SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

ప్రజల కోసం పనిచేసిన సర్పంచ్‌లకు అండగా ఉంటాను

ప్రజల కోసం పనిచేసిన సర్పంచ్‌లకు అండగా ఉంటాను దర్శి, ఆంధ్రప్రభ ; ప్రజల

ప్రభ న్యూస్ 3 Apr 2026 11:30 am

Abhishek Sharma |ఒక డీమెరిట్ పాయింట్ నమోదు..

Abhishek Sharma | ఒక డీమెరిట్ పాయింట్ నమోదు.. Abhishek Sharma |

ప్రభ న్యూస్ 3 Apr 2026 11:28 am

ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా

అసోం ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ బొకాజన్: అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టు కోవడానికి అనేక హామీలను గుప్తిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టీల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది. ఎలాగైనా ఈ సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఉన్న దారులన్నీ వెతుకుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆరోగ్యసంరక్షణ, […] The post ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Apr 2026 11:28 am

Rajasekhar getting Big Appreciation for Biker

Veteran actor Rajasekhar hasn’t been seen in films in the recent years. He played father to Sharwanand in Biker. Rajasekhar’s role, characterization and his performance are getting wide appreciation from the audience. The actor has been subtle in the role and he emoted well in the role of a caring, struggling father who wants to […] The post Rajasekhar getting Big Appreciation for Biker appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 11:25 am

కొండాపూర్ లో ఎరినా పబ్ పై ఈగల్ టీమ్ దాడులు.... 8 మందికి డ్రగ్స్ పాజిటివ్

హైదరాబాద్: మహానగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్ లపై ఈగల్ టీమ్ పోలీసులు దాడులు చేశారు. కొండాపుర్ లోని క్వాక్ ఎరినా పబ్ లో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. గురువారం రాత్రి సౌతాఫ్రికా కు చెందిన ప్రముఖ డిజె బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ ను పబ్ నిర్వాహకులు నిర్వహించారు. ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించడంతో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 3 Apr 2026 11:22 am

Sudden |కార్యాలయం, ఇళ్లల్లో తనిఖీలు..

Sudden | కార్యాలయం, ఇళ్లల్లో తనిఖీలు.. Sudden | ఆంధ్రప్రభ, వెబె డెస్క్

ప్రభ న్యూస్ 3 Apr 2026 11:18 am

Telangana |అతడు లేడని.. ఆమె కూడా…

Telangana | అతడు లేడని.. ఆమె కూడా… Telangana | ఆంధ్రప్రభ, వెబె

ప్రభ న్యూస్ 3 Apr 2026 11:12 am

గ్రామసభలో శాఖల నివేదికల వినిపింపు…

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని 12 గ్రామపంచాయతీలలో సర్పంచులు, ఉపసర్పంచులు, పాలకవర్గ సభ్యుల

ప్రభ న్యూస్ 3 Apr 2026 11:06 am

ఒరాకిల్ డేటా సెంటర్‌పై దాడి చేశాం

ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి తెహ్రాన్: ఇరాన్ తన ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. అమెరికాకి సాంకేతిక సహకారం అందిస్తోన్న టెక్ కంపెనీలపై దష్టి సారించింది. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇంత వరకు దాడులు చేసిన ఇరాన్ ఇప్ప్పుడు సాంకేతిక సంస్థలపై గురిపెట్టింది. ఈ క్రమంలో అమెరికా టెక్ సంస్థలే లక్ష్యంగా గురువారం దుబాయ్‌లోని ఒరాకిల్, బహ్రెయిన్‌లోని అమెజాన్ సంస్థల డేటా సెంటర్లపై ఐఆర్‌జీసీ దాడులు చేసింది. ఈ […] The post ఒరాకిల్ డేటా సెంటర్‌పై దాడి చేశాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Apr 2026 11:03 am

Balakrishna |అసలు ప్లాన్ ఏంటి..?

Balakrishna | అసలు ప్లాన్ ఏంటి..? Balakrishna | బాలయ్య కోసం దర్శకుల

ప్రభ న్యూస్ 3 Apr 2026 10:59 am

క్రీస్తు త్యాగాల జ్ఞాపకం గుడ్ ఫ్రై డే..

క్రీస్తు త్యాగాల జ్ఞాపకం గుడ్ ఫ్రై డే.. ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 3 Apr 2026 10:46 am

నక్సల్స్ అంతమే అభివృద్ధి కాదు

నక్సలిజం నిర్మూలనకు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ మార్చి 31, 2026 ముగిసింది. ఇది రెడ్ కారిడార్‌గా పిలవబడే తొమ్మిది రాష్ట్రాల్లో కొండలు, అడవుల్లో విస్తరించి ఉన్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో దశాబ్దాలపాటు సాగిన మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగింపు దశకు చేరిన చారిత్రక ఘట్టాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు దేశం లోని సుమారు 120 కి పైగా జిల్లాలను ప్రభావితం చేసిన మావోయిస్టులపై భద్రతా దళాలు నిరంతరం సాగించిన పోరుతో 2025 నాటికి నక్సలిజం గణనీయంగా క్షీణించింది. ఇప్పుడు మధ్య, తూర్పు భారతం లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. కొన్ని దశాబ్దాల హింసలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పౌరులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అయినప్పటికీ సాయుధ మావోయిస్టుల నిర్మూలనతో సమస్యలు ముగిసినట్టు కాదు. నక్సల్స్ బృందాలను భద్రతా బలగాలు ఎంత దెబ్బతీసినా, వారి వెనుక ఉన్న భావజాలం (ఐడియాలజీ) లేదా మూలకారణాలు ఇంకా సాక్షాలుగా మిగిలే ఉన్నాయి. చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం, టెలికమ్ నెట్‌వర్క్ విస్తరణ, బ్యాంకింగ్ సౌకర్యాలు, స్కూళ్లు, స్కిల్ సెంటర్లు వంటివి ఏర్పాటు కావడంతో భద్రతా బలగాలు ఆయా గ్రామాల్లోకి చేరుకుని భద్రత కల్పిస్తుండడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగి నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇదంతా అభివృద్ధియే అని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ అభివృద్ధి అంటే కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. మానవాభివృద్ధి, జీవన ప్రమాణాలు ఏమాత్రం విస్తరించాయో పరిశీలించాల్సి ఉంది. మావోయిజం వర్ధిల్లడానికి గిరిజన సామాజిక వర్గాల్లో పేదరికం, సామాజిక బహిష్కరణ, విచ్ఛిన్నమైన విశ్వాసం తదితర కొన్ని కఠోర వాస్తవాలే ప్రధాన కారణాలు. గిరిజన వర్గాలు కొన్ని తమ భూములను, అటవీ హక్కులను కోల్పోతున్నాయి. బలమైన పెత్తందార్ల దోపిడీని ఎదుర్కొంటున్నాయి. వీటికి తోడు అధికార యంత్రాంగం నిర్లక్షం వెంటాడుతోంది. ఇవన్నీ పరిష్కారం కాకుంటే మళ్లీ క్షేత్రస్థాయిలో మావోయిజం లేదా అలాంటి ఇతర ఉద్యమాలు పుట్టుకు రాక తప్పదు. భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్‌లో అటవీ హక్కుల చట్టం, పంచాయతీ రాజ్ చట్టాల ద్వారా ఆయా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులకు రక్షణ, స్థానిక స్వపరిపాలన కల్పించబడ్డాయి. ఈ ప్రాంతాల ప్రజల హక్కులను కాపాడటమే కాకుండా వారి బాగోగులను చూసుకునే ప్రత్యేక అధికారాలు గవర్నర్లకు ఉన్నాయి. అయితే ఇవి పేలవమైన అమలు కారణంగా విఫలమవుతున్నాయి తప్ప చట్టాల్లో లోపాలు ఉన్నందువల్ల కాదు. ఈ పరిస్థితుల్లో గవర్నర్లే గిరిజన ప్రయోజనాలను కాపాడే బాధ్యత వహించాలి. అలాగే పునరావాసం అనేది కేవలం ఒక చర్యగా మాత్రమే ఉండకూడదు. విద్య, ఆరోగ్యభద్రత, ఉద్యోగాలు, గౌరవం, ప్రతి కుటుంబానికి చేరువ కావాలి. మార్చి 31 వరకు ప్రభుత్వం ప్రధానంగా భద్రతా పరమైన అంశాల పైన, మావోయిస్టుల అంతం పైనే దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు గిరిజన బతుకుల్లో భద్రతతోపాటు ఉపాధి, ఉద్యోగాలు, అటవీ భూముల హక్కుల కల్పన వంటి సంఘర్షణకు దారితీసిన అంశాల పైనే ప్రభుత్వం దృష్టి మళ్లించవలసి ఉంది. వామపక్ష తీవ్రవాదం నిర్మూలన అనేది ఆ ప్రాంతాల అభివృద్ధికి శాంతి భద్రతల పునరుద్ధరణకు మంచి పరిణామం అయినప్పటికీ ఆ పేరుతో కార్పొరేట్ శక్తులు, క్రోనీ కేపిటలిస్టులు, గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేసే అవకాశం ఇవ్వకూడదు. దీనికి బదులు గిరిజనులకు కల్పించవలసిన హక్కుల కల్పనకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వారికి భాగస్వామ్యం కల్పించడానికి కృషి సాగించాలి. నక్సల్స్ విముక్తికి డెడ్‌లైన్ మార్చి 30కి ముందు లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మూడేళ్ల పాటు పారామిలిటరీ ఆపరేషన్లు ముమ్మరంగా చేపట్టడం వల్ల 4839 మావోయిస్టులు లొంగిపోయారని, 2218 మంది అరెస్టు అయ్యారని, 706 మంది ఎన్‌కౌంటర్లలో తటస్థం అయ్యారని లెక్కలు వల్లించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్స్‌పట్ల సానుభూతి చూపించడం వల్లనే నక్సలిజం విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. కానీ వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు పెనుసవాలుగా గుర్తించి 200910 లో ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో నక్సల్స్ నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. ఆనాడు ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని 180 జిల్లాల్లో నక్సలిజం తీవ్రంగా ఉండేది. కానీ నక్సల్ నివారణ చర్యలు చేపడితే పారామిలిటరీ నిర్వహణకు విపరీతంగా ఖర్చు చేయవలసి వస్తుందని, అనేక మంది ప్రాణాలు బలిగొనాల్సి వస్తుందని తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వంద్వ విధానం పాటించారు. ఒకవైపు లొంగిపోయిన నక్సల్స్‌కు చర్చలద్వారా పునరావాసం కల్పిస్తామని, దీనిని వ్యతిరేకించిన వారిని హతం చేస్తామని హెచ్చరించారు. నక్సల్స్‌ను నిర్మూలించడం మారణహోమంగా పరిగణించే మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తల, మేధావుల అసంతృప్తిని లెక్కలోకి తీసుకోలేదు. పైగా వారిని అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నక్సల్స్ భావజాలం వ్యతిరేకమని, అభివృద్ధికి వారు దోహదం చేయరని గిరిజనుల్లో ప్రచారం చేయించారు. మొత్తం మీద వామపక్ష ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విజయం సాధించారు. ఇప్పుడు సయోధ్య రాజకీయాల ద్వారా యుద్ధ గాయాలను మాన్పడమే తక్షణ కర్తవ్యం.    

మన తెలంగాణ 3 Apr 2026 10:46 am

Perni Nani |అధికారులపై బెదిరింపులు

Perni Nani | అధికారులపై బెదిరింపులు Perni Nani | ఆంధ్రప్రభ, వెబె

ప్రభ న్యూస్ 3 Apr 2026 10:43 am

నేత్రపర్వంగా హనుమాన్ శోభాయాత్ర

గంభీరావుపేట ఏప్రిల్ 03 (జనం సాక్షి);గంభీరావుపేట మండల కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేసి …

జనం సాక్షి 3 Apr 2026 10:39 am

సర్పంచ్ లకు అండగా ఉంటాను –ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి..

సర్పంచ్ లకు అండగా ఉంటాను – ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.. దర్శి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Apr 2026 10:38 am

సమస్యల పరిష్కారానికి గ్రామసభలు

భీమదేవరపల్లి:ఏప్రిల్ 03 (జనం సాక్షి)రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా భీమదేవరపల్లిమండలంలోని గ్రామాల్లో గ్రామసభలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా …

జనం సాక్షి 3 Apr 2026 10:34 am

అమెరికా సాంకేతికతపై ఇరాన్ సవాలు

పశ్చిమాసియాలో 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాక, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఏకధ్రువ ప్రపంచ క్రమం కుప్పకూలుతున్న ఒక చారిత్రక ఘట్టంగా పరిణమించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ప్రారంభంలో కొన్ని విజయాలను సాధించినప్పటికీ, ఇరాన్ పటిష్టమైన యుద్ధతంత్రం, అసిమెట్రిక్ యుద్ధ నైపుణ్యం ముందు ఆ అగ్రరాజ్యాల సాంకేతిక గర్వం నీరుగారిపోయింది. ముఖ్యంగా, అమెరికా గర్వపడే గగనతల నిఘా వ్యవస్థలకు వెన్నెముకవంటి అవాక్స్ విమానాన్ని ఇరాన్ కూల్చివేయడం,ఆ దేశపు రక్షణ వ్యవస్థలోని లొసుగులను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ యుద్ధం కేవలం సైనికపరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా అమెరికాను దివాలా అంచుకు నెట్టివేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ ఒక పరాన్న దేశంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతగా అమెరికాపై ఆధారపడి ఉందో స్పష్టమైంది. రష్యా, చైనా, ఇండియా వంటి ఎదుగుతున్న శక్తులు ఇప్పుడు ఏకమై ఒక చిన్న తోపు తోస్తే, పాత ప్రపంచ క్రమం అంతమై ఒక నూతన బహుధ్రువ ప్రపంచం ఆవిర్భవించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026 చివరి వారంలో జరిగిన ఒక కీలక పరిణామం యుద్ధగమనాన్ని పూర్తిగా మార్చివేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌మీద ఇరాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడిలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఇ-3 సెంట్రీ(అవాక్స్) విమానం ధ్వంసమైంది. ఈ విమానం కేవలం ఒక వాహనం కాదు. అది గగనతలంలో కదిలే ఒక కమాండ్ సెంటర్. ఇది సుమారు 250 మైళ్ల (375 కిలోమీటర్లు) పరిధిలోని ప్రతి చిన్న కదలికను -అవి డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, యుద్ధవిమానాలు కావచ్చు- అన్నింటినీ గుర్తించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతోనే అమెరికా ప్రపంచ దేశాలపై ఇన్నాళ్లూ తన పెత్తనాన్ని చలాయించింది. అయితే ఇరాన్ తన పటిష్టమైన యుద్ధతంత్రంతో ఈ ‘కదిలే రాడార్’ను మట్టుబెట్టడం ద్వారా అమెరికా గగనతల ఆధిపత్యాన్ని సవాలు చేసింది. అవాక్స్‌ను కోల్పోవడంవల్ల అమెరికా సైన్యానికి యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో తెలియని ‘అంధత్వం’ ఏర్పడింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఉన్న రాడార్లపై ఆధారపడాల్సి రావడం, అవి కూడా ఇరాన్ దాడులకు గురవుతుండడంతో అమెరికా రక్షణ వ్యవస్థలో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడింది. నిఘా విమానమైన ఇ-3 సెంట్రీ (అవాక్స్) పూర్తిగా ధ్వంసం కావడంతో 270 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. కెసి-135 స్ట్రాటోట్యాంకర్ యుద్ధ విమానాల్లో ఒకటి కూలిపోగా, ఐదు ధ్వంసమయ్యాయి. ఇవి ఒక్కో విమానం 165 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఎఫ్-15 ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు మూడు కూలిపోయాయి. ఇవి ఒక్కోటి 100 మిలియన్ డాలర్లు ఉంటుంది. అత్యాధునిక జెట్ అయిన ఎఫ్-35ఎ లైట్నింగ్ II అత్యవసర ల్యాండింగ్ అయి ధ్వంసమైంది. దీనికి 82.5 మిలియన్ డాలర్లు ఉంటుంది. దాదాపు పన్నెండుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూలిపోయాయి. వీటితో 30- 40 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. రక్షణ రాడార్ ఎఎన్/ టిపివై-2 (థాడ్) ధ్వంసం కావడంతో 500 మిలియన్ డాలర్ల నష్టం జరిగింది. దీనిని విశ్లేషిస్తే, అమెరికా తన అత్యాధునిక సాంకేతికతను ఇరాన్ వంటి దేశం ఎదురుదాడులనుంచి కాపాడుకోవడంలో విఫలమైందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎఫ్-15ఇ విమానాలు కువైట్ విమానాల ద్వారా పొరపాటున కూల్చివేయబడడం, అమెరికా నాయకత్వంలోని కూటమిలో సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. అమెరికా తన అత్యంత ఖరీదైన క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన థాడ్ (టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్), దాని రాడార్ ఎఎన్/టివివై-2పై అమితమైన విశ్వాసాన్ని ఉంచింది. ఈ వ్యవస్థ అంతరిక్షం నుంచి వచ్చే హైపర్సోనిక్ క్షిపణులను కూడా గుర్తించగలదు. కానీ ఇరాన్ యుద్ధం ఒక ‘సాంకేతిక వైరుధ్యాన్ని’ బయటపెట్టింది. కోట్లాది డాలర్ల విలువైన ఈ రాడార్ వ్యవస్థలు కేవలం 35,000 డాలర్ల విలువ చేసే చిన్న డ్రోన్ల దాడికి ఛిద్రమైపోయాయి. జోర్డాన్‌లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఎఎన్/టిపివై-2 రాడార్ ఇరాన్ దాడుల్లో ధ్వంసం కావడం అమెరికాకు కోలుకోలేని దెబ్బ. ఈ రాడార్‌లు ఒకచోట స్థిరంగా ఉండడంవల్ల శత్రువులకు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. అత్యాధునిక రాడార్ అరేలు ఎంత సున్నితంగా ఉంటాయంటే, ఒక చిన్న పేలుడు కూడా ఆ వ్యవస్థను పూర్తిగా పనికిరాకుండా చేయగలదు. ఈ వైఫల్యం వల్ల ఇరాన్‌నుంచి వచ్చే క్షిపణులను గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇది ఇజ్రాయెల్, ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న అమెరికా, ఈ యుద్ధం కోసం అదనంగా 200 బిలియన్ డాలర్ల అత్యవసర నిధుల కోసం పెంటగాన్ ద్వారా వైట్ హౌస్‌ను కోరింది. యుద్ధం మొదలైన మొదటి మూడు వారాల్లోనే సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలు ధ్వంసమయ్యాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల మార్కెట్, సాధారణంగా యుద్ధ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించబడుతుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్టుబడిదారులు అమెరికా ప్రభుత్వం తన అప్పులను తీర్చగలదా అనే అనుమానంతో బాండ్లను విక్రయిస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ బాండ్ మార్కెట్ నుంచి మార్చి నెలలోనే 2.5 ట్రిలియన్ డాలర్ల విలువ ఆవిరైపోయింది. ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరగడం, పెట్రోల్ ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు చేరువ కావడం అమెరికా సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఈ గణాంకాలు అమెరికా ఆర్థికంగా ఎంత పటిష్టమైన దేశమో నిరూపిస్తున్నాయి. ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం తగ్గిపోతుండడం ఈ పతనానికి ప్రధాన సంకేతం. ఇజ్రాయెల్ తన సాంకేతిక నైపుణ్యంతో ఇరాన్‌పై దాడులు చేస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఆ దేశం అమెరికా ఇచ్చే ‘సైనిక ప్రాణవాయువు’ (స్ట్రాటజిక్ ఆక్సిజన్ పైపులైన్) మీద పూర్తిగా ఆధారపడి ఉందని అర్థమవుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో తాము స్వయం సమృద్ధి సాధిస్తామని ప్రగల్భాలు పలికినప్పటికీ, యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే ఆ దేశ మందుగుండు సామాగ్రి నిల్వలు నిండుకున్నాయి. అమెరికా సరఫరా చేసే మందుగుండు లేకపోతే ఇజ్రాయెల్ ఒక్క వారం కూడా యుద్ధం చేయలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ‘గా (వార్‌ఎకానమీ) మారిపోయింది. పౌర రంగాలు, పర్యాటకం, వ్యవసాయం పూర్తిగా కుప్పకూలిపోయాయి. కేవలం సైనిక ఎగుమతులు మాత్రమే ఆ దేశాన్ని కాపాడుతున్నాయి. 2024లో 15బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులు చేసిన ఇజ్రాయెల్, ఇప్పుడు తన ఉనికి కోసం ప్రతి వనరును యుద్ధానికే మళ్లిస్తోంది. ఇది ఇజ్రాయెల్‌ను ఒక ‘సూపర్ స్పార్టా’ దేశంగా మార్చేసింది. అంటే నిరంతరం యుద్ధం మీదనే ఆధారపడే స్థితి. మార్చి 4, 2026న ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒక అణుబాంబు వంటి ప్రభావాన్ని చూపింది. ప్రపంచంలోని 20% చమురు సరఫరా, గణనీయమైన గ్యాస్ సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఇప్పుడు ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకొని, చమురు రవాణా చేసే నౌకల నుంచి సుంకాలను కేవలం చైనీస్ యువాన్‌లో మాత్రమే వసూలు చేస్తోంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి పడిన అతిపెద్ద దెబ్బ. చైనా క్రాస్-బోర్డర్ పేమెంట్ సిస్టమ్‌ద్వారా లావాదేవీలు జరగడం వల్ల అమెరికా ఆంక్షలు నిర్వీర్యమయ్యాయి. గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికా రక్షణ కవచం బలహీనపడడంతో తమ ఆర్థిక మార్గాలను చైనా వైపు మళ్లిస్తున్నాయి. ప్రస్తుత యుద్ధం ఒక సరికొత్త భౌగోళిక రాజకీయ మార్పును తెచ్చినట్టు కనిపిస్తోంది. అమెరికా అస్థిరమైన నాయకత్వాన్ని చూసిన జపాన్, జర్మనీ వంటి దేశాలు కూడా ఇప్పుడు తమ భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. రష్యా బహిరంగంగా అమెరికా దాడులను ఖండిస్తూనే, తెరవెనుక ఇరాన్‌కు ఉపగ్రహ సమాచారాన్ని, డ్రోన్ యుద్ధతంత్రాలను అందిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్నప్పటికీ, ఇరాన్‌ను అమెరికా పతనానికి ఒక ఆయుధంగా రష్యా వాడుకుంటోంది. చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే ఆర్థికంగా అమెరికాను దెబ్బతీస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక అండగా నిలుస్తూ, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమి ద్వారా ప్రత్యామ్నాయ ప్రపంచ క్రమాన్ని నిర్మిస్తోంది. భారతదేశం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూనే, తన ఇంధన భద్రత కోసం రష్యా, ఇరాన్‌లతో సంబంధాలను కొనసాగిస్తోంది. అమెరికా బలహీనపడడంవల్ల దానికి సాగిలపడకపోతే ఇండియా వంటి దేశాలకు ప్రపంచ స్థాయిలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం పెరుగుతుందనుకోవచ్చు. జపాన్, జర్మనీ దేశాలు ఇన్నేండ్లూ అమెరికా రక్షణ గొడుగు కింద ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా స్వయంగా యుద్ధంలో చిక్కుకోవడంతో, అవి తమ రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూ సొంత వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఇరాన్ యుద్ధం అమెరికా అజేయత అనే భ్రమను తొలగించింది. ప్రపంచ పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికా, ఇప్పుడు తన సొంత ఆర్థిక సమస్యలు, సైనిక వైఫల్యాలతో సతమతమవుతోంది. ఇజ్రాయెల్ తన మనుగడకోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడే బలహీన దేశంగా మిగిలిపోయింది. ఇరాన్ చూపిన పటిష్టమైన యుద్ధతంత్రం, ఆధునిక సాంకేతికత కంటే వ్యూహాత్మక ధైర్యం గొప్పదని నిరూపించింది. ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా వంటి శక్తులు ఏకమై ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని కొనసాగిస్తే, పాత సామ్రాజ్యాల పతనం పూర్తి కావడం ఖాయం. ప్రపంచం ఇప్పుడు ఏకధ్రువ ఆధిపత్యం నుంచి బహుళ ధ్రువ సహకారంవైపు అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక యుద్ధం ముగింపు కాదు. ఒక నూతన శకానికి ఆరంభం. అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ గమనాన్ని శాసించలేదు.   - మేకల ఎల్లయ్య -99121 78129

మన తెలంగాణ 3 Apr 2026 10:33 am

మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు

అంబర్‌పేట్‌లో విషాదం – అవయవ దానం ద్వారా ముగ్గురికి కొత్త జీవితం అంబర్‌పేట్, ఏప్రిల్ 03 (జనం …

జనం సాక్షి 3 Apr 2026 10:31 am

పెనుగంచిప్రోలులో అద్భుతం..

పెనుగంచిప్రోలులో అద్భుతం.. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలులో వెలసిన శ్రీ

ప్రభ న్యూస్ 3 Apr 2026 10:22 am

Hyderabad : హైదరాబాదీలూ.. అలెర్ట్.. కల్తీ ఆహారం తినే వారికి హెచ్చరిక

హైదరాబాద్ లో ఇటీవల కల్తీ ఆహార పదార్థాలు బయటపడుతున్నాయి

తెలుగు పోస్ట్ 3 Apr 2026 10:19 am

చరిత్ర బాటసారి జైశెట్టి రమణయ్య

కరీంనగర్ చరిత్ర కన్నీరు పెట్టిన రోజు 27 మార్చి, 2026. ఆ రోజు డా. జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. 17వ ఏటనే ఉపాధ్యాయ కొలువు చేపట్టి జగిత్యాలలో పురాతన ఖిల్లా దారిలో వెళుతుంటే ఆయన చూపు, మనసు అంతా ఆ దుర్గమ కట్టడం వైపే ఉండేది. తాను చదివిన పుస్తకాల్లో దీని ప్రస్తావనే లేకపోవడం ఆయనను కలచివేసేది. అలా రమణయ్య శోధన చరిత్ర వైపు మళ్లింది. మరింత లోతైన విజ్ఞానం కోసం చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అంతటితో ఆగకుండా పురాతన దేవాలయాలపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. అలా ఆయన 87ఏళ్ల జీవితకాలం కరీంనగర్ ప్రాంత పురా విశేషాలను, ప్రత్యేకతలను వెదుకులాటకే అంకితమైంది. శాతవాహనుల కాలం నుండి అసఫ్ జాహీల దాకా సాగిన పరిపాలన విశేషాలెన్నో ఆయన పరిశోధనద్వారా వెలుగు చూశాయి. తమ పరిశోధనా ఫలితాలను కరీంనగర్ జిల్లా చరిత్ర, సంస్కృతిగా గ్రంథస్తం చేశారు. ఎంతో విలువైన సమాచారాన్ని క్రోడీకరించి తన తర్వాతి తరం పరిశోధకులకు ఆయన మార్గదర్శకులయ్యారు. పూర్వ కరీంనగర్ జిల్లా పురాతన కట్టడాలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. ఎన్నో గ్రామాల్లో ఆదరణకు నోచుకోని శిల్పాలు, శిలా శిథిలాలు చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయాయి. గుట్టల ప్రాంతమైన ఈ జిల్లాలో రాళ్లపై విగ్రహాలు, శాసనాల చెక్కడాలు విరివిగా కనిపిస్తాయి. రాజుల ప్రాశస్త్యమంతా రాళ్లమీదే మిగిలినట్లు చరిత్రకారుల దృష్టి వీటిపైకి మళ్లలేదు. వ్యవసాయ ప్రధానమైన కరీంనగర్ ప్రాంతం చారిత్రక పరిశోధనల విషయంలో నిరాదరణకు గురైందని చెప్పవచ్చు. అలాంటి సందర్భంలో స్థానికుడిగా, చరిత్ర అధ్యయనం చేసిన వ్యక్తిగా రమణయ్య స్వీయ ఆసక్తితో జగిత్యాల, ఎలగందుల ఖిల్లాల చరిత్రను వెలికి తీశారు. శాతవాహనుల రాజధాని కోటిలింగాలపై తమ పరిశోధనలను పుస్తకంగా తెచ్చారు. జిల్లాలోని గ్రామాల, పట్టణాల పేర్ల వెనుక ఉన్న కారణాలను వెదికి, వాటిలోని చారిత్రకాంశాలను వివరించారు. ఆయన రాసిన ‘కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి’ ఒక ప్రామాణిక గ్రంథం. పరిశోధకులకు మార్గదర్శిగా, పలు పునర్ముద్రణలు పొందిన రచనగా ఇది నిలుస్తుంది. తెలంగాణ సుప్రసిద్ధ దేవాలయాలు, తెలంగాణ సుప్రసిద్ధ కోటలు, శ్రీవేములవాడ క్షేత్ర చరిత్ర, తెలంగాణ తేజోవంతులు, కాలగమనంలో కోనసముద్రం తదితర పుస్తకాలు రమణయ్య ఇతర రచనలు. 2018 లో వీరు ‘సొంత ఎదుగుదల’ అనే స్వీయ చరిత్రను రాసుకున్నారు. 1939లో జగిత్యాలలోని వైశ్య కుటుంబంలో పుట్టిన ఆయన పల్లెటూరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఒంటరి ప్రయాణం ఆరంభించి చరిత్రకారుడిగా ఎదిగిన క్రమం ఈ ఆత్మకథలో చూడవచ్చు. అధ్యాపక వృత్తిని ఎంచుకున్న వారికి వీరి జీవన గమనం స్ఫూర్తిగా నిలుస్తుంది. వీరి తాత జైశెట్టి రాజయ్య పద్యకవి. 1933 లో ఆయన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం, మనస్సంబోధ కీర్తనలు రాశారు. రమణయ్య వాటిని 1992లో పునర్ముద్రించారు. టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ది చాళుక్యాస్ అండ్ కాకతీయ టెంపుల్స్ -ఏ స్టడీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనే పుస్తకాలు ఇంగ్లీషులో వెలువరించారు. చరిత్ర అధ్యాపకులైనా.. రమణయ్యకు ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉంది. ఆ రోజుల్లో పదవ, ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా ఇంగ్లిష్‌లో ఫెయిల్ అవడంతో వారి కోసం సులభంగా అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ అనే పుస్తకం రాశారు. ఆ పరీక్షల్లో వచ్చే వ్యాకరణాంశాలను అందులో వివరించి ఎందరో విద్యార్థులు ఆ తరగతులు గట్టెక్కేలా తోడ్పడ్డారు. అధ్యాపకుడు, చరిత్ర పరిశోధకుడే కాకుండా రమణయ్య మంచి వక్త. ఏ విషయం పైనైనా సాధికారికంగా మాట్లాడగల ప్రజ్ఞాశాలి. కాలేజీల్లో ఏ సాహితీ, సాంస్కృతిక, వార్షిక సభలు, సమావేశాలు జరిగినా నిర్వహణ బాధ్యత తనపై వేసుకునేవారు. స్పష్టమైన గొంతుతో, చక్కని భాషలో, లోతైన పరిజ్ఞానంతో సాగే ఆయన సభా పరిచయ వాక్యాలు, ప్రసంగాలు సభికులను మంత్రముగ్ధుల్ని చేసేవి. విద్యార్థులంటే ఎంత ప్రేమనో, వృత్తిపట్ల అంతే నిబద్ధత కనబరచేవారు. కాలేజీ సెలవుల్లో విజ్ఞానయాత్రలు ఏర్పాటు చేసి విద్యార్థులను దేశంలోని చారిత్రక ప్రాంతాలకు తీసుకెళ్ళేవారు. కరీంనగర్‌కు సమీపంలోని ఎలగందుల ఖిలాలో పదేళ్ల క్రితం ఏర్పాటు చేరిన సౌండ్ అండ్ లైట్ షో కి అవసరమైన వ్యాఖ్యానాన్ని రమణయ్య అందించారు. 1971లో రమణయ్య సిద్దిపేట జూనియర్ కాలేజీలో పని చేశారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన విద్యార్థి. 2024 లో రాజకీయ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో కెసిఆర్ ఓ రోజు బస చేసినపుడు రమణయ్య ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్న కెసిఆర్ గురువుకు పాదాభివందనం చేశారు. వ్యక్తిగా, అధ్యాపకుడిగా పరిపూర్ణ జీవితాన్ని అందుకొని, దానిని ఎందరికో ఉపయోగపడేలా మలుచుకున్న రమణయ్య మాస్టారు సదా ఆదర్శప్రాయులు. - బి.నర్సన్ - 9440128169

మన తెలంగాణ 3 Apr 2026 10:17 am

Telangana : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 3 Apr 2026 10:10 am

సిద్దిపేటలో ప్రేమపెళ్లి... ప్రియుడు పురుగుల మందు తాగి... ప్రియురాలు ఉరేసుకొని ఆత్మహత్య

సిద్దిపేట: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బలవంతంగా ప్రేమజంటను పెద్దలు విడదీయడంతో ప్రియుడు పురుగులు మందు తాగి చనిపోవడంతో ప్రియురాలు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముస్త్యాల గ్రామంలో అనుముల రాకేష్ రెడ్డి(25), తరిగొప్పుల హారిక(22) యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. రాకేష్ రెడ్డి ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్ లో నివసిస్తున్నారు.  పెళ్లైన మూడు నెలలకు ప్రేమజంటను స్వగ్రామానికి తీసుకువచ్చారు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి రాకేష్ రెడ్డి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఇటీవల హారిక ఆత్మహత్యాయత్నం చేసుకోవగా రాకేష్ రెడ్డి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం పెళ్లి చేస్తామని చెప్పినా కూడా కావాలనే ఆలస్యం చేస్తున్నారని వీళ్లు పెళ్లి చేయరని మనస్తాపంతో పురుగుల మందు తాగి రాకేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణ వార్త విని తట్టుకోలేక హారిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

మన తెలంగాణ 3 Apr 2026 10:09 am

సాయుధ పోరాట వేగుచుక్క

అన్యాయమే అధికారమై రాజ్యమేలుతుంటే.. / అణగారిన వర్గాలపై అహంకారం విజృంభిస్తుంటే.. / వెట్టిచాకిరితో జీవితాలను బుగ్గిమయం చేస్తుంటే.. / ఆ నియంత పోకడలను ఎదురించిన యోధుడు దొడ్డి కొమురయ్య.’ నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్న మిలిటరీ పాలనకు ఎదురొడ్డి 4000 మంది కార్యకర్తలు అమరులయ్యారు. ఆ కోవలో అమరుడై, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చిన యోధుడు ‘దొడ్డి కొమురయ్య’. భూసమస్యను దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా చేసింది తెలంగాణ ప్రజలను చైతన్య పరిచింది ‘బాంచెన్ దొరా నీ కాళ్లు మొక్కుతా’ అన్న బడుగు జీవులతో ఆయుధాలు పట్టించింది అప్పటి నల్లగొండ జిల్లా జనగామ తాలూకాలోని విస్నూరు గ్రామంలో రాక్షతత్వానికి నిలువెత్తు నిదర్శనం అయినా విస్నూర్ దేశుముఖ్ రామచంద్రారెడ్డి, అతని కొడుకు బాబు దొర. వీరి ఆగడాలు అంతాఇంతా కాదు. 60 గ్రామాలకు అధిపతి ఈ నరరూప రాక్షసుడు నిజాంకు తొత్తులుగా ఉన్న దొరలు, పటేళ్లు, పట్వారీలు గ్రామాల్లో ప్రజలపై చేయని అఘాయిత్యం లేదు. విస్నూరు దగ్గరలో ఉన్న కడవెండి గ్రామాల రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ జాగీర్దార్ కడవెండి ఊరులో దొరసాని చేసిన ఆగడాలు తక్కువ ఏమీ కాదు. 20 ఎకరాలు కూడా లేని జానమ్మ దొరసాని అనతికాలంలో ఊరును అంత తన గుప్పిట్లో పెట్టుకుంది. జానమ్మ దొరసాని ప్రజలచేత దొర అని పిలిపించుకునేది. ఈ అణచివేత నుండి 1944 ఆంధ్ర మహాసభ ఏర్పాటు తెలంగాణ ప్రాంతం అంతా ఆంధ్రమహాసభ నాయకత్వంలో గుండెలు మండి గ్రామాల్లో ప్రజలు ఒడిసెల, గుప్తలు, మహిళలు కారంపొడి సంఘాన్ని ఏర్పరుచుకున్నారు. సంఘం అండతో గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దుకోసం ఉద్యమ బాటపట్టారు. పన్నులు కట్టేది లేదని తిరుగుబాటు చేశారు. ఇది చూసిన దొరలు ఉద్యమాన్ని అణచడం కోసం అనేక ప్రయత్నాలు చేసేవారు. కడవెండి గ్రామస్థులు అయినా దొడ్డి కొమురయ్య, అన్నదొడ్డి మల్లయ్య గ్రామంలో గొల్ల, కురుమల నాయకుడు. దొరసాని వెట్టికి గొర్రెలను ఇవ్వద్దని గొర్ల కాపర్లును చైతన్యపరిచాడు. దొడ్డి మల్లయ్యతోపాటు అదే గ్రామానికి చెందిన మంగలి కొండయ్య, నరసయ్య ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి, నల్లనరసింహులు అప్పుడున్న సంఘంలో చేరి గ్రామ నాయకులు అయ్యారు. ఇది మింగుడుపడని జానమ్మ దొరసాని వీళ్లను హతమార్చాలని పన్నాగం పన్నింది. ఈ కార్యక్రమంలో దొరసాని ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు అంతా నిరసన ప్రదర్శన చేయాలని సంఘం నిర్ణయించింది. 1946 జులై 4 సంఘం పిలుపు అందుకొని కడవెండి గ్రామంలో ప్రజలుఅంతా వీధుల గుండా ప్రదర్శన చేశారు. అప్పటికి దొరసానికి అండగా వచ్చిన విస్నూరు రామచంద్రారెడ్డి రౌడీలు కోడూరు దొర నరసింహారెడ్డి నాయకత్వం గడి నుండి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. కడుపులోకి తూట దిగడంతో కొమురయ్య అక్కడికక్కడే నేలకొరిగాడు. కొమురయ్య అన్న మల్లయ్య కాలుకు తూట దూసుకుపోయింది. లక్ష్మీనరసయ్య కొండయ్యలకు గాయాలయ్యాయి. కొమురయ్య మరణం చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ సంఘం అండతో గ్రామాలలో దొర గుండాలను తరిమికొట్టారు. కొమురయ్య బలిదానం తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడుపోసింది. సంఘం పిలుపుతో ప్రజలు సాయుధ మార్గం పట్టారు. కొన్ని ప్రాంతాలకు దేశ్‌ముఖ్‌లుగా ఉంటూ ప్రజలను రాచిరంపాన పెట్టిన నరరూప రాక్షసులైన దొరలను, వారి ఆధిపత్యాన్ని కూలదోశారు. మహోత్తర పోరాటంలో 4000 నుంచి5000 మంది అమరులయ్యారు. దొడ్డి కొమురయ్య త్యాగం కేవలం ఒక వ్యక్తి బలిదానం మాత్రమే కాదు. అది తెలంగాణ మట్టిలో న్యాయం కోసం పోరాడే ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన ప్రాణత్యాగం తరువాత గ్రామీణ ప్రాంతాల్లో అణచివేతకు గురైన కూలీలు, రైతులు, దళితులు, గిరిజనులు తమ హక్కులకోసం సంఘటితమై పోరాట పథంలో అడుగులు వేసారు. ఈ పోరాటం ప్రజల్లో స్వాభిమానాన్ని రగిలించి, భూమి రైతుకే అనే నినాదాన్ని గ్రామాలనుంచి దేశవ్యాప్తంగా వినిపించేలా చేసింది. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం ప్రాంతీయ ఉద్యమం మాత్రమే కాదు, సామాజిక న్యాయంకోసం జరిగిన గొప్ప ప్రజావిప్లవం.దీనిలో పాల్గొన్న వేలాదిమంది అమరుల కథలు పాఠ్యపుస్తకాలలో స్థానం పొందితేనే యువతలో చరిత్రపట్ల అవగాహన పెరుగుతుంది. ప్రజల హక్కులకోసం ప్రాణాలు అర్పించిన వీరుల స్ఫూర్తిని కొనసాగించడం అంటే వారి ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న అసమానతలు, భూవివాదాలు, సామాజిక వివక్షలను నిర్మూలించేందుకు పాలకులు కట్టుబడి పనిచేయాలి. అదే నిజమైన నివాళి. అలాగే ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా సామాజిక సంస్థలు, మేధావులు, యువత ముందుకు రావాలి. వీరుల త్యాగాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా మేధావులు కవులు, కళాకారులు, సామాజిక శక్తులు, ప్రగతిశీల శక్తులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొడ్డి కొమురయ్యతోపాటు సాయుధ పోరాట అమరుల అందరికీ నిజమైన నివాళి.-  - దయ్యాల అశోక్  95508 89907 ( నేడు దొడ్డి కొమురయ్య జయంతి)

మన తెలంగాణ 3 Apr 2026 10:04 am

ప్రేమ, క్షమాగుణం మన జీవన మార్గం కావాలి..

ప్రేమ, క్షమాగుణం మన జీవన మార్గం కావాలి.. తిరువూరు, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని

ప్రభ న్యూస్ 3 Apr 2026 10:03 am

Road Accident : అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి స్పాట్ డెడ్

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 3 Apr 2026 10:03 am

Missed DRIP Opportunities Under the Previous Government Now Haunt Andhra Pradesh

The delay in taking up key dam rehabilitation works in Andhra Pradesh under the DRIP Phase II program is not an isolated administrative issue. It reflects a pattern that began during the previous government’s tenure. The issue is a direct consequence of opportunities that were not utilised when they were available. The Dam Rehabilitation and […] The post Missed DRIP Opportunities Under the Previous Government Now Haunt Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 9:58 am

మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగు పోస్ట్ 3 Apr 2026 9:56 am

కరీంనగర్ లో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ ‌- పెద్దపల్లి బైపాస్‌ లోని బొమ్మకల్‌ ఫ్లైఓవర్‌ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. 

మన తెలంగాణ 3 Apr 2026 9:55 am

Telangana : తీరని గ్యాస్ కష్టాలు.. ఎంత పొడవు క్యూ అంటే?

తెలంగాణలో ఎల్.పి.జి గ్యాస్ కష్టాలు తీరడం లేదు.

తెలుగు పోస్ట్ 3 Apr 2026 9:51 am

సీనియర్ కాంగ్రెస్ నేతను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే..

సీనియర్ కాంగ్రెస్ నేతను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే.. నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి

ప్రభ న్యూస్ 3 Apr 2026 9:48 am

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా ‘రాకాస’

జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల... ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ మ్యాడ్ నెన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ “క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా, ఎంటర్‌టైన్ అయ్యేలా మా ‘రాకాస’ ఉంటుంది. పూర్తిగా హారర్, థ్రిల్లర్ అని కాకుండా.. కామెడీ, ఫాంటసీ, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల అంశాలతో ఉంటుంది”అని అన్నారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ “రాకాస’ గురించి రామ్ చరణ్ చాలా గొప్పగా మాట్లాడారు. ఈ చిత్రం ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది”అని తెలిపారు. మానస శర్మ మాట్లాడుతూ “రాకాస’లో కథ చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మన జానపదాలు, కల్చర్ అనేవి ఈ తరానికి అర్థమయ్యేలా, నచ్చేలా ఈ మూవీని తీశాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నయన్ సారిక, మన్యం రమేష్, జీ స్టూడియో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య పాల్గొన్నారు. 

మన తెలంగాణ 3 Apr 2026 9:44 am

Narendra Modi : నేడు పుదుచ్చేరికి ప్రధాని

నేడు పుదుచ్చేరిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 3 Apr 2026 9:43 am

తొలి తెలుగు ఏఐ సినిమా

చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తూ, సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా ‘అంబ’స్ రివెంజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు, క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారంచుడూతూ ‘అంబ’స్ రివెంజ్ ప్రాజెక్టును అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగిస్తూ విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నామని అన్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 9:36 am

Summer Effect : ఇవేమి ఎండలు...పెనం మీద ఉన్నట్లుందిరా మామా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలుగు పోస్ట్ 3 Apr 2026 9:32 am

నేడు తారాగిరి యుద్ధనౌక జాతికి అంకితం

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 3 Apr 2026 9:28 am

వైభవంగా స్వామివారి కల్యాణం..

వైభవంగా స్వామివారి కల్యాణం.. జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరుమలగిరి కొండ

ప్రభ న్యూస్ 3 Apr 2026 9:15 am

Crowd Pulling Actors: Nani at the Top

Gone are the days when the audience rushed to theatres to watch their favorite stars on the silver screen irrespective of the content and the genre. The new-age audience are focused on the content and are deciding whether to watch a film in theatres or in the OTT space. The films of several top stars […] The post Crowd Pulling Actors: Nani at the Top appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 9:13 am

IPL 2026 : నేడు మరో బిగ్ ఫైట్

నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది

తెలుగు పోస్ట్ 3 Apr 2026 9:11 am

రంగస్థలం.. సర్వం సిద్ధం..

రంగస్థలం.. సర్వం సిద్ధం.. యడ్లపాడు, ఆంధ్రప్రభ : యడ్లపాడు గ్రామస్తులతో కలిసి కళామతల్లికి

ప్రభ న్యూస్ 3 Apr 2026 9:06 am

హన్మకొండలో మళ్లీ ఆడపిల్ల పుడుతుందని... భార్య పిల్లలను స్విమ్మింగ్ పూల్ లో తోసేసి... చంపిన భర్త

ఐనవోలు: హన్మకొండ జిల్లాలో ఐనవోలు మండలం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య ఇద్దరు కూతుళ్లను భర్త చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పున్నేలు గ్రామంలో అజారుద్దీన్, పర్హాత్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతుళ్లు ఉమేరా (8), అయేషా(6) ఉన్నారు.   స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన అనంతరం ఫర్హాత్ రెండు సార్లు గర్భం దాల్చగా ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అబార్షన్ చేయించాడు.  నాలుగేళ్ల అనంతరం మళ్లీ గర్భవతి కావడంతో ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్యను అబార్షన్ చేయించుకోవాలని భర్త ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో భార్య పిల్లలను తమ స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి, అందులో తోసేసి హత్య చేసి ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజారుద్దీన్ పట్ల అనుమానం ఉందని ఫర్హాత్ తండ్రి పోలీసులకు తెలపాడు. తండ్రిని అదుపులోకి తీసుకుని తనదైనశైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

మన తెలంగాణ 3 Apr 2026 9:02 am

Gold Price Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు ఎంతంటే?

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

తెలుగు పోస్ట్ 3 Apr 2026 8:57 am

Tirumala : నేడు తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. మూడు రోజులు హెవీ రష్

తిరుమలలో భక్తుల రద్దీ కొంత పెరిగింది.

తెలుగు పోస్ట్ 3 Apr 2026 8:40 am

ఎంఎల్ఎ అరవ శ్రీధర్‌ అనుచరుల రౌడీయిజం... పట్టపగలు నడిరోడ్డుపై బాధితురాలిపై దాడి

అమరావతి: జనసేన ఎంఎల్‌ఎ అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళలపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం తెలపడంతో రైల్వేకోడూరులో ఎంఎల్‌ఎ అరవశ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర, జనసేన కార్యకర్తలతో ప్రధాని రహదారి పైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అప్పుడే సదరు ఎంఎల్‌ఎ బాధితురాలు, తన లాయర్‌తో కలిసి టోల్‌గేట్ వద్ద పూల దుకాణానికి వచ్చారు. ఎంఎల్‌ఎ అరవ శ్రీదర్, అనుచరులు ఆమెను గమనించి దాడికి పాల్పడ్డారు. నానా హంగామా సృష్టించారు. అక్కడ ఉన్నవారిని భయబ్రాంతులకు గురి చేశారు. నడిరోడ్డుపై బాధితురాలును బూతులు తిట్టడంతో ఆమెను కొట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించిన వాళ్ల చేతిలో లాఠీ తీసుకొని లాయర్, ఆమె సోదరుడు గోపీపై దాడికి పాల్పడ్డారు. ఆమె నడిరోడ్డుపై పరుగులు తీసిన ఆమె వెంటపడి మరి కొట్టారు. స్థానిక జర్నలిస్టులు వీడియో తీస్తుండగా వారిని కూడా బెదిరించారు. ఎంఎల్‌ఎ అరవ శ్రీధర్ సమక్షంలో ఈ ఘటన జరిగింది. 

మన తెలంగాణ 3 Apr 2026 8:36 am

గుడివాడలో విద్యార్థిని బలవన్మరణం..

గుడివాడలో విద్యార్థిని బలవన్మరణం.. గుడివాడ – ఆంధ్రప్రభ : ‘అనారోగ్యంతో పరీక్ష బాగా

ప్రభ న్యూస్ 3 Apr 2026 8:30 am

Paralament : మూడు రోజులు ప్రత్యేక సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు తిరిగి ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 3 Apr 2026 8:25 am

దళిత మహిళా సర్పంచ్ పై దాడి యత్నం..

దళిత మహిళా సర్పంచ్ పై దాడి యత్నం.. కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్

ప్రభ న్యూస్ 3 Apr 2026 8:23 am

ఆయన సహకారంతో పరిష్కరిస్తాం..

ఆయన సహకారంతో పరిష్కరిస్తాం.. రేగొండ, ఆంధ్రప్రభ : వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో సర్పంచ్ కాడవేన

ప్రభ న్యూస్ 3 Apr 2026 8:16 am

AA22 Glimpse: Why is it on Hold?

Icon Star Allu Arjun is celebrating his birthday on April 8th and his fans are eagerly waiting for an update from AA22, his upcoming film directed by Atlee. The team is working hard and they have kept everything under the wraps without a single leak. Atlee and his team planned to release a glimpse from […] The post AA22 Glimpse: Why is it on Hold? appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 8:15 am

అదే మా మొదటి ప్రాధాన్యత..

అదే మా మొదటి ప్రాధాన్యత.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో మౌలిక

ప్రభ న్యూస్ 3 Apr 2026 8:10 am

IPL 2026 : కోల్ కత్తాపై హైదరాబాద్ అద్భుత విజయం

కోల్ కత్తా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

తెలుగు పోస్ట్ 3 Apr 2026 8:02 am

Israel - Iran War : మధ్యప్రాచ్య యుద్ధం ఆగేట్లు లేదు.. ఎన్నిరోజులు సాగుతుందో?

మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసే లక్షణాలు శుక్రవారం కనిపించలేదు

తెలుగు పోస్ట్ 3 Apr 2026 7:44 am

పల్నాడు జిల్లాలో ప్రేమపెళ్లి... బంగారం ఎత్తుకెళ్లిందని?... కూతురును చంపేసిన తండ్రి

అమరావతి: ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురును తండ్రి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చంద్ర శీను, గంగ అనే దంపతులు మాచర్లలో జీవిస్తున్నాడు. ఈ దంపతులకు చౌడేశ్వరి(22), కుమారుడు ఉన్నాడు. జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజుతో చౌడేశ్వరికి పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది. తన కూతురును ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చంద్రశీను నిర్ణయం తీసుకున్నాడు. రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా చౌడేశ్వరిని ప్రేమించిన నాగరాజుతో వెళ్లిపోయింది. దీంతో తన ఇంట్లో బంగారం తీసుకొని కూతురు పారిపోయిందని స్థానిక పోలీస స్టేషన్‌లో చంద్రశ్రీను ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కూతురు, నాగరాజును పిఎస్‌కు తీసుకొచ్చారు. కట్టుబట్టలతోనే బయటకు వచ్చామని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లలేదని తెలిపారు. ఐదు రోజులు పుట్టింట్లో ఉండి తరువాత భర్త వద్దకు వెళ్లేలా ఒప్పందం రాసుకున్నారు. మార్చి 19న భర్త ఇంటికి వెళ్లాల్సి ఉండగా మార్చి 18న ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం తెలిపింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో ఆమె ఊపిరాడక చనిపోయిందని తేలడంతో తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తన మేనల్లుడు పచ్చిపాల శ్రీనుతో కలిసి యువతి ముఖంపై దిండు అదిమిపెట్టి చంపేశారు. ప్రేమ పెళ్లి చేసుకుందని కోపంతో తన కూతురు చంపానని వివరించారు. 

మన తెలంగాణ 3 Apr 2026 7:42 am

Israel - Iran War : హోర్ముజ్‌ జలసంధిపై టెన్షన్... 41 దేశాల సమావేశం

హోర్ముజ్‌ జలసంధిని మళ్లీ తెరవాలని నలభైకిపైగా దేశాల ప్రతినిధులు గురువారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

తెలుగు పోస్ట్ 3 Apr 2026 7:32 am

వాగులో పడి విద్యార్థులు మృతి..

వాగులో పడి విద్యార్థులు మృతి.. చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం నష్కల్

ప్రభ న్యూస్ 3 Apr 2026 7:24 am

గ్రామసభ బహిష్కరించిన కోల్కొంద సర్పంచ్..

గ్రామసభ బహిష్కరించిన కోల్కొంద సర్పంచ్.. వికారాబాద్, ఆంధ్రప్రభ : గత రెండు విడుతలుగా

ప్రభ న్యూస్ 3 Apr 2026 7:16 am

Obesity |కొత్త అధ్యయనం ఏమి చెబుతోంది..?

Obesity | కొత్త అధ్యయనం ఏమి చెబుతోంది..? Obesity | ప్రపంచంలో ఊబకాయం

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:43 am

Andhra Prabha SPL Story |భారత్‌కు సంక్షోభం ఒక అవకాశమా.?

Andhra Prabha SPL Story | భారత్‌కు సంక్షోభం ఒక అవకాశమా.? Andhra

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:32 am

3rdAprilchintana |గుడ్‌ ఫ్రైడే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..

3rdAprilchintana | గుడ్‌ ఫ్రైడే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత.. 3rdAprilchintana |యూద మత చరిత్ర

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:15 am

3rdApril2026 |శుక్రవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

3rdApril2026 | శుక్రవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 3rdApril2026 |

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:00 am

గ్రూప్-1 ఫలితాలపై జోక్యానికి సుప్రీం నో

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీ వివాదానికి శుభం కార్డు పడింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రూప్1కు సంబంధించిన 563 పో స్టుల నియామకాలపై దాఖలయిన పిటిషన్లను గురువారం కొట్టేసింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారించడానికి మెరిట్స్ లేవని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం పేర్కొంది. దీంతో గ్రూప్ 1 పోస్టుల నియామక వివాదానికి తెరపడినట్లయ్యింది. కాగా, గ్రూప్ 1 పోస్ట్‌ల భర్తీ కి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చే స్తూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. నియామకాల్లో అవకతవలు జరిగాయిని, మూల్యాంకనంలో త ప్పులున్నాయని, నోటిఫికేషన్‌ను రద్దు చే యాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ల ను విచారించిన హైకోర్టు గ్రూప్ 1 నియామాల్లో అవతవకలు కనిపించడంలేదని పేర్కొంటూ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పును పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. వాదనల సందర్భంగా హైకోర్టు తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్లు సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో టిజిపిఎస్‌సి తరపు న్యాయవాదులు జోక్యం చేసుకుని నియామక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. అవకతవకల జరిగాయని చెప్తున్న అంశాలు అభ్యర్థుల అపోహలు మాత్రమేనని, మూడు సార్లు పరీక్షా పత్రాలు మూల్యాంకనం చేసినట్లు కోర్టుకు వివరించారు. దీంతో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1కు చెందిన 563 పోస్ట్‌ల భర్తీని ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని పక్కనబెట్టడానికి తగిన ఆధారాలు పిటిషన్‌లో లేవని పేర్కొంది. హైకోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని పరిశీలించి, తదుపరి ఆదేశాలను జారీ చేసిందని, అందులో తాము జోక్యం చేసుకోదలుచుకోలేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

మన తెలంగాణ 3 Apr 2026 5:30 am

గ్యారంటీల అమలు చూడడానికి తెలంగాణకు రండి

మనతెలంగాణ/హైదరాబాద్: యూడిఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి తమ ట్రాక్ రికార్డు పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. కేరళం ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే తాము గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా  చూపుతామని సిఎం తెలిపారు. కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి యూడిఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో గురువారం సిఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరాయి విజయన్ హయాంలో ముగిసిందని, ఇక యూడిఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు. మోడీ బ్రదర్స్... పినరాయి.. కెసిఆర్‌ల మధ్య పోలికలు.. ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశాన్ని, కేరళంను మోడీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోడీ విజయన్‌ను ఉద్దేశించి సిఎం వ్యాఖ్యానించారు. దేవుడి సొంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికి రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సిఎం లేవనెత్తారు. కేరళంలో గత పదేళ్లుగా పినరాయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతోందని, అలాగే, 2014 నుంచి సుమారు పదేళ్ల పాటు కెసిఆర్ తెలంగాణను పాలించారన్నారు. పినరాయి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరాయి విజయన్, కెసిఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 2023లో తెలంగాణలో మాదిరి మార్పే ఈసారి కేరళంలో చోటుచేసుకుంటుందని సిఎం అన్నారు. పినరాయి విజయ్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. యూడిఎఫ్ కార్మికుల కూటమి పో మోనే విజయా వ్యాఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అని, మోడీలా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, విమర్శించకుండా ఉండటం తన స్వభావం కాదని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రానికి రావలసిన నిధుల సాధన తమ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరుణ కాదని అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని సిఎం తెలిపారు. యూడిఎఫ్ కార్మికుల కూటమి అని, కూటమిలో నిజాయితీగల నాయకులు ఉన్నారని సిఎం వ్యాఖ్యానించారు. ఆర్టీసిని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చాం కేరళంలో యూడిఎఫ్ గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని సిఎం తెలిపారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో పాటు ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని సిఎం వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసిని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని సిఎం తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలను బస్సుల యజమా నులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలం గాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుపనున్నామని సిఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కెపిసిసి ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కేరళ సిఎల్పీ నేత వి.డి.సతీషన్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీప్‌దాస్ మున్షీ, యూడిఎఫ్ కన్వీనర్ ఆదూర్ ప్రకాష్, ఐయూఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.కె.కున్హాలికుట్టి తదితరులు పాల్గొన్నారు. కేరళంలో ఇందిరా గ్యారంటీలు ఇలా... ‘కేరళ గెలుస్తుంది - యూడిఎఫ్ నడిపిస్తుంది’ అనే నినాదంతో ‘ఇందిర గ్యారంటీ’ పేరుతో పలు ఆకర్షణీయమైన పథకాలను తమ ఎన్నికల హామీలుగా యూడిఎఫ్ ప్రకటించింది. 1.కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలోని ఇందిరా ఐదు గ్యారంటీలు 2.కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 3.కాలేజీ చదువుతున్న బాలికలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు 4.మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా 5.యువతకు స్వయం ఉపాధి కోసం ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 6.ఐదు గ్యారంటీలతో పాటు సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి ఐదు డ్రీమ్ ప్రాజెక్టులు, వయనాడ్‌లో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు తదితర వాగ్దానాలు ఉన్నాయి.

మన తెలంగాణ 3 Apr 2026 5:00 am

మూసీ ప్రాజెక్టుకు భారీ ఊరట

మనతెలంగాణ/హైదరాబాద్: మూసీనది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బిఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది. దీంతో మూసీ ప్రక్షాళన ప నులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అ డ్డంకి తొలగిపోయినట్లయింది. అయితే, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రా జెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పను లు జరుగుతున్నాయని కార్తీక్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రాజకీ య దురుద్ధేశ్యంతోనే కార్తీక్‌రెడ్డి పిటిషన్ వే శారని ప్రభుత్వం వాదించింది. దీంతో పి టిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ పిటిషన ర్ తన వాదనలకు సంబంధించి ఎటువం టి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమ ని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యునల్ అభిప్రాపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తాజాగా నేషల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూ సీలో మురుగునీరు కలవకుండా ఎస్టీపి ల నిర్మాణం, నది పరీవాహక ప్రాంతాల్లో రి టైనింగ్ వాల్స్, చెక్‌డ్యామ్‌ల ఏర్పాటు వం టి పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 4:30 am

కెసిఆర్ సమ్మతితోనే 7మండలాల విలీనం

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కుటుంబానికి ఏటిఏంలాగా మారిందని కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కెసిఆర్ సొంత డబ్బుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా..? లేక ప్రజల సొమ్ముతో కట్టారా..? అని ప్రశ్నించారు. రాజ్యసభలో గురువారం నాడు అమరావతి బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర జలశక్తి మం త్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ ఎంపి సురేష్‌రెడ్డి తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టుపై అనేక ఆరోపణలతో కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని నివేదికలు వచ్చాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగాయని ఆరోపించారు. కాళేశ్వరం వల్ల ఉగయోగం లేదని నివేదికలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు కట్టేందుకు రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కిషన్‌రెడ్డి నిలదీశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. భద్రాచలంలో ఉన్న గ్రామాలు ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చినప్పుడు కెసిఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ కుటుంబంతో సహా వెళ్లి సోనియా గాంధీ ఇంటికి వెళ్లలేదా, అప్పుడు గుర్తుకు రాలేదా ఏడు మండలాలు అంటూ ఎంపి సురేష్‌రెడ్డిపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి కెసిఆర్‌ను జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. దీంతో ఎంపి సురేష్‌రెడ్డికి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మధ్య తీవ్ర మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పిల్లర్లు కొట్టుకుపోతే మొత్తం ప్రాజెక్టు వృధానా..?: ఎంపి సురేష్‌రెడ్డి కాళేశ్వరం ఒక డ్యాం మాత్రమేనని రెండు పిల్లర్లు కొట్టుకుపోతే మొత్తం ప్రాజెక్టు వృథా అన్నట్లు మాట్లాడడం సరికాదని రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే ప్రాజెక్టు పనికి రాదంటున్నారని సురేశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు సిఆర్ పాటిల్, కిషన్‌రెడ్డిలతో జరిగిన వాగ్వాదంలో సురేష్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం గురించి కేంద్రమంత్రి ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు నదిలో కొట్టుకుపోయాయని చేసిన ఆరోపణపై సురేష్‌రెడ్డి స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు వృథా అన్నట్లుగా మాట్లాడారని అన్నారు. తెలంగాణతో పాటు ఏపీ కూడా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని సురేష్‌రెడ్డి తెలిపారు. విభజన తీరుపై బీజేపీ తరచుగా విమర్శలు చేస్తోందని సురేశ్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తల్లిని చంపి బిడ్డను తీశారంటూ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. రాష్ట్రాలు వేరైనప్పటికీ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉందామని కేసీఆర్ సైతం చెప్పారని సురేశ్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో ఏపీ రాజధాని అమరావతికి కేసీఆర్ తన మద్దతు తెలిపారని చెప్పారు. దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలబెట్టారని అన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కనీసం చర్చ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేయకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపించామని సురేశ్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై కేంద్రమంత్రి పాటిల్ వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు. రెండు రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని సురేశ్ రెడ్డి సూచించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాళేశ్వరం కట్టాము: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరమని అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు రుణాలతో కాలేశ్వరం కట్టామని వివరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాలేశ్వరం నిర్మించామని చెప్పుకొచ్చారు. కాలేళ్వరంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని రవిచంద్ర విమర్శించారు. వికసిత ఆంధ్రప్రదేశ్‌కి వికసిత రాజధాని అవసరం: ఎంపీ కె.లక్ష్మణ్ వికసిత ఆంధ్రప్రదేశ్ కి వికసిత రాజధాని అవసరమని బిజెపి రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ అన్నారు. రాజ్యసభలో గురువారం అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రజలు రాజధాని సాకారం కోసం కలలు కన్నారని, ప్రధాని మోడీ సంకల్పంతో సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు రాజధాని కోసం సుధీర్ఘంగా పోరాడారని, ఆ పోరాటల ఫలితం నేడు ఆవిష్కృతమైందని అన్నారు. అమరావతి బిల్లు ఆమోదానికి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందన్న ఎంపి లక్ష్మణ్ దూరదృష్టి ఉన్న నేత చంద్రబాబు కృషి చేశారని అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందని, అయితే వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోన్‌రెడ్డి మూడు ముక్కలాట ఆడి రైతులు, మహిళలను ఇబ్బందులకు గురి చేశారని లక్ష్మణ్ విమర్శించారు.

మన తెలంగాణ 3 Apr 2026 4:20 am

భూభారతితో రైతుకు భద్రత

మన తెలంగాణ/ఆమనగల్లు: రాష్ట్రంలో భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స మీకృత భూభారతి పోర్టల్‌ను గురువారం 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం స మీకృత భూ భారతి కింద ఎంపికైందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ని విఠాయిపల్లిలో కల్వకుర్తి  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డిలతో కలిసి సమీకృత భూ భారతి పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందాలనే లక్షంతో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆధార్ నెంబర్ వలె భూమి కల్గిన ప్రతి రైతుకు సర్వే నెంబర్‌కు భూదార్ కేటాయిస్తామన్నారు. భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే ఆ సర్వే నెంబర్‌కు సంబంధించిన సరిహద్దులుంటాయన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్షంతో సీఎం రేవంత్ ఆలోచనల మేరకు ప్రభుత్వం రెవెన్యూ శాఖ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టులో వచ్చే ఫలితాల ఆధారంగా మార్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి ఆధునిక రోవర్ సాంకేతికతను వినియోగించి, వేగవంతమైన, కచ్చితమైన సర్వేలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించండి. కల్వకుర్తి నియోజకవర్గానికి మరో 3500ల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకుగాను మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సుశిందర్‌రావు. డీఎంహెచ్‌ఓ లలితదేవి, డీఏఓ ఉష, ఆర్డీ జగదీశ్వర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ యాట గీత నర్సింహా, మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్యనాయక్, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్, తహశీల్దార్ మహ్మద్ ఫయూమ్ ఖాద్రీ, పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, బాలాజి సింగ్, భట్టు కిషన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 4:00 am

యుద్ధ విరమణ ఇప్పట్లో లేనట్లేనా?

వాషింగ్టన్ ః అమెరికా సేనలు నిర్ణీత లక్షాన్ని పూర్తి చేస్తాయని , ఈ క్రమంలో ఇప్పటి యుద్ధంలో సత్వర, నిర్ణయాత్మక , అత్యద్భుత విజయాలు సాధిస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో యుద్ధం , నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దశలో అమెరికన్లను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. తమ ఆపరేషన్‌కు సంబందించి అత్యంత కీలక ఘట్టాలు దాదాపుగా సంపూర్తి దశకు చేరాయని తమ అత్యంత ప్రాధాన్యతాక్రమపు (ప్రైమ్‌టైమ్) ప్రసంగంలో తెలిపారు. ఇరాన్‌తో యుద్ధంలో లక్షాలను ఛేదించడం జరిగింది. ఈ విషయంలో గణనీయ ప్రగతి సాధించామని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌కు చెందిన క్షిపణి ఉత్పత్తి సామర్థం దెబ్బతీశామని, నౌకదళాన్ని దిగ్బంధం చేశామని వివరించారు. ఇకపై ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం సంతరించుకోబోదనే నమ్మకం తమకు కుదిరిందన్నారు. ఇరాన్ పరోక్ష సాయుధ శక్తులు ఇకపై ఆయా ప్రాంతాలలో అస్థిరతలకు పాల్పడే అవకాశం లేదన్నారు. మధ్యప్రాచ్యం చమురు మనకు అవసరం లేదు. వారి వద్ద ఉన్నవి ఏవీ కూడాఅమెరికాకు అవసరం లేదు. నిజానికి మిడిలిస్టు వ్యవహారాలకు అమెరికాకు సంబంధం లేదు. అయితే ఈ ప్రాంతానికి సహకరించేందుకు అమెరికా ముందు నిలుస్తుందని ట్రంప్ చెప్పారు. అమెరికాలో ఇంధన కొరత ఛాన్సే లేదు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆదిపత్యం, నౌకలకు బ్రేక్‌తో అమెరికాలో చమురు , గ్యాస్ ధరలు పెరుగుతాయనే భయాందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికన్లకు దండిగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. సొంతంగా ఎటువంటి పరిస్థితిని అయినా తట్టుకునే సామర్థం ఉందని తెలిపారు. తాము చేపట్టిన డ్రిల్ బేబీ డ్రిల్ చర్యలతో దేశీయ చమురు ఉత్వత్తి గణనీయంగా పెరిగిందని, చమురు వెలికితీతను ప్రస్తావించారు.సౌదీ, రష్యాల కోటా కలిపితే ఎంత ఉత్పత్తి అవుతుందో అంతకు మించి అమెరికా చమురు దిగుబడి ఉందని అమెరికన్లకు భరోసా ధోరణితో తెలిపారు. మనకు హర్మూజ్ దారి అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మార్గం కోరుకునే వారు దీనిని లాక్కోవల్సి ఉంటుంది. దీనిని విలసిల్లేలా చేయాలని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లోని క్రాస్‌హాల్ నుంచి ట్రంప్ ప్రసంగం సాగింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత టీవీ, మీడియా సంస్థలు వెలువరించాయి. దేశ నాయకులు అంతమొందారని తెలిపారు. ఇరాన్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతోందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికన్లు ఓపిక పట్టాలి ఇరాన్ అమెరికా మధ్య చిరకాల ఉద్రిక్తతలు ఉన్నాయని, ఇప్పటి ఘట్టం కొంతలో కొంత మార్పుతో పాతదే అన్నారు. మిడ్‌టర్మ్ ఎన్నికల దశలో అమెరికా ఓటర్లు మరికొంత ఓపిక పట్టాలని ట్రంప్ పరోక్షంగా కోరారు. ఇంతకు ముందటి ఘర్షణల గురించి ప్రస్తావించారు.. మొదటి ప్రపంచ యుద్ధం ఏడాదిపై ఏడు నెలల ఐదురోజులు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం ఏకంగా మూడు సంవత్సరాల ఎనిమిది నెలల పాతిక రోజులు సాగింది. కొరియా, వియత్నాం, ఇరాక్ వార్‌ల గురించి తెలిసిందే. వియత్నాం యుద్ధంలో అమెరికా దాదాపుగా 20 సంవత్సరాలు కట్టుబాటుతో మగ్గాల్సి వచ్చింది. 

మన తెలంగాణ 3 Apr 2026 3:40 am

కఠినంగా కెమిస్ట్రీ.. మధ్యస్తంగా మ్యాథ్

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్ర వేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ ప్రశ్నలు మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్న ట్లు నిపుణులు పేర్కొన్నారు. జెఇఇ మెయిన్ తు ది విడత పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈనెల 8వ తేదీ వరకు జరగను న్న ఈ పరీక్షలను దేశ వ్యాప్తంగా దాదాపు 11.23 లక్షల మంది రాయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలిపింది. గురువారం జరిగిన పరీక్షలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ప్రశ్నలు కొంత సులువుగా రాగా, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా,మ్యాథ్స్ మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా ఉన్నట్లు పలువురు విద్యార్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఫిజిక్స్‌లో ముఖ్యమైన చాప్టర్ల నుంచే ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. ఎలక్ట్రోమాగ్నెటిజమ్ చాప్టర్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. ఆప్టిక్స్, వేవ్స్ నుంచి కొన్ని ప్రశ్నలు అడిగారని, మెకానిక్స్ విభాగం నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రశ్నలకు ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ.. పేపర్ మధ్యస్థంగానే ఉందని తెలిపారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ ప్రశ్నలు కొంత కఠినంగానే ఉందని, ఆర్గానిక్, ఇనార్గానిక్ మధ్య దాదాపు సమానంగా ప్రశ్నలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నలకు కాలిక్యులేషన్స్ చేయాల్సి రావడం, అందుకు ఎక్కువ సమయం పట్టడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్‌పై కొంత ప్రభావం పడిందని చెబుతున్నారు. మ్యాథ్స్ మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా, ఎక్కువ సమయం తీసుకొనేలా ఉందని తెలిపారు. ఈ విభాగంలో జాగ్రత్తగా కాలిక్యులేషన్స్ చేయాల్సినవి, టైం మేనేజ్‌మెంట్ అత్యంత కీలకంగా మారిందని తెలిపారు.

మన తెలంగాణ 3 Apr 2026 3:30 am

శుక్రవారం రాశి ఫలాలు (03-04-2026)

మేషం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభం ఆర్థిక వ్యవహారాలలో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి. మిధునం నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. సింహం ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కన్య వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయట పడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వృశ్చికం సోదరులతో కలహాల సూచనలు ఉన్నవి. నూతన ఋణాలు చేస్తారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ధనస్సు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. మకరం భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉన్నవి. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. కుంభం ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. మీనం వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.  

మన తెలంగాణ 3 Apr 2026 12:20 am

Shukra Dosha |శుక్రగ్రహ దోష లక్షణాలు, ఆరోగ్య సమస్యలు మరియు ప్రభావవంతమైన పరిహారాలు

Shukra Dosha |రాశి చక్రంలో శుక్రగ్రహ దోష కారణాలు, ప్రభావాలు, నివారణ మార్గాలు

ప్రభ న్యూస్ 3 Apr 2026 12:04 am

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం

ఐపిఎల్ సీజన్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో కేవలం 161 పరుగులకే కుప్పకూలింది. రఘువంశీ 29 బంతుల్లోనే 52 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఫిన్ అలెన్ 7 బంతుల్లోనే 28 పరుగులు సాధించాడు. కెప్టెన్ రింకు సింగ్ (35) తప్ప మిగతా వారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కట్ మూడు, నితీశ్, మలింగ రెండేసి వికెట్లను పడగొట్టారు. మెరుపు ఆరంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు తొలి బంతి నుంచే చెలరేగి పోయారు. భారీ షాట్లతో కోల్‌కతా బౌలర్లను హడలెత్తించారు. వీరిని కట్టడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు హెడ్ అటు అభిషేక్‌లు తమ మార్క్ షాట్లతో అలరించారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో స్కోరు సునామీల పరిగెత్తింది. చెలరేగి ఆడిన హెడ్ 21 బంతుల్లోనే ఆరు బౌండరీలు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 82 పరుగులు జోడించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 3 ఫోర్లతో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడిన అభిషేక్ 21 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన హెన్రిచ్ క్లాసెన్ (52) పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి (39) పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ స్కోరు నమోదు చేసింది.

మన తెలంగాణ 2 Apr 2026 11:17 pm

హర్మూజ్‌పై ఇరాన్ పట్టు.. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లు

ఇప్పటి వరకూ ఇరాన్ బలగాలు హర్మూజ్ జలసంధిలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు బలప్రదర్శనకు దిగుతూ వస్తున్నాయి. దాదాపు పాతిక వరకూ సరుకు నౌకలపై దాడికి దిగారు. ఇక పలు దేశాలు కలిసికట్టుగా హర్మూజ్ నుంచి రాకపోకల ప్రారంభానికి ఒత్తిడి తీసుకువస్తామని చెపుతున్నప్పటికీ ఇప్పటి యుద్ధ పరిస్థితిలో ఈ విషయంలో అడుగు ముందుకు పడలేదు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఇరాన్ సానుకూల చర్య ద్వారా హర్మూజ్ మార్గం పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ దౌద్య మార్గాలను, రాజకీయ చర్యలను ,చేపడుతామని తెలిపారు.ఈ క్రమంలో ఆయన ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పుడు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 108 డాలర్లు స్థాయికి చేరింది. యుద్ధం ఆరంభం అయిన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే ఇప్పుడు ఇది 50 శాతం పెరుగదలను చవిచూసింది. భారత్ సహా కొన్ని అత్యంత సన్నిహిత మిత్రదేశాలకు తప్పితే మిగిలిన దేశాల చమురు నౌకలకు ప్రవేశం లేదని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది. అయితే భారత్ చమురు నౌకల రాకపోకలు కూడా ఈ ప్రాంతం నుంచి చాలా జాప్యం అవుతున్నాయి. ఇరాన్‌లో ఇప్పటివరకూ జరిగిన దాడుల ఘటనలలో మృతుల సంఖ్య 1900 దాటింది, ఇజ్రాయెల్‌లో 20 మంది వరకూ చనిపోగా, గల్ఫ్‌లో దాడులలో పాతిక మందికి పైగా చనిపోయారు. వీరిలో భారతీయులు, పాకిస్థానీయులు కూడా ఉన్నారు. ఇప్పటి దాడుల క్రమంలో అమెరికా సైనికులు 13 మంది హతులయ్యారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:50 pm

ఈ నెల 18న మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డుకు పోలింగ్

మక్తల్‌లో బిజెపి అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప మరణం వల్ల వాయిదా పడిన మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 20వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2 నుంచి 6 వరకు బిజెపి అభ్యర్థి నామినేషన్ స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని తెలిపారు. ఈనెల 7న నామినేషన్ పరిశీలన, 8న అప్పీల్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 20వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా కారణాలతో రీ పోలింగ్ అవసరమైతే మరుసటి రోజు అంటే ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:36 pm

ఈ నెల 5న ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నెల 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో టాటా ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ మల్కాజ్‌గిరి ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నాం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. నాగోల్ నుంచి హబ్సీగూడ వయా ఉప్పల్ జంక్షన్ మీదుగా వెళ్లే వారు, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ వయా ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. ప్రయాణికులు ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైలును ఉపయోగించుకోవాలి. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను హెచ్‌ఎండిఏ ఉప్పల్ భగాయత్ ఎంట్రెన్స్ వద్ద నుంచి మెహిఫిల్ హోటల్ మీదుగా నాగోల్, ఎల్‌బి నగర్ వైపు వెళ్లాలి. ఎల్‌బి నగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు నాగోల్ మెట్రో వద్ద యూటర్న్ తీసుకుని నాగోల్ , హెచ్‌ఎండిఏ భగాయత్, టయోటా యూటర్న్, బోడుప్పల్, చెంగిచెర్ల, ఐఓసిఎల్, చెర్లపల్లి ఫ్లైఓవర్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సీగూడ ఎక్స్ రోడ్డు మీదుగా నాచారం, ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చెర్లపల్లి, ఘట్ కేసర్ వైపు వెళ్లాలి. రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు స్ట్రీట్ నంబర్ 8 మీదుగా హబ్సీగూడ ఎక్స్ రోడ్డు, నాచారం,ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి. వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ మీదుగా అబ్దుల్లార్‌మెట్, ఎల్‌బి నగర్, దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఎల్‌బి నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలి.

మన తెలంగాణ 2 Apr 2026 10:31 pm

కోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గెట్ 227

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కోల్‌కతా నైట్‌రైడర్స్  బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (46), అభిషేక్ శర్మ(48) చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరద పారించారు. ఫలితంగా పవర్‌ప్లేలో హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెస్ హఫ్ సెంచరీతో రాణించారు. నితీష్ రెడ్డి(39)  కూడా పర్వాలేదని పించారు. కోల్‌కతా బౌలర్లలో ముజరబాని 4, వైభవ్ 2, త్యాగి, అనుకుల్ తలో వికె్ తీశారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:20 pm

రహానె అరుదైన ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె అరుదైన రికార్డును సాధించాడు. గురువారం కోల్‌కతా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానె కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఐపిఎల్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన దిగ్గజాల సరసన రహానె నిలిచాడు. ఇప్పటి వరకు రహానె తన కెరీర్‌లో 200 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు రహానెతో కలుపుకుని ఐపిఎల్‌లో 11 మంది మాత్రమే 200 మ్యాచ్‌లను ఆడారు. మహేంద్ర సింగ్ ధోని (278) మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (273), విరాట్ కోహ్లి (28) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:08 pm

2 Pakistan Ships : ఇరాన్ తోఫా..! Andhra Prabha News

2 Pakistan Ships : ఇరాన్ తోఫా..! Andhra Prabha News (

ప్రభ న్యూస్ 2 Apr 2026 9:50 pm

రవివర్మ చిత్రానికి రూ.167 కోట్లు

 ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ కుంచె నుంచి జాలు వారిన చిత్రం రికార్డుల్లోకి ఎక్కింది. యశోద చిన్ని కృష్ణుడితో కలిసి పాలు పితుకుతున్న ఆయిల్ పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లు దక్కించుకుంది. దీంతో అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా తొలిస్థానం దక్కించుకుంది. 1890లలో గీసిన ఈ చిత్రాన్ని తాజాగా ముంబయిలో ప్రత్యక్ష వేలం నిర్వహించారు. సీరం ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రం రూ.118 కోట్ల అత్యధిక ధరతో రికార్డుల్లో ఉండేది.. తాజాగా అది చెరిగిపోయింది. 

మన తెలంగాణ 2 Apr 2026 9:39 pm

రవాణా శాఖ ఆదాయం 7097.38 కోట్లు

ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా శాఖకు ఆదాయం రూ.7097.38 కోట్లు సమకూరిందని రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. దీనిలో భాగంగా జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.4714.63 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.961.02 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ.78.35 కోట్లు ఫీజులు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.820.09 కోట్లు, తనిఖీల ద్వారా రూ.212.49 కోట్లు, చలాన్ల ద్వారా రూ.310.80 కోట్లు సమకూరిందని రవాణా శాఖ స్పష్టం చేసింది. 2025-.26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా 7097.38 కోట్ల తో 83.16 శాతం సాధించామని రవాణా శాఖ తెలిపింది. 2024-.25 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 2.70 శాతం వృద్ధి రేటు సాధించామని రవాణా శాఖ వెల్లడించింది. 2025-.26 సంవత్సరంలో 91,637 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రూ.769.81 కోట్ల జీవిత కాలపు పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపింది.

మన తెలంగాణ 2 Apr 2026 9:31 pm

లెక్కలు చూపని రూ.60 వేల కోట్లు ఎటు పోయాయి..?: పోరెడ్డి కిషోర్

రాష్ట్ర కాగ్ నివేదిక ప్రకారం రూ.3 లక్షల కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.2.40 లక్షల కోట్లకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చూపించిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ తెలిపారు. అంటే దాదాపు రూ.60 వేల కోట్లకు ఎలాంటి లెక్కలు చూపించబడలేదని, ఇది సుమారు 20 శాతమని తెలిపారు. అయితే ఈ రూ.60 వేల కోట్లు ఎటు వెళాయనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోరెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఈ నిధులు ఆయా మంత్రిత్వ శాఖలకు పూర్తిగా పంపించబడ్డాయా? లేక పంపించిన తర్వాత పక్కకు మళ్లించబడ్డాయా? లేదా ఆర్థిక శాఖ నుంచే పూర్తిగా విడుదల కాలేదా? లేదా బడ్జెట్ విడుదల కాగానే 20 శాతం ముందుగానే పక్కకు పెట్టబడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ నిధులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం మళ్లించిందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయని కిషోర్ పేర్కొన్నారు. మొత్తానికి ఈ డబ్బులు కొందరి జేబుల్లోకి వెళ్లాయా? లేదా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించబడ్డాయా? అనే చర్చ జరుగుతోందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలు అయిపోగానే, ఈ బడ్జెట్లో మొదటి వాటా లేదా హక్కు తెలంగాణకు కాకుండా కేరళం కోసమే అన్న చందంగా అనిపిస్తోందని తెలిపారు. అందుకు నిదర్శనంగా ఈ బడ్జెట్ అయిపోగానే రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. మొదటి వాటా మాత్రం కేరళలోని కాంగ్రెస్ పార్టీకే అన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 9:28 pm

పవర్‌ప్లేలో అదరగొట్టారు.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కెకెఆర్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరదపారించారు. వైభవ్ వేసిన రెండో ఓవర్‌లో హెడ్ 20 పరుగులు రాబట్టగా.. వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో అభిషేక్ 25 పరుగులు స్కోర్ చేశాడు. అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్(46) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఫలితంగా పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత అభిషేక్ దూకుడుగానే ఆడాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో కలిసి మంచి పరుగులు రాబట్టాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 1 వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ(47), ఇషాన్ కిషన్(14) ఉన్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 8:16 pm

క్రైస్తవ సోదరులకు సిఎం రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ రాష్ట్ర ముఖ్య్మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు త్యాగం, ధైర్యంను సిఎం గుర్తు చేసుకున్నారు. ఏసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమతత్వం బోధించిన దయామయుడు, సిలువపై ఏసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్ ఫ్రైడే’ సందేశం సందర్భంగా సిఎం వెల్లడించారు. యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

మన తెలంగాణ 2 Apr 2026 8:00 pm

రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం..

రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం.. ఎమ్మెల్యే చొరవతో రూ.5 లక్షల సాయం..సీఎంఆర్‌ఎఫ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:58 pm

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత…

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత… వింత పేర్లతో విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి…భావితరాల

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:51 pm

eiffel tower |విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం

eiffel tower | విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం eiffel tower |

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:47 pm

డయాలసిస్ రోగులు ఇక్కట్లు

డయాలసిస్ రోగులు ఇక్కట్లు మరో ఉద్దానంగా ఎ.కొండూరు ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మరో

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:45 pm

బొగ్గు స్మగ్లింగ్ కేసు..ఐప్యాక్ కార్యాలయాలపై ఇడి దాడులు

పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ (ఐప్యాక్) కార్యాల యాలపై దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరులో, కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలోనే ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసులో ఇడి అధి కారుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐప్యాక్ వ్యవస్థాపకులు రిషిరాజ్ సింగ్, ప్రతీక్ శర్మ, వినీష్ చందాకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఇడి అధికారులు సోదాలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థ ఇడి ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయాలపై దాడి చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో, సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిలో సోదాలు నిర్వహించా రు. ఐప్యాక్ వంటి వృత్తిపరమైన సంస్థకు ఇది ఒక కష్టమైన, దురదృష్టకరమైన రోజు అని ఈ దాడిపై ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా వుంటే, ఐపాక్ (ఐప్యాక్) సంస్థ, బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బిఆర్‌ఎస్), జనతా దళ్ (యునైటెడ్), శివసేన వంటి అనేక రాజకీయ పార్టీలకు వృత్తిపరమైన, సిద్ధాంతపరమైన సలహాదారుగా పని చేసింది. ఐప్యాక్‌పై ఇడి దాడులు రాజకీయ దుమారాన్ని రేకెత్తించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడులలో జోక్యం చేసుకున్నారని, పోలీసుల సహాయంతో డిజిటల్ పరికరాలు, ముఖ్యమైన పత్రాలను తొలగించి, ఏమీ స్వాధీనం చేసుకోకుం డానే సోదాలను నిలిపివేయమని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆరోపించింది. తాజాగా బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సుమారు రూ. 20 కోట్ల హవా లా నిధులను ఐప్యాక్‌కు పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డేటాను తారుమా రు చేయకుండా రక్షణ కల్పించ డం, తమ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ నుండి ఉపశమనం కల్పించడంతో సహా పలు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది.

మన తెలంగాణ 2 Apr 2026 7:41 pm

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:39 pm