మనతెలంగాణ/హైదరాబాద్: లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన నల్ల బిల్లును ఇండియా కూ టమి చిత్తుగా ఓడించిందని వ్యాఖ్యనించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం పన్నిన డీలిమిటేషన్ కుట్రను ప్రజాస్వామ్య శక్తులు సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక బిల్లు వీగిపోవడం కాదు, సమాఖ్య స్ఫూర్తికి దక్కిన విజయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణల పేరుతో దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీసేందుకు ఏ శక్తులు ప్రయత్నించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వాటిని తిప్పికొడుతుందని ఈ ఓటింగ్ నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
టెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చో టు చేసుకుంది. ఇజ్రాయెల్లెబనాన్ మధ్య కా ల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు పెద్ద ఉపశమ నం కలిగించేలా ఇరాన్ శుక్రవారం హార్మూజ్ జ లసంధిని అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అ నుమతించనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అ బ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. లెబనాన్తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకు న్న నేపథ్యంలో ఇరాన్ నుండి ఈ ప్రకటన వెలువడింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉ న్నంత వరకు హార్మూజ్ జలసంధి తెరిచే ఉం టుంది అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, లెబనాన్లో కాల్పుల విరమణకు అనుగుణంగా, హార్మూజ్ జలసంధి ద్వారా అన్ని వాణిజ్య నౌకలకు ప్రయాణం పూర్తిగా అనుమతించబడుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో, కాల్పుల విరమణ కాలం మిగిలిన భాగం వరకు ఈ అనుమతి అమల్లో ఉంటుంది అని వెల్లడించారు. ఈ నిర్ణయం వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. ఆయన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ, హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచారని, అన్ని రవాణాలకు సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. ధన్యవాదాలు! అని పేర్కొన్నారు. అయితే, ఇరాన్ నౌకాశ్రయాల నుంచి వెళ్లే లేదా అక్కడికి వచ్చే నౌకలపై అమెరికా నౌకాదళ ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి పూర్తిగా తెరవబడి వ్యాపారానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇరాన్కు సంబంధించిన నౌకలపై నౌకాదళ ఆంక్షలు కొనసాగుతాయి. మా-కు, ఇరాన్ కు మధ్య ఒప్పందం పూర్తిగా ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది, ఎందుకంటే చాలా అంశాలు ఇప్పటికే చర్చించి, నిర్ణయించబడ్డాయి అని ట్రంప్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధి: ఘటనల కాలక్రమం మార్చి 2న, అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్ సైనిక మౌలిక వసతులు, ఉన్నతాధికారుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత, ‘స్నేహపూర్వకంగా లేని దేశాలకు’ చెందిన నౌకల రాకపోకలను హార్మూజ్ జలసంధిలో పరిమితం చేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసింది. చమురు ధరలు వేగంగా పెరిగాయి. భారత్లో కూడా కొంతకాలం ఎల్పీజీ కొరత కనిపించింది, ఎందుకంటే హార్మూజ్ ప్రాంతంలో కొన్ని నౌకలు దెబ్బతిన్నాయి. అయితే, ఆ తర్వాత ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా ఈ మార్గాన్ని దాటడంతో పరిస్థితి త్వరగా సాధారణమైంది. నేడు ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెట్ ధర 8 శాతం మేర క్షీణించి 90 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ మే నెల కాంట్రాక్ట్ 9.8 శాతం క్షీణించి బ్యారెట్ ధర 85 డాలర్లకు చేరువైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లు పైనే ట్రేడవుతూ వచ్చింది. క్రూడాయిల్ తగ్గుముఖం పట్టడం వల్ల దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు మేలు చేకూరుతుంది.
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుకు స్టీరింగ్ కమిటీ
మన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత ప రిష్కార మార్గాలను అన్వేషించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పనుల స మన్వయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉ న్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీల క నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడు, రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మెంబర్లుగా కె.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ (టెక్నికల్), ఎంఎస్ఎన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, సిడిఓ, సెల్వ బాలన్, అడిషనల్ డైరెక్టర్, సిడబ్లూపిఆర్ఎస్, సాయికృష్ణ, ఎండి, ఎంఎస్ ఆఫ్రి ఇండియా లిమిటెడ్, ఎస్.సురేష్కుమార్, జనరల్ మేనేజర్, ఎల్ అండ్ టి, మల్లికార్జున రావు, వైస్ ప్రెసిడెంట్, ఆఫ్రాన్స్, మాధవ్, ప్రాజెక్టు మేనేజర్, నవయుగ, టి.శ్రీనివాసరావు గుప్తా, సీఈ, రామగుండం (మెంబర్ కన్వీనర్గా) వ్యవహారించనున్నారు. ఈ కమిటీ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేయడంతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురానుంది. వారానికి రెండుసార్లు సమావేశమై పనుల పురోగతిని ఈ కమిటీ సమీక్షిస్తుంది. ప్రతిరోజూ జరిగే పనులపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 30వ తేదీ లోపు కసరత్తు పూర్తి.. వర్షాకాలం ప్రారంభం కాకముందే కీలకమైన పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. బ్యారేజీల పునాదుల పటిష్టతను తెలుసుకోవడానికి మే 30వ తేదీ లోపు జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, అనుమతుల మేరకు మాత్రమే ఈ మరమ్మతు పనులు సాగనున్నాయి. ముందుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, మేడిగడ్డను పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మెమో నెంబర్ 8141/ప్రాజెక్ట్ IV/A1/2023, తేదీ 13.04.2026 ఇరిగేషన్ సెక్రటరీ ఈ.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
30లక్షల ఎంటిల బాయిల్డ్ రైస్ సేకరించాలి
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి పం టకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్ష ల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్ రైస్ మిల్లింగ్కు అనుకూలమని వారు కేంద్ర మం త్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి జోషిని ఆయన నివాసంలో సిఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బా యిల్డ్ రైస్కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 ఎల్ఎంటి ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుకూలంగా ఉంటుందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్ఎంటి బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటి రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను.. 201415 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని.. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసిడిఎస్ల పరిధిలో పంపిణీ చేసేవారని ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునః ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, సెక్రటరీ కో ఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. శుక్రవారం ఉద యం నుంచి సెంట్రల్ సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వర కు తరబడి వేచిచూశారు. 2002లో ఏర్పా టు చేసిన సర్వర్లో కొన్ని రోజులుగా సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతుండడంతో రెం డు, మూడు గంటల పాటు రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం శుక్రవా రం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు సర్వర్లో ఇబ్బందులు తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. టెక్నికల్ టీంతో సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి సాయంత్ర 7 గం టల వరకు కృషి చేశారు. ఈ టీంలతో పాటు సబ్ రిజిస్ట్రార్లతో ఎప్పటికప్పుడు ఆ శాఖ డిఐజీ సుభాషిణి నిరంతరం సంప్రదింపులు జరిపారు. మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే, 2002లో ఏర్పాటు చేసిన సర్వర్ స్థానంలో కొత్త సర్వర్ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో ఆ శాఖ ఉన్నతాధికారులు టెండర్లను సైతం పిలిచారు. నాలుగైదు నెలల్లో కొత్త సర్వర్ అనుసంధానం పూర్తయితే మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ మధ్యన స్లాట్ బుకింగ్, ఈ సిగ్నచర్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా అమల్లోకి తీసుకురావడంతో సర్వర్పై అదనపు భారం పడి అది మొరాయిస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం సర్వర్ కొనుగోలు కోసం సుమారుగా రూ.12 కోట్ల నిధులను సైతం కేటాయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు పూర్తయితే రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడదని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. సర్వర్ మొరాయించడంతో శుక్రవారం బుక్ అయిన స్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను శనివారం చేస్తామని, వీటితో పాటు శనివారం బుక్ చేసుకున్న స్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లను కూడా ఇదే రోజు పూర్తి చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
డిమాండ్ల సాధనకు ఉద్యోగుల ఉద్యమబాట
మనతెలంగాణ/హైదరాబాద్: సమస్యల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కారు. పీఆర్సీతోపాటు పెండింగ్ బకాయిలను, ఈహెచ్ఎస్ కార్డులు, సిపిఎస్ రద్దుతోపాటు 60పైచిలుకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మం డల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని అన్ని హెచ్ఓడి కార్యాలయాలు, సెక్రటేరియేట్ లలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు నల్లబ్యాడ్జిలు ధరించి ఈ నిరసన కార్యక్ర మం చేపట్టారు. టిజిఈజేఏసీ ఉద్యోగ సంఘా ల చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీ, కో-చైర్మన్స్లు చావా రవి, వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్కుమార్, ఎం.బి కృష్ణయాదవ్, శ్రీకాంత్, జి.నిర్మల, రమేష్ పాక, గండూరి వెంకట్లతో పాటు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్లు, సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ల ఆధ్వర్యంలో లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బకాయిలను విడుదల చేయాలి: జగదీశ్వర్, ఏలూరి 2వ పిఆర్సి కమిటీని వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదికను సమర్పించలేదని, పీఆర్సీ నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్మెంట్తో జూన్ 2వ తేదీలోపు 2వ పిఆర్సిని అమలు చేయాలని టిజిఈజేఏసీ ఉద్యోగ సంఘాల చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు రూ. 13,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలి: లచ్చిరెడ్డి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని అనంతరం ఉద్యోగులు జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. సిపిఎస్ను రద్దు చేయాలి: స్థితప్రజ్ఞ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్లు డిమాం డ్ చేశారు. ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్కు భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,316 మంది సిపిఎస్ ఉద్యోగులు పదవీ విరమణ పొందారని, వారికి కనీస సామాజిక భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందిన సిపీఎస్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ద్వారా నగ దు రహిత వైద్య సౌకర్యాల ను ఎలా వర్తింపజేస్తుందో త క్షణమే స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఆరో గ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద ని వారు గుర్తు చేశారు.
శనివారం రాశి ఫలాలు (18-04-2026)
మేషం నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిధునం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటకం వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. కన్య ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి , ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తుల కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ధనస్సు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. మకరం వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. కుంభం ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
ఐపిఎల్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. కోల్కతాకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్ 7 ఫోర్లు, 4 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్మన్ గిల్ 8 ఫోర్లు, 4 సిక్స్లతో 86 పరుగులు చేసి గుజరాత్ను గెలిపించాడు.
కెటిఆర్ పాదయాత్ర ఇప్పుడెందుకు?
పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను కలవని వారికి ఇప్పు డు ఒక్కసారిగా జ్ఞానోదయమై పాదయాత్రలు గుర్తొచ్చాయా..? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉం డి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు. హరీష్రావుది అంతా కుట్ర రాజకీయం అని, ఆయనను తాను ఎప్పటికీ నమ్మను అని పేర్కొన్నారు. పార్టీ లో గ్రూప్ రాజకీయాలు పెంచి పోషించిందే హరీష్రావు అని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, కొం దరు మాజీ ఎంఎల్ఎలు తనను కలిసి లోగుట్టు విప్పారని చెప్పారు. జాగృతి కార్యాలయంలో శుక్రవారం సిపియుఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రా ష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు కవితను కలిసి తమ మద్దతు తెలిపారు. అనంతరం కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు అధికారం దక్కాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ కనీసం గ్రామ వార్డు పదవి కూడా పొందని కులా లు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భౌగోళిక తె లంగాణ సాధించుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ మాత్రం తెచ్చుకోలేకపోయామని అన్నారు. ఉద్యమ సమయంలోనే ఈ అంశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ప్రస్తావించిన విషయాన్ని కవిత గుర్తు చేసుకున్నారు. భారత్కు స్వాతంత్రం వచ్చిన సమయంలో నూ గాంధీ, అంబేడ్కర్ ముందు కూడా ఇదే సమస్య వ చ్చిందని. భారత కుల వ్యవస్థలో ఈ అంశం నిరంత రం మన ముందుంటుందని జయశంకర్ సార్ అన్నారని చెప్పారు. ముందు మనం భౌగోళిక తెలంగాణ సా ధించుకొని ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ ఎన్నో కులాలు అధికారానికి దూరంగా ఉ న్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు అధికారం కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. కులాలు బలంగా ఉన్నప్పుడే వారికి రా జకీయ అధికారం దక్కుతుందని బలంగా నమ్మిన వ్య క్తి మారోజు వీరన్న అని కవిత చెప్పారు. రాష్ట్రంలో కు ల సంఘాలకు కర్త, కర్మ, క్రియ ఆయనే అని గుర్తు చే శారు. కులాల అస్తిత్వాన్ని, విప్లవ ఉద్యమాలకు జత చే సి సామాజిక న్యాయం కోసం వీరన్న కృషి చేశారని పే ర్కొన్నారు. ఆయన మన ముందు పెట్టిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మోసం ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచిస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో కి వచ్చిన ఆరు నెలల్లో పిఆర్సి అమలు చేస్తామని న మ్మబలికి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని మండిపడ్డా రు. ఎన్నికల హామీలైన సిపిఎస్ రద్దు, పాత పెన్షన్స్కీం పునరుద్ధరణను గాలికి వదిలేసి కాంగ్రెస్ తన నైజాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. మధ్యాహ్న భోజ న సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నిరసనకు జాగృతి తరఫున మద్దతు ప్రకటించారు.
మహిళలను బిజెపి వంచించింది: కల్వకుంట్ల కవిత
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బిజెపికి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయ్యిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బిజెపి కుట్ర పూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లు వీగిపోవడంపై శుక్రవారం కవిత వీడియో సందేశం విడుదల చేశారు. మహిళా కోటా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును ముడి పెట్టడంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి లోక్సభలో బిల్లు వీగిపోయేలా చేశాయని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే బిజెపి ఈ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టీ పాస్ చేసి దానిని సెన్సెస్కు లింక్ చేశారని తెలిపారు. ఇప్పుడు 2011 సెన్సెస్ అధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెడుతున్నట్టు చెప్పి మరోసారి వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆడబిడ్డలు బిజెపి మోసాన్ని గుర్తించాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో ఒక మహిళ నాయకత్వం వహిస్తోందని, ఈ మోసకారి బిజెపిని ఓడించి ఆ మహిళను గెలిపించాలని బెంగాల్లో ఉన్న మిత్రులకు చెప్పాలని రెండు రాష్ట్రాల మహిళలకు విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ మళ్లీ ఏకగ్రీవ ఎన్నిక
నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ శుక్రవారం రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి తరఫున సభా నాయకుడు జె.పీ. నడ్డా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఎస్. ఫాంగ్నోన్ కొన్యాక్ మద్దతు ఇవ్వగా, వాయిస్ ఓట్ ద్వారా అది ఆమోదం పొందింది. హరివంశ్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మొత్తం ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం, హరివంశ్ గారు రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రకటిస్తున్నాను అని సభాపతి సి.పి. రాధాకృష్ణన్ వెల్లడించారు. తదుపరి, సభా నాయకుడు నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే హరివంశ్ను ఉపాధ్యక్షుని స్థానానికి తీసుకెళ్లాలని సభాపతి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో వారు ఆయనను ప్రతిపక్ష నాయకుడి పక్కన ఉన్న ఉపాధ్యక్షుని సీటుకు తీసుకెళ్లారు. హరివంశ్ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియడంతో రాజ్యసభ ఉపాధ్యక్షుని పదవి ఖాళీగా మారింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను మళ్లీ రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. హరివంశ్ ఎన్నికపై ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఇది అనుభవానికి ఇచ్చిన గౌరవం, ఆయన సహజమైన పని విధానానికి గుర్తింపు అని మోదీ పేర్కొన్నారు. హరివంశ్ గారి నాయకత్వంలో సభ కార్యకలాపాల సామర్థ్యం పెరిగిన విధాన్ని మనందరం గమనించాం. ఆయన కేవలం సభను నడిపించడం మాత్రమే కాకుండా, తన జీవిత అనుభవాలను ఉపయోగించి సభను మరింత సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నారు అని ప్రధాని అన్నారు. మూడోసారి ఈ పదవికి ఎన్నిక కావడం ద్వారా సభకు ఆయనపై ఉన్న నమ్మకం, ఆయన అనుభవం ఎంత గొప్పదో స్పష్టమవుతుందని మోదీ పేర్కొన్నారు. నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఒక నామినేటెడ్ సభ్యుడు ఈ పదవికి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. హరివంశ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ఉపాధ్యక్షుడు ప్రతిపక్షానికి తగిన సమయం కేటాయించి వారి అభిప్రాయాలను వినేలా చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన మూడో పదవీకాలంలో హరివంశ్ ప్రతిపక్షానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. లోక్సభలో ఉప సభాపతి పదవి 2019 నుంచి ఖాళీగా ఉండటం రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమని ఖర్గే వ్యాఖ్యానిస్తూ ఆ విషయం తనను బాధించిందన్నారు. ఇక హరివంశ్ ఎన్నిక సందర్భంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలు నిరసనగా వాక్అవుట్ చేశాయి. హరివంశ్కు మద్దతుగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ మద్దతు తెలిపారు. మరో తీర్మానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా, బీజేపీ ఎంపీ సురేంద్ర సింగ్ నగర్ మద్దతు ఇచ్చారు. జేడీయూ ఎంపీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా ప్రవేశపెట్టిన మరో తీర్మానానికి ఆర్ఎల్ఎం ఎంపీ ఉపేంద్ర కుశ్వాహా మద్దతు తెలిపారు. అలాగే ఆర్ఎల్డీ ఎంపీ, కేంద్ర మంత్రి జయంత్ చౌధరి ఇచ్చిన నోటీసుకు శివసేన ఎంపీ మిలింద్ ముర్లీ దేవోరా మద్దతు తెలుపుతూ హరివంశ్ ఎన్నికకు మద్దతు ప్రకటించారు.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం, అదానీ నికర ఆస్తి విలువ 92.6 బిలియన్ డాలర్లు (రూ.8.59 లక్షల కోట్లు) గా నమోదైంది. గతంలో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రస్తుతం 90.8 బిలియన్ డాలర్ల (రూ.8.42 లక్షల కోట్లు) నికర విలువతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. అదానీ గ్రూప్ షేర్ల విలువ పెరగడంతో గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది 8.1 బిలియన్ డాలర్లు (రూ.75,110 కోట్లు) పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే ఆయన ఆస్తి రూ.33,010 కోట్లు పెరిగింది. మరోవైపు, రిలయన్స్ షేర్ల విలువ తగ్గడం వల్ల అంబానీ సంపద ఈ ఏడాది రూ. 1.57 లక్షల కోట్ల మేరకు క్షీణించింది. అంతర్జాతీయంగా చూస్తే 656 బిలియన్ డాలర్ల ఆస్తితో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
మహిళా కోటా ఇప్పుడు అమలు చేసినా మద్దతిస్తాం: రాహుల్ గాంధీ
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల పేరిట తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఒక రకంగా రాజ్యాంగపై దాడి అని లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆ బిల్లును ఓడించామన్నారు. మహిళలకు కోటా కల్పించడం దీని లక్షం కాదని, వారి పేరు మీద దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే కుట్ర అని మండిపడ్డారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీకి మళ్లీ చెబుతున్నా...2023 మహిళా బిల్లును అమలు చేయండి. మేం తప్పకుండా సహకరిస్తాం. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహి బిల్లు కాదు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఏకపక్షంగా మార్చే కుట్ర. అందుకే అడ్డుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఆమోదించిన మహిళ రిజర్వేషన్ బిల్లును ఈ రోజు నుంచి అమలు చేసినా తాము సంపూర్ణంగా మద్దతు పలుకుతామన్నారు. అందుకు యావత్ ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉందన్నారు.
గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 181
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో180 పరుగులకు ఆలౌటైంది. కామోరూన్ గ్రీన్ 79: (55 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్స్ లు ) కష్టాల్లో పడిన కోల్కతా నైట్ రైడర్స్ను అర్ధ శతకంతో ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కగిసో రభడ 3, సిరాజ్ 2, అశోక్ శర్మ 2, రషీద్ ఖాన్,ప్రసిద్ధ్ క్రిష్ణ తలో వికెట్ తీశారు.
లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పదిరోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. దీనితో ఇంతకాలం పరస్పర దాడులతో సాగుతూ వచ్చిన నరమేథం నుంచి బీరూట్ ఇతర ప్రాంతాలు విముక్తం అయ్యాయి. ప్రజలు తమ స్వస్థలాలకు, నివాసాలకు తిరిగి వెళ్లుతున్నారు. కాగా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ సేనలకు, ఇరాన్ బలగాలకు మధ్య కూడా కాల్పుల విరమణ, తద్వారా హర్మూజ్ పునరుద్ధరణ, ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి శాంతికి అనువైన వాతావరణంపై ఆశలు తలెత్తాయి. లెబనాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన తాత్కాలిక సంధి ప్రక్రియలో హెజ్బోల్లా మిలిటెంట్లను కూడా చేర్చేంచేందుకు దౌత్యం సాగుతోంది. ఇప్పుడు ప్రత్యేకించి హర్మూజ్ మార్గంలో శాంతి స్థాపన, నౌకారవాణా సజావుగా సాగే దిశలో యూరప్ దేశాల నేతలు చర్చలకు సిద్ధం అవుతున్నారు. కాగా ఇంతకు ముందు నిలిచిపోయిన చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి స్థాపనకు పాకిస్థాన్ తిరిగి తన దౌత్య యత్నాలు ముమ్మరం చేసింది.
Unanimous Rejection for Ustaad Bhagat Singh on OTT
Ustaad Bhagat Singh is one of the biggest debacles of Telugu cinema in this year and it is the biggest flop in Pawan Kalyan’s career. Apart from criticism, the entire team was badly trolled and the makers lost big money. Ustaad Bhagat Singh is now streaming on Netflix since yesterday. Usually after the release of […] The post Unanimous Rejection for Ustaad Bhagat Singh on OTT appeared first on Telugu360 .
రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9మంది మృతి
కర్నాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. శుక్రవారంనాడు సుర్పూర్ తాలుకాలోని శాంతపుర క్రాస్ వద్ద దుర్ఘటన జరిగింది. కారు, ఓ ప్రైవేటు బస్సు పరస్పరం ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కృష్ణనాయక్(52) ఆయన భార్య అనంతకళ(45)తో పాటు కుమారుడు, కోడలు, మనవలు, మనవరాళ్లు మొత్తం 9మంది మృత్యువాతపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. దుర్ఘటన నుంచి 10 సంవత్సరాల బాలుడు విరాట్ గాయాలతో బయటపడ్డాడు. కారు రన్నింగ్లో ఉండగా టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుర్ఘటన సమయంలో కారులో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు.
నున్న మ్యాంగో మార్కెట్ లో జోరు - రైతులకు ఆశలు #NunnaMarket #MangoSeason #Banganapalli #Totapuri
Major Setback for Centre as Women’s Reservation-Linked Delimitation Bill Fails in Lok Sabha
In a significant political development, the Central government faced a major setback in Parliament today. A crucial Constitutional Amendment Bill linked to women’s reservation and Lok Sabha delimitation failed to secure approval in the Lok Sabha. The bill required a two-thirds majority to pass. However, the NDA government fell short during voting. The proposal could […] The post Major Setback for Centre as Women’s Reservation-Linked Delimitation Bill Fails in Lok Sabha appeared first on Telugu360 .
సోనియా గాంధీని బలిదేవత అనలేదా ?: బండి సంజయ్
ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ చేసిన వల్లే తెలంగాణలో వెయ్యి మంది బలయ్యారని, ఆమె బలిదేవత అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లోగడ విమర్శించలేదా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడలేదా? అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మీరు మంత్రులుగా ఎలా కొనసాగుతున్నారని ఆయన బిజెపిని విమర్శిస్తున్న రాష్ట్ర మంత్రులనుద్ధేశించి ప్రశ్నించారు. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి యూ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులుగా పోల్చుతూ బిజెపి ఎంపీ తేజస్వీ దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే వివాదం చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల తప్పిదాలవల్లే లక్షల మంది చనిపోయింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 2009లో తెలంగాణ ప్రకటించి కాంగ్రెస్ యూ-టర్న్ తీసుకోవడం వల్లే 1400 మంది యువకులు బలిదానమైంది నిజం కాదా? అని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంతో తమ పార్టీకి క్రెడిట్ వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు.కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు ఫోన్లో మాట్లాడుకునే ఈ కుట్రలకు తెరదీశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలెవరూ మోసపోవద్దని కోరుతున్నానని, రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటి నుండి చిత్తశుద్ధితో పని చేసింది తమ పార్టీయేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడితే బిఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.వాజ్పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు చత్తీష్ఘడ్, జార్ఝండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింద్న వాస్తవాలను ప్రజలకు చెబితే మీకు ఎందుకు అక్కసు అని ఆయన ప్రశ్నించారు.
Satya’s Jetlee Locks Its Release Date
Satya has teamed up once again with director Ritesh Rana, reviving their successful collaboration for Jetlee, a film that leans heavily into offbeat humor and action-packed storytelling. Known for their distinctive style from the Mathu Vadalara series, the duo appears ready to deliver another entertaining ride filled with quirky moments and unexpected twists. Promotions for […] The post Satya’s Jetlee Locks Its Release Date appeared first on Telugu360 .
రాహుల్పై కేసు నమోదు చేయండి: అలహాబాద్ హైకోర్టు
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్పై శుక్రవారంనాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.రాహుల్ గాంధీ భారత్తో పాటు బ్రిటీష్ పౌరసత్వం కూడా కలిగి ఉన్నారని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన ఎస్.విఘ్నేష్ శిశిర్ అనే బిజెపి కార్యకర్త అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. లోతైన విచారణ అవసరమని పేర్కొంటూ రాయ్బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సుభాశ్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పౌరసత్వానికి సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు తీర్పునిస్తూ ఈ వ్యవహారంపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా విచారణ చేపట్టాలని లేదా కేంద్ర సంస్థకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరయ్ ఘాట్ రోడ్డులో దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వేగంగా వెళ్లి లోయలో పడిపోయింది. పైనుంచి కిందపడడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. వ్యానులో ఉన్న పది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పేద విద్యార్థినులకు లాప్టాప్ల పంపిణీ చేసిన కెటిఆర్
పేద విద్యార్థినుల విద్యా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న ‘టచ్ ఏ లైఫ్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేద విద్యార్థులకు లాప్టాప్లను పంపిణీ చేశారు. శుక్రవారం నందినగర్లోని నివాసంలో మాజీ కార్పొరేటర్ సామల హేమ సారధ్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా విద్యార్థినులతో కలిసి కెటిఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. స్వయం సమృద్ధి సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని సూచించారు. ఈ సందర్బంగా కెటిఆర్ పంపిణీ చేసిన లాప్టాప్లను అందుకున్న నామాల రేష్మ, సలికంటి శ్రీవాణి, చింతగుట్ట వేదశ్రీ, ధుళ్ల రాజేశ్వరి, అతికా బారి, సనా సుల్తానా, కర్రె ఆర్తి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫౌండేషన్ చేస్తున్న కృషిని కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా మాట్లాడుతూ, తెలంగాణవ్యాప్తంగా బస్తీలు, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులను గుర్తించి, వారికి స్కాలర్షిప్లు, మెంటార్షిప్, నిరంతర మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే తమ లక్ష్యమని వివరించారు.
మహిళా రిజర్వేషన్ల అంశంలో బహిర్గతమైన బీజేపీ కపట నీతి : మంత్రి సీతక్క
‘లక్ష్యం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలు కూడా మంచివే కావాలని’ మహాత్మా గాంధీజీ చెప్పిన ఆలోచన ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మార్గదర్శకం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం జరిగిన పరిణామాలు బీజేపీ కపట నీతిని బహిర్గతం చేశాయని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళల సాధికారతపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, సింపుల్ మెజారిటీతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కావాలని డీ లిమిటేషన్ అంశాన్ని జోడించి బిల్లును సంక్లిష్టం చేశారని ఆరోపించారు. ఇది మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాదని, రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల దృష్టి కోణంతోనే ఈ బిల్లును ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం మీలో కనిపిస్తోందని మంత్రి విమర్శించారు. బిజెపి భావజాలమే మహిళా వ్యతిరేకమైనదని ఆమె విమర్శిస్తూ లోక్సభ సాక్షిగా బీజేపీకి మహిళా రిజర్వేషన్లపై నిజమైన నిబద్ధత లేదనే విషయం నిరూపితమైందని వెల్లడించారు. ఇది ప్రజాస్వామ్యానికి, మహిళల హక్కులకు మద్దతుగా నిలిచిన విజయంగా మంత్రి అభివర్ణించారు. ఈ దేశానికి మహిళా ప్రధానిని, మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్యా ఉపాధి అవకాశాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. మహిళల సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా, తక్షణమే అమలు చేయాలని తాము మరోసారి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఇంతకాలం మూలకు పడి ఉన్న మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 గురువారం నుంచి అమలులోకి వచ్చింది. అత్యంత కీలకమైన అనివార్య సాంకేతిక కారణాలతో ఈ చట్టం ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం పార్లమెంట్లో మహిళా చట్టం సవరణల రాజ్యాంగ బిల్లు చర్చకు వచ్చింది. అయితే ముందు చట్టం అమలులో ఉంటేనే , ప్రతిపాదిత సవరణలు వాస్తవికత దాల్చడానికి , వీటిపై చర్చకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తప్పనిసరిగా 2023 మహిళా చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించాల్సి వచ్చిందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు. ఇంతకాలం ప్రభుత్వం ద్వారా మహిళా రిజర్వేషన్ల చట్టం తద్వారా వారికి అందే 33 శాతం కోటా వర్తింపును రాజ్యాంగంలో భాగం చేయలేదు. పలు కారణాలతో చట్టం అమలులోకి రాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. చట్టం అనేది అమలులో ఉంటేనే దానికి సవరణలు లెక్కలోకి వస్తాయనేది కీలక విషయం కావడంతో, పార్లమెంటరీ, రాజ్యాంగ నిపుణులు పరిస్థితిని సమీక్షించి తక్షణ సర్దుబాటు చర్యకు దిగారు. బుధవారం ఓ వైపు సవరణలపై తీవ్రస్థాయి చర్చలు జోరందుకున్న దశలోనే 2023 చట్టం అమలులోకి వచ్చిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ చట్టం అమలులోకి వచ్చినట్లు రాత్రి పది గంటల సమయంలో నోటిఫికేషన్లో తెలిపారు. ఇప్పుడు దీని కొనసాగింపుగా ఈ చట్టం సవరణలపై పార్లమెంట్లో చర్చ తరువాత , చట్టం 2029 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విధంగా మహిళా రిజర్వేషన్ల కోటా వర్తింపు ఆరు సంవత్సరాలకు కానీ కార్యరూపం దాల్చదు. ఇప్పుడు రిజర్వేషన్ల చట్టం అమలులోకి వచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు సాంకేతిక కారణాలతో రిజర్వేషన్లను అమలు చేయడం ఇప్పటి సభ ద్వారా కుదరదని అధికారులు తెలిపారు. తదుపరి జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగే డిలిమిటేషన్ తరువాతనే మహిళలకు 33 శాతం కోటా కట్టబెట్టడానికి వీలుంటుంది. 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నారీ శక్తి వందన్ అధినియమ్ పేరిట ఈ మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టం మేరకు దేశంలోని మహిళలకు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు కేటాయింపు, తద్వారా వారికి చట్టసభలలో సాథికారికతకు వీలేర్పడుతుంది. అయితే మూడు సంవత్సరాలుగా ఈ కోటా చట్టం పెండింగ్లో ఉన్న దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించకపోవడం కీలక విషయం అయింది.
లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యంగ సవరణ బిల్లు
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డిఎ సర్కార్కి షాక్ తగిలింది. సర్కార్ ప్రవేశపెట్టిన 131వ రాజ్యంగ సవరణ బిల్లు కూడా మెజారిటీ సాధించలేకపోయింది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. అయితే ఎన్డిఎ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. మొత్తం 489 మంది సభ్యులు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. బిల్లు ఆమోదానికి 326 కావాల్సి ఉంది. అయితే బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓవర్లు వచ్చాయి. దీంతో బిల్లు వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై 528 సభ్యులు ఓటు వేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయినందున మిగితా రెండు బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అనంతరం లోక్సభ వాయిదా పడింది.
ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు: రాహుల్ గాంధీ
ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు అని, బాలాకోట్ , పెద్ద నోట్ల రద్దు, తరువాత ఆపరేషన్ సిందూర్ ఇవన్నీ ఆయన తంత్రాలని లోక్సభలో మహిళా బిల్లు చర్చ సందర్భంగా రాహుల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బిజెపి సభ్యులు అడ్డుతగిలారు. ప్రధాని మోడీపై రాహుల్ అనుచిత పదజాలాలకు దిగారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ మండిపడ్డారు. పైగా రాహుల్ మరోసారి దేశ సైనిక బలగాలను కించపర్చే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. దీనితో స్పీకర్ రాహుల్ను ఉద్ధేశించి సరిగ్గా మాట్లాడాలని, విషయానికి పరిమితం కావల్సి ఉందని స్పష్టం చేశారు. తప్పుడు పదజాలాలను అనుమతించేది లేదన్నారు. దీని తరువాత రాహుల్ గాంధీ తాను వాడిని ఇంద్రజాలికుడు పదం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన దేశంలోని సైనిక దళాలను తాను కించపర్చడం లేదని, బిజపి వారే ఈ విధంగా చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా రాహుల్ పదేపదే అంతా 16 అంకెలో దాగి ఉందని వ్యాఖ్యానించారు. గురువారం ప్రధాని మోడీ తమ ప్రసంగం దశలో నీరసంగా కన్పించారు. ఎందుకు అని ఆరాతీశానని , వెంటనే 16వతేదీ గుర్తుకు వచ్చింది. 16 కిటుకు వేరే కూడా ఉందని రాహుల్ తెలిపారు.ఈ దశలో ఆయన ఈ ప్రభుత్వం 16 మంది టిడిపి ఎంపిల మద్దతుపై ఆదారపడి పనిచేస్తున్న విషయం పరోక్షంగా ప్రస్తావించినట్లు వెల్లడైంది. రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు భార్య బాదరబందీ లేదన్నారు. అందరికీ జీవితంలో మహిళల నుంచి ఏదో ఒక పాఠం అబ్బుతుంది. తనకు సోదరి తల్లి నుంచి ఆత్మీయత దక్కుతుంది. ఇదే విధంగా ప్రధాని మోడీకి కూడా ఇదే స్పందన ఉంది. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ సభలో మాట్లాడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ తన భార్య గురించి కవిత చెప్పారని, అప్పటి నుంచి రాహుల్కు ఇంట్లో తిట్లు పడి ఉంటాయని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ అవును తనకు మోడీజి మాదిరిగానే ఈ అనుభూతి లేదు ఏం చేద్దామని చమత్కరించారు.
Nagabandham’s Sura Promo: Visually Stunning
The Secret Treasure, directed by Abhishek Nama and starring Virat Karrna, is shaping up as a grand blend of mythology and action mounted on an impressive scale. The makers have now unveiled the promo of the film’s second single, Sura Sura, which is set for release on the 19th of this month. Going by the […] The post Nagabandham’s Sura Promo: Visually Stunning appeared first on Telugu360 .
డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని నిందితులను ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6.09 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...మురళీ అనే వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్కు తీసుకుని వచ్చి కొండాపూర్, మాదవహిల్ స్ట్రీట్ ప్రాంతంలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేస్తున్న వికాస్, భరత్ చౌదరి డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇద్దరు నిందితులను గతకొంత కాలం నుంచి ఇంటీరియర్ డిజైన్ పేరుతో లగ్జరీ కార్లలో తిరుగుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. నిందితులపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది వికాస్ ,భరత్ చౌదరి డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్ గ్రాముకు రూ.5,000 చొప్పున విక్రయిస్తున్నారు. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మురళీ, మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం ముగ్గురిని కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. సిఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది నిందితులను పట్టుకున్నారు.
Big Breaking : ఎన్డీఏకు షాక్.. వీగిపోయిన బిల్లులు
లోక్ సభలో చారిత్రాత్మిక బిల్లులపై ఓటింగ్ జరిగింది
ఎంఎల్ఎ మల్రెడ్డి రంగారెడ్డి పారిపోయాడు: మంచిరెడ్డి కిషన్రెడ్డి
బహిరంగ చర్చకు రాకుండా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పారిపోయాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం యాచారం మండలంలోని మేడిపల్లిలో ఉదయం 10 గంటలకు పార్మాసిటీ భూములపై అవకతవకలు జరిగాయని చెప్పిన మల్రెడ్డి రంగారెడ్డి దమ్ము, ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడని మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం రోజు క్రితం మేడిపల్లిలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే పోలీసులతో హౌస్ అరెస్టు చేసి బంధించారని గుర్తుచేశారు. పార్టీ కార్యాలయంలో మల్రెడ్డి రంగారెడ్డిపై వ్యతిరేకంగా నినాదాలు, సాగర్ రోడ్డుపై బైటాయింపు, మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. పార్మాసిటీపై ఇప్పటికైనా తప్పు తనదేనని ఒప్పుకోవాలని సవాల్ చేశారు. తప్పుడు మాటలు చెప్తూ ఎమ్మెల్యే కాలం వెళ్లదీస్తునారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండున్నరేండ్లలో కేవలం రూ.220 కోట్లు నిధులు తీసుకరావడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అనంతరం క్యామ మల్లేష్, ఎస్వీ రమణారెడ్డిలు మాట్లాడుతూ.. గతంలో మూడు సార్లు కిషన్రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలైన మల్రెడ్డి రంగారెడ్డి తప్పుడు మాటలు మానుకొని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దండెం రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్రెడ్డి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవీణ్, గూడూరి యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, జెర్కోని రాజు, నిట్టు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
100%grant |మంత్రి లోకేష్కు నర్సెస్ అసోసియేషన్ వినతి
100%grant | మంత్రి లోకేష్కు నర్సెస్ అసోసియేషన్ వినతి 100%grant | సమస్యల
మహిళ కారులో నుండి కింద పడినట్లుగా వైరల్ అవుతున్న వీడియో. వైరల్ వీడియో భారత్ కు సంబంధించింది కాదు. ఇది కుటుంబ కలహాలకు సంబంధించిన వీడియో
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెకెఆర్
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో కెకెఆర్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్లో అయినా నెగ్గి గెలుపు ఖాతా తెరవాలని కెకెఆర్ ఆశపడుతోంది. మరోవైపు గుజరాత్ గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. దీంతో ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో కెకెఆర్ ఇక మార్పు చేసింది. అలెన్ స్థానంలో సైఫర్ట్ని జట్టులోకి తీసుకుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్లోని జట్టునే కొనసాగిస్తోంది. తుది జట్లు: కెకెఆర్: టిమ్ సైఫర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానె(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), రోవ్మెన్ పొవెల్, రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి. జిటి: శుభ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.
grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి
grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి రాప్తాడు ఏప్రిల్ 17 ఆంధ్రప్రభ
7500people |రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో….
7500people | రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో…. 7500people | రోడ్డు
ఇంద్రకీలాద్రి కొండ స్థిరత్వం పై NIRM బృందం అధ్యయనం #Indrakeeladri#DurgaTemple#NIRM
డీలిమిటేషన్తో సభ్యులకు, ప్రజలకు మేలు: అమిత్ షా
న్యూఢిల్లీ: ఈ సభలో 56 మంది మహిళలు ఉండటం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, యూటీ చట్టాల సవరణ బిల్లులపై అమిత్ షా సమాధానం ఇచ్చారు. నియమాలు, నిబంధనలకు అనుగుణంగా సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఇండి కూటమి సభ్యుల్లో చాలా మంది మాట్లాడారని.. మహిళ రిజర్వేషన్ బిల్లును ఇండి కూటమి సభ్యులు వ్యతిరేకించారని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఇండి కూటమి వ్యతిరేకం అని మండిపడ్డారు. మహిళలకు మేలు చేసే బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని.. మహిళ సాధికారత దిశగా చేసే పనులకు ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా ముందుకెళ్తున్నాం అని అమిత్ షా అన్నారు. ‘‘ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాల జనాభలో తీవ్ర వ్యత్యాసం ఉంది. ఒక చోట 39 లక్షల ఓటర్లు ఉంటే.. మరో చోట 60 వేల ఓటర్లు ఉన్నారు. ఒక ఎంపి లక్షల మంది ప్రజల సమస్యలను ఎలా ఆలకించగలరు? ఎస్సి, ఎస్టి సీట్ల పెంపుదలను కూడా వ్యతిరేకిస్తున్నారు’’ అని షా అన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే అదృష్ణం తమకు దక్కిందని అమిషా హర్షం వ్యక్తం చేశారు. ‘‘నియోజకవర్గాల ఓటర్లలో సమతూకం సాధనకు ప్రయత్నిస్తున్నాం. ఎంపి తన విధులు సమర్థంగా నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుంది. అందుకే ఈ రాజ్యాంగ సవరణకు పూనుకున్నాం. ఢిల్లీ, బెంగళూరు, ఘాజియాబాద్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మల్కాజ్గిరిలో దాదాపు 30 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. డీలిమిటేషన్ తర్వాత ఆయా చోట్ల రెండు సీట్లు వస్తాయి. డీలిమిటేషన్ వల్ల సభ్యులకు, అటు ప్రజలకు ప్రయోజనం’’ అని స్ఫష్టం చేశారు. 1972లో ఇందిరా ప్రభుత్వం లోక్సభ సీట్లను 545కు పెంచింది అని అమిత్ షా తెలిపారు. ‘‘ డీలిమిటేషన్ తర్వాత 50 శాతం స్థానాలు పెరుగుతాయి. ఇన్నాళ్లపాటు సీట్ల సంఖ్య పెంచకుండా అడ్డుకున్న ఘనత వారిదే. దేశంలో 50 శాతం ఉన్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కుతున్నాయి. కాలానికి అనుగుణంగా సీట్ల సంఖ్యలోనూ మార్పు రావాలి. మహిళా బిల్లును వ్యతిరేకిస్తూ సమయం వృథా చేయకండి. 2021లో కరోనా వల్ల జనగణన చేయలేకపోయాం. దేశంలోని కులాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల జనాభాకు స్పష్టం చేస్తున్నాం.. ఈ ఏడాది జనగణన పూర్తవుతుంది. ఇప్పటికే జనగణన ప్రారంభమైంది. ఉత్తరాదికి ఎంత అధికారం వస్తుందో.. దక్షిణాదికి అంతే వస్తుంది’’ అని షా పేర్కొన్నారు.
Breaking : గుడ్ న్యూస్.. పెట్రోలు ధరలు ఇక పెరగవ్
ప్రపంచ దేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది.
M3Media&MahaMovies |జేడీ చక్రవర్తి లీడ్గా…
M3Media&MahaMovies | జేడీ చక్రవర్తి లీడ్గా… M3Media&MahaMovies | రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా
మహిళ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి : అమిత్ షా
మహిళ బిల్లును సమర్థిస్తున్నామంటూనే విపక్షాలు వ్యతిరేకించాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు
ఎసిబి వలలో చిక్కిన మరో అవినీతి అధికారి
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం కల్లు దుకాణం నిర్వాహకుడి వద్ద బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కల్లు దుకాణం ఒకచోట నుంచి మరో చోటకు మార్చేందుకు సదరు ఎక్సైజ్ సీఐ రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పన్నిన వలలో ఎక్సైజ్ సీఐ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షలతో పాటు ఎక్సైజ్ సీఐ బ్యాగులో దొరికిన రూ.45,760 లను స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్లోని ఎక్సైజ్ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించగా రూ.12 లక్షలు దొరికాయని, వాటిని కూడా సీజ్ చేశామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి శనివారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఎక్సైజ్ సీఐ ఆస్తులు, తదితర విషయాలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
సురక్ష పీపుల్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
సురక్ష పీపుల్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోగికి
Hyderabad : ఎంఐఎం కోట బద్దలు కానుందా? ఒవైసీకి షాక్ ఇవ్వనున్నారా?
అసదుద్దీన్ ఒవైసీకి ఇదే ఆఖరి ఛాన్స్ కానుందా? అంటే అవుననే అంటున్నారు
టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం…
టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం… కార్యకర్త అధినేత..పొలిట్ బ్యూరో గా గ్రామస్థాయి నుంచి
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి తొర్రూరు,ఏప్రిల్17(ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): సంగారెడ్డి
కృత్యాలతో చిదివితే చిన్నారులు మర్చిపోలేరు
కృత్యాలతో చిదివితే చిన్నారులు మర్చిపోలేరు సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): గతేడాది
డగౌట్లో ఫోన్ వాడకం.. రాజస్థాన్ మేనేజర్కి జరిమానా
ఐపిఎల్-2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ మేనేజర్ రోమి బింధర్ డగౌట్లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. బింధర్ ఫోన్ వాడుతు కనిపించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై బిసిసిఐ చర్యలు చేపట్టింది. బింధర్కురూ.లక్ష జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూసుకవాలని హెచ్చరించింది. ఇదే తొలిసారి కావవడంతో అతను నిషేధం నుంచి తప్పించుకున్నాడు. వైభవ ఈ వివాదం నుంచి బయటపడ్డాడు. రోమి బింధర్ ఫోన్ వాడుతున్న సమయంలో ఆ పక్కనే కూర్చున్న వైభవ్ ఆ ఫోన్ని చూశాడు. దీంతో అతడికి కూడా శిక్ష పడుతుందని అనుకున్నారు. కానీ, వైభవ్కు ఎలాంటి తప్పు చేయలేదని.. లీగ్ రూల్స్ గురించి అతడికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బిసిసిఐ భావించింది.
రోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే లేదు
రోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే లేదు ఆసుపత్రి సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి
సిగాచి బాధితులకు న్యాయం చేయాలి
సిగాచి బాధితులకు న్యాయం చేయాలి సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): సిగాచి
కలెక్టర్, ఎస్పి ల నేతృత్వంలో 4 వేల కిలోల గంజాయి ధ్వంసం
కలెక్టర్, ఎస్పి ల నేతృత్వంలో 4 వేల కిలోల గంజాయి ధ్వంసం తిరుపతి
మిర్చి ట్రాక్టర్ బోల్తా… మహిళ మృతి
మిర్చి ట్రాక్టర్ బోల్తా… మహిళ మృతి మిర్చి కూలీలతో వెళ్తుండగా ప్రమాదంఇద్దరికి తీవ్ర
Social Media |‘చిరుత’భామ గ్లామర్ షోకి ఫ్యాన్స్ ఫిదా!
Social Media | ‘చిరుత’ భామ గ్లామర్ షోకి ఫ్యాన్స్ ఫిదా! Social
కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి
రాయలసీమలో మొట్ట మొదటిది The post కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి appeared first on Visalaandhra .
పంగిడీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
పంగిడీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా సిర్పూర్ (యు) ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ)
‘క్యాస్ట్’ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది
వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన, దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తు న్న చిత్రం ‘క్యాస్ట్’. కశికా కపూర్, దివి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పం దన వచ్చింది. గురువారం మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “కథ విన్నప్పుడు చాలా కొత్త, డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది. ఇందులో చాలా బలమైన క్యారెక్టర్ చేశాను. గగన్ చాలా అంకితభావంతో చేశారు. యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా తన చాప్టర్ ప్రారంభించబోతున్నారు. సత్యం రాజేష్తో నా కాంబినేషన్ చాలా బాగుంటు ంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది”అని అన్నారు. డైరెక్టర్ ఏకే జంపన్న మాట్లాడుతూ “మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించే రోజుల్లో అంత బాగుండేది. కానీ మనిషి పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించడం మొదలైనప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. కులం అనేది మనిషికి మనిషికి మధ్య ఒక అడ్డు గోడగా మారింది. కులం మన నిత్యజీవితంలో ఎలా ప్రభా వం చూపుతుందో ఇందులో చూపించాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కోటేశ్వరరావు, గగన్ బాబు, సత్యం రాజేష్, రవి పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గోదావరిఖని,
Big Twist in Jacqueline Fernandez’s Case
Sri Lankan beauty Jacqueline Fernandez has established her career in Bollywood and she has done ample number of Indian films. She has been facing allegations in a money-laundering case along with conman Sukesh Chandrasekhar. The investigation has been going on for years and Sukesh posted frequent updates about their relationship. Jacqueline Fernandez told a Delhi […] The post Big Twist in Jacqueline Fernandez’s Case appeared first on Telugu360 .
ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు….
ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు…. ఎల్కతుర్తి ఆంధ్రప్రభ : అవినీతి,
ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం పై అవగాహన
ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం పై అవగాహన బోధన్ ఏప్రిల్ 17(ఆంధ్రప్రభ)
అదానీ నెంబర్ వన్.. ముకేశ్ అంబానీ వెనక్కి
గౌతమ్ అదానీ ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు
రేషన్ బియ్యం…పట్టుపడుతున్న ఆగని అక్రమ రవాణా
రేషన్ బియ్యం…పట్టుపడుతున్న ఆగని అక్రమ రవాణా మద్దూర్, ఆంధ్రప్రభ : ప్రతీ పేదవాళ్లు
Pic Talk: Ram Charan Exudes Style
Global Star Ram Charan is almost done with the shoot of Peddi and the film is due for release. From a recent photo shoot, the actor looked stylish in a fit look like an athlete. A click from the photo shoot is going viral. With long hair and thick beard, Charan’s muscular look is winning […] The post Pic Talk: Ram Charan Exudes Style appeared first on Telugu360 .
చిలకలడోణ ఘటనలో విషాదం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలిక
Telangana : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర సస్పెన్షన్
చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర సస్పెన్షన్ బెట్టింగ్ మామూళ్ల ఆరోపణలతో సస్పెన్షన్ చిత్తూరు,
ఈ మ్యాచ్లో వరుణ్ పుంజుకుంటాడు.. కెకెఆర్ పేసర్ ఆశాభావం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఆడిన 5 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఆ జట్టుకు ఒక పాయింట్ కలిసి వచ్చి.. టేబుల్లో చివరి స్థానంలో ఉంది. అయితే కెకెఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లో బౌలింగ్లో ఇబ్బంది పడుతున్నాడు. వికెట్లు తీయడం పక్కన పెడితే.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయితే శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో జరగబోయే మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి తిరిగి పుంజుకుంటాడని ఆ జట్టు యువ పేసర్ కార్తీక్ త్యాగీ అశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ప్రతి క్రికెటర్కూ ఇలాంటి దశ ఎదురవుతూనే ఉంటుంది. ఒక్కోసారి ప్రదర్శన మెరుగ్గా ఉన్నా.. పిచ్ పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఇలాంటి వాటి నుంచి నేర్చుకొనేందుకు అవకాశాలు లభిస్తాయి. మెరుగ్గా రాణించి అత్యుత్తమ బౌలర్గా మారేందుకు ఛాన్స్ ఉంది. వరుణ్ భాయ్ కూడా ప్రస్తుతం అదే దశలో ఉన్నాడనుకుంటున్నా. తప్పకుండా బలంగా పుంజుకొని వస్తాడు. గుజరాత్తో మ్యాచ్లో ఇది జరుగుతుందని అనుకుంటున్నా. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రాకపోవచ్చు. జట్టుగా మేం మరోసారి ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. విజయం సాధించేందుకు మా ప్రణాళికలను అమలు చేస్తాం’’ అని కార్తీక్ మీడియా సమావేశంలో అన్నాడు.
Andhra Prabha Smart Edition |TS|కాంగ్రెస్ కోటలో /టెన్షన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-04-2026, 4.00PM ts బిల్లుల టెన్షన్.. ఐదింటికి
హైస్పీడ్ రైలు ప్రణాళికలు-ద.మ.రైల్వే, తెలంగాణ ప్రభుత్వం కీలక సమీక్ష #SCR #Hyderabad #Railways
రాంపూర్లో చలివేంద్రం ఏర్పాటు..
రాంపూర్లో చలివేంద్రం ఏర్పాటు.. నల్లబెల్లి,(ఆంధ్రప్రభ) వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని
Andhra Prabha Smart Edition |AP|ఐదింటికి ఓటింగ్/పవర్ బూస్టింగ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-04-2026, 4.00PM ap బిల్లుల టెన్షన్.. ఐదింటికి
లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం
21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలునెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరికవయనాడ్ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతో పార్లమెంటును ఆకట్టుకున్నారు. శుక్రవారం 21 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రసంగంలో వాగ్ధాటి, వ్యంగ్యం, రాజకీయ చతురత కలగలిసి కనిపించాయి. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా చమత్కారాలు విసురుతూనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం నవ్వించి తనదైన ముద్ర కనబరిచారు. మహిళా రిజర్వేషన్లపై […] The post లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం appeared first on Visalaandhra .
Rahul Gandhi : మోదీ ఒక మెజీషియన్... మోదీ రహస్యాలన్నీ ట్రంప్ వద్దే
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు
Telangana | 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
Telangana | 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు Telangana | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
SIR |ఓటరు జాబితాపై కేటీఆర్ హెచ్చరిక
SIR | ఓటరు జాబితాపై కేటీఆర్ హెచ్చరిక SIR | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
ఇప్పుడు కొత్తగా మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు : రాహుల్ గాంధీ
ఢిల్లీ: మహిళలే మనదేశ చోదకులు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తల్లులు, చెల్లెళ్లు, భార్యలు.. ఇలా మన జీవితంలో మహిళలది కీలకపాత్రని అన్నారు. శుక్రవారం లోక్ సభలో3 కీలక బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. గురువారం తన చెల్లి ప్రియాంకా గాంధీ ఇక్కడ మాట్లాడారని..ఆమె ప్రసంగం ఓ అన్నగా తనకెంతో గర్వకారణమని, తన నాన్నమ్మ తనకెంతో స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. తన నాన్నమ్మతో గడిపినప్పుడు..తనకెంతో ధైర్యంగా ఉండేదని, చీకట్లోనే అసలైన వాస్తవాలు ఉంటాయని అన్నారు. చీకట్లోకి వెళ్లి చూసేందుకు ధైర్యం చేయలేకపోతే మనం వాస్తవాలు తెలుసుకోలేమని, తన నాన్నమ్మ తనను గార్డెన్ కు తీసుకెళ్లినప్పుడు సత్యం, అహింస వంటి విషయాలు తెలియజెప్పేవారని అన్నారు. నిజం కొన్ని సార్లు నొప్పిని కలిగిస్తుంది.. కానీ దానిని తట్టుకోవాలని, 2023లోనే మహిళా బిల్లును మనం ఆమోదించుకున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇప్పుడు మహిళాబిల్లు ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అంతగా కావాలంటే పాత మహిళా బిల్లును రద్దుచేసి..ఇప్పుడు మళ్లీ తీసుకురండని, తాము ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా దానికి మద్దతిస్తామని అన్నారు. ఈ మహిళా బిల్లుతో ఒబిసిలకు అన్యాయం జరుగుతోందని, దక్షిణాది,ఈశాన్య, చిన్న రాష్ట్రాలను గౌరవించడం లేదని మండిపడ్డారు. బిజెపికి తన ప్రతిభ తగ్గిపోతోందన్న భయం పట్టుకుందని, ఈ బిల్లు పాస్ కాదు..అరగంటలో ఈ బిల్లు వీగిపోతుందని అన్నారు. అసలు ఇప్పుడు కొత్తగా మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదని, బిసి, దళితులు, మైనారిటీలు, మహిళలపట్ల ఈ బిల్లు క్షమించరాని, క్రూరమైన చర్యని ధ్వజమెత్తారు. ఈ బిల్లు ద్వారా ఒబిసి సోదరులను నుంచి అధికారం లాక్కునే ప్రయత్నం జరుగుతోందని, ప్రధాని నరేంద్ర మోడీని ఇంద్రజాలికుడంటూ రాహుల్ గాంధీ పరోక్షంగా వ్యాఖ్యానించారు.
పాస్టర్ ఇంట్లో కట్టలకొద్దీ డబ్బు... రూ.2.27కోట్ల నగదు సీజ్ #Narsapuram #Pastor #CashSeizure
Rahul |ప్రధాని మోదీ ప్రసంగంలో పసలేదు:
Rahul | ప్రధాని మోదీ ప్రసంగంలో పసలేదు: రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు!నేను
Loksubha |క్షమాపణకు బీజేపీ డిమాండ్!
Loksubha | క్షమాపణకు బీజేపీ డిమాండ్! ఆపరేషన్ సింధూర్ను హేళన చేస్తారా?రాహుల్ వ్యాఖ్యలపై
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రేవంత్, ఉత్తమ్ భేటీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం అయ్యారు. రేవంత్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వానాకాలం యాసంగి పంట 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని సిఎం.. కేంద్ర మంత్రిని కోరారు. 2025-26 యాసంగి పంట 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని కేంద్ర మంత్రికి తెలిపారు. ధాన్యం సేకరణ, కేంద్ర ప్రభుత్వం వాటా సంబంధిత అంశాలపై కేంద్ర మంత్రితో రేవంత్, ఉత్తమ్ చర్చించారు.
Nandamuri Fans Lost Interest in Mokshagna’s Debut
The debut of Nandamuri young scion Mokshagna has been in discussion for years. The youngster is spotted in events and his public presence has always triggered a discussion about his acting debut. A news broke out that Vishwambara director Vassishta met Mokshagna and narrated a script. Mokshagna is said to have rejected the proposal. For […] The post Nandamuri Fans Lost Interest in Mokshagna’s Debut appeared first on Telugu360 .
Telangana |డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం..
Telangana | డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం.. సమస్యలను పరిష్కరించాలని ట్రాన్స్కో
రేపు జగిత్యాలకు కేటీఆర్… జగిత్యాల, ఆంధ్రప్రభ ; భారత రాష్ట్ర సమితి వర్కింగ్
డీలిమిటేషన్తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్సభలో మిథున్ రెడ్డి
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో లేదంటూ తప్పించుకున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా అదే తీరు పునరావృతమైతే సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. డీలిమిటేషన్ అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి తప్ప, ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా మారకూడదని ఆయన […] The post డీలిమిటేషన్తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్సభలో మిథున్ రెడ్డి appeared first on Visalaandhra .
Rahul Gandhi |శాశ్వత అధికారం కోసం బీజేపీ కుట్ర
Rahul Gandhi | శాశ్వత అధికారం కోసం బీజేపీ కుట్ర లోక్సభలో రాహుల్
బ్యాంకులో చెలరేగిన మంటలు గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇండియన్
కుర్చపల్లిలో శిథిలావస్థలో కాకతీయకాలం బురుజు
కుర్చపల్లిలో శిథిలావస్థలో కాకతీయకాలం బురుజు రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కుర్చపల్లి
rs1370drop కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..
rs1370drop కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. rs1370drop కొనుగోలుదారులకు భారీ ఊరట! ఆంధ్రప్రభ

29 C