రేవంత్ పాలనలో రాష్ట్రం తిరోగమన బాట పట్టింది: జీవన్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రెండున్నరేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..దశాబ్దాలుగా అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ రైతుబంధు ను సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ రెండు సార్లు ఎగ్గొట్టిందని, కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ వంటి పథకాలను నీరుగార్చారని జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలనలో రాష్ట్రం తిరోగమన బాట పట్టిందని, కాంగ్రెస్ పాలనకు విసుగెత్తి మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ పోవాలని.. కెసిఆర్ రావాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రజాహితం కోసం రాష్ట్ర సాధకుడు కెసిఆర్ వెంటే నడుస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు
ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర జీవ సంపద పరిరక్షణలో భాగంగా ఏటా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. సంతానోత్పత్తి కోసమే ఈ విరామం ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల మధ్య కాలం చేపలు, ఇతర సముద్ర జీవుల సంతానోత్పత్తికి […] The post ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు appeared first on Visalaandhra .
jagityala |మోతే రోడ్డులో ఏర్పాట్లు..
jagityala | మోతే రోడ్డులో ఏర్పాట్లు.. లక్షమంది హాజరు లక్ష్యంjagityala | జగిత్యాల,
శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధం సృష్టించిన మానవ విషాదానికి అద్దం పడుతూ.. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మరణించిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్విగ్నతకు కారణమైంది.ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్కు బయలుదేరిన విమానంలో ముందు వరుస సీట్లలో ఈ […] The post శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు appeared first on Visalaandhra .
Mani Ratnam’s Next Film Updates
Legendary director Mani Ratnam’s last film Thug Life ended up as the biggest disappointment in his career. The film featuring Kamal Haasan is a big embarrassment for the top director. He worked on his next film and it is said to be a love story. Vijay Sethupathi and Sai Pallavi are the lead actors in […] The post Mani Ratnam’s Next Film Updates appeared first on Telugu360 .
చదువే సమాజ మార్పుకు ఏకైక ఆయుధం అని నమ్మిన పూలే
చదువే సమాజ మార్పుకు ఏకైక ఆయుధం అని నమ్మిన పూలే పామర్రు –
The Paradise: Kayadu Lohar looks stunning as Subbu
Natural Star Nani has created massive anticipation for his upcoming cinematic venture, The Paradise. With the visionary Srikanth Odela at the helm, the project is rapidly shaping up to be an unforgettable epic. Anirudh Ravichander’s massy anthem Aaya Sher song with 102 Million+ views has created unprecented buzz and hype for the film. Adding to […] The post The Paradise: Kayadu Lohar looks stunning as Subbu appeared first on Telugu360 .
పూలే ఆశయాలతో ముందుకు సాగాలి మునుగోడు, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిరావు పూలే
ഫാക്ട് ചെക്ക്: ശോഭാ സുരേന്ദ്രനോട് അശ്ലീല ആംഗ്യം കാണിച്ചോ? ചിത്രത്തിൻ്റെ വസ്തുതയെന്ത്
വോട്ടർമാർക്ക് പണം നൽകുന്ന വീഡിയോ ചിത്രീകരിച്ച യുവാവിൻ്റെ ചിത്രമാണ് പ്രചരിക്കുന്നത്
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాకారం కావాలి..
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాకారం కావాలి.. మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్
నార్సింగిలో ఘనంగా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి
నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శనివారం జ్యోతిరావు
జ్యోతిరావు పూలే బాటలో పయనిద్దాం..
జ్యోతిరావు పూలే బాటలో పయనిద్దాం.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కొండపల్లిలో ఘనంగా జ్యోతిరావు
మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు ఆదర్శనీయం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆనాటి కాలంలో మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు
కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి..
కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి.. ప్రైవేట్ కళాశాలలో ఎంసెట్, నీట్, జెఈ ఈ
ഫാക്ട് ചെക്ക്: ബംഗാളിൽ കേന്ദ്ര സേന അക്രമികളെ അറസ്റ്റ് ചെയ്യുന്ന ദൃശ്യം? വസ്തുത അറിയാം
തെരഞ്ഞെടുപ്പിന് മുന്നോടിയായി സംസ്ഥാന പൊലീസിൻ്റെ ചുമതല കേന്ദ്ര സേന ഏറ്റെടുത്തെന്നും അക്രമികൾക്കെതിരെ നടപടി തുടങ്ങിയെന്നുമാണ് വാദം
మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలోని
నేడు విశాఖలో మంత్రుల కమిటీ సమావేశం
విశాఖలో నేడు మంత్రుల కమిటీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు
ఇరాన్తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు ఇవాళ పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలు విఫలమైతే తమ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బీ) లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా దెబ్బతీశామని, అందుకే ప్లాన్ బీ అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ […] The post ప్లాన్ బీ లేదు.. appeared first on Visalaandhra .
57 ఏళ్ల టీచర్తో యువకుడికి అక్రమ సంబంధం.... మహిళను తగలబెట్టి
బెంగళూరు: ప్రభుత్వ టీచర్తో ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకొని అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా బాల్కి తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వంజార్ ఖేడ్ గ్రామంలో జ్యోతి కపాళే (57) అనే మహిళ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. కలబుర్గి జిల్లాలోని కల్మూడ గ్రామంలోని తన పుట్టింటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఈ క్రమంలో అమర్ అనే యువకుడు పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. జ్యోతి వద్ద అమర్ రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పలుమార్లు డబ్బులు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేస్తుండడంతో సదరు పంతులమ్మను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. డబ్బులు ఇస్తానని నమ్మించి ఆమెను కల్మూడ గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను చంపేసి మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాల్ హిస్టరీ ప్రకారం అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తమిళ రాజకీయాల్లో వీరప్పన్ కుటుంబం #Veerappan #TamilPolitics #Krishnagiri #Mettur #NTK #PMK
నేడు బెంగాల్కు ప్రధాని మోదీ, అమిత్ షా
నేడు బెంగాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటించనున్నారు
నేడు ఇరాన్ -అమెరికా చర్చలు... ఇరాన్ షరతులతో?
ఈరోజు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ లో చర్చలు జరగనున్నాయి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేయడాన్ని శశిథరూర్
Chandrababu : టీడీపీ ఆఫీసులో చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.
పంజాగుట్టలో సింగర్ మంగ్లీపై కేసు నమోదు
హైదరాబాద్: పోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట తన దగ్గర పది కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పది కోట్లు అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని, ఆమెతో తనకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశాడు. దాదాపు 150 మందిని మోసం చేశారని, దర్శకుడు వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో ఉన్నాడని బాధితుడు ఆరోపణలు చేశాడు.
Telangana |ఆరు అంతస్తుల భవనం కూల్చివేత
Telangana | ఆరు అంతస్తుల భవనం కూల్చివేత Telangana | ఆంధ్రప్రభ, వెబ్
అంబులెన్స్ ను ఢీ కొట్టిన బస్సు…
అంబులెన్స్ ను ఢీ కొట్టిన బస్సు… బిక్కనూర్, ఆంధ్రప్రభ ; కామారెడ్డి జిల్లా
Ram Charan’s Bollywood Outing on Cards?
There are frequent speculations about the Bollywood directors teaming up with top Tollywood actors. There are no big projects that materialized in this combination since years. Bollywood has been strongly speculating that Ram Charan will soon work with legendary Bollywood filmmaker Sanjay Leela Bhansali. Reports say that the film is a historical jungle adventure made […] The post Ram Charan’s Bollywood Outing on Cards? appeared first on Telugu360 .
ప్రమాదవశాత్తు అశ్రమ విద్యార్థి మృతి
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పానపటార్
విద్యార్థుల గొడవ.. కుటుంబాల మధ్య రగడ
రాయపోల్, ఆంధ్రప్రభ : చిన్నపాటి విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కుటుంబాల
AP | పూర్తిగా దగ్ధం AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
పోచంపాడ్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు
బాల్కొండ, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో దండుగుల
ప్రేమ జంటల వీడియోలు తీసి... లైంగికంగా వేధించి.. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్
అమరావతి: పార్క్లకు వస్తున్న ప్రేమ జంట వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేయడంతో పాటు దాడులకు దిగడం, బెదిరించి లైంగిక కోరికలు తీర్చుకోవడం సదరు ఎఎస్ఐ సరదాగా మారింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మాచర్ల నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండడంతో ప్రేమ జంటలు ఏకాంతంగా గడిపేందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. స్థానిక ఎఎస్ఐ ప్రేమ జంటల వీడియో తీసి డబ్బులు ఇవ్వాలని బెదిరించేవాడు. అనంతరం వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడుతూ కొందరిని లైంగికంగా వేధించేవాడు. మాచర్లలో వ్యాపారితో మహిళ సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి పలుమార్లు బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఓ ఆటో డ్రైవర్ చేత సదరు ఎఎస్ఐ వీడియోలు తీయిస్తున్నాడు. అదే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఇదే విధంగా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి కృష్ణారావు తెలిపారు.
ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్
పిట్లం ఏప్రిల్ 10 (జనం సాక్షి)మండలంలోని పిట్లం పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆంజనేయులు కు పిట్లం సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా …
డబిల్పూర్ లో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం..
మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండల ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబీల్పూర్ రైల్వే
Minab 168 Flight : మినాబ్ 168 ఆగమనం Andhra Prabha News
Minab 168 Flight : మినాబ్ 168 ఆగమనం Andhra Prabha News
గద్వాలలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ కలకలం
గద్వాల (ప్రతినిధి), ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మైనర్ విద్యార్థిని
ఏనాడూ కనీవినీ ఎరుగని విధంగా ఈసారి పశ్చిమబెంగాల్ ఎన్నికల ఘట్టంపై దేశమంతా ఉత్కంఠతో చూస్తోంది. దీనికి కారణం దాదాపు 27 లక్షల మంది ఓటర్లు జాబితాలో లేకుండానే ఎన్నికలు జరగనుండడం. వీరందరి అభ్యంతరాలు ఇంకా న్యాయపరిశీలనలోనే ఉన్నాయి. పోలింగ్ నాటికి వీరి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేం. ఇంతవరకు ఎటూ తేలక వీరంతా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నారు. ఫలితంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) జరగక ముందున్న అసలు 7.66 కోట్ల ఓటర్ల జాబితా ఇప్పుడు 12% వరకు కుదించుకుపోయింది. వివాదాలమయంగా తయారైన ఈ సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య ఆదర్శాలనే సవాలు చేస్తోంది. ఓటర్ల జాబితాలో తప్పుల తడకలు, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోవడం, తదితర సమస్యలు ప్రజాస్వామ్య మూలాలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. చివరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ అనుమానాస్పదంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగానికి ధర్మరక్షకులుగా ఉన్న రాష్ట్రపతి, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడవలసిన బాధ్యత కలిగిన సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటేగానీ ఈ ఎన్నికల ప్రక్రియ పవిత్రత సిద్ధించదు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 326 చెబుతున్న ప్రకారం వయోజన ఓటు హక్కు ఆధారంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటాయి. భారత పౌరులు ఎవరైనా 18ఏళ్లు నిండితే ఓటు హక్కు పొందే బాధ్యత తప్పనిసరి. ఈ మేరకు నమోదు చేయించుకోవలసి ఉంటుంది. ఇక 324(1) ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడం, ఓటర్ల జాబితాలను తయారు చేయడం, సవరించడం, ఎన్నికలను పర్యవేక్షించడం, మార్గదర్శకాలు జారీ చేయడం ఇవన్నీ ఎన్నికల కమిషన్ నిర్వర్తించాల్సిన విధులు. కానీ పౌరులు తమ పొరపాటు లేకుండానే ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి పశ్చిమబెంగాల్లో ఇప్పుడు ఏర్పడింది. పౌరుల సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే భావనపై ఎన్నికల సంఘం వైఖరి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. పశ్చిమబెంగాల్లో దాదాపు 92 లక్షల మంది పేర్లను ‘తార్కిక అసమానతలు’ పేరున తొలగించడం, ఈ పేర్ల తొలగింపుపై 60 లక్షల మంది అభ్యంతరాలు లేవదీయడం, ప్రజాస్వామ్య సూత్రాలనే ప్రశ్నిస్తోంది. ఈచర్య పౌరులు తమ ఓటు హక్కును, ఎన్నికల్లో నిలబడే హక్కును, వారి తప్పిదం లేకుండానే తొలగించిందనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల కమిషన్ చేపట్టడం, దానికి పెట్టిన గడువులు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ ఓ వైపు సిద్ధమవుతూ మరోవైపు 92 లక్షల మందిని ఓటర్ల జాబితాల్లోంచి తొలగించడం, ఓటర్ల నమూనా జాబితాను ఫిబ్రవరి 28న ప్రకటించడం ఇవన్నీ ఒక పద్ధతి లేకుండా ఎందుకింత హడావుడిగా చేశారో తెలియడం లేదు. తార్కిక వైరుధ్యం లేదా తార్కిక వ్యత్యాసం పేరున జాబితానుంచి పేర్లు తొలగించడంపై దాదాపు 60లక్షల మంది తమ అభ్యంతరాలను లేవదీశారు. వీరంతా సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పేర్లు తొలగింపుపై ఎన్నికల కమిషన్ చేసిన వాదనలు సుప్రీం కోర్టును ఏమాత్రం ప్రభావితం చేయలేదు. భారత దేశ వాస్తవ పరిస్థితులకు, ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని సుప్రీం కోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ తన సవరణ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. అయితే తొలగించబడిన లక్షలాది మంది ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చుకునే ప్రక్రియకు సుప్రీం కోర్టు బాధ్యత వహించడం హర్షణీయమే. వాస్తవానికి ఆ పని ఎన్నికల కమిషన్ చేయాల్సింది. అభ్యంతరాలను పరిష్కరించి జాబితాలను కట్టుదిట్టం చేయడానికి సుప్రీం కోర్టు ఏప్రిల్ 7 వరకు ఎన్నికల కమిషన్కు గడువు ఇచ్చింది. గడువు లోగా పరిష్కరించడానికి వీలుగా 700 మందికి పైగా న్యాయమూర్తులను నియమించేలా సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్కు సహకరించింది. కానీ తార్కిక వ్యత్యాసం జాబితాలో ఉన్న 27 లక్షల మంది ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లే హక్కున్నప్పటికీ, అది లేకుండా పోయింది. ఓటరు జాబితాలో తమ స్థానాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు. ఫిర్యాదులతో అప్పిలేట్ ముందు ఎవరైతే వేచి ఉన్నారో వారి వివాదాలు ఎటూ తేలకుండానే ఎన్నికల కమిషన్ తనపని తాను చేసుకునిపోతోంది. వీరి ఫిర్యాదులను గాలికి విడిచిపెట్టి ఎన్నికలను కమిషన్ నిర్వహించడానికి సిద్ధమైతే ఇది అత్యంత నీచమైన నాటకం అవుతుంది. పౌరులను ఓటరు జాబితా నుంచి ఎందుకు తొలగించారో దానికి తగిన సాక్షాధారాలు ఎన్నికల కమిషన్ నిరూపించగలగాలి. అలా కాకుండా ‘మిమ్మల్ని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు కొనసాగించాలి?’ అని పౌరులను ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తే అంతకన్నా విడ్డూరం మరొకటి ఉండదు. అది సహజ న్యాయ సూత్రాలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. ఒక పౌరుడ్ని ఓటరుగా నిరూపించుకోమనడం న్యాయబద్ధమైన ప్రక్రియను పాటించకపోవడమే అవుతుంది. పౌరుడి రాజ్యాంగపరమైన ఓటు హక్కుకు భంగం కలిగించేలా ఎన్నికల సంఘం బాధ్యతలను విస్మరించే పరిస్థితి ఎదురైనప్పుడు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం తప్పనిసరి. పౌరుల హక్కులను కాపాడేందుకు, రాజ్యాంగపరమైన ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది.
గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి
ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన అమీనాబాద్ మాజీ సర్పంచ్ బండి బాలరాజు… చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామ పంచాయతీకి అప్పగించిన ప్రభుత్వ స్థలంలో ఇంటి …
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి… చెన్నారావుపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం…. చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామాలలోని …
గుజరాత్ లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాన్ని గుంటూరులో జరిగిన ఘటనగా
ఏది సత్యం, ఏది మిథ్య ఓ మహాత్మా!
థ్రిల్లర్ అంటే ఇదీ! భారతీయులు 7వ తేదీ మంగళవారం రాత్రి నిద్రపోయే సమయానికి, ఇక తెల్లవారి నిద్రలేచే వేళకు ఈ భూగోళంపై ఇరాన్ అనే దేశం ఉండబోదనుకున్నారు. తీరా నిద్ర లేచే సరికి, అదేమీ లేదని, తన ప్రళయ భీకరమైన దాడులను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నానని అమెరికా అధ్యక్ష మహాత్ముడు ప్రకటించారు. అమ్మయ్య అని నిట్టూర్చి కాలకృత్యాలు తీర్చుకుని ఉపాహారాల కోసం కూర్చున్న వారికి, ఇరాన్ షరతులు నాన్సెన్స్ అనే మాట వైట్హౌస్ నుంచి వినిపించింది. లంచ్ వేళకు ఏమయేదీ ఎవరికీ తెలియదు. బహుశా ట్రంప్కు కూడా. అంతేకాదు కాల్పుల విరమణను అదే రోజు ఇజ్రాయెల్ ఉల్లంఘించటంతో 11వ తేదీన పాకిస్థాన్లో చర్చలు అనుమానాస్పదమైపోయాయి. ఈ మాట అనటం ఎందుకంటే, దాడుల విరమణకు మధ్యవర్తిత్వం తీసుకున్న పాకిస్థాన్, ఈజిప్టు, తుర్కియేలు అందుకు సంబంధించి ఎవరి షరతులేమిటో వాషింగ్టన్, టెహరాన్ల మధ్య పత్రాలు, మాటలను కొన్ని రోజులుగా బట్వాడా చేస్తున్నాయి. బట్వాడా చేయటం తప్ప వారు తమ ప్రతిపాదనలేవీ ముందుంచటం లేదు. ఆ విధంగా అమెరికా, ఇరాన్ల పరోక్ష మంతనాలు ముందుకు సాగుతూ, వెనుకబడుతూ వస్తున్నాయి. పైకి మాత్రం ఇద్దరూ అవునని, కాదని అంటూ వచ్చారు. ఒకరి కొకరు చేసుకుంటూ వచ్చిన హెచ్చరికలు ఎదుటి పక్షంపై ఒత్తిడిని పెంచేందుకు, తమ షరతులకు అనుకూలంగా లొంగదీసేందుకన్నది ఒక అభిప్రాయం. అదే సమయం లో, చివరన ట్రంప్ ఇరాన్ నాగరికతనే రాత్రికి రాత్రి తుడిచిపెట్టగలమని, ఆ దేశం ఇక కోలుకోలేదనే స్థాయికి వెళ్లటం నిజంగానే తీవ్రమైన ఆందోళనలను కలిగించింది. అంతవరకు వాడని ఆయుధాలను ఇక వాడగలమన్న ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మాటలతో అణ్వస్త్ర ప్రయోగమా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు తగిన కారణాలున్నాయి. ట్రంప్ ఒక పిచ్చివాడివలే ఎపుడేమైనా చేయగలడనే అభిప్రాయం ఇప్పటికీ అంతటా ఏర్పడింది. అటువంటి పనులు ఈ 14 మాసాలలో అనేకం కనిపించాయి. ఇరాన్ విషయమై నిష్కారణంగా దాడులు మొదలు పెట్టటమేగాక నానాటికీ రెచ్చిపోతున్నారు. వెనిజులా వలె రెండు రోజుల్లో తేలిపోతుందనుకున్నది ఇరాన్ ప్రతిఘటనతో అయిదు వారాలు గడిచినా కొనసాగుతుండటం ట్రంప్ వంటి అహంభావికి భరించలేనిదిగా మారింది. మరొక వైపు ఇజ్రాయెల్ అజెండా ఉండనే ఉంది. దాని ప్రకారం ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేయాలి. ఇక అణ్వస్త్ర ప్రయోగం అమెరికా లోగడ ఒకసారి చేయటమే గాక, కొరియా యుద్ధంలో, వియత్నాంలో అఫ్ఘానిస్థాన్లోనూ చేసేందుకు సన్నాహాలు జరిపారు. ప్రస్తుతం ఇరాన్ ప్రశ్న పశ్చిమాసియా, బహుళ ధ్రువ ప్రపంచ నిరారణ, పెట్రోడాలర్ ఆధిపత్యం, అక్కడి చమురును స్వాధీనం చేసుకోవటం, ఆ ప్రాంతమంతటా ఇజ్రాయెల్కు ఎదురు లేకుండా చేయటం, తమ ప్రత్యర్ధులైన రష్యా, చైనాలకు అక్కడ ఒక మిత్ర దేశం లేకుండా చూడటం, క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం వంటి అనేక అంశాలతో ముడిబడి ఉన్నది. ఇవన్నీ మామూలు విషయాలు కావు. అందువల్ల, ఇరాన్ను రాత్రికి రాత్రి ఒక నాగరికతగానే తుడిచి పెట్టగలమన్న మాటలు, ముఖ్యంగా ట్రంప్ వంటి పిచ్చివాడి నోటి నుంచి వచ్చినపుడు ఉపేక్షించగలవి కావు. తీరా ఇపుడు 7వ తేదీ రాత్రి నుంచి 8వ తేదీ రాత్రికి మధ్య నాలుగు విధాలైన పరిణామాలు కనిపించాయి. ఈ వ్యాసం వెలువడే వేళకు మరేమి జరిగేదీ, పైన అనుకున్నట్లు, ట్రంప్ సైతం చెప్పజాలరు. ఇరాన్తో పాటు ప్రపంచం దేనికైనా సిద్ధపడి ఉండాలి. దానినట్లుంచి మొదట ప్రస్తావించుకున్న విషయానికి వస్తే, ఎవరి షరతులు ఏమిటో ఉభయ పక్షాలకు ఎప్పటికపుడు తెలుస్తున్నపుడు 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత 15 రోజుల దాడుల విరమణ ప్రకటించిన అమెరికా అధ్యక్షునికి ఇరాన్ షరతులు ఏమిటో తెలిసే ఉండాలి కదా? ఆ విషయమై ఇజ్రాయెల్ను కూడా సంప్రదించే ఉంటారు కదా? అటువంటపుడు అన్నీ తెలిసి కూడా దాడుల విరమణ ప్రకటించినపుడు, తర్వాత కొద్ది గంటలకే నాన్సెన్స్ అనటానికి అర్థమేమిటి? ఇజ్రాయెల్ ఉల్లంఘనలు ఎందువల్ల? ఇంతకుముందు కూడా అమెరికా 10 షరతులు, ఇరాన్ 5 షరతులు, చివరకు అదేమీ ముందుకు సాగకపోవటం తెలిసిందే. అప్పటి దౌత్యం కూడా పాకిస్థాన్ ఈజిప్టు, తుర్కియేల ద్వారానే జరిగింది. ఆ ప్రయత్నాలు విఫలం కావటానికి కారణం రెండు పక్షాల షరతులు కూడా అసాధ్యం ఉండటం. వాటిని చూసిన వారికి ఇక చర్చలతో నిమిత్తం లేకుండానే అది ముందుకు నడిచే వ్యవహారం కాదని అర్థమైపోయింది. అయినా 48 గంటల గడువు, 5 రోజుల గడువు, 10 రోజుల గడువు అంటూ ఎవరికీ నమ్మకం కలగని నాటకాలు సాగాయి. అయితే గమనించదగ్గది ఒకటి ఈసారి కనిపిస్తున్నది. అది 15 రోజుల యుద్ధ విరమణ ప్రకటన. ఇది తగినంత కాలం అన్నది ఒకటైతే, ఇటువంటిది ఈ నెలన్నర యుద్ధంలో జరగలేదనేది మరొకటి. షరతులను గమనిస్తే మాత్రం అవి పోయిన మారుకన్న అసాధ్యంగా కనిపిస్తున్నాయి. అమెరికా అనటం ఇరాన్ తన అణుశుద్ధిని పూర్తిగా ఆపివేసి, ఇప్పటికే శుద్ధి అయిన యురేనియంను అప్పగించి శుద్ధ కేంద్రాలను నిర్మూలించటం. ఇరాన్ అనటం యురేనియం శుద్ధికిగల తన హక్కును గుర్తించటం. అదే విధంగా హర్మూజ్ పూర్తిగా స్వేచ్ఛాయాన మార్గం కావాలన్నది అమెరికా షరతు కాగా, ఆ మార్గంపై సార్వభౌమాధికారం తమది అయి, అటు నుంచి ప్రయాణించే నౌకలపై సుంకం విధించే అధికారం ఉండాలన్నది ఇరాన్ షరతు. దానితోపాటు, ఆ ప్రాంతమంతటి నుంచి అమెరికన్ సేనలు నిష్క్రమించాలని, ఆంక్షలన్నీ ఎత్తివేయాలని, ఇంతకాలం జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, తమ భద్రతకు పూర్తి భరోసా ఉండాలని, లెబనాన్పై కూడా దాడులు ఆపాలని, ఇదంతా కాల్పుల విరమణ రూపంలో తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా సమస్య పరిష్కారంగా జరగాలని ఇరాన్ కోరుతున్నది. కాల్పుల విరమణ ఎప్పుడూ ఇష్టం లేని ఇజ్రాయెల్ గతంలోనూ చర్చల ప్రక్రియను భంగపరిచినట్లు, ఈసారి కూడా వెంటనే లెబనాన్, ఇరాన్లపై దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ పరిస్థితి, ఉద్దేశాలు, షరతులు అన్నీ మొదటి నుంచి స్పష్టంగానే ఉన్నాయి. అందులో దాపరికాలు లేవు. వారికి కావలసింది తమ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమతను, అంతర్జాతీయ చట్టాల ప్రకారం లభించే హక్కులను కాపాడుకోవటం మాత్రమే. అంతేతప్ప పొరుగుదేశాలపై, వారి వనరులపై ఆధిపత్యం కాదు. తమ వనరులు తాము ఉపయోగించుకున తమ పద్ధతిలో అభివృద్ధి చెందటం. బయటిశక్తులు కొన్ని దశాబ్దాలుగా అందుకు భంగకారంగా వ్యవహరిస్తున్నాయి. మొదటి బ్రిటన్, తర్వాత బ్రిటన్తోపాటు అమెరికా, ఇపుడు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్. తమ ఆధిపత్యం కోసం అక్కడి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని 1953లో కూలదోసిన తర్వాత, వరుసగా లెక్కలేనన్ని ఆంక్షలతో అక్కడి ఆర్థిక పరిస్థితిని, సమాజాన్ని వీలైనంత కకావికలం చేసి, ఇపుడు మళ్లీ పాలనా వ్యవస్థ మార్పు (రెజీఛేంజ్) అంటూ బయలు దేరారు. లేని అణ్వస్త్ర ఉత్పత్తిని (లోగడ ఇరాక్లో సామూహిక మారణాయుధాల సాకు పద్ధతిలో, సాకుగా ప్రచారం చేస్తూ ఈ దురాగతాన్నంతా సాగిస్తున్నారు. ఇదంతా ఇప్పటికే ప్రపంచానికి అర్థమైపోయింది. అమెరికన్ ప్రజలకు కూడా. అందుకే ఈ దాడులలో అమెరికాకు సహకరించేందుకు యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటివి సైతం నిరాకరించటం తెలిసిందే. అంతర్గతంగా ట్రంప్ ప్రజాదరణ దారుణంగా పడిపోతున్నది. యుద్ధ ప్రభావాలు ప్రపంచ ఆర్థికంపై చూపుతున్న ప్రభావాలు తెలిసినవే. ఇపుడు అర్థం కావలసింది ఒకటున్నది. ఇరాన్ షరతులు అవేనని, గతం కన్న మరికొంత పెరిగాయని తెలుస్తుండగా, అమెరికా అధ్యక్షుడు యుద్ధ విరమణకు ఎందువల్ల అంగీకరించినట్లు? అది కూడా అసాధారణమని తోచే రీతిలో 15 రోజులకు? తన ఆలోచనలలో నిజాయితీతో కూడిన ఉద్దేశాలున్నట్లు నమ్మలేము. ఇజ్రాయెల్ ప్రధానికి అంతకన్న ఉండదు. ఇపుడు అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్లో ప్రత్యక్ష చర్చలు 10వ తేదీన జరుగుతాయంటున్నారు. అందులో అయితే గియితే రాజీ లక్షణాలు కనిపించినా వాటిని భంగపరిచేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. ఫిబ్రవరి 28న మొదలైన ప్రస్తుత యుద్ధానికి ముందు కూడా ఒమన్ మధ్యవర్తిత్వంతో చివరి దశకు వచ్చిన రాజీ చర్చలను భంగపరచింది. ఇజ్రాయెల్ అన్నది రహస్యం కాదు. ఇజ్రాయెల్ను అమెరికా గతంలోగాని, ఇపుడుగాని నియంత్రించకపోవటం కనిపిస్తూనే ఉంది. ఇరాన్ను ధ్వంసం చేసి, పాలస్తీనా ఏర్పాటును అడ్డుకుని, గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టికి కంకణం కట్టుకున్న నెతన్యాహూ ఈసారి మాత్రం అమెరికాఇరాన్ రాజీకి అంగీకరించగలరన్నది భ్రమ. ఇవన్నీ అమెరికా అధ్యక్షునికి పూర్తిగా తెలిసిన విషయాలే. అయినప్పటికీ ఈ విరమణ ప్రకటించటంలోని ఎత్తుగడ ఏమిటో తెలిసేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. - టంకశాల అశోక్ ( దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు
మెదక్ నర్సింగ్ కళాశాల లో వసతులు ఏమీ లేవు రోడ్డెక్కిన విద్యార్థులు
మెదక్ ఏప్రిల్ 10 (జనం సాక్షి )మెదక్ పిల్లి కోటల్ ఉన్న నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినిలు భోజన సదుపాయాలు హాస్టల్ వసతులు సరిగ్గా లేవని గత …
Summer Effect : బిగ్ అలర్ట్.. పది రోజులు బయటకు రావద్దు.. ఎండలు ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి
Revanth Reddy : నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు
Telangana : ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ కలకలం రేపింది
సమాజంలో మార్పు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ మార్పు కోసం ముందుకు వచ్చి పోరాడే ధైర్యవంతులు మాత్రం అరుదుగా ఉంటారు. అన్యాయం చూసి మౌనంగా ఉండటం సులభం. దానికి ఎదురు నిలబడటం నిజమైన ధైర్యం. అలాంటి ధైర్యంతో అణగారిన వర్గాల కోసం, మహిళల హక్కుల కోసం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆయన జీవితం కేవలం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే కాదు. అది కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిన జీవగాథ. ఆయన జయంతి ఒక తేదీ మాత్రమే కాదు. మన మనస్సాక్షిని మేల్కొలిపే, మన బాధ్యతలను గుర్తుచేసే చైతన్య దినం. ఫూలే జన్మించిన కాలంలో భారతీయ సమాజం కులవివక్షతో కట్టుబడి, అసమానతలు, అన్యాయాలతో నిండిపోయి ఉండేది. పుట్టుక ఆధారంగా మనిషి విలువను నిర్ణయించడం, విద్యను కొద్దిమంది వర్గాలకే పరిమితం చేయడం, మహిళలను, అణగారిన వర్గాలను అజ్ఞానంలో ఉంచడం వంటి సమస్యలు విస్తృతంగా ఉన్నాయి. కానీ ఈ అన్యాయాలను ఫూలే ధైర్యంగా ప్రశ్నించారు. మనిషి విలువ పుట్టుకతో కాదు, గుణాలతో నిర్ణయించబడుతుంది, విద్య అందరికీ హక్కు అనే భావాలతో ఆయన సమాజాన్ని సవాలు చేశారు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పుణెలో ఒక సాధారణ మాలీ కుటుంబంలో ఫూలే జన్మించారు. చిన్నప్పుడే తల్లి మరణం ఆయన జీవితాన్ని కష్టాల దారిలో నడిపించింది. తండ్రి గోవిందరావు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలకు జీవన విలువలను నేర్పించారు. పేదరికం, కష్టాలు, సామాజిక అవమానాలు ఆయన బాల్యం లో భాగమయ్యాయి. అయినప్పటికీ అవి ఆయనను బలహీనుడిగా మార్చలేదు. మరింత దృఢసంకల్పంతో ముందుకు నడిపించాయి. చదువుపట్ల ఆసక్తి ఉన్నప్పటికీ కులవివక్ష కారణంగా ఆయన విద్య మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ తరువాత ఒక స్కాటిష్ మిషనరీ పాఠశాలలో చదివే అవకాశం దొరికింది. అక్కడ పొందిన పాశ్చాత్య విద్య ఆయనలో విమర్శనాత్మక దృష్టిని పెంచి, సమానత్వం, మానవత్వంపట్ల ఆకర్షణ కలిగించింది. అమెరికన్ తత్వవేత్త థామస్ పెయిన్ రచించిన రైట్స్ ఆఫ్ మాన్ గ్రంథం ఆయన ఆలోచనలపై గాఢమైన ప్రభావం చూపింది. అలాగే ఫ్రెంచ్, అమెరికా విప్లవాలు ఆయనను ప్రభావితం చేశాయి. వీటితోపాటు ఆయనకు ఎదురైనా అనుభవాలు, వ్యక్తులు, సంఘటనలు ఆయనను సమాజ మార్పు కోసం పోరాడే మహానేతగా తీర్చిదిద్దాయి. ఫూలే జీవితాన్ని మలిచిన ఒక సంఘటన ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒక బ్రాహ్మణ స్నేహితుడి పెండ్లి ఊరేగింపులో పాల్గొనప్పుడు, కులం పేరుతో ఆయనను అవమానించారు. నీవు ఈ పెండ్లి ఊరేగింపులో పాల్గొనుటకు అర్హుడు కాదు అనే మాటలు ఆయన హృదయంలో చెరిగిపోని గాయాన్ని మిగిల్చాయి. ఆ అవమానం ఆయనను వెనక్కి తగ్గించలేదు. అది ఆయనలో తిరుగుబాటుకు నాంది పలికింది. మనిషిని కులం ద్వారా ఎందుకు కొలుస్తారు? ఒక కులం గొప్పది, మరొకటి తక్కువది ఎందుకు? అనే ప్రశ్నలు ఆయనలో ఆలోచనల జ్వాలగామారి, సమాజ మార్పుకు మార్గం చూపాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే విద్య ద్వారానే సమాజాన్ని మార్చడం సాధ్యమని, విద్యనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని బలంగా విశ్వసించారు. అందుకే తొలుత అణగారిన వర్గాలకు, మహిళలకు విద్య అందించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలో ఆయనకు అండగా నిలిచింది ఆయన జీవిత భాగస్వామి సావిత్రిబాయి ఫూలే. సావిత్రిబాయి ఫూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయిగా నిలిచారు. ఫూలే ఆమెను విద్యాబోధనకు సిద్ధం చేసి, ఇద్దరూ కలిసి 1848లో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఆ కాలంలో ఇది విప్లవాత్మక చర్య. అది కేవలం ఒక విద్యాసంస్థ కాదు, అది సమాజ విముక్తి కోసం మొదటి అడుగు. మహిళలు చదువుకుంటే కుటుంబం ఎదుగుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది అనే గొప్ప సందేశాన్ని ఆయన అందించారు. సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా వారు వెనక్కి తగ్గలేదు. అనేక బాలబాలికల పాఠశాలలు స్థాపించిన అణగారిన వర్గాల పిల్లలు విద్య వ్యాప్తికి కృషి చేశారు. ఫూలే కేవలం విద్య సేవకే పరిమితం కాలేదు. సమాజం నిర్లక్ష్యం చేసిన వర్గాలకు ఆయన ఒక ఆశాకిరణం అయ్యారు. 1873 లో సత్యశోధక సమాజంను స్థాపించి, సమాజంలో సమానత్వం కోసం పోరాటం చేశారు. ఈ సంస్థ ద్వారా కులవివక్ష నిర్మూలన, మహిళా హక్కులు, వితంతువుల పునర్వివాహం, శిశుహత్యల నివారణ వంటి అనేక సామాజిక సమస్యలపై ఆయన పోరాటం కొనసాగించారు. వితంతు స్త్రీల కోసం, అనాథ శిశువుల కోసం శరణాలయాలు నిర్మించి వారిని ఆదరించారు. వితంతు స్త్రీకి పుట్టిన బిడ్డకు యశ్వంత్ రావు అని పేరుపెట్టి దత్తత తీసుకున్నారు. రైతుల, కార్మికుల సమస్యలపై కూడా ఆయన చేసిన పోరాటం ఆయనను నిజమైన ప్రజానాయకుడిగా నిలబెట్టింది. విద్యతోనే విముక్తి, సమానత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు నేటికీ పూర్తిగా సాకారం కాలేదు. సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, కులం, లింగం, ఆర్థిక స్థితి ఆధారంగా భేదాలు ఇంకా అనేక ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్య అందరికీ హక్కు అని చెప్పే దేశంలో, ఆ హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా అందుతోందా? సమాన అవకాశాలు నిజంగా అమలవుతున్నాయా? మనం ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం మనలోనే వెతకాలి. ఫూలే జయంతి సందర్భంగా కేవలం పూలమాలలు వేసి, ప్రసంగాలు చేయడం మాత్రమే సరిపోదు. ఆయన ఆలోచనలను మన జీవన విధానంలో ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన నివాళి. మనం చదివి ఎదగడమే కాకుండా, ఇతరులను కూడా విద్యతో ముందుకు నడిపించడం మన సామాజిక బాధ్యతగా భావించాలి. సమానత్వం, న్యాయం, విద్య అనే విలువలపై నిలిచిన సమాజం నిజమైన అభివృద్ధిని సాధిస్తుంది. అదే పూలే గారికి ఇచ్చే గొప్ప నివాళి. - నేడు జ్యోతిరావు ఫూలే జయంతి
Gold Prices Today : యుద్ధం ఆగింది.. బంగారం ధర పెరిగింది.. ఎందుకిలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలుపెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
ఫ్యాక్ట్ చెక్: 500 రూపాయలకే గోబర్ గ్యాస్ తో తయారైన సిలిండర్లను ప్రజల కోసం పంపిణీ చేయడం లేదు
గోబర్ గ్యాస్ తో తయారైన సిలిండర్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు
కష్టాల కడలిలో కరెంటు కార్మికులు
‘ఎగిరెగిరి దంచినోడికి అదే కూలి.. ఎగరకుండా దంచినోడికి అదే కూలి’ అన్నట్లు ఎసిలో కూర్చునోళ్లకు అదే కూలి. ఎండనక, వాననకా, రాత్రనక, పగలనక కరెంటు కోసం చెట్లు పుట్టలు ఎక్కెటోళ్లకు అదే కూలి, కాదు అంతకన్నా తక్కువ కూలీ అదేంది అనుకుంటున్నారా ఇది నిజం. కింద కూసోని పని చెప్పేటోళ్లకు పైసలెక్కువ, అదే కరెంటు స్తంభాలెక్కి పనిచేసే కార్మికులకు తక్కువ జీతం, ఎక్కువ శ్రమ, గ్యారెంటీలేని జీవితం ఎప్పుడు ఏమవుతుందో అర్థంకాని పరిస్థితి ఇన్ని ఇబ్బందులను తట్టుకొని కూడా శ్రమిస్తున్నారంటే నిజానికి కరెంటు కార్మికులకు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పది నిమిషాలు కరెంటు పోతే మనం అల్లాడిపోతం, అంతేకాదు మనం 12 గంటలు డ్యూటీ చేస్తేనే అయోమయం అయిపోతాం. మరి అలాంటిది కరెంటు కార్మికుల పరిస్థితి ఎప్పుడైనా చూశారా? మన దేశంలో ఎక్కువ కష్టపడేది ఎవరంటే మొదటగా సైనికులు, ఆ తర్వాత పోలీసులు, కరెంటు కార్మికులు కూడా అత్యధికంగా శ్రమించేవారే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎండైనా, వానైనా, రాత్రైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలెక్కి పని చేయడం చిన్న విషయం కాదు. ఒక్క చిన్న తప్పిదం జరిగినా ప్రాణానికి ముప్పు. అయినా కూడా వాళ్లు పనిచేస్తూనే ఉంటారు, ఎందుకంటే సమాజం నడవడానికి వాళ్ళు చేయడం ఎంతో అవసరం లేదంటే అంత చీకటిమయం. మరి అంత శ్రమించేవారికి జీతం ఎందుకు తక్కువ అనుకుంటున్నారా అదే మరి సమస్య ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ‘ఒక గుడ్డివాడికి చూపు రాగానే మొట్టమొదట విసిరేసేది అప్పటివరకు సహాయపడిన చేతికర్రనే’ అన్నట్లు ఓడిపోయినా నాయకులకు, గెలిచినా నాయకులకు కరెంటు కార్మికులు చేతికర్రలాంటోళ్ళు వాళ్ళకి పదవి రాగానే కరెంటు కార్మికులను కంటికి కనపడకుండా తిరుగుతారు. అప్పటిదాకా మేము ఉన్నాం మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నోళ్లే ఆఖరికి ఏమి చేయలేని పరిస్థితి. ఈ కార్మికుల కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలో అర్థంకాక కకావికలం అవుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వం పర్మినెంట్ చేస్తాం అనగానే కార్మికులకు ఇక మాకు మంచిరోజులు వచ్చినాయి అనుకుండ్రు. తీరా చూస్తే మళ్ళీ మొదటికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించమని ఏండ్లతరబడి మొత్తుకున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఇగ చేస్తాం అగ చేస్తాం అని చెప్పుడే తప్ప చేసింది ఏమీలేదు. గత 18 ఏళ్లకు పైగా తెలంగాణ విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులుగా సేవలందిస్తున్నవారు అప్పటి తెలంగాణ ఉద్యమ సమయంలో, వీరి సేవలను క్రమబద్ధీకరిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరకపోవడంతో, 2016లో విద్యుత్ కార్మిక సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. నిరసన కారణంగా జులై 28, 2017న పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 12(3) ప్రకారం ఒప్పందం కుదిరింది. జులై 29, 2017న సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతవరకు చూస్తే సమస్య పరిష్కారం దిశగా వెళ్లినట్టే కనిపించింది. అయితే, ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ కొందరు నిరుద్యోగ యువకులు దీనిని హైకోర్టులో సవాలు చేసి నీరుగార్చేలా చేశారు. సెప్టెంబర్ 18, 2018న హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పునిస్తూ, సెక్షన్ 12(3) ప్రకారం ఈ సమస్యలను పరిష్కరించుకునే అధికారం విద్యుత్ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక సంఘలకు ఉందని స్పష్టం చేసింది. అప్పటి సిఎం అసెంబ్లీలో, గవర్నర్ ప్రసంగం ద్వారా 23,667 మంది కార్మికులను క్రమబద్ధీకరించినట్లు ప్రకటించారు. కానీ కార్మికుల రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతూ కార్మికులకు పూర్తిస్థాయి క్రమబద్ధీకరణకు బదులుగా, పాత ఉత్తర్వులను రద్దు చేసి, ఫ్యాక్టరీల చట్టం 1946 స్టాండింగ్ ఆర్డర్స్ సర్వీస్ రూల్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల అధికారికంగా శాశ్వత హోదా లేకుండానే కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. ‘చెప్పుకొని మురువుచూసుకొని ఏడువు’ అన్నట్లు వీరు సమాజం దృష్టిలో శాశ్వత ఉద్యోగులే కానీ, ప్రభుత్వ దృష్టిలో మాత్రం కాదు. చెప్పుకోవడానికి కరెంటు ఉద్యోగం కానీ వీరి జీవితం కన్నీళ్లు కష్టాలే. జీతం పెంచుడు దేవుడెరుగు కానీ మా కష్టాలను చూసైనా కనికరించండయ్యా మహా ప్రభో అని వేడుకున్న వినే నాయకులు లేరు. ఇక పని విషయానికి వస్తే.. ఎంత చెప్పుకున్నా వీరి కష్టాలు తక్కువగానే అనిపిస్తాయి. ఇతర ప్రభుత్వ ఆఫీసుల్లో ఒకరి పని నలుగురు చేస్తుంటే, కరెంట్ ఆఫీసుల్లో మాత్రం ఐదుగురు చేయాల్సిన పనిని ఇద్దరు ముగ్గురే మోస్తున్నారు. సమాన అవకాశాలు లేకపోవడమే కాదు.. గత రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ అయిన వాళ్లకి, రెగ్యులర్ కాని వాళ్లకి 30% నుంచి 60% వరకు జీతాల్లో తేడా ఉంది. సాధారణంగా ఏడాదికి 300 షిఫ్టులు ఉండాలి.. కానీ వీరు 450 షిఫ్టులు చేస్తున్నారు. వారానికి సెలవులు కూడా లేకుండా, నిరంతరం పని ఒత్తిడిలోనే బతుకుతున్నారు. ఈ ఒత్తిడి ఎంతలా ఉందంటే.. తమ కుటుంబ సభ్యుల చివరి చూపుకి కూడా వెళ్లలేని పరిస్థితి.. అంత్యక్రియలకు హాజరు కాలేని బాధ.. మాటల్లో చెప్పలేం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఆర్టిసన్ కార్మికులకి ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ లేవు.. గ్రాట్యుటీ అనే హక్కు కూడా లేదు. దాంతో రిటైర్ అయ్యాక కూడా బతుకుదెరువు కోసం మళ్లీ వృద్ధాప్యంలో అడ్డా కూలీలాగా తిరగాల్సిన పరిస్థితి నిబంధనల ప్రకారం గ్రేడ్ మార్చితే ప్రభుత్వానికి నెలకు 10 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్తున్నారు. కానీ మేమేమీ అదనంగా అడగడం లేదు సార్.. ఇప్పుడు తీసుకుంటున్న జీతాలకే (కరెంట్ పే స్కేల్కి) మమ్మల్ని రెగ్యులర్ పోస్టుల్లోకి తీసుకోండి అనేదే మా విజ్ఞప్తి. ప్రభుత్వంపై భారం లేకుండా, మా బతుకుల్ని గాడిలో పెట్టాలనే మా కోరిక మాత్రమే.. అంతే అని అంతలా వేడుకున్నా కూడా ప్రభుత్వం కరుణించకపోవడం.. ఇది మాత్రం కరెంట్ కార్మికుల దౌర్భాగ్యమే అనాలి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే.. విధి నిర్వహణలోనే ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. మా ఆర్టిసన్ కార్మికుల్లో B.Tech, డిప్లొమా, పిజిలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. అయినా సరే వారికి సరైన కేడర్ లేకుండా, గౌరవం లేకుండా పని చేస్తున్నారు. వారిని కూడా గౌరవించి, సమాలోచన చేసి, తగిన చర్యలు తీసుకోవాలని, కనీసం మాకు ప్రభుత్వం పాత సర్వీస్ రూల్స్ అమలు చేసి, మా జీవితాల్లో వెలుగులు నింపండని ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. - కోట దామోదర్ 93914 80475
ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా పూర్తి #Artemis2 #Orion #NASA #MoonMission #SpaceNews #Astronauts
బోల్తా పడ్డ డీజిల్ ట్యాంకర్.. బకెట్లు, డబ్బాల్లో ఎత్తుకెళ్లిన జనం #Guntur #DieselTanker #Medikonduru
బౌలర్ గురించి పట్టించుకోను... దానిపై దృష్టి పెడుతాను: వైభవ్
హైదరాబాద్: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లో వీరవిహారం చేస్తున్నాడు. ఆర్సిబితో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. ఆర్ఆర్ గెలుపులో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. ఆర్సిబి తొలుత బ్యాటింగ్ చేసి ఆర్ఆర్ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్ఆర్ బ్యాట్స్మెన్లలో వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లో 78 పరుగులు, ధృవ్ జురెల్ 43 బంతుల్లో 81 పరుగులు చేయడంతో 18 ఓవర్లకే 202 పరుగులు చేసి విజయం సాధించారు. నాలుగు మ్యాచ్లలో 200 పరుగులు చేయడంతో ఆరెంజ్ క్యాప్ దక్కింది. వైభవ్ మాత్రం ఏడు సిక్స్లు, ఎనిమిది ఫోర్లతో 78 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా వైభవ్ మీడియాతో మాట్లాడారు. క్రీజులో ఉన్నప్పుడు బౌలర్ వైపు కన్నెత్తి చూడా చూడనని, కేవలం బంతిపై దృష్టి పెట్టి బ్యాటింగ్ చేస్తానని వివరణ ఇచ్చాడు. ప్రాక్టీస్లో ఏవిధంగా బ్యాటింగ్ చేస్తో అదే విధంగానే మైదానంలో ఆడుతానని తెలిపారు. అంతర్జాతీయ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హాజిల్ వుడ్ లాంటి అంతర్జాతీయ స్టార్ బౌలర్లు ఎదుర్కొవడానికి తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏబౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు అనేది చూడాని బంతిని బట్టి సిక్స్లో మలుస్తానని చెప్పుకొచ్చాడు. కేక్ కటింగ్ లాంటివి ఏమీ లేవని, తెల్లవారుజామునే విమానం ఎక్కాలని, తనకు భయం లేదని అనుకోవద్దన్నారు. తనని గైడ్ చేసిన వాళ్లలో తన తండ్రితో పనాటు కోచ్లు ఉన్నారని,చ ముఖ్యంగా రోమీ సామీ నా గార్డియన్ అని తెలియజేశారు. ఇద్దరు తన ప్రయాణ ప్రారంభం నుంచి ఉన్నారని, ఈ ప్రయాణంలో చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని, ఆటపై మాత్రం దృష్టి పెట్టాలని, ఇతర ఆలోచనలు వదిలేయాలని మోటివేట్ చేస్తారని చెప్పారు. తాము తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే ఇంకో 20 పరుగులు చేసేవాళ్లమని తెలిపారు.
32 Hours Russia Ceasefire : రష్యా ఈస్టర్ ఫీస్ట్ Anhra Prabha News
32 Hours Russia Ceasefire : రష్యా ఈస్టర్ ఫీస్ట్ Anhra Prabha
Anudeep Katikala Controversy Sparks Outrage Over Boundaries in Comedy
Hyderabad-based stand-up comedian Anudeep Katikala has found himself at the center of a major controversy after his remarks about top Telugu film personalities triggered widespread backlash. It was began comedy routine has now escalated into a serious debate on the limits of humor and the responsibility that comes with public platforms. The controversy erupted after […] The post Anudeep Katikala Controversy Sparks Outrage Over Boundaries in Comedy appeared first on Telugu360 .
Dacoit Day 1: Adivi Sesh career biggest opening
Dacoit starring Adivi Sesh, Mrunal Thakur has taken career best and biggest opening for the leading man. He has been consistent with his script selection and content-driven blockbusters. Now, he came up with a thrilling love story, Dacoit and it is making a merry at the box office. The film got biggest opening for Adivi […] The post Dacoit Day 1: Adivi Sesh career biggest opening appeared first on Telugu360 .
ఆశించినంత కిక్కును ఇవ్వలేకపోయిన ‘డెకాయిట్’
హీరో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా యాక్షన్- రొమాంటిక్ థ్రిల్లర్ ’డెకాయిట్’. షానియల్ డియో దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులను అలరించిందో తెలసుకుందాం. కథ: హరి దాస్ (అడివి శేష్) రాయలసీమ ప్రాంతంలోని హిందూపురానికి చెందిన తక్కువ కులం కుర్రాడు. అతను ఉన్నత కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్)ను ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోవడమే కాదు.. హరి జైలు పాలవుతాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న అతను.. తాను ఇలా కావడానికి సరస్వతినే కారణమని రగిలిపోతుంటాడు. ఎలాగైనా జైలు నుంచి తప్పించుకుని.. సరస్వతి మీద పగ తీర్చుకోవాలని చూస్తున్న అతడికి ఓ అవకాశం వస్తుంది. దాన్ని అతను ఉపయోగించుకున్నాడా.. సరస్వతి మీద ప్రతీకారం తీర్చుకున్నాడా.. ఇంతకీ గతంలో వీరి మధ్య ఏం జరిగింది.. నిజంగా హరి జైలు పాలవడానికి సరస్వతినే కారణమా.. ఇన్నేళ్ల తర్వాత సరస్వతి ఏ స్థితిలో ఉంది.. తిరిగి సరస్వతిని కలిశాక ఆమెతో హరి ప్రయాణం ఎలా సాగింది.. అనేది ఈ సినిమా కథ. కథనం, విశ్లేషణ: ‘క్షణం’ నుంచి ‘హిట్-2’ వరకు పకడ్బందీ థ్రిల్లర్లు అందించి ప్రేక్షకుల అభిమానా న్ని చూరగొన్నాడు హీరో అడివి శేష్. ఈ నేపథ్యంలో ‘డెకాయిట్’ మీద ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఈ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ప్రేక్షకులు ఆశించినంత కిక్కును ఈ సినిమా ఇవ్వలేకపోయింది. తెరపై ఏం జరుగుతుందో ముందే ఊహించేయగలిగితే.. సన్నివేశాల్లో లాజిక్కులు మిస్ అయితే.. ఎమోషన్ బలంగా లేకపోతే నిరాశచెందనడం సహజం. ‘డెకాయిట్’ విషయంలో అదే జరుగుతుంది. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ‘డెకాయిట్’ అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. అయితే రేసీ స్క్రీన్ ప్లేతో కథ ఎక్కడా ఆగదు. సన్నివేశాలు పరుగులు పెడుతుంటాయి. కొన్ని సీన్లు మంచి కిక్ ఇస్తాయి కూడా. కానీ సినిమా మొత్తంగా ఇవ్వాల్సినంత కిక్కు ఇవ్వలేదు.అందుకు ప్రధాన కారణం.. ప్రధాన పాత్రలను, కథలోని కీలకమైన విషయాలను బలంగా తీర్చిదిద్దకపోవడం, ముఖ్యంగా లీడ్ పెయిర్ మధ్య ప్రేమ సన్నివేశాలను కానీ.. వారి మధ్య ఎడబాటుకు దారి తీసే సన్నివేశాలను కానీ ప్రభావంతంగా చూపించకపోవడంతో ఎమోషన్ పండలేదు. అదే సినిమాకు అతి పెద్ద మైనస్. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నాశనం చేయాలి అనేంతగా హీరోయిన్ మీద హీరో అదే పనిగా రగిలిపోతున్నాడంటే.. అందుకు కారణాన్ని తన కోణంలో చాలా బలంగా చూపించాలి. కానీ ‘డెకాయిట్’లో అది జరగలేదు. ఇక ముఖ్య సన్నివేశాల్లో ట్విస్టులు కూడా బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. హీరో పాత్ర చిత్రణ సైతం గందరగోళంగా అనిపిస్తుంది సినిమాలో. జైల్లో ఉండగా అతడికి ఇచ్చే బిల్డప్.. తర్వాత ప్రవర్తించే తీరుకు.. గతంలో జరిగిన దానికి పొంతన లేదు.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను బలంగా తీర్చిదిద్దుకుని ఉంటే ‘డెకాయిట్’ లెవెల్ వేరుగా ఉండేది. ఇక అడివి శేష్ నటన పర్వాలేదు. కానీ రాయలసీమ భాష, యాస అతడికి అంతగా కుదరలేదు. మృణాల్ ఠాకూర్ భావోద్వేగాలు పండించడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. అనురాగ్ కశ్యప్.. ప్రకాష్ రాజ్ పాత్రలు అనుకున్నంత స్థాయిలో లేవు. జైన్ మేరీ ఖాన్ పాత్రలో పెద్దగా విషయం లేదు. సినిమా డైలాగుల్లో పదును లోపించింది. కథలో విషయం ఉంది కానీ.. స్క్రీన్ ప్లేలో మాయాజాలం మిస్సయింది. మొత్తానికి డెకాయిట్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
NBK’s Cop Drama aims Sankranthi Release?
Nandamuri Balakrishna is currently shooting for his 111th film directed by Gopichand Malineni. This mass entertainer is planned to be wrapped up in record time and the makers have plans of releasing the film during Dasara this year. Balayya is committed for two films: one with Vivek Athreya and the other with Vijay Kanakamedala. Vivek […] The post NBK’s Cop Drama aims Sankranthi Release? appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఇంత తక్కువా.. రీజన్ ఏంటి?
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది
వైభవ్ విధ్వంసం రాజస్థాన్ కు వరుసగా నాలుగో విజయం #IPL2026 #Vaibhav #RR #Cricket #OrangeCap #RCB
ఫ్యామిలీ ఆడియెన్స్ ‘రాకాస’ని ఎంతో ఆదరిస్తున్నారు
మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఉమేష్ కుమార్ బన్సల్తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ “మా డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అది నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. మా మూవీని చూసి ఎంజాయ్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మీదున్న నమ్మకంతో ‘రాకాస’ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీని ఎంతో ఆదరిస్తున్నారు. ‘రాకాస’ని కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం. అందరూ ‘రాకాస’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి” అని అన్నారు. మైత్రి రవి మాట్లాడుతూ “నిహారిక ‘రాకాస’ని అద్భుతంగా ప్రమోట్ చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ని కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ కొట్టాం. మున్ముందు ఆమె చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను. సమ్మర్లో కూల్ బ్రీత్లా ఉండే చిత్రమిది. ఆద్యంతం నవ్వించారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ‘రాకాస’లో పార్ట్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. థియేటర్కు వెళ్లి హ్యాపీగా నవ్వుకుని, ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ ఉంది”అని తెలిపారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ “రెండో వారంలోనూ ‘రాకాస’కి మంచి స్క్రీన్లు ఉన్నాయి. అదే మా సినిమా విజయానికి నిదర్శనం. ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిహారిక లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత వరకు వచ్చేది కాదు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానస శర్మ, మన్యం రమేష్, సన్నీ, రమేష్ యాదవ్, పాండు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
పల్నాడులో న్యాయవాదిని చంపి... రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు
అమరావతి: భూవివాదంలో ఓ న్యాయవాదిని హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో యడవల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ఒంగోలులో హరిప్రసాద్ అనే న్యాయవాది భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. హరి ప్రసాద్ జిల్లా కోర్టులో లాయర్గా పని చేస్తున్నాడు. ఒంగోలులోని కేశవరాజుకుంట సమీపంలో ఓ భూమిలో పోతరాజు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి నివసిస్తున్నాడు. రాఘవేంద్రరావు అనే వ్యక్తి ఆ స్థలం తనదని వాదిస్తున్నాడు. తన భూమిని ఆక్రమించరంటూ విఆర్ఒతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాఘవేంద్రరావు స్థానిక నాయకులతో కలిసి పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో పోలీసులు పోతరాజుతో పాటు ఆయన బంధువైన న్యాయవాది హరిప్రసాద్పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో హరి ప్రసాద్ ఒక వీడియోను విడుదల చేయడంతో వైరల్గా మారింది. స్థలం విషయంలో అధికార పార్టీకి చెందిన కొందరు బెదిరిస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ఎంఎల్ఎను కోరారు. గురువారం ఉదయం హైకోర్టుకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెప్పి స్కూటీపై వెళ్లాడు. హరి ప్రసాద్ను కొట్టి చంపి అనంతరం అతడిపై ద్విచక్రవాహనాన్ని పడేశారు. అతడిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ భూవివాదంలోనే అతడిని చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Bus Accident : ప్రయివేటు బస్సు ఢీ.. గాయాలతో బయటపడిన ప్రయాణికులు
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.
Trump Warning : రాజీలేదో.. రీసెట్ రెడీ Andhra Prabha News
Trump Warning : రాజీలేదో.. రీసెట్ రెడీ Andhra Prabha News (
Telangana : రేపు ఇంటర్ ఫలితాలు.. ఎలా చూసుకోవాలంటే?
తెలంగాణలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి
Vaibhav Sooryavanshi : బుడ్డోడా... మజాకానా...చితక్కొట్టేడేవాడొచ్చాడు.. భారత్ కు వైభవమే
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనకు చూసే వారికి కూడా టీం ఇండియాకు చితక్కొట్టేటోడు దొరికాడనిపించింది
Peddi and Vishwambara: Tollywood is Waiting
Mega fans are eagerly waiting for an official update from the teams of Peddi and Vishwambara about the release dates. Speculations say that Peddi will not hit the screens as per the plan on April 30th. The team is currently tightlipped and they are expected to issue a statement soon. The promotions of the film […] The post Peddi and Vishwambara: Tollywood is Waiting appeared first on Telugu360 .
నేడు పంజాబ్తో పోరు ముల్లాన్పుర్: ఐపిఎల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం జరిగే కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ముల్లాన్పుర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. సన్రైజర్స్కు ఈమ్యాచ్ సవాల్గా మారింది. సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన కిందటి మ్యాచ్లో సన్రైజర్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. పంజాజ్ మూడింటిలో రెండు విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఇక ఈ మ్యాచ్లోనూ పంజాబ్ విజయమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఓపెనర్లే కీలకం.. ఈ మ్యాచ్లో హైదరాబాద్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు కీలకంగా మారారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరు చెలరేగితే సన్రైజర్స్కు భారీ స్కోరు సాధించడం కష్టమేమీ కాదు. అయితే వీరి బ్యాటింగ్లో నిలకడ లోపించడం ఆందోళన కలిగిస్తోంది. విధ్వంసక బ్యాటింగ్కు మరో పేరుగా చెప్పుకునే హెడ్, అభిషేక్లు రాణిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా తన బ్యాట్కు పని చెప్పక తప్పదు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఇషాన్ తన మార్క్ బ్యాటింగ్తో విజృంభిస్తే ఈ మ్యాచ్లో భారీ స్కోరు సాధించడం హైదరాబాద్కు ఇబ్బందేమీ కాదు. నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లు ఫామ్లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. వీరి ఈసారి కూడా జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ సత్తా చాటడం జట్టుకు సానుకూల పరిణామం. లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబె తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక హర్షల్ పటేల్, ఉనద్కట్, మలింగ, హర్ష్ దూబె, నితీశ్ కుమార్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా ఉండనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది. తక్కువ అంచనా వేయలేం.. మరోవైపు పంజాబ్ జట్టులో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధెరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, చాహల్, అర్ష్దీప్, జాన్సన్, బార్ట్లెట్ తదితరులతో పంజాబ్ చాలా బలంగా ఉంది. అగ్రశ్రేణి బ్యాటర్లు, బౌలర్లు ఉండడంతో పంజాబ్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా కనిపిస్తోంది.
IPL 2026 : ఆర్సీబీపై రాజస్థాన్ విక్టరీ.. సమఉజ్జీల సమరంలో పై చేయి రాయల్స్ దే
గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది.
Israel- Hezbollah : చర్చలపై దాడుల ప్రభావం.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కుదరని సయోధ్య
హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం దాడులు మరింత ముదిరాయి
కానిస్టేబుళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాదిపై కాల్పులు
అమరావతి: బాలిక గొంతుకోసి పారిపోతున్న ప్రేమోన్మాది పోలీసులు పట్టుకున్నారు. కానీ కాస్టేబుళ్లపై దాడి చేసి పారిపోతుండగా అతడిపై ఎస్ఐ కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అగ్రహారం గ్రామంలో శ్రీనివాసులు, నాగమణేమ్మ అనే దంపతులు నివస్తిన్నారు. ఈ దంపతులకు ఇంటర్ చదివే కూతురు ఉంది. ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్ గత కొంత కాలంగా ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకోవాలని యువతిని వేధిస్తుండగా ఆమె నిరాకరిస్తోంది. దీంతో ఆమెపై అతడు పగ పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక గొంతు కోసి పారిపోయాడు. బాలిక కేకలు వేయడంతో గ్రామస్థులు బాలికను ఆస్పత్రికి తరలించడానకి ప్రయత్నించారు. మార్గం మధ్యతో తండ్రికి వెంకటేశ్, ప్రవీణ్ల పేర్లను చెప్పింది. చెన్నూరు శివారులోకి వెళ్లగానే బాలిక కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్ పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలిస్తుంగా కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచి పారిపోతుండగా అతడి కాళ్లపై కాల్పులు జరిపాడు. అతడు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Iran - Amrica - Talks : ఇరాన్ - అమెరికా చర్చలు ఫలప్రదం అవుతాయా?
ఇరాన్ - అమెరికాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి
Uttar Pradesh : Uttar Pradesh : యమునా నదిలో పడవ మునక.. పది మంది మృతికి అదే కారణమా?
ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది.
డీలిమిటేషన్తో అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం
మన తెలంగాణ/హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల మనుగడకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరిగితే ప్రజా ఉద్య మం తప్పదని ఆయన హెచ్చరించారు. ఇది పార్టీల సమస్య కాదని, ప్రజా సమ స్య అని ఆయన తెలిపారు. ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం అంతరం తీసుకుని రావాలనుకుంటున్నదని ఆయన విమర్శించారు. ఢిల్లీలో శుక్రవారం సిడబ్లుసి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్సభ ని యోజకవర్గాల పునర్విభజనతో పెద్ద రా ష్ట్రాలు మరింత పెద్దవిగా, చిన్న రాష్ట్రాలు చిన్నవిగా మిగిలిపోతాయని ఆయన ఆం దోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ని యోజకవర్గాల పునర్విభజన అవసరం ఏ మి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవ లం జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం శాస్త్రీయం కాదన్నారు. ఇది దేశ సమగ్రతకు, సమాఖ్య స్పూర్తికి విఘాతం అని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సంపూర్ణ మద్దతు ప్రకటించింద ని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అంశం తొలుత తమ పార్టీ ప్రతిపాదనేనని చెప్పారు. ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ ప్రతిపాదించారని ఆయన తెలిపారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వాలని సిడబ్లుసి తీర్మానం చేసిందని ఆయన వివరించారు. 2023లో బిల్లు తీసుకొచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఇండియా కూటమి పార్టీల నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఆయన చెప్పారు. 50 శాతం సీట్లు పెరిగినప్పుడు మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఒబిసి కోటా కూడా ఇవ్వాలని ఈ సమావేశంలో ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ అన్నారని ఆయన చెప్పారు. ఒబిసిల రిజర్వేషన్ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం 543 లోక్సభ సభ్యుల సంఖ్య ప్రకారం 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తే సరిపోతుందన్నారు. దీని కోసం నియోజకవర్గాల పెంపు ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.' జీవన్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనన్న సిఎం బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ చాలా మంది నాయకులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ కోసం కష్టపడిన వారిని బయటకి పంపించారని, ఆయన దేవేందర్ గౌడ్, ఈటల రాజేందర్, ఆలే నరేంద్ర, విజయశాంతి, జూపలి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లను ఉదహరించారు. జూపల్లి కృష్ణారావు ఓడిపోతే హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని కనీసం వార్డు సభ్యునిగా కూడా నియమించలేదని ఆయన తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల ్లచట్టాలను ఉపసంహరించుకున్నట్లే, డీ-లిమిటేషన్ బిల్లును కూడా ఉపసంహరించుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు 45రోజుల్లో ఇళ్ళ స్థలాలకు మార్గం ఇదిలాఉండగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాబోయే నలభై ఐదు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొంటామని హామీ ఇచ్చారు.
11thApril2026 |శనివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
11thApril2026 | శనివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 11thApril2026 |
లెబనాన్లో హెజ్బోల్లాపై ఇజ్రాయెల్ వీడని దాడులు, హర్మూజ్పై ఇరాన్ మరింత పట్టు దశలో శనివారం పాకిస్థాన్లో శాంతి చర్చలకు రంగం సిద్ధం అయింది. ఇస్లామాబాద్లోని ప్రముఖ సెరెనా హోటల్లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు మధ్యవర్తిత్వ దేశాల ప్రాతినిధ్యం మధ్య పరోక్ష రీతిలో జరుగుతాయి. ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు వేర్వేరు రూంలలో ఉంటాయి. ముఖాముఖీ చర్చలు ఉండవు. పరస్పర ప్రతిపాదనలు, రాజీమార్గాలను మధ్యవర్తుల ద్వారా పరస్పరం అందించడం జరుగుతుంది. ఈ దశలో చర్చలలో ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ స్థాయి దౌత్యవేదికగా మారిన ఈ హోటల్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్ అయింది. ఆదివారం సాయంత్రం వరకూ ఈ హోటల్కు వేరే అతిధులు రాకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారిని ఖాళీ చేయించారు. శుక్రవారం రాత్రి వరకూ కూడా మరుసటిరోజు చర్చలకు సంబంధించి అస్పష్టతనే నెలకొని ఉంది. కాల్పుల విరమణ చర్చల దశలో కూడా కన్పించడం లేదు. ఇరు పక్షాలు పట్టుదలతో ఉన్న కీలక అంశాలతో సీజ్ఫైర్ ముందుకు సాగుతుందా? అనేది ప్రశ్నార్థకం అయింది. ముందు తాత్కాలిక శాంతి, తరువాత శాశ్వత రీతిలో రాజీకి వీటుగా చర్చలు జరగాల్సి ఉంది. అయితే లెబనాన్లోని ఇరాన్ మద్దతు హెజ్బోల్లాపై ఇజ్రాయెల్ దాడులు , గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికీ ఇరాన్ వీడని ప్రతీకార దాడులతో చర్చలకు ముందుగానే సంకట స్థితి ఏర్పడిందని దౌత్యవర్గాలు తెలిపాయి. ఇరాన్ పది అంశాల ప్రతిపాదనను పాకిస్థాన్ దాచిపెట్టిందని అమెరికా విమర్శిస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగేవరకూ చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇది చర్చలకు ముందు తమ షరతు అని తెలిపారు. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ దళాలకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ టాస్నిమ్ తెలిపింది. ఇప్పటి సీజ్ఫైర్ను ఇరాన్ గౌరవించడం లేదని, హర్మూజ్పై పట్టువీడటం లేదని అమెరికా అధ్యక్షులు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ పద్థతి ఏమి బాగా లేదని వ్యాఖ్యానించారు. శాంతిచర్చలకు ఇరాన్ కనీస పక్షంగా అయినా గౌరవం ఇవ్వకపోతే ఇక ఇవి ముందుకు కదులుతాయా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇరాన్ నుంచి తమ గగనతలం ద్వారా డ్రోన్ దాడి జరిగిందని కువైట్ విమర్శించింది. ఇరాన్, ఈ ప్రాంతంలో ఇరాన్ మద్దతు సాయుధ బలగాలు ఈ చర్యకు పాల్పడ్డాయని తెలిపారు. అయితే ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ఈ వాదనను తోసిపుచ్చాయి. తమ నుంచి జరగని దాడులను తాము చేసినట్లుగా చెప్పడం కుదరదని తెలిపారు. పరస్పర వాదోపవాదాలు సాగుతూ ఉన్నా , పాకిస్థాన్ వేదికగా చర్చలకు జోరుగా రంగం సిద్ధం అయింది. పాకిస్థాన్లో చర్చల దశలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్తో తమ దేశ ప్రతినిధి బృందం చర్చలకు అంగీకరించారు. ఇవి వచ్చే వారం అమెరికాలోని వాషింగ్టన్లో జరుగుతాయని యుఎస్ అధికారి ఒకరు తెలిపారు. అయితే నిర్థిష్ట తేదీ, చర్చనీయాంశాల గురించి తాము చెప్పలేమని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య నేరుగానే చర్చలు ఉంటాయని వెల్లడైంది. అయితే హెజ్బోల్లా అనధికారిక సమాంతర బలగాల వ్యవస్థ కావడం,ఈ మిలిటెంట్లతో చర్చల విషయం ప్రస్తావనకు రాకపోవడంతో ఈ వాషింగ్టన్ వేదిక ఫలితం ఇస్తుందా? అనేది సందేహంగా మారింది. చర్చలలో విస్తృత అజెండా ఉంటుంది. ఇరాన్ అణు కార్యక్రమ వివాదాలు, హర్మూజ్ మార్గం, ప్రాంతీయ సుస్థిరత కీలక అంశాలు కానున్నాయి. ఇరాన్పై ఆంక్షల పర్వం కూడా ప్రస్తావనకు వస్తుంది. వీటి నుంచి తమకు పూర్తి స్థాయి ఊరటను కల్పించాలని ఇరాన్ పట్టుపడుతోంది. ప్రాంతీయ శాంతిస్థాపనకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సక్రమ రీతికి హర్మూజ్ పునరుద్ధరణ విషయాలు కీలకం కానున్నాయి.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని శాఖలు 2047 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్షంగా ఆదాయం పెంచుకోవాలని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సచివాలయంలో రెవిన్యూ జనరేషన్, రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. స మావేశంలో సభ్యులు, మంత్రులు ఉత్త మ్ కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ల తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ ఏఐ వంటి ఆధునిక టె క్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో ప న్నుల ద్వారా వస్తున్న ఆదాయంపై ని రంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణ తో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తుందన్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖ ల్లో ఆదాయ వనరులను పెంచుకోగలిగామని తెలిపారు. అధికారులు మరిం త పకడ్బందీగా పనిచేసి ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వంటి అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు. నిరంతరం సమీక్షలు, పన్ను ల నిర్వహణలో పకడ్బందీ చర్యల మూలంగా కమర్షియల్ టాక్స్ శాఖలో జిఎస్టీ ఆదాయం గత మూడు నెలలుగా 15 శాతం పెరుగుదల కనిపించిందని డిప్యూటి సిఎం వివరించారు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ శాఖలో సైతం ఆదాయంలో పెరుగుదల కనిపించిందన్నారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రతి శుక్రవారం రెవిన్యూ జనరేషన్, రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని డిప్యూటి సిఎం తెలిపారు. 2047 వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నామని, ఈ మేరకు అన్ని శాఖలు ఆదాయ సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆయన స్పష్టం చేశారు. భూముల విలువ పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేశారని, ఆ కమిటీల నివేదికలను ముందుగా సబ్ కమిటీకి సమర్పించి ఆ తర్వాత క్యాబినెట్ కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను డిప్యూటి సిఎం ఆదేశించారు. అధికారులు ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు యాక్షన్ రిపోర్టుతో తదుపరి సమావేశానికి రావాలన్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ఈ అంశంపై అందరికీ ముందస్తుగా సమాచారం అందడం మూలంగా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపైన అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవిన్యూ, పరిశ్రమల శాఖలోనూ ఆదాయం పెంపునకు సంబంధించి చేపట్టిన చర్యలు ఫలితాలపై మంత్రులు సమీక్ష చేశారు.
ట్రైబల్ వర్సిటీ కోర్సులకు ఐఐటిహెచ్ సహకారం
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ విశ్వ విద్యాలయాన్ని ములుగు జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతికి ప్రధాని నరేంద్ర మోడీ సుముఖత వ్య క్తం చేశారని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీఆర్డీఓ మాజీ చై ర్మన్ డాక్టర్ జి.సతీష్రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించనున్నారు. అలాగే అధ్యాపకులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించి సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. ఎస్ఎస్సిటియు(సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్శిటి)లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రయోగశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇంటర్న్షిప్, వర్క్షాపు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు. అలాగే ఎస్ఎస్సిటియు అధ్యాపకులకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ అందించనుంది. బోధనలో మెళుకువలు పెంపొందించేందుకు వర్క్షాప్లు, సెమినార్లు, అతిథి ఉపన్యాసాలను నిర్వహిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎస్ఎస్సిటియులో సాంకేతిక కోర్సుల నిర్వహణకు ఐఐటీ హైదరాబాద్ సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బీటెక్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ లో బీఎస్, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్లో బీఎస్ వంటి కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ కోర్సులను బోధించే ఎస్ఎస్సిటియు అధ్యాపకులకు శిక్షణ బాధ్యతను ఐఐటీ హైదరాబాద్ చేపడుతుంది. ఐఐటీ హైదరాబాద్ మార్గదర్శకత్వంలో నిర్వహించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందుతూ, ప్రాంతీయ విద్యా అభివృద్ధికి దోహదం చేయనుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి ‘సమ్మక్క-సారక్క’ అమ్మవార్ల పేరును పెట్టాలని తాను ప్రధాని నరేంద్ర మోడీని కోరడంతో వెంటనే అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల తరఫున ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి తాత్కాలిక క్యాంపస్ను ములుగులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రెండు ప్రముఖ కేంద్ర విద్యాసంస్థలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్కు ఈ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ మొదటి నుంచే అవసరమైన మద్దతు అందిస్తోందని, ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ కూడా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషకరమని ఆయన తెలిపారు. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్, ట్రైబల్ యూనివర్సిటీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం చాలా ప్రాముఖ్యత కలిగినదన్నారు. ప్రధాని దూర దృష్టితో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గించడమే ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశ్యం అని ఆయన స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని ‘జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం’గా నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో రాంజీ గోండు, కొమరం భీమ్ వంటి గిరిజన వీరుల స్మారకంగా ట్రైబల్ మ్యూజియం నిర్మాణం చేపట్టామని భూమి పూజ పూర్తయిందని ఆయన వివరించారు. ఈ సంవత్సరం చివరికి మ్యూజియాన్ని ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ‘ప్రధానమంత్రి జన్ మన్ యోజన’ వంటి పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గిరిజనుల విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ఆర్టిసి) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యం (డిఏ) ప్రకటించింది. ఈ ఏడాది సంస్థ ఉద్యోగులకు జనవరిలో ఇవ్వాల్సిన డీఏను అందజేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 38 వేల మందికిపైగా ఆర్టీసీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తు తం ఆర్టీసీ ఉద్యోగులకు 50.7 శాతం డీఏ అందుతుండగా, తాజాగా 2.1శాతానికి పెంచారు. దీని తో మొత్తం డీఏ 52.8 శాతానికి చేరింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 1 నుండి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన బకాయిలను ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల మేర ఆర్థిక భారం ప డుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న డీఏలను ఈ ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తూ వస్తోందని తెలిపారు. 2024 మే నెలలో ఆర్పిఎస్ -2017 అమలు చేసిన తర్వా త, తాజాగా ఈ 2.1 శాతం డీఏను కూడా మం జూరు చేయడంతో, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలన్నీ పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది జూలై 2025లో కూడా ప్రభు త్వం 2.1 శాతం డీఏను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయం ప్రజా పాలన ప్రభుత్వం మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డీఏ పెంపుతో పాటు అంతకు ముందు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక త్రిసభ్య కమిటీ ద్వారా దీర్ఘకాలంగా విధులకు దూరమైన వారిని తిరిగి తీసుకోవడం, కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఆర్టీసీ ఆసుపత్రిని ఆధునీకరించామని పేర్కొన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై రాజస్థాన్ రాయల్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బర్సాపరా స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. జురేల్ 81, జడేజా 24 నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. సూర్యవంశీ 26 బంతుల్లోనే 8 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును కెప్టెన్ రజత్ పటిదార్ (63), విరాట్ కోహ్లి (32) ఆదుకున్నారు.
శనివారం రాశి ఫలాలు (11-04-2026)
మేషం ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభం వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మిధునం స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహం దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. కన్య దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. తుల ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదర స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చికం వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ధనస్సు నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. మకరం ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది. కుంభం రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మీనం ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతనప్రణాళికలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన జైస్వాల్ 8 బంతుల్లో 2 సిక్స్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ అండతో వైభవ్ జోరును కొనసాగించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన వైభవ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. అసాధారణ బ్యాటింగ్ను కనబరిచిన సూర్యవంశీ 26 బంతుల్లోనే 8 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. తాజా సమాచారం లభించే సమయానికి రాజస్థాన్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును కెప్టెన్ రజత్ పటిదార్ (63), విరాట్ కోహ్లి (32) ఆదుకున్నారు.
రూ.54.90 కోట్లతో బీడీ ఆకు పథకం అమలు
రాష్ట్ర వ్యాప్తంగా బీడీ ఆకుల సీజన్ 2025కి సంబంధించి 30 జిల్లాల్లోని 37 డివిజన్లలో బీడీ ఆకుల పథకం అమలుకు గాను అటవీ, పర్యావరణ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్లో రూ.54.90 కోట్లతో బీడీ ఆకుల పథకం అమలుకు అటవీ శాఖ ప్రధాన సంరక్షునికి అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఏజెంట్గా ఉంటూ బీడీ ఆకుల కొనుగోలు, వ్యాపారానికి బాధ్యత వహిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా అటవీ అభివృద్ధి సంస్థ ఇందుకు అవసరమైన రుణాలను కన్సార్టియం బ్యాంకుల నుంచి పొందేందుకు కూడా అనుమతిచ్చింది.
ఉచిత చీరల తయారీకి టెస్కోకు రూ.450 కోట్ల ఆర్డర్
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కోటి చీరల తయారీకి గాను టెస్కోకి ప్రభుత్వం రూ.450 కోట్ల ఆర్డర్ ఇచ్చిందని అధికార వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్చ్. మెప్మాల సీఈవో దివ్యా దేవరాజ్లు చీరల్లో వివిధ నమూనాలను సిద్ధం చేయగా, ఈసారి చిలకపచ్చ రంగు. ఎరుపు జరీ డిజైన్తో చీరను ముఖ్యమంత్రి ఎంపిక చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నేత కార్మికులకు టెస్కో ద్వారా చీరలు తయారు చేసి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అక్టోబరు నాటికి చీరలను సిద్ధం చేస్తే నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ హై కోర్టులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన ధర్మాసనం వారం రోజుల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటిలోగా సంబంధిత కోర్టులో రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ను ఆదేశించింది. పవన్ ఖేరా మందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ భార్య స్థానిక సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని, ఈ పిటిషన్పై విచారించే పరిధి కోర్టుకు ఉంటుందని తెలిపారు. పిటిషనర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ గురించి అస్సాం సిఎం అనుచితంగా మాట్లాడడంతో పాటు ఢిల్లీలోని ఆయన ఇంటికి సుమారు 100 మంది పోలీసులు పంపించడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. అస్సాం ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ పిటిషనర్పై నమోదయ్యింది సాధారణ పరువునష్టం కేసు కాదని, ఆరోపణలు చేయడానికి పలు నఖిలీ పత్రాలు వినియోగించారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ హైదరాబాద్ నివాసిని అంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. కాగా, అస్సాం సిఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మకు మూడు పాస్ పోర్టులు, విదేశాల్లో ప్రకటించని ఆస్తులు చాలానే ఉన్నాయని, పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై గుహవాటి పోలీస్ స్టేషన్లో పరువునష్టం కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు మంగళవారం ఢిల్లీలోని ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. హైదరాబాద్ లో భార్య నీలిమ ఇంటికి వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరా పిటిషన్ దాఖలు చేశారు.
చినూక్ నుంచి ఎయిర్డ్రాప్ పరీక్ష
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం ప్రతిష్టాత్మక గగన్యాన్ యాత్ర దిశలో ఓ అడుగు వేసింది. అత్యంత కీలకమైన రెండో ఇంటిగ్రేడెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ( ఐఎడిటి 02)ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా నిర్వహించారు. చినూక్ హెలికాప్టర్తో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి క్రూ మాడ్యుల్ను జారవిడిచే ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయాణంలో వ్యోమగాముల సురక్షిత ప్రయాణం దిశలో ఈ ప్రక్రియ అత్యవసరం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం విజయవంత పరీక్ష పట్ల కేంద్ర ఎర్త్సైన్స్ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సిబ్బందిని, సైంటిస్టులను అభినందించారు. వచ్చే ఏడాది గగన్యాన్ మిషన్ నిర్వహిస్తారు. క్రూ మోడల్ రికవరీ గగన్యాన్ ప్రక్రియలో అత్యంత కీలకమైనది. దీనిని పలుసార్లు పరీక్షించిన తరువాత గగన్యాన్ తేదీ వివరాలు ఖరారు అవుతాయి.
కులగణన వ్యాజ్యం కొట్టివేసిన సుప్రీంకోర్టు
కులాల వారి గణనను నిలిపివేయాలనే ప్రజావ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన పిటిషనర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా మందలించారు. పిటిషన్లో వాడిన పదజాలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో అనుచిత భాష వాడారు. ఎవరు ఈ పిటిషన్ మీకు రాసి ఇచ్చారని ప్రదాన న్యాయమూర్తి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2027 జనాభా లెక్కల ప్రక్రియను ప్రకటించింది. ఇందులో కులాల వారిగా జనసంఖ్యను సేకరించడం, తొలిసారిగా డిజిటల్ సెన్సస్ ప్రక్రియలను చేర్చారు. కులగణనకు సరైన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంటూ పిటిషనర్ పిల్లో వాడిన పదాలు వివాదాస్పదం అయ్యాయి.
లెబనాన్లో పౌరుల మరణాలపై భారత్ ఆందోళన
లెబనాన్లో పెరుగుతున్న పౌరుల మృతులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో, ఇప్పటికే అనిశ్చితిలో ఉన్న అమెరికాఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో న్యూఢిల్లీ ఈ ప్రకటన చేసింది. బుధవారం జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 300 మంది మరణించినట్లు లెబనాన్ అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, లెబనాన్లో భారీ సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారన్న సమాచారం మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అని తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు సైనికులను అందిస్తున్న దేశంగా భారత్, లెబనాన్ శాంతి, భద్రతల విషయంలో బాధ్యతతో వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అంతర్జాతీయ చట్టాలను పాటించడం, దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించడం అవసరం అని జైస్వాల్ అన్నారు. గల్ఫ్ దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన కొనసాగుతోందని, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లనున్నారని చెప్పారు. ఈ పర్యటనలో పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, అమెరికాఇరాన్ మధ్య రెండు వారాల కాలపరిమితి ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య రవాణా నిర్బంధం లేకుండా కొనసాగాలని, పశ్చిమ ఆసియాలో స్థిరమైన శాంతి నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేసింది. లెబనాన్లో భద్రతా పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో, అక్కడి భారత రాయబార కార్యాలయం భారతీయుల భద్రతపై నిత్యం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉన్మాది వికృత చేష్టలకు యువతి బలి
తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటుందనే అక్కసుతో ఓ ఉన్మాది వికృత చేష్టలకు ఓ యువతి బలవన్మరణానికి పాల్పిడింది. ఈ సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న కందికొండ చిరంజీవి కుమార్తె రమణి (24)కి సమీప బంధువు వరుసకు బావ అయ్యే మనోహర్ (25)తో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో కొద్ది రోజులకు మనోహర్కు హెచ్ఐవీ ఉందని తెలియడంతో సదరు యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో మనోహర్ ఉన్మాదిగా మారాడు. తనను కాదని వేరే పెళ్లి చేసుకొని ఎలా ఆనందంగా ఉంటావంటూ ద్వేషం పెంచుకొని,గత సంవత్సరం మే నెలలో ఇంజెక్షన్ ద్వారా హెచ్ఐవీ రక్తం రమణికి బలవంతంగా ఎక్కించాడు. ఈ క్రమంలో యువతి అనారోగ్యానికి గురి కావండంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించగా హెచ్ఐవీ అని నిర్ధారణ కావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మనోహర్ను ఆరెస్టు చేసి రిమాండ్కు పంపించగా నాటి నుంచి యువతి మనోవేధనకు గురైంది. దీంతో మనస్థాపంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి అమ్మానాన్న నన్ను క్షమించండి, మరో జన్మంటూ ఉంటే మీ కడుపున పుడతాను, చెల్లి, తమ్ముడు అమ్మానాన్నను మంచిగా చూసుకొండి అని లెటర్ రాసి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రమణిని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

36 C