Ys Jagan : నేడు భీమవరానికి జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
T20 World Cup : పాక్ బాయ్ కాట్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదా?
టీ 20 వరల్డ్ కప్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.
నేడు సాగు నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం
నేడు అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది
Revanth Reddy : నేడు కరీంనగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు
వికారాబాద్లో పట్టపగలు నడిరోడ్డుపై హత్య
వికారాబాద్: పాత కక్షల నేపథ్యంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాంపూర్ తండాకు చెందిన శంకర్ అనే వ్యక్తి కోడి పంచాయతీ విషయంలో ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు. మృతుడు కుమారుడు సాయి నిందితుడు శంకర్పై పగ పెంచుకున్నాడు. శంకర్ జైలు నుంచి విడుదల కాగానే హత్య చేయాలని కొన్ని రోజులుగా ప్లాన్ వేస్తున్నాడు. ధారూర్లో శంకర్ కనిపించగా అతడిని స్కూటీతో సాయి ఢీకొట్టాడు. అనంతరం కత్తి తీసుకొని అతడిపై పలుమారు పొడిచాడు. సాయి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh : నేడు కూటమి నేతల కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు
India vs South Africa : దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. వార్మప్ మ్యాచ్ తో బోణీ
టీ20 ప్రపంచకప్ కు ముందు సన్నాహక మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది
మార్కాపురం జిల్లాలో జూనియర్ టెక్సికల్ అసిస్టెంట్ ఆత్మహత్య
అమరావతి: అధికారుల వేధింపులకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా డోర్నాలలో జరిగింది. ప్రసాదరావు(47) అనే వ్యక్తి ఉపాధిహామీ పథకంలో జూనియర్ టెక్సికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఐటిడిఎ ఆఫీస్ వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నతాధికారుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమంటూ అధికారిక వాట్సాప్ గ్రూపు లో ప్రసాదరావు మెసేజ్ చేసినట్టు సమాచారం సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కుమారుడి చావు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బీస్పీ కౌన్సిలర్ అభ్యర్థి తోగిటి నవీన్ భీమ్గల్ టౌన్, ఫిబ్రవరి 5 (
నేడు డబ్లూపిఎల్ 2026 ఫైనల్.. ఢిల్లీ ఈసారైనా కప్పు కొట్టేనా?
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026 ముగింపు దశకు చేరుకొంది. గురువారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి)తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సిబి నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఢిల్లీ మాత్రం ఎలిమినేటర్ పోరులో గుజరాత్ జెయింట్స్ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గుజరాత్పై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ తుదిపోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఓపెనర్లు లిజెల్లి లీ, షఫాలీ వర్మలు ఫామ్లో ఉన్నారు. గుజరాత్పై లీ విధ్వంసక ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. షఫాలీ కూడా మెరుగైన బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలిచింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కూడా గుజరాత్పై మెరుపులు మెరిపించింది. విధ్వంసక బ్యాటింగ్తో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. లౌరా వాల్వర్డ్, మరిజానె కాప్, మిన్ను మణి తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా ఉంది. స్నేహ్ రాణా, శ్రీచరణి, మిన్ను మణి, మరిజానె కాప్లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. ఇక కిందటి మూడు సీజన్లలో ఫైనల్లో ఓటమి పాలైన ఢిల్లీ ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే పటిష్టమైన బెంగళూరును ఓడించి ట్రోఫీని సాధించడం అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. మరోవైపు బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉంది. గ్రేస్ హారిస్, స్మృతి మంధాన, జార్జియా వోల్, రిచా ఘోష్, రాధా యాదవ్, నడైన్ డి క్లర్క్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న బెంగళూరు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంలోని జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకపోవడం అధికార వర్గాలకు విశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తోంది. నరవణె పుస్తకంపై సోమ, మంగళవారాల్లో కూడా వివాదం కొనసాగింది. 2020 నాటి భారత్, చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ నరవణె చీఫ్ తన పుస్తకంలో అప్పటి సంఘటనలు కొన్ని ప్రస్తావించారు. ఈ సంఘటనలకు సంబంధించి ఓ మేగజైన్లో వచ్చిన వ్యాసాన్ని సోమవారం సభలో రాహుల్ ఉదహరించడానికి ప్రయత్నించగా స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. స్పీకర్ సూచించిన మేరకు దానిని తాను ధ్రువీకరిస్తున్నట్టు మంగళవారం రాహుల్ సభలో ప్రకటించారు. ఈమేరకు సంతకం చేసిన ఆ కాపీని స్పీకర్కు సమర్పించారు. దానిని పరిశీలించాక స్పందిస్తానని స్పీకర్ ప్రకటించారు. అయినా నరవణె అంశంపై మాట్లాడడానికి రాహుల్ ప్రయత్నించడంపై అధికార పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం ఎదురై చివరకు వివాదంగా కొనసాగుతోంది. 2020లో సరిహద్దు లోని గల్వాన్ లోయ వద్ద చైనా సేనలు దురాక్రమణ సాగించినప్పుడు భారత ప్రభుత్వం ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించిందో తగిన ఆదేశాలు జారీ చేయకుండా సైన్యం విచక్షణాధికారానికే ఎలా విడిచిపెట్టిందో ఆ వ్యాసంలో ఉదహరించారు. దాన్నే సభలో చర్చకు తీసుకురావడానికి రాహుల్ ప్రయత్నించగా రాహుల్ గొంతు వినిపించకుండా ప్రభుత్వం అడ్డుపడింది. 2020 నాటి గల్వాన్ లోయ సంఘటనలు అణు సామర్థం కలిగిన చైనా, భారత్ దేశాల మధ్య సంబంధాలను ఎలా నష్టపరిచాయో నరవణె వివరించారు. ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అన్న పేరుతో నరవణె రచించిన ఈ పుస్తకం 2023 నుంచి ముద్రణకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. చైనా యుద్ధ టాంకులు, పదాతి దళాలు భారత్ వైపు కైలాష్ పర్వత శ్రేణిలో దూసుకు వస్తుండగా ప్రభుత్వ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సైనిక దళాల బాధ్యతకే విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. క్లిష్టమైన పరిస్థితుల్లో సుదీర్ఘ పరిణామాలు ఎదురైనప్పుడు ప్రభుత్వ రాజకీయ నాయకత్వమే చొరవ తీసుకునే వ్యవస్థ స్వతంత్ర భారతంలో అభివృద్ధి చెందింది. అధికార నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అదే అధికారులు, సిబ్బంది పాటించవలసి ఉంటుంది. ఇలాంటి కార్యకలాపాల నిర్ణయాల విషయంలో మోడీ తరచుగా జోక్యం చేసుకుంటారని, సలహాలు ఇస్తుంటారని చెబుతుంటారు. 2025 ఏప్రిల్ లో పహల్గామ్ దాడి తరువాత ప్రధాని మోడీ నేతృత్వం లోని భద్రతా కమిటీ, రక్షణ దళాలకు పాకిస్థాన్పై ప్రతిస్పందన విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు, దీనికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలను ప్రధాని మోడీయే సమీక్షించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. అలాంటిది గల్వాన్ లోయ సంఘర్షణలో మోడీ ప్రభుత్వం సరైన రీతిలో ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న ఎదురవుతోంది. అయితే నవరణె పుస్తకం లోని అంశాలు వెలుగు లోకి వస్తే తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్న భయంతో మోడీ ఆ పుస్తకం ముద్రణకు అనుమతి ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకనే ఆ పుస్తకం లోని అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. సరిహద్దుల వద్ద పరిస్థితిని ‘మిలిటరీ నిర్ణయం’ అని చెప్పి ప్రధాని మోడీ బాధ్యత నుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారని లేదా ఏది సరైనదో అదే చేయండి అని చెప్పడం ద్వారా సైన్యానికి బాధ్యతను బదిలీ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నరవణె పుస్తకం చదివితే చైనా మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు మనదేశ నాయకత్వం దానిపై ఎలా స్పందించిందన్న బండారం బయటపడిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పార్లమెంటులో మాట్లాడనీయకుండా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రియాంక గాంధీ తాజాగా ఆరోపించారు. గతంలో ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా, తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసేవని, కానీ ఇప్పుడు ఓ వ్యక్తి అభిప్రాయాన్ని మాత్రమే ముందుకు తీసుకు వస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేతను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారని, ఇలా జరగడం మన పార్లమెంట్ చరిత్ర లోనే తొలిసారి అని రాహుల్ మండిపడ్డారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై విపక్ష నేతను లోక్సభలో మాట్లాడకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని రాహుల్ ధ్వజమెత్తారు. చైనా, పాకిస్థాన్లతో సరిహద్దు ఘర్షణల్లో భారత దేశం వ్యూహాత్మక లాభాలను, నష్టాలను చవి చూసింది. 2020 లో గల్వాన్ లోయ ఘర్షణ తరువాత సరిహద్దులో పరిస్థితి నిరంతరం మారుతూ వచ్చింది. చైనా వాస్తవాధీన రేఖ వద్ద సుమారు 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తన నియంత్రణ లోకి తీసుకుందని అంచనా. అయితే ఈ నేపథ్యంలో ఆత్మవిశ్వాసం గల ప్రభుత్వం సత్యాలను వెలుగులోకి రానిస్తుంది. దీనిద్వారా తన భాగస్వాములను సరైన పాఠాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఆర్మీ మాజీ చీఫ్ నరవణె పుస్తకాన్ని ముద్రణకు అనుమతినీయకుండా పెండింగ్లో ఉంచడానికి బదులు తక్షణం ముద్రణకు అనుమతిస్తే ఏవి వాస్తవాలో, ఏవి కావో పార్లమెంట్లో చర్చించడానికి వీలవుతుంది. లోపాలను సరిచేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. పార్లమెంట్లో చర్చలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం అప్పుడు అడ్డుకోవచ్చు. సరిహద్దుల్లో లక్షల చొరబాటుదార్ల వల్ల జనాభాలో మార్పులు వచ్చి తీరని నష్టం కలుగుతోందని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా తమ ప్రచారంలో ఊదరగొడుతున్న సమయంలో సరిహద్దులో ఘర్షణలను ఎందుకు గట్టిగా నివారించలేకపోతున్నారో అన్న ప్రశ్న ఎదురవుతోంది.
` నవరణే పుస్తకంపై సమాధానం చెప్పాలి ` రాహుల్, ప్రియాంక డిమాండ్ న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇంకా ప్రచురణ కాని నరవణె రాసిన పుస్తకాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు …
జగిత్యాల ఎమ్మెల్యేకు సంజయ్ అనర్హత..
పిటీషన్ను కొట్టేసిన స్పీకర్ ` పార్టీ మారినట్టు ఆధారాలు లేవని వెల్లడి ` స్పీకర్ తీర్పును స్వాగతించిన సంజయ్ ` తాను బీఆరఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని వెల్లడి …
` మున్సిపాలిటీల్లో సత్తాచాటుతాం ` సన్నబియ్యం తీసుకున్న వారంతా ఓటేయాలి ` మున్సిపల్ ఎన్నికల తరవాత రైతుభరోసా ` ఏప్రిల్ తర్వాత పేదలకు లక్షలాది ఇళ్లు ` …
‘అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట్లో ముంచేసాడే గంగరాజు’ అన్నట్లు ఉంది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 కేంద్ర బడ్జెట్లో రెండు రాష్ట్రాలకు కేటాయింపులు లేకుండా నిట్టనిలువునా ముంచారు. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ. 45.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో కీలక రంగాల్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయింపులు లేకపోవడం అన్యాయం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, జిహెచ్ఎంసి పరిధిలో అభివృద్ధి పనులు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర సహకారం లభించలేదు. రూ. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకంలో, జీనోమ్ వ్యాలీ వంటి బలమైన బయోఫార్మా వ్యవస్థ, టీకా తయారీలో తెలంగాణ కీలక పాత్ర ఉన్నప్పటికీ రాష్ట్రానికి అవకాశం కల్పించలేదు. అలాగే ఎలక్ట్రానిక్ భాగాల తయారీ, కెమికల్ పార్కులు, స్పోర్ట్ గూడ్స్ తయారీ, ఆరెంజ్ ఎకానమీ, మెడికల్ వాల్యూ హబ్స్, అంతర్గత జలమార్గాలు, సెమీకండక్టర్ అభివృద్ధి వంటి రంగాల్లో కూడా తెలంగాణను పక్కన పెట్టారు. సింగరేణి బొగ్గు ప్రాంతంలో అరుదైన ఖనిజాల ఆనవాళ్లు ఉన్నప్పటికీ, వాటి అన్వేషణ ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి చోటు కల్పించలేదు. అభివృద్ధి కార్యక్రమాల కోసం 4% ఆర్థిక లోటు అనుమతి ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించగా, తెలంగాణకు మాత్రం 4.3% లోటు కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ, రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు చెందిన ఎంపిలు అందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కేంద్ర బడ్జెట్ 2026 -27లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు. విశాఖ ఎకనామిక్ జోన్కు రూ. 5,000 కోట్లు కోరినా బడ్జెట్లో చూపించలేదు. పోలవరంకు క్రితం బడ్జెట్ మరణ శాసనం రాసినట్లు దాన్ని 135 కి బడ్జెట్లో డెడ్ స్టోరేజీకి పరిమితం చేస్తే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిని పెట్టిన దాన్ని తిరిగి సవరించుకోలేదు. 150 అడుగుల ఎత్తున పూర్తిస్థాయిలో నీరు నిలబెట్టి, (960 ఎండబ్లు దాదాపుగా పూర్తయిన పవర్ ప్రాజెక్టు నడవాలంటే అవసరం), పునరావాసం పూర్తి ప్యాకేజీ కి ఇంకా ఇవ్వాల్సిన దాదాపు రూ. 37 వేల కోట్లలో ఒక్క రూపాయి ఈ బడ్జెట్లో పెట్టలేదు. అమరావతి పునర్నిర్మాణం ఇతర కొన్ని నగరాల అభివృద్ధి పథకంలో భాగమే -రూ. 1,128.91 కోట్లు. (ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ కోసం రూ. 432.09 కోట్లు. పట్టణ తాగునీరు, మురుగు నీటి వ్యవస్థలకు రూ. 800 కోట్లు. రోడ్లు, వంతెనలు అభివృద్ధికి రూ. 350 కోట్లు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ. 500.99 కోట్లు. ప్రకృతి వ్యవసాయానికి రూ. 155.32 కోట్లు సెవరేజ్ వర్క్కు). ప్రత్యేక గ్రాంట్తో కాకుండా అమరావతి అప్పులతో కట్టుకోవాలి. బిజెపి అధ్యక్షుడు, ఎంపిలు ఇంతకుముందు కొండబద్దలు కొట్టినట్టు చెప్పిన మాటలు సంవత్సరానికి రూ. 15,000 కోట్లు. నాలుగు సంవత్సరాలు అది కూడా పూర్తి సహాయం (గ్రాంట్) హామీ గాల్లోకి ఎత్తేసారు. గట్టిగా మాట్లాడే ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దౌర్భాగ్యంగా ఉంది. పులికాట్ సరస్సు వద్ద బర్డ్- వాచ్ ట్రైల్స్ అభివృద్ధికి కేటాయింపులు లేవు. 15 లక్షల మంది యువకులు పారిశ్రామిక అధిపతులుగా మారటానికి రావలసిన ఇన్సెంటివ్స్ విభజన హామీల్లో చాలా గుజరాత్కు ఎత్తుకుపోయిన గద్దలు బర్డ్ వాచింగ్ చేయమంటున్నారు. అదానీకి పారిశ్రామిక లాభాలు డేటా సెంటర్ టాక్స్ హాలిడే (2047 వరకూ) అదానీకి కట్టబెట్టారు. (విశాఖ/ అనకాపల్లి రూ. 22,002 కోట్ల ప్రాజెక్ట్)కు డైరెక్ట్ లాభం 15% సేఫ్- హార్బర్ రేట్ ద్వారా రైడెన్ ఇన్ఫోటెక్ కు చేకూరనుంది. గంగవరం పోర్ట్, సాగర్ మాలా ఎక్స్పాన్షన్లో ఉత్తర తీర పోర్టులకు ప్రాధాన్యత. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులకు ప్రత్యేక ఉపయోగం కల్పించారు. నక్కపల్లి పోర్టు గుజరాతి వ్యాపారి మిట్టల్ (మెటల్స్) ఎలక్ట్రో లైజర్ మాన్యుఫాక్చరింగ్ ఇన్సెంటివ్స్ రేవు అనుబంధంగా స్టీల్ మెటల్ ఎగుమతులకు లాభం చేకూర్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. రేర్ ఎర్త్ మినరల్స్ (4 రాష్ట్రాలకు రూ. 8,200 కోట్లు) ఆంధ్రలో అదానీ గ్రూప్ (శ్రీకాకుళం) బీచ్ సాండ్ మినరల్స్ (గార్నెట్, మోనాజైట్) మైనింగ్ అదానీ & స్పైస్ ఇన్ఫ్రా జెవి ద్వారా కార్యకలాపాలు. ఇంతకుముందు తెలుగువారి చేతిలో ఉండేది ఇప్పుడు ఆపేశారు. ఇంకా చాలామంది గుజరాతీ వ్యాపారుల మయం అయితే ఆంధ్రలో ఉన్న యువత సెక్యూరిటీ గార్డు డ్రెస్సులు వేసుకుని వారి కంపెనీలకు కాపలాదారులుగా ఉన్నారు. రైల్వేబడ్జెట్: ఆంధ్రప్రదేశ్ ప్రసక్తి లేదు. అయితే ముంబైనుంచి హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు వేసే హై స్పీడ్ రైల్వే నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్ కూడా మధ్యలో ఉంది కాబట్టి ఉంది. బుల్లెట్ ట్రైన్: ముంబై- అహ్మదాబాద్, ఢిల్లీ- వారణాసి, చెన్నై- మైసూరు మాత్రమే ప్రస్తావన. క్రితం సారి తెలంగాణకి ఒక కోటి రూపాయలు మాత్రం రైల్వేబడ్జెట్లో పెంచి వాళ్ళ రెండు రాష్ట్రాలకి రూ. 15 వేల కోట్ల రూపాయలు పైగా పెంచారు. ఆ రెండు రాష్ట్రాలకి 61 వేల కోట్ల రూపాయల పైన కేటాయించారు. విశాఖ, హైదరాబాద్ విజయవాడ ప్రాజెక్టుల ప్రత్యేక మెన్షన్ లేదు. తెలంగాణకు ఒక జాతీయ జల ప్రాజెక్టు గత 12 ఏళ్లలో కేటాయించలేదు. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ యువత పారిశ్రామిక మార్పుకు పెద్ద ఉపయోగం లేదు. స్పెషల్ స్టేటస్, ఇండస్ట్రియల్ ప్యాకేజీలు లేవు. అదానీ, మెటల్స్ వంటి పెద్ద కార్పొరేట్లకు మాత్రమే పరోక్ష ఇన్సెంటివ్స్. ముచ్చుకోట సురేష్ బాబు 99899 88912
మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: పదేళ్ళు అక్రమంగా సంపాదించారు.. మొగుడుపెండ్లాం మాట్లాడిన మాటలు విన్నడు.. సినీతారల ఫోన్లు ట్యాపింగ్ చేసినోడు అసలు మనిషేనా? అన్నం తినెటోడు ఎవడైనా భార్యాభర్తల ఫోన్లు వింటడా? కేసిఆర్ ఎవడికి జాతిపిత? తెలంగాణ సమాజం నవ్వుతోంది.. అని మాజీసీఎం కేసిఆర్పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రాంతంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినా లెక్కచేయకుండా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధి.. ఆమె తెలంగాణ తల్లి.. తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన ఫ్రొపెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. ఫోన్లు ట్యాపింగ్లో నోటీసులు ఇస్తే వణికిపోయిన బిఆర్ఎస్ నేతలు కేసిఆర్ జాతిపిత అంటూ కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మీఫాంహూజ్ తెలంగాణ సమాజానికి రాసిస్తావా? నీఆస్తులు ప్రజలకు ఇస్తావా? అంటూ కేసిఆర్పై మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(గూడూరు)లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన బహిరంగసభ బుధవారం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంఖుస్థాపన చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు సీఎం చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారసభకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆలోచించి ఓటువేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మున్సిపల్ శాఖ నాదగ్గరే ఉంది.. మరో 8ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం.. కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు అభివృద్ధి చేసి చూపిస్తాం.. అని సీఎం చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. తెలంగాణలోని రైతులందరికీ 9వేలకోట్ల రూపాయలు ఇస్తామన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలపై కేసిఆర్కు కోపం.. అక్కసు ఉందని, కడుపులో విషం పెట్టుకొని ఎస్ఎల్బిసిని పక్కన పెట్టాడని విమర్శించారు. అనుకొని ప్రమాదం జరిగి ఇంజనీర్లు, కార్మికులు చనిపోతే మామ, అల్లుడు, కొడుకు పండుగ చేసుకొని విషం చిమ్మారని అన్నారు. ఎస్ఎల్బిసిని పూర్తిచేసి తీరుతామని సీఎం భరోసా ఇచ్చారు. నమ్మి టిక్కెట్ ఇస్తే నక్కజిత్తుల భాస్కర్రావు జానారెడ్డిని మోసం చేశాడని, కష్టపడి గెలిపిస్తే పార్టీని వీడి జానారెడ్డిని ఓడించారని గుర్తుచేశారు. మానాయకులను బెదిరిస్తున్నవంట.. ఎవరు బెదిరెటోడు లేడు.. ఒళ్ళు చింతపండు చేస్తాం.. జాగ్రత్త అని మిర్యాలగూడ మాజీఎమ్మెల్యే భాస్కర్రావును హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో 70వేల ఉద్యోగాలు ఇచ్చాం.. 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం.. 1000 బస్సులు కొనిచ్చి ఆడపడుచులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం.. అమ్మగారింటికి వెళ్ళడం.. అమ్మవారి దర్శనానికి వెళ్ళేందుకు టిక్కెట్ లేకుండా చేశాం.. పేదలందరికీ సన్నబియ్యం ఇచ్చాం.. 200యూనిట్ల ఉచితకరెంట్ ఇచ్చి పేదలను ఆదుకున్నాం.. అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆసియా ఖండంలోనే ఎక్కువ పంటపండిస్తుంది.. మిల్లింగ్ చేస్తుంది మిర్యాలగూడ ప్రాంతం అని, ఆప్రాంతం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బిఆర్ఎస్ నేతలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వారి పదేళ్ళ పాలనలో కేవలం బిఆర్ఎస్ నేతలే దోచుకుతినలేదా? అని ప్రశ్నించారు. రాబోయే బడ్జెట్లో లక్షలాది ఇళ్ళకు నిధులు కేటాయించి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు పెంచి ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టినవేనని, అవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయని చెప్పారు. బిఆర్ఎస్ నేతలు మందిని ముంచి మస్తుగా సంపాదించుకున్నరు.. ఇప్పుడు ఏది ఇచ్చినా తీసుకోండి.. కాంగ్రెస్కు ఓటేయండి.. బిఆర్ఎస్ నేతలకు కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వందకు వందశాతం కాంగ్రెస్ గెలవాలని, ఆదిశగా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈబహిరంగ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు బిఎల్ఆర్, కుందూరు జయవీర్రెడ్డి, నేనావత్ బాలునాయక్, వేముల వీరేశం, నలమాద పద్మావతిరెడ్డి, మందుల శ్యామేల్, వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, గుత్తా అమిత్రెడ్డి, పటేల్ రమేష్రెడ్డి, వి.హనుమంతరావు, పున్న కైలాష్, గుడిపాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
5Feb2026 |పంచాంగం : సంకటహర చతుర్థి విశేషాలు, రాశి ఫలితాలు
5Feb2026 | పంచాంగం : సంకటహర చతుర్థి విశేషాలు, రాశి ఫలితాలు 5Feb2026
మనం సాధారణంగా ఏదో ఒక రంగంలో ఉన్న వ్యక్తి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడితే ప్రజలమనిషి అనో, ప్రజాకవి అనో, ప్రజానాయకుడు అనో అంటుంటాం. ఇటీవల కాలంలోనయితే ప్రజాసంబంధ దృక్పథం ఉన్నాలేకున్నా మీదికి అలా నాలుగు మాటలు ప్రజల గురించి మాట్లాడితే చాలు, వారిని ప్రజలమనిషి అంటూ విశేషణాలు తగిలించి ఆకాశానికి ఎగరేయటం చూస్తున్నాం. ‘ప్రజల మనిషి’ అంటే ఎలా ఉంటాడో తన ‘ప్రజల మనిషి’ నవలద్వారా చూపించారు వట్టికోట ఆళ్వారుస్వామి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మనిషి జీవితంలోని అనేక సమస్యలను అధిగమిస్తూ ప్రజానాయకునిగా ఎదిగిన వైనం ఆ నవలలో అద్భుతంగా చిత్రించబడింది. 1928 -38 మధ్య తెలంగాణ ప్రాంతపు సామాజిక చరిత్రను ప్రతిబింబించే ఆ నవలలోని కథానాయకుడు కంఠీరవం. ఆ నవలకు ముందుమాట రాస్తూ అందులోని కంఠీరవం మరెవరో కాదు ఈ నవల రాసిన వట్టికోట వారే అని తేల్చిపారేశాడు దాశరథి రంగాచార్య. నవల చదివిన వారికి దాశరథి మాటల్లోని నిజం అర్థమవుతుంది. 1930 నుంచి 50 దాకా గల సామాజిక చరిత్రను నమోదు చేయాలనే ఉద్దేశంతో వట్టికోట మూడు నవలలు రాయాలనుకున్నారు. మొదటి నవల ప్రజల మనిషి. రెండవది గంగు. దానిని పూర్తి చేయకుండానే ఆయన వెళ్ళిపోయాడు. చాలామంది ఒప్పుకోరు కానీ ‘ప్రజల మనిషి’ నవల చారిత్రక నవలనే. 1920, 30 ప్రాంతాల తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలంటే ఈ నవలను చదివి తెలుసుకోవచ్చు. అలాగే 1940-45 మధ్య కాలపు తెలంగాణ గడ్డమీది పరిణామాలను ‘గంగు’ నవలలో చిత్రించారు. ప్రజల మనిషిలోని కంఠీరవం పాత్రకు ఆనాటి చరిత్రకు అవినాభావ సంబంధముంది. ఆనాటి పరిస్థితులే పేదవాడైన కంఠీరవాన్ని ప్రజనాయకునిగా మార్చాయి. ప్రజలకు ఎన్ని మార్గాలద్వారా చైతన్యాన్ని నూరిపోయవచ్చో అన్ని మార్గాలను వాడుకున్నారు కంఠీరవం. కాదు కాదు వట్టికోట ఆళ్వారుస్వామి. గ్రంథాలయాల స్థాపన దగ్గరినుంచి ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన అనేక ప్రజాచైతన్య కార్యక్రమాలను ముందుండి నడిపించడం దాకా వట్టికోట వారి కృషి బహుముఖాలుగా విస్తరించిందది. హోటల్ కార్మికునిగా, కాంచనపల్లి సీతారామరావు అనే ఉపాధ్యాయునికి వంటమనిషిగా, ‘గోల్కొండ పత్రిక’లో ప్రూఫ్ రీడర్గా పనిచేశారు. కందిబండ గ్రామానికి చెందిన నారపరాజు రాఘవరావు కుటుంబంతోగల పరిచయం వట్టికోట జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ కుటుంబం ఏర్పాటు చేసిన ‘సీతారామ గ్రంథాలయం’లో అనేక పత్రికలు, గ్రంథాలు చదవటం వల్ల తన ఆలోచనాపరిధి విశాలమైంది. అనేక చోట్ల పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలవల్ల సమాజం అర్థమయింది. ముఖ్యంగా బెజవాడలో హోటల్లో పనిచేస్తున్నప్పుడు నిజాం పాలన కింద ఉన్న తెలంగాణకు, బ్రిటీషు పాలనలోని ఆంధ్రాప్రాంతానికి మధ్య తేడా స్పష్టంగా తెలిసి వచ్చింది. దొరల కింద నలుగుతున్న తెలంగాణా ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న ఆలోచన ఆ రకంగా కలిగి ఉంటుంది. నిజాం నిరంకుశత్వానికి, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కలమెత్తటం, గళమెత్తటం ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. నిజామాబాదు జైలులో తనతో పాటు ఖైదీగా ఉన్న దాశరథి కృష్ణమాచారి చెప్పిన పద్యాలను గోడలమీద రాసిన సాహసి ఆయన. తన జైలు అనుభవాలను జోడిస్తూ ఖైదీల దుర్భర పరిస్థితులను మానవహక్కుల నేపథ్యంలో కథలుగా మలిచాడు. అవి ‘జైలు లోపల పేరుతో గ్రంథస్థమయ్యాయి. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యాన్ని ప్రోదిచేయవచ్చు అనే సంకల్పంతో 1938లో ‘దేశోద్ధారక గ్రంథమాల‘ను స్థాపించి అనేక విలువైన రచనలను వెలుగులోకి తెచ్చారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా విపరీతమైన అణిచివేతకు గురవుతున్న ఆనాటి తెలంగాణ సమాజానికి ఆళ్వారు స్వామి చేసిన సేవలు ఎంతో విలువైనవి. ప్రజల కోసం ఇంతలా తపించిన వట్టికోట నిజంగా ప్రజల మనిషి. తోకల రాజేశం, 96767 61415
న్యూఢిల్లీ : లోక్సభలో బుధవారం ప్రధాని మోడీ ప్రసంగించడానికి కొన్ని నిమిషాల ముందు మహిళా ఎంపీలు ఆయన చైర్ను ఘెరావ్ చేయడం తీవ్ర గందరగోళం సృష్టించింది. విపక్షాల ఎంపీల నిరసనల హోరు అధికార పక్ష సభ్యుల బెంచీల వద్ద ఘర్షణలకు దారి తీసి ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అనేక మంది విపక్షాల మహిళా ఎంపీలు సభ మధ్యలోకి దూసుకొచ్చి ప్రధాని కుర్చీని చుట్టుముట్టారని , వారి స్థానాలకు తిరిగి వెళ్లి కూర్చోవాలని సీనియర్ మంత్రులు పదేపదే అభ్యర్ధించినా పట్టించుకోలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. పరిస్థితి అదుపులో లేకపోవడంతో ప్రధాని మోడీ సభలోకి ప్రవేశించలేక పోయారని తివారీ చెప్పారు. “ ప్రధాని ఎక్కడైతే కూర్చుంటారో ఆ చైర్ పైకి మహిళా ఎంపీలు కూర్చున్నారు. పెద్ద గందరగోళం సృష్టించారు.” అని తివారీ ఆరోపించారు. తీవ్ర పదజాలంతో వారు దూసుకురావడంతో భద్రతాపరమైన సమస్యలను తెచ్చిపెట్టింది. ప్రధానిపై కూడా దాడి చేస్తారేమో అని పించింది” అని తివారీ పేర్కొన్నారు. విపక్ష ఎంపీలు “ జో ఉచిత్ లగే వో కరో ” అన్న నినాదం రాసి ఉన్న పెద్ద బ్యానర్ పట్టుకుని గట్టిగా నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ ఎంపీలు కూడా ఈ ఆందోళనలో చేరడంతో నిరసన మరింత ఉధ్ధృత రూపం దాల్చింది. ఆ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో హాజరు కాలేదు.
దివాలా కంపెనీకి వేల కోట్ల టెండర్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన బినామీ కంపెనీకి దోచి పెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ విధంగా బినామీ కంపెనీగా పనిచేస్తుందో ఆధారాలతో సహా బయట పెట్టారు. కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ మొదటి నుంచి రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీగా వ్యవహరిస్తున్నదని, ఈ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే అన్నారు. అయితే తాజాగా ఈ కె ఎల్ ఎస్ ఆర్ అనే కంపెనీ న్యాయమూర్తులను మేనేజ్ చేసే విషయం నుంచి దివాలా తీసిన ఈ కంపెనీలో కొనసాగుతున్న వందల కోట్ల ఆర్థిక లావాదేవీలను పైన నిగ్గుతెల్చాలని సుప్రీంకోర్టు వారం కింద తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని, తన బినామీ కంపెనీ, తన అక్రమాలు బయటపడతాన్న ఉద్దేశంతోనే దావోస్లో ఉన్న రేవంత్ రెడ్డి సిట్ విచారణ పేరుతో డ్రామాలకు తెరలేపారని కెటిఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఈ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, అనుబంధం, ముఖ్యమంత్రి అయ్యాక చేసిన అనుచిత లబ్ధి, కట్టబెట్టిన వేలకోట్ల రూపాయల కాంట్రాక్టు అంశాన్ని కేటీఆర్ స్పష్టంగా వివరించారు. ఈ కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ కారును ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాడుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ పైన 2018 లోనే ఈడీ మరియు ఇన్కమ్ టాక్స్ దాడులు చేసిందని, అప్పుడే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ కంపెనీకి ఉన్న సంబంధాల గురించి మీడియా బయటపెట్టిందన్నారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దివాళా తీసి ఎన్.సి.ఎల్.టి లో దివాలా ప్రక్రియ కేసు నడుస్తున్న ఈ కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి భుజాల మీదకు ఎత్తుకున్నారని కెటిఆర్ ఆరోపించారు. ఈ కంపెనీ 2018 సెప్టెంబర్ 27 న రేవంత్ రెడ్డి బంధువుల పైన ఐటీ రైడ్స్ జరిగాయని చెప్పారు. సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ, కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ మధ్య నిధులు చేతులు మారిన విషయాన్ని, టాక్స్ ఎగవేతలను ఈ దాడుల సందర్భంగా గుర్తించారని వివరించారు. భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య కంపెనీల డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయని కెటిఆర్ గుర్తు చేశారు. ఈ రెండు కంపెనీలు రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలను విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. అయితే ఈ కంపెనీ కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఒక బినామీ కంపెనీ అని అందరికీ తెలుస న్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బినామీ కంపెనీల మాస్టర్గా పనిచేస్తున్నారని, రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ నేతలకు బినామీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల కాలంలో అనేక కుంభకోణాలను ప్రధాన ప్రతిపక్షంగా బయటపెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేస్తూ ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి దాటవేత ధోరణితో వ్యవహరించారన్నారు. ఈ కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ 23 జూలై 2023 వ సంవత్సరంలో ఏ.ఎస్.ఎం.ఈ.టి అనే కంపెనీ మధ్య గొడవ జరిగిందని, వారిద్దరూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను అప్రోచ్ అయ్యారని, ఆ తర్వాత కేసు నడుస్తున్నదని తెలిపారు. ఆ తర్వాత ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ పిటిషన్ వేసి తాము దివాలా తీసిన విషయాన్ని స్పష్టంగా చెప్పిందని, దాంతో ఈ కంపెనీలో ఆర్థిక లావాదేవీలను ఎన్.సి.ఎల్.టి నిషేధించిందని కెటిఆర్ గుర్తు చేశారు. అయితే ఎన్సిఎల్టి లో జరుగుతున్న ఈ కేసు విషయంలో ఒక ఉన్నత న్యాయస్థానానికి చెందిన జడ్జ్ ద్వారా ఎన్సిఎల్టి జస్టిస్ శరత్ కుమార్ పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, ఆయన ఆ విషయాన్ని బయటపెట్టి ఆ కేసు నుంచి తప్పుకున్నారని కెటిఆర్ తెలిపారు. అయితే ఎన్.సి.ఎల్.టి లోనూ జడ్జిల ద్వారా కంపెనీకి సానుకూలంగా తీర్పు వచ్చేలా నిలబడిన వ్యక్తి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి అని కెటిఆర్ ఆరోపించారు. కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీలో రేవంత్ రెడ్డికి అనేక పెట్టుబడులు పెట్టాడని, అందుకే రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన సాయి మౌర్య అనే కంపెనీతో లావాదేవీలు నడిపిందన్నారు. కెఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భారీగా భూములు కొనుగోలు చేసే పని చేసిందని కేటీఆర్ తెలిపారు. 2018 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఈ కంపెనీ మీద దాడి చేసి అనేక ఆధారాలు బయటపెట్టారన్నారు. ఇంత దుర్మార్గమైన, నీచమైన చరిత్ర ఉన్న కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి, దివాళా తీసిన కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డి హయాంలో 6వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వచ్చాయని, అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్ట్ పనులు, రహదారుల పనులు అన్నీ కలిపి సుమారు 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్కులను ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ ఎలా పొందిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని పురపాలక శాఖతో పాటు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కంపెనీ భారీగా పనులు దక్కించుకున్నదన్నారు. అయితే 2023 నుంచే దివాళా తీసిన కంపెనీకి 2024- 26 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎలా కాంట్రాక్టులు ఇచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి 15 లక్షల రూపాయలు కూడా లేవని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నదని, అంతటి ఆర్థిక వనరులు లేని కంపెనీ వేల కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టులకు సంబంధించిన వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలను ఎందుకు, ఏ విధంగా సబ్మిట్ చేస్తుంది అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, ఆ మేరకు జడ్జిని ప్రభావితం చేసే అంశంతో పాటు ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీలోకి వచ్చిన వందల కోట్ల రూపాయల నిధుల విషయం పైన విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అందులోనే భాగంగానే సిబిఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడు ఏజెన్సీల ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని రాష్ట్రాన్ని కోరుతూ నోటీసు కూడా ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ నోటీసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే తనతో పాటు పార్టీ నేతలు హరీష్ రావు, సంతోష్ రావు, పార్టీ అధినేత కేసీఆర్కి టెలిఫోన్ ట్యాపింగ్ సిట్ నోటీసుల పేరిట డ్రామాలు ఆడారని, ఈ అంశానికి సంబంధించి దావోస్ నుంచి స్వయంగా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపించారన్నారు. నోటీసులను ఎందుకు దాచి ఉంచారు : తాము ఆధారాలతో సహా ఈ 6వేల కోట్ల స్కామ్తో పాటు కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి సంబంధించిన అవకతవకల పైన రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చిన అనుచిత లబ్ధి పైన దర్యాప్తు జరపాలంటూ రాష్ట్రానికి ఇచ్చిన నోటీసులను ఎందుకు ముఖ్యమంత్రి దాచి ఉంచారన్న విషయాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక దివాలా తీసిన కంపెనీ పైన రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత అమితమైన ఆసక్తి ఉన్నదని, ఇది కేవలం కమిషన్ల కోసమా లేక భాగస్వామ్యం కోసమా లేక అక్రమ సంపాదన ఆ కంపెనీ ద్వారా పంపించుకోవడానికా లేకుంటే ఆ కంపెనీ స్వయంగా రేవంత్ రెడ్డిదా అన్న విషయం తేలాల్సిన అవసరం ఉన్నదని, ఈ అంశం పైన రేవంత్ రెడ్డి స్వయంగా సమాధానం చెప్పాలి అన్నారు. వెంటనే సుప్రీంకోర్టు ఆదేశించినట్లు రాష్ట్రంలో సిబిఐ తో ఈ అంశంలో ఎంక్వయిరీ నిష్పాక్షికంగా జరిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటిదాకా కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టును రద్దు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్ట్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ చేయాలి : సుప్రీంకోర్టు విచారణ పూర్తి అయ్యేదాకా ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి నూతన కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే సిబిఐ, ఈడీ ద్వారా విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కిషన్ రెడ్డి స్పందించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకువచ్చి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు నోటీసులను పక్కన పెట్టి మరీ కిషన్ రెడ్డి, బిజెపి రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం కేవలం అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం మాత్రమే కాకుండా మనీ లాండరింగ్ మీద కూడా ముఖ్యమంత్రి పాత్ర ఉందని. ఈ అంశం పైన కేంద్ర ఏజెన్సీలు విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాము అన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఈ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ విషయంలో సమగ్ర విచారణ జరిపేదాకా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో : రాష్ట్రంలో ఏ పనులు కావాలన్నా, బిల్లులు కావాలన్నా ఆర్ఆర్ ట్యాక్సి కట్టాల్సిన దుస్థితి నెలకొందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు కమీషన్లతో దోపిడికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటే కమీషన్ రాజు, ల్యాండ్ మాఫియా, దోపిడి...ఇలాంటి కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు.మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎంఎవిఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో విజయ సంకల్ప సమేళనం సందర్భంగా ముఖ్యకార్యకర్తల జరిగింది. తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించేదానికి కొన్ని వర్గాలను సంతృప్తి పర్చేదానికి కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని, ముస్లింలంటే కాంగ్రెస్ అంటూ తమ వాదాన్ని వినిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా సంసృతిని సాంప్రదాయాన్ని పూర్తిగా విస్మరించి సనాతన దర్మాన్ని గాయపర్చే విధంగా కేవలం ఒక వర్గాన్ని ,మైనార్టీ వర్గాన్ని సంతృప్తి పర్చుతున్నాడో తెలంగాణ ప్రజాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలను సంతృప్తి పర్చేండంలో పరాకాష్టకు చేరాడన్నారు. ఎస్సి,ఎస్టి,బిసిలకు సంబందించిన సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపుల్లో తగ్గించి మైనార్టీలకు అధిక బడ్జెట్ కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పడుతున్న తాపత్రయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడి వక్బోర్డు సవరించాలని బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఏరకంగా వ్యతిరేకిచిందో తెలుసుకోవాలని కోరారు. రాష్ట్రంలో లక్షల రూపాయలు విలువ చేసే 77 వేల ఎకరాలు వక్ బోర్డు భూములను అప్పగించారని ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో హిందూ దేవాలయపై దాడులు జరుగుతున్నా నోరు మెదపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన విద్వంసం కాని గాందీనగర్ దేవాలయంను అపవిత్రం చేసిన సంఘటనలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహించి హిందూ మనో భావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దారుమణివ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలన్ని చూస్తుంటే సనాతన ధర్మాని ఎలా నాశనం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ దేశానికి సనాతన ధర్మమే ఒక గుర్తింపు, ఒక ఆత్మ అని, అలాంటి ఆత్మమీద దాడి జరిగితే బిజెపి కార్యకర్తలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోది మహిళా సంక్షేమం కోసం,వారి అభ్యున్యతి కోసం, నారి శక్తి పేరుమీద అనేక కార్యక్రమాలు తీసుకుంటుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందన్నారు. మహిళలకు రూ.2500, కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని మహిళలకు మోసం చేసిందని ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవ చేశారు. మహిళలకు జరిగిన అన్యాయంపై కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళలకే కాకుండా సమాజంలో ఉన్న రైతులతో పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు ఓబిసి ప్రజలను దగా చేస్తోందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా కింద ఇస్తామన్న రూ. 15 వేలు, భూమి లేని రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఎస్సిలను,ఆదివాసులను మోసం చేసిన ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో ప్రధాని నరేంద్ర మోది తెలంగాణను అభివృద్ది చేసే విధంగా బడ్జెట్లో నిధులు పెద్ద ఎత్తున విడుదల చేశారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైల్వేకు రూ- 5400 కోట్లు కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి పూణే,హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగుళూరు కు మూడు హైస్పీడ్ రైళ్ల క్యారిడార్లను తెలంగాణకు ఇచ్చారంటే తెలంగాణపై ప్రధానికి ఎంత ప్రేమె ఉందో తెలుసుకోవాలని కోరారు. ఫార్మరంగంతో పాటు పారిశ్రామిక రంగాలతో పాటు చివరికి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు,మెగా టెక్స్టైల్స్ పరిశ్రమ,హైదరాబాద్ నాగపూర్ కారిడార్ ,హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రీ కారిడార్ వంటి ఎన్నో అభివృద్ది పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోది నాయకత్వం పట్ల ఆదరణ పెరుగుతోందని అన్నారు. మదర్ ఆఫ్ దీస్ పేరుతో నరేంద్ర మోది ప్రభుత్వం యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకొని దేశాభివృద్ది కోసం పాటుపడుతోందని అన్నారు. అమెరికా అనేక ఆంక్షలు విధించినప్పటికి, అమెరికా కూడా దిగివచ్చి ఇవాల 18 శాతం సుంకాన్ని తగ్గించిందంటే అది ప్రధాని నరేంద్ర మోది పరిపాలన తీరుకు నిదర్శమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 35 శాతం ఓటింగ్ శాతం వస్తే ఈ ఎన్నికల్లో తప్పకుండా బూతు లెవల్లో 50 శాతం ఓటింగ్ పెంచే విధంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బిజెపి విజయ దుందిబి మోగించిందని కొనియాడారు. మహారాష్ట్రతో పాటు అరుణాచల ప్రదేశ్, బీహార్,కేరళలోని తిరుపనంతపురం , గోవ,చండీగడ్ ఎన్నికల్లో ప్రజలు బిజెపిని గెలిపిస్తున్నారంటే అది ప్రధానిపై ప్రజలకున్న విశ్వాసమని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్న కళలు, పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకు గెలుపు దిశగా బిజెపి పయనిస్తోందన్నారు. యువనాయకత్వాన్ని పార్టీ ప్రోత్సహించేందుకు పార్టీ ముందు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, లక్షణ్, ఎంపి డికె అరుణ, రాష్ట్ర నాయకులు శాంతికుమార్, ఆచారి, పద్మాజారెడ్డి, రాములు, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే కె. సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పారు. సంజయ్కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో ఆయనకు ఊరట లభించింది. పార్టీ ఫిరాయించరనడానికి పిటిషనర్ సాక్షాధారాలు ఏవీ చూపించకపోవడంతతో ఆయన బిఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ పార్టీ ఫిరాయించారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను స్పీకర్ కొట్టి వేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్లోకి ఫిరాయించారని బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరిపి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారలేదని, వారు బిఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్నూ స్పీకర్ కొట్టివేయడంతో మొత్తం ఎనిమిది మందికి క్లీన్ చీట్ లభించింది. ఇదిలాఉండగా ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ తీర్పుపై స్పందిస్తూ తాను పార్టీ మారలేదని, బిఆర్ఎస్లోనే ఉన్నానని అన్నారు. బిఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయం నిర్వహణకు ప్రతి నెలా తన జీతం నుంచి ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నానని చెబుతూ ఇంతకంటే పెద్ద సాక్షం ఏమి కావాలన్నారు. తాను బిఆర్ఎస్లో ఉన్నానంటూ పలు సాక్షాలతో ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ వద్ద అఫిడవిట్ దాఖలు చేశారు. స్పీకర్ తీర్పుపై బిఆర్ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరితే స్పీకర్ పార్టీ లేదని తీర్పు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనిపై తాము న్యాయ నిపుణులతో చర్చించి కోర్టులో సవాల్ చేస్తామన్నారు. కడియం, దానంపై కేసుల విచారణ ఇదిలాఉండగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్పై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణకు చేపట్టారు. పిటిషనర్, కుద్బుల్లాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానందను రెస్పాండెంట్ తరపు న్యాయవాది పలు ప్రశ్నలు వేశారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసునూ స్పీకర్ 19వ తేదీకి వాయిదా వేశారు. తాము పార్టీ మారలేదని, బిఆర్ఎస్లోనే ఉన్నామని ఎమ్మెల్యేలు కడియం, దానం ఇదివరకే అఫిడవిట్ దాఖలు చేశారు.
2020లో జరిగిన భారత్ - చైనా ఘర్ష ణ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ తన బాధ్యతలను విస్మరించారని, ఆ బాధ్యతను జనరల్ నరవణేకు అప్పగించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రాసిన విడుదలకాని జ్ఞాపకాలను ఉదహరిస్తూ ఈ ఆరోపణ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ, మాజీ ఆర్మీ చీఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన జ్ఞాపకాలులోని అంశాలను ప్రస్తావించి, ప్రభుత్వం మరో విధంగా చెబుతు న్నా, ఈ పుస్తకంలోని విషయాలను దేశంలోని యువకులు తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ కానీ, రక్షణమంత్రి రాజ్ నాథ్సింగ్ కానీ ఈ పుస్తకం చదవలేదని, ప్రభుత ్వం మాత్రం నరవణే వాదనకు భిన్నంగా ఆలాంటిది ఏమీ లేదని చెప్పిందని రాహుల్ అన్నారు. లడఖ్లో ఏమి జరిగిందో నరవణే పూర్తి కథనాన్ని రాశారని, దీనిని అంతా చదవాలని ఆయన అన్నారు. లోక్సభలో మాత్రం తాను ఈ జ్ఞాపకాలు నుంచి అంశాలను ప్రస్తావించ రాదని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. చైనా ట్యాంక్లు మన భూభాగంలోకి చొచ్చుకవస్తే.. ఏంచేయాలని జనరల్ ప్రశ్నించినప్పుడు ప్రధాని ఏది ఉచితమో అదే చేయండి అన్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కానీ, ఎస్, జైశంకర్, కానీ, ఎన్ ఎస్ ఏ అజిత్ డోవల్ కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని నరవణే పేర్కొన్న విషయాన్ని జ్ఞాపకాల నుంచి రాహుల్ ఉటంకించారు. చైనా దళాలు చొచ్చుకు వస్తే తమను అడగకుండా వారిపై కాల్పులు జరపవద్దు అని సైన్యానికి పై నుంచి స్టాండింగ్ ఆర్డర్ ఉందని నరవణే తెలిపారు. మన భూభాగంలోకి చొచ్చుకువచ్చిన, చైనా ట్యాంకులపై తాను కాల్పులు జరపాలను కున్నట్లు మాజీ జనరల్ పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. ఆర్మీ చీఫ్ ఆ విపత్కర పరిస్థితిలో తాను ఒంటరిగా ఉన్నానని, బాధ్యతగల ప్రభుత్వం విడిచివేసిందని రాశారని పేర్కొంటూ, పార్లమెంటులో ఈ విషయం చెప్పేందుకు తాను సిద్ధపడినా, ఈవాస్తవాలు అంగీకరించేందుకు వారు భయపడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని పార్లమెంటుకు వస్తే .. తాను ఈ పుస్తకాన్ని ఆయనకు బహూకరిస్తానని, ఈ పుస్తకం ప్రతిపక్షనాయకుడు రాసింది కాదని, బాధ్యతాయుతమైన మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అని లోక్ సభలో ప్రతిపక్షనేత అన్నారు. చైనా సైన్యం మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ పై ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సివచ్చింది. నిర్ణయం తీసుకోవల్సిన ప్రధాని బాధ్యత నుంచి తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు . దేశం ఈ విషయాన్ని ప్రశ్నిస్తుంటే... ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా పారిపోతోందని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఆందోళన జరిపిన ప్రతిపక్షంలోని 8 మంది సభ్యులను లోక్సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నాడు న్యాయవాదిగా సుప్రీంకోర్టుకు హాజరై తమ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నేపథ్యంలో తలెత్తిన సమస్యలను విన్నవించారు. మూడు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన వేళ.. తమ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ... హడావుడిగా సర్ చేపట్టారని మమతా బెనర్జీ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. తక్కువ వ్యవధిలో చేపట్టిన ఈ ప్రక్రియ కారణంగా ఒత్తిడికి లోనైన దాదాపు 150 మందికి పైగా మరణించారని, వారిలో బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓ)లు కూడా ఉన్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. దయచేసి ప్రజల హక్కులను కాపాడండి ...సార్ అని మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చేతులు జోడించి విజ్ఞప్తి చేయడం నాటకీయతను తలపించింది. ఒక దశలో న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోంది.. అని ఆమె సుప్రీంకోర్టులో గొ గ్గోలు పెట్టడం న్యాయమూర్తులనే విస్మ యం పరచింది. భారత ఎన్నికల కమిషన్ తో తాను సాగిస్తున్న పోరాటంలో తన వాదనను స్వయంగా వినిపించేందుకు మూడురోజులక్రితం దేశరాజధానికి వచ్చిన మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో సర్ ప్రక్రియ నుసవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సుర్యకాంత్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. ధర్మాసనంలో జస్టిస్ , జోయ్ మల్యబాగ్చి, విపుల్ పంచోలీ కూడా ఉన్నారు. సర్ విషయంలో తన అభ్యంతరాలను ఎన్నికలకమిషన్ పూర్తిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ, హెచ్చిన స్వరంతో ఈసీ మీద పలు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్ర జలను అణచివేయడానికే ఎన్నికల కమిషన్ బెంగాల్ ను టార్గెట్ చేసిందని ఆమె పేర్కొన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి కోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఒకటొకటిగా పే ర్కొం టూ, సర్ మొదటి దశ ఫలితంగా దాదాపు 58 లక్షల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయని, చాలా మంది ఓటర్లకు ఫారమ్ 6 కింద అపీలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ తొలగింపులను బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్లు చేశారని, ఈ ప్రక్రియలో స్థానిక సిబ్బందిని పక్కన పెట్టారని , నివాస ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వం జారీ చేసిన రుజువులు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను తిరస్కరిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. భాషా సమస్యలు, స్పెల్లింగ్ సరిపోలలేదనే కారణంగా ఓటర్ల జాబితా నుంచి ప్రజల పేర్లు తొలగించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఉదాహరణకు ఒక మహిళ తన అత్తమామల ఇంటి పేరును ఉపయోగించినందున ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారని వివరించారు. వివాహం త ర్వాత ఒక మహిళ తన నివాసాన్ని మారినప్పుడు ఈసీ ఆమెను అనుమానితుల లిస్ట్ లో ఉంచుతుందని ఆమె పేర్కొన్నారు. ఆధార్ను అంగీకరించడానికి నిరాకరించడం ద్వారా ఈసిఐ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నదన్నారు.మరి కొద్ది నెలల్లో నాలుగు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్తుండగా, ఎన్నికలకు ముందు బెంగాల్ నే లక్ష్యంగా చేసుకున్నారని మమతా ఆరోపించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా సమీక్ష చేపట్టారు.మరి మూడు నెల్లల్లోనే, హడావుడిగా ఇలా చేసేందుకు ఎందుకు తొందరపడ్డారను ఆమె ప్రశ్నించారు. సర్ నోటీసులు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోర్టు భారత ఎన్నికల కమిషన్ కు నోటీసు జారీ చేసింది. నోబెల్ బహుమ తి గ్రహీత అమర్త్య సేన్, ప్రఖ్యాత బెంగాలీ కవి జాయ్ గోస్వామీ, తృణమూల్ ఎంపీ దీపక్ అధికారి వంటి ప్రముఖులకు కూ డా సర్ నోటీసులు పంపబడ్డాయని తెలిసింది. ఈ కేసును వాయిదా వేస్తూ, మమతా విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. 10లోగా ఇసి తమ స మాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.
గురువారం రాశి ఫలాలు (05-02-2026)
మేషం ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వాహన సంభందిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభం ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిధునం వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కర్కాటకం వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కన్య దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి. తుల సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార మందకొడిగా సాగుతాయి. వృశ్చికం చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ధనస్సు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుంభం కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనం ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.
మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’
హైదరాబాద్: పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రం మార్చి 26న ఈ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ […] The post మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ appeared first on Visalaandhra .
శర్వానంద్ సినిమాలోరాజశేఖర్ కీలక పాత్ర
హైదరాబాద్: శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర’. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో […] The post శర్వానంద్ సినిమాలోరాజశేఖర్ కీలక పాత్ర appeared first on Visalaandhra .
‘వారణాసి’ ఒక భాగమేదర్శకుడు రాజమౌళి
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ రెండు భాగాలుగా వస్తోందనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి చెక్ పెట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… రెండు భాగాలుగా సినిమాను నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ చివరకు ఒక పార్ట్ గానే విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండవచ్చని […] The post ‘వారణాసి’ ఒక భాగమేదర్శకుడు రాజమౌళి appeared first on Visalaandhra .
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర హాస్యనటుడు బాబీ మృతి
హైదరాబాద్: తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త’, ‘సుమ అడ్డా’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ (బాబీ) రోడ్డు ప్రమాదంలో మతి చెందారు. రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై సోమ వారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతివేగంగా వచ్చిన రెండు బైక్లు బలంగా ఢీకొనడంతో ఈ అనర్థం జరిగింది. ఈ ప్రమా దంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే మరో ఇద్దరు యువకులు కూడా […] The post రోడ్డు ప్రమాదంలో బుల్లితెర హాస్యనటుడు బాబీ మృతి appeared first on Visalaandhra .
. 2018లోనే అతడి ప్రతిభను గుర్తించాం. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్రేకఅవుట్ స్టార్గా మారతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ఈ యువ బ్యాటర్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడిగా, అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకునే సత్తా అతడికి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 ఐపీఎల్ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్కు […] The post టీమిండియాకు అభిషేక్ కీలకం appeared first on Visalaandhra .
ఐసిసి టి20 ర్యాంకింగ్స్.. టాప్లోనే అభిషేక్, వరుణ్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజాగా టి20 ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ (బ్యాటింగ్), వరుణ్ చక్రవర్తి (బౌలింగ్) తమ టాప్ ర్యాంక్లను నిలబెట్టుకున్నారు. న్యూజిలాండ్తో ఇటీవల ముగిసిన టి20 సిరీస్లో అభిషేక్ అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంఅభిషేక్ 917 రేటింగ్ పా యింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 834 పాయింట్లతో రెండో ర్యాంక్ను కాపాడుకున్నాడు. అయితే భారత బ్యాటర్ తిలక్ వర్మ ఒక ర్యాంక్ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. గాయం వల్ల తిలక్ కివీస్కు దూరంగా ఉన్నాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్పై బడింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంక్కు చేరుకున్నాడు. పాథుమ్ నిసాంకా (శ్రీలంక) ఒక ర్యాంక్ మెరు గు పడి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం సూ ర్యకుమార్ ఆరో ర్యాంక్లో నిలిచాడు. ఫర్హాన్ (పాకిస్థాన్) ఏడో, ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ 8వ ర్యాంక్లో నిలిచారు. టిమ్ సిఫర్ట్ (కివీస్), మిఛెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) టాప్10లో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి776 పాయింట్లతో టాప్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్థాన్ బౌలర్అబ్రార్ అహ్మద్ రెండో ర్యాం క్కు దూసుకొచ్చాడు. రషీద్ ఖాన్ (అఫ్గాన్) మూడో ర్యాంక్కు పడిపోయాడు. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) రెండు ర్యాంక్లు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు.జాకబ్ డఫీ (కివీస్) ఐదో, వనిందు హసరంగ (శ్రీలంక), ఆరో, నవాజ్ (పాకిస్థాన్) ఏడో, ముస్తఫిజుర్ (బంగ్లా) 8వ, ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) తొమ్మిదో, ముజీబ్ (అఫ్గాన్) పదో ర్యాంక్లో కొనసాగుతున్నారు.
‘ఎప్స్టీన’ విచారణకు క్లింటన్ అంగీకారం
వాషింగ్టన్/లండన్: అమెరికా రాజకీయాలను కుదిపివేసిన ఎప్స్టీన్ వ్యవహారంలో విచారణకు హాజరవుతామని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింగన్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్ ఓవర్సైట్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని వారి న్యాయవాదులు తెలిపారు. క్లింటన్ దంపతులు గతంలో వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో వారిపై చర్యలు తీసుకుంటామని రిపబ్లికన్ పార్టీకి చెందిన జేమ్స్ కోమర్ కాంగ్రెస్ హౌస్ ఓవర్సైట్ కమిటీకి చైర్మన్ హోదాలో హెచ్చరించారు. ధిక్కార నేరం రుజువైతే […] The post ‘ఎప్స్టీన’ విచారణకు క్లింటన్ అంగీకారం appeared first on Visalaandhra .
ఇంట్లోకి చొరబడి కాల్చిచంపిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులున్యాయ విచారణకు సైఫ్ రాజకీయ బృందం డిమాండ్ ట్రిపోలీ: లిబియా మాజీ అధినేత గద్దాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం (53) హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని నలుగురు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. జింటాన్లోని గద్దాఫీ ఇంటిలోకి చొరబడి ఆయనను కాల్చి చంపినట్లు సైఫ్ సలహదారుడు వెల్లడించారు. ఈ దాడి సూత్రధారి ఎవరో తేలాల్సి ఉన్నట్లు చెప్పారు. హత్యకు ముందు తన భద్రత విషయంలో సైఫ్ మిత్రుడి వద్ద ఆందోళన వ్యక్తం […] The post గద్దాఫీ కుమారుడి దారుణ హత్య appeared first on Visalaandhra .
బలూచిస్థాన్లో సైన్యంపై రెబల్స్ దాడులు: రక్షణ మంత్రి ఆసిఫ్ ఇస్లామాబాద్: బలూచిస్థాన్లో భద్రతా బలగాలు భౌగోళికపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ వెల్లడించారు. 12 చోట్ల రెబెల్స్ దాడులు చేశారని, ఇది తీవ్రమైన భద్రతా పరిస్థితిని నెలకొల్పిందని చెప్పారు. బలూచిస్థాన్లో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారని, సైన్యంపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. బలూచ్ ప్రావిన్సులోని పట్టణాలపై ఏకకాలంలో రెబల్స్ మెరుపు దాడులు చేసినట్లు తెలిపారు. దీంతో 80 మంది భద్రతా సిబ్బంది చనిపోగా, 30కిపైగా ప్రభుత్వ […] The post పాక్కు భౌగోళిక సవాళ్లు appeared first on Visalaandhra .
అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, వెనిజులాలో నిరసనలు మాస్కో/కారకస్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను నిర్బంధించి నెలరోజులు గడిచినా వారిని విడుదల చేయకపోవడంతో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మదురో దంపతులను తక్షణమే విడుదల చేయాలని వెనిజులాతో పాటు రష్యాలోనూ పౌరులు వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శనలు నిర్వహించారు. రష్యా రాజధాని మాస్కోలో వెనిజులా రాయబార కార్యాలయం సమీపంలో నిరసన చేపట్టారు. వెనిజులాపై చేసి దాడిని వారు తీవ్రంగా ఖండించారు. రష్యా కమ్యూనిస్టు పార్టీ […] The post మదురోను విడుదల చేయాలి appeared first on Visalaandhra .
ఇందిరమ్మ ఇళ్లు పేదలఆత్మగౌరవానికి ప్రతీక
. ‘మున్సిపల’ తొలి సమరం మిర్యాలగూడ నుంచే…. రెండేళ్లలో ఎసఎల్బీసీ పూర్తి చేస్తాం: రేవంత్ విశాలాంధ్ర – నల్లగొండ బ్యూరో: త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు పేదలకు మంజూరు చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ మండలం గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో యంగ్ […] The post ఇందిరమ్మ ఇళ్లు పేదలఆత్మగౌరవానికి ప్రతీక appeared first on Visalaandhra .
తలకిందులైన పొత్తులుమున్సి‘పోరు’లో అంతా గజిబిజిఖమ్మం జిల్లాలో వింత సమీకరణలు విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం తనకే ఖచ్చితంగా టికెట్ ఇస్తుందని అనుకున్న వారిలో కొందరికి టికెట్లు దక్కలేదు. డిప్యూటీ సీఎం భట్టికి అత్యంత సన్నిహితులు మల్లాది వాసుదేవ్ దంపతులకు టికెట్లు లభించలేదు. కాంగ్రెస్తో ఎంత మాత్రం పొత్తుకు అవకాశం లేదని చెప్పిన సీపీఎం… ఏకంగా తమ్మినేని సొంత గ్రామం లోనే చేతులు కలిపి కాంగ్రెసును ఏకగ్రీవం చేస్తూ […] The post అనుకున్నదొకటి…అయిందొకటి! appeared first on Visalaandhra .
‘సర్’ తీరుపై కమల్హాసన్ ఆందోళన
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం తమిళనాడు రాష్ట్ర ఓటర్ల హక్కులను తనిఖీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ప్రముఖ నటుడు కమల్హాసన్ రాజ్యసభలో బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన తమిళనాడులో కొనసాగుతోన్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకియపై మాట్లాడారు. “ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల గురించే నా ఆందోళన. దాన్ని అక్షరదోషాలు తనిఖీ చేసే ప్రక్రియగా భావిస్తున్న. ఓటు ప్రాథమిక హక్కు. ఎన్నికల కమిషన్ మాత్రం మా హక్కును తనిఖీ చేస్తోంది. జాబితా పరిశీలనల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు కోటి మంది అర్హులైన ఓటర్లు చనిపోయినవారి జాబితాలో ఉండవచ్చని ఆందోళన చెందుతున్నాం. బీహార్లో బతికున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారు. అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని కోరుకుంటున్నాం ” అని అన్నారు. భాష గురించి మాట్లాడుతూ తనకు తమిళ ఉపాధ్యాయులు భాషను పరిచయం చేశారని, తమ భాష, సంస్కృతిపై జరిగే ఎటువంటి దాడినైనా ఎదుర్కోవాలని సీఎన్ అన్నాదురై తదితర నేతల నుంచి నేర్చుకున్నానని అన్నారు. హైస్కూలు మధ్యలో చదువు మానేసిన తాను ఆర్థిక శాస్త్రంపై మాట్లాడేందుకు అర్హుడని కాదని ఎవరనుకున్నా అభ్యంతరం లేదని, తాను మాత్రం మాట్లాడుతానని స్పష్టం చేశారు. తమిళుడిగా తనకు ఓ స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాలను నేటి యువత నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుతూ భవిష్యత్తు తమదేనన్న వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యం
. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గద్దర్. ప్రతిభ, పారదర్శకతే ప్రమాణంగా అవార్డుల ఎంపిక. ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ను కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అంబేద్కర్ సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… […] The post తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యం appeared first on Visalaandhra .
ఎస్ ఐ ఆర్ పై స్వయంగా సుప్రీంలో వాదించిన మమత
న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎసఐర్) ప్రక్రియను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. ధర్మాసనం అనుమతితో మమత ఎసఐఆర్పై తన వాదనలు వినిపించారు. తాను బెంగాల్ మట్టి నుంచే వచ్చానని, అక్కడ నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె కోర్టుకు […] The post ఎస్ ఐ ఆర్ పై స్వయంగా సుప్రీంలో వాదించిన మమత appeared first on Visalaandhra .
. కూటమి బలోపేతానికి ఐక్య కార్యక్రమాలు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చ. రాజ్యసభ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా మంతనాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం సీఎం నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను […] The post వైసీపీ కుట్రలు తిప్పికొడదాం appeared first on Visalaandhra .
. గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీ దూబే వ్యాఖ్యల దుమారం. కాంగ్రెస్ సభ్యుల ప్రతిఘటన. లోక్సభలో గందరగోళం న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోందని, ప్రతిపక్ష నాయకుడిని సభలో కీలకాంశాలపై మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో పార్లమెంటు బుధవారం రసాభాస అయింది. ఉభయ సభల్లో గందరగోళం కొనసాగింది. అధికార`విపక్షాల నినాదాలతో లోక్సభ, రాజ్యసభ హోరెత్తాయి. పదేపదే వాయిదా పడ్డాయి. చివరకు నిరసన హోరులోనే సభాపతులు […] The post ఆగని నిరసనలు appeared first on Visalaandhra .
. ప్రజా సమస్యలు పక్కదారి. మోహన్బాబు, విష్ణును అరెస్టు చేయాలి. ఉద్యమకారులపై అక్రమ కేసులు ఎత్తేయాలి. 12న సార్వత్రిక సమ్మెకు మద్దతు. అమెరికాకు మోదీ దాసోహం. వామపక్ష పార్టీ నేతలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో చట్టబద్ధపాలన దారితప్ప్పుతోందని, అక్రమ కేసులు, ఘర్షణల చుట్టూ తిప్ప్పుతూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన వామపక్ష […] The post చట్టబద్ధ పాలన హైజాక్ appeared first on Visalaandhra .
. ఎగుమతిదారుల పోటీతో పెరిగిన ధరలు. క్వింటా మిర్చి గరిష్టంగా రూ.24 వేలు. తాలుకాయలకూ గిరాకీ!. నష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం విశాలాంధ్ర -సచివాలయం: ఆకాశమే హద్దుగా మిర్చి ధరలు దూసుకుపోతున్నాయి. ఇన్నాళ్లూ ‘ధరల లేమితో’ కుదేలైన మిర్చి రైతుకు ఈ సీజన్ ఎర్ర బంగారం అందించింది. మిర్చి రైతులకు ఈ ఏడాది సంక్రాంతి తర్వాత అదృష్టం తలుపు తట్టింది. గత ఏడాది ధరలు లేక కుదేలైన రైతాంగానికి, ఈ ఏడాది మార్కెట్ పరిస్థితులు భారీ ఊరటనిస్తున్నాయి. […] The post ఘాటెక్కిన మిర్చి appeared first on Visalaandhra .
ప్రధాని సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు
న్యూదిల్లీ: ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్సభ దద్దరిల్లింది. దీంతో ప్రధాని ప్రసంగించలేదు. మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణె ఆత్మకథలోని కొన్ని అంశలను సభలో ప్రస్తావించేందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో ప్రతిపక్ష సభ్యుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. వారి నినాదాలతో సభ అనేకసార్లు వాయిదా పడింది. ప్రధాని మోదీ ప్రసంగించేందుకు కొద్ది సమయం ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు ఒక్కసారిగా ప్రధాని సీటు వద్దకు దూసుకెళ్లారు. వర్షా […] The post ప్రధాని సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు appeared first on Visalaandhra .
పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే
విశాలాంధ్ర` తొర్రూర్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల అభివృద్ధి సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి లు అన్నారు. బుధవారం తొర్రూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సోమ రజనీ రాజశేఖర్ గెలుపు కొరకు ఎమ్మెల్యే ప్రతి ఇంటిని సందర్శించి చేతి గుర్తుకు ఓటు వేసి సోమ రజనీ రాజశేఖర్లను గెలిపించాలని కోరారు. అనంతరం కార్నర్ మీటింగులో ఎమ్మెల్యే యశస్విరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి […] The post పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే appeared first on Visalaandhra .
నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాలు సాధించాలి
విశాలాంధ్ర, హైదరాబాద్ : నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు ముఖ్యంగా నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యత గల బొగ్గును మాత్రమే వినియోగదారులు కోరుతున్నారని, ఈ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ డి.కృష్ణ భాస్కర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యత తదితర అంశాలపై సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో […] The post నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాలు సాధించాలి appeared first on Visalaandhra .
ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడాలి : మంత్రి
విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం పరిధి అలియాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్-మల్కాజ్గిరి పార్లమెంటరీ ఇంచార్జి,రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారనికి హాజరై సందర్బంగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రశ్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కలిసి ఘన స్వాగతం పలికారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన […] The post ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడాలి : మంత్రి appeared first on Visalaandhra .
మేడారం జాతరలో బాలికపై అత్యాచారం..
రాష్ట్రంలోని మేడారంలో ఇటీవల ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతరలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్లూ) స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఐదుగురు యువకులు ఈ గ్యాంగ్ రేప్కు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయని వెల్లడించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయ రహత్కర్, విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్దుప్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా ఉంటారు. ఫిబ్రవరి 5 నుంచి ఈ కమిటీ విచారణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అవసరమైతే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఒక న్యాయవాది సహాయం కూడా తీసుకుంటారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, స్థానిక అధికారుల చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ కార్యక్రమం జనవరి 28 నుంచి 31 వరకు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలంగాణ అధికారులు అప్పట్లో ప్రకటించడం గమనార్హం. మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.
మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా వై. ఖేమ్ చంద్ సింగ్ ప్రమాణం
మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యుమ్నాం ఖేమ్ చంద్ సింగ్ బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. కుకి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నమ్చా కిఫ్గెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసన సభ్యుడు ఎల్ దిఖో మణిపూర్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఖేమ్ చంద్ సింగ్ బీజేపీ శాసన సభాపక్షనేతగా ఎన్నికయ్యారు. బీజేపీకి చెందిన గోవిందాస్ కోంథోజామ్ , ఎన్ పిపికి చెందిన కె. లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నమ్చా కిఫ్గెన్ న్యూఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన రద్దు చేసిన కొద్ది గంటల తర్వాత ఇంఫాల్ లోని లోక్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది.
‘బైకర్’లో బుల్లెట్ సునీల్గా...
చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న స్పోర్ట్ ఫ్యామిలీ డ్రామా బైకర్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రాజశేఖర్ పాత్రను బుల్లెట్ సునీల్ గా పరిచయం చేస్తూ రీ-స్టార్ట్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్తో మొదలవుతుంది. మాజీ మోటోక్రాస్ రేసర్ సునీల్ - ‘బుల్లెట్ సునీల్’గా పాపులర్. 18 ఇండియన్ ఛాంపియన్షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కు పైగా రేస్ విజయాలతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తనది. అయినా అతడి ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఇండియన్ రేసర్లు ఓడిపోయేవాళ్లే అన్న భావన అతడిని కలచివేస్తుంది. ఆ అభిప్రాయాన్ని చెరిపేసి, రేసింగ్ సర్క్యూట్లో భారతదేశానికి ఉన్న నిజమైన శక్తిని ప్రపంచానికి నిరూపించాలని నిశ్చయించుకుంటాడు. గత విజయాలు గురించి ఆలోచించకుండా, సునీల్ తన అనుభవాన్ని మళ్ళీ పోరాటంలోకి మళ్లిస్తాడు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర సృష్టించిన క్యారెక్టర్కు ఈ గ్లింప్స్ ఒక పవర్ ఫుల్ టీజర్లా నిలుస్తుంది. శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో శర్వా డేరింగ్, డాషింగ్ బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
అహంకారానికి అభిమానానికి మధ్య పోటీ కాదు : పిల్లోడి భవాని విశ్వనాథం
సదాశివపేట ఫిబ్రవరి 4 (జనం సాక్షి) : వార్డును సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నానని పిల్లోడి భవాని విశ్వనాథం …
జనగామ మండలంలో పెద్దపులి కలకలం...
జనగామ మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత రాత్రి ఆలేరు మండలం టంగుటూరు నుండి జనగామ మండలం పెంబర్తికి వెళ్లే మార్గంలో పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా పెంబర్తి గ్రామానికి చెందిన ఇట్టబోయిన రమేష్కు చెందిన పొలంలో పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపించాయి. అలాగే ఇక్కిరి రాజు వ్యవసాయ బావి, నిమ్మల సుధాకర్ రెడ్డి తోటల వద్ద కూడా పులి సంచరించినట్లు గుర్తులు లభ్యమయ్యాయి. మరోవైపు, జనగామ మండలం శామిర్పేట గ్రామంలోని కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం ఆవరణలో మంగళవారం రాత్రి 11:00 గంటల సమయంలో పులి తిరుగుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పులి సంచార వార్తతో పెంబర్తి, శామిర్పేట మరియు చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి అడుగుజాడలను పరిశీలిస్తున్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులు, ఒంటరిగా బయట తిరిగే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పులి కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిరుత దాడితో లేగ దూడ మృతి తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో గత రెండు నెలలో నుండి, చిరుత దాడుల్లో మేకలు, గొర్లు, పాడి పశువులు,లేగ దూడలపై చిరుతపులి దాడి చేసి చంపడంతో, రైతన్నలు వ్యవసాయ క్షేత్రాలు పనులు చేసుకోవాలంటే భయంతో ఎక్కడి నుండి చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని భయాభ్రాంతులకు గురవుతున్న సమయంలో నందివాడ గ్రామంలో మంగళవారం, సంకు రామవ్వ వ్యవసాయ క్షేత్రంలో రైతు సంకు రాజు మంగళవారం పాడి పశువులను రోజువారీగా తన కోట్టం పందిరిలో కట్టి వేయగా బుధవారం వ్యవసాయ క్షేత్రం వెళ్లి చూడగా ఏదో అడవి వన్యమృగం చంపి తిన్నదని గమనించి తన గ్రామ సర్పంచ్ అధికారులకు తెలుపగా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారంతో వ్యవసాయ క్షేత్రం పరిశీలించి , చిరుత పులి లేగ దూడపై దాడి చేసి చంపిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ తెలియజేశారు. రైతులు ఎవరు వ్యవసాయ క్షేత్రాలలో పాడి పశువులు మేకలు గొర్రెలను కట్టి వేయవద్దని , రైతులు జాగ్రత్తగా ఉండాలని, చిరుత పులిని బంధించడానికి బోనులను, కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు చిరుత పులి దాడిలోమృతి చెందిన పశువులు, రైతు బాధితులకు ప్రభుత్వ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి బాధిత రైతుల బ్యాంకు ఖాతాలోకి పరిహారం అందిందని, వివరాలను అయన తెలియజేశారు. ఎర్రపహడ్ గ్రామ రైతుకు 9,000 , గాంధీ నగర్ లో 15000 ,దేమోకలన్ రైతుకు 2500 మోతే గ్రామ బాధిత రైతుకు 22,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఆయన తెలియజేశారు. నందివాడ గ్రామంలో మంగళవారం జరిగిన చిరుత దాడిలో మృతిచెందిన లేగ దూడ 15 నుంచి 20వేల వరకు ఉంటుందని తాడ్వాయి మండల పశు వైద్యాధికారికి పంచనామా చేసినట్లు ఆయన తెలియజేశారు.
ఏనుమాముల మార్కెట్లో క్వింటా రూ. 37, 100 ధర పలికిన ఎర్ర బంగారం
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం (మిర్చి) ధర రోజు రోజుకు పెరుగుతుంది. బుధవారం వండర్ హాట్ మిర్చి ధర అల్ టైమ్ రికార్డ్ ధర నమోదు చేసుకుంది. క్వింటాల్ మిర్చి రూ. 37,100 పలకడం విశేషం. గత నాలుగు సంవత్సరాల నుండి ఇంత పెద్ద మొత్తంలో ధర పలుకలేదని మార్కెట్ అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమేల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ఆర్. వినోద్ అనే రైతు 80 వండర్ హాట్ మిర్చి మార్కెట్ కు తీసుకొచ్చారు. కీర్తన అనే అడితి ద్వారా దీనికి ధర రూ. 37,100 గా నిర్ణయించారు.
మీ ఆడ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంగడి రజిత క్రిష్ణ మీ ఆడ బిడ్డగా నన్ను
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మంది ఫోన్లు వినే మీలాంటి వాళ్లు జతిపితలు
ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే బిల్గేట్స్తో బంధం ముగిసింది : మిలిందా
వాషింగ్టన్ : ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నట్టు బయటపడడం వల్లనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పినట్టు బిల్గేట్స్ మాజీ భార్య మిలిందా వెల్లడించారు. ఈ వివరాలు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు. వైవాహిక బంధం విలువలు ఆయన నిలబెట్టుకోకపోవడం వల్లనే విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో బయటపడిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలని, తాను కాదని వ్యాఖ్యానించారు. ఎపిస్టీన్ఫైల్స్లో బాధితులుగా ఉన్న మహిళలకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్గేట్స్మిలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఎప్స్టీన్తో గేట్స్కు సంబంధాలు ఉండడంతో ఏమాత్రం ఇష్టపడని మిలిందా ఆయన నుంచి విడాకులు తీసుకున్నారని వాల్స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల ఎప్స్టీన్ఫైల్స్ను విడుదల చేసింది. గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు సాగించాడని , సుఖవ్యాధుల రోగి అయ్యాడని ఎప్స్టీన్ ఆరోపించాడు. ఈ అక్రమ లైంగిక సంబంధాలు బయటపడకుండా ఉండేందుకు బిల్గేట్స్ తన భార్య మిలిందాకు రహస్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి తనను అడిగారని తెలియజేశాడు. అయితే ఈ ఆరోపణలను గేట్స్ బృందంతీవ్రంగా ఖండించింది.
ఎక్స్ప్రెస్ వే పై గ్యాస్ ట్యాంకర్ బోల్తా...18 గంటలు ట్రాఫిక్ జామ్
ముంబై : ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వే పై రాయ్ఘడ్ జిల్లా లోని ఖండాలా ఘాట్ అదోషిటన్నెల్ వద్ద మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడడంతో 18 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 12 కిమీ మేర వాహనాలు ఆగిపోయాయి. ట్యాంకర్ లోని ప్రమాదకరమైన ప్రొపైలెన్గ్యాస్ లీక్ అవుతుండడంతో ఆ రోడ్డుకు కొంత దూరంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు 18 గంటలకు పైగా ట్రాఫిక్లో చిక్కుకు పోయారు. సాయంత్రం ట్యాంకర్ బోల్తా పడగా, అర్ధరాత్రికి సంఘటన స్థలానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చేరుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఆహారం, వాష్రూమ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ట్యాంకర్ నుంచి 50 శాతం గ్యాస్ మాత్రమే విడుదలయ్యిందని, మిగిలిన గ్యాస్ను తొలగించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రద్దీ పెరగడంతో వాహనాలను పాత ముంబై పుణె హైవే వైపు మళ్లించినట్టు తెలిపారు.
Amaravati Outer Ring Road Land Acquisition: Clearing the Air on Width and Farmer Concerns
Concerns have been rising among farmers over land acquisition for the Amaravati Outer Ring Road project. The anxiety began after a recent gazette notification mentioned a land width of 250 meters, while earlier proposals had clearly stated that the road would be built within a 140 meter corridor. This difference triggered fear of excessive land […] The post Amaravati Outer Ring Road Land Acquisition: Clearing the Air on Width and Farmer Concerns appeared first on Telugu360 .
రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్..
న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్ సమగ్రంగా లేదని విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సవాల్ విసిరారు. లోపాలు ఉన్నాయన్న ఆరోపణలను కాంగ్రెస్ తనముందు నిలబడి చెప్పగలదా ? అని సవాల్ విసిరారు. యువత నైపుణ్యం, వ్యవస్థాపకత, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై బడ్జెట్లో తమ ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించిందని సీతారామన్ చెప్పారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న కార్మిక మార్కెట్ అవసరాలను తీర్చడానికి, వ్యవసాయం , గ్రామీణ ఉపాధి, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు వంటి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరుపై విమర్శలు చేశారు. దేశంలో నెలకొన్న వాస్తవ సంక్షోభాలపై దృష్టి పెట్టలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, తయారీ రంగం పతనమవుతోందని ఆరోపించారు. పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులతోపాటు ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న అనేక చిక్కులు వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి శిక్షణ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియుజికెవై) సహకారంతో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన యువతీ, యువకులకు మూడు నెలల కాలపరిమితితో డాట ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర). ఎకౌంట్స్ అసిసెంట్ట్యాలీలో ఉపాధి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.కిషోర్రెడ్డి బుధవారం నాడొక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని, అడ్మిషన్లకు చివరి తేదీగా ఫిబ్రవరి 16 (సోమవారం)గా నిర్ణయించామన్నారు. శిక్షణా కార్యక్రమాల్లో చేరాలనుకునే అర్హత కలిగిన యువతీ, యువకులు అడ్మిషన్ల కోసం ఫోన్ నెంబర్లు : 9133908000, 9133908111, 9133908222. 9948466111లో సంప్రదించాలని కోరారు. అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్, ఫోటోలు తీసుకురావాల్సి ఉందన్నారు. దిల్సుఖ్నగర్, హయత్నగర్ నుండి బస్ నెంబర్:524 ద్వారా సంస్థకు చేరుకోవచ్చని, అదే విధంగా సమీప రైల్వేస్టేషన్లు బీబీనగర్, భువనగిరి, సికింద్రాబాద్ల నుంచి సంస్థకు చేరుకోవచ్చని వెల్లడించారు. డాట ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర)కు ఇంటర్ పాస్, ఎకౌంట్స్ అసిస్టెంట్ట్యాలీకి బి.కామ్ విద్యార్హతను విద్యార్థులు కలిగి ఉండాలన్నారు.
Tollywood |నాగవంశీ నిర్ణయం వెనుక కారణం ఇదేనా..?
Tollywood | నాగవంశీ నిర్ణయం వెనుక కారణం ఇదేనా..? Tollywood | ఆంధ్రప్రభ
ఆరోన్ జార్జి సెంచరీ.. ఫైనల్స్కి దూసుకెళ్లిన యువ భారత్
హరారే: అండర్-19 ప్రపంచకప్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. అఫ్గానిస్థాన్ని చిత్తుగా ఓడించి ఫైనల్స్కి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో భారత ప్లేయర్లు ఏ మాత్రం తడబడకుండా దంచికొట్టారు. ఓపెనర్గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఆరోన్ జార్జి మాత్రం అప్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 115 చేసి ఆరోన్ ఔట్ అయ్యాడు. మొత్తానికి భారత్ 41.1 ఓవర్లలో 311 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్స్తో భారత్, ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తలపడనుంది.
Belt shop |ప్రాణం తీసిన బెల్టు షాపు..
Belt shop | ప్రాణం తీసిన బెల్టు షాపు.. Belt shop |
టిజి ఈసెట్- 2026 షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ నేరుగా సెకండియర్ ప్రవేశం కోసం నిర్వహించే టీజీ ఈసెట్ - 2026 షెడ్యూల్ను బుధవారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్లొమా, బీ.ఎస్సీ విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్ష బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. ఈ మేరకు విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 9 నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18 గా నిర్ణయించారు. ఇక ప్రవేశ పరీక్షను మే 15న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 గా, ఇతర అభ్యర్థులకు రూ.900 గా ఫీజును నిర్ణయించారు. మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. నిర్ణీత గడువు తర్వాత కూడా ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని విద్యామండలి కల్పించనుంది. అర్హత గల విద్యార్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ecet.tgche.ac.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Gita worker |గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు
Gita worker | గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు Gita worker |
ఎసిబికి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
లంచం తీసుకుంటు విద్యాశాఖ జూనియర్ అసిస్టెంట్ బుధవారం ఎసిబి అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నగరంలోని బండ్లగూడ డిప్యూటీ విద్యాశాఖ కార్యాలయంలో శివప్రసాద్ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలోని పదోతరగతి పరీక్షల సెంటర్ను తొలగించకుండా ఉండాలంటే రూ.10,000లు ఇవ్వాలని శివప్రసాద్ డిమాండ్ చేశాడు. దీంతో ఆ పాఠశాల యాజమాన్యం ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చింది. ఎసిబి అధికారుల సూచనల మేరకు శివప్రసాద్కు రూ.10,000 ఇస్తుండగా దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.
Megastar has to Rush for Vishwambara
Mega Heroes Pawan Kalyan and Ram Charan have announced the release dates of their respective films Ustaad Bhagat Singh and Peddi. They have cleared the confusion and made it clear about the healthy gap between the releases. Megastar Chiranjeevi’s film Vishwambara too is slated for release soon. Megastar has to rush and announce the release […] The post Megastar has to Rush for Vishwambara appeared first on Telugu360 .
9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అమ్మాయిలు బలవన్మరణం
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ముగ్గురు అక్కచెల్లెళ్లు తొమ్మిదో అంతస్తునుంచి దుమికి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం కల్గించింది. వీరు 12,14,16 ఏళ్ల చిన్నారులు. సారీ.. నాన్నా.. నేను ఒంటరి తనంతో బాధపడుతున్నా.. అని లేఖ రాసి వారు బుధవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. టీనేజ్ పిల్లలు మరణించడంతో తల్లిదండ్రులు బాధతో కుమిలిపోతున్నారు.వీరి ఆత్మహత్యలకు కారణం..మొదట్లో కొరియన్ టాస్క్ -ఆధారిత గేమింగ్ యాప్ అని భావించినా, పోలీసులు మాత్రం గేమింగ్ కోణాన్ని తోసిపుచ్చారు. మరణించిన ఆ అమ్మాయిలు తమ డైరీలో పేర్కొన్నట్లు కొరియన్ సంసృ్కతి,వినోదం ద్వారా ప్రభావితమయ్యారని పోలీసులు తెలిపారు.వారు తమ డైరీలో పేర్కొన్న ప్రకారం, ఆ అమ్మాయిలు కొరియన్ సంసృ్కతిని ఇష్టపడుతున్నారని, కె-పాప్ సంసృ్కతి, కొరియన్ సినిమాలు , కొరియన్ సంగీతం, షాట్ ఫిల్మ్ లు, కొరియన్ షోలు, కొరియన్ సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని పోలీసు డిప్యూటీ కమిషనర్ నిమిష్ పాటిల్ తెలిపారు.కొరియన్ సినిమాలు, చూడడం, మ్యూజిక్ వినడం వారికి వ్యసనంగా మారిందని, చదువుకుంటున్న పిల్లలు... అలాంటి కంటెంట్ చూడడం గమనించిన తల్లిదండ్రులు వారిని మందలించి, వారి ఫోన్ లను గుంజుకున్నారని, దీంతో మనస్థాపం చెందిన పిల్లలు ఈ ఆత్మహత్యకు సాహసించారని అధికారులు తెలిపారు.వారి గదిలో దొరికిన సూసైడ్ నోట్ లో .. ఏడుస్తున్న బొమ్మ వేసి.. సారీ..నాన్నా అంటూ, డైరీలో పూర్తిగా చదవండి. దానిలో ఉన్నది అంతా నిజమే. అని పిల్లలు రాశారు.బాలికల తండ్రి చేతన్ కుమార్ కు ఇద్దరు భార్యలు, మొత్తం ఐదుగురు పిల్లలు. వీరంతా కలిసే ఉంటున్నారు. చనిపోయిన బాలికలలో ఒకరు మొదటి భార్య కుమార్తె కాగా, మిగత ఇద్దరూ రెండో భార్య పిల్లలు.. చేతన్ భార్యలు ఇద్దరూ అక్క చెల్లెళ్లే. మొదటి భార్యకు మొదట్లో సంతానం లేకపోవడంతో చేతన్ తన భార్య చెల్లెలినే రెండో బార్యగా వివాహం చేసుకున్నాడు.
Competitions |వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక…
Competitions | వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక… Competitions | దండేపల్లి, ఆంధ్రప్రభ
Indigo |శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిపోయిన విమానం
Indigo | శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిపోయిన విమానం Indigo | శంషాబాద్, ఆంధ్రప్రభ
ఎగరాలి జెండా 23వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం
మాజీ కౌన్సిలర్ 23 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాజీద్ మంచిర్యాల ఫిబ్రవరి
అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..పేదల పెన్నిధి మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్న
47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొల్లం భీమయ్య మంచిర్యాల
ఆశీర్వదించండి.. గెలుపు అందించండి..
ఆశీర్వదించండి.. గెలుపు అందించండి.. షాద్ నగర్, ఆంధ్రప్రభ : గతంలో చేసిన అభివృద్ధి
రామ్చరణ్ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే #Cinema #RamCharan #Peddi #ReleaseDate
Australia |మహాత్ముని విగ్రహం చోరీ…
Australia | మహాత్ముని విగ్రహం చోరీ… Australia | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
బిజెపి అంటే అభివృద్ధి భద్రత..సేవే లక్ష్యంగా గెలుపే ధ్యేయంగా మీ బిడ్డగా ఓటేసి ఆశీర్వదించండి
బిజెపి 51వ వార్డు అభ్యర్థి నల్లపు రజిత రమేష్ మంచిర్యాల ఫిబ్రవరి 4
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి
10వ వార్డు ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప మక్తల్
తనను గెలిపించి.. అమనగల్లు, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలోని 12వ వార్డ్ లో బీజేపీ
రియల్ స్టోరీతో రవితేజ వారసుడి ఎంట్రీ.. ‘మారెమ్మ’ టీజర్
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఎదిగారు మాస్ మహరాజ రవితేజ. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో సందడి నెలకొంటుంది. అయితే ఇప్పుడు రవితేజకు సినీ వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అతడే రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు. మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మారెమ్మ’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపా బాలు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ గ్రామానికి శాపం పడితే.. దాన్ని నుంచి తప్పించుకోవడానికి మారెమ్మ అనే దేవతకు పూజలు చేయడం ఈ టీజర్లో చూపించారు. తొలి సినిమా అయినప్పటికీ.. మాధవ్ తన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహించగా.. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Andhra Pradesh Government Gears Up for Budget 2026 With Focus on Welfare and Development
The Andhra Pradesh government is preparing to present the state budget for this year in the Assembly on February 14. Ahead of the presentation, detailed consultations are underway to finalise priorities and allocations. The government is aiming for a balanced budget that strengthens welfare delivery while accelerating long pending development works. Finance Minister Payyavula Keshav […] The post Andhra Pradesh Government Gears Up for Budget 2026 With Focus on Welfare and Development appeared first on Telugu360 .
Ministry |రాష్ట్రపతి పాలన ఎత్తివేత…
Ministry | రాష్ట్రపతి పాలన ఎత్తివేత… Ministry | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ
20వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి గాదె సత్యం ఎన్నికలలో ఇచ్చిన హామీలు
Telangana |పవన్ పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Telangana | పవన్ పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు Telangana
13వ వార్డులో ప్రజా మద్దతుతో కాంగ్రెస్ హోరు..
-ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) -ఎమ్మెల్యే, ఎంపీ అండతో
మెగా ఫ్యాన్స్కు పండగే.. ఫస్ట్ 'ఉస్తాద్ భగత్సింగ్'..నెక్ట్స్ 'పెద్ది'
మెగా అభిమానులకు ఈ సమ్మర్ పండగనే చెప్పాలి.. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇందులో ముందుగా పవన్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో విడుదల కాబోతోంది. తర్వాత 'పెద్ది'.. 'విశ్వంభర' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్'... పవన్ కల్యాణ్, కల్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం. ఇప్పటికే విడుదల టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుత షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర యూనిట్.. పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది. బుధవారం మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేస్తూ అదిరిపోయే పోస్టర్ ను వదిలారు. ఇందులో పవన్ ఎంతో స్టైలీష్ గా ఉన్నాడు. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ లో తెలిపారు. దీంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 'ఓజి'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరోసారి అదే రిపీట్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరోవైపు, మార్చి 26న వస్తుందనుకున్న రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా పడింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక, జూన్ 9న చిరు నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు 'విశ్వంభర'ను రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
Barabar Premistha Trailer: Looks Promising
Chandra Hass is coming up with a love and action drama Barabar Premistha, slated for release on February 6th. Directed by Sampath Rudra and backed by producers Geda Chandu, Gayatri Chinny, and AVR under CC Creations and AVR Movie Wonders, the film is presented by Kakarla Satyanarayana. After a series of impressive promotional drops, the […] The post Barabar Premistha Trailer: Looks Promising appeared first on Telugu360 .
వార్మప్ మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
నవీ ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్ని 4-1 తేడాతో కైవసం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సత్తా చాటాలని అనుకుంటోంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఈ మ్యాచ్ని చాలా కీలకంగా భావిస్తోంది. ఈ మ్యాచ్తోనే ఇరు జట్ల బలాబలాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో చేసే ప్రయోగాలు అసలు టోర్నమెంట్లో ఉపయోగపడతాయి. ఇది వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ.. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
ఐఐటి రూర్కీతో కలసి పని చేస్తున్న అమెజాన్
న్యూదిల్లీ: వ్యవసాయ వ్యర్థాల నుండి వినూత్న ప్యాకేజింగ్ సామగ్రిని అభివృద్ధి చేయడానికి అమెజాన్ ఇండియా ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీతో భాగస్వామ్యాన్ని ప్రక టించింది. కలపేతర కాగితం సాంకేతికతను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. వర్జిన్ కలప గుజ్జుపై ఒత్తిడిని తగ్గించేందుకు, వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయకుండా మళ్లించేందుకు ఈ సాంకేతికత తోడ్పడనుంది. తేలికైనవే అయినప్పటికీ, ఈ బలమైన ప్యాకేజింగ్ పదార్థాలు సంప్రదాయ కలప గుజ్జు కాగితం లేదా ప్లాస్టిక్ సంచులకు బదులుగా తిరిగి వాడదగిన, ఇంట్లోనే కంపోస్ట్ చేయగల ప్రత్యామ్నాయాలను అందిస్తాయి. ఈ పరిశోధన గోధుమ గడ్డి, బగాస్ వంటి పంట అవశేషాలను పేపర్ మెయిలర్స్ తయారీకి పనికొచ్చే అధిక-నాణ్యత గుజ్జుగా మార్చడంపై దృష్టి పెడుతుంది. ఇది సంప్రదాయ కాగితపు ప్యాకేజింగ్తో పోల్చదగిన పనితీరును కలిగి ఉంటుంది. ఇది వ్యవసాయ వ్యర్థాలను విలువైన ప్యాకేజింగ్ పదార్థంగా మార్చడం ద్వారా భారత దేశంలో పంట అవశేషాల దహనం తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా, ఇది దిగుమతి చేసుకున్న వర్జిన్ కలప గుజ్జుపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. వ్యవసాయ అవశేషాలకు మార్కెట్ను అందించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఐఐటీ రూర్కీలోని పేపర్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ విభాగంతో ఈ భాగస్వామ్యం 15 నెలల కాలానికి ప్రయోగశాల స్థాయిలో అభివృద్ధి, పరీక్షలతో ప్రారంభమవుతుంది. పనితీరు పరీక్షలు విజయవంతం అయిన తర్వాత, వచ్చే ఏడాది మధ్య నుండి చివరి నాటికి పారిశ్రామిక పరీక్షలు, ప్రక్రియ ధృవీకరణ, వాణిజ్య ఉత్పత్తి దశలకు పురోగమించడానికి అమెజాన్ మద్దతు అందిస్తుంది. అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘అమెజాన్లో, మేం భారతదేశ అత్యంత వేగవంతమైన, సురక్షితమైన, అత్యంత విశ్వసనీయమైన కార్యకలాపాల నెట్వర్క్ను నిర్మిస్తున్నాం, నిర్వహిస్తున్నాం. దానిని మరింత సుస్థిరమైందిగా చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా, పంట అవశేషాల నుండి వినూత్న ప్యాకేజింగ్ను అభివృద్ధి చేయడానికి మేం ఐఐటీ రూర్కీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. భారతదేశం ఏటా దాదాపు 500 మిలియన్ టన్నుల మేరకు ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. వాటిని ప్యాకేజింగ్లో తిరిగి ఉపయోగించడం ద్వారా, సంప్రదాయ పదార్థాలపై ఆధార పడటాన్ని తగ్గించుకుంటూ మరింత వృత్తాకార ఆర్థిక వ్యవస్థను మేము సమర్ధించగలం’’ అని అన్నారు. ‘‘సుస్థిరత ఇకపై ఒక ఎంపిక కాదు, ఇది అత్యవసర జాతీయ ప్రాధాన్యత’’ అని ఐఐటీ రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ కమల్ కిషోర్ పంత్ అన్నారు. స్వచ్ఛ భారత్, స్టార్టప్ ఇండియా, నేషనల్ రిసోర్స్ ఎఫిషియన్సీ పాలసీ వంటి ప్రభుత్వ లక్ష్యాలతో అనుసంధానించబడిన భారతదేశ వృత్తాకార ఆర్థిక వ్యవస్థ దార్శనికతను సాకారం చేసు కునే దిశగా ఐఐటీ రూర్కీ- అమెజాన్ మధ్య ఈ సహకారం ఒక ముందడుగు. వ్యవసాయ అవశేషాలను బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్లుగా మార్చడం ద్వారా, భారతదేశంలో పంట అవశేషాల దహనం, వర్జిన్ మెటీరియల్లపై ఆధారపడటం అనే రెండు సవాళ్లను మేం పరిష్కరిస్తున్నాం. అదే సమయంలో పరి శ్రమలు, రైతులు, సమాజానికి పెద్దగా ప్రయోజనం చేకూర్చే, భారీస్థాయిలో అందించగల ఉత్పత్తులను సృష్టి స్తున్నాం. విద్యా పరిశోధన, పరిశ్రమ భాగస్వామ్యాలు మరింత సుస్థిరమైన, స్వావలంబన భవిష్యత్తు వైపు భారతదేశ ప్రయాణాన్ని ఎలా వేగవంతం చేస్తాయో ఈ చొరవ ప్రదర్శిస్తుంది’’ అని అన్నారు. ఐఐటీ రూర్కీ, సహారన్పూర్ క్యాంపస్లోని పేపర్ మరియు ప్యాకేజింగ్ టెక్నాలజీ విభాగంలో INNOPAP ల్యాబ్ (పేపర్ మరియు ప్యాకేజింగ్లో ఆవిష్కరణలు) నుండి ప్రొఫెసర్ విభోర్ కుమార్ రస్తోగి మరియు డాక్టర్ అనురాగ్ కులశ్రేష్ఠ ఈ పరిశోధన ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తారు. ప్యాకేజింగ్ను తగ్గించేందుకు తాను చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, అమెజాన్ భారతదేశంలోని కస్టమర్ల ఆర్డర్లలో 50% కంటే ఎక్కువ వాటిని వాటి అసలు ప్యాకేజింగ్లోనే లేదా తగ్గించిన ప్యాకేజింగ్తో పం పిణీ చేస్తోంది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ నగరాల్లో కస్టమర్ల ఆర్డర్లను ఉత్పత్తి ప్యాకేజింగ్లోనే రవాణా చేస్తోంది. 2019 నుండి, అమెజాన్ ఇండియా తన ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలన్నింటిలో ప్యాకేజింగ్ నుండి 100% సింగిల్-యూజ్ ప్లాస్టిక్ను తొలగించింది. అమెజాన్ ఇండియా తన కార్యకలాపాలను మరింత స్థిరంగా శక్తివంతం చేయడానికి కట్టుబడి ఉంది. 2040 నాటికి కార్యకలాపాల అంతటా నికర-సున్నా కార్బన్ను చేరుకోవాలనేది అమెజాన్ లక్ష్యం. కార్బన్ రహిత శక్తి, ప్యాకేజింగ్ ఆవిష్కరణలు, తమ రవాణా నెట్వర్క్ విద్యుదీకరణ, సర్క్యులారిటీ మెరుగుదలలు, ఏఐలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మేం వేగంగా పనిచేశాం, అదే సమయంలో తక్కువ వ్యవధిలో ప్రభావవంతమైన పురోగతిని సాధించాం. 2027 నాటికి భారతదేశంలోని కమ్యూనిటీలకు తన ప్రత్యక్ష కార్యకలాపాలలో ఉప యోగించే దానికంటే ఎక్కువ నీటిని తిరిగి ఇవ్వాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎపిలో జంగిల్ రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వంపై మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో బుధవారం ఎపికి వచ్చిన జగన్ సిఎం చంద్రబాబుపై ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. సిఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసిపి నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజని మీద దాడులు చేశారని.. వాళ్లు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. ఏడాదిన్నరగా కావాలనే సిఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. తిరుమల లడ్డులో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా తప్పుడు ప్రచారం చేశారని. పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా వీళ్లు రాజకీయాలు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సిఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

21 C