SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
...

సోమవారం రాశి ఫలాలు (16-03-2026)

మేషం ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృషభం చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మిధునం వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తికావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కర్కాటకం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సింహం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కన్య వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. తుల ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వృశ్చికం రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ధనస్సు దైవచింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. మకరం అనుకోని అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుంభం నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. మీనం నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. గో సేవ చేస్తారు.  

మన తెలంగాణ 16 Mar 2026 12:20 am

UBS Will Become Big Hit Like Gabbar Singh: Pawan

The pre-release event was Ustaad Bhagat Singh was organized in a majestic manner, and of course, Power Star Pawan Kalyan’s presence is the biggest attractions. Director Harish Shankar opened up about the long and emotional journey of Ustaad Bhagat Singh. “I initially thought of making it as an extension of Khushi. But as the script […] The post UBS Will Become Big Hit Like Gabbar Singh: Pawan appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 12:05 am

కారుణ్య మరణం అనే మెర్సి కిల్లింగ్

భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ లేక కారుణ్య మరణం అనేది చట్టం ప్రకారం నేరం. కేవలం కోర్టులు మాత్రమే దానికి అనుమతించాలి. అప్పుడే డాక్టర్లు ఆ పేషెంట్ కు మరణాన్ని నిర్ధారించవచ్చు. పేషెంట్ మరణశయ్య పై ఉన్నాడని లేక వైద్యానికి రెస్పాండ్ కాలేదనో, కోమాలో ఉన్నాడనో వైద్యాన్ని ఆపేసే హక్కు వైద్యులకు లేదు. పాసివ్ యూధనేషియా అంటే కారుణ్య మరణం ప్రసాదించాలి అంటే కేవలం కోర్టులు మాత్రమే జోక్యం చేసుకొని ప్రసాదించాలి. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో అవిభాజ్యంగా ఉంటుంది అనేది కోర్టు తీసుకున్న నిర్ణయం. ఇది చాలా దేశాలలో ఉన్నప్పటికీ మన భారత దేశంలో మొట్టమొదటిసారిగా దీనిని అమలు చేశారు. ప్రజలు కానీ డాక్టర్లు గాని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెర్సి కిల్లింగ్ అనేది కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలి. వైద్యులు ఇక పేషెంట్ ఏమాత్రం వైద్యానికి రెస్పాండ్ కాడు అతను జీవచ్ఛవమే అతను బ్రతికినప్పటికీ అతనికి ఎటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అని మాత్రమే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. తరువాత వారికి మరణాన్ని ప్రసాదించాలి అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. ఇది మేము మెడికల్ ఎథిక్స్ లో ఒక భాగంగా చెబుతూ ఉంటాం. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 15 Mar 2026 10:54 pm

NtrTrust |నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ

NtrTrust | నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ NtrTrust | ఎన్‌టీఆర్ ట్రస్ట్: ప్రాంతాలకతీతంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 10:34 pm

డ్రగ్స్ ఘటనపై పారదర్శక విచారణ జరపాలి

అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ మనతెలంగాణ/హైదరాబాద్ : మొయినాబాద్‌లోని మాజీ ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి పెద్దవారైనా చట్టం ముందు సమానంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి జరిగిన విందులో టిడిపి ఎంపీ మహేష్ యాదవ్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని సమాచారం ఉందని, ఆ ఫార్మ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరికాయని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో నిజానిజాలను పూర్తిగా వెలికితీయాలని అన్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా కెటిఆర్‌పై కావాలని బురద జల్లుతోందని మండిపడ్డారు. పిసిసి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి సహవాస దోషంతో కెటిఆర్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడిగా తన హోదాకు తగ్గట్టు వ్యవహరించకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ ఘటనకు కెటిఆర్‌ను లింకు పెట్టడం అంటే మోకాలికి బోడి గుండు కు సంబంధం అంటగట్టినట్లేనని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు ఉందా..? అని ప్రశ్నించారు. చెర్లపల్లిలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ముంబై పోలీసులు పట్టుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముంబై పోలీసులు వచ్చే వరకు రాష్ట్రంలోని ఈగల్ పోలీసులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఇది సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా..? అని ప్రశ్నించారు. డ్రగ్స్ అంశంపై ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, డ్రగ్స్ టెస్ట్‌కు బిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం కాగానే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలువరుసగా నిలబడి డ్రగ్ టెస్ట్ చేయించుకుందామని దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. దీనికి సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమా..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:25 pm

ఉప్పల్ లో ప్లే గ్రౌండ్‌లో ఘర్షణ… మెయిన్ రోడ్డుపై కానిస్టేబుల్ హత్య

చిల్కానగర్‌లో దారుణ ఘటన పిలిపించి పబ్లిక్ చూస్తుండగానే కత్తులతో వెంటపడి దాడి భయంతో పరుగులు తీసిన స్థానికులు మన తెలంగాణ / ఉప్పల్: ఉప్పల్ పరిధిలోని చిల్కానగర్ రోడ్డులో ఆదర్శనగర్ సాయిబాబా గుడి వద్ద ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం… చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న సుధీర్ రెడ్డి (35) హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం చిల్కానగర్ రోడ్డులోని ఆదర్శనగర్ ప్లే గ్రౌండ్ వద్ద కొంతమంది యువకులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం దుండగులు సుధీర్ రెడ్డిని వెంబడిస్తూ మెయిన్ రోడ్డువరకు వచ్చి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. పలుమార్లు కత్తులతో పొడవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఘటన అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. పబ్లిక్ చూస్తుండగానే ఈ దాడి జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడు సుధీర్ రెడ్డి స్నేహితుడైన సంతోష్ నాయక్ అనే వ్యక్తి పేరు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చిల్కానగర్ ప్రాంతానికి పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:13 pm

డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం

ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా నా పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుంది బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. డ్రగ్స్ వాడేవారు ఎవరైనా, ఏ పార్టీకి చెందినవారైనా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ఏ టెస్టుకైనా తాను సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయించుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని, మనమే ఉదాహరణగా నిలుద్దాం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అని పేర్కొన్నారు. డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా తాను వ్యతిరేకం అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని బిఆర్‌ఎస్ పార్టీపై బురద చల్లడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా తన పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మన తెలంగాణ 15 Mar 2026 9:57 pm

ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు

మొదటి విడతలో ఒక ఎకరం వరకు 70 లక్షల మంది ఖాతాల్లో రూ.3,590 కోట్లు 20 రోజుల్లో రూ.2,650 కోట్లు సిఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేయనున్నట్లు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈమేరకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సిఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాల్లో నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి నుండే రైతు భరోసా తొలి విడుత నిధులు విడుదల చేయనున్నారు. తొలి విడత రైతు భరోసాలో ఒక ఎకరం భూమి కలిగిన 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తరువాత రెండో విడత రైతు భరోసా నిధులు రూ. 2,650 కోట్ల రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివర వరకు మూడోవిడతగా మొత్ంత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని, మూడు విడతలుగా మొత్తం సుమారు తోమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

మన తెలంగాణ 15 Mar 2026 9:36 pm

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందాం

ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు హాజరైన సిఎం, మంత్రులు, పిసిసి చీఫ్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహాభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. ఎల్.బి.స్టేడియంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రంజాన్ పవిత్ర మాసం సమాజంలో సఖ్యత, సోదర భావం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని మనమంతా కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి అవసరం అని ముస్లీంలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వందలాది మంది మైనార్టీ యువతీ యువకులకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు తీసుకువచ్చిన 4 శాతం రిజర్వేషన్లే కారణం అని సిఎం పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ద్వారా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి, షబ్బీర్ అలీకి సలహాదారుగా, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డిఎస్‌పిగా ఉద్యోగ కల్పించడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. 8 మంది మైనారిటీ నాయకులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ రంజాన్ పండుగ ప్రజల్లో సఖ్యత, సోదరభావం తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ మత సామరస్యంతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు అని, విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం అని వ్యాఖ్యానించారు. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత అని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు. ఈ ఇఫ్తార్ విందులో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.  

మన తెలంగాణ 15 Mar 2026 9:23 pm

పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది

పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది నమిలిగొండలో పారిశుధ్య కార్మికులకు ఘనంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:20 pm

ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి

ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:05 pm

బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం ఆశయాలను సాధించాలి

బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం ఆశయాలను సాధించాలి బీఎస్పీ నేతలు శ్రీరామ్ కృష్ణ, సుభాష్

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:01 pm

కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి

కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి చౌటుప్పల్,ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:58 pm

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:54 pm

బాబాపూర్ లో వరకట్నం నిషేధం

బాబాపూర్ లో వరకట్నం నిషేధం ఇంటింటికి తోచినంత సహాయం వధువుకు అందజేత ఉట్నూర్,

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:50 pm

కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి

విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్ వెల్ కూలీ సంతురాం (35) మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా బోర్ వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న సంతురాం, పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో సంతురాం వాహనం కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ […] The post కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 8:44 pm

వృద్ధురాలి కాళ్లపై ఎక్కిన ఆర్టీసీ బస్సు

వృద్ధురాలి కాళ్లపై ఎక్కిన ఆర్టీసీ బస్సు పలమనేరు,ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:42 pm

వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి

వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి అప్పుతీసుకొన్న వ్యక్తికి తెగిన చేతివేళ్లు గంగవరం,

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:39 pm

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం […] The post అప్పుల బాధతో రైతు ఆత్మహత్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 8:37 pm

ముత్తారం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి

ముత్తారం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి ముత్తారం, ఆంధ్రప్రభ : ముత్తారం, మృతుల

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:33 pm

ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి

ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన మర్రి ప్రశాంత్, శ్రావణి అనే దంపతులు హైదరాబాద్ లోని రాంనగర్ లో నివసిస్తున్నారు. దంపతులు తమ కుమారుడు సహస్రాతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి ఎరుపు రంగు కారు ఢీకొట్టడంతో వారు కిందపడిపోయారు. భార్యభర్తలు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో ఉద్యోగిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజీకి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మన తెలంగాణ 15 Mar 2026 8:28 pm

పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక

పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు

ప్రభ న్యూస్ 15 Mar 2026 8:11 pm

మూసీ భూములు ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే యత్నం

రేవంత్‌రెడ్డి చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారు పూర్తి డిపిఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన పేరుతో దాని పరివాహక ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటి వరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డిపిఆర్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదని, ఫేజ్ -1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను మాత్రమే చూపించిందని అన్నారు. పూర్తి వివరాలు ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని విమర్శించారు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో ఈ ప్రాజెక్టుకు రూ. 5,641 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపిందని, అయితే ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు రూ. 1,400 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగిందని అన్నారు. ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ, సిఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి అరాచకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇప్పటివరకు ఆరు ఫిర్యాదులు చేశామని ప్రస్తావించారు. అవసరమైతే హైడ్రా కమిషనర్, ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నాళాలను ఆక్రమించి విల్లాలు నిర్మిస్తున్న సంస్థ తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు పెడుతున్నారని.. మీరేమైనా కంటెంట్ రైటర్లా ...? అంటూ ధ్వజమెత్తారు. హైడ్రా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. తాను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం, హైడ్రా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. హైడ్రా చేసిన ట్వీట్లు వెంటనే డిలీట్ చేయాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం చిన్న మోదీలా ఉంది గాంధీ విగ్రహం కోసం రూ.70 కోట్లు, రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే ప్రభుత్వం, సిఎం ఇంటి నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇళ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో చిన్న మోదీలా ఉందని వ్యాఖ్యానించారు. 2017లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును తిరస్కరించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అనుమతులు ఇచ్చిందని అన్నారు. మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నగరంలోని 16 నాళాల నుంచి మురికి నీరు మూసీలోకి వస్తోందని, నగర వ్యర్థాలన్నీ మూసీలోకే వెళ్తున్నాయని తెలిపారు. 1,430 ప్రాపర్టీలను కూల్చివేస్తామని ప్రభుత్వం చెబుతోందని, దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, అసలైన బాధితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాను, విశారదన్ కలిసి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఖమ్మంలో పర్యటిస్తామని కవిత తెలిపారు. వెలుగుమట్లలో నిజమైన బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తాను, విశారదన్ కలిసి చేసిన పోరాటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆమె పేర్కొన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 8:06 pm

బడ్జెట్ సమావేశాలకు కెసిఆర్ వస్తారా..?

ఎప్పటిలానే దూరంగానే ఉంటారా...? మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా...? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెసిఆర్ సభకు హాజరవడంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలకు రాకపోవచ్చని పలువురు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. తర్వాత రెండు రోజులు మంగళ, బుధవారాలు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇతర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 15 Mar 2026 8:03 pm

డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ పుట్ట మహేష్, రోహిత్ రెడ్డి పై చర్య తీసుకోవాలి

క్రీడలను యువత అభివృద్ధి కోసం వినియోగించాలి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా. కె. నారాయణ మన తెలంగాణ / హైదరాబాద్ : డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన టిడిపి ఎంపి పుట్ట మహేష్, మాజి ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి పై కఠిన చర్యలు, తీసుకోవాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా.కె. నారాయణ డిమాండ్ చేశారు. క్రీడలను కార్పొరేట్ లాభాల కోసం కాకుండా యువత అభివృద్ధి కోసం వినియోగించాలని ఆయన కోరారు. ఐపిఎల్ పేరుతో క్రీడాకారులను సంతలో సరుకుల్లా కొనుగోలు చేసే క్రీడా వ్యాపారాన్ని అరికట్టాలని నారాయణ కోరారు. ఎఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్ లో ఈ నెల 12నుండి 17వరకు నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్(బిపిఎల్) టోర్నీ నాల్గవ రోజు నారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి మొలుగురం కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా నారాయణ మాట్లాడుతూ దేశంలో క్రీడల అభివృద్ధి విషయంలో పాలక వర్గాలు అవలంబిస్తున్న విధానాలను తప్పుపట్టారు. దేశ యువతలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడా సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు వాటిని కార్పొరేట్ లాభాల కోసం ఉపయోగించే విధంగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ వంటి విప్లవ వీరుల ఆశయాలు యువతకు ప్రేరణ కావాలని నారాయణ పేర్కొన్నారు. యువత క్రీడలు, విద్య, సామాజిక బాధ్యతల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడలను కూడా వ్యాపారంగా మార్చి బెట్టింగ్ యాప్స్, మాదకద్రవ్యాల సంస్కృతి యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని హెచ్చరించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, పోరాటస్ఫూర్తి పెంపొందించే గొప్ప సాధనమని అన్నారు. భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ యువతలో చైతన్యం కలిగించే మంచి కార్యక్రమమని అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి మొలుగురం కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన సమస్యగా మారిందని, విద్యార్థులు, యువత అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యలో ముందుండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు, యువత ముందుండాలని, ఈ దిశగా యువతలో చైతన్యం కలిగించడానికి రెఐవైఎఫ్ నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అభినందనీయమని ఉప కులపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. సత్య ప్రసాద్, శ్రీమాన్, ఎఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్, రాజ్ కుమార్, మహేష్, భాను, సక్రి భాయి, హరీష్ లతో పాటు 5 టీమ్ ల క్రీడాకారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 7:59 pm

చికెన్ ధరలు పైపైకి...!

ప్రస్తుతం కిలో రూ.320..రానున్న రోజుల్లో రూ.380కి చేరే ఛాన్స్? మన తెలంగాణ/హైదరాబాద్ : అన్‌సీజన్‌లోనూ చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ట్రిపుల్ సెంచరీ దాటడంతో సామాన్యులకు చికెన్ కూర దూరమవుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సాధారణంగా డిమాండ్ తక్కువగా ఉండే అన్ సీజన్‌లోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటేసి కిలోకు రూ.320 వరకు అమ్ముడవుతున్నాయి. స్థానిక మార్కెట్లలో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం తో.. సామాన్య జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ ధర ఎంత అని అడిగి మరీ కొనకుండా వెళ్లిపోతున్నారని వ్యాపారాలు అంటున్నా రు. ఇదే ధరకు హాఫ్ కేజీ మటన్ వస్తది కదా అంటూ కొనకుండా కొనుగోలు దారులు వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం షాప్స్ అన్ని ఖాళీగా దర్శన మిస్తు న్నాయి. గతంలో ఇదే సమయంలో చికెన్ ధరలు తక్కువగా ఉండేవి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాపారులు చెబుతున్నా రు. పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా తగ్గిపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వారు వాపోతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో మార్కెట్‌లో చికెన్‌కు కొరత ఏర్పడిందని వ్యాపారుల మాటగా వినవస్తోం ది. ఈ కారణాల వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశ ముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనే కిలో చికెన్ ధర రూ.380 వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత భారంగా మారే అవకాశముందని సామాన్యులు ఆందోళన వ్యక్తపరుస్తు న్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 7:54 pm

సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం…

సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:46 pm

రామప్ప దేవాలయ పరిసరాలలోని జైన గుడిని పరిరక్షించాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయ పరిసరాల్లోని సా.శ.13వ శతాబ్దికి చెందిన వర్ధమాన మహావీరుని జైన గుడిని పదిలపరిచి, పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఇఒ, డా. ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి, అరవింద్ ఆర్య కోరారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనగుడిని కూడా ఆ జాబి తాలో చేర్చాలని కోరారు. ఆదివారం రామప్ప పరిసరాల్లోని కాకతీయ ఆనవాళ్లను పరిశీలించిన వారిద్దరు, జైనాలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గర్భాలయం, అర్దమండపం, రెండిటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణ కలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన (శిఖరం), దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్దం పడుతున్నాయన్నారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం శిల్పం చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుని లాంఛనమని, అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరునికి అంకితం చేయబడిందని చెప్పొచ్చని శివనాగిరెడ్డి, అరవింద్ ఆర్య చెప్పారు. అద్భుత కాకతీయ వాస్తు నైపుణ్యం ఉట్టిపడుతున్న ఈ ఆలయాన్ని కూడా పదిలపరిస్తే రామప్ప ఆలయ సందర్శకులకు మరో పర్యాటక ఆకర్షణ అవుతుందని వారన్నారు.  

మన తెలంగాణ 15 Mar 2026 7:43 pm

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:42 pm

పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న క‌లెక్ట‌ర్‌…

పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న క‌లెక్ట‌ర్‌… అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం…95,598 మంది

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:24 pm

సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ

సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ మోత్కూర్, ఆంధ్రప్రభ : జిల్లా రచయితల

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:15 pm

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ కాంగ్రెస్

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:14 pm

జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం

జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 15 Mar 2026 7:11 pm

నెతన్యాహు క్షేమంగా ఉన్నారు

వదంతుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటన టెల్ అవీవ్ : ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలో మరణించి ఉంటారని వస్తున్న ఊహాగానాలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. నెట్టింట ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేసింది. ఇక నెతన్యాహు తనయుడు కూడా కొన్ని రోజులుగా కనిపించట్లేదన్న వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన మార్చ్ 9 నుంచి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత శుక్రవారంనాడు నెతన్యాహు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన వీడియో సందేశంతో కూడిన పోస్ట్‌పై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ వీడియోలో పలు మార్లు నెతన్యాహు చేతి వేళ్లు ఆరు ఉన్నట్లు కనిపించాయి. అది ఏఐ వీడియో అని, నెతన్యాహు మరణించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 15 Mar 2026 7:07 pm

రైతన్నా మీకోసం.. రైతుల్లో అవ‌గాహ‌న‌…

రైతన్నా మీకోసం.. రైతుల్లో అవ‌గాహ‌న‌… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:58 pm

అక్కడ సరదా కోసం మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్

‘ఖర్గ్’పై సరదాగా మరిన్ని దాడులు చేస్తాం చమురు క్షేత్రాలను లక్షంగా చేసుకోలేదు సైనిక స్థావరాలను దారుణంగా దెబ్బతీశాం మొజ్తాబా బతికి ఉన్నాడనేది అనుమానమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు న్యూయార్క్ : పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారంనాడు ఓ వార్త సంస్థకకు ఇచ్చిన ఇంటర్వూలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న ఖర్గ్ ద్వీపంపై సరదాగా మరిన్ని దాడులు చేస్తామని అన్నారు. ఇప్పటికే మేం జరిపిన దాడుల్లో భారీగా దెబ్బతిందని, అధిక భాగం ధ్వంసమైందన్నారు. అత్యధికంగా సైనిక స్థావరాలనే లక్షంగా ఎంచుకున్నామని ట్రంప్ తెలిపారు. చమురు క్షేత్రాలను దాడులకు లక్షంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు దిశగా ఒప్పందానికి ఇరాన్ సంసిద్ధంగా ఉందని, అందుకు ప్రతిపాదిస్తున్న షరతులు మాత్రం అంగీకార యోగ్యంగా లేవన్నారు. యుద్దం ముగింపునకు తాము సిద్ధంగా లేమంటూనే ఇరాన్ విధిస్తున్న షరతులేంటో చెప్పేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడనడానికి రుజువులేంటని ట్రంప్ ప్రశ్నించారు. ఆయన బతికి ఉన్నట్లు లేడని తాను విన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు కదా అని ప్రశ్నించారు. ఒక వేళ బతికి ఉంటే ఆ దేశం కోసం.. లొంగిపోయేందుకుతెలివైన నిర్ణయం తీసుకుని ఉండేవారన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 6:54 pm

నెతన్యాహు బతికి ఉంటే వెంటాడి చంపుతాం

నెతన్యాహు చిన్నారుల హంతకుడు ఇప్పటికీ ఆయన ఉనికిపై అనుమానాలు ఉన్నాయి ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరిక టెహ్రాన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బయటి ప్రపంచానికి కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఉనికిపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతుతన్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఘాటు హెచ్చరిక చేసింది. నెతన్యాహు బతికి ఉన్నట్టయితే ఆయనను వెంటాడి మరీ అంతమొందిస్తామని హెచ్చరించింది. చిన్నారులను పొట్టనపెట్టుకున్న హంతకుడిగా నెతన్యాహును అభివర్ణించింది. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారా అనేది మాత్రం అనుమానమేనని ఇరాన్ అభిప్రాయపడింది. నెతన్యాహు మరణించి ఉంటాడని?.. లేకపోతే కుటుంబంతో పాటు దేశాన్ని వీడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇటీవల నెతన్యాహు పత్రికా సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వీడియోలో నెతన్యాహు చేతికి ఏకంగా ఆరు వేళ్లు ఉండటం గమనించిన కొందరు అది ఏఐతో చేసిన వీడియో అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో అమెరికా రాజకీయాల విశ్లేషకురాలు కాండిస్ ఓవెన్స్ కూడా నెతన్యాహు ఎక్కడ? అని ప్రశ్నించడం మరింత కలకలం రేపింది.

మన తెలంగాణ 15 Mar 2026 6:51 pm

Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry Polls Scheduled

The Election Commission of India has announced the schedule for the upcoming Assembly elections in five states. The elections will take place in Tamil Nadu, Kerala, West Bengal, Assam, and the Union Territory of Puducherry. The current terms of these assemblies are set to end in May and June, so the polling process will be […] The post Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry Polls Scheduled appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 6:46 pm

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:42 pm

10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున

10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:40 pm

ఎడపల్లి మండలంలో అకాల వర్షం…

ఎడపల్లి మండలంలో అకాల వర్షం… ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో ఆదివారం

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:38 pm

ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:28 pm

కొండపల్లిలో ఉపేంద్ర దాస్‌కు ఘన స్వాగతం…

కొండపల్లిలో ఉపేంద్ర దాస్‌కు ఘన స్వాగతం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గంగోత్రి నుంచి

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:27 pm

ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం

ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం జనగామ అర్బన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:23 pm

దూడల రాములు గౌడ్ కు ఘన నివాళి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన సీనియర్

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:22 pm

சிலிண்டர் இலவசமாக வழங்கப்படும் என பிரதமர் மோடி அறிவித்தாரா?

இலவச சிலிண்டர் வழங்கப்படும் என பிரதமர் மோடி அறிவித்ததாக தவறான தகவலுடன் டீப்பேக் வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது.

తెలుగు పోస్ట్ 15 Mar 2026 6:21 pm

జానకీబాయి యూత్ సేవలు ఆదర్శం

ఎడపల్లి, ఆంధ్రప్రభ: రాణి శీలం జానకీబాయి పేరుతో ఏర్పడిన జానకంపేట గ్రామంలో యువకులు

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:19 pm

పోలీసుల తనిఖీ నుంచి తప్పుంచుకోబోయి.. లారీ ఢీకొని యువకుడు మృతి

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఔటుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ట్యూషన్‌కు వెళ్లి అన్నదమ్ములు తిరిగి ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు వాహనాల తనఖీలు చేపట్టారు. యువకుడు భయపడి బైక్‌ను వెనక్కి తిప్పే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దర్నీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రణయ్ మరణించాడు. అతడు కీసరపల్లివాసిగా పోలీసులు గుర్తించారు. అయితే బైక్‌ను ఆపే క్రమంలో.. కానిస్టేబుల్ వెంటపడి బైక్ హ్యాండిల్‌ను పట్టుకొని లాగారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 6:14 pm

కాంగ్రెస్ తోనే ముస్లింల అభివృద్ధి సాధ్యం

తొర్రూరు, ఆంధ్రప్రభ : ముస్లింల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:14 pm

మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత…

మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత… రాయపర్తి, ఆంధ్రప్రభ : కొండూరు గ్రామ మత్స్యకార

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:11 pm

తొర్రూరులో చికిత్స కోసం వచ్చిన యువతితో వైద్యుడు అసభ్య ప్రవర్తన...

తొర్రూరు: చికిత్స కోసం వ‌చ్చిన యువ‌తితో డాక్ట‌ర్ అస‌భ్యంగా ప్రవర్తించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. పేషెంట్ త‌ర‌ఫు బంధువులు డాక్ట‌ర్‌కు దేహ‌శుద్ధి చేశారు.  21 ఏళ్ల యువతి జ్వరంతో బాధపడుతూ డాక్టర్ కిరణ్ కుమార్ వద్దకు చికిత్స కోసం వచ్చింది. సదరు యువతికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం ఆమెతో వైద్యులు  అసభ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. భయంతో తన భర్తకు యువతి వాట్సాప్ మెసేజ్ చేసింది. డాక్టర్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో యువతి బంధువులు దేహశుద్ధి చేశారు.  

మన తెలంగాణ 15 Mar 2026 6:10 pm

నేత్రదానంతో ‘సజీవం’.. సత్యప్రకాష్ కుటుంబీకుల ఆదర్శం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తన నేత్రాల

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:08 pm

ఇల్లు దగ్దం.. కుటుంబానికి స‌హాయం…

ఇల్లు దగ్దం.. కుటుంబానికి స‌హాయం… 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ హసన్

ప్రభ న్యూస్ 15 Mar 2026 6:07 pm

డ్రగ్స్ కేసులో టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేష‌న్ బెయిల్‌

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేష‌న్ బెయిల్‌ లభించింది. టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి రోహిత్ రెడ్డిని తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.  రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే టిడిపి ఎంపిని వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండడంతోనే స్టేషన్ బెయిల్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపి పుట్టా మ‌హేష్‌కు సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురికి పాజిటివ్ రాగా అందులో  బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ పెలైట్ రోహిత్ రెడ్డి తో పాటు అయన సోదరుడికి పాజిటివ్ వచ్చింది. 

మన తెలంగాణ 15 Mar 2026 5:59 pm

ధ్యానంతో మానసిక ప్రశాంతత..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రతినిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు సంపూర్ణ

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:28 pm

గ్రామ పంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానం

ములకలపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ కార్మికుల ను కమాలపురం సర్పంచ్ వగ్గేల

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:22 pm

నాలుగు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ వివరాలను వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో అంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. కాగా మే 4న కౌంటింగ్ జరుగనుంది. పుదుచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్‌లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు షెడ్యూల్ ప్రకటించారు.

మన తెలంగాణ 15 Mar 2026 5:19 pm

చిలుపూరులో వైభవంగా సుదర్శన హోమం

చిలుపూర్, ఆంధ్రప్రభ: చిలుపూర్ మండల కేంద్రంలోని బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:17 pm

Biotechnologies |పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు..

Biotechnologies | పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు.. జిల్లాలో విజ‌య‌వంతంగా పీ4

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:15 pm

అండర్-19 ఎంపిక ట్రయల్స్..

అండర్-19 ఎంపిక ట్రయల్స్.. కే డి సి ఏ ఆధ్వర్యంలోమార్చి 19న విజయవాడలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:00 pm

అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి

అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; అంబేద్కర్

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:00 pm

దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్..

దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్.. విజయవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:58 pm

Ex BRS MLA Named A2, TDP MP A7 in Moinabad Farmhouse Drug Case

The FIR registered by Moinabad Police in the alleged drug party case at the farmhouse in Aziz Nagar village lists 11 accused, including political figures from BRS and TDP. MP Putta Mahesh Yadav was granted station bail in the Moinabad drug case. Bail was also given to Priyanka Reddy along with the MP. Police cited […] The post Ex BRS MLA Named A2, TDP MP A7 in Moinabad Farmhouse Drug Case appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 4:55 pm

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం: కెటిఆర్

హైదరాబాద్: టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరినట్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం మని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. డ్రగ్స్ వాడకం, చట్ట విరుద్ధ కార్యకలాపాలను బిఆర్ఎస్ ఖండిస్తుందని చెప్పారు. డ్రగ్స్ వినియోగించేది ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘‘రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలి. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశా. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలి. డ్రగ్స్ కేసులో నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా’’ అని కెటిఆర్ అన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 4:52 pm

పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది

పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గ్రామం పరిశుభ్రంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:51 pm

ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు..

ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు.. చారిత్రక ఆధారాలను పరిశీలించిన దేవస్థానం బృందంఇంద్రకీలాద్రి పర్వత శిఖరం

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:51 pm

భజరంగ్ దళ్ కన్వీనర్ గా కొమ్ము శ్రావణ్

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ భజరంగ్ దళ్

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:29 pm

విశ్రాంత ఉద్యోగి గోద్రుకు నివాళి..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచంలొద్ది

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:27 pm

KTR |డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది…

KTR | డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది… KTR | డ్రగ్స్ ఘటనపై

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:26 pm

పంచాయతీ కార్మికులకు సన్మానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:18 pm

నాగబంధం చిత్రం నుంచి ‘నమో రే నమో రే’ సాంగ్ విడుదల

విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి సింగిల్‌ని విడుదల చేశారు. ‘నమో రే నమో రే’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించారు. జునైద్ కుమార్ ఈ పాటకు సంగీతం అందించగా.. సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ పాటని కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పోలిన భారీ సెట్‌లో చిత్రీకరించారు. ఈ పాటని గణేశ్ ఆచార్య, శ్రేష్ఠి కొరియోగ్రాఫీ చేశారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ పాట ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు ఆ సాంగ్‌ను చూసేయండి..

మన తెలంగాణ 15 Mar 2026 4:10 pm

మాన్కుగూడ గ్రామంలో ఆదర్శ కార్యక్రమం

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోనిమాన్కుగూడ గ్రామంలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:09 pm

USERS |వంటగదిలో యుద్ధం..

USERS | వంటగదిలో యుద్ధం.. USERS | ఒకవైపు కేవైసీ గందరగోళం.. మరోవైపు

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:06 pm

అన్నమయ్య జిల్లాలో దారుణం

అన్నమయ్య జిల్లా / పుంగనూరు, ఆంధ్రప్రభ : నిన్నటి వరకు ఆ ఇంట్లో

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:04 pm

శానిటరీ వర్కర్లకు సన్మానం…

శానిటరీ వర్కర్లకు సన్మానం… బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:58 pm

వధూవరులకు సర్పంచ్ కానుక

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బత్తుల మల్లేష్

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:45 pm

ఆటో-లారీ ఢీ.. నలుగురు మృతి

దేవరపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవరపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 15 Mar 2026 3:30 pm

ఇందిరమ్మ ఇండ్లతో పేదల గృహ కల సహకారం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులు

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:29 pm

strike |‘ఫీజు పోరు దీక్ష’

ఇందిరాపార్క్ వ‌ద్ద ఆందోళ‌న‌ రీయంబర్స్‌మెంట్ బకాయిల విడుదల చేయాలివిద్యార్థులు, ప్రజా సంఘాల నాయకుల

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:27 pm

రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ..

రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ.. రాష్ట్ర ప్రభుత్వ నుండి

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:25 pm

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ..

కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్మ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:24 pm

ప్రజా సమస్యల పరిష్కార వేదిక..

ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:20 pm

accident |ఆటో, లారీ ఢీ..

న‌లుగురు మృతి.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లాలో ఇవాళ (ఆదివారం) ఘోర

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:16 pm