SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి..

సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి.. 160 క్వింటాళ్ల చౌక బియ్యం స్వాధీనం

ప్రభ న్యూస్ 11 Mar 2026 10:18 am

భారత్ అదరహో..... టీమిండియాకు రూ.131 కోట్ల నజరానా

ముంబై: టి20 ప్రపంచకప్ ట్రోఫీ సాధించిన టీమిండియాపై కనక వర్షం కురువనుంది. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) రూ.131 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు. గతంలో విజేతగా నిలిచిన టీమిండియాకు బిసిసిఐ రూ.125 కోట్లు అందించింది. ఈసారి దాన్ని రూ.131 కోట్లకు పెంచింది.   టి20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. భారత్‌కు ఇది మూడో టి20 ప్రపంచకప్ ట్రోఫీ కావడం విశేషం. మరే జట్టు కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా అసాధారణ ఆటతో ఛాంపియన్‌గా అవతరించింది. లీగ్ దశలో భారత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేదు. పసికూన అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతి కష్టం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు సర్వం ఒడ్డాల్సి వచ్చింది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెమటోడ్చక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అష్టకష్టాలు పడింది. అయితే నమీబియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం అలవోక విజయం సాధించి లీగ్ దశను అజేయంగా ముగించింది. కానీ సూపర్8 ఆరంభ మ్యాచ్‌లోనే ఎవరూ ఊహించని ఫలితం ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. సొంత గడ్డపై భారత్‌కు ఇలాంటి పరాజయం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేక పోయారు. అసాధారణ ఆటతో చెలరేగి పోయిన సఫారీ టీమ్‌ను భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఇలాంటి స్థితిలో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. లీగ్‌లో అదరగొట్టిన జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌లు భారత్‌కు సవాల్‌గా మారాయి. ఈ జట్లను ఓడించి సెమీస్‌కు చేరడం టీమిండియాకు అంత తేలిక కాదని విశ్లేషకులు సయితం అంచనా వేశారు. సంజు మార్క్ విజయం.. సఫారీ జట్టు చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్‌కు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఊరట లభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అలవోక విజయం సాధించింది. తర్వాత వెస్టిండీస్ జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టిన శాంసన్ 50 బంతుల్లోనే అజేయంగా 97 పరుగులుచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ సంజు చెలరేగి పోయాడు. ఇంగ్లీష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సంజు 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లోనూ సంజు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సంజు 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. బుమ్రా ముద్ర మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలువడంలో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచుల్లో 12.43 సగటుతో 14 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో 6.21 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఫైనల్లో అసాధారణ బౌలింగ్‌తో అదరగొట్టాడు. కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లోనూ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక హార్దిక్, దూబె, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తదితరులు కూడా భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తోవిఫలమైనా అద్భుత కెప్టెన్సీతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.

మన తెలంగాణ 11 Mar 2026 10:17 am

విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం..

విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం.. మహమ్మదాబాద్, ఆంధ్రప్రభ : క్లాస్ రూమ్ పైకప్పుఊడి

ప్రభ న్యూస్ 11 Mar 2026 10:14 am

Gas Cylinder : గ్యాస్ కే ఇంత కొరత ఎందుకు? కేంద్రం తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయా?

మధ్య ప్రాచ్యంలో యుద్ధ ప్రభావం కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 10:13 am

Telangana : నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం చేయనున్నారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 10:08 am

Telangana : నేడు భూదాన్ బాధితులకు ఇళ్లపట్టాల పంపిణీ

నేడు వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్లపట్టాల పంపిణీ జరగనుంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 10:01 am

Hyderabad : హైదరాబాద్ లో నిలిచిపోనున్న గిగ్ వర్కర్ల సేవలు

ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావంతో గిగ్ వర్కర్లపై ప్రభావం చూపుతుంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:48 am

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:40 am

Summer Effect : ఇళ్లను వదలి బయటకు రావద్దండి.. దూర ప్రయాణాలను రద్దు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:34 am

Prabhas C/O Mythri Movie Makers

Pan-Indian star Prabhas has some of the biggest films lined up and he is currently shooting for Fauzi, Spirit and Kalki 2898 AD. Fauzi is a periodic film produced by Mythri Movie Makers. Prabhas is closely associated with the top production house and he promised to do more films for Mythri in the future. The […] The post Prabhas C/O Mythri Movie Makers appeared first on Telugu360 .

తెలుగు 360 11 Mar 2026 9:33 am

Peddi Shooting Deadlines: Packed with Headaches

Ram Charan’s Peddi is in the final stages of shoot and the expectations are big on the film. The makers announced that the film will head for a grand release on April 30th and this is the best summer date for any film this year. The team is yet to complete the shoot and different […] The post Peddi Shooting Deadlines: Packed with Headaches appeared first on Telugu360 .

తెలుగు 360 11 Mar 2026 9:27 am

Andhra Pradesh : నేడు ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:26 am

ഫാക്ട് ചെക്ക്: ബഹ്റൈനിലെ താമസകെട്ടിടങ്ങൾക്ക് നേരെ ഇറാൻ ആക്രമണം? വസ്തുതയെന്ത്

യുക്രൈനിലെ കീവിൽ റഷ്യൻ ഡ്രോണാക്രമണത്തിൻ്റെ ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:19 am

Gold Prices Today : బంగారం కొనుగోలుకు వెళుతున్నారా? అయితే మీకొక అలెర్ట్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:07 am

టేకుమట్ల నూతన ఎస్ఐగా అమూల్య..

టేకుమట్ల నూతన ఎస్ఐగా అమూల్య.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల

ప్రభ న్యూస్ 11 Mar 2026 9:06 am

ఇరాన్ ఎముకలు విరగ్గొడుతున్నాం: నేతన్యాహు

జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు. ఇజ్రాయెల్ లో ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు ఆటంకం కలగలేదన్నారు. ఇజ్రాయెల్  ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, పోరాడే దేశం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తామని హెచ్చిరించారు. యుద్ధంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌లో నిరంకుళ పాలన నుంచి ఆ దేశ ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్ ఎముకలు విరగ్గొడుతున్నామని తెలియజేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ స్పందించారు. తాము కాల్పుల విరమణకు సిద్దంగా లేమని, పోరాటమే తమ ద్వేయమని తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం స్వల్పకాలిక చర్య అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒకవేళ  హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయాలని చూస్తే దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

మన తెలంగాణ 11 Mar 2026 9:01 am

కాలుష్యం నుండి కాపాడండి..

కాలుష్యం నుండి కాపాడండి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:55 am

మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రమాణస్వీకారం..

మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రమాణస్వీకారం.. చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:42 am

Tirumala : తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. నేడు దర్శనం సమయం ?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:41 am

మెదక్‌లో చెరువులో దూకి యువతి ఆత్మహత్య

మెదక్: నిశ్చితార్థం జరిగిన వారం రోజులకే ఓ యువతి చెరువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. అప్పాజీపల్లి గ్రామంలో రూప(22) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. రూపకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. వారం రోజుల క్రితం నిశ్చితార్థం కూడా జరిపించారు. గత నాలుగు రోజుల నుంచి ఆమె దిగాలుగా ఉంది. సోమవారం గ్రామశివారులో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 11 Mar 2026 8:41 am

Where is Anushka Shetty?

Anushka Shetty enjoys a huge craze among the Telugu audience. She is a known face for Tamil and other South languages. Baahubali also introduced her to North audience and she has been suffering with weight loss issues from the past few years. The actress managed to do films and she is quite selective. Miss Shetty […] The post Where is Anushka Shetty? appeared first on Telugu360 .

తెలుగు 360 11 Mar 2026 8:33 am

చిట్యాల ఎస్ఐగా పోచంపల్లి సతీష్ బాధ్యతల స్వీకరణ..

చిట్యాల ఎస్ఐగా పోచంపల్లి సతీష్ బాధ్యతల స్వీకరణ.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:31 am

యుద్ధం ఎఫెక్ట్... మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్

మధ్య ప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాల్లో వర్క్ ఫ్రం హోం చేయాలని నిర్ణయించారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:29 am

మాజీ ముఖ్యమంత్రిపై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు... మండిపడుతున్న అభిమానులు

హైదరాబాద్: నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారారు. తమిళనాడు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ పై రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు కాంతారావు గొప్పతనం గురించి చెప్పడంతో పాటు ఎంజిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు 2025 ప్రదానోత్సవంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. కాంతారావు నటన చూసి ఎంజిఆర్‌ షాక్‌ అయ్యారంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. జానపదాల్లో కాంతారావు క్రేజ్‌ చూసి ఎంజిఆర్‌ భయపడ్డారని తెలిపారు. ఎవడ్రా వీడు ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడని ఎంజిఆర్ అనడంతో పాటు భయంతో వణికిపోయాడని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. ఎంజిఆర్ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధించే దిగ్గజ నటుడిని, ప్రజానాయకుడిని ఇంతలా కించపరచడం సరికాదని ఎంజిఆర్ అభిమానులు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు మండిపడతున్నారు. తెలుగు నటుడిని ప్రశంసిస్తూ ఎంజిఆర్ ను కించపరిచడం సరికాదని దుయ్యబట్టారు.  గతంలోనూ బ్రహ్మానందం, అలీ వంటి తోటి నటులపై రాజేంద్ర ప్రసాద్ ఇలాగే వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శపాలైన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 11 Mar 2026 8:24 am

Nara Lokesh : ఢిల్లీలో నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు.

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:23 am

ఆ.. నలుగురు కౌన్సిలర్లను సన్మానించిన ఎంవి చారి..

ఆ.. నలుగురు కౌన్సిలర్లను సన్మానించిన ఎంవి చారి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:22 am

Chandrababu : ఇరాన్ యుద్ధ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష

ఇరాన్ యుద్ధ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:17 am

కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు..

కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు.. భువనగిరి/ ఆంధ్రప్రభ : ఈ నెల 13న

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:13 am

North Korea : ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు....దగ్గరుండి పర్యేక్షించిన కిమ్

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి యుద్ధనౌక నుంచి ప్రయోగించిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షలను పరిశీలించారు.

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:04 am

జడ్చర్లలో లిఫ్ట్ పేరుతో మహిళపై గ్యాంగ్ రేప్

జడ్చర్ల:  ఇద్దరు యువకులు ఓ మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జడ్చర్లలో ఓ మహిళ తన ఇంటికి వెళ్లటానికి ఆటో కోసం ఎదురుచూస్తుంది. ఇద్దరు యువకులు అటుగా వెళ్తుండగా లిఫ్ట్ అడిగింది. వాళ్లు ఆమెను బైక్ పై ఎక్కించుకొని జడ్చర్ల శివారులోనికి వెళ్లిన తరువాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఇద్దరు అత్యాచారం చేశారు. వారి నుంచి ఆమె తప్పించుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా బైక్ ను గుర్తించారు. వారిని అతి త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. 

మన తెలంగాణ 11 Mar 2026 7:57 am

Israel - Iran War : మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం ఆందోళనలో ఆసియా దేశాలు

మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరించడంతో ఆసియా దేశాలు దాని ప్రభావంతో అప్రమత్తమవుతున్నాయి

తెలుగు పోస్ట్ 11 Mar 2026 7:52 am

ఆ భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి

తిరుమల: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టిటిడి స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుండి టిటిడి కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దు. అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టిటిడి తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

మన తెలంగాణ 11 Mar 2026 7:47 am

గుది‘బండ’

` దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు కొరత ` హోటల్,పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు ` ఇప్పటికే మూతపడ్డ 20శాతం హోటళ్లు ` గ్యాస్ దొరకకపోతే …

జనం సాక్షి 11 Mar 2026 6:46 am

రాహుల్‌ని మాట్లాడనివ్వడం లేదు

` రేయింబవళ్లు నెహ్రూను విమర్శించేవారు నేడు ఆయనను ప్రశంసిస్తున్నారు ` రాహుల్ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు! ` అమెరికా ముందు భారత ప్రభుత్వం తలవంచింది …

జనం సాక్షి 11 Mar 2026 6:45 am

యుద్ధం ఉగ్రరూపం

` ఊహించని దాడులు చేస్తాం: అమెరికా ` దేఖ్‌లేంగే అంటున్న ఇరాన్ ` ఇజ్రాయెల్, సౌదీ, కువైట్‌లపై ప్రతిదాడి ` దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటన ` …

జనం సాక్షి 11 Mar 2026 6:44 am

ఆగని దాడులు

టెహ్రాన్/దుబాయి: పశ్చిమాసియాలో రెండు వర్గాలు మంగళవారంనాడు పరస్పరం దాడులను మరింత ఉధృతం చేశాయి. గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ లక్షంగా ఇరాన్ దాడులకు పాల్పడగా.. టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ అమెరికా సంయుక్తంగా విధ్వంసం సృష్టించా యి. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో 29 ఏళ్ల మహిళ మరణించింది. ఓ భవంతి పాక్షికం గా దెబ్బతింది. బహ్రెయిన్ కూడా దాడిని ధ్రువీకరించింది. సౌదీ అరేబియాలోని తూ ర్పు ప్రాంతంలో చమురు క్షేత్రాలే లక్షంగా ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. రువాయిస్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్ని మాపక దళాలను రంగంలోకి దించారు. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో రెండింటిని కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని కూడా తె లిపింది. కువైట్‌పై కూడా ఇరాన్ డ్రోన్ దా డులకు పాల్పడిందని, అయితే వాటిల్లో ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు కువైట్ ఒక ప్రకటనలో తెలిపింది. జెరూసలెం, టెహ్రాన్‌లలోనూ వరుస పేలుళ్లు, సైరన్ల శబ్ధాలు వినపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా అడ్డుకుందని ప్రకటించారు. ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతం లో ఉన్న అమెరికా కాన్సులేట్‌పై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇక్కడి అమెరికా ఎయిర్‌బేస్ లక్షంగా కూడా దాడులు చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఇరాన్ దాడులను యుఎఇ తీవ్రంగా ఖండించింది. దౌత్య కార్యాలయాలను ల క్షంగా చేసుకోవడం సరైంది కాదని మండిపడింది. అదే విధంగా ఈ యుద్ధంలో తమ దేశాన్ని లక్షంగా ఎంచుకోవడాన్ని కూడా ఖండించింది. ఖతార్ రాజధాని దోహాలోకూడా భారీ శబ్దాలు వినపడ్డాయి. ఇది ఇరాన్ పనేనని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని దోహా యంత్రాంగం సూచించింది. యుఎఇలో జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఓ అమెరికా సైనికుడు కూడా మృత్యువాత పడ్డట్లు ప్రకటించారు. ఇరాన్ కెర్మన్ విమానాశ్రయంపై దాడులు.. ఇరాన్‌లోని కెర్మన్ విమానాశ్రయంపై మంగళవారంనాడు అమెరికాఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపాయి. విమానాశ్రయంతో పాటు కొన్ని విమానాలు కూడా ధ్వంసమైనట్లు స్థానికి మీడియా తెలిపింది. కెర్మన్ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం కూడా దీన్ని ధ్రువీకరించింది. ఇప్పటికే మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని కూడా ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించి దెబ్బతీసింది. మరోవైపు హెజ్బొల్లాలు లక్షంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. మిలిటెంట్లకు ఆర్థిక కేంద్రంగా ఉన్న అల్ ఖర్ద్ అల్ హసన్‌ను నేలమట్లం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలపై సంయుక్త బలగాలు దాడులు చేసినట్లు సమాచారం.

మన తెలంగాణ 11 Mar 2026 6:00 am

యుద్ధ ప్రకంపనలు సిలిండర్

న్యూఢిల్లీ : దేశీయంగా ఉత్పత్తి చేసే నాచురల్ గ్యా స్‌ను ఇప్పుడు ప్రాధాన్యత ఆధారంగా సరఫరా చేయనున్నారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టా కేంద్ర ప్రభుత్వం అత్యవసర వస్తువుల చట్టాన్ని అమలు చేసింది. దేశంలో వం ట గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపా రు. ఇప్పటివరకు వాహనాలకు ఉపయోగించే సి ఎన్‌జి (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్), ఇళ్లకు పైప్ ద్వారా వచ్చే గ్యాస్ ఈ రెండింటిని మాత్రమే ప్రా ధాన్యత రంగాలుగా నిర్ణయించారు. ఇప్పుడు వం ట గ్యాస్‌ను కూడా ప్రాధాన్య జాబితాలో చేర్చారు. సిఎన్‌జి, ఎల్‌పిజి మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించగా, దీనిని గత 6 నెలల సగటు వినియోగానికి సమానంగా గ్యాస్ అందించాలనే ఆదేశాలు జారీ చేశారు. రెండోది ఎరువుల కర్మాగారాలకు 70 శాతం గ్యాస్ అందించనున్నారు. మూడో సె క్టార్ విషయానికొస్తే, టీ పరిశ్రమలు, ఇతర కర్మాగారాలకు 80% సరఫరా చేయాలని నిర్ణయించారు. వంట గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర అధికారులు వెల్లడించారు. రెస్టారెంట్లకు వంట గ్యాస్ కొరత దేశంలో వాణిజ్య వంట గ్యాస్ కొరత పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు ఇబ్బందులు పెరిగాయి. ప్రభుత్వం విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి ప్రాధాన్య రంగాలకు మాత్రమే గ్యాస్ సిలిండర్లు ముందుగా అందించాలనే నిర్ణయం తీసుకుంది. దీంతో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి పెద్ద నగరాల్లో రెస్టారెంట్ల కార్యకలాపాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పరిశ్రమ ప్రతినిధులు హెచ్చరించారు. సాధారణంగా రెస్టారెంట్లు ఎక్కువ నిల్వలు చేసుకోలేదు. దీంతో రెస్టారెంట్లు మెనూలను తగ్గించడం, పని గంటలను తగ్గించడం లేదా తాత్కాలికంగా మూసివేయడం గురించి ఆలోచిస్తున్నాయి. గ్యాస్ కొరత కొనసాగితే ఆహార పంపిణీ సేవలపై కూడా ప్రభావం పడవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం అక్రమ నిల్వలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ బుకింగ్ మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. --- అత్యవసర వస్తువుల చట్టం అమలు ఎందుకు? దేశంలో వంట గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండటంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 31 మిలియన్ టన్నుల వంట గ్యాస్ వినియోగం ఉండగా, దేశీయ ఉత్పత్తి కేవలం 12 మిలియన్ టన్నుల వరకు మాత్రమే ఉంది. దీనివల్ల విదేశాల నుంచి గ్యాస్‌ను భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. యుద్ధ పరిస్థితులు కొనసాగితే సరఫరా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ చట్టం ద్వారా నిల్వలు నియంత్రించడం, సరఫరాను మార్గనిర్దేశం చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 8 శాతం డౌన్ అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. మూడు రోజుల పెరుగుదలకు ముగింపు పలుకుతూ చమురు ధరలు 8 శాతానికి పైగా తగ్గాయి. దేశీయ వస్తువుల మార్పిడి మార్కెట్లో ఒక బారెల్ చమురు ధర రూ.8,069 పడిపోయింది. యుద్ధ పరిస్థితులు తగ్గే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించడంతో మార్కెట్‌లో భయాలు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముందుగా సరఫరా అంతరాయం ఉంటుందనే భయంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఒక దశలో బారెల్ ధర రూ. 10 వేలకు పైగా చేరింది. అయితే యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతాయని సంకేతాలు రావడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అవసరమైతే నిల్వల నుంచి చమురు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక మంత్రులు కూడా తెలిపారు.

మన తెలంగాణ 11 Mar 2026 5:30 am

కూల్చిన చోటే ఇండ్లు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమం గా నిర్మించిన 750 ఇళ్ళను కూల్చిన స్ధలంలోనే బుధవారం భూదాన్ నిర్వాసితుతలకు ఇళ్ళ ప ట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈమేరకు ఖ మ్మం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. డి ప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూశా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీ దుగా ఈ పట్టాలను బాధితులకు అందచేస్తారు. గత నెల 24న 750 ఇళ్ళను కూల్చివేసిన విషయం లో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఎక్కడయితే ఇళ్ళను కూ ల్చారో అక్కడే ఇంటి స్ధలాలను పంపిణీ చేయాల ని నిర్ణయించారు. గడిచిన పక్షం రోజుల్లో కూల్చి న ఇళ్ళపై 24మంది రెవెన్యూ అధికారులు ఊరూ ర తిరిగి విచారణచేసి అర్హుల లేక్క తేల్చారు. మొ త్తం 730 ఇళ్ళను కూల్చివేయగా ఆరోజు బా ధితులు ఇచ్చిన వివరాల మేరకు వారి స్వగ్రామాని కి వెళ్ళి విచారణ చేశారు. ఈవిచారణలో చాలా మంది అనర్హులు ఉన్నట్లుతేల్చారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు,కానిస్టేబుళ్ళు, అంగన్ వాడీ టీచర్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 730 కు టుంబాల్లో 412 మంది అర్హులుగా నిర్ధారించారు. మిగిలిన వారు అనర్హులు(బోగస్ )గా ప్రకటించనున్నారు. అర్హులుగా గుర్తించిన వారిలో సొంత ఇంటి స్ధలం లేని 311 మందికి ఇంటి ప్లాట్ పట్టాతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు (రూ.5లక్షల ఆర్దిక సాయం) ప్రొసిడింగ్ పత్రాలను అందజేయనున్నారు.సొంతంగా ఇంటి స్ధలం ఉన్న మరో 101 కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేస్తారు. మొత్తంగా 412 కుటుంబాలకు శాశ్వత గృహ యోగం కల్పించనున్నారు. కూల్చిన చోటే అర్హులైన పేదలకు ఇంటి స్థలం పట్టాలను అందించేందుకు అఘమేఘాలమీద ఏర్పాట్లు చేస్తున్నారు. భూదాన భూముల్లో ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 311 మందికి వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే ఇంటి స్థలం పట్టా కాగితాలను ప్రదానం చేయనున్నారు. తమకు కూల్చిన చోటనే ఇళ్ళ పట్టాలను మంజూరు చేసి ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని భూదాన నిర్వాసితులు గత పక్షం రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా జిల్లా యంత్రాగం రఘునాధపాలెం,ఏదులాపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని భావించారు. కానీ ప్రజల నుంచి రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్నందున కూల్చిన చోట నీడ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈనెల 15లోగా బాధితులందరికీ ఇంటి పట్టాలను పంపిణి చేస్తామని, ఈ పక్రియ ఈనెల 10 కల్లా పూర్తి చేస్తామని ఇటివల ఖమ్మం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ్ల సమావేశంలో వెల్లడించిన విధంగానే నాలుగు రోజుల ముందే వెలుగుమట్ల భూనిర్వాసితుల కళ్ళలో అనందం వెలుగులు నింపేలా పట్టాలను పంపిణీ చేయనున్నారు. 

మన తెలంగాణ 11 Mar 2026 5:00 am

ఆరు గ్యారెంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత క ల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆ ర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ బడ్జెట్ ద్వారా ఎంత కేటాయించారో బహిర్గతమవుతుందని అన్నారు. అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ... ఆ హామీని, ఆ మాటను మరిచిపోయిందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఈ బిల్లు ద్వారా ఎండగడతామని అన్నారు. 6 గ్యారంటీలలో పేర్కొన్న మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, రైతన్నలు వంటి తెలంగా ణ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మో సం నేపథ్యంలో... ఆయా వర్గాల తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తె లిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మొదట క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భం గా కెటిఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ స భ్యులు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి 60శాతం సమయం అయిపోతుందని తెలిపారు. గండిపేటలోని గోల్కొండ రిస్టార్ట్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల ఉమ్మడి ఓరియెంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో తాము విశ్లేషణ చేసుకున్నామన్నారు. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే అంకెల గారడీలపై కూడా విశ్లేషించామని తెలిపారు. తమ పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు మాట్లాడారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ కమిటీలు ఏమీ లేవని విమర్శించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని తమ పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారని పేర్కొన్నారు. ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ నడపాలని లేదని, అందుకే తూతూ మంత్రంగా ఈ అసెంబ్లీ సమావేశాలను నడుపుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిందని...కానీ, ఇచ్చిన హామీలకు చట్టబద్ధత ఏమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. అసెంబ్లీలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ని ప్రయోగిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పెడుతున్న ఈసారి మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతుందని, ఈ బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయిందని, హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ని ప్రయోగిస్తున్నదని మండిపడ్డారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో పచ్చిగా అబద్ధాలను, అసత్యాలను మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నదని ఆరోపించారు. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టారని ఆరోపించారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బిసి, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. శాసనమండలి, శాసనసభ మధ్య తమ పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. మూసీ పేరుతో మూటల వేటకు వ్యతిరేకం మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ, ఆ పేరుతో జరిగే మూటల వేటకే తాము వ్యతిరేకమని కెటిఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, 420 హామీల అమలుకు, రైతన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతున్నదని... కానీ, వీటన్నింటినీ పక్కన పెట్టి మూసీ పేరుతో అవినీతి కార్యక్రమానికి తెరలేపిందని అన్నారు. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు... కానీ, ఒకవైపు డబ్బులు లేవు, అప్పులయ్యాయని చెబుతూనే మూసీలో లక్షన్నర కోట్ల రూపాయల అవినీతితో లక్షలాది మంది ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు అని, కేవలం ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నారని ఆరోపించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసీలో జరిగే లక్షల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం కాదు, అసలు జీరో వ్యాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువ ఉన్నదని అన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు అని, తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియదని చెబుతున్నారని విమర్శించారు. డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాహుల్ బంధు పథకాన్ని పక్కన పెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. రెండున్నర సంవత్సరాలలో ఒక్క ఇల్లు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టిందంటే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, దానికి తాను ఇంకా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాము కట్టిన ఫ్లైఓవర్లు, ఇళ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి మావి అని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని కెటిఆర్ విమర్శించారు. 

మన తెలంగాణ 11 Mar 2026 4:30 am

కుంభమేళా తరహాలో పుష్కరాలు

మనతెలంగాణ/హైదరాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే స్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ కు మరింత పేరు తెచ్చేలా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి స మావేశంలో సభ్యులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు. పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణను సమీక్షించి అధికారులకు సబ్ కమిటీ దిశా నిర్దేశం చేసింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందన్నారు. అదే స్ఫూర్తితో మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు.... 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారన్నారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలివచ్చే అవకాశముందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామన్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా పనుల్ని ప్రారంభించేలా ముమ్మర కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ నెల చివరి నాటికి డిపిఆర్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. తొలి దశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ -1’ కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి ఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ఎమర్జెన్సీ రూట్, ఆధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పుష్కర ఏర్పాట్లలో రాజీపడే ప్రసక్తే లేదని, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహారించాలని అధికారులను కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశించింది.

మన తెలంగాణ 11 Mar 2026 4:00 am

నిలోఫర్‌లో వికటించిన ఫ్లూయిడ్స్

మన తెలంగాణ/ నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఒకే సారి 15 మంది పిల్లలు అస్వస్థులయ్యారు. వెనకా ముం దు చూసుకోకుండానే హడావుడిగా నీళ్లు, ఫ్లూ యిడ్‌ను ఎక్కించడంతో అది కాస్త వికటించి బాధిత చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి వర్గా ల్లో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు వైద్య సిబ్బంది నిర్లక్షాన్ని బయటికి పొక్కకుండా శతవిధాలా ప్రయత్నించారు. తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు ఆఘ మేఘాలమీద చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించారు. ఫ్లూయిడ్ ఎక్కించన తర్వాతే పిల్లలు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వైద్యులు అనారోగ్యపాలైన రోగులకి ఎలాంటి సమస్యలు రాకుండా దగ్గరుండి మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఏలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనికి కారకులను గుర్తించే పనిలో అధికారులు రంగంలోకి దిగారు. వివిధ జిల్లాల నుంచి ఇన్ఫెక్షన్లు సోకి ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యారు. వారిని కొత్త బ్లాక్‌లో వివిధ వార్డుల్లో చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరి నిర్లక్షం వల్లనే పిల్లలు అస్వస్థలకు కారణమని పలువురు చెబుతున్నారు. పిల్లలకి ఫ్లూయిడ్ ఎక్కించడంలోను ఆజాగ్రత్తల వల్లనే వికటించి పిల్లల ఆరోగ్యం దెబ్బతిన్నది. వారికి ఒక్కసారిగా వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు రావడం పిల్లల తల్లిదండ్రులు, సహాయకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి నర్సుల వల్లనే తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఫ్లూయిడ్ వికటించడం, పిల్లలు అస్వస్థులు కావడాన్ని ఆస్పత్రి ఉన్నత వర్గాలు తీవ్రంగా పరిగణించారు. సిబ్బంది నిర్లక్షం, తప్పిదాల వంటివి నిగ్గు తేల్చేందుకు విచారణకి ఆదేశించాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల పరిస్థితి నిలకడగా ఉంది : ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆచార్య విజయకుమార్ ఆస్పత్రిలో పిల్లల పరిస్థితి మెరుగ్గా ఉందని, వారు త్వరంగా కోలుకుంటున్నారని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య విజయకుమార్ తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇప్పటికే నలుగురిని డిశ్చార్జి చేశామని, మిగతా వారి పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. వారిని కూడా ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపిస్తామని విజయకుమార్ వివరించారు. చిన్న సమస్యను పెద్దదిగా చేయడం, వదంతులు, పుకార్లు వ్యాపింపచేయడం శ్రేయస్కరం కాదన్నారు.

మన తెలంగాణ 11 Mar 2026 3:30 am

బుధవారం రాశి ఫలాలు (11-03-2026)

మేషం ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభం కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. మిధునం అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. కర్కాటకం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు. సింహం చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కన్య తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. తుల ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది. వృశ్చికం వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ధనస్సు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. మకరం దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభం ఋణ భారం పెరిగి నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి. మీనం ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.  

మన తెలంగాణ 11 Mar 2026 12:10 am

బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా భారత్ 5000 టన్నుల డీజిల్

 బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా 5000 టన్నుల డీజిల్‌ను పైపులైన్ ద్వారా బుధవారం సరఫరా చేయడానికి భారత్ సన్నద్ధమైందని మంగళవారం అధికారి ఒకరు తెలిపారు. అస్సాం లోని ప్రబాతిపూర్ డిపో నుంచి సోమవారం నుంచే డీజిల్‌ను పైపులైన్ ద్వారా తీసుకోవడం ప్రారంభమైందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తం 5000 టన్నులు పంపింగ్ చేయడానికి 45 గంటలు పడుతుందన్నారు.ప్రతిగంటకు 113 టన్నుల డీజిల్‌ను పంప్ చేస్తున్నట్టు చెప్పారు. 15 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా ఏటా 180000 టన్నుల డీజిల్ భారత్ నుంచి సరఫరా చేయడానికి అంగీకారమైనట్టు తెలిపారు. 

మన తెలంగాణ 10 Mar 2026 11:21 pm

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయించింది. జల్ జీవన్ మిషన్‌ను 2028 డిసెంబర్ వరకు పొడిగించింది. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకం గ్రామీణ భారతంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించింది. ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రం సాయంగా మరో రూ.3.59 లక్షల కోట్లను అందించాలని నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం వెలువరించింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ముధురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రపంచంతో ఆ పట్టణాన్ని అనుసంధానిస్తామని అన్నారు. తద్వారా విద్యా, ఆరోగ్య హబ్‌గా మధురై త్వరలో మారబోతోందని అన్నారు. సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్ మద్య రూ.2,905 కోట్లతో నాలుగు లైన్ల రహదారి, రూ.3,839 కోట్లతో బద్నావర్-థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదించినట్లు అశ్విని వివరించారు. రూ.3,631 కోట్లతో జెవార్ విమానాశ్రయం-, ఫరీదాబాద్ సెక్షన్‌ను కలిపే 6 లైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపామన్నారు. అదే విధంగా భారత్‌తో సరిహద్దు పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డిఐలపై కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో అన్ని దేశాలకు నిబంధనలు సరళతరం చేశామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్న అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తొలగిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు ప్రెస్‌నోట్3ని సవరించామని తెలిపారు.

మన తెలంగాణ 10 Mar 2026 11:18 pm

నిరసన ప్రదర్శన చేస్తే అరెస్టు చేస్తారా ?: మంత్రి బండి

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రైతులు నిరసన ప్రదర్శన చేస్తే నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేస్తారా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీరు ఇచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రూ.3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేది కదా? అని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరు ఇవ్వని రైతు ద్రోహి కెటిఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గత బిఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు వరసుగా పంటలు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోతే ఆయా ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తమకు న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయం అని ఆయన విమర్శించారు. వెంటనే వారిని విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేవారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.

మన తెలంగాణ 10 Mar 2026 10:38 pm

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 10 Mar 2026 10:00 pm

ఎసిబి వలలో చిక్కిన యూసిడి విభాగం సీఈఓ మురళి

కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్‌లో యూసీడీ విభాగంలో సీఈఓగా పని చేస్తున్న మురళిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మూసాపేట సర్కిల్ పరిధిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ (ఔట్సోర్సింగ్) ఏవో కే మురళి మూసాపేట సర్కిల్ పరిధిలో మహిళా పొదుపు సంఘానికి చెందిన మహిళల నుండి 20 లక్షల మంజూరు చేసిన రుణాన్ని ప్రాసెస్ చేసేందుకు గాను రూపాయలు 18,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ముందుగా ఎసిబి అధికారులను సంప్రదించగా వారి పథకం ప్రకారం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చెల్లించడానికి వెళ్లింది. దీంతో ముందుగా వేసుకున్న ప్రకారం ఫిర్యాదు ఆధారంగా ఎసిబి అధికారులు ఉచ్చుపన్నడంతో మురళి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుకున్నారు. అనంతరం అధికారులు ఆయన వద్ద నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో మూసాపేట్ సర్కిల్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సంబంధిత కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం

మన తెలంగాణ 10 Mar 2026 9:57 pm

రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:57 pm

భవిష్యత్తు ఆరోగ్యానికి భద్రత –గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు..

భవిష్యత్తు ఆరోగ్యానికి భద్రత – గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు.. నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:51 pm

దుర్గగుడిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి..

దుర్గగుడిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి.. భవానిపురం, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:43 pm

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.!

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.! అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్జిల్లా

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:39 pm

దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష రూ.25 లక్షల చోరీ.. రెండు సంవత్సరాల

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:35 pm

ఈ నెల 13 నుండి చర్లపల్లి, కామాఖ్య మధ్య నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కూడిన కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 13న కామాఖ్య నుండి ప్రారంభం కానుంది. ఈ కొత్త రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఈశాన్య రాష్ట్రాలకు సింహద్వారంగా నిలుస్తున్న అస్సాం రాష్ట్రంతో అనుసంధానిస్తుంది. ఇది ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల వైపు ప్రయాణించే దూర ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన తక్కువ ప్రయాణ ఖర్చుతో కూడిన ప్రయాణాన్నిఅందించడానికి దోహదపడుతుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మార్గమధ్యంలో నున్న శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్ , పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణ దిశలలో ఆగుతుంది.

మన తెలంగాణ 10 Mar 2026 9:30 pm

టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు..

టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు.. భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పోలీస్

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:28 pm

ప్రపంచ ఆరోగ్య రాజకీయాల్లో కొత్త మలుపు .. భారత్ వైఖరి ఎటువైపు ?

ప్రపంచ ఆరోగ్య రాజకీయాల్లో కొత్త మలుపు .. భారత్ వైఖరి ఎటువైపు ?

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:22 pm

హామీల అమలులో కేంద్రం నిర్లక్షం: మంత్రి పొన్నం

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహారిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కి లేఖ రాశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం దయ కాదని, అది తెలంగాణ ప్రజల హక్కు. అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు పనులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చ లో తెలంగాణ కి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చర్చించాలని ఆయన సూచించారు. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రతి ఏడాది బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నదని ఆయన తెలిపారు. ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న బడ్జెట్‌లో సగం నిధులైన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష వద్దు అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్‌లు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు వాగ్దానం చేసిన కోచ్ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 10 Mar 2026 9:20 pm

రేపు తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న శివప్రతాప్ శుక్లా

రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో సిఎం రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ కె. రామకృష్ణా రావు, డిజిపి శివధర్ రెడ్డిలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా 2014 ఎన్డీఏ కేబినెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్‌గా ఆయన ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి లోక్‌భవనోన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మరోవైపు, బదిలీపై మహారాష్ట్రకు వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మ సోమవారం రిలీవ్ అయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు సిఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన వీడ్కోలు పలికారు.

మన తెలంగాణ 10 Mar 2026 9:06 pm

చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు..

చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రమాదాల

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:03 pm

Vijay, BJP and the NDA Confusion in Tamil Nadu Politics

The recent expulsion of BJP Tamil Nadu spokesperson A. N. S. Prasad has raised questions about what the party actually wants when it comes to actor Vijay and his party, Tamilaga Vetri Kazhagam. The controversy began when Prasad publicly suggested that Vijay should join the NDA if he truly wants to stop the DMK from […] The post Vijay, BJP and the NDA Confusion in Tamil Nadu Politics appeared first on Telugu360 .

తెలుగు 360 10 Mar 2026 8:59 pm

Music Labels’ pay puts Anirudh on Top Slot

There are a number of top music composers from the South who are delivering exceptional work. One music composer who dominated everyone is Anirudh Ravichander. He is considered for all the films of top stars and the producers are ready to pay him big money. Devi Sri Prasad and Thaman are on the top in […] The post Music Labels’ pay puts Anirudh on Top Slot appeared first on Telugu360 .

తెలుగు 360 10 Mar 2026 8:57 pm

Telangana Police Arrest 208 in Massive Cybercrime Operation Across 137 Bank Branches

In a major operation against cybercrime networks, Telangana Police arrested 208 people during a statewide crackdown on mule bank accounts used to facilitate cyber frauds across the country. The operation, titled “Operation Crackdown 1.0,” was carried out under the supervision of the Telangana State Cyber Security Bureau (TGCSB) after analysing cyber fraud data from the […] The post Telangana Police Arrest 208 in Massive Cybercrime Operation Across 137 Bank Branches appeared first on Telugu360 .

తెలుగు 360 10 Mar 2026 8:55 pm

నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లి స్వాధీనం

కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, హబీబ్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.20లక్షల విలువైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్, గటాల మసీదు సమీపానికి చెందిన మహ్మద్ షారూఖ్ ‘షెహజాదా ఫుడ్ మాస్టర్ పేరు సంస్థను నిర్వహిస్తున్నాడు. నిందితుడు కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి హోల్‌సేల్ కిరాణా షాపులు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్‌లకు సరఫరా చేసేవాడు. నాసిరకం అల్లంవెల్లుల్లి కొనుగోలు చేసి వాటిలో అసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు వంటి రసాయనాలను కలిపి ప్లాస్టిక్ కంటైనర్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ప్టాస్టిక్ డ్రమ్ముల్లో మూత పెట్టకుండా ఉంచాడు, దీంతో దుమ్ము, ఈగలు, ఇతర కలుషితాలకు గురై, వినియోగానికి పనికిరాని కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తీసుకుని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ 2018లోనే ముగిసింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. రాఘవేందర్, ఎస్సై జి. శ్రీకాంత్, హబీబ్ నగర్ ఎస్సై కె. శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Mar 2026 8:52 pm

దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధం: ఇరాన్

 త్వరలో యుద్ధానికి ముగింపు లభించే అవకాశం ఉందని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తుంటే దానికి భిన్నంగా ఇరాన్ యుద్ధానికి మరింత కాలు దువ్వుతోంది. రెండు దశాబ్దాలుగా అమెరికా వివిధ దేశాలపై చేస్తున్న యుద్ధాలు, ఆ దేశ సైన్యం ఏ రకంగా ఓటమి పాలవుతున్నది అధ్యయనం చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అలీ అరాగ్చి అన్నారు. మా రాజధాని టెహ్రాన్‌పై బాంబు దాడులు చేసినా మా సామర్థంపై అది ఏమాత్రం ప్రభావం చూపదు. మేం యుద్ధం కొనసాగించేందుకే సిద్ధంగా ఉన్నాం. అది ఎప్పుడు, ఎలా ముగుస్తుందన్నది తెలియదు కానీ, ముగింపు మాత్రం మేమేం చేస్తాం అని అరాగ్చీ అన్నారు. ఇక ఇరాన్ సెక్యూరిటీ అధికారి అలీ లారిజాని ట్రంప్‌కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. మీ గాలి హెచ్చరికలకు ఇరాన్ భయపడబోదని అన్నారు. 20 రెట్లు కాదు.. అంతకన్నా ఎక్కువ చేసినా ఇరాన్‌ను తుడిచిపెట్టలేరని అన్నారు. మీ అధ్యాయం ముగిసిపోకుండా చూసుకోండి అని ట్రంప్‌ను లారిజాని హెచ్చరించారు.

మన తెలంగాణ 10 Mar 2026 8:47 pm

‘గోపీచంద్ 33’లో సత్యవతిగా రీతు..

మ్యాచో స్టార్ టి.గోపీచంద్... విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ‘గోపీచంద్33’తో రాబోతున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రీతు వర్మ... టి.గోపిచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె పాత్ర సత్యవతిని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. పోస్టర్‌లో రీతూ వర్మ కమాండింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. విల్లు ఎక్కుపెట్టి ఏకాగ్రతతో కనిపిస్తూ, ఒక యోధురాలిలా ధైర్యం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నారు. పీరియడ్ స్టైల్ దుస్తులు, సంప్రదాయ ఆభరణాలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్న లుక్ ఆమె పాత్రలోని పవర్ ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సినిమాలో రీతూ వర్మ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దంలో పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక గిరిజన తెగకు చెందిన మహిళగా ఆమె పాత్ర ఉంటుంది. ఆ తెగ సంస్కృతి, ధైర్యం, సహనాన్ని ప్రతిబింబించేలా సత్యవతి పాత్ర రూపుదిద్దుకుంది. తన నటన ద్వారా రీతూ వర్మ ఆ పాత్రకు సహజత్వం, భావోద్వేగాలను తీసుకురానున్నారు. ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయి ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. సృజనాత్మక కథనాలకు పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి, భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఈ సినిమాకు సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.

మన తెలంగాణ 10 Mar 2026 8:42 pm

సాగునీటి కోసం రైతుల తండ్లాట

 ప్రభుత్వం కాళేశ్వరం 11వ ప్యాకేజీ ద్వారా అంసపూర్తిగా ఉన్న పనులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ మానేరు బ్రిడ్జిపై మండల రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బిజెపి జిల్లా అద్యక్షులు రెడ్డబోయిన గోపి రైతులకు మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు నిరసన ఆపేది లేదంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దాదాపు ఆరగంట సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సిరిసిల్ల, సిద్దిపేట రహదారుల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ సిఐ నాగేశ్వర్‌రావు జిల్లా ఎస్‌పి మహేష్ బి గీతేకు పరిస్థితి వివరించారు. జిల్లా అద్యక్షులు గోపితో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు చేయవద్దని సూచించారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. తమ సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదంటూ బిజెపి నాయకులు, రైతులు ఆందోళన తీవ్రం చేశారు. పోలీసులు బిజెపి నాయకులను, రైతులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలంలో 11వ ప్యాకేజి రంగనాయక సాగర్ కెనాల్ నిర్మాణ పనులకు రూ.3కోట్లు కేటాయించి పనులు చేపట్టకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. మండలంలోని 15 గ్రామాలకు నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ,స్థానిక ఎమ్మెల్యే కెటిఆర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కెనాల్ నిర్మాణం జరిగితే 10వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. నిధులు మంజూరైనా భూసేకరణ పనులు చేపట్టలేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అన్నారు. బిజెపి రైతు పోరాటాలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అద్యక్షులు రాగుల రాజిరెడ్డి,మండల బిజెపి అద్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు,సిరిసిల్ల వంశీ, కాళీచరణ్, రైతులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Mar 2026 8:35 pm

Aussie Entry గ‌ల్ఫ్ లో పెద్ద‌న్న మాయం Andhra prabha Analysis

Aussie Entry గ‌ల్ఫ్ లో పెద్ద‌న్న మాయం Andhra prabha Analysis (

ప్రభ న్యూస్ 10 Mar 2026 8:09 pm

ഫാക്ട് ചെക്ക്: യുഎസ് തകർത്ത ഇറാൻ കപ്പലിൻ്റെ വിവരം കൈമാറിയെന്ന് ഇന്ത്യൻ സൈനിക മേധാവി? പ്രചാരണം വ്യാജം

ഐആർഐഎസ് ദേനയുടെ വിവരം ഇസ്രായേലിന് നൽകിയെന്ന് പറയുന്ന വീഡിയോ എഐ നിർമിതമാണ്

తెలుగు పోస్ట్ 10 Mar 2026 8:07 pm

KVN Productions: Big Advances paid in Telugu Cinema

KVN Productions is backed by top real estate firm named Prestige Group. They have ventured into Tamil and Kannada languages. They are now in plans to do big films in Telugu and they have paid big advances for several top actors and directors. KVN Productions will make their debut in Telugu with Megastar Chiranjeevi’s film […] The post KVN Productions: Big Advances paid in Telugu Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 10 Mar 2026 8:04 pm

శ్రీశైలం వెళ్లే భక్తులు ఓవర్‌లోడ్ ప్రయాణాలు చేయవద్దు..

శ్రీశైలం వెళ్లే భక్తులు ఓవర్‌లోడ్ ప్రయాణాలు చేయవద్దు.. ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:50 pm

52 school |ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి

52 school | ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి తిరువూరులో నివాళులు అర్పించిన

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:47 pm

అవమానాలు ఇంకెంతకాలం భరించాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి ప్రాధాన్యత లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో ఉన్నానని, అవమానాలు ఇంకెంత కాలం భరించాలని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమయం, సందర్భం వచ్చినపుడు నిర్ణయం తీసుకుంటానని, మంగళవారం జగిత్యాల కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఇటీవల పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏ అంశమైనా మీకు తెలియకుండా జరగదు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజే ఇక్కడ పరిస్థితి గురించి చెప్పాను, భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా అన్న నిర్ణయం త్వరలో చెబుతా అన్నారు. పార్టీ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా, కార్యకర్తలకు సంప్రదించి మీడియా ద్వారానే వెల్లడిస్తానని అన్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (బీఆర్‌ఎస్ నుంచి వచ్చినవారు)కు ప్రాధాన్యత ఇవ్వడం, మున్సిపల్ ఎన్నికల పరిణామాలపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజీపీ, బీఆర్‌ఎస్ నాయకులు తనను సంప్రదించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో జగిత్యాలలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

మన తెలంగాణ 10 Mar 2026 7:42 pm

ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం……

ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం…… పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రకృతి

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:32 pm

war impact |ఈఎంఐలపై ప్రభావం ఉంటుందా?

war impact | ఈఎంఐలపై ప్రభావం ఉంటుందా? war impact | యుద్ధం

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:30 pm

పవర్ లిఫ్టింగ్ విజేతకు అభినందనలు

పవర్ లిఫ్టింగ్ విజేతకు అభినందనలు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పవర్ లిఫ్టింగ్ పోటీ

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:27 pm

చిన్నారుల ప్రాణం కోసం.. వికలాంగుడి మహా విరాళం

చిన్నారుల ప్రాణం కోసం.. వికలాంగుడి మహా విరాళం పిల్లల వైద్యం కోసం రూ.

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:24 pm

మూడేళ్లలో గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాలు: భట్టి విక్రమార్క

రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలన్నింటికి శాశ్వత భవనాలు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్కతో కలిసి ఆయా శాఖలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్థలాలు అందుబాటులో ఉన్నచోట తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. చిన్నారుల మెదడు బలంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టిక ఆహారంతో పాటు బోధనా పద్ధతులతో వారికి తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. పట్టణాల్లో రహదారులపైన కొంత మంది చంటి బిడ్డలను పెట్టుకొని యాచక వృత్తి కొనసాగిస్తున్న వారందరినీ శిశు విహార్‌లో తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్లపై చంటి బిడ్డలు పట్టపగలు ఎండకు, వర్షాకాలంలో వానకు తడిసి వారి విలువైన బాల్యం మసకబారి పోతుందని అన్నారు. ఆ విధంగా జరగడానికి అవకాశం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం తెలిపారు.

మన తెలంగాణ 10 Mar 2026 7:14 pm

కూటమి ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదు

కూటమి ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదు కోడూరు, ఆంధ్రప్రభ : ఈ ప్రభుత్వం

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:07 pm

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేయాలి

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేయాలి స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:02 pm

మల్లన్న భక్తులకు పోలీసు శాఖ సూచనలు

మల్లన్న భక్తులకు పోలీసు శాఖ సూచనలు కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: మహారాష్ట్ర, కర్ణాటక,

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:02 pm

మద్యం కోసం మగ శిశువును అమ్మేసిన తల్లి

మద్యానికి డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డనే కసాయి తల్లి విక్రయించింది. మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని లింగసానిపల్లి తాండాకు చెందిన మంజుల అనే మహిళ మహిపాల్ అనే వ్యక్తితో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. మంజుల ఫిబ్రవరి 10న మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే మద్యానికి బానిసైన మంజుల డబ్బులు లేకపోవడంతో తన బిడ్డను విక్రయించాలని నిర్ణయించింది. మంజుల తన ప్రియుడితో కలిసి కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ దంపతులకు రూ.1.70 లక్షలకు శిశువును విక్రయించింది. మగశిశువు పుట్టిన వారం రోజులకే ఈ దారుణం జరిగింది. అయితే బాలింతకు ఇవ్వాల్సిన గుడ్లు, ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో అంగన్‌వాడీ టీచర్ మంజుల ఇంటికి వెళ్లింది. శిశువు లేకపోవడాన్ని గమనించిన అంగన్‌వాడీ టీచర్ అనుమానంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ వెంటనే స్పందించిన అధికారులు శిశువును, తల్లి మంజులను సఖి కేంద్రానికి తరలించారు. మహిపాల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మంజులతో కలిసి జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 10 Mar 2026 6:56 pm

కార్పోరేషన్ లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

కార్పోరేషన్ లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు విజయవాడ ఆంధ్రప్రభ : విజయవాడ

ప్రభ న్యూస్ 10 Mar 2026 6:51 pm

అర్హులైన ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదు: ప్రధాన ఎన్నికల కమిషనర్

ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరును తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి లోటుపాట్లను సహించేది లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో వరుస సమావేశాల అనంతరం మీడియాతో సీఈసీ మంగళవారం నాడు మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో 80,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో 61,000 బూత్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని సీఈసీ చెప్పారు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత, అవకతవకల నిరోధానికి అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ అమలు చేస్తామని తెలిపారు. రాజ్యంగం ప్రకారమే ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించామని, పూర్తిగా పారదర్శకతంగా జరిగిందని తెలిపారు. మరోవైపు సీఈసీకి మంగళవారంనాడు కూడా నిరసనల సెగ తప్పలేదు. ఉదయం దక్షిణేశ్వర్ కాళి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చినప్పుడు కొందరు నల్లజెండాలతో నిరసన తెలుపుతూ ‘గో బ్యాక్’ నినాదాలు చేశారు. 

మన తెలంగాణ 10 Mar 2026 6:49 pm

పశ్చిమ బెంగాల్ సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం

 పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనుమానాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారి పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏంటని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నించారు. జ్యుడిషియల్ అధికారులను కోర్టు నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తుతూ దాఖలైన తాజా పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది.‘న్యాయాధికారుల నుంచి ఇంతకంటే ఇంకా ఎలాంటి త్యాగాలు మీరు కోరుకుంటున్నారు? తొలిగించిన ఓటర్లకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు న్యాయాధికారులు ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. వారిని అనుమానించే చర్యలను సహించేది లేదు’ అని సీజెఐ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా నుంచి తమను తొలగించారంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలిస్తున్న న్యాయాధికారులకు తగిన లాజిస్టిక్ సపోర్ట్ అందించాలని ఎన్నికల కమిషన్, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో పేర్కొంది.

మన తెలంగాణ 10 Mar 2026 6:46 pm

ఈ నెల 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు

 దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్‌కు సంబంధించిన 22వ విడత నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశ వ్యాప్తంగా రూ.9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2000 వేల చొప్పున జమ కానున్నాయి. అస్సాంలోని గువాహతి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో పీఎం- కిసాన్ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రతి ఏటా మూడు దఫాలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం రూ.19వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. గత ఏడాది నవంబర్ 19వ తేదీన 21వ విడత పీఎం-కిసాన్ నిధులు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

మన తెలంగాణ 10 Mar 2026 6:44 pm

వేసవి దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు చేయండి..

వేసవి దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు చేయండి.. ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి..తిరువూరు

ప్రభ న్యూస్ 10 Mar 2026 6:43 pm

ఉత్పత్తులను కొనుగోలు చేసి చేయూత అందించాలి..

ఉత్పత్తులను కొనుగోలు చేసి చేయూత అందించాలి.. పెనమలూరు, ఆంధ్రప్రభ : జిల్లాలో స్వయం

ప్రభ న్యూస్ 10 Mar 2026 6:41 pm

మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని గవిగట్టు గ్రామానికి చెందిన హరిజన ఉశేని ఇటీవల అనారోగ్యంతో భాధపడుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గవిగట్టు మునిస్వామి, ఈరన్న మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం భమట్టి ఖర్చులకు గాను 30వేల రూపాయలు టిడిపి నాయకులు మునిస్వామి, గ్రామ విఆర్వో నర్సింహులు చేతులు మీదుగా మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు […] The post మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Mar 2026 6:39 pm

అనుమానాస్పద కాల్స్, మెసేజీలను నమ్మవద్దు

అనుమానాస్పద కాల్స్, మెసేజీలను నమ్మవద్దు డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి : జాయింట్

ప్రభ న్యూస్ 10 Mar 2026 6:38 pm