SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
...

Ap Budget : అంకెలు గత ఏడాదిని మించి ఉంటాయా? ఈసారి బడ్జెట్ భారీగా ఉండనుందా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది

తెలుగు పోస్ట్ 14 Feb 2026 8:29 am

సమయంతో పాటు పంచాంగం వివరాలు తెలిపే డిజిటల్ గడియారం ఆస్ట్రోటెక్

 స్టార్టప్ కంపెనీ‘సోహన్ సితార’ ఆవిష్కరణ తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపకల్పన  మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన స్టార్ట్ అప్ ‘సోహన్ సితార ప్రైవేట్ లిమిటెడ్‘ రూపొందించిన భారత దేశపు మొట్టమొదటి డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ఆస్ట్రో-టెక్ అనే కొత్త తరహా విభాగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది. రోజువారీ జీవితం లో పంచాంగ వివరాలు, శుభ సమయాలు తెలుసుకోవడానికి పంచాంగ పుస్తకాలు లేదా మొబైల్ యాప్స్‌ను తరచుగా చూడాల్సి వస్తుందనే ఒక సాధారణ పరిశీలన నుంచే ఈ ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ రూపంలో సాకారమైంది. ఇది కేవలం సమయం చూపిం చే గడియారం మాత్రమే కాదు, తిథి, నక్షత్రం, రాహుకాలం, యమగండం, సూర్యోదయం, -సూర్యాస్తమయం వంటి పంచాంగ వివరాలు రోజు వా రీ దేవత ఫోటోలను ప్రత్యక్షంగా చూపిస్తూ, మన రోజువారీ కార్యక్రమాలను సంప్రదాయం మరియు ఆధ్యాత్మికతకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. సోహన్ సితారా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ‘ఈక్షన్‘ బ్రాండ్‌గా రూపొందిన ఈ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్, ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ పంచాంగం జ్ఞానాన్ని కలిపిన ప్రత్యేక డిజిటల్ గడియారంగా ఎదుగుతోంది. పేటెంట్ కోసం దరఖాస్తు ఇప్పటికే దాఖలైంది. మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో పిజి పూర్తి చేసిన వ్యవస్థాపకుడు వి.శ్రవణ్ కుమార్, రోజువారీ జీవితంలో ఒక సాధారణ లోటును గమనించి ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ www.astrowallclocks. com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. 

మన తెలంగాణ 14 Feb 2026 8:23 am

Revanth Reddy : నేడు రేవంత్ కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశం కానున్నారు

తెలుగు పోస్ట్ 14 Feb 2026 8:20 am

Telangana |గతంలో ఓడారు.. ఈ దఫా గెలిచారు..

Telangana | గతంలో ఓడారు.. ఈ దఫా గెలిచారు.. 2, 5, 12..

ప్రభ న్యూస్ 14 Feb 2026 8:07 am

Narendra Modi : నేడు అసోంలో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అసోం రాష్ట్రంలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 14 Feb 2026 8:06 am

శ్రీశైలం వెళ్తుండగా నాగర్ కర్నూల్‌లో వ్యాన్ బోల్తా: ముగ్గురు మృతి

నాగర్‌కర్నూల్: మినీ వ్యాన్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కర్నాటకకు చెందిన పది మంది భక్తులు మినీ వ్యాన్‌లో శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. 

మన తెలంగాణ 14 Feb 2026 8:05 am

Mothkur |స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటి, రెండు ఓట్లే..

Mothkur | స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటి, రెండు ఓట్లే.. Mothkur, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:56 am

Andhra Pradesh : నేడు ఏపీ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది

తెలుగు పోస్ట్ 14 Feb 2026 7:56 am

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని అవుతా: రాజగోపాల్ రెడ్డి

మనుగోడు: తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో మంత్రిని అవుతానని, లేకపోతే ముఖ్యమంత్రి అవుతానని స్పష్టం చేశారు. మీరు మునుగోడు చూసుకోండని తాను తెలంగాణను చూసుకుంటానని పేర్కొన్నారు. మర్యాదగా తనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే తానే లాక్కుంటానని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ఇంకా వేచి చూస్తానని.. పదవి గురించి తన బాధ కాదని, అభివృద్ధే తన లక్ష్యమన్నారు. సమయం వచ్చినప్పుడు జెండా ఎగురవేద్దామని చెప్పడంతో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.  గత మంత్రివర్గ విస్తరణ సమయంలోనే రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కుతుందని భావించారు. ఛాన్స్ మాత్రం రాలేదు. వివేక్, వాకిటి, అడ్లూరి, అజారుద్దీన్‌లకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో రెండు ఖాళీలు ఉన్నప్పటికి కానీ నింపడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి పార్టీలో ఉన్న ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. భువనగిరి ఎంపిని గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చిందని.. ఇచ్చిన హామీని నెరేవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటి వెంకట్ రెడ్డిలు మంత్రులుగా సేవలందిస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి సోదరుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. ఒకే ఇంట్లో రెండు పదవులు ఇస్తారా? ప్రత్యర్థి వర్గం వారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. 

మన తెలంగాణ 14 Feb 2026 7:49 am

14Feb2026 |శనివారం, నేటి తిరుమల సమాచారం..

14Feb2026 | శనివారం, నేటి తిరుమల సమాచారం.. 14 Feb2026 | టోకెన్లులేని

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:47 am

Bangladesh : బంగ్లా ప్రభుత్వం.. హసీనా అప్పగింత పైనే ఫోకస్ పెట్టనుందా?

బంగ్లాదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 14 Feb 2026 7:47 am

ఎపికి చెందిన బస్సు బోల్తా... భక్తులకు గాయాలు... డ్రైవర్ మృతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా ఖండపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రాకు చెందిన భక్తులు పూరీకికి  బస్సులో వెళ్తుండగా వాహనం బోల్తాపడడంతో డ్రైవర్ మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన 40 మంది భక్తులు వెంకటేశ్వర్ ట్రావెల్స్ బస్సులో కోల్ కతా నుంచి పూరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

మన తెలంగాణ 14 Feb 2026 7:39 am

Krish responds about his Next

Krish Jagarlamudi is one of the most sensible directors of Telugu cinema. But his recent films fell short of expectations. For his recent film Ghaati, he received a lot of criticism for delivering a film that lacks emotions. There are strong rumors that Krish will direct the next film of Nandamuri Balakrishna in the sequel […] The post Krish responds about his Next appeared first on Telugu360 .

తెలుగు 360 14 Feb 2026 7:35 am

BJP |అత్యధికంగా విజయలక్ష్మికి ఓట్లు..!

BJP | అత్యధికంగా విజయలక్ష్మికి ఓట్లు..! BJP, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్

ప్రభ న్యూస్ 14 Feb 2026 7:21 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಹಿಮ ಚಿರತೆಯೊಂದು ತನ್ನ ಮರಿಯನ್ನು ರಕ್ಷಿಸಲು ಮನುಷ್ಯನ ಸಹಾಯವನ್ನು ಕೇಳಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಹಿಮ ಚಿರತೆಯೊಂದು ತನ್ನ ಮರಿಯನ್ನು ರಕ್ಷಿಸಲು ಮನುಷ್ಯನ ಸಹಾಯವನ್ನು ಕೇಳಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 14 Feb 2026 7:00 am

కాంగ్రెస్‌కే పట్టణం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరిగి న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. శుక్రవా రం జరిగిన ఓట్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ, రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు తమకే పట్టం కట్టారని నిరూపించుకుంది. మున్సిపాలిటీలతో పాటు ఏడు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. మంచిర్యా ల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్ కా ర్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సా ధించి, నాలుగు స్థానాలకు కైవసం చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకోగా, అక్కడ హంగ్ ఏర్పడినప్పటికీ కాంగ్రెస్‌తో పాటు సిపిఐ పార్టీకి ఉన్న అవగాహన మేరకు ఆ పార్టీ మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. అయినప్పటికీ బిఆర్‌ఎస్ స్వ ఛ్చందంగా ముందుకువచ్చి సిపిఐకి మద్దతు ప్రకటించింది. సిపిఐ జాతీయ నాయకత్వం పార్టీ వర్గాల సమాచారం. నిజామాబాద్ కార్పోరేషన్ లో మొత్తం 60స్థానాలకు గానూ బిజెపి 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బిఆర్‌ఎస్ ఒక స్థా నంలో గెలిచాయి. కాగా, బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటి కీ అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మా రాయి. అయితే ఉత్తర తెలంగాణలో ఆరుగురు ఎంపీలు ఉండటంతో వారి ఓటింగ్‌తో ఆ స్థా నాన్ని బిజెపి కైవసం చేసుకునే అవకాశాలు మెం డుగా ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లలో 66 స్థానాలలో బిజెపి అత్యధికంగా 28 స్థానాలు కైవ సం చేసుకోగా, కాంగ్రెస్ 13, ఎంఐఎం 3, బిఆర్‌ఎస్ 8 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ బిజెపి కైవసం కానుంది. అ లాగే, మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 68 చోట్ల విజయం సా ధించి జెండా ఎగరేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ కేవలం 15 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోగా, 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలోల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇది రాబోయే రోజుల్లో రాజకీయ వేడిని మరింత పెంచనుంది. వార్డుల వారీగా చూస్తే, మొత్తం 2,996 మున్సిపల్ వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ 1,534 వార్డులు గెలుచుకోగా, బిఆర్‌ఎస్ 777, బిజెపి 332, సిపిఎం 13, ఎంఐఎం 70, బిఎస్‌పి 2, ఇతరులు 181 వార్డుల్లో గెలుపొందారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఓటింగ్ పర్యవేక్షణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెబ్ కాసింగ్ ద్వారా పర్యవేక్షించారు.ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎస్‌ఇసి రాణి కుముదనితో ఎపి ప్రధాన ఎన్నికల అధికారి నీలం సహానీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సాంకేతికత వినియోగం, అనుసరించిన విధానాలపై ప్రత్యక్షంగా వీక్షించి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో జరిగే ప్రతి కదలికను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారా... లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. కాగా, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం జారీ చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫిబ్రవరి 16న (సోమవారం) ప్రమాణ స్వీకారం చేసి, అదే రోజు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.

మన తెలంగాణ 14 Feb 2026 6:00 am

14thfeb2026 |శనివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

14thfeb2026 | శనివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 14thfeb2026 |

ప్రభ న్యూస్ 14 Feb 2026 6:00 am

హంగ్.. ఎక్స్‌అఫీషియోనే కింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల మధ్య పోటాపోటీగా ఉన్న చోట్ల ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారతాయి. ఓట్ల లెక్కింపు తర్వాత రెండు పార్టీల సభ్యుల సంఖ్య సమానంగా ఉన్న సందర్భాల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు ఎవరి వైపు పడుతుందో అదే ఫలితాన్ని తేల్చుతుంది. పురపాలక సంఘాల విషయంలో ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు వంటి ప్రజాప్రతినిధులు తమ పదవీ హోదా కారణంగా మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు. వారు నేరుగా మున్సిపల్ వార్డు ల్లో పోటీ చేసి గెలవకపోయినా, తమ హోదా వల్ల మున్సిపాలిటీ సమావేశాల్లో పాల్గొనే హక్కు, కొన్ని సందర్భాల్లో ఓటు హక్కు ఉంటుంది. ఎంఎల్‌ఎలు, ఎం పిలు తమ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో  ఒకచోట మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. రాజ్యసభ సభ్యులు, ఎంఎల్‌సిలు రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో అయినా ఒకదాన్ని ఎంపిక చేసుకుని అక్కడ ఓటు వేయవచ్చు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ముందు నిర్దిష్ట తేదీ (ఉదాహరణకు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు) ఆయా మున్సిపాలిటీ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాతే ఆయా ప్రజాప్రతినిధికి ఓటు హక్కు అమల్లోకి వస్తుంది. సమయానికి దరఖాస్తు చేయకపోతే ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఈ నెల 16వ తేదీన 116 చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనున్నది. ఎక్స్‌అఫీషియో ఓటు కీలకం మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులు ఎన్నికవుతారు. అనంతరం వారు కలిసి ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఇక్కడే ఎక్స్‌అఫీషియో ఓటు ప్రాముఖ్యత పెరుగుతుంది.ఉదాహరణకు ఒక మున్సిపాలిటీలో మొత్తం 20 మంది వార్డు సభ్యులు ఉన్నారనుకుంటే, రెండు ప్రధాన పార్టీలకు 10-10 సీట్లు వచ్చినట్లయితే మెజార్టీ స్పష్టంగా ఉండదు. ఇలాంటి సందర్భంలో ఎక్స్‌అఫీషియో సభ్యుడి ఓటు ఎవరి వైపు ఉంటే ఆ పార్టీకి 11 ఓట్లు అవుతాయి. దాంతో ఛైర్మన్ పదవి ఆ పార్టీకి దక్కుతుంది. అందుకే, సమాన బలం ఉన్నప్పుడు ఈ ఓటు కీలకంగా మారుతుంది. ఎంఎల్‌ఎ లేదా ఎంపి ఏ పార్టీకి చెందిన వారో, వారి ఓటు కూడా అదే పార్టీ అభ్యర్థికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో స్వతంత్ర సభ్యులు కీలకంగా మారినా, ఎక్స్‌అఫీషియో ఓట్లు సమీకరణాలను పూర్తిగా మార్చగలవు. అందువల్లే ఛైర్మన్ ఎన్నికల ముందు రాజకీయ చర్చలు, వ్యూహాలు ఎక్కువగా కనిపిస్తాయి.

మన తెలంగాణ 14 Feb 2026 5:30 am

ప్రమాద బాధితులకు రాహత్ ధీమా

న్యూఢిల్లీ: తమ కొత్త కార్యాలయం సేవాతీర్థ్ నుం చి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కొన్ని కీలక నిర్ణయాల ఫైళ్లపై సంతకాలు చేశారు. బలహీన వర్గాలు, మహిళలు, రైతులు, యువజనుల సంక్షేమ అంశాల నిర్ణయాలతో కూడిన ఫై ళ్లు ఇందులో ఉన్నాయి. కార్యాలయంలో త మ అధికారిక కార్యక్రమాల ఆరంభం తరువాత తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా వెంటనే ఈ ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇం దులో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్పించడం వారికి ప్రామాణిక చికిత్సలు కల్పించడం ఒక నిర్ణయం. పిఎం రాహత్ స్కీం పరిధిలో రోడ్డు ప్రమాదాల బా ధితులకు రూ 1.5లక్షల మేర క్యాష్‌లెస్ చికిత్సలు అందుతాయి. ఇక దేశంలో మహిళల అభ్యున్నతికి సంబంధించిన లక్‌పతి దీదీల సంఖ్యను ఆరు కోట్ల స్థాయికి చేర్చడం. వ్యవస్థాయ మౌలిక సాధనాసంపత్తి నిధిని రూ 2 లక్షల కోట్లకు విస్తరించడం . స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ను రూ 10000 కోట్ల కార్పస్ ఫండ్‌తో ప్రారంభించడం వంటి ఫైళ్లపై సంతకాలు జరిగాయి. 

మన తెలంగాణ 14 Feb 2026 5:00 am

రెండేళ్లలోనే ఎంతో మార్పు?

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్‌దేనని మరోసారి రుజువు అ యింది. తాజాగా శుక్రవారం వెలువడిన మున్సిప ల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని సాధించి తన సత్తా చాటుకుంది. ఈ ఫలితాలు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కం చుకోట అని నిరూపించుకుంది. రెండేండ్ల కిందట శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్‌దేనని చాటుకుంటూ తిరుగులేని శక్తిగా ఎదిగింది. దశాబ్దకాలం పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ పార్టీ ఒక దశలో కాం గ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కేవలం రెండేండ్ల వ్యవధిలోనే బీఆర్‌ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో కృతకృత్యం అయిందని చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చేయడమే కాకుండా కొన్ని స్థానాలలో డిపాజిట్లను కూడా గ ల్లంతు చేసి ప్రతి చావు దెబ్బతీసింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో కూడా బీఆర్‌ఎస్ పార్టీ కి సిట్టింగ్ సీట్లు అయిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ రెండింటిని కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంది. అదే స్ఫూర్తితో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ తాను బలపరిచి న గ్రామ పంచాయతీలలో 66 శాతం గెలుచుకొని హస్తగతం చేసుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీకి నగరాలలో అడ్రస్ లేకుండా చేసింది. ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా బీఆర్‌ఎస్ పార్టీకి దక్కకుండా పకడ్భంది వ్యూహాన్ని రచించి సఫలికృతం అయిందని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీమొదట రెండు ఉప ఎన్నికలలో విజయం సాధిం చి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లింది. వాటి లో కూడా తన సత్తా చాటుకొని ఇదే అదునుగా వెనువెంటనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి వాటిలో కూడా తన సత్తా చాటి, తాజాగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి అందులో కూడా అఖండ విజయం సా ధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి 80 నుం చి 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశమే లేదన్నట్టుగా ప్రతిపక్షాలను నమ్మించి అంతర్గతం గా సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు మం త్రులను, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం ద్వా రా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల అంచనాల ను తలకిందులు  చేయగలిగారు. మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ 70 శాతం స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి 116 మున్సిపాల్టీలలో 88 మున్సిపాల్టీలను, 4 మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకుంది. ఈ తాజాగా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో స్థానిక సంస్థల (మండల, జిల్లా పరిషత్) ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మన తెలంగాణ 14 Feb 2026 4:30 am

మున్సిపాలిటీల్లో బలపడ్డాం

మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తాము ఆశించిన విధంగా ఫలితాలు వచ్చాయని, గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బలపడ్డామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో రాంచందర్ రావు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్, ఇతర నాయకులు కొల్లి శారద, రాణా ప్రతాప్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలు కుమ్మక్కైయ్యాయని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడి కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామని ఆయన తెలిపారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొం డ, తదితర ప్రాంతాల్లో గతంలో కంటే తమ పార్టీ మెరుగుపడింద న్నారు. వేములవాడ, రాయికల్, నారాయణపేట్, ఆదిలాబాద్, మెట్ పల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నామని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటికే 350కి పైగా గెలుపొందామని ఆయన చెప్పారు. హంగ్‌లో ఎవరికీ మద్దతునివ్వం.. పలు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడడం, అక్కడ ఏ పార్టీకి మద్దతు నిస్తారని ప్రశ్నించగా, తాము ఎవరికీ మద్దతునివ్వమన్నారు. ఒకవేళ ఏ పార్టీ అయినా మద్దతునిచ్చేందుకు ముందుకు వస్తే తీసుకుంటా మని రాంచందర్ రావు తెలిపారు. ఎన్నికలకు ముందు తాము ఎన్నిక ల ప్రణాళికను ప్రకటించామని, గెలిపిస్తే ఎలా నిధులు సమకూరు స్తామో చెప్పామని ఆయన తెలిపారు. గతంలో తమ ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా బలపడ్డామని ఆయన చెప్పారు. ఫెవికాల్ బంధం కాంగ్రెస్, బిఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని ఆయన విమర్శించారు. మజ్లిస్ లేకుంటే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ గెలుపొంద లేవని ఆయన విమర్శించారు. జిహెచ్‌ఎంసిని మూడు ముక్కలు చేసి ఒక కార్పొరేషన్‌ను మజ్లిస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని రాంచందర్ రావు విమర్శించారు.

మన తెలంగాణ 14 Feb 2026 4:00 am

మంచి భవిష్యత్తుకు ఇది సూచిక

మనతెలంగాణ/హైదరాబాద్ : భవిష్యత్‌లో మెరుగైన ఫ లితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కలిసొచ్చే తటస్థులను కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉ న్నామని వెల్లడించారు. అధికార కాంగ్రెస్ పార్టీ సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగించినా ప్రజల మనసును గెలుచుకోలేకపోయిందని చెప్పారు. ఇటీవల పం చాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని అన్నారు. తమ విజయంతో కాంగ్రెస్ నేతల నో ళ్లు మూతపడ్డాయని విమర్శించారు. దాదాపు 700 నుంచి -800 వార్డుల్లో గెలుస్తామని భావించామని చెప్పా రు. 15 మున్సిపాలిటీల్లో తాము స్పష్టంగా గెలిచామని, మరో 37 మున్సిపాలిటీల్లో మాకు మంచి ఫలితాలు వ చ్చి.. హంగ్ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోడారని అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2020లో 130 మేయర్లు, చైర్ పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగితే బిఆర్‌ఎస్ 122, కాంగ్రెస్ 4,బిజెపి 2, ఎంఐఎం 2 చోట్ల గెలిచాయని గుర్తు చేశారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 30 శాతానికిపైగా వార్డులు గెలిచిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడొద ని గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డంపెట్టుకుని విజయం సాధించిందని, డబ్బు, మద్యం పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అక్రమలు చేసినా.. ధైర్యంగా బిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన తర్వాత కేతన్‌పల్లి మున్సిపాలిటీలో సిపిఐ కూడా తమతో కలిసి వచ్చిందని, దీంతో అక్కడ విజయం సాధించామన్నారు. హంగ్ ఏర్పడిన చోట.. ఛైర్మన్ పీఠాలు కైవసానికి కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలు పెట్టిందని, కాంగ్రెస్, బిజెపి రెండూ కు మ్మక్కయ్యాయని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతు న్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే సిపిఐ తమతో కలిసి రావాలని కోరారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలను ఎండగట్టేందుకు కొత్తగూడెం కార్పొరేషన్‌లో సిపిఐకి మ ద్దతిస్తామని ప్రకటించారు. సిపిఐ నేత కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పానని అన్నారు. కాంగ్రెస్, బిజెపిని పార్టీలను ఎదుర్కొనే శక్తి బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని, కెసిఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యాంచారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం సఫలమయ్యాం.. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నవాళ్లు చరిత్రలో కలిశారని కెటిఆర్ అన్నారు. అలా అనుకునే పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారని, చరిత్రలో కూడా ఒక తుగ్లక్ ఉండేవాడని ఎద్దేవా చేశారు. అలా అనుకున్నవారు ఎందరో గా లికి కొట్టుకుపోయారని అన్నారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ, ఎన్‌టిఆర్ వంటి నాయకులు సైతం ఓడిపోయారని గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన కెసిఆర్ వంటి నాయకుడిని కూడా కామారెడ్డిలో దురదృష్టవశాత్తూ ప్రజలు ఓడించారని పేర్కొన్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడో స్థానానికి వచ్చారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్‌ను అడ్డుకోలేకపోయారు: హరీశ్‌రావు మున్సిపల్ ఎన్నికల్లో 700పైగా స్థానాల్లో బిఆర్‌ఎస్ గెలుపు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ ప్రభు త్వం పట్ల రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకత కు నిలువెత్తు నిదర్శనం అని విమర్శించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కా ర్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాం గ్రెస్ పార్టీ అరాచక, అప్రజాస్వామిక విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని అన్నారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని విమర్శించారు. దాదాపు 700 పైగా వార్డుల్లో బిఆర్‌ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదు అని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 14 Feb 2026 3:30 am

ఫీజు బకాయిల రగడ

టీడీపీ, వైసీపీ సవాళ్లు… ప్రతి సవాళ్లు. మండలిలో అదే వేడి… అదే మాటల దాడి. వైసీపీ వాకౌట్… చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేశ్. మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు : వైసీపీ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రెండో రోజూ అదే మాటల యుద్ధం కొనసాగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలలో మళ్లీ వివాదం […] The post ఫీజు బకాయిల రగడ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 12:45 am

కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐదే

. కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం. 22 డివిజన్లలో జయభేరి. కూనంనేనికి రేవంత్శు భాకాంక్షలు. రాజకీయాలకతీతంగా కార్పొరేషన్ అభివద్ధి: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో- కొత్తగూడెం: ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ కొత్తగూడెం తొలి కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరేసింది. ధన అహంకారం ప్రదర్శించిన ప్రత్యర్థులను పట్టణ ప్రజలు తిరస్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీని వెనక్కు నెట్టేయ్యాలని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ ఎర్రజెండాకు సంపూర్ణ మద్దతు పలికి అఖండ విజయం చేకూర్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ […] The post కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐదే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 12:42 am

సంక్షేమం…అభివద్ధి

. సమతూకంతో కూటమి పాలన. పీపీపీతోనే ప్రగతి…పురోగతి. లక్ష కోట్లతో ఉద్యాన హబ్‌గా రాయలసీమ. వచ్చే మూడేళ్లూ విద్యుత్ చార్జీలు పెంచబోం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి. స్వర్ణాంధ్ర విజన్`2047తో అగ్రగామిగా ఏపీ. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమం- అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో వాగ్దానాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో […] The post సంక్షేమం…అభివద్ధి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 12:38 am

తొలిదశ… నిరసన జ్వాల

పార్లమెంట్ వాయిదా…మళ్లీ మార్చి 9న ప్రారంభంచివరిరోజు లోక్‌సభను కుదిపేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స’కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ న్యూదిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రతిపక్షాల నిరసనల ీVAరుతో ముగిసింది. మూడు వారాల విరామం తర్వాత మలిదశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. కాగా శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. లోక్‌సభ 11గంటలకు సమావేశమవగా… ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురి రాజీనామా చేయాలని ప్రతిపక్ష […] The post తొలిదశ… నిరసన జ్వాల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Feb 2026 12:34 am

శనివారం రాశి ఫలాలు (14-02-2026)

మేషరాశి ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృషభం దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. మిధునం మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. కర్కాటకం సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. కన్య ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలుంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. తుల ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృశ్చికం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ధనస్సు మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మకరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. కుంభం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. మీనం పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.  

మన తెలంగాణ 14 Feb 2026 12:00 am

మహిళల ఖాతాల్లో రూ.5వేలు

 అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు. కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నెలవారీ సాయం గా మహిళలకు రూ.1,000 అందిస్తోంది. అయితే ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల మొత్తం కలిపి రూ.3,000, సమ్మర్ స్పెషల్‌గా మరో రూ.2,000 కలిపి ఈ మొత్తాన్ని మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. ఏప్రిల్-మే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే మహిళా లబ్ధిదారులకు ఇస్తున్న నెలవారీ సాయం రూ.2,000కు పెంచుతామని వీడియో సందేశంలో స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయాన్ని అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల కోడ్ పేరిట అడ్డుకునేందుకు బిజెపి, అన్నాడిఎంకె, కుట్ర పన్నుతున్నాయని స్టాలిన్ ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మూడు మాసాల సాయాన్ని ఒకేసారి కలిపి మహిళల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సమ్మర్ స్పెషల్ ఖర్చుల కింద రూ.2,000 అదనంగా ఖాతాలో జమచేసినట్టు చెప్పారు. రాబోయే మూడు నెలలు మీరు పడబోయే ఇబ్బందులతో పాటు అదనంగా మందులు, పరీక్షల సమయంలో పిల్లలకు ఖర్చులు ఎక్కడి నుంచి తెస్తారని ఆలోచించానని, ఆ కారణంగానే తమ అకౌంట్లలో రూ.5,000 జమ చేయాలని ఆదేశించానన్నారు.

మన తెలంగాణ 13 Feb 2026 11:26 pm

ఉత్కంఠగా చేర్యాల మున్సిపాలిటీ ఫలితాలు

చేర్యాల ము న్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం రోజు న ఉత్కంఠ భరితంగా మారాయి. మొత్తం 12 వార్డులు ఉండగా అందులో 7 వార్డు లు బిఆర్‌ఎస్ కైవసం చేసుకోగా 5 వార్డు లు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. వార్డుల వారీగా ఫలితాలు 1)వ వార్డ్... ఒగ్గు వెంకటమ్మ కాంగ్రెస్ విజయం (140మెజార్టీ) 2)వ వార్డ్... కమలాపురం గీతాంజలి బిఆర్‌ఎస్ విజయం (223మెజార్టీ) 3)వ వార్డ్... కొమ్ము రాజేశ్వరి కాంగ్రెస్ విజయం (450మెజార్టీ) 4)వ వార్డ్... నిమ్మ సుప్రజ బిఆర్‌ఎస్ విజయం (391మెజార్టీ) 5)వ వార్డ్...వెలుగల దుర్గయ్య కాంగ్రెస్ విజయం ( 339మెజార్టీ) 6)వ వార్డ్...ముస్తాల అరుణ బిఆర్‌ఎస్ విజయం (145మెజార్టీ) 7)వ వార్డ్...పోతుగంటి ప్రసాద్ కాంగ్రెస్ విజయం (317మెజార్టీ) 8)వ వార్డ్...బుదారి సురేష్ బిఆర్‌ఎస్ విజయం (392మెజార్టీ) 9)వ వార్డ్...వీరబత్తిని సదానందం బిఆర్‌ఎస్ విజయం (337మెజార్టీ) 10)వ వార్డ్... మేడిశెట్టి ఉమా బిఆర్‌ఎస్ విజయం (153మెజార్టీ) 11)వ వార్డ్... ఎండి ఇజాజ్ బిఆర్‌ఎస్ విజయం (145మెజార్టీ) 12) వ వార్డ్... ఎండి షరీఫా కాంగ్రెస్ విజయం (52మెజార్టీ) గా ఉన్నాయి. ఫలించిన ఎమ్మెల్యే పల్లా కృషి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని మున్సి పాలిటీలో బిఆర్‌ఎస్ జండాను ఎగరవేయ డానికి మొక్కవోని దీక్షతో ప్రతిరోజు ప్ర చారాన్ని నిర్వహించారు.తమ అభ్యర్థుల ను గెలిపించు కోవడానికి నిరంతరం కృషి చేసి మొత్తానికి చేర్యాల మున్సిపాలిటీపై బీఆర్ ఎస్ జెండాను ఎగరవేశారు. కార్యకర్తలలో మరోసారి ఉత్సాహాన్ని నింపారు.

మన తెలంగాణ 13 Feb 2026 11:22 pm

విజయ్ ర్యాలీలో అపశృతి

తమ పార్టీ టివికె ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం అయిందని పార్టీ అధినేత , హీరో విజయ్ తెలిపారు. తమ పార్టీ తరఫున వెలువరించిన అధికార పంపిణీ ప్రతిపాదన రాజకీయాల్లో బాంబు అయిందని వ్యాఖ్యానించారు. తమ ఫార్మూలా ఇప్పుడు పలు పార్టీల్లో ప్రచారం పొందింది. అన్ని కూటములు, పార్టీలు ఇప్పుడు టివికె వెంటపడేలా ఉన్నాయని , అసెంబ్లీ ఎన్నికలకు ముందే విజయ్ విజిల్ బాగా మోగుతోందని శుక్రవారం తెలిపారు. ఈ కొత్త పరిణామంతో ముఖ్యమంత్రి, డిఎంకె నేత స్టాలిన్ గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయన తరచూ కాంగ్రెస్‌తో అధికార పంపిణీకి ససేమిరా అంటున్నారు. ఇప్పుడు పద్ధతి మార్చుకోవల్సి వస్తోందని విశ్లేషించారు. సేలం సమీపంలోని బైపాస్‌లో భారీ సంఖ్యలో హాజరైన సభలో విజయ్ ప్రసంగించారు. తమిళనేల తొలి సైనికుడుగా నిలిచితీరే వ్యక్తిని అని, వెన్నుచూపడం కలలో కూడా లేదని ప్రకటించారు. డిఎంకెకు కూటమి అంటే కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే, అయితే తరువాత పరిపాలన విషయంలో వారి పంథా విడిగా ఇతర విషయాలపై ఉంటుందని స్టాలిన్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఇతరాలను ఆయన డబ్బు అంటూ సంకేతాలతో తెలిపారు. విజయ్ ర్యాలీలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి సేలంలో విజయ్ సభ జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి స్పృహ తప్పిపడిపోయాడు. కిక్కిరిసిన జనం మధ్య పడిపోయిన ఈ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుపుతూ ఉండగా మృతి చెందాడు. ఈ వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన సూరజ్ (37)గా గుర్తించారు. కొద్ది సంవత్సరాల క్రితం సేలంలో జవనోపాధికి వచ్చారు. ఇక్కడ ప్రాణాలొదిలాడు. 

మన తెలంగాణ 13 Feb 2026 11:12 pm

Chandrababu Naidu Slams Previous Regime, Outlines Vision for Andhra Pradesh’s Rebuilding

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu launched a strong attack on the previous YSRCP government during his address in the Assembly. Speaking during the discussion on the motion of thanks to the Governor’s speech, he said the state witnessed serious damage in the past regime. He recalled the humiliation he faced in the Assembly […] The post Chandrababu Naidu Slams Previous Regime, Outlines Vision for Andhra Pradesh’s Rebuilding appeared first on Telugu360 .

తెలుగు 360 13 Feb 2026 10:15 pm

బిజెపిలో చేరిన కార్పొరేటర్లు

బిజెపిలో చేరిన కార్పొరేటర్లు .. పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి బండి కరీంనగర్ ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Feb 2026 10:12 pm

ఎయిర్ ఇండియాకు డిజిసిఎ రూ. కోటి జరిమానా

ఎయిర్ వర్థీనెస్ రివ్యూ సర్టిఫికెట్ (ఎఆర్‌సి) పర్మిట్ లేకుండా 8 సార్లు ఎయిర్‌బస్‌ను నడిపినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) రూ. కోటి జరిమానా విధించింది. నెలరోజుల్లో ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 24,25 తేదీల్లో తప్పనిసరి ఎయిర్‌వర్థినెస్ రివ్యూ సర్టిఫికెట్ లేకుండా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మధ్య ఎయిర్‌బస్ ఏ 320 విమానాన్ని ఎయిర్ ఇండియా ఎనిమిదిసార్లు నడిపింది. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని గత ఏడాది డిసెంబర్‌లో వెలుగు లోకి తెచ్చింది. దీంతో ఎయిర్ ఇండియా అంతర్గత దర్యాప్తు చేపట్టి వ్యవస్థాగత వైఫల్యాలను గుర్తించింది. ఈ లోపాల వల్లనే ఎయిర్ ఇండియాపై ప్రజల విశ్వాసం దెబ్బతిందని, ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపిందని డీజీసీఎ ఆరోపించింది. ఏటా విమాన భద్రత,ఇతర పరీక్షలు నిర్వహించిన తరువాత ఏఆర్‌సి సర్టిఫికెట్ డిజిసిఎ జారీ చేయడం పరిపాటిగా వస్తోంది. 

మన తెలంగాణ 13 Feb 2026 10:09 pm

సిఎం రేవంత్ రెడ్డిని అభినందించిన ప్రియాంక గాంధీ

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేస్తూ సిఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ప్రియాంకగాంధీ హర్షం వ్యక్తం చేయడంతో పాటు సిఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్‌కు ఘనవిజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియజేశారు.

మన తెలంగాణ 13 Feb 2026 10:00 pm

సన్న బియ్యం పంపిణీతో సంచలన విజయాలు నమోదు: మంత్రి ఉత్తమ్

పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్నబియ్యం పంపిణీ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారిందని ఆయన చెప్పారు. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమలౌతున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభించినట్లయిందని ఆయన అన్నారు. అర్హులయిన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు,అర్హులైన నిరుపేద మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పధకాలు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు. వీటన్నింటిని మించి సాగునీటి రంగంలో సాధించిన విజయాలు, యావత్ భారతదేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు, అదే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతో పాటు రైతులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని తెలిపారు.పురపాలక సంఘం ఎన్నికల్లో ఫలితాలు ముందుగా ఊహించినవేనని, యావత్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికల అద్దం పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పల్లెలతో పాటు పట్టణాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పు గా ఆయన అభివర్ణించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్ నగర్, నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేట పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకీ కంచుకోట అని మరోమారు రుజువైనందన్నారు. ఈ విజయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో సాధించిందని అందుకు తోడ్పాటునందించిన పురపాలక సంఘాల ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయాల వరవడి ఆ తరువాత జరిగిన లోకసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందని ఆయన వెల్లడించారు.

మన తెలంగాణ 13 Feb 2026 9:57 pm

couple victory |ఇద్దరూ.. ఇద్దరే

couple victory | ఇద్దరూ.. ఇద్దరే .. కార్పొరేటర్లుగా గెలిచిన భార్యాభర్తలు గోదావరిఖని

ప్రభ న్యూస్ 13 Feb 2026 9:17 pm

ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా

. నూతన కార్పొరేషన్ కొత్తగూడెం పై సిపిఐ జెండా. మిత్ర ద్రోహానికి తగిన శాస్తి చెప్పిన కార్పొరేషన్ ప్రజలు. 22 డివిజన్లో సిపిఐ విజయం. మేయర్ పీఠం అధిష్టించనున్న సిపిఐసిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తొలి కార్పొరేషన్ కొత్తగూడెం పై ఎర్రజెండా ఎగరేసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని […] The post ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Feb 2026 9:07 pm

నగర అభివృద్ధి మా ధ్యేయం..

6వ డివిజన్ బీజేపీయే అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి ఘనవిజయం.. నిజామాబాద్, ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 13 Feb 2026 9:05 pm

ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..

8వ డివిజన్ బిజెపి అభ్యర్థి పవన్ కుమార్ ఘన విజయం నిజామాబాద్ ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 13 Feb 2026 9:00 pm

సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

 సిరిసిల్ల జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఒకటి సిరిసిల్ల బిఆర్‌ఎస్ వశం కాగా మరొకటి వేములవాడలో హంగ్ వచ్చినా అది అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమైంది. ముందుగా అందరూ ఊహించినట్లుగా సిరిసిల్లలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యుడు కెటిఆర్ తన పట్టునిలుపుకోగా, వేములవాడలో ప్రభుత్వ విప్,శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ తన పట్టు బిగించారు. సిరిసిల్ల మున్సిపల్‌లో 39 వార్డులకు గాను బిఆర్‌ఎస్ 27 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది.కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచి 6 స్ధానాలు గెలుచుకోగా,బిజేపి మూడో స్థానంలో నిలిచి 5 స్ధానాలు గెలుచుకుంది. బిజేపికి రాజీనామ చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. సిరిసిల్లలో పోటీ చేసిన సిపిఎం,ఏఐఎఫ్‌బి, జనసేన తదితర పార్టీలు తమ ఖాతా తెరువలేకపోయాయి. వేములవాడలో 28 స్థానాలుండగా కాంగ్రెస్ పూర్తి మెజార్టీకి కనీసంగా రెండు స్థానాలు తక్కువైనా 13 స్థానాల్లో విజయం సాధించింది. బిజేపి రెండో స్థానంలో నిలిచి 8 స్థానాల్లో , మూడో స్థానంలో నిలిచిన బిఆర్‌ఎస్ 5 స్థానాల్లో గెలువగా స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. మిగతా పార్టీలకు ప్రజలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిర్దందంగా తిరస్కరించారు. సిరిసిల్లలో గులాబీ నేత కెటిఆర్ ఒంటరి పోరు సాగించి తన పట్టు నిలుపుకోగా, వేములవాడలో ఆది శ్రీనివాస్ తన పట్టు బిగించి బిఆర్‌ఎస్ ఖాతా ఇప్పటి వరకున్న మున్సిపల్‌ను కాంగ్రెస్ స్వాధీనంలోకి తెచ్చారు. సిరిసిల్ల ప్రజలు కెటిఆర్ వెన్నంటి ఉన్నామని మరోసారి తేల్చి చెప్పగా, వేములవాడలో ఆది శ్రీనివాస్ అభివృధ్ది చేస్తారనే విశ్వాసాన్ని ప్రజలు కనపర్చారని మున్సిపల్ ఫలితాలు నిరూపించాయి. సిరిసిల్ల మున్సిపల్‌లో విజేతలు వీరే ..... సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా 1వ వార్డులో బూర బాలమల్లు (బిఆర్‌ఎస్), 2వ వార్డులో వేముల రాములు (బిఆర్‌ఎస్), 3వ వార్డులో జిందం కళ (బిఆర్‌ఎస్), 4వ వార్డులో లాయక్ సుల్తానా( కాంగ్రెస్), 5వ వార్డులో దార్నం అరుణ (బిఆర్‌ఎస్), 6వ వార్డులో దూడం రజని (బిఆర్‌ఎస్), 7వ వార్డులో ఎర్రం వెంకట్రాజం( బిజేపి), 8వ వార్డులో లింగంపెల్లి భాగ్యలక్ష్మి(బిఆర్‌ఎస్), 9వ వార్డులో దొంతినేని కళ్యాణి (బిఆర్‌ఎస్), 10వ వార్డులో బొల్గం వైష్ణవి (స్వతంత్ర) గెలుపొందారు.11వ వార్డులో మామిడాల మహేష్ (బిజేపి), 12వ వార్డులో మొగిలి రాజు (బిఆర్‌ఎస్), 13వవార్డులో బుర్ర నారాయణ గౌడ్ (బిఆర్‌ఎస్), 14వవార్డులో వెంగళ లీల( కాంగ్రెస్), 15 వవార్డులో కూర భాగ్యలక్ష్మి(బిఆర్‌ఎస్),16 వవార్డులో గుడ్ల శ్రీనివాస్(బిఆర్‌ఎస్), 17వవార్డులో గుండ్లపెల్లి నీరజ(బిఆర్‌ఎస్), 18వ వార్డులోమేరుగు మంజుల (బిజేపి), 19వ వార్డులో బొద్దుల శ్రీనివాస్ (కాంగ్రెస్), 20వ వార్డులో సాగాల హరిప్రసాద్ (బిఆర్‌ఎస్) విజయం సాధించారు.21వ వార్డులో ఎలుక వెంకటేశం (బిఆర్‌ఎస్), 22వ వార్డులో లింగంపల్లి గంగరాజు (కాంగ్రెస్ ),23వ వార్డులో ఆడెపు చంద్రకళ (కాంగ్రెస్), 24వ వార్డులో బుర్ర మల్లికార్జున్ (బిఆర్‌ఎస్), 25 వవార్డులో బింగి రామాంజనేయులు (బిఆర్‌ఎస్),26వ వార్డులో నెల్లుట్ల నరేష్ (బిఆర్‌ఎస్), 27వ వార్డులో కాసర్ల పద్మ(బిఆర్‌ఎస్),28వవార్డులో అడిచెర్ల రూప (బిఆర్‌ఎస్), 29వ వార్డులో గెంట్యాల శ్యామల (బిఆర్‌ఎస్), 30వ వార్డులో మంచె రేణుక (బిఆర్‌ఎస్ ) గెలుపొందారు. 31వ వార్డులో పాసికంటి రమ్య(బిఆర్‌ఎస్), 32వ వార్డులో కూరపాటి శ్రీశైలం(కాంగ్రెస్), 33వ వార్డులో కొండ వర్షిణి(బిజేపి), 34 వ వార్డులో దార్ల సందీప్ (బిఆర్‌ఎస్), 35వ వార్డులో బత్తుల రమేష్ (బిఆర్‌ఎస్), 36వ వార్డులో కల్లూరి రేణుక (బిఆర్‌ఎస్), 37వవార్డులో ఊరగొండ లక్ష్మి(బిజేపి), 38వవార్డులో రిక్కుమల్లే రజిత (బిఆర్‌ఎస్), 39వ వార్డులో ఆకుల స్వప్న (బిఆర్‌ఎస్) విజయం సాధించారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:59 pm

రామగుండం ‘హస్త’గతం

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. 60వ డివిజన్లకు గాను 38 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకొని రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు మొత్తం 60 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో నగర పాలక సంస్థను కైవసం చేసుకుంది. పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్: 38 స్థానాలు, బీఆర్‌ఎస్: 13 స్థానాలు, ఏఐఎఫ్‌బీ: 06 స్థానాలు, బీజేపీ: 01, సీపీఐ: 01, ఇండిపెండెంట్: 01 స్థానం, 60 స్థానాల విజేతల పూర్తి వివరాలు 1వ డివిజన్ మడిపల్లి విజయ (కాంగ్రెస్ - ఏకగ్రీవం), 2. వెంగల బాపు (కాంగ్రెస్), 3. వడ్లూరి రవి (ఏఐఎఫ్‌బి), 4. కంకణాల మౌనిక (కాంగ్రెస్), 5. మాతురి సత్యప్రసాద్ (కాంగ్రెస్), 6. ఆవుల శ్యామని (బిఆర్ ఎస్), 7. వేగోలపు రమాదేవి (కాంగ్రెస్), 8. పర్లపల్లి పుష్పలత (ఏఐఎఫ్‌బి), 9. తాళ్లపల్లి యుగేంధర్ (కాంగ్రెస్), 10. అడ్డాల గట్టయ్య (బిఆర్ ఎస్), 11. కారెంగుల రమ్య (ఏఐఎఫ్‌బి), 12. షేక్ బాబు మియా (కాంగ్రెస్), 13. చుక్కల లావణ్య (కాంగ్రెస్), 14. బదావత్ శంకర్ నాయక్ (కాంగ్రెస్), 15. బుర్ర శశికళ (బిఆర్ ఎస్), 16. మందల రమ (బిఆర్ ఎస్), 17. అనుము స్వరూప (కాంగ్రెస్), 18. దేవనపల్లి చక్రపాణి (కాంగ్రెస్), 19. మారెల్లి సుశీల (కాంగ్రెస్), 20. తాళ్ల చిన్న రాజయ్య (బిఆర్ ఎస్), 21. కందుల స్వరూప (కాంగ్రెస్), 22. కన్నూరి భాగ్యలక్ష్మి (కాంగ్రెస్), 23. బెంద్రం సునీత (కాంగ్రెస్), 24. కొలని కవిత (కాంగ్రెస్), 25. సిరిశెట్టి సతీష్ (కాంగ్రెస్), 26. బదావత్ నర్సమ్మ (బిఆర్ ఎస్), 27. ఆయేషా ఖానం (ఇండిపెండెంట్), 28. బద్రి రాజన్న (ఏఐఎఫ్‌బి), 29. నిమ్మ రాజుల రజిని (బిఆర్ ఎస్), 30. ఇస్సంపల్లి అంజయ్య (కాంగ్రెస్), 31. షాహెదా (కాంగ్రెస్), 32. తోట మమత (బీజేపీ), 33. మేరుగు భూలక్ష్మి (కాంగ్రెస్), 34. స్వప్న ప్రియ (కాంగ్రెస్), 35. జంగపల్లి రమాదేవి (కాంగ్రెస్), 36. కల్వల పద్మావతి (కాంగ్రెస్), 37. మీర్జా ఫజల్ బేగ్ (కాంగ్రెస్), 38. నెలకంటి రాము (కాంగ్రెస్), 39. తిప్పారపు మానస (కాంగ్రెస్), 40. కజపురం జయప్రద (బిఆర్ ఎస్), 41. మార్కపురి సూర్య (సీపీఐ), 42. పాతిపల్లి కావ్య (కాంగ్రెస్), 43. దొంత శ్రీనివాస్ (కాంగ్రెస్), 44. కర్రావుల దాడిరాజు (ఏఐఎఫ్‌బి), 45. కౌటం సతీష్ (కాంగ్రెస్), 46. మహాంకాళి స్వామి (కాంగ్రెస్), 47. దాసరి సాంబమూర్తి (కాంగ్రెస్), 48. రేణుకుంట్ల నిర్మల దేవి (కాంగ్రెస్), 49. సాగి సంతోష్ రావు (కాంగ్రెస్), 50. దూళికట్ట సతీష్ (కాంగ్రెస్), 51. ఆకారపు రజిత (బిఆర్ ఎస్), 52. చీదురాల నాగరాజు (ఏఐఎఫ్‌బి), 53. గట్ల రమేష్ (కాంగ్రెస్), 54. మహ్మద్ ముస్తాఫా (కాంగ్రెస్), 55. కర్క పద్మజ (బిఆర్ ఎస్), 56. కొమ్ము స్వప్న (కాంగ్రెస్), 57. పాతపల్లి ఎల్లయ్య (కాంగ్రెస్), 58. మేకల సమ్మయ్య (బిఆర్ ఎస్), 59. బాలసాని తిరుపతి (ఏఐఎఫ్‌బి), 60. మేకల శారద (బిఆర్‌ఎస్). భార్యాభర్తల గెలుపు.. 2 ఓట్ల మెజారిటీతో ఉత్కంఠ ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. 58 మరియు 60 స్థానాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మేకల సమ్మయ్య, శారద దంపతులు ఇద్దరూ విజయం సాధించి విశేష గుర్తింపు పొందారు. ఇక 59వ స్థానంలో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి బాలసాని తిరుపతి కేవలం 2 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కి నగరంలో అత్యల్ప మెజారిటీ విజేతగా నిలిచారు. బిఆర్‌ఎస్, బిజెపిలపై ఎమ్మెల్యే నిప్పులు ఫలితాల అనంతరం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. బిఆర్‌ఎస్ పార్టీ అహంకారానికి, బిజెపి చేస్తున్న మత రాజకీయాలకు రామగుండం ప్రజలు ఈ తీర్పుతో బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. అభివృద్ధిని వదిలేసి మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూసిన బిజెపిని, ప్రలోభాలతో గెలవాలని చూసిన బిఆర్‌ఎస్‌ను ఓటర్లు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. రామగుండం లౌకికత్వానికి ప్రతీక అని, ఇక్కడ విభజన రాజకీయాలు సాగవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పోలీసుల పటిష్ట బందోబస్తు కౌంటింగ్, ఫలితాల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగా, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అల్లరిమూకలపై పోలీసులు ముందస్తు నిఘా ఉంచడంతో నగరం ప్రశాంతంగా ఉంది.

మన తెలంగాణ 13 Feb 2026 8:54 pm

మిర్యాలగూడ పుర పోరులో కాంగ్రెస్ ఘన విజయం

మిర్యాలగూడ పురపాలక ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్‌పార్టీ ఘన విజయం సాధించింది.వాడి వేడిగా రసవత్తరంగా సాగిన ఎన్నికల ప్రక్రియ అనంతరం జయాపజయాలు ఖరారుకాగా,మొత్తం 48 వార్డులకుగాను కాంగ్రెస్‌పార్టీ 31 వార్డులు కైవసం చేసుకొని మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి బిఆర్‌ఎస్ పార్టీ 14వార్డుల్లో విజయం సాధించగా,ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డు,బిజెపి ఒక వార్డు,ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ ఒక వార్డును కైవసం చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా 18వ వార్డు ఫలితం అందరి దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థిపై గెలుపొందడం ఉత్కంఠభరితంగా మారింది. ఉదయం 8గంటల నుంచి అవంతిపురం మార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోలీసుల భారీ బందోబస్తు నడుమ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. డిఎస్పీ రాజశేఖర్‌రాజు ముందుగానే ఆదేశాలు జారీ చేస్తూ, విజయోత్సవ ర్యాలీలు ,డిజెలకు అనుమతి లేదని స్పష్టం చేయడంతో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.మొత్తం మిర్యాలగూడ పురపాలక ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు స్పష్టమైన మద్దతు పలికారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మన తెలంగాణ 13 Feb 2026 8:48 pm

ward9 |రికార్డు మెజారిటీ…

ward9 | రికార్డు మెజారిటీ… -కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ రాజు ఘన విజయం

ప్రభ న్యూస్ 13 Feb 2026 8:46 pm

వార్ వన్ సైడ్ ...చిట్యాల పుర పీఠం కాంగ్రెస్‌కే

జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల వార్ పూర్తిగా వన్ సైడ్ గా నిలిచి, స్దానిక ఎంఎల్‌ఏ వేముల వీరేశం రాజకీయ చతురత ఫలించింది , 12 వార్డులకు గాను 9 వార్డులు కాంగ్రెస్ అభ్యర్దులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్దులు అన్ని స్దానాల్లో పోటీ చేసిననప్పటికి కేవలం 2 స్దానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.ఒక వార్డు ట్రాన్స్‌జెండర్ ఇండిపెండెంట్ కైవసం చేసుకుంది. రెండవ సాధారణ ఎన్నికల్లో నేడు ప్రకటించిన ఫలితాల్లో విజయం సాధించి కౌన్సిలర్‌లుగా ప్రమాణ స్వీకారం చేయనున్న అభ్యర్దులు సంబురాల్లో మునిగిపోయారు. ఒకటో వార్డు నాగిల్ల సుధాకర్ ట్రాన్స్‌జెండర్ స్వతంత్ర అభ్యర్ది సిపిఎం కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్ది అయిన జిట్ట నగేష్‌పై 102 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2వ వార్డులో బిఆర్‌ఎస్ కు చెందిన షేక్ షబానా అజీమ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది జడల పూలమ్మ పై 96 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. 3 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి గాలి యాదమ్మలింగయ్య బిఆర్‌ఎస్ అభ్యర్తి శేపూరి జయమ్మ రవీందర్ పై 302 ఓట్ల మెజారిటీ, 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ది కోనేటి ఎల్లయ్య బిఆర్‌ఎస్ అబ్యర్ది నేనావత్ కృష్ణ నాయక్ పై 181 ఓట్ల మెజారిటీ, 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది గుండెబోయిన శ్రీ లక్ష్మి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ది దయ్యాల శ్రీకాంత్ పై 34 ఓట్ల మెజారిటీ, 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది జెర్రిపోతుల సత్యనారాయణ బిఆర్‌ఎస్ అభ్యర్ది జడల సంతోషిపై89 ఓట్ల మెజారిటీ, 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది దేశపాక లతరాజేష్ బిఆర్‌ఎస్ అభ్యర్ది కూరెల జ్యోతి పై11ఓట్ల మెజారిటీ, 8 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అబ్యర్ది కుక్కల మోహన్ బిఆర్‌ఎస్ అభ్యర్ది కందాటి రమేష్‌రెడ్డి పై 143 ఓట్ల మెజారిటీ, 9వ వార్డులో కా్ంగరెస్ పార్టీ అభ్యర్ది ఏర్పుల పరమేష్ బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ది ఆగు అశోక్ పై 253 ఓట్ల మెజార్టీ, 10 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది సిలివేరు శేఖర్ పై బిఆర్‌ఎస్ అబ్యర్ది నిమ్మనగోటి శ్రీను 97 ఓట్ల మెజారిటీ, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ది బొబ్బలి సందీప బిజెపి అభ్యర్ది దుడ్డు భాగ్యమ్మపై459 ఓట్ల మెజారిటీ, 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అబ్యర్ది పందరిగీతారమేష్ బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ది మెండె సుజాత సైదులు పై 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:45 pm

కల్వకుర్తి పురపాలకంలో హస్తం కైవసం

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని మూడు ప్రధాన పార్టీలు పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కల్వకుర్తి పురపాలక సంఘం లో హస్తం హవా నడిచింది.గత పాలకమండలి లో పని చేసిన బిఆర్‌ఎస్ కారు స్పీడు తగ్గి కమలం వికసించింది.ఈ నెల 11 జరిగిన కల్వకుర్తి మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.స్థానిక బిఈడి కళాశాలలో ఉదయం 8 గంటలకు మూడు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు.ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 13 వార్డులలో,కాంగ్రెస్ రెబల్ ఇండిపెండెంట్ ఒక వార్డులో,బిఆర్‌ఎస్ పార్టీ 3 వార్డులలో,బారతీయ జనతా పార్టీ 5 స్థానాలలో గెలుపొందింది. విజయం పొందిన అభ్యర్దుల వివరాలు ఇలా.. 1 వార్డు లో బాజపా అభ్యర్ది శ్రీరాములు 35 ఓట్ల మెజార్టీతో,2 వార్డు లో బాజపా అభ్యర్ది రేణుక 182 ఓట్ల మెజార్టీతో,3 వ వార్డు లో బిఆర్‌ఎస్ అభ్యర్ది కేతావత్ రాము 29 ఓట్ల మెజార్టీతో ,4 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది హుమ్లి హనుమా నాయక్ 116 ఓట్ల మెజార్టతో ,5 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది కరుణాకర్ రెడ్డి 201 ఓట్ల మెజార్టీతో,6 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది పుట్ట రేణుక 118 ఓట్ల మెజార్టీతో,7 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ చైర్మెన్ అభ్యర్ది బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ తమ ప్రత్యర్ది 425 ఓట్ల బారీ మెజార్టీతో గెలుపొందారు. అదే విదంగా 8 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్ది కోడెల లలిత గణేష్ 16 ఓట్ల మెజార్టీతో,9 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది చిత్తారి ఎల్లమ్మ 122 ఓట్ల మెజార్టీతో ,10 వార్డు లో బిఆర్‌ఎస్ అభ్యర్ది ఎజాస్ ఒక ఓటు మెజార్టీతో,11 వ వార్డు లో బాజపా అభ్యర్ది ఎనుగొండ రామకృష్ణ 7 ఓట్ల మెజార్టీతో,12 వ వార్డు లో బాజపా అభ్యర్ది గుర్రాల జ్యోతి రాంభూపాల్ రెడ్డి 65 ఓట్ల మెజార్టీతో,13 వ వార్డులో బాజపా అభ్యర్ది బోడ నర్సింహ్మ 63 ఓట్ల మెజార్టీతో ,14 వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్ది బావండ్ల మంజుల 124 ఓట్ల మెజార్టీతో,15 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కుడుముల అస్మిత చంద్రకాంత్‌రెడ్డి,16 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది పసుల లలిత కిరణ్ కుమార్ రెడ్డి,17 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది షాన్‌వాజ్ ఖాన్ 119 ఓట్ల మెజార్టీతో ,18 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది నాజియా మక్బుల్ 82 ఓట్ల మెజార్టీతో ,19 వ వార్డు లో బిఆర్‌ఎస్ అభ్యర్ది షాహెద్ 32 ఓట్ల మెజార్టీతో ,20 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి 510 ఓట్ల బారీ మెజార్టీతో,21 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది మబ్బు రామరాజు 159 ఓట్ల మెజార్టీతో ,22 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కొల్లోజు రాజేష్ 101 ఓట్ల మెజార్టీతో తమ ప్రత్యుర్దు ల పై గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికైనట్లు పత్రాలను అందజేశారు.గెలుపొందిన చైర్మెన్ అభ్యర్ది బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ను కల్వకుర్తి ఎంఎల్‌ఏ కసిరెడ్డి నారాయణరెడ్డి అభినందించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం నుండి ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ డీజే సౌండ్స్ మద్యన నృత్యాలు చేస్తూ ,స్వీటు మిఠాయిలు తినిపించుకుంటూ శాలువాలతో సన్మానిస్తూ సంబరాలు జరుపుకున్నారు.అదే విదంగా బాజపా ఎప్పుడు లేని విదంగా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చి బిఆర్‌ఎస్ మూడో స్థానానికి నెట్టి ప్రతి పక్షం రావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:43 pm

great police |నేరస్తులకు నో చాన్స్..!

great police | నేరస్తులకు నో చాన్స్..! -స్టేషన్ ఘన్ పూర్ పోలీసుల

ప్రభ న్యూస్ 13 Feb 2026 8:39 pm

నారాయణపేట మున్సిపాలిటీ లో వికసించిన కమలం

 నారాయణపేట పట్టణం బిజెపికి కంచు కోట అని మరోమారు రుజువైంది. పట్టణంలోని 24 వార్డులలో బిజెపి 11 వార్డుల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ 07, టిఆర్‌ఎస్ 02, ఎంఐఎం 02, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 01, స్వతంత్ర 01 స్థానాలు సొంతమైంది. జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద కౌంటింగ్ నిర్వహించగా ఉదయం నుంచి వార్డుల నుంచి కౌన్సిలర్ అభ్యర్థుల అభిమానులు తరలివచ్చారు. మొత్తం మూడు రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. గెలిచిన అత్తకోడళ్ళు... పేట మున్సిపల్ ఎన్నికల్లో రెండు వేరు వేరు పార్టీలకు చెందిన అత్తకొడల్లు మొదటి సారి కౌన్సిలర్ గా విజయం సాధించారు. 17వ వార్డు నుంచి కర్రే కల్పన బిజెపి నుంచి కౌన్సిలర్ గా గెలుపొందగా ఈమెకు కోడలు వరుస అయిన 20వ వార్డు అభ్యర్థి శ్వేత కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా గెలుపొందింది. అలాగే గతంలో పేట మున్సిపల్ ఎన్నికల్లో గతంలో వైస్ చైర్మన్ గా పనిచేసిన ఇద్దరు అభ్యర్థులు హరి నారాయణ భట్టాడ్, నందునామాజీలు ఓటమి చెందారు. అలాగే కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్న 5 వ వార్డులో బిజెపి అభ్యర్థి ఎరుకలి రఘు విజయం సాధించారు. ఇదిలా ఉండగా 20 వ వార్డు కు సంబంధిన బీజేపీ అభ్యర్థులు 17 వ వార్డు లో కల్పన, 6 వ వార్డు లో మంజుల, 4 వార్డు లో శ్వేత గెలుపొందారు. కానీ ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శ్వేత వెంకటేష్ గౌడ్ గెలుపొందడం విశేషం. 1 సుతారి సత్య రఘుపాల్ (బీజేపీ), 2 కె.సౌజన్య (బీజేపీ), 3 కాకర్ల నారాయణమ్మ (బీఆర్‌ఎస్), 4 కొండా శ్వేతా సత్య యాదవ్ (బీజేపీ), 5 ఎరుకలి రాఘవేంద్ర (బీజేపీ), 6 ఎన్. మంజుల (బీజేపీ),7 భరత్ (బీ ఆర్ ఎస్), 8 కందేన్ పల్లి సత్యమ్మ(కాంగ్రెస్), 9 యు. మహేష్ (కాంగ్రెస్), 10 జయశ్రీ (స్వతంత్ర), 11 భగవతి (ఏ ఐ ఎఫ్ బీ), 12 అప్పిరెడ్డి పల్లి రాము (బీజేపీ), 13 లక్మప్ప (బీజేపీ), 14 ఎల్. అరుణ (కాంగ్రెస్), 15 బండి రాజేశ్వరి (కాంగ్రెస్), 16 అంబికా శ్రీనివాస్ (బీజేపీ), 17 కర్రే కల్పన (బీజేపీ), 18 రవితేజ (కాంగ్రెస్), 19 బి. నాగమ్మ (బీజేపీ), 20 శ్వేత (కాంగ్రెస్), 21 కమలాపూర్ ప్రభాకర్ (బీజేపీ), 22 రాజు ఘాట్ (కాంగ్రెస్), 23 మహమ్మద్ తాకిచాంద్ (ఏఐఎంఐఎం), 24 మహమ్మద్ తకీ (ఏఐఎంఐఎం) లు ఆయా వార్డు లలో గెలుపొందారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:33 pm

మంచిర్యాల కార్పోరేషన్ హస్తందే

మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అత్యధిక కార్పోరేట్ స్ధానాలను హస్తగతం చేసుకుని కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. మున్సిపాలిటి నుంచి కార్పోరేషన్‌గా ఏర్పడిన 60 డివిజన్ స్దానాల్లో 44 స్దానాల్లో కాంగ్రెస్ అభ్యర్దులు ఘన విజయం సాధించారు.బిఆర్‌ఎస్ 08,బిజెపి05, ఆల్‌ఇండియా ఫార్పర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 02, జన సేన పార్టీ01లు గెలుపొందారు. శుక్రవారం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఫలితాలు పోటి చేసిన అభ్యర్దులకు గెలుపు ఓటములపై టెన్షన్ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ప్రతి రౌండ్‌లో వచ్చే ఓట్ల ఫలితాలు ఆందోళన కల్గించాయి. డివిజన్‌లోని 60 స్దానాల్లో కాంగ్రెస్,బిఆర్‌ఎస్,బిజెపి, ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ తో పాటు జనసేన పార్టీ నుంచి అభ్యర్దులు ఎన్నికల బరిలో పోటి చేశారు. కార్పోరేషన్ ఎన్నికల్లో 60 స్దానాల్లో 44 డివిజన్‌లలో కార్పోరేటర్‌లుగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వారు వీరే.....01,02,03 డివిజన్‌ల నుంచి శ్రీపతి కవిత శ్రీనివాస్,పుట్ట యశోద, పత్తి ప్రకృతి,07వ డివిజన్ వేల్పుల రవీందర్,09,10,11 డివిజన్‌లలో సురిమెళ్ల సౌమ్య, రాజకొండ గోపాల్, సుధమల్ల హరికృష్ణ,14,15,16,17,18,19,20,21,22 డివిజన్‌ల నుంచి తూముల నరేష్, చింతపండు శ్రీనివాస్, బియ్యాల త్రివేణి, లగిశెట్టి రాజయ్య, రాచమల్ల కమల, కాకుల వరలక్ష్మి, గంగవరపు వెంకటేశ్వర్లు, జోగుల సదానందం, రోజ కంకణాల,24వ డివిజన్ నుంచి బొడ్డు స్వప్న,29,30,31,32,33 డివిజన్‌లలో బండారి సుధాకర్,కర్రె శ్రీనివాస్,తాళ్ల సంపత్,ధరణి మధుకర్, ఎంబడి కుమార స్వామి,35,36,37,38,39,40,41,42,43,44వ డివిజన్‌ల నుంచి మర్రి శ్రీలత,అగల్ డ్యూటీ రాణి,మహమ్మద్ ఖలీద్,పూదరి విజయ, పూదరి సునీత,ఆది శశికళ,షేర్ శ్రీలక్ష్మి,చిందం సత్యవతి,చిలువేరు జ్యోతి,కోమాకుల కిషన్,46వ డివిజన్ నుంచి పెంట రజిత,48వ డివిజన్ నుంచి వేములపల్లి లక్ష్మీదుర్గ, 51,52,53,54,55,56 డివిజన్‌ల నుంచి నీలి స్వప్న, వీరమనేని స్రవంతి, మహమ్మద్ నూర్జహాన్ బేగం, సల్ల రమ్య, గాండ్ల సత్యమ్మ, నల్ల శంకర్,59,60 డివిజన్‌లలో మాదంశేట్టి సత్యనారాయణ, ఆఫ్రీన్ సుల్తానాలు ఉన్నారు. 04,13,23,28,45,47,49,50 డివిజన్‌లలో గుమ్మడి శ్రీను, వనరాశి నంబయ్య, కర్రు శంకర్, అమృతరాజ్ కుమార్,దోమల సునీత, కల్వల వెంకటసాయకృష్ణ, అబ్దుల్ సత్తార్, పెట్టం స్వరూప బిఆర్‌ఎస్ పార్టీల నుండి గెలుపొందారు. అలాగే 05,06,12,57,58 డివిజన్‌లలో తోటపల్లి రాజేశ్వరి,వనపర్తి కేత, గాజుల ముఖేశ్ గౌడ్, బొట్ల అనితలు బిజెపి నుండి గెలుపొందారు. కాగా ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 8 వ డివిజన్ మేకల రమేష్,26 డివిజన్ రవిలు గెలుపొందగా జనసేన పార్టీ నుండి 34వ డివిజన్‌లో పోటి చేసిన సాగర్ గెలుపొందారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:29 pm

తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ పాగ

తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ మరోసారి పట్టు సాధించింది. మొత్తం 16 వార్డులుగా ఉన్న తొర్రూరు మున్సిపాలిటీలో 9 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించి వరసగా రెండో సారి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొంది రెండవ స్థానానికి పరిమితమైంది. తొర్రూరు మున్సిపాలిటీగా అవిర్భావం చెందిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన పట్టు నిలుపుకుంది. మొదటి వార్డు నుండి బీఆర్‌ఎస్‌కు చెందిన భూసాని జయమ్మ 610 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి తాళ్లపెల్లి శ్రీలతకు 444 ఓట్లు రావడంతో జయమ్మ 166 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి తూనం శ్రవన్‌కుమార్‌కు 669 ఓట్లు రాగా సమీప ప్రత్యర్ధి బీఆర్‌ఎస్‌కు చెందిన సర్వి వెంకన్నకు 447 ఓట్లు రాగా శ్రవన్‌కుమార్ 222 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 3వ వార్డు నుండి బీఆర్‌ఎస్‌కు చెందిన తూర్పాటి రవికి 497 రాగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌కు చెందిన తూర్పాటి రాంబాబుకు 308 ఓట్లు రాగా రవి 189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 4వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి పేర్ల జంపన్నకు 605 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి జలకం శ్రీనివాస్‌కు 440 ఓట్లు పోల్ కాగా జంపన్న 165 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ది చాపల బాపురెడ్డికి 668 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి మచ్చ సురేష్‌కు 495 ఓట్లు పోల్ కావడంతో బాపురెడ్డి 173 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి పెదగాని కళావతికి 675 ఓట్లు పోల్ కాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి రాయిశెట్టి మానసకు 514 ఓట్లు రావడంతో కళావతి 161 మెజార్టీతో విజయం సాధించారు. 7వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి భవాని లతకు 598 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి జిలుకర సురేందర్‌కు 330 ఓట్లు రావడంతో భవానిలత 268 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 8వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి అల్లం శ్యామలకు 695 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి కేతిరెడ్డి సుమలతకు 399 ఓట్లు రాగా శ్యామల 296 ఓట్ల మెజార్టీతో గెలిచింది. 9వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి బీఆర్‌ఎస్ కిన్నెర కవితకు 451 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి పంజా కల్పనకు 438 ఓట్లు సాధించగా కవిత 13 ఓట్ల మెజార్టీతో గెలుపును సొంతం చేసుకున్నారు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి ముద్దసాని సురేష్‌కు 714 ఓట్లు రాగా ప్రత్యర్ధి బీఆర్‌ఎస్ అభ్యర్ధి రుద్రోజు విజయభాస్కర్‌కు 204 ఓట్లు రావడంతో సురేష్ 510 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 11వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి కర్నె నాగరాజుకు 473 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్ది పొనుగోటి సోమేశ్వర్‌రావుకు 440 ఓట్లు రావడంతో నాగరాజు 33ఓట్ల తేడాతో గెలిచారు. 12వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి ధరావత్ పద్మకు 562 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి కేతావత్ శ్రేయకు 391 ఓట్లు రావడంతో పద్మ 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి బసనబోయిన ఐలమ్మకు 615 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి ఎన్నమనేని శ్రీదేవికి 420 ఓట్లు రావడంతో ఐలమ్మ 195 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి సోమ రజనీకి 666 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ది మడిపెద్ది శ్రవంతికి 425 ఓట్లు రావడంతో రజనీ 241 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకుంది. 15వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్ధి చకిలేల అలివేణికి 383 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి బొమ్మనబోయిన సుజాతకు 357 ఓట్లు రావడంతో అలివేణి 26 ఓట్ల తేడాతో గెలుపొందింది. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి జాటోతు బద్రుకు 443 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి ధరావత్ వెంకన్నకు 339 ఓట్లు పోల్ కావడంతో బద్రు 104 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజేతలైన అభ్యర్థులకు అధికారులు దృవీకరణ పత్రాలను అందజేశారు. క్యాంపులకు తరలిన విజేతలు... ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు ప్రత్యేక క్యాంప్‌లకు తరలి వెళ్లారు. బీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 స్థానాలు రావడంతో ఎక్కడ కూడా చైర్మన్ గిరి చేజారకుండా బీఆర్‌ఎస్ విజేతలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక క్యాంప్‌లకు తరలించారు. కాంగ్రెస్‌కు రెండు స్థానాలు తక్కువ ఉన్నప్పటికి ఏదైనా అవకాశం చిక్కితే ప్రత్యర్ధి పార్టీల నుండి విజేతలను తమవైపు తిప్పుకుని చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలకు పదును పెట్టింది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సూచనలతో విజేతలైన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా క్యాంప్‌కు తరలి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బీఆర్‌ఎస్ విజేతలైన అభ్యర్థులను మాజీ మంత్రి దయాకర్‌రావు తన వెంట ప్రత్యేక బస్సులో ఆర్యభట్ట స్కూల్‌లోని కౌంటింగ్ కేంద్రానికి తీసుకువచ్చి అధికారుల చేతుల మీదుగా దృవీకరణ పత్రాలను తీసుకుని వెంటనే అదే బస్సులో తరలి వెళ్లారు. కాంగ్రెస్ విజేతలు కూడా ఇదే విధంగా ప్రత్యేక క్యాంప్‌కు వెళ్లారు. ఈ విషయం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్తేజాన్ని నింపింది. నాంచారిమడూర్ నుండి ఆర్యభట్ట పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రం వరకు బీఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి దయాకర్‌రావుకు స్వాగతం పలికారు. ఇరు పార్టీల విజేతలైన అభ్యర్థుల అనుచరులు వారి వార్డుల్లో బానాసంచాలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:26 pm

బాన్సువాడ మున్సిపల్‌పై జెండా ఎగురవేసిన కాంగ్రెస్

బాన్సువాడ మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 19 వార్డులకు గాను 11 వార్డులను కైవసం చేసుకోగా, ఈ సారి బీజెపీ పుంజుకుని 3 స్థానాల్లో విజయం సాధించగా, మరో 3 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుచుకుంది. అలాగే స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు గెలుపొందగా, మరో స్థానంలో ఎంఐఎం గెలిచింది.బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థికి సైతం మద్దతు తెలిపి గెలిపించారు. 1వ వార్డులో అభ్యర్థిని నస్రీన్ బేగం (బీఆర్‌ఎస్), 2వ వార్డులో జంగం రాజశేఖర్ (కాంగ్రెస్), 3వ వార్డులో అబ్దుల్ హకీం (కాంగ్రెస్), 4వ వార్డులో గైక్వాడ్ రుక్మిణి (కాంగ్రెస్), 5వ వార్డులో విజయ కాసులవార్ (కాంగ్రెస్), 6వ వార్డులో అంజుం బేగం (బీఆర్‌ఎస్), 7వ వార్డులో సామల మానస (బీజెపీ), 8వ వార్డులో శ్యామల దోన్కంటి (కాంగ్రెస్), 9వ వార్డులో పాశం ఆమని (బీజెపీ), 10వ వార్డులో జగన్నాథం నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డులో గదుమల లింగమేశ్వర్ (కాంగ్రెస్), 12వ వార్డులో గడ్డమీది అంజా గౌడ్ (స్వతంత్య్ర అభ్యర్థి), 13వ వార్డులో అబ్దుల్ ఖాలెక్ (కాంగ్రెస్), 14వ వార్డులో నార్ల వసంత (కాంగ్రెస్), 15వ వార్డులో వంకర్ రమేష్ (కాంగ్రెస్), 16వ వార్డులో గజ్జల మహేష్ (బీజెపీ), 17వ వార్డులో మహమ్మద్ ఫర్హానాజ్ (ఎంఐఎం), 18వ వార్డులో రేష్మా బేగం ఎజాజ్ (కాంగ్రెస్), 19వ వార్డులో యం.డి. మక్బూర్ (బీఆర్‌ఎస్) గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ 11 స్థానాల్లో బీజెపీ 3, బీఆర్‌ఎస్ 3, స్వతంత్య్ర 1, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింగా, 76 ఓట్లు పోలయ్యాయని, ఆయా వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసినట్లు అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:18 pm

పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

పరకాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు హోరాహోరీగా తలపడ్డ విషయం తెలిసిందే. జనరల్‌కు రిజర్వు అయిన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు పార్టీలు పెద్దయెత్తున ప్రలోభాల పర్వానికి తెర లేపడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు రౌండ్లలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ.. పట్టణంలోని గణపతి కళాశాలలో శుక్రవారం భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం నాలుగు రౌండ్లలో 22 వార్డుల ఓట్లను లెక్కించారు. నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ 13 వార్డులను గెలుచుకొని స్పష్టమైన మెజార్టీతో మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను ప్రత్యర్థి పార్టీల సాయం లేకుండా కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో తన ఖాతాలో వేసుకుంది. గెలుపొందిన కౌన్సిలర్లు వీరే... ఒకటవ వార్డులో బిఆర్‌ఎస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి, 2వ వార్డులో బిఆర్‌ఎస్ అభ్యర్థి బొచ్చు శ్యామల, 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పోరండ్ల మౌనిక, 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకు దివ్య, 5వ వార్డులో బిఆర్‌ఎస్ అభ్యర్థి గొడుగు రజిత, 6వ వార్డులో బిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల రాణి, 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ కుమార్, 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమార 9వ వార్డులో బిజెపి అభ్యర్థి బెజ్జంకి పూర్ణాచారి, 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పసుల లావణ్య, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గూడెల్లి సదన్ కుమార్, 12వ వార్డులో బిజెపి అభ్యర్థి ఆకుల లావణ్య, 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు మాధవీలత, 14వ వార్డులో బిఆర్‌ఎస్ పడిదెల దీప్తి, 15వ వార్డులో బిజెపి అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్, 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బండి శ్రీధర్, 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర, 18వ వార్డులో బిఆర్‌ఎస్ అభ్యర్థి రేగూరి కరుణ, 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొయ్యడ శ్రీనివాస్, 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాలకుర్తి శ్రీనివాస్, 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుదమళ్ళ రమేష్, 22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అల్లే దశరథం గెలుపొందారు. చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నిక లాంఛనమే! మొత్తం 22 వార్డుల్లో 13 వార్డులు కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడంతో మున్సిపల్ చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నిక లాంఛనం కానున్నది. చైర్మన్ అభ్యర్థిగా సునీల్ కుమార్‌ను ఇప్పటికే ఎంఎల్‌ఏ ప్రకాష్‌రెడ్డి ప్రకటించి ఉండడంతో వేరెవరు పోటీకి వచ్చే పరిస్థితి లేదు. ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో చైర్మన్‌గా సునీల్ కుమార్‌తో పాటు వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:14 pm

భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయబేరి

భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఒక్క భూపాలపల్లి మున్సిపాల్టీ ఎన్నికల్లో 16సీట్లు గెలుచుకొని అధికార కాంగ్రెస్‌పార్టీ విజయకేతనం ఎగరవేసింది. భూపాలపల్లిలోని మొత్తం 30వార్డులకు గాను కాంగ్రెస్ సిపిఐ, సిపిఎం మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది, సిపిఐ 4. సిపిఎం1 స్థానాల్లో పోటీచేసింది. 16 కాంగ్రెస్ గెలువగా, సిపిఐ ఒక్క స్థానం గెలిచింది. బీఆర్‌ఎస్ 25 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో గెలిచింది. బిజెపి 20కి పైగా పోటీచేసి రెండు స్థానల్లో గెలిచింది. 23 వార్డు లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గెలిచిన అభ్యర్థులు పార్టీలవారిగా 1 వ వార్డు బౌత్ శోభ రాజేష్. (కాంగ్రెస్), 2 వ వార్డు బుర్ర కొమురయ్య గౌడ్. (కాంగ్రెస్),3 వ వార్డు. ఎరవెల్లి జగపతి. (అరుణ్ రావు) (కాంగ్రెస్), 4 వ వార్డు. కన్నం యుగదీశ్వర్ బిజెపి, 5 వ వార్డు కట్ల పూర్ణ చందర్ బిఆర్‌ఎస్, 06 వ వార్డు. ఎరుకల రేణుక గణపతిబిజెపి. 7 వ వార్డు. రత్నం సుమాంజలి బిఆర్‌ఎస్, 8 వ వార్డు బెజ్జాల శ్యామల బిఆర్‌ఎస్, 9 వ వార్డు అప్పం కిషన్ (కాంగ్రెస్), 10 వ వార్డు. పుల్లూరి మంజుల మాధవరావు (కాంగ్రెస్),   11 వ వార్డు మోతె రాజుబీఆర్‌ఎస్, 12 వ వార్డు బొంతల సతీష్ బీఆర్‌ఎస్, 13 వ వార్డు బడితల వెంకటస్వామి (కాంగ్రెస్), 14 వ వార్డు మాకోటి శ్వేత ప్రభాకర్ (కాంగ్రెస్), 15 వ వార్డు. అంబాల శ్రీనివాస్(కాంగ్రెస్), 16 వ వార్డు. జ్యోతుల మంజుల బిఆర్‌ఎస్, 17 వ వార్డు బీర్తి కమల మధునయ్య. (కాంగ్రెస్),18 వ వార్డు ముంత సహదేవ్ (కాంగ్రెస్), 19 వ వార్డు కురుమిళ్ళ శ్రీనివాస్ (కాంగ్రెస్), 20 వ వార్డు ఇస్లావత్ రాజు నాయక్. (కాంగ్రెస్), 21 వ వార్డు దరావత్ శారద సమ్మయ్య. (కాంగ్రెస్), 22 వ వార్డు బుర్ర రమాదేవి సదానందం బిఆర్‌ఎస్, 23 వ వార్డు రాజేశ్వరి పద్మారెడ్డి (స్వతంత్ర అభ్యర్థి), 24 వ వార్డు. వేముల జ్యోతి శ్రీకాంత్ సిపిఐ, 25 వ వార్డు. పొనగంటి మేఘన. (కాంగ్రెస్), 26 వ వార్డు. ఓరుగంటి రాధ అయిలయ్య. (కాంగ్రెస్), 27 వ వార్డు. వాసాల ఈశ్వరమ్మ బిఆర్‌ఎస్, 28 వ వార్డు. భోగం నరేందర్బిఆర్‌ఎస్, 29 వ వార్డు. గండ్ర హరీష్ రెడ్డి బిఆర్‌ఎస్, 30 వ వార్డు. బొడ్డు అశోక్ (కాంగ్రెస్) లు గెలుపొందారు. మెజార్టీ స్థానాలు గెలుచుకున్న అధికా పార్టీ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మెన్ పీఠం దక్క నుంది.

మన తెలంగాణ 13 Feb 2026 8:10 pm

cash |పోగొట్టుకున్న నగదు వెంట‌నే…

cash | పోగొట్టుకున్న నగదు వెంట‌నే… cash | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Feb 2026 8:09 pm

Traffic |మనస్తాపానికి గురై పిల్లలతో నగరానికి…

Traffic | మనస్తాపానికి గురై పిల్లలతో నగరానికి… Traffic | విజయవాడ, క్రైమ్,

ప్రభ న్యూస్ 13 Feb 2026 8:04 pm

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?

హైదరాబాద్: తెలంగాణలో బుధవారం జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరిగింది. ఈ కౌంటింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 1,331 వార్డుల్లో విజయం సాధించి 83 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. భారత రాష్ట్ర సమితి 718 వార్డుల్లో గెలుపొంది 15 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బిజెపి 258 వార్డులు, స్వతంత్రులు 250 వార్డుల్లో విజయం సాధించారు. 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం గమనార్హం. జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. 7 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీదే హవా నడిచింది. రామగుండం, మంచిర్యాల, నల్గొండలో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఒకే సంఖ్య స్థానాల్లో గెలిచాయి. రెండు పార్టీలకు చెరి 22 స్థానాలు వచ్చాయి. 8 స్థానాల్లో బిఆర్ఎస్, బిజెపి 1, సిపిఎం 1, ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఛైర్మన్ ఎంపిక రసవత్తరంగా మారింది. కొత్తగూడెంలో సిపిఐకి బిఆర్ఎస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

మన తెలంగాణ 13 Feb 2026 8:03 pm

ఇల్లందు మున్సిపాలిటీ హస్త గతం

 అందరు అనుకున్నట్టుగానే ఇల్లందు మున్సిపాలిటీ అత్యధిక మెజార్టీ స్ధానాలు గెలుచుకోని మున్సిపల్ పిఠాన్ని దక్కించుకుంది. గత కోన్నిరోజులుగా స్ధానిక శాసనసభ్యులు కోరం కనకయ్య పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ గడపగడపకు ప్రచారం నిర్వహించడంతో ప్రజాపాలనను మెచ్చిన ప్రజలు కాంగ్రేస్‌కు పట్టం కట్టారు. మున్సిపాలిటీలోని మొత్తం ౨౪ వార్డులకు గాను కాంగ్రేస్ పార్టీ 19స్ధానాలు, బిఆర్‌ఎస్ 03స్ధానాలు, 02 ఇండిపెండెంట్‌లు గెలవడం జరిగింది. ఫలితాల లెక్కింపు ప్రక్రియను అధికారులు 24ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీహల్ నందు ఉదయం 8 గంటల నుండి ప్రారంభించారు. 24వార్డులకు గాను 16 టెబుల్స్‌ను ఏర్పాటుచేసి రెండు రౌండ్‌లలో ఫలితాలను లెక్కించారు. కౌంటింగ్ కేంద్రం ముందు పోలీస్‌లు పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేయడంతో పాటు పాస్‌లు లేకుండా లోపలికి ఎవరిని అనుమతించలేదు. గెలిపొందిన అభ్యర్ధులకు గెలుపు పత్రాలను ప్రొసిడింగ్ అధికారి అందజేశారు. అత్యధిక స్ధానాలు గెలుచుకున్న కాంగ్రేస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్ర ఎదుట సంబరాలు నిర్వహించారు. గెలుపొందిన అభ్యర్ధులను ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అభినందించారు. గెలిచిన కాంగ్రేస్ అభ్యర్ధులుః 2వ వార్డు దొడ్డా కిరణ్‌మిత్ర, 3వవార్డు అజ్మీరా వంశీ, 4వవార్డు మహ్మద్ కుష్బూ, 5వవార్డు చిల్లా విజయభారతి, 6వార్డు రాధాకోరి, 7వార్డు గోపగాని రాజు, 8వార్డు రేఖా స్వరూప, 9వార్డు గందె పద్మ, 10వార్డు మెరుగు కార్తిక్, 11వార్డు మొగిలి లక్ష్మి, 12వార్డు రంప రమ్య, 14వార్డు నీరుడు ఉపేంద్ర, 15వార్డు సోనిబాయి కోరి, 16వార్డు ఉల్లింగ విజయలక్ష్మి, 17వార్డు పెండ్యాల రాజు, 20వార్డు మహ్మద్ జాఫర్, 21వార్డు నీలపు రమేష్, 23వార్డు కొండపల్లి సరిత, 24వార్డు శనిగారపు శృతి. బిఆర్‌ఎస్ అభ్యర్ధులుః 13వవార్డు దండు సారయ్య, 18వార్డు పాబోలు స్వాతి, 19వార్డు పింగళి అనూహ్య. స్వతంత్రులుః 1వవార్డు షేక్ సైదామియా, 22వార్డు కొర్లపాటి శివకిరణ్‌లు వున్నారు.

మన తెలంగాణ 13 Feb 2026 8:01 pm

Vijay |ఉరి వేసుకొని మృతి…

Vijay | ఉరి వేసుకొని మృతి… Vijay | వర్ని, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Feb 2026 7:57 pm

13 wards |స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘన విజయం!

13 wards | స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘన విజయం! 13 wards |

ప్రభ న్యూస్ 13 Feb 2026 7:51 pm

ଫ୍ୟାକ୍ଟଚେକ୍: ମେଟ୍ରୋରେ ନିର୍ବନ୍ଧ ହେଉଥିବା ଭିଡିଓଟି ପ୍ରାୟୋଜିତ ଅଟେ

ଭାଇରାଲ ହେଉଛି ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆ ସାଜିଛି ବାହକ । ପ୍ରାୟ ପ୍ରତ୍ୟେକ ଦିନ ସୋସିଆଲ ମିଡିଆରେ କିଛିନାକିଛି ନୂଆ ଭିଡିଓ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । କେତେବେଳେ କିଏ ରାଜନେତାଙ୍କ ମିଛ ଫଟୋ ଭାଇରାଲ କରୁଛି ତ କେତେବେଳେ କେଉଁ ଅଞ୍ଚଳର ଘଟଣାକୁ ଅନ୍ୟ କେଉଁ ଅଞ୍ଚଳର ଘଟଣା ଲେଖି ସେୟାର କରାଯାଉଛି । ଅଧିକ ଲାଇକ କମେଣ୍ଟ ଆଶାରେ ୟୁଜର୍ସ ମଧ୍ୟ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନପରଖି ସେୟାର କରିବାରେ ଲାଗିଛନ୍ତି । ତେଣୁ ବହୁଳ ମାତ୍ରାରେ ଭୁଲ୍ ସୂଚନା ବ୍ୟପିବାରେ ଲାଗିଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଦୁଇଜଣ ପ୍ରେମୀ ଯୁଗଳ ବସିଥିବା ବେଳେ ସେଠାରେ ଜଣେ ମହିଳା ପହଁଚି ଦୁହେଁଙ୍କୁ ବଡ଼ ପାଟିରେ କିଛି କହୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ମହିଳା ଜଣଙ୍କ ସେଠାରେ ଥିବା ପୁଅର ମା ବୋଲି କୁହାଯାଉଛି । ଉଭୟଙ୍କୁ ପୁଅର ମା ଧରିବା ପରେ ସେହି ସ୍ଥାନରେ ହିଁ ଉଭୟଙ୍କୁ ନିର୍ବନ୍ଧ କରିଦେଉଥିବାର ଉକ୍ତ ଭିଡିଓରେ ଦେଖିବାକୁ ମିଳିଛି ।  View this post on Instagram A post shared by NextGen Bhartiya (@nextgenbhartiya) Secret meetup quickly turned into a LIFETIME MATCH at a Metro Station when a mother caught her son with his girlfriend. Instead of creating a scene she stunned everyone by handling the situation in the most unexpected way — she treated the moment into an INSTANT ENGAGEMENT!! ❤️❤️ pic.twitter.com/JbJYorH53B — Rosy (@rose_k01) February 7, 2026 ଯାହାର ଆର୍କାଇଭ  ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରାୟୋଜିତ ଅଟେ । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର ଏକ ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଆରଭ ମାଭି ନାମକ ଜଣେ କଣ୍ଟେଣ୍ଟ କ୍ରିଏଟରଙ୍କ ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲ ଚଲତେ ଫିର୍ତେର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ସର୍ବମୋଟ ୧୮ମିନିଟର ହୋଇଥିବା ବେଳେ ଶୀର୍ଷକରେ ଉଲ୍ଲେଖ ରହିଥିଲା ସିଦ୍ଧାର୍ଥ ଏବଂ ଦୀକ୍ଷାର ବିବାହ ଉତ୍ସବ । ୫ ଫେବୃଆରୀରେ ଉକ୍ତ ଭିଡିଓଟି ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ବେଳେ ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ୪.୭ହଜାର ଲାଇକ ଏବଂ ୧ଲକ୍ଷ ୬୭ ହଜାର ୩୦୮ଭିୟୁ ମିଳିପାରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଭିଡିଓକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ତର୍ଜମା କରି ଦେଖିବାରୁ ଅନ୍ୟୁନ୍ୟ ୧୫ମିନିଟ ସମୟ ମଧ୍ୟରେ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ ।  ଉକ୍ତ ଭିଡିଓର ପ୍ରଥମରୁ ହିଁ ଜଣେ ବ୍ୟକ୍ତି କହିଛନ୍ତି ଏହା ଏକା ପ୍ରାୟୋଜିତ ଭିଡିଓ ଅଟେ । ଏଭଳି ବହୁତ କମ୍ ପରିବାର ଅଛନ୍ତି ଯେଉଁଠି ପୁଅ କିମ୍ବା ଝିଅ ଘର ପ୍ରେମ ସମ୍ପର୍କକୁ ସ୍ୱୀକୃତି ଦେଉଛନ୍ତି । ତାହାକୁ ନେଇ ଆମେ ଏହି ସୂଟ ଆଜି କରିବାକୁ ଯାଉଛୁ । ସେହିପରି ଚଲତେ ଫିରତେ ନିଜ ଇନସ୍ଟାଗ୍ରାମ ଆକାଉଣ୍ଟରେ ମଧ୍ୟ ସମାନ ଭିଡିଓ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି ।  View this post on Instagram A post shared by Aarav mavi (@chalte_phirte098) ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ଭିଡିଓଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରାୟୋଜିତ ଅଟେ । କେବଳ ମନୋରଞ୍ଜନ ନିମନ୍ତେ ଉକ୍ତ ଭିଡିଓଟିକୁ ସୁଟ କରି ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରାଯାଇଥିବାର ଜଣାଯାଇଛି । ଯାହାକୁ ମୁଳ ଭିଡିଓରୁ କିଛି ଅଂଶ ଏଡିଟ କରି ଭୁଲ୍ ଦାବି ସହ ସେୟାର କରାଯାଇଛି ।

తెలుగు పోస్ట్ 13 Feb 2026 7:46 pm

డయాబెటిస్ ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ రాదా? ఈ 3 నిజాలు మీకు తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు లభిస్తాయా? ప్రీమియం ఎంత ఉంటుంది? మధుమేహం ఉన్నవారు బీమా పొందేందుకు పాటించాల్సిన నిబంధనలు, చిట్కాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. భారతదేశాన్ని ‘ప్రపంచ డయాబెటిస్ రాజధాని’ అని పిలుస్తుంటారు. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే, డయాబెటిస్ రాగానే చాలా మంది భయపడే విషయం—”ఇక నాకు లైఫ్ ఇన్సూరెన్స్ లభించదా? నా కుటుంబానికి రక్షణ ఎలా?” అని. నిజానికి, డయాబెటిస్ ఉన్నంత […] The post డయాబెటిస్ ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ రాదా? ఈ 3 నిజాలు మీకు తెలుసా? appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 13 Feb 2026 7:43 pm

Photos : Funky Success Meet

The post Photos : Funky Success Meet appeared first on Telugu360 .

తెలుగు 360 13 Feb 2026 7:40 pm

Municipal |ఎల్లంపేట మున్సిపల్‌లో హంగు…

Municipal | ఎల్లంపేట మున్సిపల్‌లో హంగు… Municipal | మేడ్చల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Feb 2026 7:40 pm

Mahesh Babu and Allu Arjun to Miss 2026

2026 is packed with several films in Telugu cinema. Almost all the actors will test their luck with their respective films. Megastar Chiranjeevi started the year for Telugu cinema on a rampage mode and all the Mega heroes will test their luck in summer this year. All the top stars excluding Mahesh Babu and Allu […] The post Mahesh Babu and Allu Arjun to Miss 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 13 Feb 2026 7:29 pm

விஜய்க்கு ஆதரவாக நாடாளுமன்றத்தில் தயாநிதி மாறன் குரல் கொடுத்தாரா?

விஜய்க்கு ஆதரவாக நாடாளுமன்றத்தில் தயாநிதி மாறன் பேசியதாக பரவும் வீடியோ 6 ஆண்டுகள் பழையது.

తెలుగు పోస్ట్ 13 Feb 2026 7:26 pm

election |ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం..

election | ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం.. election | నిజాంబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Feb 2026 7:26 pm

success |పీసీసీని కలిసిన కాంగ్రెస్ విజేతలు

success | పీసీసీని కలిసిన కాంగ్రెస్ విజేతలు success | భీంగల్ టౌన్,

ప్రభ న్యూస్ 13 Feb 2026 7:22 pm

election | 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి విజయం

election | 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి విజయం election | నిజామాబాద్,

ప్రభ న్యూస్ 13 Feb 2026 7:17 pm

Village |గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలి…

Village | గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలి… Village | మునుగోడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Feb 2026 7:12 pm

గజ్వేల్‌ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ విజయ దందుభి

గజ్వేల్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటంగ్ శుక్రవారం జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 83, బిఆర్ఎస్ 15, బిజెపి 2, ఇతరులు 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. అయితే ఈ ఫలితాల్లో గజ్వేల్‌లో గులాబీ జెండా ఎగిరింది. గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా.. బిఆర్ఎస్ 11 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 7, బిజెపి 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. 

మన తెలంగాణ 13 Feb 2026 7:03 pm

4sides |పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ

4sides |పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ 4sides

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:59 pm

Ambulance |ప్రమాదవశాత్తు…

Ambulance | ప్రమాదవశాత్తు… Ambulance | ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:54 pm

పరిగి కౌంటింగ్ కేంద్రం వద్ద బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

పరిగి: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడుతున్నాయి. ఎక్కువ భాగం మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. అయితే వికారాబాద్ జిల్లా పరిగిలో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మున్సిపాలిటీలో బిఆర్ఎస్, కాంగ్రెస్ చెరి 8 వార్డుల్లో గెలుపొందాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో స్వతంత్ర అభ్యర్థుల కోసం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నేతలను బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో బిఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్ కేంద్రం ముందు బిఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. 

మన తెలంగాణ 13 Feb 2026 6:50 pm

Electricity |విద్యుత్ సరఫరాలో అంతరాయం

Electricity | విద్యుత్ సరఫరాలో అంతరాయం Electricity | జైనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:47 pm

Municipal 2026 |అవును… వాళ్లిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు…

Municipal 2026 | అవును… వాళ్లిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు… Municipal 2026 | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:40 pm

Revanth Reddy : వైఎస్ బాటను రేవంత్ ఎంచుకుంటున్నట్లుందిగా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్న మార్గంలో వెళుతున్నారు

తెలుగు పోస్ట్ 13 Feb 2026 6:34 pm

ఆస్ట్రేలియాపై జింబాబ్వే అద్భుత విజయం

టి20 ప్రపంచకప్‌లో పెను సంచనలం నమోదైంది. శుక్రవారం జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో పటిష్టమైన ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. జింబాబ్వేకు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లను హడలెత్తించారు. ఓపెనర్లు జోష్ ఇంగ్లిస్ (8), ట్రావిస్ హెడ్ (17)లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన కామెరూన్ గ్రీన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ వెంటనే టిమ్ డేవిడ్ కూడా వెనుదిరిగాడు. అతను కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో మాక్స్‌వెల్, మాట్ రెన్‌షాలు కుదురుగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు జింబాబ్వే బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మాక్స్‌వెల్, రెన్‌షాలు కలిసి ఐదో వికెట్ 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కుదరుగా ఆడుతున్న మాక్స్‌వెల్ (31)ను రియాన్ బుర్ల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. మార్కస్ స్టోయినిస్ (6), నాథన్ ఎల్లిస్ (7), ఆడమ్ జంపా (2), మాథ్యూ కుహ్నెమన్ (0) నిరాశ పరిచారు. ఒంటరి పోరాటం చేసిన రెన్‌షా 44 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్‌తో 65 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబ్బాని 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఎవన్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, మరుమని శుభారంభం అందించారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. మరుమాని దూకుడుగా ఆడగా, బెన్నెట్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ధాటిగా ఆడిన మరుమాని 21 బంతుల్లోనే 7 ఫోర్లతో 35 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రియాన్ బుర్ల్ 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. కెప్టెన్ సికందర్ రజా 25 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇక అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన బెన్నెట్ 56 బంతుల్లో ఏడు ఫోర్లతో అజేయంగా 64 పరుగులు సాధించాడు. దీంతో జింబాబ్వే స్కోరు 169 పరుగులకు చేరింది.

మన తెలంగాణ 13 Feb 2026 6:31 pm

Vishnu Vinyasam Modhale Modhale Song: Perfect V’ Day Treat

King of Entertainment Sree Vishnu has earned a huge name and reputation for his pure entertainers that drive audiences to theatres. He is working with writer-director Yedunaath Maruthi Rao for a complete entertainer, Vishnu Vinyasam. The movie has huge anticipation as first single and title glimpse became viral hits. Now, the makers have unveiled second […] The post Vishnu Vinyasam Modhale Modhale Song: Perfect V’ Day Treat appeared first on Telugu360 .

తెలుగు 360 13 Feb 2026 6:25 pm

డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటా..

డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటా.. నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజాంబాద్ నగరంలోని 26వ

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:19 pm

33 వార్డుల ఫలితాలు వెల్లడి..

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:17 pm

Chiru Shares Beautiful Family Moment From Naming Ritual

Ram Charan and Upasana Konidela have stepped into a new phase of happiness with the arrival of their twins. Following the cherished customs of both the Konidela and Kamineni families, a traditional naming ceremony was held recently to formally introduce the newborns. The little boy was named Shiva Ram Konidela, while the girl received the […] The post Chiru Shares Beautiful Family Moment From Naming Ritual appeared first on Telugu360 .

తెలుగు 360 13 Feb 2026 6:14 pm

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్…

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్… స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:13 pm

13thFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

13thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:09 pm

డివిజన్ ప్రజలదే.. ఈ విజయం..

నిజామాబాద్,ఆంధ్రప్రభ : కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ గెలుపు డివిజన్ ప్రజలదేనని 50వ డివిజన్

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:09 pm

ఫలించిన సంజయ్ కృషి.. కరీంనగర్ కార్పొరేషన్‌లో బిజెపి హవా

కరీంనగర్: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు శుక్రవారం కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అధిపత్యం చూపిస్తుండగా.. బిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా తలపడుతున్నాయి. అయితే కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నేడు కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌దే పై చేయిగా ఉంది. కానీ, కరీంనగర్ కార్పొరేషన్‌లో మాత్రం భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్‌తో కేంద్ర మంత్రి బండి సంజయ్ బిజెపిని గట్టెక్కించారు. ఇప్పటివరకూ బిజెపి 31 డివిజన్లలో విజయం సాధించగా.. కాంగ్రెస్ 14, బిఆర్ఎస్ 10, ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో గెలిచారు. ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిషియోతో కరీంగనర్‌లో బిజెపి జెండా రెపరెపలాడుతోంది. దీంతో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారిగా కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి దక్కింది. 

మన తెలంగాణ 13 Feb 2026 6:04 pm

ఘనంగా ఆంగ్లభాషా దినోత్సవ వేడుకలు..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:04 pm

525 communities |మార్చి 19న ఢిల్లీలో ముగింపు

525 communities | మార్చి 19న ఢిల్లీలో ముగింపు 525 communities |

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:03 pm

ఘనంగా సద్గురు పులాజీ బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవం

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)

ప్రభ న్యూస్ 13 Feb 2026 6:01 pm

municipolls2026 |అత్యధిక మున్సిపాలిటీలు కైవసం – రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విజయం

municipolls2026 | అత్యధిక మున్సిపాలిటీలు కైవసం – రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విజయం

ప్రభ న్యూస్ 13 Feb 2026 5:59 pm

కొత్తగూడెంలో కార్పొరేషన్‌‌లో సిపిఐ, కాంగ్రెస్ మధ్య టై

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో ఈ నెల 11న జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకూ వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలు కాంగ్రెస్ కంటే చాలా వెనుకంజలో ఉన్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య టై అయింది. మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా.. సిపిఐ, కాంగ్రెస్‌ చెరి 22 డివిజన్లలో విజయం సాధించాయి. ఇక బిఆర్ఎస్ 08, సిపిఎం 01, బిజెపి 01, ఇండిపెండెంట్‌లు 6లో గెలిచాయి.

మన తెలంగాణ 13 Feb 2026 5:33 pm

ఆంధ్రప్రభ ఎఫెక్ట్

ఆంధ్రప్రభ ఎఫెక్ట్ వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో డ్రైనేజ్

ప్రభ న్యూస్ 13 Feb 2026 5:27 pm