మక్తల్లో బిజెపి వార్డు అభ్యర్థి ఆత్మహత్య
మన తెలంగాణ/మక్తల్: మున్సిపల్ ఎన్నికలకు ఒక రోజు ముందు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆరవ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పోటీ చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థిగా ఎరుకలి మహాదేవప్ప, ఆరవ వార్డు నుండి పోటీ చేస్తున్నారు. ప్రజల మద్దతుతో గెలుపు దిశలో ముందుకెళుతున్న సమయంలో బెదిరింపులు వచ్చాయని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోటీలో ఉండి ప్రచారంలో దూసుకుపోతూ గెలుపు బాటలో పయాణిస్తున్న సందర్భంలో ఇలా జరగడం చాలా దురదృష్టకరమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికలను వాయిదా వేసినట్లుగా రిటర్నింగ్ అధికారి శివయ్య ప్రకటించారు. న్యాయ విచారణ జరపాలి: బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు మున్సిపాలిటీ ఆరవ వార్డు బిజెపి అభ్యర్థి ఎ రుకల మహదే వప్ప మంగళవారం తెల్లవా రు జామున ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందడం దురదృష్ట కారణమని ఆయనది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి న హత్య అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ డి కే.అరుణ, బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ, రాష్ట్ర నాయకు లు కే.రతంగ్ పాందురెడ్డి తో కలిసి ఆస్పత్రి వద్ద మహదేవప్ప మృతదేహంపై పూలు వే సి సంతాపం ప్రకటించారు .అనంతరం వి లేకరులతో మాట్లాడుతూ. సీఎం రేవంత్ రె డ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అ రాచకాలు, దౌర్జన్యాలు శృతిమించిపోయాయని అన్నారు. ఓటమి భయంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్ చేయడం సర్వ సాధారణం అయిందన్నా రు. మహదేవప్ప మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని బాధ్యులపై కఠినచ ర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహదేవప్ప మృ తికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
బెంగళూరు/న్యూఢిల్లీ : కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో డిప్యూటీ సిఎం శివకుమార్ను నియమించాలని కోరుతూ 80 మంది ఎంఎల్ఎ లు హైకమాండ్కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎంఎల్ఎ, డికె మద్దతుదారు డు ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఆయన తాజా ప్రకటనలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ‘అవును. నిజమే 80 నుంచి 90 మంది శాసనసభ్యులం డికెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాశాం. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పలుమార్లు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా మేం క్రమశిక్షణగా మెలగాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటించాల్సి ఉం టుంది’ అని ఇక్బాల్ మీడియాతో వ్యాఖ్యానించా రు. కర్నాటకలో నాయకత్వ అంశంపై సిఎం సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, వారు ఏ నిర్ణయం వెలువరిస్తే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తాను ఢిల్లీకి వెళ్లబోనని, ఒకవేళ హైకమాండ్ను పిలుపు వస్తేనే వెళ్తానని అన్నారు. ఇక దీనిపై అనవసరమైన ప్రశ్నలు అక్కర్లేదని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య అన్నారు. తాను పదేపదే ఢిల్లీకి ఎందుకు వెళ్లాలని, తనకు ఇక్కడ బ డ్జెట్ సిద్ధం చేసుకునే పనులతో పాటు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు డికె శివకుమార్ మాట్లాడుతూ... తమ మధ్య ఏం చర్చ జరిగిందనేది మొత్తం పార్టీ పెద్దలకు తెలుసని, అంతా వారిముందే జరిగిందని అన్నారు. అధిష్టానం ముందే సిద్ధరామయ్య మాట్లాడారని, అందులో గందరగోళానికి తావెక్కడిదని ప్రశ్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదీ జలాలను ఎపి అప్పనంగా తీసుకుపోతుంటే, సిఎం రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చోని చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎపి ప్రభుత్వం ఎలాంటి ఇండెంట్లు, బోర్డు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తరలించుకుపోతోందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, తెలంగాణ ఇరిగేషన్ శాఖ కెఆర్ఎంబికి రాసిన లేఖను ఉటంకిస్తూ ఆయన కీలక గణాంకాలను వెల్లడించారు. జనవరి 29 నాటికి ఈ వాటర్ ఇయర్లో ఎపి 664 టిఎంసిల నీటిని వాడుకున్నదని, తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఎపి వాటా 66 శాతం కాగా, ఇప్పటికే ఎపి నీటి వినియోగం 80 శాతానికి చేరిందని తెలిపారు. తెలంగాణ వాటా 34 శాతం (174 టిఎంసిలు) ఉండగా, మనం కేవలం 20 శాతానికి పరిమితమయ్యామని అన్నారు. ఎపి వాటా మరో రెండు రోజుల్లోనే దాటిపోతుందని మన ఇఎన్సి లేఖ రాసినా, ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. నీటి దోపిడీని అడ్డుకోవాలని బోర్డుకు లేఖ రాసిన ఇఎన్సి జనవరి 31న రిటైర్ అయితే, ఆ కీలకమైన బోర్డు మెంబర్ పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వానికి వారం రోజులు పట్టిందని విమర్శించారు. వాటా కుదరలేదా... మాట కుదరలేదా..? అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. ఆ పోస్టును వారం రోజులు ఎందుకు ఖాళీగా పెట్టారని ప్రశ్నించారు. మీడియా ప్రశ్నించే వరకు స్పందన లేదంటే రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా..? అని నిలదీశారు. గురుదక్షిణ చెల్లిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడుపై ఉన్న భయం వల్లే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ను కోరడం లేదని హరీష్రావు ఆరోపించారు. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వరుసగా రెండేళ్లు కృష్ణా జలాల వినియోగంలో కాంగ్రెస్ హయాంలోనే అత్యల్ప వినియోగం నమోదైందని, ఇది రేవంత్ రెడ్డి తన గురువుకు చెల్లిస్తున్న గురుదక్షిణ అని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతుల పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెఆర్ఎంబి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేతిలో ఉందని, ఎపి 664 టిఎంసిలు వాడితే, బోర్డు మాత్రం 555 టిఎంసిలు అని తక్కువ చేసి చెబుతోందని ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్, స్కామ్లు బయటపడతాయనే భయంతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటే, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేవలం కెసిఆర్ను తిట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కెఆర్ఎంబి కార్యాలయాన్ని ముట్టడిస్తాం తెలంగాణ నీటి హక్కుల కోసం బిఆర్ఎస్ పోరాడుతుందని హరీష్రావు పు నరుద్ఘాటించారు. త్వరలోనే కెఆర్ఎంబి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తక్షణమే స్పందించి ఎపి నీళ్ల తరలింపును అడ్డుకోవాలని, క్యారీ ఫార్వర్డ్ విధానంలో పైన ఉన్న శ్రీశైలంలో నీటిని ఆపి పెట్టాలని డి మాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊ రుకోదని హెచ్చరించారు. కేంద్ర మంత్రిని కలుస్తాం.. పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తుతామని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉండి తెలంగాణ హక్కులను కాపాడటంలో విఫమయ్యారని మండిపడ్డారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీష్రావు వెల్లడించారు.
టిజిఎంఎస్ఐడిసిలో కొనుగోల్మాల్
మన తెలంగాణ/హైదరాబాద్: టిజిఎంఎస్ఐడిసి సంస్థ (తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) మూడేళ్లుగా మెడికల్ కాలేజీలకు సరఫరా చేస్తున్న కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రొజెక్టర్లు, జీరాక్స్ మిషన్ల కొనుగోళ్లలో భారీ గా గోల్మాల్ జరిగినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ సరఫరా చేసిన ఈ వ స్తువుల్లో చాలావరకు నాసిరకం ఉన్నాయని దీంతో అవి మరమ్మతులకు గురవుతున్నాయని 25 మెడికల్ కాలేజీల సిబ్బంది వాపోతున్నారు. ముఖ్యం గా ఈ వస్తువుల కొనుగోళ్లను టిఎస్టిఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్) ద్వారా జరపాల్సి ఉన్నా ఆ నిబంధనలను పక్కన పెట్టి టిజిఎంఎస్ఐడిసి సంస్థ డైరెక్ట్గా వాటిని కొనుగోలు చేసి కోట్ల రూపాయలను కొందరు అధికారులు కొల్లగొట్టినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. టిజిఎంఎస్ఐడిసి సంస్థలో పనిచేసే ఒక ఈడీ అధికారి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిజిఎంఎస్ఐడిసి సంస్థ అ ధికారులు మూడు సంవత్సరాలుగా నిబంధనలను ఉల్లంఘిస్తూ టిఎస్టిఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్) నుంచి కాకుండా టిజిఎంఎస్ఐడిసి డైరెక్ట్గా 500 కంప్యూటర్లు, 400ల ప్రింటర్ల ను, 50 ప్రొజెక్టర్లను, 50 జీరాక్స్ మిషన్లను పాత టెండర్ల ప్రకారమే అర్హత లేని కంపెనీలకు బాధ్యతలు అప్పగించి కొనుగోళ్ల దందాకు తెరలేపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వస్తువుల్లో నాణ్యత కొరవడడంతో మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గతంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ ప్రస్తుతం టిజిఎంఎస్ఐడిసి సంస్థలో పనిచేసే ఓ ఈడీ స్థాయి అధికారి ఈ కొనుగోళ్లలో నిబంధనలు పాటించ లేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు అంద డం విశేషం. దీంతోపాటు మెడికల్ కాలేజీల యా జమాన్యాలకు టిజిఎంఎస్ఐడిసి సంస్థ సరఫరా చేసిన నాసిరకం ఫర్నీచర్ కొనుగోళ్లతో పాటు 11 ఎంఆర్ఐ మిషన్ల టెండర్ల కేటాయింపులోనూ ఇప్పటికే అనేక అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందగా దానిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్రస్తుతం కంప్యూటర్లు, ప్రిం టర్లు, ప్రొజెక్టర్లు, జీరాక్స్ మిషన్ల కొనుగోళ్ల లో భారీగా అవినీతి ఆరోపణలు రావడం విశేషం. నోడల్ ఆఫీసర్గా నియమించండి! దీంతోపాటు వైద్య ఆరోగ్య శాఖకు వరల్డ్ బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల నిధులు రానున్నాయని దీనికి నోడల్ ఆఫీసర్గా తనను నియమించాలని ఈ ఈడీ స్థాయి అధికారి ప్రస్తుతం ఫైరవీ చేస్తున్నట్టుగా తెలిసింది. వచ్చేనెల (మార్చిలో) వైద్య ఆరో గ్య శాఖకు రూ.1,000 కోట్లు నిధులు రానుండడంతో ఆయన నోడల్ ఆఫీసర్గా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రికి పర్నీచర్ కొనుగోళ్ల టెండర్లకు సంబంధించి ఈ అధికారి భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు సెంట్రల్ స్పాన్సర్ స్కీంలకు సంబంధించి 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులపై ఈ సంస్థ అధికారులు కన్నేశారని, మార్చి 31వ తేదీ నాటికి ఈ నిధులను వినియోగించుకోకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయని ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించి టెండర్లు లేకుండానే పాత వారికే ఈ కాంట్రాక్టు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ స్పాన్షర్ స్కీంలో సుమారుగా రూ.30 కోట్ల కమీషన్లు చేతులు మారినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం. దీవతోపాటు ఈడీ స్థాయి అధికారి మహిళా ఉద్యోగినుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో కొందరు మహిళా ఉద్యోగులు ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈడీపై ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. కమీషన్లు ఇస్తేనే చెక్కులు రెడీ టిజిఎంఎస్ఐడిసి సంస్థలో ఫైనాన్స్ అధికారి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే సమయంలో 1.5 శాతం కమీషన్గా తీసుకొని ఉన్నతాధికారులకు పంపకాలు జరుపుతున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కమీషన్లు ఇవ్వకపోతే ఫైనాన్స్ అధికారి బిల్లులను ఆపివేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కమీషన్లు ఇస్తేనే చెక్కులు రెడీ అవుతున్నాయని అప్పటివరకు బిల్లులను ఆపివేస్తున్నారన్న కాంట్రాక్టర్లు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం. కాంట్రాక్టర్ల నుంచి ఉన్నతాధికారులకు 1.5 శాతం కమీషన్లు కచ్చితంగా చెల్లించాల్సిందేనని, కమీషన్లు చెల్లించకపోతే బిల్లులు ఆగిపోతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
మన తెలంగాణ/సిటీ బ్యూరో: అక్రమణలపై హైడ్రా సీరియస్గా స్పందిస్తుంది. పార్కులు, చె రువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా హై డ్రా వ్యవహరిస్తోంది. మంగళవారం.. ఒకేరోజు నగరం నలువైపులా నాలుగుచోట్ల భారీ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణలను తొలగించింది. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది. రెండుచోట్ల 1,100ల చ.గ.ల మేర ఉన్న పార్కులను కాపాడగా.. మరో రెండు ప్రాంతాల్లో 12 ఎకరాల మేర చెరువుల ఎన్టీఎల్ ప్రాంతాలను హైడ్రా ర క్షించింది. ఇలా కాపాడిన భూమి విలువ సు మారుగా రూ.1,511ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కొండాపూర్లో చెరువును కాపాడిన హైడ్రా. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగళవారం కాపాడింది. 4 ఎకరాల జంగంకుంటను పూడ్చేసి.. మట్టితో చదును చేసి ప్లాట్లు గా విక్రయించేందుకు సిద్ధమైన కబ్జాదారుల ఆ ట కట్టించింది హైడ్రా. ఇటీవల మీడియాలో వ చ్చిన కథనాల మేరకు రెవెన్యూ అధికారులతో హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసింది. జంగంకుంటగా హైడ్రా నిర్ధారించుకుంది. కబ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఫెన్సింగ్ వేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువు వద్ద 8 ఎకరాల మే ర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎన్టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్కడ పని వారికోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్యర్థాలన్నీ చెరువులోకి వదులుతున్నారని పే ర్కొన్నారు. చెరువు ఎన్టీఎల్ పరిధిలోని టెంటు సామగ్రికి చెందిన 4 షట్టర్లు కూడా వేసినట్టు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని తొలగించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహెబ్నగర్ కలాన్లోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఈ మేరకు మంగళవారం అక్రమణలు తొలగించి.. పార్కు చు ట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది. మల్కాజిగిరి జోన్, మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయనగర్లో రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును హైడ్రా కాపాడింది.
ప్రేమ కథ, మంచి భావోద్వేగాలున్న సినిమా..
‘జాతిరత్నాలు’తో హాస్య చిత్రాలలో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కె.వి. అనుదీప్, ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ’ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు కె.వి. అనుదీప్ మీడియాతో మాట్లాడుతూ “విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ‘జాతిరత్నాలు’తో పోలిస్తే ’ఫంకీ’ చిత్రం పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించడం జరిగింది. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. ‘ఫంకీ’లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇందులో హాస్యంతో పాటు అందమైన ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయి. ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశాము. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ సినిమా చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇక మూడు నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయాల్సి ఉంది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాస్తున్నాను. అలాగే వెంకటేష్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను” అని అన్నారు.
బుధవారం రాశి ఫలాలు (11-02-2026)
మేషం నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృషభం ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది. మిథునం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సింహం: చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. కన్య: వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. తుల: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చికం: ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మకరం: వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది. కుంభం: అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. మీనం:- ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
టిజి టెట్ 2026 (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితా లు విడుదలయ్యాయి. టెట్కు మొత్తం 1,95,181మంది అభ్యర్థులు హాజరు కా గా, 1,00,270 మంది(51.37%) ఉత్తీర్ణత సాధించారు. పేపర్1కు 71,198 మంది హాజరుకాగా, 51,266 మంది (72%) ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 2కు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు 69,861 మంది హాజరుకాగా, 29,598మంది (42.37%) ఉత్తీర్ణత సాధించగా, సోషల్ స్టడీస్ సబ్జెక్టు లో 54,122 హాజరుకాగా, 19,406 మం ది (35.86%) ఉత్తీర్ణత సాధించారు. ఈసా రి టెట్కు 65,605మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరవగా, 37,893మంది (57.76%) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను https: //schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
కెసిఆర్ను అరెస్టు చేస్తామంటే... ఎవరూ అడ్డుపడకుండా చూస్తా
“బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ను అరెస్టు చేస్తామంటే, ఎవరూ అడ్డుపడకుండా చూసే బాధ్యత నాదే..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమి చేశారో సవివరంగా చర్చించేందుకు ఎప్పుడైనా, ఎక్కడైనా ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. సచివాలయంలో లేదా ప్రెస్ క్లబ్లో లేదా మరెక్కడైనా చర్చకు ‘సై’ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని తాను గానీ కేంద్రం గానీ ఎప్పుడూ చెప్పలేదన్నారు.కెసిఆర్కు తాను దత్తపుత్రుణ్ని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఎవరికీ దత్తపుత్రుణ్ని కాదని, కెసిఆర్తో మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు తేల్చుకోవాలి తప్ప మధ్యలో నన్ను లాగవద్దని అన్నారు. తమ పార్టీ భుజాలపై తుపాకి పెట్టి కాల్చాలనుకుంటే ఎవరూ హర్షించరని ఆయన తెలిపారు. కెసిఆర్ను జైలులో పెడతామని, చిప్ప కూడు తినిపిస్తామని మీరు చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారని అన్నారు. కెసిఆర్ను అరెస్టు చేస్తామనంటే ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తనది అని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బిఆర్ఎస్కుగానీ, కెసిఆర్ కుటుంబానికి గానీ వ్యతిరేకంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. రేవంత్రెడ్డి లాగా తాము సిఎం పదవి ఆశ జుపితే పార్టీ ఫిరాయించే వాళ్ళం కాదని అన్నారు. త్రిముఖ కాదు ద్విముఖ పోటీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బి, జెపి-బి, బిఆర్ఎస్ మధ్యే త్రిముఖ పోటీ ఉందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నందున అడ్డుకోవాలనే ఉద్దేశంతో త్రిముఖ పోటీ ఉందని అన్నారని ఆయన చెప్పారు. గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లలో బిజెపి గెలుపొందిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉత్తర తెలంగాణలో తమ పార్టీని గెలిపించారని అన్నారు. నా పేరు ఎలా మారుస్తారు.. ? రేవంత్ ఖాన్ అని ముఖ్యమంత్రి గర్వంగా చెప్పుకోవడం పట్ల తనకేమి అభ్యంతరం లేదు కానీ తన తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మజ్లిస్తో కాపురం చేసినన్ని రోజులు తాము ఆ కాపురంలో నిప్పులు పోస్తామని, రజాకార్లతో కలిసి తిరిగినన్ని రోజులు తాము ఇబ్బందులు పెడుతూనే ఉంటామని, మజ్లిస్తో లోపాయికారీ ఒప్పం దం చేసుకుని, పరస్పర సహకారం అందించుకుంటున్నారని ఆ యన విమర్శించారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు తమ పార్టీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప మృతి చెందడం బాధాకరమని అ న్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఈ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. 15 రోజులుగా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు దేవప్ప భార్య స్పష్టంగా ఫిర్యాదు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఏలను తొలిసారిగా వాయిదాల రూపంలో ఇవ్వడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఇటీవల తిరుమలను
. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు విశాలాంధ్ర – హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు […] The post నేడే మున్సిపోల్స్ appeared first on Visalaandhra .
. కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం మాదే. డబ్బుతో చేసే రాజకీయం శాశ్వతం కాదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కాదని, తాత్కాలిక ప్రయోజనాలు కనిపిస్తాయే తప్ప ప్రజల్లో నిజమైన విశ్వాసాన్ని పొందలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొందరు డబ్బు బలం, అహంకారంతో రాజకీయాలను కలుషితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ […] The post సీపీఐ వైపే ప్రజల మొగ్గు appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందిన కంటెంట్ కొత్త సవాళ్లు విసురుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్ కంటెంట్కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశించింది. ఏఐ కంటెంట్ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి అప్లయ్ చేశాక లేబుల్ను గానీ, మెటా డేటాను గానీ తొలగించడానికి లేదా కనబడకుండా చేయడానికి వీల్లేకుండా ఉండాలని స్పష్టంచేసింది. చట్టవిరుద్ధమైన, అసభ్య, మోసపూరిత ఏఐ కంటెంట్ను […] The post ఏఐ కంటెంట్పైకేంద్రం ఆదేశాలు appeared first on Visalaandhra .
బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి
బారాబంకి: అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్ప్పుకొచ్చారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారం జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం, శ్రీ రామార్చా పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ కొందరు అవకాశవాదులు ఉంటారని, వారికి కష్టాలు వచ్చినప్ప్పుడే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమయాల్లో తలవను కూడా తలవరని అన్నారు. అందువల్లే రాముడు కూడా వాళ్లను మరిచిపోతాడని చెప్పారు. ‘రాముని భక్తులపై […] The post బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి appeared first on Visalaandhra .
గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దీంతో శాసనసభ నిండుగా కనపడనుంది. కాగా గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన […] The post నేటి నుంచి అసెంబ్లీ appeared first on Visalaandhra .
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
. పోలవరం రెండో దశకు రూ.32వేల కోట్లు అవసరం. ఉత్తర-దక్షిణ భారత్లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి. ఏపీలో మఖానా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి. పూర్వోదయ సహా ప్రాయోజిత పథకాలకు నిధులివ్వండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతి. అమిత్షా సహా 7గురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు […] The post ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత appeared first on Visalaandhra .
విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా
. మొదటి దశలో 46.22 కి.మీ – 43 స్టేషన్లు. రూ.11వేల కోట్ల వ్యయం న్యూదిల్లీ: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలి పింది. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు… కేంద్రమంత్రి మనోహ ర్లాల్తో భేటీ అయిన సందర్భంగా మనోహర్లాల్ స్వయంగా ఈ విషయాన్ని సీఎంకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, విజయవాడ మెట్రోకు ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో విశాఖ మెట్రోకు పచ్చజెండా ఊపినట్లు సీఎంకు కేంద్రమంత్రి తెలిపారు. వేగంగా […] The post విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా appeared first on Visalaandhra .
‘కపుల్ ఫ్రెండ్లీ’.. ప్యూర్ లవ్ స్టోరీ
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “కపుల్ ఫ్రెండ్లీ... ఒక ప్యూర్ లవ్ స్టోరీ. చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. ఈ మూవీలో హీరో, హీరోయిన్స్ కు ఒక మంచి ఫ్యామిలీ నేపథ్యం, కుటుంబ సభ్యులు ఉంటారు. వారి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాను ఇబ్బందిపడకుండా చూడొచ్చు”అని అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “మిత్ర, శివ జర్నీ ఈ సినిమా. మిత్ర తనకు పరిచయమయ్యాక శివ లైఫ్ ఎలా మారింది, మిత్ర కోసం శివ ఎంతవరకు వెళ్లాడు అనేది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మానస వారణాసి పాల్గొన్నారు.
మాజీ సైన్యాధిపతి అబద్ధం చెప్పరు: రాహుల్ గాంధీ న్యూదిల్లీ: సైనిక దళాల మాజీ ప్రధానాధికారి ఎంఎం నరవణె రచించిన పుస్తకం ‘ఇప్ప్పుడు అందుబాటులో ఉంది’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ జ్ఞాపకాల ప్రచురణ ఇంకా జరగలేదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చేసిన వాదనను తిప్పికొట్టడానికిగాను నరవణె డిసెంబరు 2023 సోషల్ మీడియా పోస్ట్ను మంగళవారం ఆయన ఉదహరించారు. పార్లమెంటు భవన సముదాయంలో రాహుల్గాంధీ విలేకరులతో మాట్లాడుతూ ప్రచురణకర్త కంటే ఆర్మీ […] The post అందుబాటులో నరవణె పుస్తకం appeared first on Visalaandhra .
రూ.3.25 లక్షల కోట్ల వ్యయంఫ్రాన్స్తో రక్షణ ఒప్పందానికి భారత్ సిద్ధం న్యూదిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్పై జరిపిన దాడుల్లో కీలకంగా మారిన రఫేల్ యుద్ధ విమానాలను భారీస్థాయిలో కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఇందుకోసం ఫ్రాన్స్తో అతిపెద్ద రక్షణ ఒప్పందం కుదుర్చుకో నుంది. 3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రఫేల్ యుద్ధ విమానాలు సమకూర్చుకోనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానుండటంతో ఈ వారమే ఈ ఒప్పందానికి […] The post భారీస్థాయిలో ‘రఫేల’ appeared first on Visalaandhra .
శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం..
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తు న్నారు. సోమవారం ఒక్క రోజే దాదాపు లక్ష మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. వీరిలో దాదాపు 50,000 మంది దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం కూడా ఇదే తరహాలో భక్తులు తరలివచ్చారు. ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 50,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అను మతిస్తున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ భారీగా ఉంది. ఆలయంలో శివ భక్తుల క్యూలు భారీగా ఉన్నాయి. ప్రతి రోజూ దాదాపు లక్ష మంది భక్తులు వస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వసతి సౌకర్యాలు సరిపోకపోవడంతో చాలామంది యాత్రి కులు బహిరంగ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవలసి వస్తోంది. ఫిబ్రవరి 16 వరకు భారీ రద్దీ కొనసాగు తుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. జనసమూహాన్ని నియంత్రించడంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం భక్తులు అదుపు చేయలేక పోవడంతో లాఠీఛార్జ్ జరిగిందని వార్తలొచ్చాయి. అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. భక్తులకు సజావుగా దర్శనం కల్పించడానికి అదనపు పోలీసు బలగాలను మోహరించారు. శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బ్రహ్మో త్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యా లపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డిజిపిలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ చేశారు. అధికారులు, జిల్లా యంత్రాంగం తీసు కున్న చర్యలను, సౌకర్యాలను సమీక్షించారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగ కుండా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని చెప్పారు. దీక్ష లు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని సీఎం ఆదేశించారు. రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకో వాలని పేర్కొన్నారు. అన్ని విభాగా లు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని సిఎస్ విజయానంద్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మార్కెట్లోకి ఒప్పొ కె14ఎక్స్ 5జి
ఒప్పొ ఇండియా కొత్త స్మార్ట్ఫోన్ ఒప్పొ కె14ఎక్స్ 5జిను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో 6500ఎంఎహెచ్ బ్యాటరీ, 45డబ్లు ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెట్జ్ డిస్ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50ఎంపి కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి ఫ్లిప్కార్ట్, ఒప్పొ స్టోర్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ప్రారంభ ధర రూ.13,499గా నిర్ణయించారు.
కాంగ్రెస్ ఎంపిల ప్రవర్తనపై వీడియో బయటపెట్టిన మంత్రి కిరెణ్ రిజిజు
లోక్సభలో ఏదో జరగరాని సంఘటన జరగబోతోందని తనకు విశ్వసనీయ సమాచారం ఉన్నందునే సభకు హాజరుకావద్దని స్వయంగా ప్రధాని మోడీకి తాను తెలియజేసినట్లు ఈ నెల 4న లోక్సభలో జరిగిన పరిణామాలపై స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రకటన ఇటీవల చర్చనీయాశమైంది. దానికి మద్దతుగా ఆ రోజు సభలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారల మంత్రి కిరెణ్ రిజిజు బయటపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు బ్యానర్ చేతిలో పట్టుకుని తొలుత వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. కాసేపటికే ప్రధానమంత్రి సీటును చుట్టుముట్టి బ్యానర్ ప్రదర్శిస్తూ నినాదాలు అందుకున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రెజరీ బెంచ్ సభ్యులు, కేంద్రమంత్రులు గిరిరాజ్, అశ్విని వైష్ణవ్ వారిని వారిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తదుపరి కార్యాచరణపై వారు చర్చించుకుంటున్న తీరు కూడా అందులో ఉంది. ఆ రోజు పార్లమెంట్ గౌరవ మర్యాదలను కాపాడేందుకు తమ సభ్యులు సహనం వహించారని రిజిజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపిల ప్రవర్తనను చూసి ఆ పార్టీ నాయకత్వం గర్వపడడం సిగ్గుచేటన్నారు.
17న భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 17 నుంచి 19వరకు ఆయన ఇక్కడ పర్యటించనున్నారని విదేశాంగ శాఖ మంగళవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారని తెలిపింది. ప్రాంతీయ అంశాలతో ప్రపంచంలోని తాజా పరిస్థితులపై మోడీ, మేక్రాన్ చర్చలు జరుపుతారని పేర్కొంది. అదే విధంగా ఢిల్లీలో జరనున్న ‘కృత్రిమ మేధప్రభావం’ సదస్సులో ఇరువుకు కలిసి పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ముంబయిలో జరగనున్న ‘ఇండియాఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమాన్ని కూడా ఉమ్మడిగా ప్రారంభించనున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది.
Students |పేద విద్యార్థుల చదువుకు బాబు, లోకేష్ భరోసా..
Students |పేద విద్యార్థుల చదువుకు బాబు, లోకేష్ భరోసా.. రూ.1200 కోట్ల ఫీజు
పిచ్చికుక్క కాటుకుతో చికిత్స పొందుతూ ఐదేళ్ల చిన్నారి మృతి
అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి పిచ్చి కుక్క కాటుకు బలైన సంఘటన షాబాద్ మండలం చర్లగూడ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చర్లగూడ గ్రామానికి చెందిన సిద్దూలూరు కుమార్ దంపతులకు బాబు, కూతురు ఉన్నారు. కూతురు నక్షత్ర (5) గత పది రోజుల క్రితం ఇంటిముందు ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న ఒక పిచ్చికుక్క చిన్నారిని కాటు వేసింది. చేతికి ముఖానికి గాయాలయ్యాయి. అది గమనించిన కుమార్ దంపతులు చిన్నారిని హుటాహుటినా ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా రేబీస్ వ్యాధి ముదిరిందని చికిత్స చేయాలనే డాక్టర్లు తెలుపగా పది రోజులుగా అక్కడే ఉండి చికిత్స చేస్తున్నారు. సోమవారం రోజు రాత్రి పరిస్ధితి విషమించి చిన్నారి మృతి చెందింది. దీంతో ఆ పేద కుటుంబంలో విషాదం మిగిలింది.
తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం జరిగిన హుండీ ఆదాయం లెక్కింపులో భాగంగా నగదుతో పాటు 136 గ్రాముల బంగారం, మూడు కిలోల ఆరు వందల గ్రాముల వెండిని హుండీలో భక్తులు సమర్పించుకున్నట్లు ఈవో తెలిపారు. అమెరికా 1,605 డాలర్లు, సింగపూర్ 71 డాలర్లు, కెనడా 25 డాలర్లు, యూరప్ 40 యూరోలు, చైనా 110 యువన్, 39 రియల్, 100 ఒమన్, 2 కువైట్, 1000 జపాన్, 140 థాయిలాండ్, 165 ఇంగ్లాండ్ పౌండ్స్, 225 ఆస్ట్రేలియా, 550 మయన్మార్, 2600 శ్రీలంక, 2000 యుగాండా, 5000 ఇండోనేషియా, 110 సౌతాఫ్రికా, 20 నేపాల్, 15 భూటాన్, 20 పోలాండ్ను హుండీలో సమర్పించుకున్నట్లు తెలిపారు. నిత్యరాబడి.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి మంగళవారం వివిధ శాఖల నుంచి భారీగా ఆదాయం వచ్చింది. నిత్యరాబడిలో భాగంగా స్వామి, అమ్మవార్లకు రూ.15,55,606 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,03,556, బ్రేక్ దర్శనం ద్వారా రూ.90,000, శ్రీసత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.27,000, రూ.150 వీఐపీ దర్శనం ద్వారా రూ.1,50,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.1,68,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.39,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.8,41,080, కల్యాణకట్ట ద్వారా రూ.28,500తోపాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం ద్వారా ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి సేవలో.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తమిళనాడు ఆళ్వార్ తిరునగరి పీఠం శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా ఈవో స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాన్ని అందజేశారు.
4న లోక్సభలో ఏం జరిగింది?.. వీడియో బయటపెట్టిన రిజిజు
న్యూఢిల్లీ: లోక్సభలో ఏదో జరగరాని సంఘటన జరగబోతోందని తనకు విశ్వసనీయ సమాచారం ఉన్నందునే సభకు హాజరుకావద్దని స్వయంగా ప్రధాని మోడీకి తాను తెలియజేసినట్లు ఈ నెల 4న లోక్సభలో జరిగిన పరిణామాలపై స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రకటన ఇటీవల చర్చనీయాశమైంది. దానికి మద్దతుగా ఆ రోజు సభలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారల మంత్రి కిరెణ్ రిజిజు బయటపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు బ్యానర్ చేతిలో పట్టుకుని తొలుత వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. కాసేపటికే ప్రధానమంత్రి సీటును చుట్టుముట్టి బ్యానర్ ప్రదర్శిస్తూ నినాదాలు అందుకున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రెజరీ బెంచ్ సభ్యులు, కేంద్రమంత్రులు గిరిరాజ్, అశ్విని వైష్ణవ్ వారిని వారిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తదుపరి కార్యాచరణపై వారు చర్చించుకుంటున్న తీరు కూడా అందులో ఉంది. ఆ రోజు పార్లమెంట్ గౌరవ మర్యాదలను కాపాడేందుకు తమ సభ్యులు సహనం వహించారని రిజిజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపిల ప్రవర్తనను చూసి ఆ పార్టీ నాయకత్వం గర్వపడడం సిగ్గుచేటన్నారు.
బిఆర్ఎస్ ఇప్పటికీ మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తుంది: మంత్రి పొంగులేటి
ఒక ప్రక్క ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతున్నప్పటికి బి ఆర్ ఎస్ పార్టీ నేతలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, వాళ్ళ వద్ద ఇంకా ట్యాపింగ్ పరికరాలు ఉన్నట్లు అనుమానం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉందని దీనిపై పూర్తి స్దాయిలో విచారణ చేస్తామన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ (పరికరాలు) అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని, తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. అసలు తాను ఉద్యోగులతో చేసిన సంభాషణకు సంబంధించిన ‘వాయిస్ కాల్ రికార్డ్’ బీఆర్ఎస్ నాయకులకు ఎలా లభ్యమైందని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తనకు అనుమానం కలుగుతోందన్నారు. ఏ మామిడితోటల్లో, మరే ఫాం హౌజ్ లలో, ఎవరి ఇళ్లలో ఉండి ఇంకా ఎంత మంది దొంగతనంగా మాటలు వింటున్నారో, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయం తేలాల్సిన అవసరముందన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి స్పష్టం చేశారు. తానో మంత్రినని, మంత్రిగా తనకున్న అవకాశాన్ని బట్టి అధికారులతో ,ఉద్యోగులతో అనేక సమీక్షలు జరుపుతుంటానని ఇందులో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. నా పార్టీకోసం ఓట్లు అడగడం తప్పా? అని కూడా ఆయన అన్నారు. ఉద్యోగులు కూడా ఓటర్లేనని, సామాన్యుడు వినియోగించుకున్న తరహాలోనే ఉద్యోగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారని, వారిని తాను ఓట్లు అడగడంలో తప్పేమిటని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికి కూడా అదే ఓటు ఉంటుందని, ఓటర్లుగా ఉన్నటువంటి ఉద్యోగులను తన పార్టీ కోసం అభ్యర్థించడంలో ‘వాట్ ఈజ్ రాంగ్?’ అని పొంగులేటి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ డబుల్ బెడ్ రూం ఇళ్ళ గురించి పార్టీ కండువ కప్పుకున్న వారికే సంక్షేమ పథకాలు ఇవ్వాలని, డ్రాలు, లిస్టులు లేవని అంటూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన వాయిస్ రికార్డును విలేఖర్లకు విన్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు కాంగ్రెస్వే రాష్ట్రంలో బుధవారం జరగనున్న116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం పైగా సీట్లను కైవసం చేసుకోబోతుందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజలకు చేరువయ్యాం. అందుకే ఈ పుర ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విసిరిన రెఫరెండమ్ సవాళ్లను ప్రజలు తిప్పికొట్టారు.. అదే ఫలితం రేపు పునరావృతం కాబోతుందని అన్నారు. మొన్నటి వరకు రెఫరెండమ్, సెమీఫైనల్ అంటూ ప్రగల్భాలు పలికిన నాయకులు ఇప్పడు ఎందుకు సైలెంట్ అయ్యారని ఆయన ప్రశ్నించారు. మున్సిపాల్టీలో అధికార కాంగ్రెస్ పార్టీకి వస్తున్న స్పందనను చూసి, రిఫరెండమనే నాయకులు ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించ లేదన్నారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు సిపిఐతో ప్రెండ్లి కాంటేస్ట్తోనే ఉన్నామని సిపిఐ కాంగ్రెస్తోనే ఉంటుందన్నారు. తాను సిఎం రేసులో లేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓట్ల కోసం దౌర్జన్యాలకు, దందాలకు , అక్రమాలకు పాల్పడితే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని తాను ఎవ్వరిని బెదిరించలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. నెలకు రూ. 6,300 కోట్లు కేవలం అప్పులకే కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదు. గత దొరల పాలనలో పేదలను విస్మరించారు. 62 వేల డబుల్ బెడ్ రూంలను మొండిగోడలుగా మిగిల్చారు. కానీ మేం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. వరి వేస్తే ఉరి అన్న కాలం పోయి, ఇప్పుడు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం అని వివరించారు. ఆరు గ్యారెంటీలో కొన్ని బాకీ ఉన్న విషయం వాస్తవమేని వాటిని కూడా దశలవారీగా అమలు చేస్తామని ప్రజలకు నచ్చజెప్పుతున్నామని తమ మాటలను ప్రజలు విశ్వసిస్తున్నారు అనేదానికి గ్రామ పంచాయతీ ఎన్నికలో వచ్చిన తీర్పే నిదర్శనమన్నారు. ఇందిరమ్మఇళ్ళ పథకంలో అర్బన్ ప్రాంతాల్లో సొంత జాగా లేని వారికి రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేసి ప్రణాళికను రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. జి+3 విధానంలో మూడంతస్ధుల అపార్టెమెంట్ను నిర్మించి సొంత ఇంటి స్ధలం లేని వారికి నిర్మించి అందజేస్తామన్నారు. గత బి ఆర్ ఎస్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 63 వేల డబుల్ బెడ్ రూం గదులను పూర్తి చేసి వాటిని పట్టణాల్లోని అత్యంత పేదలను గుర్తించి వారికి కేటాయిస్తామని ఇప్పటికే 31వేల ఇళ్ళను పూర్తి చేసి సొంత ఇంటి స్ధలం లేని వారికి అందజేశాం, ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే వాటిని కూడా పేదలకు పంపిణి చేస్తామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రజలంతా గడిచిన రెండేళ్ళుగా చెప్పటిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించాలని ఆయన కోరారు.
గోషామహల్లో భారీ ఎత్తున పట్టుబడ్డ నగదు
రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చే సి, వారి నుంచి రూ.76, 87, 650 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల క థనం ప్రకారం...గోషామహల్ గ్యాన్బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో మంగళవారం ఉదయం ముగ్గురు అనుమాని త వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తచ్చాడుతుండటం గమనించిన గోషామహల్ పోలీసులు వారి ద్విచక్ర వాహనాలను ని లిచి, తనిఖీ చేయగా, వారి వద్ద గల మూడు సంచీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో పాటు సగం చించివేసిన రూ.10 నోటుతో పాటు మ రో రూ.20 నోటు లభించాయి. పట్టుబడిన ముగ్గురు అనుమానితులను పోలీసులు నగదు గురించి ఆరా తీయగా, ముగ్గురూ వ్యక్తులు భయంతో తడ బడటంలో అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద లభించిన రూ.76, 87, 650 స్వాధీనం చేసుకుని, పోలీస్స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో అనుమానిత ముగ్గురు వ్యక్తులు రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన గజరామ్ అధికారి జో టార్మ్, బెహ్రామ్ అధికారి గణపతి రామ్, రాకేష్ దేవాసి అధికారి మసు రారామ్ అధికారి మహేందర్లుగా తేలింది. వీరంతా బతుకు తెరువు కోసం న గరానికి వచ్చి ఉస్మాన్గంజ్, చాక్నావాడీ, గ్యాన్బాగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో వేర్వేరుగా గదులు అద్దెకు తీసుకుని, నివసిస్తున్నారని గోషామ హల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పకపోగా, పొంతన లేకుండా సమాధానాలు చెబుతున్నారని, వా రి వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేక పోవడంతో నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ కోసం ఇన్కమ్ టాక్స్ అధికారుల కు అప్పగించనున్నట్లు తెలిపారు. భారీ మొత్తంలో పట్టుబడిన నగదును ప్రస్తుతానికి హవాలా డబ్బుగానే భావిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ మేర కు కేసు నమోదు చేసి, ఈ డబ్బును ఎవరికి ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి పంపిస్తున్నారు? ఇక్కడ హవాలా రాకెట్ నడుపుతున్న వారు ఎవ రు? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బి శ్రవణ్కుమార్ పేర్కొన్నారు.
డికెకు మద్దతుగా 90మంది ఎంఎల్ఎల లేఖ!
శివకుమార్కు సిఎంగా ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి వినతి ఎంఎల్ఎ ఇక్బాల్ వ్యాఖ్యలతో చర్చనీయాంశమైన కర్నాటక పరిణామాలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: సిద్ధరామయ్య హైకమాండ్కు అన్నీ తెలుసు: డికె శివకుమార్ బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో డిప్యూటీ సిఎం శివకుమార్ను నియమించాలని కోరుతూ 80 మంది ఎంఎల్ఎలు హైకమాండ్కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎంఎల్ఎ, డికె మద్దతుదారుడు ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఆయన తాజా ప్రకటనలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ‘అవును. నిజమే 80 నుంచి 90 మంది శాసనసభ్యులం డికెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాశాం. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పలుమార్లు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా మేం క్రమశిక్షణగా మెలగాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటించాల్సి ఉంటుంది’ అని ఇక్బాల్ మీడియాతో వ్యాఖ్యానించారు. కర్నాటకలో నాయకత్వ అంశంపై సిఎం సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, వారు ఏ నిర్ణయం వెలువరిస్తే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తాను ఢిల్లీకి వెళ్లబోనని, ఒకవేళ హైకమాండ్ను పిలుపు వస్తేనే వెళ్తానని అన్నారు. ఇక దీనిపై అనవసరమైన ప్రశ్నలు అక్కర్లేదని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య అన్నారు. తాను పదేపదే ఢిల్లీకి ఎందుకు వెళ్లాలని, తనకు ఇక్కడ బడ్జెట్ సిద్ధం చేసుకునే పనులతో పాటు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు డికె శివకుమార్ మాట్లాడుతూ... తమ మధ్య ఏం చర్చ జరిగిందనేది మొత్తం పార్టీ పెద్దలకు తెలుసని, అంతా వారిముందే జరిగిందని అన్నారు. అధిష్టానం ముందే సిద్ధరామయ్య మాట్లాడారని, అందులో గందరగోళానికి తావెక్కడిదని ప్రశ్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.
6Benefits |అరటి పండు తింటే దూరమయ్యే నీరసం, గుండెకు అద్భుత రక్షణ
6Benefits | అరటి పండు తింటే దూరమయ్యే నీరసం, గుండెకు అద్భుత రక్షణ
praja dharbar |రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్..
praja dharbar | రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్.. praja dharbar
రైజ్తో మహిళలకు ఆర్థిక సాధికారత
కలెక్టర్ జి. లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ (రైజ్) కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు విశేషంగా తోడ్పాటు లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు రైజ్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న […] The post రైజ్తో మహిళలకు ఆర్థిక సాధికారత appeared first on Visalaandhra .
The post ఆర్థిక అక్షరాస్యత కీలకం appeared first on Visalaandhra .
విషం తాగి ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఖప్పర్పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంటిలో విషం తాగి మృతి చెంది ఉండడాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. పాలలో విషం కలిపి తాగినట్టు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబం అంతా ఒకే గదిలో ఉండేది. ఉదయం పిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారు వారిని చూడడానికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. ఎటువంటి స్పందన లేకపోవడంతో గది తలుపు పగుల గొట్టి చూశారు. గదిలో ఐదు మృతదేహాలు కనిపించాయని పోలీసులు చెప్పారు. కుటుంబ పెద్ద మనీష్ కుమార్ అనే రైతు (35), అతని భార్య (32), వారి ఇద్దరు కుమార్తెలను,కుమారుడిని పోలీసులు గుర్తించారు. తాము ఆత్మహత్య చేసుకున్నామని గోడపై రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఒక కాగితంపై మరో సూసైడ్ నోట్ దొరికింది. మృతుడి మొబైల్ ఫోన్ నుండి పోలీసులు ఒక వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో మృతుడు తాను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పినట్టు పోలీస్ అధికారి ష్లోక్ కుమార్ తెలియజేశారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్ పరిశీలించిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
Sp |ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు
Sp | ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు అన్ని కోణాల్లో దర్యాప్తువెల్లడించిన
Municipal Results May Set Stage for a Fresh Assembly By Election in Telangana
For all three major parties, Municipal elections have turned into a prestige battle. For Chief Minister Revanth Reddy, the results carry even greater weight. They are being seen as a direct measure of his government’s performance and political grip after coming to power.Strong indications suggest that Telangana may soon head towards another Assembly by-election. Sources […] The post Municipal Results May Set Stage for a Fresh Assembly By Election in Telangana appeared first on Telugu360 .
Collector |మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
Collector | మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం పోలింగ్ ప్రక్రియను
అర్జున్-సానియా పెళ్లి.. ప్రధాని మోడీకి ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియాను అర్జున్ వివాహం చేసుకోబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఈక్రమంలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి.. అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించారు. ప్రధాని మోడీతో దిగిన ఫోటోలను సచిన్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఖాతాల్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించడం మాకు గౌరవంగా ఉంది. యువ జంటకు మీ ఆశీర్వాదాలు, ఆలోచనాత్మక సలహాలకు ధన్యవాదాలు అని టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అర్జున్-సానియా చాందోక్ ల నిశ్చితార్థ వేడుక జరిగింది. అర్జున్, సానియా మార్చిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. ఆల్ రౌండర్ అయిన అర్జున్, దేశీయ సర్క్యూట్లో గోవా తరపున ఆడుతున్నాడు. అర్జున్ 22 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 23 లిస్ట్ A గేమ్లు, 29 T20 మ్యాచ్లు ఆడాడు. 2020/21 సీజన్లో ముంబై తరపున టీ20లో అరంగేట్రం చేశాడు. 2022/23 సీజన్లో గోవా తరుపున లిస్ట్ A, FC కెరీర్ను ప్రారంభించాడు. సానియా ఎవరు? సానియా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, గ్రావిస్ గ్రూప్ అధినేత రవి ఘాయ్ మనవరాలు. పెంపుడు జంతువుల సంరక్షణ సేవలపై దృష్టి సారించిన ముంబై వెంచర్ అయిన Mr Paws Pet Spa & Store LLPలో భాగస్వామి, డైరెక్టర్గా సానియా ఉంది.
Ranveer Singh receives threatening WhatsApp Voice Notes
Bollywood Superstar Ranveer Singh has been riding high with the super success of Dhurandhar. The actor today received a threatening Whatsapp Voice Note as per the reports coming from the Bollywood media. The voice note was sent demanding crores of money from the actor. Ranveer Singh has approached the Mumbai police soon after he received […] The post Ranveer Singh receives threatening WhatsApp Voice Notes appeared first on Telugu360 .
Ration |మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్
Ration | మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్ Ration |
Brs| 4వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం …
Brs| 4వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం … ఆదరించి గెలిపించండి అభివృద్ధి
రణ్వీర్ సింగ్కు బెదిరింపులు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్కు బెదిరింపులు వచ్చాయి. 'ధురంధర్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న రణ్వీర్ సింగ్కు ఓ దుండగుడి నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం వాట్సాప్ వాయిస్ నోట్ ద్వారా కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపు వచ్చింది. దీంతో రణ్వీర్ సింగ్ ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై పోలీసులు బృందం దర్యాప్తు చేస్తోంది. బెదిరింపు వాయిస్ నోట్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు, రణ్వీర్ సింగ్ ఇంటి వెలుపల భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అతని ఇంటి వెలుపల భద్రతను పెంచారు. ఇదిలావుంటే, జనవరి 31న బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత రోహిత్ శెట్టి జుహు ఇంటి వెలుపల ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ సమయంలో రోహిత్ అక్కడే ఉన్నాడు. అయితే, కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ముంబై పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పూణేలో 5 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Govt |బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి
Govt | బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి Govt | మోత్కూర్,
కరెంటు షాక్తో అత్తను చంపిన అల్లుడు
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట పంచాయతీ మంగళి తండా (బడి తండా)లో సోమవారం రాత్రి అత్యంత పాశవిక ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అల్లుడే కాల యముడిగా మారి, అత్తకు విద్యుత్ షాక్ పెట్టి హత మార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం లేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... భద్రాద్రి కొత్తగుడెం జిల్లా జులూరుపాడుకు చెందిన దారావత్ కౌసల్య (50) తన అల్లుడైన రాజేష్ పిలుపు మేరకు సీతంపేట మంగళి తండా (బడి తండా) వారి ఇంటిలోకి వచ్చారు. అయితే సోమవారం రాత్రి సమయంలో రాజేష్ ఆమెకు కరెంటు షాక్ ఇచ్చి అతి కిరాతకంగా చంపాడు. సొంత భార్య తల్లిదండ్రులు అని కూడ చూడకుండా వారిపై ఈ ఘాతుకానికి పాల్పాడ్డారు. ఇందులో అత్త మరణించగా మామ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆయనను ఆస్పత్రికి తరలించాలని గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఖైరతాబాద్ లో రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. తరుణ్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన తరుణ్ హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2017 లో హైదరాబాద్ కు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. వీరికి ఒ కూతురు ఉంది. కాగా గత సంవత్సరం కాలంగా తరుణ్ మతిస్థిమితం బాగాలేక చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళలవారం ఉదయం ఇంటి నుండి బయలకు వెళ్లాడు. మధ్యహ్నం సమయంలో ఖైరతాబాద్ రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై తలపెట్టి పడుకున్నా డు. ఆ సమయంలో నాంపల్లి వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తరుణ్ తల,మొండెం వేరయ్యాయి. లైన్ మేన్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న ఫోన్ రింగు అవ్వడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి మృతుని కుటుంబసభ్యుల సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Allu Arjun Initiates Legal Action
Icon Star Allu Arjun emerged as the Biggest Star of the country and he is busy with some of the biggest films and is working with top directors. A controversy erupted after brand manager Kaveri Baruah spoke against the actor on Sweekriti Talks podcast and the video went viral in no time. Kaveri Baruah said […] The post Allu Arjun Initiates Legal Action appeared first on Telugu360 .
Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి పాకల బీచ్
Training |ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం
Training | ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం Training |
mla |వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఎపీ లక్ష్యం…
mla |వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఎపీ లక్ష్యం… నరేంద్ర మోడీ నాయకత్వంలో
Clean |అడగకుండానే అన్నీ చేస్తున్న సర్పంచ్….
Clean | అడగకుండానే అన్నీ చేస్తున్న సర్పంచ్…. Clean | వేంసూరు, ఆంధ్రప్రభ
Ballot boxes |ఎన్నికలకు సర్వం సిద్ధం
Ballot boxes | ఎన్నికలకు సర్వం సిద్ధం Ballot boxes | స్టేషన్ఘన్పూర్,
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్
అతి వేగంతో అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ ఢీకొట్టిన సంఘటన వనస్థలిపురం ఆటో నగర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబులెన్స్ లో ఇద్దరు రోగులను ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Adulteration to Hawala Links: ED Enters Tirupati Laddu Case
The Tirupati laddu adulteration case has taken an unexpected turn with the Enforcement Directorate formally launching a money laundering investigation. On Tuesday, February 10, the ED registered an Enforcement Case Information Report under the Prevention of Money Laundering Act, widening the scope of the probe far beyond food safety violations. The central agency stepped in […] The post Adulteration to Hawala Links: ED Enters Tirupati Laddu Case appeared first on Telugu360 .
Railway |పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష
Railway | పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష Railway |
లంచం తీసుకుంటూఎసిబికి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ..
హైదరాబాద్: అవినీతి నిరోదక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. మంగళవారం నగరంలోని మాదాపూర్ ఎస్ఐ వినయ్కుమార్ 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చేందుకు ఎస్ఐ వినయ్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎసిబి అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేపట్టిన ఎసిబి అధికారులు.. వినయ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వినయ్ ని ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లో పులి అవయవాలు స్వాధీనం #WildlifeCrime #Hyderabad #DRI #TelanganaForest
mla |ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ..
mla |ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ.. mla | భవానిపురం, ఆంధ్రప్రభ:
students |మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ
students | మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ students | జైనూర్, ఆంధ్రప్రభ
Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..
Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం.. ఈనెల 16 వరకు
Ballot boxes |నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
Ballot boxes | నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి Ballot boxes |
నేను రాను.. సభకు: అవిశ్వాసంపై స్పీకర్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి.ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై తుది నిర్ణయం తీసుకునే వరకు లోక్సభ కార్యకలాపాలకు హాజరు కాకూడదని.. స్పీకర్ చైర్ లో కూర్చోకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో అధికార ఎన్డిఎ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ను సమర్పించినప్పటి నుంచి లోక్ సభలో ఇరుపక్షాల మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో సభ సజావుగా సాగడంలేదు. ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ ఓం బిర్లాను ఆయన పదవి నుండి తొలగించాలని కోరుతూ లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసు సమర్పించాయి. ఈ నోటీసుపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ను తన తొలగింపుకు సంబంధించి ప్రతిపక్షం దాఖలు చేసిన నోటీసును పరిశీలించాలని ఆదేశించారు. నోటీసును క్షుణ్ణంగా సమీక్షించి, అవసరమైన విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సెక్రటరీ జనరల్ను కోరినట్లు సమాచారం.
Real estate |కనుమరుగవుతున్న ప్రకృతి సంపద,
Real estate | కనుమరుగవుతున్న ప్రకృతి సంపద, Real estate | చిట్యాల,
Polling centers |పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన…
Polling centers | పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన… Polling centers
కాంగ్రెస్ నేతలపై రూ.500కోట్ల పరువనష్టం దావా
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 1200 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం చేసిన హిమంత తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ నేతలు నాపై తప్పుడు, దురుద్దేశపూర్వకంగా, పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారు. జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగొయ్ల నుంచి రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేశాను’ అని అస్సాం సీఎం శర్మ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: సిఎం యోగి
అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదును తిరిగి నిర్మించడం అసాధ్యమని స్పష్టం చేశారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారంనాడు జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, కొందరు అవకాశవాదులకు ఇబ్బందుల్లోనే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమాయాల్లో తలచుకోవడం కూడా ఉందని, అందువల్లే రాముడు కూడా వాళ్లను మరిచిపోతాడని చెప్పారు. రాముని భక్తులపై బుల్లెట్లు కురిపించి, రాముడి సేవకు అవాంతరాలు కల్పించే రామద్రోహులకు ఇక్కడ చోటులేదన్నారు. బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని కలలు కంటున్న వారికి ఒకటే చెప్పదలచుకున్నానని, అలాంటి రోజు ఎప్పటికీ రాదన్నారు. ‘ఖయామత్ రోజు ఒకటి వస్తుందంటూ ఎదురుచూపులు చూడొద్దు. హిందూస్థాన్లో కలిసి జీవించడం నేర్చుకోవాలన్నారు. ఇక్కడి చట్టాలను గౌరవిస్తూ జీవించాలని, చట్టాన్ని ధిక్కరించి ముందుకు వెళ్లే వాళ్లు నరకానికే వెళ్తారన్నారు. చట్టాన్ని ధిక్కరించగలమని ఎవరైనా అనుకున్నా, స్వర్గానికి వెళ్తామని అనుకున్నా వారి కలలు ఎప్పటికీ కల్లలుగానే మిగిలిపోతాయని జోస్యం చెప్పారు.
మధురలో ఒకే కుటుంబం లోని ఐదుగురు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఖప్పర్పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంటిలో విషం తాగి మృతి చెంది ఉండడాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. పాలలో విషం కలిపి తాగినట్టు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబం అంతా ఒకే గదిలో ఉండేది. ఉదయం పిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారు వారిని చూడడానికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. ఎటువంటి స్పందన లేకపోవడంతో గది తలుపు పగుల గొట్టి చూశారు. గదిలో ఐదు మృతదేహాలు కనిపించాయని పోలీసులు చెప్పారు. కుటుంబ పెద్ద మనీష్ కుమార్ అనే రైతు (35), అతని భార్య (32), వారి ఇద్దరు కుమార్తెలను,కుమారుడిని పోలీసులు గుర్తించారు. తాము ఆత్మహత్య చేసుకున్నామని గోడపై రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఒక కాగితంపై మరో సూసైడ్ నోట్ దొరికింది. మృతుడి మొబైల్ ఫోన్ నుండి పోలీసులు ఒక వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో మృతుడు తాను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పినట్టు పోలీస్ అధికారి ష్లోక్ కుమార్ తెలియజేశారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్ పరిశీలించిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..!
mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..! బడ్జెట్ సమావేశాల్లో విజయవాడ సెంట్రల్ సమస్యలపై
బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యాపారి హత్య
బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో హిందువు హత్యకు గురికావడం సంచలనం కలిగిస్తోంది.మిమెన్సింగ్ జిల్లాలో సోమవారం సుసేన్ చంద్రశేఖర్ (62) అనే హిందూ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. సోమవారం రాత్రి చంద్రశేఖర్ తన బియ్యం దుకాణంలోఉండగా,దుండగులు చొరబడి కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాపారి మృతి చెందాడని నిర్ధారించుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దుకాణం షట్టర్ మూసివేసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత దుకాణానికి వచ్చిన చంద్రశేఖర్ కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగు లోకి వచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నికలు జరగనున్న తరుణంలో హిందూ వ్యాపారి హత్యకు గురికావడంతో బంగ్లాదేశ్లో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Dandepally |ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు
Dandepally | ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ
police |ప్రజల భద్రతే లక్ష్యం. కర్నూల్ జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్…సాంకేతికతతో నేరాల కట్టడి.డ్రోన్
Lok Sabha |స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం
Lok Sabha | స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం Lok Sabha |
Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా
Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా కలెక్టర్ స్వప్నిల్ దినకర్
Finishing |మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు లక్ష్యం
Finishing | మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు లక్ష్యం Finishing | చిట్యాల,
congress |కూటమితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..
congress | కూటమితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు.. congress | శ్రీకాకుళం బ్యూరో,
Tollywood Actors working on Web Projects
Apart from films, actors are inking deals with the digital platforms for Originals which is earning them big remunerations. Bollywood actors are balancing their careers between films and web series. Now, several Telugu actors are making their waves and are testing their luck in the digital space. The number of actors signing web films and […] The post Tollywood Actors working on Web Projects appeared first on Telugu360 .
రాయదుర్గంలో దోపిడీ దొంగల బీభత్సం #CrimeNews #Rayadurgam #JewelleryTheft #PoliceInvestigation
10th Ward |నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు…
10th Ward | నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు… 10th Ward |
Counting |పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి
Counting | పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి Counting | భీమ్గల్ టౌన్,
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సభకు రాను
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు
ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. వాహనం కొనుగోలు చేస్తే?
వాహనాలు కొనుగోలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి
Nadyala |మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలన…
Nadyala | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలన… శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై
Media |ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి
Media | ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి Media | మక్తల్, ఆంధ్రప్రభ
minister |ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా కృషి చేస్తాం..
minister | ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా కృషి చేస్తాం.. minister |
తెలంగాణకు రేవంత్ శాపంగా మారారు : హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
CrPC 41 |ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ..
CrPC 41 | ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ.. CrPC 41 | ఆంధ్రప్రభ,
3reasons |బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు
3reasons | బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు 3reasons
విశాలాంధ్ర ` శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేయు లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు.దేవస్థానం ప్రారంభ ద్వారం నుండి భక్తుల క్యూ లైన్లు, క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన […] The post మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీశ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి appeared first on Visalaandhra .

18 C