SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

17    C
... ...View News by News Source

‘జెన్ జీ’ ఈజ్ వాచింగ్ ఇకనైనా మారాలి..!

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని వినమ్రంగా అభ్యర్థించడానికి వచ్చాను, కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఈ విషయంలో ఆరు లేఖలు రాసినా స్పందన లేని కారణంగా మీ తలుపులు తట్టాల్సి వచ్చింది. అక్షర దోషాలు ఉన్న కారణంగానో, మరే చిన్న చిన్న పొరపాట్ల వల్లనో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్) పేరుతో కొద్దిమాసాల్లో ఎన్నికలు జరగనున్న తమ రాష్ట్రంలో ఒక కోటి నలభై లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌కి బుధవారం నాడు మొర పెట్టుకొన్నప్పటి మాటలు ఇవి. భారత దేశ చరిత్రలో బహుశా ఒక ముఖ్యమంత్రి ఇట్లా దేశ అత్యున్నత న్యాయస్థానానికి తన సమస్యను విన్నవించుకోడానికి స్వయంగా హాజరయిన సంఘటన ఇదే ప్రథమం. సుప్రీంకోర్టులో నల్లకోటు ధరించి తనకు ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని మమత వేడుకుంటున్న సమయంలోనే రాజ్యసభలో ప్రముఖ నటుడు ఎంఎన్‌ఎం పార్టీ తరఫున డిఎంకె మద్దతుతో రాజ్యసభ సభ్యుడైన కమలహాసన్ తన తొలి ప్రసంగం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తూర్పారపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎస్‌ఐఆర్ పేరిట ఒక వ్యాధిని దేశమంతా విస్తరింప చూస్తున్నదని, దానిని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉన్నదని అన్నారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో అనేక మంది సజీవ మృతులు ఉన్నారని, తమిళనాడులో కూడా ఒక కోటి మంది పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించి వారిని కూడా సజీవ మృతుల్ని చేసే పనిలో ఎన్నికల సంఘం ఉందని ఆయన సభ దృష్టికి తెచ్చారు. కమలహాసన్ మాట్లాడేందుకు ఆయన పేరు పిలిచేటప్పుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన తొలి ప్రసంగం కాబట్టి పూర్తిగా విందాం అన్నందుకేమో కమలహాసన్ కొద్ది సేపే అయినా తన ప్రసంగంలో చాలా పదునైన భాష వాడినప్పటికీ ఎవరూ అభ్యంతర పెట్టలేదు. శాశ్వతంగా అధికారంలో ఉండాలని ఏ ప్రభుత్వము కోరుకోకూడదు, అది ప్రపంచంలో ఎవరికీ సాధ్యపడలేదు అని కమలహాసన్ హెచ్చరించారు. ఓ పక్క సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని గౌరవ న్యాయమూర్తులను వేడుకుంటున్న సమయంలోనే రాజ్యసభలో కమలహాసన్ మాట్లాడిన మాటలు కాకతాళీయమే అయినా ఇవాళ మన చట్టసభల పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని అనడంలో సందేహం లేదు. చట్ట సభల్లో ఇక న్యాయం దక్కే పరిస్థితి లేదని భావించినందువల్ల మమతా బెనర్జీ న్యాయస్థానం వైపు చూస్తుంటే కమలహాసన్ మాత్రం ఇంకా చివరి ఆశతో పార్లమెంట్‌ను వేడుకుంటున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమలహాసన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు రాష్ట్రంలో కొద్ది మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరిట పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించే పని జరుగుతున్న ఫిర్యాదు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నది. లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దీన్నొక ఉద్యమంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరం అయిన స్థానాలు లోకసభలో లభించనప్పటికీ మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్న బిజెపి రాష్ట్రాలను కైవసం చేసుకోవడానికి ఈ ఎస్‌ఐఆర్‌ను ఎన్నికల సంఘం ద్వారా ప్రయోగిస్తున్నదన్నది ప్రతిపక్షాల అభియోగం. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ముఖ్యంగా బుధవారం నాడు మమతా బెనర్జీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి చూస్తుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకునే భారత దేశంలో చట్టసభల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోతున్నదా అన్న సందేహం కలగక మానదు. మమతా బెనర్జీ మామూలు వ్యక్తి కాదు, ఆమె ఈ దేశంలోనే ఒక బలమైన రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు. 34 సంవత్సరాల వామపక్ష పరిపాలనకు చరమగీతం పాడి 2011 నుండి పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన నాయకురాలు. ఆమె నాయకత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది. 2011లో ముఖ్యమంత్రి కావడాని కంటే ముందు నాలుగు సార్లు ఆమె పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి ముఖ్యమైన శాఖలు నిర్వహించారు. ఇటు కాంగ్రెస్‌ను, అటు వామపక్షాలను పశ్చిమబెంగాల్ సరిహద్దులకు పరిమితం చేసిన మమతా బెనర్జీకి ప్రస్తుతం లోకసభలో 28 మంది సభ్యులు, రాజ్యసభలో మరో 13 మంది సభ్యులు ఉన్నారు. ఇంత శక్తిమంతురాలైన మమతా బెనర్జీ ఈ సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ముందటికి ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది. చట్టాలు చేసేది పార్లమెంట్ కదా, ఇటువంటి విషయాలన్నీ అక్కడ చర్చించి పరిష్కారం చేయాలి కదా? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడేది పార్లమెంట్ చేసే చట్టం ద్వారానే, అటువంటి వ్యవస్థలో లోటుపాట్లను సరిదిద్ది దేశ ప్రజలందరికీ న్యాయం చేయవలసిన పార్లమెంటులో అది జరగడం లేదనే కదా మమతా బెనర్జీ న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అయ్యే ప్రజాధనం వ్యయం కాక వివిధ పార్టీల ఎన్నికల ఖర్చు 2024లో రూ. లక్షా 35 వేల కోట్లకు చేరినట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో వెల్లడి అయింది. ఇట్లా ఏర్పాటైన పార్లమెంట్లో పోనీ ప్రజాసమస్యల మీద సజావుగా చర్చ జరుగుతున్నదా, ప్రజోపయోగమైన చట్టాల రూపకల్పన జరుగుతున్నదా అంటే అది కూడా జరగడం లేదని స్వయంగా లోకసభ స్పీకర్ అంగీకరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం చూసినా భారత పార్లమెంట్ నిర్వహణకు నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక గంట సేపు పార్లమెంటు సమావేశం అయితే కోటిన్నర రూపాయల ప్రజాధనం వ్యయం అవుతుంది. ఇక భద్రతకు సంబంధించిన ఖర్చు, సిబ్బంది జీతభత్యాలు మొదలయిన ఖర్చులు వేరు. పార్లమెంట్ సమావేశమయిన సమయంలో అర్థమంతమైన చర్చలు జరిగాయా, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏమైనా జరిగా అనే విషయంతో సంబంధం లేకుండా జరిగే ఖర్చు ఇది. గత సోమవారం నాడు సభను వాయిదా వేస్తూ లోకసభ స్పీకర్ ఓం బిర్లా స్వయంగా ప్రకటించినట్టు 19గంటల సభా సమయం వృథా అయింది. అంటే గంటకు కోటిన్నర రూపాయల చొప్పున 19 గంటలకు సుమారు 30 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్టే కదా. ఇందుకెవరు బాధ్యులు? సభ నిర్వహణలో కీలక సహకారం అందించవలసిన అధికార ఎన్‌డిఎ, ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న బిజెపి బాధ్యత వహించాలా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు అంటూ సభలో నిరసనలు వ్యక్తం చేసి సభా కార్యక్రమాలను స్తంభింప జేసిన ప్రతిపక్ష యుపిఎ కూటమి, ఆ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయాలా? కోట్లాది రూపాయల వ్యయం జరుగుతున్నా ఫలితం లేదని బాధపడాలా? ఇదిలా ఉంటే బహుశా మన దేశ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భద్రతా కారణాల దృష్ట్యా ప్రధానమంత్రిని పార్లమెంటుకు రావద్దని తాను సూచించినట్టు లోకసభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించడం మన పార్లమెంట్లో పరిస్థితికి అద్దం పడుతున్నది. కాంగ్రెస్ సభ్యులు ప్రధాని స్థానాన్ని చుట్టుముట్టి ఏదైనా ఊహించని చర్యకు పాల్పడే ప్రమాదం ఉందని తనకు కచ్చితంగా సమాచారం ఉన్నందున ఆయనను సభకు రావద్దని తాను కోరినట్టు స్పీకర్ చెప్పారు. అంతకు ముందు బుధవారం నాడు కొందరు మహిళా ప్రతిపక్ష ఎంపిలు బ్యానర్లు పట్టుకొని ప్రధాని స్థానం వైపు దూసుకు రావడంతో సభలో ఆందోళన మొదలైంది, అలాగే స్పీకర్ పోడియం వద్ద కూడా ప్రతిపక్ష సభ్యులు దూసుకు రావడంతో సభ వాయిదా పడింది. సభలో ఇటువంటివి జరగడం సర్వసాధారణం. ప్రతిపక్షంలో ఉన్న మన ప్రజాప్రతినిధులు ప్రధాన మంత్రి మీదనే దాడి చేసేంత స్థితికి దిగజారారని సాక్షాత్తు సభాధ్యక్షుడే నమ్మడం విచారకరం. సభకు అధిపతి అయిన స్పీకర్ ప్రధానమంత్రికి రక్షణ కల్పించలేనని అశక్తత వ్యక్తం చేయడం మన పార్లమెంటు ఎట్లా నడుస్తున్నదో అర్థమైంది. రాజకీయంగా అభిప్రాయ భేదాలు వ్యక్తం కావడం అంశాల వారీగా చర్చించుకోవడం ఒకానొక స్థితిలో అవి కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే విధంగా సాగడం సహజమే కానీ భౌతికంగా, అదీ సభలో హాని చేసే స్థితికి మన గౌరవ ప్రజాప్రతినిధులు వెళ్తారని సభాధ్యక్షుడు స్వయంగా ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. సభలోపలా, వెలుపలా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉండే స్నేహ వైరుధ్యానికి సంబంధించి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా చెప్పిన రెండు సంఘటనలను జ్ఞాపకం చేసుకోవాలి. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో వాజ్‌పేయి యువ లోకసభ సభ్యుడు. ఒకసారి సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నెహ్రూను ఉద్దేశించి మీలో ఇద్దరు వ్యక్తులున్నారు, ఒకరు చర్చిల్ అయితే మరొకరు చెంబర్లిన్ అన్నారట. సభ ముగిసాక సాయంకాలం ఒక విందులో కలిసినప్పుడు నెహ్రూ వాజ్‌పేయి భుజంతట్టి సభలో ఈ రోజు జోర్దార్‌గా మాట్లాడారు మీరు అని ప్రశంసించారట. తరువాత చాలా కాలానికి పివి నరసింహా రావు ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని కశ్మీర్ సమస్య మీద చర్చ జరగనున్న జెనీవా మనవ హక్కుల సదస్సుకు భారత దేశం తరఫున హాజరయ్యే అధికార ప్రతినిధి బృందానికి నాయకుడిని చేసి పంపారట. ఆ సదస్సుకు హాజరయిన ఇతర దేశాల ప్రతినిధులు ఈ అంశాన్ని ఒక విశేషంగా చెప్పుకున్నారని వాజ్‌పేయి స్వయంగా చాలా చోట్ల చెప్పేవారు. ఇంత సామరస్య వాతావరణం ఉంటే మమత సుప్రీంకోర్టు మెట్లెక్కే అవసరం ఎందుకొచ్చేది? ఇదంతా దేశం చూస్తున్నది. కమలహాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగం చివర్లో చెప్పినట్టు జెన్ జీ ఈజ్ వాచింగ్ అజ్ (భావి భారత పౌరులు మనను గమనిస్తున్నారు). Delete Edit

మన తెలంగాణ 8 Feb 2026 12:15 am

వార ఫలాలు (08-02-2026 నుండి 14-02-2026 వరకు)

మేష రాశి ఫలితాలు : మేష రాశి వారికి ఈ వారం ఆదాయం తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న పాటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే బాగుంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉంటారు. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీరు చేసే కృషి ఫలిస్తుంది. పదిమందిలో మెప్పు పొందే విధంగా ఉంటుంది. మీరు ఏదైతే మాట్లాడుతారో ముక్కుసూటిగా ఉంటుంది అది అందరికీ నచ్చదు. ఈ రాశి వారు ఏది మాట్లాడినా తప్పు అవుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పై అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించిన విషయాలలో వారి చదువుపట్ల ఆచితూచి అడుగు వేయటం మంచిది. ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఫిబ్రవరి నెల 17 వరకు శుక్ర మౌడ్యమి ఉంది కాబట్టి 18వ తేదీ నుండి శుభముహూర్తాలు ఉన్నాయి చక్కగా వివాహ ప్రయత్నాలు నూతన గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలు చేసుకోవచ్చు. వివాహ సంబంధిత విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా స్ట్రెస్ కు లోన్ అవటం వలన ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. బీపీ షుగర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు వాటి పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ రాశి వారు సంకల్పబలంతో ముందుకు వెళ్ళటం మంచిది. అంతేకానీ ఈ పని అవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉంటే ఏ పని నెరవేరదు. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లు చాలా చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే డాక్టర్ సలహాలు తీసుకొని జాగ్రత్త పడటం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం హనుమాన్ చాలీసా పఠించండి కుదిరితే ఒకరోజు సుందరకాండ పారాయణం ఇంట్లో చేయించుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. ధనం ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటాయి. ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ లభించే అవకాశం గోచరిస్తుంది. పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పదిమంది పలు రకాలుగా చెప్తారు ఏది మంచో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అదేవిధంగా అధికారులతో కొంత ఇబ్బంది ఉండే అవకాశం గొచరిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. శుభకార్య ప్రస్తావన ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన వ్యవహారాలు బాగుంటాయి. అయితే సంతానం ఉద్యోగం పట్ల కొంత నిరాశ ఏర్పడుతుంది. చేతిదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయిన బాధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. కాస్మటిక్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్స్ కి సివిల్ సర్వీసెస్ లో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాల ప్రారంభోత్సవం నూతన వాహనాలకు కొనుగోలు ఎక్కువగా గొచరిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. పేరు ప్రఖ్యాతల విషయంలో ఎలాంటి ఇబ్బంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ కాలం గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఏదైనా సరే కష్టపడి వెళ్లాల్సి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఫ్రెండ్స్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కష్ట కాలంలో మీకు ఎవరూ తోడు ఉండరు కాబట్టి పెద్ద వాళ్ళ మాట విని శ్రద్ధగా చదువుకోవడం మంచిది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారంపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య రీత్య కూడా అన్ని సానుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడంలో మంచి శుభవార్త వింటారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. గృహప్రవేశం చేయాలనే కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఖర్చులు విషయంలో మాత్రం జాగ్రత్త వహించడం మంచిది. ప్రతిరోజు సుబ్రమణ్య స్వామి అష్టకం చదవండి అలాగే సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లు ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి. రావలసి ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చేతికి అందుతాయి. రాహు ప్రభావం వలన మనసు పరిపరి విధాలుగా ఉండటం, ఏ పని చేసినా సరే హడావిడిగా చేయటం, పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తతో మాట్లాడటం చేయాలి. పై అధికారులతోటి జాగ్రత్త పడటం చెప్పదగిన సూచన. చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గడచిన కాలం కంటే కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది . కొన్ని కార్యక్రమాల పట్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఏదైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఖర్చులు అదుపులోకి వస్తాయి భూ సంబంధిత విషయ వ్యవహారాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. మీ స్నేహితుల అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. లాయర్లకి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కాని మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఖర్చులు అదుపులో ఉండవు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయం మనకే తెలుసు ఎవరు చెప్పనవసరం లేదు అనే ధోరణి అవలంబించకండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. మీరు రాసుకు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా గడిచిన వారం కంటే బాగుంటుందని చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సినీ కళా రంగాలలోని వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. సుబ్రహ్మణ్యం పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం కొంత అప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. నూతన కాంట్రాక్టులు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. చార్టెడ్ అకౌంటెంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రావలసిన బెనిఫిట్స్ లభిస్తాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది చదువుపై శ్రద్ధ వహించండి. విదేశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం ఆడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాజు వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడుల నుండి రాబడి రావడం మొదలు అవుతుంది. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి మంచి సంబంధం కుదురుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై తగిన శ్రద్ధ వహించాలి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాజు వారు ప్రతి రోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి వీసా పాస్పోర్ట్ లభిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు గ్రే. తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనయోగం ఉంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. సమాజ సేవలో మీ వంతు సహకారం అందిస్తారు. గో సేవ చేయండి. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయవిక్రయాలలో లాభపడతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి లాయర్లకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి నిత్యవసర సరుకులు అమ్మేవారికి ఈవారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రాజు వారు పెద్ద రోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఇంద్రాణి రూపం మెడలో ధరించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వస్తే రంగు స్కై బ్లూ. ఇదే నా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సహోదరీ సహోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. వ్యవసాయదారులకు ప్రేరేచరంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్స్ నడిపే వారికి ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలువ అనుకూలంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై తగిన శ్రద్ధ వహించాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార పరంగా రొటేషన్సు బాగుంటాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవండి సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసివచ్చ సంచే ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా అధికారుల అండదండలు లభిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది తక్కువగా ఉంది అనే బాధ కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితి ఆసాజనకంగా ఉంటుంది. వ్యాపార పరంగా తొందరపాటు పనిచేయదు. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ధనం సరైన సమయంలో చేతికందక ఇబ్బంది పడతారు. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. కొన్ని వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. ఈ రాశి వారు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతో అమ్మ వారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఇదేనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.  కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో తక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉదర సంబంధిత వ్యాధులు గైనకాలజికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శని కళా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. సాహిత్య రంగంలో ఉన్నవారికి అవార్డు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. సంతాన పురోగతి బాగుంటుంది. వివాహ సంబంధమైన విషయాలలో కొంత ఆలస్యం ఏర్పడుతుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.  

మన తెలంగాణ 8 Feb 2026 12:00 am

బెల్లంపల్లి గురుకుల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు భో జనం చేసిన తరువాత అస్వస్థతకు గురికావడంతో పుడ్ పాయిజన్ జ రిగి ఉంటుందనే వాదనలు వినవస్తున్నాయి. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి వసతి గృహాంలో విద్యార్థులు భోజనం చేసిన తరువాత 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థులను బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఆసుపత్రి కి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చి కిత్స అందించారు. గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ గురుకులాలపై ప్రభుత్వ వైఖరీ తెలియజేస్తుందని విద్యార్థుల పేరేంట్స్ అన్నారు. గురుకులాలలపై సక్రమైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే తరచు పుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతుండడం దురధృష్టకరం, ఇప్పటికే పలు ప్రాంతాలలో గురుకులాలలో పుడ్‌పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చేరిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికి, బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో సంఘటన జరగడం నిర్లక్ష్యానికి దారితీస్తుందనడంలో ఏలాంటి సందేహాం లేదు.ఈ సంఘటన తెలిసిన ఎంఎల్‌ఎసి మల్క కొంరయ్య శనివారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించారు. పుడ్ పాయిజన్ సంఘటనను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో సంఘటన విషయమై ఛరవాణిలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బెల్లంపల్లి గురుకుల పాఠశాల లో జరిగిన పుడ్ పాయిజన్ విషయమై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేసారు. ప్రతి సారి గురుకుల పాఠశాలలో పుడ్‌పాయిజన్ ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు, అధికారుల పర్యవేక్షణ ఎందుకు కొరవడుతుందని, ఈ విషయాలపై పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. పుడ్ పాయిజన్ సంఘటనపై రిపోర్టు హెల్త్ డైరెక్టర్ కు పంపాలని ఆయన ఆదేశించారు. గురుకులం ఘటనకు బాద్యులను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. విద్యార్థులకు ఏలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

మన తెలంగాణ 7 Feb 2026 11:30 pm

తొలి టి20లో యుఎస్‌ఎపై టీమిండియా ఘన విజయం

ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026లో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. శనివారం పసికూన యుఎస్‌ఎ(యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజ యం సాధించి, బోణీ కొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టమీండియా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 నాటౌట్ (49 బంతులు; 10x4, 4x6) తప్ప మరెవరూ రాణించలేకపోయారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అమెరికా బౌలర్లలో షాడ్లీవాన్ షాక్విక్(4/25), హర్మీత్ సింగ్(2/26), అలీ ఖాన్(1/13), మహమ్మద్ మోహ్సిన్(1/16) తలో వికెట్ తీసి, భారత బ్యాటర్లను వణికించారు. అనంరతం లక్ష ఛేదనకు దిగిన యుఎస్‌ఎ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. మలింద్ కుమార్(34), సంజయ్ కృష్ణమూర్తి(37), శుభం రంజనె(37) మాత్రమే రాణించారు. భారత్ బౌలర్లల్ మహ్మద్ సిరాజ్ (3/29), అర్ష్‌దీప్ సింగ్(2/18), అక్షర్ పటేల్(2/24)లు చెరేగి భారత్ గెలుపులో కీలక భూమిక పోషించారు.

మన తెలంగాణ 7 Feb 2026 11:27 pm

శ్రీశైలంలో 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సుమారు 30 శాతం మంది భక్తులు ఎక్కువగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 8న ఉదయం శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9 నుంచి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి వివిధ వాహన సేవలు, గ్రామోత్సవం జరుగుతాయి. ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వం తరపున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నేడు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా హాజరుకావాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. 15న మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ : టిటిడి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గంటల నుండి అర్థరాత్రి 12 గం=టల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

మన తెలంగాణ 7 Feb 2026 11:09 pm

కాంగ్రెస్ అభ్యర్థి ఎండి హబీబ్ ను గెలిపించండి

పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్

ప్రభ న్యూస్ 7 Feb 2026 11:02 pm

వార్డులో సమస్యలు లేకుండా ప్రజా సేవచేస్తా..

9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అప్పం కిషన్ భూపాలపల్లి, ఫిబ్రవరి 7(ఆంధ్రప్రభ): భూపాలపల్లి

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:54 pm

సూరజ్‌కుండ్ మేళాలో విషాదం

 హర్యానాలో జరుగుతున్న సూరజ్‌కుండ్ మేళాలో విషాదం నెలకొంది. ఉత్సవం జరుగుతుండగా ఓ రంగులరాట్నం కుప్పకూలింది. విధుల్లో ఉన్న ఓ పోలీసు మృతి చెందాడు. 13 మంది గాయపడ్డారు. అంతకు ముందు ఇక్కడనే ఓ ద్వారం విరిగిపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రతి ఏటా ఫరీదాబాద్‌లో పెద్ద ఎత్తున సూరజ్‌కుండ్ హస్తకళల పలు ప్రాంతాల నుంచి జనం తరతివస్తారు. ఉత్సం వద్ద దుర్ఘటన గురించి తెలియగానే జిల్లా ఉన్నతాధికారి ఆయుషు సిన్హా. పర్యాటక శాఖ ఎండి పార్థ్ గుప్తా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రంగుల రాట్నం కూలి అక్కడున్న పోలీసుపై పడింది. ఆయన అక్కడికక్కడనే మృతి చెందారు. ఆపరేటర్ భుజానికి తీవ్రగాయం అయింది.

మన తెలంగాణ 7 Feb 2026 10:50 pm

మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికై కాంగ్రెస్ కు పట్టం కట్టండి

పంచాయతీ రాజ్ మంత్రి, భువనగిరి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ సీతక్క, తుంగతుర్తి

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:48 pm

2వ వార్డులో నిచ్చకోల వంశీకృష్ణ ప్రచార ప్రభంజనం

గెలుపే లక్ష్యంగా ‘బ్యాటు’ గుర్తుతో ముందడుగు బెల్లంపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): మున్సిపల్

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:42 pm

బెల్లంపల్లి అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం బీఆర్ఎస్ లీడర్లు చెప్పేవన్ని మోసం మాటలే

కాంగ్రెస్ కు ఓటేయండి .. 34 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాంఎమ్మెల్యే గడ్డం

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:37 pm

5 వార్డు లో బండ్రు శోభారాణి ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 5 వ

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:31 pm

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి ఆదరణ

ఆలేరు, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల కోసం

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:21 pm

రోజంతా సాగిన ఎమ్మెల్యే ప్రచారం

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో శనివారం ఉదయం నుండి

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:16 pm

18వ డివిజన్‌లో కాంగ్రెస్ జోరు…

అభివృద్ధి అజెండాతో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి జాజిమొగ్గ నరసింహులు మహబూబ్ నగర్, ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:06 pm

congress l ప్రజా సమస్యల పరిష్కార మే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..

congress l ప్రజా సమస్యల పరిష్కార మే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం.. పదో

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:05 pm

కాంగ్రెస్ అబద్ధాలను ఎండగడుతున్నందుకే నాపై దండయాత్ర..

మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:03 pm

వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావించారు. అయితే ఈ నెల 11న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుండడం, అనంతరం మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక జరగనున్నందున అనుకున్న తేదీ కాకుండా మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలాఉండగా బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏ తేదీలను ఖరారు చేసినా, వెంటనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి శనివారం సంబంధిత అధికారులతో సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు. మరోవైపు నాటి నిజాం కాలం నాటి భవనాన్ని కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు అవసరమైన విధంగా స్వల్ప మార్పులు చేసి, తుది మెరుగులు దిద్దుకుంటున్నది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించే రోజు వరకు సిద్ధం అయ్యేలా అధికారులు పనులు వేగవంతం చేయించారు.

మన తెలంగాణ 7 Feb 2026 9:59 pm

కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి… అభివృద్ధి నా బాధ్యత

గెలుపు దిశగా ..దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న

ప్రభ న్యూస్ 7 Feb 2026 9:58 pm

17 నుంచి వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్నాయి. శనివారం జూబ్లీహిల్స్‌లోని స్వామివారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పోస్టర్, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేస్తున్నామన్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీరు, అన్న ప్రసాదాలు, పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్.ఎ.సి ప్రెసిడెంట్ ఏవీ రెడ్డి, ఏఈవో రమేశ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, హరికృష్ణ వీరితో పాటు పలువురు అధికారులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం : ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఆగమోక్తంగా తర్వాతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 10.30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ గోడలను, పైకప్పును, పూజాసామగ్రి తదితర వస్తువులు అన్నింటినీ నీటితో శుద్ధి చేస్తారు. తర్వాత సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంట వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహన సేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : ఈ నెల 17న ఉదయం ధ్వజారోహణం మేష లగ్నంలో ఉ. 10.30 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఆరోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామి దర్శనం ఇస్తారు. 18న ఇదే తరహాలో ఉదయం చిన్నశేష వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. 19న ఉదయం స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. రాత్రికి ముత్యపుపందిరి వాహనంపై విహరిస్తారు. 20న ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగిస్తారు. రాత్రి సర్వభూపాల వాహనం సేవ నిర్వహిస్తారు. 21న ఉదయం పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం)లో స్వామి దర్శనమివ్వనున్నారు. రాత్రి గరుడ వాహనం (రాత్రి 7 గంటల నుంచి 9గంటల వరకు)పై భక్తులకు అనుగ్రహించనున్నారు. 22న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం సేవలు జరుగుతాయి. 23న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు. 24 ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం సేవలు జరుగుతాయి. 25న ఉదయం చక్రస్నానం (ఉదయం 8 నుంచి 10గంటల వరకు) నిర్వహిస్తారు. రాత్రి ధ్వజావరోహణం (సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు) నిర్వహిస్తారు. 26న మధ్యాహ్నం 3 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.

మన తెలంగాణ 7 Feb 2026 9:53 pm

brs l ప్రజల అండతో మరోసారి విజయం ఖాయం అంటున్న ఆరెపల్లి..

brs l ప్రజల అండతో మరోసారి విజయం ఖాయం అంటున్న ఆరెపల్లి.. మోసపోవద్దు

ప్రభ న్యూస్ 7 Feb 2026 9:53 pm

MLA L ప్రజల్లో ఉండే వాళ్ళకే టికెట్స్ ఇచ్చినం…

MLA L ప్రజల్లో ఉండే వాళ్ళకే టికెట్స్ ఇచ్చినం… మీకు ఎల్లప్పుడూ అందుబాటులో

ప్రభ న్యూస్ 7 Feb 2026 9:45 pm

యుఎస్ఎ లక్ష్యం 162

 ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యుఎస్ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 161 పరుగులు చేస్తుంది. ఈ మ్యాచ్ లో సర్యకుమార్ (84) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తిలక్ వర్మ(25), ఇషాన్ కిషన్(20) పరుగులు చేశారు. యుఎస్ఎ బౌలర్లలో షాడ్లీ 4, హర్మీత్ సింగ్ 2, మొహ్సిన్ అలీ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

మన తెలంగాణ 7 Feb 2026 9:09 pm

vamsi krishna l వార్డు అభివృద్ధి నా లక్ష్యం..

vamsi krishna l వార్డు అభివృద్ధి నా లక్ష్యం.. క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ;

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:59 pm

swathi l 7వ వార్డులో గెలుపే లక్ష్యంగా ప్రచార ప్రభంజనం!

swathi l 7వ వార్డులో గెలుపే లక్ష్యంగా ప్రచార ప్రభంజనం!

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:46 pm

కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త

జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్ లో కుటుంబ కలహాలతో ఆదరవేని సత్తవ్వ (50) అనే మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. గత కొద్దిరోజులుగా మనస్పర్ధలతో భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మల్లయ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో సత్తవ్వపై గోడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిందితుడు మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

మన తెలంగాణ 7 Feb 2026 8:41 pm

prasanna l గత పాలనకు గుర్తుగా ప్రజల మద్దతు…

prasanna l గత పాలనకు గుర్తుగా ప్రజల మద్దతు… 49వ డివిజన్ లో

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:32 pm

సూడాన్‌లో పారామిలిటరీ డ్రోన్ దాడికి 24 మంది మృతి

సెంట్రల్ సూడాన్‌లో శనివారం నిర్వాసిత కుటుంబాలతో వెళ్తున్న వాహనంపై పారామిలిటరీ గ్రూపు డ్రోన్ దాడి చేయడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని డాక్టర్ల గ్రూపు వెల్లడించింది. నార్త్ కొర్డోఫాన్ ప్రావిన్స్‌లో రహాద్ సిటీ సమీపాన రాపిడ్ సపోర్టు ఫోర్స్‌స్ ఈ దాడికి పాల్పడ్డాయి. నార్త్ కొర్డోఫాన్ లోని డుబెయికర్ ఏరియా యుద్ధ ప్రాంతం నుంచి తరలిపోతున్న నిర్వాసితులపై ఈ దాడి జరిగిందని డాక్టర్ల గ్రూపు పేర్కొంది. తక్షణం ప్రజలను రక్షించడానికి అంతర్జాతీయ సమాజం, హక్కుల సంఘాలు చొరవ తీసుకుని ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకత్వాన్ని ఈ ఉల్లంఘనలకు జవాబుదారీ చేయాలని కోరింది.అయితే ఆర్‌ఎస్‌ఎఫ్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దేశాన్ని నియంత్రించడానికి గత మూడేళ్లుగా సూడానీస్ మిలిటరీకి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎఫ్ పోరు సాగిస్తోంది. 2023 నుంచి సూడాన్‌లో అధికారం కోసం మిలిటరీకి, ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య యుద్దం సాగుతోంది. రాజధాని ఖర్టోమ్ లో దేశం లోని మిగతా ప్రాంతాల్లోనూ బహిరంగ పోరు సాగుతోంది. ఈ యుద్ధం వల్ల దాదాపు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం మొత్తం మీద సూడాన్‌లో భారీ మానవతా సంక్షోభం నెలకొంది. దాదాపు 14 మిలియన్ మంది బలవంతంగా తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. దీంతో వ్యాధులు విజృంభించడమే కాకుండా దేశం లోని అనేక ప్రాంతాలు దుర్భిక్షానికి గురయ్యాయి.

మన తెలంగాణ 7 Feb 2026 8:25 pm

Video: Manasa Varanasi Exclusive Interview

The post Video: Manasa Varanasi Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 8:24 pm

బి ఆర్ ఎస్ తోనే మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కారు గుర్తుకు ఓటు వేస్తే …కాంగ్రెస్ చెంప మీద కొట్టినట్టే

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:17 pm

బీజని బాలమణికి మద్దతుగా

కొల్లూరు నాయకుల ప్రచారం ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:11 pm

APPSC l ఏపీపీఎస్సీ పరీక్షలకు స్వరం సిద్ధం..

APPSC l ఏపీపీఎస్సీ పరీక్షలకు స్వరం సిద్ధం.. APPSC l కర్నూలు ఆంధ్ర

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:08 pm

ప్రజా సమస్యల పరిష్కార మే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం

-పదో వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేజే

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:06 pm

వికారాబాద్ అనంతగిరి హిల్స్‌లో కర్నాటక తరహా జంగల్ కాటేజెస్

కర్ణాటక రాష్ట్రంలోని ‘జంగల్ లాడ్జిస్‘ తరహాలో తెలంగాణలో తన ఎకో టూరిజం బ్రాండ్‌కు ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్’ అనే పేరుతో ట్రెక్కింగ్, బర్డ్ వాక్స్, నైట్ క్యాంప్స్, జంగల్ కాటేజెస్‌లో బస, సఫరీ, అడవిలో ‘బుష్ బ్రేక్ఫాస్ట్’ వంటి వినూత్న కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రారంభించింది. దీనిలో భాగంగా భాగంగా అటవీ అభవృద్ధి సంస్థ - ది బ్రీజ్ అనంతగిరి హిల్స్ - వికారాబాద్‌లో జంగల్ కాటేజెస్ నిర్మించి, అటవీ విజ్ఞాన శాస్త్రం చదివిన, హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన వారిని ఈ డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్ - ఎకో టూరిజం విభాగంలో ఒక నెల పాటు అడవులు, వృక్ష వైవిద్యం, జంతు విజ్ఞానం, వాటి సంరక్షణ, హాస్పిటాలిటీ వంటి అంశాల మీద నైపుణ్యం పెంచి వారిని ‘నేచురలిస్ట్’లు గా నియమిస్తారు. ది బ్రీజీ ని ముందుగా గెస్ట్‌లు - వ్బ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు గాను పలు ప్యాకేజీలతో కూడిన ధరలు అందుబాటులో ఉంచింది. మిగిలిన వివరాలకు అటవీ అభివృద్ధి సంస్థ, డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్ సంస్థలను సంప్రదించాలని సూచించింది.

మన తెలంగాణ 7 Feb 2026 8:06 pm

ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరు మృతి

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పోచారం వద్ద ఔటర్ రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మౌనిక (36), నవీన్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో హరిప్రసాద్, హర్ష, అమృత, సుశ్రుత తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో సుశ్రుత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోరంపేటకు చెందిన వీరంతా జూ పార్క్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. 

మన తెలంగాణ 7 Feb 2026 8:05 pm

24వ డివిజన్‌లో కాంగ్రెస్ గెలుపు దిశగా దూకుడు…

గుమ్ముడాల రాధ గోవర్ధన్ గౌడ్ విజయం దాదాపు ఖాయం 34 ఏళ్ల జర్నలిస్టు

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:02 pm

37loves17 |మైనర్ పై మోజు పడ్డ మాతృమూర్తి

37loves17 | మైనర్ పై మోజు పడ్డ మాతృమూర్తి 37loves17 | అత్త,

ప్రభ న్యూస్ 7 Feb 2026 7:57 pm

¾ Lady Medicos :  డాక్టరమ్మలొస్తున్నారోచ్​ Andhra prabha top Story

Lady Medicos : డాక్టరమ్మలొస్తున్నారోచ్​ Andhra prabha top Story

ప్రభ న్యూస్ 7 Feb 2026 7:39 pm

ఉద్యోగుల పంపకాలపై పీటముడి

తెగని ఎపి, తెలంగాణ ఉద్యోగుల పంచాయితీ? అటకెక్కిన కమల్‌నాథన్ కమిటీ సూచనలు తెలంగాణలో పనిచేస్తూ ఎపికి వెళ్లడానికి సుముఖంగా లేని 1,300 మంది ఉద్యోగులు ఎపి నుంచి రావడానికి 1,808 మంది ఉద్యోగులు సిద్ధం మిగతా 1,025 మంది ఉద్యోగులకు తెలంగాణ స్థానికత లేదు మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి, తెలంగాణ ఉద్యోగు ల పంచాయితీ తేలడం లేదు. ప్రస్తుతం 1,808ల మంది ఉద్యోగులు ఎపి నుంచి తెలంగాణకు రావాల్సి ఉండగా, తెలంగాణలో పనిచేసే ఎపికి చెందిన 1,300ల మంది ఉ ద్యోగులు ఎపికి వెళ్లాల్సి ఉంది. అయితే, తెలంగాణలో ప నిచేసే 1,300ల మంది ఉద్యోగులు ఎపికి వెళ్లడానికి సు ముఖంగా లేకపోవడం, ఎపి నుంచి వచ్చే వారిలో కొంద రు తెలంగానేతరులు కావడంతో ఈ అంశం ప్రస్తుతం పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు ఈ అంశంపై ఇ రు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నా ముం దుకెళ్లడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, తెలంగాణలో పనిచేసే ఎపి ఉద్యోగు లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని, ఎపి నుంచి తెలంగాణకు రావాల్సిన ఉద్యోగుల్లో చాలామంది తెలంగానేతరులు ఉ న్నారని ఈ విషయంలో అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాతే అధికారులు ఉద్యోగుల పంపకాలు జరపాలని ఉద్యోగ సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఈ 1,808 మంది ఉద్యోగుల్లో చాలామంది తెలంగాణ వా రు కాదని అందరిని తెలంగాణకు తీసుకుంటే తెలంగాణ ఉద్యోగుల సీనియార్టీలో నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతం ఈ అంశాన్ని పక్కన పెట్టినట్టుగా తెలిసింది. ఈ బదిలీల్లో స్పౌస్, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించిన బదిలీలు ఉండడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సచివాలయంలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన 14 మంది ఉద్యోగులు శుక్రవారం ఏపి నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన 14 మంది ఉద్యోగులకు తెలంగాణలోని వివిధ విభాగా ల్లో పోస్టింగ్‌లను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. ఎపి నుంచి వచ్చిన 14 మంది ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో శుక్రవారం రిపోర్టు చేశారు. 12 ఏళ్ల తరువాత వారిని తెలంగాణకు కేటాయించడంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2024లోనూ 125మంది ఉద్యోగులు ఎపి నుంచి తెలంగాణ కేటాయి ంచడంతో వారికి ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇచ్చింది. 2,314 మంది ఉద్యోగుల పంపకం పూర్తి 2014కు ముందు (ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు) కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగులకు సంబంధించి విధి, విధానాలను రూపొందించింది. రాష్ట్ర స్థాయి పోస్టుకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కమల్‌నాథ్ క మిటీ ఆప్షన్‌లు ఇవ్వాలని సూచించింది. మిగతా ఉద్యోగులైన జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలని కమల్‌నాథ్ కమిటీ సూచించింది. అయితే కమల్‌నాథన్ కమిటీ సూచనల మేరకు ఈ 12 సంవత్సరాల్లో ఇరు రాష్ట్రాల అంగీకారంతో 2,314 మంది ఉద్యోగుల పంపకం జరిగింది. అయితే 2,300 మందిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లో పనిచేస్తున్న 1,500 మంది ఉద్యోగులు, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు 700ల మంది సైతం ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఎపికి పంపించడానికి లేఖ రాసిన తెలంగాణ అయితే తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం దీనికి సం బంధించి 1896 సర్యులర్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని అప్పటి ఎపి ప్రభుత్వ సిఎస్‌కు తెలియచేస్తూ ఒక లేఖ రాసింది. తెలంగాణలో ఎపి స్థానికతతో పనిచేస్తున్న వారి వివరాలను తెలియచేస్తూ వారిని ఎపికి పంపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో తెలిపింది. ఎపిలో పని చేసే 783 మంది తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు అయితే, ఎపి నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో 1,808 ఉద్యోగులు ఉండగా అందులో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు సుమారుగా 783 ఉంటారని, మిగతా 1,025 మంది ఉద్యోగులకు తెలంగాణకు సం బంధం లేదని అయినా వారిని తెలంగాణకు పంపుతామ ని ఎపి ప్రభుత్వం 15128 సర్కులర్‌ను జారీ చేయడం తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో తెలంగాణకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు దా నిని వ్యతిరేకించారు. తాము తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను మాత్రమే రాష్ట్రానికి రావడానికి సమ్మతిస్తామని వారు అప్పటి ప్రభుత్వంతో తెగేసి చెప్పారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కనబెట్టింది.

మన తెలంగాణ 7 Feb 2026 7:39 pm

స్పీకర్ స్థానానికే అవమానం

ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి యస్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె గంగా కూలంకష ! పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్… ఇది ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం. లోకసభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహారం గమనిస్తే ఈ పద్యం గుర్తు రాక తప్పదు. మన పార్లమెంటు అనేక ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పింది. ఈ సంప్రదాయాలను, ఆనవాయితీలను తుంగలో తొక్కడం మోదీ ప్రధానమంత్రి అయిన […] The post స్పీకర్ స్థానానికే అవమానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 7:34 pm

చిన్న రైతుల జీవనోపాధికి ముప్ప్పు

సోమ మర్ల ఫిబ్రవరి 2 వ తేదీ తెల్లవారుజామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఐతే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే ప్రతిఫలంగా భారత ఎగుమతులపై సుంకాలను 50 నుంచి 18 శాతానికి తగ్గిస్తామని,అన్ని అమెరికన్ వస్తువులపై భారత సుంకాలు సున్నా శాతానికి తగ్గుతాయని ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం వరకు మన వాణిజ్య శాఖా మంత్రి పియూష్ గోయల్ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఐతే […] The post చిన్న రైతుల జీవనోపాధికి ముప్ప్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 7:33 pm

Naga Vamsi’s Satires on Vishwak and Anudeep

Young Producer Naga Vamsi is known to speak out of his heart during the promotions and he even passes satires on himself about his films. His next production Funky is releasing next week and the trailer of the film is out. The film is a hilarious entertainer directed by Anudeep KV and Vishwak Sen, Kayadu […] The post Naga Vamsi’s Satires on Vishwak and Anudeep appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 7:32 pm

పిల్లల ప్రాణాలు తీస్తున్న కేఎల్‌జీతో జాగ్రత్త!

కరోనా వచ్చిన దగ్గర నుంచి చిన్నా, పెద్దా అంతా మొబైల్స్ వ్యసనానికి అలవాటుపడ్డారు. ఇక ఆన్‌లైన్‌లో ఎన్నో గేమ్స్ కూడా రావడం మొదలయ్యాయి. పిల్లలు వాటికి అలవాటుపడ్డారు. గతంలో బ్లూవేల్స్ అనే ఆన్‌లైన్ గేమ్ చాలా మంది పిల్లల మరణానికి కారణమయ్యింది. ఇప్ప్పుడు ప్రతీ చోటా కొరియన్ ఫీవర్ మొదలయ్యింది. కొరియన్ సీరియల్స్‌తో పాటు కొరియన్ గేమ్స్‌కి అలవాటుపడ్డారు. అలాంటి ఒక కొరియన్ లవ్Y పేరుతో వచ్చిన ఒక ఆన్‌లైన్ కారణంగా ముగ్గురు ఆడపిల్లల ఆత్మహత్య చేసుకున్న […] The post పిల్లల ప్రాణాలు తీస్తున్న కేఎల్‌జీతో జాగ్రత్త! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 7:31 pm

ఈయనే…“హార్ని” జానకిరామ చౌదరి

కాకినాడ తెలుసు కదా..! ఆ ఊర్లో ఏముంది. సముద్రం ఉంది. నోటిని తీపి చేసే కాకినాడ కాజా ఉంది. ఇప్పుడు కాదు కాని ఒకప్పుడు ఓ ఇరవై సినిమా థియేటర్లు ఒకే వీధిలో ఉండేవి. కెనడాకు ఇంచుమించు సరిసాటి అని ఆ దేశానికి వెళ్లి వచ్చిన వారు కాకినాడని కోకెనడా అనేవారట. అదే ఆ తర్వాత కాకినాడ అయ్యిందని పెద్దలు అంటారు. అలాంటి కాకినాడలో ఓ సాహితీవేత్త ఉన్నారు. పట్టణంలో నాటకానికి నాందీ వాచకం పలికే వీరాభిమాని […] The post ఈయనే…“హార్ని” జానకిరామ చౌదరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 7:30 pm

స్కాట్‌ల్యాండ్ ఆలౌట్.. విండీస్ ఘన విజయం

కోల్‌కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్‌లాండ్ విండీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. ముఖ్యంగా రొమారియో షెపర్డ్ హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి.. వెస్టిండీస్ విజయానికి బాటలు వేశాడు. స్కాట్‌లాండ్ బ్యాటింగ్‌లో బెర్రింగ్‌టన్ (42), బ్రూస్ (35) జట్టును గెలిపించేందుకు కృషి చేశారు. కానీ, మిగితా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దీంతో స్కాట్‌లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగుల చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

మన తెలంగాణ 7 Feb 2026 7:16 pm

Minister l అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..

Minister l అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.. Minister l కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 7 Feb 2026 7:10 pm

గజ్వేల్ లో తీవ్ర ఉద్రిక్తత..

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మల్లన్నసాగర్ భూనిర్వాసిత కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్&ఆర్ కాలనీకి వస్తున్న క్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకోవడంతోపాటు చెప్పులు విసురుకున్నారు. తమకు అన్యాయం చేసిన హరీశ్ రావు కాలనీకి రావద్దని భూనిర్వాసితులతోపాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది.

మన తెలంగాణ 7 Feb 2026 7:03 pm

కమీషన్‌లు ఇస్తే కాంట్రాక్టు!

 టిజిఎంఎస్‌ఐడిసిలో అంతులేని అక్రమాలు నాసిరకం ఫర్నిచర్ సరఫరా చేసి కోట్లు దండుకున్న అధికారులు ప్రభుత్వానికి  భారీగా ఫిర్యాదులు  మనతెలంగాణ/హైదరాబాద్: టిజిఎంఎస్‌ఐడిసి (తెలంగాణ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో జరుగుతున్న అవినీతి కుంభకోణంపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఈడీ స్థాయి (ఎగ్జిక్యూటివ్ అధికారి) నాలుగేళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తూ కోట్లలో దోచుకుంటున్నారని సిఎంఓకు ఫిర్యాదులు అందాయి. గతంలో జరిగిన టెండర్‌ల దగ్గరి నుంచి ప్రస్తుతం బిల్లుల చెల్లింపుల వరకు కమీషన్‌ల దందా ఈ సంస్థలో భారీగా జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలో పనిచేసే ఈడీని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని సిఎంఓ నుంచి ఆదేశాలు అందినా, సంవత్సరకాలంగా ఈడీ ఈ సంస్థ నుంచి వెళ్లకుండా ఆయన అంతులేని అక్రమాలకు తెరతీశారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. గత సంవత్సరం 25 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫర్నీచర్ కొనుగోళ్లు, ఎంఆర్‌ఐ (11 మిషన్‌లకు) టెండర్‌లకు సంబంధించి గోల్‌మాల్ జరిగిందని, కమీషన్‌లు ఇచ్చే కంపెనీలకే టెండర్‌లు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలపై ‘మనతెలంగాణ దినపత్రిక’లో 24, అక్టోబర్ 2024న, ఏప్రిల్ 04వ తేదీ 2025 ఈ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ సమయంలో కొన్నిరోజుల పాటు టెండర్‌లు, ఒప్పందాలను, చెల్లింపులను పక్కన బెట్టిన ఈ సంస్థ అధికారులు తదనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఎంఆర్‌ఐ మిషన్‌లు, ఫర్నీచర్ కొనుగోళ్లకు సంబంధించిన టెండర్‌లను అర్హత లేని కంపెనీలకు కట్టబెట్టడంతో పాటు పెద్ద ఎత్తున ఆయా సంస్థలకు చెల్లింపులు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నాసిరకం ఫర్నీచర్ కొనుగోళ్లపై.. ప్రస్తుతం 25 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫర్నీచర్ కొనుగోళ్లకు సంబంధించి టెండర్‌లు దక్కించుకున్న మహారాష్ట్రకు చెందిన ఓ సంస్థ నాసిరకం ఫర్నీచర్‌ను సరఫరా చేయడం ప్ర స్తుతం ఈ అంశం వివాదాస్పదం అయ్యింది. దీంతోపాటు ఈ సంస్థకు ఒకేసారి రూ.15 కోట్ల చెల్లింపుల పై కూడా ప్రభుత్వాని కి ఫిర్యాదు అందినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఎంఆర్‌ఐ (11 మిషన్‌లకు) సంబంధించి టెం డర్‌లలోనూ గోల్‌మాల్ జరిగినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. ప్ర స్తుతం నాలుగేళ్లుగా ఇక్క డ పనిచేస్తున్న ఒక ఈడీ అధికారి టెం డర్‌ల వ్యవహారం నుంచి ప్రతి పనిలోనూ కమీషన్ ఆశిస్తారన్న ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఆయన కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని ఈ అవినీతి బాగోతానికి ఈడీ స్థాయి అధికారి తెరతీసినట్టుగా సమాచారం. మొత్తం 11 ఎంఆర్‌ఐ మిషన్‌ల.. మొత్తం 11 ఎంఆర్‌ఐ మిషన్‌లను కొనుగోళ్లు చేయడానికి టిజిఎంఎస్‌ఐడిసి అధికారులు టెండర్‌లను పిలవాల్సి ఉంది. అయితే, కమీషన్‌ల కోసం ఈ టెండర్‌లలో సింగిల్ కంపెనీ మాత్రమే పాల్గొనేలా ఆ కంపెనీకి మాత్రమే ఈ టెండర్‌లు దక్కేలా ఈ సంస్థ అధికారులు చక్రం తిప్పినట్టుగా తెలిసింది. ఈ ఎంఆర్‌ఐ మిషన్‌లలో 3 టెస్లా మోడల్‌కు చెందిన 5 ఎంఆర్‌ఐ మిషన్‌ల కోసం (వాటి ధర ఒక్కో మిషన్ రూ.25 కోట్లు), కాగా, 60 బోర్ మోడల్ ఎంఆర్‌ఐ మిషన్‌లు నాలుగింటి కోసం (రూ.14 కోట్లు, ఒక్కో మిషన్), 70 బోర్ మోడల్ ఎంఆర్‌ఐ మిషన్‌లు రెండింటి కోసం (రూ.ఒక్కో మిషన్ రూ.18 కోట్లు)గా ఉంటుంది. ఇలా, పెద్దమొత్తంలో ఆయా కంపెనీలకు మేలు చేసి కోట్ల రూపాయలను ఈ సంస్థకు చెందిన అధికారులు దండుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రికి పర్నీచర్ కొనుగోళ్లకు.. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రికి పర్నీచర్ కొనుగోళ్ల టెండర్‌లకు సంబంధించి ఈ సంస్థ అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు సెంట్రల్ స్పాన్షర్ స్కీంలకు సంబంధించి 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులపై కన్నేసిన ఈ సంస్థ అధికారులు మార్చి 31వ తేదీతో ఈ నిధులను వినియోగించుకోకపోతే నిధులు రిటర్న్ వెళ్లిపోతాయని ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించి టెండర్‌లు లేకుండానే పాత వారికే ఈ కాంట్రాక్టు కట్టబెట్టడానికి ఫైల్ మూవ్ చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సెంట్రల్ స్పాన్షర్ స్కీంలోనే సుమారుగా రూ.30 కోట్లను కమీషన్‌లు చేతులు మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం. టిజిఎంఎస్‌ఐడిసిలో పనిచేసే ఈడీ స్థాయి అధికారిని అక్కడి నుంచి తప్పించకపోతే కోట్లలో ఈ సంస్థకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలిసింది.

మన తెలంగాణ 7 Feb 2026 7:00 pm

Track day l హైదరాబాద్‌లో RS457 ట్రాక్ డే..

Track day l హైదరాబాద్‌లో RS457 ట్రాక్ డే.. వాహన చోదకుల నైపుణ్యాభివృద్దిని

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:57 pm

ఉరి వేసుకుని ఫిజియోథెరపీ డాక్టర్ ఆత్మహత్య

ఉరి వేసుకుని ఫిజియోథెరపీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.  సాయిబాబా నగర్ లో నివాసముండే బత్తిని అనిత (29) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అనిత మల్లారెడ్డి ఆసుపత్రిలో ఫిజియోథెరఫిస్ట్ గా పని చేస్తుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాంను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 7 Feb 2026 6:52 pm

గవి మఠం బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు..

21 నుంచి 28 వరకు వైభవంగా ఉత్సవాలు విశాలాంధ్ర, ఉరవకొండ: ఉరవకొండ గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యంగా 26వ తేదీన మహా రథోత్సవం, 27వ తేదీన లంక దహనం కార్యక్రమాలు వైభవంగా జరుగనున్నాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […] The post గవి మఠం బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 6:50 pm

భారత్‌తో మ్యాచ్‌: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యుఎస్ఎ

ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యుఎస్ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు ఇండియా-ఎ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌‌లో యుఎస్ఎ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడిలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో పూర్తి ఫామ్‌లో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌ని విజయంతో ఆరంభించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నుంచి వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, బుమ్రా దూరమయ్యారు. బుమ్రా స్థానంలో సిరాజ్‌ని జట్టులోకి తీసుకున్నారు. యుఎస్ఎ 6 బ్యాటర్లు, 2 ఆల్ రౌండర్లు, 3 బౌలర్లతో బరిలోకి దిగుతోంది. తుది జట్లు: భారత్: ఇషాన్ కిషన్(కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. యుఎస్ఎ: ఆండ్రీస్ గౌస్(కీపర్), సాయితేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్

మన తెలంగాణ 7 Feb 2026 6:47 pm

school l గురుకుల పాఠశాల బాలికల ఖాళీ సీట్లకు బ్రోచర్ విడుదల..

school l గురుకుల పాఠశాల బాలికల ఖాళీ సీట్లకు బ్రోచర్ విడుదల.. నందిగామ,

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:37 pm

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 4

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:27 pm

Environment l పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలి

Environment l పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలి మచిలీపట్నం , ఆంధ్రప్రభః

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:27 pm

హస్తం గుర్తుకు ఓటెయ్యండి అందుబాటులో ఉంటా..

మంథని, ఆంధ్రప్రభ : హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అందుబాటులో ఉంటానని కాంగ్రెస్

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:25 pm

అభయమిస్తున్న హస్తానికి ఓటేయండి..

పాల్వంచ, ఆంధ్రప్రభ : అభయమిస్తున్న అసానికి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించండి

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:22 pm

ప్రచారంలో దూసుకుపోతున్న 10వ వార్డు బిజెపి అభ్యర్థి

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ 10వ వార్డు బిజెపి అభ్యర్థి గర్రెపల్లి

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:20 pm

school l వార్షికోత్సవ వేడుకలు

school l వార్షికోత్సవ వేడుకలు ఇప్పుడు గొప్ప స్థానాల్లో ఉన్న వారు ఎందరో

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:19 pm

స్థానికుడిగా నన్ను ఆదరించండి.. మీ అన్నగా సేవ చేస్తా..

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; నేను స్థానికుడిని, నిత్యం 9 వ వార్డ్ ప్రజలకు

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:18 pm

Chandrababu : అమరావతిలో క్వాంటం వాలీ ఒక గేమ్ ఛేంజర్

అమరావతిలో క్వాంటం వాలీ ఒక గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 7 Feb 2026 6:17 pm

మక్తల్ అభివృద్ధికి అండగా నిలవండి..

మక్తల్ అభివృద్ధికి అండగా నిలవండి.. మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ పట్టణ

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:14 pm

అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా..

పాల్వంచ, ఆంధ్రప్రభ ; కోత్తగూడెం కార్పోరేషన్ లో బాగంగా పాల్వంచ ఈరోజు 43వ

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:11 pm

Cheetah |ఎక్కడంటే….

Cheetah | ఎక్కడంటే…. Cheetah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చిరుత

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:07 pm

తీవ్ర విషాదం: సీనియర్ నటడు గుండెపోటుతో కన్నుమూత

ఖాట్మండు: నేపాల్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సునీల్ థాపా (68) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఆయన గుండెపోటుకు గురి కావడంతో వెంటనే ఖాట్మండులోని థాపాతలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఉతయం 7.44 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. నేపాల్‌లోని డాంగ్‌లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లుకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. నేపాలీతో పాటు.. బాలీవుడ్, భోజ్‌పూరితో పాటు మొత్తం పలు భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కీతో పాటు ‘మిరాయ్’ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్‌మీడియాలో సంతాపం తెలియజేశారు.

మన తెలంగాణ 7 Feb 2026 6:03 pm

Telangana : కాంగ్రెస్ లో జగిత్యాల జగడం.. పెద్దాయనపై వేటు తప్పదా?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేటట్లు కనపడుతుంది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 5:59 pm

Seetha Payanam Trailer: Emotional Love Ride

Action King Arjun dons multiple hats as director, producer, and actor in a special role for his upcoming film Seetha Payanam. Produced under his banner Shree Raam Films International, it stars his daughter Aishwarya Arjun and Niranjan in the lead roles. The trailer is out now. Seetha, a young chef, sees her quiet life upended […] The post Seetha Payanam Trailer: Emotional Love Ride appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 5:38 pm

అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 7 Feb 2026 5:31 pm

ప్రచారంలో దూసుకుపోతున్న చందనగిరి శ్రీనివాస్ లావణ్య

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ ; క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 17వార్డు

ప్రభ న్యూస్ 7 Feb 2026 5:26 pm

Minister l సోలార్ విద్యుత్ సిస్టం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

Minister l సోలార్ విద్యుత్ సిస్టం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి పాలుట్ల గిరిజన

ప్రభ న్యూస్ 7 Feb 2026 5:26 pm

ఉజ్వల వికాసం.. గేట్ పరీక్ష

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉజ్వల వికాసానికి, ఉద్యోగ భద్రత.. సమాజ అభ్యున్నతకు తోడ్పాటున అందించే గేట్ పరీక్ష ప్రతి విద్యార్థి గమ్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు అనంతపురం జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. చెన్నారెడ్డి పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పై ఔట్రీచ్ కార్యక్రమం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి బెంగుళూరు సంబంధించి ఆచార్యులు ఆచార్య ఎన్.డి. శివ కుమార్ […] The post ఉజ్వల వికాసం.. గేట్ పరీక్ష appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 5:18 pm

లడ్డూ ప్రసాదంలో కల్లీ జరిగింది చంద్రబాబు హయాంలోనే

తిరుమల లడ్డూ లో కల్తీ జరిిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు

తెలుగు పోస్ట్ 7 Feb 2026 5:18 pm

Bikkanoor |గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట….

Bikkanoor | గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట…. రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి

ప్రభ న్యూస్ 7 Feb 2026 5:17 pm

ఏపీ 10వ తరగతి పరీక్షల్లో తేదీల మార్పు.. తాజా షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్షను ఒక రోజు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఏపీ 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ పరీక్ష 21కి వాయిదాప్రారంభంలో విడుదల చేసిన […] The post ఏపీ 10వ తరగతి పరీక్షల్లో తేదీల మార్పు.. తాజా షెడ్యూల్ ఇదే! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 5:10 pm

కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర : రేవంత్

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బిఆర్ఎస్, బిజెపి ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సిఎం పర్యటించారు. నారాయణపూర్ లో ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, బిఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలను పట్టించుకోలేదని విమర్శించారు. గల్లీలో బిజెపి కార్పొరేటర్ గెలిస్తే.. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి సమస్యలు పరిష్కరిస్తాడా? అని  ఓట్లు కావాల్సి వచ్చాయి కానీ.. సమస్యలు ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని, బిఆర్ఎస్, బిజెపి కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.. ఏనాడైనా మున్సిపాలిటీలను పట్టించుకున్నారా? అని కెటిఆర్ కు ఇన్నాళ్లూ వికారాబాద్, తాండూరు ఎందుకు గుర్తు రాలేదు? అని నిలదీశారు. 2014, 2018 లో సబితా ఇంద్రా రెడ్డికి కాంగ్రెస్ అండగా నిలిచిందని తెలియజేశారు. కాంగ్రెస్ బీఫామ్ పై గెల్చి సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లిందని రేవంత్ అన్నారు. రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమని రతనాల సీమ చేస్తా అని మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను రాకుండా కెసిఆర్ అడ్డుకున్నా మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి వికారాబాద్ కు గోదావరి జలాలను తీసుకురాలేదని, 300 టిఎంసిల గోదావరి జలాలు ఇస్తే 30 లక్షల ఎకరాలు పండేవని, కెసిఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో రూ. వేలకోట్లు దోచుకున్నారని, లక్ష్మీదేవి పల్లి దగ్గర రిజర్వాయర్ కడతానని భూసేకరణ చేయలేదని, గోదావరి జలాల ముసుగులో రూ. వేల కోట్లు కొల్లగొట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 7 Feb 2026 5:07 pm

ఆదరించి మరో అవకాశం ఇవ్వండి మరింత అభివృద్ధి చేస్తా

మక్తల్ , ఆంధ్రప్రభ ; మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు అభివృద్ధి కోసం

ప్రభ న్యూస్ 7 Feb 2026 5:06 pm

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

ఏపీ రాజధాని అమరావతి.. ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి పునాదిరాయి పడింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి, దేశానికి […] The post అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 5:05 pm

TG |పశువులు అమ్ముకున్నాము ఇందిరమ్మ బిల్లు రాకపాయే

TG | పశువులు అమ్ముకున్నాము ఇందిరమ్మ బిల్లు రాకపాయే ఇందిరమ్మ L 3

ప్రభ న్యూస్ 7 Feb 2026 5:02 pm

19వ వార్డు దోర్నాల ప్రచార జోరు…

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి ; జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19వ

ప్రభ న్యూస్ 7 Feb 2026 5:01 pm

ఇంటింటి ప్రచారంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపాలిటీ లోని 11వ వార్డు లో

ప్రభ న్యూస్ 7 Feb 2026 4:56 pm

ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. స్కాట్‌లాండ్ టార్గెట్ ఎంతంటే..

కోల్‌కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ టాస్ గెలిచి విండీస్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఓపెనర్లు తొలి వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కెప్టెన్, కీపర్ హోప్‌ ఔట్ అయ్యాడు. ఈ దశలో హెట్మైర్ జట్టుకు అండగా నిలిచాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 64 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఒక వెస్టిండీస్ బ్యాటింగ్‌లో కింగ్ 35, రూతర్‌ఫర్డ్ 26, పొవెల్ 24 పరుగులు చేశారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరులు చేసింది. స్కాట్‌లాండ్ బౌలింగ్‌లో కూర్రీ 2, షరీఫ్, డేవిడ్‌సన్, లీస్క్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 7 Feb 2026 4:56 pm

Nallabelly |పెద్ద మనసుతో విద్యార్థులకు క్రీడా దుస్తుల దానం..

Nallabelly | పెద్ద మనసుతో విద్యార్థులకు క్రీడా దుస్తుల దానం.. రంగాపురం ప్రభుత్వ

ప్రభ న్యూస్ 7 Feb 2026 4:55 pm

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం..కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన ఆరోపణలు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటనకు సంబంధించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను నేరుగా టార్గెట్ చేస్తూ, చీణణదీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) రిపోర్ట్ ఆధారంగా తీవ్ర ఆరోపణలు చేశారు.లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని స్పష్టం చేసిన ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు అవినీతి, టెండర్ మినహాయింపులు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని మండిపడ్డారు.లడ్డూ వంటి పవిత్ర ప్రసాదం విషయంలో వైసీపీ […] The post తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం..కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన ఆరోపణలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 4:52 pm

Chandrababu Naidu’s Delhi Visit Signals Key Turn in Laddu Controversy

Major political developments linked to Andhra Pradesh are now unfolding in Delhi, with the Tirumala laddu controversy turning into a high-stakes political flashpoint. Coalition leaders have stepped up their attacks on the YSR Congress Party, while former chief minister Y. S. Jagan Mohan Reddy has announced plans to approach the Supreme Court, giving the issue […] The post Chandrababu Naidu’s Delhi Visit Signals Key Turn in Laddu Controversy appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 4:50 pm

రీల్స్ మోజులో తల్లి పిచ్చి పని.. సజ్జనార్ సీరియస్

సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయాక.. చాలా మంది దానికి అడిక్ట్ అవుతున్నారు. తమకు ఫాలోవర్లు, రీచ్ పెరగడం కోసం పిచ్చి పనులు చేసేవారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం తమ ప్రాణాలనే రిస్క్‌లో పెట్టేవాళ్లు లేకపోలేదు. అయితే రీల్స్ మోజులో పడి ఓ తల్లి చేసిన పనికి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ తల్లి బావి అంచుపై నిలుచొని ఇద్దరు పిల్లల్ని చేతులతో పట్టుకొని.. చాలా ప్రమాదకరంగా రీల్ చేసింది. ఇది సజ్జనార్ కంట పడింది. దీంతో ఆయన ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేసిన సజ్జనార్ ‘‘ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట! కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి’’ అని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 7 Feb 2026 4:47 pm

ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై ప్రావీణ్యం సాధించాలి : పల్లె కిషోర్

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై ప్రావీణ్యం సాధించాలి అని శ్రీ బాలాజీ విద్యాసంస్థల అధినేత పల్లె కిషోర్ పేర్కొన్నారు.అనంతపురంలోని పీవీకేకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, కార్పొరేట్ రెడినెస్ ట్రైనింగ్ సెల్ మరియు ఏపీఎస్సీడీసీ సహకారంతో విద్యార్థులకు ఆటోక్యాడ్ , స్టాడ్ ప్రో సాఫ్ట్‌వేర్‌లపై వారం రోజుల సాంకేతిక శిక్షణా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు.ఈ శిక్షణకు ప్రసన్న కుమార్ రిసోర్స్ పర్సన్‌గా , భవనాల […] The post ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై ప్రావీణ్యం సాధించాలి : పల్లె కిషోర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 4:39 pm

సే నో టు డ్రగ్స్ –ఎస్ టు లైఫ్ ర్యాలీని ప్రారంభించిన వీసీ, ఎస్పీ

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ సహకారంతో “సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్ అనే నినాదంతో 3 కిలోమీటర్ల రన్ ను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్,అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జెండా ఊపి 3కే రన్ ను ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులలో డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాల పై అవగాహన కొరకు […] The post సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్ ర్యాలీని ప్రారంభించిన వీసీ, ఎస్పీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 4:32 pm

41వ డివిజన్‌లో ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం…

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : 41వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వప్న

ప్రభ న్యూస్ 7 Feb 2026 4:27 pm