SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
...

తిరగబడ్డ ఇరాన్

 ఖమేనీ మరణం తర్వాత ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ 27 ప్రతీకార దాడులు ఇజ్రాయెల్‌పై దాడిలో 8 మృతి అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ నౌకపై క్షిపణి దాడి దుబాయ్, అబుదాభి, దోహా, మనామాలపై దాడులు హార్ముజ్ జలసంధి మార్గంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడి.. 15 మంది భారతీయులు సురక్షితం దుబాయ్‌లోని పారిశ్రామిక నగరం షార్జాసిటీలో ఇరాన్ వైమానికి దాడి తర్వాత దృశ్యం దుబాయ్ : తమ ప్రతీకార చర్యల ఉధృతితో ఆదివారం ఇరాన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఓ వైపు ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులకు దిగుతున్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట సైనిక చర్యను ఇరాన్ చేపట్టింది. ఇప్పటివరకూ ఓ ఎత్తు అయితే ఇకపై జరిగేది మరో ఎత్తు అని, తమ దాడులతో ఇక ఇజ్రాయెల్, అమెరికాలు వదలిపెట్టండని వేడుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. తమ బలగాలు ఆదివారం మధ్య ప్రాచ్యంలోని 27 అమెరికా సైని క స్థావరాలపై దాడికి దిగాయని, భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు వర్గాలు టెహరాన్‌లో తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని టెల్‌నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాల యం హాకీర్యా పై కూడా దాడికి దిగినట్లు వెల్లడించారు.ఆదివారం ఇజ్రాయెల్‌లోని బెయిట్ షెమెష్ పట్టణంపై మిస్సైల్ దాడిలో కనీసం ఎనమండుగురు చనిపోయినట్లు. 17 మందికి పైగా గాయపడ్డట్లు ఇరాన్ తెలిపింది. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీనిని ఆ ప్రాంత వైద్యాధికారులు కూడా ధృవీకరించారు. అమెరికాకు చెందిన యుద్ధ విమా న వాహక నౌక లింకన్‌పై దాడికి దిగాయి. యుఎస్‌ఎస్ లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఇరాన్ తీర ప్రాంతంలో మకాం వేసుకుని ఉన్నప్పుడు ఇరాన్ దాడికి గురైంది. మరో వైపు ఇరాన్ సేనలు దుబా య్, అబూధాబి, దోహా, మనామాలపై దాడులకు దిగాయి.ఖతార్ రాజధాని దోహా ఎక్కువగా ఇరాన్ దాడులకు తల్లడిల్లుతోంది. ఇక్కడి అమెరికా సైనిక స్థావరాలను ఎంచుకుని ఆదివారం మధ్యాహ్నానికి 11 సార్లు దాడులు జరిగాయి. కీలకమైన అంతర్జాతీయ విమాన ప్రయాణ కేంద్రం అయిన ఖతార్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి దాడులతో దుబాయ్ వాసులు, ప్రత్యేకించి పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటల ప్రాంతం లో వరుస పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ప ర్యాదం బూర్జు ఖలీఫా సమీపంలోని పలు అంతస్తుల భవనాలపై దాడులు జరిగాయి. అక్కడి ఓ హోటల్ ఇరాన్ క్షిపణి దాడులతో పాక్షికంగా దెబ్బతింది. అక్కడ మకాం వేసుకుని ఉన్న పర్యాటకులు భయంతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చిం ది. శనివారం మధ్యాహ్నం నుంచే దుబాయ్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకుని దాడులు సాగుతున్నాయి. గంటల విరామంతో పేలుళ్లు విన్పిస్తూ వచ్చాయని భారత్‌కు చెందిన ఓ ఐటి నిపుణుడు ఆర్ చౌదరి దుబాయ్ నుంచి ఫోన్‌లో తెలిపాడు. ఖమేనీ అంతంతో ఇరాన్ దాడులు భీకర స్థాయికి చేరిన విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ నిర్థారించింది. ఆదివారం ఇరాన్ శక్తివంతమైన రెండు ఖండాంతర క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణులు సైప్రస్ దిశలో దూసుకువెళ్లాయి. అయి తే సైప్రస్‌ను లక్షంగా ఎంచుకుని దాడులు జరగలేదని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. రెడ్‌లైన్ దాటినందుకు తగు శిక్ష: ఇరాన్ ఇరాన్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. రెవెల్యూషనరీ గార్డు రంగంలోకి దిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు రెడ్‌లైన్ దాటాయని , పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మెహమ్మద్ బఘెర్ ఖాలిబప్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రకటించారు. చావుదెబ్బతీస్తామని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి మార్గంలో దాడులు 15 మంది భారతీయ నౌకా సిబ్బంది సురక్షితం మరో వైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యవసరం అయిన హర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతి సాయుధులు ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారత జాతీయులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఖతార్‌లో అమెరికా వైమానిక స్థావరం ధ్వంసం కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇరాన్ విఘాతం దోహా ః ఆదివారం ఇరాన్ జరిపిన దాడులలో ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం దెబ్బతింది. యుఎస్ కమ్యూనికేషన్స్ కోసం వినియోగించే డోమ్ ధ్వంసం అయిందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కూడా నిర్థారించింది. ఇరాన్ ప్రతీకార దాడుల ప్రభావం ఎక్కువగా దోహాపై పడుతోంది. ఈ ప్రాంతంలో అమెరికా సమాచార వినిమయానికి అవసరం అయిన వ్యవస్థ విచ్ఛిన్నం అయినట్లు వెల్లడైంది. డోమ్‌పై దాడి జరిగిన విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి సియాన్ పర్నేల్ ధృవీకరించారు. అయితే ఖతార్ అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి స్పందనా వెలువరించలేదు. 

మన తెలంగాణ 2 Mar 2026 12:01 am

27 అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌తో చర్యలు ఇజ్రాయెల్ పై దాడుల్లో ఎనిమిది మంది మృతి యుఎస్ లింకన్ నౌకపై దాడి .. దోహా దుబాయ్‌లలో పేలుళ్లు ఖమేనీ అంతం తరువాత టెహరాన్ టార్గెట్ ఇకపై కోలుకోలేని దెబ్బ అని ట్రంప్ హెచ్చరిక బుర్జు ఖలీఫ్ వద్ద హోటల్‌పై ఇరాన్ దాడి భారతీయులు సహా పర్యాటకుల కలవరం దుబాయ్ : తమ ప్రతీకార చర్యల ఉధృతితో ఆదివారం ఇరాన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఓ వైపు ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులకు దిగుతున్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట సైనిక చర్యను ఇరాన్ చేపట్టింది. ఇప్పటివరకూ ఓ ఎత్తు అయితే ఇకపై జరిగేది మరో ఎత్తు అని , తమ దాడులతో ఇక ఇజ్రాయెల్, అమెరికాలు వదలిపెట్టండని వేడుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. తమ బలగాలు ఆదివారం మధ్యప్రాచ్యంలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై దాడికి దిగాయని , భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు వర్గాలు టెహరాన్‌లో తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని టెల్‌నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకీర్యా పై కూడా దాడికి దిగినట్లు వెల్లడించారు.ఆదివారం ఇజ్రాయెల్‌లోని బెయిట్ షెమెష్ పట్టణంపై మిస్సైల్ దాడిలో కనీసం ఎనమండుగురు చనిపోయినట్లు. 17 మందికి పైగా గాయపడ్డట్లు ఇరాన్ తెలిపింది. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీనిని ఆ ప్రాంత వైద్యాధికారులు కూడా ధృవీకరించారు. అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక లింకన్‌పై దాడికి దిగాయి. యుఎస్‌ఎస్ లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఇరాన్ తీర ప్రాంతంలో మకాం వేసుకుని ఉన్నప్పుడు ఇరాన్ దాడికి గురైంది. మరో వైపు ఇరాన్ సేనలు దుబాయ్, అబూధాబి, దహా, మనామాలపై దాడులకు దిగాయి. ఖతార్ రాజధాని దోహా ఎక్కువగా ఇరాన్ దాడులకు తల్లడిల్లుతోంది. ఇక్కడి అమెరికా సైనిక స్థావరాలను ఎంచుకుని ఆదివారం మధ్యాహ్నానికి 11 సార్లు దాడులు జరిగాయి. కీలకమైన అంతర్జాతీయ విమాన ప్రయాణ కేంద్రం అయిన ఖతార్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి దాడులతో దుబాయ్ వాసులు, ప్రత్యేకించి పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాదం బూర్జు ఖలీఫా సమీపంలోని పలు అంతస్తుల భవనాలపై దాడులు జరిగాయి. అక్కడి ఓ హోటల్ ఇరాన్ క్షిపణి దాడులతో పాక్షికంగా దెబ్బతింది. అక్కడ మకాం వేసుకుని ఉన్న పర్యాటకులు భయంతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. శనివారం మధ్యాహ్నం నుంచే దుబాయ్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకుని దాడులు సాగుతున్నాయి. గంటల విరామంతో పేలుళ్లు విన్పిస్తూ వచ్చాయని భారత్‌కు చెందిన ఓ ఐటి నిపుణుడు ఆర్ చౌదరి దుబాయ్ నుంచి ఫోన్‌లో తెలిపాడు.ఖమేనీ అంతంతో ఇరాన్ దాడులు భీకర స్థాయికి చేరిన విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ నిర్థారించింది. ఆదివారం ఇరాన్ శక్తివంతమైన రెండు ఖండాంతర క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణులు సైప్రస్ దిశలో దూసుకువెళ్లాయి. అయితే సైప్రస్‌ను లక్షంగా ఎంచుకుని దాడులు జరగలేదని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. రెడ్‌లైన్ దాటినందుకు తగు శిక్ష ః ఇరాన్ ఇరాన్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. రెవెల్యూషనరీ గార్డు రంగంలోకి దిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు రెడ్‌లైన్ దాటాయని , పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మెహమ్మద్ బఘెర్ ఖాలిబప్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రకటించారు. చావుదెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇంతకు ముందెప్పుడూ చవిచూడని విధంగా ఈ చర్య ఉంటుందని వెల్లడించారు. ఈ వాదనను ట్రంప్ తిప్పికొట్టారు. మీరేం చేయలేరని , ఒకవేళ చేస్తే తమ శక్తివంతమైన దాడికి ఇక కోలుకోలేరని స్పందించారు. హర్మూజ్ జలసంధి మార్గంలో దాడులు 15 మంది భారతీయ నౌకా సిబ్బంది సురక్షితం మరో వైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యవసరం అయిన హర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతి సాయుధులు ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారత జాతీయులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరికలతో ఈ జలసంధి మార్గాన్ని మూసివేశారు. అయితే ఈ ప్రాంతంలో పలు రవాణా నౌకలు యధావిధిగా తిరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి మార్గంలో వెళ్లుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగామని, అది మునిగిపోయిందని ఇరాన్ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలోనే మరో నౌకపై ఇరాన్ మద్దతుగల హౌతీలు దాడికి దిగినట్లు, ఈ క్రమంలో కొందరు గాయపడ్డట్లు వెల్లడైంది. ఈ రెండు వేర్వేరు ఘటనలని ఇరాన్ తెలిపింది.ఖమేనీ అంతం తరువాత ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహరాన్‌పై భీకర క్షిపణి దాడులకు దిగాయి. ఆగకుండా సాగుతోన్న దాడులతో పలు ప్రాంతాలలో భయానక పరిస్థితి ఏర్పడింది. 

మన తెలంగాణ 1 Mar 2026 11:41 pm

విండీస్ పై గెలుపు... సెమీ ఫైనల్ కు భారత్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ పై భారత్ గెలిచి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత జట్టు 19.2 ఓటర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ భారీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది. సంజూ 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. తిలక్ వర్మ 15 బంతుల్లో 27 పరుగులు చేసి మైదానం వీడాడు. హార్ధిక్ పాండ్యా 14 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. శివమ్ దూబే నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జోషప్, హోల్డర్ చెరో రెండు వికెట్లు తీయగా అకీల్ హోసేన్ ఒక వికెట్ తీశాడు. ౯౭ పరుగులు చేసి సంజూ శామ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

మన తెలంగాణ 1 Mar 2026 10:58 pm

ఇరాన్ ఆపద్ధర్మ నేతగా అయతుల్లా రెజా

ముగ్గురు సభ్యుల గార్డియన్ కౌన్సిల్ కొత్త సారధి కీలక మత పెద్ద, మదర్సా సారధి ఖమేనీకి అత్యంత సన్నిహితుడు సమిష్టి నిర్ణయాలతోనే పాలన టెహరాన్ : ఇరాన్‌లో ఖమేనీ హతంతో వెంటనే ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీంలీడర్‌గా అయతుల్లా అలీ రెజా నియమితులు అయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో దేశ నాయకత్వ శూన్యత ప్రమాదకరం కావడంతో ఈ నియామకం జరిగినట్లు అధికార వర్గాల కథనం మేరకు దేశంలోని ఇస్నా వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్‌లో అలీరెజా అనుభవజ్ఞుడైన మత పెద్దగా ఉన్నారు. ఖమేనీ హయాంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 67 సంవత్సరాల అలీరెజా ఇరాన్ మత వ్యవహారాల తంతులో ఇప్పుడు సీనియర్ వ్యక్తి. ఆయనకు పాలనా పగ్గాలు అప్పగించారు. ఇంతకు ముందు ఆయన ఇస్లామిక్ బోధక విద్యాసంస్థలు, మదర్సా కార్యకలాపాల జాతీయ వ్యవస్థకు సారధి. దేశంలోని ప్రాబల్య షియా వర్గంలో ఉన్న గురుత్వంతో ఈ కీలక స్థానం దక్కింది. అంతేకాకుండా ఖమేనీ అంతర్గత కూటమిలో విశ్వాస పాత్రుడుగా పేరొందిన రెజా గార్డియన్ కౌన్సిల్‌లో మతవ్యవహారాల సభ్యుడిగా ఉన్నారు. దేశంలో పలు వ్యవహారాల నిపుణుల సమావేశాల్లో కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. రెజా ముందు పలు సంక్లిష్ట అంశాలు ఉన్నాయి. ముందుగా ఇరాన్‌పై తీవ్రస్థాయి అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తట్టుకోవల్సి ఉంటుంది. ఇదే దశలో ఇరానీయన్లలో పాలకుల పట్ల కనీస సంఘీభావం వ్యక్తం కావాలంటే ఖమేనీ అంతానికి ప్రతీకారం తీర్చుకోవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు ముందుండే ప్రధాన సవాలు దేశంలోని యువనవతరం ఇప్పటి రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు తాము పగ్గాలు స్వీకరించేందుకు ముందుకు వస్తే ఏం చేయాలనేది ఖరారు చేసుకోవాలి. రాబోయే రోజులు గంటల వ్యవధిలోనే తన నాయకత్వ సమర్థతను నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశంలో చలామణిలో ఉన్న అంతర్గత నాయకత్వ మండలి సభ్యుల రహస్య సమావేశంలో కొత్త నేతను ఎంపిక చేశారు. అయితే తాత్కాలిక బాధ్యతల్లోకి తీసుకున్నారని వెల్లడైంది. ఇరాన్‌లో ఖమేనీ హత్య వెంటనే అక్కడి రాజ్యాంగంలోని ఆర్టికల్ 111ను ఆచరణలో పెట్టారు. అత్యవసర రీతిలో నాయకత్వ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సుప్రీం లీడర్‌గా రెజా ఉంటున్నప్పటికీ శాశ్వత వారసుడి ఎంపిక వరకూ ముగ్గురు సభ్యుల కౌన్సిల్ బాధ్యతలను తీసుకుంటుంది. విధి విధానాలను బట్టి రెజా ఇకపై దేశ అధ్యక్షులు మసౌద్ పెజిషుకియాన్, దేశ ప్రధాన న్యాయమూర్తి గోలామ్ హుస్సేని మెహ్‌సెని ఎజితో కలిసి దేశాన్ని పాలించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు పాలనా నిర్వహణకు అంతిమ నిర్ణయాలు అన్ని కూడా ఖమేనీపైనే ఆధారపడి ఉండేవి. అయితే ఇప్పుడున్న కౌన్సిల్‌లోని ముగ్గురు సభ్యులలో రెజానే మతపెద్దగా కీలక పాత్ర పోషిస్తారు. రెజా 1959 లో జన్మించారు. దేశ రక్షణ కీలక విషయాలపై కూడా ఆయనకు అనుభవం ఉందని వార్తా సంస్థలు తెలిపాయి. 

మన తెలంగాణ 1 Mar 2026 10:34 pm

దుబాయ్‌లో భయం భయంగా

భారతీయ సెలబ్రిటీలు సింధు, సోనాల్ స్పందన దుబాయ్/ న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం ఘర్షణల ప్రభావం దుబాయ్‌పై పడటంతో ఈ మహానగరంలో చిక్కుపడ్డ భారతీయ సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. తాము సురక్షితంగానే ఉన్నామని అయితే ఎప్పుడేం జరుగుతుందో అనే భయాలతో ఉండాల్సి వస్తోందని భారత్‌లోని తమ సన్నిహితులకు వాట్సాప్ సందేశాల ద్వారా తెలియచేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతతో దుబాయ్ నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు నిలిచిపోయాయి. దీనితో ప్రపంచ స్థాయి దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి ఎప్పుడు విమానాల రాకపోకలు ఆరంభమవుతాయనేది స్పష్టం కావడంలేదు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ విజేత పివి సింధు దుబాయ్‌లో చిక్కుపడ్డారు. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు బర్మింగ్‌హామ్‌కు ఇండోనేసియా కోచ్ ఇర్వాన్‌స్యాయ్‌తో కలిసి బయలుదేరుగా ఎయిర్‌పోర్టులో నిచిలిపోవల్సి వచ్చింది. సమీపంలోనే ఇరాన్ బాంబుల దాడి జరిగింది. దీనితో తాము పరుగులు తీశామని, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయని తెలిపారు. స్థానిక అధికారులు తమను తరువాత సురక్షిత ప్రాంతంలోని ఓ హోటల్‌కు జాగ్రత్తగా తీసుకువెళ్లారని చెప్పారు. తాము ఇప్పుడు క్షేమంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడి భారతీయ ఎంబసికి, స్థానిక అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నామని తెలిపారు. ఇక బర్మింగ్‌హామ్‌లో క్రీడా నిర్వహణపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ పరిస్థితి సమీక్షిస్తోంది. ఇక నటి సోనాల్ చౌహాన్ కూడా దుబాయ్‌లో ఉండిపోవల్సి వచ్చింది. తాను క్షేమంగా భారతదేశానికి తిరిగివచ్చేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 10:21 pm

పేద విద్యార్థులకు 150 సైకిళ్ల పంపిణీ

పేద విద్యార్థులకు 150 సైకిళ్ల పంపిణీ విజయవాడ, ఆంధ్రప్రభ: ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:14 pm

టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి

టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి భవానిపురం, ఆంధ్రప్రభ : టీటీడీ చైర్మన్

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:10 pm

విజయవాడ పర్యటనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

విజయవాడ పర్యటనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయవాడ, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టు

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:04 pm

సూర్యకుమార్ యాదవ్ ఔట్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సంజూ శామ్సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్ లు(55), తిలక్ వర్మ (01)లతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 10:00 pm

ప్రకృతి అందాలను ఆవిష్కరించే వసంతం

ప్రకృతి అందాలను ఆవిష్కరించే వసంతం కనువిందు చేస్తోన్న మోదుగ పూలువిరగ పూసిన మోదుగ

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:55 pm

సంజూ శామ్సన్ హాఫ్ సెంచరీ

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సంజూ శామ్సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్ లు(54), సూర్య కుమార్ యాదవ్(17)లతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:54 pm

పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం

పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం టేకుమట్ల,ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:50 pm

దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం

దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:44 pm

ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి

ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి కూసుమంచి, ఆంధ్రప్రభ: కూసుమంచి మండల కేంద్రానికి చెందిన

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:40 pm

నెటిజన్లను ఆకట్టుకుంటున్న తడోబా అంధారి పులి

మన తెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ ప్రేమికుడు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ తడోబా అంధారి టైగర్ రిజర్వులో పర్యటించి అక్కడి చక్కటి దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఆ సమయంలో అడివిలో తిరుగాడుతున్న ఒక పులిని ఆయన తన కెమెరాతో ఫోటో తీశారు. ఈ దృశ్యాన్ని తన వారాంతపు ఫోటోగ్రఫీలో భాగంగా ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

మన తెలంగాణ 1 Mar 2026 9:32 pm

Fact Check: Viral Airport Blast Image Actually Shows Israeli Strike on Rafah, Not Afghanistan

Loud blasts followed by gunfire were heard in the Afghan capital, Kabul, on Sunday morning amid ongoing clashes between Afghan and Pakistani forces, according to media reports. The violence comes days after Afghanistan's Taliban administration said it remained open to negotiations even as tensions with Pakistan spiralled into an open war following Pakistani airstrikes targeting multiple Afghan cities. Amid this, an image surfaced on the internet. The image shows a town engulfed in flames. Users are sharing the image claiming that it is from Kabul Airport and that the Pakistan Air Force conducted a new airstrike there. A user shared the picture and mentioned in the post: “Two explosions were heard at Kabul Airport. Reportedly, the Pakistan Air Force conducted a new airstrike.” JUST IN: 2 explosions heard at Kabul Airport. Reportedly Pakistan Air Force conducted a new airstrike. Fallow @GeoPoliticlc pic.twitter.com/ET2sCyxT7b — Geopolitics Press (@GeoPoliticlc) February 27, 2026 You can find the archive link here . Fact Check: The claim is false. The image dates back to March 2024 and reportedly shows a fireball erupting during an Israeli bombardment on Rafah in the Gaza Strip. During our investigation, we conducted a reverse image search. This led us to a March 27, 2024 report by Al Monitor , which used the same photograph in a story about heavy Israeli bombardment in southern Gaza, especially in Rafah. The same image was also found in a March 2024 AFP report published on www.news24.com. The caption read: “A fireball erupts during Israeli bombardment on Rafah in the southern Gaza Strip, amid the ongoing battle between Israel and the Palestinian militant group Hamas.” This shows that the image has been available online since at least March 2024. We also found on 27 March 2024 AFP shared a video in their YouTube Channel. In the Title AFP mentioned, Fireball lights up skyline as Israeli strike hits Rafah. In approximately a two-second segment of the video, we found the same explosion visible, matching the viral image. The team webqoof also debunked it and published, Old Image of Huge Explosion Falsely Linked to Afghanistan-Pakistan Escalations Hence, we found the viral claim linking the image to an explosion at Kabul airport amid Afghanistan-Pakistan tensions is false. The photograph predates the current developments and actually captures an Israeli bombardment on Rafah in Gaza from March 2024. Sharing old and unrelated visuals in a new context not only distorts facts but also fuels unnecessary panic and misinformation.

తెలుగు పోస్ట్ 1 Mar 2026 9:32 pm

సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ, మేయర్

సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ, మేయర్ ప్రజా సంక్షేమమే

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:31 pm

అభిషేక్, ఇషాన్ ఔట్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్ లు(20), సూర్య కుమార్ యాదవ్(01)లతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:27 pm

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:24 pm

అభిషేక్ శర్మ ఔట్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా మూడు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(1), సంజూ శామ్సన్ లు(19) బ్యాటింగ్ చేస్తున్నారు.  తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:18 pm

వరాహ స్వామిని వెలికి తీసిన వానరం

వరాహ స్వామిని వెలికి తీసిన వానరం భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌ మండలంలోని

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:15 pm

మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది..

మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది.. 15లోపు పట్టాలిస్తాం.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాంవెలుగుమట్ల

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:09 pm

వేసవి తాగునీటికి మిషన్ భగీరథ ఏర్పాట్లు

అన్ని ఆవాసాలకు ఇబ్బంది లేకుండా సరఫరా ప్రణాళిక రూపకల్పన చేసిన ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం కసరత్తు చేస్తోంది. మిషన్ భగీరథ ద్వారా అన్ని మారు మూల ప్రాంతాలకు తాగునీటిని అందించి నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు ప్రణాళికను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాలు ఉండగా, వాటిలో కేవలం 150 ఆవాసాలకు మాత్రమే మిషన్ భగీరథ నీరు అందడం లేదు. దీనికితోడు కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటైనట్లు నమోదు కావడంతో వీటికి కూడా మిషన్ భగీరథ నీటిని అందించాల్సి ఉంది. కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైపు లైన్లు వేయడం సవాల్‌గా ఉన్న ప్రాంతాల్లో స్థానిక జల వనరులను వినియోగించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిరంతర తాగునీటి సరఫరా కల్పించేందుకు గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం కృషి చేస్తోంది. మిషన్ భగీరథ పథకానికి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో ప్రస్తుతం అవసరాలకు సరిపడా నీరు నిల్వ ఉందని అధికారులు నివేదిక తయారు చేశారు. దీంతో వేసవిలోనూ పెద్దగా ఇబ్బందులు లేకుండా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మిషన్ భగీరథలో చాలా ప్రాంతాల్లో తాగునీరు అందండం లేదనే ఫిర్యాదులపై నిశిత పరిశీలన చేసేందుకు, అందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇంటింటికి తాగునీరు అందుతున్న పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాల్సి ఉంది. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి, ప్రజల్లో మిషన్ భగీరథ నీటిపై నమ్మకం పెంచేలా చూడాలని అధికారులు ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామసభల్లో మిషన్ భగీరథ నీటి వినియోగంపై తీర్మానాలు చేయించి అవగాహన పెంచేందుకు కూడా నిర్ణయించారు. ప్రతి కుటుంబానికి తాగునీటిని అందించే ప్రణాళిక మిషన్ భగీరథ పథకం నిర్దేశించిన మేరకు ప్రతి కుటుంబానికి తాగునీటిని అందించేందుకు వీలుగా ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతంలో అయితే రోజుకు తలసరి వంద లీటర్లు, అదే మున్సిపాలిటీల్లో అయితే తలసరి 135 లీటర్లు, నగర పాలక సంస్థల్లో అయితే తలసరి 150 లీటర్లు సరఫరా చేయాల్సి ఉంది. గతంలో వర్షాభావం వల్ల నీటి నిల్వలు సరిపడా లేకపోవడం వల్ల అవసరమైన మేర నీటిని సరఫరా చేయలేదు. ఈసారి భారీ వర్షాల కారణంగా నీటి నిల్వలు ఉన్నందున సరఫరా అనుకున్న మేర జరుగుతుందని అధికార వర్గాల సమాచారం. కొత్తగా గుర్తించిన ఆవాసాలకు కూడా తాగునీటిని అందించేందుకు ప్రణాళిక బద్దంగా రూపకల్పన జరుగుతోంది. ఇదిలావుండగా మిషన్ భగీరథ పథకం రాష్ట్రంలో 1.11 లక్షల చదరపు కిలోమీటర్ల మేర నీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. 95 నియోజకవర్గాల్లో 2.72 కోట్ల మంది ప్రజలకు తాగునీటిని ఇవ్వాలన్నది మిషన్ భగీరథ లక్షం. ఈ మేరకు పూర్తి లక్షంతో తాగునీటిని అందించేందుకు ప్రణాళిక రచిస్తోంది. కృష్ణా బేసిన్ నుంచి 32.43 టిఎంసిలు, గోదావరి బేసిన్ నుంచి 53.68 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ రూపకల్పన చేసింది. మిషన్ భగీరథలో కొన్ని చోట్ల పైప్‌లైన్ పనులు జరగాల్సి ఉండగా, మరికొన్ని చోట్ల వేసిన వాటికి నష్టం జరగడంతో తిరిగి వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో 1.50 లక్షల పైప్ లైన్ నెట్ వర్కు ద్వారా నీటిని అందించాల్సి ఉంది. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యంగా వేసవి దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈసారి సర్పంచ్‌లను ఎక్కువగా దీనిలో భాగస్వాములను చేసి మిషన్ భగీరథలో ఇబ్బందులు లేకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలు, సరఫరా పరిస్థితులపై సర్పంచ్‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:07 pm

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఖండించిన : ఎంసిపిఐ(యు)

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇరాన్‌ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్ ను ముందుంచి అమెరికా సాగిస్తున్న అకారణమైన సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా ( యూనైటెడ్) ఆలిండియా కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఎంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఈ మేరకు హైదరాబాద్ ఓంకార్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీ మీదనే కాకుండా వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది హెచ్చరిక అని వారన్నారు. గతంలో వెనుజువెలా దేశ అధ్యక్షుడు మదురో పై దాడి చేసి అరెస్టు చేసి అమెరికా కస్టడీలో పెట్టుకొని ఆ దేశ సహజ వనరుల పై ఆధిపత్యం చెలాయిస్తున్న తీరు గమనించిన వారందరికీ అమెరికా - ఇజ్రాయెల్ జోడి యుద్ద ఉన్మాదం అర్థం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరించి ఇతర దేశాల సార్వభౌమత్వం లో జోక్యం చేసుకుని సాగిస్తున్న ఈ దాడులు రానున్న కాలంలో మానవ మనుగడకు పెనుముప్పు గా మారే నర ఉన్మాదం తో సాగిస్తున్న ఈ సైనిక దాడులను యావత్ ప్రపంచం, అభ్యుదయ, ప్రజా తంత్ర ప్రగతిశీల శక్తులు తీవ్రంగా ఖండిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మాణం లో ముందు వరుసలో ఉండాలని వారు పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 1 Mar 2026 9:00 pm

అగ్ని ప్రమాద బాధితునికి వృత్తి పనిముట్లు అందజేత

అగ్ని ప్రమాద బాధితునికి వృత్తి పనిముట్లు అందజేత రూ.37,116 విలువ గల పనిముట్లు

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:58 pm

రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు : మంత్రి పొన్నం

మన తెలంగాణ / హైదరాబాద్ : రోడ్డు రవాణా శాఖ పై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఆర్‌టిసి నియామకానికి, ఆర్‌టిసికి ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌టిసి నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. డ్రైవర్‌కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని ఆయనన్నారు. డ్రైవర్ పోస్ట్‌కు మోటారు వాహన చట్టం ప్రకారం 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) ప్రామాణికమని తెలిపారు. టికెట్ యాప్‌లో ఎలాంటి సమస్యలు లేవని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:56 pm

ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ

ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ టన్ను గెలలు ధర 21,546 దమ్మ పేట,

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:50 pm

టీమిండియా లక్ష్యం: 196

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. భారత మందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  విండీస్ బ్యాట్స్ మెన్లు రోస్టన్ చేజ్(40), రోవన్ పావెల్(34 నాటౌట్), జెసన్ హోల్డర్(37 నాటౌట్), సాయి హోప్(32), సిమ్రాన్ హెట్ మెయిర్ (27) పరుగులు చేసి ఆలౌటయ్యారు. షెర్ఫన్ రూథర్ పోర్డు (14) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోవన్ పావెల్(03), రోమారియో జెషన్ హోల్డర్ (6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హార్ధిక్ పాండ్యా చెరో ఒక వికెట్ తీశారు. 

మన తెలంగాణ 1 Mar 2026 8:48 pm

Nani stuns with his bulky transformation for The Paradise

Natural Star Nani has been pushing the boundaries for each of his film. His script choices and performance has made him a huge star in Telugu Cinema. Now, the actor is working with Srikanth Odela, who delivered mass cult actioner, The Paradise. The transformation to play Jadal in the film is shocking everyone. He released […] The post Nani stuns with his bulky transformation for The Paradise appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 8:39 pm

CIJ Visit : వావ్ ..సూర్య‌చంద్రోద‌యం Andhra Prabha News

CIJ Visit : వావ్ ..సూర్య‌చంద్రోద‌యం Andhra Prabha News హైకోర్టు జ‌డ్జీల

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:37 pm

పేకాట రాయుళ్లపై పోలీసుల మెరుపు దాడి

పేకాట రాయుళ్లపై పోలీసుల మెరుపు దాడి స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన 9 మంది

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:36 pm

వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం

వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం మార్చి 15 నాటికి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:31 pm

కళలు, సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

దేవాలయాలు, టూరిజం, కల్చర్ తో యాక్షన్ ప్లాన్ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఎల్బీ స్టేడియంలో ఘనంగా రామదాసు జయంతి ఉత్సవాలు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తోందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో రామదాసు జయంతి ఉత్సవాలలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేల గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడు, భద్రాచల రామదాసు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని కళాకారులకు, సాంస్కృతిక వైభవానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను రాష్ట్ర అభివృద్ధి గురించి సంగీత నాటక అకాడమీ ఆధ్యర్యంలో అనేక కార్యక్రమాలతో ప్రజలకు వివరించారు. కళారూపాల్లో ప్రజలు పాల్గొనడంతో పాటు స్పందించిన తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సంగీత నాటక అకాడమీ విరివిగా కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ముందుంటుందని, అవసరమైన ఆర్థిక అవసరాలను తీరుస్తామని డిప్యూటి సిఎం భరోసా ఇచ్చారు. నేలకొండపల్లిలో జన్మించిన గోపన్న తన భక్తితో, కీర్తనలతో భక్త రామదాసుగా చిరస్థాయిగా నిలిచిపోయారని భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన కట్టిన భద్రాచలం ఆలయం, రాసిన కీర్తనలు ప్రతి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మన ప్రాంత వాగ్గేయకారుల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఇటువంటి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. చైతన్యానికి కళలే ఆయువు పట్టని, తెలంగాణ గ్రామాల్లోని ప్రతి సమస్యకు కళారూపాల ద్వారానే పరిష్కారాన్ని, చైతన్యాన్ని తీసుకువచ్చిన చరిత్ర మనదని డిప్యూటి సిఎం గుర్తుచేశారు. కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రజలను జాగృతం చేసేందుకు కళలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప వంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు, రాష్ట్రంలోని పురాతన ఆలయాలను కలుపుతూ పర్యాటకం, సంస్కృతి మేళవించిన ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంగీత నాటక అకాడమీని ఆయన ఆదేశించారు. కళల పట్ల ప్రజలకు ఉన్న మక్కువ చూస్తుంటే సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:27 pm

చింతకాని వాగులో విష్ణుమూర్తి విగ్రహం లభ్యం

చింతకాని వాగులో విష్ణుమూర్తి విగ్రహం లభ్యం కాటారం,ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:22 pm

నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.  విండీస్ బ్యాట్స్ మెన్లు రోస్టన్ చేజ్(40), సాయి హోప్(32), సిమ్రాన్ హెట్ మెయిర్ (27) పరుగులు చేసి ఆలౌటయ్యారు. షెర్ఫన్ రూథర్ పోర్డు (14) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోవన్ పావెల్(03), రోమారియో జెషన్ హోల్డర్ (6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 1 Mar 2026 8:20 pm

వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ

వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆత్మ

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:16 pm

100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ

100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:12 pm

చరిత్రలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు

ఎన్‌పిడిసిఎల్ చరిత్రలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పిడిసిఎల్) చరిత్రలోనే ఆదివారం అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,267 మెగావాట్లు నమోదయినట్లు సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. శనివారం నమోదైన 6,057 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను అధిగమిస్తూ, ఆదివారం 6,267 మెగావాట్లకు చేరుకోవడం ఎన్‌పిడిసిఎల్ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇది సంస్థ ముందస్తుగా తీసుకున్న ప్రణాళికాబద్ధమైన చర్యల ఫలితమని ఆయన స్పష్టం చేశారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. డిమాండ్ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, దిశానిర్దేశంతో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని సిఎండి వివరించారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:08 pm

స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తా….

స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తా…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : వేసవికాలంలోనీటి ఎద్దడి లేకుండా

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:06 pm

స్వామి గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే

స్వామి గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:02 pm

Wedding Celebrations Begin in Allu Family

Mega Producer Allu Aravind’s younger son Allu Sirish is all set to get married and the wedding will be a restricted ceremony and it will witness family members and close friends. The wedding celebrations have begun today in the residence of Allu Aravind. The Pelli Koduku ceremony took place today in the presence of family. […] The post Wedding Celebrations Begin in Allu Family appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 7:59 pm

రెండేళ్లు పూర్తి చేసుకున్న సిఎం ప్రజావాణి

74 శాతం సక్సెస్ రేటు ఇంచార్జ్ చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోందని ఇంచార్జ్ చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతుండడంతో రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు భారీ ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న సిఎం ప్రజావాణికి తరలివస్తున్నారన్నారు. సుమారు 25 నెలల క్రితం ప్రారంభమైన సిఎం ప్రజావాణి ప్రతి వారంలో మంగళ, శుక్రవారాలలో నిర్వహిస్తూ ఇప్పటివరకు 24 సెషన్స్ పూర్తి చేసుకుందని తెలిపారు. రెండేళ్ల కాలంలో సిఎం ప్రజావాణిలో మొత్తం ఒక లక్షా 12 వేల 245 దరఖాస్తులు నమోదు కాగా, అందులో 64 వేల 558 దరఖాస్తులు పరిగణలోకి తీసుకొని 47 వేల 935 దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. మిగిలిన 47, 687 దరఖాస్తులు ప్రభుత్వ పథకాలు, విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాల్సినవి కావడం, ఉద్యోగాల కోసం సంబంధించినవి ఉన్నట్లు వెల్లడించారు. వీటిని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత శాఖలకు సిఫార్సు చేశామన్నారు. సిఎం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారం 74 శాతం మేరకు ఉండడంతో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని, ప్రజల్లో భరోసా పెరిగిందని, దీంతో వారంలో రెండు రోజులు సుమారు వేయి దరఖాస్తులు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. గల్ఫ్ లోని ఏడు దేశాలు సహా ఇతర దేశాలలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిఎం ప్రవాసి ప్రజావాణి కేంద్రాన్ని కూడా ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజావాణిలో దరఖాస్తులు రాసి ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్, ప్రతి శాఖ నుంచి అధికారులతో ప్రత్యేక డెస్కులు, వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపు, వృద్ధులు దివ్యాంగుల రవాణా కోసం బ్యాటరీ బగ్గి, వీల్ చైర్స్, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్, ప్రజలకు మంచినీటి సౌకర్యం, జీ.హెచ్.ఎం.సీ. ఆర్థిక సహకారంతో హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఐదు రూపాయల భోజనం వంటివి ప్రజావాణిలో కల్పించినట్లు తెలిపారు. సిఎం ప్రజావాణి రానున్న రోజుల్లో పరిష్కార శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:58 pm

Vajpayee |ఖమ్మం సభలో సంచలన వ్యాఖ్యలు

Vajpayee | ఖమ్మం సభలో సంచలన వ్యాఖ్యలు కులం కంటే గుణమే మిన్న..

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:58 pm

ఉప్పరపల్లిలో 800 ఏళ్ల శివాలయానికి పునర్జీవం

సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి కృషిని కొనియాడిన డా. ఈమని శివనాగిరెడ్డి

తెలుగు పోస్ట్ 1 Mar 2026 7:55 pm

ఇప్ప‌టికీ పెన్ష‌న్ అందేలా లేదు…

ఇప్ప‌టికీ పెన్ష‌న్ అందేలా లేదు… కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుంటాల

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:48 pm

మహిళల భద్రత గాలికి..

మహిళల భద్రత గాలికి.. హామీల అమలులో ప్రభుత్వం విఫలంఅభయహస్తం హామీలు ఏమయినట్లు?మాలగురుజాల సదస్సులో

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:34 pm

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటి రష్మిక

రేవంత్ ఫ్యామిలీతో గడపడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ నెల 4న నగరంలో జరుగనున్న విజయ్ దేవరకొండ,- రష్మిక వివాహ రిసెప్షన్‌కు సిఎం కుటుంబసభ్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కుటుంబ సభ్యులతో ఆమె కొద్దిసేపు ఆప్యాయంగా గడిపారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సిఎం అర్ధాంగి గీత, రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉందని, దీన్ని తాను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను అని రష్మిక పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:33 pm

స్వర్ణకారులు అన్ని రంగాల్లో ఎదగాలి…

స్వర్ణకారులు అన్ని రంగాల్లో ఎదగాలి… స్వర్ణకార సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:29 pm

దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలి…

దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలి… నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ఉభయ నాగేశ్వర

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:24 pm

సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా ఉంటంది మంత్రి శ్రీధర్ బాబు మనతెలంగాణ/హైదరాబాద్ : కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లనే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి... అక్కడి రాజ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమది బుల్డోజర్ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరూ తమపై కావాలనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:23 pm

ప్రభుత్వమే దాడి చేయించింది…

ప్రభుత్వమే దాడి చేయించింది… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సినీఫక్కీలో పోలీసులతో కలిసి

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:20 pm

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం వేద మంత్రోచ్చారణల నడుమ అంకురార్పణ, అభిషేకాలతో

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:09 pm

విజయవాడ టౌన్ డివిజన్ ఈఈగా బాధ్యతల స్వీకరణ

విజయవాడ టౌన్ డివిజన్ ఈఈగా బాధ్యతల స్వీకరణ విజయవాడ, ఆంధ్ర‌ప్ర‌భ : ఏపీసీపీడీసీఎల్

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:04 pm

నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ జైనూర్,ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:03 pm

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత జట్టు

హైదరాబాద్: టి20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా సూపర్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.  భారత జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోతీ, షమర్ జోసెఫ్

మన తెలంగాణ 1 Mar 2026 6:58 pm

కోగంటి సరోజినికి నివాళులు…

కోగంటి సరోజినికి నివాళులు… కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ఇటీవల మృతి చెందిన కోగంటి

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:55 pm

రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీ

రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీ మునుగోడు,ఆంధ్రప్రభ: రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:52 pm

భారత చట్టాలపై అవగాహన : సిఐ శ్రీ హర్ష

భారత చట్టాలపై అవగాహన : సిఐ శ్రీ హర్ష రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:52 pm

ఇరాన్, గల్ఫ్‌లో తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్

సిఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సూచన మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. ఇరాన్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్‌తోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాగ్రత్తగా ఉండండిః మహేష్ కుమార్ గౌడ్ ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు సూచించారు. అక్కడ పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి చెందిన కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ధ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మిసైల్ దాడుల భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన కోరారు. యుద్ధ ప్రభావంతో కొన్ని చోట్ల విమానాశ్రయ సేవలు అంతరాయం కలిగినట్లు సమాచారం అందుతోందని, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు కార్మికులు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకుని తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. యూఏఈ, ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని, భారత రాయబార కార్యాలయాలతో నిరంతర సంబంధం కొనసాగించాలని సూచించారు.

మన తెలంగాణ 1 Mar 2026 6:31 pm

ప్రేమ పెళ్లి: భార్యను హత్య చేసిన భర్త

నల్గొండ: వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ మురిపెం పట్టుమని మూడు నెలలు కూడా ఉండలేదు. ఏమైందో తెలియదు కానీ, భార్యని భర్త దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం గూడూరులో చోటు చేసుకుంది. భర్త తవీర్ భార్య మనీషా చారును దారుణంగా హత్య చేశాడు. మూడు నెలల క్రితమే మనీషా-తవీర్‌లు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం మనీషా-తవీర్‌ దంపతులు ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. గూడూరులోని ఓ ఇటుక బట్టీలో వీరిద్దరు పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మన తెలంగాణ 1 Mar 2026 6:27 pm

వికలాంగుల సమస్యలు... మార్చి 13న సామూహిక నిరాహార దీక్ష

వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం... మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్ష : ఎన్‌పిఆర్‌డి మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న హైదరాబాద్‌లో సాముహిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు మానవ హక్కుల జాతీయ వేదిక వెల్లడించింది. వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని, ఎంపికైన లబ్ధిదారులకు పరికరాలు వెంటనే పంపిణి చేయాలని, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెంచాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు బి స్వామి, సహాయ కార్యదర్శి జెర్కొని రాజు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలైనా ఎన్నికల హామీలు వికలాంగుల పెన్షన్ రూ. 4016 నుండి రూ. 6వేలకు పెంచడం, చేయూత పెన్షన్స్ రూ. 2016 నుండి రూ. 4 వేలకు పెంచలేదని అన్నారు. 29,572 మంది వికలాంగుల పెన్షన్స్ రద్దు చేశారని, చేయూత పెన్షన్స్ కోసం ప్రతి నెల రూ. 994.50 కోట్లు అవసరమని, .2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 14628.91 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ. 10,514.32 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. 2026-27 వార్షిక బడ్జెట్‌లో పెన్షన్స్ పెంపుదలకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తోందని, 2026-27 బడ్జెట్‌లో 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 5 వేల కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెపుతున్న ముఖ్యమంత్రికి చేయూత పెన్షన్స్ పెంచలనే ఆలోచన ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. మార్చి 16 నుండి జరిగే బడ్జెట్ సమావేశాలలో పెన్షన్స్ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 6:18 pm

వైభవంగా ఎదురుకోల ఉత్సవం

వైభవంగా ఎదురుకోల ఉత్సవం గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మండలంలోని నెమలి

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:15 pm

Operation Ajai 2.0 ఇండియా రెడీ Andhra Prabha Spl News

Operation Ajai 2.0 ఇండియా రెడీ Andhra Prabha Spl News (ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:14 pm

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు,

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:13 pm

30 years |గ్రామ మ‌లుపు వ‌ద్ద‌…

30 years | గ్రామ మ‌లుపు వ‌ద్ద‌… 30 years | ఇంద్రవెల్లి,

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:11 pm

సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతాయి

తిరువూరు, ఆధ్రప్రభ : పాఠశాలల్లో తరచు సైన్సు ప్రదర్శనలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:10 pm

UBS: Pawan Kalyan to rock with his swag

Power Star Pawan Kalyan and Harish Shankar have formed a cult combination with the blockbuster, Gabbar Singh. The movie gave the Power Star, a big break from underperformers. Hence, audiences have been waiting for his next collaboration with Harish Shankar from long time and Ustaad Bhagat Singh is releasing soon. Exactly in 25 days, the […] The post UBS: Pawan Kalyan to rock with his swag appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 6:04 pm

supreme leader |కౌన్సిల్‌ చేతికి పగ్గాలు

supreme leader | కౌన్సిల్‌ చేతికి పగ్గాలు ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:57 pm

చంద్రగ్రహణం దృష్ట్యా 12లోపు హొలీ వేడుకలు…

చంద్రగ్రహణం దృష్ట్యా 12లోపు హొలీ వేడుకలు… మోత్కూర్, ఆంధ్రప్రభ : సంపూర్ణ చంద్రగ్రహణం

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:56 pm

Decades |మోదుగు చెట్టుకి హొలీ పువ్వు…

Decades | మోదుగు చెట్టుకి హొలీ పువ్వు… మోత్కూర్ లో హొలీ, శ్రీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:52 pm

ఆర్‌టిసి బస్సు - కారు ఢీ.. ముగ్గురు మృతి

అనంతపురం: ఆర్టిసి బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గువనపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ముదిగలకు చెందిన చెల్లెలు చంద్రకళ(32), తన సోదరులు శివకుమార్(36), హనుమంత రాయుడు(40) కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టిసి బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. కర్ణాటకలోని మొలకల్మూర్‌లో జరిగే వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డిఎస్పి రవిబాబు, సిఐ హరినాథ్ తమ సిబ్బందితో సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతదేహఆలను పోస్టుమార్టం నిమిత్తం కలంద్రం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మన తెలంగాణ 1 Mar 2026 5:45 pm

Ram Charan begins dubbing for most anticipated Peddi

Mega Power Star Ram Charan has officially kickstarted the dubbing process for his highly anticipated sports drama, Peddi. As the film moves into its crucial post-production phase, the actor shared a light-hearted and candid video from the dubbing studio alongside director Buchi Babu Sana. In a humorous exchange, Ram Charan was seen playfully teasing the […] The post Ram Charan begins dubbing for most anticipated Peddi appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 5:41 pm

బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి

సూర్యాపేట (జనంసాక్షి): ఈ నెల 2న హైదరాబాదులో జరిగే బిసి మహాధర్నాను విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నల్గొండ …

జనం సాక్షి 1 Mar 2026 5:14 pm

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూమి పూజ

మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు పట్టణంలోని దుబ్బ కాలువ రోడ్డులో రూ.200 కోట్ల

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:14 pm

Indian |ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించాలి

Indian | ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించాలి చర్చల ద్వారా చేసక్కటి పరిష్కారం..యుద్ధం సమస్యలకు

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:11 pm

నవాబుపేటలో మాదిగ అమరవీరులకు నివాళులు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేటలో మాదిగ అమరవీరులకుఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:06 pm

బ్యాటింగ్‌లో విఫలమైన భారత్.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్

హోబార్ట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో భారత చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. రిటైర్‌మెంట్ ప్రకటించిన అలీసా హేలీ 158 పరుగులతో చెలరేగిపోగా, బెత్ మూనీ 106, జార్జియా వొల్ 62, నికోలా కేరీ 34 పరుగులు సాధించారు. ఆ తర్వాత భారీ లక్ష్య చేధనలో భారత్ తీవ్రంగా తడబడింది. ఆసీస్ బౌలింగ్ ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. భారత బ్యాటింగ్‌లో స్నేహ్ రానా 44, జెమీమా 42 పరుగులు చేయగా మిగితా వాళ్లంతా స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో అలీసా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 1 Mar 2026 5:02 pm

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:01 pm

అమరవీరులకు ఘనంగా నివాళ్ళు

అమరవీరులకు ఘనంగా నివాళ్ళు ప‌ర‌కాల‌, ఆంధ్రప్రభ : పట్టణంలోని అమరధామంలో మాదిగ అమరవీరులకు

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:56 pm

4thMarchHoli |గ్రహణం రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఎందుకు శుభం కాదు?

4thMarchHoli | గ్రహణం రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఎందుకు శుభం కాదు?

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:48 pm

మృతురాలికి నివాళులు..

మృతురాలికి నివాళులు.. పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతురాలి

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:35 pm

కచ్చితమైన డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి..

కచ్చితమైన డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. విజయవాడ, ఆంధ్రప్రభ : జనగణన విధులను

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:29 pm

భీకర యుద్ధం.. పాకిస్థాన్-ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్ రద్దు

అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇరాన్‌ కూడా ప్రతి దాడులు చేస్తుంది. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణించారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ యుద్ధం ప్రభావం ఓ క్రికెట్ సిరీస్‌పై పడింది. పాకిస్థాన్ షాహీన్స్‌తో (ఎ జట్టు), జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు) రద్దు చేసుకుంది. నిజానికి ఈ సిరీస్ అబుదాబీ వేదికగా జరగాల్సి ఉంది. కానీ, అమెరికా ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా ఇరాన్ అబుదాబీపై దాడులు చేస్తోంది. దీంతో ఇంగ్లండ్ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ అక్కడే చిక్కుకుపోయారు. అయితే భారతకాలమానం ప్రకారం మార్చి 1న ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్-పాకిస్థాన్ షాహీన్స్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది. అయితే భద్రతా కారణఆల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్ మొత్తం రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. ‘‘జట్టు భద్రత మా ప్రాధాన్యం పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం’’ అని ఇసిబి ఓ ప్రకటనలో పేర్కొంది. 

మన తెలంగాణ 1 Mar 2026 4:27 pm

వైరా మున్సిపాలిటీకి ‘చికిత్స’ అవసరం

వైరా మున్సిపాలిటీకి ‘చికిత్స’ అవసరం వైరా, ఆంధ్రప్రభ : నూతనంగా వైరా మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:18 pm

రూ. 1 లక్ష ఆర్థిక సహాయం….

రూ. 1 లక్ష ఆర్థిక సహాయం…. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:14 pm

స్నేహితురాలికి భరోసా కల్పించిన మిత్ర బృందం..

స్నేహితురాలికి భరోసా కల్పించిన మిత్ర బృందం.. చిట్యాల, ఆంధ్రప్రభ : తనతో పాటు

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:11 pm