 మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యే వారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2001 లో వాజ్ పేయి పునర్విభజనపైన చట్ట సవరణ చేశారని, దాని వల్ల 2009 లో తెలంగాణకు 17 ఎంపి సీట్లు, ఆంధ్రాకు 25 ఎంపి సీట్లు వచ్చాయన్నారు. తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు, ఎపికి 175 శాసనసభ సీట్లు వచ్చాయన్నారు.

మన తెలంగాణ 14 Apr 2026 6:00 am

డీలిమిటేషన్‌పై సిఎంకు అవగాహన లేదు

మన తెలంగాణ/హైదరాబాద్: డీ-లిమిటేషన్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించగా, డీ-లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం ఏమిటీ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన విమర్శలపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులిరువురూ వేర్వేరుగా ధ్వజమెత్తారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై ముఖ్యమంత్రి అపోహలు సృష్టిస్తున్నారని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని మహిళల గౌరవాన్ని పెంచే చారిత్రక నిర్ణయం అని ఆయన తెలిపారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ నిర్ణయాన్ని రాజకీయంగా చూడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టిందని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు దీనిపై రాజకీయాలు చేయకుండా, దేశంలోని 70 కోట్ల మహిళల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలు కావని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం డీలిమిటేషన్ అవసరం ఉంటుందని చెప్పారు. దీనికి సమయం పడుతుందని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం తీసుకుంటుందని ఆయన వివరించారు. అందువల్ల అపోహలు సృష్టించకుండా, ప్రజలకు అసలైన సమాచారం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సిఎం వాదనలో శాస్త్రీయత లేదు: బండి సంజయ్ డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న వాదనలో శాస్త్రీయత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ విమర్శించారు. అత్యధిక ఆదాయం ఇచ్చిన వాళ్లకు మా త్రమే సీట్లు, ఓట్లు ఇవ్వాలని చెబుతారా? మీరు చెప్పిన ప్రాతిపదిక ప్రకారం, అత్యధిక ఆదాయం ఇస్తున్న హైదరాబాద్‌కు మాత్రమే అత్యధిక సీట్లు, ఓట్లు ఇవ్వాలా? అని ఆయన ప్రశ్నించారు. మీరు పుట్టి పెరిగిన పాలమూరుకు, వెనుకబడిన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు మూటలు పంపి డబ్బు ప్రాతిపదికనే సిద్దాంతాలు రచిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం ఇదేనా?, ఆర్ధికంగా బలంగా ఉన్న వాళ్లకు సగం, జనాభా ప్రాతిపదికన మిగిలిన ప్రజలకు సగం సీట్లు ఇవ్వాలని చెబుతారా? అని ఆయన ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికి ఉంటే కాంగ్రెస్‌ను దేశం నుంచి బహిష్కరించాలని రాజ్యాంగంలో పొందుపరిచే వారన్నారు. నేను రేవంత్‌రెడ్డిలా అవకాశవాదిని కాదు తాను ఉత్తర భారత దేశానికి వలస వెళతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. వలసపోవడానికి తాను అవకాశవాదిని కాదని, రేవంత్‌రెడ్డిని అంతకంటే కాదని ఆయన విమర్శించారు. తాను చచ్చినా బతికినా బిజెపిలోనే ఉంటానని ఆయన తెలిపారు. తాను చనిపోతే తన శవంపై కప్పేది కాషాయ జెం డానే అని ఆయన తెలిపారు. ఆ సన్నివేశం చూడడానికైనా రేవంత్‌రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తాను చచ్చినా, బతికినా, ఓడినా, గెలిచినా కేరాఫ్ అడ్రస్ కరీంనగరేనని ఆయన చెప్పారు. తన రక్తంలోనే జాతీయవాదమనే డీఎన్‌ఏ ఉందన్నారు. వలసవాది, అవకాశవాదానికి ప్రతిరూపం రేవంత్‌రెడ్డి అని ఆయన విమర్శించారు. పాలమూరు నుంచి మల్కాజ్‌గిరి దాకా వలస పోయిం ది రేవంత్‌రెడ్డేనని ఆయన ధ్వజమెత్తారు. మహిళా బిల్లును వ్య తిరేకించే మీరు కూడా తమను విమర్శిస్తారా? అని ఆయన ప్ర శ్నించారు. మీరు నిజంగా మహిళా రిజర్వేషన్లకు సానుకూలమైతే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అమలు చేయలేద ని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో దాదాపు 30 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్లను ఎం దుకు అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి ప్రశ్నించారు.

మన తెలంగాణ 14 Apr 2026 5:30 am

హైడ్రాకు కళ్లెం

మన తెలంగాణ/హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. కూల్చివేతలపై హైడ్రాకు సరైన ప్రామా ణికత లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నోటీ సులు ఇవ్వకుం డానే కూల్చివేతలు చేపడు తున్నారని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ హైడ్రా కూల్చి వేతలపై షరీఫ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అమీన్‌పూర్ కూల్చివేతల వీడియోలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రవిచందర్ వాదించారు. వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకు యత్నించారని, అనుమతి లేకుండా భవనాలు నిర్మిం చారని ఎఎజి ఇమ్రాన్ ఖాన్ తన వాదనను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి కూల్చి వేతలు చేపట్టరాదని స్పష్టపరుస్తూనే.. చెరువులు, పార్కులు, రహదా రులు ఆక్రమిస్తే నిబంధనల మేరకు మాత్రమే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

మన తెలంగాణ 14 Apr 2026 4:30 am

నిధుల కోసం కాళ్లు మొక్కాలా..

మన తెలంగాణ/బాన్సువాడ: కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రగిలిపోతున్నారు. ఆయన తన నియోజకవర్గంలో జరుగుతున్న పనులకు నిధుల మంజూరు చేసే విషయంలో లోలోపల మదన పడుతున్నారు. ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని పరిశీలించడానికి ఆయన ప్రాజెక్టు సైట్‌కి వెళ్లారు. పనుల్లో పురోగతి లేకపోవడంతో తీరా అసహనానికి గురయ్యారు. ఈ వయసులో తాను నిధులు మంజూరు చేయాలని ‘కాళ్లు మొక్కాల’ అని, టీఆర్‌ఎస్ హయాంలో కూర్చుంటే జీవోలు వచ్చాయని, సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్  జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్యాహం నుంచి రాత్రి 10 గంటల వరకు బైటాయించారు. మంత్రుల మీద హాట్ కామెంట్స్ చేశారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్‌లు చేసినా లేపడం లేదని, సీఎంకు 20 సార్లు ఫోన్‌చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక పనులు ఆగిపోతున్నాయని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఇప్పటివరకు నేనెప్పుడూ చూడలేదన్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటోనని ప్రశ్నించారు. పైస్థాయి అధికారులు పోచారంను రెండు రోజులు వేచిచూద్దామని రిక్వెస్ట్ చేయడంతో పోచారం ఇంటికి వెళ్లారు.

మన తెలంగాణ 14 Apr 2026 4:00 am

రేపటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ - తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం(ఏప్రిల్ 15) నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ వి.బాలకిష్టారెడ్డి దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు ఇ.పురుషోత్తం, ఎస్‌కె మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, డిగ్రీ ప్రవేశాలకు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మొదటి విడత దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని అన్నారు. మొదటి వెబ్ ఆప్షన్ల  నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మే 14న తొలి విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈసారి డిగ్రీలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. కొత్త కోర్సుల ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 30 నాటికి దోస్త్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, విద్యార్థులు కొత్త కోర్సులకు కూడా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మూడు విడతల్లో దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రూ400 రిజిస్ట్రేషన్ ఫీజుతో మే 15 నుంచి రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే మే 31 నుంచి మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి జూన్ 27 వరకు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూన్ 29, 30 తేదీలలో డిగ్రీ ఓరియెంటేషన్ తరగతులు ఉంటాయని, జులై 1 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో దోస్త్ పరిధిలో 969 డిగ్రీ కాలేజీల్లో 4,40,107 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.గత ఏడాది 2,05,140 సీట్లు భర్తీ కాగా, 54 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయనని చెప్పారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జెఎన్‌టియుహెచ్, తెలంగాణ మహిళా యూనివర్సిటీ, జెఎన్‌టియుహెచ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గతంలో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న సమయంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే మళ్లీ మొదటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చేదని అన్నారు. ఈసారి ఆ సమస్య తలెత్తకుండా ట్యాబ్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఏదైనా కారణంతో రిజిస్ట్రేషన్ మధ్యలో అంతరాయం ఏర్పడినా ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇదీ దోస్త్ షెడ్యూల్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు రూ.200 ఫీజుతో మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు -ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం మే 14వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు మే 15 నుంచి 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం మే 15 నుంచి 25 వరకు రూ.400 ఫీజుతో రెండవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి 26 వరకు రెండవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం మే 30వ తేదీన రెండవ విడత డిగ్రీ సీట్ల కేటాయింపు మే 31 నుంచి జూన్ 5 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం మే 31 నుంచి జూన్ 16 వరకు మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 31 నుంచి జూన్ 26 వరకు మూడవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం జూన్ 16వ తేదీన మూడవ విడత సీట్ల కేటాయింపు జూన్ 20 నుంచి 25 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం జూన్ 20 నుంచి 27 వరకు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి -జూన్ 29,30 తేదీలలో విద్యార్థులకు కళాశాలల్లో ఒరియెంటేషన్ ఉంటుంది. జులై 1 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం వాట్సాప్‌లో దోస్త్ సేవలు దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200 ద్వారా వాట్సాప్ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్‌కు ‘Hi’ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుంది. అందులో విద్యార్థులు తమ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు కోరితే వారి వాట్సాప్ నెంబర్‌కు ఒటిపి, ఇతర అలర్ట్ కూడా వస్తాయి. వీటితోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. దోస్త్ ఫేస్‌బుక్ పేజీ: facebook.com/dost.telangana దోస్త్ యూట్యూబ్ చానల్ : http://youtube.com/c/dost.telangana దోస్త్ ట్విట్టర్ ఖాతా : twitter.com/dost. telangana దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200 హెల్ప్ లైన్ నెంబర్ : 040 23120416 ...........................................................................................

మన తెలంగాణ 14 Apr 2026 3:30 am

సమ్మెకు వెళ్లొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) కార్మిక సంఘాలు ప్రేరేపిత సమ్మెకు వెళ్లవద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాల కు విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసి ఇ ప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పరిస్థితుల్లో ఇ బ్బందులకు గురి చేయవద్దని కోరారు. పెం డింగ్ డీఏ ను ఇప్పటికే విడుదల చేశామని, పీఆర్సీపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేశామని, ప్రస్తుతం కమిటీ వద్ద ఈ రెండు అంశాలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. ఈ రెం డు ప్రధాన సమస్యలు మినహా మిగతా అం శాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిబ్బందికి సంబంధించిన ఏ సమస్యలైనా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలోని ఖైరతాబాద్ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాల గోడపత్రికను మంత్రి పొన్నం సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్ర త్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వికాస్ రా జ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, టిజిఎస్‌ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి, రవాణా శాఖ జెటిసిలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివ లిం గయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని, తొందర పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తీసుకున్న సమ్మె ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రతపై అవగాహన ఈ నెల 13 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తం గా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ల క్ష్యంతో పోలీస్, రవాణా శాఖలు కలిసి అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తె లిపారు. రవాణా నిబంధనలు, రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలపై చర్చించి, వా టిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, రోడ్డు ప్ర మాదాలను తగ్గించే చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.  

మన తెలంగాణ 14 Apr 2026 3:00 am

మంగళవారం రాశి ఫలాలు (14-04-2026)

మేషం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభం నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది. మిధునం వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు చెయ్యకపోవడం మంచిది. కర్కాటకం కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సింహం వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కన్య కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తుల చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృశ్చికం సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ధనస్సు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. మకరం ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. కుంభం చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. మీనం ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  

మన తెలంగాణ 14 Apr 2026 12:20 am

ఫ్యాక్ట్ చెక్: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేయలేదు. అదొక ఫేక్ లెటర్

హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 12:19 am

హైదరాబాద్ ఘన విజయం

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో వరుస విజయాలతోదూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో విజయం కాగా, రాజస్థాన్ తొలి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (18)లు విఫలమయ్యారు. అయితే కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన ఇషాన్ 44 బంతుల్లోనే 6 సిక్స్‌లు, 8 ఫోర్లతో 91 ప రుగులు చేశాడు. క్లాసెన్ (40), నితీశ్ కుమా ర్ రెడ్డి (28), సలీల్ అరోరా 24 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ప్రఫుల్, సాకిబ్ నాలుగేసి వికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 14 Apr 2026 12:03 am

కెసిఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లీగల్ నోటీసు పంపించారు. మంత్రి తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఈ నోటీసు పంపించారు. నోటీసులో అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టిజిటిఎస్) నిర్వహించిందని, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో తన ప్రమేయం లేదని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం టెండర్ విలువ రూ.44.42 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అసంబద్ధమని, ఇది పూర్తిగా ఆధారాలు లేని ఆరోపణ అని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో మొబైల్ ఫోన్‌ను రూ.11,650కే కొనుగోలు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు టీజీటీఎస్ ద్వారా కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకే టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని మంత్రి వివరించారు. దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆరే బాధ్యత వహించాలి బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు 48 గంటల్లో సోషల్ మీడియా పోస్టులను తొలగించి, బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులో హెచ్చరించారు. ప్రజా భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, అంగన్వాడి మొబైల్ కొనుగోలు విషయంలో బీఆర్‌ఎస్ పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ అవాస్తవాలను పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయడం వల్లే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు తాను కెసిఆర్‌కు లీగల్ నోటీసు పంపించినట్టు గుర్తుచేశారు. తప్పును పదిసార్లు చెబితే నిజం కాదని అన్నారు. రూ.44 కోట్ల టెండర్లో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడినప్పుడు తాను గట్టిగా సమాధానం ఇచ్చిన తరువాత తనపై దుష్ప్రచారం ప్రారంభమైందని మంత్రి సీతక్క గుర్తు చేశారు.

మన తెలంగాణ 13 Apr 2026 11:40 pm

ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు మృతి

 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు సోమవారం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో పార్థాపూర్ ఏరియా కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావో నేత రూపి అలియాస్ రంగబోయిన భాగ్య ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఆమెపై గతంలో రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన రూపి, 2025 ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి . ఎన్‌కౌంటర్ తరువాత సంఘటన స్థలం నుంచి ఒక ఆటోమేటిక్ తుపాకీతోపాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాఖేచా వెల్లడించారు. కాల్పుల తరువాత మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం మాచ్‌పల్లి అడవుల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్పందిస్తూ అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతి లోకి రావాలని హెచ్చరించారు. హతమైన రూపి స్వస్థలం తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంగా గుర్తించారు. ఆమె వయసు 46 సంవత్సరాలు. 2004లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. ఆ తరువాత అబూజ్‌మడ్ వంటి కఠినమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. తాజా సంఘటనతో ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇంతవరకు 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. గత ఏడాది రాష్ట్రంలో 285 మంది మావోయిస్టులు హతమయ్యారు. 

మన తెలంగాణ 13 Apr 2026 11:10 pm

శ్మశానవాటికలో యువకుడి హత్య

హైదరాబాద్ పాత నగరంలోని చంచల్‌గూడ జైలుకు ఎదురుగా ఉన్న శ్మశానవాటికలో 18 ఏళ్ల యువకుడు హత్య కు గురైనట్లు సోమవారం ఆరోపణలు వచ్చాయి. గుడి బావడి ప్రాంతానికి చెందిన బాధితుడు షేక్ జాహిద్ సాయంత్రం 5 గంటల ప్రాంతం లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత నిందితుడు సుల్తాన్ దైరా శ్మశానవాటిక నుండి పారిపోయినట్లు సమాచారం. ఈ గొడవను గమనించిన స్థాని కులు వెంటనే అధికారులకు తెలియజేశారు.తదనంతరం మదన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటనల క్రమాన్ని తెలుసుకు నేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి. ఆంజనేయులు హత్యను ధృవీకరించారు, కానీ దర్యాప్తు కొనసాగుతున్నం దున మరిన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. హత్య వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.

మన తెలంగాణ 13 Apr 2026 11:05 pm

అది రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

మహిళా రిజర్వేషన్ బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ అగ్రనత, ఆ పార్టీ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డిలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది మాత్రమే కాకుండా, రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. అంతేకాక ఎన్నికల సమయంలో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును తీసుకురావడం పైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుల అసలు ఉద్దేశ్యం మహిళల రిజర్వేషన్ కాదని, డిలిమిటేషన్ అంశమే ప్రధానమని సోనియా గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంపుతో కూడిన డిలిమిటేషన్ రాజకీయంగా సమానత్వంతో ఉండాలని, కేవలం గణితపరమైన లెక్కలతో మాత్రమే నిర్ణయించకూడదని ఆమె స్పష్టం చేశారు. “రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిపాదన గురించి ప్రతిపక్షం ఒకసారి కాదు, ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి లేఖ రాసింది. అయినా అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధాని తిరస్కరించారు. దీనికి బదులుగా ప్రధానమంత్రి సంపాదకీయాల రాయడం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేయడం, ఇతర సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ‘నా మాటే నెగ్గాలి’ అన్నట్లుగా ప్రధానమంత్రి వ్యవహరించడం విచారకరం. రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల వేళ ఈ అంశాలపై కేంద్రం పార్లమెంటులో చర్చ చేపట్టాలని చూస్తోంది అంటూ సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉదృ్ధతంగా జరుగుతున్న సమయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లాభం పొందడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె అన్నారు. ప్రతిపక్షాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టడానికే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సోనియా గాంధీ వ్యాసాన్ని ఉటంకిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా స్పందించారు. మహిళల రిజర్వేషన్ ప్రక్రియలో తొందరపాటు డిలిమిటేషన్ వల్ల అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.2023లో ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం, మహిళల రిజర్వేషన్ అమలు తదుపరి జనగణన, డిలిమిటేషన్ పూర్తైన తర్వాతే అమలులోకి రావాల్సి ఉందని సోనియా గాంధీ గుర్తుచేశారు. అయితే ప్రతిపక్షం ఈ షరతును కోరలేదని, వెంటనే అమలు చేయాలని అప్పట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారని తెలిపారు. ఇప్పుడేమో 2029 నుంచే మహిళల రిజర్వేషన్ అమలు చేయాలనే సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని, అయితే ఈ నిర్ణయానికి 30 నెలలు ఎందుకు పట్టిందని ఆమె ప్రశ్నించారు. కొన్ని వారాలు వేచి అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయడంలో ఏమి ఇబ్బంది ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల చివరి దశ (ఏప్రిల్ 29) అనంతరం అన్ని పార్టీల సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షం మూడుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ప్రభుత్వం తిరస్కరించిందని ఆమె తెలిపారు. బదులుగా వ్యాసాలు రాయడం, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. మహిళల రిజర్వేషన్ చట్టం 73వ, 74వ రాజ్యాంగ సవరణల ఆధారంగా ఏర్పడినదని, వాటి ద్వారా పంచాయతీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారని ఆమె గుర్తుచేశారు. 2021లో జరగాల్సిన జనగణనను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల, జాతీయ ఆహార భద్రత చట్టం కింద సుమారు 10 కోట్ల మంది ప్రయోజనాల నుంచి దూరమయ్యారని సోనియా గాంధీ ఆరోపించారు. ఐదేళ్ల ఆలస్యానంతరం మాత్రమే జనగణన ప్రక్రియ ప్రారంభమవుతోందని ఆమె తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 11:00 pm

సముద్రంలో సమరం..

పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరిగింది. అమెరికా అన్నంత పని చేస్తోంది. ఇరాన్‌కు చెందిన హర్మూజ్ జలసంధితో పాటు అన్ని రేవులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించినట్లుగానే సోమవారంనాడు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇరాన్ పోర్టుల వైపు వచ్చి, వెళ్తున్న నౌకలను అడ్డుకోవడం ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు అమెరికా వివిధ దేశాల నౌకలను దిగ్బంధించడం మొదలుపెట్టింది. ఇరాన్ పోర్టుల్లోకి వచ్చి వెళ్లే అన్ని దేశాల నౌకలను అమెరికా నావికాదళం అడ్డుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్‌లో శాంతి చర్చల విఫలం తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ హర్మూజ్ దిగ్బంధం తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు అమెరికా నౌకాదళాలు చర్యకు దిగాయి. ఈ చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సైన్యం పర్షియన్ గల్ఫ్ పోర్టులను దిగ్బంధిస్తుందని హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు బెదిరింపులు కుదరవని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జిసి ) ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ గల్ఫ్ వెంబడి భద్రత అనేది అందరికీ వర్తించేది లేదా ఎవరికి భద్రత ఉండకూడదని స్పష్టం చేశారు. హర్మూజ్‌పై నౌకల రాకపోకల భద్రతను తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల బ్లాకేడ్‌కు రంగం సిద్ధం అయింది. ఇరాన్ నౌకలు ఏవీ అంగుళం కూడా కదలలేవని యుఎస్ దళాలు స్పష్ట చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. వేరే శక్తులు హర్మూజ్‌కు చేరినా, రేవులను దిగ్బంధించినా మాడిపోవడం తథ్యం అని హెచ్చరించారు. . ఇరాన్ రేవులకు ఏ దేశం నౌకలు రాకుండా చేస్తాం. అక్కడి నుంచి కదలకుండా చేస్తామని , ఈ విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదని వ్యాఖ్యానించారు. అమెరికా బ్లాకేడ్ హెచ్చరికతో రెండు రోజులుగా హర్మూజ్ మీదుగా ఇంతకు ముందటి వరకూ కనీసం పరిమితంగా అయినా తిరిగిన నౌకలు కూడా కదలలేని పరిస్థితి తలెత్తింది . యుద్ధం ముందు హర్మూజ్ మీదుగా రోజుకు కనీసం 100 నుంచి 135 వరకూ వాణిజ్య నౌకలు తిరిగేవి. కాగా కాల్పుల విరమణ తరువాత రెండు మూడు రోజులు ఈ మార్గం మీదుగా 40 నౌకలు ప్రయాణించాయని మెరైన్ విశ్లేషక సంస్థ లాయడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ తెలిపింది. మరోవైపు ఈ దిగ్బంధనం సెగ భారత్‌ను కూడా తాకింది. హర్మూజ్ జలసంధి మీదుగా రావాల్సిన 15 భారత నౌకలు చిక్కుకుపోయినట్లు సమాచారం. వీటిలో అధికంగా ఎల్‌పిజి, ముడి చమురు ట్యాంకర్లు ఉన్నాయి. అమెరికా బ్లాకేడ్‌ను తాము సమ్మతించడం లేదని, ఇరాన్ రేవుల దిగ్బంధ చర్యల్లో తాము పాల్గొనేది లేదని బ్రిటన్ తెలిపింది. ఈ మేరకు దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటన వెలువరించారు. హర్మూజ్‌లో సీ మైన్స్ తీసివేతకు బ్రిటన్ సహకరిస్తుందనే ట్రంప్ వాదనపై స్టార్మర్ స్పందించారు. ఈ విషయంలో తమ దేశం సహకరించవచ్చు. అయితే ముందుగా పోరు పూర్తిగా నిలిచిపోవల్సి ఉందని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 13 Apr 2026 10:51 pm

You’ll All Know, All I Said Is Right Or Not: Shaurya

Naga Shaurya will be seen in an out-and-out mass avatar in his upcoming flick Bad Boy Karthik, directed by Ramesh and produced by Srinivasa Rao Chintalapudi, Vijaya Kumar Chintalapudi and Dr. Ashok Kumar Chintalapudi. The film is up for release this week on April 19th. The producers shunned the rumours that they are in deep […] The post You’ll All Know, All I Said Is Right Or Not: Shaurya appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 10:44 pm

ఏడేండ్ల తరువాత భారత్‌కు ఇరాన్ క్రూడాయిల్

ఏడేండ్ల తరువాత ఇరాన్ ముడిచమురు సరుకు భారత్ తీర ప్రాంతానికి చేరింది. ఇరాన్ క్రూడాయిల్‌తో అతి భారీ వాహక నౌక ఫెలిసిటి ఆదివారం గుజరాత్ తీరంలోని సిక్కాకు చేరుకుంది. రెండు మిలియన్ క్రూడాయిల్ బ్యారెల్స్‌తో ఫిబ్రవరి చివరిలో ఇరాన్ ఖర్గ్ దీవి నుంచి ఈ నౌక బయలుదేరి, ఇప్పుడు క్షేమంగా ఇక్కడికి చేరింది. ఇక మరో చమురు నౌక జయ ఒడిషా తీరంలోని పరదీప్ వద్దకు చేరుకుంది. ఇందులో కూడా 2 మిలియన్ బ్యారెల్స్ సరుకు ఉంది. ఈ క్రూడాయిల్ సరఫరాకు దాదాపు ఏడేండ్ల క్రితం ఇరుదేశాల చమురు కంపెనీల మధ్య కాంట్రాక్టు కుదిరింది. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షల దశలో చాలా కాలంగా సరఫరా నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో ఇరాన్ చమురు తెప్పించుకునేందుకు వీలుగా అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది. ఈ దశలో క్రూడాయిల్ రవాణాకు వీలేర్పడింది. 

మన తెలంగాణ 13 Apr 2026 10:30 pm

టిసిఎస్‌లో లైంగిక వేధింపులు..ఏడుగురు ఉద్యోగులపై వేటు

ప్రముఖ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టిసిఎస్)లో లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్ క్యాంపస్‌లో జరిగిన ఈ వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులపై సంస్థ వేటు వేసింది. మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హెచ్‌ఆర్ మేనేజర్ కూడా ఉన్నారు. అరెస్టయిన ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు టిసిఎస్ సోమవారంనాడుఒక ప్రకటనలో తెలిపింది. నాసిక్ క్యాంపస్‌కు చెందిన ఓ ఉద్యోగిని తన సహోద్యోగి పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ క్రమంలో మరికొందరు ముందుకు వచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు. హెచ్‌ఆర్ మేనేజర్ సహా ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. మారువేషంలో క్యాంపస్‌లోకి ప్రవేశించారు. ఓ మహిళా ఉద్యోగిని మరో ఉద్యోగి వేధిస్తున్నది వారి కంట పడింది.ఈ కేసు విచారణ క్రమంలో మిగతా ఫిర్యాదులపై కూడా దర్యాప్తు జరిపారు. సిసిటివి ఫుటేజీలను పరిశీలించిన హెచ్‌ఆర్ మేనేజర్ అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, రజా మేమన్, తౌసిక్, షారుఖ్, డానిష్ షేక్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వీరు సహోద్యోగులను అనుచితంగా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం, మాంసాహారం తినమని బలవంతం చేయడం ఇలాంటివి గుర్తించారు. ఈ ఘటనపై కేంద్ర కార్మిక శాఖకు ఐటి ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. మరోవైపు నాసిక్ క్యాంపస్ వ్యవహారంపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. బాధ్యులైన వ్యక్తులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, చీఫ్ ఆపరేటింగ్ అధికారి నేతృత్వంలో సమగ్ర విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 10:20 pm

ఈ నెల 20న జగిత్యాలలో కెసిఆర్ బహిరంగ సభ

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జిలను కేటీఆర్ ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ ఎల్. రవీందర్ రావు, వేములవాడ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదండి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలను నియమించారు. సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 13 Apr 2026 10:10 pm

ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్‌బుక్‌ల జారీ: మంత్రి పొంగులేటి

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు సామాన్యుడికి సులభంగా అందేలా గత ఏడాది తీసుకొచ్చిన భూ భారతి చట్టం తెలంగాణ చరిత్రలో కీలక సంస్కరణగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాలను నక్షాలు లేవని మంత్రి  చెప్పారు. ఇందులో ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూధార్ నెంబర్ కేటాయించామన్నారు. మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్ వంటి ఆధునిక సర్వే సాంకేతికతను ఉపయో గించి రీసర్వే పనులు కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సర్వే చేపట్టబోతున్నామని, సర్వే అనంతరం హద్దులను గుర్తించి భూధార్ నంబర్ ఇస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు వినియోగంలో ఉండగా,అప్పటి నుంచి ఇప్పటివరకు 77 సంవత్సరాల్లో 2.99 కోట్లకు చేరాయన్నారు.వీటికి భూధార్ నంబర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత వరకు వినియోగించుకుంటు న్నామన్నారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామన్నారు. త్వరలో మరో 400 కొనుగోలు చేయబోతున్నాం. భూ భారతి పోర్టల్ ప్రారంభించిన గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు వివరించారు.

మన తెలంగాణ 13 Apr 2026 9:40 pm

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం: సిఎం రేవంత్‌రెడ్డి

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బిజెపికి తాత్కాలికంగా లాభం జరగవచ్చు, కానీ, దీర్ఘకాలంలో దేశానికి నష్టమని సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ (ఎక్స్‌లో) పేర్కొన్నారు. ఈ మేరకు డీలిమిటేషన్ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ వేర్వేరు అంశాలని, మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని, కానీ, మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగుగా ఉపయోగించి జనాభా ఆధారితంగా లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యమని డీలిమిటేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం అవసరమని ఈ విషయంలో అన్ని పార్టీలతో చర్చించాలని ఆయన సూచించారు. ప్రత్యామ్నాయ నమూనాలను సైతం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి షేర్ చేశారు. డీలిమిటేషన్‌కు జీఎస్టీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) పార్ములాను సూచించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెంట్ దక్కాలని 50 -50 గ్రోత్ ఫార్ములాను సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. లోక్ సభ సీట్ల పెంపులో దక్షిణాధి రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, జనాభా ప్రాతిపదికన కాకుండా దేశ వృద్ధిలో ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న అంశాల ఆధారంగా సీట్ల పెంపు చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు.

మన తెలంగాణ 13 Apr 2026 9:30 pm

చెలరేగిన ఇషాన్.. రాజస్థాన్ కు భారీ టార్గెట్

హైదరాబాద్‌: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్(91) భారీ అర్ధ శతకంతో చెలరేగాడు. ఇషాన్ తోపాటు క్లాసెన్ (40), నితీశ్ రెడ్డి (28), సలీల్(23 నాటౌట్) రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. 

మన తెలంగాణ 13 Apr 2026 9:22 pm

ఆదివాసీ, గిరిజనుల... అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

హైదరాబాద్: ఆదివాసీ, గిరిజ‌న, ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కు అడ్డంకిగా ఉన్న స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారం పైన ప్ర‌త్యేక దృష్టి సారిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ఆదివాసీ, గిరిజ‌న‌,ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నుల పైన మంత్రి సీత‌క్క నేతృత్వంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో క‌లిసి ప‌లు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజ‌నుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాం ల నిర్మాణంపైన దృష్టి సారిస్తామ‌ని వారికి సీఎం హామీ ఇచ్చారు. వీటి ద్వారా తాగు, సాగు నీటి అవ‌స‌రాల‌ను తీర్చ‌వ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు. చెక్ డ్యాం లు, ర‌హ‌దారుల నిర్మాణం కోసం అట‌వీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. వీలైనంత త్వ‌ర‌గా అట‌వీ శాఖ నుంచి అనుమ‌తులు వ‌చ్చేలా చూస్తాన‌న్నారు. ఆదివాసీ,గిరిజ‌న రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయ‌డానికి అనుమ‌తులు ఇవ్వాల‌ని చేసిన విజ్ఝ‌ప్తికి ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించారు. అట‌వీశాఖ అభ్యంత‌రాల వ‌ల్ల ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌త్తులు ఆల‌స్యం అవుతాయ‌ని, కొన్ని చోట్ల కొత్త ర‌హ‌దారులకు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని వారు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. వీలైనంత త్వ‌ర‌గా వీటిపైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అట‌వీ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. ఆదివాసీ, గిరిజ‌న ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల కోటా పెంచే విష‌యాన్ని ప‌రిశీలిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వారికి హామీ ఇచ్చారు.ఐటీడీఏ ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌న్న ముఖ్య‌మంత్రి ఆదివాసీ, గిరిజ‌నులకు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. 

మన తెలంగాణ 13 Apr 2026 9:11 pm

సుప్రీంకోర్టులో లాలూకు నిరాశ

ఆర్‌జెడి చీప్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. భూములకు ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో తనపై, తన కుటుంబ సభ్యులపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటేశ్వర సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేసులో మెరిట్స్‌ను పరిశీలించే అధికారాన్ని ట్రయిల్ కోర్టుకే విడిచిపెడుతూ, చట్టప్రకారం విచారణ కొససాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. అయితే ట్రయల్ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి లాలూకు మినహాయింపు ఇచ్చింది. ఈకేసులో ఇంతకుముందు లాలూ ప్రసాద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. సీబీఐ తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని లాలూ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపైనే సుప్రీం తాజా తీర్పు చెప్పింది.  

మన తెలంగాణ 13 Apr 2026 9:10 pm

మహిళల వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ పెంపు

ఈ ఏడాది జరిగే మహిళల టి20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీగా పెంచింది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇందులో 12 జట్లు పోటీ పడుతున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి ప్రైజ్‌మనీని పెద్ద మొత్తంలో పెంచారు. 2024లో రూ. 70 కోట్లకు పైగా ఉన్న నగదు బహుమతిని ఈసారి 10 శాతం పెంచింది. 2026 ఎడిషన్‌లో 8,764,615 డాలర్లకు పెంచారు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ రూ.81 కోట్లకు చేరింది. విజేతగా నిలిచే జట్టుకు రూ.21.8 కోట్లు అందజేస్తారు. రన్నరప్ టీమ్‌కు రూ. 10 కోట్లు దక్కుతాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు రూ.6 కోట్ల చొప్పున అందిస్తారు. ఇక గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు రూ.29 లక్షలు అందజేస్తారు.ఇక టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస హామీగా రూ.2.3 కోట్లు చెల్లించాలని ఐసిసి నిర్ణయించింది. కొన్నేళ్లుగా పురుషుల క్రికెట్‌కు సమానంగా మహిళలకు కూడా ఐసిసి భారీ మొత్తంలో నగదు బహుమతిని ఇస్తోంది. ఇది మహిళా క్రికెట్ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మన తెలంగాణ 13 Apr 2026 9:04 pm

కేంద్రం, 19 రాష్ట్రాలను ఒక్కదాన్నే ఎదుర్కోగలను: సిఎం మమత

 కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలపై సిఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. తనను ఓడించడానికి 19 రాష్ట్రాలు, కేంద్రం కలిసి కట్టుగా వచ్చాయని, కానీ ఒంటిచేత్తో వారందరినీ ఎదుర్కొంటున్నాని అన్నారు. సోమవారంనాడిక్కడ ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లు సాధించబోతుందన్నారు. యువతను ప్రభావితం చేయడానికి ప్రధాని మోడీ మన్ కీ బాత్‌ను పదేపదే ప్రసారం చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులతో డబ్బు మూటలు ఇచ్చి రాష్ట్రంలో ఓటర్లకు పంచి మభ్యపెడుతున్నారని మమత ఆరోపించారు. బీహార్ నుంచి రైళ్లు, బస్సుల్లో ఓటర్లను తరలిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహా 19 రాష్ట్రాల బిజెపి నేతలు కలిసి వచ్చినా వారందరికి తాను ఒక్కదాన్నే సమాధానం చెప్పగలన్నారు. సామాన్య ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని మమత పేర్కొన్నారు. 

మన తెలంగాణ 13 Apr 2026 9:00 pm

బాంబులకు బెంగాలీలు ఓట్లతో జవాబిస్తారు: అమిత్ షా

 బాంబులు, తూటాలకు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఓట్లతో సమాధానం చెబుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యానికి ప్రజలు అంతం పలుకబోతున్నారని పరోక్షంగా టిఎంసిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. సోమవారంనాడు బీర్బుమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో ఎలాంటి హింసకు పాల్పడకుండా టిఎంసి గుండాలు ఇళ్లకే పరిమితం కావాలని, లేకపోతే తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని గుర్తించి తప్పకుండా శిక్షిస్తామని అమిత్ షా హెచ్చరించారు. ఈ ఎన్నికల ద్వారా చొరబాటు దారులను తరిమికొట్టే అవకాశం బిజెపికి రాబోతుందన్నారు. దేశం నుంచి అలాంటి వాళ్లను పంపిచేస్తామన్నారు. శతబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న వారిని భయపెట్టే అధికారం మమతకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రామనవమి, సరస్వతి పూజ తదితర పండగల సమయంలో కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. 15ఏళ్లు బెంగాల్‌ను పాలిస్తున్న టిఎంసి రాష్ట్రాన్ని బుల్లెట్లు, బాంబుల నిలయంగా మార్చి వేసిందని ఆరోపించారు. పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇక్కడికి సరిపడా బలగాలను తరలించిందని అన్నారు. 

మన తెలంగాణ 13 Apr 2026 8:50 pm

ఆస్పత్రి నుంచి మహిళా ఖైదీ పరార్

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళా ఖైదీ పరారైన సంఘటన పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. గంటసాల త్రివేణి(26) చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉంది. త్రివేణి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. సెక్యూరిటీగా ఎఆర్ కానిస్టేబుళ్లు వచ్చారు. సెక్యూరిటీ గార్డుల కళ్లు కప్పి త్రివేణి ఆస్పత్రి నుంచి పరారయ్యారు. పోలీసులు హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:50 pm

థానెలో ఘోర రోడ్డు ప్రమాదం..11మంది దుర్మరణం

మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ముర్బాద్ సమీపంలోని రైతా వంతెన వద్ద ఓ వ్యాన్, సిమెంట్ మిక్సర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కల్యాణ్ నుంచి ముర్బాద్‌కు వెళ్తున్న వ్యాన్ సిమెంట్ మిక్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న 13 మందిలో 11మంది చనిపోగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 8 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులకు ఉల్లాస్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో పలువురిని గుర్తించామని, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు. 

మన తెలంగాణ 13 Apr 2026 8:38 pm

కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసు

ఓటింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లను (డూప్లికేట్ ఓటింగ్) నివారించేందుకు ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్యా బఘ్చిలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ అభ్యర్థనను వర్తింపజేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికలకు ఈ విధానాన్ని అమలు చేయాలా అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కేంద్రం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇతర రాష్ట్రాల నుంచి సమాధానాలు కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఉపాధ్యాయ్ వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపిస్తూ, ఈ విధానం అమలైతే లంచాలు, ప్రాక్సీ ఓటింగ్ వంటి అక్రమాలు తగ్గుతాయని తెలిపారు. అయితే, ఈ విధానాన్ని అమలు చేయడానికి చట్టాలలో విసృ్తత మార్పులు అవసరమవుతాయని, భారీ ఆర్థిక వ్యయం కూడా ఉంటుందని బెంచ్ వ్యాఖ్యానించింది.పిటిషన్ ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను వినియోగించి ఫింగర్, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను ప్రవేశపెట్టవచ్చని పేర్కొంది. దీంతో ఓటర్ల గుర్తింపును బలోపేతం చేయడంతో పాటు డూప్లికేట్, గోస్ట్ ఓటింగ్ వంటి సమస్యలను నివారించవచ్చని వాదించింది. ప్రస్తుతం ఓటర్ల గుర్తింపు ఓటర్ ఐడీ కార్డులు, మాన్యువల్ ధృవీకరణపై ఆధారపడుతోందని, పాత ఫొటోలు, లిపి పొరపాట్లు, రియల్ టైమ్ ధృవీకరణ లేకపోవడం వంటి కారణాల వల్ల దుర్వినియోగానికి అవకాశం ఉందని పిటిషన్ పేర్కొంది. బయోమెట్రిక్ విధానం ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనదిగా ఉండటంతో ‘ఒక పౌరుడు ఒక ఓటు’ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయవచ్చని తెలిపింది.  దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి ఉన్నందున, వివిధ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాల్లో అసమానతలు ఏర్పడుతున్నాయని కూడా పిటిషన్ పేర్కొంది. ఫింగర్, ఐరిస్ గుర్తింపు ద్వారా రియల్ టైమ్ ధృవీకరణ సాధ్యమవుతుందని, ఓటింగ్ కేంద్రాల్లో డిజిటల్ రికార్డు కూడా ఏర్పడుతుందని వివరించింది. ఇక యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న ఆధార్ వ్యవస్థను ఉదాహరణగా చూపుతూ, బ్యాంకింగ్, సంక్షేమ పథకాల అమల్లో ఇది మోసాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో బయోమెట్రిక్ ధృవీకరణను ప్రవేశపెట్టడం తగినదిగా, సమర్థవంతమైన చర్యగా ఉంటుందని పిటిషన్ అభిప్రాయపడింది.

మన తెలంగాణ 13 Apr 2026 8:35 pm

ఉత్కంఠ.. హార్మూజ్ దగ్గర చిక్కుకుపోయిన 15 భారత నౌకలు..

ఇరాన్-అమెరికా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. అరేబియా గల్ఫ్ తో పాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోని ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించడంతో నౌకల రాకపోకలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి దగ్గర 15 భారతీయ నౌకలు చిక్కుకున్నాయి. ఇందులో గ్యాస్ కారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్ల పాటు ఓ కెమికల్ కంటైనర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన మొత్తం 15 భారత జెండా నౌకలను వెనక్కి తీసుకురావడానికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మేము, విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ, మా నౌకలను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. హోర్ముజ్ జలసంధి నుండి మా నౌకలు ప్రయాణించడం సాధ్యమైన వెంటనే, ఆ నౌకలు తిరిగి వస్తాయి అని ముఖేష్ తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:23 pm

చెలరేగిన ఆర్ఆర్ బౌలర్లు.. కష్టాల్లో సన్‌రైజర్స్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ఎస్ఆర్‌హెచ్ జట్టును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన హైదరాబాద్‌ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ(0) తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 55 పరుగులు జోడించారు. అయితే రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (18) ఔట్ కావడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్(48), క్లాసెన్(6) ఉన్నారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:16 pm

NTR is not in a Hurry

NTR is completely occupied with Prashanth Neel’s project Dragon. Like never before, there are heaps of speculations about the film. The makers have issued clarifications several times to condemn the rumors. For Tarak’s birthday on May 20th, fans predicted that a short teaser or a video glimpse from Dragon will be released. But there is […] The post NTR is not in a Hurry appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 8:15 pm

Allu Arjun Raaka Movie: అల్లు అర్జున్ సినిమాకి అతనే మైనస్ అవుతాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబందించిన టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, ఎన్నో అంచనాలున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ అయ్యాక మాత్రం టోటల్ నెగిటివ్ టాక్ వినిపించింది. అది బన్నీ విషయంలో కాదు, దర్శకుడు అట్లీ విషయంలో కాదు. మరి, ఎవరి విషయంలో..పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాం. […] The post Allu Arjun Raaka Movie: అల్లు అర్జున్ సినిమాకి అతనే మైనస్ అవుతాడా? appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 13 Apr 2026 8:14 pm

Thalaivar173: Why Change in Director again?

Thalaivar173 happens to be the most prestigious film for Tamil cinema as Superstar Rajinikanth is playing the lead role and legendary actor Kamal Haasan is bankrolling the film. After Sundar C’s exit, Cibi Chakaravarthi signed the film and a grand announcement was made. The shoot was planned to start this month and a shocking news […] The post Thalaivar173: Why Change in Director again? appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 8:11 pm

సముద్ర యుద్థానికి రంగం సిద్ధం ?

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు మలుపు తిరిగింది. ఇరాన్‌కు చెందిన అన్ని రేవుల దిగ్బంధం చేస్తామని తీర ప్రాంత బ్లాకేడ్‌కు దిగుతామని అమెరికా సైన్యం సోమవారం ప్రకటించింది. అంతకు ముందు పాకిస్థాన్‌లో శాంతి చర్చల విఫలం తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ హర్మూజ్ దిగ్బంధం తప్పదని హెచ్చరించారు. పైగా ఇరాన్ నౌకలు ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని తమ సముద్ర మార్గ యుద్ధ వ్యూహం వెలువరించారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు అమెరికా నౌకాదళాలు రంగంలోకి దిగాయి.ఈ చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా ఈ చర్యలకు దిగితే తమ సైన్యం పర్షియన్ గల్ఫ్ పోర్టులను దిగ్బంధిస్తుందని హెచ్చరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు బెదిరింపులు కుదరవని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జిసి ) ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ గల్ఫ్ వెంబడి భద్రత అనేది అందరికీ వర్తించేది లేదా ఎవరికి భద్రత ఉండకూడదని స్పష్టం చేశారు. హర్మూజ్‌పై నౌకల రాకపోకల భద్రతను తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల బ్లాకేడ్‌కు రంగం సిద్ధం అయింది. చర్చల విఫలం తరువాత ఇరాన్, అమెరికాలు ఇప్పుడు మరింత తీవ్రస్థాయిలో తలపడేందుకు కసరత్తులు చేపట్టాయి. ఇరాన్ నౌకలు ఏవీ అంగుళం కూడా కదలలేవని యుఎస్ దళాలు స్పష్ట చేశాయి.దీనికి ప్రతిగా ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. వేరే శక్తులు హర్మూజ్‌కు చేరినా, రేవులను దిగ్బంధించినా మాడిపోవడం తథ్యం అని హెచ్చరించారు. అయితే యుఎస్ సెంట్రల్ కమాండ్ ( సెంట్‌కామ్) దీనిని పట్టించుకోకుండా తమ తీవ్రస్థాయి చర్యలు సోమవారం ఆరంభమవుతాయని ప్రకటించింది. ఇరాన్ రేవులకు ఏ దేశం నౌకలు రాకుండా చేస్తాం. అక్కడి నుంచి కదలకుండా చేస్తామని , ఈ విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదని వ్యాఖ్యానించారు. అరేబియా గల్ఫ్ , ఒమన్ గల్ఫ్ వెంబడి ఉన్న ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల్లో ఎటువంటి నౌకా రవాణా లేకుండా చేసి తీరుతామని ప్రకటించారు. ట్రంప్ అత్యున్నత స్థాయి వ్యూహంలో భాగంగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ కీలక నిర్ణయం అమలుకు దిగినట్లు స్పష్టం అయింది. అంతకు ముందు ట్రంప్ హర్మూజ్ మొత్తం దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అయితే ఇందుకు కొంచెం సడలింపుగా యుఎస్ కమాండ్ వర్గాలు తాము ఇరానేతర రేవుల నుంచి హర్మూజ్ మీదుగా నౌకలు వెళ్లేందుకు ఇంతకు ముందులాగానే వీలు కల్పిస్తామని తెలిపారు. బ్లాకేడ్ హెచ్చరికతో రెండు రోజులుగా హర్మూజ్ మీదుగా ఇంతకు ముందటి వరకూ కనీసం పరిమితంగా అయినా తిరిగిన నౌకలు కూడా కదలలేని పరిస్థితి తలెత్తింది . యుద్ధం ముందు హర్మూజ్ మీదుగా రోజుకు కనీసం 100 నుంచి 135 వరకూ వాణిజ్య నౌకలు తిరిగేవి. కాగా కాల్పుల విరమణ తరువాత రెండు మూడు రోజులు ఈ మార్గం మీదుగా 40 నౌకలు ప్రయాణించాయని మెరైన్ విశ్లేషక సంస్థ లాయడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ తెలిపింది. బ్లాకేడ్‌కు మేం దూరం ః బ్రిటన్ అమెరికా బ్లాకేడ్‌ను తాము సమ్మతించడం లేదని, ఇరాన్ రేవుల దిగ్బంధ చర్యల్లో తాము పాల్గొనేది లేదని బ్రిటన్ తెలిపింది. ఈ మేరకు దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటన వెలువరించారు. హర్మూజ్‌లో సీ మైన్స్ తీసివేతకు బ్రిటన్ సహకరిస్తుందనే ట్రంప్ వాదనపై స్టార్మర్ స్పందించారు. ఈ విషయంలో తమ దేశం సహకరించవచ్చు. అయితే ముందుగా పోరు పూర్తిగా నిలిచిపోవల్సి ఉందని స్పష్టం చేశారు. హర్మూజ్ మూసివేతకు కాకుండా, ఈ మార్గం పూర్తి స్థాయి రీ ఓపెన్‌కు బ్రిటన్ సైనిక శక్తిని వినియోగించడం జరుగుతుందని వివరించారు. ఈ విషయంలో తమ దేశం పలు దేశాలతో చర్చిస్తోంది. ఏ విధంగా హర్మూజ్‌ను తిరిగి రాకపోకలకు తెరవాలి, ఈ కీలక చమురు మార్గం మీదుగా నౌకలు ముందుకు పాగాలనే వ్యూహాలను ఇతరులతో కలిసి ఖరారు చేసుకుంటామని, ఇందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో పలు దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు. చర్చలతో శాంతి : ఆగ్నేయాసియా కూటమి ఇక శాంతి చర్చల ప్రక్రియ కొనసాగేలా చూడాలని ఆగ్నేయాసియా దేశాలు ఇరాన్, అమెరికాలకు విజ్ఞప్తి చేశాయి. కాల్పుల విరమణ జరగాలి. హర్మూజ్ మీదుగా నౌకా, విమాన రాకపోకలు సురక్షితంగా సాగేలా చూడాల్సి ఉందని తెలిపారు. 11 దేశాల కూటమి విదేశాంగ మంత్రులు ఇండోనేసియాలో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. తరువాత ప్రకటన వెలువరించారు. అమెరికా, ఇరాన్‌లకు తక్షణ సందేశం పంపించారు. ఇప్పటి యుద్ధం, హర్మూజ్ ఇతర పరిస్థితులతో పెరుగుతున్న చమురు ధరలు ఇతర పరిణామాలపై విస్తృతరీతిలో సమీక్షించారు. ప్రపంచ సంక్షభ దశలో ఆగ్నేయాసియా దేశాలు ఏ విధంగా స్పందించాలి? సహకరించుకోవాలి? అనే విషయాలపై చర్చించారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:09 pm