ప్రేమపెళ్లి... టివి సౌండ్ కోసం భర్తను పొడిచి చంపిన భార్య
అమరావతి: టివి సౌండ్ తగ్గించామని అడిగినందుకు భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... షేక్ అహ్మద్ అనే యువకుడు(27) ఎసి మెకానిక్గా పని చేస్తున్నాడు. క్రాంతి అనే యువతితో ప్రేమలో పెట్టాడు. ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకొని మంగళగిరిలోని టిడ్కో ఇళ్లలో నివసిస్తున్నారు. క్రాంతి టివి సౌండ్ ఎక్కువగా పెట్టుకొని వీక్షిస్తోంది. సౌండ్ ఎక్కువగా కొంచెం తగ్గించాలని భార్యకు భర్త సూచించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్తాయికి చేరుకుంది. భార్య చెంపపై భర్త కొట్టాడు. కోపంతో రగిలిపోయిన భార్య కత్తి తీసుకొని భర్తను పొడిచింది. స్థానికుల వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఎన్నికల ఉ చితాల సంస్కృతిపై సుప్రీంకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక ప్రగతికి ముప్పుగా వాటిల్లే ఈ పద్ధతిని మానాలని పిలుపు నిచ్చింది. ఉచితాల విధానాలను ఇప్పటికైనా సమీక్షించుకుని తీరాలి. పద్ధతి మార్చుకోవాలని సంబంధిత పక్షాలకు హితవు పలికింది. ఉద్యోగావకాశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వాలకు, విధాన నిర్ణేతలకు చురకలు పెట్టింది. తమిళనాడు విద్యుత్ పంపి ణీ సంస్థ తాము అందరికీ ఉచితంగా కరెంటు ఇస్తామని, ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుం డా ఈ సౌకర్యం కల్పిస్తామని ఇందుకు అనుమతించాలని ప్రతిపాదించింది. ఈ విషయం పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యా యమూర్తులు జాయ్మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీ ధర్మాసనం పలు రీతిలో ఈ సా మాజిక దుష్ప్రభావ అంశంపై స్పందించింది. పేదలకు చేయూత నిచ్చే సంకల్పాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్బాటాలకు దిగుతూ సాగే ఉచితాలకు పోవడం అర్థం కాని విష యం అని ధర్మాసనం తెలిపింది. ఇటీవలి కా లంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార ద శల్లో ఓట్ల వేటకు ఉచితాలకు దిగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలలో రెవెన్యూ లోటు భా రీగా ఉంది. అయితే ఇప్పటికీ దీనిని పట్టించుకోకుండా ఉచితాలకు దిగుతున్నారని విమర్శించారు. ఇటువంటి ఉచితాల దయార్థ్రత తో కూడిన ఉచిత విద్యుత్ పంపిణీతో చివరికి ఆర్థిక వ్యవస్థకు షాక్ కొట్టిస్తారా? అని ప్రశ్నించింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ కాదు , ఉద్యోగ కల్పన సంబంధిత రంగాల విస్తృతికి పాటుపడితే ప్రజలకు ఎప్పటికైనా మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు.తమిళనాడు విద్యుత్ సంస్థ ప్రతిపాదిత ఉచిత విద్యుత్ స్కీం గురించి వైఖరి తెలియచేయాలని కేంద్రానికి, ఇతర పక్షాలకు సుప్రీంకోర్టు నోటీసు వెలువరించింది. తమిళనాడు విద్యుత్ సంస్థ విద్యుచ్ఛక్తి సవరణల నిబంధన 2024ను సవాలు చేసింది. దీనిపై ధర్మాసనం స్పందించింది. దే శంలో ఎటువంటి సంస్కృతి నెలకొంటున్నదో తెలియడం లేదు. ప్రజల సంక్షేమం కోణంలో ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు. అయితే బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న వారికి దీనిని కల్పిస్తే బాగుంటుంది కానీ, మొదటికే మోసం గా మారకూడదు కదా? అని నిలదీశారు. ఎవరు బిల్లులు కట్టగలరు? ఎవరు కట్టలేరు? అనేది విశ్లేషించుకోకుండా, అందరికీ ఫ్రీ అంటే ఇది కేవలం తాయిలాల కిందికి రాదా? అని అడిగారు. ఎలక్ట్రిసిటీ టారీఫ్ వెలువడిన తరువాత ఈ ఉచిత స్కీం తీసుకువస్తామంటే దీని అర్థం ఏమిటని నిలదీశారు. రాష్ట్రాలు కానీ, సంస్థలు కానీ ముందుగా యువతరానికి అవసరం అయిన ఉద్యోగ ఉపాధి పథకాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఉచిత తిండి, ఉచిత రవాణా, ఉచిత సైకిళ్లు , ఉచిత కరెంటు ఇస్తూ పోతే ఇక అంతా ఇంట్లో హాయిగా నిద్రపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో పని సంస్కృతి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ఒక్క పనిచేస్తే సరిపోతుంది కదా? అభివృద్ధి పనులు ఆపివేసి, ఈ డబ్బుతో అందరికీ జీతాలు ఇస్తూ, వారి పట్ల ఔదార్యతను ప్రదర్శించండి. దీని వల్ల వారికి అప్పటికప్పుడు మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో దేశానికి ఏం అవుతుందనేది వదిలేస్తే మంచిదని వ్యంగ్యంగా తిట్టిపోసింది.
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్
` ఐదురుగు మావోయిస్టులు మతి రాయపూర్(జనంసాక్షి): ఛత్తీస్గఢ్లో మళ్లీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ …
` ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాలకు ఈసీ లేఖ ` అందుకు సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు …
` మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రశంసించిన ఖర్గే, రాహుల్ ` ప్రజల తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ` సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి …
` సిద్ధిపేటలో పోటీచేస్తా ` ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం ` అధికారంలోకి రావడం ఖాయం ` తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల …
ఏఐ ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వద్ధిలో నడిపిస్తాయి
` భారత్లో మార్పులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ` విశాఖ మీదుగా ఐఐటి ఖరగ్పూర్కు వెళ్లేవాడిని ` అదే విశాఖలో ఇప్ప్పుడు గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం ` …
` ఏఐని మనమే శాసించాలి ` మన ఆలోచనలకు అందనంతగా ఎఐ ` మానవ అభివద్దిలో ఎఐది కీలక భూమిక ` భారత్లో ఎఐ పురోభివద్ది చరిత్రగా …
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటి చేసిన దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటు పడక తప్పదని భావిస్తోన్న తరుణంలో ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగిం ది. బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్ను సస్పెండ్ చేయడంతో ఆయనకు పార్టీ మారే వెసులుబాటు లభించిందని, ఆ మేరకే ఆయ న కాంగ్రెస్ నుంచి ఎంపిగా పోటీ చే యడంతో అనర్హత వేటుకు అవకాశం లేదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ అంశం స్పీకర్ ప్రసాద్కుమార్ బుధవారం దానంపై అనర్హ త పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సభ్యుడిపై అనర్హత వేటు వేయమని కోరే అవకాశాన్ని బీఆర్ఎస్ చేజాతులారా కోల్పోయిందనే విషయాన్ని విచారణ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రస్తావించినట్టు సమాచా రం. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పక్షంలో సదరు సభ్యుడికి ఏ పార్టీలో అయినా చేరే వెసులుబాటు ఉంటుందని, ఆ మేరకే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎంపిగా పోటి చేసినట్టు ఆయన తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించినట్టు సమాచారం. వారి వాదన మేరకు దానం నాగేందర్పై అనార్హత వేటు పడే అవకాశం లేదని కూడా ఈ వర్గాలు చెబుతున్నాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం రాగానే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సాక్షాధారాలను పిటిషనర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇప్పటికే స్పీకర్కు అందజేయడం వల్ల వారి వాదనకు బలం చేకూర్చిందని ఈ వర్గాల సమాచారం. ఇలా ఉండగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సభ్యుడిపై సస్పెన్షన్ను ఎప్పుడైనా ఎత్తివేసే అవకాశం ఉంటుందని, దానం నాగేందర్ సస్పెన్షన్ ఎత్తివేసినట్టు సాక్షాధారం ఏది స్పీకర్ దృష్టికి పిటిషనర్లు తీసుకరాకపోవడంతో ఆయనపై అనార్హత వేటు పడుతుందా? లేదా?, దీనిపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది? పెద్ద సస్పెన్స్గా మారింది.
20thfeb2026 |శుక్రవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
20thfeb2026 | శుక్రవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 20thfeb2026 |
ഫാക്ട് ചെക്ക്: മൂന്നാമതും പിണറായി സർക്കാർ വരണമെന്ന് അൻവർ? വസ്തുതയെന്ത്?
2023ൽ അൻവർ നടത്തിയ പ്രസ്താവനയുടെ ഭാഗമാണ് ഇപ്പോൾ പ്രചരിക്കുന്നത്
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన బాగుందని, మంత్రులంతా టీంవర్క్తో పనిచేస్తున్నారని ఏఐసిసి అగ్రనేతలు ప్రశంసించా రు. దీంతోపాటు టీం వర్క్ మరింతగా పెరగాలని ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు సిఎం రేవంత్రెడ్డి, మంత్రులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కాన్సెఫ్ట్ బాగుందని, దానిని విజయవంతం చేయాలని అగ్రనేతలు సూ చించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాదు ప్ర పంచంలోనే నెంబర్వన్గా నిలవాలని అగ్రనేతలు ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని వారు సూచించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వారు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలన్న దృఢ సంకల్పంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర సీనియర్ నాయకులు న్యూఢిల్లీలోని ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై రాహుల్ గాంధీ, ఖర్గే సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్, వ్యూహాత్మక రోడ్మ్యాప్పై ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్, దాని వ్యూహాత్మక రోడ్మ్యాప్పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలిసింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక వాగ్దానాల అమలు, విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి పురోగతి, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు, నిర్మాణాత్మక సంస్కరణలపై అధిష్ఠానానికి సిఎం రేవంత్రెడ్డి సమగ్రంగా వివరించినట్టుగా తెలిసింది. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావం గురించి ముఖ్యమంత్రి తెలియచేసినట్టుగా సమాచారం. డిసెంబర్ 2023లో ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ కొలువుదీరినప్పటి నుంచి మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం చేపట్టిన విప్లవాత్మక చర్యలను నాయకత్వానికి సిఎం వివరించారని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తున్న విశేష ప్రజా మద్దతు, తదితర అంశాలను అగ్రనాయకుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావించినట్టుగా తెలిసింది. జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వం తెలంగాణ సమగ్ర, సమాన అవకాశాల అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని రేవంత్ అధిష్ఠానంతో పేర్కొన్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ సాధించిన విజయాలపై సిఎం రేవంత్ రెడ్డి ప్రజేంటేషన్ ఈ సందర్భంగా తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన, పార్టీ బలోపేతంపై అధిష్ఠానం సమీక్షించడంతో పాటు మంత్రుల ఆయా శాఖల్లో సాధించిన ప్రగతికి గురించి ఏఐసిసి అగ్రనేతలు అడిగి తెలుసున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తమకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛను ఇస్తున్నారని మంత్రులు ఏఐసిసి అగ్రనేతలతో పేర్కొన్నట్టుగా సమాచారం. ప్రభుత్వం, పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలపై సిఎం రేవంత్ రెడ్డి ప్రజేంటేషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై కూడా అధిష్ఠానంతో సిఎం చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్ఠానం పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. 2023లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు తీరును హైకమాండ్ విశ్లేషించినట్టుగా తెలిసింది. వరిధాన్యం సాగు, కొనుగోలుకు సంబంధించి ఖర్గే, రాహుల్గాంధీలు ఆరా తీసినట్టుగా సమాచారం. తెలంగాణలో ఆయిల్ ఫాం పంట ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రనేతలకు వివరించినట్టుగా తెలిసింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై.. త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించినట్టుగా తెలిసింది. రెండు రోజుల తరువాత మరోసారి అభ్యర్థులపై ఎంపికపై చర్చించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. సీనియర్ నాయకులు, మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలు, పార్టీ ఫిరాయింపుల విషయంలో పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న అసంతృప్తి గురించి ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఓ నివేదికను ఇప్పటికే అధిష్ఠానానికి సమర్పించిన నేపథ్యంలోనే దానిపై కూడా అధిష్ఠానం ఆరా తీసినట్టుగా తెలిసింది. అజహరుద్దీన్ కోసం రాజీనామా చేయిస్తారా? దీంతోపాటు మంత్రి అజహరుద్దీన్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు గవర్నర్ నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో త్వరలోనే ఎమ్మెల్సీగా ఆయనకు ఇవ్వాలని లేకపోతే మంత్రి పదవికి ఇబ్బందులు ఎదురవుతాయని అధిష్ఠానానికి సిఎం రేవంత్రెడ్డి వివరించినట్టుగా తెలిసింది. అయితే, పార్టీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వారిని రాజీనామా చేయించి వారికి ఉన్నతమైన పోస్టును కట్టబెట్టి ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ నియమించాలని అధిష్ఠానం సూచించినట్టుగా సమాచారం. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే త్వరలోనే ఆయన్ను ఢిల్లీకి పిలిచి మాట్లాడుతామని ఏఐసిసి అగ్రనేతలు సిఎం రేవంత్రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా సమాచారం. సమ్మక్క, సారలమ్మల వీరగాథను ఆసక్తిగా విన్న రాహుల్, ఖర్గే మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రి సీతక్కను అడిగి తెలుసుకున్నారు. సమక్క- సారలమ్మల వీరగాథను రాహుల్గాంధీ, ఖర్గేలు ఆసక్తిగా విన్నారు. ఆదివాసీల అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరపై సుమారు పది నిమిషాల పాటు చర్చ జరిగింది. సమ్మక్క - సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా చాటేందుకు సినిమా తీయాలని రాహుల్ గాంధీ మంత్రి సీతక్క సూచించారు. గ్రేటర్ ఎన్నికలు, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలపై కేబినెట్లో.. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చాలా బాగున్నాయని ఏఐసిసి అగ్రనేతలు ప్రశంసించడంతో పాటు గ్రేటర్ ఎన్నికలు ముందు జరపాలా, లేదా ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు ముందు జరపాలా అన్న విషయాన్ని కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు సిఎంకు, మంత్రులకు సూచించినట్టుగా తెలిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని కాబట్టి గెలవొచ్చని, కానీ, లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలని ఖర్గే వారికి మార్గనిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. నేతలు సమష్టిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మంత్రులంతా నిరూపించారని రాహుల్గాంధీ ప్రశంసించినట్టుగా సమాచారం. సమావేశం వివరాలను ఎక్స్లో వెల్లడించిన మల్లికార్జున ఖర్గే ఈ సమావేశం అనంతరం వివరాలను మల్లికార్జున ఖర్గే తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని, రాష్ట్ర నాయకులు, మంత్రులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా తదుపరి కార్యాచరణపై చర్చించామని, సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షలను సాకారం చేస్తూ సమగ్ర తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
రూ.70వేల కోట్ల స్కామ్ను పట్టిచ్చిన హైదరాబాద్ బిర్యానీ
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని బిర్యానీ బిల్లుతో మొదలై ఏకంగా రూ.70 వేల కోట్ల పన్ను ఎగవేత స్కామ్ బట్టబయలైం ది. ఐటి అధికారులు బిల్లింగ్ వ్యవస్థను అధ్యయనం చేయడం ద్వారా హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా భారీ స్కామ్ వెలుగు చూసింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఈ బి ల్లింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాయి. కం ప్యూటర్ సాధనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అధి కారులు సుమారు 1.77 లక్షల రెస్టారెంట్ల నుండి బిల్లింగ్ రికార్డులను తనిఖీ చేశారు. దాదాపు 60 టెరాబైట్ల డే టాను పరిశీలించారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. కస్టమర్లు చెల్లించిన తర్వాత అ నేక బిల్లులు కంప్యూటర్లోనే తొలగిపోతా యి, లేదంటే మార్పులు జరుగుతాయి. అంటే మెు త్తానికి బిల్లు ఉండదు, లేదంటే ఎక్కువ బిల్లు అ యిన తక్కువగా చూపిస్తుంది. ఇదంతా కస్టమర్ బిల్లు చెల్లించి వెళ్లిపోయాక జరుగు తున్న తంతుగా గుర్తించారు. దేశమంతటా ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించే రెస్టారెంట్లు రూ.13,000 కోట్లకు పైగా విలువైన బిల్లులను తొలగించా యి. తెలంగాణ, ఎపిలలో మాత్రమే ఇలా కనిపిం చకుండా చేసిన బిల్లులు రూ.5,100 కోట్లకు పైగా జరిగాయి. రెండుసార్లు తనిఖీ చేయడానికి అధికారులు 40 రెస్టారెంట్లను స్వయంగా సందర్శించారు. నిజమైన అమ్మకాలను కంప్యూటర్ రికార్డులతో పోల్చారు. ఈ చిన్న తనిఖీ కూడా దాదాపు రూ.400 కోట్ల అమ్మకాలను మిస్ అయ్యా యని గుర్తించింది. మెుత్తానికి రూ.70 వేల కోట్ల వరకు స్కామ్ జరిగింది. ఈ లిస్టులో కర్ణా టక ముందు వరుసలో ఉంది. అత్యధిక పన్ను ఎగవేత కనిపిం చింది. తరువాత తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా కొన్ని రెస్టా రెంట్లు బిల్లులను తొలగించడానికి కూడా ప్రయత్నించలేదు. వాస్తవానికి సంపాదించిన దానికంటే తక్కువ డబ్బు సంపాదించామని పన్ను శాఖకు తెలిపారు. ఇప్పటివరకు అధ్యయనం చేసిన డేటా ప్రకారం.. అన్ని రెస్టారెంట్ అమ్మకాలలో నాలుగో వంతు దాచిపెట్టారని అధికారులు విశ్వసిం చారు. రెస్టారెంట్లు సాధారణంగా అన్ని చెల్లింపులు, నగదు, కార్డులు, యూపిఐలను బిల్లింగ్ సాఫ్ట్వేర్లో నమోదు చేస్తాయి. తద్వారా సిబ్బంది డబ్బును దొంగిలించలేరు. కానీ యజమానులు స్వయంగా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అధికారులు కనుగొన్నారు. నగదును ట్రాక్ చేయడం కష్టం కాబట్టి నగదు బిల్లులను మాత్రమే తొలగిం చడం కొన్ని రెస్టారెంట్లు చేస్తున్నాయి. మరికొందరు కొన్ని రోజులు లేదా ఒక నెల మొత్తం బిల్లులన్నింటినీ తీసేస్తున్నారు. ఆ తర్వాత చాలా తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ తక్కువ పన్ను కడుతున్నారు. కాగా, ఈ డేటా ఆరు సంవత్సరాలలో దాదాపు రూ.2.43 లక్షల కోట్ల రెస్టారెంట్ అమ్మకాలను కవర్ చేసింది. ప్రతిదీ విశ్లేషించడానికి, అధికారులు డిజిటల్ ల్యాబ్ల నుండి ఎఐ సాధనాలను ఉపయోగించి పనిచేశారు. ఇవి రెస్టారెంట్ రికార్డులను జిఎస్టి నంబర్లు, పబ్లిక్ లిస్టింగ్ల వంటి ఆన్లైన్ సమాచారంతో సరిపోల్చాయి. మొదట హైదరాబాద్, విశాఖపట్నం, సమీప పట్టణాలలో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కుంభకోణం ఎంత పెద్దదో అధికారులు గ్రహించిన తర్వాత, దర్యాప్తును దేశవ్యాప్తంగా విస్తరించారు. అనేక ఇతర బిల్లింగ్ సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఉన్నాయి. అవి కూడా ఇలాంటి సీక్రెట్స్ను దాచిపెడుతూ ఉండవచ్చంటున్నారు. తనిఖీలు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు.
న్యూఢిల్లీ: మానవ కేంద్రీకృత దిశలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత సాగాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారతీయ మండపంలో ఏఐ సమ్మిట్లో గురువారం ఆయన ఈ దిశలో ఏఐ సంబంధిత మా.న.వ్ విజన్ను ఆవిష్కరించారు. భారతదేశం తరఫున ఏఐ ప్రక్రియలో ఈ వినూత్న, నిర్మాణాత్మక రూపాన్ని ప్రపంచం ముందుంచుతున్నామని ప్రధాని తెలిపారు. మానవ్ (MANAV)ఏఐ విజన్ను పరిచయం చేశారు. ఇందులో ఏం మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్..దీని మేరకు ఏఐ నైతికతను, బాధ్యతను పరిగణనలోకి తీసుకుని పనిచేయాలి. ఇక ఎ అకౌంటబులిటి. సమాజం పట్ల పారదర్శకతతో జవాబుదారితో ఉండాలి. ఎన్ ...నేషనల్ సావర్నిటి, ఒక దేశం సృష్టించిన డేటా ఆ దేశ పరిధిలోనే ఉండాలి. ఆ దేశానికి చెందాలి. ఎ ..యాక్సెసబులిటి అండ్ ఇంక్లూజివ్ ....అనుసంధానం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండటం. వి ...వాలిడ్ అండ్ లెజిట్మేట్ అంటే చట్టబద్ధం, నిబంధనలకు అనుగుణంగా ఏఐ ఉండాలని ఈ నూతన ఆవిష్కరణను ప్రధాని మోడీ వివరించారు. ఎవరూ ఊహించనంతగా ఏఐ పరిజ్ఞానం విస్తరించుకుంటోంది. ఈ క్రమంలో ఈ ప్రక్రియను ప్రజాస్వామికరించాల్సి ఉంటుంది. మానవ కేంద్రీకృతంగా ఏఐ అందరికీ అందుబాటులోకి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో దేశీయత, సార్వత్రికత కీలకం అని పిలుపు నిచ్చారు. భయంలేదు ..జయం వైపు చూపు దూసుకువచ్చిన ఈ సాంకేతికత పరిణామాల పట్ల భారతదేశం భయపడటం లేదు. పైగా దీనిని ఓ సదవకాశంగా మల్చుకుని రేపటి మంచికి అవసరం అయిన బ్లూప్రింట్గా మలుచుకుంటుందని తెలిపారు. మన ఆలోచనలకు కూడా అతీతంగా ఉండేలా ఏఐ ఉంటుంది. ఈ క్రమంలో దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకునే విధంగా నిబంధనలు అవసరం అన్నారు. చట్టబద్ధతతోనే ఇది సాధ్యం అవుతుందని చెప్పారు. పలువురు ప్రపంచ నేతల సమక్షంలో ప్రధాని మోడీ ప్రసంగం సాగింది. అపార పరివర్తన శక్తిని సంతరించుకున్న కృత్రిమ మేధను సద్వినియోగం చేసుకుంటే క్షేమదాయకం అవుతుంది లేకపోతే అది విధ్వంసానికి దారితీస్తుందని మోడీ హెచ్చరించారు. అసంఖ్యాక జనాభా గల భారతదేశం అందుబాటులోకి వచ్చే ఏఐను సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే అది మనకు ఎనలేని మేలు చేస్తుందని చెప్పారు.] ప్రజా సంక్షేమం..సంతోషమే సూచిక దేశ ప్రజల సంక్షేమం, అందరి సంతోషమే గీటురాయిగా కృత్రిమ మేధ ప్రస్థానం సాగాల్సి ఉంటుంది. ఈ వినూత్నత ద్వారా మనకు అందే డాటా ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. అంతేకాని మనుష్యులు చివరికి డాటా పాయింట్ లేదా ముడిసరుకులు కారాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఏఐ మనను శాసించరాదు. మనం ఈ వ్యవస్థను నిర్ధేశించగలగాలని ప్రధాని పిలుపు నిచ్చారు. ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటున్న కృత్రిమ మేధ సంక్షిప్తంగా చెప్పాలంటే నైతికత జవాబుదారి సార్వత్రికత, దేశీయతతో కూడిన చట్టబద్ద వ్యవస్థ అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు భారతదేశ ఆవిష్కృత మానవ విజన్ 21వ శతాబ్ధంలో మానవీయ విలువలు, సంక్షేమ అనుసంధాన దిశలో అత్యంత కీలకమైన బంధం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశమే హద్దు..పగ్గాలు చేతిలో ఈ నూతన సాంకేతికత ఆకాశం హద్దుగా సాగాల్సిందే అయితే అదుపు చేసే మీట మన చేతిలో ఉండాల్సిందే అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జిపిఎస్ ఉదాహరణ ఉటంకించారు. ఈ మార్గ సూచిక సాధనంతో మనం వెళ్లాల్సిన చోటికి సూచనలు వెలువడుతాయి. అయితే తుది నిర్ణయం తీసుకునేది కేవలం దీనిని వాడుకునే వారే అవుతారని చెప్పారు. ఏఐకి కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. ఏఐని మనం ఏ విధంగా తీసుకువెళ్లుతామనే విషయంపైనే మన భవిత ఆధారపడి ఉంటుందని అన్నారు. గురువారం నాటి సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్, బ్రెజిల్ నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, స్విస్ ప్రెసిడెంట్ గై పర్మీలిన్ , పలు టెక్ కంపెనీల సిఇఒలు హాజరయ్యారు. ఏఐ విప్లవంలో భారతదేశం కేవలం పాత్రవహించడమే కాకుండా నాయకత్వ స్థాయికి కూడా వెళ్లుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ పట్ల భయాలను వీడి జయాల వైపు సాగేందుకే భారత్ సంకల్పించిందని వివరించారు. ఇందుకు మన యువత ప్రతిభ సద్వినియోగం అవుతుందని తెలిపారు.
మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: క్యాతన్పల్లిలో దొడ్డిదారిన అధికారం లాక్కునేందుకు మంత్రి వివేక్, పోలీసుల ముందే తమ దళిత, గిరిజన మహిళ కౌ న్సిలర్లపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం ఆక్షేపణీయమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజ్యాంగం చేతిలో పె ట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్టపగలే ప్రజా తీర్పు ను కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడర ని, కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అని, రేపు మళ్ళీ బీఆర్ఎస్ రాగానే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పని, ఎవరూ కాపాడలేరని, ఉద్యమకారుడు బాల్క సుమన్పై ప్రభుత్వ కక్ష సాధింపు అక్రమంగా అరెస్ట్ చేసి 200 కిలోమీటర్ల దూరంలో ని ఆదిలాబాద్ జైలుకు తరలించడం దు ర్మార్గమన్నారు. బీజేపీ నాయకులు పోలీసులను బూతులు తిట్టిన అరెస్టులు ఉం డవు కానీ ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుల పైనే అక్రమ కేసులా అని హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి పరామర్శించిన మాజీ మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజ సమని ప్రశ్నించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్లో జైళ్లు ఉన్నప్పటికీ వాళ్లను అ క్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గమన్నారు. క్యాతన్పల్లిలోని 22 స్థానాల కు గానూ 14 స్థానాలను బీఆర్ఎస్ గె లుచుకుందని, బీఆర్ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారన్నారు. ప్రజ లు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ శిరసావహించాల్సింది పోయి, ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదన్నారు. కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారన్నారు. అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్ చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళ కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, నోటితో చెప్పలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడి జరుగుతున్నప్పుడు వివేక్ మంత్రి హోదాలో అక్కడే ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడం, కోరం ఉన్న ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం శోచనీయమన్నారు. క్యాతన్పల్లి మహిళ కౌన్సిలర్ల తరపున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం ఫిర్యాదు తీసుకోలేదన్నారు. కౌన్సిల్కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజిరెడ్డి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టారు. బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలుగా ఉండి కూడా లోపలికి పంపించకుండా కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేశారన్నారు. పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గూండాలు స్టేషన్కు వచ్చి మరీ కొడుతున్నారన్నారు. ఈ రకమైన దాడులు మంచివి కావని హితావు పలికారు. పోలీస్ కవాతు ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రజల్లో విశ్వాసం నింపాలి కానీ జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ నాయకులను, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసులు కవాతు చేశారన్నారు. ఇబ్రహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. జనగామలో ఓటింగ్ కోసం తమ కౌన్సిలర్ చేతి పైకెత్తితే వెనుక నుండి కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. అందులో దళిత మహిళ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. ఒక ఎంపీ అన్యాయంగా రెండోసారి తొర్రూరులో ఓటు నమోదు చేసుకుని ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగే మున్సిపాలిటీలు గెలిచిందని, తాము ఇప్పుడు దాదాపు 800 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నామని, అప్పుడు తాము ఇలా చేయలేదన్నారు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. దొడ్డిదారిన పదవులు దక్కించుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారని, కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకుడు బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టిన ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో తెలంగాణ క్యాబినెట్తో రివ్యూ చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడికి పోయిన చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారని ప్రశ్నించారు. ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే అని అడిగారు. తెలంగాణలో పట్టపగలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరని, రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడలాని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, క్యాతన్పల్లి ఇన్సిడెంట్ పైన గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని, పోలీసు అధికారులకు మేము చెప్పేదొకటే.. అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒకే తీరుగా ఉండవు. కాలం మారుతుంది, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పోస్టింగ్ల కోసం నాయకుల చెప్పుచేతల్లో పనిచేయకూడదన్నారు. చట్టాన్ని అతిక్రమించి, పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హరీష్రావు హెచ్చరించారు.
కాబూల్: అఫ్గానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం మ హిళలపై విపరీతమైన ఆంక్షలు విధిస్తోంది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తాలిబన్లు కొత్త నేర నియమావళిని ప్రవేశ పెట్టారు. ఇది మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. ఇది ఎంత అరాచకమంటే భార్యలను భర్తలు శారీరకంగా హింసిం చవచ్చు. ఎముకలు విరగకుండా ఉంటే నేరం కా దంటూ గృహహింస చట్టాన్ని తీసుకొచ్చారు. రక్తస్రావం కానంతవరకూ ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా, అది శిక్ష కిందకు రాదు. తీవ్ర మైన దాడి జరిగినట్టు నిరూపితమైనాభర్తకు గరిష్టంగా కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే విధిస్తారు. బాధిత మహిళ అలా కోర్టుకు వెళ్లినప్పు డు కూడా వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలి. అలాగే న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించినప్పుడు కూడా పూర్తిగా క వర్ చేసుకునే ఉండాలి. భర్త లేదా పురుష బంధు వు (మహ్రామ్) అనుమతి లేకుండా మహిళలు పు ట్టింటికి లేదా బయటకు వెళ్తే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. మహిళలు బయట మాట్లాడితే వినపడకూడదు. ముఖం కనబడకుండా పూర్తిగా క ప్పుకోవాలి. ఈ కొత్త నిబంధనలపై అఫ్గాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశా రు. ఈ కొత్త శిక్షాస్మృతి లో ఆర్టికల్ 9 ప్రకారం అఫ్గాన్ సమాజాన్ని మత పెద్దలు (ఉల్మా), ఉన్నతవర్గం(అష్రాఫ్), మధ్యతరగతి, దిగువ తరగతి అ నే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. నేర తీవ్రతను బట్టి కాకుండా ఈ వర్గాల ప్రకారం శిక్షలు ఉంటాయి. 2009లో అధికారంలో ఉన్న అఫ్గాన్ ప్రభుత్వం మహిళలపై హింసకు వ్యతిరేకంగా తీ సుకొచ్చిన చట్టాన్ని కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది.
శుక్రవారం రాశి ఫలాలు (20-02-2026)
మేషం ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృషభం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి. మిధునం ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు. కర్కాటకం రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సింహం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కన్య ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. తుల గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు. వృశ్చికం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ధనస్సు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. మకరం ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుంభం కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. మీనం దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
దుండిగల్ మున్సిపల్లో అక్రమాలు.. లంచంపై ఆధారాలు లభ్యం
లంచంపై ఆధారాలు లభ్యం ప్రకటనలో పేర్కొన్న ఎసిబి అధికారులు మనతెలంగాణ, సిటిబ్యూరోః దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎసిబి దాడులపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గండిమైసమ్మ వద్ద ఉన్న దుండిగల్ మున్సిపల్ కార్యాలయంపై ఎసిబి అధికారులు బుధవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, కార్యాలయ పనితీరును తనిఖీ చేశారు. కింద అక్రమాలు జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వాట్సాప్ చాట్లలో లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. సూపర్వైజర్ భర్తకు చెందిన సంస్థకు అనధికారికంగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించి, వారి ఖాతాల్లోకి వచ్చిన నిధుల మూలాలను, అక్రమాలతో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు ఎసిబి అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కార్యాలయ రికార్డులు, డిజిటల్ డేటా, ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ సమగ్ర నివేదిక పంపనునట్లు పేర్కొన్నారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఐదుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. శానిటరీ ఫీల్ అసిస్టెంట్ల ద్వారా పారిశుధ్య కార్మికుల హాజరు రికార్డులను తారుమారు చేసినట్లు తేలింది. 49 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 12 దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉన్నా, 21 రోజుల గడువు దాటిపోయినా పెండింగ్లోనే ఉంచారు. 32 అనధికారిక నిర్మాణ కేసులలో, 28 కేసులకు సంబంధించి రెండో నోటీసు జారీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జి+3 (మూడు అంతస్తులు) అనుమతి ఉన్న చోట, అక్రమంగా నిర్మించిన జి+5 (ఐదు అంతస్తులు) భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించారు.
రూ.70వేల లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ విద్యాశాఖ సూపరింటెండెంట్
నగరంలోని సైఫాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో పనిచేస్తున్న సూపరింటెండెట్ ఫణిరాజ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్లు రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఎసిబి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన స్కూల్ కు సంబంధించి సిబిఎస్ఇ ఎన్ఒసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైల్ ను ప్రాసెస్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రూ.70 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను సూపరింటెండెంట్తో మాట్లాడి ఎన్ఒసీ ఇప్పిస్తానన్నాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. గురువారం డిమాండ్ చేసిన రూ.70 వేలు సూపరింటెండెంట్ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ తీసుకున్న సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో టి20లో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్ 19 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు షఫాలీ వర్మ (29), స్మృతి మంధాన (31) శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. జెమీమా రోడ్రిగ్స్ (4) పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 5 ఫోర్లతో 36 పరుగులు సాధించింది. రిచా ఘోష్ (19) పరుగులు చేసింది. అయితే ఆతిథ్య జట్టు బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్తో బౌలింగ్ చేసి భారత్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. గార్డ్నర్ మూడు, కిమ్ గార్థ్, సదర్లాండ్, సోఫి తలో రెండేసి వికెట్లను పడగొట్టి భారత్ను కట్టడి చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఓపెనర్లు జార్జియా వోల్, బెథ్ మూనీ ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 4 ఫోర్లతో 46 పరుగులు చేసింది. చెలరేగి ఆడిన జార్జియా 57 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 88 పరుగులు సాధించింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేక పోయారు. దీంతో ఆసీస్ ఆశించిన స్కోరును సాధించలేక పోయింది. కానీ బౌలర్లు అద్భుత ప్రతిభతో తక్కువ స్కోరును కాపాడుకుని జట్టుకు గెలుపు సాధించి పెట్టారు.
. ముందుకు రాని ప్రభుత్వం. పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు. ఈలలు, నినాదాలతో గందరగోళం. టీడీపీ సభ్యుల నిరసనలు. ఇందాపూర్ నెయ్యిపై ఆగని రగడ. వాయిదాలతో నడిచిన మండలి. అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: తిరుపతి లడ్డూ తయారీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై శాసనమండలిలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చర్చకు ప్రతిపక్ష వైసీపీ పట్టుబడుతుండగా… అధికార పక్షం మాత్రం ససేమిరా అంటున్నది. ఈ వివాదంపై మాటలయుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో శాసనమండలి దద్దరిల్లింది. శాసనమండలి సమావేశాలు గురువారం […] The post పట్టువీడని వైసీపీ appeared first on Visalaandhra .
సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూదిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ […] The post అన్నీ ఉచితాలంటే ఎలా? appeared first on Visalaandhra .
ఇస్కఫ్ జాతీయ మహాసభలో వక్తలు (విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)ప్రజల ఐక్యతతోనే సామ్రాజ్యవాదాన్ని, మతతత్త్వాన్ని ఓడించగలమని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా అన్నారు. శాంతి, స్నేహం, సాంస్కృతిక ఐక్యతకు అంకితమైన 85 ఏళ్ల చరిత్ర గల భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్) 24 వ జాతీయ మహాసభలు గురువారం చెన్నై నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, శాంతి ఉద్యమ నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద […] The post ఐక్యతతోనే సామ్రాజ్యవాద ఓటమి appeared first on Visalaandhra .
ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో దాడి
సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ ఉన్మాది దారుణానికి తెగబడ్డాడు.గత కొంతకాలంగా ప్రేమించి దూరం పెడుతుందని యువతిపై తన ప్రియుడు సుత్తితో దాడి చేసిన సంఘటన గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్ లో చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరిస్తోందని ప్రియురాలిపై సుత్తితో దాడి చేశాడు.యువతిపై దాడి చేయడంతో యువతి కేకలు విని స్థానికులు వచ్చి నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేశ్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలో నుతనకల్ మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన రావడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో కూర్చిపెట్టి మాట్లాడారు. అప్పటి నుంచి యువతి సూర్యాపేటలోని బంధువులు ఇంట్లో ఉంటుంది. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్ లో ఉన్న యువతిపై ప్రియుడు దాడి చేశాడు. సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి స్పందన పై లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిన్ల మహేష్ దాడికి పాల్పడినట్లు తెలిపారు. స్పందన స్నేహ నగర్ లో నివాసం ఉంటున్న తన అక్క బావ ఇంటికి గత రెండు రోజుల క్రితం వచ్చింది. గురువారం ఉదయం 09.15 గంటల సమయములో స్పందన ఒక్కతే ఇంటిలో ఉండడం చూసి పథకం ప్రకారం దాడి చేసినట్లు తెలిపారు. మహేష్ స్పందన పై పథకం ప్రకారం షాపు యందు ఇనుప సుత్తె కనుగోలు చేసి ఆమె దగ్గరికి వెళ్ళి వారి ప్రేమ విషయమై అమెతో గొడవ పడి తన వద్ద యున్న సుత్తె తో తలపై కొట్టి గాయపర్చనట్లు పోలీసులు పేర్కొన్నారు. స్పందన కేకలు విని చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను కాపాడారని, స్పందనను చికిత్స నిమిత్తం సూర్యపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యందు చేర్పించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్ కు వెళ్ళి స్పందన బావ పూల బాబురావు నుండి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు డి.ఎస్.పి ప్రసన్న కుమార్ తెలిపారు. సంఘటన వద్ద సూర్యాపేట రూరల్ జి. రాజశేఖర్ , చివ్వెంల యస్.ఐ వి. మహేశ్వర్, క్లూస్ టీం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్
బాలికకు గంజాయి తాగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం బాలిక తన అమ్మమ్మతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం పాఠశాలకు వెళ్తున్నట్లు ఆ బాలిక ఇంట్లో చెప్పి బయటికి వెళ్లింది. సాయంత్రం అయినా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక అమ్మమ్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలోని విద్యార్థులను ఆరా తీశారు. వారు చెప్పిన ఆధారాలతో సీసీ కెమెరాలను పరిశీలించారు. స్థానికంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఆ బాలికకు గంజాయి, మద్యం తాగించి ముగ్గురు నిందితులు అత్యాచారం చేసినట్లు గుర్తించారు. నిందితులు కూడా మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను వెంటనే పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు, రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో ఒక యువకుడు స్థానిక భవానీ నగర్లో రౌడీ షీటర్ పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్కు తరలించారు.
ఇరాన్పై సైనిక దాడికి అమెరికా సిద్ధం
ఇరాన్పై ఏ క్షణంలో అయినా భీకర దాడికి అమెరికా సర్వంసమాయత్తం అయింది. ఇరాన్ అణు చర్చలు విఫలం అయితే తాము దాడికి దిగడమే తరువాయి అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తరచూ చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మిడిలిస్టు ప్రాంతానికి అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఎఫ్ 35, ఎఫ్ 22 జెట్ యుద్ధ విమానాలు, అనుబందంగా పలు ఫైటర్ విమానాలను రంగంలోకి దింపారని, ట్రంప్ అనుమతిని ఇస్తే వెంటనే దాడులు తప్పవని వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపింది. వచ్చే శనివారం లేదా ఆదివారం అమెరికా దాడులు జరగవచ్చునని , దీనిపై ట్రంప్ వైట్హౌజ్లో తన సలహదారులతో కీలక చర్చలకు దిగారని వెల్లడైంది. మెరికా సైనిక కదలికలను ఇరాన్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఎలక్ట్రానిక్ ఆయుధ వ్యవస్థతో కూడిన పలు యుద్ధ విమానాలను రెండో దఫాగా ఇరాన్ సమీపంలోకి తీసుకువచ్చి ఉంచారు. భారీ స్థాయి దాడులకు ఈ విమానాలు అత్యవసరంగా అమెరికా భావిస్తోంది. ఇరాన్పై పూర్తి స్థాయి దాడులకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నరీ లేనిది వెల్లడికాలేదు. అయితే దాడి జరిపితే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే విధంగా నిర్ణీత లక్షం ఎంచుకుంటారని వెల్లడైంది. ముందుగా ఇరాన్ క్షిపణి వ్యవస్థను దెబ్బతీయడం ,ఈ లోగా తమ మాట వినకుండా వ్యవహరిస్తోన్న ఖమేనీ పాలనను అంతమొందించడం కోసం ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అణు చర్చలు ఫలవంతం అయ్యేలా చూడాలనే షరతుతో జెనీవాలో ట్రంప్ ఆదేశిత చర్చలు జరిగాయి.ఈ రెండో దఫా చర్చల్లోనూ ఎటువంటి ఫలితం వెలువడలేదు ఈ దశలో ఇక ఇరాన్ నేత ఖమేనీని టార్గెట్ చేసుకుని ట్రంప్ సైనిక దాడులకు వ్యూహాత్మక ప్లానింగ్కు దిగారని వెల్లడైంది. ఇరాన్పై దాడులకు ఎఫ్ 22 రాప్టోర్స్, ఎఫ్ 35 లైట్నింగ్స్ సిద్ధం చేశారు. ఎక్కువగా గగనతల దాడులతోనే ఇరాన్ పాలకులను దెబ్బతీయాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. 2003 తరువాత ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికా సైనిక పాటవం మొహరించుకుని ఉంది. పరిస్థితిని ఇరాన్ సమీక్షించుకొంటోంది. తనకున్న క్షిపణి బలగాలను మరింత అప్రమత్తం చేసుకుంది. ముందుగా అమెరికా స్థావరాలలను దెబ్బతీయడం ద్వారా వ్యూహాత్మకంగా ట్రంప్ ఆధిపత్యానికి సవాలు విసిరేందుకు రంగం సిద్ధం చేసుకంది. చమురు ట్యాంకర్ల రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు కూడా ఇరాన్ బలగాలు యత్నించే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ పరిణామాల్లో తీవ్రతకు దారితీస్తుంది. ఇక అమెరికాను అనూహ్య రీతిలో దెబ్బతీసే పాటవం తమకు ఉందని, ఇది అత్యంత కీలకమైన పరిణామం అవుతుందని ఇరాన్ ఉన్నత స్థాయి వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపిన దివిసీమ విద్యార్థి డొక్కా జ్ఞానేశ్వర్
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపిన దివిసీమ విద్యార్థి డొక్కా జ్ఞానేశ్వర్ డొక్కా జ్ఞానేశ్వర్
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రూ.5.80 కోట్లకు అనుమతి
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా సమీకృత భవన సముదాయ ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.5.80 కోట్లను విడుదల చేసేందుకు పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో తెలుగు తల్లివిగ్రహాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను గత ఏడాది ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయి ఆర్థిక మంజూరు అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఈ ఏడాది పనులు పూర్తి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది.
విశాఖలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
ఎపిలోని విశాఖపట్నంలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నగరం లోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు యోగి క్యాటరింగ్ పని చేస్తుంటాడు. బాధితురాలి కుటుంబంతో అతనికి కొంతకాలంగా పరి చయం ఉంది. ఈ పరిచయాన్ని అడ్డుగా చేసుకుని, నిన్న సమీపంలోని దుకాణానికి వెళ్తున్న రెండేళ్ల చిన్నారిని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్ప డినట్లు తెలుస్తోంది.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆలేరు విద్యార్థులు..
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆలేరు విద్యార్థులు.. ఆలేరు,ఆంధ్రప్రభ: ఆలేరు పట్టణంలోని బాలుర, బాలికల
మైనర్ బాలికను వంచించిన యువకుడిపై కేసు నమోదు
మైనర్ బాలికను వంచించిన యువకుడిపై కేసు నమోదు చిట్టినగర్,ఆంధ్రప్రభః విజయవాడ సాయిరాం థియేటర్
Ram to take up Multiple Tasks in his Next
Energetic Star Ram is shattered with the debacle of Andhra King Taluka. The actor was super confident in the film but it failed to generate decent revenues despite receiving positive word of mouth. Ram is on a break and he has shelved his next film that was to be produced by Arka Media Works, the […] The post Ram to take up Multiple Tasks in his Next appeared first on Telugu360 .
Minister |స్థానిక పాలనలో… బీసీ లకు పెద్ద పీట
Minister | స్థానిక పాలనలో… బీసీ లకు పెద్ద పీట 34 శాతం
Big Runtime for Dhurandhar: The Revenge
Several analysts and filmmakers were left surprised with the runtime of Dhurandhar. The final runtime of the film was 3 hours and 35 minutes with the first half of the film lasting for over two hours. The film was watched multiple times by the audience and they enjoyed the film despite a lengthy runtime. The […] The post Big Runtime for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .
Nawab Cafe USA Premieres TODAY
Harshika Productions’ upcoming Telugu film Nawab Cafe is all set for its USA theatrical release. Nawab Cafe is a heartfelt Telugu drama that blends emotion, relationships, and a story rooted in warmth and legacy. The film is scheduled for a worldwide theatrical release on February 20. Earlier announced under the title ChaiWala, […] The post Nawab Cafe USA Premieres TODAY appeared first on Telugu360 .
తాడిగడప శ్రీ కృష్ణవేణి కళాశాలలో జాబ్ మేళా
తాడిగడప శ్రీ కృష్ణవేణి కళాశాలలో జాబ్ మేళా ఈనెల 21న తాడిగడప లోని
గుండెపోటుతో సర్మిడి దేవురావు మృతి
గుండెపోటుతో సర్మిడి దేవురావు మృతి జైనూర్,ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జై
జూబ్లీహిల్స్ లో చైన్స్నాచింగ్ జంట అరెస్టు
బైక్పై తిరుగుతూ చైన్స్నాచింగ్ చేస్తున్న జంటను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి బంగారు గొలుసు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లిహిల్స్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి కథనం ప్రకారం...ఎపిలోని కాకినాడకు చెందిన చెశెట్టి రేవతి (33), గుంటూరు జిల్లాకు చెందిన గిద్దల నరేంద్ర అలియాస్ నాని (23) సనత్ నగర్లోని హిందూ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉంటున్నారు. నరేంద్ర రాపిడో బైక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి చైన్స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీ ఉదయం 9.30 నిమిషాల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 39లో కడపాల మానస అనే యువతి తన కార్యాలయానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. యువతిని బైక్పై వెంబడించిన నిందితులు రోడ్ నంబర్ 44 వద్దకు చేరుకోగానే బైక్ వెనుక కూర్చున్న రేవతి బాధితురాలి మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్పాయ్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. జుబ్లీహిల్స్ ఇన్స్స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం. సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ జె. సతీష్ కేసు దర్యాప్తు చేశారు.
పాలన గాలికొదిలేసిన రేవంత్రెడ్డి: బిజెపి రాంచంద్రరావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు, చిట్ చాట్లతో పబ్బం గడుపుతు పరిపాలన గాలికి వదిలేశారని రాంచంద్రరావు ధ్వజమెత్తారు. తెలంగాణలో విద్యావ్యవస్థను భ్రష్టపట్టించారని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖను చూస్తున్న ఎలాంటి మార్పు లేదన్న ఆయన గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ డ్రామాలు ఆడుతూ విద్య వ్యవస్థను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఎన్నికలు రాగానే హామీలిచ్చి రేవంత్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని అన్నారు. ఉద్యోగుల సంఘం నేతలు మొన్ననే నాతో మాట్లాడడం జరిగిందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక గత రెండేళ్లుగా 60 మందికి పైగా చనిపోయారని ఉద్యోగల సంఘం ఆవేదన వ్యక్తo చేసింది. ఫీజు రియంబర్స్మెంట్, రిటర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదో రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసిందో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తూ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్ట పట్టిస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యవస్థను నీరుగార్చడం అంటే తెలంగాణ పిల్లలు విద్యార్థుల భవిష్యత్తును, తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
తిమ్మారెడ్డిపల్లి తండాలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన
తిమ్మారెడ్డిపల్లి తండాలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన ఊట్కూర్, ఆంధ్రప్రభః నారాయణపేట జిల్లాఊట్కూర్
ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్
రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం కాలేజీ లాగిన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల నుంచి హాల్ టికెట్లు తీసుకుని అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే తెలియజేయాలని ఇంటర్ బోర్డు తెలిపింది.మొత్తం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజవుతున్నట్టు పేర్కొంది. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా హాల్ టికెట్లను పొందే సదుపాయాన్ని కల్పించారు. బోర్డు వద్ద విద్యార్థులు నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్ను శుక్రవారం పంపిస్తున్నట్టు బోర్డు తెలిపింది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నట్టు గుర్తిస్తే... వెంటనే ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకొచ్చి, తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పారు. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న మొదటి సంవత్సరం, 26వ తేదీన రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల టైం టేబుల్ ఇంటర్ బోర్డు ఇదివరకే విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు.
జిల్లాకో తెలంగాణ తల్లి #Telangana #TelanganaThalli #GovernmentDecision #latestnews #viralvideo
అక్రమంగా పశువులు తరలింపు.. జైనూర్, ఆంధ్రప్రభః పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు
మండల అధికారులు పాఠశాలలను తనిఖీ చేయాలి..
మండల అధికారులు పాఠశాలలను తనిఖీ చేయాలి.. బాల్కొండ, ఆంధ్రప్రభః రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు
చిట్యాలలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు
చిట్యాలలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు చిట్యాల, ఆంధ్రప్రభ: చత్రపతి శివాజీ ని
రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపిక కమ్మర్ పల్లి, ఆంధ్ర
హైదరాబాద్లో 13 వేల కోట్ల జిఎస్టి మోసం
హైదరాబాద్లో 13 వేల కోట్ల జిఎస్టి మోసం బట్టబయలైంది. కేసులో గేమింగ్ సంస్థ యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ సంస్థ డైరెక్టర్ పంకజ్ కుమార్ను జిఎస్టి నిఘా విభాగం అరెస్టు చేసింది. మోసాన్ని హైదరాబాద్ జిఎస్టి ఇంటెలిజెన్స్ బహిర్గతం చేసింది. షెల్ కంపెనీలకు నకిలీ కెవైసి వెరిఫికేషన్లు ఇచ్చినట్లు గేమింగ్ సంస్థపై ఆరోపణలున్నాయి. పేమెంట్ గేట్వేలు, బ్యాంకింగ్ యాజ్ పేమెంట్ అగ్రిగేటర్ వ్యవస్థలతో ఈ సంస్థకు లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లతో కూడిన పిన్టెక్ కంపెనీల సహాయంతో అక్రమ ఆన్లైన్ గేమింగ్ వెబ్ సైట్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సిండికేట్లో పంకజ్ కుమార్ను కీలక సూత్రధారుల్లో ఒకరిగా గుర్తించారు. ఆన్లైన్ గేమింగ్ నుంచి వచ్చే నగదు ప్రవాహానికి అవసరమైన యూపిఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ కంపెనీలను చేర్చుకోవడంలో అతడు సహాయపడినట్లు జిఎస్టి నిఘా విభాగం గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్దిదారుల్లో ఈయన కూడా ఒక రు. ఈ క్రమంలోనే హైద రాబాద్ ఆన్లైన్ గేమింగ్ సిండికేట్లపై డిజిజిఐ అణిచివేత చర్యలను షురూ చేసింది. సంస్థకు చెందిన రూ.100 కోట్ల నగ దు ఉన్న బ్యాంకు ఖాతాల ను అధికారులు ఫ్రీజ్ చేశారు.
ఎంపీ చామలకి కృతజ్ఞతలు తెల్పిన వైస్ చైర్మన్ వెంకన్న
ఎంపీ చామలకి కృతజ్ఞతలు తెల్పిన వైస్ చైర్మన్ వెంకన్న మోత్కూర్, ఆంధ్రప్రభః మోత్కూర్
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు..
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు.. మోత్కూర్, ఆంధ్రప్రభః ఛత్రపతి శివాజీ జయంతి ని
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన స్వర్ణకారుల సంఘం
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన స్వర్ణకారుల సంఘం మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్
Heritage, Indapur, Bolebaba and IndiaMART Claims: A Political Diversion?
Former Andhra Pradesh Chief Minister Y. S. Jagan Mohan Reddy has launched a fresh attack targeting Heritage Foods and indirectly linking it to alleged irregularities. His latest press meet focused on claims involving Heritage, Indapur, Bolebaba Dairy and listings on IndiaMART. The larger narrative appears aimed at drawing parallels and shifting public attention. However, a […] The post Heritage, Indapur, Bolebaba and IndiaMART Claims: A Political Diversion? appeared first on Telugu360 .
కోతకు గురైన బీటీ రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
కోతకు గురైన బీటీ రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ తక్షణమే మరమ్మతులు చేయాలని
7,408 homes |మున్సిపల్ పాలకవర్గానికి పెద్ద సవాల్…!
7,408 homes | మున్సిపల్ పాలకవర్గానికి పెద్ద సవాల్…! 7,408 homes |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష
దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఆమె తిరుపతికి రావడం చాలా అరుదు. తాజాగా త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. గురువారం సాయంత్రం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో శ్రీవానీ విఐపి బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుంది.ఈనేపథ్యంలో ఆలయ అధికారులు త్రిషకు స్వాగతం పలికి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయానికి వచ్చినప్పుడు ఆమె సంప్రదాయ దుస్తుల్లో చాలా సింపుల్గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.త్రిష గతంలో (మే 2022లో) మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమె తన స్నేహితురాలు మంచు లక్ష్మితో కలిసి తిరుమల వచ్చారు.
Nandikotkur |శుభకార్యక్రమం రోజునే..
Nandikotkur | శుభకార్యక్రమం రోజునే.. Nandikotkur | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు
హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్
అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్ బండ్ దిగువన ఉన్న ఎన్టిఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల్లో లక్ష మంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500 కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వస్తాయన్నారు. మూడు రోజుల్లో పలు అంశాల పై సదస్సులు సైతం జరుగుతాయని వివరించారు. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని, అలా చేసుకోలేని వాళ్లు నేరుగా రావచ్చని తెలిపారు.
కర్రెగుట్టల్లో తక్షణమే కూబింగ్ నిలిపివేయాలి: కూనంనేని డిమాండ్
కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేందుకు మార్గం సుగమం చేయాలని ఒక పత్రికా ప్రకటనలో ఆయన కోరారు. మావోయిస్టులు సైతం జనజీవనస్రవంతిలోకి వచ్చి, మార్కిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా ఎత్తుగడలను మార్చుకోవాలని సూచించారు. అడవుల్లోని లక్షల కోట్ల ఖనిజ సంపద కోసం మహారాష్ట్ర, చత్తీస్ గడ్ జార్ఖండ్ లో లక్షలాది చెట్లు నరికివేయడాన్ని నిలిపివేయాలన్నారు. ఒకదగ్గర చెట్టును తొలగించాలంటే, మరో ప్రాంతంలో కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్న గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఆసరాగా ఈ చర్యలకు పాల్పడడం సమంజసం కాదని, అడవిలో ప్రకృతి సహజంగా పెరిగిన చెట్లను కొట్టేసి, ఇతర ప్రాంతంలో అన్ని చెట్లు పెంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. కార్పొరేట్ ఖనిజ సంపదను అప్పగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని కూనంనేని విమర్శించారు. నక్సల్స్ పేరు చెప్పి మానవ హననానికి పాల్పడడం మానవత్వానికే మచ్చ అని అన్నారు. విశాల దృక్పథంతో ఆలోచించి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి ప్రభుత్వం తరపున కూడా కృషి చేయాలని సాంబశివరావు కోరారు.
సంచలనం సృష్టించిన జింబాబ్వే.. శ్రీలంక చిత్తు
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్-2026లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్టు జింబాబ్వే. లీగ్ దశలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించి.. లీగ్ దశలో ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్-8కి చేరి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి దాన్ని చేధించింది. జింబాబ్వే బ్యాటింగ్లో ఓపెనర్ బ్రియన్ బెన్నెట్ 63 పరుగులతో నాటౌట్గా నిలవగా.. కెప్టెన్ సికందర్ రజా 45 పరుగులు చేసి సత్తా చాటాడు. మరో ఓపెనర్ తడివానాషే మరుమాని 34 పరుగులు, రియాన్ బర్ల్ 23 పరుగులతో జట్టు విజయంలో తమ వంతు సాయం అందించారు. దీంతో జింబాబ్వే తమ కెరీర్లో టి-20ల్లో రెండో అత్యధిక టార్గెట్ను చేధించి రికార్డు సృష్టించింది. ఇక సూపర్-8లో జింబాబ్వే తన తొలి మ్యాచ్ వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది.
తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడు ?: కడియం శ్రీహరి
కెసిఆర్ జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని ఆయనే మహాత్మాగాంధీ అని తెలంగాణకు కెసిఆర్ ఎలా జాతిపిత అయ్యారని ఆయన ప్రశ్నించారు. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఎన్నో స్కాంలో ఇరుక్కున్న నేతను జాతిపిత అని ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని ఎమ్మెల్యే వివేకానంద ఫిర్యాదు నేపథ్యంలో స్పీకర్ ఎదుట హాజరై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన వాదనలు వినిపించారు. స్పీకర్ సమక్షంలో కెపి వివేకానంద అడ్వకేట్లు కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దీంతోపాటు కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కెపి వివేకానంద ఈనెల 01వ తేదీన స్పీకర్కు మరిన్ని ఆధారాలు అందచేశారు. నేడు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తుది తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. తెలంగాణ మీ అయ్యా సొత్తా? విచారణ అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ అధికారం కుటుంబ హక్కుగా బిఆర్ఎస్ నేతలు వ్యవహారిస్తున్నారని కల్వకుంట్ల కుటుంబంలో అందరూ కేసుల్లో ఉన్నారని వారిపై కేసులు పెడితే తెలంగాణను అవమానించినట్టా? తెలంగాణ మీ అయ్యా సొత్తా? అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ అధికారం పోయినా అహంకారం, మాట తీరులో మార్పు రాలేదన్నారు. అందుకే ప్రజలు బిఆర్ఎస్ ఓటు వేయలేదని ఆయన విమర్శించారు. కెసిఆర్ కూలిపోయే కాళేశ్వరం కట్టడమే కాకుండా రాష్ట్రాన్ని దివాలా తీశారని ఆయన విమర్శించారు. అవినీతితో వేల కోట్ల ఆస్తులు సంపాదించికున్నారని, 2014 ముందు మీ కుటుంబం ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటారని ఆయన మండిపడ్డారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి రూపాయి ఆశించకుండా పనిచేయాలన్నారు. మనమందరం కలిసి అవినీతిరహిత, అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
Guntur |ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి…
Guntur | ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి… Guntur | యడ్లపాడు, ఆంధ్రప్రభ :
Traffic | ట్రాఫిక్ మిర్రర్లు… Traffic | చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ :
ఎదుగుతున్న దేశాలకు ఏఐతో మేలు ః సుందర్ పిచాయ్
కృత్రిమ మేధ ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియను ఆర్థికంగా ముందుకు సాగుతున్న దేశాలు సద్వినియోగం చేసుకోవచ్చునని గుగూల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. ఏఐ హైపర్ ప్రోగ్రెస్ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలననేది మన చేతుల్లోనే ఉందన్నారు. డిజిటల్ డివైడ్, ఏఐ డివైడ్లతో ప్రపంచ సార్వత్రిక ప్రగతి కుంటుపడుతుందన్నారు. ఏఐ రాకతో అనివార్యంగా వర్క్ఫోర్స్ మార్పులు జరుగుతాయి. కొన్ని బాధ్యతలు యాంత్రికం అవుతాయి. పలు రంగాలలో వినూత్న కేరీర్లకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కలిసికట్టుగా వ్యవహరిస్తేనే ఏఐ సాంకేతికత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ దిశలో ప్రభుత్వాల పాత్ర కీలకమైనది అన్నారు. అవసరం అయిన నిబంధనలు, లక్షాలు నిర్ధేశించుకోవడం కీలకం అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఏఐకి అత్యధిక బడ్జెట్ కేటాయింపుల్లో తప్పేమీ లేదన్నారు. కొన్ని కంపెనీలకు ముప్పు : సామ్ ఆల్టన్ ఏఐ రాకతో సాఫ్ట్వేర్ రంగంలో పలు మార్పులు వస్తాయని , ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగంలోని కొన్ని కంపెనీలు దెబ్బతింటాయని ఓపెన్ ఏఐ సిఇఒ సామ్ ఆల్టన్ చెప్పారు. కొన్నింటికి మంచి జరుగుతుంది. కొన్ని దెబ్బతింటాయి. ఏఐతో కోడింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. తేలిక కూడా కానుంది. దీనితో ఇప్పటివరకూ ఈ దిశలో వాడుకునే సాంకేతికతకు ముప్పు ఉండనే ఉంటుందని తెలిపారు.
S.Ilakkiya |సేంద్రియ మేళాకు పటిష్ట ఏర్పాట్లు
S.Ilakkiya | సేంద్రియ మేళాకు పటిష్ట ఏర్పాట్లు S.Ilakkiya | ఎ.కొండూరు, ఆంధ్రప్రభ
Awareness |పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి..
Awareness | పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి.. Awareness | కొడిమ్యాల
temple |దేవస్థానంలో చీరలు వేలం పాట
temple | దేవస్థానంలో చీరలు వేలం పాట temple | చిట్టినగర్, ఆంధ్రప్రభ
ఏపీ సర్కార్ కు ఉద్యోగుల అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు
అవినీతి తిమింగలాలు.. ఎనిమిది మంది ఇంజినీర్లు సస్పెండ్
హైదరాబాద్: టిజిఎస్పిడిసిఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటు పడింది. ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఎడిఇలు. ఎఇలు, సబ్ ఇంజినీర్లు ఉన్నారు. యాంటీ బ్రైబరీ సెల్కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటి వాటికి విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెల్లడైంది. ఫోన్పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా లంచాలు స్వీకరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
Home | రేపో మాపో రైతు భరోసా..! ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు
Rs1.39lakh cr |ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి..
Rs1.39lakh cr | ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి.. విద్యపై ఖర్చు
ఆర్టీసీ బస్సు బోల్తా పడి 19 మందికి గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి అనంతపూర్ కి బయలుదేరింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు స్టేజి సమీపంలో 44 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. స్నేహలత, అరుణ, జయ రాములు, శివ లకు తీవ్ర గాయాలు కాగా మరో 15 మంది కి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏఐ, పన్ను ఎగవేతపై జాతీయ చర్చకు దారితీసిన సుధాకర్ రెడ్డి ఉదుముల దర్యాప్తు కథనం
సుధాకర్ రెడ్డి ఉడుముల నేతృత్వంలో వచ్చిన డేటా దర్యాప్తు కథనం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది
Before 2014 |జాతిపిత అని చేప్పుకోవడానికి సిగ్గు ఉండాలి
Before 2014 | జాతిపిత అని చేప్పుకోవడానికి సిగ్గు ఉండాలి జాతిపిత ఒక్కరే
Total 500 |దర్శిలో మెగా జాబ్ మేళా
Total 500 | దర్శిలో మెగా జాబ్ మేళా Total 500 |
Treasury Department |పదోన్నతుల కల్పనకు కృషి..
Treasury Department | పదోన్నతుల కల్పనకు కృషి.. Treasury Department | విజయవాడ,
Video : Exclusive Interview With Hero Suhas
The post Video : Exclusive Interview With Hero Suhas appeared first on Telugu360 .
Ram charan |సుక్కు మూవీ కథ ఏంటి..?
Ram charan | సుక్కు మూవీ కథ ఏంటి..? Ram charan |
కేసీఆర్ పై కడియం సంచలన కామెంట్స్
మాజీ సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు.
Vijayawada |నూతన కౌలుచట్టం తీసుకురావాలి
Vijayawada | నూతన కౌలుచట్టం తీసుకురావాలి Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ :
MLA |రాధాతో నాదెండ్ల బ్రహ్మం భేటీ
MLA | రాధాతో నాదెండ్ల బ్రహ్మం భేటీ MLA | విజయవాడ, ఆంధ్రప్రభ
21st | అవనిగడ్డకు చాగంటి రాక 21st | అవనిగడ్డ – ఆంధ్రప్రభ
Ambati Rambabu |ఆటో కార్మికులకు చేయూత…
Ambati Rambabu | ఆటో కార్మికులకు చేయూత… Ambati Rambabu | భవానిపురం,
Dhurandar 2 |పోస్ట్ పోన్ నిజమేనా…?
Dhurandar 2 | పోస్ట్ పోన్ నిజమేనా…? Dhurandar 2 | 1300
51.47Bags |అందరికి అందుబాటులో…
51.47Bags | అందరికి అందుబాటులో… 51.47Bags | ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్లోనేరాష్ట్రమంతా
Narendra Modi : ఏఐ భారతకు చిరునామాగా మారనుంది : ప్రధాని మోదీ
భారత్ ప్రపంచ కృత్రిమ మేధస్సు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు
Karnataka |పాపం వృద్ధ దంపతులు…
Karnataka | పాపం వృద్ధ దంపతులు… Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
హైదరాబాద్ లో బిర్యా నీ బిల్లు తీగలాగితే... 70 వేల కోట్ల స్కాం #TaxEvasion #Hyderabad #GST #HotelScam
నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం
జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే […] The post నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం appeared first on Visalaandhra .
రెండో టి20: టీం ఇండియాపై ఆసీస్ ఘన విజయం
కాన్బెర్రా: మూడు టి-20ల సిరీస్లో భాగంగా మనుకా ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరిగిన రెండో టి-20లో భారత మహిళ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఆసీస్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళలు.. 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి.. 163 పరుగులు చేశారు. జార్జీయా వాల్(88) అర్థ శతకంతో రాణించగా.. బీత్ మూనీ 46 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగితా వారెవ్వరూ భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే బ్యాటింగ్లో భారత జట్టు విఫలమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 36, స్మృతి మంధన 31, షెఫాలీ వర్మ 29 మినిహా మిగితా వారు స్వల్ప స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 144 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఈ మ్యాచ్లో 19 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్ని 1-1 తేడాతో సమం చేసింది. బ్యాటింగ్లో అర్థశతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జార్జియ వాల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం
జిల్లా కోఆర్డినేటర్ రమేష్విశాలాంధ్ర ధర్మవరం;;ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ను రిషివిద్యాలయలో ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ బి. రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్ రిజిస్ట్రేషన్ను డీన్ భాస్కర్ రెడ్డి , సీఏఓ రవీంద్ర పూర్తి చేయడం జరిగిందన్నారు.“నేను సేవ చేస్తాను” అనే నినాదంతో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆరోగ్యం, సేవాతత్పరత, స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో రెడ్ క్రాస్ […] The post రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం appeared first on Visalaandhra .
Hall tickets |ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
Hall tickets | ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం Hall tickets |

19 C