SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

Andhra Pradesh : నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది

తెలుగు పోస్ట్ 16 Mar 2026 10:26 am

ఆ ఇద్దరు దేవతలకు జలాభిషేకం..

ఆ ఇద్దరు దేవతలకు జలాభిషేకం.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గౌడ

ప్రభ న్యూస్ 16 Mar 2026 10:25 am

‘బైకర్’ హాలీవుడ్ స్థాయిలో తీసిన సినిమా

చార్మింగ్ స్టార్ శర్వా స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవిక నాయ ర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్ద మొదటి పూర్తి మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ఇది. క్యారెక్టర్ గ్లింప్స్, సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ సినిమా మేకింగ్ ఒక హాలీవుడ్ లెవెల్‌లో ఉంటుంది. దర్శకుడు అభిలాష్ ఆలోచన కూడా అదే. ఇందులో కేవలం రేసింగ్, యాక్షన్ మాత్రమే కాదు, చాలా బలమైన ఎమోషనల్ ఫ్యామిలీ కంటెంట్ కూడా ఉంది. మేము మా సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులకు కూడా అది నచ్చుతుందని చాలా నమ్మకంగా ఉన్నాం. రేసింగ్ సన్నివేశాల్లో బైక్స్ నుంచి వచ్చే సౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సౌండ్స్ వల్ల మ్యూజిక్ వినిపించకుండా పోకూడదు. అందుకే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చేశాం’ అని అన్నారు.

మన తెలంగాణ 16 Mar 2026 10:25 am

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

న్యూయార్క్: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ మృతి చెందాడు. వరంగల్‌లోని జితేందర్ అనే వ్యాపార వేత్తకు రాకేశ్(40) అనే కుమారుడు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివసిస్తున్నాడు. రాకేశ్ తన భార్య తేజస్విని ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం రాకేశ్‌కు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. దీంతో వరంగల్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. 

మన తెలంగాణ 16 Mar 2026 10:24 am

Allu Cinemas: First Impressions

Allu family has prestigiously built Allu Cinemas in the costliest location of Kokapet. Allu Cinemas opened doors for the first Dolby Cinema for the patrons and the experience is quite impressive. The Dolby Screen has a 75-feet Flat Screen and the experience is phenomenal. Right from the seating to the interiors, everything was well equipped […] The post Allu Cinemas: First Impressions appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 10:17 am

కొత్త కాన్సెప్ట్ ఓరియంట్ మూవీ

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన‘. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీలక్ష్మి పిక్చర్స్ సంస్థ ‘సుయోధన’ సినిమాను విడుదల చేస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఈ కథ అనుకున్నాక, ప్రియదర్శిని కలిశాను. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన ఓకే చెప్పా రు. ‘సుయోధన’ మూవీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని అన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధ న, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపింది. ద్రిషిక ఈ మూవీలో చాలా బాగా నటించింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, ద్రిషిక చందర్ , బోసుబాబు నిడుమోలు, చోటా కె ప్రసాద్ నాయుడు పాల్గొన్నారు.

మన తెలంగాణ 16 Mar 2026 10:11 am

Oscars 2026 Full Winners List

The 98th Academy Awards event took place in Dolby Theatre in Los Angeles today. One Battle After Another bagged six Oscar awards and Michael B Jordan has been named as the Best Actor for his performance in Sinners. Jessie Buckley is the Best Actress for Hamnet and Paul Thomas Anderson bagged the Best Director award […] The post Oscars 2026 Full Winners List appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 10:01 am

Tirumala : తిరుమలకు వచ్చే భక్తులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 16 Mar 2026 9:55 am

ఊపిరి స్పర్శ

నా ఊపిరి నన్ను మాత్రమే కాదు నాలో నిక్షిప్తమైన నీ జ్ఞాపకాల్ని నాలో సజీవమైన నీ తలపుల్ని ఎప్పటికీ బతికిస్తూనే వుంది నువ్వు దూరంగా వుంటేనేం నీ శ్వాస పరిమళం నన్ను అంటుకునే వుంటుంది నీ మాటల మధురిమలు నన్ను పట్టుకునే వుంటాయి ఏకాంతంలోనూ నేను ఒంటరి కానే కాదంటూ గడిపిన నీ సాంగత్యంలోని క్షణాలు నిన్ను నా గుండె భుజాలపై అలా నాతోపాటు తీసుకొస్తుంటాయి మనతోపాటు కలుసుకున్న మన ఊపిరి స్పర్శలు అదేదో మొక్కను అంటుకట్టినట్టు కొంగ్రొత్త ఊపిరికి ప్రాణం పోసింది నాతోనే నాలోనే నన్ను స్పృశిస్తూ... నిన్ను చూడాలనుకున్నప్పుడు నా కనురెప్పలు మూస్తాను నిన్ను కలవాలన్నప్పుడు నీ జ్ఞాపకాల్ని ఊపిరితో నిమురుతాను నీ ఒడిలో సేదతీరిన అనుభూతికై... - యు.ఎల్.ఎన్.సింహా

మన తెలంగాణ 16 Mar 2026 9:53 am

నేల కేవలం మట్టి ముద్ద కాదు

చిన్నప్పుడు పొలానికి వెళ్తే మట్టిపై నడిచిన పాదాలకి కూడా పూలు పూసినట్టు అనిపించేది రైతు చేతివేళ్ళ మధ్య నుంచి జారిపడిన వడ్ల గింజ కొద్ది రోజులకే మొలకెత్తి పచ్చని ఊపిరిలా నిలబడి మన కళ్లలో మెరుపులు నింపేది అది నేల మన కన్న తల్లి నేలకు మాటలు రావు కానీ ఆ నేల హృదయం తడితో నిండి కమ్మని వాసనతో మనల్ని పరవశుల్ని చేస్తుంది నేల నిశ్శబ్దంగా మన పాదాల చెమటని తుడిచి మన భవిష్యత్తును ఓ పచ్చని వాకిట్లో నడిచేలా చేస్తుంది కానీ ఇప్పుడా నేల పాత పుస్తకంలా మౌనంగా గదిలో ఓ చివరి మూలన పడుకుని ఉంది ఇక ఇప్పుడు నేల కాదు మనల్ని మనమే చూసుకోవాల్సిన సమయం వచ్చింది ఇవ్వాళ మన చలనాలు నగరాల్లోనూ, నగిషీల్లోనూ వేగంలోనూ తల మునకలయి పోయాయి పొలాలు పాత స్నేహితుల్లా, దూరంగా నిలబడిపోయాయి ఒకప్పుడు వర్షంతో కబుర్లు చెప్పిన నేల ఇప్పుడా వర్షం కోసం మౌనంగా ఎదురు చూస్తోంది ‘నేల అమ్మ లాంటిదిరా, ఆమె ఒంట్లో తడి ఆరితే ఇంట్లో భోజనం కూడా కమ్మగా రాదు’ మా చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి మనం నేల అవసరాన్ని, దాహార్తినీ మరిచిపోయాం వాతావరణంలో గాలి వేడెక్కింది, జలాలు క్షీణించాయి పచ్చదనం కాలిపోయింది, పర్వతాలు కూలిపోయాయి జీవవైవిధ్యం గాజు గుళికల్లా పెటిల్లుమని విరిగిపోతోంది నన్ను కాపాడితేనే మీ భవిష్యత్తు పచ్చగా ఉంటుంది అని నేల మాట్లాడదు అది మౌనంగానే ఉంటుంది ఆ నేల నిశ్శబ్దమే మనకు గుణపాఠం ఇప్పుడా నేలను రక్షిద్దాం నేలను రక్షించుకోకపోతే రేపు మనకు అన్నం ఎవరు పెడతారు ఈ నేల కేవలం మట్టి ముద్ద కాదు అది మన ఊపిరి మన బతుకు మన భవిష్యత్తు నేలతల్లిని మర్చిపోతే మట్టి మౌనం వహించదు మన కథే ముగిసిపోతుంది - వారాల ఆనంద్

మన తెలంగాణ 16 Mar 2026 9:44 am

Telangana : గుడ్ న్యూస్.. మీ సెల్ ఫోన్ల మెసేజ్ లు చెక్ చేసుకోవచ్చు

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 9:39 am

రాయడం నా బాధ్యత.. ప్రజల కోసం వారి భాషలో, యాసలో

 నేను నా సాహితీ యాత్ర: నేను గుంటూరు జిల్లా ‘ప్యాపర్రు’ అనే ఒక చిన్న గ్రామంలో దళిత మాల సామాజిక వర్గంలో పుట్టాను. మా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. మేము మొత్తం ఆరుగురం పిల్లలం. అందరిలోనూ యూనివర్సిటీ చదువుదాకా వచ్చింది నేనే! గ్రామీణ దళిత నేపథ్యం వలన కుల వివక్ష, శ్రమ దోపిడీ, పేదరికం నేరుగా అనుభవంలోకి వచ్చాయి. అలాగే యింట్లో పితృస్వామ్యం కూడా వుండేది. అవి చదువు, వుద్యోగ జీవితంలో కూడా వివిధ రూపాలలో అనుభవంలో వుంటూనే వస్తున్నాయి. నేను ఒకటవ తరగతి నుండి హైస్కూల్ వరకు మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. కాలేజీ చదువు పొన్నూరు, గుంటూరులలో జరిగింది. తరువాత ఎం.ఏ (ఆర్కియాలజీ, ఫిలాసఫీ), ఎమ్.ఫిల్ (హిస్టరీ), పి.హెచ్.డి ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో పూర్తి చేశాను. మొదటి ఉద్యోగం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శ్రీశైలం క్యాంపస్‌లో తొమ్మిది సంవత్సరాలు చేశాక, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరాను. ప్రొఫెసర్ గా, డీన్‌గా, ప్రిన్సిపల్‌గా ఇలా రకరకాల హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలోనే కొనసాగుతున్నాను. మాది సాహిత్య వాతావరణం బొత్తిగాలేని కుటుంబం. ఉపాధ్యాయులు, స్నేహితుల ప్రభావంతో మంచి సాహిత్యాన్ని కాలేజీ రోజుల నుంచి చదవడం ప్రారంభించాను. ఈ క్రమంలోనే నేను కాలేజీ చదివే రోజుల్లో ప్రకృతి, స్నేహం, బాల్యం, ఇలాంటి అనుభూతి కవితలు అప్పుడప్పుడు రాసేదాన్ని. తరవాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరాక అక్కడ ఉండే ఉద్యమ, సాహిత్య వాతావరణం ప్రభావం వల్ల సామాజిక చైతన్యంతో కూడిన కవితలు, కథలు, వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. ఇది అంతా 90వ దశకం ప్రారంభం నాటి మాట. అప్పటి దళిత, స్త్రీవాద ఉద్యమాలు, అంబేద్కర్ సాహిత్యం నా కవిత్వాన్ని ప్రభావితం చేసిన విషయాలు. నేను వచ్చిన సామాజిక నేపథ్యం కూడా, నేను వాటిపట్ల ఆసక్తి పెంచుకోవడానికి దోహదపడి ఉంటుంది. ఒకవైపు కులం, మరోవైపు పితృస్వామ్యం, శ్రమ దోపిడీ దళిత స్త్రీమీద ముప్పేట దాడి చేస్తే ఆమె దళితులలోనే దళితగా, స్త్రీలలో అంటరానిదిగా అందరికంటే పీడితురాలిగా వుంటుంది. 80, 90వ దశకాలలో వుధృతంగా వచ్చిన దళిత, స్త్రీవాద సాహిత్యాలలో దళిత స్త్రీ కోణం మిస్సయ్యింది. దళిత స్త్రీకోణం నుంచి ఆసామాజిక వర్గాల స్త్రీలు రాయడం లేని రోజుల్లో నేను రాయడం వలన నా రచనల్ని సాహిత్య విమర్శకులు కూడా బాగానే పరామర్శించారు. నేను ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు మూడు వ్యాస సంపుటాలు, ఇతర సిద్ధాంతపరమైన పుస్తకాలు మొత్తం 15 దాకా పుస్తకాలు రాసి ప్రచురించాను. 1995 నుంచి పత్రికలలో కవిత్వం వస్తున్నప్పటికీ నామొదటి కవితా సంపుటి ‘మంకెనపూవు’ 2005లో శిఖామణి గారి సహాయంతో ప్రచురించగలిగాను. నా రచనలకు సాహిత్యంలో మంచి గుర్తింపు వచ్చింది. నా కవితలు ఇంగ్లీష్, హిందీ, కన్నడ, గుజరాతి వంటి భాషలలోకి అనువాదం అయ్యాయి. కొన్ని కవితలు ఇంటర్మీడియట్ స్థాయి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు పాఠ్యాంశాలుగా తీసుకున్నారు. యూనివర్సిటీలలో పరిశోధక విద్యార్ధులు నా రచనలపైన ఎం. ఫిల్, పి.హెచ్ డి డిగ్రీలు కూడా చేస్తున్నారు. యివన్నీ నాకు ఎంతో సంతృప్తినిచ్చిన విషయాలు. నాకు అనంతపురం నుంచి శాంతి నారాయణ గారు ప్రారంభించిన విమలాశాంతి సాహిత్య పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్రం జాషువా సాహిత్య పురస్కారం, గిడుగు రామ్మూర్తి స్మారక భాషా పురస్కారం, ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు, దాడులు వంటి సమస్యల మీద రాసే వారికి ఇచ్చే లాడ్లీ మీడియావంటి అవార్డులు కొన్ని వచ్చాయి. చెన్నై హిందూ లిటరరీ ఫెస్టివల్, ముంబై గేట్ వే లిటరరీ ఫెస్టివల్, లక్నో లిటరరీ ఫెస్టివల్, బెంగుళూరు బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్, హైదరాబాద్ ఛాయ లిటరేచర్ ఫెస్టివల్, సమూహ లిటరరీ ఫెస్టివల్ మొదలైన వాటిలో నేను వక్తగా ఆహ్వానం అందుకుని పాల్గొన్నాను. ఇవన్నీ నాకు కొత్త మిత్రులను సమకూర్చి పెట్టాయని చెప్పొచ్చు. రాయడంతో పాటు నేను అనేక పట్టణ స్థాయి సదస్సులు, గ్రామీణ స్థాయి సభలలో దళిత సమస్యమీద ముఖ్యంగా కులానికి అనుబంధ ప్రశ్నలపైన మాట్లాడతాను, జనంతో నేరుగా సంభాషిస్తాను. రాయడాన్ని నేను ఒక బాధ్యతగా భావిస్తాను. సమస్యల పరిష్కారం కోసం అన్ని కోణాలలో వ్యక్తులు తమకు చేతనైన పనులు చేయాలి. నేను యెవరినుద్దేశించి రాస్తానో వారితో నాకు ప్రత్యక్ష సంబంధాలు వున్నాయి. నా అక్షరాలలో వారు తమను తాము చూసుకుంటారు. వారి జీవితం, వారి భాష నా రచనలో నేరుగా వుండడం వలన వారు రాతలతో మమేకం అవుతారు. చరిత్రలో విస్మరణకు గురైన దళిత, బహుజన స్త్రీ పోరాట యోధులపైన నేను రాసిన ‘మిణుగురులు’ పుస్తకాన్ని తెనాలి దగ్గర కొల్లిపర అనే గ్రామంలో ఆవిష్కరిస్తే ఆసభకు చుట్టుపక్కల గ్రామాలనుంచి సుమారు 500 మందిహాజరయ్యారు. వారిలో పేద దళిత స్త్రీలే యెక్కువగా వుండడం నాకెంతో సంతోషం కలిగించింది. ఇప్పుడు సాహిత్యానికి పాఠకులు తగ్గిపోయారు అనేది పైకి అందరూ అనుకున్నప్పటికీ, నిజానికి సీరియస్ సాహిత్యానికి పాఠకులు పెరుగుతూనే ఉంటారనేది నా అనుభవం. మనం చేయాల్సింది రాయడం, ఎవరి మెప్పు కోసమో కాదు, ప్రజల కోసం వారి భాషలో, యాసలో రాయాలి, మన రాతలో వారు తమ కష్టాలు, కన్నీళ్లు, మొత్తంగా వారి బతుకు చిత్రం కనబడిందని అనుకుంటే చాలు.  - చల్లపల్లి స్వరూపరాణి

మన తెలంగాణ 16 Mar 2026 9:38 am

10వ తరగతి పరీక్షలు ప్రారంభం..

10వ తరగతి పరీక్షలు ప్రారంభం.. గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడలో 10 వ

ప్రభ న్యూస్ 16 Mar 2026 9:38 am

మూడో వన్డేలో బంగ్లాదేశ్ గెలుపు

ఢాకా: మూడో వన్డేలో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగల భారీ స్కోరును సాధించింది. బంగ్లా బ్యాటర్లలో తాంజిద్ హాసన్ తమిమ్(107) సెంచరీతో కదంతొక్కగా.. లిట్టన్ దాస్(41), తౌహిద్ హిరోయ్(48 నాటౌట్)లు బ్యాట్ ఝలిపించారు. పాక్ బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించారు. దీంతో బంగ్లా భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన పాక్.. 279 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్ సల్మాన్ అఘా(106) సెంచరీతో రాణించినా మిగతావారు విఫలమవడంతో పాక్ ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో తాస్కిన్ లహ్మద్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లా గెలుపు కీలక ప్రాత పోషించాడు. 

మన తెలంగాణ 16 Mar 2026 9:36 am

రహానెకే పగ్గాలు?

కోత్‌కతా నైట్‌రైడర్స్ సారధిగా మరోసారి కొనసాగింపు.. కోల్‌కతా: ఈనెల చివరి వారంలో ఇండియాన్ ప్రీమిర్ లీగ్(ఐపిఎల్ 2026) 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది దీంతో ఫ్రాంచైజీలన్నీ జట్టు కూర్పుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ వేటలో తలమునకలైంది. గతేడాది తేలిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, ఈసారి కూడా అజింక్య రహానెకే సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 18వ ఎడిషన్‌లో అజింక్య రహానె నాయకత్వంలోని కోల్‌కతా పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి కెప్టెన్‌ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, రహానె అనుభవం జట్టుకు అవసరమని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రహానె మాకు బెస్ట్ ఛాయిస్. అతడి అనుభవం జట్టుకు ఎంతో కీలకం. ఫ్రాంచైజీ ఇప్పటికే దీనిపై ఒక స్పష్టతకు వచ్చింది అని కోల్‌కతా టీమ్‌కు సంబంధించి పలువురు ప్రముఖులు తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి సయితం రహానే జట్టును నడిపించే బాధ్యలు చేపట్టనున్నాడని వార్తలు షీకార్లు చేస్తున్నాయి. 

మన తెలంగాణ 16 Mar 2026 9:33 am

ప్రేమ పేరుతో ట్రాన్స్‌జెండర్ని మోసం చేసి..

ప్రేమ పేరుతో ట్రాన్స్‌జెండర్ని మోసం చేసి.. కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రేమ పేరుతో

ప్రభ న్యూస్ 16 Mar 2026 9:31 am

తెలుగు రాష్ట్రాల సిఎంలు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో ఆదివారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం మీద మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, ప్రముఖ దర్శకులు అజయ్‌కుమార్ పాల్గొనగా ఎంతో మంది సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుండి శిఖరాగ్రం వరకు‘ పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా వారికి శ్రీనివాసరావు చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరిగింది. ఆ తర్వాత సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు, మోహన్ గోటేటి, బాల్‌రెడ్డి, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావుతో పాటు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాదరావు, కార్యదర్శి సురేశ్ కొండేటి కలిసి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకి ఘన సత్కార కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత సన్మాన పత్రా న్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సహకారం కన్నా కూడా మా ఫిలిం ఇండస్ట్రీ సహకారం అనేది చాలా అవసరం. అంతేకాక మా ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సపోర్ట్ చాలా అవసరం. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, విజయ్‌దేవరకొండ నుంచి ప్రతీ ఒక్కరూ కూడా చిన్న సినిమానుంచే పైకి వచ్చారు. ఆఖరికి రాజమౌళి, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరా వు కూడా చిన్న సినిమాల నుంచే పైకి వచ్చారు. గతంలో 20, 30ఏళ్ళ క్రితం చంద్రబాబు హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవారు. రెండు ప్రభుత్వాలు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నా ను. రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి. చిన్న సినిమా అనేది తీయడం వరకు తీస్తున్నాం కానీ దాన్ని బ్రతికించడం కష్టం అయిపోయింది. ఓటీటీ కాదు థియేటర్లలో రిలీజ్ చేయడం చాలా కష్టమయిపోయింది. ప్రభుత్వం మొత్తం విధానాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభు సతీమతి అయిన స్వర్గీయ మాధవి పేరు మీద ఉన్న ట్రస్ట్ ద్వారా క్రిటిక్స్ అసోసియేషన్‌కి ప్రభు.. చదలవాడ శ్రీనివాసరావు చేతుల మీదుగా యాభైవేల చెక్కును అందజేశారు.

మన తెలంగాణ 16 Mar 2026 9:30 am

Weather Report : నేటి నుంచి అకాల వర్షాలు.. మండుతున్న ఎండల్లో ఉపశమనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేటి నుంచి అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

తెలుగు పోస్ట్ 16 Mar 2026 9:27 am

జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్..

యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా హీరోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించిన చిత్రం “కేడీ : ది డెవిల్’. ఈ మూవీని దర్శకుడు ప్రేమ్స్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేశ్ అరవింద్, రీష్మా నానయ్య తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ ప్రాజెక్ట్‌ని ఏప్రిల్ 30న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మంచి ఊపునిచ్చే మాస్ బీట్‌ను విడుదల చేశారు. నోరా ఫతేహీ, సంజయ్ దత్ కాంబోలో వచ్చే ఈ మాస్ బీట్ యూత్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటను తెరకెక్కించిన తీరు, కంపోజ్ చేసిన స్టెప్పులు, నోరా ఫతేహీ గ్లామర్ ట్రీట్ ఆడియెన్స్‌కి కిక్కిచ్చేలా ఉన్నాయి. అర్జున్ జన్య ఇచ్చిన మాస్ బాణీకి, మంగ్లీ గాత్రం మరింతగా తోడైంది. ఈ పాటకు చంద్ర బోస్ అందించిన సాహిత్యం కూడా ఎంతో సరళంగా, వినసొంపుగా ఉంది. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట విజువల్ ట్రీట్‌లా మారింది.

మన తెలంగాణ 16 Mar 2026 9:26 am

Jaag Laadki Returns : జాగ్ లాడ్కీ వ‌చ్చేస్తోందోచ్ Andhra Prabha Detail Report

Jaag Laadki Returns : జాగ్ లాడ్కీ వ‌చ్చేస్తోందోచ్ Andhra Prabha Detail

ప్రభ న్యూస్ 16 Mar 2026 9:23 am

Amaravathi : నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

అమరావతిలో నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ జరగనుంది

తెలుగు పోస్ట్ 16 Mar 2026 9:22 am

రైతు ఆత్మహత్య. అసలు ఏం జరిగింది..?

రైతు ఆత్మహత్య. అసలు ఏం జరిగింది..? తుగ్గలి, ఆంధ్రప్రభ : అప్పుల భారాన్ని

ప్రభ న్యూస్ 16 Mar 2026 9:15 am

నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

నేటి నుంచి శ్రీశైలంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 16 Mar 2026 9:13 am

ఫ్యాక్ట్ చెక్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసనలు చేపట్టారనే విజువల్స్ ను ఏఐ ద్వారా సృష్టించారు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసనలు

తెలుగు పోస్ట్ 16 Mar 2026 9:08 am

ప్రేమజంట గొంతు కోసి... బావిలో మృతదేహాలు పడేసి... కనిపించడంలేదని ఫిర్యాదు

అహ్మదాబాద్: నెల రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమ జంట మృతదేహాలు బావిలో కనిపించిన సంఘటన గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాథి అలియా సోనూ రాబారి అనే యువతి(19), నవీన్ జివబాయ్ రాబారి అనే యువకుడు(21) గాఢంగా ప్రేమించుకున్నారు. నాథి ప్రేమ వ్యవహారం తండ్రికి తెలియడంతో ఆమెపై అగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో ఆగ్రహం తండ్రి రగిలిపోయాడు. ప్రేమ జంటను చంపేయాలని తండ్రి నిర్ణయం తీసుకున్నాడు యువతి తండ్రి, మేనఅల్లుడు ప్రేమ జంటను పట్టుకొని ఖంబాలా గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం తండ్రి, తల్లి, సోదరుడు, మేనల్లుడు యువతి, యువకుడి గొంతు కోసి బావిలో మృతదేహాలు పడేశారు. తన కూతురు కనిపించకపోవడంతో స్థానిక నఖత్రానా పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 3న తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు తన కుమారుడు కనిపించకపోవడంతో నవీన కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అందరూ వేర్వేరు సమాధానాలు చెప్పడంతో తనదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. వారు నిజాలు ఒప్పుకోవడంతో వెంటనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

మన తెలంగాణ 16 Mar 2026 9:03 am

Gold Price Today : గుడ్ న్యూస్... బంగారం ఇక అందుబాటులోకి.. ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 16 Mar 2026 9:01 am

లబ్బిపేటలో.. ఇఫ్తార్ విందు..

లబ్బిపేటలో.. ఇఫ్తార్ విందు.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని లబ్బిపేటలో వై.వి.రావు హాస్పిటల్

ప్రభ న్యూస్ 16 Mar 2026 8:46 am

Tiger : పులి సంచారం హెచ్చరికలు

పులి సంచారం హెచ్చరికలతో అన్నవరం దేవస్థానం, అటవీ, పోలీసులు అప్రమత్తమయ్యారు.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 8:44 am

TDP Cracks the Whip. Chandrababu Acts Against Eluru MP in Drugs Row

The drugs party at former MLA Pilot Rohith Reddy’s farmhouse in Moinabad has triggered a political storm. The controversy grew sharper after Eluru TDP MP Putta Mahesh Kumar Yadav was found among those present at the gathering. Police conducted drug tests on the people who attended the party. The MP’s urine test initially showed a […] The post TDP Cracks the Whip. Chandrababu Acts Against Eluru MP in Drugs Row appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 8:43 am

ప్రాణం తీసిన రసగుల్లా

రాంఛీ: పెళ్లి వేడుకలలో గొంతులో రసగుల్లా ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్ జిల్లా బెలాజూడి పంచాయతీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... లలిత్ సింగ్ అనే వ్యక్తి(41) తన కుటుంబ సభ్యులతో కలిసి మలియంట్ గ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యారు. లలిత్ రసగుల్లా తింటుండగా అది గొంతులో ఇరుక్కొవడంతో ఊపిరాడక కిందపడిపోయాడు. బంధువులు గమనించి వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు చనిపోయాడని తెలిపారు. రసగుల్లా గొంతులో ఇరుక్కొవడంతో ఊపిరాడక మృతి చెందాడని తెలిపారు. పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఝార్ఖండ్‌లో 2024 అగస్టులో ఓ యువకుడు మంచం మీద పడుకొని రసగుల్లా తింటూ చనిపోయిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 16 Mar 2026 8:40 am

Telangana : నేటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 16 Mar 2026 8:37 am

Sabarimala : శబరిమలలో వారికి ఇక అనుమతి లేదు

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 8:26 am

ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పది మంది మృతి

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒ

తెలుగు పోస్ట్ 16 Mar 2026 8:21 am

డ్రగ్స్ ఆరోపణలపై పుట్టా మహేష్ ఏమన్నారంటే?

డ్రగ్స్ ఆరోపణలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ స్పందించారు

తెలుగు పోస్ట్ 16 Mar 2026 8:11 am

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు..

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు.. పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారులో

ప్రభ న్యూస్ 16 Mar 2026 7:58 am

Andhra Pradesh : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 7:47 am

Andhra Pradesh : నేటి నుంచి ఒంటిపూట బడులు

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 16 Mar 2026 7:39 am

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కటక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ సిబి మెడికల్ కాలేజీలో భారీ ఎత్తున మంటల చెలరేగాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానిక ిచేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఐసియులో షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్‌తో సిఎం కలిసి ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులను కూడా పరామర్శించారు. గాయపడిన మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. 

మన తెలంగాణ 16 Mar 2026 7:36 am

Iran - Israel War : మిచిగాన్‌ పై దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి ఇజ్రాయెల్‌ దాడితో సంబంధం?

అమెరికా మిచిగన్‌లోని ఒక పెద్ద సినగాగ్‌పై దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి, ఈ నెల ప్రారంభంలో లెబనాన్‌లో జరిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడితో సంబంధం ఉన్నట్టు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది

తెలుగు పోస్ట్ 16 Mar 2026 7:34 am

Iran - Israel War : ఇరాన్ యుద్ధంతో పెరుగుతున్న చమురు ధరలు

హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా సురక్షితంగా కొనసాగాలంటే కొన్ని దేశాలు తమ యుద్ధనౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 7:18 am

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విమర్శనాస్త్రాలకు పదును పెట్టిన విపక్షాలు ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన మంత్రులు 11.45 గంటలకు కొత్త గవర్నర్ ప్రసంగం గంటలకు అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సిఎం డ్రగ్స్ కలకలం, మూసీ నదీ ప్రక్షాళన, గోదావరి నదీ జలాల వివాదం, గిగ్ వర్కర్స్‌కు కొత్త చట్టం, విద్యా రంగంలో కొత్త విధానాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ మౌనం, సోషల్ మీడియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఈసారి కూడా కెసిఆర్ రానట్లేనా..? మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉభయ సభల (కౌన్సిల్, అసెంబ్లీ) సభ్యులనుద్దేశించి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉదయం 11.45 గంటలకు ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలూ ధన్యవాదాలు తెలిపిన అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు వాడి-వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విపక్షాల నేతలు తమ విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. కాగా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు మంత్రులు, అధికారపక్ష సభ్యులు సంసిద్ధంగా ఉన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా డ్రగ్స్ కలకలం సృష్టించే అవకాశం ఉంది. ఇంకా మూసీ నదీ ప్రక్షాళన, మూసీ నదీ ప్రక్షాళన, గోదావరి నదీ జలాల వివాదం, గిగ్ వర్కర్స్‌కు కొత్త చట్టం, విద్యా రంగంలో కొత్త విధానాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ మౌనం, సోషల్ మీడియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించనున్నారు. విద్యా రంగంలో కొత్త విధానాల అమలు, మార్పులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. ఇంకా సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రసారం, హార్మ్ కంటెంట్ నియంత్రణకు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా మూసీ నది ప్రక్షాళనపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా నదీ జలాల అంశంపై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు, సిబిఐ మౌనం, హైడ్రాతో ప్రజలకు కలిగిన మేలు, తదితర అంశాలపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇదిలాఉండగా ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగించడానికి పదిహేను నిమిషాల ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎడమ వైపు బిఆర్‌ఎస్ అంబేద్కర్ విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అసెంబ్లీ అధికారులు ఇప్పుడు కొత్తగా గాంధీ విగ్రహానికి కుడి వైపున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. పది రోజుల పాటు సమావేశాలు ? సోమవారం గవర్నర్ ఉభయ సభలనుద్ధేశించి ప్రసంగించి వెళ్ళిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం కానున్నది. మరోవైపు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశమై అజెండాపై చర్చించనున్నది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారు పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాలకు కెసిఆర్ వస్తారా..? రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా...? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెసిఆర్ సభకు హాజరవడంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలకు రాకపోవచ్చని పలువురు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. తర్వాత రెండు రోజులు మంగళ, బుధవారాలు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇతర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 16 Mar 2026 7:00 am

16th March 2026 |తిరుమల సమాచారం..

16th March 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో

ప్రభ న్యూస్ 16 Mar 2026 6:51 am

మోగిన నగారా

ఒక యూటీ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల  ఏప్రిల్ 9నుంచి 29వ తేదీ వరకు పోలింగ్ మే 4న కౌంటింగ్ పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో పోలింగ్ తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఒక దశతో ముగియనున్న ఎన్నికలు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటన వివిధ రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల తేదీల వివరాలతో కూడిన షె డ్యూల్‌ను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్ర ధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. ఇతర ఇరువురు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివే క్ జోషితో కలిసి ఎన్నికల తేదీలు వెలువరించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అసోం రా ష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో అసోం, కేర ళం, పుదుచ్చేరిలలో ఎన్నికలు ఒకే విడతలో ఏప్రి ల్ 9న జరుగుతాయి. కాగా పశ్చిమబెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు ఏప్రిల్ 23, 29తేదీల్లో జ రుగుతాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం మీద 824 స్థానాలకు ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. తమిళనాడులో మొ త్తం 234 స్థానాలు ఉన్నాయి. డిఎంకె నేత స్టాలిన్ సిఎంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థా నాలు ఉన్నాయి, టిఎంసి అదినేత్రి మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేరళలో 104 స్థానాలు ఇక్కడ వామపక్ష సీనియర్ పినరయి విజయన్ సి ఎం. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నా యి. ఇక్కడ బిజెపి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి గా హిమంత బిస్వా శర్మ ఉన్నారు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రిగా ఎన్ రామస్వామి ఉన్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. ఇది అతి పెద్ద ఎన్నికల ప్రజాస్వామిక ప్రక్రియ అని సిఇసి తెలిపారు. ఇంత మంది ఓటర్లు ఉండటం విశేషం అని, ఇదది ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీచ దక్షిణాఫ్రికా జనాభాతో సమానం అని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. అర్హులైన పౌరులందరికి ఓటు హక్కు ఉంది. దీనిని అంతా సక్రమంగా వినియోగించుకోవడం పౌరుల బాధ్యత అని పిలుపు నిచ్చారు. ఇక గోవా, కర్నాటక, త్రిపుర, నాగాలాండ్‌లలో కలిపి ఐదు అసెంబ్లీ స్ధానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇవి ఎప్రిల్ 9న నిర్వహిస్తారు. గుజరాత్ మహారాష్ట్రలలో మూడు స్థానాలకు ఏప్రిల్ 23న ఉప ఎన్నిక ఉంటుందని సిఇసి ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఈ ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికల అవసరం ఏర్పడింది. ఇందులో మహారాష్ట్రలోని బారామతి కూడా ఉంది.

మన తెలంగాణ 16 Mar 2026 6:00 am

పైలట్‌కు జైలు..ఎంపికి బెయిల్

 మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ పోలీసులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జి డ్రగ్స్ పరీక్షల్లో ఏలూరు ఎంపి మహేశ్ యాదవ్, మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి సహా ఆరుగురికి పాజిటివ్ పార్లమెంట్ సభ్యుడితో పాటు 8మందికి స్టేషన్ బెయిల్ మన తెలంగాణ/హైదరాబాద్/మొయినాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పా ర్టీ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు 14రోజుల రిమాం డ్ విధించింది. ఆదివారం రాత్రి ఉప్పర్‌పల్లి మెజిస్ట్రేట్ ఎదు ట పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, మరో నిందితుడు నమిత్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వీరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకున్న ఈగల్ పోలీసులు అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏలూరు ఎంపి పుట్టా మహేశ్ యాదవ్, పైలట్ రో హిత్‌రెడ్డి సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. అయితే టిడిపి ఎంపి పుట్టా మహేష్ కుమార్, కౌషిక్ రవి, అర్జున్ రెడ్డి, రమేష్, విజయ్ కృష్ణ, శ్రవణ్ కుమార్, శరత్ కుమార్, ప్రియాంక లకు స్టేషన్ బెయిల్ లభించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు ఓ ప్రకటనలో వె ల్లడించారు. ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పార్టీలో అదుపులోకి తీసుకున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు ఉప్పర్ పల్లిలోని జడ్జి నివాసంతో ఆయన ఎదుట హాజరు పరిచ్చారు. వారికి బెయిల్ ఇవ్వాలని నిందితుల తరుపు న్యాయవాదులు వాదించారు. అయితే ప్రధానంగా గన్ ఫైరింగ్ గురించి పోలీసులు దృష్టి సారించడంతో ప్రభుత్వ న్యాయవాదులు సైతం ఆ దిశగానే వాదనలు వినిపించారు. కాగా, నిందితుల్లో మాజీ ఎంఎల్‌ఏ రోహిత్ రెడ్డి, టిడిపి ఎంపి మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌషిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి లకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఫాం హౌస్‌లోనే నిందితులకు యూరిన్ పరీక్షలు నిర్వహించగా, ఎంపి మహేష్ కుమార్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది. యూరిన్ పరీక్షల(ర్యాపిడ్ టెస్ట్) సమయంలో మహేష్ కుమార్‌కు నెగిటివ్ వచ్చిందని, తరువాత రక్త పరీక్షలు నిర్వహించడంతో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు జరుగుతోంది : ఈగిల్ ఎస్పీ గిరిధర్ ఈగిల్ ఎస్పీ గిరిధర్ రంగారెడ్డి ఈగిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాతూ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్ర గ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. డ్ర గ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే ఈగల్ టీమ్ లక్ష్యమని, ఆ విధంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయని, పోలీస్‌లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో అక్క డే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న వ్యక్తి సిల్వేరి శరత్ కు మార్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పా యింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చే సుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు. సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. ఫామ్‌హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డ్రగ్స్ వినియోగం గుర్తిస్తే టోల్ ఫ్రీ 1908 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం ఉంచుతామని తెలిపారు. పుట్టా మహేష్ పై చంద్రబాబు ఆగ్రహం ఆంధ్ర ప్రదేశ్ ఎంపి పుట్టా మహేష్ కుమార్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. డ్ర గ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఘటనపై మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ప ల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపి మహేష్‌కు పార్టీ అధ్యక్షుడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లోపు లిఖిత పూ ర్వక వివరణ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్లమెంట్ జరుగుతుంటే డ్రగ్స్‌తో చిందులు వేస్తున్న ఎంపి: వైస్ షర్మిలా రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంటే టిడిపి ఎంపి పుట్టా మహేష్ ఫాం హౌస్‌లో కొకైన్‌తో చిందులు వేస్తొన్నాడని ఏపిసిసి చీఫ్ వైస్ షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇదెక్కడి బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. పాజిటివ్ వచ్చిన ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఎంపి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 16 Mar 2026 5:30 am

ఇస్ఫహాన్ నగరంపై అమెరికా దాడి

 బి25 బాంబర్ విమానంతో దాడికి దిగిన అగ్రరాజ్యం తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా విమానాలు ఇరాన్ అణుకేంద్రం ఉన్నది ఈ నగరంలోనే టెహరాన్‌లోని స్పేస్ సెంటర్‌పైనా దాడులు షిరాజ్ నగరంపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడి అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రదేశాలకు హర్మూజ్ ప్రవేశం లేదు ఇరాన్ స్పష్టీకరణ దుబాయ్: మధ్యప్రాచ్య, గల్ఫ్ పోరు ఆదివారం మరింత తీవ్రతరం అయింది. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన అణుకేంద్రం ఉన్న చారిత్రక ఇస్ఫమాన్ నగరంపై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఆదివారం తెల్లవారుతూనే సంయుక్త బలగాల వైమానిక దాడులు వీడకుండా సాగాయి. భారీ పేలుళ్లు, నల్లని దట్టమైన పొగలతో నగర జనం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇరాన్ నాయకత్వానికి సవాళ్లు విసురుతూ దాడులను ఉధృతం చేయాలనే ట్రంప్ ఆదేశాలతో యుఎస్ ఆర్మీ కమాండ్ రంగంలోకి దిగింది. ఈ నగరంలో తక్కువ ఎత్తులోనే యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి. ప్రత్యేకించి అణుకేంద్ర స్థావరం అయినందునే ఈ నగరంపై దాడులకు దిగినట్లు వెల్లడైంది. అయితే అణు కేంద్రానికి ఏమైనా నష్టం జరిగిందా? అనేది వెంటనే వెల్లడికాలేదు. మరో వైపు టెహరాన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఇరాన్ స్పేస్ సెంటర్‌పై కూడా దాడులు జరిగాయి. ఇక్కడి నుంచే ఇరాన్ అత్యంత కీలకమైన శాటిలైట్ మ్యాపింగ్ సమాచారాన్ని తన సైనిక శ్రేణులకు, ఇంటలిజెన్స్ వ్యవస్థలకు పంపిస్తుంది. మరో వైపు ఇరాన్‌పై ఇప్పటి దాడులకు అమెరికా ఇప్పుడు తమ అత్యంత శక్తివంతమైన బి25 బాంబర్ విమానాన్ని పంపించిందని నిర్థారించారు. ఈ విమానం ద్వారా ఒకేసారి అత్యధిక స్థాయిలో 38 టన్నుల బాంబులను తీసుకువెళ్లవచ్చు. వీటిని తరలిస్తున్న దృశ్యాలను అమెరికా సైనిక విభాగం విడుదల చేసింది. టెహరాన్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ స్థాయిలో 20 నిమిషాల వ్యవధిలోనే 20 సార్లు బాంబు పేలుళ్లు విన్పించాయి. అయితే ఇరాన్ సైనిక వర్గాలు ఇస్ఫహాన్, టెహరాన్‌లపై దాడుల గురించి పెద్దగా స్పందించలేదు. ఇరాన్‌లోని షిరాజ్ నగరం నివాసిత ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. పేదలు, శ్రామికులు ఎక్కువగా ఉండే ఈ నగరంపై దాడులతో ఇక్కడి వర్కర్ల గృహసముదాయాలు, అక్కడి సహాయక సంస్థల కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకూ జరిగిన దాడులలో ఇరాన్‌లో దాదాపు 1500 మంది వరకూ పౌరులు మృతి చెందారు. వీరిలో 223 మంది మహిళలు, 202 మంది పిల్లలు ఉన్నారని ఇరాన్ సంస్థలు తెలిపాయి. అరబ్ దేశాల ఆస్తులు , స్థావరాలపై నేరుగా ఇరాన్ దాడులు తమ దేశానికి అత్యంత కీలకమైన ఖర్గ్ దీవిపై అమెరికా దాడుల పట్ల ఇరాన్ రగిలిపోతోంది. ఇందుకు అవసరమైన స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ దీవిపై దాడులతో ఇరాన్‌కు భారీ స్థాయిలో చమురుపరమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. ఖర్గ్ దీవిపై అమెరికా దాడులకు అరబ్ దేశాలలోని పలు రేవులు, డాక్‌లు, రహస్య స్థావరాలను అమెరికా విరివిగా వాడుకుందని ఇరాన్ పసికట్టింది. మిత్రదేశాలు ఈ విధంగా తమపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం, అమెరికాకు వంత పాడటంతో ఇరాన్ ఆయా దేశాలను ఎంచుకుని వరుసగా దాడులు తీవ్రతరం చేసింది. ఆదివారం ఉదయం నుంచి తమ భూభాగంలో ఇరాన్ దాడులు జరిగాయని గల్ఫ్ దేశాలు తెలిపాయి. ఇప్పటికే యుఎఇలోని మూడు అత్యంత ప్రధాన రేవులపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా రక్షణ కవచాలుగా ఈ ప్రధాన రేవులు పనిచేస్తున్నాయని ఇరాన్ గుర్తించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశాలకు హర్మూజ్ ప్రవేశం లేదని, దీనిని ప్రకటించామని, అయితే పలు దేశాలు తమ మీమాంసతో ఈ అవకాశం వాడుకోవడం లేదని, దీనితో తమకు సంబంధం లేదని తెలిపారు. మరో వైపు బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ కాంపౌండ్‌లోపలి హెలిపాడ్‌పై క్షిపణి దాడి జరిగింది. ఆదివారం జరిగిన దాడికి ఇంతవరకూ ఎవరూ బాధ్యత వహించలేదు. 

మన తెలంగాణ 16 Mar 2026 5:00 am

తీవ్రరూపం దాలుస్తున్న వాణిజ్య సిలిండర్ల కొరత

రోజు రోజుకీ మూతపడుతున్న టీ స్టాల్స్, హోటళ్లు బ్లాక్‌లోనూ స్థిరంగా లేని వాణిజ్య సిలిండర్ల ధర గ్యాస్ సరఫరా పునరుద్దరిస్తే తప్ప ఏం చేయలేమని చేతులెత్తేస్తున్న వ్యాపారులు హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో వాణిజ్య సిలిండర్లకు కటకట మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం చిన్నచిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నుంచి రెస్టారెంట్ల వరకు తీవ్రంగా పడింది. ప్రైవేటు వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేయడం వల్ల పరిస్థితి క్రమేణా తీవ్ర రూపం దాలుస్తోంది. ఒక్కొక్కటిగా దుకాణాలు మూతపడుతూ రోజుకి వందల సంఖ్యలోనే మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న కమర్షియల్ ఎల్పీజీ సరఫరా కొరత కారణంగా చిరు వ్యాపారులు నుంచి రెస్టారెంట్ల వరకు తమ వ్యాపారాలను మూసుకుంటున్నారు. గత వారం రోజులుగా భారీగా హోటళ్లు, మెస్‌లు, చిరుతిళ్లు అందించే బండ్లపై నడిపే వ్యాపారాల వరకు వాణిజ్య సిలిండర్లు దొరక్క తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలపై వాణిజ్య సిలిండర్ల కొరత, సరఫరా నిలిపివేత ప్రభావం చాలా ఎక్కువ ఉందని చెబుతున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాల్లో ఆహార పదార్థాల సరఫరాపై తీవ్ర ప్రభావం పడి సగానికి సగం తయారు చేయడాన్ని నిలిపివేస్తున్నారు. గ్యాస్ సరఫరా మెరుగుపడితే తప్ప యధాతధ పరిస్థితికి రాదని ఖరాకండీగా చెబుతున్నారు. ఇక బ్లాక్‌లో సిలిండర్ కొనాలంటే పెద్ద సాహసమే అవుతోందని వాపోతున్నారు. బ్లాక్‌లో దొరికే వాణిజ్య సిలిండర్లను నాలుగు నుంచి ఆరు వేల వరకు కొనుగోలు చేసుకుని ధరలు పెంచి టిఫిన్లు, ఇతర తినుబండారాలను అందిస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్‌లో కూడా దొరక్కపోవడం, దొరికినా భారీ ధర చెప్పడంతో వ్యాపారం చేయలేక దుకాణాన్ని, లేదా టిఫిన్ బండిని మూసివేసుకుంటున్నారు. తీవ్రరూపం దాల్చిన వాణిజ్య సిలిండర్ల కొరత గత రెండు రోజులుగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రరూం దాల్చడంతో చేసేది లేక రెస్టారెంట్ల వరకు మూసుకుంటున్నారు. ఇక మెస్‌లు, హాస్టళ్ల వంటి చోట్ల మాత్రం ఎంతో కొంత వరకు గ్యాస్ మీద చేసినా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కట్టెల పొయ్యిలపై పరిమితంగా వంట చేసుకుని హాస్టళ్లలో ఉండే విర్థులు, ఉద్యోగార్థులకు అందిస్తున్నారు. ఇండ్లలో వాడుకునే డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా కొంచెం ఆలస్యమైనా ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. అయితే ఎక్కడైనా హోటళ్లు, మెస్‌లు, బండ్లమీద విక్రయాలు చేసే వారు డొమిస్టిక్ సిలిండర్లు వాడితే భారీ జరిమానా విధించి కేసు నమోదు చేస్తున్నారు. దీంతో వాటిని వినియోగించి చిక్కుల్లో పడ్డం దేనికంటూ వాపోతున్నారు. కొందరైతే గ్యాస్ దొరికితేనే వ్యాపారం చేద్దాం, లేదంటే ఇంకో పని చూసుకుందామని సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా టి పాయింట్లను మూసివేస్తున్నారు. గ్యాస్ దొరికిన వాళ్లు నడుపుతున్నారు, లేదంటే టి దుకాణాలను మూసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా చెన్నై, ఢిల్లీ, సూరత్, బెంగళూరు, భోపాల్, కోల్‌కత్తా వంటి మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.29 కోట్ల గృహ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీటిని 810 డిస్ట్రిబ్యూటర్లు అందిస్తున్నారు. దినసరి గ్యాస్ అవసరాలలో 86 శాతం గృహ అవసరాలకు, మిగిలిన 14 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. రోజువారీగా సుమారు 2.5 లక్షల సిలిండర్లు అవసరం ఉంటుందని అధికారిక అంచనా. బ్లాక్‌లోనూ గుది‘బండ’ బ్లాక్‌లో సిలిండర్లు కొనే వారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణంగా రూ. 1,800 నుంచి రూ. 1,900 వరకు ఉండే కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చేరింది. అది కూడా రెండు మూడు రోజుల ముందు చెబితేనే అందుతుంది. అయితే ఈ ధర నిలకడగా ఉంటుందని చెప్పే పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్ వంటి మహానగరం నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించకపోతే చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్ల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడం, ధరలు అమాంతం పెరగడం, రీఫిల్లింగ్ గడువు 25 రోజులకు పెరగడం వంటి కారణాలతో హోటల్ వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా హోటల్ రంగంపై ఆధారపడిన సిబ్బంది నిత్య జీవితం అస్తవ్యస్తంగా మారింది. వారి కుటుంబ పోషణ అధిక భారం కావడమే కాకుండా హోటల్లో పనిచేసే సిబ్బందికి కూడా వంట చేసుకునేందుకు గ్యాస్ లేకపోవడంతో లెక్కలేనన్ని బాధలు పడుతున్నారు. ఇక రోజువారీగా సిబ్బంది జీతాలు, హోటల్ అద్దె భారం పెరుగుతుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాపోతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నగరంలోని చిన్న హోటళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించకపోతే చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్ల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని ఆయా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ సరఫరా జరుగుతోంది. బహిరంగ మార్కెటల్లో వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరో వైపు ముమ్మరం చేసింది. వారం రోజుల్లో వాణిజ్య సరఫరా పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మన తెలంగాణ 16 Mar 2026 4:50 am

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు...వాతావరణ శాఖ అలర్ట్

ఐదు రోజులు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ మన తెలంగాణ/హైదరాబాద్ : మార్చి ఆరంభంలోనే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే అలర్ట్ ఇచ్చింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సుమారు 40 నుంచి -50 మి.మీ మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు, భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావం ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశాముందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తుందని, దీంతో మండే ఎండలతో సతమతమవుతున్న జనాలకు కొంత మేర ఉపశమనం లభించనుందని వివరించింది. ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో సోమవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మాల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

మన తెలంగాణ 16 Mar 2026 4:20 am

మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం

ఆరుగురికి పాజిటివ్ డ్రగ్స్ పార్టీ జరుగుతుండడంతో పకడ్బందిగా ఈగల్ టీం సోదాలు కాల్పులు, మాదక ద్రవ్యాల సరఫరాపై దర్యాప్తు జరుగుతోంది ఈగిల్ అధికారులు ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు ఆగ్రహాం మన తెలంగాణ/హైదరాబాద్/మొయినాబాద్ : మొయినాబాద్ ఫాం హౌస్‌లోని డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు బృందం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయన, పోలీస్‌లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో అక్కడే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న సిల్వేరి శరత్ కుమార్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పాయింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు. సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. నిందితుల్లో 11 మంది వ్యక్తులకు మాదకద్రవ్యాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఫామ్‌హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దర్యాప్తు జరుగుతోంది : ఈగిల్ ఎస్పీ గిరిధర్ ఈగిల్ ఎస్పీ మీడియాతో మాట్లాతూ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ ఫ్రీగా చేయాలన్నదే ఈగల్ టీమ్ లక్ష్యమని, ఆ విధంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. నిందితుల్లో పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), ఏపి టిడిపి ఎంపి పుట్ట మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయ కృష్ణ, వరమచనేని శ్రవణ్ కుమార్, మోరవినేని రమేష్, ప్రియాంక, సిల్వేరి శరత్ కుమార్‌లు ఉన్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ వినియోగం గుర్తిస్తే టోల్ ఫ్రీ 1908 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం ఉంచుతామని తెలిపారు. పుట్టా మహేష్ పై చంద్రబాబు ఆగ్రహాం ఆంధ్ర ప్రదేశ్ ఎంపి పుట్టా మహేష్ కుమార్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఘటనపై మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపి మహేష్‌కు పార్టీ అధ్యక్షుడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లోపు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్లమెంట్ జరుగుతుంటే డ్రగ్స్‌తో చిందులు వేస్తున్న ఎంపి: వైస్ షర్మిలా రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంటే టిడిపి ఎంపి పుట్టా మహేష్ ఫాం హౌస్‌లో కొకైన్‌తో చిందులు వేస్తొన్నాడని ఏపిసిసి చీఫ్ వైస్ షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇదెక్కడి బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. పాజిటివ్ వచ్చిన ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఎంపి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 16 Mar 2026 3:40 am

అప్పుడు పట్టిచ్చారు..... ఇప్పుడు పట్టుబడ్డారు

నాడు ఎమ్మెల్యేలకు ఎర.. నేడు డ్రగ్స్ పార్టీ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ పోలీసులకు ఉప్పు అందించిన అప్పటి కోడ్ భాష ‘నారియల్ పానీ లే అయియే’ తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తోన్న తాజా డ్రగ్స్ కేసు మన తెలంగాణ/హైదరాబాద్:  మూడున్నర ఏండ్ల కిందట (అక్టోబర్ 2022) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బుల ఎర కేసు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ పార్టీ రెండు సంచలన కేసులకు బీఆర్‌ఎస్ నాయకుడు, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ కేంద్ర బింధువుగా మారింది. అప్పుడు ఎమ్మెల్యేలకు డబ్బుల ఎర కేసులో పైలెట్ రోహిత్‌రెడ్డి స్వయంగా పోలీసులకు ఉప్పు అందించి నిందితులను పోలీసులకు పట్టించగా , తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ పార్టీపై అగంతకులు సమాచారం ఇచ్చి పోలీసులకు పట్టించడం కొసమెరుపు. సరిగ్గా తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి రెండు రోజుల ముందు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి డ్రగ్స్ సేవించి పట్టుబడగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా అక్కడ అధికార టిడిపికి చెందిన ఏలూరు ఎంపి పట్టా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ సేవించి పట్టుబడటంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను, అక్కడ అధికార పక్షం టీడీపీని రాజకీయంగా తీవ్ర ఇరకాటంలోకి నెట్టివేసిందని చెప్పవచ్చు. ఈ కేసులో తమ ఎంపి మహేశ్‌కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో అతనికి ఎపి టీడీపి షోకాజ్ నోటీసు జారీ చేసి 48 గంటలలో సంజాయిషీ ఇవ్వాలని కోరింది. అయితే తమ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయనపై బీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం సంజాయిషీ నోటీసు కూడా జారీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా డ్రగ్స్ కేసు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ప్రధాన చర్చకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ, తమ పార్టీ ఎమ్మెల్యేలతో సహా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్ పరీక్షకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. దీనికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిస్పందిస్తూ డ్రగ్స్ పరీక్షకు తాను సిద్దమేనని ప్రకటించారు. మొత్తం మీద రెండున్నర ఏండ్ల కిందట జరిగిన ఎ మ్మెల్యేలకు డబ్బుల ఎర కేసు, తాజాగా డ్రగ్స్ పార్టీ కేసులో బీఆర్‌ఎస్ నేత పైలెట్ రోహిత్‌రెడ్డి కేంద్ర బింధువుగా మారడం గమనార్హం. అప్పుడు ఏం జరిగింది అంటే అక్టోబర్ 26. 2022లో మొయినాబాద్‌లో బీఆర్‌ఎస్ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు (రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి) డబ్బుల ఎరచూపడానికి వచ్చిన రామచ్ంర ద భారతీ (ఢిల్లీ), సింహయాజులు (తిరుపతి), నందకుమార్ (హైదరాబాద్) చర్చిస్తోన్న సమయంలో సైబరాబాద్ పోలీసులు వచ్చి ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడటానికి వచ్చిన ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఉదంతంఅప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన ఫామ్ హౌస్‌లో ముందుగానే నాలుగు సీక్రెట్ కెమెరాలను అమర్చి ఎమ్మెల్యేలతో బేరసారాలను ఆడటానికి వచ్చినవారిని రోహిత్‌రెడ్డినే పట్టించిన విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. వారిని పోలీసులకు పట్టించడానికి అప్పుడు రోహిత్‌రెడ్డి వాడిన కోడ్ భాష (నారియల్ పానీ లే అయియే) అని సంకేతం ఇచ్చినట్టు కూడా పోలీసులు బయటపెట్టారు. కాగా తాజాగా బయటపడిన డ్రగ్స్ పార్టీపై అగంతకులు ఇచ్చిన పక్కా సమాచారంతో పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు 11 మందిని ఫ్యూచర్ సిటీ పోలీసులు, ఈగల్ టీమ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం విశేషం.

మన తెలంగాణ 16 Mar 2026 3:30 am

సోమవారం రాశి ఫలాలు (16-03-2026)

మేషం ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృషభం చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మిధునం వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తికావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కర్కాటకం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సింహం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కన్య వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. తుల ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వృశ్చికం రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ధనస్సు దైవచింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. మకరం అనుకోని అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుంభం నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. మీనం నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. గో సేవ చేస్తారు.  

మన తెలంగాణ 16 Mar 2026 12:20 am

కారుణ్య మరణం అనే మెర్సి కిల్లింగ్

భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ లేక కారుణ్య మరణం అనేది చట్టం ప్రకారం నేరం. కేవలం కోర్టులు మాత్రమే దానికి అనుమతించాలి. అప్పుడే డాక్టర్లు ఆ పేషెంట్ కు మరణాన్ని నిర్ధారించవచ్చు. పేషెంట్ మరణశయ్య పై ఉన్నాడని లేక వైద్యానికి రెస్పాండ్ కాలేదనో, కోమాలో ఉన్నాడనో వైద్యాన్ని ఆపేసే హక్కు వైద్యులకు లేదు. పాసివ్ యూధనేషియా అంటే కారుణ్య మరణం ప్రసాదించాలి అంటే కేవలం కోర్టులు మాత్రమే జోక్యం చేసుకొని ప్రసాదించాలి. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో అవిభాజ్యంగా ఉంటుంది అనేది కోర్టు తీసుకున్న నిర్ణయం. ఇది చాలా దేశాలలో ఉన్నప్పటికీ మన భారత దేశంలో మొట్టమొదటిసారిగా దీనిని అమలు చేశారు. ప్రజలు కానీ డాక్టర్లు గాని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెర్సి కిల్లింగ్ అనేది కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలి. వైద్యులు ఇక పేషెంట్ ఏమాత్రం వైద్యానికి రెస్పాండ్ కాడు అతను జీవచ్ఛవమే అతను బ్రతికినప్పటికీ అతనికి ఎటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అని మాత్రమే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. తరువాత వారికి మరణాన్ని ప్రసాదించాలి అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. ఇది మేము మెడికల్ ఎథిక్స్ లో ఒక భాగంగా చెబుతూ ఉంటాం. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 15 Mar 2026 10:54 pm

NtrTrust |నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ

NtrTrust | నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ NtrTrust | ఎన్‌టీఆర్ ట్రస్ట్: ప్రాంతాలకతీతంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 10:34 pm

డ్రగ్స్ ఘటనపై పారదర్శక విచారణ జరపాలి

అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ మనతెలంగాణ/హైదరాబాద్ : మొయినాబాద్‌లోని మాజీ ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి పెద్దవారైనా చట్టం ముందు సమానంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి జరిగిన విందులో టిడిపి ఎంపీ మహేష్ యాదవ్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని సమాచారం ఉందని, ఆ ఫార్మ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరికాయని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో నిజానిజాలను పూర్తిగా వెలికితీయాలని అన్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా కెటిఆర్‌పై కావాలని బురద జల్లుతోందని మండిపడ్డారు. పిసిసి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి సహవాస దోషంతో కెటిఆర్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడిగా తన హోదాకు తగ్గట్టు వ్యవహరించకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ ఘటనకు కెటిఆర్‌ను లింకు పెట్టడం అంటే మోకాలికి బోడి గుండు కు సంబంధం అంటగట్టినట్లేనని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు ఉందా..? అని ప్రశ్నించారు. చెర్లపల్లిలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ముంబై పోలీసులు పట్టుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముంబై పోలీసులు వచ్చే వరకు రాష్ట్రంలోని ఈగల్ పోలీసులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఇది సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా..? అని ప్రశ్నించారు. డ్రగ్స్ అంశంపై ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, డ్రగ్స్ టెస్ట్‌కు బిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం కాగానే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలువరుసగా నిలబడి డ్రగ్ టెస్ట్ చేయించుకుందామని దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. దీనికి సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమా..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:25 pm

ఉప్పల్ లో ప్లే గ్రౌండ్‌లో ఘర్షణ… మెయిన్ రోడ్డుపై కానిస్టేబుల్ హత్య

చిల్కానగర్‌లో దారుణ ఘటన పిలిపించి పబ్లిక్ చూస్తుండగానే కత్తులతో వెంటపడి దాడి భయంతో పరుగులు తీసిన స్థానికులు మన తెలంగాణ / ఉప్పల్: ఉప్పల్ పరిధిలోని చిల్కానగర్ రోడ్డులో ఆదర్శనగర్ సాయిబాబా గుడి వద్ద ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం… చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న సుధీర్ రెడ్డి (35) హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం చిల్కానగర్ రోడ్డులోని ఆదర్శనగర్ ప్లే గ్రౌండ్ వద్ద కొంతమంది యువకులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం దుండగులు సుధీర్ రెడ్డిని వెంబడిస్తూ మెయిన్ రోడ్డువరకు వచ్చి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. పలుమార్లు కత్తులతో పొడవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఘటన అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. పబ్లిక్ చూస్తుండగానే ఈ దాడి జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడు సుధీర్ రెడ్డి స్నేహితుడైన సంతోష్ నాయక్ అనే వ్యక్తి పేరు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చిల్కానగర్ ప్రాంతానికి పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:13 pm

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. పరీక్షకు కెటిఆర్ సిద్ధమా ?

ప్రశ్నించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మన తెలంగాణ/హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా? అని ఆయన ఆదివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పట్టుబడడంపై కెటిఆర్, ఇంకా ఆయన బృందం స్పందించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేదని, ఈగల్ టీంకు లభించిన సమాచారం మేరకు తన కర్తవ్యాన్ని నిర్వహించిందని ఆయన చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఈగల్ టీం తమకు లభించిన పక్కా సమాచారం, ఆధారాలతో దాడులు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరి కొందరు నాయకులు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం తెలిసే ఈగల్ టీం దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. నో-డ్రగ్స్- సేవ్ తెలంగాణ ఇదిలాఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణలో నో-డ్రగ్స్&సేవ్ తెలంగాణ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ కెటిఆర్‌ను, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తూర్పారబట్టారు. డ్రగ్స్ సంస్కృతి తెచ్చిందే కెటిఆర్ ఎంతో ప్రశాంతంగా ఉండే మొయినాబాద్‌లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను డ్రగ్స్ వైపు కెటిఆర్ ఉసిగొల్పారని పిసిసి అధికార ప్రతినిధి గౌరి సతీష్ ఆరోపించారు. సమాజంలో సంఘవిద్రోహ శక్తులుగా కెటిఆర్ నిలిచిపోతారని ఆయన హెచ్చరించారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:07 pm

డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం

ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా నా పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుంది బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. డ్రగ్స్ వాడేవారు ఎవరైనా, ఏ పార్టీకి చెందినవారైనా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ఏ టెస్టుకైనా తాను సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయించుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని, మనమే ఉదాహరణగా నిలుద్దాం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అని పేర్కొన్నారు. డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా తాను వ్యతిరేకం అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని బిఆర్‌ఎస్ పార్టీపై బురద చల్లడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా తన పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మన తెలంగాణ 15 Mar 2026 9:57 pm

ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు

మొదటి విడతలో ఒక ఎకరం వరకు 70 లక్షల మంది ఖాతాల్లో రూ.3,590 కోట్లు 20 రోజుల్లో రూ.2,650 కోట్లు సిఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేయనున్నట్లు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈమేరకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సిఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాల్లో నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి నుండే రైతు భరోసా తొలి విడుత నిధులు విడుదల చేయనున్నారు. తొలి విడత రైతు భరోసాలో ఒక ఎకరం భూమి కలిగిన 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తరువాత రెండో విడత రైతు భరోసా నిధులు రూ. 2,650 కోట్ల రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివర వరకు మూడోవిడతగా మొత్ంత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని, మూడు విడతలుగా మొత్తం సుమారు తోమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

మన తెలంగాణ 15 Mar 2026 9:36 pm

పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది

పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది నమిలిగొండలో పారిశుధ్య కార్మికులకు ఘనంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:20 pm

ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి

ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:05 pm

బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం ఆశయాలను సాధించాలి

బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం ఆశయాలను సాధించాలి బీఎస్పీ నేతలు శ్రీరామ్ కృష్ణ, సుభాష్

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:01 pm

కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి

కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి చౌటుప్పల్,ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:58 pm

వైసిపి నేత ఇఫ్తార్ విందు..

విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత […] The post వైసిపి నేత ఇఫ్తార్ విందు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 8:56 pm

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:54 pm

బాబాపూర్ లో వరకట్నం నిషేధం

బాబాపూర్ లో వరకట్నం నిషేధం ఇంటింటికి తోచినంత సహాయం వధువుకు అందజేత ఉట్నూర్,

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:50 pm

కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి

విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్ వెల్ కూలీ సంతురాం (35) మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా బోర్ వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న సంతురాం, పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో సంతురాం వాహనం కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ […] The post కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 8:44 pm

వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి

వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి అప్పుతీసుకొన్న వ్యక్తికి తెగిన చేతివేళ్లు గంగవరం,

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:39 pm

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం […] The post అప్పుల బాధతో రైతు ఆత్మహత్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 8:37 pm

ముత్తారం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి

ముత్తారం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి ముత్తారం, ఆంధ్రప్రభ : ముత్తారం, మృతుల

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:33 pm

ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి

ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన మర్రి ప్రశాంత్, శ్రావణి అనే దంపతులు హైదరాబాద్ లోని రాంనగర్ లో నివసిస్తున్నారు. దంపతులు తమ కుమారుడు సహస్రాతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి ఎరుపు రంగు కారు ఢీకొట్టడంతో వారు కిందపడిపోయారు. భార్యభర్తలు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో ఉద్యోగిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజీకి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మన తెలంగాణ 15 Mar 2026 8:28 pm

రేపటి నుంచి ఒంటిపూట బడులు

ఉ.8 నుంచి మ.12:30 వరకు తరగతులు టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లకు పరీక్షలు జరిగే రోజుల్లో మ.1 గంట నుంచి సా. 5 వరకు క్లాసులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం ఒంటిపూట బడులు (హాఫ్‌డే స్కూల్స్) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. అయితే, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. అలాగే, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కేంద్రాలు కూడా 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.

మన తెలంగాణ 15 Mar 2026 8:20 pm

పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక

పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:11 pm

మూసీ భూములు ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే యత్నం

రేవంత్‌రెడ్డి చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారు పూర్తి డిపిఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన పేరుతో దాని పరివాహక ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటి వరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డిపిఆర్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదని, ఫేజ్ -1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను మాత్రమే చూపించిందని అన్నారు. పూర్తి వివరాలు ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని విమర్శించారు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో ఈ ప్రాజెక్టుకు రూ. 5,641 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపిందని, అయితే ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు రూ. 1,400 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగిందని అన్నారు. ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ, సిఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి అరాచకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇప్పటివరకు ఆరు ఫిర్యాదులు చేశామని ప్రస్తావించారు. అవసరమైతే హైడ్రా కమిషనర్, ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నాళాలను ఆక్రమించి విల్లాలు నిర్మిస్తున్న సంస్థ తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు పెడుతున్నారని.. మీరేమైనా కంటెంట్ రైటర్లా ...? అంటూ ధ్వజమెత్తారు. హైడ్రా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. తాను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం, హైడ్రా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. హైడ్రా చేసిన ట్వీట్లు వెంటనే డిలీట్ చేయాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం చిన్న మోదీలా ఉంది గాంధీ విగ్రహం కోసం రూ.70 కోట్లు, రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే ప్రభుత్వం, సిఎం ఇంటి నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇళ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో చిన్న మోదీలా ఉందని వ్యాఖ్యానించారు. 2017లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును తిరస్కరించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అనుమతులు ఇచ్చిందని అన్నారు. మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నగరంలోని 16 నాళాల నుంచి మురికి నీరు మూసీలోకి వస్తోందని, నగర వ్యర్థాలన్నీ మూసీలోకే వెళ్తున్నాయని తెలిపారు. 1,430 ప్రాపర్టీలను కూల్చివేస్తామని ప్రభుత్వం చెబుతోందని, దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, అసలైన బాధితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాను, విశారదన్ కలిసి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఖమ్మంలో పర్యటిస్తామని కవిత తెలిపారు. వెలుగుమట్లలో నిజమైన బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తాను, విశారదన్ కలిసి చేసిన పోరాటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆమె పేర్కొన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 8:06 pm

బడ్జెట్ సమావేశాలకు కెసిఆర్ వస్తారా..?

ఎప్పటిలానే దూరంగానే ఉంటారా...? మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా...? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెసిఆర్ సభకు హాజరవడంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలకు రాకపోవచ్చని పలువురు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. తర్వాత రెండు రోజులు మంగళ, బుధవారాలు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇతర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 15 Mar 2026 8:03 pm

చికెన్ ధరలు పైపైకి...!

ప్రస్తుతం కిలో రూ.320..రానున్న రోజుల్లో రూ.380కి చేరే ఛాన్స్? మన తెలంగాణ/హైదరాబాద్ : అన్‌సీజన్‌లోనూ చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ట్రిపుల్ సెంచరీ దాటడంతో సామాన్యులకు చికెన్ కూర దూరమవుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సాధారణంగా డిమాండ్ తక్కువగా ఉండే అన్ సీజన్‌లోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటేసి కిలోకు రూ.320 వరకు అమ్ముడవుతున్నాయి. స్థానిక మార్కెట్లలో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం తో.. సామాన్య జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ ధర ఎంత అని అడిగి మరీ కొనకుండా వెళ్లిపోతున్నారని వ్యాపారాలు అంటున్నా రు. ఇదే ధరకు హాఫ్ కేజీ మటన్ వస్తది కదా అంటూ కొనకుండా కొనుగోలు దారులు వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం షాప్స్ అన్ని ఖాళీగా దర్శన మిస్తు న్నాయి. గతంలో ఇదే సమయంలో చికెన్ ధరలు తక్కువగా ఉండేవి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాపారులు చెబుతున్నా రు. పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా తగ్గిపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వారు వాపోతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో మార్కెట్‌లో చికెన్‌కు కొరత ఏర్పడిందని వ్యాపారుల మాటగా వినవస్తోం ది. ఈ కారణాల వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశ ముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనే కిలో చికెన్ ధర రూ.380 వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత భారంగా మారే అవకాశముందని సామాన్యులు ఆందోళన వ్యక్తపరుస్తు న్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 7:54 pm

సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం…

సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:46 pm

రామప్ప దేవాలయ పరిసరాలలోని జైన గుడిని పరిరక్షించాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయ పరిసరాల్లోని సా.శ.13వ శతాబ్దికి చెందిన వర్ధమాన మహావీరుని జైన గుడిని పదిలపరిచి, పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఇఒ, డా. ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి, అరవింద్ ఆర్య కోరారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనగుడిని కూడా ఆ జాబి తాలో చేర్చాలని కోరారు. ఆదివారం రామప్ప పరిసరాల్లోని కాకతీయ ఆనవాళ్లను పరిశీలించిన వారిద్దరు, జైనాలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గర్భాలయం, అర్దమండపం, రెండిటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణ కలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన (శిఖరం), దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్దం పడుతున్నాయన్నారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం శిల్పం చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుని లాంఛనమని, అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరునికి అంకితం చేయబడిందని చెప్పొచ్చని శివనాగిరెడ్డి, అరవింద్ ఆర్య చెప్పారు. అద్భుత కాకతీయ వాస్తు నైపుణ్యం ఉట్టిపడుతున్న ఈ ఆలయాన్ని కూడా పదిలపరిస్తే రామప్ప ఆలయ సందర్శకులకు మరో పర్యాటక ఆకర్షణ అవుతుందని వారన్నారు.  

మన తెలంగాణ 15 Mar 2026 7:43 pm

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:42 pm

సీఎం చంద్రబాబు సీరియస్‌

సీఎం చంద్రబాబు సీరియస్‌ ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:36 pm

పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న క‌లెక్ట‌ర్‌…

పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న క‌లెక్ట‌ర్‌… అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం…95,598 మంది

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:24 pm

సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ

సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ మోత్కూర్, ఆంధ్రప్రభ : జిల్లా రచయితల

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:15 pm

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ కాంగ్రెస్

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:14 pm

జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం

జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:11 pm

నెతన్యాహు క్షేమంగా ఉన్నారు

వదంతుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటన టెల్ అవీవ్ : ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలో మరణించి ఉంటారని వస్తున్న ఊహాగానాలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. నెట్టింట ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేసింది. ఇక నెతన్యాహు తనయుడు కూడా కొన్ని రోజులుగా కనిపించట్లేదన్న వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన మార్చ్ 9 నుంచి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత శుక్రవారంనాడు నెతన్యాహు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన వీడియో సందేశంతో కూడిన పోస్ట్‌పై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ వీడియోలో పలు మార్లు నెతన్యాహు చేతి వేళ్లు ఆరు ఉన్నట్లు కనిపించాయి. అది ఏఐ వీడియో అని, నెతన్యాహు మరణించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 15 Mar 2026 7:07 pm

రైతన్నా మీకోసం.. రైతుల్లో అవ‌గాహ‌న‌…

రైతన్నా మీకోసం.. రైతుల్లో అవ‌గాహ‌న‌… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:58 pm

అక్కడ సరదా కోసం మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్

‘ఖర్గ్’పై సరదాగా మరిన్ని దాడులు చేస్తాం చమురు క్షేత్రాలను లక్షంగా చేసుకోలేదు సైనిక స్థావరాలను దారుణంగా దెబ్బతీశాం మొజ్తాబా బతికి ఉన్నాడనేది అనుమానమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు న్యూయార్క్ : పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారంనాడు ఓ వార్త సంస్థకకు ఇచ్చిన ఇంటర్వూలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న ఖర్గ్ ద్వీపంపై సరదాగా మరిన్ని దాడులు చేస్తామని అన్నారు. ఇప్పటికే మేం జరిపిన దాడుల్లో భారీగా దెబ్బతిందని, అధిక భాగం ధ్వంసమైందన్నారు. అత్యధికంగా సైనిక స్థావరాలనే లక్షంగా ఎంచుకున్నామని ట్రంప్ తెలిపారు. చమురు క్షేత్రాలను దాడులకు లక్షంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు దిశగా ఒప్పందానికి ఇరాన్ సంసిద్ధంగా ఉందని, అందుకు ప్రతిపాదిస్తున్న షరతులు మాత్రం అంగీకార యోగ్యంగా లేవన్నారు. యుద్దం ముగింపునకు తాము సిద్ధంగా లేమంటూనే ఇరాన్ విధిస్తున్న షరతులేంటో చెప్పేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడనడానికి రుజువులేంటని ట్రంప్ ప్రశ్నించారు. ఆయన బతికి ఉన్నట్లు లేడని తాను విన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు కదా అని ప్రశ్నించారు. ఒక వేళ బతికి ఉంటే ఆ దేశం కోసం.. లొంగిపోయేందుకుతెలివైన నిర్ణయం తీసుకుని ఉండేవారన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 6:54 pm