తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
యాదాద్రి జిల్లా తుర్కపల్లి, ఏప్రిల్ 8 (జనం సాక్షితుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎండి జహంగీర్ ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబ …
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్లలో ఎదురుచూస్తున్నారు. ఉదయం 9 గంటలకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాంలో 17.87 శాతం, కేరళలో 16.23 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం రికార్డయింది. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర మంత్రులు, నటులు మోహల్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి వంటి వారు ఓటు వేశారు.
అమరావతికి సమీపంలో తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ కలకలం రేపుతుంది
మాజీ ఎంపిటిసికి రసమయి నివాళులు
బెజ్జంకి, ఆంధ్రపభ : మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపిటిసి
Nila Robot : పుదుచ్చేరిలో రోబో సందడి Andhra Prabha News
Nila Robot : పుదుచ్చేరిలో రోబో సందడి Andhra Prabha News (
Inhuman incident |భర్త మోసం చేశాడని…
Inhuman incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో అమానుష
Palnadu-Simhadri Express |గేదెను ఢీకొనడంతో…
Palnadu-Simhadri Express | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో పల్నాడు-సింహాద్రి
Gold Rates : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి
Scrap warehouse |స్క్రాప్ గోదాం నుంచి వాహనాలకు మంటలు
Scrap warehouse | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లాలో భారీ
‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక?
హైదరాబాద్: రామ్చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే రామ్ చరణ్తో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసే కథానాయకను ఎంపిక చేయడంపై చిత్ర బందం దష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా… తెలంగాణ తెలుగమ్మాయి మానస వారణాసి కూడా ఈ రేసులోకి వచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఆకట్టుకున్నారు మానస […] The post ‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక? appeared first on Visalaandhra .
వైభవ్ చేసిన ఆ పని.. మా అందరిలో ఆత్మవిశ్వాసం నింపింది: జైస్వాల్
గౌహటి: క్రికెట్ ప్రపంచంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పుకోవాలి. 13 ఏళ్లకే గత ఐపిఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ తరఫున గత ఐపిఎల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత అండర్-19 జట్టులో కూడా సంచలనాలు సృష్టించాడు. ఇక ఈ సీజన్లోనూ వైభవ్ అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. ఎంతో అనుభవం ఉన్న బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మొదటి బంతినే సిక్సర్గా మలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ విషయంపై రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ స్పందించాడు. బుమ్రాను వైభవ్ ఎదురుకున్న తీరు.. తమ జట్టులోని మిగితా బ్యాటర్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపిందని జైస్వాల్ అన్నాడు. ‘‘బుమ్రా తొలి బంతికే వైభవ్ సిక్సర్ బాదాడు. ఇలాగే నీవైన షాట్లు ఆడుతూ ఉండు అని అతడికి చెప్పాను. బుమ్రా దిగ్గజ బౌలర్లలో ఒకడు. అలాంటి బౌలర్ బంతులను వైభవ్ ఎదురుకున్న తీరు గొప్పగా అనిపించింది. మనం కూడా బౌలర్లపై ఎదురుదాడి చేయొచ్చు అనే విశ్వాసాన్ని మిగితా బ్యాటర్లకు అతను ఇచ్చాడు. నా మీద కూడా అతడు ఒత్తిడిని తొలగించాడు. మా భాగస్వామ్యాన్ని ఎంతో ఆస్వాదించాను’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.
కడప జిల్లాలో చిరుతపులులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి
ఆ రెండు రాష్ట్రాలు హ్యాట్రిక్ సాధిస్తాయా?
కేరళ, అసోం రాష్ట్రాల్లోను, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లోనూ గురువారం (ఏప్రిల్ 9) ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పుదుచ్చేరి ఎన్నికల గురించి ప్రత్యేకంగా చర్చించవలసిందేమీ లేదు. కేరళ, అసోంల్లో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత బలమైన అంశంగా పనిచేయదని తెలుస్తోంది. కేరళలో సిపిఎం నేతృత్వం లోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ప్రస్తుతం ప్రజల్లో వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతోను, కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)తోనూ గట్టిగా పోరాడుతోంది. ఈ రెండు ఫ్రంట్లకు చెందిన సభ్యులంతా జాతీయ స్థాయిలో సంయుక్త వ్యతిరేక వేదికలో భాగస్వాములే అయినప్పటికీ, కేరళ రాష్ట్రంలో మాత్రం ఒకరితో ఒకరు నువ్వానేనా అనే రీతిలో ఢీకొంటున్నారు. బిజెపి విషయానికి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీగా ఆ పార్టీ ఇంకా నిరూపించుకోవలసి ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని లక్షంగా పెట్టుకుంది. 2021లో కేరళ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఎల్డిఎఫ్ కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని బద్దలు కొట్టి రెండోసారి అధికారం లోకి వచ్చింది. ఇప్పుడు మూడోసారి కూడా విజయం సాధించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాలన్న పట్టుదలతో ఉంది. గత పదేళ్లలో లైఫ్ మిషన్, సామాజిక భద్రత పెన్షన్లు, అత్యంత పేదరిక నిర్మూలన, విద్య, వైద్య రంగాల్లో మార్పు, కూలీలకు కనీస వేతనం వంటి పథకాలు అమలు చేశామని, అవే తమను గెలిపిస్తాయని ఎల్డిఎఫ్ విస్తృతంగా ప్రచారం చేసింది. లైఫ్ మిషన్ పథకం కింద ఐదు లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించి పంపిణీ చేసింది. పేదరిక నిర్మూలన పథకం కింద దాదాపు 64,000 కుటుంబాలకు విముక్తి కలిగించింది. వ్యక్తిగత విమర్శల కంటే ‘ప్రదర్శన ఆధారిత రాజకీయాల’ పై ఎల్డిఎఫ్ దృష్టి సారించింది. అయితే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, పెన్షన్ల పంపిణీలో జాప్యం వంటివి విపక్షాల విమర్శలకు దారితీశాయి. ఇదిలా ఉండగా సిపిఎం పార్టీకి ఈసారి అనుకోని ప్రతిఘటనలు ఎదురయ్యాయి. అనుభవజ్ఞులైన, కీలకమైన సీనియర్ నేతలు ఐదుగురు పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ మద్దతు గల యుడిఎఫ్ ఇండిపెండెంట్లుగా తిరుగుబాటు అభ్యర్థులుగా రంగం లోకి దిగారు. వీరిలో కొంతమంది 1967 నుంచి సిపిఎంకు కంచుకోట వంటి పయన్నూర్ వంటి స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కేరళలో ఈ మూడు కూటములు బయటకు తీవ్రంగా పోరాడుతున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం పరస్పర ప్రయోజనాల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఓటర్లలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) విషయం పరిశీలిస్తే 2025 నాటి లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలన్న ఆకాంక్షతో ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లను చేజిక్కించుకుంది. మలప్పురం వంటి బలమైన స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం కంటే ముస్లిం లీగ్ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. 2021 అసెంబ్లీ ఎన్నికల పరాజయం తరువాత యుడిఎఫ్ కొత్త వారికి, యువకులకు అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. తెలంగాణలో విజయవంతమైన హామీల నమూనాను కేరళలో అమలు చేయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. విద్యార్థులు, మహిళలు, యువతను ఆకర్షించేలా ఆరు గ్యారంటీలను ప్రకటించింది. చిన్న వ్యాపారుల కోసం రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, రబ్బరు రైతులకు ప్రత్యేక మద్దతు ధర కిలోకు రూ. 250 వంతున కల్పన వంటి హామీలు ఇందులో ఉన్నాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల గురించి పరిశీలిస్తే ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రెండోసారి తానే ముఖ్యమంత్రిగా రావాలని, ఎన్డిఎ ప్రభుత్వం మూడోసారి విజయం సాధించాలన్న ఆశతో ఉన్నారు. శర్మ హిందుత్వ వాదాన్ని బలపరుస్తూ ముస్లిం వ్యతిరేక వాదన తీవ్ర రూపంగా మారుస్తున్నారు. అంతేకాదు ద్వేష ప్రసంగాలు చేయడంలో ఆయన ఆరితేరారు. 2018 నాటి తన ఎన్నికల అఫిడవిట్లో ఆయనపై 40 కేసులు నమోదై ఉన్నాయని తేలింది. వీటిలో చాలా కేసులు ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించినవే. ఇక్కడ ముస్లిం చొరబాటుదారుల ఏరివేత. అభివృద్ధి ప్రాజెక్టులు, హిందుత్వ అతివాదం ఇవే ప్రధాన లక్షాలుగా బిజెపి పనిచేస్తోంది. గోహింస, లవ్ జీహాద్, మతమార్పిడి వంటివి ప్రధాన సమస్యలుగా పేర్కొంటోంది. సంక్షేమ పథకాలకు సంబంధించి అరుణోదయ పథకం కింద 40 లక్షల మందికి నేరుగా నెలకు రూ. 1250 వంతున ఆర్థికసాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి చొరబాటుదార్లను తరిమికొట్టడం, అక్రమ ఆక్రమణలను నివారించడం తప్పనిసరి అంటున్నారు. ఇక కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్కు పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని సిఎం తీవ్ర ఆరోపణలు చేయగా, దీనికి ప్రతిగా గొగోయ్ సిఎం శర్మ భార్యకు యుఎఇ, ఈజిప్టు, బర్బూర్ తదితర మూడు దేశాల పాస్ పోర్టులున్నాయని, ఓడిపోతే విదేశాలకు పారిపోడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇక పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి నాయకత్వంలో ఎన్డిఎ ప్రభుత్వం 2021 నుంచి అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు కేవలం 30 మాత్రమే ఉన్నప్పటికీ పార్టీల రాజకీయాల కన్నా అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట, ప్రజలతో మమేకం కావడం, సామాజిక సంబంధాలు తదితర అంశాలే విజయానికి కారణాలవుతాయి.
Peddi |స్పెషల్ సాంగ్ ఎవరితో..?
Peddi | స్పెషల్ సాంగ్ ఎవరితో..? Peddi | పెద్ది స్పెషల్ సాంగ్పై
ఏప్రిల్ 09: (జనం సాక్షి )బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన …
కోడిపందాల స్థావరాల పై పోలీసులు దాడి..
కోడిపందాల స్థావరాల పై పోలీసులు దాడి.. మధిర, ఆంధ్రప్రభ : మధిర మున్సిపాలిటీ
Copyright Suit over Dhurandhar Team
The team of Dhurandhar: The Revenge landed into trouble after a copyright suit was filed against the team. Trimurti Films has approached the court against Aditya Dhar’s B62 Studios for using “Rang De Lal” from the second part of Dhurandhar.The song is from Tridev that released in 1989 and Trimurti Films holds the rights of […] The post Copyright Suit over Dhurandhar Team appeared first on Telugu360 .
దేశంలో, రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు, భౌగోళిక సరిహద్దుల ఖరారుకు జరపాల్సిన పునర్విభజన వివాదాస్పదమవుతోంది. ఈ ప్రక్రియతో చట్టసభల్లో తమకు లభించే ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది అసమంజసం, అన్యాయమని దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచినా, ఇప్పుడున్న స్థానాలపై సగటున 50 శాతం సీట్లు పెంచినా తమకు అన్యాయమే అన్నది వారి వాదన! ఈ ప్రాతినిధ్య వ్యత్యాసాల వల్ల అధికార కేంద్రీకరణ దక్షిణాది నుంచి ఉత్తరాదికి మారుతుందని, నిర్ణయాధికారంలో దక్షిణ రాష్ట్రాల పాత్ర-ప్రమేయం తగ్గిపోతుందన్నది ఈ ఆందోళనకు కారణం. చట్టసభల్లో ప్రాతినిధ్య వాటా మాత్రమే కాకుండా వేర్వేరు వేదికలపై స్వరం, పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపులు... ఇలా అన్నీ తగ్గిపోతాయనే భయాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ లక్ష్యాలకు అనుగుణంగా బాగా జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అది సరిగ్గా జరుగక జనాభా అసాధారణంగా పెరిగింది. ప్రస్తుత పెంపు వల్ల.. సదుద్దేశంతో జనాభాను నియంత్రించిన తమకు శిక్ష, నియంత్రణ చేయక విచ్చలవిడి జనాభా వృద్ధికి కారణమైన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు బహుమతి ఇచ్చినట్టుగా ఉంటుందని వారంటున్నారు. దక్షిణాది ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు), చంద్రబాబునాయుడు (ఎపి), రేవంత్రెడ్డి (తెలంగాణ), సిద్దరామయ్య (కర్ణాటక), పినరయ్ విజయన్ (కేరళం) కేంద్రం తాజా ఆలోచనల్ని ఖండించి, తీవ్రంగా నిరసించారు. ఒక పౌరుడు, ఒక ఓటు, ఒకే విలువ ఉండాలన్నది ఆదర్శం. ఏ రాష్ట్రంలో నివసిస్తున్నా పౌరులందరి ఓటు విలువ దాదాపు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో దేశ జనాభా -చట్టసభ స్థానాల నిష్పత్తిని ఎప్పటికప్పుడు సమం చేయడం ద్వారా ఇది సాధించేట్టు విధానం రూపొందించారు. ప్రతి పదేళ్లకొకసారి జనాభా గణన, ఆ గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ముందు నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారించడం, తర్వాత దాని ప్రకారం భౌగోళిక సరిహద్దులు సర్దుబాటు/ ఖరారు చేస్తూ వచ్చారు. ఇందుకు రాజ్యాంగ నిబంధనల మేర, చట్టం ద్వారా ప్రతి పదేళ్లకోసారి పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. తొలి కమిషన్ 1952లో ఏర్పాటయింది. అప్పుడు దేశంలో 494 లోక్సభ స్థానాలే ఉన్నాయి. తర్వాత మూడుమార్లు (1962, 1972, 2002) పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్సభ స్థానాల సంఖ్య 1962లో 522 కు, 1972లో 543 కు పెరిగాయి. 1972 తర్వాత ఒక చర్చ వచ్చింది. అప్పట్లో జనాభా నియంత్రణను దేశ ప్రయోజన కార్యక్రమంగా పెద్ద ఎత్తున చేపట్టారు. పెరిగే జనాభాను బట్టి నియోజకవర్గాల సంఖ్య పెంచితే అది జనాభా నియంత్రణ లక్ష్యాలకు ప్రతిబంధకంగాను, మంచి కార్యం నెరవేర్చేవారికి శిక్షగా, విఫలమయ్యే వారికి బహుమతిగా ఉంటుందనే వాదన తెరపైకి వచ్చింది. చర్చ తర్వాతి అభిప్రాయం మేరకు, ప్రతి పదేళ్లకు తాజా జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చినా, 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా (543 కే) కట్టడి చేసేట్టు (42 వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా) నిర్ణయించారు. 2001 లో ఏర్పడ్డ తాజా పునర్విభజన కమిషన్ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నా, మళ్లీ అదే చర్చ తెరపైకి వచ్చింది. మొత్తం నియోజకవర్గాల సంఖ్య (543ను) పెంచకుండానే, 2026 వరకు ఆ సంఖ్యను తిరిగి కట్టడి (84వ రాజ్యాంగ సవరణ 2001) చేశారు. 2001 జనాభా గణాంకాల ప్రాతిపదికన నియోజకవర్గాల భౌతిక స్వరూపాల్ని ఏకరీతికి సరిదిద్దే పునర్విభజనను 2009లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. దాంతో సంఖ్య మారలేదు. నాటి ప్రతిపాదన ప్రకారం 2026 తర్వాతి తాజా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంపు, భౌతిక సరిహద్దుల మార్పు చేయాల్సి ఉంది. అందుకే తాజా ఆలోచనలు. నియోజకవర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్లను ఎందుకు ముడిపెట్టినట్టు? ఇదొక వ్యూహం. దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 సార్వత్రిక ఎన్నికల ముందు 2023 లో హడావుడిగా తీసుకువచ్చారు. 2024 ఎన్నికల్లో రిజర్వేషన్ వర్తిస్తుందా? అంటే, లేదు 2029 కూడా కష్టమే అనే భావన వచ్చి, అమలు ఇక 2034 ఎన్నికల్లోనే అనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. 2026 తర్వాతి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలి, ఈ రెండు జరిగాకే మహిళా రిజర్వేషన్ల అమలు అని చట్టంలో ఉంది. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ వల్ల జరుగలేదు. 2025 అనుకున్నా మొదలు కాలేదు. ఈ సంవత్సరం ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం మే కు గాని గణాంకాలు అందుబాటులోకి రావు. అప్పుడు పునర్విభజన కమిషన్ ఏర్పరచి, భౌగోళిక సరిహద్దుల ఖరారు ప్రక్రియ చేపట్టినా 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు దుస్సాధ్యమే! 2026 తర్వాతి తాజా లెక్కలు, వాటి ఆధారంగా జరిపే పునర్విభజన అన్న నిబంధనని తొలగిస్తూ చట్ట సవరణ ఇపుడు ఎన్డిఎ ప్రభుత్వం ముందున్న లక్ష్యం! జనాభా ఆధారంగా సంఖ్య పెంపును దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కనుక, లోక్సభ, అసెంబ్లీల్లో స్థానాలను 50 శాతం పెంచాలనేది తాజా ప్రతిపాదన. 543 లోక్సభ సీట్లు కాస్త 816 అవుతాయి. అదే లెక్కన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలూ పెరుగుతాయి. నియోజకవర్గాల భౌతిక సరిహద్దుల ఖరారుకు, ఎస్సి, ఎస్టి స్థానాలతో పాటు మూడో వంతు మహిళా రిజర్వుడు స్థానాల గుర్తింపునకు 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్ర ప్రతిపాదించవచ్చు. 50 శాతం స్థానాల పెంపుతో మూడో వంతు సీట్లు పెరుగుతాయి కనుక మహిళా రిజర్వేషన్ అమలుకు అభ్యంతరాలుండవనేది వారి అంచనా. ఈ మేర రాజ్యాంగ సవరణకు సభల్లో మూడింట రెండొంతుల బలం కావాలి. విపక్షాల సహకారం లేకుండా సవరణ సాధ్యపడదు. విపక్షం సహకరించకుంటే... మహిళల రిజర్వేషన్ను అడ్డుకుంటున్నారని ఇరుకున పెట్టొచ్చనేది పాలకపక్ష వ్యూహం. నియోజకవర్గాల సంఖ్య పెంపు జనాభా ప్రాతిపదికన జరిగినా, ప్రస్తుత సంఖ్య మీద 50 శాతం పెంచినా ఉత్తర- దక్షిణ వ్యత్యాసాన్ని అది పెంచుతుందే తప్ప తగ్గించదు. 50 శాతం పెంపు వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చెబుతున్నా... దక్షిణాది ముఖ్యమంత్రులు అంగీకరించడం లేదు. ఉదాహరణకు ఉత్తర్ప్రదేశ్ 80 స్థానాలు 120 అయితే, కర్ణాటకలో 28 కాస్త 42 అవుతుంది. అంటే, ఇది వరకు 52 ఉన్న వ్యత్యాసం 78కి చేరుతుంది. ఇది మరింత అన్యాయమే తప్ప పరిష్కారం కాదనేది వాదన. జనాభా ప్రకారమో, 50 శాతం సీట్ల పెంపో కాకుండా దీనికి మరేదో ప్రత్యామ్నాయం కావాలి. సంఖ్య పెంచకుండా కాలాన్ని ముందుకు నెట్టిన 1972 నాటి, 2002 నాటి పరిస్థితులు ఇప్పుడూ ఉన్నాయి. జనాభా నియంతణ్ర -వృద్ధి పరమైన ఉత్తర- దక్షిణాల వ్యత్యాసాలు ఇప్పుడింకా అధిక రెట్లలో ఉన్నాయి. సంఖ్య పెంపును మరో పదేళ్లకో, ఇరవయేళ్లకో వాయిదా వేసి, పాత సంఖ్య (543)కే తాజా జనాభా గణాంకాల ప్రాతిపదికన భౌగోళిక స్వరూపాల పునర్విభజన చేపట్టాలనే సూచన వస్తోంది. అమెరికాలో ప్రతినిధుల సభ (మన లోక్సభ లాంటి) సభ్యుల సంఖ్యను 1913 లోనే 435 గా కట్టడి చేశారు. ఇప్పుడూ అదే సంఖ్య! 1911లో 9.4 కోట్లున్న అమెరికా జనాభా 2023లో 33.4 కోట్లకు చేరింది. మొత్తం సీట్ల సంఖ్య మార్చకుండానే, జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల్ని ఏకరీతికి తెచ్చినపుడు 37 రాష్ట్రాలు మాత్రం స్వల్పంగా సంఖ్య హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మన దగ్గర కూడా, స్థానాల సంఖ్య మార్చకుండా రాష్ట్రం యూనిట్గా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల భౌతిక సరిహద్దుల్ని మార్చాలనే సూచన వస్తోంది. అప్పుడు, జనాభా నియంత్రించిన రాష్ట్రాల్లో తక్కువ జనాభాకు ఒక ఎంపి ఉంటే, నియంత్రించని రాష్ట్రాల్లో ఎక్కువ జనాభాకు ఒక ఎంపి ఉంటారు. 1973 నుంచి 2026 వరకున్న ఈ వ్యత్యాసాలు ఇక ముందూ ఉంటే ప్రమాదమేంటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. యురోపియన్ యూనియన్ (ఇయు)లో ఇదే పరిస్థితి! ఇయు పార్లమెంట్ లోని 720 స్థానాలు 27 మంది సభ్య దేశాల మధ్య పంపిణీ అవుతాయి. డెన్మార్క్లోని 60 లక్షల జనాభాకు 15 (సగటున 4 లక్షల మందికి ఒక ప్రతినిధి) మంది సభ్యులుంటే, జర్మనీ 8.3 కోట్ల జనాభాకు 96 (సగటున 8.6 లక్షల మందికి ఒక ప్రతినిధి) సభ్యులున్నారు. లోక్సభ స్థానాల సంఖ్య స్థిరంగా ఉంచి, జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లు పెంచుతూ మరో ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చనే సూచనా ఉంది. ఏం చేసైనా తాజా వివాదాన్ని పరిష్కరించడం కేంద్రం ముందున్న తక్షణ కర్తవ్యం. - దిలీప్ రెడ్డి ( సమకాలీనం) - రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ
మంత్రి కొండపల్లికి సీఎం మందలింపు! అమరావతి: రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను సీఎం చంద్రబాబు మందలించినట్లు తెలుస్తోంది. ‘రాజకీయ అరంగేట్రంతోనే ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రిగా అవకాశం కల్పించాం. అయినా మీ పనితీరు మెరుగుపడలేదు. మీ తండ్రిని దూరం పెట్టాలని చెప్పాం కదా’ అని మంత్రిని చంద్రబాబు మందలించినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉండవల్లిలో బుధవారం రాత్రి సమీక్షించారు. దీనికి మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ, […] The post పనితీరు మార్చుకోవాలి appeared first on Visalaandhra .
ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్… ఇది కేవలం బాధాకరం కాదు…ఇది నిజంగా సిగ్గుచేటు విషయం! సిపిఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ United States, Israel కలిసి Iran పై దాడులు చేస్తుంటే… అమాయక పిల్లలు, నిరపరాధ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… భారత్ కేవలం చూస్తూ ఉండాలా? ఇదేనా మన విదేశాంగ విధానం?ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే… Pakistan కూడా మధ్యవర్తిత్వానికి ముందుకు వస్తోంది! భారత్ చేయాల్సిన పని… పాకిస్తాన్ చేస్తుంటే… […] The post ఎందుకు మౌనం పాటిస్తోంది? appeared first on Visalaandhra .
వెంకట దుర్గాంబాపురంలో మంత్రి కొల్లు రవీంద్ర..
వెంకట దుర్గాంబాపురంలో మంత్రి కొల్లు రవీంద్ర.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
Hyderabad : హై అలెర్ట్... పొంచి ఉన్న తాగు నీటి సంక్షోభం
తెలంగాణలోని నీటి జలాశయాలు దాదాపు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.
ముమ్మర తనిఖీలకు కారణం అదే.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఎస్పీ
హైదరాబాద్ జలవిహార్లోని RO ప్లాంట్లో భారీ పేలుడు #Hyderabad #Jalavihar #Explosion #BreakingNews
Un Warning : ఇదేం పని Andhra Prabha News
Un Warning : ఇదేం పని Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
సంతానోత్పత్తికి వడగాడ్పుల దెబ్బ
అత్యధిక వేడి వల్ల గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం దాపురిస్తాయని గతంలో అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలపైన, పిండంపైన వేడి ప్రభావంపై ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అన్న కోణంలో విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. గర్భధారణ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలకు గురైతే మగపిల్లల జననం తక్కువగా ఉంటుందని, సబ్ సహరాన్ ఆఫ్రికా, భారత్ దేశాల్లో జనాభాపరంగా, ఆరోగ్యపరంగా జరిగిన సర్వేల్లో వెల్లడైంది. గర్భధారణ సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు సహజమైన లింగ నిష్పత్తిలో మార్పు వస్తుందని బయటపడింది. ఈ పరిశోధనలో 90 డెమోగ్రాఫిక్, హెల్త్ సర్వేల నుంచి 5 మిలియన్ జననాల వివరాలు సేకరించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కేవలం పర్యావరణానికే పరిమితం కాదని, మానవ జననాలపై కూడా ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే అధిక ఉష్ణోగ్రతలు పుట్టబోయే శిశువు అబ్బాయా లేక అమ్మాయా అన్న విషయంపై పరోక్షంగా ప్రభావం చూపవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భూతాపం కారణంగా ప్రపంచం లోని కొన్ని ప్రాంతాల్లో జననాల లింగ నిష్పత్తి మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, ఆఫ్రికా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిశోధనలో 33 ఆఫ్రికా దేశాలతోపాటు భారతదేశంలో కూడా దాదాపు 50 లక్షల జననాలను అధ్యయనం చేశారు. దీని ప్రకారం ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ మించినప్పుడు మగ శిశువుల జనన రేటు తగ్గి ఆడశిశువుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పరిశోధన చెబుతోంది. సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో గర్భధారణ మొదటి మూడు నెలల్లో అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే మహిళలు మగబిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలింది. భారత దేశంలో మగపిల్లలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో లింగ ఎంపిక గర్భస్రావాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గర్భధారణ సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు గురైతే నెలలు నిండక ముందే ప్రసవించడం, తక్కువ బరువుతో శిశుజననం, మృతశిశువు జన్మించడం వంటి అపసవ్యాలు ఏర్పడే పరిస్థితి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.గర్భధారణ సమయంలో ప్రధాన అవయవాలు ఏర్పడు మొదటి త్రైమాసికంలో అధిక వేడికి గురైతే శిశువు పుట్టుకతో కొన్ని లోపాలు కలుగుతాయని, పిండం వేగంగా పెరిగే రెండు లేదా మూడవ త్రైమాసికంలో అత్యధిక వేడిని ఎదుర్కొంటే నెలలు నిండక ముందే ప్రసవించడం లేదా మృత శిశువు జన్మించడం జరగవచ్చని, గర్భధారణ అంతటా వేడికి గురైతే శిశువు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సుమారు 3.85 లక్షలమంది గర్భిణులపై 2000 నుంచి 2015 వరకు పరిశోధనలు సాగించారు.గర్భం దాల్చడానికి 12 వారాల నుంచి బిడ్డ పుట్టేవరకు తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ విధంగా పుట్టిన బిడ్డల్లో దాదాపు 20 శాతం మంది బరువులో వ్యత్యాసం ఉన్నట్టు తేల్చారు. ఇక వేసవిలో వీచే వడగాలులు సంతానోత్పత్తి పై ప్రభావం చూపిస్తాయని బయటపడింది. వడగాలులు వల్ల కీటకాల్లోనూ, మనుషుల్లోనూ వీర్యం దెబ్బతిన్నట్టు గుర్తించారు. మగవారిలో వీర్య ఉత్పత్తి జరిగేటప్పుడు వారి మర్మావయవాల్లో చల్లదనం ఉండాలని, వడగాలుల వల్ల వేడిపెరగడం ప్రారంభమైతే వీర్యకణాల ఉత్పత్తి దెబ్బతింటుందని పరిశోధకులు తెలుసుకున్నారు. పురుషుల సంతానోత్పత్తి సామర్ధంపై అధిక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. స్త్రీల సంతానోత్పత్తి సామర్థం కూడా వడగాలులకు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటాయని తేలింది. అండం, ఫలదీకరణ అభివృద్ధి దెబ్బతింటాయి. మహిళల శరీరంలోని హార్మోన్లు అసమతుల్యతకు గురవుతాయి. క్రమరహిత పిరియడ్స్, అధిక రక్తపాతం, పిరియడ్స్ సమయంలో నొప్పిరావడం వంటి కారణాలు కనిపిస్తాయి. ఒత్తిడి మరీ ఎక్కువైతే రుతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది. అందుకే గర్భిణులు వడగాలుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు గురైతే నెలలు నిండకముందే ప్రసవం అయ్యే ప్రమాదం ఉంది. ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించే పేదల్లో ఎక్కువ మంది దీని ప్రభావానికి గురవుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కనీసం 15 మిలియన్ల మంది పిల్లలు నెలలు నిండక ముందే ప్రసవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఈ విధంగా చనిపోయే చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జొహన్నెస్బర్గ్ లోని విట్స్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ హెచ్ఐవి సంస్థకు చెందిన మాథ్యూ చెర్చిస్ నేతృత్వం లోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం 27 ధనిక, పేద, మధ్య ఆదాయ దేశాలపై 70 అధ్యయనాలు నిర్వహించింది. వాతావరణంలో ఒక డిగ్రీ సెల్సియస్ వేడి పెరిగితే ముందస్తు జననాల రేటు ఐదు శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. వడగాడ్పులు ఎక్కువగా వీచే పరిస్థితుల్లో ఇది 16 శాతానికి పెరిగిందని అధ్యయనంలో తేలిందని పరిశోధకుల బృందం పేర్కొంది. - డాక్టర్ బి. రామకృష్ణ - 99599 32323
ముస్లిం ఓటర్లను ఎందుకు తొలగించారు?
పశ్చిమ బెంగాల్ లో ముస్లిం ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు త్రుటీలో తప్పిన ప్రమాదం..
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు త్రుటీలో తప్పిన ప్రమాదం.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
Andhra Pradesh : నేటితో ముగియనున్న పాలిసెట్ గడువు
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది
తెహ్రాన్ : ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలికంగా యుద్ధం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికా ఒప్పందం షరతులకు లోబడి హోర్మోజ్ ను తెరిచిన తెహ్రాన్… లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ‘ సముద్ర భద్రత సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హోర్మోజ్ జల సంధి […] The post హోర్ముజ్ జల సంధి పై గందరగోళం appeared first on Visalaandhra .
Zodiac Signs : ఈరోజు ఎవరికి కలసి వస్తుంది?
ప్రతి ఒక్కరూ తమ అదృష్ట సంఖ్యను బట్టి, ఆరోజు దినఫలాలను బట్టి అడుగులు వేస్తుంటారు
కానిస్టేబులైతే మద్యం తాగి వాహనం నడపొచ్చా?
కానిస్టేబులైతే మద్యం తాగి వాహనం నడపొచ్చా? ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మద్యం తాగి
భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో గిరిజనుల పాత్ర విశిష్టమైనది. ముఖ్యంగా దక్షిణ మధ్య భారతదేశంలో, గోదావరి అటవీ ప్రాంతాల్లో నివసించే గోండ్లు, కోయలు వంటి గిరిజన సమూహాలు స్వేచ్ఛా భావనకు ముందుగానే కట్టుబడి, పాలక వ్యవస్థలపై తిరుగుబాటు స్వరాన్ని వినిపించాయి. ఈ నేపథ్యంలో 19వ శతాబ్దం మధ్యకాలంలో జరిగిన రాంజీ గోండ్ తిరుగుబాటు ఒక ముఖ్యమైన సంఘటనగా నిలుస్తుంది. 1857 స్వాతంత్య్ర సమరంతో సమకాలీనంగా, హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ ప్రభావం, నిజాం పాలనకు వ్యతిరేకంగా గిరిజన- రోహిల్లా కూటమి రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమానికి రాంజీ గోండ్ నాయకత్వం వహించడం గిరిజన చైతన్యానికి ప్రతీకగా భావించవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ వద్ద, రాంజీ గోండ్ నాయకత్వంలో గోండ్లు రోహిల్లాలకి చేరారు. 1860 ఏప్రిల్ 9న నిర్మల్కు కొన్ని మైళ్ళ దూరంలో సమీకృతమైన రోహిల్లాలు, గోండు, డెక్కనీల గుంపుపై నిర్మల్ కలెక్టర్ చేసిన దాడికి సంబంధించిన వివరాలు హైదరాబాద్ సెంట్రల్ రికార్డ్ ఆఫీస్ (ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్)లో భద్రపరచిన ఫైళ్లలోని పత్ర వ్యవహారాల ఆధారంగా సేకరించబడ్డాయి. ఈ ఆధారాల ప్రకారం ఏప్రిల్ 1, 1860 ఆదివారం నాడు రాంజీ గోండ్ సిపాయిలు, నిజాం / బ్రిటిష్ ప్రభుత్వ దళాలకు మధ్య భీకర పోరాటం జరిగింది. అందులో ఇరువర్గాల వారికి ప్రాణనష్టం జరిగినా రాంజీ గోండ్ తప్పించుకున్నాడు. తరువాత ఆయనను 1860 సెప్టెంబర్ ప్రాంతంలో పట్టుకుని నిర్మల్ లోని మర్రి చెట్టుకు ఉరి తీశారు. ఇది ఆధార సహిత చరిత్ర. కాగా కొందరు ఏప్రిల్ 9 నే అయన వర్ధంతి అని జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సత్యం తెలియాలన్న ఉద్దేశంతో ఈ వ్యాసంలో సంబంధిత ఆధారాలు ఇవ్వడమైనది. (1) 1860 ఏప్రిల్ 9 తేదీ గల లేఖ సంఖ్య 155లో హాజీ అలీ, ఇతర రోహిల్లాలపై జరిగిన దాడికి సంబంధించిన విపుల వివరాలు ఇవ్వబడ్డాయి. ఇంకా వివరాలు ఇలా ఉన్నాయి: గత ఆదివారం ఉదయం 4 గంటల తర్వాత కలెక్టర్కు సమాచారం వచ్చింది. -రాంజీ, ఇతర తిరుగుబాటుదారులు నిర్మల్ నుండి 15 కురోహ్ దూరంలో, రహదారి నుండి 4 కురోహ్ దూరంలో ఉన్న ఒక కొండ సమీపంలో ఆశ్రయం పొందారని. శత్రువులు తలదాచుకున్న ప్రదేశం చాలా దుర్భేద్యమైనది. ఇద్దరు వ్యక్తులు పక్కపక్కన కూడా వెళ్లలేని విధంగా మార్గం సన్నగా ఉండేది; అక్కడ ఆహారం, నీరు వంటి అవసరాలు కూడా లభించేవి కావు. విశ్వాసభావంతో కలెక్టర్ తన వద్ద ఉన్న దళంతో అక్కడికి బయలుదేరాడు. అనేక కష్టాలను భరించి మధ్యాహ్నం సమయానికి శత్రువుల వద్దకు చేరుకుని దాడి చేశాడు. మొదట కొంతసేపు తుపాకీ కాల్పులు జరిగాయి; ఆ తరువాత కత్తులతో పోరాటం జరిగింది. శత్రు పక్షంలో ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా తెలియలేదు.తిరుగుబాటుదారులు సుమారు 200 రోహిల్లాలు, 300 గోండ్లు, డెక్కనీలు ఉండేవారు. గాయపడిన అనేక మంది తిరుగుబాటుదారులు పారిపోయారు. దళసభ్యులు చాలా అలసటతో, ఆకలితో ఉండటం వల్ల పారిపోయిన తిరుగుబాటుదారులను వెంబడించలేదు. వారు 4.30 గంటల్లో 20 కురోహ్ దూరం ఆకలితోనే ప్రయాణించారు. వారికి ఆహారం కొరత కూడా ఉంది. దళసభ్యులు ఆకలి, దాహంతో అలమటిస్తూ చీకటి పడడంతో ఆహారం, నీటి కోసం ముందుకు కదిలారు. ఉత్త్నూర్ తాలూకాలోని బాలాపూర్ ఎడారిలో రెండు కురోహ్ దూరం నడిచిన తరువాత మాత్రమే వారికి నీరు దొరికింది. ఈలోగా తిరుగుబాటుదారులు అవకాశాన్ని వినియోగించుకుని పారిపోయారు. చిన్నూర్ థానేదార్ ఫతేహ్ అలీ ఖాన్ను ఎడ్లాబాద్ థానేదార్కు సహాయం చేయడానికి పంపించారు; అయితే యుద్ధ సమయంలో అతడు అతనిని కలవలేదు. అయినప్పటికీ ఆ ప్రాంతంలోని తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకుని వారిని వెంబడించి పట్టుకుంటానని హామీ ఇచ్చాడు. దేవుని దయతో తిరుగుబాటుదారులు పట్టుబడి శిక్షించబడతారు. (2) నిర్మల్ తాలూకాదార్, నాగపూర్ నుండి సహాయం పొందుతున్నట్టు తెలిసిన సుమారు వెయ్యిమంది రోహిల్లాలు, గోండ్లపై జరిగిన దాడి గురించి దివాన్కు సమాచారం ఇచ్చాడు. రహదారులు దుర్గమంగా ఉండటంతో సైన్యం అనేక కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగింది. అవసరమైన సామగ్రి కొరతతో వారు లభ్యమైన కొద్దిపాటి వనరులతోనే జీవించాల్సి వచ్చింది. అయినప్పటికీ శత్రువులతో పోరాడటంలో ఎలాంటి వెనుకడుగు వేయలేదు. మొదట రెండు పక్షాల మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి; తరువాత అది కత్తిపోట్ల యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో రెండు పక్షాలకు నష్టాలు సంభవించాయి. అయితే సైన్యం తిరుగుబాటుదారులను చుట్టుముట్టడంలో విజయం సాధించింది; కానీ వారి నాయకుడు రాంజీ మాత్రం తప్పించుకున్నాడు. ఈ ఘటన వివరాలు రెసిడెంట్కు తెలియజేయబడ్డాయి. అతను తన సమాధానంలో తాలూకాదార్ సేవలను ప్రశంసిస్తూ రాంజీని తప్పకుండా పట్టుకోవాలని ఆదేశించాడు. అయితే ఫైల్లో రాంజీ పట్టుబడిన విషయంపై సమాచారం లేదు. తరువాత రాంజీ గోండ్ పట్టుబడి, విచారణకు గురై, నిర్మల్లో ఉరిశిక్ష అమలు చేయబడ్డాడు. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని తిరుగుబాటు అణచివేయబడింది. 1860 నాటికి రోహిల్లాల తిరుగుబాట్లు ముగిశాయి; అనేక రోహిల్లాలు పట్టుబడి, విచారణ అనంతరం వివిధ కాలాలపాటు జైలు శిక్షలకు గురయ్యారు. పై వివరాలు అన్నీ హైదరాబాద్ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర సంకలనానికి నియమించబడిన కమిటీ 1956 నాటి ప్రచురణ, ‘ది ఫ్రీడమ్ స్ట్రగ్గుల్ ఇన్ హైదరాబాద్’, రెండవ సంపుటం (1857- 1885), పుటలు 155 -157 లలో ఉన్నాయి. రాంజీ గోండ్ మరణ సూచన 1860 అక్టోబర్ 15 నాటి రిపోర్ట్ లో ఉంది. ఆనాడు రిపోర్ట్ లండన్కు వెళ్లి ప్రచురించబడడానికి సుమారు నెల పట్టేది. కాబట్టి రాంజీ గోండ్ వర్ధంతిని సెప్టెంబర్ 17 న జరుపుకోవలసి ఉంటుంది. - డా. ద్యావనపల్లి సత్యనారాయణ - 94909 57078
Summer Effect : అసలైన సమ్మర్ ఇదేనట.. మూడు నెలల్లో మటాషేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
రేషన్ షాపుకు వచ్చే వారి కోసం..
రేషన్ షాపుకు వచ్చే వారి కోసం.. వర్ని, ఆంధ్రప్రభ : రేషన్ బియ్యం
నేడు వనపర్తిలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ సభ నిర్వహించనున్నారు
వంశీకృష్ణ అరెస్ట్. అసలు ఏం జరిగింది..?
వంశీకృష్ణ అరెస్ట్. అసలు ఏం జరిగింది..? చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
చలివేంద్రంలో కుండలు ధ్వంసం.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూరు మండల కేంద్రంలోని స్థానిక
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడ రాంరెడ్డి నగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ సాల్వెంట్స్ డ్రమ్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. కాలనీలో అలముకున్నదట్టమైన పొగ, రహదారిపైకి డ్రమ్ములు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
Sesh’s Dacoit Advance Sales: Highly Impressive
Adivi Sesh’s love-and-action drama Dacoit, directed by Shaneil Deo, hits theatres tomorrow, with USA premieres scheduled for tomorrow. The makers are also planning to hold special premiere shows in Hyderabad and Mumbai cities for evening shows. Going by the advance ticket sales, Dacoit is on track to beat Sesh’s previous best in domestic and overseas. […] The post Sesh’s Dacoit Advance Sales: Highly Impressive appeared first on Telugu360 .
ఎల్లమ్మకు నివాళులర్పించిన సర్పంచ్ రాజు..
ఎల్లమ్మకు నివాళులర్పించిన సర్పంచ్ రాజు.. చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం రాజవరం
నిలువ నీడ లేదు.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది
బీజేపీ నాయకుల పరామర్శ.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
Chandrababu : నేడు వేమూరు నియోజకవర్గానికి చంద్రబాబు
నేడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
నేడు జీవన్రెడ్డి ఇంటికి కేటీఆర్
నేడు జీవన్రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నారు
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది
అసోం, కేరళ, పుదేచ్చేరిలో పోలీంగ్ ప్రారంభం
అసోం, కేరళ, పుదేచ్చేరిలో పోలీంగ్ ప్రారంభం అయింది. కేరళలో 140 నియోజకవర్గాలకు 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు బరిలో 722 మంది అభ్యర్థులు నమోదయ్యారు. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కేరళలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు నమోదు అయ్యారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఓటింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాటు చేశారు.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ସାଂସଦ ରାଘବ ଚଡ୍ଡାଙ୍କ ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ବହୁ ପୁରୁଣା ଅଟେ
ଆମ ଆଦମୀ ପାର୍ଟିର ସବୁଠାରୁ ଚର୍ଚ୍ଚିତ ଚେହେରା ବା କେଜ୍ରିୱାଲଙ୍କ ସଙ୍କଟମୋଚକ ବୋଲାଉଥିବା ରାଘବ ଚଢ଼ା ଏବେ ଦଳ ଭିତରେ ନିଜ ଅସ୍ତିତ୍ୱ ରକ୍ଷା ପାଇଁ ସଂଘର୍ଷ କରୁଛନ୍ତି । ରାଜ୍ୟସଭାରେ ଉପ-ନେତା ପଦରୁ ହଟାଯିବା ପରେ ରାଘବ ଏବଂ ଆପ୍ ହାଇକମାଣ୍ଡଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ତିକ୍ତତା ଏବେ ସଂସଦରୁ ବାହାରି ସୋସିଆଲ ମିଡିଆ ପର୍ଯ୍ୟନ୍ତ ପହଞ୍ଚିଛି । ପଞ୍ଜାବରୁ ରାଜ୍ୟସଭାକୁ ଯାଇଥିବା ରାଘବଙ୍କ ଉପରେ ଦଳ ଅଭିଯୋଗ ଆଣିଛି ଯେ, ସେ ରାଜ୍ୟର ସ୍ୱାର୍ଥ ରକ୍ଷା କରିବାରେ ବିଫଳ ହୋଇଛନ୍ତି । ଖୋଦ୍ ଆପ୍ ନେତାମାନେ ପ୍ରଶ୍ନ ଉଠାଇଛନ୍ତି ଯେ ରାଘବ ସଂସଦରେ ଗମ୍ଭୀର ପ୍ରସଙ୍ଗ ଛାଡ଼ି କେବଳ ଲାଇମଲାଇଟ୍ ରେ ରହିବା ଭଳି ପ୍ରସଙ୍ଗ ଉଠାଉଛନ୍ତି । ଏହା ପଛରେ ଦଳର ଗୋଟିଏ ଗୋଷ୍ଠୀ ତାଙ୍କୁ ରିୟଲ ପଲିଟିସିଆନ୍ ବଦଳରେ ପିଆର ଷ୍ଟଣ୍ଟବାଜ ବୋଲି କଟାକ୍ଷ କରିବାକୁ ପଛାଉନାହାନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ସାଂସଦ ରାଘବ ଚଡ୍ଡାଙ୍କ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ଭିଡିଓରେ ରାଘବ ବିଜେପିକୁ ଟାର୍ଗେଟ କରୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓରେ ରାଘବ କହିଛନ୍ତି, ମତେ ରାଜ୍ୟସଭାରୁ ଆଜି ସସପେଣ୍ଡ କରି ଦିଆଯାଇଛି । ମୁ ସଂସଦରେ ଠିଆ ହୋଇ ବିଶ୍ୱର ସବୁଠାରୁ ବଡ଼ ପାର୍ଟି ବିଜେପି ଉପରେ ପ୍ରଶ୍ନ ପଚାରିଛି ନାଁ ଏହା ମୋର ଅପରାଧ ଯେ ଦିଲ୍ଲୀର ବଡ଼ବଡ଼ିଆ ବିଜେପି ନେତାଙ୍କୁ ଦିଲ୍ଲୀ ସେବା ବିଲ୍ ନେଇ ପ୍ରଶ୍ନ ପଚାରିଛି । ବିଜେପିକୁ ତାଙ୍କରି ପୁରୁଣା ନିର୍ବାଚନୀ ଇସ୍ଥହାର ଦେଖାଇ ତାହାସବୁ ପୂରଣକରିବାକୁ କହିଲି । ୩୪ ବର୍ଷୀୟ ଏହି ଯୁବ ସାଂସଦ କିଭଳି ଭାବେ ଆମକୁ କଟାକ୍ଷ କରୁଛି ତାହା କଣ ବିଜେପି ସହି ପାରୁନି । ଉକ୍ତ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । View this post on Instagram A post shared by Digital Breaking (@digitalbreakingmp) ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ନୁହେଁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ୨୦୨୩ ମସିହାର ଅଟେ । ଦାବୀର ସତ୍ୟାସତ୍ୟ ଜାଣିବାକୁ ଯାଇ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନ ସମୟରେ ଉକ୍ତ କିୱାର୍ଡ ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ତେବେ ଭାଇରାଲ ଭିଡିଓରେ ବିଜେପି ଉପରେ ବର୍ଷିଥିବା ରାଘବଙ୍କ ଉକ୍ତ ଭିଡିଓଟି ପାଇନଥିଲୁ । ରାଜ୍ୟସଭାରେ ଉପ-ନେତା ପଦରୁ ହଟାଯିବା ପରେ ରାଘବଙ୍କ ବହୁ ଭିଡିଓ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ବିଭିନ୍ନ ଭିଡିଓରେ ଭିନ୍ନଭିନ୍ନ ମତ ଦେଇଥିବାର ଦେଖାଯାଇଛି । ଯାହାକୁ ରାଘବ ନିଜେ ତାଙ୍କର ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ , ଏଠାରେ , ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଉକ୍ତ କୌଣସି ମଧ୍ୟ ଭିଡିଓ ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ତାଳମେଳ ଖାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିନଥିଲା । ତେଣୁ ଭାଇରାଲ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ହୋଇନଥାଇ ପାରେ ବୋଲି ଅନୁମାନ କରାଯାଏ । ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ଲିଙ୍କ୍ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୧ ଅଗଷ୍ଟ ୨୦୨୩ରେ ଏକ ଖବର ପ୍ରସାରଣ କରି ଏନଡିଟିଭି ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖାଯାଇଛି । ଉକ୍ତ ଖବରରେ ଏନଡିଟିଭି ଉଲ୍ଲେଖ କରିଛି, ସସପେଣ୍ଡ ପରେ ଆପ୍ ସାଂସଦ ରାଘବ ଚଡ୍ଡା ମୁହଁ ଖୋଲିଛନ୍ତି । ଉକ୍ତ ଭିଡିଓରେ ରାଘବ ସ୍ପଷ୍ଟୀକରଣ ଦେଇ କହିଛନ୍ତି ଯେ, ମୁଁ କୌଣସି ଦସ୍ତଖତ କରିବାକୁ ଭୁଲି ନାହିଁ । ପ୍ରସାରିତ ଖବରରେ ଯେଉଁ ଭିଡିଓ ଅଛି ତାହା ଭାଇରାଲ ଭିଡିଓର ଏକ ଅଂଶ ପରି ଦୃଶ୍ୟମାନ ହୋଇଥିଲା । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଭିଡିଓ ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ନୁହେଁ I କାରଣ ଏହା ୨୦୨୩ରୁ ଇଣ୍ଟରନେଟରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ତେବେ ଉକ୍ତ କିୱାର୍ଡ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଖବର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୧ ଅଗଷ୍ଟ ୨୦୨୩ରେ ହିନ୍ଦୁସ୍ତାନ ଟାଇମ୍ସ ଏକ ଖବର ପ୍ରସାରିତ କରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଖବର ପ୍ରସାରଣ କରି ହିନ୍ଦୁସ୍ତାନ ଟାଇମ୍ସ ଉଲ୍ଲେଖ କରିଛି, ଆମ ଆଦମୀ ପାର୍ଟି (ଆପ) ସାଂସଦ ରାଘବ ଚଡ୍ଡା ଏକ ଭିଡିଓ ବାର୍ତ୍ତାରେ ନିଜକୁ 'ନିଲମ୍ବିତ' ରାଜ୍ୟସଭା ସଦସ୍ୟ ବୋଲି କହିଛନ୍ତି ଏବଂ ସଦନରୁ ତାଙ୍କୁ ନିଲମ୍ବିତ କରିବା ପାଇଁ କେନ୍ଦ୍ର ସରକାରଙ୍କ ଉପରେ ଇଙ୍ଗିତ କରି ଏକାଧିକ ପ୍ରଶ୍ନ ଉଠାଇଛନ୍ତି। ସେ ପଚାରିଛନ୍ତି ଯେ, ତାଙ୍କ ନିଲମ୍ବନର କାରଣ କ'ଣ ସେ 'ସଂସଦ ଭିତରେ ବିଶ୍ୱର ସବୁଠାରୁ ବଡ଼ ଦଳର ନେତାମାନଙ୍କୁ ପ୍ରଶ୍ନ କରିଥିଲି' ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ପ୍ରାସଙ୍ଗିକ ବିଷୟଗୁଡ଼ିକ ଉପରେ ପ୍ରଶ୍ନ ଉଠାଇଥିଲି ? ମୁଁ କ'ଣ ଦୋଷୀ କାରଣ ମୁଁ ସଂସଦ ଭିତରେ ବିଶ୍ୱର ସବୁଠାରୁ ବଡ଼ ଦଳର ନେତାମାନଙ୍କୁ ପ୍ରଶ୍ନ କରିଥିଲି ନା ମୁଁ ଦୋଷୀ କାରଣ ମୁଁ ଦିଲ୍ଲୀ ସେବା ବିଲ୍ ଉପରେ ମୋର ମତ ରଖିଥିଲି ଏବଂ ସେମାନଙ୍କଠାରୁ ନ୍ୟାୟ ଦାବି କରିଥିଲି? ବୋଲି ଉଲ୍ଲେଖ କରିଛି ହିନ୍ଦୁସ୍ତାନ ଟାଇମ୍ସ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ନୁହେଁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ୨୦୨୩ ମସିହାର ଅଟେ । ବର୍ତ୍ତମାନ ଦିନରେ ରାଜ୍ୟସଭାରେ ଉପ-ନେତା ପଦରୁ ହଟାଯିବା ଘଟଣା ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
పోలీసు సిబ్బందికి వేసవి రక్షణ సామగ్రి పంపిణీ..
పోలీసు సిబ్బందికి వేసవి రక్షణ సామగ్రి పంపిణీ.. నర్సంపేట, క్రైం, ఆంధ్రప్రభ :
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభమయింది.
IPL 2026 : టైటాన్స్ సూపర్ విక్టరీ.. ఢిల్లీపై ఒక్క పరుగుతోనే?
ఢిల్లీ కాపిటల్స్ ఈ సీజన్ లో తొలి ఓటమి చవి చూసింది
యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ ’ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటో లో హీరో తిరువీర్ తో పాటు టీమ్ మొత్తం ఒకేచోట చేరి సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ వైబ్ లో కనిపించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ మీదున్న భారీ అంచనాల గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ‘లెనిన్’ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో పూర్తి సినిమాటిక్ ప్యాకేజీగా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్ఫుల్ పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్లో అఖిల్ కొత్త లుక్లో కనిపించగా, ఆయన చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా ఉంది. అభిమానుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాల్ని సృష్టించిన ఈ చిత్రం జూన్ 26న విడుదల కానుంది. మురళీ కిషోర్ అబ్బూరు ‘లెనిన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో, అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Israel - Iran War : కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు.. కొనసాగుతున్నదాడులు
ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు ప్రారంభించడంతో ప్రతిస్పందనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది
గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..
గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ గండి?
దుబాయ్ : ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక తెరపడిందన్న సంబరం కొద్ది గంటలు కూడా నిలబడలేదు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే విషయమై అమెరికా విధించిన గడువు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటన ప్రపంచ దేశాలకు పోయిన హర్షం వ్యక్తం చేశాయి. అం తలోనే ఇజ్రాయెల్ లెబనాన్పై అత్యంత భీకర దాడులకు దిగింది. ఈ దాడిలో 89 మందికి పైగా మృతి చెందారు. 700 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలోలెబనాన్ ప్రముఖ మతపెద్ద అలీ నబూ డా 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడి ఇదే. ఈ దాడుల పట్ల భగ్గుమ న్న ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూ సి వే సింది. బీరూట్, ఇతర ప్రాంతాలలో ని ఇరాన్ ఆధిపత్య హెజ్బోల్లా మిలిటెంట్ల అ ణచివేత ల్లో భాగంగా ఇజ్రాయెల్ ఈ దాడుల కు దిగిం ది. ఈ మిలిటెంట్లపై తమ దాడులు ఆగబోవని ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదన తరువాత కూడా వెల్లడించింది. ఇందు కు అ నుగుణంగానే దాడులకు దిగింది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులలో ఈ నెల 3 నుం చి జ రుగుతున్న పరిణామాలలో మొత్తం మృ తుల సంఖ్య 1500 దాటింది. లెబనాన్లో ఇ జ్రాయెల్ పలు చోట్ల భూతల దాడులు కూడా సా గిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ సాగిస్తో న్న దాడులలో 130 మంది వరకూ పిల్లలు చ నిపోయారు. 100 మందికి పైగా మహిళలు బలి అయ్యారు. అయితే హెజ్బోల్లా అంతం వరకూ తమ పంతం సాగుతుందని తాత్కాలి క కాల్పుల విరమణతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ సేనలు కదం తొక్కుతున్నాయి. దీ నితో పోరు విరమణ ప్రక్రియపై నీలినీడలు ప ర్చుకున్నాయి. బుధవారం బీరూట్లో అ త్యం త భయానక పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో రక్తసిక్తమైన జనం కార్లలో దూర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆసుపత్రికి చేరేలోగానే పలువురు మృతి చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లెబనాన్పై యుద్ధం ఆగబోదని, కాల్పుల విరమణ ప్రతిపాదన ఈ ప్రాంతం పరిధిలోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. బుధవారం తమ బలగాలు హెజ్బోల్లాకు మునుపెన్నడూ లేని స్థాయిలో నష్టం కల్గించాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెలీ కట్జ్ తెలిపారు.సౌదీలోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడులు తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు దిగాయి. దీనితో పాటు కువైట్, బహరైన్లలో కూడా గగనతలంలో పోరు బీకరమైంది. హర్మూజ్ జలసంధిని తిరిగి మూసేసిన ఇరాన్ బుధవారం కొద్ది సేపు హర్మూజ్ జలసంధి మార్గం తెరిచేందుకు అంగీకరించిన ఇరాన్ తరువాత నిర్ణయం మార్చుకుంది. ఇజ్రాయెల్ నుంచి లెబనాన్పై భారీ స్థాయిలో దాడులతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. దీనితో కాల్పుల విరమణ ప్రక్రియ ఆదిలోనే ఆటంకాలతో కుంటుపడింది. హర్మూజ్పై ఇరాన్ తాజా నిర్ణయం గురించి ఇరాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ తూట్లుపొడుస్తున్న దశలో తమ నిర్ణయాలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికా తన పెంపుడు పిచ్చికుక్కను అదుపులో పెట్టలేకపోతే , తాము అందుకు తగ్గట్లుగానే దెబ్బ తీయాల్సి ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రక్రియలో లెబనాన్ కూడా ఉందని శాంతిచర్చలలో కీలకమైన పాకిస్థాన్ అంతకు ముందు తెలిపింది.
9thApril2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
9thApril2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 9thApril2026 |
మనతెలంగాణ/హైదరాబాద్: సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సిఎస్ఆర్కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని సిఎం రే వంత్రెడ్డి తెలియజేశారు. కంపెనీలు వాటితో పాటు తమ కు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సిఎస్ఆర్ నిధులు వినియోగించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించా రు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగా ణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీ ర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేస్తామని సిఎం పేర్కొన్నారు. విద్యపై పెట్టే వ్య యాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్లోనే 44 శాతం ఉన్నారని వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సిఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు. సిఎస్ఆర్ నిధుల వినియోగం కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియామకం సిఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటివరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకు నియమించామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్యా, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సిఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని సిఎం తెలిపారు. ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని సిఎం వారికి అభినందనలు తెలిపారు. కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సిఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. పాఠశాల విద్యా, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు వారు ఆసక్తి చూపారు. ఈ సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు, మేఘా నుంచి సుధా రెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణా రెడ్డి, కామినేని భాస్కర్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్ రెడ్డి, నాడ్యామ్ ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, ఎంపి వేం నరేందర్ రెడ్డి, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో మీ అవినీతి చిట్టా విప్పుతా
మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్, కెటిఆర్, హరీష్రావులు తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం తమ ప్రభుత్వాన్ని, మంత్రులను భ యబ్రాంతులను గురిచూస్తే వారి తాటాకు చప్పుళ్ల కు భయపడమని, ఇష్టానుసారంగా కారుకూతలు కూస్తే తాము భయపడమని రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బిఆర్ఎస్ నాయకుల అక్రమాలు, భూదందాల చిట్టాను త్వరలోనే విప్పుతామని బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాగోతాల జాబితాను ఒక్కొక్కటి గా తమ మిత్రలు ఇస్తున్నారని వాటిని త్వరలోనే బ యటకు తీస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నాదర్గుల్, వట్టినాగులపల్లి భూముల వ్య వహారం , మంత్రులపై బిఆర్ఎస్ నాయకులు చేసి న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను ‘అబద్ధాల రావు’, ‘డ్రామాల రావు’ అని సంబోధి స్తూ, వారు చేస్తున్న విమర్శలను అసత్యాల పుట్టగా మంత్రి పొంగులేటి అభివర్ణించారు. బుధవారం ఆ యన సచివాలయంలో గ్రౌండ్ప్లోర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పది సంవత్సరాల్లో తెలంగాణను కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని బిఆర్ఎస్ నాయకులైన అబద్ధాల రావు, డ్రామారావు, శకుని మామలు ఎలా తాపత్రయ పడుతున్నారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ధరణిలో జరిగిన అవకతవకలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయని, ఫోరెన్సిక్ ఆడిట్ లో రెండు జిల్లాల రిపోర్టు వచ్చిందని, మిగతా జిల్లాలది రాబోతుందని ఆయన తెలిపారు. అవన్నీ బయట పెట్టక ముందే, మనకంటిన బురద వారికి పూస్తే ఇద్దరం బురద రాసుకున్నోళ్లం అవుతామని బిఆర్ఎస్ పగటి కలలు కంటుందని ఆయన అన్నారు. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తరువాత డ్రామారావు, అబద్ధాల రావు, శకుని మామ కుటుంబానికి ఉన్న ఆస్తులెంతా? ఇప్పుడు వారికున్న ఆస్తులెంత చెప్పాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు. మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మోచేతి నీళ్లంటే కోటి రూపాయలు కాదని అంతకన్నా ఎక్కువని... రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో మీకు తెలియదా అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ మోచేతి నీరు తాగినోళ్లు మీరని, ప్రజలకు ఈ విషయం తెలుసో లేదో కానీ, ఈ అబద్ధాల రావు, డ్రామా రావుకు బాగా తెలుసనీ ఆయన అన్నారు. అంతేకాదు మాయమాటలు చెప్పి, తడి బట్టతో నా గొంతు కోసిన తరువాత, నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి అధికారికంగా కోటి రూపాయలు ఇచ్చానని మరచిపోయావా అబద్ధాలరావు అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అప్పుడే తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నావా డ్రామారావు? మోచేతి నీళ్లంటే కోటి రూపాయలు కాదని అంతకన్నా ఎక్కువని ఈస్టోరీ మీ అంతరాత్మకు తెలుసనీ మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శాసనసభ సమావేశంలో డైరెక్టుగా చెప్పారు, మీకు చాలెంజ్ విసిరారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్కు రాఘవ కన్ స్ట్రక్షన్ సంబంధం లేదని, రోడ్లకు మెటల్ పంపే కంపెనీ మీద సిబిసిఐడీ విచారణ వేస్తామని సిఎం పేర్కొన్న విషయాన్ని మరోసారి మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడిపై బిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి ఆ కంపెనీతో పాటు విదేశాలకు వేలాది కోట్ల రూపాయల సంపద తరలించిన కంపెనీలపై కూడా సిబిసిఐడీ విచారణ జరిపిస్తామని పేర్కొనడం తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నిరూపిస్తుందని ఆయన అన్నారు. 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో గనుల శాఖకు అబద్ధాలరావు, డ్రామారావు, శకుని మామలే మంత్రులుగా వ్యవహారించారని ఆయన తెలిపారు. ఈ ముగ్గురు ఎన్ని సెక్టార్లలో మైనింగ్ను దోచుకున్నారో ప్రతిదీ ఈ సిబిసిఐడీ ద్వారా విచారణలో వస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోనే నాదర్గుల్ భూములకు మ్యుటేషన్.... నాదర్గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. ఈ భూమి బాగోతం మొత్తం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి, రేకుల షెడ్లు వేయించింది బిఆర్ఎస్ నాయకులేనని ఆయన మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని గత ప్రభుత్వమని, కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వం తరపు కౌంటర్ దాఖలు చేశామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. వట్టినాగులపల్లి భూములపై అబద్దాలరావుది దుష్ప్రచారం.... వట్టినాగులపల్లి భూముల్లోనూ అబద్దాలరావుది పూర్తిగా దుష్ప్రచారమని మంత్రి పొంగులేటి కొట్టిపారేశారు. కుటుంబ సభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షా కుటుంబానికి సంబంధించిన భూమిని తన కుమారుడు సహా నలుగురు డెవలప్మెంట్కు తీసుకున్నారని, వట్టినాగులపల్లి భూములను తన కుమారుడు కొనలేదని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హోమ్ అనే సంస్థ కొన్న భూమి కొంత ఓఆర్ఆర్లో పోయిందని, ఓఆర్ఆర్లో పోయిన కొంత భూమిని రికార్డుల నుంచి తొలగించుకోలేదని మంత్రి తెలిపారు. ఓఆర్ఆర్లో పోయినంత భూమిని పక్కవాళ్ల భూమి నుంచి కబ్జా చేసే ప్రయత్నం చేశారని, ఆనాడు ప్రభుత్వం అండతో హోం సంస్థ భూఅక్రమాలకు పాల్పడిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఆధారం చూపకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని... ఆధారం చూపకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వంపై మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని, సన్నబియ్యం పథకంపై ప్రజల స్పందన చూసి దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే బిఆర్ఎస్ ఉనికి పోతుందని మంత్రి కోమటిరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, సింగరేణిలో అవకతవకలని ఉప ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేశారని, పౌర సరఫరాలో అవినీతి అంటూ మంత్రి ఉత్తమ్పై మరో పుకారు పుట్టించారని ఆయన అన్నారు. లిక్కర్ విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి మీద కూడా అదే రకంగా నిందలు వేశారని ఆయన మండిపడ్డారు. హిల్ట్ పాలసీ, మైనింగ్ పై విచారణకు సిద్ధమని సిఎం రేవంత్ చెబితే అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్లిందెవరు అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.
ఆదిలాబాద్లో జంట ఎయిర్పోర్టులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి రెం డు నూతన విమానాశ్రయాలు రాబోతున్నా యి. ఆదిలాబాద్లో అతి పెద్ద విమానాశ్రయా న్ని నెలకొల్పనున్నట్లు, మామునూరుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు గను ల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఈ శుభ వార్త వెల్లడించారు. అ న్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ తెలిపారు. విమానాశ్రయాల అవసరం ఉన్న చో ట నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలోని మామునూరు ఎయిర్పోర్టుకు 3 నె లల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చే స్తున్నామన్నారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నామని, అయితే ఆదిలాబాద్లో పెద్ద విమానాశ్ర యం నిర్మించాలని కేంద్రం భావిస్తోందన్నారు. సైని క, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఇది ఉంటుంది అని తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైనట్లు ఆయన చెప్పారు. ఎప్పటి నుంచో తెలంగాణలో ఒకే విమానాశ్రయం కేవలం హైదరాబాద్లోనే ఉందన్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలు ఉండాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఫీజిబిలిటీకి తగ్గట్లుగా విమానాశ్రయాలు నిర్మించాలనేది ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన అని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా వరంగల్ లో విమానాశ్రయానికి అడుగులు ముందుకు వేస్తున్నామని, మరో మూడు నెలల్లో మామునూరులో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు ముఖద్వారమైన ఆదిలాబాద్లో, పర్యాటకానికి, వివిధ వాణిజ్య కార్యక్రమాలను ప్రోత్సహించేలా విమానాశ్రయం రావాలని చిరకాల డిమాండు ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పలు దఫాల్లో చర్చించామని,వివిధ ఫీజిబుల్ ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణంపై దృష్ఠి సారించమని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్లో 360 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ స్థలంలో విమానాశ్రయం నిర్మించాలను కున్నామని ఆయన తెలిపారు. లోగడ కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమై కోరామని ఆయన చెప్పారు. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని ఆయన వివరించారు. మరో 450 ఎకరాలు అవసరం ఆదిలాబాద్ లో విమానాశ్రయానికి అదనంగా మరో 450 ఎకరాల అవసరం అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ డిమాండ్ గురించి చెప్పడంతో సానుకూలంగా స్పందించిందని ఆయన చెప్పారు.విమానాశ్రయానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నామని, మొదట ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించాలని అనుకున్నామని, అయితే రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యూహాత్మకమైన ప్రాంతం కావడం, వైమానిక దళం శిక్షణకు కీలకమైన ప్రాంతం కావడంతో ఈ విమానాశ్రయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంట్లో ఒక పక్కన సామాన్య ప్రజల కోసం విమాన సేవల టర్మినల్ను ఎయిర్ పోర్ట్ అథారిటీ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు తెలిపారు.సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ నెల 17న క్షేత్రస్థాయిలో సర్వే చేసిన తర్వాత రన్ వే ఓరియంటేషన్పై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన 450 ఎకరాల స్థలాన్ని అప్పజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. భూసేకరణలో ఎలాంటి సమస్యలు లేవని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారని ఆయన వివరించారు. ఆదిలాబాద్ భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం అవుతుందన్నారు. కమర్షియల్ హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జేవర్ విమానాశ్రయం యూపీ ప్రభుత్వం పిపిపి పద్ధతిలో చేసుకుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే రాష్ట్రం భూమిని తమకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. పెద్దపల్లిలో ఒక స్థలాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని, తమ నివేదికలోనూ సానుకూలంగా వచ్చిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాధానం వచ్చిన తర్వాత ముందుకెళ్తామన్నారు. విమానాశ్రయానికి 600 నుంచి 700 ఎకరాలు అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. పెద్ద విమానాశ్రయాలు భవిష్యత్ కోసం కావాలంటే కనీసం 1200 ఎకరాలు అవసరం అవుతాయన్నారు. కొత్తగూడెంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఫీజిబుల్ కాదన్న విషయాన్ని తెలియజేశామని కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు తెలిపారు. -=-=-=-=-=-=-=-=-=-=- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం రాష్ట్రంలో వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్ స్ట్రిప్ ఉన్నదని, ఆ స్థలంలో నూతన విమానాశ్రయం కట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి చర్చించామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పౌర విమానయాన శాఖ అధికారులు, రక్షణ శాఖ అధికారులు, ఆదిలాబాద్ కలెక్టర్ పాల్గొన్నారు. --++--
ఇరిగేషన్ మోటార్లపై ఇదేం కుట్ర?
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రా వు ధ్వజమెత్తారు. బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతుందని, ఆ నె పాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నా రా అంటూ ప్రశ్నించారు. భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చే శారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా?, లేక ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? అని నిలదీశారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, పదే పదే ఆపితే తీవ్ర న ష్టం కలుగుతుందని హెచ్చరించారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరమని, తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్ కు అనుగుణంగా ని రంతరాయంగా పంపులు నడిపించాలని, రాజకీయాల కోసం రా ష్ట్ర రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హ రీష్ రావు హెచ్చరించారు.
నేడు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
నేడు (గురువారం) కేరళ, అసోం, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవల్సి ఉంది. ఇక్కడ ఎల్డిఎఫ్ వరుసగా మూడోసారి తన బలాన్ని పరీక్షించుకొంటోంది.కాంగ్రెస్ సారధ్య అ యుడిఎఫ్ రాష్ట్రంలో విరామం తరువాత పాగాకు యత్నిస్తోంది. ఇక బిజెపి సారధ్య ఎన్డిఎ తన ఖాతా తెరిచేందుకు రంగంలోకి దిగింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలలో మొత్తం మీద 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ అత్యధిక స్థానాలలో యుడిఎఫ్, ఎల్డిఎఫ్ మధ్యనే ఉంటుంది. బిజెపి రాకతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. పది సంవత్సరాల తమ పాలనలో సాధించిన ప్రగతిని చాటుకుంటూ అధికార ఎల్డిఎఫ్ ప్రచారం సాగించింది. ఈ హయాంలో అవినీతిని ఎండగడుతూ ప్రతిపక్ష యుడిఎఫ్ విజయం కోసం ఆరాటపడుతోంది. ఈశాన్య రాష్ట్రం అసోంలో బిజెపి ఈసారి గెలుపుతో హ్యాట్రిక్కు సర్వశక్తులు ఒడ్డింది. ఇక్కడ ఎన్డిఎ, కాంగ్రెస్ నాయకత్వ ప్రతిపక్ష కూటమి నడుమ పోటి నెలకొని ఉంది. 126 మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇప్పుడు మొత్తం 722 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ్ గొగోయ్, ప్రతిపక్ష నేత దెవవ్రత సైకియా, ఎఐయుడిఎఫ్ అధ్యక్షులు బద్ద్రుద్దీన్ అజ్మల్, రాయ్జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్ , ఎజెపి ప్రెసిడెంట్ లూరింజ్యోతి గగోయ్ రంగంలో ఉన్నారు. ఈసారి ఎన్నికలకు చాలా కాలం ముందుగానే రాష్ట్ర కాంగ్రెస్ నేత గౌరవ్ ప్రధాన కేంద్రంగా బిజెపి పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆయన జాతీయతను ప్రశ్నించింది. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారమే ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 294 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు, ఇక్కడ ఎన్డిఎకు కాంగ్రెస్, అన్నాడిఎంకె, విసికెతో కూడిన ఇండియా కూటమి సవాలు విసురుతోంది. ఈసారి నటుడు విజయ్ కూడా తమ టివికె పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఎన్డిఎలో కీలకమైన ఎఐఎన్ఆర్సి నేత , సిఎం రంగస్వామి ఇప్పుడు థట్టన్చావడీ, మంగళం స్థానాల నుంచి పోటీలో ఉన్నారు
గురువారం రాశి ఫలాలు(09-04-2026)
మేషం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృషభం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. మిధునం గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు. సింహం చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. కన్య సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వృశ్చికం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనస్సు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మకరం వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీనం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.
ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
ఐపిఎల్ గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో గుజరాత్ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. ఈ సీజన్లో గుజరాత్కు ఇదే తొలి గెలుపు కాగా, ఢిల్లీ మొదటి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 45 బంతుల్లో 5 సిక్స్లు, 4 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన జోస్ బట్లర్ 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ (55) పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (41), కెఎల్ రాహుల్ (92) అద్భుత బ్యాటింగ్ను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది.
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం విశాలాంధ్ర-హైదరాబాద్: వేసవి నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ జల సరఫరా శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టుగా వినియోగించేలా అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి […] The post తాగునీటి కొరత రానీయొద్దు appeared first on Visalaandhra .
. నాదర్గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్గూడ క్రషర్పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని […] The post అసత్యాలు ఆపండి appeared first on Visalaandhra .
హర్మూజ్ జలసంధిని తిరిగి మూసేసిన ఇరాన్
బుధవారం కొద్ది సేపు హర్మూజ్ జలసంధి మార్గం తెరిచేందుకు అంగీకరించిన ఇరాన్ తరువాత నిర్ణయం మార్చుకుంది. ఇజ్రాయెల్ నుంచి లెబనాన్పై భారీ స్థాయిలో దాడులతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. దీనితో కాల్పుల విరమణ ప్రక్రియ ఆదిలోనే ఆటంకాలతో కుంటుపడింది. హర్మూజ్పై ఇరాన్ తాజా నిర్ణయం గురించి ఇరాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ తూట్లుపొడుస్తున్న దశలో తమ నిర్ణయాలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికా తన పెంపుడు పిచ్చికుక్కను అదుపులో పెట్టలేకపోతే , తాము అందుకు తగ్గట్లుగానే దెబ్బ తీయాల్సి ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రక్రియలో లెబనాన్ కూడా ఉందని శాంతిచర్చలలో కీలకమైన పాకిస్థాన్ అంతకు ముందు తెలిపింది.
అందుబాటులో 36 కాలనీల్లో 1400 షాపులు విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగరంలోని క్యూర్ పరిధిలో డబుల్ బెడ్ రూం కాలనీల్లో ఉన్న 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేల ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీచేశారు. తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది కాలనీల్లో […] The post నేటి నుంచి దుకాణాల వేలం appeared first on Visalaandhra .
ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం
. పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి. ఈవీ బస్సుల వినియోగం పెంచుదాం. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు, […] The post ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం appeared first on Visalaandhra .
కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణంరూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్డీఏ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్ను […] The post అమరావతికి మరో కీలక ప్రాజెక్టు appeared first on Visalaandhra .
లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్పేట ఆర్టీసీ డిపోకు […] The post లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ […] The post అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం appeared first on Visalaandhra .
. ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్ల చెలగాటం. మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. 28వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంకింగ్. ఎఫఎసఓలు, ఏఎఫ్సీలు విజిటింగ్లకే పరిమితం. 30 శాతం లైసెన్సులు లేకుండానే వ్యాపారం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ అపహాస్యమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను కట్టడి చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాల్లో నాణ్యతలేని పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతుంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు […] The post ఆహార భద్రత డొల్ల! appeared first on Visalaandhra .
400 Tankers Struck : మళ్లీ హోర్ముజ్ బ్లాక్ Andhra Prabha News
400 Tankers Struck : మళ్లీ హోర్ముజ్ బ్లాక్ Andhra Prabha News
డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. హోర్మూజ్ జలసంధిలో […] The post ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం appeared first on Visalaandhra .
వాషింగ్టన్: ఇరాక్లో గత వారం కిడ్నాప్కు గురైన అమెరికా జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ సురక్షితంగా విడుదల య్యారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం అధికారికంగా ధ్రువీకరిం చారు. ఆమె విడుదలతో తామంతా ఊపిరి పీల్చుకున్నామని, ఇరాక్ నుంచి ఆమె సురక్షితంగా బయటకు వచ్చేం దుకు పూర్తి సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. మార్చి 31న బాగ్దాద్లోని ఒక వీధిలో ఇరాన్ మద్దతున్న కతైబ్ హిజ్బుల్లా అనే మిలీషియా గ్రూప్ షెల్లీ కిటిల్సన్ను […] The post అమెరికా జర్నలిస్ట్ విడుదల appeared first on Visalaandhra .
డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లొద్దు
యువతకు సూపర్స్టార్ రజనీకాంత్ సూచనచెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్… యువతకు మంచి సందేశం ఇచ్చారు. దయచేసి డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లవద్దని సూచించారు. చెన్నై విమానాశ్రయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కాలంలో యువత పెడదోవ పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేని జీవితం నరకప్రాయమవుతుందని హెచ్చరించారు. యువత కేవలం సినిమాల్లోని స్టంట్లు, నటుల వేషధారణ చూసి ప్రభావితమై బైక్ రేసింగ్ వంటి ప్రమాదకర పనులకు పాల్పడటం సరికాదని… అది ప్రాణాపాయానికి దారితీస్తుందని హితవు […] The post డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లొద్దు appeared first on Visalaandhra .
Iran War Strategy: ఆయుధ సేకరణం Andhra Prabha Top Story
Iran War Strategy: ఆయుధ సేకరణం Andhra Prabha Top Story (
Supriya reveals emotional journey behind production logo
Producer Supriya Yarlagadda became talk of the town post Adivi Sesh’s Dacoit pre-release event. While Mythri Ravi and Naga Vamsi words about her strictness went viral, her emotional side while revealing story behind logo of their production banner, SS Creations. She stated that she added Akkineni Nageswara Rao’s Panche, who guided them throughout their life, […] The post Supriya reveals emotional journey behind production logo appeared first on Telugu360 .
Active Producers Guild strongly Oppose Percentage Model
A week ago, the exhibitors of the single screens from Telangana announced that Hyderabad single screens will be in business on a percentage models and a list of 23 single screens are listed in the statement issued. The distributors will get 60 percent share from the Nett in the first week, 50 percent share in […] The post Active Producers Guild strongly Oppose Percentage Model appeared first on Telugu360 .
Iran Us Ceasefire : జలతంత్రం Andhra Prabha Top Story
Iran Us Ceasefire : జలతంత్రం Andhra Prabha Top Story ఆంధ్రప్రభ,
వన్ప్లస్ నోర్డ్ 6 స్మార్ట్ఫోన్ ఆవిష్కరణ
న్యూదిల్లీ: వన్ప్లస్ ఇండియా ఈరోజు నోర్డ్ 6ను ఆవిష్కరించింది. ఆధునిక హస్ట్లర్కు స్పష్టమైన ఆధిక్యం అందించేందుకు రూపొందించబడిన ఈ స్మార్ట్ఫోన్, విభాగంలో తొలిసారిగా 165 ఎఫ్.పి.ఎస్. గేమింగ్ అనుభవాన్ని అందిస్తూ అద్భుతమైన గ్రాఫిక్ స్మూత్నెస్ను ఇస్తుంది. అలాగే, 9000 ఎం ఏ హెచ్ సామర్థ్యంతో ఉన్న, తన విభాగంలోనే అతిపెద్దదయిన భారీ ఎస్.ఐ.కార్బన్, అనేది పవర్పై ఉన్న ఆందోళనకు ముగింపు పలుకుతుంది. వన్ప్లస్ నోర్డ్ 6, మధ్యశ్రేణి ఫోన్లపై ఉన్న అంచనాలను కొత్తగా నిర్వచిస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ […] The post వన్ప్లస్ నోర్డ్ 6 స్మార్ట్ఫోన్ ఆవిష్కరణ appeared first on Visalaandhra .
టాటా మోటార్స్ టాటా ఇంట్రా ఈవీ పికప్ విడుదల
ముంబయి: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, సరికొత్త టాటా ఇంట్రా ఈవీ పికప్ను ప్రారంభిస్తూ ఎలక్ట్రిక్ వాణిజ్య చలనశీలతలో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసింది. ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాల పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ, ఈ కొత్త పికప్ విశ్వసనీయ ఇంట్రా ప్లాట్ఫారమ్ బలాన్ని, ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్తో కలిపి అందిస్తోంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న కార్గో అవసరాలను తీర్చేందుకు నమ్మదగిన, అధిక ఆదాయం సాధించే పరిష్కారంగా ఇది రూపుదిద్దుకుంది. […] The post టాటా మోటార్స్ టాటా ఇంట్రా ఈవీ పికప్ విడుదల appeared first on Visalaandhra .
ఖరీఫ్ ఎరువులపై రూ 41,534 కోట్ల సబ్సిడీ ఖరారు
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో ఖరీఫ్ పంటకాలానికి ఎరువులలో సబ్సిడీని 12 శాతం పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖరీఫ్లో నత్రజని, భాస్వర (పి. కె) ఎరువులపై ప్రభుత్వ సబ్సిడీ పెరుగుదల రూ 41,534 కోట్లుగా నిర్ణయించారు. గల్ఫ్ యుద్ధంతో సరఫరాల ఆటంకాలతో అంతర్జాయ స్థాయి ధరల ప్రభావం ఎరువులపై పడకుండా ఉండేందుకు సబ్సిడీని పెంచారు. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటకాలానికి నత్రజని ఆధారిత ఎరువులపై కిలోకు రూ 47.32 పైసలు చొప్పున పెరుగుతుంది. ఇక ఫాస్పేట్ ఎరువులపై సబ్సిడీలు కిలోకు రూ 52.76 చొప్పున పెరుగుతాయని కేబినెట్ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఇక సల్ఫర్ ఎరువులపై సబ్సిడీలు రూ 3.16గా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ పంటల పోషక ప్రతిపాదిత సబ్సిడీ (ఎన్బిఎస్) స్కీమ్ పరిధిలో ఈ సబ్సిడీల పెంపుదల ఖరారు చేశారు. ఈ పథకం 2010 ఏప్రిల్ నుంచి అమలులో ఉంది. గత ఏడాది 2025 ఖరీఫ్ సీజన్ సబ్సిడీ మొత్తంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఏడాది పెంపుదల రూ 4317 కోట్లుగా ఉందని తెలిపారు.ఎన్బిఎస్ స్కీమ్ పరిధిలోకి వచ్చే 28 రకాల ఎరువుల సబ్సిడీలకు ఈ పెంపుదల వర్తిస్తుంది. కోవిడ్ దశలో అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు ప్రత్యేకించి డిఎపి వంటి వాటి దరలు గణనీయంగా పెరిగాయి. అయితే దేశంలో 50 కిలోల ఎరువుల సంచి రిటైల్ ధర రూ 1350గానే ఉంచామని మంత్రి వివరించారు. ఇప్పుడు యుద్ధం దశలోనూ రైతుల ఎరువులపై భారం పడకుండా పలు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేబినెట్లో రెండు ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో రూ 40000 కోట్ల వ్యయ అంచనాలతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన అంశం కూడా ఉంది. జైపూర్ మెట్రోరైలు రెండో దశకు కూడా ఆమోదం వెలువడిందని కేబినెట్ తరువాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వెస్ట్బెంగాల్ జార్ఖండ్ మల్టీ ట్రాకింగ్ రైలు ప్రాజెక్టుకు కూడా గ్రీన్సిగ్నల్ వెలువడింది.రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీ రెట్టింపు సామర్థపు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజస్థాన్ రిఫైనరీ డబ్లింగ్ పనులకు రూ 79,450 కోట్ల వ్యయ అంచనాలకు ఆమోదం తెలిపారు. హెచ్పిసిఎల్ నుంచి అదనపు ఈక్విటీ మద్దతు కూడా ఈ ప్రాజెక్టుకు దక్కుతుంది. ఈ మేరకు ఇప్పుడు హెచ్సిఎల్ నుంచి ఈ ప్రాజెక్టులో రూ 19600 కోట్ల వరకూ ఈక్విటీ ఉంటుంది. ఈ రిఫైనరీకి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న ప్రారంభోత్సవం జరుపుతారు.
జీవన్ రెడ్డికి కెటిఆర్ ఫోన్.. బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫోన్ కాల్ మాట్లాడారు. రేపు(ఏప్రిల్ 9) కెటిఆర్ జగిత్యాల పర్యటనలో భాగంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసానికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీలోకి కెటిఆర్ ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో తనకు అవమానం జరిగిందని.. ఆ పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన బిఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కెటిఆర్, జీవన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.
వెల్కమ్హోటల్ బ్రాండ్ 50వ హోటల్ మైలురాయి: ఐటీసీ హోటల్స్ వేడుకలు
న్యూదిల్లీ: ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ (ఐటీసీహెచఎల్) భారతదేశంలో వెల్కమ్హోటల్ బ్రాండ్ కోసం 50వ హోటల్ మైలురాయి ఒప్పందాన్ని ఈరోజు ప్రకటించింది. పెరుగుతున్న ఈ బ్రాండ్ పోర్ట్ఫోలియోకు షిర్డీ మరియు భువనేశ్వర్లలో కొత్త హోటళ్లను చేర్చింది. వెల్కమ్హోటల్ బ్రాండ్ కోసం త్వరలో ప్రారంభం కానున్న గమ్యస్థానాలలో సిక్కింలోని గాంగ్టక్, మధ్యప్రదేశ్లోని భోపాల్, గ్వాలియర్ ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డీలో మెస్సర్స్ శాండీ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న 73 గదుల హోటల్ను నిర్వహించడానికి ఐటీసీహెచఎల్ ఇటీవల వారితో ఖచ్చితమైన ఒప్పందాలను […] The post వెల్కమ్హోటల్ బ్రాండ్ 50వ హోటల్ మైలురాయి: ఐటీసీ హోటల్స్ వేడుకలు appeared first on Visalaandhra .
పాస్పోర్ట్ కేసులో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔట్ పోస్ట్ సీఐ సంపత్తి కనుకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇటీవల ఫేక్ పాస్పోర్ట్ కేసులో నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన కేరళకు చెందిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్పై బయటికి వచ్చిన వ్యక్తిని ప్రతి ఆదివారం పోలీస్స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు సూచించారు, చార్జిషీట్ ఫైల్ చేయడం కోసం బాధితుడిని సీఐ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర్లు మొదటగా రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబసభ్యుల పేర్లు కూడా చార్జిషీట్లో చేరుస్తామని వారు హెచ్చరించారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడగా రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా మంగళవారం రూ.2 లక్షల లంచం సీఐ కనకయ్య, ఎస్ఐ సిద్దేశ్వర్లు తీసుకుంటుండగా పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు.
సహజ రత్నాల విభాగంలో తనిష్క్ కొత్త అధ్యాయం ప్రారంభం
హైదరాబాద్: పవిత్రమైన అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో, టాటా సంస్థకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్, సహజ రత్నాల విభాగంలో తమ తాజా ఆభరణాలను రుక్మిణి వసంత్తో కలిసి ఆవిష్కరించింది. దక్షిణ భారతదేశంలో ఎల్లప్పుడూ రత్నాలు, కేవలం అలంకరణకు మించినవి; అవి సంప్రదాయం, గుర్తింపు, నిత్యజీవితపు సొగసుకు ప్రతీకలు. టెంపుల్ జ్యువెలరీ ప్రభావం నుండి ఉత్సాహభరితమైన వేడుకల వరకూ, ఈ ప్రాంతపు సౌందర్య భాషలో లోతుగా రత్నాలు పెనవేసుకుపోయాయి. కెంపులు, పచ్చలు, […] The post సహజ రత్నాల విభాగంలో తనిష్క్ కొత్త అధ్యాయం ప్రారంభం appeared first on Visalaandhra .

33 C