అస్ట్రేలియాపై అద్భుత విజయం.. ప్రపంచకప్ ఫైనల్ కు భారత్
మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్కు చేరుకుంది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో అద్భత విజయం సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్) వీరోచిత శతకంతో చెలరేగింది. అలాగే, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరితోపాటు దీప్తి శర్మ(24), రిచా ఘోష్(26), అమన్ జ్యోత్ కౌర్(15 నాటౌట్)లు రాణించారు. దీంతో భారత్ ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్ లో సౌతాఫ్రికా జట్టుతో భారత్ తలపడనుంది.
హైదరాబాద్ ఐఐటీ యువకుడి ‘పంచాయత్ కిచెన్’ ;ఇంటి రుచిని నగరానికి పరిచయం చేసిన సాయి తేజా
భారతీయ వంటకాలు, సందర్భానుసారంగా కస్టమ్ మెనూలు
వారణాసి(యూపీ) : వారణాసిలో కొత్తగా పారిశుద్ధ నిబంధనలను వారణాసి మున్సిపల్కార్పొరేషన్ అమలు లోకి తెచ్చింది. వాహనం నుంచి ఎవరైనా ఉమ్మివేస్తే రూ. 250 జరిమానా విధిస్తారు. అలాగే వాహనం నుంచి చెత్త పారేసినా, ఉమ్మి వేసినా రూ. 1000 జరిమానా కట్టక తప్పదు. వీధుల్లో తిరిగే జంతువులకు ఆహారం విడిచిపెడితే రూ. 250 జరిమానా తప్పదు. ఎవరైనా తమ నివాస పరిసరాల్లో చెత్తను 24 గంటలపాటు ఉంచినా, బహిరంగ ప్రదేశాల్లో, పార్కులు, రోడ్లపై చెత్తను పారేసినా రూ.న 500 జరిమానా విధిస్తారు. పెంపుడు జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులు బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేస్తే శుభ్రం చేయకపోతే రూ. 500 జరిమానా విధిస్తారు. నదులు, కాలువలు, లేదా మురికి కాలువల్లో వ్యర్థాలను గుమ్మరిస్తే రూ. 750 జరిమానా చెల్లించవలసి వస్తుంది. వ్యర్థాలను లేదా శిథిలాలను ఓపెన్ట్రక్కుల్లో రవాణా చేసినా, మున్సిపల్ వాహనాలకు, కుండీలకు, తొట్టెలకు నష్టం కలిగించినా, రూ. 2000 జరిమానా చెల్లించుకోవాలి. మురికి నీరు పారకుండా స్తంభించిపోయినా, అపారిశుద్ధ పరిస్థితులు కల్పించినా గరిష్ఠంగా రూ.5000 జరిమానా చెల్లించక తప్పదని విఎంసి పబ్లిక్రిలేషన్స్ అధికారి సందీప్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ స్వంత నియోజకవర్గంలో పరిశుభ్రత, పారిశుద్ధం ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండేలా తీసుకుంటున్నచర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
కలర్ కోడింగ్ బ్యాగులు తప్పనిసరి..
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు
చాబహార్ పోర్టుపై మరో 6 నెలల పాటు ఆంక్షల మినహాయింపు
న్యూఢిల్లీ : ఇరాన్ లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై అమెరికా మరో ఆరునెలల పాటు ఆంక్షల మినహాయింపు పొడిగించింది. గతంలో ఇచ్చిన మినహాయింపునకు గురువారంతో గడువు ముగియడంతో మళ్లీ ఈ గడువు పొడిగించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. దీంతో చాబహార్ పోర్ట్ లోని షహీద్ బెహెస్తీ టెర్మినల్ అభివృద్ధి నిర్వహణకు భారత్కు వీలు కలిగింది. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం నిర్వహించడానికి చాబర్హార్ పోర్టు ప్రధాన మార్గం. ఈ పోర్టు అభివృద్ధి, నిర్వహణలో భారత్దే కీలక పాత్ర. ఈ రేవులో 10 ఏళ్లపాటు టెర్మినల్ నిర్వహణ కోసం గత ఏడాది భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తరువాత ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధిస్తూ భారత్కు హెచ్చరికలు చేసింది. ఇదిలా ఉండగా అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తాము పరిశీలిస్తున్నామని తెలిపారు.
రేణిగుంట సర్కారీ హైస్కూలులో.. ఆంధ్రప్రభ, రేణిగుంట (తిరుపతి జిల్లా) : రేణిగుంట పట్టణంలోని
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్
సుప్రీం కోర్టు 53 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నియామకాన్ని ప్రకటిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు పదవిలో ఉన్న బీఆర్ గవాయ్ నవంబర్ 23న రిటైర్ అవుతారు. జస్టిస్ సూర్యకాంత్ చీఫ్జస్టిస్గా దాదాపు 15 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించిన తరువాత 65 ఏళ్ల వయసు వచ్చిన తరువాత 2027 ఫిబ్రవరి 9న రిటైర్ అవుతారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను వినియోగించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను రాష్ట్రపతి నియమించారని , నవంబరు 24న బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ తన ఎక్స్ పోస్టులో తెలియజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హర్యానా లోని హిస్సార్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జీ అయ్యారు. అత్యున్నత న్యాయ ధర్మాసనంలో రెండేళ్లు అనుభవం సంపాదించారు. ఆర్టికల్ 370 రద్దు, భావ ప్రకటన, ప్రజాస్వామ్యం, అవిపీతి. సర్యావరణం, లింగ సమానత్వం తదితర అంశాల్లో చెప్పుకోదగిన తీర్పులు వెల్లడించారు. వలసవాద దేశద్రోహ చట్టం (ఐపిసి సెక్షన్ 124 ఎ ) తాత్కాలిక నిలుపుదలకు 2022 మే 11న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పునః పరిశీలించేవరకు అన్ని విచారణలు, అప్పీళ్లు , ఇతర ప్రక్రియలు పెండింగ్లో ఉంటాయని తీర్పు వెలువరించారు. బీహార్లో ఎన్నికల కమిషన్ ఓటర్ల సవరణ చేపట్టినప్పుడు మినహాయించిన 65 లక్షల ఓటర్ల వివరాలు తెలియజేయాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్తోసహా బార్ అసోసియేషన్లలో మూడోవంతు స్థానాలు మహిళలకు రిజర్వు చేయాలని తీర్పు చెప్పారు. ,
ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి : జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాల కోరు
కోల్కతా ప్రధాన కోచ్గా అభిషేక్ నాయర్..
రానున్న ఐపిఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ టీమ్ ప్రధాన కోచ్గా అభిషేక్ నాయర్ను ఎంపిక చేశారు. కిందటి సీజన్లో ప్రధాన కోచ్గా పని చేసిన చంద్రకాంత్ పండిట్ స్థానంలో నాయర్ను తీసుకున్నారు. అభిషేక్ 2018 నుంచి కోల్కతా టీమ్లో సహాయక కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా అతన్ని ప్రధాన కోచ్గా నియమించాలని కోల్కతా ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషాయన్ని ఫ్రాంచైజీ ప్రతినిధి వెంకీ మైసూర్ అధికారికంగా ప్రకటించారు. అతని పర్యవేక్షణలో కోల్కతా మెరుగైన ప్రదర్శన చేస్తుందనే నమ్మకం తమకుందన్నారు. అన్ని ఆలోచించే నాయర్కు కీలకమైన బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు.
వృద్ధుడి నుంచి రూ.51లక్షలు కొట్టేసిన సైబర్ నేరస్థులు
డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి ఓ వృద్ధుడి నుంచి సైబర్ నేరస్థులు రూ.51 లక్షలు కొట్టేశారు. నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వృద్ధుడు (78) కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వృద్ధుడికి వాట్సాప్ వీడియో కాల్ చేసిన సైబర్ నేరస్థులు తాము ముంబాయి క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పారు. మీ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారంటూ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆయనకు వాట్సప్ కాల్ చేశారు. సీబీఐ పేరుతో ఉన్న నోటీసులు చూపి బెదిరించారు. బాధితుడి పేరుతో ఇతరులు సిమ్ కార్డులు తీసుకుని బాంబు పేలుళ్లకు వాడారని బెదిరించారు. మనీలాండరింగ్ లోనూ భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్పి వృద్ధుడిని సైబర్ నేరస్థులు వీడియో కాల్లో 24 గంటలపాటు నిర్బంధించారు. ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా వృద్ధుడి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నారు. కేసు నుంచి తప్పించాలంటే ఖాతాలోని 95 శాతం నగదు పంపాలన్నారు. దర్యాప్తు అనంతరం తిరిగి ఇస్తామని చెప్పారు. కేసు భయంతో బాధితుడు రూ.51 లక్షలు బదిలీ చేశారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
న్యాక్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్
హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో, వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుంచి హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సివిల్ సూపర్వైజర్, ఎలక్ట్రిషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, శిక్షణతో పాటు ఉచిత భోజనం, నివాసం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తామని మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8008937800, 9032504507 నెంబర్లను సంప్రదించాలని మంత్రి కోరారు.
ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం : పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తులో నైపుణ్యత,వేగం
ఆంధ్రప్రభ కంచికచర్ల : మునేరుకు వరద ఉధృతి పెరుగుతున్నందున ఆస్తి ప్రాణ, నష్టాలు
ఆంధ్రప్రభ, గంపలగూడెం (ఎన్టీఆర్ జిల్లా) మొంథా తుఫాన్ వరి,పత్తి,మిరప రైతులను నిండా ముంచేసింది.భారీ
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) : మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ఆపదలో ఉన్న వారికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని,
తెనాలి(గుంటూరు జిల్లా),అక్టోబరు 30( ఆంధ్రప్రభ) : అధైర్యం వద్దు… ప్రతి గింజ కొంటాం
ఆస్ట్రేలియా క్రికెట్లో మరో విషాదం..
మెడకు బంతి తగిలి తీవ్ర గాయాలు మృత్యువుతో పోరాడి యువ క్రికెటర్ అస్టిన్ మృతి మెల్బోర్న్: ప్రాక్టీస్ సమయంలో బంతి మెడకు తగిలి మైదానంలోనే కుప్పకూలిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ బెన్ అస్టిన్ కథ విషాదాంతంగా ముగిసింది. దశాబ్దం క్రితం ఫిల్ హ్యూస్ అనే ఆస్ట్రేలియా క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలిన ఉదంతం ఇప్పటికీ క్రికెట్ అభిమానులను కలచి వేస్తూనే ఉంది. తాజాగా ఇలాంటి విషాద ఘటనే మరోసారి పునరావృతమైంది. తాజాగా మెల్బోర్న్కు చెందిన 17 ఏళ్ల యువ ఆటగాడు బెన్ అస్టిన్ మెడకు బంతి బలంగా తగలడంతో మైదానంలోనే కుప్పకూలి పోయారు. సహచర ఆటగాళ్లు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపు రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువ క్రికెటర్ గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. బెన్ అస్టిన్ 20 మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో బంతి అతడి మెడకు బలంగా తగిలింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందించారు. వైద్యులు అతన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి బెన్ మృత్యు ఒడిలోకి వెళ్లిపోయాడు. అతని మరణంతో ఆస్ట్రేలియా క్రికెట్లో మరోసారి విషాదం నెలకొంది.
మొంథా తుఫాను కారణంగా తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు
తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో రేపు ఉదయం
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ : ఎపికి రూ.5,265 కోట్లు నష్టం
మొంథా తుఫాన్ తో ఏపీకి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్లు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సిఎం చంద్రబాబు వివరించారు. వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం జరిగింది. ఇక హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్లు, సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్లు నష్టం, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగింది. ఇక ఆక్వారంగంలో రూ.1,270 కోట్లు.. మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు నష్టం, హౌసింగ్లో రూ.5.53 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. కానీ 120 వరకు పశువులు మృత్యువాత పడ్డాయని తెలిపారు. అయితే తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంతోనే చాలా వరకు నష్టాన్ని నివారించగలినట్టు ఆయన తెలిపారు. తుపాను కారణంగా మారుతున్న పరిణామాలను అంచనా వేసి వాటికి తగ్గట్లుగా నిర్ణ యాలు తీసుకున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించడానికి గతంలో 10 గంటల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా 3 గంటల్లోనే పునరుద్ధరించగలిగామని ఆయన తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేశారని, ఎలా ప్రాణ నష్టం లేకుండా తుఫాన్ను ఎదుర్కొవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నా కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించారని, గతంలో చెట్లు కూలితే తొలగించేందుకు వారం పట్టేదని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరని, కానీ ముందస్తు చర్యల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించవచ్చుని సిఎం చంద్రబాబు వెల్లడించారు. హుద్హుద్ తుఫాన్తో విశాఖపట్నం అతలాకుతలం అయ్యింది. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దాం. తరువాత వచ్చిన తిత్లీ తుఫాన్ సమయంలోనూ సమర్థంగా పనిచేశాం. బుడమేరు వరదను ఎదుర్కొన్నాం. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తున్నాం. శాటిలైట్ ఇమేజ్ల ఆధా రంగా తుఫాన్ పరిస్థితులను అంచనా వేశాం. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివా లయం వరకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అని సీఎం చంద్రబాబు గురువారం చెప్పారు. ప్రతి ఒక్కర్నీ ఆదుకుంటామని స్పష్టం చేశారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో యువకుడి జలదీక్ష
మన తెలంగాణ/కొల్లాపూర్ : పొంగుతున్న వాగుపై రైతులు, గ్రామస్తులు, భక్తులు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ యువకుడు పొంగిపొర్లుతున్న వాగులో ప్రజా గర్జన నిరసన జల దీక్షను చేపట్టిన ఘటన గురువారం నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలోని పసువుల వాగులో గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆకునమోని చంద్రయ్య యాదవ్ ప్రజా గర్జన నిరసన జలదీక్ష చేపట్టారు. గ్రామ సమీపంలో ఉన్న పసువుల వాగు పొంగిపొర్లుతుంది. వారం రోజుల నుంచి పొలాలకు రైతులు, కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు వెళ్లకుండా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొంగుతున్న వాగును దాటడానికి వీలు కాకపోవడంతో పంటపొలాలు, సోమశిల లింక్ రోడ్డు, గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. రామాపూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆకునమోని చంద్రయ్య యాదవ్ ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పరిష్కరించాలని కోరుతూ ఉధృతంగా పొంగుతున్న వాగులో జలదీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు గ్రామస్తులు సంఘిభావం పలికారు. వరదలో వైకుంఠదామం షెడ్లు మునిగిపోయిందని ఆ గ్రామస్తులు వాపోయారు. గత నెల రోజుల క్రితం గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే నానా అవస్థలు పడుతూ అతి కష్టం మీద వాగు దాటి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. వర్షం కాలంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శవాన్ని ఎత్తుకొని వాగు దాటాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోయారు. వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని దీక్ష చేపట్టిన ఆకునమోని చంద్రయ్య యాదవ్ కోరారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు తాను జలదీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
సాగర్ డ్యామ్ 14 గేట్లు ఎత్తి నీటి విడుదల
మన తెలంగాణ/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీనితో గురువారం ఉదయం 20 గేట్ల ద్వారా కొనసాగిన వరద ప్రవాహం మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్క గేట్లను తగ్గించుకుంటూ మొత్తం గేట్లను మూసివేశారు. సాయంత్రానికి మళ్ళీ వరద ప్రవాహం పెరగటంతో జలాశయం 14 క్రష్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,13,400 క్యూస్సెక్కుల నీటివిడుదల కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 1,46,854 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుంది. దీనితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 590.00 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 33,454 క్యూసెక్కుల నీటిని,కుడి,ఎడమ కాల్వద్వారా,ఎస్.ఎల్.బి.సి ద్వారా ,లోలెవల్ కెనాల్ ద్వారా నీటివిడుదల కొనసాగడం లేదు. రిజర్వాయర్ నుండి మొత్తం 1,46,854 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో ఉధ్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో దంపతులు గల్లంతైన ఘటన అక్కన్నపేట మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలానికి చెందిన ఈసంపల్లి ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు భీమదేవరపల్లి నుండి ప్రణయ్ అత్తగారింటికి అక్కన్నపేటకు బయలుదేరి ప్రయాణిస్తుండగా ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షానికి కొత్తకొండ వద్ద రాకపోకలకు అంతరాయం కలిగి మోత్కులపల్లి మీదగా అక్కన్నపేటకు వెళ్లే క్రమంలో వాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో ద్విచక్ర వాహనంతో సహా దంపతులు వాగులో గల్లంతైనట్లు తెలుస్తోంది. వాగు ప్రవాహంలో మల్లంపల్లి చెరువులో కొట్టుకొచ్చి గొర్ల సమ్మయ్య పశువుల షెడ్డు వద్ద గ్రామస్తులకు కనబడినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో హుటాహుటిగా చేరిన ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ ఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రెస్క్యూ టీంను పంపించి గాలింపు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ కే. హైమావతి చేరుకొని పరిశీలించారు. రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. సహాయక బృందాలకు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేయాలని సూచించారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గుట్ట ఆలయ విద్యుత్ అధికారి
మన తెలంగాణ/యాదగిరిగుట్ట: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విద్యుత్ ఈఈ ఊడెపు రామారావును జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రామారావు ప్రస్తుతం దేవాదాయశాఖలో విద్యుత్ ఇంచార్జ్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఓ కాంట్రాక్టర్ యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ మిషనరీని మూడు నెలల క్రితం టెండర్ ద్వారా సప్లై చేశాడు. దీనికి సంబంధించి రూ.11.90 లక్షల బిల్లు అయిందని, బిల్లు మంజూరు చేయడానికి బిల్లులో 20 శాతం లంచాన్ని రామారావు డిమాండ్ చేశాడని తెలిపారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక నల్గొండ ఏసీబీ అధికారులను బాధితుడు సంప్రదించాడని, పక్కాగా నిఘా పెట్టి రామారావును పట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రామారావు మేడారం జాతర ఇంచార్జ్ ఎస్ఈగా వ్యవహరిస్తున్నాడని, బుధవారం మేడారం నుంచి వస్తుండగా బోడుప్పల్లో కాంట్రాక్టర్ను కలవమని చెప్పాడని తెలిపారు. కాంట్రాక్టర్ను కలిసిన రామారావు అతని దగ్గర నుంచి రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా రామారావును పట్టుకున్నట్లు తెలిపారు. రామారావు దగ్గర నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని, నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ కొండపైన రామారావు కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించామని, అతనికి సంబంధించిన ఇళ్లు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగాయని తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి వివరాలు అందజేస్తామని తెలిపారు.
పౌల్ట్రీ ఫామ్ లో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కేటాయించేందుకు మెదక్ ట్రాన్స్ కో డీఈ షేక్ షరీఫ్ చాంద్ బాషా ఒక రైతు వద్ద నుంచి ముప్పై వేలు లంచం తీసుకుంటు గురువారం సాయంత్రం ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎసిబి డిఎస్పి సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతా నగర్ గ్రామనికి చెందిన భాస్కర్ అనే రైతు తన పౌల్ట్రీ ఫామ్ షెడ్ కు సింగల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్ ఇవ్వాలని గత ఐదు నెలల నుండి విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినా ట్రాన్స్ఫార్మర్ కేటాయించలేదు. రూ.30 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ బిగిస్తామని చెప్పడంతో విసిగిపోయిన బాధితుడు భాస్కర్ ఎబిసిని ఆశ్రయించగా గురువారం రూ.9 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించి మిగతా రూ.21వేలు నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. డిఈ కార్యాలయంతో పాటు పట్టణంలోని నివాసం, హైదరాబాద్ మెహదీపట్నంలోని తన సొంత నివాసంతో కలిపి మొత్తం మూడు చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. డిఈ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎసిబి డిఎస్పి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
వరద ప్రవాహంలో యువతి గల్లంతు.. ఎస్డిఆర్ఎఫ్ గాలింపు చర్యలు
మన తెలంగాణ/జఫర్గడ్: మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగి ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మంపేట్ సమీపంలో స్టేషన్ ఘన్పూర్జఫర్గడ్ ప్రధాన రహదారిపై బోళ్ల మత్తడి వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువతీ, యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. యువకుడు మాత్రం ఓ చెట్టును ఆసరాగా చేసుకుని ప్రాణాలతో బయటపడగా, యువతి గల్లంతైంది. వెంటనే ఆ యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకుని ఘటన వివరాలను పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రామారావు తన బృందంతో కలిసి అదే రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వెనుదిరిగారు. గురువారం ఉదయం 30 మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు ప్రారంభించారు. జనగామ దక్షిణ మండల డిసిపి రాజ మహేంద్ర నాయక్ , స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్న, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం పొద్దు పోయే వరకు గాలింపుచర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం కూడా గాలింపు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానికి తహసీల్దార్ బి. రాజేశ్, ఆర్ఐ లు బలరామ స్వామి, దేవేందర్ ఇతర అధికారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కాగా యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మావోయిస్టుల స్థూపం కూల్చిన పోలీసు బలగాలు
మావోయిస్టుల నిర్మూలనే లక్షంగా పోలీసు బలగాల వేట కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఆగ్రనాయకులు ఆయుధాలతో సహ లొంగిపోతున్నారు. మరోవైపు మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు తమ వేటను కొనసాగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మావోయిస్టుల కుట్రను భగ్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్స్టేషన్ పరిధిలో గోటుంపల్లి అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసు భద్రత బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ స్మారక స్థూపాన్ని గుర్తించి కూల్చివేశారు.
ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం
తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ.
కిడ్నాప్కు గురైన 17 మంది పిల్లలు సురక్షితం
కిడ్నాపర్ బారి నుంచి 17 మందిని సురక్షితంగా రక్షించారు. ముంబై లోని ఆర్ ఏ స్కూడియోలో 17 మంది పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చనిపోయాడు. పిల్లలను రక్షించే క్రమంలో కాల్పులు జరపక తప్పలేదు. గురువారం ముంబై లోని పోవై ప్రాంతంలో ఉన్న స్టూడియోలో రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన తర్వాత సురక్షితంగా ఇద్దరు పెద్దలతో పాటు పిల్లలు అందరినీ కాపాడారని అధికారులు తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.పిల్లలను విజయవంతంగా రక్షించిన తర్వాత ఆర్ ఏ స్టూడియో ఉద్యోగి అయిన ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ముందు అధికారులు చెప్పారు. రిస్క్యూ ఆపరేషన్ కు ముందు తన డిమాండ్ ఏమిటో అధికారులకు చెప్పాలని అనుకుంటున్నట్లు నిందితుడు మెస్సేజ్ కూడా విడుదల చేశాడు. అయితే, అతను పిల్లలను ఎందుకు బందీలుగా పట్టుకున్నాడో, అధికారులతో ఏమి మాట్లాడాలని అనుకున్నాడో ఖచ్చితంగా తెలియలేదు.అంతకు ముందు ఆర్య అనే నిందితుడు తన వీడియో సందేశంలో కొంతమంది తో మాట్లాడాలనే తన డిమాండ్ నెరవేరని పక్షంలో పిల్లలు, ఇద్దరు పెద్దలు బందీలుగా ఉన్న భవనానికి నిప్పుపెడతానని బెదిరించాడు. తాను టెర్రరిస్ట్ కానని, పిల్లలను విడిపించడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయనని అతడు చెప్పాడు. అదికారులను తనతో మాట్లాడమని ఒత్తిడి చేయడానికి కేవలం మాట్లాడాలన్నదే తన డిమాండ్ అని చెప్పాడు. తన మాట వినాలని అధికారులను గట్టిగా కోరుతూ, ఒకదశలో పిల్లలకు ఏదైనా హాని జరిగితే తన బాధ్యత ఏమీ లేదని ఆర్య అన్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోవై పోలీసు స్టేషన్ కు 17 మంది బందీ పరిస్థితి విషయం తెలియడంతో పెద్దఎత్తున పోలీసు బృందాలు యాక్టింగ్ స్టూడియోకు చేరాయి. మొదట పోలీసులు ఆర్యతో చర్చలు జరపడానికి యత్నించారు. కానీ, అతడు తన డిమాండ్లపై మొండిగా పట్టుపట్టాడు. చర్చలు విఫలమైన తర్వాత, పోలీసులు పిల్లలను రక్షించేందుకు. బాత్రూమ్ ద్వారా బలవంతంగా స్టూడియోలోకి చొరబడ్డారని డిసిపి దత్తా మీడియాకు తెలిపారు. పిల్లలను రక్షించే క్రమంలో ఆర్యపై కాల్పులు జరిపి గాయపరిచారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంది.. అధైర్యపడొద్దు
మన తెలంగాణ/హన్మకొండ: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని అధైర్య పడవద్దని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జలమయమైన ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ ప్రాంతాల్లో మంత్రి లోక్ సభ సభ్యురాలు డా.కడియం కావ్య, కలెక్టర్ డా.సత్య శారదతో కలిసి క్షేత్ర వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులకు దైర్యం కలిగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాను వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా భారీ వర్షాలు కురిసాయని, వృద్ధులు ఆపరేషన్ మొదటి అంతస్తులో సుమారు 400 మంది వరకు ఉన్నారని, ఎస్డిఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు. గత 5 సం.ల నుండి ముంపు పరిస్థితి తలెత్తుతున్నదని, నగర పరిధిలో లోతట్టు ప్రాంతాలు ఉండడం, కొన్ని ప్రాంతాలు కబ్జాకు గురవ్వడం, సరైన వెడల్పుతో నాలాలు ఉండకపోవడం ఇందుకు కారణమని ఇకముందు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, వారి ఆదేశం మేరకు ముందుకు వెళతామని మంత్రి తెలిపారు. వరద ప్రభావం దృష్ట్యా గత రాత్రి నుండి జిల్లా కలెక్టర్తోపాటు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి మన వద్ద అందుబాటులో ఉన్న డిఆర్ఎఫ్ బృందాలకు తోడు ఎన్డి ఆర్ఎఫ్ బృందాలను కూడా పిలిపించడం జరిగిందని ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా రాత్రి నుండి వారి డివిజన్లలో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని కాలనీ లలోని వరద ప్రాంతాల్లో చిక్కున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆవాసం అందిస్తున్నామని అన్నారు. వరద వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని, వరద వల్ల నిరాశ్రయులైన వారికి తాత్కాలికంగా వరంగల్ ప్రాంతంలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు సుమారు 700 మందిని తరలించినట్లు, వరద నీటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేని వారికి డ్రోన్ ల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సారి వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లను అందించి ఆ ప్రాంతాలను ఖాళీ చేయించేలా చూస్తామని, ప్రస్తుత పరిస్థితి నేపధ్యంలో రెండు రోజులు సెలవులు ప్రకటించామని, ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ముఖ్యమంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఉందని, వరంగల్లో వరద పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని పునరావస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న బాధితులకు పౌష్టికాహారం మంచినీటితో పాటు దుప్పట్లను కూడా అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా పరిధికి లో సగటున 25 సెం.మీ వర్షపాతం నమోదు కావడం జరిగిందని పర్వతగిరి కల్లెడ ప్రాంతాలలో 37 సెం.మీ వర్షపాతం నమోదైందని నెక్కొండలో 33 సెం.మీ వర్షం కురిసిందని పర్వతగిరి, నెక్కొండ,వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో అత్యధికం గా వర్షం కురిసిందని, పర్వత గిరి లో కొన్ని చెరువుకు లకు గండ్లు పడ్డాయని విద్యుత్ సరఫరా లో అంతరాయాలు ఏర్పడ్డాయని, ఎన్ పి డి సి ఎల్ నుండి సిఎండి పర్యవేక్షించి తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాయపర్తి మండలం లో కట్ట తెగడం వల్ల సుమారు 50 ఇండ్లు ప్రభావితం అయ్యాయని, పంట పొలాల్లోకి నీరు చేరడం జరిగిందని వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు. వర్షం నిలిచిపోయినప్పటికి నగరంలో కొన్ని కాలనీలు ఇంకా నీటి లోనే ఉన్నాయని ముంపు ను అరికట్టగలిగితే రాబోయే 12 నుండి 16 గం.లలో నీరు పూర్తి గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని ఎస్ ఆర్ నగర్లో వృద్ధుడు ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడు వృద్ధాప్య కారణంతో మృతి చెందినట్లు తెలిసిందని, సమగ్ర సమాచారం అందాల్సి ఉందని తెలిపారు. వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణి కార్పొరేటర్ పల్లం పద్మ రవి, డిఎఓ అనురాధ, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, సంబంధిత శాఖల అధికారులు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
Jagan’s Return After Cyclone Sparks Criticism and Disappointment
YS Jagan Mohan Reddy’s return to Vijayawada after spending several days in Bengaluru has drawn widespread criticism and disappointment. As Andhra Pradesh faced the recent cyclone, the former Chief Minister’s absence from the state raised serious questions about his leadership and priorities. Even before the cyclone warning was announced, Jagan had already been in Bengaluru. […] The post Jagan’s Return After Cyclone Sparks Criticism and Disappointment appeared first on Telugu360 .
జిన్పింగ్తో ట్రంప్ భేటీ... చైనాపై టారిఫ్లు తగ్గింపు
ఎబోర్డ్ ఎయిర్ఫోర్స్ వన్ : అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో ట్రంప్, జిన్పింగ్ దక్షిణ కొరియాలో భేటీ కావడం కీలక పరిణామం. జిన్పింగ్తో ట్రంప్ భేటీకి దక్షిణ కొరియాలోని బూసాన్ నగరంలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు వేదికైంది. ఈ సందర్భంగా అనేక కీలక అంశాలపై వీరు చర్చించారు. జిన్పింగ్తో భేతీ తరువాత చైనాపై విధించిన టారిఫ్లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు ఎబోర్డ్ ఎయిర్ ఫోర్స్ వద్ద విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ఫెంటనిల్ విక్రయిస్తుందని అపరాధం కింద చైనాపై విధించిన 20 శాతం సుంకాలను 10 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల చైనాపై సుంకాల రేటు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గుతుంది. జిన్పింగ్తో భేటీ అద్భుతంగా జరిగిందని తెలిపారు. అమెరికా నుంచి సొయబీన్ చైనా తిరిగి కొనుగోలు చేయడానికి, అరుదైన ఖనిజాల ఎగుమతికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్టు ప్రకటించారు. అత్యంత ఆధునిక కంప్యూటర్ చిప్స్ చైనాకు ఎగుమతిపై కూడా చర్చించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ప్రశంసిస్తూ ఆయన గొప్పనేత అని, ఆయనకు 10 కి 12 మార్కులు ఇస్తానని వ్యాఖ్యానించారు.దక్షిణ కొరియాలోని బుసాన్లో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు వేదికగా దాదాపు 100 నిమిషాల పాటు ఇరువురు నేతలు చర్చించారు. తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతికతల వృద్ధి, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వంటి ప్రపంచ సమస్యలపై చర్చించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో చైనాలో తాను పర్యటిస్తానని, ఆ తర్వాత జిన్పింగ్ కూడా అమెరికా వస్తారని ట్రంప్ చెప్పారు. అణుపరీక్షలు తిరిగి ప్రారంభించాలి: ట్రంప్ ఆదేశం అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ను ఆదేశించినట్టు ట్రంప్ వెల్లడించారు. రష్యా, చైనా తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు ప్రాథాన్యం సంతరించుకున్నాయి. ఈమేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. “ ప్రపంచంలో ఇతర దేశాల కంటే యూఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉంది. నా మొదటి పదవీ కాలం లోనే దీన్ని సాధించాం. దీనికి విపరీతమైన విధ్వంసక శక్తి ఉన్నందున నేను ఇది చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు వేరే మార్గం లేదు. అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. ఐదేళ్ల లోపు అవి సమానంగ ఉంటాయి. ఇతర దేశాల్లో దీని కార్యక్రమాలు విస్తరిస్తున్నందున మన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని నేను యుద్ధశాఖను ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది ” అని ట్రంప్ రాసుకొచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపులో భారత్ “వెరీ గుడ్” రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపులో భారత్ ‘ వెరీగుడ్’ అని ట్రంప్ కితాబు ఇచ్చారు. భారత్ మరింత తగ్గిస్తుందని ఆయన చెప్పారు. దక్షిణ కొరియాలో ఆన్బోర్డ్ ఎయిర్ఫోర్స్ వన్లో విలేకరులు అడగ్గా ఈ విషయం చెప్పారు. రష్యా నుంచి చాలా కాలంగా బారత్ చమురు కొనుగోలు చేస్తోందని , కానీ వాస్తవానికి చమురు గురించి తాము మాట్లాడడం లేదని, యుద్ధం ముగింపు జరిగితే కలిసి పనిచేస్తామని చర్చించుకున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా చమురు కొనుగోలు రష్యా నుంచి తగ్గిస్తామని భారత్ చెబుతోందని పేర్కొన్నారు.
తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడాయో కాన్ఫరెస్స్ లో రేవంత్ రెడ్డి
వ్యక్తి ఆత్మహత్య.. దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలంలోని గూడెం
అవసరమైన చోట తక్షణ సాయం.. ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరంలో
అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి..
అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.. జైనూర్, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి సాగు
రోడ్డు ప్రమాదంలో 16 మంది సిక్కోలు క్షతగాత్రులు .. కేంద్ర మంత్రి పరామర్శ
రోడ్డు ప్రమాదంలో 16 మంది సిక్కోలు క్షతగాత్రులు .. కేంద్ర మంత్రి పరామర్శ
ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తం
ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తం కంచికచర్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రాంతంలో కురిసిన
What’s Happening with Vishal? Another Film Shoot Comes to a Halt!
Actor Vishal seems to be caught in yet another controversy in Kollywood. The shoot of his upcoming film has reportedly been stopped by the Directors’ Association and FEFSI (Film Employees Federation of South India) following a dispute with director Ravi Arasu. According to reports, Vishal allegedly removed Ravi Arasu from the project midway, leading to […] The post What’s Happening with Vishal? Another Film Shoot Comes to a Halt! appeared first on Telugu360 .
అల్వాల్ పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఓయో రూమ్స్పై పోలీసులు ఆకస్మిక
Allu Sirish–Nayanika Engagement to Be a Mega Family Affair
The Mega family is gearing up for yet another grand celebration as actor Allu Sirish is set to get engaged to Nayanika. The engagement ceremony will take place tomorrow evening, marking a beautiful new start in the Allu family. According to sources, the event will be a private family affair, attended by some of the […] The post Allu Sirish–Nayanika Engagement to Be a Mega Family Affair appeared first on Telugu360 .
హైదరాబాద్, ఆంధ్రప్రభ : గౌతమ్ నగర్, మల్లికార్జున నగర్ ప్రధాన రహదారికి ఆనుకుని
ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...హకీంపేటకు చెందిన మహ్మద్ ముజామిల్ అలియాస్ ఆయూబ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయూబ్ను హత్య చేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టోలీచౌకి పోలీసులు తెలిపారు.
నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..
నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్.. అచ్చంపేట, ఆంధ్రప్రభ : గత రెండు రోజులుగా ఎడతెరిపి
ఆస్ట్రేలియా ఆలౌట్.. టీమిండియకు భారీ టార్గెట్
మహిళల ప్రపంచకప్ 2025 భాగంగా భారత్ జట్టుతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా టీమిండియాకు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్ లిచ్ఫీల్డ్(119) మెరుపు శతకంతో చెలరేగింది. మరో ఓపెనర్ అలీసా హీలీ (5) త్వరగా ఔటైనా.. వన్ డౌన్ లో వచ్చిన ఎలీస్ పెర్రీతో కలిసి లిచ్ఫీల్డ్ భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కేవలం 77 బంతుల్లోనే శతకం సాధించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 133 బంతుల్లో155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న లిచ్ఫీల్డ్, అమన్జోత్ కౌర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. తర్వాత అర్థశతకం పూర్తి చేసుకున్న పెర్రీ 77 పరుగుల వద్ద ఔటైంది. అనంతరం ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే, చివర్లో ఆష్లీన్ గార్డ్నర్ ధనాధన్ ఇన్నింగ్స్ తో చెలరేగింది. భారీ బౌండరీలతో దూకుడుగా ఆడిన ఆష్లీన్ 45 బంతుల్లోనే 65 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో శ్రీచరణీ, దీప్తి శర్మలు చెరె రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్, క్రాంతి గౌడ్, రాధ యాదవ్ లు తలో వికెట్ పడగొట్టారు.
జలదిగ్బంధంలో ఏడుపాయల వన దుర్గభవాని ఆలయం
మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు ప్రాజెక్టులోకి భారీ వరద మొంథా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సింగూరు ప్రాజెక్టులోకి ఏకంగా 26,313 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దిగువకు నీటి విడుదలతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు నుండి దిగువకు 21,935 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సింగూరు నుండి నీటి విడుదలతో వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లింది. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో, నది నీరు ఏకంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రవేశించింది. భక్తుల రక్షణే ప్రధానం: ఆలయ అధికారులు భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ ఈవో చంద్రశేఖర్ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆలయం తాత్కాలిక మూసివేత వరద ఉధృతి నేపథ్యంలో ప్రధాన ఆలయాన్ని మూసివేశారు. భక్తుల దర్శనార్థం వన దుర్గ భవాని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం ముందున్న రాజగోపురంలో ఏర్పాటు చేశారు. రాజగోపురం నుండే దర్శనం భక్తులకు ఇక్కడి నుండే అమ్మవారి దర్శనాలను కల్పిస్తున్నారు. వరద తీవ్రత దృష్ట్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మంజీరా పరివాహక ప్రాంతాలకు భక్తులు లేదా ఇతరులు వెళ్లకుండా ఆ ప్రాంతంలో పోలీస్ బందోబస్తును పటిష్టం చేశారు.
పెంటపాడులో ప్రారంభించిన భీమవరం కలెక్టర్
పెంటపాడులో ప్రారంభించిన భీమవరం కలెక్టర్ భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లాలో
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే గ్యారంటీలు అమలవుతాయి:కెటిఆర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ మేరకు కెటిఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతున్నదని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేస్తుందని అన్నారు. అందుకే కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సరైన వేదిక అని పేర్కొన్నారు.
చిన్నపిల్లల కిడ్నాపర్ రోహిత్ ఎన్కౌంటర్..
ముంబైలో కిడ్నాపైన 20 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా కాపాడు. చిన్నారులను రక్షించే ప్రయత్నంలో కిడ్నాపర్ రోహిత్ ఆర్యను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గురువారం (అక్టోబర్ 30) ముంబైలోని పోవై ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో కిడ్నాపర్ రోహిత్ చాలా మంది పిల్లలను బందించాడు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగి చిన్నారులకు కాపాడారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులను కాపాడేందుకు ఆర్ఏ స్టూడియోలోకి పోలీసులు బాత్రూమ్ డోర్ నుంచి ప్రవేశించారు. అయితే, నిందితుడి వద్ద ఎయిర్ గన్ తోపాటు పలు రసాయన పదార్థాలు ఉన్నాయి. పోలీసులు పదేపదే లొంగిపోవాలని కోరారు. కానీ నిందితుడు అంగీకరించలేదు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి దిగజారడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో ఆర్యకు తుపాకీ గాయం అయింది. దీంతో అతన్ని వెంటనే చికిత్స కోసం జోగేశ్వరి ట్రామా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ కిడ్నాపర్ రోహిత్ మరణించాడు. తర్వాత పిల్లలందరినీ స్టూడియో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు.
పతనావస్థలో బంగారం ధర.. వారం రోజుల్లో రూ.12,062 తగ్గుదల
పతనావస్థలో బంగారం ధర.. వారం రోజుల్లో రూ.12,062 తగ్గుదల ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్
శివ – నటీనటులు.. అప్పుడు – ఇప్పుడు
రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా లోకంలో అడుగుపెట్టినప్పుడు, ఆయన తొలి చిత్రంతోనే..
ముస్కీ చెరువు అభివృద్ధిలో… మణికొండ: ముస్కీ చెరువు అభివృద్ధిలో మరో కీలక మైలురాయి
Mumbai : ముంబయిలో చిన్నారుల కిడ్నాపర్ హతం
ముంబయి లో చిన్నారులను కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్య మరణించాడు. పోలీసు కాల్పుల్లో రోహిత్ ఆర్య మృతి చెందాడు
సర్వే నివేదిక వెంటనే ఇవ్వాలి..
సర్వే నివేదిక వెంటనే ఇవ్వాలి.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో మెంథా
EV ఛార్జింగ్ సమీకృత మొబిలిటి కేంద్రాన్ని ప్రారంభించిన జియో-బిపి
బెంగళూరు: బెంగళూరులోని దేవనహళ్లిలో రిటైల్ అవుట్ లెట్ లో 28 EV ఛార్జింగ్ పాయింట్లతో భారతదేశంలో మొదటి మరియు అతి పెద్ద సమీకృత మొబిలిటీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జియో-బిపి ఈరోజు ప్రకటించింది. ఇది దేశం పరిశుభ్రమైన మరియు స్మార్ట్ ప్రయాణం దిశగా దేశం యొక్క పరివర్తనలో ఒక ప్రధానమైన మైలురాయిని సూచిస్తుంది. దేవనహళ్లి అవుట్ లెట్ బహుళ-ఇంధనం రిటైల్ సైట్. ఇది పెట్రోలు, డీజిల్, CNGని అందిస్తుంది మరియు వైల్డ్ బీన్ కేఫ్. ఇది ఇప్పుడు ఆధునిక EV ఛార్జింగ్ వేదికను చేర్చింది, 360kW వరకు పంపిణీ చేసే 28 ఛార్జింగ్ పాయింట్లతో అత్యంత వేగవంతమైన DC ఛార్జర్స్ ను కలిగి ఉంది. ఈ ఫ్లాగ్ షిప్ గమ్యస్థానం ఇంధనం, CNG, EV, రిటైల్, మరియు కేఫ్ అనుభవాలను ఒకే చోటకు తెచ్చింది, కస్టమర్లు మరియు ప్రయాణికులకు ఒకే విధంగా సౌకర్యాన్ని పునర్నిర్వచిస్తోంది. జియో-బిపి ఛైర్మన్ సార్థక్ బెహూరియా మాట్లాడుతూ..“భారతదేశంలో సమీకృత ప్రయాణం యొక్క భవిష్యత్తు కోసం దేవనహళ్లి మొబిలిటి స్టేషన్ మా కలకు ఉదాహరణగా నిలిచింది. ఆధునిక EV ఛార్జింగ్ టెక్నాలజీని మా ఇప్పటికే ఉన్న రిటైల్ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా, మేము కస్టమర్లకు సౌకర్యం, అందుబాటులో ఉంచడం మెరుగుపరుస్తూనే భారతదేశం తక్కువ కార్బన్ రవాణా పరివర్తనను మద్దతు చేస్తున్నాం. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న ఈ కేంద్రం, EV యజమానులకు మరియు బెంగళూరులో మరియు చుట్టుప్రక్కల ఉన్న ఫ్లీట్స్ కోసం వేగంగా ఛార్జీ చేసుకోవడానికి, ప్రశాంతత పొందడానికి మరియు ఆత్మవిశ్వాసంతో తమ ప్రయాణాలను కొనసాగించడానికి సదుపాయం కల్పించింది” అన్నారు. కెంపెగూడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కీలకంగా ఏర్పాటైన ఈ స్టేషన్ ప్రైవేట్ మరియు వాణిజ్య EV యూజర్లకు సేవలు అందిస్తుంది, వేగవంతమైన మరియు సమర్థవంతమైన ఛార్జింగ్ ను కేటాయిస్తుంది. ఇంధనం భర్తీ చేయడం, షాపింగ్, వైల్డ్ బీన్ కేఫ్ వంటి సదుపాయాలు ద్వారా సౌకర్యం మరియు పరిచయాన్ని నిర్థారిస్తుంది. కస్టమర్లు కాఫీతో ప్రశాంతతను పొందవచ్చు, అవసరమైన వాటిని కొనుగోలు చేయవచ్చు, లేదా తమ వాహనాలను ఛార్జీ చేసుకునే సమయంలో స్వల్ప విరామం తీసుకోవచ్చు- ఇంధనం భర్తీ సమయాన్ని సౌలభ్యం మరియు ఆనందంగా మార్చుకోవచ్చు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మౌళికసదుపాయంతో రూపొందించబడిన ఈ వేదిక విస్తృత శ్రేణి EV మోడల్స్ కు మద్దతునిస్తుంది మరియు భారతదేశంలో వేగంగా పెరుగుతున్న EV వినియోగాన్ని నెరవేరుస్తుంది. కీలకమైన ప్రధానాంశాలు ü సమీకృత ఇంధనం, CNG, EV, రిటైల్ మరియు కేఫ్ అనుభవం ü మొత్తం 28 ఛార్జ్ పాయింట్లతో 360kWవరకు అత్యంత వేగవంతమైన ఛార్జర్లు పంపిణీ చేస్తాయి ü వ్యక్తిగత మరియు ఫ్లీట్ EVలు రెండిటిని మద్దతు చేసే భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే డిజైన్ ü జియో-బీపీ వ్యవస్థలో రెడీమ్ చేసుకోదగిన లాయల్టీ రివార్డ్స్ ద్వారా కస్టమర్ కు సంతృప్తి ఈ తొలి కార్యక్రమం సుస్థిరమైన మరియు సమీకృత ప్రయాణంలో జియో-బీపీ యొక్క నాయకత్వాన్ని శక్తివంతం చేస్తోంది. వేగం, నమ్మకం మరియు కస్టమర్ సౌకర్యాన్ని కలపడం ద్వారా, దేవనహళ్లీ కేంద్రం రేంజ్ ఆందోళనను నిర్మూలిస్తోంది మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీని ఆత్మవిశ్వాసంతో అనుసరించడానికి కస్టమర్లకు సాధికారత కల్పిస్తోంది. ఆవిష్కరణ, సుస్థిరత మరియు కస్టమర్ కు ప్రాధాన్యతనిచ్చే డిజైన్ కు జియో-బీపీ యొక్క నిబద్ధతను ఈ సదుపాయం మరింత శక్తివంతం చేసింది, భారతదేశం తమ ప్రయాణాలను తరలించి, శక్తివంతం చేయడానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. కీలకమైన పట్టణాల్లో 32 ఆపరేషనల్ వేదికలు సహా సుమారు 1000 ప్రదేశాల్లో సుమారు 7000 ఛార్జింగ్ పాయింట్లతో, జియో-బీపీ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే వేగవంతమైన ఛార్జింగ్ కోసం వేగంగా తమ ఉనికిని విస్తరిస్తోంది. 480 kW వరకు అత్యంత వేగవంతమైన ఛార్జర్లతో మరియు పరిశ్రమలో అగ్రగామి 96%+ అప్ టైమ్ ను నిర్వహిస్తోంది, ఈ సైట్స్ ఉపయోగానికి మించిన లక్ష్యంతో రూపొందించబడ్డాయి, మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కేఫ్ లు మరియు విశ్రాంతి జోన్లు వంటి ప్రీమియం సదుపాయాలను అందిస్తున్నాయి.
ద్విచక్ర వాహనాల కేసులో నిందితులు అరెస్ట్..
11 బైకులు స్వాధీనం…. విశాలాంధ్ర – హిందూపురం : ఎస్పీ సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, హిందూపురం డి.ఎస్.పి కె.వి. మహేష్ గారి పర్యవేక్షణలో, హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజినేయులు తోపాటు సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా, ద్విచక్ర దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మొత్తం 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పి కె.వి మహేష్ మాట్లాడుతూ, తూముకుంట చెకపోస్ట్ వద్ద సీఐ. […] The post ద్విచక్ర వాహనాల కేసులో నిందితులు అరెస్ట్.. appeared first on Visalaandhra .
komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారా? అందులో నిజమెంత?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ లోని ఒక వర్గం నేతలు ప్రచారాన్ని మొదలు పెట్టారు
ప్రపంచకప్ సెమీస్.. భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా
మహిళల ప్రపంచకప్ 2025 భాగంగా సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ లిచ్ఫీల్డ్(119) మెరుపుతో శతకంతో చెలరేగింది. మరో ఓపెనర్ అలీసా హీలీ (5) త్వరగా ఔటైనా.. వన్ డౌన్ లో వచ్చిన ఎలీస్ పెర్రీతో కలిసి లిచ్ఫీల్డ్ భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కేవలం 133 బంతుల్లో155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత అమన్జోత్ కౌర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బెత్ మూనీ వేగంగా ఆడుతూ.. వ్యక్తిగత స్కోరు 24 వద్ద శ్రీచరణి బౌలింగ్లో ఔటైంది. దీంతో ఆస్ట్రేలియా జోరుకు కొంత బ్రేక్ పడింది. మరోవైపు పెర్రీ ఆచితూచి ఆడుతూ అర్ధశతకాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 38 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. క్రీజులో ఎలీస్ పెర్రీ(69), ఆష్లీన్ గార్డ్నర్ (3)లు ఉన్నారు. భారత బౌలర్లలో శ్రీచరణీ రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్, క్రాంతి గౌడ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
Sabarimala : అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్
శబరిమలకు వెళ్లే భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది
India : బ్యాంకు ఖాతాలున్నాయా? అయితే మీకు అలెర్ట్
బ్యాంకుల్లో నవంబరు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
పరిహారం అందేలా నివేదిక… దేవరకొండ, ఆంధ్రప్రభ : తుఫాన్కు నష్టపోయిన రైతులకు నష్ట
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని హనుమాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్ ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఆదోని ఏఎంవిఐ ఆవేష్ ఖాన్ లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తే […] The post ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – రోలుగుంట: రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ కె.వీరజ్యోతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందిస్తున్న ఆరోగ్య సేవలను పరిశీలించి, సిబ్బంది హాజరు రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. తుఫాను కారణంగా సేవల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడిందా సమాచారం తెలుసుకొని, వాక్సినేషన్ గదులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అంశాలను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రజలు మరిగించిన నీరు తాగాలి, తాజా ఆహారం తీసుకోవాలి, […] The post పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ appeared first on Visalaandhra .
పార్టీ మారుతున్నానని నాపై కావాలని దుష్ప్రచారం
పార్టీ మారుతున్నానని నాపై కావాలని దుష్ప్రచారం నేను క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తను,
ఇంటింటి ప్రచారం.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో దివంగత
Mallu Bhatti Vikramarka : అజారుద్దీన్ కు మంత్రి పదవి రాకుండా కుట్ర
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీజేపీ పై మండిపడ్డారు.
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పంగ హనుమంతు తమ పశువుల సంరక్షణ కోసం గోకులం షెడ్డును మంజూరు చేయాలని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు గోకులం షెడ్డు మంజూరు చేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ విజయం కోసం తాను సైనికుడిలా పని చేశానని, అయినా గోకులం షెడ్డు […] The post గోకులం షెడ్డును మంజూరు చేయండి appeared first on Visalaandhra .
రిటైర్మెంట్ తీసుకోను.. చివరి శ్వాస వరకూ సెట్లోనే#TeluguPost #telugu #post #news
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి..
సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతో తమ పనుల నిమిత్తం సచివాలయాలకు వస్తున్న ప్రజలు సకాలంలో తమ పనులు జరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు, ఈ సందర్భంగా శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు తమ వివిధ పనుల నిమిత్తమై మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా ప్రభుత్వ సేవలను గ్రామాల్లోనే […] The post సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి.. appeared first on Visalaandhra .
బూర్గంపాడు, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ): విద్యార్థినీలు తమ లక్ష్యాలను సమయస్ఫూర్తితో సాధించాలి అని
బూర్గంపాడు, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ): విద్యార్థినీలు తమ లక్ష్యాలను సమయస్ఫూర్తితో సాధించాలి అని
కేబినెట్ లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలి: భట్టి
హైదరాబాద్: దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారుడు.. ముహమ్మద్ అజారుద్దీన్ అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవద్దని లేఖలు రాస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ బిడ్డ.. మన కీర్తిపతాకాలను రెపరెపలాడించిన వ్యక్తి అని దేశ రాశారని ఔన్నత్యాన్ని ప్రపంచపటంలో నిలబెట్టిన వ్యక్తి అజారుద్దీన్ అని ప్రశంసించారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలని సూచించారు. బిఆర్ఎస్ ను గెలిపించడంలో భాగంగానే బిజెపి నేతలు లేఖలు రాశారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి బిఆర్ఎస్ పార్టీ సహకరించిందని భట్టి మండిపడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిజెపి బలహీన వ్యక్తిని నిలబెట్టారని, అజారుద్దీన్ కు కేబినెట్ లో స్థానం కల్పించవద్దనే కుట్ర కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోకుండా గవర్నర్ పైనా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోందని, గవర్నర్ గొప్ప వ్యక్తి.. ఇలాంటి ఒత్తిళ్లకు లొంగరని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మంత్రి పయ్యావుల కేశవ్ కు విజ్ఞప్తి విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ నియోజకవర్గంలో అధిక వర్షాలు వల్ల రైతులు సాగుచేసిన వివిధ రకాల పంటలు తీవ్రంగా నష్టపోయాయని సాగు చేసి నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు సిపిఎం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం మంత్రి ఉరవకొండలో పర్యటించిన సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఆయనను కలిసి పలు సమస్యలపై మెమోరాన్ని […] The post అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి appeared first on Visalaandhra .
ప్రకాశం బ్యారేజీకి తప్పిన ముప్పు…
ప్రకాశం బ్యారేజీకి తప్పిన ముప్పు… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ప్రకాశం బ్యారేజ్
నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ #telugu #post #news
Rage of Kaantha: Rebellious and Fierce Anthem
Dulquer Salmaan is one of the most sought after stars in Indian Cinema with his penchant to deliver unique films and scripts that present him in a new style. He is starring in peiod drama thriller, Kaantha, based on 1950’s stars in Indian Cinema. Selvamani Selvaraj is directing the film. With songs, glimpse, teaser and […] The post Rage of Kaantha: Rebellious and Fierce Anthem appeared first on Telugu360 .
రైతులను ఆదుకునేలా చర్యలు భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పంట నష్టం అంచనాలను
మరోసారి బిగ్ స్క్రీన్ పై ఆనాటి మ్యాజిక్ !!
తెలుగు సినిమా నడతను మార్చిన సంచలన చిత్రం శివ. ఈ చిత్రంలో టాలీవుడ్
గ్రంథాలయ సెస్ బకాయిలు చెల్లించుకునే విధంగా కృషి చేయండి
గ్రంథాలయ శాఖ ముఖ్య కార్యదర్శి రమావిశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయ సెస్ బకాయిలు చెల్లించుకునే విధంగా కృషి చేయాలని గ్రంధాలయ శాఖ ముఖ్య కార్యదర్శి పి.రమా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌరశాక గ్రంథాలయాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను వారు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కాసేపు పాఠకులతో గ్రంథాలయం అందిస్తున్న సేవలు గూర్చి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠకుల […] The post గ్రంథాలయ సెస్ బకాయిలు చెల్లించుకునే విధంగా కృషి చేయండి appeared first on Visalaandhra .
Fact Check: Viral video claiming to show a pig roaming near school is not from Araku, Andhra Pradesh
Viral video claiming to show a pig roaming near school in Araku, Andhra Pradesh is old. It’s from Telangana.
డీప్ ఫేక్ టెక్నాలజీతో కొత్తరకం మోసాలు: ప్రముఖుల నకిలీ వీడియోలతో ప్రజల సొమ్ము దోపిడీ| Deepfake Scams
సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు! #maheshbabu #janhviswaroop #tollywoodnews #telugupost
గొట్లూరు గ్రామంలో ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం
ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి. గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులతో ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో గొట్లూరు గ్రామంలోని సచివాలయంలో ఎన్. ఎస్. ఎస్. ప్రత్యేక శిబిరం మొదటి రోజు ప్రారంభ కార్యక్రమము నిర్వహించామని ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. బి. గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 29 అక్టోబర్ […] The post గొట్లూరు గ్రామంలో ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం appeared first on Visalaandhra .
రాష్ట్ర అసెంబ్లీకి బిఎస్ఆర్ విద్యార్థి ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం; రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, ఎలాక్యూషన్ , క్విజ్ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లోని సంజయ్ నగర్ లో గల బిఎస్ఆర్ బి ఎస్ ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి. జస్వంత్ విజయం సాధించి, రాష్ట్ర అసెంబ్లీకి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 26వ తేదీ అమరావతిలో జరిగే […] The post రాష్ట్ర అసెంబ్లీకి బిఎస్ఆర్ విద్యార్థి ఎంపిక appeared first on Visalaandhra .
తుఫాను బాధితులను ఆదుకోవాలి.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను సృష్టించిన
క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన గొట్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఎస్ జి ఎఫ్ డివిజన్ స్థాయి పోటీలలో గొట్లూరు గ్రామం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని హెడ్మాస్టర్ జగన్నాథం తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ జగన్నాథము పిడిఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఈనెల 20 ఏడవ తేదీన ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఎస్జిఎఫ్ మండల స్థాయి పోటీలలో మా విద్యార్థులు డివిజన్ స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులలో 200 మీటర్లు […] The post క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన గొట్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు appeared first on Visalaandhra .
ఆర్యవైశ్యుల అభివృద్ధే లక్ష్యం తాడేపల్లి, ఆంధ్రప్రభ : అన్ని రంగాల్లో ఆర్యవైశ్యుల అభివృద్ధే
రైతులకు ఆపారనష్టం గీసుగొండ, ఆంధ్రప్రభ : అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది.

24 C