సామాజిక సేవ మనందరి బాధ్యత.. పాయకాపురం, ఆంధ్రప్రభ : కల్వరి ప్రేమ ప్రార్ధన
Hyderabad : మెట్రో రైళ్లన్నీ కిటకిట.. పార్కింగ్ అంతా ఫుల్లు
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి
వేధింపులు భరించలేక.. వరంగల్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వేధింపుల కారణంగా ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. నగరంలోని మట్టెవాడ పరిధిలో నివాసం ఉంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో సంగీత(33) అనే మహిళ, కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బందోబస్తు విధులు ముగించుకుని మంగళవారం మట్టెవాడలోని తన నివాసానికి చేరుకున్న సంగీత.. రాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, శ్రీధర్ అనే కానిస్టేబుల్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంగీత, సూసైడ్ లెటర్ రాసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మట్టేవాడ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉప్పల్ డిపో వద్ద ఆర్టీసి కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా
మన తెలంగాణ బోడుప్పల్ : ఆర్టీసి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసి కార్మికుల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది.దీంతో బుధవారం ఉప్పల్ డిపో ముందు సమ్మె నిర్వహించారు.ఈ సమ్మె కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. ఆర్టీసి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో బుధవారం నుంచి ఆర్టీసి జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు ఆర్టీసి కార్మికులు ఉప్పల్ డిపో ముందు సమ్మెకు దిగారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళకుండా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ...ఆర్టీసి కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. ఆర్టీసి కార్మికుల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆర్టీసితో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వలన కరీంనగర్ లో ప్రమాదం జరిగిందని, తృటిలో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అని మండిపడ్డారు. కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
How did Koratala join NBK’s Project?
It may not be known to many but Koratala Siva met Nandamuri Balakrishna last year and discussed about directing a film. But somehow the talks did not reach the final stages and there are various inside speculations for this. Koratala Siva shares a great bond with a young Tollywood actor and Balayya kept him aside […] The post How did Koratala join NBK’s Project? appeared first on Telugu360 .
Summer Effect : ఎండలు ఇన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నాయా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి
సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు #TGSRTC#RTCStrike#Telangana#BusStrike
దశలవారీగా కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తాం: ఆర్ టిసి ఎండి
హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో ఆర్ టిసి జెఎసి నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఐఎఎస్ అధికారుల కమిటీతో జెఎసి నేతలు సుదీర్థంగా చర్చలు జరిపినప్పటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కార్మికులు డిపోల ముందు ధర్నాకు దిగారు. ఈ రోజు నుంచి ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపు నివ్వడంతో ఆర్ టిసి ఎండి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్ టిసి కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, కార్మికులు డిమాండ్లను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. రాజకీయ లబ్ది కోసమే కార్మికులను నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. ఇప్పటికే కార్మికులు డిపోలకు చేరుకొని ధర్నాకు దిగారు. మాటలు వద్దు అని చేతలే ముద్దు అంటూ నినాదాలు చేస్తన్నారు. కానీ ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపించడానికి ప్రయత్నిస్తోంది. పోలీసుల భద్రతాలో బస్సులు నడిపిస్తుండడగా ఆర్ టిసి కార్మికులు అడ్డుకుంటున్నారు.
ఏపీలో ఎల్లుండి నుంచి పాఠశాలలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి
కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి –వనపర్తి జేఏసీ
కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి – వనపర్తి జేఏసీ వనపర్తిటౌన్, ఆంధ్రప్రభ :
కార్మికుల సమ్మెతో కదలని బస్సులు
కార్మికుల సమ్మెతో కదలని బస్సులు వరంగల్, ఆంధ్రప్రభ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
Ys Jagan : కడప జిల్లాలో నేడు వైఎస్ జగన్
కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన నేడు రెండో రోజు సాగనుంది
మెట్రో స్టేషన్లకు పోటెత్తిన జనం.. ఆర్టీసీ సమ్మెతో భారీ రద్దీ #telugupost #rtcstrike #metro
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం తెల్లవారు జామునుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇక, తిరుమల వెంకన్నను 73,324 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 22,955 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Gold Prices Today : హై అలెర్ట్.. బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింంది
కరీంనగర్ లో లారీని ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు... ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఆర్ టిసి కార్మికులు సమ్మె చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను బంద్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్ల సాయంతో బస్సులను నడుపుతోంది. కరీంనగర్ 2కు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఓ ప్రైవేటు డ్రైవర్ సహాయంతో వరంగల్ కు పంపించారు. అల్గూనుర్ సమీపంలోకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ వణికిపోయారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ
ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలొగ్గదు.. పహల్గామ్ ఉగ్రదాడిపై మోడీ..
న్యూఢిల్లీ: గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి భారతదేశం ఎప్పటికీ తలొగ్గదని, అటువంటి హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఏప్రిల్ 22, 2025న ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. గత ఏడాది ఇదే రోజున జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నాను. వారిని ఎన్నటికీ మరచిపోలేము. ఈ నష్టం నుండి కోలుకుంటున్న బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక దేశంగా, మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా ఉన్నాము. భారతదేశం ఏ రకమైన ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావు అని ప్రధాని పేర్కొన్నారు కాగా, గత ఏడాది ఏప్రిల్ 22న, దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్, ప్రతీకారం తీర్చుకునేందుకు.. మే 7న భారత్ సైనిక చర్యను ప్రారంభించి, పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది.
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు కరీంనగర్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు
సూచిక బోర్డును ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వీరవల్లి టోల్ ప్లాజా వద్ద సూచిక బోర్డును కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమేప్రమాదానికికారమనిపోలీసులుభావిస్తున్నారు.
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
Karnataka : షాకింగ్.. ఇలా కూడా చేస్తారా.. ఒక యువతి మర్డర్ చేసిన తీరు చూస్తే?
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకోడని అనుమానించిన యువతి ప్రియుడిని దారుణంగా చంపేసింది.
ఆర్టీసీ సమ్మె.. మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన
మోగిన సమ్మె సైరన్.. నిలిచిన ఆర్టీసీ సర్వీసులు
మోగిన సమ్మె సైరన్.. నిలిచిన ఆర్టీసీ సర్వీసులు కొత్తూరు, ఆంధ్రప్రభ : తమ
బస్సులు బంద్ – సమ్మె ఉద్యమం ఉధృతం
బస్సులు బంద్ – సమ్మె ఉద్యమం ఉధృతం 32 డిమాండ్ల సాధన లక్ష్యంగా
IPL 2026 : ఐపీఎల్ నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్
నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది.
Road Accident : ఏపీలో రోడ్ యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
ట్రాఫిక్ పోలీసులకు మిస్ట్ ఫ్యాన్స్ #HyderabadTrafficPolice#MistFans#TrafficPolice#SummerHeat
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. వెంటనే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం
నేటి నుంచి కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పరారీలో ఉన్నారు
KVN Productions: Strict on Megastar’s Film
K Venkata Narayana, the man behind the Prestige Constructions has ventured into South Indian films. He floated KVN Productions and paid big advances to several stars. When Vijay’s last film was in trouble, KVN paid the quoted sum for Vijay and completed the film on time. The film is struggling for release and is occupied […] The post KVN Productions: Strict on Megastar’s Film appeared first on Telugu360 .
Telangana : నేడు కాళేశ్వరం కమిషన్ పై తీర్పు
కాళేశ్వరం కమిషన్ పై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది
టాలీవుడ్ లో విషాదం..చిట్టిబాబు మృతి
సినీ నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెందారు
టాలీవుడ్ లో విషాదం.. నిర్మాత చిట్టి బాబు కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని వరప్రసాద్(చిట్టి బాబు) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వెైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Telangana : ఆర్టీసీ సమ్మె అర్థరాత్రి నుంచి ప్రారంభం.. ప్రత్యామ్యాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
Telangana : ఆర్టీసీ సమ్మె అర్థరాత్రి నుంచి ప్రారంభం.. ప్రత్యామ్యాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్.. డిపోల వద్ద కార్మికుల నిరసన
తెలంగాణలో అర్దరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసి సమ్మెకు దిగింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్న టీజి ఆర్టీసి జెఎసి స్పష్టం చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ అయ్యాయి. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో డిపోల వద్ద ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఉప్పల్ డిపో వద్ద నిరసనకు దిగిన కార్మికులకు మద్దతూ తెలుపుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు, బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.ఇక, ఆర్టీసీ యాజమాన్యం.. యథావిధిగా అద్దె బస్సులు నడుపుతోంది.
America - Iran - Ceasefire : అమెరికా - ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు... ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కీలక ప్రకటన చేశారు
22ndaprilsplstory |క్రీడల ద్వారా మహిళల ఎదుగుదల
22ndaprilsplstory | క్రీడల ద్వారా మహిళల ఎదుగుదల 22ndaprilsplstory | పరిపాలనలో మహిళల
నిత్యం ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ దినపత్రికలను తిరగేసేవారికి రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదేమో అనిపించకమానదు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేంతవరకూ ప్రాణాలకు హామీ లేదంటే అతిశయోక్తి కాదు. ఏవైపునుంచి ఏ వాహనం మీదకు దూసుకువస్తుందో, ఏ మూలమలుపులో మృత్యుదేవత మాటువేసుకుని కూర్చుందో తెలియదు. తాజాగా జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ సమీపాన ఓ బస్సు లోయలో పడి, 21 మంది కన్నుమూసిన ఘటన దిగ్భ్రాంతికరం. కొండప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా మూలమలుపు వద్ద దారి కనబడకపోవడంతోనే బస్సు లోయలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారణాలు ఏవైనా, ప్రమాదం జరిగాక మృతుల బంధువులకు మిగిలేది తీరని శోకమే. ప్రమాదం మిగిల్చిన అవకరాలతో క్షతగాత్రులు జీవితాంతం దీనంగా బతుకు ఈడ్వవలసిందే. ప్రభుత్వాలు అప్పటికప్పుడు లక్షల్లో నష్టపరిహారాలను ప్రకటించవచ్చుగాక, అవేవీ కోల్పోయిన తమ బంధువులను తిరిగి తీసుకురావడానికి ఎంతమాత్రం సహాయపడవు కదా. వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై చోదకుల నిర్లక్ష్యం, పరిమితికి మించి అతివేగంగా నడపడం వంటివి ప్రమాదాలకు ప్రధాన హేతువులు కాగా, వాహనాలలోని సాంకేతిక లోపాలు సైతం పదుల సంఖ్యలో ప్రాణాలను కబళిస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. స్లీపర్ బస్సులలో ఉన్నపళంగా మంటలు చెలరేగి, అందులో ఉన్న ప్రయాణికులు సజీవంగా ఆహుతి అవుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి రాత్రివేళ బయల్దేరిన ఓ ప్రవేటు బస్సు, బయల్దేరి నాలుగు కిలోమీటర్లు దాటిందో లేదో మంటల్లో చిక్కుకోవడం ఈ తరహా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయనడానికి నిదర్శనం. ఇలాంటి ప్రమాదాలకు గల కారణాలపై నిపుణులతో అధ్యయనం జరిపించాలన్న ఆలోచన, ఒకవేళ అధ్యయనాలు జరిగినా వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో లోపిస్తున్నాయి. ప్రపంచంలోని వాహనాలలో భారతదేశంలో ఉన్నవి కేవలం ఒక్క శాతమే అయినా రోడ్డు ప్రమాదాల సంఖ్యలో మాత్రం మన దేశం అగ్రస్థానంలో ఉండటం శోచనీయం. ఏటా భారతదేశంలో 4.8 లక్షల ప్రమాదాలు జరుగుతుంటే, అందులో లక్షా డబ్భైవేలమంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారట. దేశంలో సగటున రోజూ 474 మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి నెట్ వర్క్ ఉన్నది భారతదేశంలోనే. కానీ, ఇక్కడ జాతీయ, ప్రధాన రహదారులలో అనేక లోపాలు ఉన్నాయని, బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన చోట్ల కూడా మరమ్మతులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రే స్వయంగా పార్లమెంటులో ఆ మధ్య వాపోవడం మన రహదారుల దుస్థితికి అద్దం పడుతోంది. రోడ్డు ప్రమాదాలపై సందర్భం వచ్చినప్పుడల్లా సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెడుతూనే ఉన్నా, అవేవీ పాలకుల చెవికి ఎక్కడం లేదు. రాజస్థాన్ లోని ఫలోడి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లో గత ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ ప్రమాదాలకు కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన మార్గదర్శకాలను రెండు రోజుల క్రితమే ప్రకటించింది. సురక్షితమైన రహదారి ప్రయాణం రాజ్యాంగంలోని జీవించే హక్కు (ఆర్టికిల్ 21) లో అంతర్భాగమని, ప్రమాద రహిత ప్రయాణం ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు పాలనాపరమైన నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలే ప్రాణనష్టానికి కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో రహదారి భద్రతను రాజ్యంగాబద్ధమైన బాధ్యతగా పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్దేశిత ప్రాంతాల్లో మినహా భారీ వాహనాలను జాతీయ రహదారులపై ఎక్కడబడితే అక్కడ నిలపకూడదని, రియల్ టైమ్ అలెర్టులు, జిపిఎస్ ఆధారిత ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలు, ఇ- చలాన్ల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి జిల్లాలో జాతీయ రహదారులు ఉన్న చోట జిల్లాస్థాయిలో రహదారి భద్రత టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిపై దృష్టిపెట్టాలని హితవు చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలను శిరోధార్యంగా భావించి, అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రమాదం జరిగినప్పుడల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, నష్ట పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోగానే సరిపోదని గుర్తించాలి.
22ndAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
22ndAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 22ndAprilCartoon | బెంగాల్, తమిళనాడులో ప్రచారానికి
భారత్కు చావోరేవో.. నేడు సఫారీ మహిళలతో కీలక పోరు
జోహెన్నస్బర్గ్: వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత మహిళా క్రికెట్ జట్టుకు బుధవారం సౌతాఫ్రికాతో జరిగే మూడో టి20 మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. ఇక ఇప్పటికే రెండు విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఇందులోనూ గెలిచి సిరీస్ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండు మ్యాచుల్లోనూ టీమిండియా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలం కావడంతో భారత్కు వరుస ఓటములు తప్పలేదు. ఇలాంటి స్థితిలో మూడో టి20 సవాల్గా మారింది. సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలవడం తప్పించి మరో మార్గం భారత్కు లేకుండా పోయింది. ఆతిథ్య సౌతాఫ్రికా మాత్రం విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సఫారీ టీమ్ సిరీస్పై కన్నేసింది.
ప్రియుడి కళ్లకు గంతలు కట్టి... కూర్చీలో కట్టేసి... సజీవదహనం చేసిన ప్రియురాలు
బెంగళూరు: ప్రియుడు మోసం చేస్తాడనే అనుమానంతో ప్రేమ పేరుతో అతడిని కూర్చికి కట్టేసి పెట్రోల్ పోసి దహనం చేసింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని బైదరహళ్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంజనానగర్ లో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. తుమకూరుకు చెందిన కిరణ్ పరిచయం కావడంతో అతడితో ప్రేమలో పడింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. గత కొంతకాలంగా యువతిని యువకుడు పట్టించుకోకపోవడంతో అనుమానం పెంచుకుంది. కిరణ్ తనని పెళ్లి చేసుకోడేమోనని అనుమానం కలిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించింది. ప్రియుడితో సరసాలు జరిపిన తరువాత వినూత్నంగా ప్రేమను తెలియజేస్తానని అతడిని కళ్లకు గంతలు కట్టి కూర్చీకి కట్టేసింది. అనంతరం అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకునేసరికి కూర్చీలో కిరణ్ సజీవదహనమయ్యాడు. తాను బాత్రూమ్ లో ఉన్నప్పుడు కిరణ్ కూర్చీలో కాలిపోయాడని నాటకం మాడింది. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
22ndaprilchintana |చాణక్య నీతిలో శిరస్సు ప్రాధాన్యం
22ndaprilchintana | చాణక్య నీతిలో శిరస్సు ప్రాధాన్యం 22ndaprilchintana | గౌరవం, విధేయతలో
ఆర్ టిసి బస్సు బోల్తా: పది మంది ప్రయాణికులకు గాయాలు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మార్కపురం జిల్లాలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపడింది. తుమ్మలబైలు గ్రామశివారులో ఆర్టిసి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ౩౦ మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి మార్కపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.
22ndaprileditorial |చర్చలు విఫలమైతే యుద్ధ భయం..
22ndaprileditorial | చర్చలు విఫలమైతే యుద్ధ భయం.. 22ndaprileditorial | శాంతి చర్చలకు
22aprilpahalgam |మరువని భారత్, వదలని సైన్యం!
22aprilpahalgam | మరువని భారత్, వదలని సైన్యం! 22aprilpahalgam | పహల్గామ్లో నెత్తురోడిన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్ర భుత్వం రైతులకు అండగా నిలుస్తూ రై తు భరోసా పథకం కింద రెండోవిడత ని ధులను విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తె లిపారు. దీంతో 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారని, ఈ క్ర మంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,206.06 కోట్లు నేడు (బుధవారం) జ మ కానున్నాయని మంత్రి తెలిపారు. ఇ ప్పటికే నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయి ల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి విడతలో భాగంగా రూ. 3,446.94 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఈ రెండు విడతలు కలిపి ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మొత్తం రూ. 5,653 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రైతుల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని , వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. మొత్తం సోమవారం నాటికి 71,05,572 మంది రైతుల ఖాతాల్లో రూ.5,653,00,36,827 కోట్లు జమ అయ్యాయని మంత్రి తుమ్మల తెలిపారు.
22ndApril2026 |బుధవారం నేటి పంచాంగం
22ndApril2026 | బుధవారం నేటి పంచాంగం 22ndApril2026 | దిన పంచాంగ విశేషాలుశుభ
హడావుడి ‘బిల్లు’తో సాధించిందేమిటి?
సెప్టెంబర్ 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాల ప్రత్యేక భేటీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడంతో గత 12 ఏళ్లలో మొదటిసారిగా పార్లమెంట్లో ఈ ప్రభుత్వం అనూహ్యమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. బహుశా గత మూడున్నర దశాబ్దాలలో మొదటిసారిగా ఓ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ఓటమికి గురయింది. అయితే ఈ బిల్లు ఓటమితో ప్రతిపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’ అంటూ వెంటనే ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని మోడీ, ఇతర నాయకులు దిగడం మినహా అందుకు దారితీసిన కారణాల గురించి ఆత్మపరిశీలన చేసుకొనే ప్రయత్నం చేయడం లేదు. తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని తెలిసి కూడా, ముందుగా ఎటువంటి సంప్రదింపులు, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొనే ప్రయత్నం చేయకుండా కీలకమైన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా ఈ బిల్లులను ఎందుకు తీసుకు వచ్చారో ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం ఎవ్వరి విశ్వాసాన్ని పొందలేకపోతున్నది. చివరకు బిజెపి నేతలు సైతం ప్రభుత్వ ధోరణిని అర్ధం చేసుకోలేకపోతున్నారు. మెజారిటీ లేనప్పుడు పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపి, ఇతర పక్షాల మద్దతు కూడదీసుకుని ప్రయత్నం చేయవచ్చు గదా? అనే ప్రశ్నలు ఆ పార్టీ నాయకులతోనే తలెత్తుతున్నాయి. ‘బిజెపి 11ఏళ్లుగా అధికారంలో ఉన్న మా అనుభవంలో, ఒక మహిళను ప్రధానమంత్రిగా నియమిస్తామని బిజెపి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా కూడా, మేము వారిని నమ్మము’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విశ్వాస రాహిత్యాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ప్రతి రాష్ట్రానికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచేందుకు అధికారిక సవరణ తీసుకు రావడానికి వీలుగా సభా కార్యకలాపాలను గంటసేపు నిలిపివేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదనకు, లోక్సభ చర్చ సందర్భంగా అఖిలేష్ ఇచ్చిన ఈ పదునైన సమాధానం, ప్రస్తుత రాజకీయాల స్థితిని స్పష్టం చేస్తుంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యవస్థను కొనసాగించడంలో సహకరించే పార్లమెంటరీ సంప్రదాయాలలో కీలకమైన ‘సంప్రదింపులు’ ప్రక్రియకు ఈ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలివ్వడంతో ఈ సమస్య ఏర్పడింది. 1991లో పివి నరసింహారావు ప్రధాని కాగానే నాటి ఆర్థిక దుస్థితిని తట్టుకునేందుకు రూపాయి విలువ తగ్గించాలని, అందుకోసం వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయమని ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కోరారు. కానీ ప్రధాని మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సీనియర్లు అందరూ అందుకు వ్యతిరేకిస్తారని చెబుతూ తనకు కొంత సమయం ఇస్తే పరిష్కారం ఆలోచిస్తానని చెప్పి పంపారు. ఓ గంట తర్వాత రూపాయి విలువ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయమని మన్మోహన్ సింగ్ను ఆదేశించారు. ఓ గంటలో ఏ అద్భుతం జరిగిందో తెలియక ఆయన తికమక చెందారు. విచారించగా, వెంటనే పివి నరసింహారావు నాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయీకి ఫోన్ చేసి ఈ విషయమై చర్చించి, ఆయన సహకారం కోరారు. అందుకు ఆయన ఆమోదం తెలపడంతో ప్రతిపక్షం నోరువిప్పకపోతే ఇక అభ్యంతరం ఎవ్వరు చెబుతారు? అంటూ నాటి ప్రభుత్వం ముందుకుపోయింది. వాజ్పేయీ ప్రభుత్వంలో సైతం కీలక అంశాలపై పార్లమెంట్లో బిల్లులు తీసుకువచ్చే ముందు స్వయంగా ప్రధాని, సీనియర్ మంత్రులైన అద్వానీ, జశ్వంత్ సింగ్, జార్జ్ ఫెర్నాండెస్ వంటి వారు ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రతిపక్ష ప్రముఖులతో సవివరమైన సమాలోచనలు జరిపేవారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సైతం ప్రధాని లేదా సీనియర్ మంత్రులు ప్రతిపక్ష నేతలతో తరచూ సమాలోచనలు జరిపేవారు. లేదా సాంకేతిక అంశాలైతే సంబంధిత శాఖల ఉన్నతాధికారులను పంపి ప్రతిపక్ష నాయకులకు వివరించమనేవారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు, ప్రత్యేక సమయాలలో స్వయంగా ప్రధానులు అఖిలపక్ష సమావేశాలు జరిపేవారు. కానీ నరేంద్ర మోడీ ఈ సంప్రదాయాలు అన్నింటికీ తిలోదకాలిచ్చారు. ప్రతిపక్షాలతో మాత్రమే కాకుండా సొంత పార్టీలో సైతం ఎవ్వరితో సంప్రదింపులు జరపడం జరగడం లేదు. స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖలు రాసారు. ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపవచ్చని, ఎన్నికల ప్రచారం మధ్యలో హడావుడిగా ఎందుకని ప్రశ్నించారు. ఈ బిల్లుల గురించి వివరణ ఇచ్చేందుకు అఖిలపక్ష సమావేశం జరపమని కోరారు. కానీ ప్రభుత్వం నుండి స్పందన లేదు. రాజ్యాంగ సవరణపై జరిగిన చర్చలో 103 మంది పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. వారంతా మహిళా రిజర్వేషన్ల అమలుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 2023లో ఆమోదించిన బిల్లును వెంటనే అమలు జరపమని అప్పుడే కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, ఆ విషయాన్నీ నియోజకవర్గాల పునర్విభజన, జనగణనతో కలపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం లేదు. అంటే ప్రభుత్వానికి రహస్య అజెండా ఉందని అనుమానించాల్సి వచ్చింది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల సంఖ్య పెంచుతామని హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంలో చెప్పడమే గాని, ఆ మేరకు బిల్లుల్లో ఎక్కడా లేదు. ఈ విషయాన్నీ చివరకు స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రశ్నించగా, ఓ గంటసేపు సమావేశానికి విరామం ఇస్తే, బిల్లులో మార్పులు చేస్తానని అమిత్ షా చెప్పడం చూస్తుంటే అవసరమైన కసరత్తు లేకుండా, రాజకీయ ప్రయోజనాలకోసం ఈ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారని అభిప్రాయం బలపడుతుంది. పైగా, లోక్సభలో ఓ రోజంతా చర్చించిన తర్వాత, ఆ రాత్రికి హడావుడిగా 2023లో ఆమోదించిన బిల్లును వెంటనే అమలులోకి తెస్తూ రాష్ట్రపతి ఉత్తరువు జారీచేయడం గమనిస్తే పార్లమెంటరీ వ్యవస్థపట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనతగా వ్యవహరిస్తుందో వెల్లడి అవుతుంది. అవసరమైన కసరత్తు చేయలేకపోవడంతో రాజ్యాంగ సవరణకు తగు మద్దతు పొందటంలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’గా చిత్రీకరిస్తూ ఓ భారీ ప్రచారాన్ని చేపట్టడం ప్రభుత్వ ఉద్దేశాలను బహిర్గతం చేస్తుంది. యుద్ధాలలో, తీవ్రవాదుల దాడులలో, మావోయిస్టుల ఆపరేషన్లలో మహిళలను ‘రక్షణ కవచం’గా ఏర్పాటు చేసుకొని, హింసాయుత దాడులకు పాల్పడుతూ ఉండటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. అటువంటి దాడులను ‘పిరికితనంతో పాల్పడే చర్య’గా భావిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రభుత్వ ధోరణి సైతం అందుకు భిన్నంగా లేదు. అందుకనే దేశసమాఖ్య సమతుల్యతను దెబ్బతీసేందుకు మహిళలను రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొనే, నియోజకవర్గాల పునర్విభజనకు పాల్పడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పుడు, మరో పదేళ్ల వరకు అమలు సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అకస్మాత్తుగా అమలుకు పూనుకోవడం, అర్ధాంతరంగా పార్లమెంట్ సమావేశాలు జరపడం గమనిస్తుంటే నిగూఢమైన ఎత్తుగడ ఉందని స్పష్టం అవుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి దారితీసిన సంఘటనల క్రమం గమనిస్తే ఈ ప్రభుత్వం పట్ల డిఎంకె, ఇతర ప్రతిపక్షాలలో అవిశ్వాసం ఎందుకు పెరిగిందో స్పష్టం అవుతుంది. మార్చి 22న, బడ్జెట్ సమావేశాల మధ్యలో, 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసే మార్గాలపై చర్చించడానికి అమిత్ షా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా, చిన్న చిన్న బృందాలుగా పిలిచారు. అనేక ప్రధాన పార్టీలు షా సమావేశానికి హాజరుకాకుండా, అఖిలపక్ష సమావేశాన్ని కోరాయి. సమావేశానికి హాజరైన పార్టీలు ఆయన మాటలు విన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ముగిసే ఏప్రిల్ 29 తర్వాత ఈ చర్చను నిర్వహించవచ్చని చెబుతూ, మరింత వివరంగా చర్చించాలని కోరాయి. అయినప్పటికీ, ప్రభుత్వం ముందుకు వెళ్లి ఏప్రిల్ 16- 18 సమావేశాలను ప్రకటించింది. ఈ వారం ప్రారంభంలో పంపిణీ చేసిన ముసాయిదా బిల్లులలో, కేవలం మహిళలకు సాధికారత కల్పించడం కాకుండా, దేశ ‘రాజ్యాంగ స్వరూపాన్ని’ మార్చే ప్రయత్నం ఉందని ప్రతిపక్షం భావించింది. జాతీయ రాజకీయ వేదికపై బిజెపి ఒక ఆధిపత్యశక్తిగా అవతరించినప్పటి నుండి చూస్తే, మొదటిసారి ప్రతిపక్షాలు అత్యంత ఐక్యతను ప్రదర్శించినట్లు కనిపిస్తున్నాయి. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న బిజెపికి, అది అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ శాసనపరమైన ఓటమిని రుచి చూపించారు. గతంలో మాదిరిగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను చూపి భయపెట్టడం ద్వారా ప్రతిపక్షాలలో చీలిక తీసుకువచ్చే ప్రయత్నాలు ఫలించలేదు. టిఎంసి, సమాజ్వాదీ పార్టీ ఎంపిలు ఓటింగ్ లో పాల్గొనకుండా చేసేందుకు ఆయా పార్టీలలో కీలకమైన నేతలపై ఒత్తిడులు తెచ్చిన్నట్లు తెలిసింది. అందుకనే మొదటిరోజు కనీసం ఏడుగురు టిఎంసి ఎంపిలు సభకు హాజరుకాలేదు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేరుగా ఆయా నాయకులకు ఫోన్ చేసి, వారంతా ఓటింగ్లో పాల్గొనేటట్లు చేయగలిగారు. ఈ బిల్లులను తిరస్కరించడంలో ప్రతిపక్ష పార్టీలు అందరూ తమ తమ రాష్ట్రాలలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుండా విశాల జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి వ్యవహరించడం అత్యంత ప్రశంసనీయమైన పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీకి మాత్రం అపారమైన ప్రశంసలు లభించాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరప్రదేశ్ అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ చర్యలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలకు ఆ పార్టీకి చెందిన 37 మంది ఎంపిలు అందరూ సంపూర్ణ మద్దతు తెలపడం గమనార్హం. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఓ ప్రాంతీయ పార్టీ వ్యవహరించిన తీరు ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతీయ పార్టీలకు చెంపపెట్టు కాగలదు. చలసాని నరేంద్ర 98495 69050
దాదాపు మూడు దశాబ్దాల కల కలగానే మిగిలిపోనుందా అనే సందేహం మహిళలకే కాదు స్త్రీల ఉన్నతికి పాటుపడే వారందరి మదిలోమెదులుతున్న ప్రశ్న. 131 రాజ్యాంగ సవరణ మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడంపై రకరకాల అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. మహిళా బిల్లు వీగిపోవడం ఇప్పుడు కొత్తేంకాదు. సుమారు ఆరు ఏడు సార్లు అయింది. ఎన్డిఎ కూటమి ఏమో మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కలుపడంద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్ష నేతలు వ్యతిరేకించి ఓటు వేశారని అర్థమైంది. పార్లమెంట్ ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతు 352 మెజారిటీ దక్కలేదు. 2/3 మెజారిటీకి 54 ఓట్లు తక్కువపడ్డాయి. మహిళా బిల్లు ఎన్డిఎ కుట్రలో భాగమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బిల్లు 2011 జనాభా లెక్కల ప్రకారం డీమిలిటేషన్తో ముడిపెట్టి ఓటింగ్ పెట్టడమే తప్పిదమని, బిజెపి చాణక్య నీతికి మించి అత్యుత్సాహం చూపుతున్నదని బలంగా వాదిస్తున్నారు ఇండియాకూటమి నేతలు. ఒబిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీ రిజర్వేషన్పై కూడా స్పష్టతలేదు. అందుకే విపక్షాలు మద్దతు తెలుపలేదు. మహిళా బిల్లు వ్యతిరేకించిన వారిని దేశప్రజలు క్షమించరని, మహిళలను ఓటు అడిగే నైతిక హక్కు లేదంటుంది ఎన్డిఎ కూటమి. మహిళా బిల్లుపై ఎవ్వరికి ఎంత బాధ్యత ఉంది అనేది భవిష్యత్తులో తేలనుంది. ఎవరి వాదనలు ఎలా ఉన్న మహిళలు చట్టసభలలోకి వెళ్లడం వారి హక్కు ఇకనైనా మహిళలపై గౌరవంతో వీలైనంత త్వరగా మహిళా బిల్లు ఆమోదానికై కలిసికట్టుగా పనిచేయాలి. మహిళా బిల్లుకు చట్టబద్ధతకు ఎన్డిఎ కూటమి ఆమోదించేలా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత విపక్షాలపై ఉంది. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వహించి చిత్తశుద్ధి కాపాడుకుంటారో ఆ పార్టీలను మహిళా లోకం గుర్తిస్తుందని మారువరాదు. దేశంలో కొన్ని రాష్ట్రాలు స్వయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన వారి అధికారులను కూడా తమ ఇంట్లో వారు అధికార దర్పం చాటుకుంటున్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ లేదనే చెప్పవచ్చు. సమాన హక్కులతోపాటు చట్టసభల రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళలకు న్యాయం సంపూర్ణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిస్వార్థంగా మహిళా బిల్లును ఆమోదం తెలిపేలా చేసి ఉంటే మహిళల దృష్టిలో బిజెపికి ప్రత్యేకమైన ఆదరణ ఉండేదేమో. రాజకీయ దూరదృష్టితో మహిళా బిల్లును కావాలనే సంపూర్ణ మద్దతు తెలుపడం లేదా అనే ఆలోచన మేధావులు, రాజకీయ విశ్లేషకులు, విద్యావంతులలో వస్తుంది. ఎందుకంటే జనాభా, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలి అంటున్నాం. చట్టసభలలో కూడా 50% జనాభా ఉన్న మహిళలకు రిజర్వేషన్ ఎక్కడ ఉంది, వారికి రావాల్సిన వాటా హక్కు ఇవ్వాలి కదా, ఎందుకు జాప్యం చేస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మహిళా బిల్లు రావాలి ఎందుకంటే శాసన నిర్మాణ, అభివృద్ధిలో మాహిళల పాత్ర ఉండాలి. ఈ సృష్టిలో నింగి నుండి నేల వరకు మహిళామణులు సేవలు అందిస్తున్నారు. రాజకీయాలలో మాత్రం మహిళలకు రావాల్సిన 33% పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 1/3 వంతు సీట్లు రిజర్వేషన్ అమలు చేయాలి కానీ మహిళా బిల్లు సుదీర్ఘ కాలంగా ఆమోదం పొందలేకపోయింది. చివరగా మహిళలు చైతన్యం అయితే తప్ప బిల్లు ముందుకు సాగదు. మహిళలు ఉద్యోగ విధులు నిర్వహించడమే కాకుండా ఇంట్లో వారికి సేవలు అందిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే స్త్రీ అంటే అబల కాదు సబల కావాలంటూ వీర వనితలను ఆదర్శంగా చూపెడుతాము. అలాంటిది దేశ రాజకీయాల్లో ఆశించిన ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటం మొదలుకుని సామాజిక ఉద్యమాల వరకు శంఖారావం పూరించిన ఘనత స్త్రీలదే అని చరిత్ర తెలుపుతుంది. స్త్రీలు ఏకమై కదంతొక్కుతూ ఉప్పెనలా కదిలితేనే మహిళా బిల్లు ఆమోదానికి అడుగులు పడతాయి. మహిళలను గౌరవించుకుంటూ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఘనంగా నిర్వహిచుకుంటూ మహిళలో చైతన్యం రావాలని నినదిస్తూ మహిళా బిల్లుపై అధికార, ప్రతిపక్షాలు మాటలు కోటలు దాటుతాయి. ఆచరణలోకి వచ్చే సరికి శూన్యం. పార్టీలు రాజకీయాలకు అతీతంగా మహిళల అభ్యున్నతి ముఖ్యమని భావించినప్పుడే మహిళా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ప్రపంచ ఉద్యమాలలో సైతం మహిళా పాత్రయే కీలకమైంది, మహిళలు వారి హక్కుల కోసం ప్రశ్నించే గళాలతో నినదించి పోరాడిన సందర్భాలు చూశాం. అదే ఒరవడితో మహిళా బిల్లుకై ఒక్కటై పోరాడాలి. 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి వారి హక్కులకోసం పని చేస్తుంది. ప్రతి ఏటా మహిళల సాధికారతకై ఒక థీమ్ తీసుకు వస్తూ వారి అభివృద్ధిని ప్రోత్సాహిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురుషులకు దీటుగా పోటీపడి అవార్డులు, రివార్డులు సాధిస్తున్నా వారి హక్కులను కాలరాస్తున్నాం. మహిళలను ప్రధానంగా పట్టిపీడించిన కొన్ని రుగ్మతలు బాల్యవివాహాలు, దేవదాసీ, సతీసహగమనం, నిరక్షరాస్యత వంటివి వారి వెనుకబాటుకు కారణమైనవని గతం తెలుపుతుంది. దశాబ్దాల కాలం తర్వాత మహిళలు చైతన్యమై సమాజంలో ముందుకు వెళ్తున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ వారికి తోడ్పాటు అందిస్తే రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతి సాధిస్తారు. ఒక్కప్పుడు మహిళ అంటే వంట గదికే పరిమితం అనే ఆంక్షలను తెంచుకుని నేడు దేశాభివృద్ధిలో మహిళలదే పైచెయ్యిగా ఉంది. మహిళ అంటే ఒక శక్తిగా భావిస్తూ మహిళా బిల్లుకు జనమంతా జాగృతమై మద్దతు తెలుపుదాం. మహిళల పురోగతికి కృషి చేసిన మహనీయులైన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాజారామోన్ రాయ్, జ్యోతిరావు ఫూలే వంటివారి ఆశయాలను గౌరవిస్తూ మహిళ సంక్షేమ, అభివృద్ధి చైతన్యాన్ని కాంక్షిస్తూ మహిళా బిల్లుకై ఏకమై ఉద్యమిద్దాం. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడిన వీరవనితలు ఝాన్సీ లక్ష్మిబాయ్, సరోజిని నాయుడు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ వంటి వారి త్యాగాలను యాదికి చేసుకుంటూ, స్త్రీ జనోద్ధారణకు కృషి చేసిన సావిత్రీ బాయ్ ఫూలే, తెగువకు ఐల్లమ్మ, పౌరుషానికి రాణి రుద్రమదేవి నేటికి ఆదర్శప్రాయులు వారి స్ఫూర్తితో మహిళలు సంఘటితం కావాలి, మహిళా బిల్లుకు ఏకమై గళమెత్తాలి. మిద్దె సురేష్ 97012 09355
వామపక్షాలన్నీ కలిస్తేనే గెలుపు
భారతదేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై ఎర్రజెండా ఒక చెరగని సంతకం. దానికో ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అయితే, వందేళ్ల ప్రస్థానం తర్వాత కూడా ‘అధికారం’ అనే గమ్యం ఎందుకు అగమ్యగోచరంగా మారింది? సిద్ధాంతం పటిష్టంగా ఉన్నా, ఆచరణలో ఎక్కడ అడుగులు తడబడ్డాయి? ప్రజల నాడిని పట్టుకోవడంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకోవాలి. ‘ప్రజల నుండి... ప్రజల వైపుగా’ ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కేవలం సిద్ధాంతాల చట్రంలో కాకుండా, భారతీయ మట్టి వాసనను, ఇక్కడి మనుషుల మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి. ‘పుస్తకంలో ఉన్న సిద్ధాంతం కేవలం అక్షరం.. ప్రజల ఆకలిని తీర్చినప్పుడే అది అధికారం!’ ‘పుస్తకాల్లో ఉన్న మార్క్సిజం విజ్ఞానాన్ని ఇస్తుంది.. కానీ ప్రజల కళ్లలో ఉన్న కన్నీటిని తుడిచే మార్క్సిజం అధికారాన్ని ఇస్తుంది.’ కమ్యూనిజం అంటే కేవలం రష్యా, చైనా విప్లవాల చరిత్రకాదు. భారతదేశంలో ఎర్రజెండా గెలవాలంటే, అది ఇక్కడి సామాజిక రుగ్మతలపై ఎక్కుపెట్టిన అస్త్రం కావాలి. అణచివేత ఎక్కడ ఉన్నా అక్కడ ఎర్రజెండా ఉండాలి. అది ఆర్థిక దోపిడీ కావచ్చు లేదా వేలఏళ్లుగా పేరుకుపోయిన కులవివక్ష కావచ్చు. మనువాద భావజాలం సృష్టించిన అగ్ర-నీచ భేదాలను తుడిచివేయడంలో ఎర్రజెండా మహాత్మా జ్యోతిరావు ఫూలే, - అంబేద్కర్ ఆశయాలను’ తన భుజానికెత్తుకోవాలి. భారతదేశం కేవలం ‘వర్గాల’ దేశం కాదు, ఇది ‘వర్ణాల’ దేశం కూడా. ఇక్కడి పేదరికం వెనుక కేవలం ఆర్థిక కారణాలే లేవు, శతాబ్దాల సామాజిక వివక్ష ఉంది. మార్క్సిజాన్ని కేవలం ఆర్థిక కోణంలోనే చూడటం వల్ల, భారతీయ ఆత్మ అయిన ‘కులం’ అనే సంకెళ్లను తెంచడంలో ఎర్రజెండా కొంత వెనకబడింది. ‘మనువాదం నుంచి మనిషికి విముక్తి పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి శ్రమకు విముక్తి’ అనే రెండు కత్తులను ఎర్రజెండా ధరించాలి. అప్పుడే అది సామాన్యుడి ఆయుధమవుతుంది. ప్రజల నుండి కమ్యూనిస్టు నాయకులు పుట్టాలి. నాయకత్వం అనేది ఒక హోదాగా కాకుండా, ప్రజల కష్టాలను మోసే బాధ్యతగా మారాలి. సామాన్యుడికి తన కష్టం వస్తే గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎర్రజెండా కార్యకర్త కావాలి. నాయకులు ఎసి గదుల్లో చర్చలు జరపడం కంటే, ఎండలో శ్రమిస్తున్న కూలీతో, పొలంలో ఉన్న రైతుతో, ఐటి ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కొంటున్న యువతతో మమేకం కావాలి. నాయకత్వం అంటే ప్రసంగాలు చేయడం కాదు, ప్రజల కష్టాల్లో భాగస్వామి కావడం. కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వం ప్రజాబాహుళ్యం నుంచి, ముఖ్యంగా దళిత, బహుజన, మైనారిటీ వర్గాలనుంచి ఎదగాలి. నాయకుడు ప్రజలకు ‘మార్గదర్శి’గా మాత్రమే కాదు, ‘సొంత మనిషి’గా కనిపించాలి. ‘నాయకుడు అంటే జెండా పట్టుకునేవాడు కాదు, ప్రజల గుండె చప్పుడిని తన జెండాగా మార్చుకునేవాడు.’ భారతదేశం మత విశ్వాసాలు కలిగిన దేశం. ఇక్కడ ‘నాస్తికత్వం’ కంటే ‘మానవత్వం’ ముఖ్యం. భారతీయ సామాన్యుడికి మతం అనేది ఒక భావోద్వేగం. ‘మతం మత్తుమందు’ అనే నిర్వచనాన్ని నేరుగా ప్రజలపై రుద్దడంవల్ల ఉద్యమం ప్రజలకు దూరమైంది. మతాన్ని విమర్శించడం కంటే, మతం పేరుతో సాగుతున్న రాజకీయాలను, దోపిడీని ఎండగట్టాలి. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని నిర్మించాలి. ఆధ్యాత్మికతకు, మతోన్మాదానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. శ్రమజీవుల సంస్కృతిని, జానపద కళలను, గ్రామదేవతల పండుగలను విప్లవ భావజాలంతో అనుసంధానించాలి. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూనే, వారిని దోపిడీ నుంచి రక్షించాలి. ‘ముక్కలైన ఎరుపు - ఒక్కటి కావాలి’. వ్యక్తిగత ఇగోలను పక్కన పెట్టి, పేదవాడి రాజ్యస్థాపన కోసం అన్ని వామపక్షాలు ఒకే జెండా కిందకు రావాలి. అప్పుడే అది ప్రజల్లో గెలుపుపై ధీమాను నింపుతుంది. సిద్ధాంతపరమైన చిన్న చిన్న భేదాలవల్ల పార్టీలు ముక్కలవ్వడం కేవలం శత్రువుకే లాభం చేకూరుస్తుంది. చీలికలు ఎప్పుడూ బలహీనతనే ఇస్తాయి. సిద్ధాంత చర్చల పేరుతో ముక్కలైన ఎరుపు ఇవాళ ఒక్కటవ్వాల్సిన చారిత్రక సంధికాలంలో ఉంది. కార్యకర్తలు, నాయకులు ఇగోలను పక్కన పెట్టి ‘ఒకే జెండా ఒకే అజెండా’ వైపు రావాలి. పది మంది పది దిశల్లో లాగితే రథం కదలదు, అందరూ ఒక్కటై లాగితేనే అది విజయ తీరాలకు చేరుతుంది. కమ్యూనిస్టులు పాతకాలపు నినాదాలకు పరిమితం కాకూడదు, ఆధునికతను ఆహ్వానించడం ద్వారా 21వ శతాబ్దపు సవాళ్లును అధిగమించాలి. నేడు శ్రమ దోపిడీ డిజిటల్ రూపంలో జరుగుతోంది. సోషల్ మీడియాను, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. యువతకు అర్థమయ్యే భాషలో, ఆసక్తికరమైన పద్ధతుల్లో సమానత్వం గురించి చెప్పాలి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదు.. అభివృద్ధి అంటే ఉచిత విద్య, మెరుగైన వైద్యం, ప్రతి చేతికీ పని, పనికి తగ్గ వేతనం ఉండాలని బలంగా చాటాలి. కార్పొరేట్ శక్తుల నుంచి ప్రకృతి వనరులను రక్షించాలి. ఆధునిక టెక్నాలజీని సామాన్యుడి సేవలో ఉపయోగించాలి. నేటి తరం యువతకు ఐటి ఉద్యోగాలు, స్టార్టప్లు, డిజిటల్ స్వేచ్ఛ ముఖ్యమని గుర్తించాలి. ‘జెండా ఎర్రగా ఉందని కాదు.. అది గుండె రక్తంలా ప్రతి మనిషిలోనూ ప్రవహిస్తుందని నిరూపించాలి. ‘ఎర్రజెండా అంటే కేవలం ధర్నాలు, ఆందోళనలు కాదు. అది ఒక ప్రత్యామ్నాయ జీవన విధానం కావాలి. ప్రజల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, కష్టసుఖాల్లో పార్టీ ఒక కుటుంబంలా ఉండాలి. ప్రజల మనసు గెలవకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యం. ఎర్రజెండా ప్రయాణం వంద ఏళ్లకే ఆగిపోయేది కాదు. ఇది నిరంతర ప్రవాహం. సిద్ధాంతంపట్ల నిబద్ధత, ఆచరణలో పారదర్శకత, ప్రజల పట్ల అంకితభావం ఉన్నప్పుడు ప్రజలే నాయకత్వాన్ని స్వీకరిస్తారు. ప్రజలను ఐక్యం చేయడమే మన కర్తవ్యం. ప్రజల నుండి పుట్టిన ఈ ఉద్యమం, తిరిగి ప్రజల వైపుకు వెళ్లినప్పుడే.. ఎర్రకోటపై ఎర్రజెండా రెపరెపలాడుతుంది. గడిచిన 100ఏళ్ల అనుభవాల పాఠం.. రాబోయే కాలం ప్రజావిజయాల కేతనం. మనువాదాన్ని మట్టికరిపిస్తూ, మతతత్వశక్తులను తరిమికొడుతూ, కార్పొరేట్ కబంధ హస్తాలనుంచి దేశాన్ని రక్షించాలంటే.. ఎర్రజెండా వెలుగులో భారత జాతీయవాద కమ్యూనిజం ఒక్కటే శరణ్యం. అణగారిన వర్గాల ఆశలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు కలిసిన రోజున భారతదేశంలో ‘ప్రజా ప్రభుత్వం’ ఏర్పడటం ఖాయం. ‘సూర్యుడు అస్తమించేది చీకటికోసం కాదు.. రేపటి ఉదయం నూతన కాంతితో ఉదయించడం కోసం.’ విశ్వ జంపాల 77939 68907
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ హైకోర్టు దాఖలు అయిన పిటిషన్పై బు ధవారం కీలక తీర్పు వెలువడనున్నది. ఈ కమిషన్కున్న అర్హతలను సవాల్ చే స్తూ ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయంతెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం వెలువడే తీర్పు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష రాజకీయ వర్గాలలో ప్రాధా న్యం సంతరించుకుంది. ఈ కేసులో కోర్టు వెలువరించే తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కుంగిన బ్యారేజీలు, ప్రాజెక్టు నిర్మాణం జరిగిన అవకతవకలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14, 2024న నియమించింది. కమిషన్ నియామకం, దానికున్న అర్హతలను సవాలు చేస్తూ కెసిఆర్, హరీశ్రావుతో పాటు ఐఎఎస్ అధికారులు స్మితా సభర్వాల్, మాజీ ఐఎఎస్ ఎస్.కె. జోషి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ల బెంచ్ విచారణను తొలుత ఈ నెల 8కి , అనంతరం ఈ నెల 22కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా పిటిషన్దారుల తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలోని చట్టబద్ధమైన ఉల్లంఘనలు ఉన్నాయని తన వాదనలను గట్టిగా వినిపించారు. అలాగే సహజ న్యాయసూత్రాలను కమిషన్ పాటించలేదని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు కేసు’ విచారణ సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు’ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్రంలోని ఎసిబి కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది.
బిఆర్ఎస్ ఉత్తి కథలు..కాంగ్రెస్ పిట్టకథలు
మన తెలంగాణ/హైదరాబాద్: వెయ్యేండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.ఓటమిపై బిఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని.. ప్రజలే తప్పు చేశారని ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల కురువృద్ధుడిని చే ర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయాయి, నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిట ని ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువ నా యకత్వాన్ని ప్రోత్సహిస్తామని.. యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని విమర్శించారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగా ణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తున్నారంటే వెయ్యేండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు అని తేల్చిచెప్పారు. మేధావులు, విద్యావేత్తలు బిఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి జీవన్రెడ్డి అని, ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారని గుర్తు చేశారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఏమీ అనకపోవడంలో ఆంతర్యం ఏమిటి..? జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని కవిత ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటమికి ప్రజలకే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలి రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి తూ కిత్నా అంటే.. అంటే మై కిత్నా అంటూ బలప్రదర్శనకు దిగుతున్నాయి తప్పితే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్ పార్టీ పిట్టకథలు చెప్పిందని విమర్శించారు. పార్టీల కేంద్రంగా కాకుండా ప్రజల కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలని, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈనెల 25న వస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య ఉంటే దానిని పరిష్కరించే వరకు పోరాడేందుకు తాము రాజకీయాల్లోకి వస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సిఎం మాట్లాడుతున్నారు “గుంట నక్క ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అంటున్నారని.. ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి బిఆర్ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా” అని కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సిఎం మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సిఎం మాట్లాడారని పేర్కొన్నారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కానీ ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. “ఢిల్లీలో గుంటనక్క ఎవరిని కలిశారో చెప్పాలా” అంటూ ఆయనతో సిఎం డీల్ మాట్లాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో నిర్ణయం చేయాల్సింది ప్రజలు కదా..? ప్రశ్నించారు. పదేళ్లు తానే సిఎంగా ఉంటానని ఎలా చెబుతారని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు రెండోసారి ఓట్లేస్తారని అడిగారు. సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సగం మందికి రైతుభరోసా ఇవ్వలేదని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని, కుమ్మెర జాతరలో రెండు నెలల పాప చనిపోయినా మాట్లాడలేదని మండిపడ్డారు. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని రేవంత్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా..? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రజల విషయంలో ఏ లెక్కలేని తనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేని తనం కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అన్నారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఆర్టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతిలో ఫార్వర్డ్ బ్లాక్ సీనియర్ నేత ప్రసాద్ చేరిక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఆర్ వి ఆర్ ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.అలాగే టిడిపి మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.
అక్రమ కేసులు ఎదుర్కొనేందుకే హస్తినకు వెళ్లాం
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పా ర్టీ అధినేత కెసిఆర్ సూచన మేరకే ఢిల్లీ వెళ్లి లాయర్లను కలిసినట్లు మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు తెలిపారు. కానీ, తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎంఒ నుంచి లీకులు ఇచ్చారని, మీడియా వాళ్లతో అర్థం లేని బ్రేకింగ్లు పెట్టించారని ఆరోపించారు. విషయం ఉన్న వారు ఎవరైనా ఇలాంటి పనులు చేయరని, విషయం లేనివారే ఇలా చేస్తారని విమర్శించారు. సిఎం పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే అక్కడి లాయర్లతో మాట్లాడినట్లు చె ప్పారు. కాళేశ్వరం కేసులపై సీనియర్ లాయర్లతో చర్చించేందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే మే 6వ తేదీన హైకోర్టులో రాబోతున్న ఎంఎల్ఎల ఫిరాయింపుల కేసుల విచార ణపై సీనియర్ లాయర్లతో చర్చించామని అ న్నారు. కాంగ్రెస్ బి.ఫామ్పై గెలిచి తాను ఇం కా బిఆర్ఎస్లోనే ఉన్నానని ఒక ఎంఎల్ఎ అనడం, దానిని స్పీకర్ ధృవీకరించడం అ త్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు.ఓటుకు నోటు కేసు కూడా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టులో విచారణకు రానుందని, ఆ కేసు గురించి కూడా న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. పట్టపగ లు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పుడు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి కంప్లైంట్ కూ డా ఆయనే అని పేర్కొన్నారు. ఈ ఓటుకు నో టు కేసులో బిఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మ హమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారని చెప్పారు. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్ల ను పెట్టి, సిఎం రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నారని విమర్శించారు. ఆనాడు సమాఖ్య వాదులతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు. నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయిందంటే.. ముఖ్యమంత్రి సీటు ఊడటం,జైలుకు వెళ్లడం ఖాయం అని చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. తమ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని, అందులో దాచిపెట్టేదేమీ లేదని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనపై కూడా చిల్లర ప్రచారం చేశారని మండిపడ్డారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్షిప్లో కనీసం 10 శాతం కూడా రేవంత్కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారిక లైవ్లో బిఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా దానిని ఆపలేరు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. సోమవారం జగిత్యాల సభలో కెసిఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని చెప్పారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? అని ప్రశ్నించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది, పంట చేతికి వచ్చాక వేశారని తెలిపారు. కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాత్రి రాహుల్ గాంధీతో, ఉదయం బిజెపి వాళ్లతో తిరిగారని హరీష్ రావు వివర్శించారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఇన్నాళ్లు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ, రెండు పిల్లర్లు కుంగిపోయాయని, మరమ్మతులు చేస్తామని చెప్పారని సిఎం తాజాగా చెప్పారని పేర్కొన్నారు. మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని సిఎం ఒప్పుకున్నారని, రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లా..? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఎల్నినో రానుందని తెలియడంతో మేడిగడ్డ అవసరం తెలిసిందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని, కాళేశ్వరం వృథా అయితే మూసీలోకి గోదావరి నీళ్లు ఎలా ఎత్తిపోస్తావని ప్రశ్నించారు. కెసిఆర్ ఎంతో గొప్పగా ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని చెప్పారు. వరద ఉంటే మిడ్ మానేరు నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారని తెలిపారు. రేవంత్ శంకుస్థాపన చేసిన గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి రైతుబంధు, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకు రేవంత్రెడ్డికి ప్రజలు ఓట్లు వేయాలా..? అని హరీష్రావు ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించినందుకా, తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి ఢిల్లీకి, కుప్పానికి కడుతున్నందుకా..2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకా..నెలకు రూ. 2500 ఇస్తామని మహిళలను దగా చేసినందుకా..స్కీములు లేవు కానీ రాష్ట్రాన్ని స్కాములతో నింపినందుకా..సింగరేణిని దోచుకున్నందుకు రేవంత్రెడ్డి ప్రజలు ఓట్లు వేయాలా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టినందుకా... ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇండ్లు కూల్చినందుకా...కలుషిత ఆహారంతో 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టన పెట్టుకున్నందుకా.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా లక్షలాది విద్యార్థులను అంధకారంలో నెట్టినందుకా.. ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, అంగన్వాడీలను రోడ్డున పడేసినందుకా..ఫార్మా కంపెనీల కోసం లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసినందుకా..కులవృత్తులను ధ్వంసం చేసినందుకు ప్రజలు ఆయనకు ఓట్లు వేయాలా..? అని నిలదీశారు. ఎన్ని డ్రామాలు ఆడినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి అని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని అన్నారు.
ఇస్లామాబాద్: కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియనున్న నేపథ్యంలో, అమెరికా ఇరాన్ మధ్య మలివిడత చర్చలు జరగనున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్లో సమావేశమయ్యే అవకాశముందని ఆ యా వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అ యితే, చర్చల సమయంపై అమెరికా లేదా ఇ రాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకారం, ఇ ప్పటివరకు తమ అధికార ప్రతినిధులు ఎవరూ పాకిస్తాన్ రాజధానికి చేరుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్ మధ్యవర్తుల సమాచారం మేరకు, అ మెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఖాలిబాఫ్ బుధవారం ఉదయం ఇస్లామాబాద్కు చేరుకు ని చర్చలకు నేతృత్వం వహించే అవకాశం ఉం దని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, గో ప్యతా నిబంధనల నేపథ్యంలో పేర్లు వెల్లడించకుండా ఉంచినట్లు సమాచారం. ఏప్రిల్ 8న ప్రారంభమైన కాల్పుల విరమణ ఒప్పందం బు ధవారం ముగియనుంది. ఇరు దేశాలు మాటల యుద్ధంలో మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. ఒప్పందం కుదరకపోతే భారీ బాంబు ల దాడులు మొదలవుతాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ చర్చల ప్రధాన ప్రతినిధి ఇంకా బయటపెట్టని కొత్త వ్యూహాలు తమ వద్ద ఉన్నాయి అని పేర్కొన్నారు. అయితే చర్చలు పునఃప్రారంభమైతే కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా తరఫున జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా ఇరాన్, అమెరికా బృందాల రాకను నిర్ధారించింది. ఇరు దేశాలు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. బుధవారంనాడు ఉదయానికల్లా రెండు దేశాల ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్ చేరుకుంటాయన్నారు. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలో ఒక బృందం, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ నాయకత్వంలో బృందం వస్తున్నాయని ప్రకటించింది. ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మలి విడత చర్చలకు దారులు పడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు మరోదారి లేదని, ఒప్పందానికి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాల్పుల విరమణను మరోసారి పొడిగించే ఉద్దేశం లేదన్నారు. ఒప్పదం చేసుకుంటేనే ఇరాన్ పరిస్థితి బాగుంటుందన్నారు. లేకపోతే మా సేనలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయని సిఎన్బిసితో మాట్లాడుతూ హెచ్చరించారు. ఈ సారి భీకరమైన దాడులు తప్పవని స్పష్టం చేశారు. బెదిరింపుల నీడలో చర్చలా? బెదిరింపుల నీడలో జరిగే చర్చలను మేము అంగీకరించము అని ఇరాన్ ప్రతినిధి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చర్చలు పునఃప్రారంభమవుతాయన్న ఆశాభావాన్ని పాకిస్థాన్ వ్యక్తం చేసింది. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్కు చేరుకునే అవకాశముందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. తద్వారా చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ అబ్దెలాత్తీతో తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సమయంలో, ఇరాన్కు ముఖ్య వాణిజ్య భాగస్వామి అయిన చైనా రాయబారితో కూడా సమావేశమయ్యారు. బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుత పరిస్థితి యుద్ధం నుంచి శాంతి వైపు మారుతున్న కీలక దశలో ఉందని పేర్కొంది. ఈ సందర్భంలో అన్ని పక్షాలు నిజాయితీగా వ్యవహరించి, రాజకీయ పరిష్కారానికి కట్టుబడి ఉండాలని, కాల్పుల విరమణ, చర్చల వేగాన్ని కొనసాగించాలని మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ సూచించారు. ఇక ఇస్లామాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది భద్రతా సిబ్బందిని మోహరించి, విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో పర్యవేక్షణను పెంచారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చల కంటే ఈసారి ఏర్పాట్లు మరింత కఠినంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చర్చలు ముందుకు సాగితే, అమెరికాఇరాన్ అగ్రనేతలు పాకిస్థాన్ను సందర్శించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్లామాబాద్కు చెందిన భద్రతా విశ్లేషకుడు సయ్యద్ మహ్మద్ అలీ అభిప్రాయపడ్డారు. ఒప్పంద దశకు చర్చలు చేరితే, అగ్రనేతల పర్యటనకు అవకాశం ఉండొచ్చు అన్న భావనతో పాకిస్థాన్ సిద్ధమవుతోంది అని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.
Fact Check: No Evidence That Lemon, Garlic, Turmeric and Honey Can Cure
Social media has become one of the biggest platforms for sharing knowledge today. People can easily find a wide range of information, including many health-related tips, within seconds. Many users depend on these platforms to learn about fitness, diet, and general well-being. Sometimes, such information is shared by qualified doctors and health experts, making it useful and reliable. However, a large portion of content is also posted by creators who may not have proper medical knowledge or training. Without consulting experts, they often share many tips that can be misleading or incorrect. These posts often gain high reach because they are simple and attractive. As a result, along with useful information, wrong messages are also spread widely, especially in the case of health-related advice shared without proper knowledge. Amid this, a health tip is widely spread on social media. In an Instagram reel, a creator claims that lemon, garlic, turmeric, and honey can cure fatty liver in 8 days. In a reel posted by a user, it is claimed that fatty liver can be reversed within just 8 days using a simple home remedy. The creator says that even people already dealing with liver problems, infections, or toxin buildup can see their liver become completely clean in this short period. According to the video, the remedy is easy to prepare using common household ingredients. A glass of water is taken, and the juice of one full lemon is added to it. A small pinch of turmeric is mixed in, followed by two crushed garlic cloves. Half a teaspoon of honey is then added to complete the mixture. The preparation should be left aside for about an hour, then strained before consumption. The creator advises drinking this mixture every morning on an empty stomach. It is further claimed that regular use for 8 days will cleanse the liver, remove toxins from the body through urine, and may also help with several other health issues. The claim can be found here . Fact Check: The claim is False, There is no scientific proof or medical agreement that fatty liver disease can be cured in just 8 days by taking lemon, garlic, turmeric, and honey. While these ingredients may be good for overall health, they are not a substitute for proper treatment or long-term lifestyle changes. During a conversation with dietician Bishnupriya Gadanayak, she explained the condition of fatty liver in a very clear way. She said that fatty liver disease develops in four stages, and each stage shows a higher level of damage to the liver. In the first stage (Type 1), fat builds up in the liver but there is no inflammation, so it is usually not harmful. In the second stage (Type 2), fat is present along with inflammation, which shows that the liver is under stress. In the third stage (Type 3), there is fat accumulation along with damage to liver cells. The fourth stage (Type 4) is the most serious, where there is severe damage along with fibrosis, and it may lead to cirrhosis. She added that the early stages can be reversed with proper diet and regular exercise, but the later stages may cause permanent damage. However, with proper treatment and lifestyle control, the disease can be managed and its progression can be slowed. She also spoke about the ingredients mentioned in the viral remedy. Lemon is low in calories and rich in vitamin C, which is good for overall health. Garlic contains natural compounds that may help reduce inflammation and support heart and liver health. Turmeric, known for its active compound curcumin, has anti-inflammatory and healing properties and has been used in traditional medicine for many conditions. Honey is a natural product with antioxidant and antibacterial qualities and has been used for both food and health purposes for a long time. However, she clearly stated that there is no scientific proof that lemon, garlic, turmeric, and honey can cure fatty liver in just 8 days. While these ingredients may support general health and may have some benefits for the liver, they cannot act as a quick cure for fatty liver disease. Proper medical care, a balanced diet, exercise, and long-term lifestyle changes are necessary to manage and improve the condition. During a conversation with Dr. Swasti Tirta Prayag, He clearly explained that lemon, garlic, turmeric, and honey cannot cure fatty liver, especially not within a few days. He said that although these ingredients have some health benefits like antioxidant and anti-inflammatory properties, there is no medical evidence to show that they can reverse fatty liver in such a short time. He explained that lemon contains vitamin C, which may help reduce inflammation, but it does not treat liver disease. Garlic is known to support heart health and has some protective effects, but there is no strong proof that it can treat fatty liver. Turmeric also has useful properties and may support general health, but it does not remove fat from the liver. Honey, she added, contains natural sugars, and taking too much of it could actually make fatty liver worse instead of improving it. Dr. Prayag emphasized that while these ingredients can be part of a healthy diet, they should not be seen as a cure. The best way to manage fatty liver is through long-term lifestyle changes, including a balanced diet and regular exercise. He also advised regular health check-ups and screening for other factors such as alcohol use or infections like hepatitis B and C, which can worsen the condition. He concluded that fatty liver requires proper care over time, not quick remedies. He added that while some changes may be seen over the long term, improvement within eight days is impossible. As per expert opinion, the claim that fatty liver can be cured within a few days using lemon, garlic, turmeric, and honey is False. These ingredients may support general health but cannot treat or reverse the condition. Proper medical care, along with long-term lifestyle changes, remains the most effective approach.
విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ షురూ
హైదరాబాద్: టాలీవుడ్లో రెండు క్రేజీ ప్రాజెక్టులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఒకటి విజయ్ దేవరకొండది కాగా మరొకటి బెల్లంకొండ గణేశ్ది. నాని హీరోగా తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మెప్పించారు శౌర్యువ్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శౌర్యువ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రారంభమైంది. నాని ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సమయంలో నాని, విజయ్ ఎంత స్నేహంగా […] The post విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ షురూ appeared first on Visalaandhra .
హైదరాబాద్: అభిమానులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ చిత్ర బందం కొన్ని ఫొటోలు పంచుకుంది. మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘జైలర’ చిత్రానికి కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రహీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. […] The post ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి appeared first on Visalaandhra .
. తాజాగా జట్టుకు దూరమైన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే. ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఐపీఎల్ 2026లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే ఎడమ కాలి గాయం (హామ్స్ట్రింగ్) కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇవాళ సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న సన్రైజర్స్ హైదరాబాద్తో […] The post సీఎస్కేను వెంటాడుతున్న గాయాలు appeared first on Visalaandhra .
కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్కు జహీర్ఖాన్ సూచన
న్యూదిల్లీ: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, జట్టులో కీలక బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్కు మాజీ పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ గురించి ఆలోచించొద్దని, బ్యాటర్గా రాణిస్తూ టీ20 జట్టులో పునరాగమనంపై దృష్టిసారించాలని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ 600కు పైగా పరుగులు చేయడంతోపాటు జట్టును […] The post కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్కు జహీర్ఖాన్ సూచన appeared first on Visalaandhra .
ఢిల్లీపై ఘన విజయం.. SRH హ్యాట్రిక్ విజయం
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్ హెచ్ నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో నితీష్ రాణా(57) అర్ధ శతకంతో చెలరేగాడు. సమీర్ రిజ్వీ(41), కెఎల్ రాహుల్(37), స్టబ్స్(27)లు భారీ స్కోరు చేయలేకపోయారు. దీంతో ఢిల్లీపై హైదరాబాద్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో టాస్ 3 స్థానానికి దూసుకెళ్లింది. అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. మరోసారి ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.
విశాలాంధ్ర-జేఎన్టీయూ: ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి ఈ విషయం వెల్లడించారు. జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సుదర్శన్రావు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని చెప్పారు. పరీక్ష కేంద్రాలలోకి గంట ముందే అనుమతిస్తామని తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ అధ్వర్యంలో నిర్వహించే […] The post రేపు ఏపీఈసెట్ పరీక్ష appeared first on Visalaandhra .
రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్కు రెండు రోజుల ముందు నుంచి అంటే మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి […] The post రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ appeared first on Visalaandhra .
కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి
తిరువనంతపురం: కేరళలోని త్రిసూర్ జిల్లాలోని బాణసంచా గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూరం వేడుక కోసం నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రాల్లో ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. స్థానికంగా పంటపొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు గాయపడిన వారిని […] The post కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి appeared first on Visalaandhra .
ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసు
. స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన కాంగ్రెస్. సభ్యులపై నిందారోపణలు చేశారని ఆరోపణ న్యూదిల్లీ: లోక్సభ సభ్యులపై ‘నిందారోపణలు’ చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రధానికి వ్యతిరేకంగా హక్కుల నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ మేరకు ఓం బిర్లాకు వేణుగోపాల్ లేఖ రాశారు. ‘18 ఏప్రిల్, 2026న టెలివి జన్లో ప్రసారమైన తన ప్రసంగంలో లోక్సభ సభ్యు […] The post ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసు appeared first on Visalaandhra .
తమిళనాడులో రేపు పోలింగ్బెంగాల్లో మొదటిదశకు కూడా… చెన్నై/కోల్కతా: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్కు ముందు తప్పనిసరి 48 గంటల నిశ్శబ్ద కాలం అమలులోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలు లేదా ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా, […] The post ఎన్నికల ప్రచారానికి తెర appeared first on Visalaandhra .
కొసెళ్లేదాక ఉంటవో.. ఊడుతవో తెలియదు
రాష్ట్రానికి రేవంత్రెడ్డి శని పట్టిందని, ఆ శని పీడ విరగడ కావాలంటే రేవంత్రెడ్డి పోవాలి... కేసీఆర్ రావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా జగిత్యాలలో కేసీఆర్ సభ జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కేసిఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పుణ్యంతోనే నీవు సీఎం అయ్యావని, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే నీవు సీఎం అయ్యేవాడివా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభ సక్సెస్ కాకూడదనే నీవు మేడిగడ్డ వద్ద సభ పెట్టావు.. 30 మాసాలుగా అక్కడికి ఎందుకు పోలేదు? నిద్ర పోయావా అని రేవంత్ను ప్రశ్నించారు. మేడిగడ్డ మరమ్మతు పనులకు కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, మరమ్మతులు చేయకుండా కేసీఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నేను పదవుల కోసం లొంగేవాడిని కాదని, నేనెవరిని తొక్కుకుంటూ రాలేదన్నారు. నాదేండ్లను ఎన్టీఆర్ మంత్రి వర్గంలో తొలగించడంతో నా మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. 1984లో పార్టీ ఫిరాయింపు చట్టమే లేదని, అయినా నా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరానన్నారు. నేను ఇంకా పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ విర్రవీగి మాట్లాడుతున్నాడని, ఈ రెండేండ్లు పూర్తిగా ఉంటాడో, ఊడతాడో కూడా తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలుండగా తన సొంత కుంపటి కోసమే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్లో చేరికతో నా ప్రజా జీవితానికి నూతన అధ్యయం ఏర్పడిందని, తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్ సీఎంలా వ్యవహరించకుండా వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నాడన్నారు. నోరు తెరిస్తే బండ బూతులు మాట్లాడటం సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డికి తగదన్నారు. చావుకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకా కేసీఆర్ను ఊరి తీసేదని ప్రశ్నించారు? ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? రైతన్నలకు అండగా నిలిచినందుకా, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడినందుకా? ఎందుకు కేసీఆర్ను ఉరి తీయాలని ఈశ్వర్ రేవంత్రెడ్డిని నిలదీశారు.
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. తాజాగా ప్రభుత్వం మరో రూ.4,600 కోట్ల అప్పు చేసినట్లు సమాచారం. ఇది రాష్ట్ర ఖజానాపై మరింత భారాన్ని పెంచనుంది. గణాంకాలను పరిశీలిస్తే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 60 నెలల్లో దాదాపు రూ. 3,32,000 కోట్ల అప్పులు చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 23 నెలల స్వల్ప కాలంలోనే రూ.3,56,655 కోట్ల భారీ రుణాలను సమీకరించింది. అంటే గత ప్రభుత్వ ఐదేళ్ల […] The post మరో రూ.4,600 కోట్ల అప్ప్పు appeared first on Visalaandhra .
మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు బీజేపీ కుట్ర
. ఎన్నికల్లో లబ్ధికే నాటకాలు. రాష్ట్రాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు. అమరావతిలో మూడో విడత భూ సమీకరణకు వ్యతిరేకం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర-ఒంగోలు: మూడేళ్ల క్రితం పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లును ఎన్డీయే ప్రభుత్వం తిరిగి ఎలా ప్రవేశపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సూటిగా ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఈశ్వరయ్య విమర్శించారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో […] The post మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు బీజేపీ కుట్ర appeared first on Visalaandhra .
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం భారీ బైక్ ర్యాలీలు
విశాలాంధ్ర`తిరుపతి: ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికవర్గం మంగళవారం బైక్ ర్యాలీలు నిర్వహిం చింది. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ర్యాలీలు జరిగాయి. తిరుపతి, వినుకొండ, ఇతర ప్రాంతాల్లో భారీ బైక్ ర్యాలీలు కొనసాగాయి. కార్మికులు ఉత్సాహంగా బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ రాష్ట ఉపాధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి మంగళవారం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. బైక్ […] The post ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం భారీ బైక్ ర్యాలీలు appeared first on Visalaandhra .
కెసిఆర్ చెప్పినవన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవే: ఎంపి ధర్మపురి
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల బహిరంగ సభలో చెప్పిన పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినవేనని బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. 72 ఏళ్ళ వయసులో కెసిఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టారని ఆయన విమర్శించారు. పౌరసరఫరాల విభాగంలో అవినీతి, అక్రమాలు గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆ అవినీతిని ప్రస్తుత మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తమ్కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న బిఆర్ఎస్కు కోవర్ట్ అని విమర్శించారు. రైతుల వద్ద నుంచి కరెంట్ బిల్లులు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఎంపీ అర్వింద్ చెప్పారు. ఆదివాసీల పోడు భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. దీనిని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో రైతులను ఆదుకోని కెసిఆర్ పంజాబ్కు వెళ్ళి రైతులకు చెక్కుల పంపిణీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తన పోరాటం ఆగదని, పసుపు రైతులకు క్వింటాల్కు రూ. ౩౦ వేలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూముల ధరలకు దేశ వ్యాప్తంగా రెక్కలు వచ్చాయని ఎంపీ అర్వింద్ తెలిపారు. తుపాకి రామునిలా.. ఎంపీ రఘునందన్ రావు జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, భూపాల్పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో తుపాకి రామునిలా డైలాగులు కొట్టారని బిజెపి ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పరస్పరం కాపాడుకుంటున్నాయని, నామమాత్రంగా విమర్శలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..?: హరీష్రావు
కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్షిప్లో కనీసం 10 శాతం కూడా రేవంత్కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారిక లైవ్లో బిఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా దానిని ఆపలేరు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. సోమవారం జగిత్యాల సభలో కెసిఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని చెప్పారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? అని ప్రశ్నించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది, పంట చేతికి వచ్చాక వేశారని తెలిపారు.
‘ఎన్టీఆర్ నీల్’ వచ్చేది అప్పుడే
ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్... కెజిఎఫ్ సిరీస్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో భారీ యాక్షన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ గురించి వివరాలను తెలియజేశారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ ఒక పవర్ఫుల్ సినిమాటిక్ వరల్డ్ను పరిచయం చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా జూన్ 11, 2027న శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఎన్టీఆర్ నీడలాంటి ఓ లుక్లో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సహా పలు భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.
ఆర్మీ ట్యాంకుల కొనుగోలుకు రూ.975 కోట్లతో ఒప్పందం
న్యూఢిల్లీ: మందుపాతరలు అమర్చిన క్షేత్రాలను ధ్వంసం చేసే అత్యంత సామర్థం కలిగిన కీలకమైన ఆర్మీ ట్యాంకుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ రూ. 975 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎంఎల్) , ఎలెక్ట్రోన్యూమాటిక్స్ , హైడ్రాలిక్స్ (ఇండియా) ప్రైవేట్ సంస్థలతో ఈ ఒప్పందం కుదిరిందని ప్రకటన వెలువడింది. ఈమేరకు టి 72,/టి90 ట్యాంకులు లభిస్తాయి.
థాయ్లాండ్లో ‘ఈఎన్ఈ రిపీట్’.. ఆకట్టుకుంటున్న ఫోటో
’ఈ నగరానికి ఏమైంది’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ని కొనసాగిస్తూ సినిమా సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా చేరారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యానర్పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నెల పాటు కొనసాగుతుంది. సెట్ నుంచి వచ్చిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ‘టీమ్ కన్యారాసి‘ గ్యాంగ్కు చెందిన ఆ నలుగురు అబ్బాయిలు వింటేజ్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు.
జర్మనీ గురుద్వారా దగ్గర ఘర్షణ... నలుగురికి గాయాలు
లండన్: జర్మనీ లోని గురుద్వారాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఆయుధాలు, కత్తుల దాడి వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు జర్మనీ లోని మోయిర్స్ సిటీ గురుద్వారాలో ఈ సంఘటన జరిగింది. సిక్కు సమాజం లోని రెండు వర్గాల మధ్య మొదలైన చిన్నగొడవ చివరకు ఆయుధాలు, కత్తుల దాడికి దారి తీసిందని అధికారులు చెప్పారు. అయితే ఘర్షణకు కారణాలేమిటో ఇంకా తెలియడం లేదని పోలీసులు చెప్పారు.
మెక్సికో పిరమిడ్ దగ్గర కాల్పులు.. ఒకరు మృతి
మెక్సికో సిటీ: మెక్సికో లోని చారిత్రక టియోటిహుకాన్ పిరమిడ్ల వద్ద ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడడంతో ఓ కెనడా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తరువాత నిందితుడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు పర్యాటకులు భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట జరిగి అనేక మంది గాయపడ్డారు. వారందరినీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి తుపాకీ, కత్తి, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చర్చలు విఫలం. అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్సులు బంద్
తెలంగాణలో ఆర్టీసి సమ్మె బాట పట్టనుంది. మంగళవారం ప్రభుత్వంతో టీజిఎస్ ఆర్టీసీ జేఏసీ చర్చలు జరిపింది. సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఆర్ అధికారుల కమిటీతో దాదాపు 4 గంటలకుపైగా ఆర్టీసీ సంఘాలు చర్చలు జరిపాయి. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో ఈ అర్ధరాత్రి నుంచే టీజిఎస్ ఆర్టీసి సమ్మెకు వెళ్లనుంది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈక్రమంలో ప్రజా రవాణా స్తంభించే అవకాశం ఉంది.
అభిషేక్ ఊచకోత.. ఢిల్లీకి భారీ టార్గెట్
మన తెలంగాణ/హైదరాబాద్: మరోసారి ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఐపిఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో అభిషేక్ తన బ్యాటింగ్ తో వీరవిహారం చేశాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.
లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ సిఐ, ఎస్ఐ
లంచం తీసుకుంటూ సిఐ, ఎస్ఐ ఎసిబికి దొరికిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. మంగళవారం రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరుకు చెందిన ఓ వ్యక్తి, అతని కుటుంబసభ్యులపై వికారాబాద్ మహిళ పోలీస్స్టేషన్లో సెక్షన్ 498 ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసులో బాధితుడికి, అతని తల్లి, ఆడ పడుచులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు మహిళా పోలీస్స్టేషన్ సిఐ సరోజ, ఎస్ఐ రాణి ఒక్కొక్కరికి లంచం డిమాండ్ చేశారు. రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో రూ.20 వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బులు తన వద్ద లేకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టాం. ఈ విచారణలో సాక్ష్యాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే బాధితుడి వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా సీఐ, ఎస్ఐలను పట్టుకున్నామని డీఎస్పీ ఆనందర్కుమార్ తెలిపారు. మొదటి విడత డబ్బులు రూ.20 వేలు సీఐ సరోజ సమక్షంలో ఎస్సై తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్సైపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వికారాబాద్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ సరోజ స్టేషన్కు వచ్చిన బాధితుల రక్తం తాగేదని బాధితుడు, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షద్ ఆరోపించారు. ఫిబ్రవరి 20న నా భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేదు. కానీ డబ్బుల కోసం నాపై, నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, తమ్మునిపై కేసులు నమోదు చేశారు. నాకు, నా భార్యకు చిన్న గొడవ జరిగింది. నా భార్య ఇచ్చిన ఫిర్యాదుపై అదే రోజు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మా అమ్మనాన్న ఇద్దరు వృద్ధులు. వారు నాతో దూరంగా ఉంటారు. మా సిస్టర్లు ఇద్దరు, మా తమ్ముడు నాతో పాటు ఉండరు. కానీ వారిపైనా కేసు నమోదు చేశారు. కేసును లోక్ అదాలత్లో కొట్టేసేవిధంగా చేస్తానని, అందుకోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పునా మొత్తం రూ.60 వేలు కావాలని డిమాండ్ చేశారు. రూ. 40 వేలకు సెటిల్చేసి ముందుగా రూ. 20 వేలు తీసుకున్నదన్నారు. వీరిద్దరు నెలకు రూ.50 నుంచి 60 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. మా వాళ్ల తప్పుల్లేకపోయినా వారిని డబ్బుల కోసం సీఐ, ఎస్సై ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ ఇద్దరు అధికారులు బాధితులకు న్యాయం చేయకపోగా లంచాలు తీసకుంటున్నారన్నారు. వీళ్ల భాగోతం గురించి జిల్లాలో ఎవరినడిగినా తెలుస్తుందన్నారు. అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.
పెద్ది నుంచి కీలక అప్డేట్.. బుచ్చిబాబుతో రామ్ చరణ్ సెల్ఫీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్పోర్ట్ యాక్షన్ డ్రామా ’పెద్ది’ నుంచి విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా సంచలనం సృష్టించాయి. రెండు గ్లింప్స్లలో చరణ్ డిఫరెంట్ అవతార్స్లో కనిపించి మైమరపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్ స్పెషల్ గా విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇంకో 6 రోజుల్లో పూర్తవనుంది. షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ సినిమా జూన్లో థియేటర్లలో విడుదల కానుంది. సెట్స్ నుంచి విడుదలైన కొత్త స్టిల్స్లో షూటింగ్ స్పాట్లోని పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తోంది. దర్శకుడు బుచ్చి బాబు సానాతో కలిసి రామ్ చరణ్ ఆనందంగా కనిపిస్తూ, షూట్ వాతావరణాన్ని తెలియజేస్తున్నారు. చరణ్ పొడవాటి జుట్టు, గడ్డం, స్టైలిష్ షేడ్స్తో రగ్గడ్ అవతార్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి అద్భుతమైన తారాగణం కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు పునఃప్రారంభం
ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్ లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.ఇదే సమయంలో లెబనాన్లో 10 రోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్పై ప్రారంభమైన రెండో రోజునే, ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లెబనాన్లో జరిగిన పోరాటాల్లో ఇప్పటివరకు 2,290 మందికి పైగా మరణించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో కనీసం 3,375 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదనంగా ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ అరబ్ దేశాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాంతవ్యాప్తంగా 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించినట్లు సమాచారం.
చెన్నైకి బిగ్ షాక్.. ఐపిఎల్ నుంచి స్టార్ బ్యాటర్ ఔట్
చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్ తగిలింది. గాయంతో యువ ఆటగాడు ఆయుష్ మాత్రె ఐపిఎల్కు దూరమయ్యాడు. ఈ సీజన్లో చెన్నై అంతంత మాత్రంగానే రాణిస్తోంది. ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇలాంటి స్థితిలో ప్రతిభావంతుడైన బ్యాటర్గా పేరున్న ఆయుష్ దూరం కావడం సిఎస్కెకు పెద్ద ఎదురు దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయుష్ గాయానికి గురయ్యాడు. తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ఆయుష్ ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని సిఎస్కె యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
పొన్నాల గతే జీవన్ రెడ్డికీ పడుతుంది: ఎంపి చామల
గతంలో కాంగ్రెస్ను వీడి బిఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ పడుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కెసిఆర్ వెంటనే ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారని, నిజానికి తమ పార్టీ అధినేతగా చేయాలనుకున్నామని ఎంపీ చామల మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జీవన్ రెడ్డి ఆలోచన లేని పని చేశారని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహు, కేతు గ్రహం అని ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ విమర్శించడాన్ని ఎంపీ చామల తీవ్రంగా ఖండించారు. అసలు బండి సంజయ్ ఏ గ్రహం అని ఆయన అన్నారు. నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర మంత్రి బండి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మెట్రో పేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో మీ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భువనగిరి లోక్సభ పరిధి కోసం నిధులు తీసుకుని వచ్చేందుకు బహిరంగ సభను కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి. కిషన్ రెడ్డి కలిసి పెట్టాలని, అందుకు పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకుని వచ్చే బాధ్యత తనదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేపిస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు. సిబిఐ విచారణకు ఆదేశించడం కేంద్ర హోం శాఖ మంత్రి పరిథిలోకే వస్తుందని, అయినా బండి సంజయ్ మాట్లాడడం లేదన్నారు. కాళేశ్వరం బిఆర్ఎస్కు ఏటీఎంగా మారిందన్న బిజెపి ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు.
అమెరికా సీజ్ చేసిన నౌకలో.. చైనా నుంచి ఇరాన్కు క్షిపణి రసాయనాలు
వాషింగ్టన్: హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ మాజీ రాయబారి , రిపబ్లికన్ నేత హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిని బట్టి ఇరాన్కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని కొట్టి పారేయలేమని ఆరోపించారు. ఈ తొస్కా నౌక అనేక సార్లు చైనాకు వెళ్లిందని, ఇరాన్ క్షిపణుల తయారీకి కావలసిన రసాయనాలను తీసుకొచ్చిందని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. గత ఆరు వారాల్లో ఈ నౌక చైనాకు రెండు సార్లు వెళ్లిందని పేర్కొంది. మరోవైపు తౌస్కా నౌకను, అందులోని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఇది వెంటనే జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాను హెచ్చరించింది. ఇరాన్ నౌకతో మా సంబంధం లేదు: చైనా అమెరికా సీజ్ చేసిన ఇరాన్ తౌస్కా వాణిజ్య నౌకలో క్షిపణుల తయారీకి కావలసిన చైనా రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. “నాకు తెలిసినంతవరకు , ఇది విదేశీ పతాకం కలిగిన నౌక. దాంతో తమ దేశానికి సంబంధం ఉందన్న దుష్ప్రచారాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం ” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి గుయో జియా కున్ పత్రికా విలేకరులకు చెప్పారు. అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఉద్రిక్తతలకు దారితీసిన హిజాబ్ బిందీ వివాదం
కళ్లజోడు విక్రయ సంస్థ లెన్స్కార్ట్ షోరూమ్లో హిజాబ్ బిందీ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యోగులు హిందూత్వాన్ని ప్రతిబింబించే బింది, బొట్టు పెట్టుకోవడం వంటివి చేయకూడదు అని చెబుతూ, హిజాబ్కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చా నేతల ఆధ్వర్యంలో కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు స్టోర్లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు బీజేపీ మైనారిటీ మోర్చా నేత నాజియా ఎలాహీ నాయకత్వం వహించారు. కార్యకర్తలు స్టోర్లోకి ప్రవేశించి సిబ్బందికి బొట్టు పెట్టడంతో పాటు చేతులకు పవిత్ర దారాలను కట్టారు. అలాగే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాజియా ఎలాహీ స్టోర్ ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్ను ప్రశ్నిస్తూ, హిందూ మతంలోని కొన్ని సంప్రదాయాల ఆంక్షలపై వస్తున్న ఆరోపణలకు వివరణ కోరారు. మీరు మొహ్సిన్ ఖాన్ కాబట్టే బొట్టు పెట్టుకోవడాన్ని ఆపారా? అని ఆమె వీడియోలో ప్రశ్నించినట్లు వినిపించింది. నాజియా ఎలాహీ మాట్లాడుతూ స్టోర్నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ మరొక మతాన్ని అణగదొక్కుతున్నారు. ఇది హిందూ దేశం. సంస్థ యజమాని క్షమాపణ చెప్పకపోతే లెన్స్కార్ట్ను బహిష్కరిస్తాం లేదా అన్ని ఔట్లెట్లనూ మూసివేయాల్సిందే అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్ తో పాటు హిందూ ఉద్యోగులను ముందుకు పిలిచి వారి నుదుటిపై బొట్టు పెట్టారు. మతపరమైన గుర్తింపును వ్యక్తపరచడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు అని పేర్కొన్నారు. అయితే, ఈ సమయంలో ఉద్యోగులు అసౌకర్యంగా కనిపించినప్పటికీ ప్రతిఘటించలేదు. ఇదిలా ఉండగా, షోరూమ్లోని ఒక ఉద్యోగి, సంస్థ శిక్షణా సమయంలో బొట్టు పెట్టుకోవడం, చేతికి పవిత్ర దారం కట్టుకోవడం నిషేధమని చెప్పినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, వివాహిత మహిళలు కూడా మంగళసూత్రం ధరించకూడదని సూచించారని ఆయన తెలిపారు. ఈ ఆరోపణలు అక్కడున్న వారిలో ఆగ్రహానికి దారితీశాయి. షోరూమ్ మేనేజర్ నుంచి వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల కార్యకర్తలు ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పేర్కొంటూ, పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు ఔట్లెట్ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. హిజాబ్కు అనుమతి ఇస్తూ, బిందీ, బొట్టు పెట్టుకోవడం వంటి హిందూ మత సంప్రదాయాలపై పరిమితులు విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో లెన్స్కార్ట్ వివాదాల్లో చిక్కుకుంది. వివాదం ముదురుతున్న నేపథ్యంలో సంస్థ క్షమాపణలు తెలియజేసింది. సంస్థ సీఈఓ పీయుష్ బన్సల్ వివరణ ఇస్తూ, ఆ విధాన పత్రం తప్పుదోవ పట్టించేలా ఉంది అని, అది సంస్థ ప్రస్తుత మార్గదర్శకాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. వైరల్ అయిన ఆ పాత విధాన పత్రం పాత శిక్షణ గమనిక మాత్రమేనని, సంస్థ హెచ్ఆర్ విధానంలో భాగం కాదని తెలిపారు. బిందీ, బొట్టుకు సంబంధించిన సూచనలు తరువాత తొలగించేశామని కూడా పేర్కొన్నారు. తరువాత సంస్థ విడుదల చేసిన సమగ్ర ‘ఇన్-స్టోర్ స్టైల్ గైడ్’లో బిందీ, బొట్టు నుంచి హిజాబ్, తలపాగా (తుర్బాన్) వరకు అన్ని మత, సాంసృ్కతిక గుర్తులను తమ అన్ని ఔట్లెట్లలో అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.
27న తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ కీలక సమావేశం
భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు తప్పనిసరిగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంఎల్ఎలు, మాజీ ఎంఎల్సిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి..
మనతెలంగాణ, సిటిబ్యూరోః రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన నాచారం, మల్లాపూర్లో వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం వీడియో తీస్తు బిల్డింగ్పై నుంచి కిందపడడంతో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రానికి చెందిన బాలుడు మితున్(14) తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం నాచారం, మల్లాపూర్కు వచ్చి పనిచేస్తున్నారు. మల్లాపూర్, గాంధీ బొమ్మ దగ్గర ఉన్న బస్తీలో ఉంటున్నారు. బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు, బాలుడు తరచూ ఇన్స్ట్రాగ్రాం, యూట్యూబ్లో రీల్స్ చూసేవాడు. తాను కూడా రీల్స్ చేసి ఫేమస్ కావాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీన తాను ఉంటున్న భవనం బాల్కనీ రేయిలింగ్ పిట్ట గొడపై ఫీట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు.

33 C