SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

` డీజీపీ బి.శివధర్ రెడి ్డహైదారాబాద్(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు మరియు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ …

జనం సాక్షి 13 Feb 2026 7:15 am

మార్చి కల్లా ‘టిమ్స’ పూర్తి

` ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశం ` సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు ` రెడీగా సీటీ స్కాన్, ఎంఆరఐ మిషన్లు ` గుండె ఆపరేషన్ల …

జనం సాక్షి 13 Feb 2026 7:14 am

అర్హులందరికీ అక్రిడిటేషన్లు

జారీ ప్రక్రియపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు గతానికంటే పారదర్శకంగానే ప్రతి జర్నలిస్టుకూ న్యాయం చేస్తాం కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, అవసరం మేరకు మరోసారి మీటింగ్ రాష్ట్ర రెవెన్యూ, …

జనం సాక్షి 13 Feb 2026 7:11 am

పురపోరు.. రిజల్డ్‌డే…

` నేడే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ` అధికారులకు ఈసీ దిశానిర్దేశం ` ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ ` ఉదయం 8 గంటల …

జనం సాక్షి 13 Feb 2026 7:10 am

2018 నిబంధనల ప్రకారమే సింగరేణి టెండర్లు

` తప్పని నిరూపించండి ` కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ` కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తాం ` ఎన్టీఆర్‌కు …

జనం సాక్షి 13 Feb 2026 7:03 am

కౌంటింగ్.. నేడే మున్సి‘పోల్స్’ ఓట్ల లెక్కింపు

రాత్రిలోగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌ల ఫలితాల వెల్లడి మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలు అభ్యర్థులు చేజారకుండా ప్రధాన పార్టీల వ్యూహాలు పోటీ చేసిన అభ్యర్థులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న పార్టీలు 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులను చేజిక్కించుకోవడానికి ప్రధాన పార్టీల కసరత్తు భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధమైన ఆశావహులు మనతెలంగాణ/హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రాల్లో నేడు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభంకానుంది. రాత్రి వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. మూడు గంటలలోపు మున్సిపాలిటీల ఫలితాలు, రాత్రిలోపు కార్పొరేషన్‌ల ఫలితాలు వెల్లడికానున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లలో ఎన్నికలు జరగ్గా ఎవరికీ వారే గెలుపు అంచనాలతో క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ అభ్యర్థులెవరూ చేజారకుండా క్యాంపు రాజకీయాలను ప్రారంభించడంతో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీల అభ్యర్థులను వేరే రాష్ట్రాలకు ఆయా పార్టీలు తరలిస్తున్నాయి. నేడు కౌంటింగ్ జరుగనుండగా గెలిచిన అభ్యర్థులు పార్టీలు మారకుండా అన్ని పార్టీలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా గెలిచిన అభ్యర్థులను గోవా, కేరళ, బెంగళూరు, హైదరాబాద్‌లకు తరలిస్తున్నాయి. ఫలితాలు వెలువడకముందే పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో పోటీ చేసిన అభ్యర్థులను శిబిరాలకు తరలిస్తుండడంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి పకడ్భందీ ఏర్పాట్లు చేశాయి. ఈ ఏర్పాట్ల బాధ్యతలను చైర్మన్, మేయర్ పదవులను ఆశిస్తున్న వారికి ఆయా పార్టీలు అప్పచెప్పాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులను దక్కించుకోవడానికి ఆశావహులు అనుసరిస్తున్న వ్యూహాలు, చేస్తున్న ఖర్చు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అన్ని పార్టీలో మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులను ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు కోట్ల రూపాయల ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘ఎక్స్-అఫీషియో’ సభ్యుల ఓటు కూడా కీలకమే.... మేయర్, చైర్మన్ ఎన్నికల్లో కేవలం గెలిచిన కౌన్సిలర్లే కాకుండా, ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు ‘ఎక్స్-అఫీషియో’ సభ్యులకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. మెజార్టీకి అతి సమీపంలో ఉన్న చోట్ల ఈ ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు ఆశిస్తున్న ఆశావహులు ఇప్పటికే ప్రదక్షిణలు చేస్తుండడం విశేషం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వారికే ఈ పదవులు కట్టబెట్టేందుకు చక్రం తిప్పుతుండటంతో, సాధారణ కౌన్సిలర్ల కంటే ఎక్స్-అఫీషియో సభ్యులకే ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు, 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించడంతో, పాత నేతలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దించి తెరవెనుక పాలన సాగించాలని ప్రణాళికలు రూపొందించడంతో దీనివల్ల పోటీ మరింత పెరిగింది. నేడు ఫలితాలు వెలువడనుండగా, అసలైన ఉత్కంఠ మాత్రం ఫిబ్రవరి 16వ తేదీన జరిగే మేయర్, చైర్మన్‌ల ఎన్నిక రోజు ఉంటుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పైచేయి సాధించేందుకు పార్టీల కసరత్తు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు అన్ని పార్టీలు క్యాంపులను ఏర్పాటు చేస్తుకున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలతో ఇప్పటికే మంతనాలు జరిపిన ఆయా పార్టీల ఇన్‌చార్జీలు అభ్యర్థులను వివిధ చోట్లకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండంగా నిలిచిపోనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. గెలిచిన తమ అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరి ఈ క్యాంపు రాజకీయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయన్నది త్వరలో తేలనుంది. నేడు ఫలితాలు వెలువడనుండగా ఈ నెల 16వ తేదీన జరిగే చైర్‌పర్సన్, మేయర్, వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులను ఏ పార్టీ గెలుచుకుంటుందో తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు ఇప్పటికే కౌంటింగ్ కోసం సూపర్‌వైజర్లు, సహాయకులను నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద దాని చుట్టుపక్కల సెక్షన్ 163 అమల్లో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం లోపలిఇక సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, అభ్యర్థులు వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కౌంటింగ్ హాల్‌ల లోపల మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను అనుమతించరు. అన్ని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల వెబ్‌కాస్టింగ్‌లను ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తారు. దాని తర్వాత, సాధారణ బ్యాలెట్ పత్రాలను తీసుకుంటారు. ఒక వార్డులోని అన్ని బ్యాలెట్ పెట్టెలను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్ వద్దకు తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్‌లోని బ్యాలెట్ పత్రాలను 25 సెట్‌లలో బండిల్ చేస్తారు. మిగిలిపోయిన బ్యాలెట్‌లు 25 కంటే తక్కువ ఉంటే, వాటిని ప్రత్యేక బండిల్‌గా తయారు చేసి కౌంట్‌తో లేబుల్ చేస్తారు. ప్రతి రౌండ్‌లో 1,000 బ్యాలెట్‌లు ప్రతి రౌండ్‌లో 1,000 బ్యాలెట్‌లను ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్దకు పంపుతారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తారు ప్రతి అభ్యర్థికి సంబంధించి చెల్లుబాటు అయ్యే ఓట్లను 100 బ్యాలెట్‌లలో బండిల్ చేస్తారు. అభ్యర్థుల వారీగా మొత్తం బ్యాలెట్ పేపర్‌లను చెల్లుబాటు కానీ ఓట్లను కౌంటింగ్ షీట్‌లో నమోదు చేసి కౌంటింగ్ సూపర్‌వైజర్ సంతకం చేయిస్తారు. రౌండ్ల వారీగా అభ్యర్థుల ఓట్లను, తిరస్కరించబడిన ఓట్ల వివరాలను నమోదు చేస్తారు. ప్రతి రౌండ్ తర్వాత ఏజెంట్ల సంతకాలను తీసుకుంటారు. లెక్కింపు పూర్తయి విజేత తేలిన తరువాత ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తారు.

మన తెలంగాణ 13 Feb 2026 7:00 am

రూ.2,200 కోట్ల విలువైన భూమికి విముక్తి

మన తెలంగాణ/సిటీబ్యూరో: మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువగా వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న పాపులను హైడ్రా గురువారం తొలగించింది. మొండికుంట ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వే సింది. చెరువుతోపాటు పక్కనే ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమిలోని అక్రమణలు తొలగించి హైడ్రా కాపాడింది. రూ.2200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హై డ్రా రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మం డలం ఖానామెట్ గ్రామంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేసింది. సర్వే నంబరు 53లోని మొండికుంటతో పాటు సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమి ఎకరాల కొద్దీ ఆక్రమణలకు గురి అవుతోందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలమేరకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది. దాదాపు 11 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐరన్ స్టీల్ షాపు ఇలా పలురకాల షెడ్డులు వేసి వ్యాపారాలు చేస్తున్నట్టు హైడా అధికారులు గుర్తించారు. 30కి పైగా ఉన్న పాపుల ద్వారా నెలకు రూ. లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలోకి ఆక్రమణలతో పాటు హై కోర్టు స్టే ఉన్నప్పటికీ షెడ్డుల నిర్మాణం చేశారు. 200 వరకు తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసుకుని అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. 30కి పైగా దుకాణాలను ఏర్పాటుచేసి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం, ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన షెడ్డులు, షాపుల ద్వారా నెలకు రూ. 2 కోట్ల వరకూ అద్దెలు వసూలు చేస్తున్నట్టు హైడ్రా గుర్తించింది. మొండికుంటకు ఆనుకుని నిర్మించిన ఆలయాన్ని మినహాయించి కూల్చివేతలను చేపట్టిన హైడ్రా ఆక్రమణల తొలగింపుతో పాటు ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సమావేశపరిచి... సమాచారం ఇచ్చి మొండికుంటతో పాటు అక్కడున్న ప్రభుత్వ భూమి అక్రమణలపై జనవరి 31న హైడ్రా విచారణ కూడా చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే అక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి కూడా అక్రమణలు జరిగినట్టు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కబ్జాదారులకు తెలిపారు. వారికి కొంత సమయాన్ని ఇచ్చి గురువారం హైడ్రా అక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్డులను పోలీసు బారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. ఈ అక్రమణలు తొలగించిన సందర్భంలో అక్కడ స్థానికులు అధికాశాతం మంది వచ్చి హైడా చర్యలను అభినందించారు. ప్రభుత్వ భూమిలో అక్రమణలు తొలగించిన చోట పార్కులను అభివృద్ధి చేయాలని స్థానికులు ఈ సందర్భంగా హైడ్రా అధికారులను కోరారు. చెరువును కూడా అభివృద్ధి చేసి సుందరీకరించాలని అభ్యర్ధించారు. 

మన తెలంగాణ 13 Feb 2026 6:40 am

క్యాంపు రాజకీయాలు షురూ..

ఎన్నికల ఫలితాల వేళ అప్రమత్తమైన అన్ని పార్టీలు ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట మున్సిపల్ పరిధిలో జోరందుకున్న క్యాంపు రాజకీయాలు బిజెపి అభ్యర్థులను ప్రత్యేక బస్సుల్లో తరలించిన ఎంఎల్‌ఎ పాయల్ శంకర్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫంక్షన్ హాల్‌లో బస సూర్యాపేటలో బిఆర్‌ఎస్ అభ్యర్థులను తరలించిన మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి  మన తెలంగాణ/ న్యూస్ నెట్‌వర్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఫలితాల పైన ప్రధాన పార్టీలు భారీ అంచనాలతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా తమ అంచనాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నేతలు 80 శాతానికి పైగా స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నారు. బీజేపీ కొన్ని కార్పోరేషన్ల పైన నమ్మకం పెట్టుకుంది. అయినా ఫలితాల ముం దే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ పరిణామాలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మున్సి పల్ ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫలితాల అనంతరం తన అభ్యర్థులు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా చూసేందు కు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలను ప్రారంభించాయి. ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు అభ్యర్థులతో ఆయా పార్టీల కీలక నే తలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. వారికి పలు కీల క సూచనలు చేస్తున్నారు. పార్టీల ముఖ్య నేతలు క్యాంపు రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బరిలో ఉన్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నా లు ముమ్మరం చేశారు. సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. శుక్రవారం ఎన్నికల ఫలితాల దృష్ట్యా బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. గెలిచే అవకాశమున్న అభ్యర్థులను ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌లు, రిసార్టులకు తరలిస్తోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మం చిర్యాల నగరపాలిక సహా మరో పది పురపాలికల ఫలితాలు ఎలా ఉండబోతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సొంత బలంతో ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటామనే దానిపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, మజ్లిస్ లెక్కల్లో మునిగిపోయాయి. రాజకీయంగా ఎవరి స్థానం ఏంటో శుక్రవారం తేలిపోనుంది. క్యాంపుల్లోకి అభ్యర్దులు పురపాలక ఎన్నికల్లో బాగా పనిచేశారని నేతలు, శ్రేణులను ఆయన అభినందించారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్ కొన్నిమున్సిపాల్టీలను సొంతంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులతో క్యాంపులను నిర్వహించి నేతలకు కేటీఆర్ పలు కీలక సూచనలు చేశారు. విప్ జారీ సహా అన్ని అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా.. తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థు లు పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు అన్ని రాజకీయపార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. దీంతో, మున్సిపల్ ఫలితాలు వెలువడనున్న వేళ రాజకీయం మరింత ఉత్కంఠ పెంచుతోంది. జోరందుకున్న క్యాంపు రాజకీయాలు ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బరి లో నిల్చున్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ ఎ మ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు కార్యాలయానికి అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని తరలించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యం లో పట్టణ శివారులోని ఫంక్షన్‌హాల్‌లో అభ్యర్థులతో స మావేశమయ్యారు. వారిని ఎక్కడికి తరలించాలో సమాలోచన చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను మాజీ మంత్రి జోగు రామన్నసైతం క్యాంపునకు పంపించే ఆలోచనలో ఉండటంతో శుక్రవారం ఫలితాలు ఆసక్తిని రేపుతున్నా యి. అటు నిర్మల్‌లో బీజేపీ మహేశ్వర్ రెడ్డి నివాసంలో 42 మంది అభ్యర్థులతో సమావేశం నిర్వహించి వారిని క్యాంపునకు తరలించారు. అప్రమత్తమైన బీఆర్‌ఎస్ మరోవైపు సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. రేపు ఎన్నికల ఫలితాల దృష్ట్యా బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. 48 వార్డులకు చెందిన ఆపార్టీ అభ్యర్థులను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంపునకు తరలించారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునే వ్యూహాంలోనే ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచనలు చేసినట్లు సమాచారం. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడుతుందనే అభిప్రాయం రాజకీయ పార్టీల నుంచే వ్యక్తమవుతోంది. 49 వార్డులకు గానూ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రావ టం కష్టమనే అంతర్మథనం ప్రధాన పార్టీలను పట్టిపీడిస్తోంది. మంత్రి వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూర్, క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. బీజేపీ మాత్రం బోణి కొడతామనే భావనలో ఉంది. లక్షెట్టిపేట, బెల్లంపల్లిలో సత్తా చాటుతామనే ధీమాలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలిస్తుందనే ఆలోచన బీజేపీ, బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని పార్టీల ధీమా నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పాగా వేస్తామనే వి శ్వాసంతో అధికార పార్టీ ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్, బీజేపీ గట్టి పోటీ ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా రు. నిర్మల్‌లో కాంగ్రెస్ బలం పుంజుకుందనే అభిప్రా యం రాజకీయ ప్రాధాన్యతను రేకెత్తిస్తోంది. ఇక రాష్ట్రంలోనే అత్యంత సున్నిత ప్రాంతమైన భైంసాలో మజ్లిస్ ప్రభావానికి బీజేపీ, బీఆర్‌ఎస్ కూటిమిగా ఏర్పడతాయా అనే చర్చకు దారితీస్తోంది. కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామనే ధీమా గులాబీ పార్టీలో కనిపిస్తోంది. కాగజ్‌నగర్‌లో బీజేపీ, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ సాధించే కౌన్సిలర్ స్థానాలపైనే బీఆర్‌ఎస్ ఆధిక్యత ఆధారపడి ఉంది. మేయర్ స్థానాలు మావే అంటున్న కాంగ్రెస్ తొలిసారిగా నగరపాలికగా అవతరించిన మంచిర్యాల ఫలితం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాము మే యర్ స్థానాన్ని కైవసం చేసుకోవటం ఖాయమనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాతినిథ్యం లేని బీజేపీ బోణీ కొట్టడమే కాకుండా మేయర్ స్థా నం కైవసం చేసుకుంటామనే ఉత్తేజంతో ఉంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పును అంచనా వేయటంలో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి.

మన తెలంగాణ 13 Feb 2026 6:40 am

విన్నపాలు వినవలే..

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించండి గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు సిఎం రేవంత్ విజ్ఞప్తి కేంద్ర నిధులతో కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతి అంతర్జాతీయ ప్రమాణాలతో మమూనురు ఎయిర్‌పోర్టు నిర్మించాలి పౌరవిమానయాన శాఖ మంత్రి రాంమ్మోహన్‌నాయుడుకు విజ్ఞప్తి ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలను అందచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం, రైల్వే లైన్‌ల మంజూరు, విమానాశ్రయాల పనులు వేగవంతంగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పౌర విమానయాన శాఖ మంత్రి రాంమ్మోహన్ నాయుడులతో గురువారం ముఖ్యమంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఆయా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, భూ బదలాయింపులు, నిధుల మంజూరును కోరుతూనే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇవ్వనున్న మద్దతు, భూ కేటాయింపుల గురించి కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర మంత్రితో సౌత్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం భేటీ అయ్యారు. శంకుస్థాపన, భూమి పూజకు రండి సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్రమంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహత్మా గాంధీ చితభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు సిఎం తెలియజేశారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభి వృద్ధి, నిరాడంబర జీవనశైలిని అద్దం పట్టేలా గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి సిఎం తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రపంచస్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మక, పర్యావరణ కేంద్రంగా నిలుపుతామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు సిఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఈ నెలాఖరులో చేసే శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచే హైస్పీడ్ కారిడార్‌ను.. హైదరాబాద్ టు -చెన్నై (778 కి.మీ.), హైదరాబాద్ టు -బెంగళూర్ (586 కి.మీ.), హైదరాబాద్- టు పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని సిఎం సూచించారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి కోరారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందని ఆయన వివరించారు. హైదరాబాద్- టు బెంగళూరు, హైదరాబాద్- టు పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని సిఎం రైల్వే మంత్రికి వివరించారు. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేశారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అదనంగా 249.82 ఎకరాల భూమిని అందచేస్తాం వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని కేంద్ర మంత్రికి సిఎం వివరించారు. మామూనూరు నుంచి సాధ్యమైనంత త్వరగా విమాన రాకపోకలు సాగేలా పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడుకు సిఎం విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాల భూమిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రితో సిఎం తెలియజేశారు. వెంటనే అనుమతుల మంజూరు చేయాలని కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపిస్తానని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపిలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలి కృష్ణా-, వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తాన్ని తామే భరిస్తామని గతంలో పేర్కొన్న విషయాన్ని సిఎం కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ మార్గంలోని లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సిఎం కేంద్ర మంత్రికి తెలియజేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని కేంద్ర మంత్రితో సిఎం పేర్కొన్నారు. కొడంగల్, టేడంగల్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సిఎం వివరించారు.  మామూనూరు ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ కు సమీపంలో నిర్మించనున్న మామూనూరు ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమ్మోహన్ నాయుడుతో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మామూనూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్టు కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్ ఓవర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. జౌళి, ఇతర పరిశ్రమలతో వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, వరంగల్‌కు దగ్గరలో రెండేళ్లకోకసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర మేడారంలో జరుగుతుందని కేంద్ర మంత్రికి సిఎం తెలియజేశారు.

మన తెలంగాణ 13 Feb 2026 6:40 am

ఉద్యోగులకు తీపికబురు

15 రోజుల్లో సిఎం సమక్షంలో ఇహెచ్‌ఎస్ స్కీమ్ ప్రారంభం వారం రోజుల్లో విధివిధానాలు ఖరారు సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఇహెచ్‌ఎస్ ట్రస్ట్ సమావేశంలో కీలక నిర్ణయం ఉద్యోగుల మూల వేతనాల నుంచి 1.5శాతం చెల్లింపు అంతే మొత్తాన్ని చెల్లించనున్న ప్రభుత్వం   మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యపై గురువారం రాష్ట్ర స చివాలయంలో సిఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఈహెచ్‌ఎస్ ట్రస్టు సమావేశం జరిగింది. ఈనేపథ్యంలోనే ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం 15 రోజుల్లో సిఎం సమక్షంలో ప్రారంభించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈహెచ్‌ఎస్ పథకం కింద ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆ రోగ్య పథకానికి చెల్లించేలా నిర్ణయించారు. అలా గే ఉద్యోగులు చెల్లించిన అంతే మొత్తాన్ని ప్రభు త్వం కూడా చెల్లించేలా ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధి, విధానాలు వారం రోజుల్లో సిద్ధం చేయాలని సిఎస్ కె. రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సివి ఆనంద్, మహేశ్ దత్ ఎక్కా, ఆ ర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోగ్తులతో పాటు టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టిజిఓ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, టిజిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్, టిఎన్జీఓ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సే నీ, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డిలు తెలంగాణ సెక్రటేరియేట్ అ సోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్, పిఆర్‌టియూ దామోదర్‌రెడ్డి, తెలంగాణ యూటిఎఫ్ చావా రవి, హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఈ నూతన ఉద్యోగుల ఆరో గ్య పథకం వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో లక్షా 44వేల మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 12.84 ల క్షల మంది డిపెండెంట్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఉద్యోగులు, పెన్షనర్లలో నాలుగవ తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, పెన్షనర్లు తమ బేసిక్-పే లో 1.5 శాతం మొత్తాన్ని చెల్లిస్తే సంవత్సరానికి రూ. 528 కోట్లు జమ అవుతాయని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ఈ ట్రస్టు సిఈఓగా నియమిస్తారు. ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన హెల్త్ స్కీమ్ ఒక ముందడుగు అని సిఎస్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ఈ పథకంలో మార్పులు, చేర్పులపై ట్రస్ట్ సమావేశంలో నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 13 Feb 2026 6:30 am

రఫేల్ రక్ష

 రూ.3.60 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రక్షణ కొనుగోళ్ల మండలి ఏడాది చివరినాటికి ఒప్పందం న్యూఢిల్లీ: భారతీయ వాయుసేన శక్తి పాటవం మరింత ఇనుమడించనుంది. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల సేకరణకు దిగనున్నారు. ఇందుకు రూ.3.60లక్షల కోట్ల వ్యయం అవుతుం ది. సంబంధిత రక్షణ వ్యూహాత్మక కొనుగోళ్ల ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వశాఖ గురువారం అనుమతిని వెలువరించింది. ఫ్రాన్స్, భారత్ ప్రభుత్వా ల మధ్య ఉన్న రక్షణ ఒప్పందం విధివిధానాల పరిధిలో రఫేల్ ఫైటర్ జెట్స్ సమీకరణ జరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనకు ఆమోదం దక్కిందని అధికారులు తెలిపారు. రక్ష ణ సైనిక ఆయుధ వ్యవస్థ సంబంధిత కొనుగోళ్ల ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారధ్యపు రక్షణ కొనుగోళ్ల లేదా సేకరణల మండలి (డిఎసి) అనుమతిని ఇచ్చింది. త్రివిధ బలగాల పోరాట పటిమను పెంచేందుకు ఈ కొనుగోళ్ల ఒ ప్పందం ఇంతకు ముందే కుదిరింది. ఇప్పుడు దీని ని కార్యరూపంలోకి తీసుకువస్తున్నారు. మరో 4రోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షులు మేక్రాన్ ఎమ్మాన్యుయెల్ భారతదేశ పర్యటనకు రానున్న సందర్భం లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల నిర్ణయం తీ సుకోవడం కీలక పరిణామం అయింది. భారత్ వాయుసేన వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలున్నాయి. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ కార్యాచరణలో ఈ యుద్ధ విమానాల సమర్ధత వెల్లడైం ది. శత్రుదేశాల సవాళ్లను తిప్పికొట్టేందుకు ఇటువంటి ఫైటర్ల అవసరాన్ని గుర్తించి మరిన్ని విమా నాలు కొనుగోలుకు రక్షణ శాఖ సిద్ధమైంది. రఫేల్ యుద్ధ విమానాల తయారీ కంపెనీ డసౌల్ట్‌తో ఏడాది చివరి నాటికి ఒప్పందం ఖరారవుతుంది.

మన తెలంగాణ 13 Feb 2026 6:20 am

శుక్రవారం రాశి ఫలాలు (13-02-2026)

మేషం ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమునకు ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు. వృషభం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మిధునం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. కర్కాటకం చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహం కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఋణాలు కొంత వరకు తొలగుతాయి. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. కన్య చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. తుల దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చికం నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధనస్సు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకరం బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. కుంభం వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు. మీనం స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.  

మన తెలంగాణ 13 Feb 2026 12:20 am

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ୧୫ ଦିନରେ ୮୦୦ ବ୍ୟକ୍ତି ନିରୁଦିଷ୍ଟ ହୋଇଥିବା ଦାବିକୁ ଖଣ୍ଡନ କଲା ଦିଲ୍ଲୀ ପୋଲିସ

ସବୁ ବେଳେ ଚର୍ଚ୍ଚାର ବିଷୟ ପାଲଟିଥାଏ ଦେଶର ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀ । କେତେବେଳେ ସରଗରମ ରାଜନୈତିକ ମାହୋଲ ତ କେତେବେଳେ କୌଣସି ଅପରାଧ ଜନିତ ଖବର । ସେହିପରି କିଛିଦିନ ତଳେ ଦିଲ୍ଲୀକୁ ବୋମା ଧମକର ଖବର ସାରା ଦେଶରେ ଚାଞ୍ଚଲ୍ୟ ସୃଷ୍ଟି କରିଥିଲା। ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀରେ ଆତଙ୍କ ଖେଳିଗଲା ଯେତେବେଳେ ସହରର ବିଭିନ୍ନ ଅଞ୍ଚଳର ନଅଟି ପ୍ରମୁଖ ସ୍କୁଲକୁ ବୋମା ଧମକ ଆସିଲା। ଏହି ଧମକପୂର୍ଣ୍ଣ କଲଗୁଡ଼ିକ ସକାଳ ୮ଟା ୩୦ ରୁ ୯ଟା ମଧ୍ୟରେ ଆସିଥିଲା, ଯାହା ଫଳରେ ସ୍କୁଲ ପ୍ରଶାସନ ଏବଂ ସୁରକ୍ଷା ଏଜେନ୍ସିଗୁଡ଼ିକ ତୁରନ୍ତ ସତର୍କ ହୋଇଗଲେ। ସୂଚନା ପାଇବା ପରେ, ସ୍କୁଲଗୁଡ଼ିକ ତୁରନ୍ତ ଦିଲ୍ଲୀ ପୋଲିସକୁ ସୂଚନା ଦେଇଥିଲେ। ପୋଲିସ, ଅଗ୍ନିଶମ ବାହିନୀ ଏବଂ ବମ ସ୍କ୍ବାଡ ଦଳ ଘଟଣାସ୍ଥଳରେ ପହଞ୍ଚି ସ୍କୁଲ ପରିସରରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ତଲାସି ଆରମ୍ଭ କରିଥିଲେ।ଧମକକୁ ଗମ୍ଭୀରତାର ସହ ନେଇ, ଅନେକ ସ୍କୁଲର ଛାତ୍ରୀଛାତ୍ରମାନଙ୍କୁ ଶ୍ରେଣୀଗୃହରୁ ବାହାର କରି ସୁରକ୍ଷିତ ସ୍ଥାନକୁ ନିଆଯାଇଥିଲା। କିଛି ସ୍କୁଲ ଛୁଟି ଘୋଷଣା କରିଥିଲା, ଯେତେବେଳେ ଅଭିଭାବକମାନଙ୍କୁ ମଧ୍ୟ ତୁରନ୍ତ ସୂଚନା ଦିଆଯାଇଥିଲା। ଇତିମଧ୍ୟରେ ଏକ ପୋଷ୍ଟ ସୋସିଆଲ ମିଡିଆରେ ବହୁମାତ୍ରାରେ ସେୟାର ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯେଉଁଥିରେ ଉଲ୍ଲେଖ ରହିଚି, କେବଳ ୨୦୨୬ ମସିହାର ପ୍ରଥମ ୧୫ ଦିନରେ ଜାତୀୟ ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀରେ ୮୦୦ ରୁ ଅଧିକ ଲୋକ, ବିଶେଷକରି ମହିଳା ଏବଂ ଶିଶୁ ନିଖୋଜ ହୋଇଥିବା ଦାବି ସୋସିଆଲ ମିଡିଆ ପ୍ଲାଟଫର୍ମ ରେ ବହୁମାତ୍ରାରେ ସେୟାର ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଦିଲ୍ଲୀରେ ମହିଳା ସୁରକ୍ଷାକୁ ପ୍ରଶ୍ନ କରୁଥିବା ହ୍ୟାସଟ୍ୟାଗ୍ ସହିତ ପ୍ରାୟତଃ ଏହି ପୋଷ୍ଟଗୁଡ଼ିକ ନିଖୋଜ ସଂଖ୍ୟାରେ ହଠାତ୍ ଏବଂ ଅଭୂତପୂର୍ବ ବୃଦ୍ଧିକୁ ସୂଚିତ କରୁଛି, ଯାହା ଏକ ଆତଙ୍କର ମାହୋଲ ସୃଷ୍ଟି କରୁଛି । 800 People Missing in Just 15 Days in Delhi! | Is the Capital Really Safe? #DelhiMissing #DelhiCrime #MissingPersons #DelhiPolice #WomenSafety #PublicSafety #IndiaNews #ViralNews #TruthBehindTheData #AnchorReport pic.twitter.com/GZmPNzLJ3M — Aap Ki Khabar (@aapkikhabarnews) February 6, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ  ଉପଲବ୍ଧ ରହିଛି ।  ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଦାବିକୁ ଖଣ୍ଡନ କଲା ଦିଲ୍ଲୀ ପୋଲିସ । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ କିମ୍ବା ସ୍ୱୀକୃତିପ୍ରାପ୍ତ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରଣ କିମ୍ବା ସେୟାର ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସର ୱେବସାଇଟରେ ଏନେଇ କିଛି ତଥ୍ୟ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ମିଳିଥିବା ତଥ୍ୟ ଅନୁଯାୟୀ, ୧ ଜାନୁଆରୀ ୨୦୨୬ ରୁ ୧୫ ଜାନୁଆରୀ ମଧ୍ୟରେ ୮୦୭ ଜଣ ନିଖୋଜ ବ୍ୟକ୍ତିଙ୍କ ରିପୋର୍ଟ ଦାଖଲ କରାଯାଇଥିଲା । ଦୈନିକ ହାରାହାରି ୧୫ ଦିନରେ ୮୦୭ ଟି ମାମଲା ପ୍ରତିଦିନ ପ୍ରାୟ ୫୪ ଜଣ ନିଖୋଜ ବ୍ୟକ୍ତି ଥିବାର ଜଣାଯାଉଛି । ଦର୍ଶାଉଛି । ତେଣୁ ପୂର୍ବ ବର୍ଷ ସହ ତୁଳନା କଲେ ଏହା ହ୍ରାସ ପାଇଥିବାର ଦେଖାଯାଇଛି । ଉଦାହରଣ ସ୍ୱରୂପ, ୨୦୨୫ ମସିହାର ସମ୍ପୂର୍ଣ୍ଣ ବର୍ଷରେ, ମୋଟ ୨୪,୫୦୮ ଜଣ ନିଖୋଜ ହୋଇଥିଲେ, ଯାହା ପ୍ରତିଦିନ ହାରାହାରି ପ୍ରାୟ ୬୭ ଜଣ ଥିଲେ । ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଯୁଗ୍ମ ଆୟୋଗ ଏବଂ ଲୋକସମ୍ପର୍କ ଅଧିକାରୀ ସଞ୍ଜୟ ତ୍ୟାଗୀ ନିଖୋଜ ବ୍ୟକ୍ତିଙ୍କ ସଂଖ୍ୟା ହଠାତ୍ ବୃଦ୍ଧି ପାଇବାର ଦାବିକୁ ଭିତ୍ତିହୀନ ଏବଂ ଗୁଜବ ବୋଲି କହି ଖଣ୍ଡନ କରିଛନ୍ତି । ତ୍ୟାଗୀଙ୍କ ଅନୁଯାୟୀ, ଜାନୁଆରୀ ୨୦୨୬ ରେ ପୂର୍ବ ବର୍ଷଗୁଡ଼ିକର ଜାନୁଆରୀ ତୁଳନାରେ ନିଖୋଜ ମାମଲା ସଂଖ୍ୟା ହ୍ରାସ ପାଇଛି । हम यह स्पष्ट करना चाहते है कि गुमशुदगी, विशेषकर बच्चों के लापता होनें को लेकर फैलायी जा रही अफवाहों से घबराने की कोई आवश्यकता नहीं है। विगत वर्षों की तुलना में गुमशुदगी के मामलों में वृद्धि नहीं हुई है। दिल्ली पुलिस त्वरित जांच व कार्रवाई के साथ नागरिकों की सुरक्षा के लिए… pic.twitter.com/WjV1MCoTEM — Delhi Police (@DelhiPolice) February 5, 2026 ୫ ଫେବୃଆରୀ ୨୦୨୬ରେ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଏନେଇ ଏକ ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଆମେ ସ୍ପଷ୍ଟ କରିବାକୁ ଚାହୁଁଛୁ ଯେ ନିଖୋଜ ବ୍ୟକ୍ତି, ବିଶେଷକରି ପିଲାମାନଙ୍କ ସମ୍ପର୍କରେ ପ୍ରଚାରିତ ଗୁଜବ ଯୋଗୁଁ ଭୟଭୀତ ହେବାର କୌଣସି ଆବଶ୍ୟକତା ନାହିଁ । ପୂର୍ବ ବର୍ଷ ତୁଳନାରେ ଚଳିତ ବର୍ଷ ନିଖୋଜ ମାମଲାରେ କୌଣସି ବୃଦ୍ଧି ହୋଇନାହିଁ । ଦିଲ୍ଲୀ ପୋଲିସ ତୁରନ୍ତ ତଦନ୍ତ ଏବଂ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ମାଧ୍ୟମରେ ନାଗରିକଙ୍କ ସୁରକ୍ଷା ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ। ଦିଲ୍ଲୀ ପୋଲିସର ଯୁଗ୍ମ ପୋଲିସ କମିଶନର / ଜନସମ୍ପର୍କ ଅଧିକାରୀ ଶ୍ରୀ ସଞ୍ଜୟ ତ୍ୟାଗୀଙ୍କ ବାର୍ତ୍ତା । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଉକ୍ତ ଦାବିକୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଖଣ୍ଡନ କରିବା ସହ ଗତବର୍ଷ ତୁଳନାରେ ଚଳିତ ବର୍ଷ ନିଖୋଜ ତାଲିକାରେ ଅଧିକ ମାମଲା ରହିନାହିଁ ।

తెలుగు పోస్ట్ 13 Feb 2026 12:06 am

అడివి శేష్ దర్శకత్వంలోఅకీరా నందన్ సినీ అరంగేట్రం?

హైదరాబాద్: ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అన్న విషయమె కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చలో హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా అరంగేట్రం బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అకీరాతో […] The post అడివి శేష్ దర్శకత్వంలోఅకీరా నందన్ సినీ అరంగేట్రం? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:43 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ୟୁସିଜି ନିୟମ ସହ ଉକ୍ତ ଭିଡ଼ିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ

UGCର ନୂଆ ନିୟମକୁ ନେଇ ବଢୁଛି ବିବାଦ । ଜାନୁଆରୀ ୨୭ରେ ପ୍ରସାରିତ ଏକ ଖବର ଅନୁଯାୟୀ, ଚର୍ଚ୍ଚା ହେଉଛି ନୂଆ ନିୟମ ଯୋଗୁଁ କ୍ୟାମ୍ପସରେ ଭେଦଭାବ ଦୂର ହେବ ନା ବିବାଦ ବଢ଼ିବ? ଜାନୁଆରୀ ୨୦୨୬ରେ ୟୁନିଭରସିଟି ଗ୍ରାଣ୍ଟସ୍ କମିଶନ ଦେଶର କଲେଜ ଏବଂ ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟଗୁଡ଼ିକରେ ଜାତିଗତ ଭେଦଭାବ ରୋକିବା ପାଇଁ ଏକ ନୂଆ ନିୟମାବଳୀ ଆଣିଛନ୍ତି । ଏହାକୁ ନେଇ ଏବେ ସାରା ଦେଶରେ ଚର୍ଚ୍ଚା ଓ ବିବାଦ ଦେଖାଦେଇଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଏକ ମଶାଳ ଯାତ୍ରା ହେଉଥିବରଦେଖିବାକୁ ମିଳିଛି । ଯାତ୍ରାରେ ମୋଦି ଏବଂ ସାହାଙ୍କ ଫଟୋ ଧରି କିଛି ଆନ୍ଦୋଳନକାରୀ ବିକ୍ଷୋଭ ପ୍ରଦର୍ଶନ କରୁଥିବାର ମଧ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି । ତେବେ ଉକ୍ତ ଭିଡିଓଟି ଉକ୍ତ ନୂତନ ୟୁଜିସି ନିୟମକୁ ନେଇ ହୋଇଥିବା ଏକ ଆନ୍ଦୋଳନ ସମୟର ବୋଲି ଦାବି ହୋଇଛି । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଗୋଟିଏ ନୂଆ ନିୟମ ଗୋଟିଏ ଯାତୀର ଏକତାର ମୁହଁ ଭାଙ୍ଗିଦେଲା । ଆହୁରି ମଧ୍ୟ ଧର୍ମକୁ ନେଇ ବିଭାଗ ଆକ୍ଷେପ ମୂଳକ ଲେଖା ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ଅନ୍ୟପଟେ ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଏପର୍ଯ୍ୟନ୍ତ ତ ହିନ୍ଦୁ ଅସୁବିଧାରେ ଥିଲେ ଏବେ ଲାଗୁଚି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଅସୁବିଧାରେ ଅଛନ୍ତି । HINDU UNITY IS A MYTH One UGC law and Brahmins dropped the facade of Hindu Unity in one day. Hindus were never one, they will never be one. The basis of this religion is Caste/Varna and it is fundamentally against Unity. To all those Dalits & OBCs who are roaming as… pic.twitter.com/dePJHrIbp9 — Tarun Gautam (@TARUNspeakss) January 27, 2026 ଯାହାର ଏକ ସ୍କ୍ରିନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି ।   ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ନୂତନ ୟୁଜିସି ନିୟମ ନେଇ ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ଆନ୍ଦୋଳନ ହେଇଚି ସତ । ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ଯାହାକି ଏକ ରାଜନୈତିକ ଆନ୍ଦୋଳନ ସମୟର ଅଟେ । ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳି ବହୁ ଆନ୍ଦୋଳର ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ହେଲେ କୌଣସି ଭିଡିଓରେ ପ୍ରକୃତ ଏଭଳି ଭାଇରାଲ ହେଉଥିବାର ଛବି ଦେଖିବାକୁ ମିଳିନଥିଲା । ଯଦି ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଫେସବୁକରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ସର୍ଵ ଭାରତୀୟ କଂଗ୍ରେସର ସୋସିଆଲ ମିଡିଆ ପେଜରେଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ଥିଲା, ଭାରତୀୟ ଜାତୀୟ କଂଗ୍ରେସର ସର୍ବୋଚ୍ଚ ନେତ୍ରୀ । ଶ୍ରୀମତୀ ସୋନିଆ ଗାନ୍ଧୀ ଓ ସର୍ବମାନ୍ୟ ନେତା ଶ୍ରୀ ରାହୁଲ ଗାନ୍ଧୀଙ୍କ ନାମରେ ନ୍ୟାସନାଲ ହେରାଲଡ଼ ମିଥ୍ୟା ମାମଲାରେ ଫସାଇ ଦୀର୍ଘ ଏକ ଦଶନ୍ଧି ଧରି ବଦନାମ କରିବା ପ୍ରତିବାଦରେ ମଶାଲ ଶୋଭାଯାତ୍ରା । ପିସିସି ସଭାପତି ଶ୍ରୀ ଭକ୍ତଚରଣ ଦାସଙ୍କ ସମେତ ଜିଲ୍ଲା ସଭାପତି ପ୍ରକାଶ ଚନ୍ଦ୍ର ଜେନା, ବରିଷ୍ଠ ନେତା ସୁରେଶ ରାଉତରାୟ, ନବଜ୍ୟୋତି ପଟ୍ଟନାୟକ, ଶୁଭେନ୍ଦୁ ମୋହାନ୍ତି, ଯୁବକଂଗ୍ରେସ ସଭାପତି ରଞ୍ଜିତ ପାତ୍ରଙ୍କ ଆଦି ବହୁ ବିଶିଷ୍ଟ ନେତୃବୃନ୍ଦ ଯୋଗଦେଇଥିଲେ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସଦୃଶ ହୋଇଥିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ସମୟର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ପ୍ରମାଣିତ ହୋଇଥିଲା । ସେହିପରି ବର୍ତ୍ତମାନର ପିସିସି ସଭାପତି ଶ୍ରୀ ଭକ୍ତ ଚରଣ ଦାସ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ୨୦ ଡିସେମ୍ବର ୨୦୨୫ରେ ଅପଲୋଡ଼ କରି ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଦଶନ୍ଧିରୁ ଅଧିକ ସମୟ ଧରି, ମୋଦି-ଶାହାଙ୍କ ନେତୃତ୍ୱାଧୀନ ବିଜେପି ବିରୋଧୀଙ୍କୁ ଚୁପ୍ କରିବା ପାଇଁ କେନ୍ଦ୍ରୀୟ ଏଜେନ୍ସିଗୁଡ଼ିକର ଅପବ୍ୟବହାର କରିଆସିଛି ଏବଂ ମିଥ୍ୟା ମାମଲା ମାଧ୍ୟମରେ ଶ୍ରୀ ରାହୁଲ ଗାନ୍ଧୀ ଏବଂ ଶ୍ରୀମତୀ ସୋନିଆ ଗାନ୍ଧୀଙ୍କୁ ବଦନାମ କରିଛି। କୋର୍ଟ ଦ୍ୱାରା ନିଶ୍ଚିତ କରାଯାଇଥିବା ସତ୍ୟର ଜୟ ହୋଇଛି। ମୁଁ ଏହି ରାଜନୈତିକ ପ୍ରତିଶୋଧର ପ୍ରତିବାଦ ପାଇଁ ଭୁବନେଶ୍ୱର କଂଗ୍ରେସ କମିଟି ଦ୍ୱାରା ଆୟୋଜିତ ମଶାଲ ରାଲିରେ ଯୋଗ ଦେଇଥିଲି। ଏହା ଗଣତନ୍ତ୍ର ଏବଂ ସମ୍ବିଧାନକୁ ସୁରକ୍ଷା ଦେବା ପାଇଁ ଏକ ସ୍ପଷ୍ଟ ଦୃଷ୍ଟିକୋଣ ଥିଲା । କଂଗ୍ରେସ ଭୟ ଆଗରେ ମୁଣ୍ଡ ନୁଆଁଇବ ନାହିଁ ଏବଂ ନ୍ୟାୟ ପାଇଁ ଏହି ଲଢ଼େଇ ଜାରି ରହିବ । For over a decade, the Modi-Shah led BJP has misused central agencies to silence the opposition and malign Shri Rahul Gandhi and Smt Sonia Gandhi through false cases. Truth has prevailed as affirmed by the Court. I joined the torch rally organised by the Bhubaneswar Congress… pic.twitter.com/Yl1zXYcITT — Bhakta Charan Das (@BhaktaCharanDas) December 20, 2025 ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ନୂତନ ୟୁଜିସି ନିୟମ ନେଇ ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ଆନ୍ଦୋଳନ ହେଇଚି ସତ । ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ଯାହାକି ଏକ ରାଜନୈତିକ ଆନ୍ଦୋଳନ ସମୟର ଅଟେ ।

తెలుగు పోస్ట్ 12 Feb 2026 11:40 pm

‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్ […] The post ‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:39 pm

‘మృత్యుంజయ’ టీజర్ విడుదల

హైదరాబాద్: హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ‘మృత్యుంజయ’ చిత్రం ఈనెల27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… చిత్ర బందం టీజర్‌ను విడుదల చేసింది ఈ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఒక సస్పెన్స్‌తో కూడిన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ అధికారిగా శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించనుండగా, అందరూ ప్రమాదంగా భావించే ఒక ఘటన వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా వెలికితీశారనే ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమా […] The post ‘మృత్యుంజయ’ టీజర్ విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:38 pm

లంక చేతిలో ఒమన్ విలవిల

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్ […] The post లంక చేతిలో ఒమన్ విలవిల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:37 pm

122 మీటర్ల క్యాచ్… గిన్నిస్ బుక్‌లో జోస్ బట్లర్?

న్యూదిల్లీ: ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ అందుకుని వార్తల్లో నిలిచాడు. ఈ రికార్డ్ ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్‌లో నమోదైంది. సుమారు 122 మీటర్ల ఎత్తులో డ్రోన్ నుంచి క్రికెట్ బంతిని వదిలారు. అంత ఎత్తు నుండి వేగంగా వస్తున్న బంతిని జోస్ బట్లర్ కళ్లప్పగించి గమనిస్తూ అద్భుత టైమింగ్‌తో క్యాచ్ పట్టాడు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ప్రశంసించాడు. […] The post 122 మీటర్ల క్యాచ్… గిన్నిస్ బుక్‌లో జోస్ బట్లర్? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:36 pm

నేపాల్‌పై ఇటలీ ఘన విజయం

ముంబై: టీ20 ప్రపంచ కప్ లో ఇటలీ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ కాగా… ఈ లక్ష్యాన్ని ఇటలీ వికెట్లేమీ కోల్పోకుండా 12.4 ఓవర్లలోనే ఛేదించింది. జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 66 పరుగులు, ఆంథోనీ మోస్కా 32 బంతుల్లో 62 పరుగులతో చెలరేగారు. కాగా ఈ టోర్నీలో నేపాల్‌కు […] The post నేపాల్‌పై ఇటలీ ఘన విజయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:35 pm

అరేపల్లి సమీపంలో పులి జాడలు.. అటవీ శాఖ అలర్ట్

మన తెలంగాణ/హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా అరేపల్లి గ్రామం పరిసరాల్లో పులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. నిన్న పులి కనిపించిన ప్రాంతానికి వాయువ్య దిశగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో తాజా పాదముద్రలు గుర్తించినట్లు హైదరాబాద్‌లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయం అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేలా వెంటనే ట్రాకింగ్ చర్యలను మరింత ముమ్మరం చేశామని వెల్లడించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పర్యవేక్షణ కోసం థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం, స్థానిక అటవీ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తోందని తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలు జాగ్రత్త సూచనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షిత మార్గం కల్పించేందుకు అటవీ శాఖ సమగ్ర చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మన తెలంగాణ 12 Feb 2026 11:34 pm

బంగ్లా ఎన్నికల్లో హింస

. ఖుల్నాలో ఘర్షణ…బీఎన్‌పీ నాయకుడి మృతి. గోపాల్‌గంజ్‌లో పోలింగ్ కేంద్రంపై బాంబు దాడి.. ముగ్గురికి గాయాలు. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని జమాత్ ఆరోపణ ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు హింసాత్మకంగా మారాయి… గురువారం దేశవ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఖుల్నా జిల్లాలో జరిగిన ఘర్షణలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత మొహిబుజ్జమాన్ కోచీ మతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఖుల్నాలోని అలియా మదరసా పోలింగ్ కేంద్రం వద్ద […] The post బంగ్లా ఎన్నికల్లో హింస appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:34 pm

టర్కీ పార్లమెంటులో రభస

కొట్టుకున్న అధికార, ప్రతిపక్ష ఎంపీలు అంకారా: టర్కీ పార్లమెంట్ రణరంగంగా మారింది. ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ…తన్నుకుంటూ నానా రభస చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అకిన్ గుర్లెక్ పార్లమెంట్‌లో న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతుండగా ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికార-ప్రతిపక్ష ఎంపీలు పరస్పర దాడులకు తెగబడ్డారు. ఒకరినొకరు గుద్దుకుంటూ, తన్నుకుంటూ కనిపించారు. చాలా సేపు ముష్టి యుద్ధం జరిగింది. ఇస్తాంబుల్ చీఫ్ […] The post టర్కీ పార్లమెంటులో రభస appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:29 pm

ప్రజాకంటక ప్రభుత్వాన్నిసాగనంపుదాం: కూనంనేని

కేంద్రంలోని మోదీ పాలనలో దేశ ప్రజలందరికీ … ముఖ్యంగా కార్మికులు, కర్షకులకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజాకంటక ప్రభు త్వాన్ని కూకటివేళ్లతో పీకేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా కార్మిక, కర్షక, ఉద్యోగ, మహిళా, మోటార్, ఆటో, క్యాబ్ వివిధ సంఘాలు సమ్మెల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. చుంచుపల్లి మెయిన్ రోడ్లో నిరసన, ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న […] The post ప్రజాకంటక ప్రభుత్వాన్నిసాగనంపుదాం: కూనంనేని appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:25 pm

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 100 ఎకరాలుబదలాయించండి

. ‘గాంధీ సరోవర’ శంకుస్థాపనకు రండి. రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ వినతి విశాలాంధ్ర – హైదరాబాద్: ఈసా… మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచస్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాల్సిందిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సౌత్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం కేంద్ర మంత్రితో సీఎం భేటీ అయ్యారు. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, […] The post మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 100 ఎకరాలుబదలాయించండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:22 pm

114 రఫేల్‌కుకేంద్రం ఓకే

న్యూదిల్లీ: ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలకమైన రక్షణ ఒప్పందానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందం. ఈ ఒప్పందానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఢిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంతో భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల ద్వితీయార్థంలో […] The post 114 రఫేల్‌కుకేంద్రం ఓకే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:08 pm

అంబటిపై మరో కేసు26వరకు రిమాండ్…

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును కేసులు వెంటాడుతున్నాయి. ఒక వైపు బెయిల్ వస్తే…మరోవైపు ఇంకో కేసులో జైలుకు ఆయన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వైద్యకళాశాలలు ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఉద్యమంలో అధికారులను బెదిరించారంటూ అంబటిపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఈనెల 11న ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రాజమండ్రి జైలు […] The post అంబటిపై మరో కేసు26వరకు రిమాండ్… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:07 pm

రాజ్ కెసిరెడ్డికిబెయిల్ తిరస్కృతి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దది. అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇలాంటివి జరగవు’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమ న్నారు. ప్రభుత్వానికి రాజ్ కెసిరెడ్డి సలహాదారు మాత్రమేనన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కెసిరెడ్డి సలహాదారు మాత్రమే కాదని, మొత్తం కుంభకోణానికి ఆయనే సూత్రధారి అని వ్యాఖ్యానించింది. పదవిలో ఉన్నవారి […] The post రాజ్ కెసిరెడ్డికిబెయిల్ తిరస్కృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:04 pm

స్తంభించిన భారత్

సర్కారు ఏకపక్ష విధానాలపై కార్మిక – కర్షకాగ్రహం . కేంద్రం మెడలు వంచేందుకు ఒక్కటైన శ్రామికవర్గం. రోడ్డెక్కని బస్సులుతెరుచుకోని విద్యా సంస్థలు. పనిచేయని బ్యాంకులుపరిశ్రమలు: రైల్`రాస్తా రోకోలు. అన్ని రాష్ట్రాల్లో భారీ ప్రదర్శనలు. మార్మోగిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు. పాల్గొన్న 30 కోట్ల మంది. సార్వత్రిక సమ్మె విజయవంతం: కార్మిక సంఘాల ప్రకటన న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను కార్మికులు, రైతులు ప్రతిఘటించారు. అమెరితో వాణిజ్య ఒప్పందం, నాలుగు లేబర్ కోడ్‌లు, […] The post స్తంభించిన భారత్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 11:00 pm

రద్దు చేస్తారా… గద్దె దిగుతారా?

. లేబర్‌కోడ్‌లపై గర్జించిన కార్మిక, కర్షక, ఉద్యోగసంఘాలు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు. పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకుంటాం: ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. సమ్మెను పురస్కరించుకుని కార్మికులు, కర్షకులు, ఉద్యోగ సంఘాలు పెద్దసంఖ్యలో రోడ్డెక్కారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యపట్టణాల్లో వేలాది మందితో భారీ ప్రదర్శనలు జరిగాయి. పల్లె, పట్నం తేడా లేకుండా కార్మికలోకం కదం తొక్కింది. ఉద్యోగ సంఘాలన్నీ సమ్మెలో భాగస్వామ్యమయ్యాయి. శాఖల వారీ ఉద్యో గులు విధులు బహిష్కరించి […] The post రద్దు చేస్తారా… గద్దె దిగుతారా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 10:55 pm

భూముల కేటాయింపుపై రచ్చ

టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: శాసన మండలిలో తొలిరోజు జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి గవర్నరు ప్రసంగం వరకు రచ్చ జరిగింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విశాఖలో విలువైన భూములను 99 పైసలకే కారుచౌకగా కట్టపెట్టడంపై మండలి అట్టుడికింది. ప్రధానంగా రహేజాకు భూములు ఇవ్వడంపై విపక్ష వైసీపీ, అధికార టీడీపీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రహేజా సాఫ్ట్‌వేర్ సంస్థ కాదనీ, అది ఒక […] The post భూముల కేటాయింపుపై రచ్చ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 10:45 pm

రాహుల్ సభ్యత్వం రద్దు

లోక్‌సభలో బీజేపీ ఎంపీ దూబే తీర్మానం న్యూదిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. రాహుల్ సభ్యత్వం రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ దూబే నోటీసు ఇచ్చారు. ఇంకా ప్రచురితం కాని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణె పుస్తకం సహా పలు వివాదాస్పద అంశాలపై రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచిన సంగతి తెలిసిందే. […] The post రాహుల్ సభ్యత్వం రద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 10:41 pm

మేడారం జాతరలో మహిళా సంఘాలకు భారీ ఆదాయం

రూ.6 కోట్ల పెట్టుబడి...రూ.3 కోట్ల లాభం ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి నిదర్శనమన్న -మంత్రి సీతక్క మన తెలంగాణ/హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ మహా జాతర- 2026 సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని 10 మండలాలను కవర్ చేస్తూ మొత్తం 565 ఆదాయ యూనిట్లను ఎస్‌హెచ్‌జిల ద్వారా ఏర్పాటు చేయగా వారు జాతర సమయంలో రూ.3 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని మేడారం జాతర ప్రాంగణంలో మహిళా సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో షాపులను కేటాయించారు. ములుగు జిల్లాలోని పది మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ద్వారా వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాట్లు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించారు. మంత్రి సీతక్క స్వయంగా ఈ యునిట్లను ప్రారంభించి వారి బిజినెస్‌కు విస్త్రుత ప్రచారం కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడంతో మహిళలు కూల్ డ్రింక్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ స్టాళ్లు, బ్యాంబూ చికెన్, క్యాంటిన్లు, స్నాక్స్ తదితర దుకాణాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఇతర వ్యాపార కార్యకలాపాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని ఆర్థికంగా లాభపడ్డారు. ఈ వ్యాపారాల కోసం రూ.6 కోట్ల పెట్టుబడిని బ్యాంకులు, జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా సమకూర్చగా మొత్తం రూ.9.12 కోట్ల ఆదాయం లభించింది. పెట్టుబడి, ఖర్చులు పోగా రూ.3 కోట్లకుపైగా లాభం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు అవుతున్న ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి ఇదే నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రొత్సాహకం, మహిళా సంఘాల పట్టుదల, ఆడ బిడ్డల శ్రమ ఫలితమని అభినందించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడుతూ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు దృఢమైన పునాది వేసిందని మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.

మన తెలంగాణ 12 Feb 2026 10:36 pm

పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

తొలి విడత ఇప్పటికే రూ.259.36 కోట్లు విడుదల తాజా విడతతో కలిపి మొత్తం విడుదలైన నిధులు రూ.646.36 కోట్లు మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇదివరకే మొదటి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తాజా విడతతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.646.36 కోట్లు తెలంగాణకి అందించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అయితే 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు మొత్తం సుమారు రూ.3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటికీ సుమారు రూ.2,400 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామాల సమగ్రాభివృద్ధి, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం దృష్ట్యా పెండింగ్ నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని మంత్రి తెలిపారు.

మన తెలంగాణ 12 Feb 2026 10:31 pm

హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే: కెటిఆర్

ఎమ్మెల్యేలు వెళ్లినా క్యాడర్ అంతా కెసిఆర్ వెంటే శేరిలింగంపల్లిలో పార్టీ అత్యంత బలోపేతం కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం బిఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేలు పోయినా పార్టీ వెన్నెముక కార్యకర్తలే అని, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కెసిఆర్ నాయకత్వంలోనే ఉన్నారని కెటిఆర్ ప్రశంసించారు. మొత్తం హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచిందని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా, బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని, శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా బిఆర్‌ఎస్‌కు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరిచేతిలో వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని కెటిఆర్ విమర్శించారు. మరోవైపు బిజెపి12 ఏళ్లుగా రాష్ట్రానికి 12 పైసల పని కూడా చేయలేదని, బిజెపి పూజకు పనికిరాని పువ్వు అని ఎద్దేవా చేశారు. ‘వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి‘ అన్న నానుడిని గుర్తు చేస్తూ, తెలంగాణకు కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్ బజార్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో దోపిడీలు, చందానగర్‌లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. ఎమ్మెల్యే లేడని భయపడవద్దని, అండగా నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్, అరికెపూడి కృష్ణారావు ఉంటామని, ఏ అవసరమొచ్చినా అందుబాటులో ఉంటామని కెటిఆర్ హామీ ఇచ్చారు. తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మహిళలకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, విజయ్ కుమార్ రెడ్డి వంటి యువకులు పార్టీకి ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 12 Feb 2026 10:17 pm

సంక్రాంతి లక్కీ డ్రా కేసు.. అంబటికి రిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్: సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో 2023 జనవరిలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ల ద్వారా పింఛనుదారుల నుంచి రూ.200 చొప్పున అక్రమంగా వసూలు చేసి, వారికి బలవంతంగా లాటరీ టికెట్లు అంటగట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మరో కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటిని, పోలీసులు పిటి వారెంట్‌పై గురువారం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఎం. కుముదిని, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అంబటిని తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ లభించగా, గతేడాది మెడి కల్ కాలేజీ అంశంపై నిర్వహించిన ఆందోళనల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులోనూ ఆయనకు బెయిల్ లభించింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ రావడంతో అంబటి విడుదల కావడం లాంఛనమేనని అందరూ అనుకున్నారు. అయితే, పోలీసులు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పిటి వారెంట్ పై కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో అంబటికి నిరాశే మిగిలింది. తాజా రిమాండ్‌తో ఆయన విడుదల ఆగిపోయింది.

మన తెలంగాణ 12 Feb 2026 10:00 pm

సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, డా.మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో అధికారంలోకి వచ్చీ రావడంతోటే ప్రైవేటీకరణకు పెద్దపీట వేసినట్టయింది. ఇది శ్రామిక వర్గానికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. 100 నుంచి 150ఏళ్ల కాలం సుదీర్ఘ పోరాటం చేసి శ్రామికవర్గం సాధించుకున్న హక్కులకు క్రమంగా కోత పడడం మొదలైంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రమజీవుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం […] The post సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 9:58 pm

దేశవ్యాప్త సమ్మెలో రైతులు, గ్రామీణ పేదలు

కేవీవీ. ప్రసాద్ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం భారత రైతాంగంపై ఎడాపెడా దాడికి పూనుకుంటోంది. మరో పక్క శ్రమజీవులైన కార్మికవర్గంతో పాటు వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కులకు భంగం కలిగే చట్టాలను తెచ్చి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే ప్రమాదాన్ని తెస్తున్నది. అదేవిధంగా అమెరికా తదితర దేశాలతో ఫ్రీట్రేడ్ ఆగ్రిమెంట్ చేసుకుంటూ చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది. మోదీ విధానాల పుణ్యమాని గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆహార భద్రత పెనుప్రమాదంలో పడనుంది. […] The post దేశవ్యాప్త సమ్మెలో రైతులు, గ్రామీణ పేదలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 9:58 pm

గత కాలపు శిథిలాలుకొత్త చరిత్రకు ఆనవాళ్లు

బి.రామారావు సుమారు 3,000 సంవత్సరాల క్రితమే తెలంగాణతో పాటు సమీప ప్రాంతాల్లో నివసించిన ప్రాచీన సమాజాలకు ఖగోళ శాస్త్రంపై విశేష అవగాహన ఉన్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి Vౖదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగానికి చెందిన గౌరవ ప్రొఫెసర్ కే.పీ.రావు వివరించారు. దిక్కులను గుర్తించడంలో వారికి ఎంతో నైపుణ్యం ఉందన్నారు. వరంగల్‌లోని సరస్వతి ఆలయం సమీపంలో చేపట్టిన పరిశోధనల్లో నక్షత్ర సమూహాల ప్రతిరూపంతో పాటు కొన్ని శిల్పాలు లభించాయన్నారు. ఇండస్ లోయ నాగరికత […] The post గత కాలపు శిథిలాలుకొత్త చరిత్రకు ఆనవాళ్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 9:57 pm

దేశంలో 27 నుంచి 29కి పెరిగిన సగటు వివాహ వయస్సు..

న్యూఢిల్లీ : గత దశాబ్ద కాలంలో దేశంలో సగటు వివాహ వయస్సు 27 నుండి 29 సంవత్సరాలకు పెరిగింది. అలాగే రెండో వివాహం చేసుకోవాలనుకున్న వారి సంఖ్య 43 శాతానికి పెరిగింది.భాగస్వామిని ఎంచుకోవడంలో, అంకితం కావడంలో అభిప్రాయాల్లో మార్పు వచ్చిందని గురువారం ఒక నివేదిక వెల్లడించింది. వివాహవేదిక జీవనశక్తి ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.20162025 మధ్యకాలంలో వచ్చిన పరిణామాలపై 2026లో 30 వేల మంది క్రియాశీల వ్యక్తులపై ఈ అధ్యయనం సాగింది. అధ్యయనంలో పాలుపంచుకున్న వారిలో 50 శాతం మంది 29 ఏళ్లకు ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ వైఖరిలో మార్పుకు ఆర్థిక సుస్థిరత, కెరీర్ , వ్యక్తిగత సంసిద్ధత ఇవన్నీ ప్రాధాన్యత వహిస్తున్నాయని తేలింది. 

మన తెలంగాణ 12 Feb 2026 9:43 pm

Audio |రహస్య టెలికాన్ఫరెన్స్ కలకలం..

Audio | రహస్య టెలికాన్ఫరెన్స్ కలకలం.. మంత్రి, ఉద్యోగ సంఘాల నేతలపై బీజేపీ

ప్రభ న్యూస్ 12 Feb 2026 9:43 pm

కుమార్తెనే.. కిమ్ వారసురాలు: దక్షిణ కొరియా

సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తెనే ఆయన వారసురాలని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్‌ఐఎస్) అంచనా వేసింది. ఇది కిమ్ కుటుంబ వారసత్వం నాలుగోతరం వరకు కొనసాగుతుండడానికి సంకేతంగా ఎన్‌ఐఎస్ అంచనా వేసింది. ఈ విషయాన్ని చట్టసభ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. ఉత్తర కొరియా ఈ నెలాఖరులో భారీ ఎత్తున రాజకీయ సదస్సును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 లో తన కుమార్తె కిమ్ జు యేను మొట్ట మొదటిసారి కిమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. 2023 లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్యోంగాంగ్‌లో మళ్లీ ఆమె కనిపించింది. అప్పటి నుంచి అనేక అధికారిక కార్యక్రమాలకు ఆమె హాజరవుతోంది. గత నెలలోనూ తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశ కుమ్‌సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్‌ను ఆమె సందర్శించింది. ఈ పరిణామాలన్నీ ఆమె కిమ్ వారసురాలన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఆమె వారసురాలిగా నియామకం కీలక దశలో ఉన్నట్టు చట్టసభ సభ్యుడు లీ సియోంగ్ క్వెయియున్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 12 Feb 2026 9:37 pm

Pamphlets |బుగ్గ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవ కరపత్రాల ఆవిష్కరణ..

Pamphlets |బుగ్గ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవ కరపత్రాల ఆవిష్కరణ.. Pamphlets | బెల్లంపల్లి,

ప్రభ న్యూస్ 12 Feb 2026 9:27 pm

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుని హత్య

ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో చంపారా టీ గార్డెన్ కార్మికుడైన రతన్ శుభోకర్ (28) హత్యకు గురయ్యాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతోపాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుని సోదరుడు లక్ష్మణ్ కర్ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి నుంచి రతన్ కనిపించకుండా పోయాడని, తరువాత తోటలో శవమై కనిపించాడని, హత్యకు కారణాలు తమకు తెలియవని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం మౌల్వీబజార్ సాదర్ ఆస్పత్రికి పంపారు.బంగ్లాదేశ్‌లో హిందువులుతీవ్రమైన దాడులకు గురవుతున్నారు.గత డిసెంబర్‌లో రాడికల్ యూత్ లీడర్ షరీఫ్ ఉస్మాన్‌హాదీ హత్యకు గురైన దగ్గర నుంచి ఇవి తీవ్రంగా సాగుతున్నాయి. సోమవారం 62 ఏళ్ల హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్ బోగర్ బజార్‌లో తన షాపులో హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత డిసెంబర్‌లో మతోన్మాద హింసాత్మక సంఘటనలు 51 సంఘటనలు జరిగాయి. 

మన తెలంగాణ 12 Feb 2026 9:27 pm

Shiva’s |ఉమామహేశ్వర క్షేత్ర కొండపై వెలసిన శివస్వరూపం

Shiva’s | ఉమామహేశ్వర క్షేత్ర కొండపై వెలసిన శివస్వరూపం ఉమామహేశ్వరంలో శివస్వరూపం పునరుద్ధరణభక్తుల్లో

ప్రభ న్యూస్ 12 Feb 2026 9:16 pm

వాట్సాప్‌కు రష్యా షాక్..

మాస్కో: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు రష్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని బ్లాక్ చేసింది, తద్వారా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ గురువారంనాడు ధ్రువీకరించారు. తమ దేశ చట్టాలకు వాట్సాప్ కట్టుబడి ఉండేందుకు విముఖత చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంపై వాట్సాప్ కూడా స్పందించింది. తమ యాప్ ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేందుకు రష్యా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది. ‘మా యాప్‌ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు రష్యా ప్రయత్నించింది. ప్రభుత్వ నిఘా ఉన్న యాప్ వైపు ప్రజలు మళ్లేలా చేస్తోంది. 100 మిలియన్‌ల మంది యూజర్లను భద్రతమైన మేసేజింగ్ వ్యవస్థకు దూరం చేయడం తిరోగమన చర్య. ఇది రష్యా ప్రజల భద్రత మరింత తగ్గిస్తుంది. అయితే, యూజర్ల కనెక్టివిటీ కొనసాగేలా మేము ప్రయత్నిస్తున్నాము’ అని ఎక్స్ వేదికగా వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ స్థానంలో మ్యాక్స్ అనే మేసేజింగ్ యాప్‌ను రష్యా తీసుకురానుంది. 

మన తెలంగాణ 12 Feb 2026 9:15 pm

Kakani Govardhan Reddy Served Police Notice in Minor Death Case

Former Andhra Pradesh minister and YSR Congress Party leader Kakani Govardhan Reddy has been issued a police notice in connection with his remarks about the recent death of a minor girl in Nellore district. The incident took place last month in Gummalladibba village of Kovur mandal. The young girl was first treated at the Kovur […] The post Kakani Govardhan Reddy Served Police Notice in Minor Death Case appeared first on Telugu360 .

తెలుగు 360 12 Feb 2026 8:57 pm

development|పది లక్షలతో నిర్మించే గ్రామైక్య భవనానికి భూమి పూజ..

development| పది లక్షలతో నిర్మించే గ్రామైక్య భవనానికి భూమి పూజ.. development| సిర్పూర్,

ప్రభ న్యూస్ 12 Feb 2026 8:56 pm

protest |ఆశా వర్కర్లు నిరసన

protest | ఆశా వర్కర్లు నిరసన protest | చిట్యాల, ఆంధ్రప్రభ: కేంద్ర

ప్రభ న్యూస్ 12 Feb 2026 8:43 pm

Jagan to Continue Assembly Boycott, Says YSRCP Will Raise Voice in Council

YSR Congress Party president Y. S. Jagan Mohan Reddy has decided that his party will stay away from the Andhra Pradesh Assembly sessions once again. The announcement came after a meeting with party MLAs and MLCs at the YSRCP central office in Tadepalli. The party had earlier attended the Governor’s address at the start of […] The post Jagan to Continue Assembly Boycott, Says YSRCP Will Raise Voice in Council appeared first on Telugu360 .

తెలుగు 360 12 Feb 2026 8:38 pm

Didn’t Change Script, Happy To Direct Vishwak Sen: Arjun

It is known that Vishwak Sen was supposed to do the lead role in Action King Arjun Sarja’s latest flick Seetha Payanam. However, for some reasons, the actor opted out of the movie and he was replaced by Niranjan, with Aishwarya Arjun playing the female lead. The movie is set for release on February 14. […] The post Didn’t Change Script, Happy To Direct Vishwak Sen: Arjun appeared first on Telugu360 .

తెలుగు 360 12 Feb 2026 8:37 pm

23wards |తోక ముడిచిన సింహం.. చేతులెత్తేసిన లీడర్

23wards | ఆర్థిక తోడ్పాటు కోసం అభ్యర్థుల ఎదురు చూపులు 23wards |

ప్రభ న్యూస్ 12 Feb 2026 8:32 pm

Vikranth’s Markandeya Title Glimpse: DilRaju Dreams big budget Mythological thriller

The young and talented actor Vikranth, who recently impressed audiences with Santhana Prapthirasthu, steps into a new genre. His next under the prestigious DilRaju Dreams banner titled as Markandeya. This is the first production venture of DRD, the film appears to be mounted on a grand scale. The film is directed by Sistla VMK Makers […] The post Vikranth’s Markandeya Title Glimpse: DilRaju Dreams big budget Mythological thriller appeared first on Telugu360 .

తెలుగు 360 12 Feb 2026 8:16 pm

Counting |ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

Counting | ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు… Counting | స్టేషన్ ఘన్‌పూర్,

ప్రభ న్యూస్ 12 Feb 2026 8:09 pm

helping |రాజ్ పాల్ పై చెక్-బౌన్స్ కేసు..రంగంలోకి బాలీవుడ్ స్టార్స్ …

helping |రాజ్ పాల్ పై చెక్-బౌన్స్ కేసు..రంగంలోకి బాలీవుడ్ స్టార్స్ … helping

ప్రభ న్యూస్ 12 Feb 2026 8:02 pm

100 people |కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు

100 people | కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు 100 people

ప్రభ న్యూస్ 12 Feb 2026 8:00 pm

నరవణె పుస్తకం లీక్ వెనుక కుట్ర .. ఢిల్లీ పోలీసుల అనుమానం

న్యూఢిల్లీ: భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ’పుస్తకంపై వివాదం తీవ్ర దర్యాప్తునకు దారి తీస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చేపట్టిన ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. రక్షణశాఖ అనుమతి లేకుండానే ఈ పుస్తకం గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించడం కుట్ర కోణం బయటపెడుతుందనీ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రచురణకు ముందే ఈ పుస్తకం కాపీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సాధారణంగా అన్ని అనుమతులు పొంది ప్రచురించిన పుస్తకాలను విక్రయించేటప్పుడు కేటాయించే 13 అంకెల స్టాండర్డ్ బుక్ నంబరు (ఐఎస్‌బీఎన్)ను ఈ పుస్తకంపై ఉండడం పోలీసులకు విస్మయం కలిగించింది. ప్రచురణకు ముందు డిజిటల్ కాపీ ఎలా మార్కెట్ లోకి వెళ్లిందో వివరించాలని డిమాండ్ చేస్తూ పెంగ్విన్ సంస్థకు నోటీసు పంపారు. అయితే ఈ పుస్తకం ప్రచురణ హక్కులు తమవే అని, అధికారికంగా ఎలాంటి కాపీ ప్రింట్ రూపంలో కానీ డిజిటల్ రూపంలో కానీ పంపిణీ చేయడం, లేదా విక్రయించడం చేయలేదని ఆసంస్థవివరించింది. ఈ బుక్‌ను పంపించడానికి సంబంధించి డిజిటల్, ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

మన తెలంగాణ 12 Feb 2026 7:50 pm

తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి: సిఎం రేవంత్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో సిఎం రేవంత్ చిట్‌ చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీకాదు అన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని, తనను అన్నవాళ్లనే.. అంటున్నానని చెప్పారు. 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని.. తెలంగాణలో పదిన్నరేళ్లపాటు తానే ముఖ్యమంత్రి ఉంటానని పేర్కొన్నాడు. కాగా, నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొడంగల్ లో సిఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకుని.. తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో భేటీ అయి కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, తెలంగాణలో పలు అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

మన తెలంగాణ 12 Feb 2026 7:30 pm

రోడ్డు ప్రమాదంలో మృతి.. జాహ్నవి ఫ్యామిలీకి రూ.262కోట్ల భారీ పరిహారం

మూడేళ్ల క్రితం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించి తెలుగు యువతి ఫలించిన న్యాయపోరాటం, పరిహారానికి అంగీకరించిన సియాటెల్ వాషింగ్టన్/న్యూఢిల్లీ : మూడేళ్ల క్రితం అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల అంశంలో కుటుంబం చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఆమె కుటుంబానికి 26 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.262 కోట్లు) భారీ పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం ప్రకటన చేశారు. ‘జాహ్నవి కందుల మరణం మమ్నల్ని బాధించిందది. ఈ పరిహారం ఆమె కుటుంబానికి కాస్తయినా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాం’ అని సియోటెల్ అటార్నీ ప్రకటనలో పేర్కొంది. అయితే జాహ్నవి కుటుంబం తరుఫు అటార్నీ నుంచి ఇప్పటివరకూ ప్రకటనల వెలువడలేదు. కాగా, ఈ కేసులో సెటిల్‌మెంట్ కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి(23) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సౌత్‌లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరిన ఆమె 2023, జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా అతివేగంగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే, మరో అధికారి డేనియల్ అడరర్ జాహ్నవి మృతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఆమె ఒక సాధారణ వ్యక్తి అని, ఈ మరణానికి విలువే లేదు అంటూ పోలీస్ అధికారి అన్న మాటలు, ఆయన ప్రవర్తించిన తీరు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో భారత్‌తోపాటు అమెరికాలోనూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కెవిన్ తీరుపై అమెరికాలోనూ విమర్శలు రావడంతో ఆయన్ని విధుల నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేవలం 40 కిలోమీటర్ల జోన్ ఉంది. కానీ, కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవి మరణానికి కారణమైనట్లు దర్యాప్తులో తేలింది. ఇదిలావుండగా జాహ్నవి కుటుబానికి జరిగిన న్యాయంపై ఎన్‌ఆర్‌ఐలు హర్షం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 12 Feb 2026 7:20 pm

For the First Time, Mrunal Thakur responds on Wedding Rumors

Mrunal Thakur has been in the news for wrong reasons for some time. The actress is linked to Tamil actor Dhanush. Speculations said that the duo will get married on February 14th in a grand manner and the news created a sensation across the country. Dhanush and Mrunal Thakur remained tightlipped without responding much. Some […] The post For the First Time, Mrunal Thakur responds on Wedding Rumors appeared first on Telugu360 .

తెలుగు 360 12 Feb 2026 7:19 pm

చెట్టు కొమ్మ విరిగిపడి మహిళకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర–రొళ్ళ: మండల కేంద్రంలోని మడకశిర రోడ్డులో ఎస్.ఎల్.ఎన్ హోటల్ సమీపంలో నెలలుగా ఎండిపోయి ప్రమాదకరంగా నిలిచిన జువ్వి చెట్టు గురువారం ఒక మహిళకు తీవ్ర గాయాలకు కారణమైంది. సంబంధిత శాఖల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం అంగన్వాడీ కార్యకర్త జయలక్ష్మి తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బస్టాండ్ వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా ఎండిన కొమ్మ విరిగి ఆమె తలపై పడింది. ఈ ఘటనలో ఆమెకు తలకు బలమైన గాయమైంది. ఘటనను గమనించిన […] The post చెట్టు కొమ్మ విరిగిపడి మహిళకు తీవ్ర గాయాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 7:17 pm

లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా

విశాలాంధ్ర- తాడిపత్రి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్లో గురువారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మండల కార్యదర్శి నాగ రంగయ్య ఏఐటీయూసీ అంగన్వాడి యూనియన్ నాయకులు జ్యోతిలత, నాగేశ్వరి, శంకరమ్మ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపి, సార్వత్రిక సమ్మె విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను అమలు పరచి, […] The post లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Feb 2026 6:59 pm

Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 12 Feb 2026 6:54 pm

Temple |బయటపడిన దేవుని మహిమ…

Temple | బయటపడిన దేవుని మహిమ… Temple | రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:54 pm

Dharna |హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యం

Dharna | హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యం Dharna | ఉట్నూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:49 pm

25%PunitiveTariffs |భారత్ మౌనం వెనుక వ్యూహమా?

25%PunitiveTariffs | భారత్ మౌనం వెనుక వ్యూహమా? 25%PunitiveTariffs | మిత్ర దేశాల

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:49 pm

Association |నూత‌న చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ర్యాలీ…

Association | నూత‌న చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ర్యాలీ… Association | ఉరవకొండ

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:48 pm

Unit-I |రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి..

Unit-I | రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి.. Unit-I | రాప్తాడు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:42 pm

MLA |అంగడీశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా

MLA | అంగడీశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా MLA | కడెం( నిర్మల్

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:38 pm

Parkal |ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన పావుశెట్టి సునీల్

Parkal | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంపై

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:34 pm

44th National |లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి…

44th National | లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి… 44th

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:33 pm

Bhupalpalli |కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె..

Bhupalpalli | కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె.. Bhupalpalli | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:30 pm

Rs. 2,200 crore |విలువైన ప్రభుత్వ భూమిని

Rs. 2,200 crore | విలువైన ప్రభుత్వ భూమిని Rs. 2,200 crore

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:24 pm

వచ్చేది బిఆర్ఎస్ సర్కారే.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: కెటిఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగపల్లి నియోజకవర్గం నుంచి విజయ్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడాన్ని కెటిఆర్‌ స్వాగతించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణకు బిఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని అన్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే లేనప్పటికీ.. హైదరాబాద్ మొత్తంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ బలంగా ఉందని కెటిఆర్ తెలిపారు. ‘ఈ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపి చేసింది ఏం లేదు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలని పెద్దలు చెప్తారు. అందుకే ఈ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష బిఆర్ఎస్ మాత్రమే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఒకే ఒక విషయం చెప్పాను. ఓటు ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలో ఆలోచన చేయండని. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో ఎగిరేది మాత్రం గులాబి జెండానే. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొందరు నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్‌లోనే ఉన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ లేదు. కెసిఆర్ హయాంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉండేవి’ అని కెటిఆర్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 12 Feb 2026 6:15 pm

Mass copying |ఎందుకంటే…

Mass copying | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : 12వ తరగతి పరీక్షల

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:15 pm

Nani’s The Paradise Targets Ideal Date For Release

Natural Star Nani’s grand period action drama The Paradise has locked a new date, and it couldn’t be more favourable for the film’s box-office prospects. The team has moved away from the earlier March plan and will now arrive in cinemas on August 21, a slot that opens the door to one of the strongest […] The post Nani’s The Paradise Targets Ideal Date For Release appeared first on Telugu360 .

తెలుగు 360 12 Feb 2026 6:09 pm

Rs.15 crore |డిగ్రీ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలి….

Rs.15 crore | డిగ్రీ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలి…. Rs.15 crore

ప్రభ న్యూస్ 12 Feb 2026 6:03 pm

1350 cusecs |పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి..

1350 cusecs | పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి.. 1350 cusecs

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:57 pm

Elections |ఈసీ ఆదేశాలతో…

Elections | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:53 pm

Governor | 99 పైసలకే భూములపై స్పష్టత ఇవ్వని అధికార పక్షం

Governor | 99 పైసలకే భూములపై స్పష్టత ఇవ్వని అధికార పక్షం Governor

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:53 pm

Ootkur |సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక గ్రామసభ

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గ్రామంలో

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:45 pm

AP |ఏ కేసులోనంటే….

AP | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:37 pm

Clues Team |గుణదలలో కలకలం

Clues Team | గుణదలలో కలకలం Clues Team | విజయవాడ, క్రైమ్,

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:34 pm

Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ నెల 26వ తేదీ వరకూ గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది

తెలుగు పోస్ట్ 12 Feb 2026 5:32 pm

Sirpur |ఆధ్యాత్మిక సత్సంగం కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్, సర్పంచ్

Sirpur | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : శ్రీశ్రీశ్రీ సద్గురు పరమహంస పులాజి

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:30 pm

Farmers |యూరియా కోసం పెట్టిన యాప్ రద్దు చేయాలి.. 

Farmers | యూరియా కోసం పెట్టినయాప్రద్దు చేయాలి.. Farmers | శంకరపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:23 pm

Collector |జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే, చైర్ పర్సన్

Collector | జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే, చైర్ పర్సన్ Collector

ప్రభ న్యూస్ 12 Feb 2026 5:19 pm

Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపికబురు.. భారీగా ఫీజులు తగ్గింపు

తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపికబురు అందింది. ఫీజులు తగ్గించాలని నిర్ణయించింది

తెలుగు పోస్ట్ 12 Feb 2026 5:18 pm

అంపైర్‌తో నబీ ఓవరాక్షన్.. కొరడా ఝుళిపించిన ఐసిసి

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు విజయం కోసం ఏమాత్రం తగ్గకుండా పోటీ పడ్డాయి. తొలుత మ్యాచ్ టై కావడంతో నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ అంపైర్‌తో ఓవరాక్షన్ చేయడంతో అతనిపై ఐసిసి కొరడా ఝుళిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ కూడా 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు 17 పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవర్‌కి వెళ్లారు. రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా విజయకేతనం ఎగరవేసింది. అయితే లక్ష్య చేధనలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నబీ ఆరు బంతులు ఎదురుకొని ఐదు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయితే తాను క్రీజులో ఉన్న సమయంలో అన్‌ఫీల్డ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. సఫారీ బౌలర్ లుంగి ఎంగిడి ధరించిన రిస్ట్ బ్యాండ్ గురించి నబీ ఫిర్యాదు చేస్తూ.. అంపైర్‌తో గొడవపడ్డాడు. దీంతో ఐసిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా వేసింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. అంతేకాక ఐసిసి కోడ్ ఆఫ్ కండెక్ట్‌లో ఒక లెవల్ డీమెరిట్ పాయింట్ విధించింది.

మన తెలంగాణ 12 Feb 2026 5:16 pm