SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

BRS |అభివృద్ధి కాంక్షించి గెలిపించండి..

BRS | అభివృద్ధి కాంక్షించి గెలిపించండి.. BRS, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్

ప్రభ న్యూస్ 3 Feb 2026 8:31 am

రెండు కేసుల్లో షేక్ హసీనాకు పదేళ్ల జైలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో స్థానిక కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది

తెలుగు పోస్ట్ 3 Feb 2026 8:29 am

విజయ్ దేవరకొండ తల్లిగా..?

విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న‘రౌడీ జనార్థన‘ సినిమాకు బ్లాక్‌బస్టర్ ప్రామిస్ ఇస్తున్నారు దర్శకుడు రవికిరణ్ కోలా. ఈ సినిమా టీజర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. అయితే ఈ వారం కొన్ని యాక్షన్ సీన్స్ ను తీస్తున్నారని.. వీటిని విజయ్ దేవరకొండ లేకుండానే షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సీన్స్ లో ఆమె హీరోకి తల్లి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.

మన తెలంగాణ 3 Feb 2026 8:29 am

Nara Lokesh : నేడు డిల్లీకి మంత్రి నారా లోకేశ్

నేడు డిల్లీకి మంత్రి నారా లోకేశ్ బయలుదేరి వెళ్లనున్నారు

తెలుగు పోస్ట్ 3 Feb 2026 8:24 am

Ram Shelves his Next Film

Energetic Star Ram has been struggling to deliver a decent hit. He had high hopes on Andhra King Taluka and he worked on a profit sharing model for the film. Despite receiving decent talk, the film failed to mint decent money and this left everyone in shock. Ram is committed to Baahubali producers Arka Media […] The post Ram Shelves his Next Film appeared first on Telugu360 .

తెలుగు 360 3 Feb 2026 8:24 am

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ବରଫାଞ୍ଚଳରେ ଗାଡ଼ି ଖସୁଥିବା ଭିଡିଓଟି ତୁର୍କୀର ଅଟେ

ଗତ ସପ୍ତାହ ହିମାଚଳ ପ୍ରଦେଶର ପ୍ରବଳ ତୁଷାରପାତ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ମନାଲି ସମେତ ଅନେକ ସ୍ଥାନରେ ତୁଷାରପାତ ହୋଇଛି। ଏହାର ମଜା ନେଇଛନ୍ତି ପର୍ଯ୍ଯଟକ। ମନାଲିରେ ସଫେଦ ଚାଦରର ଆସ୍ତରଣ ବେଶ ମନୋରମ ପରିବେଶ ସୃଷ୍ଟି କରିଛି। ଦୂରଦୂରାନ୍ତରୁ ଆସିଥିବା ପର୍ଯ୍ୟଟକ ଏହାର ମଜା ଉଠାଇଛନ୍ତି। ଦୁଇ ତିନି ଧରି ତୁଷାରପାତ ଜାରି ରହିବ ବୋଲି ସୂଚନା ମିଳିଛି। ସେହିପରି ସିମଳାରେ ବି ପ୍ରବଳ ତୁଷାରପାତ ଜାରି ରହିଛି। ଗତ କିଛି ବର୍ଷ ମଧ୍ୟରେ ଏପରି ବଡ଼ ଧରଣର ତୁଷାରପାତ ହୋଇ ନଥିଲା ବୋଲି କୁହାଯାଉଛି। ସେପଟେ ଦିଲ୍ଲୀରେ କିଛି ସ୍ଥାନରେ ବର୍ଷା ହୋଇଛି। ଶୀତ ସହ ବର୍ଷା ଯୋଗୁ ଜନଜୀବନ ପ୍ରଭାବିତ ହୋଇଛି। ବର୍ଷା ଯୋଗୁ ଦିଲ୍ଲୀରେ ବାୟୁ ଗୁଣବତ୍ତାରେ ଉନ୍ନତି ଆସିଛି। ଆଜି ସକାଳୁ ଝିପିଝିପି ବର୍ଷା ଲାଗି ରହିଛି । ସେହିପରି ଚଣ୍ଡୀଗଡ଼, ଉଦ୍ଧମପୁରରେ ବି ବର୍ଷା ହୋଇଥିବାର ଉକ୍ତ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏକ ବରଫାଞ୍ଚଳର ହୋଇଥିବା ବେଳେ, ଗୋଟିଏ କାର୍ ତଳକୁ ଖସୁଥିବାରଦେଖିବାକୁ ମିଳିଛି । ଖସୁଥିବା କାର୍ ଟି ଆଉ ଏକ କାର୍ କୁ ଧକ୍କା ମାରିଥିବା ବେଳେ ଉକ୍ତ କାର୍ ଟି ବହୁ ତଳକୁ ଖସି ଓଲଟି ପଡ଼ିଥବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯାହାର ଆର୍କଆଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ତୁର୍କୀରେ ୨୦୨୫ ମସିହାର ଘଟଣାର ଅଟେ, ଉକ୍ତ ଭିଡିଓ ସହ ମନାଲିର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ବିଭିନ୍ନ ଗଣମାଧ୍ୟମରେ ଏନେଇ କିଛି ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ ।  ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ମନାଲିରେ ଏକ କାର ବରଫ ଉପରେ ଖସିପଡ଼ିବା ପରେ ଏକ ବଡ଼ ଦୁର୍ଘଟଣା ଅଳ୍ପକେ ଟଳି ଯାଇଛି । ନାସୋଗି ଗାଁର ଏକ ସିସିଟିଭି କ୍ୟାମେରାରେ କଏଦ ହୋଇଥିବା ଏହି ଘଟଣା ଏବେ ସୋସିଆଲ ମିଡିଆରେ ବହୁଳ ଭାବରେ ଭାଇରାଲ ହୋଇଛି । ଭିଡିଓରେ ଦେଖାଯାଉଛି ଯେ ଏକ ହୋଟେଲ ବାହାରେ ପାର୍କିଂ ହୋଇଥିବା ଏକ କାର ହଠାତ୍ ନ୍ୟୁଟ୍ରାଲ୍‌ରେ ଖସି ପଡ଼ିବା ପରେ ଆଗକୁ ଭାସି ଯାଉଛି । ରାସ୍ତାରେ ବରଫ ପଡ଼ିଥିବାରୁ ଗାଡ଼ିଟି ଖସିଯାଇଥିଲା, ଡ୍ରାଇଭର ଏହାକୁ ଅଟକାଇବାକୁ ଚେଷ୍ଟା କରିଥିଲେ କିନ୍ତୁ ଖସି ପଡ଼ି ତାଙ୍କ ପାଦ ମଧ୍ୟ ହରାଇଥିଲେ । ଡ୍ରାଇଭର ସୁରକ୍ଷିତ ସ୍ଥାନକୁ ଯିବାରେ ସଫଳ ହୋଇଥିଲେ, କିନ୍ତୁ କାରଟି ଏକ ଖାଲରେ ପଡ଼ିଯାଇଥିଲା ଏବଂ ଗୁରୁତର ଭାବରେ କ୍ଷତିଗ୍ରସ୍ତ ହୋଇଥିଲା। ଡ୍ରାଇଭର ଗୁରୁତର ଆହତ ହୋଇଥିଲେ ହେ ଅଳ୍ପକେ ଜୀବନ ରକ୍ଷା ପାଇଯାଇଥିଲେ। ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ପ୍ରସାରିତ ଭିଡିଓ ଠାରୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଲଗା ଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୯ ଡିସେମ୍ବର ୨୦୨୫ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଆନାଡୋଲୁ ଏଜେନ୍ସି ନାମକ ଏକ ସଂସ୍ଥା ନିଜ ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲରେ ଅପଲୋଡ଼ କରିଥିବା ବେଳେ ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ୨୨,୨୩୪ ଭିୟୁ ମିଳିପାରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସଦୃଶ ହୋଇଥିବାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ତେବେ ଭିଡିଓଟି ଅପଲୋଡ଼ କରି ଉକ୍ତ ଚ୍ୟାନେଲ ତୁର୍କୀ ଭାଷାରେ କିଛି ଲେଖିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯାହାକୁ ଅନୁବାଦ କରିବାରୁ ଜଣାଯାଏ ଏହା ମାଲାଟ୍ୟା ଅଞ୍ଚଳର ଅଟେ । ସେହିପରି ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ସ୍ଥାନୀୟ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର କିଛି ଖବର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ପ୍ରସାରିତ ଖବରରେ ଯେଉଁ ଫଟୋ ବ୍ୟବହାର ହୋଇଛି ତାହା ଭାଇରାଲ ଭିଡିଓର ଏକ ଅଂଶ ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ତୁର୍କୀରେ ୨୦୨୫ ମସିହାର ଘଟଣାର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ମନାଲିର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ I

తెలుగు పోస్ట్ 3 Feb 2026 8:13 am

Revanth Reddy : నేడు రేవంత్ కీలక సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశం కానున్నారు.

తెలుగు పోస్ట్ 3 Feb 2026 8:04 am

Weather Report : ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్.. ఈసారి టాప్ లేచిపోద్ది

వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గింది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతన్నాయి

తెలుగు పోస్ట్ 3 Feb 2026 7:54 am

Road Accident : రాజమండ్రి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

రాజమండ్రి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

తెలుగు పోస్ట్ 3 Feb 2026 7:51 am

Andhra Pradesh :నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది

తెలుగు పోస్ట్ 3 Feb 2026 7:42 am

ప్రపంచ టెన్నిస్‌లో అల్కరాజ్‌దే రాజ్యం!

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. వరుస గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో దూసుకుపోతున్నాడు. అతని ఆట ఆల్‌టైమ్ గ్రేట్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్)లను తలపిస్తోంది. 22 ఏళ్ల అతి చిన్న వయసులోనే అల్కరాజ్ కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించి ఎదురులేని శక్తిగా మారాడు. కిందటి ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ట్రోఫీలు సాధించిన అల్కరాజ్ తాజాగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ విజేతగా నిలిచి సత్తా చాటాడు. సెర్బియా యోధుడు జకోవిచ్‌తో జరిగిన తుది పోరులో అసాధారణ పోరాట పటిమతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. జకోవిచ్ ఆధిపత్యాన్ని తట్టుకుంటూ ముందుకు సాగిన తీరును ఎంత పొగిడినా తక్కువే. రానున్న రోజుల్లో అల్కరాజ్ ఎదురులేని శక్తిగా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో ఇటలీ స్టార్ జన్నిక్ సినర్ ఒక్కడే అల్కరాజ్‌కు పోటీ ఇస్తున్నాడు. జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ కూడా రేసులో ఉన్నా సినర్‌తో పోల్చితే అతనికి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మంచి రికార్డు లేదనే చెప్పాలి. వెటరన్ ఆటగాడు జకోవిచ్‌లో కూడా మునుపటి జోష్ కనిపించడం లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరినా టైటిల్ మాత్రం సాధించలేక పోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అల్కరాజ్ జోరును తట్టుకుని మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం అతనికి శక్తికి మించిన పనిగానే చెప్పాలి. ప్రపంచ టెన్నిస్‌లో మరి కొన్నేళ్ల పాటు అల్కరాజ్ ఆధిపత్యం చెలాయించడం ఖాయమని చెప్పొచ్చు.

మన తెలంగాణ 3 Feb 2026 7:40 am

Tariffs : భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు

భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది

తెలుగు పోస్ట్ 3 Feb 2026 7:32 am

అమ్మవారి మహిమలు తెలిపేలా..

సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘దక్షిణ కాళీ‘. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. ఆధ్యాత్మిక కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ. ఈ సినిమా ఈ నెల 6న తెలుగు, తమిళ, కన్నడలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర సాంగ్స్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు వి.సముద్ర, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ అమ్మవారి మహిమలు తెలిపేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ఓ కీలక పాత్రలో నటించానని తెలిపారు. నిర్మాత సత్యవాణి మీసాల మాట్లాడుతూ సినిమా నిర్మాణం నుంచి రిలీజ్ దాకా అమ్మవారే మమ్మల్ని నడిపిస్తూ వచ్చారని అన్నారు. 

మన తెలంగాణ 3 Feb 2026 7:30 am

నేడు ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌హౌస్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఎన్‌డిఎ కూటమి భాగస్వాములైన బీజేపీ, టిడిపి, జెడి(యు),ఎల్‌జెపి (ఆర్), శివసేన,జెడి(ఎస్)తదితర పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో రాజకీయ, పాలనా వ్యవహారాలపై పార్లమెంట్ లోని ప్రభుత్వ అజెండాపైన ప్రధాని మోడీ చర్చించడం ఆనవాయితీ. ఎంపీలు తమ నియోజకవర్గాల సమస్యలపై లేవనెత్తే అంశాలపై ప్రధాని తరచుగా చర్చిస్తుంటారు.

మన తెలంగాణ 3 Feb 2026 7:20 am

టారిఫ్ ఊరట

వాషింగ్టన్ /న్యూఢిల్లీ : భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారయిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది తనకు తన గుడ్ ఫ్రెండ్ మోడీకి గుడ్ న్యూస్ అని వ్యాఖ్యానించారు. ఒప్పందం ముందుగా భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని సోమవారం వెల్లడించారు.రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేయడంలో ప్రధాని మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీనితో రష్యా చమురుపై భారత్‌కు పడ్డ పాతిక శాతం ప్రతీకార సుంకాలను తగ్గించినట్లు ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక భారత్ ఎక్కువగా తమ చమురు అవసరాలను అమెరికా నుంచి , ప్రత్యేకించి తమ ఆధీనంలో ఉన్న వెనెజువెలా చమురు నిల్వల నుంచి తీర్చుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రేడ్ డీల్ కుదిరినందున పరస్పర టారీఫ్‌లు తక్షణం తగ్గుతాయని వివరించారు. భారత ప్రధాని మోడీ మంచి నాయకుడు ఎక్కువగా అమెరికా సరుకులు కొంటానని చెప్పారు.పైగా 500 బిలియన్ డాలర్ల మేర అమెరికా ఇంధన, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు దిగుతామని చెప్పారని ఈ సందర్భంగా మోడీకి ట్రంప్ కితాబు వెలువరించారు. మాట నిలబెట్టుకుంటున్నందున ఆయనకు ముందుగా ఫోన్ చేసి తరువాత సుంకాలను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను తాజాగా మోడీతో జరిపిన ఫోన్ సంభాషణ వివరాలను తెలిపారు. పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయని, రష్యా ఉక్రెయిన్‌ల యుద్ధం గురించి మాట్లాడామని వివరించారు. ట్రంప్ ప్రకటన తరువాత ప్రధాని మోడీ వెంటనే స్పందించారు. టారీఫ్‌ను తగ్గిస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడం తమకు ఆనందం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్‌నకు ధన్యవాదాలు చెపుతూ ట్వీట్ వెలువరించారు. ఆయన నిర్ణయం ప్రపంచ శాంతికి దోహదపడుతుందని,ఆయన చేస్తున్న కృషికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మన తెలంగాణ 3 Feb 2026 6:00 am

3Feb2026 |మంగళవారం పంచాంగం |మాఘ పౌర్ణమి విశేషాలు, రాశి ఫలితాలు

3Feb2026 | నేటి గ్రహ స్థితి – రాశులపై ప్రభావంనేటి దైవారాధన &

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:00 am

ఈశాన్యానికి బడ్జెట్ దెబ్బ

ప్రపంచ ఆర్థిక అస్థిర పరిస్థితి, దేశంలో ఆర్థిక పరిమితుల మధ్య కేంద్ర ప్రభుత్వం 2026 -27 బడ్జెట్‌ను సిద్ధం చేసింది. ఆర్థిక చర్చల్లో అనిశ్చిత పరిస్థితి ఆధిపత్యం చెలాయించింది. వాణిజ్యపరం గా ఎదురైన ఇబ్బందులు, ప్రపంచ డిమాండ్ మందగించడం, మారిన జిడిపి అంచనాలు, పన్నుల రూపంలో వచ్చే ఆదాయాలలో నియంత్రణ, ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు అవకాశాలను తగ్గించాయి. ఈ సవాళ్లు మొత్తం దేశంపై ప్రభావం చూపినప్పటికీ, ఈశాన్య భారతంపై మరింత తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వం చేసే వ్యయమే వృద్ధికి కీలకమైన ఈ ప్రాంతంలో ఆర్థిక అనిశ్చితి బడ్జెట్‌పరమైన ఆందోళన మాత్రమే కాదు, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదంగా మారింది. జాతీయ ఆర్థిక నేపథ్యం సంక్లిష్టంగా ఉంది. ఆదాయం అంచనాలు, ఆర్థిక లక్ష్యాలను బలోపేతం చేసే జిడిపి వృద్ధి అంచనాలు, వినియోగం తగ్గడంతోవల్ల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నాయి. జిఎస్‌టి, ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇప్పటికీ పెరుగుతున్నా, జోరు మాత్రం తగ్గింది. అదే సమయంలో ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) నెట్‌వర్క్‌కు అనుగుణంగా రుణం- జిడిపి నిష్పత్తిని తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతంత మాత్రంగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులు, పరిమితులు, ఆర్థిక విధాన పరమైన పరిధిని మరింత తగ్గిస్తాయి. ఈశాన్య భారతానికి సంబంధించినంత వరకూ ఈ మైక్రో -ఫైనాన్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్, తక్షణ పరిణామాలకు దారితీస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల మాదిరిగా, ఈశాన్య ప్రాంతం స్థిరమైన ప్రైవేటు మూలధన పెట్టుబడులను ఆకర్షించే స్థితి లేదు. అందుకు కారణం భౌగోళికంగా దూరం, సరైన కనెక్టివిటీ లేకపోవడం, పరిమితమైన వినియోగదారుల మార్కెట్, అడపాదడపా రాజకీయంగా, జాతిపరంగా తలెత్తే అశాంతి. పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మూలధనం వ్యయం... ఇక్కడి అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఏకైక ఆర్థిక శక్తిగా మారింది. అందువల్ల కేంద్రం ఖర్చులను నియంత్రించినా, ప్రాధాన్యతలలో మార్పులు చేసినా, ఈ ప్రాంతంపై ప్రభావితం చూపుతుంది. గత దశాబ్దంగా పలు మార్పులు వచ్చాయి. ప్రభుత్వం గణనీయంగా పెట్టుబడులు పెట్టడంతో ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీ మెరుగుపడింది. కొత్త రహదారులు, రైల్వే లింక్ లు, వంతెనలు, విమానాశ్రయాలు, ప్రయాణ సమయాన్ని తగ్గించాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలను మరింత సులభతరం చేశాయి. ప్రభుత్వం చేసిన ఈ పెట్టుబడులకు దీటుగా, ప్రైవేటు పెట్టుబడులు రాలేదు. ఇది ప్రభుత్వ అభివృద్ధి వ్యూహాలపై ప్రభావం చూపింది. సంస్థాగతంగా, ఆర్థిక సంస్కరణలు లేకుండా ప్రభుత్వం మూలధనం ఖర్చుచేసినంత మాత్రాన ఆర్థిక స్థితిగతులను మార్చలేవు. జిడిపి, అభివృద్ధి పరమైన అంచనాలపై ఉన్న అనిశ్చిత పరిస్థితి ఈశాన్య ప్రాంతాల ప్రణాళికలను మరింత క్లిష్టతరం చేస్తుంది. క్రమబద్ధీకరించిన జిడిపి కూడా ఆర్థికపరమైన వాస్తవాలను మార్చకపోవచ్చు. కానీ అది ఆర్థిక నిష్పత్తులు, లోటు బడ్జెట్, రుణపరమైన అంచనాలపై ప్రభావం చూపించి తీరుతుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడిన ఈ ప్రాంతానికి, అంచనాలలో స్వల్ప మార్పులు జరిగినా, నిధుల విడుదలలో జాప్యం జరిగినా, వ్యయంపై కోతలు పడినా రాష్ట్ర రుణాల సేకరణపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఇబ్బందులు అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను మరింత దిగజారుస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలకూ అడ్డంకిగా మారుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఔచిత్యం ప్రశ్నార్థకమైంది. జాతీయ స్థాయిలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌ఇలు) ప్రైవేటీకరణలో జాప్యం విపరీతమైన ఖర్చులకు దారితీస్తున్నది. ప్రభుత్వం మూలధనం పెట్టుబడి అంతగా లాభాలు రాని లేదా నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమల్లో చిక్కుబడిపోయి ఉంది. కాగా, మరోపక్క కొత్త ప్రాధాన్యాలకు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈశాన్య ప్రాంతాలకు సంబంధించినంత వరకూ ఇది అభివృద్ధిపరమైన చిక్కుముడిగానే ఉంది. భారతదేశంలో అత్యంత క్లిష్టమైన, హానికరమైన ప్రాంతాలలో ఈశాన్య ప్రాంతం ఒకటి. వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు, వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఈ ప్రాంతం లో విపరీతం. ఈ సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. ఆర్థికపరమైన పరిమితులతో ఈ పెట్టుబడులు రిస్క్‌లో పడ్డాయి. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలే ప్రభుత్వరంగ ఆస్తులకు నెలవుగా ఉన్నాయి. వీటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోగలదు. దీంతో నిరుపయోగంగా ఉన్నాయి. చమురు, గ్యాస్ క్షేత్రాలు జలవిద్యుత్ ప్రాజెక్టులు, తోటలు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పర్యాటకం రంగాలను సమర్థవంతంగా నిర్వహిస్తే, ఎక్కువ విలువైన ఉత్పత్తి సాధించవచ్చు. విచక్షణారహితమైన ప్రైవేటీకరణకు దూరంగా, వ్యూహాత్మకంగా, సామాజికపరంగా ప్రయోజనకరమైన విధానం ద్వారా ఆ ఉత్పత్తులను వినియోగించుకోవచ్చు.ఆ విధంగా వచ్చే ఆదాయాన్ని సాధారణ బడ్జెట్‌లో గుత్తగా కలిపేయకుండా, ప్రాంతీయ అభివృద్ధికి పారదర్శకంగా కేటాయించాలి. ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో ఎదురవుతున్న మరో అడ్డంకి పరిమితంగా ఉన్న పన్ను రూపంలో వచ్చే ఆదాయాలు. ఈశాన్య భారతంలో తలసరి ఆదాయం తక్కువ. పరిమితమైన పారిశ్రామికీకరణ, పెద్ద ఎత్తున ఆదాయ సమీకరణకు అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. కేంద్రంపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ ప్రాంతంలో రాష్ట్రాలు సొంతంగా పన్నుల ద్వారా ఆదాయాలను పెంచుకోవాలని ఆశించడం దురాశే. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రాజెక్టులు హేతుబద్ధత దీనిని రుజువు చేస్తోంది. ఈశాన్య ప్రాంతంలో స్వల్పంగా విస్తరించిన నిధుల కారణంగా ప్రాజెక్టులు ఫలితాలు సాధించడంలో విఫలమవుతున్నాయి. 2026- 27 బడ్జెట్ పథకాలను స్థిరీకరించేందుకు, పరిమితులను తగ్గించడానికి, ఖర్చులో రాష్ట్రాలకు మరింత సౌలభ్యాన్ని కల్పించేందుకు అవకాశాన్ని అందిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఇలాంటి విధానం వల్ల ఆయా ప్రభుత్వాలు వ్యయం విషయంలో తమ తమ ప్రాధాన్యాలను నిర్ణయించుకునేందుకు అనుమతినిస్తుంది. ఫలితంగా ఉద్యానవనం పంటలు, మత్స్య సంపద, వెదురు ఆధారిత పరిశ్రమలు, చేనేత, హస్తకళలు, పర్యావరణ పర్యాటకం వంటి రంగాల విస్తరణకు వీలవుతుంది. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో రుణాల లభ్యత నిస్సారంగా ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, గిరిజన సహకార సంస్థలకు కూడా రుణాలు లభించడం కష్టంగానే ఉంది. ప్రభుత్వరంగ సంస్థలే ఈ ప్రాంతంలో ఆర్థికరంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రిస్క్ తీసుకోడానికి వెనుకాడడం, శాఖ స్థాయిలో స్వయం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో రుణాలు పరిమితంగానే ఇస్తున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ల కోసం ఒత్తిడి తేవకుండా, క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచువచ్చు. క్రెడిట్ హామీలు, విధానపరమైన చర్యలు ఈ పరిస్థితిని మార్చగలవు. ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధిని సామాజిక స్థిరత్వం నుంచి విడదీయలేము. దీర్ఘకాలం పాటు సాగిన జాతి సంఘర్షణలు, వలసలు, పాలనాపరమైన సవాళ్లు, మార్కెట్‌కు అంతరాయం కలిగిస్తుండడంవల్ల పెట్టుబడులు తగ్గుతున్నాయి. సంస్థలు నమ్మకం కోల్పోతున్నాయి. జాతీయంగా జిడిపిలో వైద్య, ఆరోగ్య రంగాలకు, విద్యపైన చేసే వ్యయం మరీ హీనంగా ఉంది. ఇది దశాబ్దాలుగా నెలకొన్న ప్రాంతీయ అసమానతలు పరిష్కరించే అవకాశాలను తగ్గిస్తున్నది. అందువల్ల, 2026 -27 బడ్జెట్ ఖర్చుల పరిమాణాన్ని మాత్రమేకాక, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈశాన్య రాష్ట్రాలకు, వాతావరణ షాక్‌లను తట్టుకోగల మౌలిక సదుపాయాలు, చిన్నరైతులకు మద్దతు ఇచ్చే, ఈ వాతావరణ అనుకూల వ్యవసాయం, స్థానిక అవసరాలకు అనుగుణంగా మూలపెట్టుబడి పెట్టడం అవసరం. ఇందుకు ప్రభుత్వ సంస్థల విశ్వసనీయతను పునరుద్ధరించడం అవసరం. ఈశాన్య భారతానికి వివేకం, సమగ్రమైన, సమతుల్య వృద్ధి వ్యూహాం ఉండాలి. పథకాల హేతబద్ధీకరణ, ఎక్కువ సౌలభ్యంతో రాష్ట్రాలకు అవకాశం కల్పించడం, ఆర్థిక పరిమితులను సంస్కరణలకు అవకాశంగా మార్చగలవు, 2026- 27 బడ్జెట్ ఈ సవాల్‌ను ఎదుర్కొంటే ఈశాన్య ప్రాంతం జాతీయ ఆర్థిక ప్రణాళికలో క్రమశిక్షణ, సమతుల్యంతో కూడిన అభివృద్ధి నమూనాగా ఉద్భవిస్తుంది. చివరి వాక్యం. ఈశాన్యానికి అతిపెద్ద ప్రమాదం అనిశ్చితి కాదు. జడత్వం. ప్రాంతీయ ఆకాంక్షలు, సామాజిక సమైక్యతను దెబ్బ తీసి ఆర్థిక ఏకీకరణ జరగకుండా చూసుకోవడానికి నిర్ణయాత్మక, ప్రాంతీయపరమైన సున్నితమైన, విధానపరమైన చర్య తీసుకోవడమే ఏకైక మార్గం. గీతార్థ పాఠక్

మన తెలంగాణ 3 Feb 2026 5:50 am

బంగారం భద్రతా సాధనమా?

భారతీయ సామాజిక ఆర్థిక వ్యవస్థలో బంగారం అనేది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, అది ఒక సాంస్కృతిక మూలధనం, సామాజిక ప్రతిష్ఠా సూచిక, ఆర్థిక భద్రతా సాధనంగా బలంగా స్థిరపడిపోయింది. ముఖ్యంగా వివాహాలు, పండుగలు, కుటుంబ పరంపరలు వంటి సందర్భాల్లో బంగారం వినియోగం ఒక అనివార్య ఆచారంలా మారింది. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో చోటుచేసుకుంటున్న అసాధారణ పెరుగుదల, వ్యక్తిగత కుటుంబాల స్థాయిని మించి, సమగ్ర జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను మోపుతోంది. మధ్య తరగతి జీవితంలో బంగారం ధరల పెరుగుదల ఒక రకమైన వినియోగ ఒత్తిడిను సృష్టిస్తోంది. స్థిర ఆదాయం ఉన్నప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆరోగ్య వ్యయాలు, విద్యా ఖర్చులు వంటి అంశాల మధ్య బంగారం కొనుగోలు అనేది ఒక ఆర్థిక విరోధాభాసంగా మారింది. బంగారం కొనాలనే సామాజిక అంచనాలు ఒకవైపు, కొనలేని ఆర్థిక వాస్తవాలు మరోవైపు ఉండడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు తీవ్రమైన మానసిక, ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నాయి. బంగారం ధరల పెరుగుదల ప్రభావం అత్యంత తీవ్రంగా పడేది ఆడపిల్ల తల్లిదండ్రుల మీదనే. భారతీయ సమాజంలో ఇంకా పూర్తిగా నిర్మూలించబడని కట్న భావజాలం, సామాజిక పోటీ ధోరణి, పరువు ప్రతిష్ఠల పట్ల అతిగా ఆలోచించే మనస్తత్వం కలసి, ఒక ఆడపిల్ల తండ్రిని, తల్లిని ఒక సాంఘిక బాధ్యతా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. కుమార్తె వివాహం అనగానే ఆభరణాలు, కట్నం, ఆడంబర ఖర్చులు అనే భావన తల్లిదండ్రుల మనసులో సహజంగానే కలుగుతోంది. ఈ భారం కోసం తల్లిదండ్రులు తమ జీవితకాలపు పొదుపును ఖర్చు చేయడమే కాకుండా, బ్యాంకు రుణాలు, ప్రైవేట్ అప్పులు, బంగారం తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా వారు ఒక అప్పుల చట్రంలో చిక్కుకుని, వివాహం పూర్తయిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి ఆర్థిక భారాన్ని మోస్తూ జీవించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించే ఒక మానసిక ఒత్తిడి సంక్షోభంగా మారుతోంది. సంపన్న వర్గాల దృష్టిలో మాత్రం బంగారం ఒక హెడ్జింగ్ సాధనంగా పనిచేస్తోంది. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరత, స్టాక్ మార్కెట్ పతనం వంటి పరిస్థితుల్లో బంగారం ఒక భద్రమైన పెట్టుబడిగా మారుతుంది. ధరలు పెరిగే కొద్దీ వారి సంపద విలువ కూడా పెరుగుతూ, ఇది ఒక సంపద విస్తరణ యంత్రాంగంగా పనిచేస్తోంది. దీని వల్ల సామాజిక, ఆర్థిక, అసమానతలు మరింత లోతుగా పెరుగుతున్నాయి. సమగ్ర ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే, బంగారం ధరల పెరుగుదల దేశానికి తీవ్రమైన దిగుమతి భారాన్ని కలిగిస్తోంది. భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న బంగారం దిగుమతి దేశం కావడం వల్ల, ధరలు పెరిగినప్పుడు విదేశీ మారకద్రవ్య నిల్వలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది చెల్లింపుల సమతుల్యత లోటును పెంచి, రూపాయి విలువను బలహీనపరుస్తుంది. రూపాయి బలహీనపడిన కొద్దీ దిగుమతుల ఖర్చు మరింత పెరిగి, ద్రవ్యోల్బణం మరోసారి తీవ్రమవుతుంది. ఇది ఒక ఆర్థిక దుష్చక్రంగా మారుతుంది. ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే, బంగారంపై అధిక పెట్టుబడి పెట్టడం వల్ల దేశంలో ఉత్పాదక మూలధనం క్షీణిస్తోంది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడి పెట్టాల్సిన డబ్బు బంగారం రూపంలో నిల్వ అయి, ఆర్థిక వృద్ధి రేటును దీర్ఘకాలంలో మందగించే ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఇది దేశానికి ఒక అవుట్‌పుట్ గ్యాప్‌ను సృష్టిస్తోంది. ప్రభుత్వ వైఖరి విషయానికి వస్తే, బంగారం ధరలను నేరుగా నియంత్రించడం సాధ్యం కాకపోయినా, దిగుమతి సుంకాలు, జిఎస్‌టి, సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి విధానాల ద్వారా ప్రజలను భౌతిక బంగారం కొనుగోలు నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక రకమైన విధానాత్మక హస్తక్షేపం. కానీ సామాజిక మానసికత మారకుండా, కేవలం విధానాలతో సమస్య పరిష్కారం సాధ్యం కాదు. భవిష్యత్తులో బంగారం ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే, మధ్యతరగతి సమాజంలో ఆర్థిక అస్థిరత, వినియోగ సామర్థ్యంలో తగ్గుదల, అప్పుల భారంతో కూడిన జీవితం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలంలో ఇది ఒక తరతరాల పేదరిక చట్రంగా మారే ప్రమాదం ఉంది. నివారణ మార్గాలుగా ముందుగా సామాజిక దృక్పథంలో మార్పు అవసరం. కట్నం, ఆడంబర వివాహాలను సామాజికంగా నిరుత్సాహపరచాలి. బంగారాన్ని గౌరవానికి ప్రమాణంగా కాకుండా, ఒక సాధారణ పెట్టుబడి సాధనంగా మాత్రమే చూడాలి. ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ పథకాలు, సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. ప్రభుత్వం ఆర్థిక విద్యను పాఠశాల స్థాయి నుంచే ప్రవేశపెట్టి, ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచాలి. ముగింపుగా, బంగారం ధరల పెరుగుదల అనేది కేవలం మార్కెట్ పరిణామం కాదు, అది ఒక వ్యవస్థాత్మక ఆర్థిక హెచ్చరిక. దీన్ని సమాజం సమయానుకూలంగా గ్రహించకపోతే, మధ్యతరగతి మాత్రమే కాదు, జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా దీర్ఘకాలంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. బంగారం కంటే విలువైనది మన మానవ మూలధనం, ఆర్థిక అవగాహన, సామాజిక సంస్కరణలే అన్న సత్యాన్ని గుర్తించడమే నిజమైన పరిష్కారం.

మన తెలంగాణ 3 Feb 2026 5:50 am

తప్పు చేస్తే..ప్రశ్నించొద్దా?

మన తెలంగాణ / హైదరాబాద్ : తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి సిఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ బి. సు దర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని, ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, తెలంగాణ సమాజానికి అవమానం జరిగిందని ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేశారని, దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? అని ప్రశ్నించారు. ఆనాడు తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్టు చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తేనే ఏదో జరిగినట్లు రాద్దాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని, పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న వాళ్లు ఉద్యమకారులు ఎలా అవుతారన్నారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకుని హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేదన్నారు. ప్రజలే తప్పు చేశారని చెప్పడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం అని సిఎం ప్రశ్నించారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారికి ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారని, శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారని, ఇది ప్రజాస్వామ్య యుగమని, మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు దక్కడం సముచితం రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి దక్కడం సముచితమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తొలి తరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే, మలి తరంలో జైపాల్ రెడి, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తి నింపారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. 2019 లో నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన వారు రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డి గారిని తాను కోరానని గుర్తు చేశారు. ఆ సమయంలో తరం మారింది.. ప్రత్యక్ష రాజకీయాలకు తను దూరం అని, యువతరం రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డి తనను ప్రోత్సహించారని తెలిపారు. సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనని గౌరవించిన గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిబద్ధత మోడీని బయపెడుతుందని ఆయనను రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిగా బరిలో దించారన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించాలనే ఏక పార్టీ, ఏక వ్యక్తి పాలనకు వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి రావి నారాయణరెడ్డి పురస్కారం అందించడం సముచితమని ముఖ్యమంత్రి తెలిపారు. రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తాం అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆయన పోరాడారన్నారు. బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి అని తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి అని గుర్తు చేశారు. దేశంలో మొట్ట మొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారన్నారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్ట మొదటి పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారని సిఎం తెలిపారు. అరవై ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణరెడ్డి అని అన్నారు. ఈ కాలంలో ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత రావి నారాయణ రెడ్డి గారికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటామని సిఎం తెలిపారు. సచివాలయంలో అందరితో సమావేశమై తెలంగాణలో సముచిత గౌరవం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం రావి నారాయణ రెడ్డి : సుదర్శన్ రెడ్డి రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డును పొందడం ఎంతో గొప్పగా భావిస్తున్నానని అవార్డు గ్రహిత జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు, ఎప్పటికీ ఆదర్శప్రాయుడు, తెలంగాణ స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు. సొంత ఆస్తులను ప్రజలకు పంచిన మహానుభావడని అన్నారు. తాను న్యాయవాదిగా అందుకున్న ఎన్నో అవార్డులు , గౌరవాలు ఒక ఎత్తైతే రావి నారాయణ రెడ్డి స్మారక అవార్డు ఒక ఎత్తు అని సుదర్శన్ రెడ్డి అన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం ఆస్తులనే కాదు జీవితాన్నే త్యాగం చేసిన త్యాగధనుడు నారాయణ రెడ్డి అని అన్నారు. తెలంగాణ నగ్న సత్యం పత్రికను పరిశోదిస్తే రావి నారాయణ రెడ్డి గొప్పతనం తెలుస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిశోధనలు ఎంతో అవసరమని చెప్పారు. రాజ్యాగంపై ప్రమాణాలు చేసి విద్వేశ ప్రసంగాలతో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ఒక ముఖ్యమంత్రి ఒక వర్గం వారినుద్దేశించి ఐదు రూపాయలు ఇవ్వాల్సిన చోట నాలుగు రూపాయలు ఇవ్వాలని, సాధ్యమైతే మూడు రూపాయలు ఇవ్వాలని చెప్పడం, హేట్ స్పీచ్ ద్వారా ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అవరవీరుల ట్రస్ట్ అధ్యక్షులు చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి కె. ప్రతాప్ రెడ్డి, సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ, పల్లా వెంకట్ రెడ్డి, మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌సి ఎం. సత్యం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొ. కోదండరాం, సయ్యద్ అజీజ్ పాషా, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 3 Feb 2026 5:30 am

చిన్న జిల్లాలు.. భౌగోళిక సవరణలు

భారత రాజ్యాంగం మౌలిక లక్ష్యం ప్రజలకు సమర్థవంతమైన, న్యాయబద్ధమైన పాలనను అందించడమే. ఈ లక్ష్యసాధనలో అధికార వికేంద్రీకరణ ఒక కీలక సాధనగా రాజ్యాంగం గుర్తించింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే జిల్లాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగపరంగా అవకాశం కల్పించబడింది. అందువల్ల చిన్న జిల్లాల ఏర్పాటు అనేది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాకుండా, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణమైన చర్యగా భావించాలి. అయితే, జిల్లాల రూపకల్పనలో భౌగోళికంగా జరిగిన లోపాలు ప్రజలకు నిరంతర ఇబ్బందులు కలిగిస్తే, అవి రాజ్యాంగపరమైన పరిశీలనకు లోబడాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రభుత్వ చర్యలు యాదృచ్ఛికంగా (arbitrary) ఉండకూడదు. భౌగోళిక లోపాలతో రూపొందించిన జిల్లాల వల్ల కొందరు పౌరులు జిల్లా కేంద్రాలు, కోర్టులు, పరిపాలనా కార్యాలయాలకు చేరుకోవడానికి అధిక దూరాలు ప్రయాణించాల్సి వస్తే, అది పరిపాలనా అసమానతకు దారితీస్తుంది. ఉదాహరణకు, కూకట్‌పల్లి మండలం, శేరిలింగంపల్లి మండలాలు భౌగోళికంగా పక్కపక్కనే ఉన్నప్పటికీ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో వాటిని విడదీసి - కూకట్‌పల్లిని మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లాలోకి, శేరిలింగంపల్లిని రంగారెడ్డి జిల్లాలోకి చేర్చడం జరిగింది. ఈ రెండు మండలాలు గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగినవే. ప్రస్తుతం న్యాయస్థానాల పరిధి పరంగా రెండూ కూకట్‌పల్లి కోర్టులోనే కొనసాగుతున్నప్పటికీ, ఇది తాత్కాలిక ఏర్పాటే. భవిష్యత్తులో ఏ జిల్లా పరిధి ఆ జిల్లాకే చెందిన కోర్టు అనే చట్టబద్ధ సూత్రాన్ని అమలు చేస్తే, శేరిలింగంపల్లి మండలానికి సంబంధించిన న్యాయ వ్యవహారాలను రంగారెడ్డి జిల్లా పరిధిలోకి మార్చాల్సి వస్తుంది. అది అక్కడి ప్రజలకు భౌగోళికంగా మరింత దూరంగా మారే ప్రమాదం ఉంది. మరోవైపు, శేరిలింగంపల్లి పరిధిలోనే కొత్త కోర్టు నిర్మిస్తే, పక్కపక్కనే కోర్టులు ఏర్పడే పరిస్థితి రావచ్చు. ఇది ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం మోపడంతోపాటు, ఇతర జిల్లాల ప్రజల నుంచి అసమానత ఆరోపణలకు దారి తీసే అవకాశముంది. ఈ పరిస్థితి సమాన పరిపాలనా సౌకర్యాల హక్కును భంగం చేసే అంశంగా మారుతుంది. జీవన హక్కు - ఆర్టికల్ 21 దృక్పథం సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 కింద జీవన హక్కును కేవలం శారీరక జీవితం వరకు పరిమితం చేయలేదు. గౌరవప్రదమైన జీవనం, సులభమైన ప్రజాసేవలు, న్యాయానికి సులభ ప్రవేశం (Access to Justice) అన్నీ దీనిలో భాగమే. పరిపాలనా సరిహద్దుల లోపాల వల్ల ప్రజలు మౌలిక సేవలు, న్యాయ వ్యవస్థను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, అది వారి జీవన హక్కుపై పరోక్ష ప్రభావం చూపినట్లుగా భావించవచ్చు. కావున భౌగోళికంగా జరిగిన పరిపాలనా తప్పిదాలను సరిదిద్దడం ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యతగా మారుతుంది. డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ - సామాజిక న్యాయం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 38, 39 (Directive Principles of State Policy) సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించాల్సిన బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతున్నాయి. పరిపాలనా విభజనలు ప్రజలపై భారంగా మారినప్పుడు, అవి ఈ సూత్రాలకు విరుద్ధంగా మారతాయి. కాబట్టి జిల్లాల సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ అనేది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాకుండా, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యగా చూడాలి. జిల్లాలు తగ్గించాలా? లేక సరిదిద్దాలా? ఈ లోపాలకు పరిష్కారంగా జిల్లాల సంఖ్యను తగ్గించడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలం కాదు. అది అధికార వికేంద్రీకరణ లక్ష్యాన్ని బలహీనపరచి, పరిపాలనను మళ్లీ కేంద్రీకృతం చేసే ప్రమాదం కలిగి ఉంటుంది. రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణలు స్థానిక స్వయంపాలనను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడ్డాయి. చిన్న జిల్లాలు ఈ వికేంద్రీకరణ భావనకు సహాయకారిగా ఉంటాయి. అందువల్ల జిల్లాలను రద్దు చేయడం కాకుండా, భౌగోళిక లోపాలను గుర్తించి సరిదిద్దడమే సమంజసం. ఉదాహరణకు, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, బాచుపల్లి మండలాలను కలిపి ఒక కూకట్‌పల్లి సర్కిల్‌గా గుర్తించి ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం పరిపాలనా, న్యాయపరమైన దృష్టిలో సమతౌల్యమైన పరిష్కారంగా ఉంటుంది. ఇదే విషయాన్ని గతంలో కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం దృష్టికి రిప్రజెంటేషన్ ద్వారా తీసుకువెళ్లడం జరిగింది. న్యాయస్థానాల తీర్పుల ప్రకారం ప్రభుత్వ విధాన నిర్ణయాలు సమంజసం (reasonable), ప్రజాప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలి. ప్రజలకు నిరంతర ఇబ్బందులు కలిగించే భౌగోళిక లోపాలను సరిదిద్దకుండా కొనసాగించడం అసమంజసమైన పరిపాలనగా పరిగణించబడే అవకాశం ఉంది. అందువల్ల జిల్లాల భౌగోళిక పునర్వ్యవస్థీకరణ న్యాయపరంగా కూడా సమర్థించదగిన చర్య. చిన్న జిల్లాల ఏర్పాటు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణమైనదే. అయితే వాటి రూపకల్పనలో జరిగిన భౌగోళిక తప్పిదాలను సరిదిద్దకపోతే, అదే రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా మారే ప్రమాదం ఉంది. జిల్లాలను తగ్గించడం కాకుండా, సమానత్వం, న్యాయం, ప్రజాసౌలభ్యం అనే రాజ్యాంగ సూత్రాలను ఆధారంగా చేసుకొని భౌగోళిక సవరణలు చేయడమే సరైన, రాజ్యాంగబద్ధ పరిష్కారం. ఆర్షణపల్లి ప్రకాష్‌రావు 99484 39580

మన తెలంగాణ 3 Feb 2026 5:20 am

సర్వేలన్నీ మనకే అనుకూలం

మన తెలంగాణ/హైదరాబాద్:మున్సిపల్ ఎన్నిక ల్లో అన్ని సర్వేలూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉ న్నాయ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అ మెరికా నుంచి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల జూమ్ మీ టింగ్‌లో పాల్గొన్నా రు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమా ర్క, మంత్రులు కూడా జూమ్‌లో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా? అని ము ఖ్యమంత్రి ఈ మీటింగ్‌లో ప్రశ్నించారు. పిసిసి అ ధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ స్పంది స్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతూ స్క్రీనిం గ్ కమి టీ సిఫార్సు చేసిన జాబితా గురించి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు మేరకు అభ్యర్థులకు బి-ఫా రం ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇంకా పార్టీ ప్రచారం, ప్రజలకు ఇ వ్వాల్సిన హామీల గురించి కూడా చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై తాను వేర్వేరు నివేదికలు తెప్పించుకున్నానని, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి సమీపాన ఉన్న క్యాంపు కార్యాలయంలో ము న్సిపల్ ఎన్నికలపై సన్నాహక కమిటీ సమావేశం లో పాల్గొంటారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీ గా ఇదివరకే నియమించిన ఇన్‌ఛార్జి మంత్రులతో సమావేశం కానున్నారు. మీనాక్షి నటరాజన్, పిసి సి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు.

మన తెలంగాణ 3 Feb 2026 5:00 am

సిట్‌చాట్ ఆపండి

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినే త, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు సిట్ విచారణను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రంలోని అన్ని గ్రా మాలు, పట్టణాల్లో బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కదిలారని, తమకు మళ్లీ ఆనాటి ఉద్యమ రోజు లు గుర్తుకొచ్చాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. తమను తట్టిలేపిన సిఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ విచారణ కు నిరసిస్తూ స్వఛ్చందంగా నిరసనలు చేపట్టిన పార్టీ క్యాడర్‌కు ఈ సందర్భంగా కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ సిట్ విచారణకు రావాల్సిన అవసరం లేదని, అయినా చట్టం అంటే కెసిఆర్‌కు గౌరవం అని, అందుకే సిట్ విచారణకు హాజరయ్యారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, అప్పుడు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సమాచారం అలాగే వచ్చిందని అన్నారు. నందినగర్ నివాసంలో సోమవారం బిఆర్‌ఎస్ ముఖ్యనేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు చెబుతున్న అబద్ధాలు ఒక్కటొక్కటి తేలిపోతున్నాయని అన్నారు. మొదట వ్యాపారవేత్తలు, ఆ తర్వాత సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారని, ఇప్పుడు ఏమీ లేదని అంటున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకు లేదని స్వయంగా కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇకనైనా పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిపి సజ్జనార్ తీర్పు చెప్పడానికి ఆయన జడ్జి కాదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన అభియోగాలపై కోర్టులు తేల్చుతాయని అన్నారు. విచారణ దశలో ఉన్నప్పుడు సిపి సజ్జనార్ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆయన వద్ద ఆధారాలు ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదని పేర్కొన్నారు. పాలనా వైఫల్యం కనిపిస్తోంది రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మంత్రి వాహనంపై దాడి జరగడం మొదటిసారి అని పేర్కొన్నారు. కెసిఆర్ నందినగర్ వస్తే అధికారికంగా 900 మంది పోలీసులను పెట్టారని, అనధికారికంగా 2 వేల మంది పోలీసులు ఉంటారని చెప్పారు. హైదరాబాద్‌లో పట్టపగలే కాల్పులు, దోపిడీ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. సుల్తాన్ బజార్‌లో పట్టపగలే ఎటిఎం దగ్గర చోరి జరిగిందని, నల్లమల సాగర్‌తో నీళ్ల దోపిడి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బౌన్సర్లను పెట్టుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఎవరో తెలియక కేసు పెట్టినందుకే నిజాయితీపరుడైన సిఐ హాబీబుల్లా ఖాన్ బదిలీ చేశారని ఆరోపించారు. టీవీ సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించి, పాలనపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ కేసులో హరీష్‌రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ కొనసాగుతోందని, నల్లమలసాగర్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి పరిపాలన రావటం లేదని, తెలంగాణకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్లనని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళారని విమర్శించారు. సింగరేణి బొగ్గు కుంభకోణం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన సమాధానం లేదని అన్నారు.సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోరుతుంటే ఎందుకు వెనక్కిపోతున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శాఖాపరమైన కమిటీ వేసి చేతులు దులిపేసుకున్నారని, ఈ వ్యవహారంలో సృజన్‌రెడ్డి కాల్ డాటా బయటకు తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. బిఆర్‌ఎస్ నిలదీస్తుంటే దృష్టి మరల్చేందుకు సిట్‌ల పేరిట విచారణలు చేస్తున్నారని ఆరోపించారు. పైశాచిక ఆనందం కోసం కెసిఆర్‌ను అంతసేపు కూర్చోబెట్టారని, ప్రజలకు ఒక్కొక్కటి అర్థమవుతున్నాయని తెలిపారు. 60 సార్లు ఢిల్లీ వెళ్లిన సిఎం సాధించిందేంటి..? కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించారని కెటిఆర్ విమర్శించారు. ఎరువుల రాయితీ, ఆహార రాయితీతో పాటు స్వచ్ఛ భారత్‌కు నిధులు కూడా తగ్గించారని అన్నారు. వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, ఫార్మాకు హైదరాబాద్ కేంద్రం అయితే.. బయో ఫార్మా తయారీకి రూ.పది వేల కోట్లు కేటాయించి తెలంగాణకు రూ.10 కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం సున్నా అని విమర్శించారు. తెలంగాణకు బిజెపి ఇచ్చేది ఇదేనా..? అని నిలదీశారు. హై స్పీడ్ రైల్ కారిడార్ కేటాయించామని గొప్పగా చెబుతున్నారని, తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది..కాబట్టి కారిడార్ హైదరాబాద్ మీదుగా వెళ్లక తప్పదని తెలిపారు. తెలంగాణకు హై స్పీడ్ ట్రైన్లు ప్రత్యేకంగా ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదం అని కెటిఆర్ అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎన్ని మెటీరియలైజ్ అయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కేబినెట్‌లో ఉండే మంత్రి ఆ రాష్ట్ర సిఎంతో దావోస్ ఒప్పందం చేసుకున్నారని, అలాగే జూబ్లీహిల్స్‌లో ఉండే సిఎం రేవంత్‌రెడ్డి, మెగా కృష్ణారెడ్డి కూడా దావోస్‌లో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలవారీగా తమ పార్టీ నాయకత్వం అక్కడే పనిచేస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తమ పార్టీ నాయకులు, కేడర్ అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు. తాము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో...పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తమ నాయకుడిని విచారణ పేరిట వేధిస్తే ఊరుకుంటామా..? అని ప్రశ్నించారు. కెసిఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అస్థిత్వాన్ని ముట్టుకున్నట్టేనని బరాబర్ చెబుతున్నామని అన్నారు. తాము ఎవరికీ గులాములం కాదని తెలంగాణ ప్రజలే తమకు బాసులు అని తేల్చిచెప్పారు. కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని,ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

మన తెలంగాణ 3 Feb 2026 4:30 am

సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

మన తెలంగాణ/హైదరాబాద్ : సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యక ర్త శశిధర్ గౌడ్ (నల్లబాలు)పై రాష్ట్ర హైకో ర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సి ఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీ డియాలో బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కా ర్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు సదరు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్‌గా కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు సూచించింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలం గాణ ప్రభుత్వ తరఫు న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా గతంలో ప్రస్తావించారు. ఈ కేసును తాజాగా విచారించిన సుప్రీం న్యాయస్థానం. హైకోర్టు తీర్పు ను అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీలేదని స్పష్టం చేసింది.

మన తెలంగాణ 3 Feb 2026 3:30 am

హైదరాబాద్ ` బెంగళూరు ఏ 2 గంటలు

` హైస్పీడ్ కారిడార్‌తో పూర్తైతే ఘననీయంగా తగ్గనున్న ప్రయాణసమయం ` హైదరాబాద్ నుంచి చెన్నై, పుణె, బెంగళూరుకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి ` కేంద్ర రైల్వే …

జనం సాక్షి 3 Feb 2026 3:18 am

ఎవరిపైనా కక్షసాధింపు చర్యలుండవు

` ఫోన్ ట్యాపింగ్ దుశ్చర్యలు బయటపడాల్సిందే ` దోషులు ఎవరో తేల్చాల్సి ఉంది ` మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ …

జనం సాక్షి 3 Feb 2026 3:17 am

మళ్లీ పాతరోజులు గుర్తుకొస్తున్నాయి

` 60 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం సాధించిందేంటి? ` రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది:కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):కేసీఆర్‌కు సిట్ నోటీసులను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రంలోని అన్ని …

జనం సాక్షి 3 Feb 2026 3:15 am

సంక్షోభం నుంచి సంక్షేమంవైపు పరుగులు

` సమాచారశాఖ ఆధుకనీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి ` ప్రజా ప్రభుత్వ ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతోందని వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి): …

జనం సాక్షి 3 Feb 2026 3:13 am

న్యాయానికి అంకితమైన జీవితం…మహాయోధుడి గౌరవం

జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం నిబద్ధత గలవారికి రావి నారాయణరెడ్డి పురస్కారం నిజమైన గౌరవం మా ప్రభుత్వం ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తోంది …

జనం సాక్షి 3 Feb 2026 3:09 am

నల్లధనం వయా నకిలీ దందా

మనతెలంగాణ/హైదరాబాద్:వాణిజ్య పన్నుల శాఖలో ఫేక్ జిఎస్టీ రి జిస్ట్రేషన్‌లు హవాలాకు రాచమార్గంగా మారాయి. ఫేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్‌లు చేయించుకునే వారు లేని వ్యాపారాలను చూపించి వాటిల్లోకి హవాలారూపంలో నల్లధనాన్ని బదిలీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కొందరు సెంట్రల్, రాష్ట్ర జిఎస్టీ అధికారులు వత్తాసు పలుకు తున్నారని, కమీషన్‌లు తీసుకొని ఇలాంటి వ్యాపారులను కొందరు అధికారులు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. ఫేక్ జిఎస్టీని రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో కొందరు అక్రమార్కులు చూపించే ఆఫీసు అడ్రస్, బిల్లులు, లావాదేవీలు అంతా డొల్లవేనని వాటిపై నిఘా వేయాల్సిన అధికారు లు ముడుపులు తీసుకొని వారిని కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హవాలా ద్వారా కొట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఇందులో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, స్క్రాప్ బిజినెస్ చేసే వారితో పాటు పలు రంగాలకు చెందిన ఫేక్ వ్యాపారులు ఉన్నట్టుగా తెలిసింది. పస్తుతం జీఎస్టీలోని లోపాలను ఆసరాగా చేసుకొని సెంట్రల్, రాష్ట్ర జీఎస్టీ అధికారులను మచ్చిక చేసుకొని ఫేక్ రిజిస్ట్రేషన్‌లతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు ఇలాంటి డొల్ల కంపెనీలపై చర్యలు చేపట్టినా ఆ అధికారులపై కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చి రాజీ చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాదాపూర్, బేగంపేట్, పంజాగుట్ట, చార్మినార్, హైదరాబాద్ రూరల్, సరూర్‌నగర్ డివిజన్‌లలో ఫేక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లు అధికంగా చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఫేక్ రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీలు ఇలాంటి కేసుల నుంచి బయటపడడానికి ఎక్స్‌టెన్డ్ టర్నోవర్ పేరుతో ప్రభుత్వ ఆదాయానికి కుచ్చుటోపి పెడుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఒక అదనపు కమిషనర్ షాడో క మిషనర్‌గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తు తం కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీగా రఘునందన్ రావు వ్యవహరిస్తున్నారు. ఆయన కమిషనర్‌గా, ప్రిన్సిపల్ సెక్రెటరీగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించలేకపోవడంతో ఇదే అదనుగా ఒక అడిషనల్ కమిషనర్ ఉద్యోగులందరిపై పెత్తనం చెలాయిస్తున్నారని, తనకు నచ్చని వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆశాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి కమిషనర్ పోస్టులో మరో ఐఏఎస్‌ను నియమించాలని ఆ శాఖ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిఈఓకు 7 నెలల జీతం అడ్వాన్స్‌గా.... కొందరు ప్రైవేటు వ్యక్తులు (డిఈఓలుగా) పనిచేసే వారిపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినా వారినే మళ్లీ కొనసాగిస్తూ వారిని ముడుపులు తీసుకోవడానికి వినియోగించుకుంటున్నట్టుగా ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వం తొలగించిన డిఈఓల్లో కొందరు రీఫండ్ కేసులో ఉన్నారని, ఈ మధ్యే వారిని విధుల్లోకి తీసుకొని పాతదందాను అధికారులు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వీస్ మ్యాటర్‌లో పనిచేసే ఒక డిఈఓకు (ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి) ఏకంగా 7 నెలల జీతం అడ్వాన్స్‌గా ఒక అధికారి ఇప్పించారని ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సమయానికి రాక ఇబ్బంది పడుతుంటే, ఆయనకు మాత్రం 7 నెలల అడ్వాన్స్ జీతం ఇవ్వడంపై ఆ శాఖ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. ఇక, సి, డి సెక్షన్‌ల సూపరింటెండెంట్‌లపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినా వారిపై చర్య తీసుకోవడం లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. సి,డి సెక్షన్‌లో రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో ఈ సెక్షన్‌ల సూపరింటెండెంట్‌లు అందినకాడికి దండుకుంటున్నారని ఉన్నతాధికారులు సైతం వారిని వెనకేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరగకుండా అడ్డుకట్ట..... గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసిన అధికారులు వ్యాపారులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందడంతో ఈ ముడుపుల బాగోతంలో ఉన్నతాధికారులు, జేసిలు, కిందిస్థాయి అధికారుల పాత్రపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే, ఈ విచారణ జరగకుండా కొందరు ఉన్నతాధికారులు అడ్డుకోవడంతో పాటు ఈ కేసులో ఉన్న వారికి మంచి పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన కేసులో విజిలెన్స్ శాఖ సైతం విచారణ జరిపిందని త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందచేసే అవకాశం ఉందని తెలిసింది.

మన తెలంగాణ 3 Feb 2026 3:00 am

మంగళవారం రాశి ఫలాలు (03-02-2026)

మేషం సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిధునం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటకం చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు. కన్య కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. తుల కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ధనస్సు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. మకరం వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. కుంభం ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.  

మన తెలంగాణ 3 Feb 2026 12:20 am

ఈసీపై మమత యుద్ధం

. సీఈసీ అబద్ధాల కోరు… 58 లక్షల ఓట్లు తీసేస్తారా!. ఎసఐఆర్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. బంగా భవన్ వద్ద భద్రతా సిబ్బంది, మమత వాగ్వాదం. నలుపు దుస్తులు ధరించి సీఈసీని కలిసిన టీఎంసీ నేత న్యూదిల్లీ: దిల్లీలో ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ […] The post ఈసీపై మమత యుద్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:37 pm

కన్నతండ్రే కాలనాగై..!

ఎన్నికలలో పోటీకి అర్హత సాధించాలంటే కుమార్తెను అడ్డుతొలగించాలని ఆలోచించిన ప్రబుద్ధుడు. చివరకు కన్నబిడ్డను కడతేర్చాడు. కూతురిని నమ్మించి బయటకు తీసుకొచ్చిన తండ్రి.. కాలువలోకి తో సి దారుణంగా హతమార్చాడు. మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మీడియాకు వెల్లడించారు. జ నవరి 29న ఎడపల్లి మండలం ఎఆర్‌పి క్యాంపు శివారులోని నిజాంసాగర్ కెనాల్ (డి-46/8)లో ఆరేళ్ల గుర్తు తెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి, బోధన్ ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఫోటోను సామాజిక మాద్యమాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈక్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన పిసి-630 సుధీర్ తన వాట్సాప్ స్టేటస్‌లో ఉంచిన ఫోటోను మహారాష్ట్రలోని ముఖేడ్ గ్రామస్తులు గుర్తించి, పాప ప్రాచి కొండమంగలే అని పోలీసులకు సమాచారం అందించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలుకా కెరూర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగకు ముగ్గురు పిల్లలు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని అతను ఆశపడ్డాడు. నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు. దీనిపై ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి చర్చించిన పాండురంగ, తన ముగ్గురు పిల్లలలో ఒకరిని తక్కువ చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పథకం వేశాడు. ఒక బిడ్డను చంపేసి తప్పిపోయినట్టు నమ్మించాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకా రం... తండ్రి పాండురంగ తన పెద్ద కూతురు ప్రాచిని బైక్‌పై మాయమాటలు చెప్పి ఎడపల్లికి తీసుకువచ్చాడు. పాపను నిజాంసాగర్ కాలువలోకి తోసేసి పరారయ్యాడు. పోలీస్ దర్యాప్తులో గుట్టు రట్టుకావడంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 2 Feb 2026 11:32 pm

రోడ్డెక్కిన విద్యుత్ మీటర్ రీడర్లు

హామీల అమలుపై నిర్లక్ష్యం సరికాదు . బాబు, పవన్, లోకేశ్ తీరు దుర్మార్గం. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ‘కూటమి’. న్యాయం చేయకుంటే పోరాటాలతో బుద్ధి చెబుతాం: ఈశ్వరయ్య విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విద్యుత్ మీటర్ రీడర్స్ ‘చలో విజయవాడ’ నిరసన కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. ధŠర్నాచౌక్ వద్ద ఏర్పాటు […] The post రోడ్డెక్కిన విద్యుత్ మీటర్ రీడర్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:32 pm

విభజన హామీలకు తిలోదకాలు

. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్షu ప్రత్యేక హోదా ఊసేలేదు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కేంద్రం మౌనం. ఏపీని పట్టించుకోని కేంద్ర బడ్జెట్. దేశవ్యాప్తంగా సామాన్యుల బతుకుపోరుకు భరోసా కరువు. పన్ను పోటు యథాతథం. మాటల గారడీతో సరిపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విశాలాంధ్ర – సచివాలయం: కార్మికులు, కర్షకులతో పాటు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షి బడ్జెట్ తీవ్ర నిరాశే మిగిల్చింది. పెరిగిన నిత్యావసర […] The post విభజన హామీలకు తిలోదకాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:21 pm

పోలవరం… పొలికేక!

బాంబు పేలుళ్లతో గిరిపుత్రుల బెంబేలు . బీటలువారుతున్న ఇళ్లు… దెబ్బతింటున్న పంటలు. క్వారీ తవ్వకాల్లో నిబంధనలకు పాతర. మామూళ్ల మత్తులో అధికారులు, పాలకులు. కొరవడిన పర్యవేక్షణ… యథేచ్ఛగా తరలుతున్న నల్లబంగారం విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: రాష్ట్రంలో అనేక తర్జనభర్జనల తరువాత గిరిజన ప్రజానీకం కోరికను మన్నిస్తూ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లా వాసులు… మైనింగ్ మాఫియా దెబ్బకు పొలికేకలు పెడుతున్నారు. నిత్యం బాంబు పేలుళ్లకు భయభ్రాంతులవుతున్నారు. కిలోమీటర్ల మేర వచ్చిపడుతున్న రాళ్లకు గాయపడుతున్నారు. ఇళ్లు […] The post పోలవరం… పొలికేక! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:17 pm

ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. విమానం ఎడమ ఇంధన నియంత్రణ స్విచ్ రెండు సార్లు రన్ స్థానంలో నిలవకుండా, ఇంజన్ స్టార్టప్ సమయంలో కటాఫ్ కు మారడంతో దానిని నిలిపివేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రతినిధి సోమవారం నాడు తెలిపారు. ఎయిర్ ఇండియా 132 విమానం హీత్రో విమానాశ్రయం నుంచి బెంగళూరుకు సోమవారం వచ్చింది.బోయింగ్ 787-8 విమానం లో ఇంధన నియంత్రణ స్విచ్ లో లోపం ఉందని ఎయిర్ ఇండియా పైలెట్లలో ఒకరు నివేదించారని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాథమిక వివేదిక అందుకున్న తర్వాత ,ఆ విమానాన్ని నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. పైలెట్ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని,ప్రాధాన్యతా ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించవలసిందిగా , విమానం తయారీ దారు అయిన బోయింగ్ ను కోరినట్లు , ఆ సంస్థ ఎయిర్ ఇండియాతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.ఇంధనం స్విచ్ కు సంబంధించి తలెత్తిన సమస్యను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ అథారిటీ (డిజిసిఏ) తెలియజేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికుల భద్రతే సంస్థ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొంది.2025 జూన్ లో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ కుప్పకూలి 250 మందివరకూ మరమించిన తర్వాత టాటా యాజమాన్యం అన్ని బోయింగ్ 787 విమానాలలో ఇంధన నియంత్రణ స్విచ్ లను కచ్చితంగా తనిఖీ చేసి, లోపాలు లేవని నిర్థారించింది.

మన తెలంగాణ 2 Feb 2026 11:13 pm

68,000 మంది ఉద్యోగుల జీతాలను నిలిపివేసిన యోగి సర్కార్

ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 68,236 మంది రాష్ట్ర ఉద్యోగుల జీతాలను నిలిపివేయడం సంచలనం కల్గించింది. ఇది వివిధ విభాగాలలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. జనవరి 31 లోగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు అంతా, తమతమ ఆస్తుల వివరాలను ప్రకటించాలన్న ప్రభుత్వం ఆదేశాన్ని పాటించక పోవడంతో ఈ చర్య తీసుకున్నారని తెలిసింది.ఉత్తరప్రదేశ్ లో మొత్తం 8,66,261 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జనవరి 31లోగా మానస్ సంవిదా పోర్టల్ లో ఉద్యోగులు అంతా తమ స్థిరాస్తులు, చరాస్తుల వివరాలను అప్ లోడ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిబంధనలు పాటించని వారి జీతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జీతాలు నిలిచి పోయిన ఉద్యోగులలో, అత్యధిక సంఖ్యలో క్లాస్ 3 కు చెందిన వారే 34,926 మంది ఉన్నారు. ఇతరులలో క్లాస్ 2 ఉద్యోగులు 724 మంది, క్లాస్ 1 ఉద్యోగులు 2,628 ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 11:10 pm

మయన్మార్ గ్యాంగ్‌లో మరో నలుగురికి చైనాలో మరణశిక్ష

తైపే( తైవాన్) : ఆన్‌లైన్ మోసాలతోపాటు హత్యలు, టెలికాం మోసాలు, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్న మయన్మార్‌కు చెందిన గ్యాంగ్ లోని మరో నలుగురికి చైనాలో మరణశిక్ష అమలైంది. ఆరుగురు చైనీయుల మరణానికి వీరు కారణమైనట్టు తేలడంతో గత ఏడాది నవంబరులో కోర్టు మరణ శిక్ష విధించింది.మయన్మార్‌లో స్కామ్ సెంటర్లు నడుపుతున్న 11 మంది సభ్యుల నేర ముఠాకు మరణశిక్ష అమలు చేసినట్టు గతవారం ప్రకటించింది. స్కామ్ సెంటర్లు, కేసినోలు నడుపుతున్న బై కుటుంబానికి చెందిన వారితో సహా ఐదుగురికి షెంజెన్ కోర్టు గత నవంబరులో మరణశిక్ష విధించగా, వారిలో ఒకరు బై సోచింగ్‌గ్రూపు లీడర్ శిక్ష పడిన తరువాత అస్వస్థుడై మృతి చెందాడు. ఈ మాఫియా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకోడానికి ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలు తీసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యం లోనే ఆ ముఠా లోని నలుగురికి మరణశిక్ష అమలైనట్టు వెలుగులోకి వచ్చింది. 

మన తెలంగాణ 2 Feb 2026 10:36 pm

అణు ఒప్పందంపై ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ హెచ్చరిక

వాషింగ్టన్: అణు కార్యక్రమంపై ఇరాన్ ఒప్పందానికి రాకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో తాము తేల్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ఖమేనీ హెచ్చరించారు. తమపై ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ గట్టిగా సమాధానం చెబుతుందన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించి రెండు రోజుల్లో ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నానని, ఒకవేళ కుదరకపోతే ఖమేనీ చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు అక్కడ చాలా దగ్గరలో ఉన్నాయని ట్రంప్ హెచ్చరించారు.

మన తెలంగాణ 2 Feb 2026 10:31 pm

తాడిచర్ల 1 బొగ్గు గనులు తెలంగాణకే

తాడిచర్ల -1 బొగ్గు గునుల కేటాయింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ గనులను తెలంగాణకు కేటాయించామని సోమవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థకు కేటాయించామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ అడిగి ప్రశ్నకు బదులిచ్చిన కిషన్ రెడ్డి 2019 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆమోదం తర్వాత 2020 జూన్ నుంచి గనుల కేటాయింపుల ప్రక్రియ మారిందని తెలిపారు. వ్యాపారానికి వాడే గనులను వేలంలో కేటాయించాలని కమిటీ సూచించిందని, ప్రత్యేక, తప్పని పరిస్థితుల్లోనే బొగ్గు శాఖ నేరుగా కేటాయించాలని కమిటీ తెలిపిందన్నారు. తాడిచర్ల-2 గనులు ఇంకా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు. కాగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాడిచర్ల కోల్ బ్లాక్ ను జెన్‌కోకు కేటాయించారు. దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకువస్తే వారితో ‘మేం పనిచేయలేమని బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అని ఇటీవల కిషన్ రెడ్డి విమర్శించారు. నేడు సుమారు రూ.47వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడింది. దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీకి కూడా ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవని వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 2 Feb 2026 10:27 pm

వార్మప్ మ్యాచ్‌.. ఇండియా-ఎపై పోరాడి ఓడిన అమెరికా

నవీ ముంబై: అమెరికాతో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇండియాఎ టీమ్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టి20 వరల్డ్‌కప్ సన్నాహాల్లో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ 55 బంతుల్లోనే (104) పరుగులు చేశాడు. కెప్టెన్ ఆయుష్ బడోని 26 బంతుల్లో అజేయంగా (60), తిలక్‌వర్మ 24 బంతుల్లో 38 పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది.

మన తెలంగాణ 2 Feb 2026 9:55 pm

వెంకీ అట్లూరితో ‘విశ్వనాథం అండ్ సన్స్’?

విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి... సూర్యతో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ‘ఫార్చ్యూన్ ఫోర్’ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. ఈ చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పేరు వినగానే త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో సూర్య ఒక నడి వయస్కుడిగా కనిపిస్తారని, కేరళ బ్యూటీ మమిత బైజు ఇందులో కథానాయికగా నటిస్తోందని సమాచారం. వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథ చాలా ఆసక్తికరంగా, వైవిధ్యంగా ఉండబోతోందని సినీ వర్గాల టాక్. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు, ఈ ఫ్యామిలీ డ్రామా మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సూర్య చేతిలో ‘కరుప్పు’ వంటి యాక్షన్ సినిమాలు ఉన్నప్పటికీ, వెంకీ అట్లూరి స్టైల్ లో రాబోతున్న ఈ సినిమాపైనే ట్రేడ్ వర్గాల్లో ఎక్కువ ఆశలు ఉన్నాయి. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ ‘విశ్వనాథం అండ్ సన్స్’ టైటిల్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 9:45 pm

రాజ్యసభలో కృత్రిమ కాళ్ల కలకలం.. బిజెపి ఎంపి నిరసన

న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కేరళకు చెందిన ఎంపి తమ కృత్రిమ కాళ్లను ప్రదర్శించడం సంచలనానికి దారితీసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ దశలో ఈ సభ్యుడు సదానందన్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలతో సిపిఎం సభ్యులు మండిపడ్డారు. ఆయనను అడ్డుకున్నారు. సభ్యుడి తీరుపై సిపిఎం ఎంపిలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఇంతకు ముందు స్కూల్ టీచర్‌గా ఉండి, తరువాత రాజకీయాల్లోకి వచ్చిన మాస్టర్ సదానందన్ తమ ప్రసంగంలో మూడు దశాబ్దాల క్రితం తనపై కేరళలో సిపిఎం కార్యకర్తలు జరిపిన దాడిని ప్రస్తావించారు. తాను ఇంటికి వెళ్లుతుండగా తనపై సిపిఎం వారు దాడికి దిగి, కిందపడేసి కాళ్లు నరికేశారని, ఇప్పుడు కృత్రిమ కాళ్లతో తిరుగుతున్నానని, వాటిని చూపారు. దేశం ఈ ప్రజలకు కేరళలో ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిందనేది తెలియాల్సి ఉందని చెప్పారు. 31 సంవత్సరాల క్రితం తనపై దాడి జరిగిన విషయం అంతా గుర్తించాలని, ప్రజాస్వామ్యం గురించి నినాదాలకు దిగేవారి అసలు స్వరూపం తనతోనే తెలిసి తీరాలని చెప్పారు. దీనికి సిపిఎం అడ్డుతగిలింది. తాను నిలబడలేకపోతున్నానని, కూర్చుని మాట్లాడుతున్నానని తెలిపారు. టేబుల్‌పై తన ఊతపు కాళ్ల జతను ఉంచారు. వీటిని చూసి, కేరళలో జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలని కోరారు. దీనిపై సిపిఎం నేత జాన్ బ్రిట్టాస్ స్పందించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభలో ఇతర వస్తువులు ప్రదర్శించడం సభా వ్యతిరేకమని నిబంధనలు చెపుతున్నాయి. దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని బ్రిట్టాస్ విమర్శించారు. దీనితో ఆయనకు, బిజెపి నామినేటెడ్ ఎంపికి మధ్య వ్యాగ్యుద్ధం సాగింది. ఈ దశలో సభాధ్యక్షులు సిపి రాధాకృష్ణన్ కలుగచేసుకుని సభ్యులు ఎవరైనా ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలిగించాల్సి ఉందని రాజ్యసభ నేత జెపి నడ్డా డిమాండ్ చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కేరళలో అధికార వామపక్ష దౌర్జన్యాల విషయం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ దశలో బిజెపి ప్రస్తావనకు తీసుకువచ్చింది. 

మన తెలంగాణ 2 Feb 2026 9:36 pm

మాజీ సిఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలి

న్యూఢిల్లీ : తమిళనాడు మాజీ సిఎం జయలలితకు భారత రత్న బిరుదు ప్రదాని చేయాలని ఆ పార్టీ ఎంపీ రాజ్యసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ఎఐఎడిఎంకె ఎంపి ఎం ధనపాల్ లేవదీశారు. ఆమె తన పాలనా కాలంలో అమ్మా కాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, విద్యార్థులకు ఉచిత లాప్‌టాప్‌లు, సైకిళ్లు పంపిణీ చేయించారని, మిక్సర్లు, గ్రైండర్లు వంటి గృహోపకరణాలను సబ్సిడీపై సరఫరా చేయించారని, మొత్తం మీద ఆమె సంక్షేమ పథకాలకు తల్లి వంటివారని ఎంపీ వివరించారు. ఈ నేపథ్యంలో ఆమెకు భారతరత్న బిరుదు ప్రదానం చేయడమే సరైన నివాళి అని సూచించారు. ఆప్ ఎంపీ రాజీందర్ గుప్తా జిఎస్‌టి కౌన్సిల్ రీతిలో నేషనల్ ఫీస్కూల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ఎంపి కె లక్ష్మణ్ అన్ని రాష్ట్రాల్లో, దిగువ కోర్టుల్లో జడ్జిల నియామకానికి వీలుగా ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసులను ఏర్పాటు చేయాలని సూచించారు. 

మన తెలంగాణ 2 Feb 2026 9:26 pm

ఇందూర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం

అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి.. ఐక్యతతో

ప్రభ న్యూస్ 2 Feb 2026 9:25 pm

రేవంత్‌రెడ్డి హార్వర్డ్‌లో చదువుకున్నా..తన వెనకటి గుణం మార్చుకోలేదు: హరీష్‌రావు

హార్వర్డ్‌లో చదువుకున్నా సిఎం రేవంత్‌రెడ్డి గుణం మార్చుకోలేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనేత హరీష్‌రావు విమర్శించారు. రవి నారాయణరెడ్డి పురస్కార ప్రదాన కార్యక్రమంలో కెసిఆర్‌పై సిఎం చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా వెళ్లి హార్వర్డ్‌లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని అన్నారు. కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కెసిఆర్ జాతి పితనే అని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న రేవంత్‌రెడ్డికి కెసిఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది..? అని ప్రశ్నించారు. ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన ఆయనకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా..? అని నిలదీశారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా..అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న ఆయన అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా...లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన ఆయనకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి...ఎలా అర్థం అవుతాయి..? అంటూ ప్రశ్నలు సంధించారు. రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ వెళ్ళినా, అంతరిక్షం వెళ్ళినా ఆయన బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టం అని హరీష్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మన తెలంగాణ 2 Feb 2026 9:12 pm

గోనె సంచిలో వ్యక్తి మృతదేహం

కామారెడ్డి పట్టణంలో సంచిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. ముక్కలు ముక్కలు చేసిన సగం మృతదేహాన్ని దుండగులు మూటగట్టి పడేశారు. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి సమీపంలోని చెత్త కుప్పలో కాగితాలు ఏరుకునే వారికి గోనె సంచిలో నుంచి కాళ్లు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని గోనె సంచిని తెరిచి పరిశీలించగా తల నుంచి నడుం భాగం వరకు లేకుండా నడుం నుంచి కాళ్ల వరకు మాత్రమే ఉన్న మృతదేహం లభించింది. మృతదేహంలోని మిగతా భాగం కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహం సగం మాత్రమే ఉండడంతో మృతుడు ఎవరో గుర్తించడం కష్టంగా మారిందన్నారు. రెండు మూడు రోజుల క్రితమే హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి గోనె సంచిలో కట్టి ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:57 pm

మ్యూచువల్ ఫండ్స్‌ ఎలా ఎంచుకోవాలి? ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు

మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి? రేటింగ్స్, అసెట్ అలొకేషన్, పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ను ఎలా విశ్లేషించాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు, మీ సంపదను తెలివిగా పెంచుకోవడం. సరైన ఫండ్‌ను ఎంచుకోవడానికి రేటింగ్స్ మాత్రమే సరిపోవు, అసెట్ అలొకేషన్, పోర్ట్‌ఫోలియో విశ్లేషణ కూడా చాలా ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్స్ – ఇవి ఎంతవరకు నమ్మదగినవి? మ్యూచువల్ ఫండ్ రేటింగ్స్ అనేది ‘Value Research‘ లేదా ‘Morningstar’ […] The post మ్యూచువల్ ఫండ్స్‌ ఎలా ఎంచుకోవాలి? ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 2 Feb 2026 8:50 pm

అవినీతి రుజువు.. బంగ్లా మాజీ ప్రధానికి పదేళ్ల జైలు శిక్ష

ఢాకా: రాజుక్ న్యూటౌన్ హౌసింగ్ అనే ప్రభుత్వ ప్రాజెక్టు లోని ప్లాట్ల కేటాయింపులో అవినీతి జరిగినట్టు రుజువు కావడంతో రెండు అవినీతి కేసుల్లో మాజీ ప్రధాని 79 ఏళ్ల షేక్ హసీనాకు పదేళ్లు జైలు శిక్ష పడింది. హసీనా తన అధికారిక పలుకుబడిని ఉపయోగించి తన మేనకోడలు, బ్రిటన్ లేబర్ ఎంపీ , మాజీ బ్రిటిష్ మంత్రి తులిప్ సిద్దిక్ సహా ఇతరులకు అక్రమంగా ప్లాట్లను కేటాయించారని ఢాకా స్పెషల్ జడ్జి కోర్టు ధ్రువీకరించింది. రాజధాని ఢాకాకు శివారులో పుర్బచోల్‌లో రాజుక్ న్యూటౌన్ హౌసింగ్ ప్రాజెక్టు ఉంది. జడ్జి రాబిల్ ఆలమ్ హసీనాతోపాటు ఆమె ఇద్దరు మేనకోడళ్లు, మేనల్లుడుకు వేర్వేరు జైలుశిక్షలు విధించారు. సిద్దిక్ సోదరి అజమన్ సిద్దిక్, సోదరుడు రద్వాన్ ముజిబ్‌సిద్దిక్ బాబీలకు ఏడేళ్లు శిక్ష విధించారు. మిగతా నిందితుల్లో మాజీ హౌసింగ్ జూనియర్ మంత్రి , మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి మాజీ రాజుక్ చైర్మన్ , అధికారులకు ఐదేళ్లు వంతున శిక్ష విధించారు. ఈ కేసులో సరెండర్ అయిన రాజుక్ సభ్యుడు ఖుర్షీద్ ఆలమ్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. నిందితులు అందరికీ లక్ష జరిమానా విధించారు. జరిమానా కట్టకుంటే అదనంగా ఆర్నెళ్లు జైలు జీవితాన్ని అనుభవించాలి. 

మన తెలంగాణ 2 Feb 2026 8:49 pm

సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ‘ ట్రైలర్ వచ్చేసింది..

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ‘. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ‘ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కపుల్ ఫ్రెండ్లీ‘ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ “సంతోష్ శోభన్ స్క్రిప్ట్ చదివిన వెంటనే ఈ మూవీ చేద్దామని ఓకే చేశారు. అలా ‘కపుల్ ఫ్రెండ్లీ‘ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నిజాయితీతో కూడిన ప్రయత్నం చేశారనే ఫీల్ అందరిలో తప్పకుండా కలుగుతుంది. నేను ఈ కథ రాసినప్పుడు శివ, మిత్రతో పాటు కథ జరిగే చెన్నై నగరాన్ని కూడా ఒక పాత్రలా అనుకున్నాను”,అని అన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “కపుల్ ఫ్రెండ్లీ‘ సినిమా మనసుకు హత్తుకుంది. సంతోష్ శోభన్ సినిమా అంతా అద్భుతంగా నటించారు. మానస వారణాసి తెలుగమ్మాయి. ఈ మూవీలో బాగా నటించింది. మనం ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటాం. కానీ ఇదొక విభిన్నమైన ప్రేమ కథ. ‘కపుల్ ఫ్రెండ్లీ‘ బ్లాక్ బస్టర్ అవుతుంది”అని పేర్కొన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “ఈ కథ ఇరవై ఏళ్ల పాటు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశాను. శివ అనే క్యారెక్టర్ కు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తా. ఇది నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మానస వారణాసి, కో ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు పాల్గొన్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:44 pm

తప్పతాగి నడివీధిలో భార్యను చితకబాదిన కానిస్టేబుల్

ప్రజల మాన ప్రాణాలకు రక్షణనివ్వాల్సిన పోలీసే తప్పతాగి నడివీధిలో భార్యను చితకబాదిన వైనం ఆ శాఖ పరువును గంగలో కలిపింది. బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్నానన్న విషయాన్ని విస్మరించి అర్థనగ్నంగా వీధుల్లో సంచరించన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. ఒక పోలీస్ హల్‌చల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. భార్యను వీధిలోకి లాక్కొచ్చి విచక్షణారహితంగా బాదిన వైనం పట్ల కాలనీ వాసులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ రవిప్రసాద్ చర్యలను స్థానికులు  చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో  హేయమైన చర్య బహిర్గతమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ రోడ్ నెంబర్ 14లో నివాసముంటున్న కానిస్టేబుల్ రవిప్రసాద్ తప్పతాగి అర్దనగ్నంగా వీధిలో తిరుగుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. తాగిన మైకంలో.. భార్యను ఇంటి నుండి బయటకు లాక్కొచ్చి అమానూషంగా కొట్టడంతో.. తల్లి చంకలో వున్న చిన్నారి కేకలు విని స్థానికులు కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు. అప్పటికే కానిస్టేబుల్ విచక్షణారహితంగా భార్యను కొడుతున్న దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. కానిస్టేబుల్ రవిప్రసాద్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. రక్షకభటుడే సంస్కారహీనంగా ప్రవర్తించడం పట్ల బస్తీ మహిళలు ఆగ్రహాం వ్యక్తం చేసారు. రవిప్రసాద్ చర్య పోలీస్ శాఖ పరువు తీసిందని పలువురు దుయ్యబట్టారు. రవిప్రసాద్ వ్యవహారించిన తీరువల్ల తాము భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు భయందోళన వ్యక్తం చేసారు. కానిస్టేబుల్ అతి ప్రవర్తనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని.. ప్రజలలో పోలీస్ శాఖకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని స్థానికులు కోరారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:43 pm

‘ సర్ ’ బాధిత కుటుంబాలతో CECని కలిసిన మమత

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి చీఫ్ మమతాబెనర్జీ, “సర్‌”( ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) బాధితులైన కుటుంబాలు, పార్టీ నాయకులతో కలిసి చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను సోమవారం కలుసుకున్నారు. గతవారం సిఇసి కుమార్ సోమవారం కలుసుకోవడానికి బెనర్జీకి సమయం కల్పించారు. ఈమేరకు ఆదివారం దేశ రాజధానికి మమతాబెనర్జీ చేరుకున్నారు. ఆమె వెంట తృణమూల్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, అడ్వకేట్ కూడా అయిన కల్యాణ్ బెనర్జీ ఉన్నారు. సోమవారం ఉదయం బెంగాల్ నుంచి ఎస్‌ఐఆర్ బాధితులు తమ సమస్యలను ఎలెక్షన్ కమిషన్‌కు వివరించడానికి వచ్చారని, కానీ వారికి బెదిరింపులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంగ భవన్ ఆవరణలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. సర్ బాధితులైన దాదాపు 50 కుటుంబాలు పశ్చిమబెంగాల్ నుంచి ఢిల్లీకి వచ్చారు. 

మన తెలంగాణ 2 Feb 2026 8:35 pm

కొత్వాల్ చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం కెసి తాండలో చోటుచేసుకుంది. మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం కెసి తాండకు చెందిన జాటావత్ రిషి (6), జాటావత్ బద్రీనాథ్ (8) ఆదివారం సెలవు కావడంతో గ్రామంలో ఆడుకునేందుకు ఇంటి నుండి వెళ్లారు. చీకటి పడినా ఇంటికి చేరకపోవడంతో కుటుంబీకులు మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆడుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని కోత్వాల్ చెరువులో పడిపోయి ఉంటారన్న అనుమానంతో చెరువులో పోలీసు రెస్కూ టీం గాలింపు మొదలు పెట్టింది. ఆదివారం రాత్రి నుండి గాలింపు నిర్విహించి.. సోమవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:32 pm

సమయస్ఫూర్తికి పురస్కారం.

సమయస్ఫూర్తికి పురస్కారం. దమ్మపేట , ఆంధ్రప్రభ : సామాజిక బాధ్యతను చాటుతూ,సమయస్ఫూర్తితో వ్యవహరించి

ప్రభ న్యూస్ 2 Feb 2026 8:30 pm

సంజుకు కష్ట కాలం.. టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో చోటు దక్కేనా?

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో స్టార్ ఆటగాడు సంజు శాంసన్ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. ఐదు మ్యాచుల్లో ఆడే ఛాన్స్ దొరికిన ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 20 పరుగుల మార్క్‌ను అందుకోలేక పోయాడు. వరుస అవకాశాలు లభించినా వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఘోర వైఫల్యం చవిచూశాడు. ఇలాంటి స్థితిలో త్వరలో జరిగే టి20 ప్రపంచకప్ తుది జట్టులో అతనికి ఛాన్స్ దొరుకుతుందా అంటే కష్టమేనని సమాధానం వస్తోంది. అందివచ్చిన అవకాశాలు చేజార్చుకున్న సంజు జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గాయం నుంచి కోలుకోవడంతో సంజు కష్టాలు మరింత పెరిగాయి. సంజు కంటే తిలక్ వర్మకే తుది జట్టులో ఆడించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సంజు బెంచ్‌కే పరిమితం కాక తప్పదు.

మన తెలంగాణ 2 Feb 2026 8:26 pm

60 సార్లు ఢిల్లీ వెళ్లిన సిఎం సాధించిందేంటి..?: కెటిఆర్

కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించారని కెటిఆర్ విమర్శించారు. ఎరువుల రాయితీ, ఆహార రాయితీతో పాటు స్వచ్ఛ భారత్‌కు నిధులు కూడా తగ్గించారని అన్నారు. వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, ఫార్మాకు హైదరాబాద్ కేంద్రం అయితే.. బయో ఫార్మా తయారీకి రూ.పది వేల కోట్లు కేటాయించి తెలంగాణకు రూ.10 కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం సున్నా అని విమర్శించారు. తెలంగాణకు బిజెపి ఇచ్చేది ఇదేనా..? అని నిలదీశారు. హై స్పీడ్ రైల్ కారిడార్ కేటాయించామని గొప్పగా చెబుతున్నారని, తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది..కాబట్టి కారిడార్ హైదరాబాద్ మీదుగా వెళ్లక తప్పదని తెలిపారు. తెలంగాణకు హై స్పీడ్ ట్రైన్లు ప్రత్యేకంగా ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదం అని కెటిఆర్ అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎన్ని మెటీరియలైజ్ అయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కేబినెట్‌లో ఉండే మంత్రి ఆ రాష్ట్ర సిఎంతో దావోస్ ఒప్పందం చేసుకున్నారని, అలాగే జూబ్లీహిల్స్‌లో ఉండే సిఎం రేవంత్‌రెడ్డి, మెగా కృష్ణారెడ్డి కూడా దావోస్‌లో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:23 pm

కోర్టు తేల్చకముందే ఇల్లీగల్ అని ఎలా అంటారు..?: హరీష్ రావు

 ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చీఫ్ విసి సజ్జనార్ తీరుపై బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వకముందే ఫోన్ ట్యాపింగ్‌ను ఇల్లీగల్ అని అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ఈ మేరకు ఆదివారం మాజీ సిఎం కెసిఆర్ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా హరీష్ రావు ట్వీట్ చేశారు. సిట్ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టబద్ధంగా నిలవదని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఒక ఆరోపణ నేరమని తేల్చాల్సింది న్యాయస్థానం మాత్రమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, నిందితుడు నిరపరాధి అనే భావన ప్రాథమిక సూత్రం అని, దీనిని విస్మరించరాదని అన్నారు. దర్యాప్తు చేయడం మాత్రమే పోలీసుల విధి అని, విచారణ దశలోనే ఒక చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించడానికి వారేమీ న్యాయమూర్తులు కాదని పేర్కొన్నారు. ఒక ఫోన్ సంభాషణను రహస్యంగా వినడం చట్టబద్ధమా..కాదా..? అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలకు లోబడి ఉంటుందని వివరించారు.అలాగే, పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిందా..లేదా...? అన్నది న్యాయ సమీక్ష ద్వారానే తేలుతుందని, పోలీసుల అధికారిక సందేశాల ద్వారా కాదని అన్నారు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్(అక్రమ ఫోన్ ట్యాపింగ్) అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ద్వారా, సిట్ చీఫ్ దర్యాప్తు ఫలితంపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. ఆయన ప్రవర్తన తను నిర్వహిస్తున్న పదవికి తగదని, సీనియర్ అధికారులు పాటించాల్సిన నిష్పాక్షికత, సమగ్రతకు సంబంధించిన అఖిల భారత సర్వీసుల (ప్రవర్తనా) నిబంధనలు, 1968కు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు సంబంధించిన అత్యంత రాజకీయ ప్రాధాన్యమున్న కేసులో ఇలాంటి తొందరపాటు నిర్ధారణలు చేయడం వల్ల దర్యాప్తు రాజకీయ ప్రేరేపితంగా, పక్షపాతంతో సాగుతోందనే అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడమే కాదు, అలా జరిగినట్లు ప్రజలకు కనిపించాలని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లడానికి పోలీసుల అధికారిక ప్రకటనలను వాడుకోరాదని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు చట్టపరిధిలో స్వతంత్రంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. తీర్పులు ఇవ్వాల్సింది కోర్టులే తప్ప పోలీసుల సందేశాలు కాదని, రాజ్యాంగ పరిమితులను సంస్థలు అతిక్రమిస్తే ప్రజాస్వామ్యం మనలేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా,కెసిఆర్‌ను గౌరవ ప్రతిపక్ష నేతగా సిట్ చీఫ్ ఎందుకు గుర్తించడం లేదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:20 pm

అంతరిక్షం వెళ్లినా.. రేవంత్ బుద్ధి మారదు..

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 2 Feb 2026 8:20 pm

పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

మంగళగిరి: జనసేన అధినేత, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సికె కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ మాట్లాడారు. కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘లడ్డూ వ్యవహారంలో వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు? వైసిపి నేతల ట్రాప్‌లో చిక్కుకోవద్దు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.. జాగ్రత్తా! జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి. విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుతాం. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు మీ చేయి తగిలినా రేప్ చేశారని వైకాపా నేతలు ప్రచారం చేస్తారు’’ అని పవన్ అన్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:16 pm

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర నిర్లక్ష్యం: మంత్రి తుమ్మల

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ రాష్ట్ర రైతులకు తీవ్ర నిరాశ కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించకుండా, దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు నిధుల కేటాయింపు లేకపోవడం, అలాగే పసుపును హై వాల్యూ క్రాప్‌గా గుర్తించకపోవడంతో రాష్ట్ర పసుపు రైతులకు తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పారు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కొబ్బరి (కోకనట్) బోర్డు ఏర్పాటు విషయంలో కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర రైతులకు మరో ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు రైతులపై మరింత భారం మోపనున్నాయని, ఇప్పటికే పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించే చర్యలు బడ్జెట్‌లో పూర్తిగా లేవని మంత్రి తెలిపారు. రైతులకు అత్యంత కీలకమైన ఎంఎస్‌పి (కనీస మద్దతు ధర)కు చట్టబద్ధ హక్కు కల్పించడంలో కేంద్రం మరోసారి విఫలమైందని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం కేంద్ర బడ్జెట్ లోని ప్రధాన లోపమన్నారు. దేశీయ నూనెగింజల రైతులను రక్షించేలా తినుబండార నూనెలపై ఇంపోర్ట్ డ్యూటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కోత విధించడం తీరని అన్యాయం అని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ మాటలకే పరిమితమయిందని, దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యవసాయ రంగంలో బడ్జెట్‌లో ఏఐ ఆధారిత కార్యక్రమాల ప్రస్థావన మాత్రమే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని, అయితే ధర భద్రత, మార్కెట్ భరోసా లేకుండా కేవలం ఏఐ సాంకేతికత రైతు సమస్యలు పరిష్కారం తీర్చదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి, వ్యవసాయ రంగానికి ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:14 pm

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు..

విశాలాంధ్ర – ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి 2.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, గుత్తి పట్టణానికి చెందిన చిన్న కందుకూరి అజయ్, వడ్ల ఆదిత్య అనే యువకులు గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందడంతో ఉరవకొండ పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద సోమవారం పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో వారి వద్ద ఉన్న 2.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు […] The post గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 8:05 pm

రాహుల్ గాంధీ vs కేంద్రం.. దద్దరిల్లిన లోక్ సభ

చైనా కబ్జా, మాజీ ఆర్మీచీఫ్ జ్ఞాపకాలు లోక్‌సభలో రాహుల్, కేంద్రం వ్యాగ్యుద్ధం పుస్తకంతో దాడికి దిగిన ప్రతిపక్ష నేత అడ్డుకున్న సీనియర్ మంత్రుల బృందం ఎంపిల నినాదాలతో సభ వాయిదా న్యూఢిల్లీ : లోక్‌సభలో సోమవారం కేంద్రం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్రస్థాయిలో వ్యాగుద్ధం సాగింది. 2020 భారత్ చైనా ఘర్షణ నేపథ్యంతో సైనిక మాజీ ప్రధానాధికారి ఎంఎం నవరానే రాసిన జ్ఞాపకాల పుస్తకం’లోని అంశాలను రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించడం వివాదానాకి దారితీసింది. ఘర్షణ దశలో చైనా సేనలు భారత్‌లోకి ప్రవేశించాయని మాజీ ఆర్మీచీఫ్ ఈ పుస్తకంలో పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వెలువడిన వార్తను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి ఎంపిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని నిర్థారణ కాని అంశాలను రాహుల్ ప్రస్తావించం అనుచితం అని ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ సింగ్ రాహుల్‌పై ఎదురుదాడికి దిగారు. ఆయన సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాహుల్ పదే పదే సభను అవమానించేలా వ్యవహరిస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ దశలోనే స్పీకర్ కలుగచేసుకుని వార్తా పత్రికల క్లిప్పింగ్‌లు, అప్రచురిత పుస్తకాల్లోని అంశాలు సభలో ప్రస్తావించకూడదని సభ్యులు తెలుసుకుంటే మంచిదని మందలించారు బిజెపి సభ్యులు రాజ్‌నాథ్‌కు, అమిత్ షాకు మద్దతు పలికారు. దీనితో సభలో వాడివేడి వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. అయితే రాహుల్ వెనకకు తగ్గలేదు. ఆయనకు తోడుగా పలువురు ప్రతిపక్ష ఎంపిలు నిలిచారు. దీనితో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ ముందుగా రెండుసార్లు వాయిదా పడింది. తరువాత అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి వాదనల నడుమనే స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై రాహుల్ గాంధీ ముందుగా మాట్లాడారు. ఈ సందర్భంగా అంతకు ముందు మాట్లాడిన బిజెపి ఎంపి తేజస్వీ సూర్య కాంగ్రెస్‌కు జాతీయవాదం లేదని చేసిన విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే జనరల్ నవరానే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించారు. చైనా మన భూభాగం కబ్జా చేస్తూ పోతూ ఉంటే నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్న వారు జాతీయవాదులు అన్పించుకుంటారా? అని బిజెపిని నిలదీశారు. దీనితో వివాదం రాజుకుంది. పుస్తక ప్రస్తావనపై రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. దేశ సమగ్రత విషయంపై మాట్లాడకూడదనే విషయం ప్రతిపక్ష నేత తెలుసుకుంటే మంచిదని చురకలకు దిగారు. అయితే పుస్తకంలోని అంశం , ఇందులో పొందుపర్చిన డాక్యుమెంట్ నిర్థారితం అని , దీనిని ప్రస్తావించడంలో తప్పేమీ లేదని తెలిపారు. అయితే తప్పుడు అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. ఇది సభను పక్కదోవ పట్టించడమే అవుతుందని అధికార సభ్యులు రాహుల్‌ను దిగ్బంధం చేసేందుకు యత్నించారు. చైనాపై తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న పలు నిర్ణయాలు, ఆయన వల్ల వేలాది ఎకరాల భూమి చైనా ధారాదత్తం అయిన రికార్డులు ఉన్నాయని, వీటిని సభలో ప్రస్తావించలేమని తెలిపారు. అయితే తాను ఈ అంశాన్ని ప్రస్తావించదల్చుకోలేదని, కానీ బిజెపి ఎంపి సభలో కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ మాట్లాడటం వల్లనే తాను ఈ విషయం చెప్పాల్సి వచ్చిందని అన్నారు. రాహుల్‌కు సమాజ్‌వాది పార్టీ, టిఎంసి,ఆర్జేడీ ఇతర పార్టీల సభ్యులు మద్దతుగా లేచి నిలబడ్డారు. సభలో పరస్పర విమర్శల జోరు కొనసాగింది. దీనితో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ పక్క దారి పట్టింది. 

మన తెలంగాణ 2 Feb 2026 8:00 pm

Gods |ఓటర్ దేవుళ్ళు నమస్కారం…

Gods | ఓటర్ దేవుళ్ళు నమస్కారం… Gods | మంచిర్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:56 pm

కనేకల్‌లో వీధి కుక్కల, పశువుల బెడద..

విశాలాంధ్ర – కనేకల్: కనేకల్ మండలం కేంద్రంలో వీధి పశువులు, కుక్కల సంచారం రోజురోజుకూ పెరిగి ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన రహదారులపై పశువులు గుంపులుగా పడుకోవడం, కొట్లాడుకోవడం వల్ల వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.ఆదివారం రామనగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడిని వీధి కుక్క కరచడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీప మెయిన్ రోడ్డులో, దిగువగేరి పాత […] The post కనేకల్‌లో వీధి కుక్కల, పశువుల బెడద.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 7:55 pm

Excise |గాజుల సౌమ్య దోషులను కఠినంగా శిక్షించాలి…

Excise | గాజుల సౌమ్య దోషులను కఠినంగా శిక్షించాలి… Excise | కరిమాబాద్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:51 pm

పడకల్ లో విజయనగర కాలపు శిల్పాలను పదిలపరచాలి!

పడకల్ లో 400 సం||ల శిల్పాలు.కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి

తెలుగు పోస్ట్ 2 Feb 2026 7:46 pm

Candle |దండేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ.

Candle | దండేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ. Candle | దండేపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:46 pm

Barabar Premistha, Turning Point For Chandra Hass: Aadi

Attitude Star Chandra Hass starrer Barabar Premistha isn’t just another romantic entertainer, but it’s a film driven by attitude, emotion, and unpredictability. Directed by Sampath Rudra, the film stars Miss India finalist Meghna Mukherjee as the female lead and Arjun Mahi in a menacing antagonist role. The film’s pre-release event turned into a celebration of […] The post Barabar Premistha, Turning Point For Chandra Hass: Aadi appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 7:43 pm

రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

హైదరాబాద్: హీరో రామ్‌చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వీరిద్దరికి కవల పిల్లలు జన్మించారు. ఈ సందర్భంగా ఆ దంపతులకు తోటి సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నవ్వులతో నిండిన కుటుంబాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘మరోసారి తల్లిదండ్రులైన ఉపాసన-రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు. చిరంజీవి గారి గర్వం, ఆనందం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబం మొత్తం నవ్వుతూ కనిపిస్తుండటం సంతోషంగా ఉంది. చిన్నారులు తమ రాకతో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చారు’’ అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 7:42 pm

Leopard |కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం…

Leopard | కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం… Leopard | జుక్కల్

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:39 pm

కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపుల కేసు..బాధితురాలి ఆత్మహత్యాయత్నం

విశాలాంధ్ర – ఎల్లనూరు (పుట్లూరు): పుట్లూరు మండలం పరిధిలోని అరకట వేముల గ్రామంలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ కానిస్టేబుల్ మారుతిపై శనివారం కేసు నమోదు అయిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత మహిళ భర్త వివరాల ప్రకారం, నిందితుడి తరఫు వ్యక్తులు కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ ఒత్తిళ్లతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు.అస్వస్థతకు గురైన ఆమెను […] The post కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపుల కేసు..బాధితురాలి ఆత్మహత్యాయత్నం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 7:39 pm

రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార సభలో సీఎం రేవంత్

రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార సభలో సీఎం రేవంత్ కేసీఆర్ నిజమైన

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:35 pm

Construction |మక్తల్ –పేట కొడంగల్ ఎత్తిపోతల పనులు ప్రారంభం.

Construction | మక్తల్ – పేట కొడంగల్ ఎత్తిపోతల పనులు ప్రారంభం. Construction

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:32 pm

Photos : Couple Friendly Movie Trailer Launch

The post Photos : Couple Friendly Movie Trailer Launch appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 7:30 pm

Health |పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…

Health | పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:25 pm

MLA |ఉపాధి హామీ మార్పులకు వ్యతిరేకంగా…

MLA | ఉపాధి హామీ మార్పులకు వ్యతిరేకంగా… MLA | అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:19 pm

Medical College |జల్లపల్లి ఫారంలో పశు వైద్య శిబిరం…

Medical College | జల్లపల్లి ఫారంలో పశు వైద్య శిబిరం… Medical College

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:15 pm

రవితేజ మూవీ నుంచి ‘బెల్లా బెల్లా’ వీడియో సాంగ్ రిలీజ్

మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. డింపుల్ హయాతి, అషిక రంగనాథ్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా నుంచి ‘బెల్లా బెల్లా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా పాట అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకి సురేశ్ గంగుల లిరిక్స్ అందించగా.. నకాశ్ అజీజ్, రోహిని అలపించారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు. కాగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 

మన తెలంగాణ 2 Feb 2026 7:14 pm

Central Govt |కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం.

Central Govt | కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం. Central Govt

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:11 pm

President |మండల అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్

President | మండల అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్ President | చౌటుప్పల్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:07 pm

Ration |ఏఆర్ పల్లి గ్రామస్తులకు స్థానికంగా రేషన్ అందించాలి…

Ration | ఏఆర్ పల్లి గ్రామస్తులకు స్థానికంగా రేషన్ అందించాలి… Ration |

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:05 pm

Election |గులాబి కౌన్సిలర్లను గెలిపించండి …

Election | గులాబి కౌన్సిలర్లను గెలిపించండి … Election | జనగామ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:01 pm

Narsampeta |ముత్తోజీపేటలో ఇంటింటి ప్రచారం

Narsampeta | ముత్తోజీపేటలో ఇంటింటి ప్రచారం Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:59 pm

వీల్‌చైర్‌లో అసెంబ్లీకి తేజస్వియాదవ్

 ఆర్‌జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వియాదవ్ సోమవారం బొటనవేలి గాయంతో వీల్‌చైర్‌లో బీహార్ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హాజరైన యాదవ్ గవర్నర్ ప్రసంగం తరువాత పాత్రికేయులతో మాట్లాడుతూ తన ఎడమ కాలిబొటనవేలు గాయమైందని , నడవడం కష్టం కావడంతో వీల్‌చైర్‌లో వచ్చానని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినదేనని విమర్శించారు. అభివృద్ధి విషయంలో బీహార్ వెనుకబడి ఉన్నప్పటికీ ప్రసంగం అందంగా రంగు పూశారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా పాలన సాగిస్తున్నా అత్యాచారాలు, హత్యలు, ఇతర నేరాలు కొనసాగుతూనే ఉన్నాయని, శాంతిభద్రతలు లోపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లు ఎన్నికల స్టంట్లుగా దిగజారాయని ఆరోపించారు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధుబని చీర ధరించారని, ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నందున ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నందున మంత్రి సీతారామన్ కాంజీవరం చీర ధరించారని వ్యాఖ్యానించారు. ఈలోగా యాదవ్ విరోధులైన తోబుట్టువులు పెద్దక్క రోహిణీ ఆచార్య “ శరీరానికి గాయమైతే బాధ కలుగుతుంది. కానీ హృదయాన్ని గాయపరిస్తే ఇంకా విపరీతమైన నిస్పృహ కలుగుతుంది ” అని యాదవ్‌ను ఉద్దేశించి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. జేడీ(యు) నేషనల్ జనరల్ సెక్రటరీ , రాష్ట్రమంత్రి అశోక్ చౌదరి తేజస్వియాదవ్‌ను ఉద్దేశించి “ యాదవ్ ఉత్త కాళ్లతో క్రికెట్ ఆడుతుంటాడు. అతను తప్పకుండా షూలతో ఆడడం అలవాటు చేసుకోవాలి ” అని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 2 Feb 2026 6:58 pm

పత్రికా రంగంలో ఆంధ్రప్రభ నూతన ఒరవడి

బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆత్మకూర్ , ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:56 pm

Minister |దిష్టిబొమ్మలు దహనం…

Minister | దిష్టిబొమ్మలు దహనం… Minister | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:55 pm

సెంచరీతో కదం తొక్కిన నారాయణ్.. ఇండియా ఎ భారీ స్కోర్

నవీ ముంబై: టి-20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా యుఎస్‌ఎతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఇండియా ఎ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ నారాయణ్ జగదీషన్ సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యుఎస్ఎ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే 43 పరుగుల వద్దే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(28) ఔట్ అయ్యాడు. కానీ, మరో ఓపెనర్ నారాయణ్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శస్త్ర చికిత్స నుంచి కోలుకొని తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్న తిలక్ వర్మ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక ఆయుశ్ బదోనీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. యుఎస్ఎ బౌలింగ్‌లో శుభం రంజనే, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 2 Feb 2026 6:55 pm

Revanth Redddy : జాతి పిత టైటిల్ వారికి వారే పెట్టుకుంటారా?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 2 Feb 2026 6:47 pm