SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్..

కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో మరోసారి పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. పాక్ పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో పాక్.. తొలి ఓవర్ నుంచే వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో 18 ఓవర్లలోనే పాక్ 114 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ వరుసగా మూడో విక్టరీని సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, పాండ్యాలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ సింగ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 77 పరుగులతో మెరుపులు మెరిపించాడు. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(27)లు పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో సయామ్‌ ఆయుబ్ 3 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్, షహీన్‌ చెరో వికెట్‌ తీశారు.

మన తెలంగాణ 15 Feb 2026 10:27 pm

అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ మృతి

మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వాషింగ్టన్ : ఈ నెల 9న అమెరికాలోని బర్కిలీలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆయన మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సాకేత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నాడు. 9వ తేదీన చివరిసారిగా క్యాంపస్ సమీపంలోని లేక్ అంజా వద్ద కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతని జాడ తెలియలేదు. స్నేహితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సమీపంలోనే అతని పాస్ట్‌పోర్టు, ల్యాప్‌టాప్, బ్యాగ్‌తో అక్కడే అతడి మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలిఫోర్నియాలో భారత కాన్సులేట్ కూడా సాకేత్ మృతిని ధృవీకరించింది. 

మన తెలంగాణ 15 Feb 2026 10:10 pm

గ్రహాంతరవాసి ఉనికి నిజమే: బరాక్ ఒబామా

వాషింగ్టన్: మనకు అపరిచితులు అయిన గ్రహాంతరవాసులు ఉన్నారని, వీరి ఉనికిని తాను నమ్ముతున్నానని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా చెప్పారు. ఎక్కడో ఓ చోట వీరి జీవనం ఉండే ఉంటుంది. అయితే అది ఎక్కడ అనేది తనకు తెలియదని మాజీ ప్రెసిడెంట్ తాజా ్రఇంటర్వూలో వెల్లడించారు. గ్రహాంతర జీవుల మనుగడ ఉందా? అనే యూట్యూబర్ బ్రెయిన్ టైలెర్ ప్రశ్నకు ఒబామా స్పందించారు. తానైతే వారిని చూడలేదని తెలిపారు. తాను నిజమేనని చెపుతున్న గ్రహాంతరవాసులను ఏరియా 51లో పెట్టి ఉంచారనేది కుట్రపూరిత వాదన అని కొట్టిపారేశారు. ఏరియా 51 అమెరికా రహస్య వైమానిక దళం ఉండే నెవాడాలోని ఎయిర్‌బేస్. దీనికి ఏరియా 51 అనే సంకేత నామం ఉంది. అయినా ఏలియన్స్‌కు రహస్య ప్రదేశాలు అనేవి ఉండవన్నారు. ఏరియా 51కు ఎప్పుడూ గ్రహాంతరవాసులు తారసిల్లడం, యుఎఫ్‌ఒలు కన్పించడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ నిర్థారించలేదు. గ్రహాంతర జీవుల ఉనికిని నిర్థారించేందుకు ఎటువంటి నిర్థిష్ట సాక్షాధారం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికీ శాస్త్రజ్ఞుల బృందాలు అంతరిక్షంలోని విస్తారిత ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు. గ్రహాంతరవాసుల నుంచి అందే సంకేతాలు అత్యంత కీలకమైన సాక్షాధారం అని భావిస్తున్నారు. మాజీ ప్రెసిడెంట్ ఒబామా వ్యాఖ్యలతో తిరిగి అందరి దృష్టి ఇప్పుడు ఈ ఎలియన్స్ వైపు మళ్లింది.

మన తెలంగాణ 15 Feb 2026 9:57 pm

గిరిజన సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది: రాంచందర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. గిరిజన నాయకుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఆదివారం బిజెపి రాష్ట్ర ఎస్‌టి మోర్చా అధ్యక్షుడు రవి నాయక్ అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రసంగిస్తూ ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఐటీడీఏ నిధుల ద్వారానే సాధ్యమవుతోందని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం తమ పార్టీ ట్రైబల్ మోర్చా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ సిద్ధాంతాలకు చేరువలో సేవాలాల్ జీవితం సేవాలాల్ మహారాజ్ జీవితం తమ పార్టీ నమ్మే సిద్ధాంతాలకు ఎంతో దగ్గరగా ఉందని ఆయన చెప్పారు. దేశాన్ని విదేశీ శక్తుల ఆధిపత్యం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో పాటు, ప్రకృతి-పర్యావరణ పరిరక్షణకు ఆయన జీవితాంతం అంకితమయ్యారని తెలిపారు. బంజారా సమాజానికి శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవమని, పర్యావరణాన్ని కాపాడే దేవుడిగా ఆయనను గిరిజన సమాజం భావిస్తుందని అన్నారు. విదేశీ పాలన కాలంలో ఒకవైపు విదేశీయులపై పోరాటం చేస్తూనే, మరోవైపు ప్రకృతి పరిరక్షకుడిగా నిలిచిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని ఆయన కొనియాడారు. జగదాంబ మాత ఉపాసకుడిగా, భక్తి శ్రద్ధలతో జీవించిన సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి అనేక చారిత్రాత్మక నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని ఆయన వివరించారు. గిరిజన కమిషన్ ఏర్పాటు, ప్రత్యేకంగా గిరిజన మంత్రి, గిరిజన సంక్షేమానికి అత్యధిక నిధుల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలను ప్రధాని మోదీ తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. గిరిజన విశ్వ విద్యాలయం ములుగులో సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు విస్తరించాయని తెలిపారు. అలాగే మహారాష్ట్రలో సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం చేపట్టడం గిరిజన సంస్కృతికి ఇచ్చిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. ఇంకా గిరిజనుల విద్య, ఉపాధి, ఆరోగ్య సంక్షేమం కోసం అనేక పథకాలు అమలులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, సరైన నిధులు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని రాంచందర్ రావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మన తెలంగాణ 15 Feb 2026 9:48 pm

Shivartri |సర్వం శివోహం..

Shivartri | సర్వం శివోహం.. అంగరంగ వైభవంగా భక్త మార్కండేయ ఆలయంలో ఘనంగా

ప్రభ న్యూస్ 15 Feb 2026 9:42 pm

బంజారాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది: కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : బంజారాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. బంజారాలకు, ఆదివాసీలకు ఈ ముఖ్యమంత్రి లొల్లి పెట్టిస్తున్నారని ఆరోపించారు. జిఒ 33 ప్రకారం బంజారాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం సేవాలాల్ 287వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కవిత బోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సేవాలాల్ సందేశం ప్రకారం జాగృతి ముందుకు వెళ్తుందని తెలిపారు. సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, సంఘ సంస్కర్త కూడా అని పేర్కొన్నారు. బంజారాజాతి మేలు కోసం పోరాడిన సేవాలాల్ పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా ఉండాలని డిమాండ్ చేశారు. గోర్ భోళి భాషను కచ్చితంగా 8వ షెడ్యూల్‌లో చేర్చాలని అన్నారు. తండాల్లో ఎక్కువ మంది పేదవాళ్లే ఉంటారని,గతంలో సూర్యాపేట దగ్గర ఆడబిడ్డలను అమ్ముకున్న పరిస్థితి చూశామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినప్పటికీ పేదరికం మాత్రం ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక ఫండ్‌ను కేటాయించాలని తెలిపారు. అన్ని పార్టీలు బంజారా శాఖను పెట్టుకుంటాయి... కానీ, జాగృతి మాత్రం మెయిన్ బాడీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బంజారా బిడ్డకు అవకాశం ఇచ్చిందని అన్నారు. వెనుకబడిన జాతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సేవాలాల్ స్వాభిమానం, సామాజిక న్యాయం ఉండాలన్నారని చెప్పారు. బంజారాలు మంచి పొజిషనల్‌లో ఉండాలని, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షించారు. మన తండాల్లో మన రాజ్యం అని తెలంగాణ వచ్చాక చేసుకున్నామని, అయితే యువమిత్రులు తండాల్లో వెలుగులు నింపేలా నాయకత్వం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో యువకులు పోటీ చేయాలని, నాయకులు కావాలనుకునే యువత గ్రామాల్లో ఉండాలని తెలిపారు. తండాలను గ్రామపంచాయితీలుగా చేసుకున్నప్పటికీ సరైన వసతులు మాత్రం లేవు అని, ఈ పరిస్థితి మారాలంటే ముఖ్యమంత్రి ప్రతి తండాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో తాము ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే కాంగ్రెస్ ఆ సీటును లాక్కున్నదని మండిపడ్డారు. ఈ వెగటు రాజకీయాలు చేసే బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందని చెప్పారు. రాష్ట్రంలో అడిగేవాళ్లు, ప్రతిపక్షం ఉండొద్దా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కూడా కచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. సేవాలాల్ జయంతి, శివరాత్రి సందర్భంగా ప్రజలకు కవిత శుభాకాంక్షలు తెలిపారు.

మన తెలంగాణ 15 Feb 2026 9:37 pm

మాజీ ఎంఎల్‌సి ఐలాపురం వెంకయ్య కన్నుమూత

మన తెలంగాణ/హైదరాబాద్ : విజయవాడకు చెందిన ప్రముఖ బి.సి. సంక్షేమ ఉద్యమ నాయకుడు, మాజీ శాసన మండలి సభ్యుడు ఐలాపురం వెంకయ్య (93) కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి రాజకీయ, సామాజిక, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పేద కుటుంబంలో జన్మించిన వెంకయ్య కష్టపడి ఎదిగి విజయవాడలో ప్రముఖ హోటల్ ఐలాపురం స్థాపకుడిగా పేరుపొందారు. కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై ప్రజాసేవలో 8 ఏళ్ళు విశేష పాత్ర పోషించారు. ఆయన అంత్యక్రియ లు సోమవారం నిర్వహించనున్నట్లు కుమారుడు ఐలాపురం రాజా వెల్లడించారు. బిసి వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం వెంకయ్య నిరం తరం పనిచేశారని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. వెంకయ్య కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అటు మాజీ సిఎం వైఎస్ జగన్ కూడా ఐలాపురం వెంకయ్య ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటని తెలిపారు.

మన తెలంగాణ 15 Feb 2026 9:29 pm

కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోంది: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

పోలీస్ శాఖను సిఎం తనకు అనుకూలంగా మార్చుకున్నారు చైర్మన్, మేయర్ ఎన్నికలను పారదర్శకంగా జరపాలి బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందని బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. సిఎం రేవంత్‌రెడ్డి పోలీస్ శాఖను తన దగ్గర పెట్టుకుని తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ కౌన్సిలర్లు ఉన్న క్యాంపులకు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో బిఆర్‌ఎస్‌కు మెజారిటీ వచ్చిందని, వాళ్ళు క్యాంపులో ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనుక్కుని పోలీసులను పంపారని అన్నారు. కొన్ని చోట్ల మఫ్టీ పోలీసులను క్యాంపులకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలిపే ఇండిపెండెంట్ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఓటింగ్ జరుగుతుందని, తమ పార్టీ క్యాంపుల నుండి అభ్యర్థులను బస్సులో తరలించే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బస్సుల మీద దాడి చేసి, మా అభ్యర్థులను బలవంతంగా తీసుకెళ్లి వారికి అనుకూలంగా ఓట్లు వేయించుకునే కుట్ర చేస్తున్నారని తమకు సమాచారం ఉందని చెప్పారు. కాబట్టి పోలీసుల అండతో కాంగ్రెస్ నాయకులు చేసే ఇలాంటి అరాచకాలను ఆపాలని డిజిపికి విజ్ఞప్తి చేశారు. చైర్మన్,మేయర్ ఎన్నికలను పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 30శాతం ఓట్లను బిఆర్‌ఎస్ కొల్లగొట్టిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మూడు రోజుల ముందే చైర్మన్లు, మేయర్ల ఎంపికకు నోటిఫికేషన్ ఇచ్చిందని, కనీసం 15 రోజుల ముందే షెడ్యూల్ ఇవ్వాలని చెప్పారు. వారం రోజుల్లోనే అన్నీ పూర్తి చేసి ఎస్‌ఇసి మమ అనిపించిందని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా..ఎస్‌ఇసి నోటీసులు ఇవ్వలేదు అని, రేవంత్‌కు అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని ఆరోపించారు.

మన తెలంగాణ 15 Feb 2026 9:24 pm

Tribute |ఐలాపురం వెంకయ్యకు రామకృష్ణ, ఈశ్వరయ్య నివాళి

Tribute | ఐలాపురం వెంకయ్యకు రామకృష్ణ, ఈశ్వరయ్య నివాళి Tribute | విజయవాడ,

ప్రభ న్యూస్ 15 Feb 2026 9:24 pm

'కోవా బన్‘ వ్యవహారంపై అసదుద్దీన్ ఆగ్రహం

హైదరాబాద్: ‘కోవా బన్‘ వ్యవహారానికి మతం రంగు పూయడం సరైంది కాదని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మేడారం జాతర సందర్భంగా చెలరేగిన కోవా బన్ వివాదంపై ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నుంచి వచ్చిన వలీ అనే ముస్లిం చిన్న వ్యాపారిని లక్ష్యంగా చేసుకొని కొందరు యూట్యూబర్లు ‘ఫుడ్ జిహాద్‘ అంటూ వీడియోలు చేయడం, అన్ హైజీన్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఒక చిన్న వ్యాపారి జాతర సమయంలో తన కుటుంబ పోషణ కోసం వస్తువులు అమ్ముకుంటుంటే, అతనిపై మతరంగు పులిమి వీడియోలు తీయడం అన్యాయమని ఒవైసీ పేర్కొన్నారు. ''ఒక మనిషి పొట్టకూటి కోసం కష్టపడుతున్నాడు. ఇలాంటి వీడియోల వల్ల అతని కుటుంబమే కాదు, లక్షల మంది చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఫుడ్ సేఫ్టీ సమస్య ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి కాని యూట్యూబ్‌లో డ్రామా చేసి మత విద్వేషం రెచ్చగొట్టడం ఎందుకు'' అని ఆయన ప్రశ్నించారు. వ్యూస్ కోసం సోషల్ మీడియాలో మతపరమైన వివాదాలకు పూనుకోవడం సమాజానికి మంచిది కాదని ఓవైసీ అన్నారు. ఇలాంటి కంటెంట్ సృష్టించే యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి మత విద్వేషం పెంచే ప్రయత్నాలను ఆపాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ఎపి మంత్రి నారా లోకేష్ కోవా బన్ చిరు వ్యాపారి షేక్ షావలికి మద్దతు తెలిపారు. త్వరలోనే వలిని కలిసి, కోవా బన్ టేస్ట్ చేస్తానని హామీ ఇచ్చారు.

మన తెలంగాణ 15 Feb 2026 9:19 pm

excitement |బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై ‘హస్తం’పట్టు!

excitement | బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై ‘హస్తం’ పట్టు! చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

ప్రభ న్యూస్ 15 Feb 2026 9:17 pm

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలి: డిజిపి శివధర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు, కేడర్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపుమేరకు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న వారందరూ తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో శాంతియుతమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని డిజిపి కోరారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన 588 మంది తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నట్లు డిజిపి గుర్తుచేశారు. లొంగిపోయిన వారిందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకం కింద లభించే అన్ని రకాల ప్రయోజనాలను అందజేశామని, ప్రస్తుతం వీరంతా తమ సొంత గ్రామాల్లో కుటుంబాలతో కలిసి ఎంతో క్షేమంగా, సంతోషంగా జీవిస్తున్నారని డిజిపి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల పట్ల నమ్మకం, అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అజ్ఞాత మావోయిస్టులు సైతం ఇక్కడి పోలీసుల ఎదుట లొంగిపోయి సమాజంలో కలిసిపోతున్నారని ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి చెందిన 15 మంది మావోయిస్టు నాయకులు, కేడర్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని శాంతియుత భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని డిజిపి పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందజేయడంతో పాటు, సమాజంలో ఆత్మగౌరవంతో బతికేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాంతియుత మార్గాల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, సాయుధ మార్గం, అజ్ఞాతవాసం వీడి బయటకు రావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిజిపి బి.శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 15 Feb 2026 9:12 pm

Congress |బీఆర్ఎస్ క్యాంపు శిబిరంపై దాడికి యత్నం

Congress |బీఆర్ఎస్ క్యాంపు శిబిరంపై దాడికి యత్నం అప్రమత్తమైన మాజీ ఎమ్మెల్యే బాల్క

ప్రభ న్యూస్ 15 Feb 2026 9:09 pm

రేపు ఎపిలో బిల్ గేట్స్ పర్యటన..

మన తెలంగాణ/హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం ఎపిలో పర్యటించనున్నారు. ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి ఎపికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌లతో సమావేశమవుతారు. ఆదివారం అందిన సమాచారం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టిజిఎస్) కేంద్రాన్ని సందర్శించి, పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారులతో బిల్ గేట్స్ బృందం సమావేశమవుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే అమలవుతున్న ప్రాజెక్టులను మరింతగా విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ లక్ష్యాల సాధనకు చేపట్టిన సంస్కరణలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, మెడ్‌టెక్, సంజీవని వంటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్‌కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టు పనితీరును ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకంగా వివరించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికా ర్డులు రూపొందించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమావేశాల అనంతరం, బిల్ గేట్స్ బృందం అమరావతిలోని ఉండవల్లి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుంది. అక్కడ డ్రోన్లు, ఎఐ టెక్నాలజీ సహాయంతో చేపడుతున్న ఆధుని క వ్యవసాయ పద్ధతులను పరిశీలించనుంది.

మన తెలంగాణ 15 Feb 2026 9:06 pm

ఇషాన్ మెరుపులు.. పాక్ లక్ష్యం ఎంతంటే?

కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మోస్తరు స్కోరు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లను వీర బాదుడు బాదాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(27)లు పర్వాలేదనిపించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సయామ్‌ ఆయుబ్ 3 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్, షహీన్‌ చెరో వికెట్‌ తీశారు.

మన తెలంగాణ 15 Feb 2026 8:55 pm

Shavartri |సాంబశివుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

Shavartri | సాంబశివుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న

ప్రభ న్యూస్ 15 Feb 2026 8:43 pm

Rally |పలుతండాలో నిర్వహించిన సేవాలాల్ ర్యాలీ

Rally | పలుతండాలో నిర్వహించిన సేవాలాల్ ర్యాలీ ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్

ప్రభ న్యూస్ 15 Feb 2026 8:34 pm

funds |సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి నిధులు విడుదల చేయాలి డిమాండ్

funds | సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి నిధులు విడుదల చేయాలి డిమాండ్ funds

ప్రభ న్యూస్ 15 Feb 2026 8:26 pm

Suriya is the Busiest despite Debacles

Tamil actor Suriya promises to deliver his best for every film. After the pandemic, two of his impressive films Soorarai Pottru and Jai Bhim skipped theatrical release. The actor has been delivering his best performances but his films are falling short of delivering blockbusters. Films like Kanguva, Retro and others failed big. Though Suriya is […] The post Suriya is the Busiest despite Debacles appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 8:19 pm

అల్లు శిరిష్ వివాహ అహ్వానం.. మొదటి శుభలేఖ ఎవరికంటే..

హైదరాబాద్: అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అల్లు శిరీష్.. అతడి ప్రేయసి నయనికను మార్చి 6న వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు పెళ్లి పనుల్లో వేగం పెంచారు. తాజాగా వివాహ అహ్వానాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మొదటి శుభలేఖ శిరీష్ మామయ్య, మెగాస్టార్ చిరంజీవికి అందించి.. ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ విషయాన్ని శిరీష్ సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. శిరీష్-నయనికల ప్రేమ ప్రయాణం వరుణ్ తేజ్ - లావణ్యల పెళ్లి సమయంలో ప్రారంభమైంది. వీరి పెళ్లి నటుడు నితిన్ సతీమణి షాలినితో కలిసి హాజరయ్యారు. షాలినితో ఆమె స్నేహితురాలు నయనిక కూడా వచ్చింది. తొలిసారి ఆమెను అక్కడే చూశానని శిరీష్ తెలిపాడు. ఆ పరిచయం స్నేహంగా మారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘మా పరిచయం ఎలా మొదలైందంటూ ఏదో ఒక రోజు మా పిల్లలు అడిగితే ఇదే చెబుతా. నన్ను తమ సర్కిల్‌లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ థ్యాంక్స్‌’’ అని చెప్పాడు.

మన తెలంగాణ 15 Feb 2026 8:18 pm

Humanity |మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్

Humanity | మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్

ప్రభ న్యూస్ 15 Feb 2026 8:16 pm

Siva Karthikeyan’s Next Connected to Trivikram’s God of War?

Tamil actor Siva Karthikeyan has delivered some of the promising films over the recent years. After the super success of Amaran produced by Kamal Haasan, Siva Karthikeyan is doing one more film for Kamal Haasan’s Raaj Kamal Films International. The first look will be out tomorrow and the speculations say that the film is based […] The post Siva Karthikeyan’s Next Connected to Trivikram’s God of War? appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 8:08 pm

Science |సైన్సే మానవ ప్రగతికి మూలం…

Science | సైన్సే మానవ ప్రగతికి మూలం… Science | అచ్చంపేట, ఆంధ్రప్రభః

ప్రభ న్యూస్ 15 Feb 2026 7:58 pm

ఇషాన్ కిషాన్ అర్థ శతకం.. భారత్ స్కోర్ ఎంతంటే..

కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అర్థ శతకంతో సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకొని భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) పరుగులు చేయకుండానే తొలి ఓవర్‌లో ఔట్ అయ్యాడు. ఈ దశలో ఇషాన్ కిషన్ జట్టుకు అండగా నిలిచాడు. బౌండరీలు బాదుతూ.. స్కోర్‌ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఆ తర్వాత 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో ఇషాన్ కిషన్ అర్థ శతకం సాధించాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్‌లో కిషన్(55), తిలక్ వర్మ (10) ఉన్నారు.

మన తెలంగాణ 15 Feb 2026 7:33 pm

బంగ్లాదేశ్‌లో కొత్త సర్కారు.. ప్రధానిగా ప్రమాణం చేయనున్న రెహ్మన్

ఢాకా: బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బిఎన్‌పి) నేతృత్వపు నూతన ప్రభుత్వం మంగళవారం కొలువుతీరుతుంది. కొత్త మంత్రిమండలి మంగళవారం ప్రమాణస్వీకారం చేస్తుందని స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. బిఎన్‌పి ఘన విజయంతో పార్టీ నేత తారీఖ్ రెహ్మన్ ప్రధాని కానున్నారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి) ఎఎంఎం నసీర్ ఉద్దిన్ ప్రమాణం చేయిస్తారు. దీనితో కొత్త పార్లమెంట్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుంది. తరువాత మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో దేశాధ్యక్షులు మెహమ్మద్ షాబుద్దిన్ ప్రధాని తారీఖ్ రెహ్మన్ ఇతర మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. ఈసారి ఎన్నికల్లో బిఎన్‌పికి మూడింట రెండొంతుల మెజార్టీ దాటింది. ఈ పార్టీకి 209 స్థానాలు వచ్చాయి. కాగా తరువాతి స్థానంలో జమాత్ ఏ ఇస్లామీ పార్టీకి 68 స్థానాలు దక్కాయి. తొలిసారిగా ప్రధాని పదవిని రెహ్మన్ చేపడుతున్నారు. దీనితో ఇప్పటివరకూ ప్రభుత్వ తాత్కాలిక సారధిగా ఉంటూ వస్తున్న నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ పాలన ముగుస్తుంది. దేశ న్యాయ చట్ట పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారు అసిఫ్ నజ్రూల్ ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్, ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు జోరందుకున్నాయి. సాధారణంగా పార్లమెంట్ స్పీకర్ ఎంపిలతో ప్రమాణం చేయించాల్సి ఉంటుంది. అయితే స్పీకర్ ప్రవాసం, డిప్యూటీ స్పీకర్ జైలు పాలుకావడంతో అసాధారణ పరిస్థితిలో ఈసారి సిఇసినే ఎంపీలతో ప్రమాణం చేయిస్తారని వెల్లడైంది. భారత్ తరఫున స్పీకర్ ఓం బిర్లా హాజరు బంగ్లాదేశ్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి భారతదేశం తరఫున పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతారు. ప్రధాని మోడీని ఈ కార్యక్రమానికి బిఎన్‌పి అధినేత తారీఖ్ రెహ్మన్ ఆహ్వానించారు. అయితే ప్రధాని మోడీ వెళ్లడం లేదు. దేశం తరఫున స్పీకర్ ఓం బిర్లానే ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. 

మన తెలంగాణ 15 Feb 2026 7:30 pm

Telugu Girl Shines Big in Couple Friendly

Couple Friendly, a small attempt featuring Santosh Sobhan and Manasa Varanasi released during the Valentine’s Day weekend and the appreciation for the film has been decent. The performances by Santosh Sobhan and Manasa Varanasi is the film’s major USP. Telugu girl Manasa Varanasi has dominated the show and the actress surprised the audience with her […] The post Telugu Girl Shines Big in Couple Friendly appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 7:30 pm

Amit Shah Challenges Rahul Gandhi for a Public Debate

India’s interim trade agreement with the United States has triggered a fresh political confrontation, with Congress leader Rahul Gandhi framing it as a potential threat to farmers and the Modi government dismissing the charge as deliberate misinformation. Rahul Gandhi has positioned the agreement as a structural risk to Indian agriculture. In a series of remarks […] The post Amit Shah Challenges Rahul Gandhi for a Public Debate appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 7:28 pm

చమురు కొనుగోళ్లపై స్వంతంత్రంగా వ్యవహరిస్తాం: జైశంకర్

రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు చమురు కంపెనీలు ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి మ్యూనిచ్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందంటూ అమెరికా వాణిజ్య ఒప్పందానికి ముందు చేసిన ప్రకటన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా స్పందించారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న అంశాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడమే భారత దేశ విధానమని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి అంశాల్లో రాజకీయ జోక్యానికి తావులేదని, అది పనిచేయదని జర్మనీలో వ్యాఖ్యానించారు. మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొనేదుకు ఇక్కడికి వచ్చిన జైశంకర్ ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్లపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందా? ఇది దేశ వ్యూహాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జైశంకర్ స్పందిస్తూ ఇంధన కొనుగోళ్ల అంశం సంక్లిష్టమైనదని అన్నారు. ఇతర దేశాల్లోని సంస్థల వలెనే భారతీయ ఇంధన కంపెనీలు కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. ధరలు, ఇంధన లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక భారత్ ఎల్లప్పుడూ పూర్తి స్వాతంత్య్రంతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశ చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం స్పందించారు. రష్యా కొనుగోళ్లను నిలిపివేస్తామంటూ భారత్ తమకు హామీ ఇచ్చిందని అన్నారు. ఈ దిశగా ఐరోపా దేశాలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయని అన్నారు.  

మన తెలంగాణ 15 Feb 2026 7:19 pm

Development |ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరి వైపు?

Development | ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరి వైపు? Development | స్టేషన్ ఘన్‌పూర్,

ప్రభ న్యూస్ 15 Feb 2026 7:15 pm

Vice Chairman |మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ మరింత హీట్…

Vice Chairman | మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ మరింత హీట్… ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 15 Feb 2026 7:06 pm

16 villages |శివనామస్మరణతో హోరేత్తిన ఆలయాలు

16 villages | శివనామస్మరణతో హోరేత్తిన ఆలయాలు 16 villages | రాప్తాడు,

ప్రభ న్యూస్ 15 Feb 2026 6:48 pm

Volleyball |టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం

Volleyball | టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం Volleyball | మునుగోడు, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 15 Feb 2026 6:48 pm

INDvsPAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్

కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో హై-ఓల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ టి-20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడగా.. భారత్ ఏడు సార్లు గెలవగా, పాకిస్థాన్ ఒకసారి విజయం సాధించింది. ఇక ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు ఆడిన తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. భారత్ మాత్రం రెండు మార్పులు చేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న అభిషేక్ శర్మ జట్టులోకి రాగా.. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. పాకిస్థాన్: సైమ్ అయుబ్, షహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజామ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), షహీన్ అఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.

మన తెలంగాణ 15 Feb 2026 6:46 pm

Chairman |డోర్నకల్ మున్సిపల్ కుర్చీ చెరి సగం!

Chairman | డోర్నకల్ మున్సిపల్ కుర్చీ చెరి సగం! రెండున్నర–రెండున్నర ఫార్ములా ఖాయం?..

ప్రభ న్యూస్ 15 Feb 2026 6:37 pm

BRS Ready to Align with TDP to Stop Congress!

HYDERABAD: Bharat Rashtra Samithi (BRS) appears to have changed its enemy list. For years, BRS chief K. Chandrashekar Rao and his son K.T. Rama Rao framed TDP chief N. Chandrababu Naidu as the ultimate Andhra villain to fuel Telangana sentiment. After losing power, that pitch only intensified. But “Chandrababu villain” narrative is delivering diminishing returns […] The post BRS Ready to Align with TDP to Stop Congress! appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 6:33 pm

ఫ్యాన్స్‌కి బిగ్ రిలీఫ్.. భారత్, పాక్‌కి వర్ష గండం లేనట్లే..

కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా మరికాసేపట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించవచ్చని వాతావరణ నివేదికలు చెప్పాయి. దీంతో ఫ్యాన్స్ అంతా నిరుత్సాహపడ్డారు. అయితే తాజా నివేదికల ప్రకారం ఈ మ్యాచ్‌కి వరుణుడు ఎటువంటి ఇబ్బంది కలిగిండని తేలిపోయింది. దీంతో అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఆదివారం సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్ పడనుంది. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటగాళ్లు, ఫ్యాన్స్‌ స్టేడియంకి చేరిపోయారు. గత ఆసియా కప్‌లో మాదిరిగానే ఈసారి కూడా భారత, పాక్ ఆటగాళ్ల మధ్య కరచాలనం చేసుకొనేది లేదని తెలుస్తోంది. ఈ విషయంపై టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. 24 గంటలు గడిచాక మీకే తెలుస్తుందని పేర్కొన్నాడు. అయితే పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ విషయంలో మార్పు ఉండకపోవచ్చని క్రికెట్ వర్గాల పేర్కొంటున్నాయి.

మన తెలంగాణ 15 Feb 2026 6:32 pm

Shivaratri |ఘనంగా శివాలయాల్లో ..మహా శివరాత్రి వేడుకలు

Shivaratri | ఘనంగా శివాలయాల్లో ..మహా శివరాత్రి వేడుకలు Shivaratri | చిట్యాల,

ప్రభ న్యూస్ 15 Feb 2026 6:28 pm

Municipal |చెర్ పర్సన్ పీఠంపై ఉత్కంఠ..

Municipal | చెర్ పర్సన్ పీఠంపై ఉత్కంఠ.. అభ్యర్థులు క్యాంప్ లోమంత్రి చెన్నూరులో

ప్రభ న్యూస్ 15 Feb 2026 6:23 pm

Facilities |పోలీసుల పైరవీలతో దర్శనాలు…

Facilities | పోలీసుల పైరవీలతో దర్శనాలు… Facilities | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

ప్రభ న్యూస్ 15 Feb 2026 6:13 pm

Congress |నిముష నిముషానికి మారుతున్న రాజకీయం

Congress | నిముష నిముషానికి మారుతున్న రాజకీయం Congress | కరీంనగర్ కార్పొరేషన్‌లో

ప్రభ న్యూస్ 15 Feb 2026 6:07 pm

ఆసీస్‌కు చుక్కలు చూపించిన భారత్.. తొలి టి-20లో విజయం

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళ జట్టు టి-20 సిరీస్‌ని విజయంతో ఆరంభించింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి టి-20లో ఆసీస్‌కి చుక్కలు చూపించి.. విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళ జట్టు 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి)లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య చేధనలో భారత్ 5.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో ఫలితాన్ని డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో అంపైర్లు ప్రకటించారు. వర్షం వచ్చే సమయానికి భారత్ అదనంగా 21 పరుగులు చేసి ఉండటంతో విజేతగా అంపైర్లు నిర్ణయించారు. బౌలింగ్ 4 వికెట్లు పడగొట్టిన అరుంధతి రెడ్డికి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

మన తెలంగాణ 15 Feb 2026 5:53 pm

Road |డ్రైనేజిపై ప్రీకాస్ట్ బిల్లలను ఏర్పాటు చేస్తున్న సర్పంచ్ శిరీష లోకేష్ గౌడ్

Road | డ్రైనేజిపై ప్రీకాస్ట్ బిల్లలను ఏర్పాటు చేస్తున్న సర్పంచ్ శిరీష లోకేష్

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:49 pm

Cricket |క్రికెట్ సామాగ్రి వితరణ..

Cricket | క్రికెట్ సామాగ్రి వితరణ.. Cricket | కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:44 pm

CM Cup|రాష్ట స్థాయి యోగా పోటీలకు విద్యార్థి ఎంపిక

CM Cup| రాష్ట స్థాయి యోగా పోటీలకు విద్యార్థి ఎంపిక CM Cup|

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:40 pm

Minister |ప‌ర‌మ‌శివుని అనుగ్ర‌హం ఉండాలి…

Minister | ప‌ర‌మ‌శివుని అనుగ్ర‌హం ఉండాలి… Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:36 pm

Power |బీసీలకు ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించాలి..

Power | బీసీలకు ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించాలి.. బీసీ సంక్షేమ

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:35 pm

From 150 to 12.98 Lakh: Pawan Kalyan Leads Jana Sena’s New Membership Push

The Jana Sena Party has launched a fresh membership enrollment campaign as part of its efforts to strengthen its grassroots presence across Andhra Pradesh. The initiative was formally inaugurated by party president and Deputy Chief Minister Pawan Kalyan at the party’s central office in Mangalagiri. Marking the occasion, Pawan Kalyan contributed ₹2 crore toward the […] The post From 150 to 12.98 Lakh: Pawan Kalyan Leads Jana Sena’s New Membership Push appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 5:21 pm

Mla |శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

Mla | శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు Mla |

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:21 pm

Resource |మహిళల సాధికారతకు కట్టుబడి ఉంది…

Resource | మహిళల సాధికారతకు కట్టుబడి ఉంది… Resource | ఆముదాలవలస, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:17 pm

Help |ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న శ్రీనివాస్ రెడ్డి

Help | ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న శ్రీనివాస్ రెడ్డి చదువుల తల్లికి ఆసరాగా

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:12 pm

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపాలిటీలో బుజిలాపురం 5వ వార్డు లో ఇండిపెండెంట్

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:12 pm

8 years |మార్మోగిన శివాల‌యాలు…

8 years | మార్మోగిన శివాల‌యాలు… 8 years | నందికొట్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:11 pm

Telangana’s New Political Order: Congress Firm at Top, BRS–BJP Contest for Second

HYDERABAD: When the BRS was in power, its working president K.T. Rama Rao often said the BJP and Congress were contesting for second place. The electoral numbers since the change in government suggest a reversal. Now BJP and BRS are fighting for second position. Congress has remained consistently around the 40 per cent vote share […] The post Telangana’s New Political Order: Congress Firm at Top, BRS–BJP Contest for Second appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 5:11 pm

ఘనంగా మహా శివరాత్రి మహోత్సవ వేడుకలు

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:10 pm

సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా బడ్జెట్: పి.వి.ఎన్. మాధవ్

అమరావతి: రాష్ట్ర బడ్జెట్ ప్రగతి శీల బడ్జెట్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ సమ్మిళితం చేస్తూ ప్రజలకు వివరించాలని అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అధికార ప్రతినిధులకు మాధవ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధికి శనివారం అసెంబ్లీలో జరిగే బడ్జెట్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అని..సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా బడ్జెట్ రూపొందించారని తెలియజేశారు. రూ.3.32 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించడం సాహసోపేతమైన చర్య అని..అన్నారు. రెవెన్యూ లోటు 1.86 శాతానికి పరిమితం చేయడం ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం అని.. ‘వికసిత్ ఎపి’ ద్వారా ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తోందని మాధవ్ పేర్కొన్నారు.  

మన తెలంగాణ 15 Feb 2026 5:06 pm

మహాశివరాత్రి శివాలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి శివాలయాలకు పోటెత్తిన భక్తులు పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని శ్రీ

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:05 pm

Collector |లేపాక్షి మహాశివరాత్రి ఉత్స‌వాల్లో….

Collector | లేపాక్షి మహాశివరాత్రి ఉత్స‌వాల్లో…. Collector | శ్రీ సత్యసాయి బ్యూరో,

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:03 pm

‘బాషా’ నిర్మాత మృతి.. సంతాపం తెలిపిన రజనీకాంత్

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాల్లో ‘బాషా’ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఎన్ని సినిమాలు చేసిన బాషా సినిమా అంటే ఇప్పటికీ ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు భాషా సినిమా నిర్మాతల్లో ఒకరైన తమిళగన్ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘సోదరుడు లాంటి తమిళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ రజనీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. బాషా చిత్రాన్ని తమిళగన్ ఆయన తల్లి రాజమ్మాళ్‌తో కలిసి నిర్మించారు. ఆయన తండ్రి ఆర్ఎం వీరప్పన్ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితో పాటు మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ చిత్రాలను కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు ఆయన దర్శకుడిగా వ్యవహరించారు. 

మన తెలంగాణ 15 Feb 2026 5:02 pm

కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర

ప్రభ న్యూస్ 15 Feb 2026 5:02 pm

జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై కర్రలతో దాడి చేసి హత్య

జగిత్యాల: జగిత్యాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి చంపేశారు. నడిరోడ్డుపైనే అతడిపై కర్రలతో దాడి చేసి ఇద్దరు వ్యక్తులు హతమార్చారు. మృతుడు పోరండ్ల గ్రామానికి చెందిన విశ్వనాథ్‌గా గుర్తించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాతకక్షలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు.

మన తెలంగాణ 15 Feb 2026 4:25 pm

Temple |భక్తిశ్రద్ధలతో ఘనంగా…

Temple | భక్తిశ్రద్ధలతో ఘనంగా… Temple | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Feb 2026 4:20 pm

సింగరేణిలో కాంగ్రెస్, బిజెపి భాగస్వాములై దోచుకుంటున్నాయి: కెటిఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల అరాచకాలకు పాల్పడుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్.. పార్టీ వారు తమ కార్పొరేటర్లను పోలీసుల ద్వారా ప్రలోభపెడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఫలితాల్లో 34 చోట్ల హంగ్ ఉందని, తమకు ఎక్స్అఫీషియో ఓటుపై కూడా ఇంకా స్పష్టత రాలేదని తెలియజేశారు. సింగరేణిలో దోపిడీని నిరోధించేందుకు సిపిఐతో కలిసి ఉంటామని చెప్పానని, సింగరేణి దోపిడీని అరికట్టేందుకు సిపిఐకి మద్దతిస్తామని చెప్పామని అన్నారు. సింగరేణిలో కాంగ్రెస్, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని, సింగరేణిలో కాంగ్రెస్, బిజెపి భాగస్వాములై దోచుకుంటున్నాయని విమర్శించారు. ఎవరు కలిసొచ్చినా.. రాకున్నా సింగరేణి అవినీతిపై పోరాటం చేస్తామని, కొత్తగూడెంలో సిపిఐపై ఏం ఒత్తిడి పని చేసిందో తెలియదని కెటిఆర్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 15 Feb 2026 4:19 pm

హర హర మహాదేవ… శంభో శంకర

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; హర హర మహాదేవ… శంభో శంకర అంటూ

ప్రభ న్యూస్ 15 Feb 2026 4:13 pm

Minister |మహా శివుడికి పూజలు చేసిన మంత్రి కొండ సురేఖ

Minister | మహా శివుడికి పూజలు చేసిన మంత్రి కొండ సురేఖ మహా

ప్రభ న్యూస్ 15 Feb 2026 4:11 pm

cinema|రెడ్ డ్రెస్‌లో.. అదుర్స్‌

cinema|రెడ్ డ్రెస్‌లో.. అదుర్స్‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా నేహా

ప్రభ న్యూస్ 15 Feb 2026 4:10 pm

కమణీయం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కళ్యాణం

చెన్నూర్, ఆంధ్రప్రభ : మహాశివారాత్రి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం

ప్రభ న్యూస్ 15 Feb 2026 4:09 pm

Video: Shivani Nagaram Exclusive Interview

The post Video: Shivani Nagaram Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 4:06 pm

Shivatri |ఊట్కూర్ లో ఘనంగా మహా శివ రాత్రి వేడుకలు..

Shivatri | ఊట్కూర్ లో ఘనంగా మహా శివ రాత్రి వేడుకలు.. Shivatri

ప్రభ న్యూస్ 15 Feb 2026 4:04 pm

శివనామ స్మరణతో పులకించిన ఉమామహేశ్వర క్షేత్రం

శివనామ స్మరణతో పులకించిన ఉమామహేశ్వర క్షేత్రం అచ్చంపేట, ఆంధ్రప్రభ ; నాగర్‌కర్నూల్ జిల్లా

ప్రభ న్యూస్ 15 Feb 2026 4:01 pm

పాలక వర్గం ప్రమాణ స్వీకారం..

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మున్సిపల్ పాలక వర్గం ప్రమాణ స్వీకారం

ప్రభ న్యూస్ 15 Feb 2026 3:54 pm

Peddi Special BTS Video: Buchi Babu crafting a grand epic

Peddi starring Mega Powerstar Ram Charan is the most eagerly awaited Indian film in recent times. The Pan-India sports based epic drama is written and directed by Buchi Babu Sana. Venkata Satish Kilaru is producing the film on a lavish scale taking Indian Cinema to International level. AR Rahman is composing music for the film […] The post Peddi Special BTS Video: Buchi Babu crafting a grand epic appeared first on Telugu360 .

తెలుగు 360 15 Feb 2026 3:35 pm

Revanth reddy |దళితులకు పట్టం కట్టాం..

Revanth reddy | దళితులకు పట్టం కట్టాం.. 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం

ప్రభ న్యూస్ 15 Feb 2026 3:28 pm

చెలరేగిన భారత ఎ బౌలర్లు.. పాక్ 93 ఆలౌట్.. భారత్ ఎ విజయం

ఎసిసి మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్-2026 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మహిళ జట్టుతో తలపడిన భారత ఎ మహిళ జట్టు ప్రత్యర్థిని స్వల్పస్కోర్‌కే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ని కేవలం 93 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. పాకిస్థాన్ బ్యాటింగ్‌లో షవాల్ జుల్ఫికర్ (23), గల్ రుఖ్(21), అనోషా నాసిర్ (17) మినహా మిగితా వాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. భారత్ ఎ బౌలింగ్‌లో సైమా ఠాకూర్, రాధా యాదవ్, ప్రేమ రావత్ చెరి 2, కలితా, మణి తలో వికెట్ తీశారు. ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఎ 10 ఓవర్లలోనే చేధించింది. వ్రిందా దినేష్(55) అర్థ శతకంతో చెలరేగగా.. అనుష్క శర్మ(24) ఫర్వాలేదనిపించింది. దీంతో భారత్ ఎ 10.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి.. ఎనిమిది వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

మన తెలంగాణ 15 Feb 2026 3:21 pm

Minister |మెల్లచెరువు అభివృద్ధికి కొత్త దిశ

Minister | మెల్లచెరువు అభివృద్ధికి కొత్త దిశ Minister | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Feb 2026 3:19 pm

4400 grams |కనకదుర్గమ్మకు బంగారు కానుకలు

4400 grams | కనకదుర్గమ్మకు బంగారు కానుకలు 4400 grams | ఇంద్రకీలాద్రి,

ప్రభ న్యూస్ 15 Feb 2026 3:05 pm

officers |భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా…

officers | భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా… officers | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:57 pm

india|ఇండియా గెల‌వాలి..

india| ఇండియా గెల‌వాలి.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:53 pm

11th Division |మస్జిద్-ఏ-కౌసర్, హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభం..

11th Division | మస్జిద్-ఏ-కౌసర్, హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభం.. 11th Division

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:50 pm

MLA |నీలాద్రీశ్వర స్వామి సేవలో …

MLA | నీలాద్రీశ్వర స్వామి సేవలో … MLA | తిరువూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:45 pm

BC LEGEND  :   ఆయన అందరివాడు  Andhra Prabha SPL story

BC LEGEND : ఆయన అందరివాడు Andhra Prabha SPL story నాటి

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:43 pm

Cancer |ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి…

Cancer | ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి… Cancer | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:40 pm

Challapally |భక్తులకు మజ్జిగ పంపిణి

Challapally | భక్తులకు మజ్జిగ పంపిణి Challapally | చల్లపల్లి – ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:29 pm

1008 నదుల తీర్థజలాలతో శివుడికి అభిషేకం చేసిన దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఫసల్ వాడి గ్రామంలోని శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో భారత దేశంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా 1008 నదులలో తీర్థజలాలను సేకరించి చేపట్టిన జలలింగ అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యం లో చేపట్టిన గరక పూజలో భాగంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ స్వయంగా నదీ జలాలతో కూడిన బిందెను తలపై పెట్టుకొని ఆమ్లయనం చుట్టూ తిరిగి జలలింగానికి అభిషేకించారు. అనంతరం జలలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది శివ భక్తులు పాల్గొన్నారు.  

మన తెలంగాణ 15 Feb 2026 2:29 pm

Queue lines |వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు..

Queue lines | వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. Queue lines |

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:26 pm

Ktr |మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారు..

Ktr | మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారు.. కాంగ్రెస్ అరాచకాలు చేస్తోంది…మాజీ మంత్రి

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:25 pm

హ్యాట్సాఫ్ “స్టేషన్ ఘన్ పూర్ “పోలీసులు!

హ్యాట్సాఫ్ “స్టేషన్ ఘన్ పూర్ “పోలీసులు! స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : పోలీస్

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:24 pm

శివుడిగా విరాట్.. అదిరిపోయేలా ‘నాగబంధం’ టీజర్

ప్రస్తుతం భారీ స్థాయిలో దేవుడిపై తీస్తున్న చిత్రాలు గ్రాండ్ సక్సెస్‌ని అందుకుంటున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఎక్కువ శాతం అలాంటి సినిమాలు చేసేందకు ఇష్టపడుతున్నారు. ఆ జోనర్‌లో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. ‘పెద్దకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాక.. ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నాడు. జగపతి బాబు, గరుడ రామ్, మురళీ శర్మ, రిషబ్ స్వాహ్నితో పాటు హీరోయిన్ నభా నటేష్... ప్రతి ఒక్కరి లుక్ కొత్తగా ఉంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ టీజర్‌ని రిలీజ్ చేశారు. టీజర్ చూసిన చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. త్వరలో ఈ సినిమాను చూడాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది.

మన తెలంగాణ 15 Feb 2026 2:21 pm

11th rank |సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధకులు….

11th rank | సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధకులు…. 11th rank |

ప్రభ న్యూస్ 15 Feb 2026 2:20 pm