SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

నేను తిన్నది మూడు మామిడి పండ్లే

కోర్టుకు తెలిపిన కేజ్రీవాల్‌… తీర్పు రిజర్వు న్యూదిల్లీ : మామిడి పండ్లు, స్వీట్లు విచ్చలవిడిగా తింటున్నట్లు ఈడీ తనపై దుష్ప్రచారం చేస్తోందని, అందులో ఎలాంటి వాస్తవం లేదని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడిరచారు. 48 సార్లు భోజనంలో కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే తాను తెలిపారు. ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తిన్నానని చెప్పారు. అది కూడా నవరాత్రి ప్రసాదమని శుక్రవారం దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టుకు వెల్లడిరచారు. తీహారు జైల్లో తనకు […] The post నేను తిన్నది మూడు మామిడి పండ్లే appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 19 Apr 2024 11:30 pm

పొలిటికల్‌ సెటైర్లతో `ప్రతినిధి 2` ట్రైలర్‌.. గాంధీ మరణాన్ని సాకుగా చూపి సీఎంకి చురకలు?

నారా రోహిత్‌ కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. తనకు హిట్‌ని అందించిన `ప్రతినిధి` మూవీకి సీక్వెల్‌తో వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాలనే లక్ష్యంగా `ప్రతినిధి 2` చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీకి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు(టీవీ5 మూర్తి) దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సమకాలీన రాజకీయాలను ప్రధానంగా చేసుకుని ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పొలిటికల్‌ సెటైరికల్‌గా వచ్చిన టీజర్‌ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. `మన దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం పోరాడిన గాంధీ చనిపోయినప్పుడు ఎంత మంది గుండెపోటుతో చచ్చారు` అని నారా రోహిత్‌ ప్రశ్నించే సీన్లతో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. తర్వాత వరుసగా బాంబ్‌ బ్లాస్ట్ జరుగుతుంటాయి. కట్‌ చేస్తే రాజకీయ నాయకుడైన అజయ్‌ ఘోష్‌ని నారా రోహిత్‌ ఇంటర్వ్యూ చేస్తుంటాడు. మీలా కష్టపడాలంటారు అని అడగ్గా, మరీ నేనైతే కొండ మీద కొబ్బరి కాయాలు అమ్మా, బండి మీద బత్తాయిలు అమ్మా, ఎన్నో వ్యాపారాలు చేసి ఈ స్థాయికి వచ్చాను. ఊరికెనే అయిపోతారా? పెద్దోళ్లు అంటాడు అజయ్‌ ఘోష్‌. దీనికి మరేంటి సర్‌ కాయలు అమ్ముకునే వాళ్లు ఇంకా కాయలే అమ్ముకుంటున్నారు, మీరెలా సార్‌ కోటీశ్వరులయ్యారు అని యాంకర్‌ స్థానంలో ఉన్న నారా రోహిత్‌ ప్రశ్నించడంతో ఆయన నీళ్లు నమిలారు. రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి సర్‌ అని నిలదీశాడు. దీనికి సమాధానం లేదు. ఆ తర్వాత పృథ్వీ పాత్ర ఎంట్రీ ఇస్తూ అరేయ్‌ నా పెళ్లి వీడియో కూడా ఇన్నిసార్లు చూడలేదని, షో మీద షో వేసి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు పృథ్వీ. ఆసుపత్రిలో ఓ పేషెంట్‌.. ఆయన మా దేవుడు సర్‌, ఆయనకు ఇలా జరిగిందని తెలియగానే.. అని ఆగిపోగా, నిన్ను నమ్ముకున్న భార్యబిడ్డల కంటే నాలుగు పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా? అని ప్రశ్నించాడు నారా రోహిత్‌. ఆ తర్వాత యంగ్‌ పొలిటీషియన్‌ సీఎం అవుతాడు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మీ కుటుంబంలో అన్నని కోల్పోయిన వారికి అన్నలా, కొడుకుని కోల్పోయిన వారికి కొడుకులా ఉంటానని మాటిస్తున్నా అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక సీఎంకి ఈ సారి మనం గెలవడం కష్టం విశ్వ, సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేశాం అని మరో పొలిటికల్‌ సలహాదారు అనడంతో మిగిలిన నాయకులు నవ్వడం ఆకట్టుకుంది. ఆ తర్వాత అందరికంటే ముందే మీ ఛానెల్‌లో వార్తలు ఎలా వస్తున్నాయని పోలీసులు నారా రోహిత్‌ ని అరెస్ట్ చేసి విచారించడం, అనంతరం రాజకీయ నాయకులపై తిరగబడటం ఆకట్టుకుంది. ఓవరాల్‌గా `ప్రతినిధి 2` ట్రైలర్ ఏపీ రాజకీయాలను టార్గెట్‌ చేస్తూ తీశారని అర్థమవుతుంది. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేసినట్టు, ఆయన ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నట్టుగా ఉంది. ఇందులో మీడియాపై జరిగే దాడులను ప్రస్తావించారు. కొద్దిగా తెలంగాణ రాజకీయాలను కూడా టచ్‌ చేశారు. ట్రైలర్‌ ఆకట్టుకుంటూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. చివరగా `ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్లు వాడు చెప్పింది చేయాల్సిందే, డిసైడ్‌ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో, వాడా? వీడా? అనే చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది. చివర్లో ఓ ముసలాయన పాత్ర చేసే ఫైట్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో ఇలా డైరెక్ట్ పొలిటికల్‌ డైలాగ్‌లు, పొలిటికల్‌ కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ రిలీజ్‌ అవుతుందా అనేది అనుమానంగా మారింది.

ఆసియ నెట్ న్యూస్ 19 Apr 2024 11:28 pm

చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ

చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ

v6 వెలుగు 19 Apr 2024 11:25 pm

తొలి విడతప్రశాంతం

. 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌. అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీలకు కూడా…. మణిపూర్‌, అరుణాచల్‌లో స్వల్ప హింసాత్మక ఘటనలు. కొన్నిచోట్ల ఈవీఎంల ధ్వంసం ` ఓటు వేసిన ప్రముఖులు… సినీ నటులు. సాయంత్రం 5 గంటలకు 60 శాతం పోలింగ్‌ నమోదు న్యూదిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్‌ శుక్రవారం ముగిసింది. అనేక చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 60 శాతం పోలింగ్‌ […] The post తొలి విడతప్రశాంతం appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 19 Apr 2024 11:24 pm

LSG vs CSK |విజృంభించిన ఓపెనర్లు.. చెన్నైపై లక్నో ఘన విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు హోం గ్రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో సీఎస్‌కేపై జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంగ‌డ్డ‌పై సీఎస్కేను త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేసిన ల‌క్నోకు ఓపెన‌ర్లు శుభారంభ‌మిచ్చారు. క్వింట‌న్ డికాక్‌(54), కెప్టెన్ కేఎల్ రాహుల్(82) చ‌రో హాఫ్ సెంచ‌రీతో చెన్నై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన నికోలస్ […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 11:24 pm

సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు నామినేషన్‌

. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల భారీ ర్యాలీ. కోటేశ్వరరావును గెలిపించాలని రామకృష్ణ, నేతల పిలుపు విశాలాంధ్ర – విజయవాడ : ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్‌, సీపీఎం బలపర్చిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ స్థానానికి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాన్ని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాలు, కోలాహలం మధ్య నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి […] The post సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు నామినేషన్‌ appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 19 Apr 2024 11:21 pm

ఇజ్రాయిల్‌ దుస్సాహసం

తెహ్రాన్‌: పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలన్న విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన ఇజ్రాయిల్‌… ఇరాన్‌పై ప్రతీకారదాడులకు దిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై క్షిపణి దాడులు చేసింది. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇవి ఇజ్రాయిల్‌ ప్రతీకార దాడులేనని… అమెరికా చెబుతోంది. అయితే వీటిని ధ్రువీకరించేందుకు మాత్రం ఇజ్రాయిల్‌ నిరాకరించింది.మరోవైపు తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ క్రమంలో రెండు దేశాల […] The post ఇజ్రాయిల్‌ దుస్సాహసం appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 19 Apr 2024 11:11 pm

ఐరాసలో పలస్తీనాకు శాశ్వత సభ్యత్వం

తీర్మానం వీటో చేసిన అమెరికాన్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో అమెరికా వీటో అధికారాన్ని వినియోగించింది. 193 దేశాల సభ్యత్వం గల సమితిలో పలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్‌ సందర్భంగా 12 కౌన్సిల్‌ సభ్యదేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌ దేశాలు ఓటింగ్‌కు దూరంగా […] The post ఐరాసలో పలస్తీనాకు శాశ్వత సభ్యత్వం appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 19 Apr 2024 11:10 pm

META లో ఏఐ ఫీచ‌ర్స్…

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రేసులో అడుగుపెట్టింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలకు తన మెటా ఏఐని ఇంటిగ్రేట్‌ చేసింది. లాలామా 3 లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారంగా పని చేస్తుంది. దీంతో చాట్‌జీపీటీ తరహాలో మెటా ఏఐ చాట్‌బాట్‌ ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం రాబట్టొచ్చు. అంతేకాదు వాట్సప్‌లో ఇకపై ఏఐ సాయంతో రియల్‌టైమ్‌ ఇమేజులను రూపొందించొచ్చని మెటా చెబుతోంది. మరోవైపు తమ వేదికలపై అందిస్తున్న మెటా ఏఐని మరిన్ని […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 11:09 pm

జగన్ కు చంద్రబాబు మరో కొత్త పేరు

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆలూరులో జరిగిన ప్రజాగళం సభలో ప్రసంగించిన చంద్రబాబు…జగన్ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి మూడు పార్టీలు కలిశాయని అన్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని చెప్పారు. ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని, రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవేనని చంద్రబాబు అన్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న జగన్ కు ప్రజలు […] The post జగన్ కు చంద్రబాబు మరో కొత్త పేరు first appeared on namasteandhra .

నమస్తే ఆంధ్ర 19 Apr 2024 11:03 pm

ఎన్‌డీఏకు రికార్డు స్థాయిలో ఓట్లు.. ప్రధాని మోడీ ట్వీట్

దిశ, నేషనల్ బ్యూరో : తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో 60 శాతం ఓటింగ్‌ నమోదైందని, బీజేపీకి గొప్ప స్పందన వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

దిశా డైలీ 19 Apr 2024 11:03 pm

TS |రాగల మూడు రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు- గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అదే సమయంలో పలు జిల్లాల్లో […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 11:01 pm

ఈ నెల 21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో (ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి) ప్రవేశాలకు ఈ నెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం తెలంగాణలోని 33 జిల్లాల విద్యార్థుల నుండి ఆన్ లైన్ (http://tsrjdc.cgg.gov.in) ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. విద్యార్థులు జిల్లా కేంద్రాలు హైదరాబాద్, మహాబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, […]

మన తెలంగాణ 19 Apr 2024 10:53 pm

బుమ్రా బౌలింగ్‌లో ఆ షాట్ కొట్టాలనుకున్నా.. కొట్టేశా : అశుతోష్ శర్మ

బుమ్రా బౌలింగ్‌‌లో ఆడిన స్వీప్ సిక్స్ నా డ్రీమ్ షాట్ అని పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ తెలిపాడు.

దిశా డైలీ 19 Apr 2024 10:49 pm

Breaking: బోండా ఉమ కార్యాలయం వద్దకు పోలీసులు.. ఉద్రిక్తత

టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశా డైలీ 19 Apr 2024 10:49 pm

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సారనికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ( ఎస్‌డబ్లుఆర్‌ఈఐఎస్) ద్వారా ప్రతి సంవత్సరం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షకు […]

మన తెలంగాణ 19 Apr 2024 10:48 pm

`స్పిరిట్‌` షూటింగ్‌ అప్‌డేట్‌.. `సలార్‌ 2`కి లైన్‌ క్లీయర్‌.. ప్రభాస్‌ నెక్ట్స్ ప్లాన్‌ ఇదే..

ప్రభాస్‌ నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన ఓ క్లారిటీ వచ్చింది. సందీప్‌రెడ్డి వంగా కామెంట్లతో `స్పిరిట్‌` షూటింగ్‌, `సలార్‌ 2` షూటింగ్‌తోపాటు మిగిలిన ప్రాజెక్ట్ లు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయో తెలిసింది. ప్రభాస్‌ చేతిలో ఇప్పటికీ నాలుగైదు సినిమాలున్నాయి. పార్ట్ 2లు రావడంతో తన లైనప్‌ల సంఖ్య పెరిగిపోతుంది. గతేడాది `సలార్‌`తో రచ్చ చేసిన డార్లింగ్‌ ఇప్పుడు `కల్కి2898ఏడీ` చిత్రంతో రాబోతున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై ఊగీసలాట కొనసాగుతుంది. చిత్ర బృందం దీనిపై స్పందించడం లేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అదిగో అప్‌డేట్‌, ఇదిగో అప్‌డేట్‌ అని ఫ్యాన్స్ పోస్ట్ లు తప్ప టీమ్‌ నుంచి రియాక్షన్ లేదు. ఓ రకంగా ప్రభాస్‌ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పొచ్చు. మే 9న రిలీజ్‌ కావాల్సిన ఈ మూవీ ఎన్నికలు, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ డిలే కారణంగా వాయిదా పడుతుందంటున్నారు. మే 30 లేదా, జూన్‌లో రిలీజ్‌ అని తెలుస్తుంది. ఎప్పుడు అనేదానిపై టీమ్‌ స్పందిస్తేగానీ తెలియదు. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో `ది రాజా సాబ్‌` అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెక్ట్స్ మూవీ షూటింగ్‌ స్టార్ట్ అయ్యే లోపు మారుతి మూవీ షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ప్రభాస్‌. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన లుక్‌లో కనిపించి సందడి చేశారు డార్లింగ్‌. ఇక తాజాగా `స్పిరిట్‌` మూవీ అప్‌డేట్‌ ఇచ్చాడు సందీప్‌ రెడ్డి వంగా. `యానిమల్‌` చిత్రంతో ఆయన గతేడాది దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఆ మూవీ సుమారు ఎనిమిది వందల కోట్లు వసూలు చేసి షాక్‌ ఇచ్చింది. దీంతో సందీప్‌రెడ్డి వంగా నెక్ట్స్ మూవీపై ఆసక్తి ఏర్పడింది. ఆయన ప్రభాస్‌తో `స్పిరిట్‌` చేయాల్సిన కమిట్‌ మెంట్‌ ఉంది. దీనిపైనే వర్క్ చేస్తున్నారు సందీప్‌. అయితే ఈ మూవీ త్వరలోనే ప్రారంభమవుతుందనే వార్తలు వచ్చాయి. ఆ మధ్య దీనిపై రియాక్ట్ అయ్యాడు సందీప్‌. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉంటుందన్నారు. అయితే `సలార్‌ 2` షూటింగ్‌ కూడా త్వరలోనే ఉంటుందనే వార్తల నేపథ్యంలో ప్రభాస్‌ సినిమాలు ఎప్పుడు ఏది ఉంటుందనేది పెద్ద సస్పెన్స్ నెలకొంది. తాజాగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మాటలతో ఓ క్లారిటీ వచ్చింది. ప్రభాస్‌ సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. `స్పిరిట్‌` మూవీ ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అన్నికంప్లీట్‌ చేసి ఈ ఏడాది డిసెంబర్‌లో `స్పిరిట్‌`ని ప్రారంభించబోతున్నారట. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. లుక్‌ కొత్తగా ఉంటుందని, ఇప్పటి వరకు చూడనటువంటి లుక్‌లో డార్లింగ్‌ కనిపించేలా చేయబోతున్నారట సందీప్‌. ఇదిలా ఉంటే సందీప్‌ రెడ్డి వంగా కామెంట్స్ తో `సలార్‌ 2`పై క్లారిటీ వచ్చింది. ఈ మూవీ త్వరలోనే ప్రారంభమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది జూన్‌ లేదా జులై లో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. `కల్కి2898ఏడి` రిలీజ్‌ అయి, ప్రమోషన్ల హడావుడి పూర్తయిన వెంటనే `సలార్‌ 2`ని స్టార్ట్ చేయబోతున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఈ మేరకు పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ ని ఫైనల్‌ చేస్తున్నారట. నిజానికి పార్ట్ 2 షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యిందట. జులైలో రెగ్యూలర్‌ షూటింగ్‌ జరిపి అక్టోబర్‌, నవంబర్‌ వరకు ప్రభాస్‌ పోర్షన్‌ మొత్తం కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే `సలార్‌ 2`కి సంబంధించిన షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యిందని టాక్‌. కొంత పార్ట్ ఉంటుందని, దాన్ని నవంబర్‌ వరకు కంప్లీట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. `సలార్‌2` షూటింగ్‌ పూర్తి చేసుకుని `స్పిరిట్‌`లో పాల్గొంటారని ప్రభాస్‌. ఆ తర్వాత దానికే ఎక్కువ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైప హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది ప్రభాస్‌. వార్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే లవ్‌ స్టోరీ ఇది. ఈ మూవీ కోసం దర్శకుడు వెయిట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు షూటింగ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ మూవీని కూడా ఈ ఏడాది చివర్లోనే ప్రారంభించాలనుకున్నారు. కానీ లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. `స్పిరిట్‌`, హను మూవీలను పారలల్‌గా చేయాలనే ఆలోచనలో డార్లింగ్‌ ఉన్నారట. ఇదిలా ఉంటే `కల్కి2898ఏడీ` కూడా రెండు భాగాలు. మొదటిభాగంకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి రెండో పార్ట్ ఉంటుంది. మొదటి భాగం హిట్‌ అయ్యిందంటే ఈ లెక్కలన్నీ మారిపోయే అవకాశం ఉంటుంది. వెంటనే ఆ మూవీని కంటిన్యూ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, ప్రభాస్‌ ప్లాన్‌ మేరకు హను రాఘవపూడి మూవీ అనంతరం `కల్కి` పార్ట్ 2 ఉంటుందని తెలుస్తుంది. ఇలా డార్లింగ్‌ ఓ ప్లాన్‌ సెట్‌ చేసుకున్నారట. ఆ దిశగా సినిమా షూటింగ్‌లు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా రెండేళ్ల వరకు ప్రభాస్‌ ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్ట్ లతోనే బిజీగా ఉంటాడని చెప్పొచ్చు. వచ్చే ఏడాది రెండు సినిమాలను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.

ఆసియ నెట్ న్యూస్ 19 Apr 2024 10:47 pm

AP |జనసేనకు షాక్.. కీలక నేత రాజీనామా

అమలాపురం లోక్ సభ నియోజకవర్గ ఇన్‌చార్జి డీఎంఆర్ శేఖర్ జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం సాయంత్రం జనసేనాని పవన్ కల్యాణ్‌కు పంపించారు. అమలాపురం లోక్ సభ టికెట్ ఆశించిన ఆయన.. టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన శేఖర్ ఓటమి చెందారు. ఈ క్రమంలోనే ఈసారి అమలాపురం పార్లమెంట్ లేదా? అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించినప్పటికి చివరకు […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 10:43 pm

ఎపి పిసిసి చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు

ఎపిలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తాజాగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. షర్మిల తన ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని, వైసిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇసికి ఫిర్యాదులు అందాయి. షర్మిలపై వైసిపి నేతలు మల్లాది విష్ణు, అవినాష్‌రెడ్డి, వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం. […]

మన తెలంగాణ 19 Apr 2024 10:37 pm

హిందువులమని సగర్వంగా చెప్పండి: ఆరెస్సెస్ చీఫ్

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ప్రజల్లో మన గుర్తింపుపై అవగాహన కొరవడిందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, ప్రజలు తమ గుర్తింపు హిందువు అని సగర్వంగా చెప్పాలంటూ పిలుపునిచ్చారు. నాగపూర్‌లో తాజాగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పదే పదే ఎవరో వస్తారు. మన తప్పుల వల్ల వాళ్లకు మనం బానిసలుగా మారతాం. ఈ వ్యాధికి చికిత్స అవసరం. లేదంటే, ప్రతిసారీ బానిసలం అవుతూనే ఉంటాం. మన తప్పులను సరిదిద్దుకోవాలి’’ అని అన్నారు. ‘‘అవగాహనలేమి కారణంగా, మన దేశంలో మనం ఎవరిమి? మనవారు ఎవరు? మన గుర్తింపు ఏంటి? అనేదానిపై చాలా మందిలో స్పష్టత లేదు. ఏళ్లనాటి బానిసత్వం కారణంగా మనలో మానసిక అణచివేత ఉంది. అందుకే మనందరినీ ఏకం చేసే ఉమ్మడి సూత్రంతో మొత్తం సమాజాన్ని వ్యవస్థీకరించాలి. మనం మన గుర్తింపును స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రపంచానికి కూడా చెప్పాలి. మనం ఎవరో మనకు తెలిస్తే, మనవాళ్లు ఎవరో తెలుస్తుంది. తద్వారా మన గుర్తింపు హిందువు అని, మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలి’’ అని చెప్పారు.

దిశా డైలీ 19 Apr 2024 10:35 pm

ఐదు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన

రాష్ట్రంలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు వచ్చే ఐదు రోజులపాటు ఉండే వాతావరణ పరిస్థితులపై శుక్రవారం బులెటిన్ విడుదల […]

మన తెలంగాణ 19 Apr 2024 10:33 pm

దేశంలో ‘తొలి దశ’ పోలింగ్.. టాప్ పాయింట్స్ ఇవే

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాల్లో శుక్రవారం తొలి విడత పోలింగ్‌ జరిగింది.

దిశా డైలీ 19 Apr 2024 10:32 pm

రెజ్లర్లు దీపక్, సుజీత్‌లకు ఎదురుదెబ్బ

భారత స్టార్ రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్ కలాకల్‌లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ కోసం కిర్గిస్థాన్‌లో ప్రారంభమైన ఆసియా క్వాలిఫయర్స్ పోటీలకు వీరు దూరమయ్యారు. భారీ వర్షాల కారణంగా వీరిద్దరూ దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దీంతో సకాలంలో బిష్కెక్‌కు చేరుకోలేక పోయారు. దీంతో వీరికి నిర్వాహకులు క్వాలిఫయింగ్ పోటీలకు అనుమతి ఇవ్వలేదు. దీపక్, సుజీత్‌లు ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు రష్యాలో శిక్షణ తీసుకున్నారు. అది ముగించుకుని దుబాయ్ మీదుగా కిర్గిష్థాన్ వెళ్లాలని […]

మన తెలంగాణ 19 Apr 2024 10:28 pm

ఆ ఆరు జిల్లాల్లో ‘సున్నా శాతం’ పోలింగ్‌.. ఎమ్మెల్యేలు సైతం ఓటింగ్ కు దూరం..  కారణమేంటీ?

Nagaland: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) శుక్రవారం తొలి విడత పోలింగ్‌ ముగిసింది. ఈ విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎండల సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సంఘం అందించిన లెక్కల ప్రకారం.. 60 శాతం పోలింగ్ నమోదైంది. కానీ, నాగాలాండ్‌లోని ఆరు జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నాగాలాండ్‌లో ఆరు తూర్పు జిల్లాల్లో 4,00,632 మంది ఉంటారు. వీరందరూ నాగా తెగకు చెందిన వారు. ఈ జిల్లాల్లో మొత్తం 20 శాసనసభ స్థానాలు ఉండగా.. 738 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ స్టేషన్లల్లో వేచి చూసిన ఫలితం లేదు. ఒక్కరూ అంటే ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందు రాలేదు. దీంతో ఆ పోలింగ్ స్టేషన్లలో ’సున్నా శాతం’ పోలింగ్‌ నమోదు అయ్యింది. ఈ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో పాటు లక్షల మంది ఓటర్లు.. పోలింగ్ కు దూరంగా ఉన్నారు. 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం.. నాగా తెగ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తూ 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO) ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పోరాటం ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి ENPO అనేది తూర్పు ప్రాంతంలోని ఏడు గిరిజన సంస్థల అపెక్స్ బాడీ. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధిని తీసుకురాలేదని ఆరోపిస్తూ.. ఏడు గిరిజన తెగలు కలిసి తూర్పు నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ENPO)గా ఏర్పడి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. తాము ఎన్నోఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నామనీ, ఎన్నికలకు ముందు అంటే.. ఏప్రిల్‌ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్‌ పాటించాలని ఈఎన్‌పీవో ప్రకటించింది. ఈ ప్రకటనతో పోలింగ్‌ రోజున లక్షల మంది ఓటర్లు పోలింగ్ దూరంగా ఉన్నారు. అధికారులు, అత్యవసర సేవలు మినహా రోడ్లపై ఏ ఒక్క వ్యక్తి, వాహనం కనిపించలేదు. అయినప్పటికీ అక్కడ శాంతియుత వాతావరణమే నెలకొందని అధికారులు వెల్లడించారు. ఎలాంటి అభ్యంతరం లేదు- నాగాలాండ్ సీఎం తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ENPO) లెవనెత్తిన ఫ్రంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ (FNT)డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో ​​పేర్కొన్నారు. ఫ్రంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ (FNT) ప్రాంతానికి స్వయంప్రతిపత్తి అధికారాలను ఇప్పటికే సిఫార్సులు చేశామన్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో తనకు అందజేసిన ఎఫ్‌ఎన్‌టి కోసం 'డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్'ను తాను అంగీకరించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్వయంప్రతిపత్తి గల సంస్థను సిఫార్సు చేసిందని, తద్వారా ఈ ప్రాంతం మిగిలిన రాష్ట్రాలతో సమానంగా తగిన ఆర్థిక ప్యాకేజీని పొందగలదని ముఖ్యమంత్రి చెప్పారు. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను సృష్టించినప్పుడు ఎన్నికైన సభ్యులతో సరైన వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి నీఫియు రియో ​​అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఉమ్మడి ఫార్ములాపై పనిచేయడానికి ఎమ్మెల్యేలు, ENPOలు చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం సీరియస్.. పార్లమెంట్ ఎన్నికల వేళ.. బంద్‌కు పిలుపునివ్వడాన్ని రాష్ర్ట ఎన్నికల సంఘం తప్పు బట్టింది. బంద్ కు పిలుపు నిచ్చిన ఈఎన్‌పీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

ఆసియ నెట్ న్యూస్ 19 Apr 2024 10:27 pm

రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

v6 వెలుగు 19 Apr 2024 10:20 pm

టీడీపీ జనరల్ సెక్రటరీకి ఈసీ నోటీసులు

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

దిశా డైలీ 19 Apr 2024 10:18 pm

ఫ్యాక్ట్ చెక్: డిబేట్ లో పాల్గొన్న వ్యక్తులు కొట్టుకుంటున్న ఘటన మణిపూర్ లో చోటు చేసుకున్నది కాదు.. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది.

వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా..

తెలుగు పోస్ట్ 19 Apr 2024 10:12 pm

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై భూకబ్జా కేసు

భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్ పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ కంచర్ల రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డిపై సెక్షన్ 447, 427, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ సర్వే నెంబర్ 500, 501లో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ […]

మన తెలంగాణ 19 Apr 2024 10:10 pm

లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు

లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు

v6 వెలుగు 19 Apr 2024 10:08 pm

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్ రిలీఫ్

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్ రిలీఫ్ లభించింది....

దిశా డైలీ 19 Apr 2024 10:05 pm

దేశంలో ఎర్రకోటపై ఎగరవేయబోయేది కాంగ్రెస్ జెండానే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో ఎర్రకోటపై ఎగరవేయబోయేది కాంగ్రెస్ జెండాయేనని నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

దిశా డైలీ 19 Apr 2024 10:02 pm

హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముగ్గురు రిమాండ్..

ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి

దిశా డైలీ 19 Apr 2024 10:00 pm

షూటింగ్ ఒలింపిక్ ట్రయల్స్‌లో సత్తాచాటిన ఇషా సింగ్

పారిస్ ఒలింపిక్ మొదటి సెలెక్షన్ ట్రయల్స్‌లో భారత షూటర్, తెలుగమ్మాయి ఇషా సింగ్ సత్తాచాటింది.

దిశా డైలీ 19 Apr 2024 9:59 pm

కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత

కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత

v6 వెలుగు 19 Apr 2024 9:58 pm

TS |మంచిర్యాల ఎమ్మెల్యేపై కేసు నమోదు

మంచిర్యాల, ఏప్రిల్ 19 (ప్రభన్యూస్): మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల ఆర్డీవో, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వి.రాములు శుక్రవారం తెలిపారు. ఈ నెల 17వ తేదీన పాత మంచిర్యాలలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధి కోసం రూ.1 లక్ష విరాళం అందించారని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 9:56 pm

తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి

తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి

v6 వెలుగు 19 Apr 2024 9:56 pm

హుస్నాబాద్‌లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయాలి.. బండి సంజయ్‌కు వినతి

హుస్నాబాద్ లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని

దిశా డైలీ 19 Apr 2024 9:54 pm

నటుడు రఘుబాబు అరెస్ట్.. రెండు గంటల్లోనే బెయిల్

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రఘుబాబు అరెస్ట్ అయ్యారు. రెండు రోజుల క్రితం నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందాడు.

దిశా డైలీ 19 Apr 2024 9:54 pm

తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్

తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్

v6 వెలుగు 19 Apr 2024 9:46 pm

ఓటేసిన ఆ ఒకే ఒక్క ఓటరమ్మ

అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల జిల్లా అన్జావ్‌లోని మాలోగామ్ పోలింగ్ కేంద్రానికి ప్రత్యేకత ఏర్పడింది. శుక్రవారం ఇక్కడ నూటికి నూరుశాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ ఎన్నికల జాబితాలో కేవలం ఒకే ఒక్క ఓటరు ఉన్నారు. ఈ మహిళా ఓటరు దాదాపు ఒంటిగంట ప్రాంతంలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 44 సంవత్సరాల ఏకైక ఓటరు సొకేలా తయాంగ్ రాకకోసం పోలింగ్ సిబ్బంది ఇక్కడికి కొండలు కనుమలు దాటి కాలినడకన చేరుకుంది. కాగా ఓటరు కూడా నడక సాగించి […]

మన తెలంగాణ 19 Apr 2024 9:44 pm

Breaking: వైఎస్ షర్మిలకు నోటీసులు

కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది....

దిశా డైలీ 19 Apr 2024 9:40 pm

జార్ఖండ్ ఎన్‌టిపిసిలో మంటలు

జార్ఖండ్‌లో ఎన్‌పిటిసికి చెందిన నార్త్ కరన్‌పురా విద్యుత్ కేంద్రంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఛత్రా జిల్లాలో ఈ భారీ స్థాయి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. మధ్యాహ్నం పూట అగ్ని ప్రమాదం జరిగిందని, ప్రాణనష్టం ఏదీ జరగలేదని అధికారులు తెలిపారు. యూనిట్ వెనుక ఉండే భెల్ మెటీరియల్ యార్డ్‌లో తొలుత ప్రమాదం జరిగింది. కారణాలు తెలియలేదని అధికారులు చెప్పారు. ఇక్కడి ఎన్‌టిపిసి విద్యుత్ కేంద్రం బొగ్గు ఆధారితంగా పనిచేస్తోంది.

మన తెలంగాణ 19 Apr 2024 9:40 pm

CSK vs LSG : బ్యాట్‌ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్‌

CSK vs LSG : బ్యాట్‌ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్‌

v6 వెలుగు 19 Apr 2024 9:37 pm

కాంగ్రెస్ కు ప్రజా బలం లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం లేదని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశా డైలీ 19 Apr 2024 9:34 pm

ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..

ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..

v6 వెలుగు 19 Apr 2024 9:34 pm

క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానంలో గుకేశ్

క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

దిశా డైలీ 19 Apr 2024 9:33 pm

LSG vs CSK |ఆదుకున్న దోనీ, జ‌డేజా.. ల‌క్నో టార్గెట్ ఎంతంటే

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ల‌క్నో ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తడబాటుకు గునైంది. ఈ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ బౌల‌ర్ల ధాటికి సీఎస్కే కీల‌క ఆట‌గాళ్లంతా వ‌చ్చిన వాళ్లు వ‌చ్చిన‌ట్టు పెవిలియ‌న్ చేరారు. అయితే, ఆఖర్లో రవీంద్ర జడేజా.. ధోనీ చెలరేగడంతో సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి176 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రవీంద్ర జడేజా 57 (నాటౌట్) హాఫ్ సెంచరీ […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 9:29 pm

వైసీపీకి భారీ షాక్..టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు

నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది....

దిశా డైలీ 19 Apr 2024 9:28 pm

స్టార్ హీరో విజయ్‌కు ప్రమాదం.. దెబ్బలతో ఉన్న ఫొటోలు వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ‘ద గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

దిశా డైలీ 19 Apr 2024 9:26 pm

జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..

జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..

v6 వెలుగు 19 Apr 2024 9:26 pm

గుండెపై పారాసెటమాల్ ప్రభావం.. ఎలా వాడితే మంచిదంటే?

పారాసెటమాల్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నగా జ్వరం వచ్చినా, ఒంట్లో నలతగా అనిపించినా ప్రతి ఒక్కరూ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవడం అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒకరి ఇంట్లో

దిశా డైలీ 19 Apr 2024 9:24 pm

ఎస్వీఆర్‌ పంతం.. ఆ సినిమా టైమ్‌లో ఎన్టీఆర్‌ని అంతగా ఏడిపించాడా?.. రామారావు భయపడే పరిస్థితి!

నటనలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ నువ్వా నేనా అనేలా ఉండేవారు. అయితే ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కి బాగా ఏడిపించాడట ఎస్వీఆర్‌. సినిమా మొత్తం చుక్కలు చూపించాడట. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు లాంటి వాళ్లు అని అంతా కొనియాడుతుంటారు. ఎస్వీఆర్‌ ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. కానీ అప్పట్లో ఎస్వీఆర్‌ లేకుండా సినిమాలు ఉండేవి కావు, ఎన్టీఆర్‌ సినిమా అయినా, ఏఎన్నార్‌ మూవీ అయినా అందులో ఎస్వీఆర్‌ ఉండాల్సిందే అనేట్టుగా ఉండేది. అంతేకాదు ఈ ముగ్గురు కలిసి చాలా సినిమాలు చేశారు. అనేక విజయాలు అందుకున్నారు. కానీ అప్పట్లో ఎన్టీఆర్‌ డామినేషన్‌ ఎక్కువగా ఉండేది. ఆయన స్టార్‌డమ్‌, సినిమాలు ఆదరణ పొందడం, కలెక్షన్లు, ఎక్కువ రోజులు ఆడటం వంటి అనేక కారణాలతో ఎన్టీఆర్‌ ఓ మెట్టు ఎక్కువగా ఉండేవాడంటారు. నటన పరంగానూ, క్రమశిక్షణ విషయంలోనూ, సెట్‌లో వాతావరణంలోనూ ఎన్టీఆర్‌కి ఆ రెస్పెక్ట్ ఉండేది. కానీ నటన పరంగా ఎస్వీఆర్‌ తర్వాతే అనే వాళ్లు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ భయపడేది ఒక్క ఎస్వీఆర్‌కి మాత్రమే అంటుంటారు. అంతేకాదు ఈ ఇద్దరికి పెద్దగా పడేది కాదట. నువ్వా నేనా అనేట్టుగానే ఉండేదని, ఎన్టీఆర్‌ సినిమాలంటే అంతా టైమ్‌కి వచ్చేవారని, కానీ ఎస్వీఆర్‌ మాత్రం తన టైమ్‌కి వచ్చేవారట. ఎన్టీఆర్‌ పెట్టే రూల్స్ ని కూడా ఫాలో అయ్యేవాడు కాదని, ఆ విషయంలో అవసరమైతే సినిమా నుంచి తప్పుకోవడానికి వెనకడుగు వేసేవారు కాదట. ఇద్దరు బావా, బావా అని పిలుచుకునే వారట. అంతటి సాన్నిహిత్యం ఉండేది. కానీ వర్క్ విషయంలో మాత్రం ఇద్దరికి ఇద్దరు నువ్వా నేనా అనేలా ఉండేవారని కైకాల సత్యనారాయణ తెలిపారు. ఎన్టీఆర్‌ తన ప్రొడక్షన్‌లో రూపొందించిన `ఉమ్మడి కుటుంబం` సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన తెలిపారు కైకాల. ఆ మూవీకి నాగభూషణం నటించిన జమిందార్‌ పాత్రకి మొదట ఎస్వీఆర్‌ని అనుకున్నారట. అయితే ప్రొడక్షన్‌ పరంగా కొన్ని రూల్స్ ఉండేవట. కాల్షీట్ల అగ్రిమెంట్లు ఉండేవని, దానికి సైన్‌ చేయమంటే ఎస్వీఆర్‌ చేయలేదు, అడ్జెస్ట్ చేసుకుందాం, ఫర్వాలేదు, జస్ట్ పద్దతి ప్రకారం వెళ్లాలి అంటే, నేను ఆ రూల్‌ ఫాలో కాను, నేను చేయాల్సింది చేస్తా అని అన్నాడట. ఎన్టీఆర్‌ కూడా ఆ విసయంలో తగ్గలేదట. దీంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట ఎస్వీఆర్‌. అంతేకాదు అడ్వాన్స్ కూడా తెల్లారి రివర్స్ ఇచ్చి పంపించాడట. పంతానికి పోతే ఎస్వీఆర్‌ ఎవరి మాట వినేవాడు కాదని, ఎంతకైనా వెళ్తారని, బతిమాలుకుంటే వాళ్లకోసం ఏమైనా చేస్తాడని తెలిపారు. ఈ క్రమంలో `శ్రీకృష్ణ సత్య` సినిమా షూటింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని చెబుతూ, ఆ మూవీ సమయంలోనూ ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌కి ఇలాంటి పంతాలే ఉండేవట. దీంతో ఎస్వీఆర్‌ రోజూ తాగి షూటింగ్‌కి వచ్చేవాడట. షూటింగ్‌ డిలే అయ్యేదట. సరిగా చేయలేకపోయాడట. డేట్స్ వేస్ట్ అయ్యేవట. ఇలా ఆ మూవీ షూటింగ్‌ టైమ్‌లో ఎన్టీఆర్‌ని బాగా ఏడిపించాడట ఎస్వీఆర్‌. ఓ రకంగా చుక్కలు చూపించాడట. `శ్రీ సత్య కృష్ణ` సినిమాకి కేవీ రెడ్డి దర్శకుడు. నిర్మాత ఎన్టీఆర్‌. అంతేకాదు రామారావు ఇందులో రాముడిగా, కృష్ణుడిగా, రావణ్‌గా నటించారు. ఎస్వీఆర్‌.. దుర్యోధనుడిగా, మహి రావణ్‌గా కనిపించారు. ఆ పాత్రకి ఆయన తప్ప మరెవ్వరూ వేయడానికి లేదు, ఆల్టర్‌నేట్‌ లేదు. దీంతో ఎస్వీరే వేయాలి. దీంతో ఆయన ఏం చెబితే అది చేయాల్సి వచ్చిందని, సినిమా షూటింగ్‌ మొత్తం ప్రాసెస్‌లో ఎన్టీఆర్‌కి ఏడుపు ఒక్కటే తక్కువ అని, పంతానికి పోతే అంతగా ఆడుకుంటాడని చెప్పారు కైకాల. కైకాల సత్యనారాయణ గతేడాది మరణించిన విషయం తెలిసిందే. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే షోలో ఈ విషయాలను కైకాల వెల్లడించారు. ఎస్వీఆర్‌ పంతం గురించి చెప్పుకొచ్చారు. ఆయన చాలా భోళా మనిషి అని, తనే అంటే గుండెల్లో పెట్టుకుంటాడని, తేడా చేస్తే దూరం పెడతాడని, రకరకాలుగా ఇబ్బంది పెడతాడని చెప్పారు కైకాల. ఈ రేర్‌ ఇంటర్వ్యూ విషయాలు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.

ఆసియ నెట్ న్యూస్ 19 Apr 2024 9:24 pm

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరికి జైలు శిక్ష...

పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడిన కేసులో ఇద్దరికి నాంపల్లిలోని 7వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ ఎస్.సత్యనారాయణ శుక్రవారం మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

దిశా డైలీ 19 Apr 2024 9:23 pm

తప్పుడు ధ్రువపత్రాలతో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులు అరెస్టు

తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఒక వ్యక్తికి చెందిన ప్లాటును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసినందుకు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ సీఐ కృష్ణ, మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.

దిశా డైలీ 19 Apr 2024 9:22 pm

తమ్ముడి రొమాన్స్ చూసి అసూయపడిన అక్క.. ఏకంగా అంతమందితో గడిపి, అయినా కోరిక తీరక చివరికి?

కొన్ని కథలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అసలు ఇవి నిజంగా జరిగాయా అనే ఆలోచన కలిగిస్తాయి. ముఖ్యంగా పూర్వకాలంలో రాజులు, రాణుల కథలు మనలో కొత్త ఆసక్తిని కలిగిస్తాయి. అయితే మనం ఎక్కువగా

దిశా డైలీ 19 Apr 2024 9:16 pm

HYD: రిస్తోం కా లైవ్ టెలికాస్ట్ అనేది ప్రతి కుటుంబానికి సంబంధించినది : హిమానీ శివపురి

హైదరాబాద్: రిస్తోం కా లైవ్ టెలికాస్ట్ అనేది ప్రతి కుటుంబానికి సంబంధించినదని ప్రముఖ టెలివిజన్ అండ్ చలనచిత్ర నటి హిమానీ శివపురి అన్నారు. హిమానీ శివపురి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి అయినందున స్టేజ్‌తో ఆమెకు బలమైన అనుబంధం ఉంది. జీ థియేటర్ టెలిప్లే రిస్తోం కా లైవ్ టెలికాస్ట్ లో పనిచేయడం, ఆమె తన మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, తనను తాను బలంగా ప్రతిధ్వనించే పాత్రను పోషించడానికి ఆమెకు చక్కటి అవకాశంగా […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 9:16 pm

బీజేపీ మతోన్మాద విధానాలపై సీపీఎం పోరాటం

దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పార్టీ పోటీ చేస్తుందని సీపీఎం జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు.

దిశా డైలీ 19 Apr 2024 9:15 pm

నేతన్నల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను

దిశా డైలీ 19 Apr 2024 9:15 pm

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రచ్చ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశం కొత్త రచ్చకు దారితీసింది.

దిశా డైలీ 19 Apr 2024 9:11 pm

ఫనిగిరి గుహలో అతి చిన్న పార్వతి శిల్పం

చరిత్ర పరిశోధకులు రత్నాకర్ రెడ్డి శుక్రవారం సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఫనిగిరి గ్రామ గుట్టపై పురావస్తు శాఖ జరుపుతున్న త్రవ్వకాలను సందర్శించారు.

దిశా డైలీ 19 Apr 2024 9:10 pm

HYD: రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు తీసుకోవాలి… షీలా కృష్ణస్వామి

హైదరాబాద్: సీజన్లు మారుతున్న వేళ, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యమ‌ని న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణ‌స్వామి అన్నారు. ఆమె మాట్లాడుతూ…. మీ రోజువారీ భోజనంలో బాదం, సీజనల్ పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాలను జోడించడం వల్ల అనారోగ్యాలను ఎదుర్కోవడానికి మీ శరీరానికి అవసరమైన అదనపు శక్తి లభిస్తుందన్నారు. మీ రోగనిరోధక శక్తిని పెంపొందించే సహజ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 9:10 pm

వీడిన శ్రీదేవి డెత్ మిస్టరీ..! ఇన్నాళ్లకు బయట పడిన అసలు నిజం..?

అలనాటి అందాల తారా శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశా డైలీ 19 Apr 2024 9:08 pm

OTT |మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించిన మంజుమ్మాళ్ బాయ్స్… ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవలే తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేక‌ర్స్. వ‌చ్చే నెల‌ మే 03 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 9:03 pm

ఈ ఆలయానికి వెళ్లారంటే కాళ్లు వణకాల్సిందే..

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయి.

దిశా డైలీ 19 Apr 2024 9:03 pm

యూపీఎస్సీ ఫలితాల్లో నాంపల్లి ఆడబిడ్డకు 112 వ ర్యాంకు

ఇటీవల యూపీఎస్సీ ఫలితాల్లో నాంపల్లి మండలం మెల్లవాయి గ్రామానికి చెందిన గాడిపర్తి దర్శిని కి 112 వ ర్యాంకు వరించింది.

దిశా డైలీ 19 Apr 2024 9:00 pm

మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ శుక్రవారం పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రామచంద్రపురం పట్టణానికి చెందిన మాజీ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశా డైలీ 19 Apr 2024 9:00 pm

CPIM నేత తమ్మినేనితో డిప్యూటీ CM భట్టి విక్రమార్క భేటీ

ఎన్నికల వేళ రాష్ట్రంలో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని సీపీఐఎం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు.

దిశా డైలీ 19 Apr 2024 9:00 pm

Good Health: చిరుధాన్యాల బ్రేక్​ఫాస్ట్​.. ఆరోగ్యదాయకం

Good Health: చిరుధాన్యాల బ్రేక్​ఫాస్ట్​.. ఆరోగ్యదాయకం

v6 వెలుగు 19 Apr 2024 9:00 pm

లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు

లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు

v6 వెలుగు 19 Apr 2024 8:58 pm

ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి

ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి

v6 వెలుగు 19 Apr 2024 8:57 pm

కేటీఆర్ ట్వీట్‌తో లొల్లి షురూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ట్విట్టర్ వార్!

లోక్ సభ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.

దిశా డైలీ 19 Apr 2024 8:54 pm

ఒడిశా జూలో తెల్ల ఆడపులి స్నేహ మృతి

భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లోని తన ఎన్‌క్లోజర్‌లో 14 ఏళ్ల తెల్ల ఆడపులి స్నేహ శుక్రవారం మరణించిందని అధికారులు వెల్లడించారు. తెల్ల ఆడపులి గురువారం అస్వస్థతకు గురి కాగా వైద్య చికిత్స అందిస్తున్నారు. దానికి స్లైన్, మందులు ఇచ్చారు. కాని అది శుక్రవారం మరణించింది. తెల్ల ఆడపులి వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో పాటు తీవ్ర ఉష్ణోగ్రత వల్ల బాధ పడుతోందని అధికారులు తెలిపారు. రాయల్ బెంగాల్ టైగర్ నిషాన్‌కు, తెల్ల ఆడపులి కుసుమ్‌కు 2010 […]

మన తెలంగాణ 19 Apr 2024 8:54 pm

Nagaland | 6 జిల్లాల్లో ‘సున్నా శాతం’పోలింగ్‌.. ఓటు వేయని ఎమ్మెల్యేలు

సార్వత్రిక ఎన్నికలు తొలి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 102 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. బెంగాల్‌, మణిపుర్‌లలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. అయితే, నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో ‘సున్నా శాతం’ పోలింగ్‌ నమోదుకావడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు. నాగాలాండ్‌లో ఆరు జిల్లాల […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 8:50 pm

ఇంట్రెస్టింగ్‌గా ఏపీ రాజకీయం.. క్వశ్చన్ పేపర్లతో వైసీపీ,జనసేన ఫైట్!

ఏపీలో ఎన్నికలకు 25రోజులే ఉండడంతో ఓటర్లను ఆకర్షించే దిశగా అన్ని పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

దిశా డైలీ 19 Apr 2024 8:48 pm

ఎన్నికల వేళ జనసేనకు మరో షాక్.. కీలక నేత రాజీనామా

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి కీలక నేతలు పార్టీని వీడి అధికార వైసీపీలో చేరారు.

దిశా డైలీ 19 Apr 2024 8:46 pm

వ్యభిచారం.. పిల్లల కస్టడీ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : వ్యభిచార అభియోగంతో విడాకులను ఇవ్వగలం కానీ.. ఆ అంశం ప్రాతిపదికన పిల్లల కస్టడీపై నిర్ణయాన్ని తీసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

దిశా డైలీ 19 Apr 2024 8:46 pm

నీలం మధు గెలుపు తథ్యం

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలవడం తథ్యం అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మీసం మహేందర్ అన్నారు.

దిశా డైలీ 19 Apr 2024 8:45 pm

నాగాలాండ్ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్

నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఓటర్లు తమ ఓటు బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. శుక్రవారం నాగాలాండ్‌లో ఆరు తూర్పు జిల్లాలో ఏ ఒక్క బూత్‌లోనూ ఒక్కటంటే ఒక్క ఓటు నమోదు కాలేదు. పోలింగ్ సిబ్బంది ఓపికగా దాదాపు తొమ్మిది గంటల పాటు వేచి చూసినా జనం రాకడ లేకుండా పోలింగ్ ఘడియలు గడిచిపోయ్యాయి. తమకు సరిహద్దు ప్రాంతపు నాగాలాండ్ (ఎఫ్‌ఎన్‌టి) ఏర్పాటు చేయాలని ఈ జిల్లాల వారు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ సాధనకు ఈ పోలింగ్ రోజును […]

మన తెలంగాణ 19 Apr 2024 8:45 pm

రాజకీయ కుట్రదారులకు కోర్టు తీర్పు చెంప పెట్టు

సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే అబద్ధపు ప్రచారంతో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించడం, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడం శుభపరిణామమని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు.

దిశా డైలీ 19 Apr 2024 8:39 pm

అతిగా సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య

అతిగా సెల్ ఫోన్ వాడుతున్నాడని కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధి తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశా డైలీ 19 Apr 2024 8:38 pm

కేజ్రీవాల్‌కు జైలులో పొంచి ఉన్న ముప్పు:ఆప్ ఎంపి సంజయ్ సింగ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై లోతైన కుట్ర జరుగుతోందని, తీహార్ జైలులో ఆయనకు ఎటువంటి ప్రమాదమైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శుక్రవారం ఆరోపించారు. ఎవరినైనా చంపేంత నీచానికి బిజెపి దిగజారుతుందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రాణాలకే ముప్పు తీసుకువచ్చే కుట్రలో భాగస్వాములైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తెలియచేసేందుకు ఆప్ నాయకులు ఎన్నికల కమిషన్‌ను, రాష్ట్రపతిని కలుస్తారని ఆయన తెలిపారు. తనకు […]

మన తెలంగాణ 19 Apr 2024 8:38 pm

రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు

రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు

v6 వెలుగు 19 Apr 2024 8:35 pm

డైరెక్టర్లకు అమ్మాయిల సప్లై.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీనియర్ నటి!

చిత్ర పరిశ్రమ అంటే అదో పెద్ద ప్రపంచం. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కాస్టింగ్ కౌట్, మీటూ, కమిట్ మెంట్ ఇలా ఎన్నో ఇష్యూస్ దాని చుట్టే తిరుగుతాయి.

దిశా డైలీ 19 Apr 2024 8:33 pm

బీఆర్ఎస్ శకం ముగిసింది.. గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేదు

రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిందని, పదేండ్ల గొప్పలు చెప్పుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపించారని, ఇక అది ‘నిన్నటి పార్టీ’గానే ఉండిపోతుందని బీజేపీ సికింధ్రాబాద్ అభ్యర్థి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

దిశా డైలీ 19 Apr 2024 8:31 pm

లారీని ఢీకొన్న కారు… మహిళ మృతి

ఆగి ఉన్న లారీని వెనకాల నుంచి కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు హమితుల్లా నగర్ వద్ద చోటు చేసుకుంది.

దిశా డైలీ 19 Apr 2024 8:31 pm

AP |షర్మిలకు ఈసీ నోటీసులు…

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ నేతలు మల్లాది విష్ణు, అవినాష్ రెడ్డితో పాటు వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా ఆమెకు నోటీసులు పంపారు. కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్‌ షర్మిల.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్‌ అవినాష్‌ తదితరుల పాత్ర ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వివేకా కేసు పదే పదే ప్రస్తావనకు […]

ప్రభ న్యూస్ 19 Apr 2024 8:30 pm

భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్

భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్

v6 వెలుగు 19 Apr 2024 8:29 pm

పెద్దవారితో కలిసి చార్ ధామ్ యాత్ర వెళ్తున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..

సనాతన ధర్మంలో చార్‌ధామ్‌కు వెళ్లడం అదృష్టంగా భావిస్తారు.

దిశా డైలీ 19 Apr 2024 8:27 pm

సీఎం జగన్‌కు మరో పేరు నామకరణం చేసిన చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు మార్చారు...

దిశా డైలీ 19 Apr 2024 8:26 pm

మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సోషల్ ఉపాధ్యాయుడు మాసయ్యను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ విధుల నుంచి శుక్రవారం సస్పెన్షన్ చేసినట్లు డిఇఓ గోవిందరాజులు తెలిపారు.

దిశా డైలీ 19 Apr 2024 8:26 pm