SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

19    C
... ...View News by News Source

సోమవారం రాశి ఫలాలు (09-02-2026)

మేషం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మిధునం ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తిఅధికమౌతాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటకం ఇంటాబయట మానసిక ఒత్తిడులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు ఫలించవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సింహం అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. కన్య ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. తుల సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వృశ్చికం ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ధనస్సు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. మకరం ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుంభం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. మీనం నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.    

మన తెలంగాణ 9 Feb 2026 12:00 am

దిగొచ్చిన చికెన్, మటన్ ధరలు.. అందుబాటులోకి కోడిగుడ్ల ధరలు

మన తెలంగాణ/హైదరాబాద్ : పండుగల సీజన్, మేడారం జాతర దరిమిలా చికెన్ ధరలు కొండెక్కగా ప్రస్తుతం పండుగ సీజన్ ముగియడంతో ధరలు దిగొచ్చాయి. గతేడాది డిసెంబర్‌లో క్రిస్మస్ ఉండటం, ఆ తర్వాత కొత్త ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ రావడం, మేడారం జాతర జరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కేజీ చికెన్ రూ.350 వరకు వరకు పలికింది. మెల్లమెల్లగా ధరలు తగ్గుతుండటంతో నాన్ వెజ్ ప్రియులు ఉపశమనం పొందుతున్నారు. ఆదివారం సెలవు కాకడంతో చికెన్ తినేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తారు. ధరలు తగ్గడం వీరికి ఊరటనిస్తోంది. ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 240 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఇక డ్రెస్‌డ్ చికెన్ కిలో రూ.220 నుంచి రూ.230 వరకు ఉండగా లైవ్ చికెన్ రూ.118 నుంచి రూ.120కే లభిస్తుంది. మేడారం జాతర సమయంలో డిమాండ్ కారణంగా స్కిన్‌లెస్ చికెన్ రూ.350 నుంచి రూ.380 వరకు కూడా వ్యాపారులు విక్రయించారు. ఇక డ్రెస్‌డ్ చికెన్‌ను రూ.350కు, లైవ్ కోడిని రూ.200 వరకు విక్రయించారు. జాతర ముగిసిన తర్వాత చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే రూ.100 తగ్గడంతో నాన్‌వెజ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్ ముగియడంతో కోళ్లకు డిమాండ్ పడిపోయిందని, ధరలు తగ్గడానికి ఇదే కారణమని వ్యాపారుల చెబుతున్నా రు. అలాగే కోళ్ల ఉత్పత్తి కూడా పెరగడం వల్ల ధరలు పడిపోతున్నాయని అంటున్నారు. కోళ్ల ఫామ్స్‌లో ఉత్పత్తి పెరగడం, డిమాండ్ లేకపోవడంతో తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. అందుబాటులోకి కోడిగుడ్డు ధరలు ఇక చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. గత నెలలో ఏకంగా ఒక్కో కోడిగుడ్డు ధర రూ.10కు చేరుకుంది. రిటైల్ షాపుల్లో రూ.10కి విక్రయించారు. ఇప్పుడు కేవలం ఒక్కో గుడ్డు రూ.6కే షాపుల్లో అమ్ముతున్నారు. కోడిగుడ్ల ధరలు కూడా ఒకేసారి తగ్గినట్లైంది.. అటు మటన్ ధరలు కూడా పండుగ తర్వాత తగ్గాయి. పండుగ సమయంలో రూ.1500 వరకు పలకగా ఇప్పుడు రూ.800కే లభిస్తుండటం గమనార్హం.

మన తెలంగాణ 8 Feb 2026 10:00 pm

యూరియాపై బిఆర్‌ఎస్ బూటకపు మాటలు: మంత్రి తుమ్మల

మన తెలంగాణ/హైదరాబాద్ : యూరియా కోసం రైతులు క్యూ లైన్లో ఉన్నారని పదే పదే బిఆర్‌ఎస్ చేస్తోన్న బూటకపు ప్రచారాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. రైతులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళలో ఏ విధంగా గోస పెట్టారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ప్రజలు గ్రహించారని చెప్పారు. -సిద్దిపేట, గజ్వెల్ లో ఎరువుల కోసం క్యూ లైన్లు ఉన్న సందర్భాలు, క్యూ లైన్లలో రైతులు మరణించిన సందర్భాలు మరిచి ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల సాంకేతిక సమస్యలతో ఏర్పడ్డ రద్దీని కూడా రాజకీయంగా వాడుకొనే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. రైతులు కొనుగోలు చేయకుండానే 7.60 లక్షల టన్నుల యూరియా ఈ యాసంగిలో అమ్ముడుపోయాయా? అని నిలదీశారు. వరి వేస్తే ఉరి అన్న బిఆర్‌ఎస్ నాయకులకు వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా..? అని ప్రశ్నించారు. గత వానాకాలం కేంద్ర నుండి తగిన సమయంలో ఎరువులు అందక కొన్ని రోజులు పడిన ఇబ్బందులను రాజకీయ లబ్ధికోసం వాడుకున్నప్పటికి పంచాయతీ ఎన్నికలలో రైతులు కర్రుకాల్చి వాత పెట్టారని మంత్రి విమర్శించారు. యూరియా యాసంగి మొత్తానికి 10.40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరముంటే ఇప్పటికే 8.42 లక్షల మెట్రిక్ టన్నులు తెప్పించగా 7.60 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు అందించామని మంత్రి తెలియజేశారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న నాయకులకు ఎరువుల విక్రయాలు ఈపాస్ మిషన్‌ల ద్వారా జరుగుతాయన్న విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. వానాకాలం పత్తి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ విజయవంతం కావడంతో, అదే ప్రాతిపదికన యూరియా యాప్ ను తీసుకువచ్చి పరిశీలిస్తుంటే బిఆర్‌ఎస్ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏంటో వారికే తెలియాలన్నారు. యాప్ ద్వారా 22 జిల్లాల రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే 2.64 కోట్ల బస్తాల యూరియాను కొనుగోలు చేసినట్లు చెప్పారు. యూరియా అంటే తెలియని కొంతమంది బిఆర్‌ఎస్ నాయకులు కూడా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా రైతుల సౌకర్యార్థం ఒక యాప్ తీసుకొస్తే ఊరారా తిరిగి దాని మీదా లేని పోని అపోహాలు సృష్టించినా రైతులు వారిని నమ్మలేదని చెప్పారు. ప్రాసలతో కల్లబొల్లి మాటలు చెప్పినా, ఎల్లకాలం నమ్మరన్న విషయాన్ని బిఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికీ గ్రహించినట్లు లేరని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై రైతులకు పూర్తి నమ్మకముందని, రైతుభరోసా, రైతు భీమా, పంటల కొనుగోళ్లు, బోనస్, పంటనష్ట పరిహారం, యాంత్రీకరణ ఇలా ఏ పథకం చూసినా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకొన్నట్లు మంత్రి వెల్లడించారు.

మన తెలంగాణ 8 Feb 2026 9:50 pm

Award l భారతీయ ప్రొఫసర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు

Award l భారతీయ ప్రొఫసర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు Award l

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:46 pm

Sunitha l ఆలేరు 8వ వార్డులో గొంగిడి సునీత ప్రచారం..

Sunitha l ఆలేరు 8వ వార్డులో గొంగిడి సునీత ప్రచారం.. Sunitha l

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:41 pm

మున్సిపల్ ఎన్నికలలో బీసీల ఓటు బీసీలకే: జాజుల

జనరల్ స్థానాలంటే రెడ్డి, రావులవి కావు జనరల్ బరిలో ఉన్న బీసీలను పార్టీలకతీతంగా గెలిపించాలి బీసీలను గెలిపించడం బీసీల రాజకీయ ఐక్యతకు నిదర్శనం బీసీలకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 11న తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో రాజకీయ పార్టీలకతీతంగా జనరల్ స్థానాలలో ఎన్నికల బరిలో నిలబడిన బీసీలను గెలిపించాలని బీసీ జేఏసీ నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నగరంలోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ అధ్యక్షతన, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామి సమన్వయంతో ఆదివారం జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలలో మూడు కార్పొరేషన్‌లలో జరుగుతున్న ఎన్నికలలో ‘ఓటు మనదే సీటు మనదే, బీసీల ఓటు బీసీల’కే అనే నినాదంతో బీసీ ప్రజలు రాజకీయ పార్టీలకతీతంగా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బీసీ బిడ్డలను గెలిపించి రాష్ట్రంలో బీసీల రాజకీయ ఐక్యతను, సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించాలని బీసీలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌లు అమలవుతుండగా, పది శాతం ఉన్న అగ్రకులాలు 50 శాతం జనరల్ స్థానాలలో పోటీ చేస్తున్నారని, జనరల్ స్థానాలు అంటే రెడ్డి, రావులవి కావని ఆయన అన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు 28 శాతమే రిజర్వేషన్లు కల్పించారని, రిజర్వేషన్లు లేని చోట జనరల్ స్థానాలలో నిలబడిన బీసీలను గెలిపించడం ద్వారా బీసీలకు రాజకీయంగా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల మారిగానే ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా బీసీలు ఓటు అనే ఆయుధంతో అగ్రకులాలను ఓడించి తెలంగాణలో బీసీ రాజ్యాధికారానికి పునాదులు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు లేవని ఒకవేళ సిద్ధాంతాలు ఉంటే నైతిక విలువలతో ఏ పార్టీకి ఆ పార్టీ ఇతరులతో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసేవని అన్నారు. కానీ నేడు విచిత్రంగా బద్ధ విరోధులమని చెప్పుకునే పార్టీలు అపవిత్ర, అక్రమ పొత్తులతో గెలవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, జేఏసీ నేతలు మాదేశి రాజేందర్ గంగపుత్ర, గజ్జల సత్యరాజ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మహేష్ మేరు, నయనంపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 8 Feb 2026 9:39 pm

Congress l సొంత నిధులతో పేదలకు సహాయం చేస్తాను….

Congress l సొంత నిధులతో పేదలకు సహాయం చేస్తాను…. ఇంటింటి ప్రచారం చేస్తున్న

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:30 pm

ఢిల్లీలో ఘోరం.. పార్క్ చేసిన కారులో మూడు మృతదేహాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో పీరాగఢి ఫ్లైఓవర్‌పై పార్క్ చేసి ఉన్న కారులో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెంది కనిపించారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలీవిధంగా ఉన్నాయి. ప్రాథమికంగా వీరు విషం సేవించి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం మృతులను రన్‌హోలా ప్రాంతానికి చెందిన రణధీర్ సింగ్ (62), శివ్ నరేశ్ (42), జహంగీర్‌పురికి చెందిన లక్ష్మిసింగ్ (40) గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారు రణధీర్ సింగ్‌కు చెందినదిగా వెల్లడైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫ్లైఓవర్‌పై నిలిపి ఉన్న కారును గమనించారు. లోపల ముగ్గురూ మరణించినట్లు నిర్ధారిం చారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేదా ప్రతిఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో ఇది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ కు వచ్చారు. దోపిడీ లేదా దొంగతనం జరిగినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు,

మన తెలంగాణ 8 Feb 2026 9:27 pm

Brs l ప్రచారంలో దూసుకుపోతున్న మిరియాల అలివేలు..

Brs l ప్రచారంలో దూసుకుపోతున్న మిరియాల అలివేలు.. Brs l పాల్వంచ ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:24 pm

పాక్ ఏజెంట్‌తో అంటకాగిన గొగోయ్ జంట: అసోం సిఎం

గువహతి : కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ తమ ఆరోపణలను తీవ్రతరం చేశారు. గౌరవ్, ఆయన భార్య బ్రిటిష్ పౌరురాలు ఎలిజబెత్ కోల్బర్న్‌కు పాకిస్థాన్ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్‌తో సంబంధాలు ఉన్నాయి. వీరిది ఓ ప్రగాఢ త్రికోణ వలయం అని వ్యాఖ్యానించారు. గౌరవ్ గొగోయ్ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేతగా కూడా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్‌తో వీరి కనెక్షన్, కార్యకలాపాలదర్యాప్తు సాగుతోందన్నారు. భార్య ద్వారా పై ఇంటలిజెన్స్ బ్యూరో సమాచారం ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు అందిందని సిఎం తెలిపారు. త్వరలో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆదివారం బిస్వా శర్మ మీడియాతో మాట్లాడారు, కుమార్ గౌరవ్ అనేక నిబందనలు ఉల్లంఘించాడు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) అతిక్రమణ జరిగిందని విమర్శించారు. గౌరవ్‌కు భార్య కాకముందు కోల్బర్న్ భారత్‌లో ఉద్యోగినిగా ఉంది. అప్పుడు ఆమెకు క్రమం తప్పకుండా పాక్ ఏజెంటు నుంచి వేతనం అందేదని , తరువాత కుమార్‌తో పెళ్లి జరిగిందని తెలిపారు.పైగా తనకు తెలిసిన సమాచారం మేరకు గొగోయ్ 2013లోనే పాకిస్థాన్‌లో గుట్టుచప్పుడు కాకుండా పర్యటించాడు. అక్కడ ఏదో శిక్షణ పొందినట్లు ఉందని ఆరోపించారు. తాను నిర్థిష్ట రీతిలోనే ఈ విషయం చెపుతున్నానని, ధైర్యముంటే ఆయన ఇది నిజం కాదని నిరూపించుకోవాలి. లేదా దేశ ద్రోహ నేరం కింద విచారణకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. ఆ ముగ్గురు ద్వారా అంతర్జాతీయ కుట్ర ఏదో జరిగిందని, దీనిని తాను పూర్తి వివరాలతో వెలుగులోకి తీసుకువస్తానని చెప్పారు.

మన తెలంగాణ 8 Feb 2026 9:20 pm

Laxmi l అభివృద్ధికి చిరునామా మళ్లీ కాంగ్రెస్…

Laxmi l అభివృద్ధికి చిరునామా మళ్లీ కాంగ్రెస్… 49వ డివిజన్ లో లక్ష్మీప్రసన్న

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:16 pm

75 ఏళ్లు నిండినా కొనసాగమన్నారు.. ఆదేశిస్తే పదవిని వదిలేస్తా

కులం కన్నా సమర్థత మిన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పదవికి హిందువైతే చాలు బంగ్లాదేశ్ హిందువులు సంఘటితం అయితేనే రక్ష ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పందన అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని స్వాగతించిన ఆర్‌ఎస్‌ఎస్ ముంబై : బంగ్లాదేశ్‌లో హిందువులు సంఘటిత శక్తితోనే తమ హక్కులను రక్షించుకోగలరు. అక్కడి దాదాపు కోటి పాతిక లక్షల మంది హిందువులు స్థానిక రాజకీయ వ్యవస్థను సరైన రీతిలో వినియోగించుకోవచ్చునని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ తెలిపారు. తమ భద్రతకు, సంక్షేమానికి అవసరం అయిన శక్తి ఉందనే విషయం తెలుసుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్‌లో హిందువుల పట్ల నెలకొని ఉన్న విద్వేషపూరిత వాతావరణాన్ని మోహన్ భగవత్ ప్రస్తావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో ముంబైలో సంఘ్ ప్రయాణం, నూతన అధ్యాయాలు అనే రెండు రోజుల ప్రసంగ కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి, ప్రవాసం తరువాత బంగ్లాదేశ్‌లో నెలకొన్న భారత వ్యతిరేక స్పందనలపై మోహన్‌భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు మీద పడ్డా ఆర్‌ఎస్‌ఎస్ పర్‌సంఘ్‌చాలక్ బాధ్యతల్లో కొనసాగడంపై మోహన్ భగవత్ స్పందించారు. తనకు సంస్థ ఆదేశాలు శిరోధార్యమని, వయసుతో నిమిత్తం లేకుండా సంఘ్ పరివార్ తనను పదవిలో ఉండాలని చెప్పిందన్నారు. అందుకే ఈ బాధ్యతల్లో ఇప్పటికీ నిర్వర్తిస్తున్నానని, దిగిపోవాలని వారు చెప్పిన వెంటనే దిగిపోతానని స్పష్టం చేశారు. తనకు 75 సంవత్సరాలు నిండాయని, సాధారణంగా ఈ వయస్సు రాగానే కీలక బాధ్యతల్లో ఉండరాదనే నిబంధన ఉందన్నారు. అయితే వారు కొనసాగమని కోరినట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత పదవికి ఎన్నికలు ఉండవని, ప్రాంతీయ ఉప ప్రాంతీయ స్థాయి అధిపతులు సర్‌సంఘ్‌చాలక్‌ను నియమిస్తారని వెల్లడించారు. సంఘ్‌లో పదవి నుంచి నిష్క్రమణ ఉంటుంది తప్పితే సేవల నుంచి కాదని ఆయన తమ ప్రసంగంలో తెలిపారు. అయినా సంఘ్ సేవకుల తుది రక్తపు బొట్టు వరకూ వారి సేవలను వినియోగించుకుంటుందని చమత్కరించారు. అధినేతగా ఎస్‌సి, ఎస్‌టిలు ఉండవచ్చా అనే ప్రశ్నకు ఆయన నిర్థిష్ట సమాధానం ఇవ్వలేదు. ఎవరిని నియమించాలనేది ఎవరైతే నిర్ణయిస్తారో వారిపై ఆధారపడి ఉంటుందన్నారు. తన ఉద్ధేశంలో అయితే ఉత్తములకు అవకాశం దక్కాలని, కులాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఆర్‌ఎస్‌ఎస్ నేత కావచ్చన్నారు. అయితే తప్పనిసరిగా హిందువు అయ్యి ఉండాల్సిందే అన్నారు. వీర్ సావర్కర్ భారతరత్నకు అర్హులు హిందూత్వ జాతీయవాది వినాయక్ దామోదర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని మోహన్‌భగవత్ స్పష్టం చేశారు. ఈ పురస్కారం ఆయనకు దక్కితే ఈ పురస్కారానికి గౌరవం పెరుగుతుందని తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారుపై కూడా ఆయన స్పందించారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ ప్రసక్తే లేకుండా ఈ ఒప్పందం కుదిరిందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సి ఉందన్నారు. అయితే ఇది విభేదాలు తద్వారా విద్వేషాలకు దారితీయరాదని స్పష్టం చేశారు. రాజకీయాలు, స్వార్థానికే ఇప్పుడు కులం కులం ఒకప్పుడు సాంప్రదాయక రీతిలో వారివారి వృత్తులకు ప్రతీకగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు కులాల వారి విభజన పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు, స్వార్థానికి ఉపయోగపడుతోందని మోహన్ భగవత్ తెలిపారు. కులాలవారి ఘర్షణలు దురదృష్టకరం, ఇటువంటి వాటి పరిష్కారానికి విచక్షణాయుతంగా వ్యవహరించాలి. అత్యంత జాగరూకతతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసంగ కార్యక్రమమే కాకుండా, పలువురి నుంచి వచ్చిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చే కార్యక్రమం ముంబైలో ఏర్పాటు అయింది. 

మన తెలంగాణ 8 Feb 2026 9:14 pm

Rajashekar l ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి..

Rajashekar l ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి.. ఎన్నికల ప్రచారంలో బిజెపి

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:11 pm

Bellampalli l మటన్ కొడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ‘ చింతల వసంత’ వినూతన ప్రచారం..

Bellampalli l మటన్ కొడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ‘ చింతల వసంత’ వినూతన

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:05 pm

Brs l మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..

Brs l మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి.. చౌటుప్పల్ మున్సిపాలిటీపై మరోసారి

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:55 pm

నీట్ యుజి దరఖాస్తులు ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్య, దంత విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్ యుజి 2026) పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ప్రకటించింది. ఆదివారం(ఫిబ్రవరి 8) నుంచి మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంబిబిఎస్, బిడిఎస్‌తోపాటు బిఎఎంఎస్,బియుఎంఎస్, బిఎస్‌ఎంఎస్ కోర్సులకు నీట్ (యుజి) పరీక్ష నిర్వహిస్తామని ఎన్‌టిఎ తెలిపింది. నీట్ (యుజి) ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బిహెచ్‌ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్‌లో మిలిటరీ నర్సింగ్ సర్వీస్(ఎంఎన్‌ఎస్)లో బిఎస్‌సి నర్సింగ్ కోర్సు అడ్మిషన్లకు నీట్ (యుజి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేండ్ల బిఎస్‌సి నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ (యుజి)లో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్‌టిఎ తెలిపింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్ ఇడబ్ల్యూఎస్/ఒబిసి ఎన్‌సిఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగులు,థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే 011- 40759000, 011 -69227700 ఫోన్ నంబర్లు లేదా neetug2026@nta.ac.inకు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని ఎన్‌టిఎ తెలిపింది. దేశంలోనే అతిపెద్ద పరీక్ష దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్ పరీక్షకు పేరుంది. ఏటా సుమారు 20 నుంచి 23 లక్షల మందికిపైగా ఈ పరీక్షను రాస్తుంటారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబిబిఎస్ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ యుజి పరీక్షను ఎన్‌టిఎ నిర్వహిస్తుంటుంది. మొత్తం 1.08 లక్షల ఎంబిబిఎస్ సీట్లలో దాదాపు 56 వేల సీట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. నీట్‌లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.

మన తెలంగాణ 8 Feb 2026 8:47 pm

Brs l ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా..

Brs l ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా.. Brs l క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:47 pm

ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ను రేవంత్ చదువుతున్నారు

మనతెలంగాణ/హైదరాబాద్ : రేవంత్ రెడ్డి తన గురువు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని బిఆర్‌ఎస్ నేత, శాసనమండలి మాజీ విప్ కర్నె ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టం కావాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ది జరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై భాద్యత గల ప్రతిక్షంగా ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. తాము ప్రశ్నిస్తుంటే సిఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం మొదలు పెట్టారని ఆరోపించారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 700 రోజులైనా సిఎంలో మార్పు రాలేదని, తమను తిట్టి సిఎం రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, జీవన్ రెడ్డి, హన్మంతరావు లాంటి స్పందించాలని అన్నారు. రేవంత్ రెడ్డి హర్వర్డ్ నుంచి మంచి నాయకత్వ లక్షణాలతో వస్తాడనుకుంటే..పిచ్చి ముదిరినట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

మన తెలంగాణ 8 Feb 2026 8:36 pm

Govindh l 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవింద్ రావు

Govindh l 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవింద్ రావు రైటప్:

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:35 pm

కిడ్నాప్ కేసు.. మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని మంచు విష్ణు లిఖిత పూర్వకంగా పోలీసులకు తెలిపారు. అయితే ఈ కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు మాత్రం నోటీసులు ఇంకా అందలేదు. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ ఘటనలో మోహన్‌బాబు, విష్ణు, పీఆర్వో సతీష్‌పై సహా 13మందిపై ఈ నెల 3న కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్‌ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంచువిష్ణుకు మొత్తంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. విద్యార్థి సంఘాల్ నేతలపై ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలు సమర్పించాలని చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే మరోవైపు విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు, ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన విద్యార్థి సంఘాలు, వామపక్షాలు విష్ణు, మోహన్ బాబులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. యూని వర్సిటీ గుర్తింపు రద్దు చేసి, అక్రమంగా వసూలు చేసిన రూ.26 కోట్ల ఫీజులను తిరిగి చెల్లించాలని కోరుతున్నాయి. ఈ కేసులో పోలీసులు విచా రణ కొనసాగిస్తున్నారు. నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే అమలు చేయా లంటే గత కొన్నేళ్లుగా విద్యార్థి సంఘాల నేతలు పోరాటం చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నాకు బయలుదేరిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలను సుమారు 30 మంది బౌన్సర్లు వచ్చి అడ్డగించారని వారిపై దాడి చేశారంటూ సీపీఎం నేతలు ఎస్‌పి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌పి ఆదేశాల మేరకు ఎఎస్‌పి నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్ బృందాలు వారి వాహనాలు వెంటాడి విద్యార్థి నాయకులను విడిపించినట్లు సిపిఎం నేతలు వెల్ల డించారు. ఆ తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, విద్యార్థి సంఘ నాయకుడు వినోద్‌లను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారం టూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోహన్ బాబు, విష్ణు, వారి పీఆర్వో సతీష్‌లపై కేసు నమోదైంది. ఘటనకు కారణమైన ఐదుగురు బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాలు సీజ్ చేశారు. విచారణలో భాగంగా విష్ణుకు నోటీసులు జారీ చేయగా మోహన్ బాబుకు కూడా నోటీ సులు ఇచ్చేందుకు పోలీసులు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మన తెలంగాణ 8 Feb 2026 8:31 pm

Brs l 49వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ దూకుడు..

Brs l 49వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ దూకుడు.. కాంగ్రెస్ అహంకారానికి చెక్ పెట్టాల్సిందేనని

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:31 pm

congress l చేతి గుర్తుకు ఓటు 11వ వార్డు అభివృద్ధికి మలుపు

congress l చేతి గుర్తుకు ఓటు 11వ వార్డు అభివృద్ధికి మలుపు 11వ

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:26 pm

Ranjith l ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలి…

Ranjith l ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలి… Ranjith l ధర్మపురి, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:16 pm

Narasimhulu l ఆశీర్వదించండి గతంలో కన్న మెరుగైన అభివృద్ధి చేస్తా…

Narasimhulu l ఆశీర్వదించండి గతంలో కన్న మెరుగైన అభివృద్ధి చేస్తా… 18వ డివిజన్‌లో

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:10 pm

Ravendhar l కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న గరిసే రవీందర్…

Ravendhar l కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న గరిసే రవీందర్… అందుబాటులో

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:05 pm

Dharmmapuri l అందుబాటులో ఉండే సేవ చేస్తా…

Dharmmapuri l అందుబాటులో ఉండే సేవ చేస్తా… Dharmmapuri l , ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 8 Feb 2026 7:56 pm

Bhimgal l పోస్టల్ బ్యాలెట్ వేసిన 37 మంది

Bhimgal l పోస్టల్ బ్యాలెట్ వేసిన 37 మంది Bhimgal l భీమ్‌గల్‌

ప్రభ న్యూస్ 8 Feb 2026 7:48 pm

Bjp l బిజెపి ప్రచారంలో చెప్పులతో దాడి చేసిన బిఆర్ఎస్ గుండాలపై చర్య తీసుకోండి..

Bjp l బిజెపి ప్రచారంలో చెప్పులతో దాడి చేసిన బిఆర్ఎస్ గుండాలపై చర్య

ప్రభ న్యూస్ 8 Feb 2026 7:42 pm

Buzz: Prabhas’ Heroine for Pawan Kalyan?

Powerstar Pawan Kalyan is on a break and he is focused on AP politics. The actor will take up a new set of films very soon. He signed a film to be directed by Surendar Reddy and the project has been announced officially. The film will have a grand launch during Ugadi this year and […] The post Buzz: Prabhas’ Heroine for Pawan Kalyan? appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 7:37 pm

Sankranthi 2027: Nagarjuna makes it Official

King Nagarjuna is currently shooting for his 100th film and it is expected to hit the screens during Dasara this year. The actor announced that his next film will hit the screens during Sankranthi 2027 and he would team up with Soggade Chinni Nayana fame Kalyan Krishna for a film. Annapurna Studios will produce the […] The post Sankranthi 2027: Nagarjuna makes it Official appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 7:32 pm

‘రుద్ర’ గ్రంథాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

మన తెలంగాణ/హైదరాబాద్: శివ పురాణంపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ రచించిన ‘రుద్ర’ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఇలాంటి పుస్తకం రూపొందించడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి కొనియాడారు. నేటి తరానికి ఇలాంటి విలువైన గ్రంథాలు అవసరమని మెగాస్టార్ సుస్మితకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప రచనలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవికి మంత్రి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు.

మన తెలంగాణ 8 Feb 2026 7:10 pm

shetti l 17వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా…

shetti l 17వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా… అవకాశం ఇవ్వండి నన్ను భారీ

ప్రభ న్యూస్ 8 Feb 2026 7:06 pm

Bjp l 13వ వార్డులో ప్రచారంలో దూసుకు వెళ్తున్న బిజెపి అభ్యర్థి పావని మల్లికార్జున్

Bjp l 13వ వార్డులో ప్రచారంలో దూసుకు వెళ్తున్న బిజెపి అభ్యర్థి పావని

ప్రభ న్యూస్ 8 Feb 2026 7:00 pm

Rebel l కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పోటినుంచి తప్పుకున్న రెబల్

Rebel l కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పోటినుంచి తప్పుకున్న రెబల్ Rebel l

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:49 pm

people l ప్రజల కష్టాల్లో నేనుంటా..

people l ప్రజల కష్టాల్లో నేనుంటా.. people l నారాయణపేట ఆంధ్రప్రభ: ప్రజల

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:42 pm

18వ వార్డులో పొన్న రవి ప్రచార ప్రభంజనం

స్టేషన్‌ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం దగ్గరపడుతు

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:32 pm

Inspections l కనకదుర్గమ్మ ఆలయంలో ఈఓ తనిఖీ

Inspections l కనకదుర్గమ్మ ఆలయంలో ఈఓ తనిఖీ భక్తుల ఈఓ శీనా నాయక్

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:27 pm

గెలుపు దిశగా టిఆర్ఎస్ అభ్యర్థి సంకేట సరస్వతి పోశెట్టి

బైంసా, ఆంధ్రప్రభ : పట్టణంలోని 6 వార్డులో ఆదివారం ఆదివారం బిఆర్ఎస్ సమన్వయ

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:25 pm

An honor l అంధత్వాన్ని జయించిన నాగరాజుకు ఎంపీ, ఎమ్మెల్యే సన్మానం

An honor l అంధత్వాన్ని జయించిన నాగరాజుకు ఎంపీ, ఎమ్మెల్యే సన్మానం అంధత్వాన్ని

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:19 pm

ఖానాపూర్ లో ఉట్నూర్ నాయకుల ప్రచారం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:18 pm

Fire Incident at Nampally Forensic Lab Sparks Rumours, Officials Clarify No Key Evidence Lost

A fire accident at the Forensic Science Laboratory in Nampally has triggered intense speculation on social media, with claims that crucial evidence linked to high-profile cases was destroyed. The incident occurred on the first floor of the laboratory, affecting multiple sections including the computer forensic lab, property room, server room, analysis chamber and verification areas. […] The post Fire Incident at Nampally Forensic Lab Sparks Rumours, Officials Clarify No Key Evidence Lost appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 6:18 pm

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ ప్రచార హోరు!

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:15 pm

Nikhil’s Swayambhu Teaser Blast Loading

Nikhil’s most ambitious period action spectacle Swayambhu, directed by Bharat Krishnamachari, is inching closer to its grand arrival. Planned for a summer release on April 10, the film is now ready to take its next big step- the makers have confirmed that the teaser blast on February 11, setting the stage for an explosive promotional […] The post Nikhil’s Swayambhu Teaser Blast Loading appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 6:06 pm

అభివృద్ధే ఆశయం.. సంక్షేమమే సంకల్పం

అభివృద్ధే ఆశయం.. సంక్షేమమే సంకల్పం 2వ వార్డులో నిచ్చకోల వంశీకృష్ణ ప్రచార హోరు!

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:02 pm

TG |కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

TG | కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు -ఎన్నికల్లో ఎలాంటి లోపాలు

ప్రభ న్యూస్ 8 Feb 2026 6:00 pm

ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తా..

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ

ప్రభ న్యూస్ 8 Feb 2026 5:57 pm

Video: Manasa Varanasi Interview

The post Video: Manasa Varanasi Interview appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 5:53 pm

‘మృత్యుంజయ్’లో ఐపీఎస్ సీతా పరశురామ్‌గా..

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాలో రేబా మోనికా జాన్ పోషిస్తోన్న ఐపీఎస్ సీతా పరుశురామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ రేబా జాన్ మృత్యుంజయ్ చిత్రంలో మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో ఆమె తనదైన నటనతో ఎలాంటి థ్రిల్స్ ఇవ్వనుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

మన తెలంగాణ 8 Feb 2026 5:30 pm

‘నిన్ను కౌన్సిలర్ గా గెలిపించుకుంటాం స్వాతమ్మ’..

‘నిన్ను కౌన్సిలర్ గా గెలిపించుకుంటాం స్వాతమ్మ’.. 7వ వార్డులో దావ స్వాతి ప్రచార

ప్రభ న్యూస్ 8 Feb 2026 5:24 pm

ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ

ప్రభ న్యూస్ 8 Feb 2026 5:21 pm

ప్రజా సమస్యలపై గళమెత్తుతా..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 11వ వార్డులో

ప్రభ న్యూస్ 8 Feb 2026 5:16 pm

Get Together | 47 ఏళ్ల తర్వాత కలిసిన బాల్య స్నేహితులు

Get Together | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ ఉన్నత పాఠశాల

ప్రభ న్యూస్ 8 Feb 2026 5:11 pm

తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశాను: కోమటి రెడ్డి

హైదరాబాద్: అసలైన జాతిపిత తానేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ జాతిపిత కాదు.. జాతి పిట్ట అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశానని తెలియజేశారు. అసెంబ్లీకి రాని కెసిఆర్ జీతం తీసుకోవద్దని, తీసుకున్న జీతం వెనక్కి ఇవ్వాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. 

మన తెలంగాణ 8 Feb 2026 5:09 pm

అందరివాడిని ఆదరించి గెలిపించండి…

అందరివాడిని ఆదరించి గెలిపించండి… అభివృద్ధి చేసుకుందాం.. పాల్వంచ 8 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): అందరివాడిని

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:58 pm

Counseling l రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న కర్నూలు పోలీసులు

Counseling l రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న కర్నూలు పోలీసులు చట్ట వ్యతిరేక

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:58 pm

ఎమ్మెల్యే ఆదేశాలతో నాయకుల విస్తృత ప్రచారం

ఎమ్మెల్యే ఆదేశాలతో నాయకుల విస్తృత ప్రచారం ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:55 pm

Flag march |ధర్మపురి పట్టణంలో పోలీసు ఫ్లాగ్ మార్చ్

Flag march | ధర్మపురి, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:54 pm

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఓటర్లకు సొంత హామీలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఓటర్లకు సొంత హామీలు పరకాల, ఫిబ్రవరి 8

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:52 pm

ఓటుకు నోటు కేసు ఆధారాలన్నీ న్యాయస్థానంలో ఉన్నాయి :  శిఖా గోయల్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని, ఒకవేళ మావద్ద లేకపోయినా కోర్టు వద్ద …

జనం సాక్షి 8 Feb 2026 4:36 pm

Harish Rao Corners Revanth Reddy Over Unkept Promises

The campaign for the Telangana municipal elections has entered its final phase, with all major political parties pushing hard to secure a majority of seats. The contest has become a matter of prestige for the three main parties, as senior leaders remain busy with intensive outreach. Campaigning is set to end by Monday evening, even […] The post Harish Rao Corners Revanth Reddy Over Unkept Promises appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 4:32 pm

కాంగ్రెస్ అభ్యర్థుల ను గెలిపించాలి..

కాంగ్రెస్ అభ్యర్థుల ను గెలిపించాలి.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం12,13 వ వార్డు

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:24 pm

ఆడబిడ్డగ ఆశీర్వదించి గెలిపించండి.

ఆడబిడ్డగ ఆశీర్వదించి గెలిపించండి. 9వ వార్డును అభివృద్ధి చేయడమే మా లక్ష్యంబీఆర్ఎస్ అభ్యర్థి

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:20 pm

Anonymous  miracle :  ‘అజ్ఞాత అద్భుతం’ Andhra parabha SPL Story

Anonymous miracle : ‘అజ్ఞాత అద్భుతం’ Andhra parabha SPL Story

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:14 pm

కారు గుర్తుపై ఓటు వేయండి..

పాల్వంచ, ఆంధ్రప్రభ : కారు గుర్తుపై ఓటు వేసి చింతలచెరువు దుర్గాప్రసాద్ ను

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:13 pm

7 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి

7 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బింగి లతా రవి ప్రచారం ఆలేరు,ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:11 pm

ఎమ్మెల్యే పల్లా ప్రచారంతో గెలుపు ఖాయం

జనగామ, ఆంధ్రప్రభ ; జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంతో

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:10 pm

ప్రచారం చేస్తున్న 8 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు

ప్రచారం చేస్తున్న 8 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:08 pm

అభివృద్ధి కోసం కర్రెం చెన్నమ్మ నీలప్ప ను గెలిపించండి

అభివృద్ధి కోసం కర్రెం చెన్నమ్మ నీలప్ప ను గెలిపించండి బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్

ప్రభ న్యూస్ 8 Feb 2026 4:05 pm

బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులను పేదవాళ్ల కోసం ఖర్చు చేయలేదు: భట్టి

హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ కాలనీలు నిర్మించిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడారు. మన నిధులు మనకే ఖర్చు కావాలని పోరాడి తెలంగాణ సాధించుకున్నామని భట్టి తెలియజేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులను పేదవాళ్ల కోసం ఖర్చు చేయలేదని విమర్శించారు. సాగుకు ఉచిత విద్యుత్ ను మొదట అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాజీ సిఎం కెసిఆర్ ఏనాడు నిధులు ఇవ్వలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు.      

మన తెలంగాణ 8 Feb 2026 3:42 pm

మటన్ కొడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ‘ చింతల వసంత’ వినూతన ప్రచారం..

మటన్ కొడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ‘ చింతల వసంత’ వినూతన ప్రచారం.. 15వ

ప్రభ న్యూస్ 8 Feb 2026 3:27 pm

Kareemabad |పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి

Kareemabad | పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి Kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Feb 2026 3:27 pm

death l వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు మృతి

death l వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు మృతి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించిన

ప్రభ న్యూస్ 8 Feb 2026 3:25 pm

కుంటుపడిన అభివృద్ధికి పరుగులు పెట్టిస్తా

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి

ప్రభ న్యూస్ 8 Feb 2026 3:20 pm

కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్‌ను గెలిపించండి

కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్‌ను గెలిపించండి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రతినిధి,

ప్రభ న్యూస్ 8 Feb 2026 3:20 pm

Buzz: OTTs Closes 2026 Business for Indian Films

The Digital Platforms have been making things tough for Indian film producers. With most of them relying on the digital deal to recover their investments and with a number of films in making, the digital players are not in a hurry and they are picking up interesting films. Some of them also faced tough times […] The post Buzz: OTTs Closes 2026 Business for Indian Films appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 3:17 pm

ఆలేరు 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సందిల సురేష్ ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో 3

ప్రభ న్యూస్ 8 Feb 2026 3:15 pm

కారుకు ఓటు వేసి మోయిజ్ హుస్సేన్ ను గెలిపించండి

కారుకు ఓటు వేసి మోయిజ్ హుస్సేన్ ను గెలిపించండి గడప గడపకు –

ప్రభ న్యూస్ 8 Feb 2026 3:14 pm

Exciting Releases in Summer 2026

Summer 2026 is slowly getting packed with several releases. 2024 and 2025 summer season has been extremely wasted but this year, stars like Pawan Kalyan, Ram Charan, Suriya and young heroes like Varun Tej, Akhil, Nikhil, Adivi Sesh and others will test their luck. To avoid clashes, some of the biggies have locked their release […] The post Exciting Releases in Summer 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 3:14 pm

evidence @ 1000  vedios వీణా నాదం Andhara prabha Insight Story

evidence @ 1000 vedios వీణా నాదం Andhara prabha Insight Story

ప్రభ న్యూస్ 8 Feb 2026 3:08 pm

ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ, ಭಾರೀ ಆಲಿ ಕಲ್ಲುಗಳು ಬಿದ್ದು ಕಾರ್‌ ಪುಡಿಪುಡಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ, ಭಾರೀ ಆಲಿ ಕಲ್ಲುಗಳು ಬಿದ್ದು ಕಾರ್‌ ಪುಡಿಪುಡಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 8 Feb 2026 2:16 pm

8వ వార్డులో కాంగ్రెస్ జోరుగా ప్రచారం

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాం మంత్రి డాక్టర్

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:59 pm

అగ్ని ప్రమాదంపై తరువాత వివరాలు వెల్లడిస్తాం: శిఖాగోయల్

హైదరాబాద్: నాంపల్లి లో జరిగిన అగ్నిప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ కు, లైబ్రరీ, హెచ్ఆర్ డి రూమ్ కు మంటలు వ్యాపించాయని డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై శిఖాగోయల్  మీడియాతో మాట్లాడారు. శనివారం 10.08 గం.లకు అగ్నిప్రమాదం జరిగిందని, ఫైర్ సిబ్బంది మధ్యాహ్నం 1.30 గం.లకు మంటలు ఆర్పేశారని అన్నారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని తెలియజేశారు. అగ్ని ప్రమాదంపై కొందరు అసత్యాలు, రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని, అగ్ని ప్రమాదంపై అంచనాలకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని శిఖాగోయల్ పేర్కొన్నారు. కీలకమైన కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని, 2015 నాటి ఎసిబి కేసు విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించారు. 2015 నాటి ఎసిబి కేసుకు సంబంధించిన ఏ సామగ్రి తమ వద్ద లేదని, పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసులోనూ ఆధారాలు కోర్టుకు ఇచ్చామని అన్నారు. 2024 వరకు సేకరించిన 136 ఆధారాల్లో 7 మినహా అన్నీ కోర్టుకు ఇచ్చేశామని, పలు పరికరాలు పరిశీలించి వెంటనే కోర్టుకు నివేదికలు ఇచ్చామని అన్నారు. చాలా సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్ సురక్షితంగా పునరుద్ధరిస్తుందని, ఏదైనా జరిగితే ఎస్ఎఫ్ఎల్ టీమ్ సమాచారాన్ని పునరుద్ధరిస్తుందని శిఖాగోయల్ స్పష్టం చేశారు.

మన తెలంగాణ 8 Feb 2026 1:56 pm

Urea |అక్రమల కట్టడికే యాప్ ద్వారా యూరియా విక్రయం

Urea | ఎడపల్లి, ఆంధ్రప్రభ : రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుని సాగులో ముందడుగు

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:53 pm

మరోసారి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

మరోసారి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా 10 వార్డు అభ్యర్థి పనాస రాజు

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:52 pm

మూడో వికెట్ కోల్పోయిన కివీస్

చెన్నై: వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్-అప్ఘానిస్థాన మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా 54 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంది. తొలుత బ్యాటింగ్ చేసి అప్ఘాన్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు ముందు ఉంచింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ గ్లెన్ ఫిలీఫ్స్ 42 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫిన్ అలెన్ ఒక పరుగు చేసి ముజీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రచిన్ రవీంద్ర పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.  ప్రస్తుతం క్రీజులో టిమ్ సీఫర్ట్(33), మార్క్ చాపమన్(10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 8 Feb 2026 1:52 pm