3942wards | సన్నాహాలు ప్రారంభం 3942wards పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం ముందడుగుడివిజన్లు, వార్డుల
గాఢతను సంతరించుకున్న సరళత నాకు ఇష్టం
నేను, నా సాహితీయాత్ర: 1974లో నా పదమూడవ ఏట నా సాహిత్య ప్రయాణం మొదలయింది. వరంగల్ జిల్లా ఖానాపురం అనే గ్రామంలో ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు మా తెలుగు ఉపాధ్యాయుడు తేలు లక్ష్మీనారాయణ గారి ప్రోత్సాహంతో కవితలను రాయడం మొదలుపెట్టాను. స్కూలు వార్షికోత్సవ కార్యక్రమంలో కొన్ని వందల మంది గ్రామస్తుల సమక్షంలో నా తొలి కవితను చదివే అవకాశాన్ని పొందాను. స్కూల్ రోజుల్లో కొన్ని పద్యాలు రాశాను. నేను రాసిన తొలి కథ ‘వెలుగు రేఖలు’ 1978లో యోజన అనే పత్రికలో అచ్చయింది. కవిత్వం వైపు పూర్తిగా మళ్లడం వల్ల మళ్ళీ నేను కథలు రాయలేదు. నేను వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో MSc (Ag) పూ ర్తి చేసాక 1984లో ఆంధ్రా బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరి కలకత్తాలో, హుబ్లిలో పనిచేసి పొన్నూరుకు వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే తుమ్మపూడిలో ఉండే సంజీవదేవ్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. గుంటూరులో ఉన్న కాలంలో పా పినేని శివశంకర్ గారి ద్వారా ఎన్నో సాహిత్యవిషయాలను తెలుసుకున్నాను. అక్కడే ‘చినుకు’ అనే బులెటిన్కు సహ సంపాదకుడిగా పనిచేసాను. రోమిలా థాపర్ రాసిన Sati in history అనే దీర్ఘ వ్యాసాన్ని చరిత్రలో సతిగా అనువదించాను. దాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక చిన్న పుస్తకంగా ప్రచురించింది. 1987లో నా తొలి కవితా సంపుటి ‘జీవన వీచిక’ ను తెనాలిలో సంజీవదేవ్ గారు ఆవిష్కరించారు. ఆ తర్వాత వచ్చిన నా కవితా సంపుటులు ఇవి: ప్రవాహం (1992), ముఖాముఖం (1995), వేళ్ళు మాట్లాడే వేళ (1999), ఆట (దీర్ఘ కవిత - 2001), నాగటిచాళ్ళు (2004), నేల గంధం (2009), పొలం గొంతుక (2013), పత్రహరితం (2016). ధాన్యం గింజలు (2019), బాలల కోసం బాటసారి పదాలు (2020), జొన్నచేను ముందు (2023). నా లేఖా సంపుటి 2021లో పలకరింపుగా వెలువడింది. నా విమర్శ వ్యాసాల సంపుటి ఇష ్టవాక్యం (2012)లో వచ్చింది. అమితావ్ ఘోష్, మహాశ్వేతా దేవి, వాసుదేవ నాయర్, దామోదర్ మౌజోలతో పాటు మరి కొందరితో నేను చేసిన ఇంటర్వ్యూల సంపుటి అనుభవం మాట్లాడింది (2025)లో. నా తొలి ఆంగ్ల కవితా సంపుటి Scents of the Soil (2016)లో వచ్చింది. నా కవితలను కొన్నింటిని దేశెట్టి కేశవరావు ఆంగ్లంలోకి అనువదించగా Green Fingers and other poems అనే సంపుటిగా తెచ్చాను. వ్యవసాయం, నా యాత్రలు, మానవ సంబంధాలు, రాజకీయాల తీరుతెన్నులు, నా లోపలి చింతనలూ ఉహలూ స్థూలంగా ఇవీ నా కవితా వస్తువులు. నా కవితలు సరళంగా, గాఢతతో, దృశ్యమానంగా వుండాలని అభిలషిస్తూ ఆ దిశగా సాధన చేసాను. 2004 నుంచి 2014 వరకు వెలువడిన కవిత వార్షిక సంచికలకు సహ సంపాదకుడిని. 2015 నుంచి 2024వరకు సంపాదకుడిగా కవిత్వం వార్షిక సంచికలను రూపొందించాను. కాళోజీతో సహా ఎందరినుంచో నేను స్ఫూర్తిని పొందాను. సాహిత్యం ప్రజాహితానికీ, మానవ సంస్కారానికీ దోహదం చేయాలని నా నిశ్చితాభిప్రాయం. నా కవిత్వానికీ, నా వ్యక్తిత్వానికీ నడుమ భేదం ఉండకూడదనీ, నేను కవిత్వంలో ప్రతిపాదించే విలువలకు భిన్నంగా జీవించకూడదనీ నాకు నేను పెట్టుకున్న ప్రమాణాలు. నా ప్రయాణంలో ఫ్రీవర్స్ ఫ్రంట్, సినారె పురస్కా రం, గరికిపాటి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారంతో పాటు దాదాపు ఇరవై అయిదు పురస్కారాలను పొందాను. 1992లో బ య్యారం అనే ఊళ్లో రైతులమీద నేను రాసిన కవిత ను చదివినపుడు, అక్కడ కొందరు రైతులు నన్ను సమీపించి మా గురించి రాశారు, చాలా సంతోషం గా ఉంది అని అన్నారు. అది నా సాహిత్య జీవితం లో నేను పొందిన అత్యున్నత పురస్కారమని అనుకుంటాను. నా విస్తార సాహిత్య ప్రయాణానికి నా సహచరి కమల, పిల్లలు మానస రవళి, చైత్ర మౌ నిక అందించిన తోడ్పాటును మాటల్లో చెప్పలేను. - దర్భశయనం శ్రీనివాసాచార్య
Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? క్యూ లైన్ లు ఎంత పొడవంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
NTR is transforming himself for Prashanth Neel’s film and he is taking bigger breaks for his transformation. Though it is unclear how many looks Tarak would portray, the top actor is spending hours in the gym to get the desired beast look. Tarak himself posted a click from his transformation in his gym. He gets […] The post NTR’s Beast Look Loading appeared first on Telugu360 .
Nara Lokesh : నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు
ప్రియురాలిని చంపి... పిఎస్లో లొంగిపోయిన ప్రియుడు
చెన్నై: అనుమానంతో ప్రియురాలిని ప్రియుడు హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం పెరంబలూరు జిల్లా కున్నం తాలూకాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పుదువెట్టక్కుడి గ్రామానికి చెందిన పచ్చముత్తు, సత్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నందిని(25) అనే మహిళకు భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి ఉంటుంది. పెరంబలూర్లో పని చేస్తుండగా నందినికి పచ్చముత్తు పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సత్యకు తెలియడంతో పలుమార్లు భర్తను మందలించింది. భర్తలో మార్పు రాకపోవడంతో సత్య ఆత్మహత్య చేసుకుంది. పెరంబలూరులోని భారతీనగర్లో నందినితో కలిసి పచ్చముత్తు ఉంటున్నాడు. నందిని ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుండడంతో ఆమెపై పచ్చముత్తు అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఆమె ఫోన్లో మాట్లాడుతుండగా ప్రియుడు ఆమెను ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో ఆమెపై దాడి చేయడంతో చనిపోయింది. వెంటనే పెరంబలూర్ పోలీస్ స్టేషన్లో అతడు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Sibling Rivalry Intensifies Over TRS Legacy
K. T. Rama Rao and K. Kavitha, once seen walking in the footsteps of their father K. Chandrashekar Rao, are now seen competing for the legacy of the pink flag. At the centre of this emerging rivalry is the TRS brand name, which still carries strong emotional value among Telangana voters. There is a growing […] The post Sibling Rivalry Intensifies Over TRS Legacy appeared first on Telugu360 .
Zodiac Signs : ఈరోజు అదృష్టం ఏ రాశికో తెలుసా? ఇబ్బందులు ఈ రాశుల వారికో తెలుసా?
దినఫలాలు అంటే చాలా మందికి గురి
అమీన్ పూర్ లో ఆక్రమణల తొలగింపు... 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్.
అమీన్ పూర్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ దాదాపు పూర్తి కావచ్చింది
భువనేశ్వర్: కుమారుడు, కుమార్తెను కసాయి తల్లి చంపిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కన్నతల్లి కాటికి పంపిస్తుందని అనుకోలేదు. ఝూర్సుగూడలోని తంగరపల్లి గ్రామంలో రంజిత అనే మహిళ, భర్త కుమారుడు బిభాన్షు(06), కుమార్తె జిజ్ఞాస (10) కలిస జీవిస్తోంది. శనివారం రాత్రి భర్తను లేపి బయటకు రమ్మని పిలించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లి గడియ వేసుకుంది. కూతురు, కుమారుడిని పదునైన ఆయుధంతో దాడ చేసి చంపేసింది. అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంది. లోపల నుంచి కేకలు వినపడడంతో భర్త ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. గ్రామస్థులు డోర్ బద్దలు కొట్టి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో కనిపించారు. భార్య కొన ఊపిరితో ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు రాజస్థాన్తో పోరు మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భా గంగా సోమవారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్కు సవాల్గా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్కు ఈ మ్యా చ్లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచిన రాజస్థాన్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇందులోనూ గెలిచి టాప్ ర్యాంక్ను నిలబెట్టుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్కు బౌలింగ్ సమ స్య వెంటాడుతోంది. దాదాపు ప్రతి మ్యాచ్లో భారీ స్కోరు సాధిస్తున్నా దాన్ని కాపాడుకోలేక ఓటములు చవిచూస్తోంది. పంజాబ్తో జరిగిన కిందటి మ్యాచ్లో 219 పరుగుల భారీ స్కోరు ను సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ మరో ఏడు బంతులు మిగిలివుండగానే అలవోకగా ఛేదించింది. అంతకుముందు బెంగళూరు కూడా హైదరాబాద్ ఉంచిన 202 పరుగులు క్లిష్టమైన లక్ష్యా న్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. బ్యాటర్లు బాగానే ఆడుతున్నా బౌలిం గ్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కనీసం ఈ మ్యాచ్లోనైనా బౌలింగ్, ఫీల్డింగ్ను మెరుగు పరుచుకోవాల్సిన బాధ్యత సన్రైజర్స్పై ఉంది. లేకుంటే మరో ఓటమి ఖాయమని చెప్పాలి. మరోవైపు వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన రాజస్థాన్ ఈ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. అద్భుత ఆటతో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓటమి పాలవ్వని రాజస్థాన్ ఈసారి కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ అసాధారణ రీతిలో రాణిస్తున్నాడు. వైభవ్, యశస్వి, పరాగ్, జురెల్, హెట్మెయిర్, జడేజా తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ఆర్చర్, జడేజా, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
IPL 2026 : ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పోరాడనుంది.
IPL 2026: తేరుకోని ముంబయి.. పట్టుకోల్పోని బెంగళూరు
ముంబయి ఇండియన్స్ తేరుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టు కోల్పోలేదు
Strait of Hormuz : హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చేశారు
వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండా - తట్టెపల్లి మధ్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం తాండూర్ నుంచి జహీరాబాద్ కు స్కూటీపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాయపడిన కుమారుడిని 108లో తాండూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఫెయిలవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య.... తీరా చూస్తే పాస్!
ఖమ్మం జిల్లా రాపల్లిలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అక్షాంత్ అన్ని సబ్జెక్టుల్లోనూ పాస్ అయినట్లు ఫలితాల్లో వెల్లడి మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/మహబూబ్నగర్ బ్యూరో/ వెల్దుర్తి/ ఉట్నూర్: ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయపడి నాలుగు రోజుల క్రితం ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, ఆదివారం వెల్లడైన ఇంటర్ ఫలితాలలో మాత్రం ఆ విద్యార్థి పాసయ్యాడు. బోనకల్ మండలం రాపల్లికి చెందిన గంగాదేవుళ్ల వెంకటేశ్వర్లు రేణుక కుమారుడు గంగాదేవుల అక్షాంత్ వైరా పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, తాను పరీక్షలు సరిగ్గా రాయలేదని, ఫెయిల్ అవుతానేమోననే భయంతో గురువారం మధిర రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆదివారం వెలువడ్డ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అక్షాంత్ 347 మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. ఇది తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఫలితాలపై విద్యార్థులు ఆందోళన చెందకుండా, కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు వారికి మానసికంగా ధైర్యం చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవితం ఒక పరీక్షా ఫలితంతో ముగియదని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని అవగాహన కల్పించడం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. ఎందరో గొప్ప వ్యక్తులు చదువులో విఫలమైనా, జీవితంలో అద్భుత విజయాలు సాధించారని నిపుణులు పేర్కొంటున్నారు. అన్నాసాగర్లో విద్యార్థిని ఆత్మహత్య ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానన్న బాధతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో చోటుచేసుకున్నది. జక్కుల శ్రావణి (17) అనే విద్యార్థిని భూత్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివి పరీక్షలు రాసింది. ఆదివారం విడుదలైన ఫలితాలలో శ్రావణి ఫెయిల్ అయింది. దీంతో మానసిక వేదన చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెల్దుర్తిలో విద్యార్థి ఆత్మహత్య ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అ య్యాడనే మనస్థాపం తో చాకలి సాయిరాం (17) అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. వివరాల్లోకి వెళితే... చాకలి సాయిలు నాగమణి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి పని చేసుకునే తరుణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో సా యిరాం ఇంటర్లో సీఈసీ చదువు తున్నాడు. ఈ నెలలో సోదరి మహేశ్వరి వివాహం కుదరడంతో కుటుం బసమేతంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ తరుణంలో ఆదివారం నాడు వెలువడిన పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మనస్థాపానికి గురైన సాయిరాం ఇంట్లో ఎవరూ లేని సమయం లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. దంతన్పల్లిలో ఉరివేసుకొని.. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లికి చెందిన జిల్లపెల్లి బక్కన్న, బుచ్చవ్వ దంపతుల కుమార్తె సౌజన్య (17) ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల కాగా ఆ ఫలితాలలో సౌజన్య ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Haiti stampede : తొక్కిసలాట...25 మంది మృతి... వందలాది మందికి గాయాలు
హైతీలోని మిలోట్లో తొక్కిసలాట జరిగింది
నేషనల్ హైవే పై ప్రమాదం.. ఉయ్యురు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు – మచిలీపట్నం
శ్వాసకోస, గుండెపోటు వ్యాధులతో చికిత్స పొందుతూ మృతి నేడు సాయంత్రం ముంబయిలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని సిఎం రేవంత్ సహా సినీ ప్రముఖుల సంతాపం 20 రెండు సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం ముంబై : వసంత వేళ మృధుమంద్ర స్వరా ల కోకిల ఇక సెలవంటూ వెళ్లిపోయింది. చ లనచిత్ర ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లే తమ 92వ ఏట కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న ఆశాకు శనివా రం గుండెపోటు వచ్చింది. దీనితో కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని ప్రఖ్యాత బ్రీ చ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిసే పు పరిస్థితి నిలకడగా ఉన్నా తరువాత విషమించింది. చికిత్స దశలో ఆదివారం ఉద యం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే మీడియా కు వెలువరించిన ప్రకటనలో తెలిపారు. ఆశాభోంస్లే మరణంతో భారతీయ గానక ళా సౌరభం మరింతగా ఇగిరిపోయింది. ప్ర ముఖ గాయని లతా మంగేష్కర్ చిన్న సోద రి, ఆమె కు భిన్నమైన గాన స్వర రాగాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఆశా భోస్లే అ టు స రిగమల కువకువల సశాస్త్రియ గానాలాపనలో, ఇటు జనాన్ని ఊర్రూతలూగించే దశాబ్దాల పాటు దమ్మారో దమ్ అంటూ ప క్కన నిలుచుని పాడినట్లు ఉండే పాటలతోనే తన స్వర ఝురిని సృష్టించుకున్నారు. వ యోవృద్ధ సమస్యలతో పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఆమె మరణించారని ఆసుపత్రి డాక్టర్ ప్రతీప్ సందాని మీడియాకు తెలిపారు. ఆమె భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన తరువాత సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పెద్దక్క లతా మంగేష్కర్ కూడా తమ 92వ ఏటనే 2022 ఫిబ్రవరిలో కన్నుమూశారు. సంగీత ప్రవాహాలలో ఇరువురిది భిన్న సరళి. లత గంభీర గంగాప్రవాహ శైలిని సొంతం చేసుకుంటే, ఇందుకు భిన్నంగా ఆశా భోంస్లే గలగలల జలపాతం వరవడిని సృష్టించుకున్నారు. పలు జాతీయ ప్రాంతీయ పురస్కారాలు అనేకం ఆమెకు అందాయి. పద్మ విభూషణ్, దాదాసాహెబ్ పాల్కే, మహారాష్ట్ర భూషణ్, బంగా విభూషణ్ వంటి అవార్డులతో ఆమె వాటికి వన్నె తెచ్చారు. ఆశా సీని ప్రస్థానం 1943లో మరాఠీ చిత్రం మజాబ్తో ఆరంభం అయింది. చలా చలా నవ్ చలా మొదటి పాట. భావానికి తగ్గట్లుగానే ఆమె తరువాతి పాటల క్రమం ముందుకు సాగింది. తరువాత 1948లో బాలీవుడ్ దర్శకులు హంసరాజ్ బహల్ పిలుపుతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. అక్కడ మలుపు తిప్పారు. 1954లో బూట్పాలిష్ సినిమాలోని పాటలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. ఇక తిరుగులేకుండా సాగారు . హరేరామ్ హరేకృష్ణలో క్లబ్ డాన్స్ దమ్ మారో దమ్ తరాల నిత్యనూతన యువజోరు పాట అయింది. చురాలియా హూ తుమ్నే జో దిల్కో పాటలోని విరుపులు ప్రేమికులకే సందేశాలు ఇచ్చాయి. తెలుగులో తక్కువే అయినా తళుక్కుమన్నవే తెలుగు సినిమాలలో కూడా ఆమె పాడారు. తక్కువ పాటలు పాడినా నిలిచి ఉన్నాయి. పాలు నీళ్లు సినిమాలో ఇది మౌనగీతం, సీతాకాలం ప్రేమకు , నాలో ఊహలకు ఐసాలకిడి వంటి పాటల తేనెలూరారు. సోదరి లతా మంగేష్కర్ వ్యక్తిగత కార్యదర్శి గణపతిరావును తొలుత పెళ్లిచేసుకున్న ఆశా తరువాత విడాకులు తీసుకుని ప్రముఖ సంగీత దర్శకులు ఆర్డి బర్మన్ను 1980లో పెళ్లాడారు. యన 1994లో మరణించారు. అప్పటి నుంచి తన ముగ్గురు పిల్లలు, మనవడు మనవరాలు జీవితంగా గడిపారు. అరుదుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో పాటలు పాడారు. తనపై ఎవరి ప్రభావం పడటానికి వీల్లేదని చెపుతూ గానంలో తన సొంత ప్రతిభనే ఆశగా శ్వాసగా ఎంచుకుని సాగారు. క్లాసికల్ నుంచి కాబ్రే పాటల వరకూ ఆమెదే ప్రత్యేక బాణీ అయింది. చివరికి లతా మంగేష్కర్ను కూడా గాన ప్రతిభలో మించిపోయారు. తన నానమ్మకు ఛాతీలో ఇన్ఫెక్షన్ చివరికి మరణానికి దారితీసిందని మనవరాలు జనాయ్ భోంస్లే తెలిపారు. సినిమా రంగంలో కవ్వింతల మహిళ స్వరం ఎవరిదంటే అది కేవలం ఆశాజీదే అనే పేరు తెచ్చుకున్నారు. మీరాకు పాడినా, హెలెన్కు గళమిచ్చినా ఆమెకే చెల్లు విషాద ప్రేమ కథల హీరోయిన్ మీరాకుమారికి ‘హమ్ ఇంతేజార్ కరేంగే ’పాటతో బాధపెట్టినా, తిరుగులేని నర్తకి హెలెన్ క్లబ్ డాన్స్ పియా తూ అబ్తో ఆజా పాడినా ఈ రెండింటి వైరుద్ధం ఎంతగా ఉన్నా, వీటికి ప్రాణం పోసింది ఆమెనే అయ్యారు. ఎనిమిది దశాబ్దాల పాటల తోటల ప్రస్థానంలో ఆమె పాటల చివుళ్లు 12000 వరకూ ఉన్నాయి. ఆశాభోంస్లేకు అభిమానులు, పౌరులు ఆమె స్థానిక నివాసం లోవర్ పారేల్లోని కాసా గ్రాండేలో తుది నివాళులు అర్పించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. తరువాత శివాజీ పార్క్లో అంత్యక్రియలు జరుగుతాయి. ఆశాజీ మరణంతో ఓ అసాధారణ సంగీత యాత్ర ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. భారతదేశ గుర్తింపుగా మారిన ఆమె సంగీత ముద్ర చెరిపివేయలేనిదని కితాబు ఇచ్చారు. ఆశా భోంస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించారు. సంగీత ఓనమాలను సోదరి లతా మాదిరిగానే తండ్రి దీననాథ్ మంగేష్కర్ నుంచి పొందారు. నలుగురు సోదరిలు లతా ఉషా , మీనా ఆశా వీరిలో ముగ్గురు గాయనీలు, మీనా ఒంక్కరే సంగీత దర్శకురాలు అయ్యారు. సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఆశా లతా గాయనిలు అయినా ఎవరికి వారుగా సొంత శైలితో సాగారు. ప్రముఖ సంగీత దర్శకులు ఏ ఆర్ రహమాన్ రంగీలా పాటకు ఆమె ప్రాణం పోశారని స్పందించారు. ఆమె తేజస్సు ఆమె పాటనే అని ఫోటోలు జతపర్చారు. ఆమె మరణం తనను కదలించివేసిందని గాయని ఉషా ఉతూప్ రోదించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల సంతాపం మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్ఞి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోస్లే మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా, వివిధ భాషలలో సాటిలేని బహుముఖ ప్రజ్ఞ, నైపుణ్యంతో భారతీయ సంగీతానికి ఆశా భోస్లే చేసిన అసాధారణమైన సేవ, తరతరాలకు స్ఫూర్తినిచ్చే శాశ్వత వారసత్వాన్ని మిగిల్చిందని ముఖ్యమంత్రి తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా తెలిపారు. ఆమె మరణం దేశ సాంస్కృతిక, కళారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆశా భోస్లే మృతి సంగీత లోకానికి తీరని లోటని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆశా భోస్లే ఎనిమిది దశాబ్దాల పాటు తన మధుర గాత్రంతో కోట్లాది సంగీతాభిమానులను అలరించారని మంత్రి గుర్తు చేసుకున్నారు. శాస్త్రీయ సంగీతం నుంచి ఆధునిక పాప్ వరకు విభిన్న శైలుల్లో ఆమె అందించిన గానమాధుర్యం అజరామరమని కొనియాడారు. భారతీయ చలనచిత్ర సంగీత శిఖరం, లెజెండరీ గాయని ఆశా భోస్లే మరణం పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణం కేవలం సినీ రంగానికే కాకుండా, యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. అభిమానుల హృదయాల్లో ఆమెది చిరస్థాయి: కిషన్రెడ్డి భారతదేశం గర్వించదగ్గ గాయని, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా భోస్లే ఇకలేరనే వార్త చాలా విచారకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వైవిధ్యభరితమైన గాత్రంతో శాస్త్రీయ సంగీతంతోపాటుగా, గజల్స్, పాప్ మ్యూజిక్లోనూ రాణించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను వారు గెలుచుకున్నారు. సంగీత ప్రియులకు తీరని లోటు: రాంచంద్రరావు ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణ వార్త విని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. ఈ యుగానికి మరపురాని గాయనిగా గుర్తింపు పొందారని కొనియాడారు. అక్క లతా మంగేష్కర్, అలాగే ప్రఖ్యాత గాయకులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్తో కలిసి ఆశా భోస్లే దాదాపు అరవై ఏళ్లకు పైగా హిందీ సంగీత రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందారని కొనియాడారు. సంగీత ప్రపంచం అపురూపమైన స్వరాన్ని కోల్పోయింది: కెటిఆర్ సంగీత ప్రపంచం ఒక అపురూపమైన స్వరాన్ని కోల్పోయిందని ప్రముఖ గాయని, పద్మవిభూషణ్ ఆశా భోస్లే మరణం పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సుమారు ఎనిమిది దశాబ్దాలపాటు తన గాత్రంతో కోట్ల మందిని అలరించిన పద్మ విభూషణ్ ఆశా భోస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
అగ్నిగోళం.. బయటకు వెళితే ఇక అంతే..
అగ్నిగోళం.. బయటకు వెళితే ఇక అంతే.. హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత
రహస్య కోటి రూపాయలు స్వాహా ఇద్దరు అధికారుల చేతివాటం ఎస్టిఎఫ్, డిటిఎఫ్లో పాతుకుపోయిన అధికారులు, సిబ్బందితో వసూళ్ల దందా మేడ్చల్ పరిధిలో కిందిస్థాయి సిబ్బందికి ఓ అధికారి టార్గెట్ పెట్టి వసూళ్లు సికింద్రాబాద్లో డిఫెన్స్ బాటిళ్లను విక్రయిస్తున్న ఎక్సైజ్ అధికారి గంజాయి సేవిస్తూ దొరికిన ఓ కంపెనీ యజమాని మనవడు, రూ. 20 లక్షలు పుచ్చుకొని వదిలేసిన వైనం మనతెలంగాణ/హైదరాబాద్: ఆబ్కారీ శాఖలో అవినీతి తిమింగలాలు అధికమయ్యారు. గంజాయి, ఎండిఎం, డ్రగ్స్, నకిలీ మద్యం కేసుల్లో అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టిఎఫ్, డిటిఎఫ్లో పనిచేసే కొందరు అధికారుల చేతివాటం అధికమయ్యిందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. ముఖ్యంగా ఎస్టిఎఫ్, డిటిఎఫ్లో కిందిస్థాయి సిబ్బంది ద్వారానే ఈ వసూళ్ల దందా జరుగుతుందని అందుకే తమకు నచ్చిన కానిస్టేబుళ్లను డిప్యూటేషన్ తీసుకొచ్చి ఇక్కడ అక్రమాలు, అవినీతి కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో... ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్లో ఇన్ఫార్మర్ల పేరుతో ఏర్పాటు చేసే సీక్రెట్ ఫండ్కు సంబంధించి కోటి రూపాయలను ఇద్దరు అధికారులు కలిసి స్వాహా చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బుకు సంబంధించి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో ఇన్ఫార్మర్ల పేరుతో ఆ డబ్బును ఇద్దరు అధికారులు స్వాహా చేశారని ఇప్పటికే దీనిపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు అందినట్టుగా సమాచారం. ఇలా, ఎస్టిఎఫ్, డిటిఎఫ్లో చాలాకాలంగా కొందరు అధికారులు, సిబ్బంది డిప్యూటేషన్ల పేరుతో పాతుకు పోయారని వారే ప్రస్తుతం చక్రం తిప్పుతూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.20 లక్షలు ఇచ్చి మనువడిని తీసుకెళ్లిన... ఈ మధ్య ఎస్టిఎఫ్లో పనిచేసే ఓ అధికారి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఆయన మనువడిని అరెస్టు చేస్తానని బెదిరించి గంటలోనే వారి నుంచి రూ.20 లక్షలను వసూళ్లు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. గంజాయి కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సమయంలో ఆ వ్యక్తి ఫోన్ను ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ను చెక్ చేయగా ప్రముఖ కంపెనీకి చెందిన మనువడు గంజాయి తీసుకుంటున్న వీడియో ఎస్టిఎఫ్ అధికారులకు దొరికింది. వెంటనే ఎస్టిఎఫ్ అధికారులు ప్రముఖ కంపెనీకి చెందిన మనువడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆ కంపెనీ యజమాని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తన మనువడిని ఎస్టిఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయమై మొరపెట్టుకోగా ఆ ఎమ్మెల్యే వెంటనే ఎస్టిఎఫ్ అధికారితో సంప్రదింపులు జరిపారని, ఆ అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో గంటలోపే ప్రముఖ కంపెనీ యజమాని రూ.20 లక్షలు ఇచ్చి ఆయన మనువడిని ఇంటికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. మేడ్చల్ పరిధిలో పనిచేసే... మేడ్చల్ పరిధిలో పనిచేసే ఒక అధికారి కూడా వసూళ్లలో కింగ్మేకర్ అయ్యారని గతంలో ఆయన పనిచేసిన జిల్లాలోనూ అనేక ఆరోపణలు వచ్చాయని ప్రస్తుతం కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్ పెట్టి ఆయన వసూళ్లు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, సరూర్నగర్ డివిజన్ పరిధిలో పనిచేసే ఇద్దరు ఎక్సైజ్ సిఐలకు రెగ్యులర్గా ఇచ్చే మాముళ్లు సరిపోక వారి పరిధిలోని బార్లు, వైన్షాపులపై వేరే వారితో కేసులు నమోదు చేయించి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శంషాబాద్ పరిధిలోని డిటిఎఫ్లో... సికింద్రాబాద్ పరిధిలో పనిచేసే ఒక ఎక్సైజ్ అధికారి డిఫెన్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నప్పుడు వాటిని ధ్వంసం చేయకుండా ఇతరులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆయన్ను ఒకసారి మందలించినా ఆయనలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. శంషాబాద్ పరిధిలో డిటిఎఫ్లో పనిచేసే ఒక అధికారిపై భారీగా ఆరోపణలు రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘా పెట్టినట్టుగా తెలిసింది. అధికారుల పనితీరుపై రిపోర్టు... దీంతోపాటు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని కొందరు సిఐలు, ఎస్ఐలు వైన్షాపులు, బార్ యజమానులను కేసుల పేరుతో బెదిరిస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఈ మధ్య ఫిర్యాదులు అందడంతో దానిపై అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్టుగా తెలిసింది. త్వరలో జరిగే బదిలీల్లో ఎస్ఐలు, సిఐలు, ఏఈఎస్లు, ఈఎస్లు, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పనితీరు, వారి అవినీతి భాగోతాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఇప్పటికే అంతర్గతంగా వారి రిపోర్టు సైతం ప్రిన్సిపల్ సెక్రటరీ తెప్పించుకున్నట్టుగా సమాచారం.
ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం పొత్తులు మాకు కలిసిరావు బిఆర్ఎస్, బిజెపి పొత్తు ప్రచారం అబద్ధం. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు బిఆర్ఎస్ బలోపేతానికి కార్యాచరణ మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగింది ఆ లోపాలను సరిదిద్దుకుంటాము బిఆర్ఎస్ను మళ్లీ టిఆర్ఎస్గా మార్పు గురించి పరిశీలిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మీడియా ప్రతినిధులతో కెటిఆర్ చిట్చాట్ తండ్రిని సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు..కవిత తీరుపై కెటిఆర్ వ్యాఖ్యలు మనతెలంగాణ/హైదరాబాద్ : 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు 2027 నుంచి పాదయాత్ర ప్రారంభించాలనే ప్రణాళికలో ఉన్నామని చెప్పారు. నియోజకవర్గాల డిలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని, దీనివల్ల బిఆర్ఎస్కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పైన ఇప్పుడు ఉన్న సమాన నిష్పత్తిలో విభజన జరిగితే ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని అన్నారు. పార్లమెంట్లో ప్రస్తుతం 24 శాతం ఎంపీల స్థానాల్లో వాటా ఉన్నదని, అదే శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెరిగితే నష్టం లేదని పేర్కొన్నారు. ఈ అంశంలో అభ్యంతరం ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఆదివారం మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ నివాసంలో మీడియా ప్రతినిధులతో కెటిఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని,పొత్తులు తమకు కలిసిరావని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ ఎప్పటిలాగే ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని ధీమా ఆశాభావం వ్యక్తం చేశారు. 2014, 2018లో ఒంటరిగానే పోటీ చేసి గెలిచి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. 2023లో కూడా ఒంటరిగానే గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయామని వ్యాఖ్యానించారు. బిజెపితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయబోమని తేల్చిచెప్పారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలే తమకు ముఖ్యం అని, ఈ అంశంలో పార్టీకి ఎలాంటి మొహమాటం లేదని అన్నారు. ఎవరు ఎక్కడ గెలుస్తారో అక్కడికి పంపిస్తామని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎంఎల్ఎలను మార్చగలిగితే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పదేళ్లలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగింది గతంలో అధికారంలో ఉన్న సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని లోపాలను ఈ సందర్భంగా కెటిఆర్ బహిరంగంగానే అంగీకరించారు. ఆ లోపాలను సరిదిద్దుకుంటామని వెల్లడించారు. పదేళ్ల పాలనలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగిందని, ఆ గ్యాప్ను తగ్గించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా, పదేళ్లు అధికార పార్టీగా, గత రెండున్నరేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా మూడు పాత్రలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటిసిలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పటికీ, వారి ప్రయోజనాల కోసం సరైన ‘గల్ఫ్ పాలసీ’ని తీసుకురాలేకపోయామని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం ముఖ్యంగా కొన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇలాంటి లోపాలు తలెత్తయన్నారు. బిఆర్ఎస్ను మళ్లీ టిఆర్ఎస్గా మార్పు గురించి పరిశీలిస్తామని కెటిఆర్ తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర నుండి అభ్యంతరాలు ఉన్నప్పటికీ బడ్జెట్లో నిధులు కేటాయించడం విచిత్రమని అన్నారు. చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు రుణమాఫీ సక్రమంగా అమలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతోందని వ్యాఖ్యానించారు. జైలుకు వెళితేనే సిఎం అవుతారనేది ఒక భ్రమ మాత్రమేనని అని పేర్కొన్నారు. నలభై ఏళ్ల క్రితం అలాంటి రాజకీయ సంస్కృతి లేదని, తాము హత్యలు చేసి అక్రమాలు చేసి జైళ్లకు వెళ్లేంత దుర్మార్గుకాము కాదు అని స్పష్టం చేశారు. ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణ వల్ల కార్మికుల సంఖ్య తగ్గుతోందని, ప్రస్తుత ప్రభుత్వంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. సమస్యలపై చర్చించేందుకు ఎఐటియుసి నేతలను హైదరాబాద్కు ఆహ్వానించినట్లు తెలిపారు. టిబిజికెఎస్ కార్మిక సంఘాన్ని త్వరలోనే పునర్నిర్మించి, కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ గెలిచిన తర్వాత నిధులు తెస్తామని చెప్పిన నాయకులు మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధి అంతా ఒకే నాయకుడి వల్ల జరిగిందనే భావనను ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. పార్టీలో కెసిఆర్ నిర్ణయమే ఫైనల్ భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసే దిశగా పార్టీ చేపట్టనున్న కార్యాచరణన ఆయన వివరించారు. పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా మే, జూన్ నెలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, అలాగే కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బిఆర్ఎస్లో చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తెలుగుదేశం లాంటి ఇతర పార్టీలలో ఉన్న సంప్రదాయాన్ని గుర్తిస్తూ, అక్కడి మంచి లక్షణాలను నేర్చుకుంటామని చెప్పారు. పార్టీలో ఎలాంటి ఆధిపత్య పోరులేదు అని, అందరం కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం కేవలం విపక్షాల ప్రచారం మాత్రమే అని పేర్కొన్నారు. తాను ఆల్ రౌండర్ను అని, తన వయసుకు మించిన పదవులను పొందను అని చెప్పారు. కెసిఆర్ ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పార్టీ సైనికుడిగా నిర్వహిస్తానని అన్నారు. తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అని, కెసిఆర్ ఏ పని అప్పచెప్తే ఆ పని చేయడమే తన కర్తవ్యం అని చెప్పారు. పార్టీలో జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎంత ప్రాధాన్యత ఉందో తనకూ అంతే ప్రాధాన్యత ఉందని అన్నారు. పార్టీలో కెసిఆర్ నిర్ణయమే తుది నిర్ణయం అని తెలిపారు. పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మాట్లాడే వ్యవస్థ తమ పార్టీలో లోపించిందని, అదే ఓటమికి కారణమైందని అంగీకరించారు. తెలంగాణను కాపాడగల ఏకైక నాయకత్వం కెసిఆర్దేనని పేర్కొన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించింది కెసిఆర్ నాయకత్వమే అని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాలలోనే దెబ్బతీసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సింగరేణి సహా అన్ని స్థాయిలలో బిఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారని కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కవిత విషయంలో చెప్పేదేమీ లేదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విషయంలో చెప్పేదేమీ లేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. పిల్లలు తండ్రిని సంతోష పెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ, ఏడిపించవద్దని తెలిపారు. ఈ రాజకీయం ఉంటుంది, పోతుంది.. కానీ ఇతరులను బాధ పెట్టే తీరు మంచిది కాదని చెప్పారు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని, ప్రజల ఆదరణ లేకుంటే వృథానే కదా అని పేర్కొన్నారు. ప్రజల కోణంలో పార్టీ పెడితే తప్పు లేదని, వ్యక్తిగత సమస్యలతో పార్టీ పెడితే ఎవరూ పట్టించుకోరని అన్నారు.
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ప్రథమ సంవత్సరంలో 74.40 శాతం, ద్వితీయ సంవత్సరంలో 78.65 శాతం ఉత్తీర్ణతతో ముందంజలో బాలికలు ఫస్టియర్లో 3,23,807 మంది, సెకండియర్లో 3,58,490 మంది ఉత్తీర్ణత - మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, మే 22 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు - ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడులయ్యాయి. ఈసారి ఫలితాల్లోనూ మళ్లీ బాలికలే ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 9.97 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,23,807 మంది ఉత్తీర్థత సాధించారు. ఫస్టియర్లో 66.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 5,07,948 మంది పరీక్షలు రాయగా, 3,58,490 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ప్రథమ సంవత్సరం ఫలితాలలో జనరల్లో 1,92,589 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 65,480 మంది బి గ్రేడ్, 27,476 సి గ్రేడ్, 10,235 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్లో 17,791 మంది మంది విద్యార్థులు ఎ గ్రేడ్, 9,616 మంది బి గ్రేడ్, 586 మంది సి గ్రేడ్, 34 మంది డి గ్రేడ్ సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్లో 2,13,179 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా,25 మంది ప్రైవేట్ విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించారు. రెగ్యులర్లో 69,641 మంది, ప్రైవేట్లో 11 మంది బి గ్రేడ్, రెగ్యులర్లో 22,862 మంది, ప్రైవేట్లో ఆరుగురు సి గ్రేడ్, రెగ్యులర్లో 5,430 మంది, ప్రైవేట్లో నలుగురు డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్ రెగ్యులర్లో 20,099 మంది ఎ గ్రేడ్ సాధించగా, బి గ్రేడ్లో 10,305 మంది, సి గ్రేడ్లో రెగ్యులర్లో 450, డి గ్రేడ్లో రెగ్యులర్లో 18 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు ఇంటర్మీడియేట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా, కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ,ఇంటర్మీడియేట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ తరుఫున అభినందనలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందని పేర్కొన్నారు. బాలికలదే పైచేయి ఇంటర్ ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 66.20 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 74.40 శాతం నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 70.58 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం నమోదైంది. ప్రథమ సంవత్సరం జనరల్లో 2,24,436 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 1,67,045 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 24,674 మంది బాలికలు హాజరు కాగా, 18,286 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం జనరల్లో 2,17,427 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 1,28,734 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 22,586 మంది హాజరుకాగా, 9,741 మంది ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్లో 2,12,930 మంది బాలికలు హాజరు కాగా, 1,74,136 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ప్రైవేట్లో 17,921 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 6,191 మంది ఉత్తీర్ణులయ్యారు. పెరిగిన ఉత్తీర్ణత ఇంటర్మీడియేట్ ఫలితాలలో గత ఐదేళ్లతో పోల్చితే ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2022లో ప్రథమ సంవత్సరంలో 64.86 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 2023లో 62.85 శాతం, 2024లో 61.08 శాతం, 2025లో 66.91 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఏడాది గత ఐదేళ్ల కంటే అధికంగా 66.94 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2022లో 68.68 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 2023లో 67.27 శాతం, 2024లో 69.49 శాతం, 2025లో 71.43 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. సెకండియర్లో కూడా ఈ ఏడాది గత ఐదేళ్ల కంటే అధికంగా 75.61 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది. ఇంటర్ ఫలితాల్లో టాప్లో మేడ్చల్ రాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొదటి మూడు జిల్లాలు మేడ్చల్ 77.31 శాతం, రంగారెడ్డి 76.38 శాతం, జయశంకర్ భూపాలపల్లి 73.04 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చివరి మూడు జిల్లాలు కామారెడ్డి 49.40 శాతం, మహబూబాబాద్ 49.11 శాతం, రాజన్న సిరిసిల్ల 49.05 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొదటి మూడు జిల్లాలు వరుసగా మేడ్చల్ 82.73 శాతం, జయశంకర్ భూపాలపల్లి 82.34 శాతం, కుమురం భీం ఆసిఫాబాద్ 82.16 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చివరి మూడు జిల్లాలు ఆదిలాబాద్ 62.50 శాతం, వరంగల్ 60.80 శాతం, రాజన్న సిరిసిల్ల 58.69 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎంపిసిలో అత్యధిక ఉత్తీర్ణత నమోదు ఇంటర్మీయేట్ ఫలితాలలో గ్రూపుల వారీగా ఎంపిసి ఫస్టియర్లో 75.51 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఎంఇసిలో 64.07 శాతం, బైపిసిలో 72.39 శాతం, సిఇసిలో 44.90 శాతం, హెచ్ఇసిలో 34.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా సెకండియర్ ఎంపిసిలో 78.01 శాతం,ఎంఇసిలో 67.91 శాతం, బైపిసిలో 76.04 శాతం, సిఇసిలో 49.39 శాతం, హెచ్ఇసిలో 49.25 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రకటించారు.మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని అన్నారు. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తామని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులు సోమవారం నుంచే ప్రారంభం అవుతాయని, ఏప్రిల్ 20 చివరి తేదీ అని వెల్లడించారు. రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్కు ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రీ కౌంటింగ్కు ఒక్కో పేపర్కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్కు రూ.800 చెల్లించాలని పేర్కొన్నారు. వాట్సాప్లోనూ ఫలితాలు ఇంటర్ ఫలితాలను ఈసారి వాట్సాప్లోనూ చూసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు స్మార్ట్ఫోన్లలో 80969 58096 నంబర్ను సేవ్ చేసుకొని, ఆ నెంబర్కు ‘Hi’ అని మెసేజ్ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఉత్తీర్ణత శాతం ఇలా.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 66.20 శాతం ఉత్తీర్ణత ఇంటర్ రెండో సంవత్సరంలో 70.58 శాతం ఉత్తీర్ణత ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం- 74.40 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం- 57.69 ఇంటర్ రెండో సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం- 78.65 ఇంటర్ రెండో సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం- 62.50 సెకండియర్లో మేడ్చల్లో జిల్లాలో అత్యధికంగా 82.73 శాతం ఉత్తీర్ణత సెకండియర్లో అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 58.69 శాతం ఉత్తీర్ణత ఫస్టియర్లో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 77.31 శాతం ఉత్తీర్ణత ఫస్టియర్లో అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 49.05 శాతం ఉత్తీర్ణత
పెళ్లి చేసుకోవడానికి అందగత్తెను పంపండి
సోమాలియాలో మేము అందిస్తున్న సేవలకు గాను బిలియన్ డాలర్ల నగదు చెల్లించండి నెల రోజుల్లోగా నా డిమాండ్లకు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు టర్కీకి ఉగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ హెచ్చరిక టర్కీకి ఉగాండా సైన్యాధిపతి కైనెరూగాబా హుకుం లేకపోతే దౌత్యబంధాన్ని తెంచుకుంటామని హెచ్చరిక కంపాలా: ఉగాండా సైన్యాధిపతి, అధ్యక్షుడు యోవెరి ముసేవెనీ కుమారుడు ముహూజి కైనెరూగాబా టర్కీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. టర్కీ తమకు 1 బిలియన్ డాలర్లు చెల్లించడంతో పాటు దేశంలోని అత్యంత అందమైన అమ్మాయిని తనకు భార్యగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 30 రోజుల్లో ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే దౌత్యపరమైన సంబంధాలను తెంచి, కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ఎక్స్ లో చేసిన పలు పోస్టుల్లో కైనెరూగాబా మాట్లాడుతూ, ప్రాంతీయ భద్రత కోసం ఉగాండా చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించలేదని, అందుకు ఆర్థిక పరిహారం రావాల్సిందేనని పేర్కొన్నారు. టర్కీ సోమాలియాలో, ముఖ్యంగా రాజధాని మొగాదిషులో పోర్టులు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల ద్వారా లాభాలు పొందుతుండగా, భద్రతా బాధ్యతలను ఉగాండానే భుజాన వేసుకుందని ఆయన ఆరోపించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉగాండా సైన్యం ఆఫ్రికన్ యూనియన్ మిషన్లలో భాగంగా సోమాలియాలో సేవలందిస్తోంది. ముఖ్యంగా అల్-షబాబ్ అనే అల్-ఖైదా అనుబంధ మిలిటెంట్ సంస్థను ఎదుర్కొనేందుకు ఈ దళాలు పనిచేస్తున్నాయి.టర్కీకి ఇది చాలా సులభమైన ఒప్పందం... వారు మాకు డబ్బు చెల్లించాలి, లేకపోతే వారి రాయబార కార్యాలయాన్ని మూసివేస్తాను. వారు కూడా టర్కీలోని మా రాయబార కార్యాలయాన్ని మూసివేయవచ్చు.. మాకు ఎలాంటి సమస్య లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉగాండాటర్కీ సంబంధాలు గంభీరమైనవి అని పేర్కొన్న ఆయన, వాటిని సోషల్ మీడియా నాటకంగా చూడకూడదని అన్నారు. త్వరలోనే దౌత్య సంబంధాలను తెంచేస్తాం అంటూ హెచ్చరించారు. వెన్నుపోటు పొడిచే స్నేహితుడు ఎవరికీ అవసరం లేదు అని కూడా ఆయన విమర్శించారు. ఇంకా, భద్రతా కారణాల దృష్ట్యా ఉగాండా ప్రజలు టర్కీకి ప్రయాణించకుండా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో, ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటిస్తూ, నా ఆధ్వర్యంలో 1 లక్ష మంది ఉగాండా సైనికులను పంపడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన తెలిపారు. ఇది కైనెరూగాబా నుంచి వచ్చిన మొదటి వివాదాస్పద వ్యాఖ్య కాదు. 2022 అక్టోబర్లో ఆయన, జార్జియా మెలోనిను వివాహం చేసుకోవడానికి 100 అంకోల్ గోవులను ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించి వివాదం సృష్టించారు.
కాళేశ్వరం బ్యారేజ్ పునరుద్ధరణకు వారంలో డిజైన్లు
పునరుద్ధరణ పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ కమిటీకి కన్వీనర్గా ఇరిగేషన్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా 2028 నాటికి మరమ్మతుల ప్రక్రియ పూర్తి ఎల్అండ్టీ సహా సంస్థలన్నీ తమ పనులను తక్షణమే పునరుద్ధరించాలి కాళేశ్వరంపై ప్రత్యేక సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గాను నీటిపారుదల రంగ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ వారానికి రెండు సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తుందని అన్నారు. అవసరమైతే స్వయంగా తానే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమావేశాల్లో పాల్గొని పురోగతిని సమీక్షించ నున్నట్లు వెల్లడించారు. ఈ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గాను సంబంధిత అధికారులతో ఆదివారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్య దాస్నాధ్, జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్, టన్నెల్ నిపుణులు పరిక్షిత్ మెహ్రా, ఇ.ఎన్.సిలు రమేష్ బాబు, శ్రీనివాస్లతో పాటు సి.డబ్ల్యూ.పి.ఆర్.ఎస్ ఆదనపు డైరెక్టర్ సెల్వా బాలన్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఏ), విజిలెన్స్ కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ మూడు నిర్మాణాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయని అన్నారు. 2028 నాటికి మరమ్మతుల ప్రక్రియ పూర్తి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతుల పూర్తి ప్రక్రియలో భాగంగా 2027, 2028 సంవత్సరాలను కీలకంగా పరిగణించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డలో కొంత భాగన్నీ పూర్తి చేయగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్వై ఇండియా, ఐఐటి ముంబయిలకు కొత్త డిజైన్ల బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే డిజైన్ కన్సల్టెంట్గా ఎఫ్ఆర్వై ఇండియాను ఎంపిక చేసి, ఐఐటి ముంబయితో సంయుక్తంగా పని చేయాలని నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. డిజైన్ బృందం రాత్రింబవళ్లు పనిచేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. డిజైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, డిజైన్ సిద్ధమైన వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదానికి పంపాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సెక్రటరీ పరిక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కన్సల్టెంట్లకు ఆయన సూచించారు. డిజైన్ ప్రక్రియకు సంబంధించిన భూభౌతిక, భూసాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహించబడతాయని తెలిపారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటా అత్యవసర ప్రాధాన్యంతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ ఈ పరీక్షలు, అధ్యయనాల బాధ్యత వహిస్తోందని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను కేంద్ర సంస్థ అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల కమిషన్తో సమన్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలని ఆయన సూచించారు. కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ సిబ్బంది 45 రోజుల అధ్యయన కాలంలో నిరంతరం ప్రాజెక్ట్ స్థలాల్లో ఉండాలని ఆదేశించారు. ఏజెన్సీలకు శిబిరాల పునఃప్రారంభ ఆదేశం ఎల్ అండ్ టీ సహా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన సంస్థలన్నీ తమ క్యాంపులు, మెస్ సదుపాయాలు, లాజిస్టిక్స్ను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలని ఆయన సూచించారు. ఇసుక తొలగింపు, జిపిఆర్ (భూభౌతిక) పరీక్షలు, సైట్ సిద్ధం పనులు అన్ని ఏజెన్సీల పూర్తి సహకారంతో నిర్వహించబడతాయని పేర్కొన్నారు. డిజైనర్లు, కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ, ఆయా శాఖల ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు కలిసి అన్ని పరీక్షలను ప్రత్యక్షంగా వీక్షించాలని, ప్రతి అంశాన్ని సక్రమంగా నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకూ చలివేంద్రాలు
గ్రామీణాభివృద్ది శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్కు మంత్రి సీతక్క ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను గ్రామ పంచాయితీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆ శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్కు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించే వారు, పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవి కాలంలో సాధారణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో, బస్ స్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రయాణ సమయంలో అలసటకు గురయ్యే వారికి, కూలీలు, రైతులు, రోజువారీ పనుల కోసం వెళ్లే ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటు పూర్తి కాగా, ప్రజలు ఈ సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి సీతక్క కోరారు. గత ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి తాగునీరు అందించారని అన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు. వేసవి వేడి కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. మంత్రి సీతక్క ఆదేశాలతో ప్రతి గ్రామ పంచాయతీలో చలివేంద్రాల ఏర్పాటుకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టినట్లు శాఖ డైరెక్టర్ దివ్యా దేవ రాజన్ తెలిపారు.
అసంతృప్తివాదులపై పిసిసి చీఫ్ ‘ఆరా’
జిల్లా పర్యటనలతో బిజి-బిజి ఇప్పటికే పది జిల్లాల్లో పూర్తి మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పదవులు రాలేదనో, మరే ఇతర కారణాలతోనైనా నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారా? అనే కోణంలోనూ పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ‘ఆరా’ తీస్తున్నారు. మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్-బై చెప్పడం పట్ల పార్టీలో కలకలం సృష్టించినందున భవిష్యత్తులో అటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తన భుజస్కందాలపైనే ఉందని ఆయన భావిస్తున్నారు. ఎంపిటిసి, జెడ్పిటిసిలకు ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు గత నెలలో మహేష్ కుమార్ గౌడ్ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పది జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేశారు. రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. ఇదిలాఉండగా జిల్లా పర్యటనల సందర్భంగా ఎక్కడైనా అసంతృప్తి గళం వినిపిస్తే వారిని ముందుగానే నచ్చజెప్పే అంశాన్ని జిల్లా కార్యవర్గాలకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు సూచన చేయాలని ఆయన చెబుతున్నారు. అయినా సద్దుమణగకపోతే తన వరకు ఆ అంశాన్ని తన వరకు తీసుకుని రావాలని ఆయన జిల్లా నాయకులకు చెబుతున్నారు. ఇంకా పార్టీకి-ప్రభుత్వానికి మధ్య సయోధ్య చెక్కు చెదరకుండా ఉండేందుకు తన ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. అంతకు ముందు నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి మర్నాడు గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లాలకు కొత్తగా డిసిసి కార్యవర్గాలు ఏర్పాటైన తర్వాత పిసిసి చీఫ్ చేపట్టిన ఈ పర్యటనలకు ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. జిల్లా పర్యటనల సందర్భంగా పార్టీ శ్రేణులను కలుసుకోవడమే కాకుండా ఆ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన కమిటీలతో సమావేశం కావడం గమనార్హం. జిల్లా కమిటీల పని తీరునూ ఆయన సమీక్షిస్తూ పార్టీపై పట్టు బిగిస్తున్నారు. పిసిసి అధ్యక్షుని హోదాలో శుభకార్యాలకు హాజరుకావడం, హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియా సమావేశాలు నిర్వహించడానికే తాను పరిమితం కాకుండా జిల్లాల్లో పర్యటిస్తూ, పార్టీ శ్రేణులను కలుసుకోవడం, వారితో మంచి-చెడ్డా చర్చించడం మంచిదని ఆయన భావిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలూ తనను కలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అనుయాయులు చెబుతున్నారు. ప్రజలను నేరుగా కలుసుకోవడం ద్వారా తనకూ పార్టీపై, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకూ అవకాశం లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇదిలాఉండగా తాను చేపట్టిన జిల్లా పర్యటనలతో కార్యకర్తల నుంచి లభిస్తున్న ఆదరణ, ప్రజాభిప్రాయ సేకరణ పట్ల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతృప్తిగా ఉన్నారు. మిగతా పార్టీల నేతలు పాదయాత్రలనో, జిల్లా పర్యటనలనో చేపట్టడానికి ముందుగానే తాను ఈ పర్యటనలు చేపట్టడం మంచిదే అయ్యిందని ఆయన భావిస్తున్నారు. ఇప్పటి వరకు పది జిల్లాల్లో పర్యటనలు పూర్తి కాగా, శనివారం ములుగు జిల్లా పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపించిన ఆదరణ, ఇంకా తనకు గజమాలతో స్వాగతం పలకడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఇదేవిధంగా మిగతా జిల్లాల్లోనూ పర్యటనలు కొనసాగించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు పరిశీలన మహేష్ కుమార్ గౌడ్ తన జిల్లా పర్యటనల్లో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు తీరునూ పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా?, యువకులు, నిరుద్యోగులు, రైతులు ప్రభుత్వం పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు? అనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాలని ఆయన జిల్లా కమిటీలకు సూచిస్తున్నారు. ఎంపిటిసీ, జెడ్పిటిసిలకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు; బండి
కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక మన తెలంగాణ/హైదరాబాద్ః మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు జాగ్రత్త అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అని పార్టీలను హెచ్చరించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్ లో బిల్లుకు మద్దతివ్వాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. మహిళలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నది దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఆలోచన అని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయంగా ఉండిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఈ బిల్లుకు మద్దతునివ్వాలని ఆయన కోరారు. మహిళలు ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక మహిళా రిజర్వేషన్ బిల్లు అని ఆయన తెలిపారు. పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని ఆయన తెలిపారు. డీలిమిటేషన్తో పార్లమెంట్లో స్థానాలు పెరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు.
ఉదయం 9 గంటలకే భగ్గుమంటున్న సూర్యుడు రాష్ట్రంలో 40డిగ్రీలు దాటిన ఉష్ణ్రోగ్రతలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు వేడి, ఉక్కపోత అధికంగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలీవిధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ (40.3 డిగ్రీలు), భద్రాచలం (39.6 డిగ్రీలు), హన్మకొండ (37.5 డిగ్రీలు), హైద రాబాద్ (39.4 డిగ్రీలు), ఖమ్మం (39.8 డిగ్రీలు), మహబూబ్నగర్ (40.5 డిగ్రీలు), మెదక్ (39.9 డిగ్రీలు), నల్గొండ (37.8 డిగ్రీలు), నిజామా బాద్ (40.7 డిగ్రీలు), రామగుండం (39.0 డిగ్రీలు), హయత్నగర్ (37.6 డిగ్రీలు), పటాన్చెరు (38.0 డిగ్రీలు), రాజేంద్రనగర్ (38.5 డిగ్రీలు) మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతు న్నారు. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి అధికం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అతి ముఖ్య మైన పని ఉంటేనే బయటకు వస్తున్నారు.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికే రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. మధ్యా హ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హితవు పలికింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భి ణులు, చిన్నారుల విష యంలో మరింత జాగ్రత్త అవస రమని సూచించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తలపాగా, గొడుగు వంటివి వాడా లని, తరచూ నీరు, ద్రవ పదార్థా లు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఎపిలోనూ అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు అటు ఎపిలో ఇప్పటికే భానుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం కడప జిల్లాలో గరిష్టంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీలుగా రికార్డయింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని, మొత్తం 93 మండలాల్లో వీటి ప్రభావం ఉంది. హీట్ వేవ్తో పాటు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎండ మొదలవుతోంది. 10 గంటల తర్వాత ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుండగా ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడు తున్నా రు. దీంతో ఇళ్లల్లోనే ఉంటున్నారు. వచ్చే రెండు నెలల పాటు ఇటువంటి పరిస్థితులే ఉండనున్నాయి.
సోమవారం రాశి ఫలాలు (13-04-2026)
మేషం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. మిధునం ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తికావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. కర్కాటకం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహం సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి. కన్య జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తుల కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చికం సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మకరం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కుంభం వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీనం ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.
బిసి మహిళ సబ్ కోటాపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి
పూలేకు నివాళులే కాదు.. పూలే ఆశయం కోసం ప్రధాని పాటుపడాలి బిసి మహిళ సబ్ కోటా కై ఈనెల 16న ఢిల్లీలో బిసి మహిళల ధర్నా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల ఐకాన్ మహాత్మ జ్యోతిబా పూలే 200 జయంతి సందర్భంగా మొదటి సారిగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం అభినందనీయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పూలే ఆశయాలు అమలు చేయడానికి ప్రధాని మోడీ పాటుపడాలని ఆయన కోరారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు ఆమోదం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కంటే ముందు జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు మహిళా బిల్లు లక్ష్యం నెరవేరాలంటే బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని ఈ విషయాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మహిళా బిల్లుపై గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరించకుండా బిసి కోటపై తమ రాజకీయ విధానాన్ని ప్రకటించి 16 న జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిసి మహిళల సబ్ కోట కోసం పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బిసి మహిళలకు వాటా కల్పించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగా ఈ నెల 13న అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపడతామని, ఈనెల 16న ఢిల్లీలో బిసి మహిళలచే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల విజయకేతనం
90 శాతం ఉత్తీర్ణతతో సంక్షేమ గురుకుల్లాలో ప్రథమ స్థానం మన తెలంగాణ / హైదరాబాద్ : -ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. 90 శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా సంక్షేమ గురుకులాల్లో బిసి గురుకులాలు ప్రథమ స్థానంలో నిలిచారు. సీనియర్ ఇంటర్లో బైపిసి విద్యార్థి శ్రియ (994), బి. హిమానీ(993), రాథోడ్ నందు(993), ఎంపిసిలో బి. మధు(994), శ్రీనిధి(994), సిఇసిలో శ్రీలత (981), ఎంఈసిలో జాహ్నవి (983), హెచ్ ఇసిలో రాజేశ్వరి (980) స్టేట్ ర్యాంకులు సాధించారు. -సీనియర్ ఇంటర్లో పది లోపు ర్యాంక్లు ఎంపిసిలో 97 మంది, బైపిసిలో 62 మంది విద్యార్థులు సాధించారు. -జూనియర్ ఇంటర్ లో 16మందిఎంపిసి విద్యార్థులు స్టేట్ ర్యాంక్ (468) సాధించగా బైపిసిలో 11మందివిద్యార్థులు 438 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ఫలితాల్లో 33 కాలేజీల్లో 100 శాతం ఉత్తీర్ణత, జూనియర్ ఇంటర్ లో 9 కాలేజీల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సీనియర్ ఇంటర్ లో ఏడు శాతం, జూనియర్ ఇంటర్ లో ఎనిమిది శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు ఉత్తర్ణీత (70.58 శాతం) కాగా బిసి గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపిసిలో పి. ప్రవల్లిక (468), కె. వైష్ణవి (468)తో పాటు 15 మంది విద్యార్థులు, బైపిసిలో పి. రాఘవి (438), వి. హేమశ్రీ (438) మార్కులు సాధించారు. మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సొసైటీ లోని 261 కాలేజీల నుండి 2025- 26 విద్యా సంవత్సరానికి జనరల్ కేటగిరీలో సీనియర్ ఇంటర్ - 12,035 మంది పరీక్షకు హాజరుకాగా 10,856 (90 శాతం), జూనియర్ ఇంటర్ లో 14,783 మందికి గాను 12,664 మంది (86 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో ప్రథమ సంవత్సరం 191 కు 183 మంది (96 శాతం) ద్వితీయ సంవత్సరం 176 కు 172 మంది (98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో 98శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన కాలేజీలు సీనియర్ ఇంటర్లో బాలికలు - 17, బాలురు - 16, మొత్తము - 33 కాలేజీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జూనియర్ ఇంటర్ లో బాలికలు - 5, బాలురు - 4, మొత్తము - 9 కాలేజీలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఒకేషనల్ కోర్సులో బాలికలు - 6, బాలురు - 2, మొత్తము - 8 కాలేజీలు వంద శాతం ఫలితాలు సాధించాయి. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 70.60 శాతం కంటే అధిక ఉత్తీర్ణత 90 శాతం సాధించి విజయభేరి మోగించారు. పది లోపు ర్యాంక్ లు ఎంపిసిలో (988/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 97 మంది, బైపిసిలో (985/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 62 మంది ఉన్నారు. సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 12,211 కాగా వీరిలో 11,028 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏ గ్రేడ్ (75 శాతం మార్కులు) సాధించిన విద్యార్థులు 8,490 బి గ్రేడ్ (60శాతం మార్కులు) 2,097. మంది సాధించారు. జూనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 14,974 కాగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 12,847 మంది ఉన్నారు. పది లోపు ర్యాంకులు సాధించినవారు ఎంపిసిలో (460/470) కన్న ఎక్కువ వచ్చిన వారు 727మంది, బైపిసిలో (429/430) కన్న ఎక్కువ వచ్చిన వారు 459 మంది ఉన్నారు. వీరిలో ఏ గ్రేడ్ (75 శాతం మార్కులు) సాధించిన విద్యార్థులు 9,628, బి గ్రేడ్ (60శాతం మార్కులు) 2,360. సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఫలితాలు సాధించిన బోధనా సిబ్బందిని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బి. సైదులు అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం
సీనియర్ ఇంటర్ ఎంపిసిలో స్టేట్ టాప్ మార్క్ 996 శ్రీ చైతన్యదే సీనియర్ ఇంటర్ బైపిసిలో స్టేట్ టాప్ మార్క్ 997 శ్రీచైతన్యదే జూనియర్ ఇంటర్ ఎంపిసిలో స్టేట్ టాప్ మార్క్ 469 శ్రీచైతన్యదే జూనియర్ ఇంటర్ బైపిసిలో స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది మన తెలంగాణ/హైదరాబాద్ : జూనియర్ ఇంటర్ ఎంసిలో 470 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 469తో ఇద్దరు, 468 మార్కులు ఆ పైన 147 మంది, 467 మార్కులు ఆపైన 701 మంది, 466 ఆపైన 1378 మంది, 465 ఆపైన 1988 మంది, 460 ఆపైన 4497 మంది శ్రీ చైత న్య విద్యార్థులే. జూనియర్ ఇంటర్ బైపిసిలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది, 437 ఆపైన 319 మంది, 436 ఆపైన 583 మంది, 435 ఆపైన 837 మంది, 400 మార్కులు ఆపైన 4941 మంది శ్రీచైతన్య విద్యార్థులే. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు గానూ 997 స్టేట్ టాప్ మార్క్తో పాటు 996 మార్కులు ఆపైన 3 గురు, 995 మార్కులు ఆపైన 16 మంది, 990 మార్కులు ఆపైన 759 మంది శ్రీచైతన్య విద్యార్థులు విజయం సాధించారు. ఇప్పటికే విడుదలైన జెఇఇ మెయిన్ 2026లో సెషన్ 1 అండ్ 2, ఎన్టిఎ ప్రొవిజనల్ కీ ప్రకారం 300కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం. ప్రతీ ఏటా ఐఐటి జెఇఇ, నీట్లలో అత్యథిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారని, రేపటి ఐఐటి అడ్వాన్స్డ్, నీట్లలోనూ నెంబర్ వన్ ర్యాంకులు సాధి స్తారని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘శ్రీచైతన్య సృష్టించిన పటిష్ట మైన ప్రోగ్రామ్లు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి అధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతల వల్లే ఇంటర్మీడియేట్లో సబ్జెక్ట్పై తమ విద్యార్థులు కాన్సె ప్టువల్గా పట్టు సాధించడంతో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో టాపర్స్గా నిలుస్తున్నారన్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లనే ఇంటర్మీడియేట్లో స్టేట్ టాప్ మార్కులు సాధ్యమయ్యాయని, దీనితో పాటు రాబోయే రిజల్ట్లో కూడా అగ్రస్థానం శ్రీచైతన్యదే అనే నమ్మకం తమకు ఉందన్నారు. అతు ్యత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, తమ విద్యా సంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన అభినందించారు.
ఇరాన్కు ఆయుధాలు?.. చైనాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అన్న అనిశ్చితి మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైట్ హౌస్ నుంచి మియామీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్, చైనా, ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తే, చైనాకు పెద్ద సమస్యలు వస్తాయి అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మరే వివరాలు వెల్లడించలేదు. ఈ హెచ్చరికకు కారణం, అమెరికా గూఢచారి నివేదికల ఆధారంగా వెలువడిన సిఎన్ఎన్ కథనం. దాని ప్రకారం, రాబోయే వారాల్లో ఇరాన్కు చైనా ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సరఫరాలను ప్రత్యక్షంగా కాకుండా మూడో దేశాల ద్వారా రహస్యంగా పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమెరికాఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయినప్పటికీ, రెండు దేశాలూ భారీ సైనిక బలగాలను కొనసాగిస్తున్నాయి. ఇరాన్ సమీపంలో అమెరికా నౌకాదళం మోహరించగా, ఇటీవలి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న గగన రక్షణ వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఘర్షణలో ఏ పక్షానికీ మేము ఆయుధాలు సరఫరా చేయలేదు అని స్పష్టం చేసింది. అలాగే అమెరికా ఆధారంలేని ఆరోపణలు, అతిశయోక్తులను మానుకోవాలి అని సూచించింది. చైనా ఇరాన్కు సైనిక సహాయం అందిస్తే, అది పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే చర్యగా అమెరికా భావించే అవకాశం ఉంది. అంతేకాకుండా, వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరగనున్న ట్రంప్ పర్యటనపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. పశ్చిమ దేశాల ఆంక్షల కింద ఉన్న ఇరాన్కు, చైనా మరియు రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇవి ఇరాన్కు ముఖ్యమైన ఆర్థిక, దౌత్య మద్దతు అందిస్తున్నాయి. సిఎన్ఎన్ నివేదిక ప్రకారం, ఇరాన్కు చేరే అవకాశం ఉన్న ఆయుధాల్లో మాన్పాడ్స్ (భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులు) కూడా ఉండవచ్చు. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణించే అమెరికా విమానాలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడవచ్చు. ఈ నెల ప్రారంభంలో అమెరికా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లపై జరిగిన ఘటనల్లో ఇటువంటి వ్యవస్థలు ఉపయోగించి ఉండవచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇరాన్ ఈ విషయంపై అధికారికంగా వివరాలు వెల్లడించకపోయినా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజా దాడుల్లో కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. ఇదిలా ఉండగా, అమెరికాఇరాన్ మధ్య చర్చలు లోతుగా కొనసాగుతున్నాయి అని ట్రంప్ తెలిపారు. అయితే తుది ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా తమకు ప్రయోజనం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా మేమే గెలుస్తాం అని ట్రంప్ అన్నారు. అదేవిధంగా, ఇరాన్ సముద్ర మార్గాల్లో కొన్ని మైన్లు అమర్చినట్టు భావిస్తున్నామని, వాటిని తొలగించేందుకు అమెరికా మైన్స్వీపర్ నౌకలు చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. దీంతో హార్మూజ్ జలసంధిలో నౌకా రవాణా భద్రతను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
హార్మూజ్ జలసంధిపై నిర్బంధం: ట్రంప్ కఠిన హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలం అవ్వడంతో అమెరికా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అని ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఇరాన్ నౌకలను దిగ్భందించే అవకాశం ఉన్నట్లు ఓ మీడియా కథనాన్ని ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇరాన్పై తదుపరి ప్రణాళికల గురించి ట్రంప్ పరోక్షంగా హింట్ఇచ్చారా అని అంతర్జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తోంది. ట్రంప్ షేర్ చేసిన వార్తా కథనంలో హార్మూజ్ జలసంధిపై నౌకాదళ నిర్బంధాన్ని అమలు చేయాలని కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అమెరికా డిమాండ్లకు లొంగకపోతే అధ్యక్షుడి వద్ద ఉన్న అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే.. హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే నౌకలను అడ్డుకునేందుకు అమెరికా నౌకాదళం వెంటనే చర్యలు ప్రారంభిస్తుంది. అప్పుడు చమురు ఎగుమతులపై ఆధారపడిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది. టెహ్రాన్ నుండి చమురు దిగుమతి చేసుకుంటున్న దాని మిత్ర దేశాలైన చైనా, భారత్పైనా ఈ ప్రభావం పడుతుంది. వెనెజులా మాజీ అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్భందించడానికి ముందు కూడా ఇదే విధంగా ఆ దేశంలోని నౌకలను దిగ్భందించారు. ఆ విజయవంతమైన ప్లాన్ను ట్రంప్ ఇరాన్పైనా అమలు చేసే అవకాశం ఉంది అని మీడియా సంస్థ అంచనా వేసింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం రవాణా జరిగే ఈ కీలక జలమార్గంపై వ్యూహాత్మక నియంత్రణ సాధించడం ద్వారా, యుద్ధంలో ఇరాన్కు ఉన్న ఆర్థిక ఆధిక్యాన్ని తగ్గించడమే అమెరికా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్కు టోల్ చెల్లించిన ప్రతి నౌకను గుర్తించి అడ్డుకోవాలని మా నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చాను. చట్టవిరుద్ధంగా టోల్ చెల్లించే వారికి సముద్ర మార్గంలో సురక్షిత ప్రయాణం ఉండదు అని ట్రంప్ హెచ్చరించారు. ఇక అవసరమైతే సరైన సమయంలో ఇరాన్పై పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం ముగియకపోవడానికి ఇరాన్ అణు ఆశయాలే ప్రధాన కారణమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్లో జరిగిన అమెరికాఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.
మహిళా రిజర్వేషన్లపై కలిసిరండి.... ఫ్లోర్లీడర్స్కు ప్రధాని మోడీ లేఖలు
న్యూఢిల్లీ: దేశంలో 2029 నాటికి చట్టసభలలో మహిళా రిజర్వేషన్ కోటా అమలులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కీలక పార్టీలు ఒకేతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కేంద్రంతలపెట్టిన రాజ్యాంగ సవరణలకు, చట్టం రూపకల్పనకు అంతా ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ, లోక్సభలలోని పలు పార్టీల సభాపక్ష నేతలకు లేఖలు రాశారు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పొడిగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణల ఆమోదానికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ మూడు రోజుల ప్రత్యేక సిట్టింగ్ను ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఉభయ సభల ఫ్లోర్ లీడర్స్కు లేఖలు పంపించినట్లు అధికారికంగా వెల్లడైంది. చట్టసభల పరిపూర్ణత దిశలో రిజర్వేషన్ల కోటా అమలుకు సంకల్పించినట్లు ప్రధాని పేర్కొన్నారు. 2029 లోక్సభ ఎన్నికలు, అప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికలు మహిళా కోటా అమలు తోనే నిర్వహించాల్సిన అవసరం ఉందని , ఈ విషయాన్ని పార్టీల నేతలంతా గుర్తించాలని, ఈ విషయంలో సభలో ఐక్యత చాటుకోవల్సి ఉందన్నారు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థ మరింత పరిపుష్టం అయి తీరాలి. మహిళలకు పరిపాలనలో మరింత ప్రాతినిధ్యం తలెత్తాలని ఈ లేఖలలో పేర్కొన్నారు నారీ శక్తి వందన్ అధినియం సాకారం కీలక మలుపు అవుతుందన్నారు. రాజ్యాంగ సవరణల మేరకు రూపొందే చట్టంతో లోక్సభలో, అసెంబ్లీలో మహిళలకు 33శాతం స్థానాలకు వీలేర్పడుతుంది. 2023లోనే ఈ మేరకు సవరణలు అమలులోకి వచ్చాయి. అయితే 2027 జనగణన ప్రాతిపదికన జరిగే డిలిమిటేషన్ పూర్తి తరువాతనే కోటా అమలులోకి వస్తుంది. అప్పటి చట్టం అమలులో ఉంటే రిజర్వేషన్ల కోటా అమలు 2534కు ముందు అసాధ్యం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని దీనికి ఇప్పుడు సవరణలు చేపట్టారు. ఈ ప్రక్రియతో లోక్సభ బలం 816కు చేరుతుంది. ఇందులో కోటా మేరకు మహిళలకు 273 స్థానాలు కల్పించాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలక పరిణామం అవుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. డిలిమిటేషన్ ప్రక్రియలోని అంశాలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నేడు ఢిల్లీలో జాతీయ స్థాయి మహిళా సదస్సుకు ప్రధాని మహిళా రిజర్వేషన్ల కోటా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జాతీయ స్థాయి మహిళా సదస్సు జరుగుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ముందు జరిగే నారీ శక్తి వందన్ సమ్మేళన్కు ప్రధాని మోడీ హాజరవుతారు. దేశ భవిష్యత్తు రూపకల్పన, వికసిత భారత్ 2047 లక్ష సాధనలో మహిళలకు ఇతోధిక ప్రాతినిధ్యం, నిర్ణయాథికారాలలో వారికి ప్రాధాన్యత వంటి విషయాలపై విశ్లేషణకు ఈ జాతీయ సదస్సును తలపెట్టారు.
ముంబయి: ఐపిఎల్ లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ సిబి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఎంఐ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రజత్ పాటిదర్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రజత్ 20 బంతుల్లోనే 53 పరుగులు, సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు చేసి వీరవిహారం చేశారు. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో విరాట్ కోహ్లీ(50), టిమ్ డేవిడ్(34), జితేశ్ శర్మ(10), రోమారియో షెపర్డ్(2) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, శార్థూల్ టాకూర్, మిచెల్ శాంట్నార్, హార్ధిక్ పాండ్యా తలో ఒక వికెట్ తీశారు.
annabhau |సాఠే విగ్రహావిష్కరణ.. దళిత సాహిత్యానికి దిక్సూచి!
annabhau | సాఠే విగ్రహావిష్కరణ.. దళిత సాహిత్యానికి దిక్సూచి! annabhau | నిజామాబాద్లో
12apr |మణికొండలో వైభవంగా జరిగిన హిందూ సమ్మేళనం
12apr | మణికొండలో వైభవంగా జరిగిన హిందూ సమ్మేళనం 12apr | సనాతన
గంభీరావుపేటలో 700 ఏళ్ల నంద వెలుగుతున్న దీపం#Gambhiraopet #NandaDeepam #SitaramachandraSwamyTemple
ముందుచూపుతోనే ఆ ప్రతిపాదనలు చేశాం... కానీ విఫలం: ఇరాన్ స్పీకర్ భాఘర్
ఇస్లామాబాద్: పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పాకిస్తాన్లో జరిగిన చారిత్రాత్మక అమెరికా ఇరాన్ చర్చల్లో అమెరికా ఇరాన్ విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లో జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసిన అనంతరం, ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఘాలిబాఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో చేసిన పలు పోస్టుల్లో ఆయన మాట్లాడుతూ, మా బృందం ముందుచూపుతో కూడిన ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ చర్చల దశలో ప్రత్యర్థి పక్షం మా విశ్వాసాన్ని సంపాదించలేకపోయింది అని పేర్కొన్నారు. చర్చలకు ముందు తాము సత్సంకల్పంతో ముందుకు వచ్చామని, కానీ గత రెండు యుద్ధ అనుభవాల కారణంగా అమెరికాపై విశ్వాసం లేకపోయిందని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. మా సిద్ధాంతాలు, తర్కాన్ని అమెరికా గ్రహించింది. ఇప్పుడు మా విశ్వాసాన్ని పొందగలదా లేదా అన్నది వారి నిర్ణయం అని ఆయన అన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడేందుకు శక్తివంతమైన రాజనీతితో పాటు సైనిక శక్తిని కూడా వినియోగిస్తామని ఘాలిబాఫ్ తెలిపారు రాజనీతితో పాటు సైనిక పోరాటం కూడా ఇరాన్ ప్రజల హక్కుల సాధనలో భాగమే. 40 రోజుల జాతీయ రక్షణ ద్వారా సాధించిన విజయాలను కాపాడేందుకు మా ప్రయత్నాలు ఎప్పటికీ ఆగవు అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలకు వేదిక కల్పించిన పాకిస్తాన్కు ఘాలిబాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రజలను వీర ప్రజలుగా అభివర్ణిస్తూ, తమ బృందం చేసిన నిరంతర శ్రమను ప్రశంసించారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించడానికి సిద్ధంగా లేకపోవడమే చర్చల విఫలం కావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మా చివరి, ఉత్తమ ప్రతిపాదనను సమర్పించాం. ఇరాన్ దానిని అంగీకరిస్తుందో లేదో చూడాలి అని ఆయన తెలిపారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యక్ష చర్చలు విఫలమవడంతో రెండు వారాల కాల్పుల విరమణ స్థిరత్వంపై సందేహాలు నెలకొన్నాయి. అలాగే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్థిరీకరణకు కీలకమైన హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఆశలు కూడా మసకబారాయి.
Amaravati’s Quantum Leap and IBM’s Entry Signal Andhra Pradesh’s Tech Push
Andhra Pradesh is positioning itself as a future-ready technology hub with a dual push in quantum computing and IT expansion. Nara Lokesh announced on X, that on April 14, World Quantum Day, Chief Minister Chandrababu Naidu will inaugurate India’s first indigenous open-access quantum computers, Amaravati 1S and 1Q, at SRM University. This marks the launch […] The post Amaravati’s Quantum Leap and IBM’s Entry Signal Andhra Pradesh’s Tech Push appeared first on Telugu360 .
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఎందుకు విఫలమయ్యాయో... మీకు తెలుసా?
అమెరికా ఇరాన్ మధ్య ప్రధాన విభేదాలు ఇవే న్యూఢిల్లీ: పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్లో శనివారం (ఏప్రిల్ 11) జరిగిన అమెరికాఇరాన్ శాంతి చర్చలు 21 గంటలపాటు కొనసాగినప్పటికీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయాయి. ఈ చర్చలు ఎందుకు విఫలమయ్యాయనే అంశంపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, తమ బృందం చివరి, ఉత్తమ ప్రతిపాదనను సమర్పించిన తర్వాత చర్చల నుంచి నిష్క్రమించిందని తెలిపారు. ఈ పరిణామం ఇరాన్కు చేదు వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. 21 గంటలపాటు జరిగిన రహస్య చర్చల వివరాలను వెల్లడించడానికి వాన్స్ నిరాకరించినప్పటికీ, ప్రధాన విభేదం అణ్వాయుధాల అంశంపైనేనని స్పష్టం చేశారు. మాకు ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదనే స్పష్టమైన హామీ కావాలి. అలాగే అణ్వాయుధాలను త్వరగా తయారు చేయగల సామర్థ్యాన్ని కూడా వారు పొందకూడదు అని వాన్స్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం ఇదేనని, ఈ చర్చల ద్వారా అదే సాధించాలని ప్రయత్నించామని చెప్పారు. ఇరాన్ లోని యురేనియం శుద్ధి కేంద్రాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయని వాన్స్ తెలిపారు. అయినప్పటికీ, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా విరమించాలనే స్పష్టమైన సంకల్పం ఇరాన్ లో కనిపించడం లేదని ఆయన అన్నారు. ఇరాన్ కు భవిష్యత్తులో అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనే దృఢ సంకల్పం ఉందా? ఇప్పటివరకు అలాంటి సంకేతాలు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆ సంకేతాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాం అని వాన్స్ వ్యాఖ్యానించారు. ఇరాన్ మాత్రం తాము అణుబాంబు తయారీ ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలోనూ, అంతకుముందు కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన సున్నిత ప్రాంతాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. చర్చల్లో ఇరాన్కు సంబంధించిన ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల అంశం చర్చకు వచ్చిందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, అనేక అంశాలు చర్చకు వచ్చాయని, కానీ ఇరాన్, అమెరికా షరతులను అంగీకరించే స్థితికి రాలేదని వాన్స్ తెలిపారు. ఇరాన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ ప్రకారం, హార్మూజ్ జలసంధి నియంత్రణ సహా పలు అంశాలు రెండు దేశాల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. మొత్తంగా, అణు కార్యక్రమం, హార్మూజ్ జలసంధి, ఆంక్షలు, ఆస్తుల విడుదల వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చలు విఫలమైనట్టు స్పష్టమవుతోంది.
మార్చి నెల@ 2.24 లక్షలు ట్యాంకర్ ట్రిప్పులు... నీటిని పొదుపుగా వాడుకోవాలి
ఈనెల 12 రోజుల్లోనే 95,454 ట్రిప్పులు నీటిని పొదుపుగా వాడుకోవాలి ప్రతి కుటుంబం 20 శాతం నీటిని ఆదాచేయాలి ఎండీ అశోక్రెడ్డి మనతెలంగాణ, సిటీబ్యూరో ః ఈ సంవత్సరం మార్చి నెలలో మొత్తం 2,24,421 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్రెడ్డి వెల్లడించారు. ఈ నెలలో 12వ తేదీ నాటికే 95,454 ట్రిప్పులు సరఫరా చేసినట్టు తెలిపారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ నీటి వినియోగంపై ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. నీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున, నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్మెంట్పై అశోక్ రెడ్డి జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్తో పాటు రీజినల్ ఈడీలు, డైరెక్టర్లలు, సీజీఎంలు, జీఎంలతో జూమ్ మీటింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ ఘననీయంగా పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు. పెరిగిన బుకింగ్స్.. గత ఏడాదికంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్లో నీటిసరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్ని డెలివరీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి పొదుపుపై ఎండీ విజ్ఞప్తి: ------------------------------------హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు .. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజులలో నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి పౌరుడు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. పౌరులకు ముఖ్య సూచనలు: ----------------------------------విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు, ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు. బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి. స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు. లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి. అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి. జలమండలి ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని ఎండీ తెలిపారు. అయినప్పటికీ, వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. నీరు అమూల్యమైన వనరు. ప్రతి చుక్కను విలువైనదిగా భావించి వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలం అని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి పౌరుడు నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను పాటిస్తూ జలమండలికి సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో లో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, డైరెక్టర్లు ఆపరేషన్స్-1,2,3 వినోద్ భార్గవ, నారాయణ, శీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా
మోడీ సర్కార్ కు సిపిఐ హెచ్చరిక… విశాలాంధ్ర.. ప్రత్యేక ప్రతినిధి/అనంతపురం బ్యూరో.. నూతన ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన “విబిజీ రాంజీ” చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.అనంతపురం […] The post ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా appeared first on Visalaandhra .
Exclusive: Peddi to take up Toxic Date
Ram Charan’s Peddi will not release as per the plan on April 30th. Though the team hasn’t made any official statement yet, the industry insiders, producers and filmmakers are well aware that the film’s release is pushed. For now, the team of Peddi is considering two dates in June. Yash’s Toxic is slated for June […] The post Exclusive: Peddi to take up Toxic Date appeared first on Telugu360 .
ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష
ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష ఎన్టీఆర్ జిల్లా
రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరాకరించడంతో భూతులు తిట్టారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు ఫొటొః మంగ్లీ పేరుతో ఉంది... మనతెలంగాణ, సిటిబ్యూరో: డబ్బులు ఇవ్వలేదని అడ్వకేట్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని సింగర్, యాక్టర్ ముదావత్ సత్యవతి అలియాస్ మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదని, తనవి అని చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. గత నెల 22వ తేదీన అడ్వకేట్ సింగపోగు సుబ్బు ఆఫీస్కు వెళ్లానని, అక్కడ సుబ్బతోపాటు ముగ్గురు ఉన్నారని పేర్కొన్నారు. అడ్వకేట్ సుబ్బు తనతో అసభ్యంగా మాట్లాడారని, దీంతో తాను అడ్వకేట్ను నిలదీశానని తెలిపింది. తనపై యూట్యూబ్, ఇన్స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తొలగించాలని అడ్వకేట్ను అడిగితే, రూ.10లక్షలు ఇస్తేను వాటిని తొలగిస్తానని చెప్పాడని తెలిపారు. తాను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అడ్వకేట్ సుబ్బ, అక్కడ ఉన్నవారు అసభ్యంగా తనను తిట్టారని, డబ్బులు ఇవ్వకుంటే వేధిస్తామని, రెప్యుటేషన్ డ్యామెజ్ చేస్తామని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్తో సంబంధం లేదు: సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్తో తనకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ తెలిపారు. తన పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేశారో తెలియదని తెలిపారు. అడ్వకేట్ సుబ్బుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంగ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుబ్బు భరత నాట్యం డ్యాన్సరని, బిగ్బాస్లోకి వెళ్లేందుకు తన పేరు వాడుకుంటున్నాడని తెలిపారు. తనను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. ఆరోపణలు అన్నీ నిరాధారమని తెలిపారు. నా పేరు చెప్పి ఎవరూ వసూలు చేశారో నాకు తెలియదని, వారికి తనకు సంబంధం లేదని తెలిపారు. మధుకు తన సోదరుడికి సంబంధంలేదని తెలిపారు.
దమ్మపేట మండల విద్యార్థినిలకు స్టేట్ ర్యాంక్…
దమ్మపేట మండల విద్యార్థినిలకు స్టేట్ ర్యాంక్… దమ్మపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్మీడియట్
ఇంటర్ ఫలితాల భయంతో… మూడు రోజుల ముందే విద్యార్థి ఆత్మహత్య..తీరా ఫలితాలలో 347
ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల ప్రభంజనం…
ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల ప్రభంజనం… ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు
కొత్త కార్పొరేషన్లకు రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..?
మొదటి కమిటీలో స్పెషలాఫీసర్ ప్రకటన రెండో మీటింగ్లో ఊసేలేని నజరానా రాష్ట్ర బడ్జెట్లోనూ కనిపించని ప్రస్తావన మనతెలంగాణ, సిటీబ్యూరో ః కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్లకు ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రకటించిన రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్లో హాట్టాపిక్గా మారింది. కొత్తగా ఏర్పడిన కొద్దిరోజుల్లోనే కార్పోరేషన్ల అధికారులతో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన స్పెషలాఫీసర్.. నూతనంగా ఆవిర్భవించిన రెండు కార్పోరేషన్లకు ఒక్కొక్క కార్పోరేషన్కు రూ. 500 కోట్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆ ప్రకటన కాస్త కార్యరూపంలోకి రాకుండా ప్రకటనగానే మిగిలిపోయినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషలాఫీసర్గా నియమితులైన మొదటి సమావేశంలోనే ఆయన ఈ ప్రకటనను ఎందుకు చేసినట్టు..? ఎందుకు నిధులు మంజూరు చేయలేకపోతున్నట్టు..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్లో ఆసక్తికరమైన చర్చకు కేంద్రబిందువుగా మారింది. ప్రకటనచేసి నెల రోజులకుపైగా గడిచినా.. అనంతరం మరోమారు స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగినా.. ప్రకటించిన రూ. 500 కోట్లకు సంబంధించి కార్పోరేషన్ల ప్రత్యేకాధికారి ప్రస్తావించకపోవడంపై పలురకాలుగా వ్యాఖ్యానాలకు కేరాఫ్గా మారింది. బడ్జెట్లో ప్రస్తావనేది..? సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్లకు ఊరటనిచ్చేందుకే రూ. 500 కోట్లను మంజూరు చేయనున్నట్టు ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ ప్రకటించారా..? లేక ప్రభుత్వం నుండి వచ్చిన సంకేతాల మేరకు ప్రకటించారా..? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండానే ఆయన ఈ ప్రకటనను చేశారా..? అనేది ఇప్పుడు ఇటు అధికారులను, అటు పాలకులను తొలుస్తున్న ప్రశ్న. ఇదిలా ఉండగా గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ అంచనాల కేటాయింపుల్లోనూ కొత్తగా ఏర్పడిన కార్పోరేషన్లు సైబారాబద్, మల్కాజిగిరిలకు నిధుల కేటాయింపుపై ఊసే లేకపోవడం కూడా అధికారులను, మాజీ పాలకులను ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. కేవలం హెచ్సిటీ ప్రాజెక్టులకు మాత్రమే రూ. 2654 కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. మరి ఈ రూ. 500 కోట్ల ప్రస్తావన చేయలేదు. గతంలో జీహెచ్ఎంసి వరకు మాత్రమే హెచ్సిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసిలో శివారులోని 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. అదనంగా పెరిగిన ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ధి పథకాలను చేపట్టడం జరగాల్సి ఉంది. మరి వీటిని నిధుల సహాకారం చేయాల్సిన ప్రభుత్వం కాస్త వార్షిక బడ్జెట్ అంచనాలలో కొత్త మున్సిపల్ కార్పోరేషన్లకు నిధులను కేటాయించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఆస్తి పన్ను, ప్లానింగ్పైనే.. ఎర్లీబర్డ్ స్కీంతో వచ్చే ఆస్తిపన్ను వసూలు, టౌన్ప్లానింగ్ విభాగం వసూలు చేసే భవన నిర్మాణాల ఫీజుల నుండి వస్తున్న ఆదాయంపైనే ఈ రెండు కొత్త కార్పోరేషన్లు ఆధారపడి ఉన్నాయి. వచ్చే ఆదాయం మేరకు కార్పోరేషన్ ఉద్యోగుల జీతభత్యాలను అందించనున్నది. ఈ రెండు విభాగాల నుండి ఆదాయం వస్తేనే ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు తమతమ బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయని, లేదంటే జాప్యం కావడం ఖాయమనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. గత ఏడాది ఆస్తిపన్ను వసూలు సిఎంసిలో రూ. 1000.36 కోట్లుగా ఉంటే మల్కాజిగిరి కార్పోరేషన్కు రూ. 962.62 కోట్లు వసూలైనట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క మార్చినెలకు సైబారాబాద్లో ఆస్తిపన్ను రూ. 143.69 కోట్లుగా ఉంటే ఎంఎంసిలో రూ.107.09 కోట్లు వసూలైంది. 202526 టౌన్ప్లానింగ్ విభాగం ద్వారా సిఎంసికి రూ. 538.09 కోట్లు, ఎంఎంసికి రూ.198.24 కోట్లు ఆదాయంగా వచ్చాయి. ఇప్పుడు ఈనెల(ఏప్రిల్)లో ఎర్లీబర్డ్ స్కీం అమలులో ఉన్నందున ఆస్తిపన్ను కొంతమేర ఖజానాకు చేరే అవకాశాలున్నాయి. అనంతరం ఇక టౌన్ప్లానింగ్ నుండి వచ్చే ఆదాయంపైనే ఈరెండు కార్పోరేషన్లు ఆధారపడాల్సి ఉంటుందనేది అధికారులు వివరిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’విద్యార్థుల ప్రభంజనం..
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’ విద్యార్థుల ప్రభంజనం.. భీమారం, ఆంధ్ర ప్రభ : స్థాపించిన
Guruthundha Magic: Massive 10 Million views & Counting
“Guruthundha” from Chennai Love Story has turned into a massive sensation dominating charts and social media feeds with reels, shorts, and fan recreations. Crossing over 10 million views, it has firmly established itself as one of the most talked-about songs in recent times. The song has become an addiction to everyone. Both Kiran Abbavaram and […] The post Guruthundha Magic: Massive 10 Million views & Counting appeared first on Telugu360 .
ఫెయిల్ అయిన మనస్థాపంతో సౌజన్య ఆత్మహత్య
ఫెయిల్ అయిన మనస్థాపంతో సౌజన్య ఆత్మహత్య ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా
KTR : బీఆర్ఎస్ కాదు.. మళ్లీ టీఆర్ఎస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
రెండు దశాబ్దాల తర్వాత ఏఆర్ హెడ్క్వార్టర్స్లో డీజీపీ పర్యటన
రెండు దశాబ్దాల తర్వాత ఏఆర్ హెడ్క్వార్టర్స్లో డీజీపీ పర్యటన నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న
ఇంటర్ ఫలితాల్లో బెల్లంపల్లి విద్యార్థిని మెరుపులు..
ఇంటర్ ఫలితాల్లో బెల్లంపల్లి విద్యార్థిని మెరుపులు.. బైపీసీలో స్టేట్ థర్డ్ ర్యాంక్!440కి 436
గ్రేటర్లో విద్యుత్ ఆటో కొనుగోళ్ళు అంతంత మాత్రమే
నిబంధనలు సడలించాలంట్ను యూనియన్ నాయకులు మన తెలంగాణ,సిటీబ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల కొనుగోళ్ళకు ఎన్ని రాయితీలు ప్రకటిస్తున్నా వాటి అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఇతర వావాహనాలు కొనుగోళ్ళు ఎలా ఉన్నా ప్రవేట్ ట్రాన్స్పోర్టులో కీలక పాత్ర పోషిస్తూ, ప్రయాణికులకు ఆర్టిసితో సమానంగా సేవలు అందిస్తున్న ఆటోలకొనుగోళ్ళు ఇతర వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి.డీజిల్, పెట్రోల్, సీఎన్జీ ధరలు పెరుగుతుండటంతో విద్యుత్ కోనుగోళ్ళు అధికం అవుతాయని, ముఖ్యంగా ఆటో కొనుగోళ్ళ అధికంగా ఉంటాయని భావించిగా ఇతర వాహనాల కోనుగోళ్ళకంటే విద్యుత్ ఆటోలు కొనుగోళ్ళుమాత్రమే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఉపాధి కోసం ఆటోలను కొనుగోలు చేయాలంటే తప్పకుండా పర్మిట్ ఉండాల్సిందే. కేవలం పర్మిట్కోసమే సుమారు రూ.3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఆటో ఖరీదు సుమారు రూ ః 2 లక్షల 20 వేలకు మించి లేదు. కానీ వీటిని బ్లాక్ మార్కెట్లో రూ సుమారు మూడు లక్షలకు విక్రయిస్తున్నారు. అదే విద్యుత్ ఆటోలు కోనుగోలు చేయాలంటే ముందుగా షోరూమ్ నిర్వాహకులకు ఆధార్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్లు, రెండు ఫోటోలతో అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఆయా ప్రాంతానికి చెందిన రవాణాశాఖకు పంపిస్తారు. దరఖాస్తుదారునికి ముందుగామరో అటోలేక పోతే విద్యుత్ ఆటోల కొనుగోళ్ళకు అనుమతి ఇస్తారు. వాస్తవానికి ట్రాన్స్పోర్టు వాహనాలు ఎన్ని కొనుగోలు చేసిన అనుమతించే పాలకులు ఆటోల కొనుగోళ్ళను ఎందుకు నియంత్రిస్తున్నారో ఆర్దం కావడం లేదని ఆటో యూని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలో పాత ఆటో డ్రైవర్లు పేరున ఆటో ఉన్నప్పటికి అవి ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీ వద్దనే ఉంటుంది.దీంతో సదరు డ్రైవర్ ఆటోకోనుగోలుకు అవకాశం లేకుండా పోతోంది. ఇటువంటి నిబంధన కారణంగా ఆటో డ్రైవర్లు వాటి కోనుగోళ్ళకు వెనుకాడుతున్నారు. ట్రాన్స్పోర్టుకు ఉపయోగించే విద్యుత్ ఆటోల కొనుగోళ్ళకు ఎటువంటి నిబంధనలు విధించకుండా నేరుగా షోరూమ్కు వెళ్ళగానే సాధారణ వాహనాల మాదిరిగా విద్యుత్ ఆటోల కోనుగోళ్ళకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. విద్యుత్ ఆటోలకు అనుమతిస్తే గ్రేటర్లో వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా ఆటోల బ్లాక్ పర్మిట్ల దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆటోలతో ఉపాధి అవకాశాలు ఎక్కువ ః విద్యుత్ ఆటోలను కోనుగోలు చేయడం ద్వారా ఆటో డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా వారికి మెరుగైన జీవనోపాధి కలిగించినట్లు అవుతుందని ఆటోయూనియన్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆటోలను ఒక్క సారి చార్జ్ చేస్తే 100 నుంచి 120 కిలో మీటర్ల వరకు నడుస్తాయన్నారు. అదే గ్యాస్ ఆటోలు రూ.80లతో 30 కిలో మీటర్లు మాత్రమే నడుస్తాయనింటున్నారు.ఇక ధర విషయానికి వస్తే విద్యుత్ ఆటోకు రూ. 3 లక్షలు అవుతుందని దీనికి పర్మిట్ అవసరం లేకపోవడంతో పర్మిట్కు పెడుతున్న ఖర్చుకే విద్యుత్ ఆటో కొనుగోలు చేయవచ్చంటున్నారు. విద్యుత్ ఆటో కొనుగోళ్ళపై ఉన్న నిబంధన వెంటనే ఎత్తివేస్తే ఎంతోమంది ఆటో కార్మికులకు జీవనోపాది కలిగించినట్లు అవుతుందంటున్నారు. రెండో వాహనం కొంటే అదనపు ట్యాక్స్ను రద్దు చేసిన విధాంగానే ఆటో కొనుగోళ్ళకు పర్మిట్ విధానాన్ని ఎత్తివేయాలని పలువురు ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తూన్నారు. ఆటో పర్మిట్ విధానంతో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని, తద్వారా షోరూం నిర్వహకులకు ప్రయోజనం చేకూరుతుందనేకాని సాధారణ ఆటో డ్రైవర్లకు ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. అంతే కాకుండా ఆటో పర్మిట్ విధానం ఎత్తివేయడంతో విద్యుత్ వాహనాలు కోనుగోళ్ళు పెరగడమే కాకుండా రవాణాశాకు ట్యాక్స్ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
ప్రజలకు చేరువగా పోలీసింగ్.. కన్నెపల్లి ఠాణా ప్రారంభం…
ప్రజలకు చేరువగా పోలీసింగ్.. కన్నెపల్లి ఠాణా ప్రారంభం… నూతన భవనాన్ని ప్రారంభించిన డీజీపీ
వృద్ధులు, నిరాశ్రయుల సేవతో 5వ వార్షికోత్సవం..
వృద్ధులు, నిరాశ్రయుల సేవతో 5వ వార్షికోత్సవం.. విజయవాడ, ఆంధ్రప్రభ : గత ఐదు
మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలి…
మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలి… కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : సామాన్య
ఐపిఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఎల్ఎస్ జిపై జిటి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. శుభమన్ గిల్, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది. గుజరాత్ జట్టు 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్ మన్ గిల్(56), జోస్ బట్లర్(60) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు తీసి లక్నో నడివిరిచాడు. ప్రసిద్ధి కృష్ణకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
పాదచారులకు రస్నా పంపిణీ… పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక పైపుల రోడ్డు, సింగ్
హంద్రీనీవా ద్వారా చెరువుకు నీరు అందించేలా ప్రణాళికలు
హంద్రీనీవా ద్వారా చెరువుకు నీరు అందించేలా ప్రణాళికలు రాప్తాడు, ఆంధ్రప్రభ : గతంలో
“నేను ఆడపిల్లనే” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న మంగ్లీ #Mangli#Emotional#GirlPower#IamAGirl
Breaking : లక్నోపై గుజరాత్ సూపర్ విక్టరీ
గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలం... యుద్ధం కొనసాగుతుందా?
21 గంటల చర్చలు విఫలం పాకిస్తాన్లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కూలిపోయాయి ఇస్లామాబాద్: పాకిస్తాన్లో జరిగిన చారిత్రాత్మక 21 గంటల అమెరికాఇరాన్ శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. దీంతో రెండు వారాల సున్నితమైన కాల్పుల విరమణ భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. చర్చలు విఫలమయ్యేందుకు ఒకరినొకరు బాధ్యులుగా రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. ఇస్లామాబాద్లో జరిగిన ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్ పెట్టిన షరతులను ఇరాన్ అంగీకరించలేదని తెలిపారు. అమెరికా తమది చివరి, ఉత్తమ ప్రతిపాదన అని సమర్పించినప్పటికీ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడంలో ఆసక్తి చూపలేదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికాతో చర్చలు విఫలం కావడానికి ఆ దేశమే కారణమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ, 21 గంటల పాటు జరిగిన చర్చల సందర్భంగా తమ ప్రతినిధి బృందం సానుకూల ప్రతిపాదనలను అందించింది. అయినప్పటికీ.. అమెరికన్లు తమ నమ్మకాన్ని సంపాదించగలదా లేదా అన్నది అమెరికా నిర్ణయించుకోవాల్సిన విషయం అని ఎక్స్ వేదికగా చెప్పారు. “యుద్ధం ముగింపు విషయంలో మాకు సదుద్దేశం, సంకల్పం ఉన్నాయని చర్చలకు ముందే చెప్పాం. కానీ గత రెండు యుద్ధాల అనుభవం కారణంగా మాకు అవతలి పక్షంపై నమ్మకం లేకుండా పోయింది. చర్చల సమయంలో మా ప్రతినిధులు దూరదృష్టితో కూడిన కొన్ని ప్రతిపాదనలు చేశారు. కానీ మా నమ్మకాన్ని పొందండంలో అమెరికా విఫలమైంది. ఇరాన్ అంటే 9 కోట్ల ప్రజల సముదాయం. సుప్రీం లీడర్ పిలుపుకు స్పందించి వారంతా వీధుల్లోకి వచ్చారు. మా ప్రజల హక్కుల సాధనకు సైనిక పోరాటంతో పాటు దౌత్యం కూడా ఒక మార్గమని భావిస్తున్నాం. అదేవిధంగా 40 రోజుల యుద్ధంలో సాధించిన విజయాలను సుస్థిరం చేసుకునే దిశగా మా ప్రయత్నాలను విరమించుకోం అని ఘాలిబఫ్ అన్నారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా అధికమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను పెట్టిందని విమర్శించింది. ఈ చర్చలు విఫలమవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల స్థిరీకరణకు కీలకమైన హార్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై ఆశలు తగ్గిపోయాయి. అమెరికా మళ్లీ ఇరాన్పై సైనిక చర్యలు ప్రారంభిస్తుందా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇరాన్ హామీ ఇవ్వలేదు.. పాకిస్థాన్ వేదికగా ఇరాన్అమెరికాల మధ్య నిర్వహించిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ, 21 గంటలపాటు మేము ఇరానీయులతో గంభీర చర్చలు జరిపాం. ఇది మంచి విషయం. అయితే ఒప్పందం కుదరలేదు. ఇది అమెరికాకంటే ఇరాన్కే ఎక్కువ నష్టం అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదనే స్పష్టమైన హామీ అవసరం అని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం ఇరాన్కు అణ్వాయుధాలు అందకుండా నిరోధించడమేనని వాన్స్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చర్చలు జరిపినట్టు చెప్పారు. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అణు కార్యక్రమం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ, ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలపై విభేదాలు చర్చల విఫలానికి దారితీశాయి. ఘాలిబాఫ్ సోషల్ మీడియాలో పేర్కొంటూ, ఇరాన్ పక్షం ముందుచూపు కలిగిన ప్రతిపాదనలు చేసినప్పటికీ, ప్రత్యర్థి పక్షం విశ్వాసాన్ని పొందలేకపోయిందని తెలిపారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడటానికి రాజనీతితో పాటు సైనిక పోరాటం కూడా కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. హార్మూజ్జలసంధి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ మాట్లాడుతూ, చర్చల విజయవంతం అవ్వడం ప్రత్యర్థి పక్షం నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. అధికమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నివారించాలి అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా రవాణా అంశం కూడా చర్చల్లో అడ్డంకిగా మారిందని తెలిపారు. 40 రోజుల యుద్ధం తర్వాత, అనుమానాలు, అవిశ్వాసం నడుమ ఈ చర్చలు జరిగాయి. ఒకే సమావేశంలో ఒప్పందం సాధ్యమవుతుందని ఆశించలేం. అమెరికా, ఇరాన్ అభిప్రాయాలను దగ్గర చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయి అని బఘాయ్ అన్నారు. ఇక పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ, ఇరాన్అమెరికా శాంతి చర్చలకు తమ దేశం మధ్యవర్తిత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను అంగీకరించినందుకు రెండు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా బృందంలో వెస్ట్ ఆసియా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు మరియు వైట్ హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు రోజుల తరువాత ఇవి జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికాఇరాన్ మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష, ఉన్నత స్థాయి చర్చలు ఇవే. ఇరాన్ చర్చల కోసం 10 పాయింట్ల ప్రణాళికను సమర్పించింది. ఇందులో పశ్చిమ ఆసియాలో నుంచి అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ వంటి డిమాండ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో ఈ ఘర్షణ మొదలైంది. దీంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు దెబ్బతిని, అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమైంది. పశ్చిమ ఆసియా భద్రత, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు, అంతర్జాతీయ రాజనీతిపై దీర్ఘకాల ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ఈ చర్చలను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు.
యాదవ సంఘం అభివృద్ధికి కృషి… చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ
సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత.. విజయవాడ, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం
కేజీబీవీ జూనియర్ కళాశాల బాలికల హవా..
కేజీబీవీ జూనియర్ కళాశాల బాలికల హవా.. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
పనిభారం తడిసి మోపెడు..!... భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు.
అసహనంలో ఇంజనీర్లు సెలవులపై వేళ్ళేందుకు ప్రయత్నాలు భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు.. కార్యరూపంలోకి వస్తోన్న ప్రాజెక్టులు పెరిగిన జీహెచ్ఎంసి చ.కి.మీ.లు.. తగ్గిన అధికారులు మనతెలంగాణ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసిలో ఇంజనీర్లు పనిభారంతో అసహనానకి లోనవుతున్నారనీ, బదిలీపై ఇక్కడకు వచ్చేందుకు సీనియర్ ఇంజనీర్లు ఆసక్తిని చూపడంలేదనే ఆసక్తికరమన చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇంజనీర్ల కొరతతో ఉన్నవారిపైనే తీవ్రమైన పనిభారం పెరుగుతుంది. ఫలితంగా పలువురు ఇంజనీర్లు సెలవులపై వెళ్ళేందుకు సిద్దమవుతున్నారనేది సమాచారం. ఓవైపు ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకురావాల్సిన పరిస్థితులు... మరోవైపు నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యతలు.. ఇంకోవైపు నెలనెలకు పదవీ విరమణ పొందుతున్న సీనియర్ ఇంజనీర్లు.. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంజనీర్లకు పనిభారం కాస్త తడిసి మోపెడవుతోంది. ఇది తెలిసి కూడా ఖాళీ పోస్టులను భర్తీచేసే దిశగా జీహెచ్ఎంసి ప్రయత్నాలు చేయడంలేదనే విమర్శలు అధికారుల్లో వినిపిస్తున్నాయి. కనీసం 400 మంది ఇంజనీర్లు ఉండాల్సిన జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంలో కేవలం 100 మంది వరకు మాత్రమే ఉన్నారనేది అధికార వర్గాల సమాచారం. ఈ ఎప్రిల్తో పాటు మే, జూన్ నెలలోనూ మొత్తం 14 మంది ఇంజనీర్లు పదవీ విరమణ చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ 14 మందికి బదులుగా మరో 14 మంది జీహెచ్ఎంసికి వస్తారా..? అంటే.. అదీ లేదు. ఇటీవల రిటైర్మెంట్ అయినవారి పోస్టుల్లో ఇతరులు వచ్చి చేరలేదు. దీంతో పదవీ విరమణ చేసిన వారి బాధ్యతలు కూడా ప్రస్తుతమున్న వారే చేపట్టాల్సి వస్తోందని ఆవేదిన చెందుతున్నారు. 426 ఇంజనీర్లు ఇవ్వండి... జీహెచ్ఎంసిలో స్టాఫింగ్ పాట్రన్పై అధ్యయనంచేసి నివేదిక అందించిన ప్రసాదరావు కమిటీ నివేదిక మాత్రం.. ఇంజనీరింగ్ విభాగానికి అదనంగా కనీసం 426 పోస్టు(ప్రాజెక్ట్169, మేయింటనెన్స్257)లను రెండు దశల్లో మంజూరు చేయాలని స్పష్టంచేసింది. మొదటి దశలో ప్రాజెక్ట్కు 144, మేయింటనెన్స్కు 257. రెండో దశలో ప్రాజెక్ట్కు 25 పోస్టులను సాంక్షన్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు తేది 03.04.2013లో జీఓ. ఎంస్ నెం. 92ను అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం వెలువరించింది. ఈ జీవో నెం. 92 ప్రకార ఇప్పటి వరకు ఏఈఈ పోస్టుల్లోకి119 మంది మాత్రమే జీహెచ్ఎంసికి వచ్చినా, నేటికి ఏఈఈ, డిఈఈ, ఈఈ, ఎస్ఈ పోస్టులు ఖాళీలతో అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నవి. ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం మూడు కార్పోరేషన్లుగా జీహెచ్ఎంసి విభజించబడింది. దీంతో ఇంజనీరింగ్ విభాగంలోని ఇంజనీర్లు మూడు కార్పోరేషన్లకు వెళ్ళారు. ఒక్కొక్క కార్పోరేషన్లో ప్రాజెక్ట్, మేయింటనెన్స్లలో ఇంజనీర్ల కొరత తీవ్రత మరింత పెరిగింది. జీహెచ్ఎంసి మాత్రం 650 చ.కి.మీ.ల నుండి 689.76 చ.కి.మీ.లకు పెరిగి 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 వార్డులుగా ఆవిర్భవించింది. దీంతో ఉన్న ఇంజనీర్లకు అదనపు భాధ్యతలు పెరిగాయి. ఈఈలు ఎస్ఈలుగా, ఎస్ఈలు సీఈలుగా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అదనపు బాధ్యతలు ఇటు ఈఈగా.. అటు ఎస్ఈగా రెండేసి బాధ్యతలను నిర్వర్తించడమే కష్టమవుతోందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భర్తీచేయడం అవసరం.. ప్రస్తుత అధికార వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ నెలలో ఎస్ఈలు4, ఈఈలు 3, మే నెలలో ఎస్ఈలు3 మంది ఇలా ప్రతినెల సీనియర్ ఇంజనీర్లు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో జీహెచ్ఎంసిలో సీనియర్ ఇంజనీర్ల కొరత తీవ్రంగామారి ప్రాజెక్టులు, నిర్వహణ పథకాలు తీవ్ర జాప్యానికి కారణమవుతుందనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. ప్రాజెక్ట్లో నాలుగు జోన్లకు ఎస్ఈలు4, ఈఈ 4 డీఈఈ8, ఏఈఈ 8, ఫీల్డ్ లేవల్ స్టాఫ్గా డీఈఈలు, ఏఈఈలు, మేయింటనెన్స్లో జోన్కు ఒక ఎస్ఈ, సర్కిల్కు ఒక ఈఈ, సర్కిల్కు ఇద్దరు డీఈఈలు , ఏఈఈలు 120. క్వాలిటీ కంట్రోల్ సెల్లో ఎస్ఈ, ఈఈ, డీఈఈలు, డిజైన్ వింగ్లో, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లోనూ ఇంజనీర్ల పోస్టులను భర్తీచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ, ఉన్నవారిపై పనిభారం మోపుతోన్న జీహెచ్ఎంసి అధికారులు ప్రభుత్వం నుండి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు చేయడంలేదని, తద్వారా తాము పనిచేయడంకన్నా.. సెలవుపై వెళ్ళడమే ఉత్తమమని భావిస్తున్నారు. ప్రాజెక్టులు, మేయింటనెన్స్ విధులు కార్యాలయాల్లో కూర్చుని చేసే పనులు కాదని సాంకేతికంగా పరిశీలించడం, క్షేత్రస్థాయిలో వెళ్ళి తనిఖీలు చేయడం, పర్యవేక్షణ చేపట్టడం వంటి విధులుంటాయని, దానిని గుర్తించి సరిపడా స్టాఫ్ను తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యతను విస్మరించడంతో ఇంజనీర్లలో అసహనం వ్యక్తమవుతోంది.
K. T. Rama Rao made strong remarks on party affairs and current political debates during his visit to Mancherial. Speaking about Kavitha, he chose a restrained tone. He said there was nothing more to add on the issue. He added that children may not always make their father proud, but they should never cause him […] The post KTR Breaks Silence on Kavitha appeared first on Telugu360 .
ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అటకెక్కించింది: కెటిఆర్
మంచిర్యాల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ‘దాచుకో.. దోచుకో’ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా అదే పని మీద ఉన్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో కెటిఆర్ పర్యటించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన క్యాతనపల్లి పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ.. బిఆర్ఎస్-సిపిఐ కూటమి తరఫున గెలిచి కౌన్సిలర్లు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అటకెక్కించిందని ధ్వజమెత్తారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట.. సింగరేణి సంపదను దోచుకుంటున్నారని కెటిఆర్ ఆరోపించారు.
త్రాగునీరు రాని నల్లాలు పరిశీలించిన కార్పొరేటర్…
త్రాగునీరు రాని నల్లాలు పరిశీలించిన కార్పొరేటర్… సమస్య పరిష్కారానికి కృషి చేస్తానునేడు నిర్వహించే
ఇంటర్ ఫలితాలలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల
ఇంటర్ ఫలితాలలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల ప్రతిభ ఫస్ట్ సెకండ్
టీజీఆర్ ఎస్ కళాశాల విద్యార్థుల హవా…
టీజీఆర్ ఎస్ కళాశాల విద్యార్థుల హవా… మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా
ఇంటర్లో కేజీబీవీ బాలికల సత్తా…
ఇంటర్లో కేజీబీవీ బాలికల సత్తా… చిట్యాల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో
నందిగామలో ఘనంగా 33వ ఉర్సు మహోత్సవం…
నందిగామలో ఘనంగా 33వ ఉర్సు మహోత్సవం… పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు నందిగామ,
నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు…
నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు…
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి..
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి.. విజయవాడ, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ సమ స్యల పరిష్కారం
అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి
పెదబయలు: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు మత్స్యగెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా.. మరొకరు బయటకు వచ్చి సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్య్సకారులు తక్షణమే స్పందించి.. ఒకరిని కాపాడగలిగారు. మిగిలిన ముగ్గురూ మృతి చెందారు. మృతులను హర్షిత్(12), ప్రదీప్(11), పొంగి బబులు(10)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ తిరువూరు, ఆధ్రప్రభ : స్థానిక కుమ్మరబజారులో ఈ
Sumanth Prabhas’ Godari Gattupaina gets perfect release date
Sumanth Prabhas, who scored a hit with his previous film Mem Famous, is returning to the screen with a rural love story titled Godari Gattupaina. The makers have officially announced that the film is scheduled to release in theaters worldwide on May 8th. Directed by Subash Chandra and produced by Abhinav Rao, the movie features […] The post Sumanth Prabhas’ Godari Gattupaina gets perfect release date appeared first on Telugu360 .
పోలీస్ స్టేషన్కు ప్రభుత్వ వాహనం కరువు….
పోలీస్ స్టేషన్కు ప్రభుత్వ వాహనం కరువు…. అత్యవసర సమయాలలో ఇబ్బందులు పడుతున్న స్థానిక
సినీ ప్రముఖుల పేర్లతో కామెడీ… అనుదీప్పై ఫ్యాన్స్ ఫైర్ #Anudeep#Tollywood#StandUpControversy
ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నఅధికారులు..
ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నఅధికారులు.. పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని నూతన
Auto Driver’s Son Who Studied Abroad Dies in US Accident
Sai Sri Harikrishna, a young man from Piridi village in Bobbili mandal of Vizianagaram district, died in the United States after a drowning accident. Harikrishna had moved to the US two years ago to pursue higher studies. He completed his MSc and recently secured a job as an engineer at Elicent Clean Technologies. On Saturday, […] The post Auto Driver’s Son Who Studied Abroad Dies in US Accident appeared first on Telugu360 .
ముగిసిన లక్నో బ్యాటింగ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..
లక్నో: ఐపిఎల్ 19వ జీజన్లో ఏకనా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన లక్నో.. ఆరంభంలో వేగంగా ఇన్నింగ్స్ ఆడినా.. గుజరాత్ బౌలర్లు కట్టడి చేస్తూ వచ్చారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో మార్క్రమ్ 30, పూరన్ 19, పంత్, సమాద్, ముకుల్ తలో 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలింగ్లో ప్రసిద్ధ్ 4, అశోక్ 2, రబాడా, సిరాజ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే.. గుజరాత్ 165 పరుగులు చేయాలి.
బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేత..
బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేత.. స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ :

34 C