SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

ఆ ఐదూళ్లను తెలంగాణలో కలపండి

 ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల భౌగోళికంగా భద్రాచలంతో కలిసి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం తర్వాత అక్కడి ప్రజలు పాలనాపరంగా అవస్థలు పడుతున్నారు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సమస్యను పరిష్కరించండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ మన తెలంగాణ/హైదరాబాద్: భద్రాచలం ప ట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు రాష్ట్ర వ్వయసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ దివారం లేఖ రాశారు. భద్రాచలం పట్టణానికి అనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండా ల పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ రా ష్ట్రంతో కలిసి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని వివరించారు. భద్రాచలం ప ట్టణం తెలంగాణలోనే ఉన్నా, భద్రాచలం గ్రా మం, పట్టణం మినహా భద్రాచలం మండలంలోని మిగిలిన అన్ని రెవెన్యూ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసినట్లు గుర్తు చేశారు. సుమారు 19 రెవెన్యూ గ్రామాలను కలిగి ఉన్న ఈ గ్రామ పంచాయతీలు, తెలంగాణ భూభాగంలోని రెండు ప్రాంతాల మధ్య ఒక విలక్షణమైన భౌగోళిక ప్రదేశంలో నెలకొని ఉన్నాయని, వీటి మిగిలిన సరిహద్దులు గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని కలిగి ఉన్నట్లు వివరించారు. దీంతో స్థానిక ప్రజలకు అనవసరమయిన కష్టాలను కలిగిస్తుందని చెప్పారు. ఈ గ్రామ పంచాయతీలు నివాస ప్రాంతాలు రాకపోకలు, పరిపాలన, జీవనోపాధి, ప్రజా సేవల కోసం పూర్తిగా భద్రాచలంపైనే ఆధారపడి ఉన్నాయని, ఈ క్రమంలో వీటిని ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించడం స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో భద్రాచలం పట్టణంతో తమకున్న చారిత్రక అనుబంధం, ప్రధానంగా షెడ్యూల్ తెగలకు చెందిన గ్రామ పంచాయతీలలోని ప్రజలు తెలంగాణలో భాగం కావాలని కోరుతూ స్థానిక నివాసితులు పలుమార్లు శాంతియుత ధర్నాలు, ప్రదర్శనలు కూడా నిర్వహించిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. ప్రభావిత గ్రామస్థులు ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా స్థాయి పరిపాలన, పనుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుమారు 282 కిలోమీటర్ల (రోడ్డు మార్గంలో సుమారు 8 గంటల ప్రయాణం) దూరంలో ఉండగా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల (రోడ్డు మార్గంలో సుమారు గంట ప్రయాణం) దూరంలో ఉందని వివరించారు. ప్రస్తుత పరిస్థితులతో వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులను రవాణా చేసేటప్పుడు స్థానిక గిరిజన జనాభాకు పదేపదే తనిఖీలు, రాకపోకలకు సంబంధించిన ఇబ్బందులతో సహా, అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు సమీపంలో ఉండటం, చారిత్రాత్మకంగా వామపక్ష తీవ్రవాదం ప్రభావానికి లోనవడం వల్ల ఈ ప్రాంతం అంతర్గత భద్రత దృష్ట్యా సున్నితమైనదని, దీంతో పోలీసులులకు భద్రతాపరమయిన సవాళ్లను సృష్టిస్తాయని పేర్కొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం, తెలంగాణలో ఉండగా ఆలయానికి సంబంధించిన భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నంలో ఉన్నాయని, ఆలయ వ్యవహారాలు, అనుబంధ భూముల పరిపాలన కోసం, ఈ ప్రాంతాన్ని తెలంగాణలో తిరిగి విలీనం చేయడం తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని లేకపోతే రాబోయే సంవత్సరాలలో ప్రభావిత గ్రామాలు, గిరిజన నివాసాలకు దీర్ఘకాలిక అన్యాయం జరుగుతుందని మంత్రి తెలిపారు.

మన తెలంగాణ 6 Apr 2026 6:00 am

6thApril2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

6thApril2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 6thApril2026 |

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:00 am

నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో పొంగులేటి కుమారుడి ప్రమేయం లేదు

 కోహినూర్ గ్రూప్ వివరణ - మన తెలంగాణ / హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ భూముల వ్యవహారంలో బిఆర్‌ఎస్ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితం మాత్రమేనని, ఇందులో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కోహినూర్ గ్రూప్‌ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. 2021లోనే స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మాణం జరిగిందని వెల్లడించింది. రాజకీయ లబ్ధి కోసం బిఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని కోహినూర్ గ్రూప్ పేర్కొంది. 2015లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో రాజా శివ్ రాజ్ బహదూర్ వారసులు హక్కుదారులుగా గుర్తించబడ్డారని వెల్లడించింది. 2015 వరకు భూవివాదం కోర్టులో ఉన్న కారణంగా ల్యాండ్ రిఫామ్స్ చట్టం వర్తించదని పేర్కొంది. వ్యవసాయానికి అనుకూలం కాని భూమి కావడం, ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫామ్స్ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. కేసు విచారణలో ఉన్న సమయంలో మీడియా ట్రయల్ నిర్వహించడం సరికాదని పేర్కొంది. ఎక్యూ స్కేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2021లో మొత్తం స్థలాం చుట్టూ రేకులతో ప్రహరీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ వెబ్‌సైట్‌లోని టైమ్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. ఈ ప్రహరీ పనులు 2022మే నెలలో పూర్తయ్యాయని తెలిపింది. ఎక్యూ స్క్వేర్ రియల్టర్స్, దాని అనుబంధ సంస్థ క్రిస్టల్ మ్యాన్షన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో 2021 డిసెంబర్ 6 నుంచి 2023 మార్చి 1వరకు పొంగులేటి హర్ష రెడ్డి అదనపు డైరెక్టర్‌గా ఉన్నారని, అనంతరం బోర్డు నుంచి రాజీనామా చేశారని తెలిపింది. ఆ వివరాలు ఎంసిఎ రికార్డుల్లో నమోదయ్యాయని వివరించింది. నాదర్గుల్ భూ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ప్రేరేపితంగానే నిరాధార ఆరోపణలు చేస్తూ పొంగులేటికి హర్ష రెడ్డికి ఆపాదిస్తున్నారని పేర్కొంది. ఈ భూమి అసలు రాజా శివ్ రాజ్ బహదూర్‌కు చెందిన ప్రైవేట్ ఆస్తి అని, 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆయన వారసులే హక్కుదారులని ధ్రువీకరించబడిందని తెలిపింది. అసలు ఈ భూమిపై వివాదం 2005లో ఓస్ నెంబర్ 155తో ప్రారంభమైందని తెలిపింది. యాజమాన్యం, ఆక్యుపెన్సీ హక్కులపై డిక్లరేషన్, రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, అయితే ఏప్రిల్ 30, 2007న ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టివేసిందని తెలిపింది. దీనిపై హైకోర్టులో ఎస్ నంబర్ 274/2007 ద్వారా అప్పీల్ దాఖలైందని, డివిజన్ బెంచ్‌లో భిన్నాభిప్రాయాల కారణంగా కేసు మూడో న్యాయమూర్తికి వెళ్లిందని వివరించింది. 19 డిసెంబర్ 2011న వెలువడిన తీర్పులో పిటిషనర్లను పూర్తి యజమానులుగా కోర్టు గుర్తించిందని, రాష్ట్రం జోక్యం చేసుకోకుండా శాశ్వత ఇంజంక్షన్ కూడా మంజూరు చేసిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎపిఐఐసి 2013లో దాఖలు చేసిన సివిల్ అప్పీలు (2963, 2964)ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, భూ యజమానులకు ఆక్యుపెన్సీ హక్కులు వర్తించేలా ఉత్తర్వులిచ్చిందని తెలిపింది. భూమి విస్తీర్ణం అధికంగా ఉండటంతో ల్యాండ్ రిఫారమ్స్ చట్టం వర్తించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు, 2015 వరకు భూమి వివాదంలో ఉండటంతో ఆ చట్టం అమలు కాదని తెలిపింది. 2020 జనవరి 9న ల్యాండ్ రిఫారమ్స్ ట్రైబ్యునల్ (ఎల్‌ఆర్‌టి) నోటీసులు జారీ చేసిందని, దీనిపై భూయజమానులు అప్పీల్ దాఖలు చేయగా అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని తెలిపింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి పాట్ ఖరాబ్‌గా (అంటే వ్యవసాయానికి అనుకూలం కాని భూమిగా) వర్గీకరించబడిందని కోహినూర్ గ్రూప్ వివరణ ఇచ్చింది. ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫారమ్స్ చట్టం వర్తించదని, ఈ భూమిపై కొందరు చేసిన కొనుగోళ్లలో న్యాయపరమైన లోపాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించింది. నాలా కన్వర్షన్ అనుమతి తిరస్కరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లిందని, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కోహిర్‌నూర్ గ్రూపు పేర్కొంది. 

మన తెలంగాణ 6 Apr 2026 5:40 am

భట్టి పీపుల్స్ మార్చ్‌కు మూడేళ్లు

కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి 2023లో పాదయాత్ర నేడు బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరిలో బహిరంగ సభ హాజరు కానున్న సిఎం రేవంత్ పలు పథకాల లబ్దిదారులకు పత్రాల పంపిణీ మన తెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి వేదికగా పీపుల్స్ మార్చ్ పేరిట అప్పటి ప్రధాన ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తికానున్న సందర్భంగా పిప్పిరి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు సిఎం రేవంత్ రెడ్డి హాజరై పాదయాత్రలో ఇచ్చిన సంక్షేమ పథకాల తాలుకా అర్హులయిన లబ్దిదారులకు పత్రాలు అందించనున్నారు. 109 రోజులు.. 1,364 కిలోమీటర్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమయి 2023 జులై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగిసింది. మొత్తం 109 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భట్టి విక్రమార్క సుమారు 1,364 కిలోమీటర్లు నడిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తం 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటి ముందుకు సాగింది. ఈ యాత్రలో ఆయన 700 పైగా గ్రామాలను సందర్శించి వందకు పైగా కార్నర్ సమావేశాల్లో హాజరైన అశేష జన వాహిని ఉద్దేశించి ప్రసంగించారు. పాదయాత్రను మరింత ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో అధిష్టానం సూచన తో మంచిర్యాల, షాద్నగర్, ఖమ్మం, మూడు చోట్ల భారీ బహిరంగ సభలు సైతం నిర్వహించారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను వినడమే కాకుండా అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా హామీల ద్వారా డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క నాడు ప్రజలకు వివరించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు పునరంకితం అవుతూ మరోసారి పిప్పిరి గ్రామంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు అమలు చేసే పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. జలయజ్ఞం 2004 కార్యక్రమంలో ఆడ వద్ద కొమరం భీం ప్రాజెక్టులు ప్రారంభమైనప్పటికీ గత పది సంవత్సరాలుగా కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కుడి ఎడమ కాలువలు వెంటనే పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటి సిఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా ఉన్న చికుమాను, పులిమడుగు, కుఫ్టీ త్రివేణి సంగమం ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ రకాల అనుమతులను ఈ సందర్భంగా మంజూరు చేయనున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మర్చిపోలేని మహాయజ్ఞం : భట్టి విక్రమార్క ఆదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం వరకు 1364 కిలోమీటర్ల మేర జరిగిన పీపుల్స్ మార్చ్ పాద యాత్ర జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞమని డిప్యూటి సిఎం భట్టి అన్నారు. తెలంగాణ మట్టి బిడ్డలకు, నాతో నడిచిన అశేష జనవాహినికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ నాడు పాదాలకు బొబ్బలు ఎక్కినా, శరీరం అలసిపోయినా నన్ను ముందుకు నడిపించింది ప్రజల ఆత్మీయత మాత్రమేనని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 6 Apr 2026 5:20 am

డిజిటల్ జనగణనలో ‘కుల గణన’ ఉంటేనే సామాజిక న్యాయం

దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన ‘జనగణన 2027’ ప్రక్రియ గురించి భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ కీలక …

జనం సాక్షి 6 Apr 2026 5:18 am

రూ.7వేల కోట్ల భూమికి ఎసరు

 నాదర్‌గుల్‌లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు యత్నాలు ఈ భారీ భూ కుంభకోణం వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు సిఎం వెంటనే చర్యలు చేపట్టాలి హైడ్రా కమిషనర్ తక్షణమే కలుగజేసుకోవాలి లేకపోతే మా ఎంఎల్‌ఎలతో కలిసి అక్కడికి వెళ్తాం: బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : నాదర్‌గుల్‌లో రూ. 7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు ఆరోపించారు. హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ అధికార బలంతో బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ భారీ భూ కుంభకోణం, కబ్జా కంపెనీల వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం ఉన్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కూలగొట్టే హైడ్రాకు .. అధికార పార్టీ నేతల వేల కోట్ల కబ్జాలు, చెరువుల ఆక్రమణలు ఎందుకు కనిపించదని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాదారులను అరెస్ట్ చేసి, రైతులను భూముల్లోకి అనుమతించాలని అన్నారు. నాదర్‌గుల్ భూములపై సోమవారం ఉదయం వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోకపోతే.. ఎంఎల్‌ఎలతో కలిసి బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మండిపడ్డారు. ఒకవైపు పారిశ్రామిక వేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతోందన్నారు. రక్షకులే భక్షకులుగా మారారని విమర్శించారు. నాదర్‌గుల్ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఎపిఐఐసికి అప్పగించారని చెప్పారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఆ భూములను కంటికి రెప్పలా కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని పేర్కొన్నారు. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. పేదలకు సాయం చేయాల్సిన పోలీసులు పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నాదర్‌గుల్ భూములు తనవని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెబుతుండగా, 2005లోనే అప్పటి ఆర్డీవో ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారు.2017లో సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వానిదేనని చెప్పింది. 373 ఎకరాలు ఉండే అవకాశం లేదు రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని హరీష్‌రావు అన్నారు. కానీ, 2016లో శివరాజ్ బహదూర్ ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ అనే కంపెనీలకు విక్రయించారని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఈ విక్రయాలు చెల్లవని, ఇది సెక్షన్ 22ఎ కింద నిషేధిత జాబితాలో ఉంటుందని కందుకూరు ఆర్‌డిఒ తేల్చిచెప్పారని అన్నారు. ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్లగా.. ఆర్డీవో నిర్ణయమే సరైనదని, ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ స్పష్టం చేశాయని తెలిపారు. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించిందని అన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారని, ప్రస్తుతం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం వద్ద ఈ కేసు 2026 ఏప్రిల్ 7న విచారణకు పెండింగ్‌లో ఉందని అన్నారు. సుప్రీంకోర్టులో వాళ్లకు ఎలాంటి స్టే రాలేదు కాబట్టి హైకోర్టు తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కందుకూరు ఆర్డీవో దాఖలు చేసిన అఫిడవిట్ లోనూ ఇది ప్రభుత్వ భూమి అనే స్పష్టం చేశారని, ఆదివారం ఉదయం భూభారతి వెబ్‌సైట్‌లో చూసినా ఇది ప్రభుత్వ భూమి నిషేదితగానే చూపిస్తోందని తెలిపారు.

మన తెలంగాణ 6 Apr 2026 5:00 am

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍:ଭାଇରାଲ ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ, ଦିଲ୍ଲୀରେ ଘଟିଥିବା ହତ୍ୟାକାଣ୍ଡ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ

ହୋଲିରେ ଦୁଇଟି ପରିବାର ମଧ୍ୟରେ ସଂଘର୍ଷ ସମୟରେ ଜଣେ ୨୬ ବର୍ଷୀୟ ଯୁବକଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ପଶ୍ଚିମ ଦିଲ୍ଲୀର ଉତ୍ତମ ନଗରରେ ଉତ୍ତେଜନା ପ୍ରକାଶ ପାଇଥିଲା । ହିନ୍ଦୁ ଧର୍ମର ବିଭିନ୍ନ ସଂଗଠନ ପ୍ରତିବାଦ କରିବା ସହ ମୃତ୍ୟୁବରଣ କରିଥିବା ଯୁବକ ତରୁଣଙ୍କ ହତ୍ୟାରେ ସମ୍ପୃକ୍ତ ସନ୍ଦିଗ୍ଧ ବ୍ୟକ୍ତିଙ୍କ ସହ ଜଡିତ ଏକ ଘରକୁ ନିଆଁ ଲଗାଇ ଦେଇଥିଲେ । ଉତ୍ତେଜନାପୂର୍ଣ୍ଣ ଅଞ୍ଚଳରେ ପୋଲିସ ମୁତୟନ ପରେ ହିଁ ସ୍ୱାଭାବିକ ଅବସ୍ଥା ଫେରି ଆସିଥିଲା । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ଭିଡିଓରେ ଏକ ଜନ ସମୁଦ୍ର ଭିତରେ କିଛି ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଦଉଡ଼ିରେ ବନ୍ଧା ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆଉ କିଛି ବ୍ୟକ୍ତି ଏକ ବାଡ଼ି ଦ୍ୱାରା ମାଡ଼ ମାରୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ମାଡ଼ ମାରୁଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ପଛପଟେ ଆଉକିଛି ବ୍ୟକ୍ତି ପୋଲିସ ପୋଷାକରେ ଚାଲୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟିକୁ ଦିଲ୍ଲୀର ଉତ୍ତମ ନଗରର ଘଟଣା ସହ ଯୋଡ଼ା ଯାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଘଟଣାରେ ଜଡ଼ିତ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ପୋଲିସ ଶାସ୍ତି ଦେଉଥିବାର ଏହି ଭିଡିଓ ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ସେହିପରି ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଚି, ଉତ୍ତମ ନଗରରେ ଯେଉଁ ଦଙ୍ଗା ହେଉଥିଲା । ଉକ୍ତ ଘଟଣାରେ ଜଡ଼ିତ ଦଙ୍ଗାକାରୀଙ୍କୁ ପୋଲିସ ଗିରଫ କରି ସର୍ବସାଧାରଣ ସ୍ଥାନରେ ଉତ୍ତମ ମଧ୍ୟମ ଦେଉଛି । ଯାହାର ଏକ ଲିଙ୍କ ଏଠାରେ  ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ଦିଲ୍ଲୀ ଉତ୍ତମ ନଗରରେ ଘଟିଥିବା ଘଟଣା ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଉକ୍ତ ଦାବିର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଏଭଳି କୌଣସି ଦଣ୍ଡ ଦେବାର ସୂଚନା ଆମର ହସ୍ତଗତ ହୋଇ ନଥିଲା । ଯଦି ଏଭଳିକୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । #गुजरात पाटन जिले के चाणस्मा तालुका के जीलिया गांव में 15 मार्च 2026 की रात एक फार्महाउस पर 15 से 20 हमलावरों ने हथियारों और पत्थरों से हमला किया, कई लोगों को पीटा औऱ तोड़फोड़ करके भारी नुकसान किया। मंदिर के चंदे को लेकर पुरानी रंजिश के चलते यह हमला किया गया था। इसमें… pic.twitter.com/Svk5LziZOf — Abhimanyu Singh (@Abhimanyu1305) March 19, 2026 ଅଭିମନ୍ୟୁ ସିଂହ ନାମକ ଜଣେ ସାମ୍ବାଦିକ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ୧୯ ମାର୍ଚ୍ଚ ୨୦୨୬ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରି ଅଭିମନ୍ୟୁ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ । ୧୫ ମାର୍ଚ୍ଚ, ୨୦୨୬ ରାତିରେ, ପାଟନ ଜିଲ୍ଲାର ଜିଲିଆ ଗ୍ରାମସ୍ଥିତ ଏକ ଫାର୍ମହାଉସରେ ୧୫ ରୁ ୨୦ ଜଣ ଦୁର୍ବୃତ୍ତ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଏବଂ ପଥର ବ୍ୟବହାର କରି ଆକ୍ରମଣ କରିଥିଲେ; ସେମାନେ ଅନେକ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆକ୍ରମଣ କରିଥିଲେ ଏବଂ ଭଙ୍ଗାରୁଜା ମାଧ୍ୟମରେ ବ୍ୟାପକ କ୍ଷତି କରିଥିଲେ। ମନ୍ଦିର ଦାନ ସମ୍ପର୍କିତ ଏକ ପୁରୁଣା ଶତ୍ରୁତା ଯୋଗୁଁ ଏହି ଆକ୍ରମଣ କରାଯାଇଥିଲା। କିଛି ସଂଗଠନ ଏବଂ ପ୍ରମୁଖ ରାଜନୈତିକ ଦଳ ସହିତ ଜଡିତ ବ୍ୟକ୍ତିମାନେ ଏହି ଘଟଣାରେ ସାମିଲ ଥିଲେ। ତୁରନ୍ତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରି, ପୋଲିସ ୧୮ ଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରିଥିଲା ​​ଏବଂ ମାର୍ଚ୍ଚ ୧୮ ରେ ସେମାନଙ୍କୁ କ୍ଷମା ମାଗିବାକୁ ବାଧ୍ୟ କରିବା ପାଇଁ ସାର୍ବଜନୀନ ଭାବରେ ପରେଡ କରିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁ ମାତ୍ରାରେ ସମାନତା ଦେଖା ଯିବାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଦିନର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ କିୱାର୍ଡ ଗୁଡିକ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଆଉ ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୯ ମାର୍ଚ୍ଚ ୨୦୨୬ରେ ଆଇବିଏନ ୨୪× ୭ ନିୟୁଜ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆ ପେଜରେ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ଅପଲୋଡ଼ କରି ଆଇବିଏନ ଉଲ୍ଲେଖ କରିଛି, ଝିଲ୍ଲୀଆ ଗ୍ରାମରେ ଥିବା ଫାର୍ମ ହାଉସରେ ଘଟିଥିବା ଅଘଟଣ ପାଇଁ ଦୁର୍ବୃତ୍ତଙ୍କୁ ପୋଲିସ ସର୍ବସାଧାରଣରେ ଏଭଳି ଚଲାଇ ଚଲାଇ ନେଉଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଗୁଜରାଟର ଏକ ଫାର୍ମହାଉସରେ ଅଘଟଣ ଘଟାଇଥିବା ଦୁର୍ବୃତ୍ତଙ୍କୁ ପୋଲିସ ଚଲାଇ ଚଲାଇ ନେଉଥିବାର ଭିଡିଓ ଅଟେ। ଉକ୍ତ ଭିଡିଓ ସହ ଦିଲ୍ଲୀ ଉତ୍ତମ ନଗରୀରେ ଘଟିଥିବା ହତ୍ୟାକାଣ୍ଡ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । 

తెలుగు పోస్ట్ 5 Apr 2026 11:30 pm

టిఎంసిపై మోదీ తీవ్ర విమర్శలు... మహా జంగిల్‌రాజ్ అంటూ మండిపాటు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో న్యాయాధికారులను గంటల తరబడి ముట్టడి చేసిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఘటనను మహా జంగిల్‌రాజ్‌గా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. కూచ్ బెహార్ జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన మోదీ, న్యాయాధికారులే సురక్షితంగా లేనప్పుడు, సాధారణ ప్రజల భద్రత ఎలా ఉంటుందో ఆలోచించండి అని అన్నారు. మాల్దాలో జరిగిన ఘటన దేశమంతా చూసింది. న్యాయమూర్తులకే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడగలదు? అని ప్రశ్నించారు. టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ, బెంగాల్ వంటి పవిత్ర భూమిపై ప్రజాస్వామ్యం ప్రతిరోజూ దాడికి గురవుతోంది అని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యవస్థను పూర్తిగా కూల్చివేయడానికి టీఎంసీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మాల్దా ఘటనను ప్రస్తావిస్తూ, ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో పేర్లు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు కాళియాచక్-2 బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో న్యాయాధికారులను ముట్టడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఘటనను బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. అలాగే చొరబాటుదారుల సమస్యను లేవనెత్తిన మోదీ, టీఎంసీ పాలనలో సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పు ప్రమాదకరంగా మారింది. చొరబాటుదారులకు టీఎంసీ సిండికేట్ రక్షణ కల్పిస్తోంది అని ఆరోపించారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్)ను టీఎంసీ వ్యతిరేకించడం వెనుక ఉద్దేశ్యం చొరబాటుదారులను కాపాడడమేనని మోదీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. టీఎంసీబీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి.

మన తెలంగాణ 5 Apr 2026 11:13 pm

ఆప్ నేతలకు రాఘవ చద్ధా కౌంటర్

సినిమా ఇంకా ఉందని వీడియోలతో ఎదురుదాడి న్యూఢిల్లీ:  పంజాబ్ వేదికగా ఆమ్ ఆద్మీపార్టీలో సంక్షోభం ముదిరింది. ఆప్ రాజ్యసభ సభ్యులు ఎంపి రాఘవ చద్ధా ఆదివారం పార్టీ నాయకత్వంపై ఎదురుదాడికి దిగారు. సినిమా అయిపోలేదు. ఇంకా మిగిలే ఉంది. పైగా ఇప్పుడే అసలు సినిమా అంటూ వీడియోలు విడుదల చేశారు. పార్లమెంట్‌లో పంజాబ్ సమస్యలను రాఘవ ప్రస్తావించడం లేదనే పార్టీ అంతర్గత వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్లమెంట్‌లో తన ప్రసంగాలను తెలియచేస్తూ తాజాగా మూడు నిమిషాల వీడియోను వెలువరించారు. నిజానిజాలు ఈ దృశ్య శ్రవణ సాధనాలు తెలియచేస్తామని స్పందించారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో తప్పుడు కథలతో ప్రచారానికి దిగుతున్నారని, దీనికి తాను ప్రతిస్పందన ఇచ్చుకోవల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యసభలో ఆప్ ఉపనేత పదవి నుంచి ఇటీవల ఆయనను తొలిగించారు. ఇది వివాదాస్పదం అయింది. పంజాబ్ విషయాలను తాను ప్రస్తావించడం లేదని చెప్పడం కించపర్చడమే అని పేర్కొన్నారు. పంజాబ్ తనకు ఓ మైక్ అనుకోరాదని, అంతకు మించి ఓ ఇల్లు, తన ఆత్మ అని తెలిపిన రాఘవ పంజాబ్ కోసం స్పందించడం తన బాద్యత అని తేల్చిచెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరలు, భగత్ సింగ్‌కు భారత్ రత్న, భూగర్భ జలాల తగ్గుముఖం, నన్‌కానా సాహిబ్ కారిడార్ వంటి విషయాలపై మాట్లాడానని తెలిపారు. సంబంధిత వీడియోలు అందరి ముందుంచుతున్నాను మిత్రమా అని సవాలు విసిరారు. పంజాబ్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం వల్లనే రాజ్యసభకు చద్థా వెళ్లారని, అయితే ఆయన పల్లెతు మాట కూడా పంజాబ్ కోసం మాట్లాడటం లేదని పంజాబ్‌లోని ఆప్ నాయకత్వం విమర్శిస్తోంది. ఆయన మౌనం దేనికి సంకేతం అని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, ఆప్ పంజాబ్ విభాగం అధ్యక్షులు అమన్ ఆరోరా , సీనియర్ నేత కుల్దీప్ సింగ్ ధాలీవాల్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు గౌరవప్రదంగానే రాఘవ కౌంటర్ ఇచ్చారు. 

మన తెలంగాణ 5 Apr 2026 10:50 pm

ഫാക്ട് ചെക്ക്: രാമക്ഷേത്രം തകർത്ത് ബാബരി പണിയുന്ന വീഡിയോയുമായി കോൺഗ്രസ്? വസ്തുതയെന്ത്?

വയനാട്ടിൽ കോൺഗ്രസിൻ്റെ തെരഞ്ഞെടുപ്പ് പ്രചാരണ ഗാനം എന്ന നിലയിലാണ് വീഡിയോ വൈറലാവുന്നത്

తెలుగు పోస్ట్ 5 Apr 2026 10:43 pm

చందమామ పెద్దగా ఉంది... భూమి చిన్నగా కనిపిస్తుంది

నేడు ఆర్టిమిస్ తుది మజిలి కనువిందు హుస్టన్: తాము బయలుదేరిన భూమి మాకు చాలా చాలా చిన్నది అవుతోంది. చేరుకునే చంద్ర మండలం రానురానూ పెద్దగా కన్పిస్తోందని అర్టిమిస్ 2 వ్యోమగాములు ఆదివారం తెలిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక చంద్ర మండల యాత్ర విజయవంత దశకు చేరుకుంది. చంద్రుడి అధిదేవత ఆర్టిమిస్ పేరిట సాగే ఈ యాత్ర ఇప్పుడు చంద్రుడికి చేరుకునే దగ్గరలో ఉంది. సోమవారం ముగ్గురు అమెరికన్లు, ఓ కెనడియన్‌తో కూడిన వ్యోమగాముల బృందం తమ నిర్ణీత లక్షం చేరకుంటారు. చంద్ర మండలంపై పదిరోజుల పరిభమ్రణ సాగుతుంది. 53 ఏండ్ల క్రితపు అపోలో చంద్ర మండలయాత్రతో పోలిస్తే ఇది మరింత విజయంగా నిలుస్తుందని వీరు ఆశిస్తున్నారు. భూమిని దాటేసుకుని చంద్రుడి వద్దకు చేరుతున్నామని తెలిపిన వ్మోమగాములు తాము ఇంతకు ముందటి వ్యోమగాముల కన్నా అత్యధిక పరిశోధనలకు దిగుతామన్నారు. అంతా బాగానే సాగుతున్నా వీరి రాకెట్‌కు సంబంధించి ఇప్పుడు టాయ్‌లెట్‌లో సాంకేతిక సమస్యలతో మొరాయింపు సాగుతోంది. 

మన తెలంగాణ 5 Apr 2026 10:43 pm

కోల్‌కతా వరకు గురి చూసి కొడుతాం: పాక్ మంత్రి

లాహోర్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆరిఫ్ మరోసారి తీవ్ర స్థాయి హెచ్చరికలకు దిగారు. భారతదేశం మరోమారు ఎప్పుడైనా తమ దేశంపై చర్యకు దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చివరికి భారత్‌లోని కోల్‌కతా వంటి సుదూర ప్రాంతాలను కూడా గురిచూసి కొడుతామని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వంపై ఓ శక్తి అంతర్గత కుట్రకు దిగుతోందని, దీని వెనుక భారత్ ఉందనే విషయం తమకు తెలుస్తోందని చెప్పిన రక్షణ మంత్రి ఇందుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. పాకిస్థాన్‌పై బయటి నుంచి కానీ లోపలి నుంచి కానీ ఎటువంటి చర్యకు అయినా భారత్ పాల్పడితే తమ చర్యలు అత్యంత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా , ఉధృతంగా ఉంటాయని ఆయన తమ స్వస్థలం సియాల్‌కోట్‌లో మీడియా సమావేశంలో తెలిపారు.

మన తెలంగాణ 5 Apr 2026 10:38 pm

గుర్తింపు కార్డులతో 5 కిలోల సిలిండర్లు

వంటగ్యాస్ కొరత లేదు..ఆందోళన వద్దన్న కేంద్రం న్యూఢిల్లీ ః దేశంలో వంటగ్యాసు (ఎల్‌పిజి) సరఫరాను మరింత పెంచినట్లు కేంద్రం ఆదివారం ప్రకటించింది. కోట్లాది మంది నిరుపేద కార్మికుల కోసం 5 కిలోల ఎల్‌పిజి సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎల్‌పిజి కోటా అడుగంటిందనే భయాందోళనలు వద్దని ప్రజలను కోరారు. హర్మూజ్ జలసంధి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోందని చమురు మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇక గత నెల 23 నుంచి 5 కిలోల ఎల్‌పిజి సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకూ మొత్తం మీద దాదాపు ఆరులక్షల 60వేలకు పైగా ఈ సిలిండర్లను విక్రయించారు. పంపిణీదార్ల వద్దకు కార్మికులు ఎటువంటి నివాస పత్రాలు లేకుండా వెళ్లి , కేవలం తమ గుర్తింపు కార్డు చూపి ఈ చిన్న సిలిండర్లను తీసుకువెళ్లవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 90వేలకు పైగా 5 కిలోల సిలిండర్లు (వీటిని ఎఫ్‌టిఎల్ సిలిండర్లు కార్మికులకు అందించారు. అక్రమ నిల్వలను , బ్లాక్ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు గుర్తించి , తగు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని వలసకూలీలకు,, ఇంటి పనిమనుష్యులు, రోజువారి కూలీలలకు, విద్యార్థులకు , పలు వృత్తులలో ఉండి సరైన చిరునామా పత్రాలు లేని వారు నేరుగా వచ్చి5 కిలోల సిలిండర్లు తీసకువెళ్లవచ్చునని ఆలిండియా ఎల్‌పిజి పంపిణీదార్ల సమాఖ్య ప్రెసిడెంట్ చంద్ర ప్రకాశ్ ప్రకటించారు. ఈ చిన్న సిలిండర్ ధర తెలంగాణలో ఇప్పుడు రూ 335 నుంచి రూ 338 పై పైసలుగా పలుకుతోంది, వెంటనే వచ్చి తీసుకుపోవడానికి వీలైన ఈ సిలిండర్లపై ఇప్పుడు ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం అయింది. అయితే ఇది శ్రామిక వర్గాలకు పరిమితం అయింది.

మన తెలంగాణ 5 Apr 2026 10:32 pm

కువైట్‌లో ఇరాన్ కీలక దాడులు

విద్యుత్ కేంద్రాలు, పెట్రోకెమికల్ కేంద్రం ధ్వంసం ఇరాన్ ఆదివారం జరిపిన డ్రోన్ దాడులలో కువైట్‌కు చెందిన ఓ విద్యుత్ కేంద్రం, ఒక పెట్రోకెమికల్ స్థావరం దెబ్బతింది. ఒక జల శుద్ధి కర్మాగారాన్ని కూడా పనికి రాకుండా చేశారు. కువైట్‌లోని షువైఖ్ చమురు సెక్టార్ కాంప్లెక్స్‌లో కూడా డ్రోన్ దాడి జరిగింది. దీనితో మంటలు చెలరేగాయి. ఈ కాంప్లెక్స్‌లో చమురు మంత్రిత్వశాఖ, కువైట్ పెట్రోలియం ప్రధాన కార్యాలయం ఉన్నాయి. . ఈ విషయాన్ని కువైట్ విద్యుత్ మంత్రిత్వశాఖ కూడా నిర్థారించింది. . ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అరబ్ ఏమిరేట్స్‌లో బోరోగ్ పెట్రోకెమికల్ ప్లాంట్‌ను ఇరాన్ దెబ్బతీసింది. ఈ క్రమంలో ఆదివారం చెలరేగిన మంటలను తమ సహాయక బృందాలు అదుపులోకి తీసకువచ్చాయని ఏమిరేట్స్ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాకు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న యుఎఇకి చెందిన రువైస్ ఇంధన ప్లాంట్‌లో పని నిలిచిపోయింది. పలు గల్ఫ్ దేశాలలో పెట్రో కెమికల్ పరిశ్రమ అత్యంత కీలకమైన ఆర్థిక వనరుగా ఉంది. బహరైన్, యుఎఇ, ఇరాన్‌లలో ఈ యూనిట్లలోనే చమురు, సహజవాయువులను ప్లాస్టిక్స్, పాలిమిర్స్‌తో పాటు ఎరువులుగా మారుస్తారు. దీనితోనే ఎటా బిలియన్ డాలర్లలో ఎగుమతి ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇరాన్ తమ పెట్రోకెమికల్ యూనిట్స్‌ను శత్రుదాడుల నుంచి రక్షించుకుంటూనే గల్ఫ్ దేశాలలోని కీలక విభాగాలపై దాడులకు దిగుతోంది.

మన తెలంగాణ 5 Apr 2026 10:30 pm

Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story

Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story

ప్రభ న్యూస్ 5 Apr 2026 10:28 pm

క్రెడిట్ స్కోరు నుంచి రక్షించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రెడిట్ స్కోరు దెబ్బ నుంచి ఓ ఉత్తరాఖండ్ వాసిని రక్షించింది. ఏండ్ల తరబడిగా ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్ర సింగ్ పన్వర్‌కు ప్రతికూల క్రెడిట్ స్కోరు వస్తోంది. అయితే తనకు ఎటువంటి అప్పులు లేవని, చెల్లింపుల బాదరబందీకి దూరంగా ఉన్నానని అయితే ఈ పేలవ క్రెడిట్ స్కోర్ తనను వేధిస్తోందని పన్వర్ వాపోతున్నాడు. తాను ఈ క్రెడిట్ స్కోర్ ఆటంకాలతో రుణాలు పొందలేకపోతున్నానని , పైగా తప్పు చేశాననే భాధలో ఉన్నానని , తనను రక్షించాలని కోరుకున్నాడు. దీనిపై న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం స్పందించింది. 2020 నుంచి తన వెంటపడుతున్న ఈ బెడదపై రంగంలోకి దిగింది, ప్రధాన బ్యాంకులైన ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇతర బ్యాంకులను పన్వర్ బకాయిల గురించి వివరాలను ఆరా తీసింది. ఎటువంటి బకాయిలు లేవని వివరణ వచ్చింది. రుణాల విషయంలో క్లీన్‌చిట్ వచ్చింది. పన్వర్ రికార్డులను సవరించినట్లు, ఇక తాజా వివరణ ఆయనకు అందుతుందని సిబిల్ వర్గాలు తెలిపాయి. 

మన తెలంగాణ 5 Apr 2026 10:24 pm

సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ... బెంగళూరు 84/5

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఏడు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 84 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ సిబి జట్టు 250 పరుగులు చేసింది. ఆర్ సిబి జట్టు 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. కార్తీక్ శర్మ కూడా ఆరు పరుగులు చేసి మైదానం వీడాడు. ఈ మ్యాచ్ లో సంజూ శామ్సన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో శివమ్ దూబే(8), ప్రశాంత్ వీర్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బెంగళూరు బౌలర్లలో జాకోబ్ డఫీ రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. 

మన తెలంగాణ 5 Apr 2026 10:18 pm

ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోండి: ఓటర్ల పేర్ల తొలగింపుపై మమతా బెనర్జీ పిలుపు

సంసేర్‌గంజ్: ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రజలు ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలి అని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పేర్లు తొలగించిన వారు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని కూడా ఆమె సూచించారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సంసేర్‌గంజ్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రజల పేర్లు తొలగించిన వారిపై మీ ఓటుతో ప్రతిస్పందించండి. ఫలితాలు దానికి తగినట్లుగా ఉండాలి అని అన్నారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ రోజు మే 4 వరకు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుంటూ, ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపుకు ఆయన బాధ్యత వహిస్తున్నారని మమతా ఆరోపించారు. ధైర్యం ఉంటే నేరుగా పోటీ చేయండి అంటూ సవాల్ విసిరారు. అలాగే ఎన్నికల సమయంలో బూత్ ఏజెంట్లు బీజేపీకి అమ్ముడుపోకూడదని పార్టీ కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేశారు. ఈవీఎంలు కొన్ని చోట్ల పనిచేయకుండా చేయవచ్చని ఆరోపిస్తూ, అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అధికారులు మరమ్మత్తులు చేయడానికి అనుమతించకుండా, కొత్త యంత్రాలను డిమాండ్ చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు. సంసేర్‌గంజ్‌లో మొహమ్మద్ నూర్ ఆలం, ఫరక్కాలో మొహమ్మద్ అమీరుల్ ఇస్లాం అభ్యర్థిత్వానికి మద్దతుగా నిర్వహించిన సభలో మమతా, వక్ఫ్ (సవరణ) చట్టంపై తాను గట్టిగా పోరాడుతున్నానని తెలిపారు. తనపై ముస్లింల కోసం ఏమీ చేయలేదని బీజేపీ ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. వక్ఫ్ చట్టం అమలులో ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసను ప్రస్తావిస్తూ, కొంతమంది మరణించారని గుర్తుచేశారు. అయితే ఆ హింసకు తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల కారణంగా అభివృద్ధి పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఎన్నికల సంఘం దాదాపు 500 మంది అధికారులను బదిలీ చేసిందని ఆమె విమర్శించారు. ఈ మార్పులు తాత్కాలికమే, ఎన్నికల తర్వాత మళ్లీ పనులు ప్రారంభమవుతాయి అని చెప్పారు. ఎన్నికల జాబితాలో కొందరి పేర్లు తొలగిస్తూ, మరికొందరిని బెదిరిస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసిన మమత, 2024 లోక్‌సభ ఎన్నికల జాబితాతోనే అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అప్పటి జాబితాలో అక్రమ వలసదారులు ఉన్నారని భావిస్తే, ఆ ఓట్లతో గెలిచిన ప్రధాని, హోం మంత్రి ముందుగా రాజీనామా చేయాలి అని విమర్శించారు. ఎన్‌ఆర్‌సీ పేరుతో నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేయడానికి తాను ఎప్పటికీ అనుమతించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే రాష్ట్ర పాలనపై ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుందని కూడా ఆమె గుర్తుచేశారు.

మన తెలంగాణ 5 Apr 2026 10:10 pm

No Dollar : టోల్​ కట్టాల్సిందే Andhra Prabha News

No Dollar : టోల్​ కట్టాల్సిందే Andhra Prabha News ( ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 5 Apr 2026 10:10 pm

అమెరికా రక్షణ ఆపరేషన్ విఫలం..... ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా ఇరాన్ వ్యాఖ్యలు

టెహ్రాన్: ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించే ప్రయత్నం పూర్తిగా విఫలమైంది అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అయితే ఆ సిబ్బంది పట్టుబడ్డారని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. ఈ ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైలట్‌ను సురక్షితంగా రక్షించాం అని ప్రకటించిన కొన్ని గంటలకే వెలువడడం గమనార్హం. ఇరాన్ సాయుధ దళాల సమన్వయ కమాండ్ ‘ఖాతమ్ అల్-అన్‌బియా’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారీ టెలివిజన్ ద్వారా విడుదల చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ఇస్ఫహాన్‌లోని నిర్జన విమానాశ్రయం వద్ద కూలిన యుద్ధవిమాన పైలట్‌ను రక్షించే పేరిట అమెరికా చేపట్టిన మోసపూరిత ఆపరేషన్‌ను పూర్తిగా భగ్నం చేశాం అని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో రెండు సి-130 రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భూమిపై వాస్తవ పరిస్థితులు ఇరాన్ సైనిక శక్తి ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ, ట్రంప్ ఖాళీ ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మాధ్యమాలు విడుదల చేశాయి. ఎడారి ప్రాంతంలో కాలిపోయిన యుద్ధ వాహనాల అవశేషాలు, పొగలు కక్కుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. రక్షణ చర్య సమయంలో జరిగిన దాడుల్లో దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఐదుగురు మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే వారు పౌరులా లేక సైనికులా అన్నది స్పష్టత రాలేదు. ఇక శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన అమెరికా సిబ్బంది కోసం స్థానికులు కూడా శోధనలో పాల్గొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయుధాలు, జెండాలు పట్టుకున్న కొందరు ప్రజలు ఆ పైలట్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలను ప్రసారం చేశారు. ఈ పరిణామాలతో అమెరికాఇరాన్ మధ్య సమాచార యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు అమెరికా రక్షణ చర్య విజయవంతమైందని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ దాన్ని పూర్తిగా విఫలమైందని ప్రకటించడం గమనార్హం.

మన తెలంగాణ 5 Apr 2026 10:07 pm

హార్మూజ్ జలసంధి తెరవండి.. లేకుంటే.. ! ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని డిమాండ్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో ఆయన చేసిన ఘాటు, అసభ్య పదజాలం కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, మంగళవారం కీలక దశగా మారవచ్చు అని పేర్కొంటూ, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై విసృ్తత స్థాయి దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో పాటు ఇరాన్‌పై నేరుగా దూషణలు చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మూజ్ జలసంధి ఇటీవల ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, వాయువు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుంది. ప్రస్తుతం ఈ జలసంధిలో రవాణా తీవ్రంగా అంతరాయం ఎదుర్కొంటుండటంతో గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మాత్రమే కాకుండా దౌత్య పరంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికే అమెరికా హెచ్చరికలకు కఠినంగా స్పందిస్తుండగా, ఈ తాజా వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మన తెలంగాణ 5 Apr 2026 10:03 pm

ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత

మే 31 వరకు విమాన సేవలు రద్దు జెరూసలేం: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్‌కు వెళ్లే తన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. న్యూఢిల్లీతెల్ అవీవ్ మార్గంలో నడుస్తున్న విమానాలు మే 31 వరకు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ చాలా వరకు తమ సర్వీసులను నిలిపివేశాయి. కేవలం ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్ అల్, ఇజ్రా ఎయిర్, ఆర్కియా, ఎయిర్ హైఫా వంటి విమాన సంస్థలు మాత్రమే కఠిన పరిమితులతో సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న 40,000కు పైగా భారతీయులకు ఇబ్బందులను కలిగిస్తోంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో భారత్‌కు రావాలనుకునేవారు, లేదా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నుంచి బయటపడాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు రావాలనుకునే భారతీయులు ప్రస్తుతం జోర్డాన్ లేదా ఈజిప్ట్ మార్గం ద్వారా సరిహద్దులు దాటి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయక చర్యలు చేపడుతోంది. 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, భారతీయుల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇటీవల భారత రాయబారి జె.పీ. సింగ్, రాయబార బృందం ఇజ్రాయెల్‌లోని భారతీయ కార్మికులు, విద్యార్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించి వారి సమస్యలను వినిపించుకున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ, తరువాత కూడా నిరంతర సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, న్యూఢిల్లీతెల్ అవీవ్ నేరుగా విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి 1న మళ్లీ ప్రారంభమయ్యాయి. వారానికి నాలుగు సార్లు నడిచే ఈ విమానాలు ఆధునిక బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలతో నిర్వహిస్తున్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 10:02 pm

Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News

Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News

ప్రభ న్యూస్ 5 Apr 2026 9:08 pm

సింగరేణిలో కార్మికుల నియామకాలపై కాదు... మీ అవినీతిపై ఎంక్వైరీకి సిద్ధమా..?

నైనీ కోల్ బ్లాక్ అవినీతి బాగోతాన్ని బయట పెట్టటంతో భట్టి విక్రమార్క కార్మికులపై ఆక్రోషం పెంచుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐదు తీర్మానాలు మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణిలో డిపెండెంట్ కార్మికుల నియామకాల జోలికి వస్తే ప్రభుత్వం తాట తీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఎసిబి విచారణ చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేయటంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల నియామకాలపై కాదు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. నైనీ బ్లాక్ అవినీతి బాగోతాన్ని బయటపెటట్టంతోనే కార్మికులపై భట్టి విక్రమార్క ఆక్రోషం పెంచుకున్నారని, వారిపై కక్ష తీర్చుకునేందుకే విచారణ అంటూ డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు జరిగిన నష్టాన్ని కొంత పూడ్చేందుకు గత ప్రభుత్వం కొన్ని సడలింపులతో 20 వేల కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలసీపై ఎంక్వైయిరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రాణప్రదాయని అయిన సింగరేణిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి భావోద్వేగం, ప్రేమ, అవగాహన లేవని, అందుకే వారికి కార్మికుల సమస్యలు పట్టటం లేదన్నారు. రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి సంస్థ 11 వేల కోట్ల ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఒక మెగావాట్ విద్యుత్‌కు అయ్యే ఖర్చుకు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అదే విధంగా లిథియం రిఫైనరీ అంటూ అల్ట్ మిన్ అనే చిన్న కంపెనీతో రూ. 2250 కోట్ల ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. 27 లక్షలు కూడా ఆదాయం లేని సంస్థతో రూ. 2250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ రెండు ఒప్పందాల్లో అడ్డగోలుగా అవినీతి ఉందని ఆరోపించారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని...ఈ ఒప్పందాల వెనుక ఉన్న బడా బాబుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇచ్చే జీతాల కారణంగా సంస్థపై భారం పడుతుందన్నట్లుగా డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారని...కానీ ప్రభుత్వం చేతగానీ తనంతో సింగరేణిని సర్వనాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ కుంభకోణంలో రూ. 250 కోట్లు, అదనపు ఛార్జీలు వసూలు చేయలేక వెయ్యి కోట్లకు పైగా, లీకేజీ కారణంగా 24 కోట్లు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా 74 కోట్లు సింగరేణికి నష్టం చేశారని చెప్పారు. ఈ విషయం కాగ్ నివేదిక వెల్లండించిందని అన్నారు. సింగరేణి ఓబీ కాంట్రాక్టర్లు, నాయకులు, అధికారులు, సింగరేణిలో బొగ్గు మింగిన వాళ్లపై ముందు విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం చేతగాని తనంతోనే సింగరేణి కి ఇబ్బందులు తలెత్తాయని కవిత అన్నారు. ప్రభుత్వం దాదాపుగా 47 వేల కోట్ల రూపాయలు సింగరేణికి బకాయి ఉందని గుర్తుచేశారు. చెమట చిందించి సింగరేణిని లాభాల బాట పట్టిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తే తప్పేంటనీ ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడగానే సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ తగ్గించారని చెప్పారు. సింగరేణి విషయంలో ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని...కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేదని అన్నారు. ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా ఐదు తీర్మానాలు చేశారు. కేంద్రం లేబర్ కోడ్ కు సంబంధించి తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, మెడికల్ బోర్డును మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే ఏర్పాటు చేసి, పెండింగ్ కేసులు పరిష్కరించాలని, అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించాలని, సింగరేణి సంస్థ అల్ట్ మిన్ కంపెనీతో కంపెనీతో రూ. 2250 కోట్లతో చేసుకున్న ఒప్పందంపై శ్వేత పత్రం విడుదల చేయాలని, నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను కొత్త వచ్చే గనులను కూడా సింగరేణి సంస్థయే ఆపరేట్ చేయాలని తీర్మానాలు చేసినట్లు కవిత చెప్పారు. మరో 20 రోజుల్లో రాజకీయ శక్తిగా తాము రాబోతున్నామని, ఈ లోపు ప్రభుత్వం సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే బొగ్గు బాయి బాట పడతామని హెచ్చరించారు.

మన తెలంగాణ 5 Apr 2026 9:08 pm

భారత్ లో విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ

ఎఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్, అగ్రి-టెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యం విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొలంబియా బిజినెస్ స్కూల్‌లో జరిగిన ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభివర్ణించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్‌లో జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలం పాటు జరిగిన అభివృద్ధి గురించి కెటిఆర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం, తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం అని పేర్కొన్నారు. తాము అవకాశాల కోసం ఎదురుచూడలేదు అని, వాటిని అందిపుచ్చుకునేందుకు అద్భుతమైన పాలసీలను తయారు చేశామని తెలిపారు. మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని అన్నారు. 2027లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, కేవలం పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని చెప్పారు. రాష్ట్రాన్ని దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. భవిష్యత్తు గురించి కేవలం మాటలు చెప్పడం కంటే, దానిని మనమే సృష్టించడం ఉత్తమమైన మార్గం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు అన్న ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని ప్రస్తావిస్తూ.. దేశాభివృద్ధి అనేది కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా, ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. భారతదేశం 28 ఇంజన్లు కలిగిన ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ లాంటిదని, ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయని గుర్తుచేశారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారింది ఐటి, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని కెటిఆర్ తెలిపారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకాలను వివరించారు. ఐటీ ఎగుమతులు రూ. 57,000 కోట్ల నుండి రూ. 2.72 లక్షల కోట్లకు పెరిగాయని, ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుండి దాదాపు 10 లక్షలకు చేరుకుందని తెలిపారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్ కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు. హైదరాబాద్‌లో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారిందని వ్యాఖ్యానించారు. టీ -హబ్, వీ-హబ్, టీ- వర్క్, టాస్క్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు పెద్దపీట వేసిందని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్, డార్విన్ బాక్స్, జెనోటి, హైరేడియస్ వంటి యూనికార్న్ సంస్థలు హైదరాబాద్ నుండి పుట్టుకురావడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని, ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. ఏటా 10 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని, దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్, అగ్రి-టెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కేవలం ఆలోచనల దగ్గర ఆగిపోకుండా వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. నేటి సమస్యల పరిష్కారమే కాదు.. రేపటి అవసరాలకు తగిన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 5 Apr 2026 8:52 pm

Bellamkonda Sreenivas Engaged

Tollywood young actor Bellamkonda Sreenivas is all set to tie the knot soon. The actor has found his lady love Kavya Reddy and the duo got engaged today in a closed ceremony in Hyderabad. Close friends and family members of the Bellamkonda family attended the event. Bellamkonda Sreenivas and Kavya Reddy will get married on […] The post Bellamkonda Sreenivas Engaged appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 8:36 pm

కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి సీతక్కపై ఖర్గే ప్రశంసల జల్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేరళలోని ఇడుక్కి జిల్లా ఏలప్పారలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రశంసల వర్షం కురిపించారు. ఇడుపు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇడుక్కి జిల్లాలోని ఏలప్పార లొ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన సీతక్క తన కృషి, పట్టుదలతో ఎదిగిన గొప్ప నాయకురాలని ఆయన కొనియాడారు. సీతక్క ఒక గొప్ప ఫైటర్, హార్డ్‌వర్కింగ్ మహిళగా ఎప్పటికప్పుడు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపిస్తూ, అడవుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సేవలు అందిస్తున్న నాయకురాలని ఆయన అభినందించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి కష్టసుఖాలను అర్థం చేసుకుని సేవ చేయడం సీతక్క ప్రత్యేకత అని ఖర్గే చెప్పారు. ఆమె సేవాభావం, నిబద్ధత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా నియమించినట్లు ఆయన వెల్లడించారు.

మన తెలంగాణ 5 Apr 2026 8:27 pm

సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి : సిఎం రేవంత్ రెడ్డి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి మన తెలంగాణ / హైదరాబాద్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి రోజున జరుపుకునే సమతా దివస్ సందర్భంగా, సమాజంలోని వివక్షతకు వ్యతిరేకంగా సమానత్వం, ఐక్యత, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ని సిఎం కొనియాడు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, దళితుల హక్కుల కోసం వారు జీవితాంతం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. బాబూజీ స్పూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. సాంఘీక న్యాయయోధుడు జగ్జీవన్ రామ్ : గవర్నర్ నివాళి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగజీవన్ రామ్ ఒక మహోన్నత జాతీయ నాయకుడని, స్వాతంత్య్ర సమరయోధుడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సాంఘిక న్యాయ యోధుడని ఆయన అభివర్ణించారు. సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రగతిశీల భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో దోహదపడిందని కొనియాడారు. న్యాయమైన, సమ్మిళిత, సమాజాన్ని నిర్మించడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఆయన వారసత్వం శాశ్వతంగా నిలిచిపోవాలని గవర్నర్ ఆకాక్షించారు. జగ్జీవన్‌రామ్ జీవితం మనందరికీ స్పూర్తిదాయకం : వివేక్ బాబు జగ్జీవన్‌రామ్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అపారమైనవని కొనియాడారు. ఇందిరా గాంధీ కేబినెట్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా కూడా ఆయన అద్భుతమైన సేవలు అందించారని, ఆయన స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగుదామని అన్నారు. బిసి కమిషన్ ఘన నివాళి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ బిసి కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాల లక్ష్మి ఇతర అధికారులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ జి.నిరంజన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి, బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసారని, ఆయన కూతురు మీరా కుమారి లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషి చేశారని తెలిపారు. ఆర్‌టిసి బస్ భవన్ లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు‘ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పని చేసిన ధీరుడు, భారత మాజి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అని ఆర్‌టిసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం సంస్థ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబుజీ చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆర్‌టిసి ఈడి సిహెచ్ .వెంకన్న అన్నారు. అధికారులు, సిబ్బంది బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ భవన్‌లో జగ్జీవన్‌రామ్ జయంతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు కుమారరావు, మెట్టు సాయికుమార్, జగదీశ్వరరావు, సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 8:14 pm

Anil Ravipudi confirms Krithi Shetty in his Next

From the past couple of weeks, there are rumors that Krithi Shetty is in talks to play one of the female leads in Anil Ravipudi’s upcoming directorial. She is paired up beside Kalyanram in the film. During the pre-release event of LIK, Anil Ravipudi himself confirmed the news. He said that the news was out […] The post Anil Ravipudi confirms Krithi Shetty in his Next appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 8:05 pm

తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సిబి.. విరాట్ ఔట్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నైస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఆర్‌సిబిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్‌సిబి జట్టు నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే మ్యాట్ హెన్రీ వేసిన నాలుగో ఓవర్‌లో విరాట్ కోహ్లీ 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ ఓవర్‌లో కోహ్లీ (28) శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పవర్‌ప్లే (ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఆర్‌సిబి ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్‌లో సాల్ట్(20), పడిక్కల్ (3) ఉన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 8:03 pm

వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి

వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి తెలంగాణ రన్నర్స్ ప్రోమో రన్ విజయవంతంవెస్ట్

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:47 pm

వానరం ఒడిలో కుక్కపిల్ల..

వానరం ఒడిలో కుక్కపిల్ల.. అమ్మ ప్రేమకు జాతి భాష రూపం బేధాలు లేవు…

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:44 pm

దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

30 కోట్లతో కాచిగూడలో జగ్జీవన్ రామ్ భవన్ లోయర్ ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ నిర్మాణం జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మన తెలంగాణ / హైదరాబాద్ : జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా మార్చాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే మహనీయుడు చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రసంగిస్తూ, దళితులు, పేద, అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం దళితుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. జగ్జీవన్ రామ్ దళితుల గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. కాచిగూడ లోని నింబోలి అడ్డలో రూ. 30 కోట్లతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను నిర్మిస్తున్నామని, లోయర్ ట్యాంక్ బండ్ లో పది అంతస్తులకు తగ్గకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. అణగారిన వర్గాల పక్షాన నిలబడిన అరుదైన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అభివర్ణించారు. అవకాశం లభిస్తే దళితుడు కూడా ఉన్నత నాయకత్వం చేపడతాడు అనే నమ్మకాన్ని ఆయన కార్యాచరణతో నిరూపించారని అన్నారు. రాజ్యాంగంలో ఎస్‌సి, ఎస్‌టిల హక్కులు, రిజర్వేషన్లు కాంగ్రెస్ దృక్పథంతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. భూమి సంస్కరణలు, విద్యా అవకాశాల ద్వారా పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని వివరించారు. త్వరలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు రాష్ట్రంలో ప్రజాపాలన పారదర్శకంగా సాగుతోందని, దళితుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అనే సంకల్పంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి తెలిపారు. సంక్షేమం మాత్రమే కాకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. దళిత విద్యార్థులకు ఉన్నత విద్యలో పూర్తి సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిబ్మోలి గడ్డ హాస్టల్‌కు ఆధునిక సౌకర్యాలతో నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరేలా కృషి చేస్తూ, వివక్షలేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ ఆశయాలకు దళిత ఐక్యతే మా బలం, సామాజిక న్యాయం కాంగ్రెస్ ధర్మం అంటూ నినాదాలు చేశారు. ప్రతి దళిత కుటుంబానికి గౌరవం, ప్రతి యువకుడికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జగ్జీవన్ రామ్ కలల భారతాన్ని తెలంగాణలో సాకారం చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ విప్ అద్దంకి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, నాగరాజు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ కాసిం, ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, జేబీ రాజు, మేడి పాపయ్య, ఉత్సవ కమిటీ నేతలు, పలువురు దళిత నాయకులు కార్యక్రమానికి హాజరై బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న ఆలపించిన గీతాలు ఆహుతులను ఉర్రూతలుగుంచాయి

మన తెలంగాణ 5 Apr 2026 7:43 pm

Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News

Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:40 pm

జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం…

జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం… స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:40 pm

తండ్రిని హతమార్చిన తనయుడు..

తండ్రిని హతమార్చిన తనయుడు.. మందస(పలాస), ఆంధ్రప్రభ : పున్నామ నరకం నుండి కాపాడుతాడని,

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:34 pm

Thunderbolt |పిడుగు పడి…

Thunderbolt | పిడుగు పడి… Thunderbolt | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలోని

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:28 pm

రాణించిన పంత్.. హైదరాబాద్‌పై లక్నో ఘన విజయం

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఘన విజయం సాధించింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆఖరు వరకూ పోరాడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి లక్నో.. ఆరంభంలో దూకుడుగానే ఆడింది. మార్క్‌రం(45) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే మధ్య ఓవర్లలో లక్నో బ్యాటర్లని హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. ఓ వైపు వికెట్లు పడుతున్న పంత్(68) మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం ఉండగా.. పంత్ తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత రెండు డాట్‌బాల్స్ పడ్డాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో 5 బంతిని కూడా ఫోర్‌గా మలిచి.. పంత్ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

మన తెలంగాణ 5 Apr 2026 7:27 pm

వైసీపీలో జోకర్ అంబటి రాంబాబు

వైసీపీలో జోకర్ అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:17 pm

బెంగళూరుపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలని తాపత్రయ పడుతోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. తుది జట్లు: సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీరె్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్. ఆర్‌సిబి: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడికల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.

మన తెలంగాణ 5 Apr 2026 7:15 pm

బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం జిల్లా కేడీసీసీ బ్యాంకు

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:14 pm

IPL 2026 : హైదరాబాద్ లో సన్ రైజర్స్ ఓటమి.. లక్నో కు విజయం

హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ పై ఓటమి పాలయింది

తెలుగు పోస్ట్ 5 Apr 2026 7:12 pm

ఇరాన్‌లో చిక్కుకున్న ఎఫ్-15 సిబ్బందిని రక్షించిన అమెరికా

స్పెషల్ ఫోర్సెస్, భారీ యుద్ధ విన్యాసాలతో అమెరికా ఆపరేషన్ న్యూఢిల్లీ: ఇరాన్‌లో కూలిన ఎఫ్-15 యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన సాహసోపేత ఆపరేషన్‌పై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వి గాట్‌హిమ్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, వందల సంఖ్యలో ప్రత్యేక దళాలు పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చివేయడంతో, అందులో ఉన్న ఇద్దరు సిబ్బందిలో పైలట్‌ను తక్షణమే రక్షించారు. అయితే వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో అతని కోసం అమెరికా విసృ్తత శోధనను ప్రారంభించింది. రెండో రోజు రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ మరుసటి రోజు ఉదయం ముగిసింది. అమెరికా సైన్యం ఈ ఆపరేషన్‌లో అత్యాధునిక యుద్ధ సామగ్రిని వినియోగించింది. హెచ్‌హెచ్-60 డబ్ల్యూ‘జాలీ గ్రీన్ II’ రక్షణ హెలికాప్టర్లు, ఎ-10 వార్థాగ్ దాడి విమానాలు, హెచ్‌సి-130 మిడ్‌ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్స్‌తో పాటు ప్రత్యేక ‘కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ దళాలు పాల్గొన్నాయి. శత్రు భూభాగంలో మిసైల్, రాడార్ ముప్పు మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, విమానం కూలిన వెంటనే ఇద్దరు సిబ్బంది తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వారి స్థానాన్ని తెలియజేశారు. అమెరికా సైన్యం మొదటి పైలట్‌ను రక్షించగా, రెండో పైలట్ కోసం సీఐఏ ప్రత్యేక వ్యూహంతో శోధన చేపట్టింది. శత్రువులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, అసలు స్థానం గోప్యంగా ఉంచింది. ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే ప్రత్యేక దళాలను ప్రవేశపెట్టి, తీవ్ర కాల్పుల మధ్య హెలికాప్టర్ల సహాయంతో రెండో పైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్‌లో కొంత ప్రతిఘటన ఎదురైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ బలగాలు దాడి చేయడానికి ప్రయత్నించగా, అమెరికా యుద్ధవిమానాలు బాంబులు విసురుతూ, కాల్పులు జరిపి శత్రువులను దూరంగా ఉంచాయి. ఈ చర్యల మధ్యే రక్షణ కార్యాచరణ విజయవంతమైంది. రక్షించిన సిబ్బంది గాయపడినప్పటికీ ప్రాణాపాయం లేదని ట్రంప్ తెలిపారు. రెండో పైలట్‌ను గౌరవనీయ కల్నల్ అని పేర్కొంటూ, శత్రు ప్రాంతంలో ఉన్నప్పటికీ అతను ఒంటరిగా లేడు. 24 గంటలూ అతని కదలికలను మేము పర్యవేక్షించాం అని అన్నారు. అదేవిధంగా, రెండు వేర్వేరు సందర్భాల్లో శత్రు భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను విజయవంతంగా రక్షించడం సైనిక చరిత్రలో అరుదైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిస్పందన మరోవైపు ఈ ఆపరేషన్‌పై ఇరాన్ విభిన్న వాదనలు చేసింది. అమెరికా రక్షణ చర్య విఫలమైందని, తమ బలగాలు ఒక సి-130 రవాణా విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని, కొందరు మరణించారని కూడా ఇరాన్ ఆరోపించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా తన వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్ తీవ్ర ప్రతిదాడులకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంధన రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది.

మన తెలంగాణ 5 Apr 2026 7:11 pm

పునరుద్దానుడైన యేసును ప్రకటిస్తున్నాం…

పునరుద్దానుడైన యేసును ప్రకటిస్తున్నాం… ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:11 pm

రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే…

రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే… విజయవాడ అభివృద్ధి నిరోధకులు దేవినేని అవినాష్

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:08 pm

సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత‌ జగ్జీవ‌న్ రామ్‌

సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత‌ జగ్జీవ‌న్ రామ్‌ సంగారెడ్డి ప్ర‌తినిధి,

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:56 pm

బూత్ స్థాయి బలోపేతమే లక్ష్యం

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ పట్టణ, మోత్కూర్ రూరల్, అడ్డగూడూర్ మండలాల బిజెపి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమం శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీలత రెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కార్యాచరణపై స్పష్టమైన అవగాహన పొందాలని తెలిపారు. ఆ అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత ముఖ్యమని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తే పార్టీ మరింత విస్తరిస్తుందని తెలిపారు. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ, సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు. శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలకు సిద్ధాంతపరమైన, సంస్థాగత పరమైన అవగాహన పెంపొందించబడుతుందని తెలియజేశారు. మోత్కూర్ పట్టణ అధ్యక్షులు చాడా మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, మోత్కూర్ రూరల్ అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, అడ్డగూడూర్ మండల అధ్యక్షులు ననుబోతు సైదులు, బిజెపి సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, బందారపులింగస్వామి, కొనతం నాగార్జున రెడ్డి జిల్లా కోశాధికారి గుజ్జ సోమ నరసయ్య జిల్లా నాయకుల బయ్యని చంద్రశేఖర్, శిక్షణ తరగతుల ప్రబారి గౌరు శ్రీనివాస్ ఏనుగు జితేందర్ రెడ్డి సోమిరెడ్డి నర్సిరెడ్డి జిల్లా నాయకులు కూరాకుల వెంకన్న పోచం సోమయ్య తిరుమల్ రెడ్డి సజ్జన మనోహర్ ఎడ్ల రాము జిలకర దశరథ మల్లేశం సత్యనారాయణ చంద్రమౌళి విజయలక్ష్మి, రమణ,రేణుక రమాదేవి, తదితరులు పాల్గొన్నారు

మన తెలంగాణ 5 Apr 2026 6:54 pm

గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు…

గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు… – ఆరుగురు అరెస్టు, భారీగా బంగారం

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:52 pm

రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్

రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్118వ జయంతి

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:49 pm

బాబుజికి ఘన నివాళులు…

బాబుజికి ఘన నివాళులు… పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:47 pm

దూకుడుగా ఆడుతున్న లక్నో.. విజయానికి చేరువలో..

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి చేరువ అవుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. పవర్‌ప్లేలో 53 పరుగులు రాబట్టింది. ఓపెనర్‌గా దిగిన మార్క్‌రమ్ 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లక్నో విజయానికి ఇంకా 42 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉంది. క్రీజ్‌లో పంత్(31), పూరన్ (1) ఉన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 6:38 pm

అమెరికా యుద్ధ విమానాలను యుఎస్ఎనే ధ్వంసం చేసింది ఎందుకో తెలుసా?

రక్షణ ఆపరేషన్‌లో అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసం అవశేషాల ఫోటో విడుదల చేసిన ఇరాన్ వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధవిమాన పైలట్‌ను రక్షించే ఆపరేషన్‌లో భాగంగా అమెరికా తన యుద్ధవిమానాలను తానే స్వయంగా ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన అవశేషాల చిత్రాన్ని ఇరాన్ విడుదల చేయగా, అమెరికాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఒక అమెరికా అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ రక్షణ చర్యలో రెండు ఎంసీ-130జె రవాణా విమానాలు పాల్గొన్నాయి. శత్రు ప్రాంతాల్లో రహస్యంగా ప్రవేశించి, సిబ్బందిని బయటకు తీసుకురావడానికి ఉపయోగించే ఈ విమానాలు ఆపరేషన్ సమయంలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీంతో అవి ఇరాన్ చేతుల్లో పడకుండా ఉండేందుకు అమెరికా బలగాలు వాటిని పేల్చివేశాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, ఈ ఘటనపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ధ్వంసమైన విమానాల అవశేషాల ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలాంటి విజయాలు ఇంకొన్ని సాధిస్తే అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్ వైమానిక రక్షణ దళాలు కూల్చివేసిన ఎఫ్-15ఇ యుద్ధవిమానంలో ఉన్న ఇద్దరు సిబ్బందిలో ఒకరిని ముందుగానే రక్షించగా, మిగిలిన పైలట్‌ను రాత్రి జరిగిన సాహసోపేత ఆపరేషన్‌లో అమెరికా సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్‌ను ప్రశంసిస్తూ, మా సైన్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ రక్షణ చర్యను విజయవంతంగా పూర్తి చేసింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని పేర్కొన్నారు. వి గాట్ హిమ్! అంటూ ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో జరిగిన ఈ రక్షణ చర్యను ట్రంప్ చరిత్రలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు. గాయాలపాలైన పైలట్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. ఇక ఇజ్రాయెల్ కూడా ఈ ఆపరేషన్‌కు మద్దతుగా రహస్య సమాచారాన్ని అందించిందని సమాచారం. ఆ ప్రాంతంలో తమ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి సహకరించినట్లు వెల్లడైంది. మరోవైపు ఈ ఆపరేషన్ సమయంలో అమెరికాకు మరింత నష్టం జరిగిందని ఇరాన్ పేర్కొంది. ఒక సీ-130 రవాణా విమానం, రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు సహా పలు యుద్ధ వాహనాలను ధ్వంసం చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో కనీసం ఏడు అమెరికా యుద్ధవిమానాలను కూల్చేశారని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. తాజా ఆరోపణలు నిజమైతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 5 Apr 2026 6:26 pm

Etala Rajender : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటల

బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.

తెలుగు పోస్ట్ 5 Apr 2026 6:19 pm

బాబు జగ్జీవన్ రాంకు బీఆర్ ఎస్ నేతల నివాళి

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట వద్ద మాజీ

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:03 pm

Telangana : ఆ ఐదు గ్రామాలు మా కివ్వండి : తుమ్మల

కేంద్రమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు

తెలుగు పోస్ట్ 5 Apr 2026 6:00 pm

కడెంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

కడెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెంలో బృందావన్ రిసార్ట్ లో ఆదివారం

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:59 pm

ఏఐ ఉచిత శిక్ష‌ణ‌కు అనూహ్య స్పంద‌న‌..

ఏఐ ఉచిత శిక్ష‌ణ‌కు అనూహ్య స్పంద‌న‌.. గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు…సదస్సులో

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:58 pm

దేవున్‌పల్లి లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు

దేవున్‌పల్లి లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు భీమ్‌గల్‌ రూరల్

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:54 pm

హోర్ముజ్‌ జలసంధిని దాటిన మరో భారత నౌక

పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ మరో గుడ్ న్యూస్ అందిం

తెలుగు పోస్ట్ 5 Apr 2026 5:53 pm

పాలిటెక్నిక్ కళాశాలలో ‘పూర్వ విద్యార్థుల’ కోలాహలం!

పాలిటెక్నిక్ కళాశాలలో ‘పూర్వ విద్యార్థుల’ కోలాహలం! ఘనంగా గ్రాండ్ ఆలుమ్నీ మీట్ –

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:49 pm

అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ…

అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ… ఇకనైనా రాజకీయ నాటకాలు ఆపాలిరైతుల హక్కుల పరిరక్షణకు

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:46 pm

కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇందిరమ్మ

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:45 pm

జగన్ తో వైరం నాకు నష్టమే

వైఎస్ జగన్ తో వివాదం తనకు రాజకీయంగా కలిసి రాలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు

తెలుగు పోస్ట్ 5 Apr 2026 5:37 pm

ఆదుకున్న క్లాసెన్, నితీశ్.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లోక్న సూపర్ జెయింట్స్ బౌలర్లు చెలరేగిపోయారు. లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టును షమీ కుదిపేశాడు. తొలి ఓవర్‌లో అభిషేక్‌ని, మూడో ఓవర్‌లో హెడ్‌ను ఔట్ చేశాడు. ఒక దశలో 26 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ఈ దశలో జట్టును క్లాసెన్, నితీశ్ రెడ్డిలు ఆదుకున్నారు. వికెట్‌ని కాపాడుకుంటూనే.. పరుగులు రాబట్టారు. ఐదో వికెట్‌కి వీరిద్దరు కలిసి 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ భాగస్వామ్యానికి సిద్ధార్త్ బ్రేక్ వేశాడు. సిద్ధార్త్ బౌలింగ్‌లో నితీశ్ (56) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే క్లాసెన్(62) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్‌లో షమీ, అవేశ్, ప్రిన్స్ చెరి రెండు, దిగ్వేశ్, సిద్ధార్త్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 5 Apr 2026 5:35 pm

Video: Kiran Abbavaram Round Table Interview

The post Video: Kiran Abbavaram Round Table Interview appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 5:30 pm

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. వివాహాల సీజన్ తో పెరిగిన భక్తుల రాక.రద్దీకి తగ్గట్లు

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:25 pm

కలెక్టర్‌ను కలిసిన డీహెచ్‌పీఎస్ నేత

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను డీహెచ్‌పీఎస్

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:25 pm

Vemireddy : వైసీపీలో చేరబోం : వేమిరెడ్డి దంపతులు

తాము టీడీపిని వీడుతున్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వేమిరెడ్డి దంపతులు అన్నారు

తెలుగు పోస్ట్ 5 Apr 2026 5:22 pm

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:22 pm

పారిశ్రామిక వేత్త‌ల‌కు డైన‌మిక్ వేదిక‌.. ఫౌండ‌ర్స్ రూఫ్‌..

పారిశ్రామిక వేత్త‌ల‌కు డైన‌మిక్ వేదిక‌.. ఫౌండ‌ర్స్ రూఫ్‌.. ఒకేవైదిక‌పై ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, క్రియేటర్స్‌ఒక

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:16 pm

High Schools |పేద ప్రజల విద్యా దీపం ఎస్ కేపీవీ…

High Schools | పేద ప్రజల విద్యా దీపం ఎస్ కేపీవీ… ఎంపీ

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:09 pm

నన్ను మెడలు పట్టి గెంటేశారు.. పార్టీలో మారే ప్రసక్తే లేదు: ఈటల

శామీర్‌పేట: మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి తప్పు చేయకపోయినా మెడలు పట్టి బయటకు గెంటేసిన బిఆర్ఎస్‌ పార్టీలోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి చెబుతున్నా.. పార్టీలు మారే పరిస్థితి లేదు. పార్టీలు మారడం అంటే దుస్తులు మార్చినంత సుంభం కాదు’’ అని అన్నారు. ‘‘నన్ను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే బిఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేశారు. అధికాల బలంతో వ్యక్తిగతంగానూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడేమో ఈటల పార్టీ మారుతున్నారని కరీంనగర్‌లో కొందరు పోస్టర్లు వేయడం, ఆరోపణలు చేయడం నాకు బాధ కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు మారే పరిస్థితి రాదు’’ అని ఈటల పేర్కొన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 5:07 pm

ఉరుసులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:00 pm

బాధిత కుటుంబానికి 1.50 లక్షల ఎల్ఓసి అందజేత‌…

బాధిత కుటుంబానికి 1.50 లక్షల ఎల్ఓసి అందజేత‌… భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:59 pm

తాళ్ల పేట ముస్లిం మైనార్టీ నూతన కమిటీ ఎన్నిక

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేట ముస్లిం మైనార్టీ గ్రామ కమిటీని

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:56 pm

ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది: కెటిఆర్

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష అన్నారు. కొలంబియా బిజినెస్ స్కూలులో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. తెలంగాణ సాధించిన అద్బుత ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అవకాశాల కోసం ఎదురు చూడలేదని, అద్భుతమైన పాలసీలు తయారు చేశామని తెలియజేశారు. మౌలిక సదుపాయాలు కల్పించామని, పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని, పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని ప్రశంసించారు. ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, ఐటీ ఎగుమతులు రూ.2.72 లక్షల కోట్లకు పెరగాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఐటి ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుందని, హైదరాబాద్ గ్లోబల్ ఐటి దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. అతిపెద్ద క్యాంపస్ ను అమెజాన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని, ఆవిష్కరణలకు చిరునామాగా తెలంగాణ మారిందని అన్నారు. 

మన తెలంగాణ 5 Apr 2026 4:41 pm

చెలరేగుతున్న లక్నో బౌలర్లు.. పెవిలియన్ కు క్యూ కట్టిన SRH బ్యాటర్లు

ఐపీఎల్‌ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ గెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ(0), ట్రావిస్ హెడ్(7)ల తోపాటు కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ఔట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్ హెచ్ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగస్టన్(14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్ 9 ఓవర్లలో 31 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెస్(5), నితీష్ కుమార్ రెడ్డి(3)లు ఉన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 4:19 pm

Us Pilot Rescued : అమెరికా ఫైల‌ట్ సేఫ్ Andhra Prabha News

Us Pilot Rescued : అమెరికా ఫైల‌ట్ సేఫ్ Andhra Prabha News

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:19 pm

నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సన్‌రైజర్స్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో.. తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మహ్మద్ షమీ షాక్‌ మీద షాక్ ఇచ్చాడు. షమీ వేసిన మొదటి ఓవర్‌ చివరి బంతికి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత షమీ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి ట్రావిస్ హెడ్(7) పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో లివింగ్‌స్టోన్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ, దిగ్వేష్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్(14) కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజ్‌లో క్లాసెన్(4), నితీశ్(2) ఉన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 4:12 pm

పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి…

పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి… ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలపై బారం

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:11 pm

Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard

Adivi Sesh commands a massive following not only in Telugu states but across the Hindi belt as well, thanks to the sensational success of his Pan-India blockbuster Major. Now, he is gearing up for another nationwide outing with Dacoit, slated for release on the 10th of this month. After the teaser, songs, and posters made […] The post Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 4:10 pm

Will Vijay’s Nominations Be Valid After Affidavit Discrepancies?

Actor-turned-politician Vijay is facing scrutiny over discrepancies in his nomination affidavits for the Perambur and Tiruchi East constituencies in the Tamil Nadu Assembly elections. Election officials flagged variations between the two filings. His declared assets differ across documents. In one affidavit, he reported assets worth around ₹404 crore. In the revised details, the figure crosses […] The post Will Vijay’s Nominations Be Valid After Affidavit Discrepancies? appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 4:09 pm

పల్లెవెలుగు బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం

అమరావతి: కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్న గట్టపల్లె వద్ద పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తాకడంతో పల్లెవెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై 21 మంది ప్రయాణికులు దిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.     

మన తెలంగాణ 5 Apr 2026 4:09 pm

Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has issued strict instructions to officials to curb the illegal entry of Tamil Nadu fishermen into the state’s coastal waters. The move comes amid rising tension in Nellore and Tirupati districts where local fishermen have raised serious concerns. The Chief Minister made it clear that such intrusions will […] The post Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 4:08 pm

భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:07 pm

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్… 299వ డివిజన్ కాంగ్రెస్

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:03 pm

దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్

దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:01 pm