SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
...

సూర్యాపేట మైనింగ్ వేలంలో అక్రమాలు

మన తెలంగాణ/హైదరాబాద్: సూర్యాపేట జి ల్లాలోని మైనింగ్ బ్లాక్‌ల ఈ -వేలంలో భారీ అక్రమాలు జరిగాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ ఆరోపించారు. ఈ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి, వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ సోమవారం కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గనుల శాఖ విడుద ల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చేపట్టిన ఈ-వేలం ప్రక్రియలో విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు, పారదర్శకత లోపాలు ఉన్నట్లు తెలిపా రు. పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్‌పూర్ మైనింగ్ బ్లాక్‌లలో సుమారు 1,100 ఎకరాల రిజర్వ్‌డ్ ఫారెస్ట్ భూమి ఉన్నప్పటికీ, టెండర్ పత్రాల్లో చట్టబద్ధంగా అవసరమైన కీలక వివరాలు పొందుపరచలేదని ఆ రోపించారు. ముఖ్యంగా మినరల్ బ్లాక్‌ల ఖచ్చితమైన అక్షాంశ-రేఖాంశ కోఆర్డినేట్లు, అటవీ కంపార్ట్‌మెంట్ వివరాలు, డిజిపిఎస్ సర్వే ధృవీకరణ, వివరణాత్మక సర్వే మ్యాపులు,యుటిఎం జియో కోఆర్డినేట్లు, మినరల్ ఆక్షన్ రూల్స్, 2015, మై న్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957 ప్రకారం అవసరమైన సమగ్ర జియోలాజికల్ నివేదికలు వెల్లడించలేదని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి లోపాలు వే లం ప్రక్రియ చట్టబద్ధతను, పారదర్శకతను తీ వ్రంగా దెబ్బతీస్తాయని విమర్శించారు. టెండర్ నోటీసు జారీకి ముందే మినరల్ బ్లాక్‌లను ఖచ్చితంగా గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించడం త ప్పనిసరి అయినప్పటికీ,ఈ నిబంధనలు పాటించలేదని అన్నారు. న్యాయపరమైన విచారణలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం,చట్టపరమైన, పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. సైదుల్నామా బ్లాక్‌కు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, సుల్తాన్‌పూర్ బ్లాక్‌కు ఎన్‌సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలను ప్రిఫర్డ్ బిడ్డర్లుగా ప్రకటించారని, ఈ సంస్థలు రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అలాగే, మైన్స్ అండ్ జియోలజీ శాఖ లీగల్ ఆఫీసర్ ఈ బ్లాక్‌ల సమాచారాన్ని గోప్యంగా పేర్కొంటూ ఫిర్యాదుదారునికి ఇవ్వడానికి నిరాకరించడం పారదర్శకతపై అనుమానాలు పెంచుతోందని అన్నారు. అటవీ శాఖ నుండి తప్పనిసరిగా పొందవలసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఒసి) లేకుండానే వేలం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయని, రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మైనింగ్ జరగడం పర్యావరణానికి ముప్పు కలిగించడమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలని, నోటిఫికేషన్ కింద చేపట్టిన టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని, స్వతంత్ర, పారదర్శక విచారణను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని, అవసరమైన శాస్త్రీయ సర్వేలు, జియోలాజికల్ డేటా వెల్లడి, అటవీ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధంగా కొత్త టెండర్ జారీ చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కెటిఆర్ కోరారు. ఈ లేఖ ప్రతులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపారు.

మన తెలంగాణ 3 Mar 2026 5:00 am

మోడీ ఫోన్ దౌత్యం

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో వరుస దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం నాడు బహ్రెయిన్ రాజు, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ లకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు దేశాలపై జరిగిన దాడులను ఖండించారు. క్లిష్ట పరిస్థితులలో భారతదేశం ఆ దేశాల ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. బహ్రెన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ , ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్ లతో ప్రధాని టెలిఫోన్ లో సంభాషించారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత్వ త్వరలో పునరుద్ధరించబడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. క్లిష్ట పరిస్థితులలో కూడా భారతీయుల క్షేమం పట్ల శ్రద్ధవహించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు తలపడింది. ముఖ్యంగా పశ్చిమాసియాలలో పలు దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు జరిపింది. ముఖ్యంగా దుబాయ్, దోహాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఈ టెలిఫోన్ సంభాషణలు చోటు చేసుకున్నాయి.ప్రధాని అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యుఏఇ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో మాట్లాడారు. గల్ఫ్, పశ్చిమాసియాలో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్ లో దాదాపు 10 వేల మంది భారతీయులు ఉన్నారు వారిలో విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ లో 40 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు అన్నిదేశాల నుంచి విమాన సర్వీసులు నిలిచి పోయాయి. 

మన తెలంగాణ 3 Mar 2026 4:30 am

అధికారం ఉందని అహంకారం వద్దు

మన తెలంగాణ/హైదరాబాద్/వికారాబాద్: “అహంకారాన్ని పక్కన పెట్టండి&ఏమీ ఆశించకుండా పార్టీ కోసం కష్టపడి పని చేయండి..పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి” అని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులకు హిత వు చెప్పారు. వికారాబాద్, అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో గత తొమ్మిది రోజులుగా శిక్షణా తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పదవ రోజు (సోమవారం) శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాం ధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రా హుల్ గాంధీ మార్షల్ ఆర్ట్ ద్వారా పాఠాలు చెబుతూ డిసిసి అధ్యక్షులను ఉర్రూతలూగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టి.పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేష్‌కుమార్ గౌడ్, ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితర అతిథులను ఆకర్షించారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో డిసిసి అధ్యక్షులకు ది శా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చెయాలని, ప్రతి ఒక్కరూ మరో పది మంది నాయకులను తయారు చేయాలని, ఆ పది మంది పది మందిని తయారు చేయాలని, ఇలా నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉండాలని ఆయన సూచించారు. మార్షల్ ఆర్ట్ ద్వారా పలు మెళుకవలు చూపిస్తూ, ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం అ మలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యత మీదేనని ఆయన డిసిసి అధ్యక్షులనుద్ధేశించి అన్నారు. నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు ప్రజలతో అనుసంధానం పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్రంగా చ ర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డిసిసి అధ్యక్షులు త మ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మా ణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను విశ్లేషిస్తూ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంలో సిద్దిపేట డిసిసి ఆంక్షా రెడ్డి మాట్లాడుతూ తాము కెసిఆర్‌పై పోరాటం చేస్తున్నామని చెప్పడంతో, రాహుల్ గాంధీ కల్పించుకుని మంచిదే పోరాటం చెయ్యండి.. హార్డ్ వర్క్ చేయండి అని సూచించారు. మహాత్ముని ఒంటిపై& జాతిపిత మహాత్మా గాంధీ ఒంటిపై ఒక బట్ట తప్ప ఏమీ ఉండేది కాదని, అది మహాత్ముని సాధారణ, నిరాండంబర జీవితానికి నిదర్శనమని ఆయన వివరించారు. బ్రిటిష్ వాళ్ళు గాంధీని ఏమీ చేయలేక దిగివచ్చారని ఆయన ఉదహరించారు. మీరూ అదే విధంగా అహం పక్కన పెట్టి సాధారణ, నిరాండంబరంగా ఉంటూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే అధికారం మీ చెంతకు వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలతో మమేకం కావాలని ఆయన సూచించారు. మంచి రోజులు రానున్నాయి జిల్లాలకు డిసిసి అధ్యక్షులే పవర్‌ఫుల్ అని, సుప్రీం అని ఆయన అన్నారు. “మీరంతా నా టీం&మంచి రోజులు రానున్నాయి..” అని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కి చైనా మద్దతునిస్తున్నదని, ఇరాన్ వెనక చైనా, రష్యా ఉందని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీపై నిప్పులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా సరెండర్ అయ్యారని, ట్రంప్ కి వ్యతిరేకంగా మోదీ పని చేయలేరని ఆయన విమర్శించారు. హింస ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బిజెపి లక్షమైతే, అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ పరమావధి అని రాహుల్ అనగానే కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ముగిసిన శిక్షణా శిబిరం వికారాబాద్ హరిత రిసార్ట్‌లో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం భాగంగా నిర్వహించిన డిసిసి అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం అనంతగిరిలో ఏర్పాటైన శిక్షణ శిబిరానికి విచ్చేసిన కాం గ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీకి ఎస్‌ఎపి కాలేజిలోని హెలిప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం ఫలికారు. రాహుల్ గాంధీ వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. వారికి వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మె ల్యే, అసెంబభ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టి.పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏఐసిసి సెక్రటరీ సచిన్‌సావంత్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఏయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి శం షాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు హెలికాప్టర్‌లో వికారాబాద్‌లో జరుగుతున్న శిక్షణా శిబిరానికి చేరుకున్నారు. శిబిరం ముగిసిన అనంతరం రాహులు గాంధీ హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడి నుంచి ఆయన ఏయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ‘సంఘటన సృజన్’ ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్‌రావ్ ‘సంఘటన సృజన్ ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్‌రావ్ ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంశీ చందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పరిగి రాంమోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిబిరం జరిగింది. వివిధ రంగాల నిపుణులు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, సోషల్ మీడియా, మీడియా నిర్వహణ, ఎన్నికల వ్యూహరచన, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై శిక్షణనిచ్చారు. మీడియాకు అనుమతి లేదు సాధారణంగా ఏ పార్టీ అయినా తమ కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని భావిస్తాయి. కానీ కాంగ్రెస్ శిక్షణా శిబిరానికి మీడియాను దూరం పెట్టడం విశేషం. పది రోజుల పాటు శిక్షణా శిబిరం గోప్యంగా ఉంచారు.

మన తెలంగాణ 3 Mar 2026 4:00 am

3 జిల్లాలకు వడగాల్పుల ముప్పు

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్రత ఉండనుందని, పగలు, రాత్రి వేళల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని శనివారం విడుదల చేసిన వెదర్ ఔట్‌లుక్‌లో తెలిపింది. తెలంగాణలో మార్చి-మే నెలల మధ్య ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీ చే రోజుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే మా ర్చి నెలలో అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా వర్షపా తం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దీని వ ల్ల వేడిగాలులు సాధారణ స్థితిలోనే నమోదవుతా యి. ఏప్రిల్ నుంచి మే నెల వరకు పగలు, రాత్రి వేళలో ఎక్కువ వేడి పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ మేరకు హై దరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు తా గునీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా, ప్రభు త్వం అన్ని విధాలుగా ఆరోగ్యపరమైన నిఘా ఏ ర్పాటు చేయాలని ఐఎండీ సూచించింది.అదే దేశవ్యాప్తంగా చూస్తే పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణా, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖం డ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర కర్ణాటక, ఉత్తర తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎం డీ తెలిపింది.ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 25 డిగ్రీల వద్దే నడుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మన తెలంగాణ 3 Mar 2026 3:30 am

కలెక్టర్లతో నేడు సిఎం సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్: నేడు సిఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలుపై సచివాలయం వేదికగా కలెక్టర్లకు సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ఈ నెల 06వ తేదీ నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుంది. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు. 99 రోజుల కాలంలో జిల్లాల వారీగా యంత్రాంగం ఎలా పనిచేయాలన్న విషయాల గురించి సిఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎలా పరిష్కరించాలన్న అంశాల గురించి సిఎం రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం, స్థానిక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంపై చర్చించనున్నారు. 

మన తెలంగాణ 3 Mar 2026 3:00 am

తగ్గని ఇరాన్

. క్షిపణులు, డ్రోన్లతో విధ్వంసం. హెచ్చరికలు బేఖాతరు. ప్రతీకారంతో ముందుకు…. అమెరికాతో చర్చకు ససేమిరా. గల్ఫ్ బాంబుల మోత తెహ్రాన్: ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ సైనిక, చమురు స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అధినేత ఖామేనీనికోల్పోయినప్పటికీ వెన్నుచూపని యోధుడివలే యుద్ధంలో ముందుకెళుతోంది. అమెరికా-ఇజ్రాయిల్ ఏకపక్షంగా విరుచుకుపడుతున్నా, గల్ఫ్దేశాలు ఏకాకిని చేసినా తనదైన పంథాలో దూసుకుపోతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగిస్తోంది. చమురు రవాణా నౌకలను ధ్వంసం […] The post తగ్గని ఇరాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 11:50 pm

ఇరాన్‌లో 555 మంది పౌరులు బలి

దుబాయ్ ః ఇరాన్‌లోని పలు నగరాలు, ప్రత్యేకించి రాజధాని టెహరాన్‌ను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా సేనలు నిర్విరామంగా దాడులకు దిగుతున్నాయి. టెహరాన్ ఆకాశం ఎప్పుడూ నిప్పులు కక్కే రీతిలో మారుతోంది. క్షిపణులు, యుద్ధ విమానాలను ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు దేశాల దాడులతో ఇరాన్‌లో 555 మంది వరకూ పౌరులు మృతి చెందినట్లు, ఇది తమకు అదికారికంగా అంటే నిర్థారణ అయిన సమాచారం అని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సోమవారం తెలిపింది. క్రమేపీ టెహరాన్ కూడా గాజాలో మాదిరిగా అనుక్షణ దాడుల , ఆర్తనాదాల ప్రతీక అవుతుందనే భయాలు ఉన్నాయని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పుడు రెడ్‌క్రాస్ సొసైటి వెలువరించిన నివేదికతో ఇరాన్‌లోని 131 వరకూ నగరాలు, పట్టణాలపై దాడులు సాగుతున్నాయి. ఇరాన్ నటాంజ్ అణుకేంద్రం ధ్వంసం? ఇరాన్‌లోని అతి పెద్ద నటాంజ్ అణు కేంద్రం సోమవారం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో దెబ్బతిందని, దీనితో బారీ స్థాయిలో అణుధార్మికత వెలువడుతోందని వార్తలు వెలువడ్డాయి. అంతర్జాతీయంగా ఈ అంశం కలవరం కల్గించింది. అయితే ఇటువంటి దాడి ఏమి జరగలేదని ఆ తరువాత అణు సంస్థ వివరణ ఇచ్చింది. ఐఎఇఎ అధినేత నుంచి ప్రకటన వెలువడింది. ఇందులో వైమానిక దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలకు ముప్పు వాటిల్లిందనే అంశం నిర్థారణ కాలేదని తెలిపింది. కానీ తమ అణు కేంద్రం దెబ్బతిందని ఈ సంస్థ పరిధిలో ఉండే ఇరాన్ రాయబారి రెజా నజాఫీ వాదించారు. లెబనాన్‌లో హెజ్బుల్లా నేత ఖాసీం హతం ఇరాన్‌తో ఇజ్రాయెల్ అమెరికా పోరు మరింతగా విస్తరించింది. హెజ్బుల్లా అధినేత నయీమ్ ఖాస్సీంను లెబనాన్‌లోని బీరూట్ ప్రాంతంలో తమ దాడుల్లో మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ సోమవారం ప్రకటించింది. ఈ పరిణామ అత్యంత కీలక మలుపులకు దారితీసింది. తమకు నిమిత్తం లేకుండానే హెజ్బుల్లా శక్తులు లెబనాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని లెబనాన్ ప్రభుత్వం చెపుతోంది. అమెరికా మిత్రపక్షంగా ప్రకటించుకుంది. అయితే తమకు హెజ్బుల్లా అధినేత ఖాస్సీం అత్యంత కీలకమైన శత్రువు అని, ఖమేనీ తరువాత అంతటి తీవ్ర స్థాయి ప్రత్యర్థిని ఇప్పుడు మట్టుపెట్టామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్టూ అధికారికంగా ప్రకటించారు. బీరూట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ముందుగా అక్కడి పౌరులకు ముందస్తు జాగ్రత్తలు వెలువరించారు. తరువాత వైమానిక దాడులు జరిగాయి. ఈ క్రమంలో 31 మంది వరకూ హెజ్బుల్లా మిలిటెంట్లు మృతి చెందారు. వీరిలో తాము నయీమ్‌ను గుర్తించినట్లు రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి దాడుల క్రమంలో బీరూట్ తల్లడిల్లింది. దాదాపుగా 150 మంది వరకూ పౌరులు గాయపడ్డారు. కాగా తమ ప్రాంతంలో హెజ్బుల్లా కార్యకలాపాలు చెల్లనేరవని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ బృందం వెంటనే తమకు ఆయుధాలతో లొంగిపోవాలని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ టీవీ సందేశంలో తెలిపారు. యుద్ధంలో పాల్గొనాలా ? శాంతికి దిగాలా? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇటువంటి అజ్ఞాత గ్యాంగ్‌లు కాదని ప్రధాని స్పష్టం చేశారు. హిజ్బుల్లా కార్యకలాపాలను నిషేధిస్తున్నామని, వీలైతే వారు రాజకీయాల్లోకి దిగవచ్చునని హితవు పలికారు. ఈ సంస్థ షియా ముస్లిం రాజకీయ సంస్థగా వెలిసింది.

మన తెలంగాణ 2 Mar 2026 11:36 pm

అమెరికా ఎఫ్ 15 ఫైటర్లను కూల్చేసిన కువైట్

 పోరులో పొరపాటు..మిత్రదేశం కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ దాడులలో అమెరికా ఎఫ్ 15 ఇ యుద్ధ విమానాలు మూడు కుప్పలుగా లాయి. పలు దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతూ , ప్రతీకారం తీర్చుకుంటున్న దశలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కువైట్ సేనలు అనుకోకుండా తమ ఎఫ్ ఫైటర్ విమానాలను కూల్చివేశాయనే విషయాన్ని అమెరికా సైనిక విభాగం కూడా ధృవీకరించింది. అయితే ఈ మూడు ఫైటర్స్ పతనం దశలో మొత్తం ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. ఇతరత్రా నష్టం వివరాలు ఇప్పటి ఘర్షణల తీవ్రత నడుమ వెలుగులోకి రాలేదు. అయితే అమెరికా సేనలకు చివరికి మిత్రపక్షంతోనే భారీ నష్టం వాటిల్లినట్లు వెల్లడైంది. ఇరాన్ తమ దాడుల్లో భాగంగా కువైట్‌పై కూడా విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఎఫ్ 15 ఇ ఈగల్స్‌ను కువైట్ సేనలు ఇరాన్ ప్రయోగించివవి అనుకుని కూల్చేశాయి. సిబ్బంది క్షేమంగా ఉన్నారని, పోరుకు రెడీ అయ్యారని కువైట్ తెలిపింది. కువైట్ అధికారులు కూడా ఇప్పటి ఘటనను నిర్థారించారు. ఇప్పటి ఆపరేషన్‌లో ఎప్పటికప్పుడు తమ సైనిక బలగాలు స్పందిస్తున్న తీరును కొనియాడారు.

మన తెలంగాణ 2 Mar 2026 11:19 pm

కేరళ సిఎం విజయన్ కు మంత్రి పొంగులేటి కౌంటర్

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల్లో వెలిసిన ఇళ్ల కూల్చివేత ఘటనను ‘బుల్డోజర్ రాజ్’గా అభివర్ణిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అసత్య ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూములను భూ మాఫియా నకిలీ పత్రాలతో అమాయక పేదలకు విక్రయించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు లోబడే పనిచేస్తోందని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం భవిష్యత్తు తరాల కోసం అవసరమని పేర్కొన్నారు. దీనిని ‘బుల్డోజర్ రాజ్’ అని పిలవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం ద్వారా పక్కా గృహాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారు పేదల నుండి వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం కేరళ కాంగ్రెస్‌ను ఈ వివాదంలోకి లాగడం సరికాదు అని హితవు పలికారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందని మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఉద్ఘాటించారు.

మన తెలంగాణ 2 Mar 2026 11:15 pm

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన రేణు దేశాయ్

తనపై సోషల్ మీడియాలో చేస్తోన్న అసభ్యకర కామెంట్స్‌పై నటి రేణు దేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర యిం చారు. ఈ మేరకు సోమవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొందరు తన పోస్టులకు అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరా రు. కాగా, వీధి కుక్కల అంశంపై మాట్లాడిన నాటి నుంచి సోషల్ మీడియాలో కొందరు రేణు దేశాయ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆమె పోస్టులకు రాయలేని బాషలో కామెంట్స్ పెట్టడంతో పాటు అసభ్యకరమైన మీమ్స్ క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నారు. దీనిపై తాజాగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై అసభ్య కామెంట్స్ చేస్తున్నారని వాపోయారు. తన వ్యక్తిగత జీవితం, పిల్లలు గురించి కూడా నీచంగా మాట్లాడుతున్నారని బాధపడ్డారు. ఇన్నాళ్లు ఏమన్నా ఓపికా పట్టాను, ఇక భరించడం తన వల్ల కాదన్నారు. ఇకపై సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్లు చేసే వాళ్ల ఇంటికి వచ్చి సంగతి తేలుస్తానని హెచ్చరించారు.

మన తెలంగాణ 2 Mar 2026 11:11 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ରମଜାନ ଅବସରରେ ବିବାହକୁ ନେଇ ଜାମିଆ ମିଲିଆ ଇସଲାମିଆ ଅନୁଷ୍ଠାନ ପକ୍ଷରୁ ଜାରି ହୋଇଥିବା ନୋଟିସରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା

ଇସଲାମ୍‌ ଧର୍ମାବଲମ୍ବୀଙ୍କ ପବିତ୍ର ମାସ ରମଜାନ୍‌। ମୁସଲିମ୍‌ ସମ୍ପ୍ରଦାୟ ପାଇଁ ଅନ୍ୟତମ ପବିତ୍ର ମାସ ଭାବେ ବିବେଚିତ ହେଉଥିବା ଏହି ମାସ ସାରା ଶ୍ରଦ୍ଧାଳୁମାନେ ଉପବାସ ବ୍ରତ(ରୋଜା) ପାଳନ କରନ୍ତି। ସକାଳୁ ସନ୍ଧ୍ୟା ପର୍ଯ୍ୟନ୍ତ ଶ୍ରଦ୍ଧାଳୁମାନେ ପୂରା ଉପାସେ ରହନ୍ତି ଏବଂ ରାତି‌ରେ ଥରକ ପାଇଁ କିଛି ଖାଦ୍ୟ ଗ୍ରହଣ କରନ୍ତି। ରୋଜା ପାଳନ ଅବସରରେ ଉପବାସ ରହିବା ଛଡ଼ା ବହୁ ମୁସଲମାନ ଶ୍ରଦ୍ଧାଳୁ ବିଭିନ୍ନ ଖରାପ ଅଭ୍ୟାସ ବି ପରିତ୍ୟାଗ କରିବା ପ୍ରଥା ରହିଛି। ବଡ଼କଥା ହେଉଛି ଏହି ମାସ ସାରା ବହୁ ଶ୍ରଦ୍ଧାଳୁ ନମାଜ ପଢ଼ିବାରେ ଅଧିକ ସମୟ ବିତାଇବା ଦେଖାଯାଏ। ମନରେ ପବିତ୍ରତା ବୃଦ୍ଧି କରିବାକୁ ଏହି ବ୍ରତ ପାଳନ କରାଯାଏ ବୋଲି ବିଶ୍ବାସ ରହିଛି। ତେଣୁ ମସଜିଦ୍‌ଗୁଡ଼ିକ ଚଳଚଞ୍ଚଳ ହୋଇଉଠିଛି । ଇତିମଧ୍ୟରେ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏକ ନୋଟିସ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ନୋଟିସଟି ଜାମିଆ ମିଲିଆ ଇସଲାମିଆ ପକ୍ଷରୁ ଜାରି କରାଯାଇଥିବାର ଦର୍ଶାଯାଇଛି । ଉକ୍ତ ନୋଟିସରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ରମଜାନ ଅବସରରେ ଯଦି ପୁଅ ଏବଂ ଝିଅକୁ ଏକାଠି ଠିଆ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳେ ତେବେ ତୁରନ୍ତ ତାଙ୍କର ବିବାହ କରିଦିଆଯିବ । ଉକ୍ତ ନୋଟିସକୁ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଏହା ଏକ ବିଶ୍ୱ ବିଦ୍ୟାଳୟ ନା ବିବାହ ଏଜେନ୍ସି । ଉକ୍ତ କ୍ୟାପସନରେ ୟୁଜର୍ସ ଜଣଙ୍କ କେନ୍ଦ୍ର ଶିକ୍ଷାମନ୍ତ୍ରୀ ଧର୍ମେନ୍ଦ୍ର ପ୍ରଧାନ ଏବଂ କେନ୍ଦ୍ର ଶିକ୍ଷା ବିଭାଗକୁ ମଧ୍ୟ ଟ୍ୟାଗ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି ।  Is it a university or a marriage agency? Who gave them the right to do moral policing? @dpradhanbjp @EduMinOfIndia pic.twitter.com/EF1dYlsqOv — rudranjaneya (@hanuman_rudra) February 24, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ନୋଟିସଟି ଫେକ୍ ଅଟେ । ରମଜାନ ଅବସରରେ ଯଦି ପୁଅ ଏବଂ ଝିଅକୁ ଏକାଠି ଠିଆ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳେ ତେବେ ତୁରନ୍ତ ତାଙ୍କର ବିବାହ କରିଦିଆଯିବ ବୋଲି କୌଣସି ନୋଟିସ ଜାରି କରି ନାହାଁନ୍ତି ଜାମିଆ ମିଲିଆ ଇସଲାମିଆ କର୍ତ୍ତୃପକ୍ଷ । ଦାବି ନେଇ ତଦନ୍ତ କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏଭଳି ଘଟଣା ନେଇ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ନୋଟିସ ଏତେ ବଡ଼ ପ୍ରମୁଖ ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟ ଦ୍ୱାରା ଜାରି ହୋଇଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମ ସଂସ୍ଥା ଏନେଇ ନିଶ୍ଚିତ ଖବର ପ୍ରସାରିତ କରିଥାନ୍ତେ । ତେବେ ଉକ୍ତ ନୋଟିସ ନେଇ ପ୍ରଣବ କୁମାର ନାମକ ଜଣେ ପୁରାତନ ଛାତ୍ରଙ୍କ ସହ ଯୋଗାଯୋଗ କରିଥିଲୁ । ପ୍ରଣବ ଏନେଇ ପୂର୍ବତନ ଛାତ୍ର ସଂସଦ ସହ ଯୋଗାଯୋଗ କରି ଆମକୁ ସୂଚନା ଦେଇ କହିଛନ୍ତି, ଏଭଳି କୌଣସି ନୋଟିସ ପକ୍ଷରୁ ଜାରି କରାଯାଇ ନାହିଁ । ଏନେଇ ଜାମିଆ ୱେବସାଇଡ ଏବଂ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳି ନୋଟିସ ନେଇ କୌଣସି ସ୍ଥାନରେ କୌଣସି ସୂଚନା ମିଳିପାରି ନାହିଁ । ସେହିପରି ଉକ୍ତ ନୋଟିସକୁ ଯଦି ଆପଣ ତର୍ଜମା କରି ଦେଖିବେ, ନୋଟିସର ହେଡର ଏବଂ ଲେଖା (ଫଣ୍ଟ) ରେ ବହୁ ପାର୍ଥକ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି । ମୁଖ୍ୟ ମେସେଜର ଫଣ୍ଟ ଉପର ଲେଖା ତୁଳନାରେ ଭିନ୍ନ ଏବଂ ଅସ୍ପଷ୍ଟ ରହିଛି ଯାହାକି ଏହା ଏଡିଟ ହୋଇଥିବାର ଅନୁମାନ କରାଯାଉଛି । ଅନ୍ୟପଟେ ବିବାହ ବ୍ୟବସ୍ଥା କରିବା' କିମ୍ବା 'ୱାଲିମାର ଖର୍ଚ୍ଚ ବହନ କରିବା' ଭଳି ଭାଷା କୌଣସି ପ୍ରତିଷ୍ଠିତ ବ୍ୟକ୍ତିର ସରକାରୀ ବିଜ୍ଞପ୍ତିରେ ବ୍ୟବହାର କରାଯିବା ଗ୍ରହଣୀୟ ହେଉନାହିଁ ତେଣୁ ପ୍ରାୟତଃ ଉକ୍ତ ନୋଟିସଟି ଫେକ୍ ହୋଇଥାଇ ପାରେ । ଅନ୍ୟପଟେ ଉକ୍ତ ଭାଇରାଲ ନୋଟିସ ନେଇ ଆଉ ଏକ ନୋଟିସ  ଜାରି  କରିଛନ୍ତି  ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟ କର୍ତ୍ତୃପକ୍ଷ । ନୋଟିଫିକେସନ ନମ୍ବର ସି୮୪୦ - ୯(୨) ଆର ଓ/ ୨୦୨୬ ସହ ୨୦.୨ ୨୦୨୬ରେ ଏକ ନୋଟିସ ଜାରି କରି କର୍ତ୍ତୃପକ୍ଷ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଏହାଦ୍ୱାରା ସମସ୍ତ ସମ୍ପୃକ୍ତଙ୍କୁ ସୂଚିତ କରାଯାଉଛି ଯେ, ପବିତ୍ର ରମଜାନ ମାସରେ କୌଣସି ପୁଅ ଏବଂ ଝିଅଙ୍କୁ ଏକାଠି ଠିଆ ହୋଇଥିବାର ଦେଖାଗଲେ ନିକାହ ଆୟୋଜନ କରିବା ସମ୍ପର୍କରେ ୨୦.୦୨.୨୦୨୬ ତାରିଖର ଏକ ବିଜ୍ଞପ୍ତି ସଂଖ୍ୟା C&0-9(2)/RO/2026 ସୋସିଆଲ ମିଡିଆରେ ପ୍ରସାରିତ ହେଉଛି । ଯାହା ସମ୍ପୂର୍ଣ୍ଣ ନକଲି ଏବଂ ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟ କର୍ତ୍ତୃପକ୍ଷଙ୍କ ଦ୍ୱାରା ଏପରି କୌଣସି ବିଜ୍ଞପ୍ତି ଜାରି କରାଯାଇ ନାହିଁ। ସମସ୍ତଙ୍କୁ ଏହାକୁ ଗମ୍ଭୀରତାର ସହ ନ ନେବାକୁ ଅନୁରୋଧ କରାଯାଉଛି କାରଣ ଏହା ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟର ଛବିକୁ ଖରାପ କରିବା ପାଇଁ ପ୍ରସାରିତ ହୋଇଛି । ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟ ପ୍ରଶାସନ ଏପରି ବିଜ୍ଞପ୍ତିକୁ ନିନ୍ଦା କରିବା ସହ ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟ ଦିଲ୍ଲୀ ପୋଲିସର ସାଇବର ସେଲ୍ ନିକଟରେ ଅଭିଯୋଗ କରିଛି ।   ଉକ୍ତ ଘଟଣାକୁ ନେଇ ଏନଡିଟିଭି ଖବର ପ୍ରସାରଣ କରି ଉଲ୍ଲେଖ କରିଛି,  ଜାମିଆ ମିଲିଆ ଇସଲାମିଆ 'ରମଜାନ ନିକାହ' ନୋଟିସକୁ ନକଲି ବୋଲି କହିଛି ଇ  ଉକ୍ତ ଘଟଣା ନେଇ ସାଇବର ଥାନାରେ  ଅଭିଯୋଗ ଦାଖଲ କରିଛି ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟ I ଛାତ୍ରଛାତ୍ରୀ  ଏବଂ ଜନସାଧାରଣଙ୍କୁ ଏହି ନକଲି ବିଜ୍ଞପ୍ତିକୁ ବିଶ୍ୱାସ କିମ୍ବା ସେୟାର ନକରିବାକୁ ଅନୁରୋଧ କରିଛନ୍ତି  କର୍ତ୍ତୃପକ୍ଷ  ।  ସେହିପରି ଆହୁକିଛି ଗଣମାଧ୍ୟମ ଏନେଇ ସମାନ ସୂଚନ ସହ ଖବର ପ୍ରସାରଣ କରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି, ଯାହାର ଲିଙ୍କ ଏଠାରେ  ଏବଂ  ଏଠାରେ    ଉପଲବ୍ଧ ରହିଛି I  ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ନୋଟିସଟି ଫେକ୍ ଅଟେ । ରମଜାନ ଅବସରରେ ଯଦି ପୁଅ ଏବଂ ଝିଅକୁ ଏକାଠି ଠିଆ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳେ ତେବେ ତୁରନ୍ତ ତାଙ୍କର ବିବାହ କରିଦିଆଯିବ ବୋଲି କୌଣସି ନୋଟିସ ଜାରି କରି ନାହାଁନ୍ତି ଜାମିଆ ମିଲିଆ ଇସଲାମିଆ କର୍ତ୍ତୃପକ୍ଷ । ଏଭଳି ନୋଟିସ କୁ ନିନ୍ଦା କରିବା ସହ ଏନେଇ ଦିଲ୍ଲୀ ସାଇବର ଥାନାରେ ଏତଲା ଦିଆଯାଇଛି ବୋଲି ସୂଚନା ଦେଇଛନ୍ତି କର୍ତ୍ତୃପକ୍ଷ ।

తెలుగు పోస్ట్ 2 Mar 2026 10:53 pm

రేపు మూడు కమిషనరేట్లలో మద్యం షాపులు బంద్

హోలీ పండగ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులను మూసివేయాలని సిపిలు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు దుకాణాలు, వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు. సార్ట్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మన తెలంగాణ 2 Mar 2026 10:20 pm

చందన లేపనంతో తయారైన సంతూర్ అగర్బత్తీల విడుదల

న్యూదిల్లీ: విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రధాన ఉత్పత్తి అయిన సంతూర్, రియల్ చందన లేపనంతో తయారు చేసిన ‘సంతూర్ అగర్బత్తీ’లను విడుదల చేయడం ద్వారా అగర్బత్తీల విభాగంలోకి ప్రవేశించింది. చందనం ఆధారిత ఉత్పత్తులతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, సంతూర్ ఇప్పుడు నూతనంగా గృహసుగంధ విభాగంలోకి విస్తరించింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగించడంలో సంతూర్ దశాబ్దాలుగా పేరుగాంచింది. ఈ నూతన ఉత్పాదకథతో,సంతూర్ తన వ్యాపార వారసత్వ విలువలను అగర్బత్తీల విభాగంలోకి విస్తరిస్తోంది. దేవాలయాలు, […] The post చందన లేపనంతో తయారైన సంతూర్ అగర్బత్తీల విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 10:05 pm

పెరిగిన బంగారం, వెండి

అమెరికా-, ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,000 పెరిగి రూ.1.66 లక్షలకు చేరింది. కిలో వెండి రూ.20,000 పెరిగి రూ.2.87 లక్షలకు పెరిగింది. కమోడిటీ నిపుణుడు అజయ్ కేడియా మాట్లాడుతూ, బంగారం రూ.1.90 లక్షలు, వెండి రూ.3.50 లక్షలకు చేరవచ్చన్నారు. ప్రపంచ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు తగ్గింపు అంచనాలతో ఈ విలువైన లోహాల ధరలు పెరిగాయి

మన తెలంగాణ 2 Mar 2026 10:01 pm

అమెజాన్ హోలీ స్టోర్ ఇప్పుడు లైవ్

బెంగుళూరు: ఏడాదిలో అత్యంత రంగులభరితంగా ఉండే పండుగ కోసం భారతదేశం సంసిద్ధమవుతున్న తరుణంలో, అమెజాన్. ఇన్ తన ప్రత్యేకమైన హోలీ స్టోర్ఎన్నుప్రారంభించి పండుగకు అవసరమైన ఫ్యాషన్, సౌందర్యసాధనాలు, గృహాలంకరణ, కిరాణా సామాగ్రులు, బొమ్మలు, ఇంకా మరెన్నో రకాల వస్తువులను ఒకే చోటకుతీసుకువచ్చింది. నేడు కస్టమర్లు పండుగవేడుకలను జరుపుకునే పద్ధతికి అద్దం పడుతూ ఈ స్టోర్ఎలో, చర్మానికి హాని కలిగించని హెర్బల్ గులాల్, పండుగ మిఠాయిలుమొదలుకుని పిచికారీలు, పార్టీలకు కావలసిన దుస్తులు, వాటర్ ప్రూఫ్ మేకప్, పోర్టబుల్ స్పీకర్లు, […] The post అమెజాన్ హోలీ స్టోర్ ఇప్పుడు లైవ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 10:00 pm

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి

ముంబైఫ భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్గాప్రకటించింది. ‘చునియే భరోసా, అప్నో సా’ అనే ఇంటిగ్రేటెడ్ బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. విశ్వసనీయత, ప్రామాణికతకు పేరుగాంచిన వ్యక్తిత్వాన్ని నమ్మకం,పారదర్శకతలో పాతుకుపోయిన బ్రాండ్తో అసోసియేషన్ ఏకం చేస్తుంది. పంకజ్ త్రిపాఠి స్థిరపడిన వ్యక్తిత్వం అతన్ని బ్రాండ్ ప్రధాన వాగ్దానం – “నమ్మకం” సహజస్వరూపంగా చేస్తుంది, ఇది వ్యక్తిగత, భరోసానిస్తుంది. బ్రాండ్ తన ‘చునియే భరోసా, అప్నో […] The post ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 9:58 pm

ఇరాన్ నటాంజ్ అణుకేంద్రం ధ్వంసం

ఇరాన్‌లోని అతి పెద్ద నటాంజ్ అణు కేంద్రం సోమవారం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో దెబ్బతిందని, దీనితో బారీ స్థాయిలో అణుధార్మికత వెలువడుతోందని వార్తలు వెలువడ్డాయి.పైగా ఇరాన్ అధికారికంగా ఈ దాడి గురించి తెలిపింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ)కు విషయం తెలిపింది. జాగ్రత్తల గురించి అభ్యర్థించిందని ఇరాన్ వార్తా సంస్థలు తెలిపాయి. అంతర్జాతీయంగా ఈ అంశం కలవరం కల్గించింది. పలు దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో పరిస్థితి చేజారిపోతోందని అమెరికా ఈ స్థావరంపై దాడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ముందుగా వెల్లడైంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ భద్రతా బలగాలు (ఐడిఎఫ్) బారీ ఆపరేషన్‌ను నిర్వహించాయని తెలిసింది. అయితే ఇటువంటి దాడి ఏమి జరగలేదని ఆ తరువాత అణు సంస్థ వివరణ ఇచ్చింది. ఐఎఇఎ అధినేత నుంచి ప్రకటన వెలువడింది. ఇందులో వైమానిక దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలకు ముప్పు వాటిల్లిందనే అంశం నిర్థారణ కాలేదని తెలిపింది. కానీ తమ అణు కేంద్రం దెబ్బతిందని ఈ సంస్థ పరిధిలో ఉండే ఇరాన్ రాయబారి రెజా నజాఫీ వాదించారు. ఇజ్రాయెల్, అమెరికాలు భీకర దాడికి దిగిన క్రమంలో ఈ ప్రాంత పౌరులకు పెను ముప్పు తలెత్తేలా ధ్వంసం జరిగిందని, అంతర్జాతీయ అణు సంస్థ దీనిపై వెంటనే స్పందించాల్సి ఉందని రెజా తెలియచేసుకున్నారు. అయితే దీనిపై తరువాత అణు సంస్థ ఎటువంటి స్పందనా చేయలేదు. అయితే తమ ఇప్పటి పరిశీలనలో ఇరాన్‌లోని బషెహర్ అణు కేంద్రం లేదా టెహరాన్‌లోని పరిశోధనా కేంద్రం కానీ ఇతర అణు ఇంధన సంస్థలు లేదా కేంద్రాలకు ఎటువంటి ముప్పు వాటిల్లిలేదని తేలిందని ఐఎఇఎ అధినేత రాఫెల్ గ్రాసి వివరించారు. 

మన తెలంగాణ 2 Mar 2026 9:58 pm

టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 32% వార్షిక వృద్ధి

ముంబై: ఫిబ్రవరి 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో టాటా మోటార్స్ లిమిటెడ్ అమ్మకాలు 42,940 యూనిట్లుగా ఉన్నాయి, ఫిబ్రవరి 2025లో 32,533యూనిట్లు మాత్రమే ఉన్నాయి, ఇది వార్షిక ప్రాతిపదికన 32% ఎక్కువ. దేశీయ అమ్మకాలు ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ, ఫిబ్రవరి 2025లో 15,940యూనిట్లతో పోలిస్తే 21,423 యూనిట్లు (సంవత్సరానికి 34.4%) పెరిగాయి. ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు, ఫిబ్రవరి2025లో 16,693 యూనిట్లతో పోలిస్తే 22,512 యూనిట్లు (సంవత్సరానికి 34.9%గా నమోదయ్యాయి. ఈ […] The post టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 32% వార్షిక వృద్ధి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 9:56 pm

ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలుకే రాహుల్ తెలంగాణకు వచ్చారు: కిషన్ రెడ్డి

రాహుల్‌గాంధీ, -రేవంత్ రెడ్డి (ఆర్‌ఆర్) ట్యాక్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్‌తోనే రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీకి నిజంగా తెలంగాణ ప్రజల సమస్యలపై కనీస అవగాహన, ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు రాగానే మొదట వాటి అమలుపై సమీక్షించేవారని విమర్శించారు. హామీలు ఎలా అమలు అవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేసేవారని, అయితే ఇసుమంతైనా జవాబుదారీతనం లేని రాహుల్ గాంధీ నుంచి ఇలాంటివి ఆశించడం తెలంగాణ ప్రజల దురదృష్టమని ఆయన ఎక్స్‌వేదికగా సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలపై రాహుల్ గాంధీ ఊసెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మతిమరుపు ఉందేమో కానీ తెలంగాణ ప్రజలకు లేదనే విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించాలని చురకలు వేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలతో చేసిన గోబెల్స్ ప్రచారం ఎన్నికల్లో గెలిచాక ముఖం చాటేసి, మీరు చేసిన మోసానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని కిషన్‌రెడ్డి తన పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 2 Mar 2026 9:51 pm

రాష్ట్ర ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగగా హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత, సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోళీ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సహజ సిద్ధమైన రంగులు, సంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాలన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల సమైక్యతను చాటే పండుగ హోళీని వేడుకగా జరుపుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

మన తెలంగాణ 2 Mar 2026 9:48 pm

చంద్రగ్రహం.. రేపు తిరుమల ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ తలుపులను మూసివేస్తు న్నట్లు టిటిడి అధికారులు సోమవారం ప్రకటించారు. చంద్రగ్రహణ ప్రభావం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. సోమవారం రాత్రి వరకు మాత్రమే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించనున్నారు. అలాగే తిరుప తిలో జారీ చేసే మంగళవారం కోటా సర్వదర్శనం టోకెన్లను కూడా రద్దు చేస్తున్నట్లు టిటిడి స్పష్టపర్చింది. మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్ల వరకు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఒక్కరోజే 83,122 మంది భక్తులు శ్రీవారిని దర్శిం చుకోగా, 30,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.49 కోట్ల రూపాయలు. గ్రహణం వీడినానం తరం ఆలయ శుద్ధి, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి, మంగళవారం రాత్రి 7.30 గంటల తర్వాతే భక్తులను తిరిగి దర్శనానికి అనుమ తించనున్నారు.

మన తెలంగాణ 2 Mar 2026 9:44 pm

తిరుమలలో భక్తుల ఘర్షణ

తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూలైన్‌లో రెండు కుటుం బాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలా మారడంతో రెండు కుటుంబాలు క్యూలైన్‌లోనే పరస్పరం దాడు లకు తెగబడ్డాయి. దీంతో తోటి భక్తులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. గమనించిన శ్రీవారి సేవకులు వెంటనే టిటిడి విజిలెన్స్, పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న టిటిడి అధికారులు భక్తులకు సర్ధిచెప్పారు. అనంతరం ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీశారు. మిగిలిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనకు సంబంధిం చిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మన తెలంగాణ 2 Mar 2026 9:42 pm

కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నికతో ఆకులతండాలో ఉత్సాహం

కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నికతో ఆకులతండాలో ఉత్సాహం నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 2 Mar 2026 9:40 pm

ముత్తోజి పేటలో భక్తి జ్వాలలు

ముత్తోజి పేటలో భక్తి జ్వాలలు కొమ్మాల లక్ష్మి నరసింహ స్వామి జాతరకు,ఘనమైన ప్రభ

ప్రభ న్యూస్ 2 Mar 2026 9:35 pm

దారి ఆక్రమణ.. బీడు భూములుగా మారిన పొలాలు

దారి ఆక్రమణ.. బీడు భూములుగా మారిన పొలాలు పట్టించుకోని సంబంధిత అధికారులు తొర్రూరు,ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 2 Mar 2026 9:28 pm

ఉత్సవ ఏర్పాట్లలో… ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దు

ఉత్సవ ఏర్పాట్లలో… ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దు నాచగిరి,ఆంధ్రప్రభ: ప్రసిద్ధ నాచగిరి వార్షిక బ్రహ్మోత్సవాలను

ప్రభ న్యూస్ 2 Mar 2026 9:16 pm

స్వీపర్ శాహీన్ సుల్తాన బదిలీ.. ఘనంగా సన్మానం

స్వీపర్ శాహీన్ సుల్తాన బదిలీ.. ఘనంగా సన్మానం స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Mar 2026 9:10 pm

sorcery |నివాసాల మ‌ధ్య‌.. ఇంటి ముందే..

sorcery | నివాసాల మ‌ధ్య‌.. ఇంటి ముందే.. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట

ప్రభ న్యూస్ 2 Mar 2026 9:02 pm

హైడ్రా పేరు తో పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు: మంత్రి బండి

 బాన్సువాడ ఘటనలో తెలంగాణ రాష్టంలో శాంతి భద్రత సమస్య ఉందని, రాహుల్ గాంధీ శిక్షణ శిబిరం కోసం వచ్చారు తప్ప ప్రజా సమస్యలపై కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ కి మూటలు పంపవచ్చని సీ ఎం చెviతున్నాడని, తెలంగాణలో రాచరిక పాలన మొదలైందని విమర్శించారు. సోమవారం కామారెడ్డి బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్ల ను కూల్చాడం, దేవాలయాలను కూల్చడం జరుగుతుందని, రాహుల్ గాంధీ పోవాల్సింది శిక్షణ శిబిరం కు కాదని హై డ్రా పేరు తో కూలిన ఇండ్ల వద్ద కు వెళ్లి పరామర్శించాలన్నారు. బాన్సువాడ లో జరిగిన సంఘటన హేయమైన చర్య అన్నారు. తెలంగాణలో దేవాలయాలపై దాడులను అరికట్టాలన్నారు. బాన్సువాడలో సామాన్యులు సామాన్లు తీసుకోవడానికి షాప్ కి వస్తే అమాయకులను పట్టుకుపోయి కేసులు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు.తెలంగాణ లో హోమ్ మంత్రి లేరని, కాంగ్రెస్, ఎం ఐ ఎం పార్టీ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బాన్సువాడలో జరిగిన ఘటన లో చట్ట పరంగా చర్యలు తీసుకోవలసిన పోలీసులు చట్టానికి కొమ్ముకాస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూవులను అరెస్ట్ చేశారని, ఎం ఐ ఎం పార్టీ ఆనందం చూడటానికి కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. కాంగ్రెస్, ఎం ఐ ఎం పార్టీ కి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, దేవుళ్ళ మీద దాడి జరిగితే స్పందించక పొతే హిందువే కాదని, బాన్సువాడలో అరెస్ట్ చేస్తే కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారన్నారు. 4 కోట్ల ఇండ్లను బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పేదలకు అందచేశామని, హై డ్రా పేరు తో పేదల ఇండ్ల ను కూల్చివేస్తున్నారన్నారు. మూసీ పేరు తో పేదల ఇండ్లు కూలగాట్టారని, గాంధీ ఆత్మ కోసం పేదోడి ఇండ్ల ను కొట్టడం సరికాదన్నారు. ప్రజలు ఏడుస్తున్నారని, ఖమ్మం లో భూదాన్ భూముల పేరు తో 800 ఇండ్లు కూల్చి వేశారని, పేద విద్యార్థుల పరిస్థితి ఏంటని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లో పేదలు భయపడుతూ బ్రతకల్సిన పరిస్థితి నెలకొంది. పేదల ఇండ్ల జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. గ్రామ పంచాయతీ జడ్పిటిసి, ఎం పి టి సి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించలన్నారు. కార్యక్రమం లో ఎల్లారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

మన తెలంగాణ 2 Mar 2026 8:52 pm

భారత్ కెనడా మధ్య యురేనియం ఒప్పందం

భారత్‌కెనడా మధ్య సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది.ఈమేరకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి నిరంతర సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లపై కలిసి పనిచేయనున్నామని మోడీ తెలిపారు. అలాగే 2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొలిక్కి రావాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్టు కార్నీ వెల్లడించారు. స్వామి వివేకానంద సూక్తి ప్రస్తావన 1893 లో స్వామి వివేకానంద కెనడాలో పర్యటించిన విషయాన్ని మార్క్ కార్నీ గుర్తు చేసుకున్నారు. “ లేవండి, మేల్కొనండి,, లక్షం చేరేవరకు ఆగకండి ”’ అని వివేకానంద సూక్తిని ప్రస్తావించారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు. 

మన తెలంగాణ 2 Mar 2026 8:42 pm

రేపు చంద్రగ్రహణం..2029 వరకు చివరిది ఇదే

మెల్‌బోర్న్ : 2029 వరకు కనిపించని చివరి చంద్రగ్రహణం మంగళవారం దర్శనం ఇవ్వనుంది. తదుపరి చంద్రగ్రహణం 2028 డిసెంబర్31 2029 జనవరి1న దర్శనం ఇవ్వనుంది. భారత దేశంలో సాయంత్రం 3.20 గంటలకు ప్రారంభమై 6.46 గంటలకు ముగుస్తుంది. ఆస్ట్రేలియా, అయోటిఅరోయా న్యూజిలాండ్‌ల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి బ్లడ్‌మూన్ అని పిలుస్తారు. హోలీ పండగ రోజున ఈ గ్రహణం ఏర్పడుతుండడం విశేషం. భూమి ఛాయ లోకి చంద్రుడు చేరడానికి 75 నిమిషాలు పడుతుందని, దానిని పాక్షిక గ్రహణ దశ అంటారని, చంద్రుడు పూర్తిగా ఎర్రబడడానికి గంట సమయం పడుతుందని మరో 75 నిమిషాల తరువాత ఛాయ నుంచి చంద్రుడు బయట పడి పూర్తి వికాసంతో ప్రకాశిస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. భారత దేశంలో ముఖ్యంగా తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో సాయంత్రం వేళ చంద్రోదయ సమయంలో కనిపిస్తుంది. పశ్చిమ ఆస్ట్రేలియా లోని చాలా ప్రాంతాల్లో గ్రహణం చంద్రుడు దిగ్మండలం కింద ఉండటంతో ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా మినహా మిగతా ప్రాంతాల్లో గ్రహణం సాయంత్రం ప్రారంభమవుతుంది. న్యూజిలాండ్‌లో రాత్రి 10.50 కి గ్రహణం ప్రారంభం కానుంది. తదుపరి రక్త చంద్రుడ్ని దర్శించడానికి మూడేళ్లు నిరీక్షించవలసి ఉన్నందున మంగళవారం సాయంత్రం గ్రహణం స్పష్టంగా కనిపించేలా ఆకాశం నిర్మలంగా ఉంటుందని నిరీక్షిస్తున్నారు. 

మన తెలంగాణ 2 Mar 2026 8:38 pm

NBK waiting for Ustaad Bhagat Singh Result

Nandamuri Balakrishna is eager to work with talented director Harish Shankar soon. The discussions were initiated and the script will be discussed after the release of Ustaad Bhagat Singh featuring Pawan Kalyan in the lead role. S Naga Vamsi of Sithara Entertainments is on board to produce the film. Balakrishna is now waiting for the […] The post NBK waiting for Ustaad Bhagat Singh Result appeared first on Telugu360 .

తెలుగు 360 2 Mar 2026 8:34 pm

Jagan Appeals for Gulf Evacuation as AP Government Activates 24×7 Helplines

Amid rising tensions between Iran and Israel, concerns have grown over the safety of Telugu workers in Gulf nations. Former Chief Minister Y. S. Jagan Mohan Reddy urged the Andhra Pradesh government to act swiftly and ensure the safe return of stranded migrant workers. According to Jagan, thousands of Andhras are employed in Gulf countries, […] The post Jagan Appeals for Gulf Evacuation as AP Government Activates 247 Helplines appeared first on Telugu360 .

తెలుగు 360 2 Mar 2026 8:31 pm

యుద్ధం వారాలపాటు కొనసాగుతుంది: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ సంక్షోభం, పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌తో యుద్ధం వెంటనే ముగిసే అవకాశాలు లేవని, మరో ఐదు నుంచి ఆరు వారాల పాటు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని ప్రకటించారు. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్, సైన్యం ఆయుధాలు విడిచిపెడితే రక్షణ కల్పిస్తామన్నారు. ఇరాన్ దీర్ఘశ్రేణి ఆయుధాలు కలిగి ఉండడం పశ్చిమాసియాతో పాటు అమెరికాకు పెనుముప్పు అని ట్రంప్ హెచ్చరించారు.ఆపరేషన్ ‘ఎపిక్ ప్యూరీ’ సంపూర్ణ స్థాయిలో కొనసాగుతోందన్నారు. ఖమేనీ ప్రమేయంతో తనపై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. ఇప్పటి వరకు యుద్ధంలో నలుగురు తమ సైనికులు మరణించారని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్‌సెథ్ వెల్లడించారు. ఇరాన్ ఆయుధాలు తయారు చేస్తూ ప్రాంతీయంగా ఉద్రిక్తతలకు దారి తీసిందన్నారు. అణ్వాయుధ బెదిరింపులకు కూడా వెనకాడలేదన్నారు. యుద్ధాన్ని తాము మొదలు పెట్టామని, తామే ముగింపు పలుకుతానమని పీటర్ తెలిపారు. ఇరాన్‌లో పాలనను చేజిక్కించుకుకునేందుకు తాము యుద్ధానికి పాల్పడడం లేదని, అలాంటి ఉద్దేశం తమకు లేదన్నారు. యుద్ధ కారణంగా జరిగే నష్టం ఇరువైపులా ఏ రకంగా ఉంటుందో అధ్యక్షుడు ట్రంప్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు. అణ్వాయుధాలు వీడాలని సూచిస్తే ఖమేనీ పెడచెవిన పెట్టడమే కాకుండా ఎవరో ఒకరు బ్రతికుండాలన్నట్టుగా మాట్లాడారని, చివరకు అతనే యుద్ధం మృత్యువాతపడ్డారని అన్నారు.

మన తెలంగాణ 2 Mar 2026 8:28 pm

పాక్ దళాల దాడితో అఫ్గాన్ ఆయుధ డిపో ధ్వంసం

అఫ్గాన్ తాలిబన్లపై పాక్‌సైన్యాల దాడులు కొనసాగుతున్నాయి. పాక్ భద్రతా దళాలు ఆయుధ డిపోను ధ్వంసం చేశాయని ప్రభుత్వ మీడియా సోమవారం వెల్లడించింది. పాక్, అఫ్గానిస్థాన్ సరిహద్దు లోని 2600 కిమీ పొడవునా 53 ప్రాంతాల్లో తాలిబన్ దళాలు దాడి చేసిన తరువాత పాకిస్థాన్ ఆపరేషన్ ఘజాజ్ లిల్ హక్‌ను గత వారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 415 మంది అఫ్గాన్ తాలిబన్లను పాకిస్థాన్ దళాలు హతమార్చాయని, మరో 580 మంది గాయపడ్డారని పాక్ సమాచార మంత్రి అత్తయుల్లా తరార్ ఆదివారం వెల్లడించారు. ఖోస్ట్ లోని ఫిట్నా అల్ ఖవర్జ్ అనే తాలిబన్ ఆయుధ డిపోను సమర్ధంగా పాక్ దళాలు ధ్వంసం చేయగలిగాయని చెప్పారు. పాకిస్థాన్ దళాలు బగ్రాం విమాన స్థావరం వరకు తమ వైమానిక దాడులను విస్తరించాయని అఫ్గాన్ వర్గాలు పేర్కొన్నాయి. 

మన తెలంగాణ 2 Mar 2026 8:25 pm

చికిత్స పొందుతూ ఖమేనీ భార్య మృతి

 ఇటీవల అమెరికాఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మన్సూరెహ్ ఖొజెత్సెటెహ్ భఘెర్జాదెహ్ మరణించారు. ఈ మేరకు సోమవారంనాడు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇదే దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన అల్లుడు, కుమార్తె, మనవరాలు మృతి చెందారు. ఖమేనీ భార్య మరణం పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలకు తావిచ్చే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు తెలిపాయి.  

మన తెలంగాణ 2 Mar 2026 8:21 pm

Holi2026 |అదృశ్యముప్పు పట్ల అప్రమత్తంగా ఉండండి.

Holi2026 | అదృశ్యముప్పు పట్ల అప్రమత్తంగా ఉండండి. Holi2026 | ప్రమాదకరమైన రసాయన

ప్రభ న్యూస్ 2 Mar 2026 8:19 pm

బైక్ ను ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి దుర్మరణం

బైక్ ను ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి దుర్మరణం వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్

ప్రభ న్యూస్ 2 Mar 2026 8:09 pm

Gold@2Lakhs |గోల్డ్ రేట్ నాన్ స్టాప్ Andhra Prabha TopStory

Gold@2Lakhs | గోల్డ్ రేట్ నాన్ స్టాప్ Andhra Prabha TopStory Gold@2Lakhs

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:58 pm

8 Smugglers | 8 టన్నుల దుంగలు..

8 Smugglers | 8 టన్నుల దుంగలు.. 8 Smugglers | తిరుపతి

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:53 pm

రాష్ట్ర ప్రజలకు హోలి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

హోలీ పండుగను ప్రజలంతా ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రసాయనిక రంగులను వినియోగించకుండా, పూలు, ఔషధ మొక్కలు, ప్రకృతి వనరులతో తయారైన సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. పర్యావరణానికి, మనుషులకు హాని కలిగించే రసాయనిక రంగులను అస్సలు వాడకూడదని కోరారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని, పండుగలను కూడా పర్యావరణహితంగా జరుపుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని కోరారు. హోలీని ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా మలుచుకోవాలని తెలిపారు.

మన తెలంగాణ 2 Mar 2026 7:46 pm

మహిళలకు 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం…

మహిళలకు 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం… మష్రూమ్స్, హోమ్ బేస్డ్ ప్రొడ‌క్ట్స్ తయారీ

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:42 pm

Development |పనులను సత్వరమే పూర్తి చేయాలి..

Development | పనులను సత్వరమే పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన చైర్మన్ బొర్రా

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:36 pm

ప్రతి గ్రామానికి సీసీ కెమెరాలు తప్పనిసరి…

ప్రతి గ్రామానికి సీసీ కెమెరాలు తప్పనిసరి… సంగెం, ఆంధ్రప్రభ : మామునూరు ఏసీపి

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:24 pm

సాంప్రదాయబద్ధంగా ఢూండ్ ఉత్సవాలు

సాంప్రదాయబద్ధంగా ఢూండ్ ఉత్సవాలు లింగాపూర్, ఆంధ్రప్రభ: లింగాపూర్ మండల పరిధిలోని నడ్డంగూడా గ్రామంలో

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:16 pm

Section 307 |అడ్డు వ‌చ్చిన భార్య‌ను కూడా….

Section 307 | అడ్డు వ‌చ్చిన భార్య‌ను కూడా…. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:13 pm

రాహుల్ గాంధీకి మెమెంటో బహుకరించిన ఎమ్మెల్యే

రాహుల్ గాంధీకి మెమెంటో బహుకరించిన ఎమ్మెల్యే పార్టీ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలిఏఐసీసీ

ప్రభ న్యూస్ 2 Mar 2026 7:07 pm

మహా కుంభాభిషేకానికి రండి… వీక్షించండి..

మహా కుంభాభిషేకానికి రండి… వీక్షించండి.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:59 pm

Telangana Model or Political Liability? A National Test for Revanth

What happens in Hyderabad is no longer staying in Hyderabad – it is being watched by the entire country. The “Telangana Model” was supposed to be the Congress party’s national calling card. Instead, it may be becoming a political liability. For Chief Minister Revanth Reddy, the challenge is no longer just governing a state; it […] The post Telangana Model or Political Liability? A National Test for Revanth appeared first on Telugu360 .

తెలుగు 360 2 Mar 2026 6:56 pm

సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్

సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్ వ‌ర్గ‌ల్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : సిద్దిపేట

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:46 pm

Ys jagan : చంద్రబాబుకు వైఎస్ జగన్ వినతి

గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు

తెలుగు పోస్ట్ 2 Mar 2026 6:44 pm

నకిలీ సంస్థలపై కేటీఆర్ ఆగ్రహం..!

నకిలీ సంస్థలపై కేటీఆర్ ఆగ్రహం..! నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:40 pm

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత జన్నారం,ఆంధ్రప్రభ : వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:32 pm

విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేత

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం వెల్గనూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:27 pm

తలసరి ఆదాయం పెంపు దిశగా ప్ర‌ణాళిక‌లు…

తలసరి ఆదాయం పెంపు దిశగా ప్ర‌ణాళిక‌లు… జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:27 pm

అంగన్వాడి భవనానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ కి వినతి

అంగన్వాడి భవనానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ కి వినతి మహాదేవపూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:26 pm

పదవీ విరమణ పొందిన అధికారికి స‌న్మానం…

పదవీ విరమణ పొందిన అధికారికి స‌న్మానం… క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : గుబ్బల

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:24 pm

పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి…

పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి… లో హోల్టేజ్ సమస్య తీరుతుంది… నర్సంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:21 pm

జాతీయస్థాయిలో ఊరు పేరును నిలపాలి…

జాతీయస్థాయిలో ఊరు పేరును నిలపాలి… క్రీడలు మానసిక ఉల్లాసనికి దోహదం జగదేవపూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:17 pm

Chandrababu :అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందే : చంద్రబాబు

రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

తెలుగు పోస్ట్ 2 Mar 2026 6:14 pm

మల్లక్కపేట గ్రామంలో పశువైద్య శిబిరం

మల్లక్కపేట గ్రామంలో పశువైద్య శిబిరం పరకాల, ఆంధ్రప్రభ : జిల్లా పశుగణభివృద్ధి సంస్థ,

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:13 pm

బాలల హక్కులు, చట్టాలపై అవగాహన

బాలల హక్కులు, చట్టాలపై అవగాహన ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరూ బాలల హక్కులు

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:07 pm

2march2026 |షా(క్రా)కర్స్

2march2026 | షా(క్రా)కర్స్ ఇరాన్ పై ట్రంప్ అహంకార వారుమూడుతుందా ప్రపంచానికి మరోమారు?ఎప్పటికి

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:06 pm

Telangana : రాజ్యభ అభ్యర్థుల పేర్లు ఖరారయినట్లేనా? అదే జరిగితే?

తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు.

తెలుగు పోస్ట్ 2 Mar 2026 6:01 pm

ఘ‌నంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

ఘ‌నంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు మధ్యాహ్న భోజన తనిఖీలో చిన్నారులు మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Mar 2026 6:01 pm

Strict Deadlines for Prabhas’ Fauzi

Mythri Movie Makers is producing Fauzi featuring Prabhas in the lead role. The top actor has been delaying his films because of his multiple commitments. Prabhas is juggling between the sets of Fauzi, Spirit and he will join the sets of Kalki 2898 AD sequel. With a big amount of money involved, Mythri Movie Makers […] The post Strict Deadlines for Prabhas’ Fauzi appeared first on Telugu360 .

తెలుగు 360 2 Mar 2026 5:52 pm

ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’

ద్విభాష్యం రాజేశ్వరరావు ఈ మధ్యలో అనేక మంది సాహితీవేత్తలతో పాటు అప్పుడప్పుడు కళారంగంలోని ఇతరులనూ పరిచయం చేస్తున్నారు. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. వాటికి లిఖిత రూపం ఇచ్చి “విశాలాంధ్ర” పాఠకులకు అందజేయడం కోసం “నెమరు” శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ పరిచయ వ్యాసాలు ప్రచురణ మొదలెట్టడానికి ముందు ద్విభాష్యం రాజేశ్వరరావు గురించి నాలుగు ముక్కలు… ద్విభాష్యం 1945 జూలై ఒకటిన మునుపటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో జన్మించారు. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పట్నంలో చదువుకున్నారు. మొదట […] The post ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 5:40 pm

చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర

తాడి ప్రకాష్సెల్: 9704541559 తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను. “ఇంకెవరు! రాంభట్ల కష్ణమూర్తిగారేగా” అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి “మీతో అదే వచ్చింది” అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో అని ఆయన ఉద్దేశం. “మొట్టమొదట రాసింది నేను” అని నండూరి చెప్పారు. 1956 లోనో 57 లోనో రాశానని […] The post చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 5:37 pm

అరసం 20 వ రాష్ట్ర మహాసభల సందర్భంగాయువ రచయితలకు కథ, కవితల పోటీ

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగనున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని యువతకు కథ, కవిత్వ రచనలో పోటీని నిర్వహిస్తోంది. ఉత్సాహవంతులైన యువ కవులు, కథకులను ప్రోత్సహించడమే పోటీల ప్రధాన లక్ష్యం. విజేతలకు బహుమతీ ప్రదానం మహాసభల వేదిక మీద జరుగుతుంది. పెదపరిమికి చెందిన మొవ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఈ పోటీలను అరసం నిర్వహిస్తోంది.కథా రచనలో మొదటి బహుమతి రూ.5000 లు, ద్వితీయ […] The post అరసం 20 వ రాష్ట్ర మహాసభల సందర్భంగాయువ రచయితలకు కథ, కవితల పోటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 5:35 pm

హాయి రాగమై పరిమళించి…

ఏదో వేళ నీ గురుతుల్లో తేలియాడుతుంటేఉన్మత్త స్థితి జాలులా చేరిఆకాశపుటంచులపై పడదోసిపకపక నవ్వి పరిహాసాలాడుతుందిఒంటరితనపు బెంగదోసిళ్ళతో తోడిమనోనాళీకంపై విసురుతోందిఇపుడు మనసు ఘనీభవించివిలవిలలాటలో ఉందిఒక్కసారైనా పల్లవికావూహాయి రాగమై పరిమళించి పాడతాను! తాళ్లూరి రాధ The post హాయి రాగమై పరిమళించి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 5:32 pm

హాకర్లకు శాశ్వత పరిష్కారం చూపాలి…

హాకర్లకు శాశ్వత పరిష్కారం చూపాలి… కార్పోరేషన్ అధికారులకు పుణ్య శిల వినతి……..కూటమి ప్రభుత్వం

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:28 pm

రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కిమ్స్ సవేరాలో 50కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు పూర్తి

వినికిడి లోపం ఉన్న మూగ, బధిర చిన్నారులు శస్త్రచికిత్సలను ఉపయోగించుకోవాలిజాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : వినికిడి లోపం ఉన్న పిల్లలు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పూర్తి ఉచితంగా చేస్తున్న కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఈనెల 3వ తేదీన ప్రపంచ శ్రవణ దినోత్సవం (వరల్డ్ హియరింగ్ డే ) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో డా.ఎన్టీఆర్ వైద్య సేవ […] The post రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కిమ్స్ సవేరాలో 50కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు పూర్తి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 5:27 pm

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:22 pm

మీరే సుప్రీం..భవిష్యత్ మీదే : రాహుల్ గాంధీ

ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.

తెలుగు పోస్ట్ 2 Mar 2026 5:22 pm

సర్కిల్ వన్ పీజీఆర్‌ఎస్‌లో ఒకే ఒక అర్జీ దాఖలు…

సర్కిల్ వన్ పీజీఆర్‌ఎస్‌లో ఒకే ఒక అర్జీ దాఖలు… చిట్టినగర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:22 pm

పదేళ్లలో నియోజకవర్గానికి అపకీర్తి తెచ్చావ్?

పదేళ్లలో నియోజకవర్గానికి అపకీర్తి తెచ్చావ్? కడియం కుటుంబంపై విమర్శలు చేస్తే సహించముకడియం అభివృద్ధి

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:21 pm

ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి..

ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి.. గ‌డువులోపు స‌మ‌స్యకు ప‌రిష్కారం చూపాలి..ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:19 pm

23 million |రికార్డ్ క్రాస్ చేసిన రష్మిక..

23 million | రికార్డ్ క్రాస్ చేసిన రష్మిక.. 23 million |

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:19 pm

పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి…

పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి… గన్నవరం, ఆంద్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:17 pm

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమునకు విశేష స్పందన

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి నాగార్జున తెలిపారు. ఈ శిబిరం యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరు శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. […] The post ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమునకు విశేష స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 5:17 pm

చర్మకారులకు విశ్వకర్మ శిక్షణ…

చర్మకారులకు విశ్వకర్మ శిక్షణ… రుణాలు మంజూరు చేయాలి….ఏపీ సీవీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:14 pm

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ ఆంధ్ర‌ప్ర‌భ,వెబ్ డెస్క్ : మీ బండిపై పెండింగ్

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:12 pm

అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలి

అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కర్నూలు, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 2 Mar 2026 5:12 pm

అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచింది సీఎం చంద్రబాబే

టిడిపి నియోజకవర్గ వర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం; అంగన్వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, మీ డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అంగన్వాడీలు తమ డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా కొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి మేలు జరిగింది.. ఇప్పుడు ఏం జరుగుతోందన్నది పునఃపరిశీలన […] The post అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచింది సీఎం చంద్రబాబే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Mar 2026 5:12 pm