పార్టీ ఫిరాయింపుల కేసులో..ఎంఎల్ఎ దానంకు హైకోర్టు నోటీసు
పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతికి కూడా నోటీసు జారీ చేసింది. 2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ 2024లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్పై తాము ఇదివరకే అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయగా, పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ కేసు కొట్టి వేశారని పిటిషనర్ ఏలేటి తరఫున న్యాయవాది తన వాదన వినిపించారు. స్పీకర్ తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరుకాగా, అడ్వకేట్ జనరల్గా ఉంటూ స్పీకర్ తరపున ఎలా వాదిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ సీనియర్ న్యాయవాదిగా వాదించాలనుకుంటున్నానని చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి చెబుతూ కేసును వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు.
దాడులు 5 రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటన . తెహ్రాన్తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ట్రంప్ భయపడి పారిపోయారు… చమురు ధరల తగ్గింపు కోసమే నాటకాలు: ఇరాన్. చర్చలు జరగలేదని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు వాషింగ్టన్/తెహ్రాన్: హోర్మూజ్ జలసంధిని 48గంటల్లోగా తెరవని పక్షంలో విద్యుత్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. రెండురోజులుగా ఇరాన్తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను […] The post బెదిరిన ట్రంప్ appeared first on Visalaandhra .
. యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఇది స్టీల్ప్లాంట్ కాదు…స్టీల్ సిటీకి శంకుస్థాపన. దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ప్రభుత్వ ప్రణాళిక. ఏఎం`ఎనఎస్ భూమి పూజలో సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రాభివృద్ధి: కుమారస్వామి విశాలాంధ్ర- పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా): పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తిరుగులేని వేదికని, ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకా పల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద రూ.1.35 లక్షల కోట్లతో […] The post పరిశ్రమలకుఏపీ సరైన వేదిక appeared first on Visalaandhra .
యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం
. ఇంధన సరఫరా ఆగకుండా చర్యలు తీసుకున్నాం. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాం. పశ్చిమాసియా ఉద్రికత్తలపై లోక్సభలో ప్రధాని మోదీ ప్రకటన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశంలోని అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన లోక్సభలో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో […] The post యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం appeared first on Visalaandhra .
. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే పరిష్కారం. గ్యాస్ సరఫరా సమస్య నివారణకు చంద్రబాబు సూచన. శ్రీకాకుళం-కాకినాడ పైప్లైన్ పునరుద్ధరణకు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్జీ […] The post ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ appeared first on Visalaandhra .
నాడు అంగీకరించి… నేడు విచారణేంటి?అధికారుల ద్వంద్వ వైఖరిపై నిరసనగొంతు నొక్కేందుకే ‘రీ-సర్వే’ అంటున్న రాజధాని రైతులు విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు త్యాగం చేసిన అమరావతి రైతులపై ప్రభుత్వం మరోసారి తన ప్రతాపం చూపుతోంది. జీఓ నంబర్ 50 రూపంలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించి… భూములిచ్చిన రైతులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే సర్వేలు పూర్తి చేసి… అథారిటీ తీర్మానాల మేరకు ఇచ్చిన మినహాయింపులను ఇప్ప్పుడు ‘అక్రమాలు’గా […] The post గ్రామ కంఠాల గోస appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. భవిష్యత్లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిం చాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే […] The post ఇక 10 కిలోల గ్యాస్ సిలిండర్లు appeared first on Visalaandhra .
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్ప్పు
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఐఈఏ ఆందోళన పారిస్: పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఇంధన సంక్షోభం అంతకంతకూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. సోమ వారం ఆస్ట్రేలియా నేషనల్ ప్రెస్ క్లబ్ సమావేశం వేదికగా ఫాతిహ్ బిరోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధం వల్ల పశ్చిమాసియా లోని […] The post ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్ప్పు appeared first on Visalaandhra .
సర్వేలో అమెరికన్ల నిరసనవాషింగ్టన్: ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికన్లు భావిస్తున్నారు. గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా తమకు నష్టాలే జరుగుతాయనే అభిప్రాయంతో వారు ఉన్నారు. ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం ఇప్పటికే ప్రారంభమైందని సర్వేలో పాల్గొన్న అనేమంది అమెరికన్లు చెప్పారు. […] The post యుద్ధం వల్ల అన్నీ నష్టాలే appeared first on Visalaandhra .
అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం
వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025 […] The post అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం appeared first on Visalaandhra .
రన్వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం
న్యూయార్క్ విమానాశ్రయంలో ఘటన న్యూయార్క్: రన్వేపై వెళ్తున్న విమానం ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఘటన అమెరికా లోని న్యూయార్క్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా… మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారు. న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ సీఆర్జే-900… లాగార్డియా విమానాశ్రయంలోని నాలుగో రన్వేపై దిగింది. […] The post రన్వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం appeared first on Visalaandhra .
కూలిన కొలంబియా విమానం.. 80 మంది సైనికులు సజీవదహనం
బోగోటా : కొలంబియాలో ఓ సైనిక రవాణా విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని దాదాపు 80 మంది సైనికులు చనిపోయ్యారని అధికారులు తెలిపారు. సైనికులను తరలించేందుకు వినియోగించే సి 130 హర్కులస్ విమానం ప్యూర్టో లెగూయి.జమో నుంచి బయలుదేరిన వెంటనే సాంకేతికలోపాలతో కూలింది. మంటలు చెలరేగి , ఇందులోని రెండు ప్లాటూన్ల సైన్యం దుర్మరణం చెందినట్లు కొలంబియా రక్షణ మంత్రి కూడా నిర్థారించారు. ఈక్వెడార్ సరిహద్దుల్లో జరిగిన ప్రమాదానికి కారణాలు వెల్లడికాలేదు. సాధారణంగా ఈ విమానంలో వంద మంది వరకూ సైనికులను కల్లోలిత ప్రాంతాలకు తరలిస్తారు. సరిహద్దులో ఘర్షణల అణచివేతకు సైన్యాన్ని తరచూ వినియోగిస్తున్నారు.
హోర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై భారీగా ‘టోల్’
ఇరాన్ నిర్ణయం!తెహ్రాన్: అమెరికా, ఇజ్రాయిల్తో కొనసాగుతున్న ఘర్షణల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు కీలకమైన హోర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకలపై భారీగా టోల్ వసూలు చేయాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.18 కోట్ల వరకు పన్ను విధించనున్నట్లు ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత కమిటీ సభ్యుడు అలాఎద్దీన్ బొరూజెర్దీ వెల్లడించారు. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థకు […] The post హోర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై భారీగా ‘టోల్’ appeared first on Visalaandhra .
కల్కి సీక్వెల్ కోసం ప్రత్యేక సెట్?
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం (సీక్వెల్) శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్లకు సంబధించి కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ ప్రత్యేక మైన సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ప్రభాస్ పై ఎంట్రీ సాంగ్ ను చిత్రీకరిస్తారట. ఈ పాటలో […] The post కల్కి సీక్వెల్ కోసం ప్రత్యేక సెట్? appeared first on Visalaandhra .
కోలీవుడ్లో రోజా వరుస సినిమాలు
చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ నటీమణుల పునరాగమనం నడుస్తోంది. శోభన వంటి నటీమణుల బాటలోనే మాజీ మంత్రి రోజా కూడా మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ తమిళ సినిమాలకు దూరమైన రోజా… 12 రోజుల తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశమైన చిత్రం ‘అన్బే డయానా’. పారి ఎలవళగన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రోజా ఒక ముఖ్య […] The post కోలీవుడ్లో రోజా వరుస సినిమాలు appeared first on Visalaandhra .
జైపూర్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుండగా… ఇప్పుడు అందరి దష్టి రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పడింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే గత సీజన్లో ఐపీఎల్లో సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్… ఆ తర్వాత భారత అండర్-19 జట్టు తరఫున కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అతనిపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో అతని ఆటతీరు, ప్రొఫెషనలిజంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా […] The post వైభవ్కు ఏబీడీ కితాబు appeared first on Visalaandhra .
ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్
న్యూదిల్లీ: ఇటీవల టీ20 ప్రపంచకప్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్ ఐపీఎల్లోనూ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అక్షర్ ఈసారి జట్టుకు టైటిల్ను అందించేందుకు అవసరమైన వ్యూహాలు పన్నుతున్నాడు. మరో ఐదు రోజుల్లో పంతొమ్మిదో సీజన్ మొదలవ్వనున్న నేపథ్యంలో సహచరులతో కలిసి నెట్స్లో ప్రాక్టీస్తో బిజీగా ఉన్న అక్షర్ పటేల్… ‘ఇంప్యాక్ట్ ప్లేయర’ నిబంధనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అన్నీ ఒకే.. కానీ, ఈ ఒక్క నిబంధనే తనకు నచ్చదని […] The post ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్ appeared first on Visalaandhra .
కొడంగల్లో ఆయిల్పామ్, రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు
కొడంగ్లో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వెల్లడించారు. సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెరుగుతున్న డిమాండ్ దృష్టా సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొడంగల్లో మరోక ఆయిల్ పామ్, రిఫైనరీ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇకో పామ్ ఆయిల్, ఫ్యాట్స్ ప్రయివేట్ లిమిటెడ్కు చెందిన కంపెనీ గంటకు పది టన్నుల సామర్ధం కలిగిన మిల్లు ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. మిల్లు ఏర్పాటు చేయడానికి 50 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలియజేశారు. భూ కేటాయింపులు జరిగిన సంవత్సరం కాలంలో రూ. 75 కోట్లతో మిల్లు పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మిల్లు ఏర్పాటుతో ప్రత్యక్షంగా వంద మందికి, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, జాతీయంగా పామాయిల్ డిమాండ్ కోటి మెట్రిక్ టన్నులుగా ఉందని, భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతుల ద్వారా వంట నూనెల లోటును సమకూర్చుకుంటున్నామన్నారు. వంట నూనెల దిగుమతుల్లో పామాయిల్ వాటా సుమారు 60 శాతం ఉందని, పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం అవసరమని అంచనా ఉన్నట్లు వివరించారు. దీంతో రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఆయిల్ పామ్సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సిఎం ఆదేశాలతో కొడంగల్లో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు రాష్ట్ర రైతులకు మేలు చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన సంచాలకులు యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పాతబస్తీ, సంతోష్నగర్, మెయిన్బాగ్కు చెందిన సయీద్ లయీక్(31)ను మెయిన్బాగ్, మసాన్ గట్టి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్లూస్టీం వచ్చి ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతోష్ నగర్ పోలీసులు తెలిపారు.
గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినేట్
గిగ్వర్కర్స్, ప్లాట్ఫాం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026’ బిల్లును కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ దీనిని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం పిసిసి అధ్యక్షుడితో పాలు పలువురితో సిఎం రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశమయ్యారు. సభలో చర్చించాల్సిన విషయాలు, సభలో సభ్యులు వ్యవహారించాల్సిన తీరు తదితర అంశాలపై కేబినెట్ చర్చించినట్టుగా తెలిసింది.
Did Pawan Kalyan Hint of Taking a Break?
Pawan Kalyan’s recent film Ustaad Bhagat Singh released last weekend and the film turned out to be a huge embarrassment for the actor. He is badly criticized and his fans trolled him badly. The actor’s production house Pawan Kalyan Creative Works has issued a statement to put an end to the speculations. “As of now, […] The post Did Pawan Kalyan Hint of Taking a Break? appeared first on Telugu360 .
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. హేట్ స్పీచ్ బిల్లుకు, గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే,పేరెంట్స్ సామాజిక భద్రత బిల్లుకు, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు, కులగణనపై నిపుణుల కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తీర్మానించింది. ఈ కమిటీ ఛైర్మన్గా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులుగా మంత్రులు ఉత్తమ్కుమార్, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, శ్రీధర్బాబు వ్యవహరించనున్నారు. ఎల్ అండ్ టీ నుండి మెట్రో స్వాధీనం వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కీడు సోకిందని ఊరు ఖాళీచేసిన గ్రామస్తులు
జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా వరుసగా 28 మంది వివిధ కారణాలతో మరణించడంతో గ్రామంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రామానికి ఏదో కీడుసోకిందని బలంగా నమ్మిన గ్రామస్తులు, పురోహితుడి సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజంతా గ్రామస్తులు ఊరు మొత్తం ఖాళీ చేసి వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి కీడు వంటలు వండుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం సోమవారం తెల్లవారు జామునే ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలో డప్పు చాటింపు వేయించి మరీ ఊరి బయటకు వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన (కీడు) పీడ విరుగడవుతుందని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.
హార్మూజ్ జలసంధి మీదుగా రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు
దేశానికి సుమారు ఒకరోజుకుర సరిపడా వంటగ్యాస్ను తీసుకువెళ్తున్న భారత జెండా కలిగిన మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు, యుద్ధ వల్ల దెబ్బతిన్న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ఇవి రాబోయే రెండు రోజుల్లో భారత తీరానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ‘పైన్ గ్యాస్, జగ్ వసంత్’ అనే ఈ ఎల్పీజీ ట్యాంకర్లు సోమవారం ఉదయం పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరి, పరస్పరం సమీపంగా ప్రయాణిస్తూ హార్మూజ్ జలసంధిని దాటాయి. ఈ రెండు నౌకలు కలిపి సుమారు 92,000 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, ఈ నౌకలు గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్కు చేరేందుకు సాధారణంగా రెండు నుంచి రెండున్నర రోజులు పడుతుందని తెలిపారు. ఈ ట్యాంకర్లు ఇరాన్కు చెందిన లారాక్ మరియు క్వేశ్మ్ దీవుల మధ్యగా ప్రయాణించాయి. హార్మూజ్ జలసంధిని దాటే ముందు ఇరాన్ అధికారులకు తమ గుర్తింపును స్పష్టంగా తెలియజేయడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి దాదాపు మూసివేయబడటంతో పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన 22 భారత జెండా నౌకల్లో ఈ రెండు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ‘ఎంటీ శివాలిక్’, ‘ఎంటీ నందా దేవి’ అనే ట్యాంకర్లు సుమారు 92,712 టన్నుల ఎల్పీజీతో సురక్షితంగా భారత తీరాలకు చేరుకున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు మొత్తం 28 భారత జెండా నౌకలు హార్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్నాయి. వాటిలో 24 నౌకలు పశ్చిమ భాగంలో, నాలుగు తూర్పు భాగంలో ఉన్నాయి. గత కొన్ని రోజుల్లో రెండు వైపుల నుంచి రెండు నౌకలు చొప్పున సురక్షితంగా బయటపడ్డాయి. ‘శివాలిక్’ నౌక మార్చి 16న గుజరాత్లోని ముండ్రా పోర్టుకు చేరగా, ‘నందా దేవి’ మరుసటి రోజు కాండ్లా పోర్టుకు చేరింది. మరో రెండు ఎల్పీజీ నౌకలు మార్చి 13న ప్రయాణం ప్రారంభించి, మార్చి 14న హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇక యూఏఈ నుంచి 80,886 టన్నుల క్రూడ్ ఆయిల్ తీసుకువచ్చిన ‘జగ్ లాడ్కీ’ నౌక మార్చి 18న ముండ్రాకు చేరింది. అలాగే ఒమన్ నుంచి ఆఫ్రికాకు పెట్రోలు తీసుకెళ్తున్న ‘జగ్ ప్రకాష్’ ట్యాంకర్ కూడా ముందుగా సురక్షితంగా జలసంధిని దాటి ప్రస్తుతం టాంజానియాకు వెళ్తోంది. ఇంకా యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఉన్న 24 భారత జెండా నౌకల్లో, 22 నౌకలు పశ్చిమ భాగంలో 611 మంది సిబ్బందితో ఉన్నాయి. మిగిలిన రెండు నౌకలు తూర్పు భాగంలో కొనసాగుతున్నాయి.
Mega Steel Plant in Anakapalli Marks New Industrial Era for Andhra Pradesh
Andhra Pradesh has taken a major step forward in its industrial journey with the foundation of a massive steel plant in Rajayyapeta, Anakapalli district. Chief Minister Chandrababu Naidu laid the foundation stone for the ArcelorMittal Nippon Steel India project and described it as a turning point for the state’s economy. The project is set to […] The post Mega Steel Plant in Anakapalli Marks New Industrial Era for Andhra Pradesh appeared first on Telugu360 .
ఫైర్ట్రక్ను ఢీకొట్టిన కెనడా విమానం
అమెరికాలో ఎయిర్ కెనడా విమానానికి ప్రమాదం జరిగింది. పైలట్, కో పైలట్ మృతి చెందారు. సోమవారం ప్రాంతీయ జెట్ న్యూయార్క్ లాగార్డియా ఎయిర్పోర్టు రన్వేపే ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. అక్కడున్న అగ్నిమాపక ట్రక్కుతో ఢీకొంది. ఈ సమయంలో విమానంలో 39 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిని ఇతర సిబ్బందిని వెంటనే చికిత్సకు తరలించారు. కొందరికి ఎక్కువగా కాలిన గాయాలు అయ్యాయి. ఫైర్ ట్రక్కు సిబ్బంది కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటన తరువాత ఈ విమానాశ్రయాన్ని కొద్ది సేపు నిలిపివేశారు.
రుణమాఫీ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదు : నిర్మలా సీతారామన్
రైతులకు పూర్తి రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ద్వారా సకాలంలో తగినంత రుణం అందించడం వంటి అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుందని వివరించారు. ఈ కేపిసి కింద రూ. 3 లక్షల వరకు పంట రుణాన్ని రాయితీ వడ్డీ రేట్లకు అందిస్తున్నట్టు చెప్పారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కింద సకాలంలో తిరిగి చెల్లిస్తే అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్టు గుర్తు చేశారు. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ ) జారీ చేసిన ప్రాధాన్య రంగ రుణాల మార్గదర్శకాల ప్రకారం అనుబంధ కార్యకలాపాల రుణాలతోసహా పూచీకత్తు లేని స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. అలాగే వ్యవసాయంతో సహా ఆర్థిక వ్యవస్థ లోని ప్రాధాన్య రంగాలకు బ్యాంకింగ్ నుంచి తగినంత రుణ ప్రవాహం ఉండేలా చూస్తున్నామని లోక్సభకు ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. వీటితోపాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్ )పథకం కింద రైతులకు నేరుగా నగదు బదిలీతోపాటు పంటలబీమా అందిస్తున్నామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ముట్టడికి బిజెపి యత్నం
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ముట్టడికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆటోలో అసెంబ్లీ వద్దకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసు స్టేషన్కు తీసుకెళ్ళి సాయంత్రం విడుదల చేశారు.సోమవారం ఉదయం11.30 గంటల సమయంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో అసెంబ్లీకి నలువైపులా వస్తూ ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ముట్టడికి బిజెపి శ్రేణులు వస్తున్నారన్న విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పార్టీ నాయకుడు దీపక్ రెడ్డి నాయకత్వంలో కొంత మంది కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకుని రాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అదే సమయంలో ఇతర మార్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలు దూసుకుని రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. కార్యకర్తలు దూసుకుని రావడం, ఆ ప్రాంత మంతా ఉద్రిక్తతకు దారి తీసి, ట్రాఫిక్కు కొంత సమయం తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇదిలా ఉండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, మిగతా గ్యారంటీలన్నింటినీ పక్కనబెట్టి, అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతు భరోసా చెల్లించడం లేదని, దాదాపు రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో పలు విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆయన విమర్శించారు. అర్ధరాత్రి నుంచే తమ పార్టీ నాయకులను గృహనిర్బంధం చేశారని, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తున్న వేలాది కార్యకర్తలను మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. సుమారు ఎనిమిది వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారని రాంచందర్ రావు చెప్పారు.
ప్రయాగ్రాజ్లో ఘోర ప్రమాదం.. కోల్డ్ స్టోరేజ్ కూలి నలుగురు మృతి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఓ కోల్డ్ స్టోరేజ్ కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక దళం, పోలీసులతో సహా పలు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారి చెప్పారు. ఈ ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామని ప్రయాగ్రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ వర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏడీఎం ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అది 24 నుంచి 48 గంటల్లో నివేదిక సమర్పించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశఆరు. మరణించిన వారికి సంతాపం తెలుపుతూ.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 అందజేయనున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని యోగి, అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందేలా చూసేందుకు, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని జిల్లా పరిపాలన అధికారులను ఆదేశించారు.
పవన్ తదుపరి సినిమాలపై రూమర్స్.. నిర్మాణ సంస్థ ఏమందంటే..
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ‘హరిహర వీరమల్లు’, ‘ఒజి’ ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్సింగ్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఓవైపు ఎపి డిప్యూటీ సిఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఈ సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు పవన్. అయితే పవన్ తదుపరి సినిమాలపై సోషల్మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. సామాజిక అంశాలే ఇతివృత్తంగా సినిమాలు తెరకెక్కించే ఓ దర్శకుడితో పవన్ వర్క్ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ‘పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నిర్మాణ సంస్థ స్పందించింది. పవన్ ప్రస్తుతం ఏ సినిమాకి కమిట్ కాలేదని పేర్కొంది. ‘‘ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఏ కొత్త సినిమానీ అంగీకరించలేదు. ఆయన తదుపరి చిత్రాలపై వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదు. వెంటనే కొత్త సినిమాలు చేయాలన్న ప్రణాళికలు లేవు. ఒకవేళ ఏదైనా ప్రాజెక్టు ఓకే అయితే.. అధికారిక మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తాం. ఒక ‘ఒజి2’ అప్డేట్పై సరైన సమయంలో పవన్కల్యాణే దాని గురించి చెబుతారు’’ అని స్పష్టం చేసింది.
మైనర్ల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు,
మైనర్ల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు, పోలీసుల అదుపులో 11 ద్విచక్ర వాహనాలు, చిట్యాల,
క్యూ నెట్ కేసు.. 32మంది నిందితుల అరెస్టు
క్యూ నెట్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ చేస్తూ పలువురు అమాయకులను మోసం చేస్తున్న 32మందిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రంలో దాడులు చేసిన పోలీసులు విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న వారిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బషీర్బాగ్లోని సిసిఎస్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 30 బృందాలుగా ఏర్పడి అంతర్రాష్ట్ర ఆపరేషన్లో 11 మంది మహిళలతోపాటు 32 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నిందితులు నాలుగు కేసులలో 11 మంది బాధితుల నుండి సుమారు 75 లక్షల రూపాయలు వసూలు చేశారు. గతంలో గోల్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్ అని పిలవబడే ఈ సంస్థ, హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే క్యూ ఐ గ్రూప్కు చెందిన అనుబంధ సంస్థ. ఈ సంస్థ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతోంది. కమీషన్, విదేశాల ట్రిప్పుల పేరుతో పలువురిని ఇందులో చేర్చుకుంటోంది. చేరిన వారు మరికొంత మందిని చేర్చాలని, భారీగా కమీషన్ వస్తుందని, విదేశాలకు వెళ్లవచ్చని, కార్లు గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. క్యూ నెట్ నిందితులు హైటెక్ సిటీలోని ప్రముఖ హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ-కామర్స్ వ్యాపారం, పెట్టుబడుల పేరుతో పలువురు బాధితులకు వలవేశారు. రూ. 5 నుండి 10 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే, రెండేళ్లలో రూ. 3 నుండి 4 కోట్ల రూపాయల లాభం వస్తుందని నమ్మిస్తారు. ప్రారంభంలో వీరు క్యూ నెట్ పేరును కానీ, ఇది మల్టీ లెవల్ మార్కెటింగ్, బైనరీ పద్ధతి అని ఎక్కడా చెప్పరు. బాధితులు డబ్బు చెల్లించిన తర్వాత, వారి ప్రమేయం లేకుండానే ఆ మొత్తాన్ని వస్తువుల కొనుగోలుకు మళ్ళిస్తారు. ఇంటికి వస్తువులు వచ్చినప్పుడు, అవి కంపెనీ ఇచ్చిన బహుమతులని నమ్మిస్తూ అసలు పెట్టుబడిని పథకంలోకి మారుస్తున్నారు.
తాటిచెట్టి పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు
తాటిచెట్టి పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ :
కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రంగంలోకి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్అప్రమత్తమైన అగ్నిమాపక
సమస్యల పరిష్కారానికి సమర్థ నాయకత్వం ముఖ్యం…
సమస్యల పరిష్కారానికి సమర్థ నాయకత్వం ముఖ్యం… ప్రతి విజయం వెనుకా దృఢమైన నాయకత్వం
5days |ఇరాన్ యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భయమా? వ్యూహమా?
5days | ఇరాన్ యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భయమా? వ్యూహమా? 5days |
గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బి.ఎం.బి. ఏ2.0 – 100 రోజుల
సామ్ కరన్ ఔట్.. RRలోకి శ్రీలంక ఆల్ రౌండర్
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 మెగా టోర్నమెంట్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ ..జట్టులో కీలక మార్పు చేసింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ దసున్ శనకను జట్టులోకి ఎంపిక చేసింది. శనకను రూ.2కోట్లకు తీసుకుంది. గతంలో గుజరాత్ టైటాన్స్కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేస్తాడని రాజస్థాన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా శనక.. శ్రీలంక తరఫున 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 3350కి పైగా పరుగులు, 86 వికెట్లు ఉన్నాయి. ఇదిలావుంటే.. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ-వేలంలో శనక అమ్ముడుపోలేదు. దీంతో అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో లాహోర్ ఖలందర్స్, శనకను 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ లీగ్ను వదులి మళ్లీ ఐపీఎల్లో ఆడేందుకు వస్తున్నాడు. ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరనున్నాడు. మరో విదేశీ ఆటగాడు బ్లెస్సింగ్ ముజరబానీ కూడా పీఎస్ఎల్ లో ఇస్లామాబాద్ యునైటెడ్తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుని కోల్కతా నైట్ రైడర్స్లో చేరాడు.
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు… 16 వెల రూపాయలు అనధికారికంగా ఉన్న
ఈసారి ఆ సమస్య రాదు.. అతడే మా ఓపెనర్: ఢిల్లీ క్యాపిటల్స్
ఐపిఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనింగ్ జోడి సమస్యతో ఇబ్బంది పడింది. ఆరేడు జోడీలను ప్రయత్నించినా.. సఫలం కాలేదు. ఈ ఐపిఎల్లో మాత్రం అలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. అందులో భాగంగా పర్మనెంట్ ఓపెనర్గా కెఎల్ రాహుల్ని ఫిక్స్ చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమంగ్ బదాని తెలిపారు. ప్రి సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెనింగ్ జోడీనే టి-20 క్రికెట్లో కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. ఈసారి ఎలాంటి ప్రయోగాలకు పోవడం లేదని స్పష్టం చేశారు. 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్.. ఆ సీజన్లో కొన్ని మ్యాచ్లు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత టాపార్డర్లోకి వచ్చాడు. గత ఎడిషన్ో 150 స్ట్రైక్ రేటుతో 539 పరుగులు రాబట్టాడు. ఇటీవల కాలంలో పవర్ గేమ్ను మెరుగుపర్చుకున్నాడు రాహుల్. రాహుల్ ఓపెనర్గా అదరగొడితే ఢిల్లీకి ఇక తిరుగు ఉండదు. మరోవైపు అతడికి తోడుగా పాథున్ నిశాంక, అభిషేక్ పొరెల్, పృథ్వీషాలో ఒకరు ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం లేకపోలేదు.
మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వ సేవలు…
మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వ సేవలు… సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాయకాపురం, ఆంధ్రప్రభ
There are a lot of speculations about the upcoming film of Megastar Chiranjeevi which will be directed by Bobby Kolli. Titled Mega158, the film was announced last year and the shoot of the film was delayed due to various reasons. Bobby is yet to wrap up the scriptwork of the film and the casting process […] The post Mega158 Latest Updates appeared first on Telugu360 .
ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయం–సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్ర, కళ్యాణదుర్గం:రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గుతున్న ఈ కాలంలో, వచ్చే తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా జీవించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.సోమవారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో దివంగత నేత హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. పెద్దాయన భార్య లక్ష్మీదేవి, కుమారులు మారుతి చౌదరి, ఉదయ […] The post ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయం– సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ appeared first on Visalaandhra .
దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేసిన బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం నాగేందర్ను న్యాయస్థానం ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 16కి వాయిదా వేసింది. కాగా, పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బిఆర్ఎస్.. స్పీకర్ ఫిర్యాదు చేశారు. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం ఆదేశాల మేరకు దానంతో సహా 10 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డిని సిఎం చేసింది నేనే: ఎంఎల్ఎ మల్లారెడ్డి
“రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే..” అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ రెడ్డి తప్ప పవర్ పుల్ దమ్మున్న నాయకుడు మరొకరు లేరని రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో చెప్పానని ఆయన సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. మీకు తన మాటలపై నమ్మకం లేకపోతే ఆ వీడియో చూపిస్తానని ఆయన విలేకరులనుద్ధేశించి తెలిపారు. ఎవరు అవునన్నా కాదన్నా తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని ఆయన చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ తనదేనని అన్నారు. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తనను నటించమని అడిగితే నిరాకరించానని ఆయన తెలిపారు. ఎందుకు నిరాకరించారని ప్రశ్నించగా, అలాంటి పాత్ర కాదు ఏకంగా ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని ఉందన్నారు. వెండి తెరపై ముఖ్యమంత్రి పాత్ర పోషించడానికి అవకాశం వస్తే తప్పకుండా పోషిస్తానని సి. మల్లా రెడ్డి తెలిపారు.
బిఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో..ఏం ఇచ్చిందో చెప్పాలి: మంత్రి సీతక్క
బిఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో, ఏం ఇచ్చారో చెప్పాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాజీ మంత్రి హరీష్రావును ప్రశ్నించారు. అసెంబ్లీలో మాజీమంత్రి హరీష్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఢిల్లీ పాయే జాబులేమో రాకపాయే అంటూ అశోక్ నగర్ లాఠీచార్జీలను హరీశ్రావు గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఈ అంశంపై మంత్రి సీతక్క అసెంబ్లీలో మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇస్తే వాళ్లకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినట్లేనానని మంత్రి ప్రశ్నించారు. పాండవులు సంపాదించింది అంత కౌరవుల తద్దినానికే సరిపోయిందన్నట్లుగా గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోతుందని మంత్రి సీతక్క అన్నారు. ఇచ్చిన హామీల ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని సీతక్క చెప్పారు. హరీశ్ రావు నీ నియోజకవర్గానికి 50 శాతం రైతు రుణమాఫీ కాలేదంటున్నారని, మరి మీ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని, మీరు అప్పుడు చేసి ఉంటే ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఇబ్బంది ఉండకపోయేది కదా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏం చేశారో లెక్కలతో సహా చెప్పాలని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీ హయాంలో చాలా మంది రైతులు చనిపోయారు, మీ బాధ అంత అధికారం పోయిందని హరీష్ అన్న, మేము చేస్తున్న వాటిలో మన్ను పోసి మీరు గొప్ప అని చెప్పుకోవడం కాదని, సీట్ మారినంత మాత్రాన చరిత్ర మారుతుందా? పదేళ్లు అంటే చాలా సమయం ప్రజలు ఇచ్చారని, ఎందుకు మీరు చేయలేదని, మీ అప్పులకి వడ్డీలు, వడ్డీలకు వడ్డీలే సరిపోతున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా పెడితే ఓర్వ లేకపోతున్నారని, మట్టి, దుమ్ము పోసుడు రాజకీయం కాదని, ముందు మీరు చేసింది చెప్పాలని, తాము ఏం చేయాలో చెప్పాలని మంత్రి సీతక్క హరీష్రావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఐదు రోజులు దాడులు ఆపుతామన్న ట్రంప్.. ఇరాన్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయమని ట్రంప్ తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకూ దాడులు చేయమని స్పష్టం చేశారు. ఇరాన్తో చర్చలు జరుగుతున్నట్లు ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. రెండు రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చలు సానుకూలంగా ఉన్నాయని.. మరో వారం పాటు ఇరాన్తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. చర్చల ఫలితంపై భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం స్పందించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ట్రంప్ మరోసారి దిగివచ్చారని ఇరాన్ అన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. తమ హెచ్చరికలతో ట్రంప్ దిగివచ్చారని ఇరాన్ తెలిపింది. ట్రంప్తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని పేర్కొంది. చర్చల ప్రతిపాదనను తాము తిరస్కరించామని.. చమురు ధరల తగ్గింపు కోసమే ట్రంప్ నాటకాలు అని తెలిపింది. యుద్ధ నివారణ కోసం గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని.. అసలు చొరవ తీసుకోవాల్సింది.. యుద్ధం ప్రారంభించిన దేశమని ఇరాన్ స్పష్టం చేసింది.
Congress : అక్కరకు రాని నేతలను అక్కున చేర్చుకుని కాంగ్రెస్ తప్పు చేస్తుందా?
కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీనే ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు
హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్నగర్ కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శృతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మూడో అంతస్థులో ఎసి పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది, రోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.
'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో మైలురాయిని నెలకొల్పిన డానోన్ ఇండియా
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది. నవంబర్ 2025లో, డనోన్ ఇండియా దేశవ్యాప్తంగా ఐరన్ లోప రక్తహీనత (IDA)ను గుర్తించడం, నివారించడాన్ని వేగవంతం చేయడానికి 'ఐరన్ అప్!' అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, అవగాహన పెంచడానికి, సకాలంలో రోగ నిర్ధారణను మెరుగుపరచడానికి, నివారణ పోషణను ప్రోత్సహించడాని కి కట్టుబడి ఉండాలని భారతదేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులకు పిలుపునిస్తూ డనోన్ 'IDA ప్లెడ్జ్ క్యాంపెయిన్'ను ప్రారంభించింది. కుటుంబాలు ప్రతిరోజూ ఐరన్ లోపాన్ని అర్థం చేసుకుని, దానిపై చర్యలు తీసు కోవడంలో సహాయపడటానికి వైద్య సమాజంలో ఒక బలమైన, ఏకీకృత ఉద్యమాన్ని నిర్మించడమే ఈ సామూ హిక ప్రయత్న లక్ష్యం. 'ఐరన్ అప్' చొరవ అనే ప్రచారం, అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న శిశువైద్యులు, సాధారణ వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులను భాగస్వాములను చేసింది. వైద్య సమాజాన్ని సమీకరించడం ద్వారా, డానోన్ ఇండియా ముఖ్యంగా పేద ప్రజలలో ఐరన్ లోపంపై అవగాహన పెంచడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తన విజ్ఞాన-ఆధారిత పోషకాహార విధానంలో భాగంగా, డానోన్ ఇండియా ఐరన్ శోషణకు, పేగు ఆరో గ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలతో రూపొందించిన 'ఐరన్బయోటిక్స్' వంటి పరిష్కారాలను అభివృద్ధి చేస్తూనే ఉంది. తద్వారా, ఐరన్ లోపం, రక్తహీనతను పెద్ద ఎత్తున పరిష్కరించాలనే తన నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తోంది. ఈ మైలురాయి గురించి డనోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక వర్మ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రభావ వంతమైన కార్యక్రమానికి గాను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందడం మాకు గర్వకారణం. లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న రక్తహీనతపై పోరాడటానికి వైద్య సమాజంలో ఉన్న ఉమ్మడి నిబద్ధతను, ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుండి 20,911 ప్రతిజ్ఞలను పొందడం ద్వారా ప్రదర్శించవచ్చు. ఈ నిరంతర, సమాజ-ఆధారిత విధానం లెక్కలేనంత మంది భారతీయుల ఆరోగ్య ఫలితాలను మార్చివేస్తుంది. ఇది అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సమాజాలు, సంస్థలు ఏకతాటిపైకి వచ్చే సామూ హిక చర్య శక్తిని ప్రతిబింబిస్తుంది. దేశ పోషకాహార పునాదిని బలోపేతం చేయడమే కాకుండా, సాక్ష్యాధారిత, సమ్మిళిత ప్రజారోగ్య ఆవిష్కరణలలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టే ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం’’ అని అన్నారు. ఐరన్అప్ కార్యక్రమంతో పాటు, డనోన్ ఇండియా బిహార్లో 'స్వస్థ మాత స్వస్థ బాలక్' అనే ఏడాది పొడవునా సాగే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. గర్భిణీ స్త్రీల పోషణను మెరుగుపరచడం, అవగాహనను పెంచడం, తల్లులు, వారి శిశువులిద్దరికీ మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. గర్భిణులు, శిశువులలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి డనోన్ చేస్తున్న ప్రత్యేక ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగం. పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల కొరతను పరిష్కరించడానికి డనోన్ ఇండియా చేస్తున్న నిరంతర ప్రయత్నా లలో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. ఆరోగ్యకరమైన భవి ష్యత్తును నిర్మించడానికి ఆరోగ్య సంరక్షణ భాగస్వాములు, విధాన రూపకర్తలు, సమాజాలతో కలిసి పని చేయడా నికి ఈ సంస్థ కట్టుబడి ఉంది.
‘ధురంధర్ 2’ను బ్యాన్ చేయాలంటూ.. కోర్టులో పిటిషన్
'ధురందర్ ది రివెంజ్' సినిమాను బ్యాన్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టను ఆశ్రయించారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఆందోళనలను ప్రస్తావిస్తూ, తమిళనాడులో 'ధురందర్ 2' సినిమా విడుదలను నిషేధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది. ఓ న్యాయవాది.. ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్ ఎదుట మౌఖికంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ చిత్రం రాజకీయ ఇతివృత్తాలతో కూడుకున్నదని, ఎన్నికల సమయంలో దీనిని ప్రదర్శించకూడదని ఆయన వాదించారు. అయితే, పిటిషనర్ అధికారికంగా రిట్ పిటిషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఈ విషయంపై అత్యవసర విచారణ కోరాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన తర్వాతే, సినిమా విడుదలను నిలిపివేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా, 'ధురందర్ ది రివెంజ్' చిత్రం కరాచీలోని ల్యారీ నేపథ్యంలో సాగుతుంది. ఈ ప్రాంతం తరచుగా గ్యాంగ్ ఘర్షణలతో ముడిపడి ఉంటుంది. ఈ చిత్రం కల్పిత కథనంతో పాటు కాందహార్ హైజాకింగ్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వంటి నిజ జీవిత సంఘటనలను కూడా ప్రస్తావించారు. హీరో రణ్ వీర్ సింగ్ తోపాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కూడా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయంతో దూసుకుపోతోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా రూ.750 కోట్లకు పైగా వసూల్ చేసి.. రూ.వెయ్యి కోట్లవైపు పరుగులు పెడుతోంది.
Chandrababu : స్పీడ్ ఆఫ్ బిజినెస్ వైపు ఏపీ దూసుకెళుతుంది
స్పీడ్ ఆఫ్ బిజినెస్ వైపు ఏపీ వైపు వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
నేనెంత చెప్పిన.. వైభవ్ నా మాట వినడు: జితేశ్ శర్మ
గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల వయస్సులోనే ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత జరిగిన ఐపిఎల్ సీజన్లో వేగవంతమైన సెంచరీ చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత భారత యువ జట్టు తరఫున కూడా పలు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపిఎల్ 19వ సీజన్లో చాలా మంది దృష్టి వైభవ్ పైనే ఉంది. ఈసారి వైభవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీపై ఆర్సిబి ఆటగాడు జితేశ్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్తో యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన జితేశ్.. వైభవ్ని అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. ‘‘వైభవ్ సూర్యవంశీ చక్కటి ఆటగాడు. అండర్-19 జట్టులో అతడి ఆట చూశాను. నిలకడగా రాణించడం సాధారణ విషయం కాదు. అండర్-19 ప్రపంచకప్లో అతడి ఆట తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తన వయసు కన్నా ఎంతో పరిణితిని సాధించాడు’’ అని జితేశ్ అన్నాడు. ‘‘అతడు తన గేమ్ ప్లాన్ను అనుసరించి ఆడాడు. ఐపిఎల్లో ఎలా రాణించాడో దాన్నే కొనసాగించాడు. మరొకరిని అనుకరించలేదు. బౌలర్లతో దురుసుగా ప్రవర్తించలేదు. వైభవ్ భవిష్యత్తులో ప్రొఫెషనల్గా మారుతాడు. ప్రస్తుతానికైతే అతడు ప్రొఫెషనల్ కాదు (నవ్వుతూ). అందరూ అతడిని ప్రొఫెషనల్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. వైభవ్ ఎప్పటికీ అలానే ఉంటాడని నేను అనుకోవడం లేదు. నేను కూడా ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్నా. రాత్రిపూట ఐస్క్రీం తినొద్దు అని అతడికి నేను చాలాసార్లు చెప్పి చూశాను. అయినా ఎప్పుడు నా మాట వినలేదు’’ అని జితేశ్ వివరించాడు.
Ys Sharmila : నా అజెండా ఆస్తులు కాదు.. ఆస్తుల కోసమే అయితే?
వైఎస్ వివేకా హత్య కేసు వచ్చినప్పుడల్లా వైసీపీ నేతలు ఆస్తుల వివాదాన్ని తెస్తున్నారని వైఎస్ షర్మిల తెలిపారు
ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు..
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డొమ్మేటి వెంకట రెడ్డిజయంతి వేడుకలు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డిగారు మట్లాడుతు..దొమ్మేటి వెంకటరెడ్డి (1853–1928) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సామాజికవర్గ ఆద్యులు,దాత అన్నారు. 1920లో ఈండ్ర/ఈడిగ కులాన్ని ‘సెట్టిబలిజ’గా గుర్తింపు […] The post ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు.. appeared first on Visalaandhra .
నా కుమారుడు నిర్దోషి : పుట్టా సుధాకర్ యాదవ్
తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
Fake News: Anushka Sharma in Allu Arjun’s Film
Icon Star Allu Arjun is shooting for his upcoming movie directed by Atlee. The film titled AA22 is half done with the shoot and has four top actresses playing important roles. Deepika Padukone, Mrunal Thakur, Rashmika Mandanna and Jahnvi Kapoor will be seen in prominent roles in the film. From the past one day, there […] The post Fake News: Anushka Sharma in Allu Arjun’s Film appeared first on Telugu360 .
US Steps Back From Iran Conflict, But Israel’s Move Remains Uncertain
The United States has taken an unexpected step back from the brink of conflict with Iran. President Donald Trump announced a five-day pause on planned military strikes, saying that he had constructive talks with Iranian representatives. The decision has eased immediate tensions, but it has also raised a larger question. There is a growing belief […] The post US Steps Back From Iran Conflict, But Israel’s Move Remains Uncertain appeared first on Telugu360 .
రూరల్ ఎస్సై రాజశేఖర్ విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో నివసించు బి. శ్రీనివాసులు(35)కుటుంబ కలహాలతో శనివారం అర్ధరాత్రి సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. వివరాలకు వెళితే మృతుడు బి శ్రీనివాసులు ఆరు సంవత్సరాల కిందట మహేశ్వరి అనే అమ్మాయిని వివాహం చేసుకొని, కుటుంబ కలహాలతో భార్య మృతి చెందింది. భార్య చనిపోవడంతో మద్యముకు బానిస అయ్యాడు. మధ్యము మాని, మరో పెళ్లి చేస్తే బాగుపడుతాడు అన్న ఉద్దేశంతో నాన్న అదెప్ప మరో […] The post కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య appeared first on Visalaandhra .
Iran - Israel War : అమెరికా అధ్యక్షుడి కీలక నిర్ణయం..ఊపిరి పీల్చుకున్న పశ్చిమాసియా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు
ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..?
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజావిశాలాంధ్ర ధర్మవరం;; గరికిపాటి నరసింహారావు విద్యార్థుల చదువు, వారి హక్కులపై మాట్లాడటం బాగానే ఉంది కానీ ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు గరికిపాటికి సమాధానం చెప్పే దమ్ముందా..? అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సిపిఐ కాలనీలో పట్టణ అధ్యక్షులు గోవర్ధన్ ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దు అనడంలో గరికపాటి ఆంతర్యం ఏమిటి అని?, పేదల పిల్లలకు చదువుకోవడం ఇష్టం […] The post ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..? appeared first on Visalaandhra .
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జేసి పులి శ్రీనివాసులు మార్కాపురం : మార్కాపురం జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్క రించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సూక్ష్మ స్థాయిలోపరిశీలించి సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజల నుండి […] The post ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి appeared first on Visalaandhra .
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని వర్తింప చేయండి..
మహిళా రైతు వనమాల నారాయణమ్మవిశాలాంధ్ర ధర్మవరం;; అన్నదాత సుఖీభవ పి ఎం కిషోర్ పథకాన్ని నాకు వర్తింపచేయాలని మహిళా రైతు వనమాల నారాయణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ధర్మవరం మండల పరిధిలోని కొలుతురు గ్రామంలో గల మహిళా రైతు ఉన్నానని, నా భర్త వనమాల నారాయణ మృతి చెందడం జరిగిందని, ప్రస్తుతం కుమారుడితో తుంపర్తి కాలనీలో నివాసం ఉంటున్నానని తెలిపారు. సర్వేనెంబర్ 171-2 సర్వే నెంబర్లు రెండు ఎకరాల భూమి ఉందని పూలు […] The post అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని వర్తింప చేయండి.. appeared first on Visalaandhra .
24న నిరాహార దీక్షను విజయవంతం చేయండి..
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ విశాలాంధ్ర ధర్మవరం; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు నిర్వహించే దీక్షను మార్చి 24వ తేదీన విజయవంతం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా నిరాహార దీక్ష కొరకు అనుమతి కోరుతూ వన్ […] The post 24న నిరాహార దీక్షను విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ ఆలయంలో అద్భుత దృశ్యం #telugupost #temple #adilabadnews #sunrays
Breaking : పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్
ఇరాన్ పై యుద్ధాన్ని కొన్ని రోజుల పాటు ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు
ధర్మవరం పట్టు శాలువాలు తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలుకు శ్రీకారం
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం పట్టుచీరలు ఇకనుంచి తిరుమల తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలో పాల్గొనే వారికి ఆలయం తరఫున పట్టు వస్త్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మవరం నుంచి కొనుగోలు చేయనున్నది. రాష్ట్ర చేనేత జౌళి శాఖ రంగం తరపున తొలి విడతలో 65 వేల పట్టు శాలువాలను కొనుగోలు చేసేలా రంగం సిద్ధమయింది. ధర్మవరంలోని చేనేత మగ్గాలపై నేసిన పట్టు శాలువాలను మాత్రమే తయారు చేసే విధంగా చర్యలు […] The post ధర్మవరం పట్టు శాలువాలు తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలుకు శ్రీకారం appeared first on Visalaandhra .
కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం; ఎస్పీ సతీష్ కుమార్, ఇంచార్జ్ డిఎస్పి నర్సింగ్ అప్ప ఆదేశాల మేరకు వన్ టౌన్ పరిధిలోగల ఎర్రగుంట లో కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వీరితో పాటు వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, టూ టౌన్ ఎస్ఐ వీరేష్, సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఏ ఇంటిలో అయినా డ్రగ్స్, అనుమానిత వస్తువులు ఉన్నాయా అన్న కోణంలో సోదాలు నిర్వహించారు. అనంతరం సీఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ […] The post కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు appeared first on Visalaandhra .
తమిళనాడు ఎన్నికలు.. కూటమి పార్టీల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు
చెన్నై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) సోమవారం సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసింది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి, భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఈ సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐఏడీఎంకే అత్యధికంగా 178 సీట్లను దక్కించుకుంది. ఇక, బిజెపికి 27 సీట్లు.. పట్టాలి మక్కల్ కచ్చి (PMK) పార్టీకి 18 సీట్లు.. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) పార్టీకి 11 సీట్లు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటనే ఈసారి బిజెపికి ఏడు సీట్లు ఎక్కువగా ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించింది. సీట్లు సర్దుబాటు అనంతరం BJP నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము అత్యంత బలమైన కూటమిని ఏర్పాటు చేశాం. మా కూటమి ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించబోతోంది అని ధీమా వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకం..
ఆమ్ ఆద్మీపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద పిల్లలకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకము అని ఆమ్ ఆద్మీపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకం మీద చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, నిరుపేద, మధ్యతరగతి వారి పిల్లల కోసం రూపొందించినదే ఈ మధ్యాహ్న […] The post పేద విద్యార్థులకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకం.. appeared first on Visalaandhra .
క్యూనెట్ కేసులో 32 మందిని అరెస్ట్ చేశాం: సజ్జనార్
హైదరాబాద్: క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేశామని సిపి సజ్జనార్ తెలిపారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ మోసాలకు పాల్పడిన విషయం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్, ఎపి, కర్ణాటకల్లో 25 బృందాలతో సోదాలు నిర్వహించారు. తాజాగా సజ్జనార్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. క్యూనెట్పై తెలంగాణలో 68, హైదరాబాద్లో 22 కేసులు ఉన్నాయని.. ఇటీవల మరో 4 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో సోదాలు చేసి 32 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్లో ఓ క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సెకండ్ ఇన్కమ్ పేరుతో ఐటి ఉద్యోగులను ఆకర్షిస్తున్నారని అన్నారు. స్టార్ హోటళ్లలో మీటింగ్లు పెట్టి ఉత్పత్తులు అమ్మమంటున్నారని.. రుణాలు ఇప్పించి మరీ క్యూనెట్లో చేర్చుకుంటున్నారని తెలిపారు. కార్లు, ఇళ్లు చూపించి క్యూనెట్లోకి ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. బాధితుల్లో ప్రముఖ ఐటి కంపెనీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. మనీలాండరింగ్పై దర్యాప్తు కోసం ఇడిని కోరుతమని తెలిపారు.
ఐపిఎల్ 2026.. ఫ్యాన్స్ కోసం బిసిసిఐ ప్రత్యేక ఏర్పాటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా మైదానంలో చూడాలని ప్రతీ అభిమానులు భావిస్తాడు. అయితే కొందరికి అది సాధ్యం కాదు. అలాంటి అభిమానుల కోసం బిసిసిఐ చేసే ప్రత్యేక ఏర్పాటే ‘ఫ్యాన్ పార్క్’. ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని.. అక్కడ స్క్రీన్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి అందరికి మ్యాచ్ని చూసే సౌకర్యం కల్పిస్తుంది. అలా ఈసారి కూడా 15 నగరాల్లో ఫ్యాన్ పార్క్లు ఏర్పాటు చేయనుంది బిసిసిఐ. అవి కూడా వీకెండ్స్లో కావడం మరో విశేషం. అయితే ఈ సారి ఐపిఎల్ తొలి 20 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయడంతో ఫ్యాన్ పార్క్లు కూడా మూడు వీకెండ్స్లో ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాన్ పార్క్లో లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్తో పాటు వివిధ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తారు. మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫుడ్ కోర్టులు, చిన్నారుల కోసం ప్లే జోన్లను ఏర్పాటు చేస్తారు. వర్చువల్ బ్యాటింగ్, బౌలింగ్ నెట్స్, పేస్ పెయింటింగ్, ఫోటో బూత్స్.. ఇలా అభిమానులను అలరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ప్యాన్ పార్క్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన 2015 ఐపిఎల్ సమయంలో బిసిసిఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు వీకెండ్స్తో ఐదేసి నగరాల్లో ఫ్యాన్ పార్క్లను బిసిసిఐ ఏర్పాటు చేయనుంది. మార్చి 28 & 29లలో రోహ్తక్, భోపాల్, నాగ్పూర్, తుమకూరు, కృష్ణానగర్లో.. ఏప్రిల్ 4 & 5 తేదీల్లో మథుర, జోద్పూర్, మైసూరు, భువనేశ్వర్, నిజామాబాద్లో.. ఏప్రిల్ 11 & 12 తేదీల్లో మేరఠ్, నదైద్, రత్నగిరి, కోయంబత్తూర్, రవూర్కెలాలో ఈ ఫ్యాన్ పార్క్లు ఏర్పాటు చేయనున్నారు.
ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు..
ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు.. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసిన
రైతులకు రూ. 8.25 కోట్ల రుణాలు పంపిణీ…
రైతులకు రూ. 8.25 కోట్ల రుణాలు పంపిణీ… తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు
రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. ఉరుసు బైపాస్ రోడ్డుపై ధర్నా
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా బాధ్యతా సేవా సంస్థ
కడియం : కడియం అరుంధతి పేటలో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా కుడేలి చిన్న అమ్ములు కుటుంబానికి చెందిన తాటాకిల్లు దగ్ధమయింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామన్లు కాలి బూడిద అయ్యాయి. బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు, సంస్థ సభ్యులతో కలిసి బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామగ్రి, బియ్యం, నగదు అందజేశారు. కోసూరి సూరిబాబు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గిరజాల […] The post అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా బాధ్యతా సేవా సంస్థ appeared first on Visalaandhra .
10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 302 మంది గైరు హాజరు…
10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 302 మంది గైరు హాజరు… 53 పరీక్ష
ఉచిత గాలికుంటు నివారణ టీకాలు..
ఉచిత గాలికుంటు నివారణ టీకాలు.. చిట్యాల, ఆంధ్రప్రభ : పశు వైద్య శాఖ
Andhra Prabha Smart Edition |AP|నక్కపల్లిలో అద్భుత ఘట్టం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-03-2026, 4.00PM ap నక్కపల్లిలో నయా చరిత్ర..
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి : దేశంలో సామ్రాజ్యవాద, మతోన్మాద శక్తులకు చరమగీతం పాడి సమసమాజ కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదరర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు సుఖదేవ్, భగత్ సింగ్, శివరాం రాజ్ గురు 95వ వర్ధంతి వేడుకలు సోమవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా […] The post సమసమాజం కోసం పోరాటం చేద్దాం appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|బకాయిల లడాయి/వివాదాల రణస్థలం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-03-2026, 4.00PM ts బకాయిల లడాయి.. హరీష్
సజావుగా పదో తరగతి పరీక్షలు..
సజావుగా పదో తరగతి పరీక్షలు.. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డా.
Disha Patani Irritates with her Glam Show
Disha Patani is one of the most glamorous actresses and she never hesitates to show off her curves in public. There are hundreds of her bikini pictures posted by the actress on social media. They kept trending for sometime and it is now irritating to watch her continuously in glamorous outfits. Her recent public appearance […] The post Disha Patani Irritates with her Glam Show appeared first on Telugu360 .
Tirupati | ఏమైందో ఏమో… Tirupati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్
పశ్చిమాసియాలో కోటి మంది భారతీయుల రక్షణ చర్యలు: ప్రధాని
పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం లోక్సభను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారని.. యుద్ధక్షేత్రంలో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని తెలిపారు. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో 24 గంటల పాటు కంట్రోల్రూమ్లు, హెల్ప్లైన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కు వచ్చారని ప్రధాని తెలిపారు. ఇక, పశ్చిమాసియాతో భారత్ కు లోతైన వ్యాపార సంబంధాలున్నాయని మోడీ చెప్పారు. భారత్ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందని తెలిపారు. ప్రస్తుతం మన దగ్గర 53 మిలియన్ మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయన్నారు. హర్మూజ్ నుంచి షిప్స్ సురక్షితంగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు… ఎల్పీజీకి బదులు పీఎన్జీ!
: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై దృష్టి సారించడమే సరైన మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ అందించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో […] The post గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు… ఎల్పీజీకి బదులు పీఎన్జీ! appeared first on Visalaandhra .
హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి
పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగరాన్ని మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నట్లు వెల్లడించారు. క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా ఈ ప్రణాళిక సాగనుంది. నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలన్నింటినీ వెలుపలికి తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా అండర్పాస్లు, సర్ఫేస్ రోడ్లు […] The post హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి appeared first on Visalaandhra .
ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం
భారత్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు […] The post ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం appeared first on Visalaandhra .
బడ్జెట్లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు: హరీశ్ రావు
హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల అజెండాలో, తొలి బడ్జెట్లో పెట్టారని తెలిపారు. కానీ, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 వేలకు తగ్గించారని ధ్వజమెత్తారు. మూడో పంటకు రైతు బంధు ఇవ్వాలని అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక సీజన్కే ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒక సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాజఫీ చేశామరి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. మొదటి బడ్జెట్లో పెట్టినట్లు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే.. రైతు భరోసా, పంటల బోనస్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండో బడ్జెట్లో పెట్టిన పంటల బీమా ఈ బడ్జెట్లో మాయమైందని అన్నారు.
ఇక నుంచి 10 కేజీల ఎల్పీజీ సిలిండర్..?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఈ తీవ్ర కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీనిని 10 కిలోలకు తగ్గించాలని చమురు సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. పాత సిలిండర్లలోనే 10 కేజీల ఎల్పీజీని నింపి అందించే అవకాశాలను పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ది ఎకనామిక్ టైమ్స్ […] The post ఇక నుంచి 10 కేజీల ఎల్పీజీ సిలిండర్..? appeared first on Visalaandhra .

25 C