మహేశ్ ఫ్యాన్స్కు సారీ చెప్పిన హరీశ్ శంకర్.. ఒత్తిడి వల్లే అని..
మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్, పవర్స్టార్ పవన్కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ చిత్రం మార్చి 19వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ కామెంట్ వల్ల దర్శకుడు హరీశ్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. ఓ వ్యక్తికి ఆయన పెట్టిన కామెంట్ వల్ల సూపర్స్టార్ మహేశ్ బాబు అభిమానుల నుంచి ఆగ్రహాన్ని ఎదురుకున్నారు. అయితే ఆ కామెంట్పై ఆయన వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి పెట్టిన పోస్ట్ను మొత్తం చదవకుండానే కామెంట్ చేశానని.. ఒత్తిడి వల్లే అది జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు అభిమానులకు ఆయన క్షమాపణ చెప్పారు. ‘‘కొన్ని రోజులుగా పని ఒత్తిడిలో ఉన్నాను. సెన్సార్ పనులు, బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సాంగ్ ప్రోమో ఫైనల్ చెక్ చేయడం.. ఇలా ఎంతో బిజీగా ఉన్నాను. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో సినిమా ప్రోమోపై వస్తున్న స్పందనలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ీమడియాలో రిప్లైలు ఇస్తున్నాను. ఆ హడావుడిలో ఒక ట్వీట్ పూర్తిగా చదవకుండానే పోరపాటున కోట్ చేశాను. వెంటనే నా టీం అప్రమత్తం చేయడంతో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ రిప్లెని తొలగించాను’’ ‘‘సూపర్స్టార్ మహేశ్ బాబు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ‘వారణాసి’ చిత్రంలో ఆయన మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నా. గతంలో ‘పోకిరి’ గురించి నేను పెట్టిన పోస్టులు చూస్తే.. మహేశ్పై నాకున్న అభిమానం అర్థమవుతుంది. ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బ తీయాలనే ఉధ్దేశం నాకు లేదు’’ అని తన లేఖలో హరీశ్ రాసుకొచ్చారు. సినిమా విడుదలకు మరో 10 రోజులు మాత్రం ఉన్న సమయంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకొనేంత అవివేకిని కాదని హరీశ్ పేర్కొన్నారు. అందరు హీరోల అభిమానులు ఆదరిస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుందని ఆయన అన్నారు. పొరపాటున తన వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని.. అందరూ పెద్ద మనస్సుతో అర్థం చేసుకొని ‘ఉస్తాద్ భగత్సింగ్’ను అదరించాలని విజ్ఞప్తి చేశారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి
క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నదుండగులునిర్వహకులపై పోలీసులు
25th Division |సెంట్రల్లో అభివృద్ధి జోరు…
25th Division | సెంట్రల్లో అభివృద్ధి జోరు… అయ్యన్న నాయుడు వీధిలో డ్రైనేజీ
ఏజెన్సీలో నూతన ఓరవడికి శ్రీకారం..
ఏజెన్సీలో నూతన ఓరవడికి శ్రీకారం.. ఉట్నూర్, జైనూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఏజెన్సీ
Hindi Deals kept Markets of these Actors at Risk
The Hindi Rights of Telugu stars have turned out to be a gold mine for the producers. The Hindi rights included the satellite rights, YouTube rights along with the streaming rights of the films. Actors like Ravi Teja, Ram, Gopichand, Bellamkonda Sreenivas and others enjoyed a terrific craze and their films did well on small […] The post Hindi Deals kept Markets of these Actors at Risk appeared first on Telugu360 .
వేం నరేందర్ రెడ్డి ని కలిసిన బీర్ల అయిలయ్య..
వేం నరేందర్ రెడ్డి ని కలిసిన బీర్ల అయిలయ్య.. యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ :
సీఎంను కలిసిన బీర్ల అయిలయ్య సీఎం రేవంత్ రెడ్డికి లక్ష్మీ నరసింహస్వామి లడ్డు
కోర్టు తీర్పు మావైపే వస్తుంది..
కోర్టు తీర్పు మావైపే వస్తుంది.. జంపింగ్ ఎమ్మెల్యేలపై అనాహారత వేటు తప్పదుకడియం, దానం
Andhra Prabha Smart Edition |AP|ఆర్థిక విధ్వంసం/వచ్చే జులైనాటికి..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-03-2026, 4.00PM ap వచ్చే జులైనాటికి వెలిగొండ,
Andhra Prabha Smart Edition |TS|. స్పీకర్ తీర్పు/కేటీఆర్ ఫైర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-03-2026, 4.00PM ts దానం, కడియం పార్టీ
నేల ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమం…
నేల ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమం… పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లోని
13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి
గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటంతో హరీశ్ రాణా మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా, పూర్తిగా […] The post 13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి appeared first on Visalaandhra .
ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు
శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని, అలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండబోమని స్పష్టం చేశారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు […] The post ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు appeared first on Visalaandhra .
హైదరాబాద్–ఫుకెట్ ఎయిర్ ఇండియా విమానం రన్వేపై నోస్ వీల్ విరిగి... #AirIndiaExpress#HyderabadFlight
RGV’s Big Statement on South Cinema
It has been known that several films from South are making it to the pan-Indian stage and are dominating Bollywood. Gone are the days when Hindi films were top grossers. South films like Baahubali, KGF, RRR, Pushpa and others have surpassed the lifetime numbers of Hindi films. Sensational filmmaker Ram Gopal Varma has made a […] The post RGV’s Big Statement on South Cinema appeared first on Telugu360 .
చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం
మంచిర్యాల జిల్లా, చెన్నూరు: చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ తివారీ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహేశ్ ప్రసాద్ తివారీతో పాటు కమిటీ సభ్యులు కూడా పదవీ ప్రమాణం చేశారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ మరియు సభ్యులకు అభినందనలు తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలని సూచించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొత్త చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
ఉగాదికి సామూహిక గృహప్రవేశాలు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది కానుకగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు […] The post ఉగాదికి సామూహిక గృహప్రవేశాలు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన appeared first on Visalaandhra .
OTT Releases for March Second Weekend
Several Telugu films that were released recently are all set for streaming this weekend on various platforms. Ravi Teja’s Sankranthi outing Bhartha Mahasayulaku Wignyapthi will stream on Zee5. Vishwak Sen’s Funky will be available on Netflix. February’s only hit film Couple Friendly will be available on Prime Video. All these three films will stream from […] The post OTT Releases for March Second Weekend appeared first on Telugu360 .
చిరుతకే చమటలు పట్టించిన అడవి కుక్కలు #AmrabadForest#Leopard#WildDogs#ViralVideo
హెల్త్ యాప్ వ్యాపారంలో రూ.1.55 కోట్ల మోసం
యాప్ ప్రాజెక్టు కోసం ఏడు రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నట్లు ఫిర్యాదునిధుల మళ్లింపు, సంతకాలు–డీఎస్సీ దుర్వినియోగం ఆరోపణలురూ.2 కోట్ల చెక్కులు బౌన్స్ అయిన తర్వాత బెదిరింపులంటూ ఆరోపణ
వాళ్లను ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్నారు.. ఇంకా అతడు కూడా చేరితే..: పొలాక్
టీం ఇండియా అనుకున్నది సాధిచింది. భారతీయులంతా గర్వపడేలా.. సొంత గడ్డపై ప్రపంచకప్ను దక్కించుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి టి-20 ప్రపంచప్ను అందుకుంది. భారత్-శ్రీలంక వేదికలుగా జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరేట్గానే బరిలోకి దిగిన సూర్యకుమార్ సేన.. ఆరంభంలో కాస్త తడబడినా.. ఆ తర్వాత పుంజుకుంది. అన్ని విభాగాల్లో రాణిస్తూ.. చివరకు కప్పును సొంతం చేసకుంది. ఈ విషయంపై సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ షాన్ పొలాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను, ముఖ్యంగా ఇంత స్ట్రైక్ రేట్తో ఆడుతున్న టీమిండియాపై ఏ జట్టైనా గెలవడం అసాధ్యమని అన్నాడు. మిగితా జట్ల కంటే టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉందని పేర్కన్నొడు. టీం ఇండియా బ్యాటర్లను ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించారు. టీం ఇండియా టాప్ నుంచి బాటమ్ వరకు ఎనిమిది వరకు బ్యాట్స్మెన్లు 200 స్ట్రైక్రేటుతో ఆడుతున్నారని.. ఇలాంటి బ్యాటింగ్ను ఎదురుకోవడం ఎవరి వల్ల కాదు అని పేర్కొన్నాడు. ఇది చాలదు అన్నట్టుగా ఇంకా టీం ఇండియాలోకి కొత్త ఆటగాళ్లు, భీకర హిట్టర్లతో టీం ఇండియాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో అలాగే ఐపిఎల్లో దుమ్మురేపుతున్న వైభవ్ టీం ఇండియాలో చేరితే మాత్రం, బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారుతుంది. దీంతో ప్రత్యర్థి జట్లు భారత బ్యాటింగ్ను ఎదురుకోవాలంటే భయపడతాయని పొలాక్ పేర్కొన్నాడు.
మంగళ్పహాడ్ చౌరస్తా వద్ద హనుమాన్ దీక్షాపరుల రాస్తారోకో
మంగళ్పహాడ్ చౌరస్తా వద్ద హనుమాన్ దీక్షాపరుల రాస్తారోకో ఎడపల్లి,ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం
Air India |దెబ్బతిన్న విమానం నోస్ గేర్
Air India | దెబ్బతిన్న విమానం నోస్ గేర్ Air India |
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, శివ ప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు. లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Ap Cs Task : కలిసి పనిచేద్దాం Andhra Prabha News
Ap Cs Task : కలిసి పనిచేద్దాం Andhra Prabha News (ఆంధ్రప్రభ,
UV Creations owned by Vamshi and Pramod are close to Prabhas. They made their debut as producers with Mirchi and went on to produce films like Saaho and Radhe Shyam with Prabhas. With the pan-Indian actor busy with several commitments, UV Creations kept busy with other films. But most of their recent films ended up […] The post A Relief for UV Creations appeared first on Telugu360 .
Ys Jagan : జగన్ చేజేతులా చేసుకుంటున్నాడే.. మారితేనే భవిష్యత్
వైఎస్ జగన్ కు రాజకీయ శత్రవులు ఎక్కువగా కనపడుతున్నారు.
సర్పంచులందరికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం
సర్పంచులందరికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరిన ఎంపీడీఓ జుక్కల్
సీఎం ఆదేశాలతో టీటీడీ విద్యా సంస్థలకు డిజిటల్ శోభ
సీఎం ఆదేశాలతో టీటీడీ విద్యా సంస్థలకుడిజిటల్ శోభ తాజా బడ్జెట్ లో రూ.
YCP leader | కేసు నమోదు YCP leader | ఆంధ్రప్రభ, వెబ్
Naga Chaitanya |వృషకర్మ బడ్జెట్ ఎంత…?
Naga Chaitanya | వృషకర్మ బడ్జెట్ ఎంత…? వృషకర్మ సినిమాపై పెరిగిన అంచనాలుగ్లింప్స్తో
Ration rice |దోపిడీ వెనుక ఉన్నది అవినాష్ అనుచరులే
Ration rice | దోపిడీ వెనుక ఉన్నది అవినాష్ అనుచరులే Ration rice
హెచ్ టి పత్తి విత్తనాలు సాగు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు…
హెచ్ టి పత్తి విత్తనాలు సాగు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు… ఊట్కూర్,
Allu Arjun |టైటిల్ ఈవెంట్ ప్లాన్ ఇదే..
Allu Arjun | టైటిల్ ఈవెంట్ ప్లాన్ ఇదే.. Allu Arjun |
వసతి గృహాల్లో విద్యార్థుల ఇబ్బందులు…
వసతి గృహాల్లో విద్యార్థుల ఇబ్బందులు… సమయపాలన పాటించని వార్డెన్లుకొరవడిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణపదవ పరీక్షల
గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం..
గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం.. వెల్దండ, ఆంధ్ర ప్రభ : గ్రామపంచాయతీ అభివృద్దె
Andhra Politics : విజయం మత్తులో ఉంటే అలాగే అనిపిస్తుంది గురూ.. కానీ వాస్తవమిదీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్న మాటలు కూటమి వల్లే గెలిచామని
ఘనంగాస్వయంపరిపాలన దినోత్సవం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల మండల
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1943 అక్టోబర్ 1న అప్పటి మద్రాసు ప్రావిన్స్ లో ఏలూరు ప్రాంతం దోశపాడు గ్రామంలో జన్మించారు. ఆయన ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు, భార్య హేమలత ఉన్నారు. ఎన్ఐటి వరంగల్లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సేవలందించారు. ఐదు సార్లు ఎంపి, ఒక సారి కేంద్రమంత్రి పని చేశారు. 1984, 1989. 1998, 2004, 2009వ సంవత్సరాలలో ఎంపి గెలిచి ప్రజలకు సేవలందించారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా పేరొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆయన బిజెపిలో చేరారు. విశాఖపట్నం ఎంపి, నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఆయనకు మనవడు అవుతారు. భరత్ స్వయానా కూతురి కుమారుడు కావడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్, ఎంఎల్ఎ నందమూరి బాలకృష, నందమూరి రామకృష్ణ సంతాపం తెలిపారు. కావూరు కుటుంబానికి ప్రగాఢ సానూభూతి ప్రకటించారు. రాజకీయ వ్యాపార రంగంలో కావూరు సాంబశివరావుది ప్రత్యేక ముద్ర అని బాబు తెలిపారు. కావూరుతో పంచుకున్న ప్రేమ, అనురాగం, మరువలేనిదని నందమూరి రామకృష్ణ తెలిపారు.
ర్యాలీకి భారీ స్పందన.. గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున
రాజుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
రాజుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : మండలం నిడమర్రు గ్రామంలో
ఆ పనిపై మాజీ క్రికెటర్ విమర్శలు.. ధీటుగా జవాబిచ్చిన గంభీర్
2026 ఐసిసి టి-20 ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్స్లో న్యూజిలాండ్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే కప్పును గెలిచిన సంతోషంలో భారత ఆటగాళ్లు హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట కోచ్ గౌతమ్ గంభీర్, ఐసిసి ఛైర్మన్ జై షా కూడా ఉన్నారు. అయితే ఈ పనిపై మాజీ క్రికెటర్, టిఎంసి ఎంపి కీర్తి ఆజాద్ విమర్శలు చేశారు. ట్రోఫీని కేవలం ఆలయానికే ఎందుకు తీసుకెళ్లారు అని.. ఇతర మతల ప్రార్థన మందిరాలకు ఎందుకు తీసుకెళ్లలేదని అడిగారు. ఈ విమర్శలకు కోచ్ గౌతమ్ గంభీర్ ధీటుగా జవాబిచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలతో సొంత జట్టునే తక్కువ చేసుకుంటారా? అని ప్రశ్నించారు. ‘‘ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేంత విలువ లేదు. దేశం గర్వపడే క్షణాలు ఇవి. ఇలాంటప్పుడు అసంబద్ధ ప్రశ్నం వేయడం ఎంతవరకూ కరెక్ట్? మనం ప్రపంచకప్ని గెలిచాము. సంబరాలు చేసుకోవడం ముఖ్యం కానీ.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల మనం సాధించిన లక్ష్యాన్ని తక్కువ చేసుకున్నట్లే అవుతుంది. 15 మంది ప్లేయర్లు కష్టపడి సాధించిన దానిని పక్కన పెట్టాలని భావిస్తున్నారా.? కుర్రాళ్లు సాధించిన దానిని వారికి ఇష్టమైన రీతిలో సెలబ్రేట్ చేసుకొని వెసులుబాటు కల్పించాలి. ఇందులో రాజకీయ, మతపరమైన విబేధాలు చూపించకూడదు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో తీవ్ర ఒత్తిడికి గురైన ప్లేయర్లు.. పుంజుకొని మరీ ఛాంపియన్లుగా మారారు. వారి కష్టాన్ని తక్కువ చేయవద్దు. ఇలాంటి వ్యాఖ్యలతో సొంత టీమ్నే డీగ్రేడ్ చేసిన వారవుతారు’’ అని గంభీర్ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన…
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ :
బస్టాండ్ స్థలం సర్వే నిర్వహించిన అధికారులు.
బస్టాండ్ స్థలం సర్వే నిర్వహించిన అధికారులు. వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల
YS Jagan |దోచిపెట్టడమే సరిపోతుంది…
YS Jagan | దోచిపెట్టడమే సరిపోతుంది… YS Jagan | ఆంధ్రప్రభ, వెబ్
అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం…
అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం… చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే 129వ
Limited Menus in IT office Cafeterias & Hostels Amid LPG Concerns
Hostels and corporate offices in major IT hubs are beginning to limit food services amid concerns over LPG supply disruptions linked to the ongoing geopolitical tensions involving the United States, Israel and Iran. The IT Corridor Hostel Association in Gachibowli, Hyderabad, has issued a notice to residents warning of a possible temporary gas cylinder shortage. […] The post Limited Menus in IT office Cafeterias & Hostels Amid LPG Concerns appeared first on Telugu360 .
ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు..
ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు.. కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
Telangana : తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు
కరీంనగర్ లో ఆ రోజు వరకు డంపింగ్ యార్డ్ తరలిస్తాం: పొన్నం ప్రభాకర్
కరీంనగర్: పెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో కేంద్ర మంత్రి కట్టర్ కరీంనగర్ కి వచ్చినప్పుడు కరీంనగర్ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నటువంటి అనారోగ్యాలకు కారణం అవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సభా వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ నుండి తరలించిన డంపింగ్ యార్డ్ వరంగల్ కరీంనగర్ మధ్యలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ మేనేజ్మెంట్ విషయంలో ఇబ్బందులు లేకుండా రెండు నగరాల మధ్య ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కమిషనర్ కార్పొరేటర్లు కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ లో వెస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి సరైన చర్యలు తీసుకోలేకపోయారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈరోజు డంపింగ్ యార్డ్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపులో డైలీ వచ్చే వెస్ట్ మేనేజ్మెంట్, ఇప్పటికే స్టోర్ అయిన వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా తరలించాలని దానిపై ఒక విధానాన్ని తీసుకుంటామన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తున్నామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యత తీసుకున్నారని, డంపింగ్ యార్డ్ వల్ల కరీంనగర్ ప్రజల శ్వాసకోస ఇబ్బందులతో పాటు అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని, 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ ను ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక రోజులో అయ్యేది కాదు అని, సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులుగా ముఖ్యమంత్రి హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపుకు చొరవ తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డ్ తరలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రపుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు ,ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Harish Shankar’s Quick Response To Tweet On Mahesh Babu
Director Harish Shankar clarified that his recent quote-tweet about Superstar Mahesh Babu was an unintentional error that arose during a hectic workday. The filmmaker stated that the misunderstanding was blown out of proportion due to the incomplete tweet he reacted to. Busy with the promotions and final touches of his upcoming film Ustaad Bhagat Singh […] The post Harish Shankar’s Quick Response To Tweet On Mahesh Babu appeared first on Telugu360 .
కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మృతి చెందారు
తెలంగాణ నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం […] The post తెలంగాణ నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం appeared first on Visalaandhra .
ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఇవాళ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మెసేజ్లు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ మెసేజ్ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక […] The post ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు appeared first on Visalaandhra .
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ ఛార్జ్ను విడతల వారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని మోపాల్సి వస్తోందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా […] The post ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు appeared first on Visalaandhra .
Andhra Pradesh : అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్... నిండా మునిగేది ఎవరో?
కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి అంత కుదురుగా లేదు
మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలి..
మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలి.. మామడ, ఆంధ్ర ప్రభ : గ్రామ
జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న కృష్ణకుమారి
జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న కృష్ణకుమారి ఢిల్లీలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో
KTR : ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి : కేటీఆర్
స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు
సమర్థవంతంగా అమలు చేయాలి.. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్,
బడ్జెట్ కేటాయించలేదని నిరసిస్తూ..
బడ్జెట్ కేటాయించలేదని నిరసిస్తూ.. కృష్ణ ,ఆంధ్రప్రభ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ
కేసీఆర్ క్షమాపణలు చెబితే రాజీనామా చేస్తా
తాను పార్టీ మారినట్లు ఆధారాలు లేవని కడియం శ్రీహరి తెలిపారు
పిల్లల భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన
పిల్లల భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన పరకాల, ఆంధ్రప్రభ : పోలీసుల ఆధ్వర్యంలో పిల్లల
గుడుంబా స్తావరాల పై పోలీసుల దాడులు..
గుడుంబా స్తావరాల పై పోలీసుల దాడులు.. చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
సిలిండర్ కథ తేలితేనే ఐపీఎల్ షెడ్యూల్! #IPL2026#GasCylinderShortage#BCCI#ArunDhumal
విద్యార్థుల అభివృద్ధి కోసం చైత్ర ఫౌండేషన్..
విద్యార్థుల అభివృద్ధి కోసం చైత్ర ఫౌండేషన్.. నిస్వార్థంగా చైత్ర ఫౌండేషన్ పనిచేయడం అభినందనీయం
Ys Jagan : ఆర్థిక విధ్వంసానికి కేరాఫ్ చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు.
విద్యుత్ షాక్ తో మృతి.. వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండలం జాకోర
HYD | కేటీఆర్పై దానం ఆగ్రహం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్,
కడియం శ్రీహరి, దానం నాగేందర్ లకు ఊరట
హైదరాబాద్: అనర్హత పిటిషన్ల విషయంలో ఎంఎల్ఎ కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు ఊరట లభించింది. కడియం, దానంలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయం ప్రకటించారు. బిఆర్ఎస్, బిజెపి వేసిన రెండు పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండడంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు తుది నిర్ణయం తీసుకుంది. మొత్తం పది మంది ఎంఎల్ఎలలో ఇప్పటికే ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు ఈ ఇద్దరు విషయంలో స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఎంఎల్ఎ దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి తాను ఎంపిగా పోటీ చేశానని, తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఫండ్మెంటల్ రైట్ను కాలరాసే హక్కు ఎవరికీ లేదని, గత ఆరు నెలల నుంచి క్షోభను అనుభవిస్తున్నానని, స్పీకర్ను కూడా ఆరు నెలలుగా ఇబ్బంది పడతూ వచ్చారన్నారు. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ఎంఎల్ఎలు పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి ఎంఎల్ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.
తెహ్రాన్ : అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులకు సతమతమవుతున్న ఇరాన్ వాసులకు మరో దెబ్బ తగిలింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు… ఆమ్ల వర్షం రూపంలో ప్రకృతి మరో దెబ్బతీసింది. వైమానిక దాడులతో ఇరాన్ వాసులు ఇప్పటికే భయాందోళనలు చెందుతున్నారు. అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ వర్షం కారణంగా ఇరాన్ వాసులు పలు ఆరోగ్య […] The post ఇరాన్ లో ఆమ్ల వర్షం appeared first on Visalaandhra .
Israel Iran Effectg : యుద్ధం ఎఫెక్ట్.. దుబాయ్ లో పెంపుడు జంతువుల కేకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.
ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన, అవినీతి పంకిలంలో నిండామునిగిన రాజకీయ వృద్ధ జంబూకాలకు గుణపాఠం చెబుతూ, భవిష్యత్తుపై కొండంత ఆశతో నవ యువతరానికి పట్టంగట్టింది పొరుగున ఉన్న హిమాలయ దేశం నేపాల్. అల్లర్లకు, ఆందోళనలకు, రాజకీయ అనిశ్చితికి పెట్టింది పేరైన నేపాల్లో మూడేళ్ల క్రితం కళ్లు తెరిచిన ఒక కొత్త పార్టీకి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టడం ప్రపంచ దేశాలను నివ్వెరపరిచిందంటే అతిశయోక్తి లేదు. దేశంలో పెచ్చరిల్లిపోతున్న అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలను పట్టించుకోకుండా విలాసాలలో మునిగితేలే రాజకీయ నేతల తీరుపట్ల విసిగివేసారిపోయిన ప్రజలు నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, నేపాలీ కమ్యూనిస్టు పార్టీ వంటి పేరొందిన పార్టీలను కట్టగట్టి ఓ మూలకు విసిరిపారేసి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్ పి)కి అందలం అప్పగించారు. గత సెప్టెంబర్ నెలలో ఉవ్వెత్తున ఎగసిన జన్జడ్ ఉద్యమం ప్రధాని కెపి శర్మ ఓలి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంతోనే యువతరం శక్తి ఏమిటో అర్థమైంది. యువతరం నాడి తెలుసుకుని, సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన ఆర్ఎస్పి.. అవినీతిని రూపుమాపి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీలు ఇచ్చి అధికారానికి దగ్గరైంది. 275 స్థానాల పార్లమెంటులో ప్రత్యక్ష ఓటింగ్ జరిగిన 165 సీట్లలో ఇప్పటికే మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్ఎస్పి, మిగిలిన 110 సీట్లకు దామాషా పద్ధతిలో జరిగే ఎన్నికలోనూ తిరుగులేని విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. ర్యాపర్గా వృత్తి జీవితం మొదలు పెట్టి, రాజకీయాల్లోకి అడుగిడిన ముప్ఫయ్ అయిదేళ్ల బాలేంద్ర షా ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే దేశ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించడం ఖాయం. తాజా ఎన్నికల్లో ఆయన మాజీ ప్రధాని కెపి శర్మ ఓలిని 50 వేల ఓట్ల తేడాతో ఓడించారు. దశాబ్దాల తరబడి రాచరిక పాలనలో మగ్గుతూ, ప్రపంచానికి దూరంగా ఉన్న నేపాల్, పద్ధెనిమిదేళ్ల క్రితం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అయినా, తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి పార్టీల పుణ్యమాని, రాజకీయ అనిశ్చితితో అభివృద్ధికి ఆమడదూరంలోనే ఆగిపోయింది. ఏళ్ల తరబడి నేపాల్కు భారత్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోంది. మౌలిక సదుపాయాలు, ఇంధనం, రక్షణ, వాణిజ్య రంగాలలో తలలో నాలుకలా వ్యవహరించే భారత్తో నేపాల్కు ఇటీవలి కాలంలో స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదాలు ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగమైన కాలాపాని, లిపులేక్, లింపియాధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ పేచీపెట్టడమే కాకుండా ఆరేళ్ల క్రితం విడుదల చేసిన చిత్రపటంలోనూ అవి తమ భూభాగాలుగా చూపించడం వివాదాలకు ఆజ్యం పోసింది. లిపులేఖ్ పాస్ మీదుగా భారత్ -చైనా వాణిజ్యానికి అడ్డు చెప్పడం ద్వారా నేపాల్ తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పట్ల బాలేంద్ర షా వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి. బెంగళూరులో ఎంటెక్ పూర్తి చేసి, ర్యాపర్ గా వృత్తి జీవితానికి శ్రీకారం చుట్టిన బాలేంద్ర నేపాల్ ప్రజలకు చిరపరిచితుడే. అవినీతి, సామాజిక అసమానతలపై పాటలు రచించి, పాడుతూ యువతరానికి ఆయన దగ్గరయ్యారు. తదనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, ఇండిపెండెంట్గా పోటీచేసి ఖాట్మండూ మేయర్ పదవిని అధిష్ఠించారు. అయితే, ఆయనది కూడా భారత్ వ్యతిరేక వైఖరేనన్నది గతంలో జరిగిన సంఘటనలను గమనిస్తే అర్థమవుతుంది. ఆ మధ్య బాలేంద్ర విడుదల చేసిన ఒక రాజకీయ చిత్రపటంలో భారత్ లోని కొన్ని భూభాగాలను తమ దేశానికి చెందినవే అన్నట్లుగా చూపించడం వివాదాస్పదమైంది. అంతేకాదు, బాలీవుడ్ సినిమాలను నేపాల్లో నిషేధించాలని కూడా ఆయన ఒక సందర్భంగా డిమాండ్ లేవనెత్తారు. నేపాల్ ప్రయోజనాలే తనకు ప్రధానమంటూ ఎన్నికల ప్రచారంలో పదేపదే వల్లెవేసిన ఆయన తన ఎన్నికల నినాదాన్ని అనుసరించి, పటుతరమైన విదేశాంగ విధానానికి రూపకల్పన చేస్తారా లేక బంగ్లాదేశ్ మాదిరిగా చైనా తాయిలాలకు ఆశపడి అటువైపు మొగ్గు చూపుతారా అనేది ప్రశ్న. అంతకుమించి, ప్రజాభీష్టం మేరకు అవినీతికి అడ్డుకట్టవేసి, పారదర్శక పాలనను అందించడం, నిరుద్యోగాన్ని అంతమొందించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు.
Switzerland |ఆరుగురు సజీవదహనం
Switzerland | ఆరుగురు సజీవదహనం Switzerland | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
తెలంగాణలో సంస్థాగత వృద్ధి రాజకీయ పట్టు కోసం భారతీయ జనతా పార్టీ వివిధ స్థాయిల్లో ఆలోచనలు సాగుతున్నాయి. అవకాశం ఉండి, ఆశించిన స్థాయిలో తెలంగాణలో పార్టీ ఎదగలేకపోతోందనే అసంతృప్తి బిజెపి ఢిల్లీ నాయకత్వానికి ఉంది. ఆ భావనను పార్టీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు సమీక్షా సమావేశాల్లో రాష్ట్ర నాయకులతో వ్యక్తం చేసినట్టు లోగడ వార్తా కథనాలు వచ్చాయి. పార్టీ జాతీయ ఇతర ముఖ్య నేతల్లోనూ ఒక అసంతృప్తి ఉంది. రాష్ట్ర పార్టీ లో ‘ఐక్యత’ కొరవడటమే ప్రధాన సమస్యగా ఉందని, పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న బడానేతలు, కొత్తగా ఎదుగుతున్నవారు, ఇతర పార్టీల నుంచి వచ్చి స్థిరపడ్డవారూ ఉన్నప్పటికీ, వారి మధ్య సయోధ్య లేకపోవడం, ఉమ్మడిగా కార్యాచరణ లేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకున్న అన్ని అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలనే అధినాయకత్వం ఎప్పటికప్పుడు ఉద్బోధిస్తోంది. దేశంలో త్వరలో జరుగనున్న కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టాలని బిజెపి అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. పాలకపక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ నుంచి బలమైన గ్రూప్లను పార్టీలోకి లాగి బిజెపిని బలోపేతం చేస్తే ఎలా ఉంటుందనే యోచన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశించిన మేర ఫలితాలు దక్కలేదనే అసంతృప్తి ఉంది. కరీంనగర్ కార్పొరేషన్పై పార్టీ జెండా ఎగిరినా, నిజామాబాద్లో మెజారిటీ స్థానాలు దక్కినా.. అక్కడి స్థానిక పరిస్థితులు, ముఖ్యంగా ‘హిందుత్వ’ అంశం వంటివే తప్ప పూర్తి ఘనతను నాయకత్వానికే ఇచ్చే పరిస్థితి లేదు. 8 మంది చొప్పున పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలున్నా పార్టీకి ఎన్నిదగిన రీతిలో ఫలితాలు రాలేదు. నగర- పట్టణ పార్టీగా బిజెపికి పేరుండి, మున్సిపల్ ఎన్నికల్లోనే తగు ఫలితాలు రాబట్టకుంటే ఇక పల్లె ప్రాంతాల్లో చొచ్చుకుపోయి ముద్రవేయడం కష్టమౌతుంది కదా? అన్నది వారి ఆందోళనగా ఉంది. కొట్టిపారేయలేని వాదన! రాష్ట్రంలో పాలక కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామంటే తామని బిఆర్ఎస్, బిజెపి ఇద్దరూ అనుకుంటున్నారు. బిజెపితో కలిసి సాగే ప్రసక్తే రాదని బిఆర్ఎస్, అసలు బిఆర్ఎస్తో పొత్తుకు ఆస్కారమే లేదని బిజెపి బల్లగుద్ది చెబుతున్నాయి. రెండు పార్టీల నాయకత్వం కూడా ‘మేం కలువబోం’ అని బహిరంగంగా ప్రకటిస్తోంది. కలుస్తారనే స్పష్టమైన సంకేతాలు కూడా లేవు. కానీ, లోపల ఏదో ఇరువురి మధ్య సఖ్యతకు ఆస్కారం ఉందనే అభిప్రాయం ఉభయ పార్టీ కార్యర్తల శ్రేణుల్లోనే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత పౌరుల్లోనూ వినిపిస్తోంది. ‘చూస్తూ ఉండండి, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతాయి, కాంగ్రెస్ను గద్దె దింపుతాయి’ అంటూ రాజకీయాల్లో తలపండిన రిటైర్డ్ టీచరొకరు చేసిన వ్యాఖ్య క్షేత్రంలో ప్రచారాలకు అద్దం పడుతోంది. ‘బిఆర్ఎస్తో పొత్తుండదు’ అని రామచందర్ రావు పదే పదే చెబుతున్నా, ఇటువంటి విషయాల్లో రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా కేంద్ర నాయకత్వం నిర్ణయాలు రుద్దడమే బిజెపిలో ఎప్పుడూ జరిగేది. తెలంగాణలో మేం సంపూర్ణ ఆధిక్యతకే యత్నిస్తాం, నేరుగా మేం ఆధిపత్యం చూపలేని చోట కాంగ్రెస్ స్పేస్ తగ్గించడానికి కమ్యూనిస్టేతర, కాంగ్రేసేతర శక్తులతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?’ అనే చర్చ ఒకటి పార్టీలో ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఎపి, తమిళనాడు, కేరళ, కర్నాటకలో ఇటువంటివి జరుగుతున్నపుడు, ఇక్కడ జరిగితే మాత్రం తప్పేంటి? అన్న వాదనలో లాజిక్ ఉందనిపిస్తుంది. ఆంతరంగిక చర్చల్లోనయినా ఇంతమేరకు బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు తప్ప బిఆర్ఎస్లో మాత్రం ఒక మాట కూడా వినిపించడం లేదు. ఆ పార్టీలోని ముఖ్యులు కొందరిని బిజెపిలోకి చేర్చుకునే ప్రయత్నమేదో లోలోపల జరుగుతోందనే ప్రచారం చాలా కాలంగా తెంగాణ రాజకీయ వర్గాల్లో ఉంది. ఫార్ములాల చర్చా సాగుతోంది తెలంగాణలో బిజెపి -బిఆర్ఎస్ మధ్య పొత్తంటూ ఉంటే ఏం ఫార్ములా అనుసరిస్తారు? అన్నది అందరికీ ఆసక్తి కలిగించేదే! ఇది కూడా అక్కడక్కడ ప్రస్తావనకు వస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బిజెపి పక్షంలో 75ః25 , అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పక్షంలో 75ః- 25 శాతం స్థానాల నిష్పత్తిలో ఉభయ పార్టీలు అంగీకారానికి రావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటువంటి నమూనా ఒకటి గతంలోనే జాతీయ పార్టీలకు తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు కుదిరేది. సాగినంత కాలం ఏ ఇబ్బందీ లేకుండా ఇటువంటి సఖ్యత వారిమధ్య నడిచింది. కానీ, జాతీయ పార్టీల ప్రాబవం తమిళనాట తగ్గిన దరిమిళా పరిస్థితులు, సమీకరణాలు అక్కడ కూడా మార్పునకు గురయ్యాయి. లోక్సభకు తాను ఎక్కువ స్థానాలు తీసుకొని, అసెంబ్లీ విషయంలో చెరి సమాన స్థానాల్లో పోటీ చేసి, మెజారిటీని బట్టి ముఖ్యమంత్రి పదవి తీసుకుందామనే ఫార్ములాకు బిజెపి పట్టుబట్టవచ్చన్న వాదన కూడా ఒకటుంది. ఇటువంటి నమూనాను ఇదివరకే బిజెపి మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో అనుసరించి, సుస్థిర ఫలితాలు సాధించిన అనుభవం ఉంది. అందుకు బిఆర్ఎస్ ఏ మేరకు అంగీకరిస్తుందన్నది వేచిచూడాల్సిందే! ‘ఎట్టి పరిస్థితిలోనూ, ఏ పక్షానికీ అనుకూలంగా వ్యవహరించకూడదు, మనకు వస్తే వచ్చింది, లేదంటే విపక్షంలోనే కూర్చుందాం’ అని మొన్నటి మున్సిపల్ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి రామారావు పార్టీ నాయకుల సమావేశంలో స్పష్టత ఇచ్చినట్టు బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కానీ, ఎన్నికల తర్వాత స్థానిక పరిస్థితులు, సందర్భాన్ని బట్టి మూడు పార్టీల వాళ్లూ గీతదాటిన సందర్భాలు కళ్లకు కట్టాయి. బలం-బలహీనతలే నిర్ణయిస్తాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ బిఆర్ఎస్, బిజెపిలు కలవకూడదనే కాంగ్రెస్ కోరుకుంటుంది. వారిద్దరు విడివిడిగా పోటీ చేస్తేనే ఎన్నికల రాజకీయాల్లో తమ పరిస్థితి మెరుగ్గా ఉంటుందనేది వారి లెక్క! వేరెవరు పెద్దగా ప్రస్తావించకపోయినా, తరచూ కెసిఆర్ పేరు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శలు చేయడం వెనుక వ్యూహం ఉందని అంటారు. కెసిఆర్ తనకు తాను బలహీనపడ్డట్టు తలపోసిన రోజున, బిజెపితో పొత్తుకు ఆయన సిద్ధపడవచ్చని, అదే జరిగితే రాజకీయంగా తమకు నష్టమని రేవంత్రెడ్డి భావిస్తుండవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. కవిత పార్టీ నుంచి రాజకీయంగా, కుటుంబం నుంచి మనోభావాల పరంగా దూరమవటం కెసిఆర్ను కలతకు గురిచేస్తున్నట్టు ఆయనను సన్నిహితంగా ఎరిగిన వారు చెబుతారు. ఇటువంటి పరిస్థితుల్లో కెసిఆర్ ఒక గౌరవప్రదమైన రాజకీయ మార్గాంతరం ఎంచుకోవడంలో భాగంగా బిజెపితో సఖ్యత పొత్తుకు మొగ్గుతారా? అందుకు ససేమిరా అంటారా? అన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపి లోనూ ఓ అంతర్మథనం జరుగుతోంది. పార్టీ సిద్ధాంత నిబద్ధతపరంగా, సైద్ధాంతిక భూమిక అయిన సంఘ్ మద్దతుపరంగా రాష్ట్ర అధినేత రాంచందర్ రావు బలమైన నాయకుడే అయినా పార్టీని దూకుడుగా నడుపలేకపోతున్నారనే విమర్శ ఉంది. పార్టీ రాష్ట్ర విభాగంలో కొందరికి బిఆర్ఎస్ పట్ల సుహృద్భావం ఉంటే, మరికొందరికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్ల సానుకూల ధోరణి ఉంది. ఆధారాలు లేకపోయినా, ఈ రకంగా కొన్ని ‘మ్యాచ్ ఫిక్సింగ్’లూ జరుగుతాయని పార్టీలోనే గుసగుసలున్నాయి. పార్టీలోని కొందరికి బిజెపి కేంద్ర నాయకత్వంపైన కూడా కినుక ఉంది. బిజెపి పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులకన్నా విరివిగా తెలంగాణ సిఎం రేవంత్రెడ్డికి ప్రధాని వద్ద అపాయింట్మెంట్, ప్రాపకం లభించడాన్ని వారు అభ్యంతరపెడుతున్నారు. ఇలా ఇరుపక్షాల నుంచి చాలా అంశాలున్నాయి. రాజకీయ అవసరాల కోసం కారు, కమలం కలిసేనా? అన్నది రాగల కాలమే నిర్ణయించాలి. దిలీప్రెడ్డి సమకాలీనం (రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)
మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలు..
మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలు.. కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు ప్రధాన
మీ కారుకు బుల్ బార్ ఉందా? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే
మీ కార్లకు అదనపు హంగులు సమకూర్చుకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు
Telangana |క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్
Telangana | క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ Telangana | ఆంధ్రప్రభ, వెబ్
ఎంత పని చేశావ్ తల్లి... పిఎస్ లో పెళ్లి... చెట్టుకు యువతి ఉరేసుకొని
అమరావతి: ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు... పెద్దలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రియుడి తల్లి, బంధువులు ఒప్పుకోకపోవడంతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోగా యువతి చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మహానందిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈశ్వర్నగర్లో శివప్రసాద్, స్వప్న అనే యువతి యువకుడు గత మూడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకుంటామంటే పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇరువైపుల కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమజంట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పోలీసులు ఇరువైపుల పెద్ద మనుషులను పిలిపించి పిఎస్ లో పెళ్లి జరిపించారు. కానీ శివ తల్లి ఒప్పుకోకపోవడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే యువతి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందింది. ప్రస్తుతం శివ నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమార్తెను హత్య చేసి ఉరేశారని, శివ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడుతున్నాడని స్వప్న తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. శివ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Manchu Manoj’s “No Excuses” Training Push Builds Momentum for David Reddy
Actor Manchu Manoj has once again drawn attention after sharing a powerful glimpse into his ongoing transformation journey. Known for his intense screen presence and commitment to physically demanding roles, the actor recently posted workout images along with a candid note about the discipline he has embraced in recent weeks. The update quickly resonated with […] The post Manchu Manoj’s “No Excuses” Training Push Builds Momentum for David Reddy appeared first on Telugu360 .
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.. బీబీనగర్/ ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
యుద్ధం నేర్పుతున్న ఆర్థిక పాఠాలు
ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తున్నట్టుగానే, చమురు ధరలు పెరిగి, కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఖరీదవుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ గొలుసులా అనుసంధానమై ఉన్నందున, దాని తీవ్ర ప్రభావం భారతీయ సామాన్య ప్రజల జీవన వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదాలు తీసుకురావచ్చు? ప్రభుత్వం, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇవి చర్చించాల్సిన అత్యవసర అంశాలు. పశ్చిమాసియా ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. హోర్ముజ్ జలసంధి వంటి మార్గాల ద్వారా ప్రతి రోజూ లక్షల కోట్ల డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్కు సరఫరా అవుతుంది. ఇక్కడ యుద్ధం లేదా ఉద్రిక్తతలు పెరిగితే, ఈ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడటం సహజం. ఫలితంగా అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. భారతదేశం తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు తప్పకుండా పెరుగుతాయి. ఇటీవలి రోజుల్లోనే ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్లు పెరిగిన తర్వాత, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 10 డాలర్లు పైబడి పెరిగాయి. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) అంచనాల ప్రకారం, దేశ ద్రవ్యోల్బణాన్ని 0.5-1 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ఇంధన ధరల పెరుగుదల అంటే కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు; అది మొత్తం ఆర్థిక వ్యవస్థను కదిలిస్తుంది. రవాణా ఖర్చులు పెరిగితే, రైతు పొలంలో పండిన కూరగాయలు, పప్పులు, ధాన్యాలు నగర మార్కెట్లకు చేరే దాకా ప్రతి దశలో వ్యయం పెరుగుతుంది. ఉదాహరణకు, రవాణా ఖర్చు పెరగడంతో కిలో టమాటా 20 -30 రూపాయలు ఎక్కువగా పలికే అవకాశం ఉంది. ఇది మధ్య, దిగువ తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు, ఎర్రసముద్రం మార్గంలోని ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భారతదేశం నుంచి యూరప్కు వెళ్లే 40% సరుకులు ఈమార్గం ద్వారానే ప్రయాణిస్తాయి. హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగితే, నౌకలు ఆఫ్రికా చుట్టూ పొడవైన మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది. ఫలితంగా, రవాణా సమయం 10-15 రోజులు పెరిగి, ఖర్చులు 20-30 శాతం పెరుగుతాయి. బీమా ప్రీమియంలు కూడా డబుల్ అవుతాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం, ఈ మార్గం పూర్తిగా మూసివేయబడితే, దిగుమతి వస్తువుల ధరలు 5-10 శాతం పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, యంత్రాలు, మొబైల్ ఫోన్లు అన్నీ చైనా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ ధరల పెరుగుదల పరిశ్రమలు, వినియోగదారులపై భారం పడుతుంది. ఇటీవలి నెలల్లో ఎర్ర సముద్రంలో దాడులు పెరిగిన తర్వాత, ఓడ ఖర్చులు 40% పెరిగాయి, ఇది భారత ఎగుమతులపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం. చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, అమెరికా, ఆస్ట్రేలియాతో ఒప్పందాలు పెంచడం, వ్యూహాత్మక చమురు నిల్వలు (90 రోజుల అవసరం) సమర్థంగా వాడడం వంటివి ధరలను కొంత నియంత్రించగలవు. తాత్కాలికంగా పెట్రోల్, డీజిల్పై పన్ను సడలింపులు ఇవ్వడం, రవాణా రంగానికి సబ్సిడీలు ప్రకటించడం ఉపయోగకరం. దీర్ఘకాలికంగా, పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెంచడం - సోలార్, విండ్ ఎనర్జీలో 50 జిడబ్లు లక్ష్యం వేసుకోవడం - దిగుమతి ఆధారాలను తగ్గిస్తుంది. ఈ సంక్షోభం మనకు ఒక పాఠం. యుద్ధం ఎక్కడ జరిగినా, దాని బాధను భరించేది సామాన్య ప్రజలే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అంతర్జాతీయ సంభాషణలు, దౌత్య పరిష్కారాలు అవసరం. భారతదేశం వంటి దేశాలు యుఎన్, జి20 వేదికలపై శాంతి ప్రయత్నాల్లో ముందుండాలి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే, భారతీయ వంటగదుల్లో నిశ్చింతం తిరిగి వస్తుంది. ఇది కేవలం ఆర్థిక అంశం కాదు, మానవతా విలువల సమస్య. ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి, 9032042014
బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పారు
బెంగాల్పై బిజెపి సరికొత్త అస్త్రం
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించేందుకు భారత ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న సమయంలో గత వారం అకస్మాత్తుగా తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన గవర్నర్ల మార్పు రాజకీయ వర్గాలలో విస్మయం కలిగించింది. ముఖ్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ గవర్నర్లను మార్చడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు రాజ్భవన్లను ‘రాజకీయ పునరావాస కేంద్రాలు’గా మార్చారని విమర్శలు చెలరేగగా, ప్రస్తుతం అవి బిజెపి ‘వార్రూమ్’లుగా మారినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు అడుగడుగునా అడ్డుపడుతూ, అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆమోదింపకుండా, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాలను అసెంబ్లీలలో చదవకుండా ‘రాజకీయ పాత్రలు’ వహిస్తూ ఉండటంతో ఈ వివాదాలు సుప్రీంకోర్టు ముందుకు కూడా వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ అర్ధాంతరంగా రాజీనామా చేయడం, ఆయన స్థానంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని నియమించడం రాజకీయ వర్గాలలో కలకలం రేకెక్తిస్తున్నది. ఈ మార్పులు ‘పరిపాలన సామర్థ్యం’ కోసం కాకుండా, లోతయిన రాజకీయ ఎత్తుగడలతో భాగంగానే జరిగిన్నట్లు సర్వత్రా విశ్వసిస్తున్నారు. ఐపిఎస్ అధికారిగా పనిచేసి, నాగాలాండ్లో తిరుగుబాటు వర్గాలతో శాంతి ఒప్పందం కుదర్చడంలో విజయవంతమై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని రవి ఆకర్షించారు. నిఘా, జాతీయ భద్రతా విభాగాలలో పనిచేసిన అనుభవం ఉండడంతో సున్నితమైన నాగాలాండ్ గవర్నర్గా నియమించారు. అయితే, అక్కడ బిజెపి భాగస్వామిగాగల సంకీర్ణ ప్రభుత్వం ఆయన తీరు నచ్చక ఆయనను బదిలీ చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ఆయనను తమిళనాడు గవర్నర్గా నియమించి ‘పదవోన్నతి’ కల్పించారు. తమిళనాడులో అసెంబ్లీ ఆమోదించిన సుమారు 20 బిల్లులను ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. గవర్నర్ చర్యను ‘చట్టవ్యతిరేకం’ అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టింది. ముఖ్యమంత్రి ఎంకెస్టాలిన్ ప్రతిపాదించిన ఓ మంత్రితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే అధికారం గవర్నర్లకు లేదని ధర్మాసనం స్పష్టం చేయడంతో ఆయన చివరకు ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్న అసోంలో మరోసారి గెలుస్తామని ధీమాతో ఉండగా, కేవలం పశ్చిమబెంగాల్లో మాత్రమే ఎట్లాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. ఉత్తరాదిన, ఈశాన్య రాష్ట్రాలలో దాదాపు అన్ని రాష్ట్రాలలో బిజెపి ప్రభంజనం వీస్తున్నా ఈ రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి రాలేకపోతున్నది. గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగించినా కాంగ్రెస్, సిపిఎంలను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా మాత్రమే చోటు సంపాదింపగలిగింది. అందుకనే, ఈ పర్యాయం లోక్భవన్ కేంద్రంగా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహంలో భాగంగా అందుకు సమర్థుడని భావించి ఆర్ఎన్ రవిని ఇక్కడకు బదిలీ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. గవర్నర్ల మార్పును ప్రకటించేందుకు కొన్ని గంటల ముందే బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన రాజీనామాను ప్రకటించారు. ఢిల్లీలో పెద్దలను కలిసేందుకు వెళ్లిన ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించారు. అందుకు ఎటువంటి కారణాలు ప్రకటించలేదు. కేవలం ‘వ్యక్తిగత, ఆరోగ్య’ కారణాలు అంటూ పొడిపొడిగా చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మమతా ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో ఇరకాటంలో పడవేయలేరనే ఆయనను అర్ధాంతరంగా బదిలీ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. మే, 2025లో రాజ్భవన్లో ఓ తాత్కాలిక మహిళా ఉద్యోగిని తనను గవర్నర్ లైంగికంగా వేధించారని చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలంరేపాయి. ఆ ఆరోపణలకు సంబంధించిన కేసు ఇంకా పోలీసులవద్దే ఉంది. అందుకనే మమతా ప్రభుత్వం పట్ల కఠినంగా వ్యవహరింపలేదని బిజెపి అధిష్టానం భావించి, ఆయనకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తున్నది. అయితే, లోక్భవన్ను ‘బిజెపి వార్రూమ్’గా మార్చితే తమిళనాడులో ఎంకె స్టాలిన్ సహనంతో, మర్యాదగా వ్యవహరించారు. న్యాయస్థానాలకు వెళ్లారు గాని గవర్నర్ను వీధులలో నిలదీసే ప్రయత్నం చేయలేదు. కానీ, మమతా రాజకీయ ప్రస్థానం వీధి పోరాటాల నుండి వచ్చింది. ఆమె ఇడీ, సిబిఐ కార్యాలయాలపై దాడులకు సైతం వెనకాడటం లేదు. చివరకు ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టులో దోషిగా నిలబెట్టి, తానే స్వయంగా వాదించారు. స్టాలిన్తో వ్యవహరించినట్లు ఆమెతో వ్యవహరిస్తే ఆమె గాండ్రిస్తారు. ఇప్పటికే బిజెపి నేతలను ‘బైటవారు’, తాను ‘బెంగాల్ కుమార్తె’ అంటూ రాజకీయ ప్రజలలో గుర్తింపు పొందుతున్న ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకే రవి దోహదపడే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఎన్నికల ప్రకటన వెలువడగానే రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉంటుంది. పరోక్షంగా గవర్నర్ అజమాయిషీలో ఉంటుంది. ఆ విధంగా మమతను ఓడించేందుకు లోక్భవన్ నుండి రవి ద్వారా పావులు కదిపేందుకు బిజెపి ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇప్పుడు బిజెపి ఎన్నికలలో విజయం కోసం ఓటర్లపై, బాలట్ బాక్స్ లపై కాకుండా ఎన్నికల కమిషన్, గవర్నర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో చేపట్టిన ఎస్ఐఆర్ను సైతం ఈ దృష్టాంతంతోనే చాలామంది చూస్తున్నారు. అయితే, బిజెపికి క్షేత్రస్థాయిలో ప్రజలలో పట్టగలిగిన నాయకత్వం, ప్రజాకర్షణ కలిగిన నాయకత్వం లేకపోవడంతో కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా అవి వికటించి, ప్రతికూలంగా మారుతున్నాయని విషయాన్ని మరచిపోతున్నారు.ఎస్ఐఆర్ పక్రియ ద్వారా లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించగా, బెంగాల్లో గత ఎన్నికలలో గెలిచినా అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఓట్లకు మించి ఎక్కువ ఓట్లను 35 నియోజకవర్గాలలో తొలగించారని చెబుతున్నారు. ఆ విధంగా ఆయా నియోజక వర్గాలలో ఫలితాలను తారుమారు చేయాలనే వ్యూహం కనిపిస్తుంది. అయితే, ఆ విధంగా ఓట్లు తొలగించిన 35 నియోజకవర్గాలలో 22 బిజెపి అభ్యర్థులు గెలుపొందిన నియోజక వర్గాలు కావడం గమనార్హం. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ బిజెపి అభ్యర్థులకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. పైగా, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్లో బిజెపి అంతర్గత కుమ్ములాటలతో బలహీనం అవుతూ వస్తున్నది. పలువురు కీలక నాయకులు పార్టీని విడిచిపెట్టారు లేదా క్రియాశీలకంగా పనిచేయడం లేదు. ఆ ఫలితంగానే 2024 లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ ఎంపిల సంఖ్య 18 నుండి 12కు తగ్గింది. దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తున్న నాయకులకు, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు మధ్య సయోధ్య కనిపించడం లేదు. కేంద్ర నాయకత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఐకమత్యంగా వారితో పనిచేయించడం కనిపించడం లేదు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మమతా ప్రజలకు దగ్గరవుతున్నారు. ముఖ్యంగా మహిళలో ఆమె తిరుగులేని నాయకురాలు. మమత ‘స్థానిక- బయటివారు’ ప్రచారంతో ఇతర రాష్ట్రాలలో మాదిరిగా ప్రధాని మోడీ, అమిత్ షా వంటి నేతల ప్రచారం ఈ రాష్ట్రంలో బిజెపికి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. చలసాని నరేంద్ర 98495 69050
తగ్గుతున్న ఎల్పీజీ నిల్వలు విశాఖపట్నం: విశాఖ ఉక్కుపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) నిల్వలు తగ్గిపోవడంతో ఆ ప్రభావం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉక్కు ఉత్పత్తిపై పడుతోంది. ప్లాంట్లోని స్టీల్ మెల్ట్షాప్ (ఎసఎంఎస్) వద్ద బ్లూమ్స్ను కట్ చేయడానికి ఎల్పీజీ వాడతారు. ఎసఎంఎస్-2 వద్ద డీగ్యాసింగ్ ప్రక్రియలో, ఇంజినీరింగ్ షాప్లో వివిధ పనులకు ఎల్పీజీని వినియోగిస్తారు. రోజూ 4 వేల బ్లూమ్స్ కట్ చేయాల్సి ఉంటుంది. వాటిని కట్ చేస్తేనే బెడ్ […] The post విశాఖ ఉక్కుపై యుద్ధ ప్రభావం appeared first on Visalaandhra .
ఆ విషయంలో.. ప్రభుత్వాలు విఫలం..
ఆ విషయంలో.. ప్రభుత్వాలు విఫలం.. మునుగోడు, ఆంధ్రప్రభ : చేనేత కార్మికులను ఆదుకోవడంలో
చిన్న ఓగిరాలలో కుల గోల.. ఉయ్యూరు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు మండలం చిన్న
సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి..
సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి.. 160 క్వింటాళ్ల చౌక బియ్యం స్వాధీనం
భారత్ అదరహో..... టీమిండియాకు రూ.131 కోట్ల నజరానా
ముంబై: టి20 ప్రపంచకప్ ట్రోఫీ సాధించిన టీమిండియాపై కనక వర్షం కురువనుంది. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) రూ.131 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు. గతంలో విజేతగా నిలిచిన టీమిండియాకు బిసిసిఐ రూ.125 కోట్లు అందించింది. ఈసారి దాన్ని రూ.131 కోట్లకు పెంచింది. టి20 ప్రపంచకప్లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. భారత్కు ఇది మూడో టి20 ప్రపంచకప్ ట్రోఫీ కావడం విశేషం. మరే జట్టు కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా అసాధారణ ఆటతో ఛాంపియన్గా అవతరించింది. లీగ్ దశలో భారత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేదు. పసికూన అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో అతి కష్టం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచేందుకు సర్వం ఒడ్డాల్సి వచ్చింది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ చెమటోడ్చక తప్పలేదు. ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు అష్టకష్టాలు పడింది. అయితే నమీబియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో మాత్రం అలవోక విజయం సాధించి లీగ్ దశను అజేయంగా ముగించింది. కానీ సూపర్8 ఆరంభ మ్యాచ్లోనే ఎవరూ ఊహించని ఫలితం ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో చిత్తుగా ఓడింది. సొంత గడ్డపై భారత్కు ఇలాంటి పరాజయం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేక పోయారు. అసాధారణ ఆటతో చెలరేగి పోయిన సఫారీ టీమ్ను భారత్ను చిత్తుగా ఓడించింది. ఇలాంటి స్థితిలో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. లీగ్లో అదరగొట్టిన జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్లతో జరిగిన మ్యాచ్లు భారత్కు సవాల్గా మారాయి. ఈ జట్లను ఓడించి సెమీస్కు చేరడం టీమిండియాకు అంత తేలిక కాదని విశ్లేషకులు సయితం అంచనా వేశారు. సంజు మార్క్ విజయం.. సఫారీ జట్టు చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్కు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఊరట లభించింది. ఈ మ్యాచ్లో టీమిండియా అలవోక విజయం సాధించింది. తర్వాత వెస్టిండీస్ జరిగిన మ్యాచ్లో ఓపెనర్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టిన శాంసన్ 50 బంతుల్లోనే అజేయంగా 97 పరుగులుచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లోనూ సంజు చెలరేగి పోయాడు. ఇంగ్లీష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సంజు 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లోనూ సంజు అసాధారణ బ్యాటింగ్తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సంజు 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. బుమ్రా ముద్ర మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా కూడా భారత్ ప్రపంచ ఛాంపియన్గా నిలువడంలో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచుల్లో 12.43 సగటుతో 14 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో 6.21 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఫైనల్లో అసాధారణ బౌలింగ్తో అదరగొట్టాడు. కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లోనూ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక హార్దిక్, దూబె, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తదితరులు కూడా భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్తోవిఫలమైనా అద్భుత కెప్టెన్సీతో భారత్ను ఛాంపియన్గా నిలిపాడు.
విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం..
విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం.. మహమ్మదాబాద్, ఆంధ్రప్రభ : క్లాస్ రూమ్ పైకప్పుఊడి

34 C