SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

19    C
...

మన టీచర్లకు జీతాలు ఎక్కువా?

ప్రపంచంలో అన్నివృత్తుల కన్నా గౌరవించదగిన, ఆదర్శవంతమైన, అవినీతి లేని వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ప్రపంచంలోని అనేకదేశాలలో ఉపాధ్యాయులకు అన్నివృత్తుల వారి కన్నా ఎక్కువ వేతనాలు ఉంటాయి. జపాన్‌లో డాక్టర్‌ల కన్నా ఇంజినీర్ల కన్నా ఉపాధ్యాయులకు ఎక్కువ వేతనాలు ఉంటాయి. డాక్టర్లు, ఇంజినీర్లు ఆ దేశ ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లి ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని అంటే మిమ్మల్ని తయారు చేసిన వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకుంటారా? అని అడిగారట. అదే విధంగా అనేక దేశాలలో ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం, ఉన్నత వేతనాలతో సమాజంలో గౌరవం దక్కుతుంది. మన పొరుగు రాష్టమైన ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారు. మన దేశ భవిష్యత్తు కాకుండా ప్రపంచ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉంది. కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ పాఠాలు, యూట్యూబ్, కృత్రిమమేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఐ) లను అభివృద్ధి చేసింది ఉపాధ్యాయులే అన్నది మరవలేని మరపురాని నిజం. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ సమర్పించిన నివేదికలో ఉపాధ్యాయులకు ఎక్కువ వేతనాలు ఉన్నాయని రిపోర్ట్ ఇవ్వడం ఉపాధ్యాయ లోకంలో గందరగోళం, అయోమయం, ఆవేదన, ఆందోళన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో దినమంతా విద్యా కమిషన్ చైర్మన్ సమర్పించిన నివేదిక మీద చర్చలు జరిగాయి. ఉపాధ్యాయులుగా చేయడం వృత్తి కాదు నిపుణులను తయారు చేసే సేవ అని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అంటున్నారు. దేశంలో అందరూ మర్యాదఇచ్చే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయులుగా జీతం జీవితం గురించి కాకుండా అన్ని రకాల వృత్తులను తయారు చేసే నైపుణ్యంగల వృత్తి. ఉపాధ్యాయులను గౌరవించడం తరతరాలుగా ఉంది. విదేశాల్లో కోర్టులలో అందరినీ నిలబెట్టి సాక్ష్యం తీసుకుంటారు. కానీ ఉపాధ్యాయులను గౌరవించి వారికి చైర్ వేసి కూర్చోబెడతారు. విదేశాల్లో అందరి కంటే ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువగా ఉంటాయి. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికలో ఉత్త టీచర్స్‌లను ఎంపిక చేసి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొని రావొద్దు. ఎప్పుడూ పాఠశాలలకు వెళ్ళని వాళ్ళకు, ఉపాధ్యాయ సంఘాలలో తిరిగేవారిని, అధికారుల చుట్టూ తిరిగే వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి నిజంగా పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందిస్తున్న వారిని, వినూత్న పద్ధతులలో బోధిస్తూ విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేవారిని ఎంపిక చేయాలి. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పకుండా అధికారులే నిజమైన ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేస్తే ఎంతో బాగుంటుంది. 35, 38 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా చేసి ఎంతోమందిని పదవ తరగతిలో ఉత్తీర్ణులను చేసి 2026 2027 విద్యా సంవత్సరంలో పలవీ విరమణ చేసేవారిని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రులు పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించే సంప్రదాయం ఉండేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సెప్టెంబర్ 5 నాడు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి రాకుండా ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నాయకులను నిరాశ, నిస్పృహలకు గురి చేసేవారు. 2025 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాలువా, మెమెంటో, నగదుతో సన్మానించి ఉపాధ్యాయులపట్ల అభిమానం చాటారు. ఉపాధ్యాయులందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 5 నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శిల్పారామంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సన్మానించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొని దీర్ఘకాలంగా అపరిషృతంగా ఉన్న సమస్యల పరిష్కారం చేస్తానని ప్రకటించారు. ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలైన నగదు రహిత హెల్త్ కార్డు లు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్, డైట్, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సిఇఆర్‌టి), బి.ఎడ్, ఐసిఎస్‌సిలలో రెండు దశాబ్దాలుగా ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ, ఆచార్య పోస్టుల భర్తీ, విశ్వవిద్యాలయాలలో ఆచార్య పోస్టుల భర్తీ మొదలైన ఉపాధ్యాయ సమస్యలకు ఉపాధ్యాయ దినోత్సవం నాడు పరిష్కారం అవుతుంది అనే నమ్మకం కలిగించారు. ఎన్నో సంవత్సరాలనుండి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, పదోన్నతులు, బదిలీలు చేసి ఉపాధ్యాయుల పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నానని ఉత్తమ ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు, పాఠశాల విద్య శాఖాధికారుల మధ్య చాటారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ విద్యా శాఖ కమిషన్ నివేదికలో ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులను తయారు చేసే డిఎడ్ లేకుండా బిఎడ్ చేయాలని అనడం ఎంత వరకు సమంజసం. ఎంతోమంది ఉపాధ్యాయ శిక్షణ చేసుకొని నిరుద్యోగ ఉపాధ్యాయులుగా టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్(టెట్) ఉత్తీర్ణత సాధించి డిఎస్‌సి కోసం ఎదురు చూస్తున్న వారికి విద్యా కమిషన్ నివేదిక గుండె గుబులు మన్నది. బిఎడ్ చేసిన వారికంటే డిఎడ్ చేసిన వారే ప్రాథమిక పాఠశాలల్లో బోధించాలని, ప్రాథమిక పాఠశాలల్లో బిఎడ్ చేసిన వారిని ఎంపిక చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాకమీషన్ సుప్రీం కోర్టు తీర్పు ఒక్క సారి పరిశీలించవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని అనడంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల పట్ల చులకన భావం ఏర్పడుతుంది. పెండింగ్‌లో ఉన్న ఐదు డిఎలు, పిఆర్‌సిలను వీలైనంత వరకు త్వరలో ప్రకటించాలి. ఉపాధ్యాయుల వేతనాల కంటే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘా ల నాయకులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ విద్యా శాఖ, తెలంగాణ విద్యా కమిషన్ ఉపాధ్యాయుల వేతనాలు మిగితా దేశాల కంటే మిగితా రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి. ఎస్. విజయ భాస్కర్ 92908 26988

మన తెలంగాణ 4 Mar 2026 6:10 am

మండుతున్న మధ్యప్రాచ్యం

టెహ్రాన్/దుబాయి/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నాలుగో రోజూ యుద్ధం ఉధృతంగానే సాగింది. ఇరాన్, అమెరికాఇజ్రాయెల్ పరస్పర దాడులకు పాల్పడ్డాయి. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ తదితర దేశాల్లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో రెచ్చిపోయింది. అమెరికా స్థావరాలను లక్షంగా చేసుకుంది. బహ్రెయిన్ షేక్ ఇసాలోని అమెరికా ఎయిర్‌బేస్‌ను క్షిపణులు, డ్రోన్లతో ధ్వంస చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కాప్స్ ప్రకటించుకుంది. ఇంధన నిల్వ ట్యాంకులకు మంటలు అంటుకున్నాయని, ఉవ్వెత్తున పొగలు ఎగిసినట్లు తెలిపింది. లక్ష్యాన్ని పక్కాగా ఢీకొట్టినట్లు వెల్లడించింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడిలో అమెరికా ప్రధాన హెడ్‌క్వార్టర్ ధ్వంసమైందని, ప్రధాన కార్యాలయంతో పాటు ఉద్యోగుల క్వార్టర్లు సల్వంగా దెబ్బతిన్నాయని తెలుపుతూ సంబంధిత చిత్రాలను ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇక రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను సౌదీ అరేబియా విజయవంతంగా కూల్చివేసింది. మరోవైపు ఒమన్‌లోని ‘రస్ అల్ జైమా’ పోర్టుపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో ఆ ప్రాంతమంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంబంధిత వీడియో కూడా వైరల్ అయ్యింది. ఖతార్‌లోని ఇంధన కేంద్రంపై కూడా జరిగినట్లు తెలుస్తోంది. కువైట్‌లో రాయబార కార్యాలయంపైనా ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడడంతో దాన్ని మూసివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇదిలావుండగా నాలుగు రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది చనిపోయారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ మంగళవారంనాడు ‘ఎక్స్’లో వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ గురి... ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తాజాగా ఆ దేశ అధ్యక్షుడిపై గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. మంగళవారంనాడు టెహ్రాన్‌లో అధ్యక్ష కార్యాలయమే లక్షంగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మిలిటరీ శిక్షణ ప్రధాన కార్యాలయంపైనా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దానితో పాటు ఇతర ప్రధాన కార్యాలయాను కూడా టార్గెట్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్‌లో అత్యంత సీనియర్ అధికారుల కాంపౌండ్‌లను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ ఇరాన్‌లోని అమెరికాఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 13 మంది ఇరాన్ సైనికులు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. టెహ్రాన్‌కు 500 మైళ్ల దూరంలోని కెరామిన్ ఎయిర్‌బేస్ లక్షంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఇదిలావుండగా టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ మేరకు టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హకీమే ఏరియాలో కూడా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలే లక్షంగా ఉమ్మడి సేనలు విధ్వంసానికి తెగబడినట్లు వెల్లడైంది. లెబనాన్‌లో 40 మంది మృతి.. మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లాల టీవీ, రేడియో స్టేషన్లకు నష్టం వాటిల్లింది. దక్షిణ లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ తరలిస్తోంది. హెజ్‌బొల్లాలు స్థావరాల చుట్టూ ఉన్న 80 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. 200మందికిపైగా గాయపడ్డారు. బీరూట్‌లోని దహియేలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది. నతాంజ్‌పై దాడిని నిర్ధారించిన ఐఎఈఏ ఇదిలావుండగా ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు నిజమేనని ఐఎఈఏ నిర్ధారించింది. కేంద్రానికి స్వల్పంగా నష్టం జరిగిందని, అయితే అణు ధార్మికత ప్రమాదం ఇప్పటికేమీ లేదని వెల్లడించింది. అణుకేంద్రంలోకి ప్రవేశించే క్రమంలో భూగర్భ ప్రవేశ ద్వారాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుర్తించామని తెలిపింది. ఖాళీ చేసి రండి.. ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాలను లక్షంగా చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఆ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. బహ్రెయిన్, జోర్డాన్‌లలోని అత్యవసర సేవల సిబ్బంది మినహా మిగతా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, లేకపోతే స్వదేశానికి విచ్చేయాలని సూచించింది. భద్రతా పరమైన రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించింది. 

మన తెలంగాణ 4 Mar 2026 6:00 am

సమగ్ర విద్యతో సమసమాజ నిర్మాణం

విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే జ్ఞాన ప్రక్రియ. అది కేవలం పాఠశాలల్లో, కళాశాలలో పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, మనస్సును, ఆలోచనలను, ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అతి పెద్ద జీవన పద్ధతి. విద్య అనేది మనిషిని లోపల నుంచి మార్చే మహోన్నత మార్గం. నైపుణ్యంతో ముందుకు నడిపిస్తుంది, నీతి విలువలతో సరైన మార్గం చూపిస్తుంది. నవచైతన్యంతో ప్రపంచాన్ని మార్చే ధైర్యం ఇస్తుంది. ఈ మూడు లక్షణాలు కలిసినప్పుడే వ్యక్తి సంపూర్ణంగా ఎదుగుతాడు. సమాజం అభివృద్ధి చెందుతుంది. దేశం ముందుకు సాగుతుంది.విద్య అనేది వ్యక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం. ఇది కేవలం పుస్తకాల జ్ఞానం లేదా పరీక్షల మార్కుల వరకే పరిమితం కాదు. నిజమైన విద్య అంటే మనిషి ఆలోచనా విధానాన్ని మార్చేశక్తి, జీవితాన్ని సార్థకం చేసే మార్గదర్శకం.నేటి వేగవంతమైన ప్రపంచంలో నైపుణ్యాలు, నీతి, నవచైతన్యం వంటి మూడు ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైనవి. ఇవన్నీ కలిగినప్పుడు మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసం సాధ్యమవుతుంది. ఈ పరిపూర్ణతను అందించే మార్గమే సమగ్ర విద్య. నైపుణ్యం ఆధునిక ప్రపంచానికి పునాది, ప్రపంచం మారుతోంది. జ్ఞానం కంటే నైపుణ్యాలే నేటి ఉద్యోగ విపణిలో ముఖ్యం అవుతున్నాయి. కంప్యూటర్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టీంవర్క్, సమస్య పరిష్కరణ, నాయకత్వ లక్షణాలు వంటి అనేక నైపుణ్యాలు వ్యక్తిని విజయమంతుడిగా నిలబెట్టే మెట్లు. సాంప్రదాయ విద్యలో నైపుణ్యాల మీద పెద్దగా దృష్టి ఉండలేదు. కానీ పుస్తకాల్ని కంఠస్థం చేసే విద్యతో ఉద్యోగాలు కూడా రాకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టే విద్యా వ్యవస్థ నైపుణ్యాల పెంపువైపు మళ్లాలి. పాఠశాల స్థాయినుండే ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, ప్రయోగాలు, ప్రాక్టికల్ శిక్షణ, డిజిటల్ లిటరసీ వంటి అంశాలను బలపరచాలి. నైపుణ్యం ఉన్న విద్యార్థి ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలను సృష్టించగలడు. నీతి వ్యక్తిత్వ వికాసానికి నిత్యావసరం, నైపుణ్యాలు ఉన్నప్పటికీ విలువలు లేకపోతే వ్యక్తి సమాజానికి హానికరుడు అయిపోతాడు. నీతి అనే విలువ మనిషిని లోపలినుంచి మార్చుతుంది. నిజాయితీ, దేశభక్తి, బాధ్యతా భారతం, పరస్పర గౌరవం, కరుణ, సేవాభావం ఇవన్నీ నీతి ద్వారా వచ్చే అంశాలు. ప్రస్తుత కాలంలో విలువలు తగ్గిపోతున్నాయని మనం ప్రతిరోజూ చూస్తున్నాం. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మానవత్వం తగ్గిపోకుండా చూసుకోవడం కూడా విద్యా వ్యవస్థ బాధ్యతే. విలువల పాఠాలు, కథలు, సమాజ సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, గురుశిష్య సంబంధాలపట్ల గౌరవం ఇవన్నీ విద్యార్థుల్లో నీతిని పెంపొందించగల అంశాలు. మంచి విలువలతో ఉన్న విద్యార్థి భవిష్యత్తులో మంచి పౌరుడిగా మారతాడు. నవ చైతన్యం అభివృద్ధికి కొత్త దారి, భవిష్యత్తు నవ చైతన్యాన్ని కోరుతోంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు, కొత్త పరిష్కారాలే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనను ప్రోత్సహించడం అనేది సమగ్ర విద్యలో కీలక అంశం. కేవలం పాఠాలు నేర్పించడంసరిపోదు. ఆ పాఠాలపై సందేహాలు అడగడం, కొత్త ప్రయోగాలు చేయడం, వైఫల్యం భయపడకుండా ముందుకుసాగడం వంటి ధైర్యం విద్యార్థికి ఉండాలి. ల్యాబ్‌లు, ఇన్నోవేషన్ క్లబ్‌లు, సైన్స్ ఫెయిర్‌లు, స్టార్టప్ ఆలోచనలకు ప్రోత్సాహం ఇవన్నీ నవచైతన్యాన్ని పెంపొందించే మార్గాలు. నవ చైతన్యంతో ఉన్న విద్యార్థి ఉద్యోగం కోసం వెతకడు, ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉంటాడు. సాంకేతిక రంగం నుంచి వ్యవసాయం వరకు ప్రతిచోటా ఈ సృజనాత్మక ఆలోచనకు అవసరం పెరిగింది. సమగ్ర విద్య అనేది విద్యార్థిని ఒకే కోణంలో కాకుండా పలు కోణాలలో ఎదగనిచ్చే ప్రక్రియ. అందులో విద్యా జ్ఞానం, సృజనాత్మకత, నైతికత, సామాజిక బాధ్యత, శారీరక ఆరోగ్యం, భావోద్వేగ పరిపక్వత అన్నీ సమపాళ్లలో ఉండాలి. పుస్తకాల జ్ఞానంతోపాటు జీవితానికి అవసరమైన విలువలను నేర్పడం, నైపుణ్యాలను పెంపొందించడం, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించే ఆలోచనను పోషించడం ఇవన్నీ సమగ్ర విద్య లక్ష్యాలు. సమగ్ర విద్య ఎందుకు అవసరం అంటే సమాజంలో మార్పులు వేగంగా జరుగుతున్న ఈ యుగంలో సమగ్ర విద్య అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇది వ్యక్తిని జ్ఞానం కలిగినవాడిగా, నైపుణ్యం ఉన్నవాడిగా, విలువలు పాటించే పౌరుడిగా, సృజనాత్మక ఆలోచకుడిగా మారుస్తుంది. దేశ అభివృద్ధికి ఇలాంటి పౌరులే అవసరం. పాఠశాలల నుండి ఉన్నత విద్యా సంస్థల వరకు సమగ్ర విద్యను అమలు చేయడం వల్ల ఆరోగ్యవంతమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన, బాధ్యత గల, ఆవిష్కరణాత్మక యువత పెరిగి దేశాన్ని ముందుకు నడిపించగలుగుతుంది. విద్య అనేది వ్యక్తిని మాత్రమే కాకుండా, సమాజాన్ని, దేశాన్ని కూడా మార్చగల మహాశక్తి. నైపుణ్యం, నీతి, నవ చైతన్యం ఈ మూడు అంశాలు ఏ ఒక్కరి జీవితాన్నైనా సార్థకంగా మార్చగలవు. కానీ ఇవన్నీ ఒకే చోట పొందాలంటే సమగ్ర విద్య తప్పనిసరి అవసరం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు వేగం పుంజుకుంటున్నాయి. నూతన యుగ అవసరాలకు అనుగుణంగా పాఠశాలలనుండి ఉన్నత విద్య వరకు సమగ్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అభ్యాసం వంటి అంశాలు ప్రముఖ స్థానం సంపాదిస్తున్నాయి. విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్య అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థి వ్యక్తిత్వాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేసే సమగ్ర ప్రక్రియ కావాలని సూచిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాల్లో కూడా ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాఠశాలల్లో కొత్త కార్యక్రమాలు, నైపుణ్య ఆధారిత కోర్సులు, సాంకేతిక పరికరాల వినియోగం పెరగడంతో విద్యార్థుల అభ్యాస పద్ధతుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, విలువల విద్య వంటి అంశాలను తరగతులలోకి తీసుకువస్తూ పాఠశాలలు విద్యార్థులను భవిష్యత్తు వైపు తీర్చిదిద్దుతున్నాయి. విద్యా నిపుణులు చెబుతున్నదేమిటంటే, నేటి తరం ఉద్యోగాలకే కాదు, జీవితానికి సిద్ధం అవ్వాలి. మొత్తం మీద విద్యా రంగంలో జరుగుతున్న ఈ మార్పులు సమీప భవిష్యత్తులో దేశ యువతకు మరింత బలమైన భవిష్యత్తును అందించనున్నాయి. విద్యార్థులు నైపుణ్యవంతులుగా, విలువలను పాటించే పౌరులుగా, కొత్త ఆలోచనలతో ముందుకు సాగేందుకు ఈ సంస్కరణలు మేలుచేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నేటి తరానికి సరైన విద్య అంటే కేవలం పుస్తకాలు కాదు, మంచి విలువలు, జీవిత నైపుణ్యాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కరణ, ఆధునిక జ్ఞానం ఇవన్నీ కలగలిపిన బహుముఖ విద్య సమగ్ర విద్యను ప్రతి విద్యా సంస్థలో అమలు చేసినప్పుడే మన దేశం నిజమైన అర్థంలో విజ్ఞానభారతంగా వెలుగొందుతుంది.

మన తెలంగాణ 4 Mar 2026 5:40 am

చర్చలకు సమయం మించిపోయింది

వాషింగ్టన్: ఇరాన్ సైనిక నాయకత్వం, కీలక రక్ష ణ సామర్థ్యాలు నిర్వీర్యం అయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మంగళవారం నాడు ప్రకటించారు. ఈ తరుణంలో ఇరాన్‌తో చర్చలకు చాలా ఆలస్యం అ యిందని, ప్రస్తుతానికి చర్చల ప్రసక్తి లేదని ఆయన స్ప ష్టం చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ చర్చల పై ప్రచురించిన ఓ వ్యాసాన్ని ఆయన తిరస్కరించారు. ఇరాన్ సై న్యం, రక్షణ వ్యవస్థ వైమానిక దళం, నావికా దళం, నాయకత్వం అన్నీ దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో వారు సంప్రదింపులకు సిద్ధమయ్యారని, అయితే అందుకు చాలా ఆల స్యం అయిందని స్పష్టం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికావద్ద అపరమితమైన ఉన్న త స్థాయి, మధ్య స్థాయి ఆయుధ సంపత్తి, విధ్వంసకర ఆయుధ బలం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం నాల్గో రోజులో ప్రవేశించింది. ఇప్పట్లో విరామం సూచనలు కన్పించడం లే దు. అమెరికా వైమానిక దళం సోమవారం రాత్రి ఇరా న్‌లోని కీలకమైన ప్రభు త్వం కార్యాలయాలు, భవనాలపై దాడి చేసింది. వాటిలో ప్రెసిడెంట్ భవన సముదాయం, దేశ అత్యున్నత భద్రతా సంస్థ కార్యాలయ భవనం కూడా ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ పైన, గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై పెద్దఎత్తున దాడులకు పూ నుకుంది. శనివారం ఇరాన్ ను అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసిన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంబించింది. అప్ప టి నుంచి సరిహద్దుల్లోని గల్ఫ్ దేశాలపై డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. 

మన తెలంగాణ 4 Mar 2026 5:30 am

కలెక్టర్ల పనితీరు మారాలి

మన తెలంగాణ/హైదరాబాద్: కలెక్టర్‌లు పనితీరు మార్చుకోవాలి. కొం దరు కలెక్టర్‌లు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండడం లేదు. వారు తమ పద్ధతిలో మార్పు తీసుకురావాలి. 99 రోజుల పాటు కలెక్టర్‌లు జిల్లా విడిచి వెళ్లొద్దని సిఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్‌లను హెచ్చరించారు. కలెక్టర్‌లు ప్రజలకు అందుబాటులో ఉండని పక్షంలో సహించేది లేదని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కలెక్టర్‌లు పనితీరు మార్చుకోని పక్షంలో కఠిన చర్య లు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆషామాషీగా ఐఏఎస్‌లు కా లేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యతలపై అధికారులకు, కలెక్టర్‌లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని, కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ ప్రజల సమస్యలు అర్థం కావని ఆయన అన్నారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సిఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్‌లను ఆదేశించారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేనని, కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని సిఎం సూచించారు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుందని, మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తామని, వార్షిక పర్ఫామెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీ పనితీరు తెలుసుకుంటామని, జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని సిఎం రేవంత్ తెలిపారు. కలెక్టర్, ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తా బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాంటి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆయన పేర్కొన్నారు. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహారించాలన్నారు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహారించకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్లు తమ జిల్లాల్లో పంటల వైవిధ్యతకు ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.

మన తెలంగాణ 4 Mar 2026 5:00 am

గరిష్ట స్థాయిలో విద్యుత్ డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మరోసారి తన అప్రతిహత ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్‌ను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు  రంగంలోని ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి భట్టి విక్రమార్క మల్లు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లకు సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభ తెలంగాణ 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండగా, సుమారు 19,900 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను నమోదు చేసిన మధ్యప్రదేశ్, అలాగే 19,600- నుంచి 20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదైన రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు దాదాపు సమానంగా నిలిచిందని అన్నారు. భూభాగం, జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటిందని కొనియాడారు. అదేవిధంగా పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్‌ను తెలంగాణ నమోదు చేసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్నదైనా, అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఐటీ, ఔషధ తయారీ, తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణమని డిప్యూటీ సీఎం వివరించారు. వేగంగా డిమాండ్ పెరుగుదల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని భట్టి పేర్కొన్నారు. 2023.-24లో గరిష్ట డిమాండ్ 15,623 మెగావాట్లు, 2024.-25లో గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు, 2025-.26లో 17,162 మెగావాట్లు, 2026 మార్చి 3నాటికి 18,139 మెగావాట్లు కొత్త గరిష్ట దశలోకి ప్రవేశించామని తెలిపారు. కాగా తెలంగాణ కేవలం సమకాలీన అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, రాబోయే వేసవి గరిష్ట డిమాండ్లకు ముందస్తు ప్రణాళికలతో పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ మన బలమని అన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం అభివృద్ధిని ముందుకు నడిపేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కంట్రోల్ రూమ్‌ల నుంచి నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.

మన తెలంగాణ 4 Mar 2026 4:30 am

‘రాజ్యసభ’ దక్కేదెవరికి?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీలేర్పడిన రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బుధవారం అభ్యర్థులను ప్రకటించనున్నది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం హస్తినకు వెళ్ళనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అ యిన రెండు రాజ్యసభ స్థానాలు అధికార కాంగ్రె స్ పార్టీకి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటిదాకా కాం గ్రెస్ అధిష్ఠానం తేల్చకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకున్నది. వీటికి నామినేషన్లు దాఖలుకు ఈ నెల 5న గడువు ముగియనుండగా, ఈ నెల 16న పోలింగ్ జరగనున్నది. రాష్ట్రం నుంచి కెఆర్ సురేష్‌రెడ్డి (బిఆర్‌ఎస్), అభిషేక్ మను సిం ఘ్వీ (కాంగ్రెస్) పదవీ కాలం వచ్చే నెల ఏప్రిల్ 9న ముగియనున్నది. ఈ రెండు స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు రాజ్యసభ పదవిని ఆశిస్తోన్న పలువురు సీనియర్ నాయకులు తమకు అధిష్ఠానం వద్ద ప లుకుబడితో లాబీయింగ్‌ను మమ్మరం చేశారు. కాగా రెండు స్థానాల్లో ప్రస్తుతం ఉన్న అభిషేక్ మ ను సింఘ్వీని తిరిగి రాజ్యసభ ఇస్తుందా? లేక ఇతరులకు అవకాశం కల్పిస్తుందా? అనే సస్పెన్స్ కొనసాగుతున్నది. సింఘ్వీ ఏఐసిసి అగ్ర నేత సోని యా గాంధీ కుటుంబానికి  సన్నిహితుడు కావడంతో పాటు పార్టీకి సంబంధించిన కోర్టు కేసుల ను ఆయనే చూసుకుంటున్నారు. పార్టీకి అవసరమైన వ్యక్తిగా, పార్టీకి విధేయుడిగా సింఘ్వికి తిరి గి అవకాశం కల్పిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు స్థానాలకు రాష్ట్రం నుంచే అవకాశం కల్పించి సింఘ్వికి మరో రాష్ట్రం నుంచి అవకాశం కల్పిస్తుందన్న వాదన కూడా లేకపోలేదు. ఒకవేళ సింఘ్వికి కేటాయిస్తే ఇక మిగిలేది ఒక్క స్థానమే. అది ఏ సామాజిక వర్గానికి దక్కుతుందోనన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతున్నది. పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు ఇవ్వాలని మాజీ ఎంపీ వి. హనుమంత రావు కోరుతుండగా, మరోవైపు పార్టీ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షుడు అనంతుల శ్యాం మోహన్ హస్తినలో పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. గతంలో పిసిసి అధ్యక్ష పదవికి తీవ్రంగా ప్రయత్నించిన బిసి నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానానికి సిఫార్సు చేసే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నారు. తనకు నమ్మకస్తుడైన వేం నరేందర్ రెడ్డిని తనతోనే ఉండాలని ముఖ్యమంత్రి తన సలహాదారునిగా నియమించుకోవడంతో రాజ్యసభకు పంపించకపోవచ్చని కూడా కొందరి వాదన. ఉప రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో యుపిఏ తరపున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ ఆయనేమి ఆ పదవిని ఆశించడం లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలాఉండగా వికారాబాద్‌లో ఏర్పాటైన తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో ఈ అంశంపై చర్చించినప్పటికీ తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా చెప్పివెళ్లారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఢిల్లీ వెళ్ళనున్నట్టు సమాచారం. గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్నందున బుధవారం ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. రాజ్యసభకు ఖాళీగా ఏర్పడిన రెండు సీట్లకుగాను రాష్ట్రం నుంచి పదహారు మంది రేసులో ఉన్నప్పటికీ నాలుగురి అభ్యర్థిత్వాలపైనే ప్రధానంగా చర్చించి అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

మన తెలంగాణ 4 Mar 2026 3:30 am

ఖమేనీ హత్యపై మౌనమెందుకు?

` మోడీ తీరుపై మండిపడ్డ సోనియాగాంధీ ` ఇరాన్‌పై దాడి పట్ల మోదీ మాట్లాడరేం? ` ప్రధాని తీరుతో దిగజారుతున్న భారత్ ప్రతిష్ట ` మండిపడ్డ రాహుల్ …

జనం సాక్షి 4 Mar 2026 2:32 am

ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయండి

` కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచన హైదరాబాద్(జనంసాక్షి):ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల …

జనం సాక్షి 4 Mar 2026 2:31 am

వేసవి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ప్రణాళిక

` ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్ ` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి): మంగళవారం ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం …

జనం సాక్షి 4 Mar 2026 2:29 am

మూడు వారాల్లోగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక

రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర …

జనం సాక్షి 4 Mar 2026 2:28 am

ప్రజలకు పనికొస్తేనే మీ ఉద్యోగానికి సార్ధకత

` పదిరోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించండి ` ప్రజాపాలన ప్రగతిపై మార్చ్‌ఫాస్ట్ ` మార్చి 6 నుంచి 12 వరకు ` ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్‌ప్లాన్ …

జనం సాక్షి 4 Mar 2026 2:27 am

ఇరాన్ నాయకత్వ నివాసాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’

` ఆయుధ నిల్వలపై దాడి ` సుప్రీం లీడర్ ప్రతి కదలికను ట్రాక్ చేసి.. ` పక్కా సమాచారంతోనే అటాక్ ప్లాన్ ` కొన్ని నెలలుగా ట్రాఫిక్ …

జనం సాక్షి 4 Mar 2026 2:26 am

ఇరాన్‌పై పోరు.. ఇరుగుపొరుగు బేజారు

అమెరికా, సౌదీ, ఇజ్రాయెల్  ఈ మూడు దేశాల చిరకాల ప్రత్యర్థి ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడం ప్రపంచ అస్తిత్వాన్నే ప్రశ్నించే విధంగా అమెరికా మారుతున్నదనే సంకేతాలు ఇస్తున్నది. గత కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని అమెరికా దెబ్బతీయటం నేడు ఓ రివాజుగా మారిపోయింది. వెనెజువెలా అధ్యక్షుడిని, ఆయన భార్యను తమ దేశానికి ఎత్తుకుపోయారు, ఇరాన్ సుప్రీంను ఆయన నివాసంలోనే హతమార్చారు. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత ప్రతిభావంతమైన సమాచార సేకరణ సంస్థ మొసాద్, సౌదీ ఇంటెలిజెన్స్ సంస్థ అందించిన సమాచారంతో ఖమేనీని, ఇరాన్ రక్షణ శాఖామంత్రితో కీలకమైన 40 మందికి పైగా నేతలను హతమార్చారు. జూన్ 2025లో 12 రోజుల సంఘర్షణకు ముందు జరిగిన సంఘటనల మాదిరిగానే, ఈసారి కూడా టెహ్రాన్, వాషింగ్టన్‌ల మధ్య పరోక్షంగా చురుకైన చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా దాడులు జరిగాయి. కానీ ముఖ్యమైన తేడా ఏమిటంటే ప్రస్తుత యుద్ధం చర్చలలో పురోగతి కారణంగానే జరిగింది. సాంప్రదాయకంగా తీవ్రమైన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్-బుసైది అమెరికా -ఇరాన్ చర్చల వివరాలను బహిరంగపరిచారు. ఇరాన్ అణు పదార్థాల సున్నా నిల్వకు అంగీకరించడం, దానిలో ఉన్న 60 శాతం సుసంపన్నమైన నిల్వను తిరిగి పొందలేని ఇంధనానికి తగ్గించడం, అమెరికా ఇన్‌స్పెక్టర్లకు ఇరాన్ అణు ప్రదేశాలను యాక్సెస్ చేయడానికి అనుమతించడం వంటి ఇతర చర్యలు వెంటనే అమలు చేయగలవని ఆయన నొక్కి చెప్పారు. అమెరికా విధించే అనేక కఠినమైన షరతులకు ఇరాన్ దిగివచ్చిందని కూడా ఆయన మాటలు వెల్లడించాయి. అంతర్జాతీయ అణుఇంధన సంస్థ (ఐఎఇఎ)ద్వారా సుసంపన్నమైన యురేనియం, ఇరాన్ అణు సౌకర్యాల తనిఖీలపై సమాంతర సాంకేతిక చర్చల వైపు వెళ్లడానికి రెండు దేశాలు సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు ప్రారంభమయ్యాయి. గతంలో ఇరాక్‌లో రసాయన ఆయుధాల నెపంతో దాడిచేసి, అక్కడ సద్దాం హుస్సేన్ పాలనను అంతం చేసిన విధంగా, ఇరాన్‌లో కూడా తమ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు కోసమే అమెరికా, ఇజ్రాయెల్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి గాని, అణ్వయుధాల వివాదం కాదని ఈ సందర్భంగా స్పష్టం అవుతుంది. దౌత్యపరమైన పురోగతి కనిపించినప్పటికీ, వైట్ హౌస్ నిబద్ధత ఉచ్చులో ఉన్నట్లుగా పనిచేస్తుందని ప్రతిబింబిస్తూ, ఇరాన్‌పై దాడి చేయాలనే వాషింగ్టన్ ప్రణాళికగురించి మస్కట్‌కు తెలుసు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. తొలి నుండి ‘పాలన మార్పు’ అంటున్న ట్రంప్ ఏకంగా ఖమేనీని హత మార్చడంతో యుద్ధం ప్రారంభించారు. తన సీనియర్ గార్డులను శిరచ్ఛేదం చేసినప్పటికీ, ఇరాన్ గల్ఫ్‌లోని ప్రతి దేశంలోనూ, ఇరాక్, ఇజ్రాయెల్‌లోనూ ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులతో ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ జూన్ 2025లో మాదిరిగా పరిమితంగా కాకుండా దుబాయ్, బహ్రెయిన్, రియాద్, కువైట్‌లపై దాడులు, సైనిక, పౌర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఈ ఘర్షణల పరిధి విస్తరిస్తుంది. ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా వెళుతున్న చమురు ట్యాంకర్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం చమురు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ పాలన సుప్రీం లీడర్ ‘బలిదానానికి ప్రతీకారం తీర్చుకుంటామని’ ప్రతిజ్ఞ చేసింది. పరస్పరం దాడులను తీవ్రతరం చేస్తున్న సమయంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ ఎర్రటి గీతను దాటాయా? ఇప్పటికే అస్థిరంగా ఉన్న మధ్యప్రాచ్యంలో సుదీర్ఘమైన, అస్థిరపరిచే యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారా? కేవలం ఇరాన్‌లో పాలన మార్పు లక్ష్యంగానే అమెరికా, ఇజ్రాయెల్ రెండూ దాడులు ప్రారంభించాయి అనడంలో సందేహం లేదు. ఇరాన్ ప్రజలను పశ్చిమదేశాలతో మరింత అనుసంధానించే ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పర్చడమే వారి లక్ష్యం. కానీ 30,000 అడుగుల ఎత్తు నుండి క్షిపణులను ప్రయోగించి అగ్రనాయకత్వాన్ని హతం చేసినంత తేలికగా, వీధులలో ప్రజలను సమీకరించి, ప్రభుత్వంలో మార్పు తీసుకురావడం అమెరికాకు అంత సులభం కాదని గ్రహించాలి. ఇస్లామిక్ రిపబ్లిక్ కొనసాగింపును నిర్ధారించడానికి త్వరగా కదిలిందని పరిణామాలు సూచిస్తున్నాయి. సత్వరమే కొత్త సుప్రీం లీడర్‌ను నియమించే రాజ్యాంగ ప్రక్రియను ఇరాన్ ప్రారంభించింది. రాజ్యాంగం ఆదేశించిన విధంగా, తాత్కాలికంగా, ఎక్స్‌పెడియెన్సీ డిస్సర్న్‌మెంట్ కౌన్సిల్ ద్వారా ఎంపిక చేసిన అధ్యక్షుడు, న్యాయవ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్ నుండి ఒక న్యాయనిపుణుడితో కూడిన కౌన్సిల్ సుప్రీం లీడర్ విధులను స్వీకరించింది. 12 రోజుల యుద్ధం సమయం నుండే ఇరాన్ పాలన వారసత్వ ప్రణాళిక గురించి మాట్లాడుతోంది. ఈ సన్నాహాలు ఇప్పుడు అమలులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. అక్కడి పాలనను బలహీనపరిచే బదులు, ఈ హత్యలు ఇటీవలి వరకు ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అణచివేతపై గణనీయమైన వీధి నిరసనలలో నిమగ్నమై ఉన్న జనాభాను ఏకం చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత పాలనా కూలిపోయినా అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడాలి అంటే ఇరాన్ సైన్యం, ఐఆర్‌జిసి, బాసిజ్‌లను అధిగమించడానికి వారికి ప్రజలలో లాజిస్టికల్ మద్దతు అవసరం. అంటే ఆయుధాలు, లాజిస్టిక్‌ల భారీ సరఫరాను ఏర్పాటు చేయడం. క్షేత్రస్థాయిలో సాయుధులను మోహరించడం. ప్రస్తుత పరిస్థితులలో అందుకు ఏమేరకు అవకాశం ఉందన్నది సందేహాస్పదమే. ఇప్పటివరకు, ఇరాన్ పాలన గణనీయమైన స్థిరత్వాన్ని ప్రదర్శించింది. అగ్ర కమాండర్ల నష్టాన్ని తట్టుకుంటూనే, సముద్ర ప్రాంతంతో సహా బహుళ థియేటర్లలో గణనీయమైన ప్రతిఘటనను కొనసాగిస్తోంది. గత సెప్టెంబర్‌లో దోహాలో హమాస్‌తో సంబంధం ఉన్న లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత, అమెరికా రక్షణపై నమ్మకం మునుపటిలా బలంగా ఉండకపోవచ్చు. ఇరాన్ గల్ఫ్ దేశాలపై అమెరికా- ఇజ్రాయెల్ మధ్య మరింత ఉద్రిక్తతను నిరోధించడానికి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణాకు అంతరాయం కలిగించడంతోపాటు ఎర్రసముద్రం, ఆవల దాడులను విస్తరించడం ద్వారా టెహ్రాన్ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఇరాకీ ప్రతిఘటన గ్రూపులు ఇప్పటికే అమెరికా లక్ష్యాలపై దాడులకు పాల్పడ్డాయని ప్రకటించాయి. అయితే అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లకు వ్యతిరేకంగా ప్రజాప్రదర్శనలు ఈ ప్రాంతం అంతటా మరో అమెరికన్ వ్యతిరేక భావాన్ని సృష్టించవచ్చు. రాబోయే రోజుల్లో, అమెరికా, ఇజ్రాయెల్ దీర్ఘకాలిక సంఘర్షణకు సిద్ధంగా ఉన్నారా? లేదా ఉద్రిక్తతను తగ్గించడానికి ఆఫ్- ర్యాంప్‌ను కోరుకుంటారా? అని నిర్ణయించుకోవాలి. ఈ పరిస్థితి దక్షిణాసియాకు కూడా గణనీయమైన ప్రభావాలను చూపుతుంది. మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తత ఇరాన్‌పై కొత్త ఆంక్షలకు దారితీయవచ్చు. కీలకమైన వాణిజ్య, ఇంధన సరఫరా మార్గాలను దెబ్బతీయవచ్చు. ఇప్పటివరకు, అమెరికన్ సైనిక పరికరాలు, సిబ్బందికి స్థలం ఇచ్చిన ప్రాంతీయ భాగస్వాములను బెదిరించడానికి ఇరాన్ సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలను జాగ్రత్తగా లక్ష్యంగా చేసుకుంటున్నది. యుద్ధాన్ని వారాలపాటు సాగదీయడం ద్వారా ప్రాంతీయ ఆటగాళ్ళు కాల్పుల విరమణ కోసం కలిసి వస్తారని ఇరాన్ ఆశిస్తున్నట్లు కనిపిస్తున్నది. టెహ్రాన్ దాడుల కారణంగా ప్రాంతీయ ప్రత్యర్థులు తమ సొంత జనాభా భద్రతను ప్రమాదంలో పడేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా భారతదేశం చాలా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. గల్ఫ్‌లోని పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు ఎదురుకాల్పుల్లో చిక్కుకోవచ్చు. చాలా మంది తక్కువ సమయంలోనే అక్కడి నుండి వెళ్లిపోవాల్సి రావచ్చు. ఒక ముఖ్యమైన ప్రాంతీయ భాగస్వామి అయిన ఇరాన్ స్థిరత్వం, శ్రేయస్సుపై భారతదేశం ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయని మరచిపోలేము. అంతేకాకుండా, ఇరాన్‌లోని మిగిలిన అణుకేంద్రాలను నిర్లక్ష్యంగా లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతటా రేడియోధార్మిక కాలుష్యం వచ్చే ప్రమాదం ఉంది. ఇది భారతదేశంతో సహా పొరుగు దేశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాల గురించి వారి ఆందోళనలతో సంబంధం లేకుండా, బాధ్యతాయుతమైన దేశాలు దౌత్య ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక, విస్తరిస్తున్న సంఘర్షణ ఈ ప్రాంతం దాటి దుష్ప్రమాణాలు చూపే అవకాశం ఉంది. చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 4 Mar 2026 1:10 am

భారత్‌కు ఇంధన కొరత లేదు

 మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలతో భారతదేశానికి ఇంధన సరఫరా విషయంలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఎటిఎఫ్) వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో ఐదో స్థానంలో ఉందని, అయితే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్నారు. అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా, భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల అందుబాటుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విస్పష్టం చేశారు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులు (మంగళూరు, పాదూర్, విశాఖపట్టణంలోని వ్యూహాత్మక ఇంధన నిల్వలు) పెంచుకోవడంతోపాటుగా దేశీయంగా చమురు ఉత్పత్తి, ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. భారత్ గతంలో గల్ఫ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకునే పరిస్థితులుండేవని కేంద్రమంత్రి తెలిపారు. అయితే కేంద్రప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వివిధ దేశాల నుంచి చమురును కొనుగోలు చేయడంపై దృష్టిసారించిందని పేర్కొన్నారు. దీని కారణంగా హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండా వేర్వేరు రూట్లలో మన దేశ ఇంధన సంస్థలు చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయని వెల్లడించారు.

మన తెలంగాణ 4 Mar 2026 12:11 am

మూసీ రివర్‌ఫ్రంట్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

మూసీ సుం దరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీరివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో (ఎన్‌హెచ్‌ఆర్‌సి)లో కేసు నమోదు అయ్యింది. మూసీ ప్రా జెక్టు పేరుతో ఈ నది తీర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని దీనిని అడ్డకోవాలని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఎన్‌హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు. ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండా లంగర్‌హౌస్, నా ర్సింగి, రాందేవ్‌గూడ ప్రాంతాల్లో శతాబ్దాల నాటి వేలాది చెట్లను నరికివేస్తున్నారని ఈ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావం, సామాజిక ప్రభావంపై ఎటువంటి సోషల్ ఇంపాక్ట్ స్టడీ నిర్వహించకుం డా పనులు ప్రారంభించారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రజల జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపే విధంగా మూసీ తీరాలను ధ్వంసం చేస్తున్నారని ఆ యన స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

మన తెలంగాణ 3 Mar 2026 11:56 pm

ఖమేనీ మృతి.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సోనియా గాంధీ ఫైర్

న్యూఢిల్లీ : ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి సంఘటనలో మోడీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆక్షేపించారు. ఇరాన్ అంశంలో భారత్ ప్రదర్శించిన మౌనం తటస్థంగా ఉండటం కాదని, అది పరిత్యాగం చేసినట్టుగా ఉందని సోనియా ఆరోపించారు.భారతీయ విదేశాంగ విధానంపై విశ్వాసం కోల్పోయినట్టుగా ఉందని ఆమె అన్నారు. విదేశీ విధానం అంశంలో భారత్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా ఆమె చెప్పారు. అయితే రెండోదఫా బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ప్రారంభమైనప్పుడు , భారత్ తీసుకున్న తన నిర్ణయం పట్ల చర్చచేపట్టాలని సోనియా డిమాండ్ చేశారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సోనియా తన వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసంలో ఆమె ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖమైనీ మృతి చెందినట్టు మార్చి ఒకటో తేదీన ఇరాన్ ధ్రువీకరించిందని, వైమానిక దాడుల్లో ఖమైనీ ప్రాణాలు కోల్పోయారని, ఒకవైపు చర్చలు నిర్వహిస్తూనే మరోవైపు దేశ అధినేతను చంపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని విమర్శించారు. ఇలాంటి షాకింగ్ సంఘటన జరిగినప్పుడు భారత్ వ్యవహరించిన తీరు మరింత షాకింగ్‌గా ఉందన్నారు. ఖమేనీ హత్యగురించి కానీ, ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంశం గురించి కానీ భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా ఖండించారు. 

మన తెలంగాణ 3 Mar 2026 11:35 pm

మత సామరస్యం చాటుదాం

ప్రజల మధ్య ఐక్యత… శాంతి, ప్రగతికి చిహ్నంఇస్లాం ధర్మం చెప్పేది సమసమాజస్థాపనే: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: మతసామరస్యాన్ని చాటుతూ దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అందుకు ధార్మిక పండుగలు దోహదపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యత ఉన్నప్ప్పుడే శాంతి ప్రగతి సాధ్యమన్నారు. కొన్ని శక్తులు రాజకీయ , ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన […] The post మత సామరస్యం చాటుదాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:17 pm

99 రోజుల కార్యక్రమాల్లో ‘స్థానిక’ పాలకులను భాగస్వాముల్ని చేయండి

u శిక్షణలో విధులు, బాధ్యతలపై అవగాహన. సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం. ప్రజలకు వైద్య కళాశాలల సేవలు. పంటల మార్పిడి ప్రయోజనాన్ని రైతన్నకు వివరించండి. కలెక్టర్ల సదస్సులో రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యక్రమాల్లో పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వీరందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు […] The post 99 రోజుల కార్యక్రమాల్లో ‘స్థానిక’ పాలకులను భాగస్వాముల్ని చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:14 pm

18,139 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఓ చరిత్ర

ఇప్పటి వరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ ఇదేజాతీయ స్థాయిలో అప్రతిహత ప్రగతిభవిష్యత్ అవసరాలకు ప్రణాళికలతో సిద్ధం: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్ : మరోసారి తన అప్రతిహత ప్రగతిని రాష్ట్రం చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి, ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […] The post 18,139 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఓ చరిత్ర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:13 pm

రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలు

కాంగ్రెస్ పెద్దల అక్రమాలు కనబడడం లేదా? హరీశ్‌రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : పేదల ఇళ్లను కూల్చిన రేవంత్ సర్కార్‌కు కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున కొండలను పిండి చేస్తుంటే కనిపిండం లేదా అని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాల పై ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి […] The post రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:10 pm

ప్రపంచ శాంతికి ముప్ప్పు

న్యూదిల్లీ: అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్‌పై అమెరికా సామ్రాజ్యవాద, జియోనిస్ట్ ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) దిల్లీ రాష్ట్ర సమితి సహా ఇతర వామపక్ష పార్టీలు మంగళవారం దిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వహించడంపై ఆగ్రహం వెలిబుచ్చాయి. ప్రపంచశాంతికి విఘాతం కలుగుతున్న ఈ తరుణంలో మౌనం, తటస్థ వైఖరి ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన, […] The post ప్రపంచ శాంతికి ముప్ప్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:07 pm

హర్ముజ్ జలసంధి మూసివేసిన ఇరాన్

తెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన క్రమంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధనానికి జీవనాడి అయిన హర్ముజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆ మార్గం గుండా ఏ నౌకైనా వెళ్లడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని ఇరాన్ హెచ్చరించింది. దీంతో సుమారు 700 ఆయిల్ ట్యాంకర్లు జలసంధికి ఇరువైపులా నిలిచిపోయాయి. అయితే తాజా చర్యలతో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం […] The post హర్ముజ్ జలసంధి మూసివేసిన ఇరాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:00 pm

ఇరాన్‌కుచైనా మద్దతు

బీజింగ్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధంపై చైనా స్పందించింది. ఇరాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులను నిలిపివేయాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడానికి, దాని చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు ఇస్తుందని వాంగ్ యి తెలిపారు. అమెరికా, […] The post ఇరాన్‌కుచైనా మద్దతు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:58 pm

అమెరికా`ఇజ్రాయిల్ విధ్వంసకాండకు భీకర ప్రతిఘటన

డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరమవుతున్నాయి. గంట గంటకూ పరిస్థితి మారిపోతోంది. యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ను నియంత్రించేందుకు ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలైన ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, విలాసవంతమైన రెస్టారెంట్లు లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడులు చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున బహ్రెయిన్‌లోని […] The post అమెరికా`ఇజ్రాయిల్ విధ్వంసకాండకు భీకర ప్రతిఘటన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:56 pm

సీఎం, డిప్యూటీ సీఎంకీలక భేటీ

నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ అభ్యర్థులు,శాఖాపరమైన అంశాలపై చర్చ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మధ్యాహ్న సమయంలో వచ్చిన పవన్ కల్యాణ్ సీఎంతో ఏకాంతంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వివిధ అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. అధికారికంగా ఉప ముఖ్యమంత్రి నిర్వహించే శాఖలకు సంబంధించి నిధులు, ఇతర అంశాలు చర్చించినట్లు మీడియాకు తెలియజేసినప్పటికీ నామినేటెడ్ పోస్టులు, […] The post సీఎం, డిప్యూటీ సీఎంకీలక భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:53 pm

దాడి చేయకుంటే ఇరాన్ అణుశక్తివంతం అయ్యేది: నెతన్యాహు

పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే కారణం ఇప్పుడు దాడి వల్ల ఇరాన్‌లో ప్రస్తుత తరం మార్పుకు దోహదం పొరుగుదేశాలతో శాంతి ఒప్పందాలకు అవకాశం ఫాక్స్‌న్యూస్ ఇంటర్వూలో నెతన్యాహు వెల్లడి జెరూసలెం : ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించిందని, కొన్ని నెలల్లోనే శక్తివంతం అయ్యేదని అందుకనే ఇజ్రాయెల్, అమెరికా కలిసి అత్యవసరంగా దాడి చేయక తప్పలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం “ ఫాక్స్ న్యూస్‌” ఇంటర్వూలో వెల్లడించారు. దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇరాన్ కొత్తగా బాలిస్టిక్ క్షిపణుల తయారీ కోసం భూగర్భంలో అణు కార్యక్రమాల క్షేత్రాలను, బంకర్లను, నిర్మించడం ప్రారంభించిందని ,ఇప్పుడు దాన్ని నివారించకుంటే భవిష్యత్తులో ఏ చర్య తీసుకోలేమని నెతన్యాహు పేర్కొన్నారు. గత ఏడాది జూన్‌లో 12 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ అణు క్షేత్రాలను, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ధ్వంసం చేశామని, అయినా ఇరాన్ మళ్లీ ప్రారంభించిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు గత ఏడాది నెతన్యాహు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయి. గత ఏడాది ఇరాన్‌పై ఇజ్రాయెల్ చారిత్రక విజయం సాధించిందని నెతన్యాహు వెల్లడించగా, ఇరాన్ అణుకార్యక్రమం పూర్తిగా తుడిచిపెట్టడమైందని ట్రంప్ వెల్లడించారు. ఇప్పుడు దీనికి విరుద్ధంగా నెతన్యాహు ఇంటర్వూలో వెల్లడిస్తున్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అంతులేని యుద్ధం సాగిస్తామన్న ప్రకటనను కొట్టిపారేశారు. ఇరాన్‌లో ప్రస్తుత ఉగ్రవాద తరం బలహీనంగా ఉందన్నారు. అమెరికా, తాము సంయుక్తంగా చేపట్టిన దాడుల వల్ల ఇరాన్‌లో తరం మారడానికి దోహదపడుతుందన్నారు. పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే ప్రధాన కారణమని, ఆ పాలన అంతమొందితే పశ్చిమాసియాలో శాంతి లభిస్తుందని, ఇజ్రాయెల్, పొరుగున ఉన్న అరబ్, ముస్లిం దేశాలతో శాంతి ఒప్పందాలు కుదురుతాయని వెల్లడించారు. ఇజ్రాయెల్ యుద్ధం లోకి అమెరికాను లాగుతోందన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని కొట్టి పారేశారు.

మన తెలంగాణ 3 Mar 2026 10:45 pm

గ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో చెలరేగిన మంటలు

గ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో మంటలు చెలరేగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్ లో చోటుచేసుకుంది. గోదాం నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. లోపల ఉన్న కూలర్లు, విడిభాగాలు ప్లాస్టిక్ మరియు గడ్డితో తయారైనవి కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న సుమారు వందలాది కూలర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనివల్ల యజమానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు, మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ పని చేసే సిబ్బంది వంట కోసం తీసుకొచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు తెలిపారు. 

మన తెలంగాణ 3 Mar 2026 10:35 pm

షూటింగ్ ఆపేద్దామన్నా రామ్‌చరణ్ వినలేదు

‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబుహైదరాబాద్: ‘పెద్ది’ సినిమాలో తొలి పాట ‘చికిరి చికిరి’కి రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. అందులోని హుక్‌స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సోమవారం రాత్రి విడుదలైన రెండో పాట ‘రయ్ రయ్ రారా’ కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నెటిజన్లు ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్‌తో సందడి చేస్తున్నారు. కేవలం తెలుగు లిరికల్ వీడియోకే యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ 17 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ విజయం వెనుక దాగిన […] The post షూటింగ్ ఆపేద్దామన్నా రామ్‌చరణ్ వినలేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:30 pm

ఆ సినిమా సమయంలోవిజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక

హైదరాబాద్:కొంతమంది హీరో, హీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. అలాంటి జాబితాలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ’ సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక ముందుంటారు. ఇటీవల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవగా బుధవారం వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. అసలు తొలిసారి విజయ్‌ను చూసి రష్మిక భయపడ్డారట. గతంలో ఇదే విషయాన్ని ఆమె పంచుకున్నారు. ‘కొత్త వ్యక్తులతో మాట్లాడటమంటే కాస్త బెరుకు. అందుకే ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి విజయ్‌తో కలిసి […] The post ఆ సినిమా సమయంలోవిజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:09 pm

తుది అంకానికి టీ20 ప్రపంచకప్

. ఇక సెమీస్ పోరు. నేడు దక్షిణాఫ్రికా I న్యూజిలాండ్. రేపు భారత్ I ఇంగ్లాండ్. వరుణ్ స్థానంలో కుల్దీప్? ముంబై: టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు […] The post తుది అంకానికి టీ20 ప్రపంచకప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:04 pm

‘నీకు వసీం అక్రం, షేర్ వార్న్‌ను ఇచ్చినా వేస్ట’

పాక్ కెప్టెన్‌పై రషీద్ లతీఫ్ ఆగ్రహం ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి పాకిస్థాన్ ఘోరంగా నిష్క్రమించడం ఆ దేశంలో మాజీల ఆగ్రహానికి కారణమైంది. పాక్ క్రికెట్ అభిమానులు కూడా పాకిస్థాన్ ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై విమర్శలు దాడి ఎక్కువైంది. తాజాగా ఆ దేశ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, నెట్ రన్ రేట్ కారణంగా పాకిస్థాన్ సెమీఫైనల్స్ కు వెళ్లకుండా […] The post ‘నీకు వసీం అక్రం, షేర్ వార్న్‌ను ఇచ్చినా వేస్ట’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:02 pm

ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో అంతర్జాతీయ విమానసర్వీసుల ఆపరేషన్‌కు అవాంతరాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దయ్యాయి. 36 సర్వీసులు బయల్దేరవలసినవి కాగా, 44 సర్వీసులు రావలసినవని అధికారులు వెల్లడించారు. ఈలోగా ఎమిరేట్స్ ఫ్లైట్ ఇకె 513 దుబాయ్‌కు వెళ్లవలసి ఉన్నప్పటికీ ఎయిర్‌స్పేస్ అవాంతరాల వల్ల తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. పశ్చిమదేశాలకు వెళ్ల వలసిన అనేక అంతర్జాతీయ విమానాలు ఆలస్యం కావడం కానీ లేదా షెడ్యూల్ సర్దుబాట్లు కానీ జరుగుతున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో రోజూ 1300 విమానసర్వీసులు నడుస్తుంటాయి. గత మూడు రోజులుగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ 1117 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మంగళవారం దుబాయ్ నుంచి డిల్లీకి 149 మంది ప్రయాణికులను ఎయిర్ ఇండియా సర్వీస్ తీసుకొచ్చింది.

మన తెలంగాణ 3 Mar 2026 10:01 pm

అబుదాబి నుంచి క్షేమంగా చేరుకున్న భారతీయులు

బెంగళూరు: పశ్చిమాసియా సంఘర్షణలతో అబుదాబిలో చిక్కుకుని ఎంతో ఉద్రిక్తతకు గురైన భారతీయులకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరగానే ఊరట లభించింది. సోమవారం రాత్రి చేరగానే వీరంతా గల్ఫ్ దేశంలో క్షిపణి దాడులు జరిగినప్పుడు ఎంత ఉద్రిక్తత అనుభవించారో గుర్తు చేసుకున్నారు. స్వదేశం చేరుకునేందుకు వీలుగా ప్రయాణ సౌకర్యం కల్పించిన ఇటిహాద్ ఎయిర్‌వేస్ కు, అబుధాబి ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. అబుధాబిలో ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్న మంగళూరుకు చెందిన సౌరభ్ సెట్టి అబుధాబిలో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని వాపోయారు. “ఫిబ్రవరి 28న విమానం చేరుకోడానికి వచ్చినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు కనిపించింది. అకస్మాత్తుగా చెక్ చేసే సమయంలో తామంతా కింద కూర్చోవాలన్న హెచ్చరిక వచ్చింది.క్షిపణి దాడి భయంతో కిటికీలకు దగ్గరగా కూర్చోరాదన్నారు. ” అని ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు. తమ కళ్ల ముందే క్షిపణుల దాడులను చూసి భయం చెందామని, ఏ ఒక్క క్షిపణి తమపై దాడి చేసినా తామెవరం ఉండమని చాలా మంది తమ భయానక పరిస్థితిని వివరించారు. బోస్టన్ నుంచి వచ్చిన మహేష్, బెంగళూరుకు చెందిన రమ్య, కోయంబత్తూరుకు చెందిన నిరుబన్, బెంగలూరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ప్రసాద్, గిరిమలప్పకెరూర్,వీరంతా క్షిపణి దాడుల నుంచి తామెలా బయటపడ్డామో వివరించారు. ఇటిహాద్ ఎయిర్‌వేస్ కల్పించిన సౌకర్యాలను ప్రశంసించారు.

మన తెలంగాణ 3 Mar 2026 9:59 pm

ఆరూధ ఎఎఫ్ ఆరూధ ఈక్విటీ లాంగ్-షార్ట్ ఫండ్ ప్రారంభం

హైదరాబాద్: బంధన్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఆరూధ ఎఫ్, ప్రత్యేక పెట్టుబడి నిధుల (ఎఫ్) ఫ్రేమ్వర్క్ కింద ఓపెన్-ఎండ్ ఈక్విటీ పెట్టుబడి వ్యూహం అయినఆరూధ ఈక్విటీ లాంగ్-షార్ట్ ఫండ్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఎ) గురువారం, 5 మార్చి 2026న ప్రారంభమై, బుధవారం, 18 మార్చి2026న ముగుస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులు, మారుతున్న నాయకత్వం, పెరిగిన అస్థిరత ద్వారా వర్గీకరించబడిన వాతావరణంలో మరింత అనుకూల పోర్ట్ఫోలియోనుకోరుకునే పెట్టుబడిదారులకు ఈ పెట్టుబడి వ్యూహం అనుకూలంగా ఉంటుంది. […] The post ఆరూధ ఎఎఫ్ ఆరూధ ఈక్విటీ లాంగ్-షార్ట్ ఫండ్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 9:53 pm

ఎస్కార్ట్స్ కుబోటా కొత్త ‘సౌత్ స్పెషల్’వరి ట్రాక్టర్ సిరీస్ ప్రారంభం

న్యూదిల్లీ: వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్, పవర్ ట్రాక్ శౌర్య పేరుతో కొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్సిరీస్ ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ సిరీస్లో 39 హెచ్పి నుండి 52 హెచ్పీ విభాగాలలో ఐదు వేర్వేరు రకాలను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలోని వరి సాగు ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి వరి, మాగాణి ప్రత్యేక సిరీస్ […] The post ఎస్కార్ట్స్ కుబోటా కొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్ సిరీస్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 9:50 pm

రామ్ చరణ్ డ్యాన్స్ పై సమంత ప్రశంసలు

పెద్ది చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘రైరై రారా’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ చూసి కేవలం అభిమానులు మాత్రమే కాదు హీరోయిన్ సమంత కూడా ఫిదా అయ్యారు. చరణ్ మాస్ స్టెప్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. రామ్ చరణ్ ఒకే ఒక్కడు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్, - సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించారు. అప్పటి నుంచి సామ్.. చరణ్ యాక్టింగ్ కి, డ్యాన్స్ కి పెద్ద ఫ్యాన్. 

మన తెలంగాణ 3 Mar 2026 9:48 pm

Hyderabad Municipal Polls to Be Delayed Amid Changing Political Equations?

Hyderabad municipal elections are likely to be delayed as the ruling Indian National Congress reassesses its prospects in the city. Despite sweeping a majority of municipal bodies across Telangana, the expected ripple effect has not translated into visible momentum in Hyderabad. The term of office of GHMC was completed in February2026. Even internal reports suggest […] The post Hyderabad Municipal Polls to Be Delayed Amid Changing Political Equations? appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 9:47 pm

Nani’s Aaya Sher shatters 1 Million likes in record time

Natural Star Nani has once again proven his mass appeal as the first single from his ambitious project The Paradise creates history online. Titled Aaya Sher, the song has successfully crossed the 1 million likes threshold on YouTube in record-breaking time. The track’s rapid ascent to this milestone is a testament to the combined star […] The post Nani’s Aaya Sher shatters 1 Million likes in record time appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 9:39 pm

99 రోజుల ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గద్వాల, ఆంధ్రప్రభ: జిల్లాలో

ప్రభ న్యూస్ 3 Mar 2026 9:28 pm

చెట్టుకు ఉరివేసుకొని ప్రమ జంట ఆత్మహత్య

చెట్టుకు ఉరివేసుకొని ప్రమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటనా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రాపూర్ ఘాట్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) కు సోషల్ మీడియాలో చిట్టమూరుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. మంగళవారం రావూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బా గుర్తించారు. అయితే ఆ మహిళకు ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 3 Mar 2026 9:19 pm

బాలుడికి తలసేమియా.. దీన స్థితిలో తల్లిదండ్రులు

బాలుడికి తలసేమియా.. దీన స్థితిలో తల్లిదండ్రులు విస్సన్నపేట,ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు

ప్రభ న్యూస్ 3 Mar 2026 9:13 pm

దుబాయ్ నుంచి సురక్షితంగా వచ్చేశా: పీవీ సింధు

బెంగళూరు: ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దుబాయ్ నుంచి మంగళవారం సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఎయిర్‌స్పేస్‌ను మూసి వేయడంతో దుబాయ్ విమానాశ్రయంలో సింధు చిక్కుకున్న విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వెళ్లిన సింధు, ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయింది. అయితే బెంగళూరు లోని తన ఇంటికి సురక్షితంగా చేరుకున్నట్టు తన ఎక్స్ అకౌంట్‌లో వెల్లడించింది. కష్ట సమయంలో చాలా కేర్ తీసుకున్న దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. దుబాయ్‌పై ఇరాన్ దాడి గురించి ప్రస్తావిస్తూ తాను ఉండే చోట పేలుళ్లు జరగడంపై స్పందిస్తూ “ఇలాంటి క్షణాలు సాధారణ జీవితం నిజంగా ఎంత దుర్బలమైనదో మీకు గుర్తు చేస్తాయి.” అని ఆమె తన అనుభవాన్ని వివరించారు. ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకుని మళ్లీ ఉత్తేజాన్ని పొందిన తరువాత తదుపరి అడుగులు వేయాల్సి ఉందని తన అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చింది.

మన తెలంగాణ 3 Mar 2026 9:12 pm

జిల్లాఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్యకార్యాచరణసమితి ఏర్పాటు

విశాలాంధ్ర – పార్వతీపురం : జిల్లాలోని అన్ని విభాగాలనుండి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్య కార్యాచరణసమితిను మంగళవారంనాడు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్.ఎస్. కిషోర్, కార్యదర్శి రంగాచారిలు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సంఘాన్ని మరింత పటిష్టంగా నిర్మించాల్సిన బాధ్యత, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల బాధ్యత ఇతరఅంశాలపై కూలంకషంగా […] The post జిల్లాఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్యకార్యాచరణసమితి ఏర్పాటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 9:09 pm

భారతీయుల భద్రతపై ఒమన్, కువాయిట్ అధినేతలతో మోడీ చర్చలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్‌అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతపై ప్రధాని మోడీ ఆయా దేశాధినేతలతో గత రెండు రోజులుగా చర్చించి వారి క్షేమసమాచారం తెలుసుకుంటున్నారు. మంగళవారం ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్, కువాయిట్ రాజు షేక్ సబాహ్ అల్ ఖలేద్ అల్ హమాద్ అల్ ముబారక్ అల్ సబాహ్‌లతో అక్కడి భారతీయుల భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెలిఫోన్ ద్వారా సాగిన సంభాషణల్లో అక్కడ నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రత గురించి తెలుసుకున్నారు. అంతకుముందు బహ్రెయిన్ రాజు, సౌదీ అరేబియా రాజులతో చర్చించారు. ఆయా దేశాలపై ఇటీవల జరిగిన దాడులపై మాట్లాడుతూ ఈ క్లిష్టసమయంలో ప్రజల సాధికారతకు భారత్ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా తో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో కూడా మోడీ చర్చించారు. 

మన తెలంగాణ 3 Mar 2026 9:08 pm

లెబనాన్‌లో 40 మంది మృతి

లెబనాన్‌లోని హెజ్‌బొల్లాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లాల టీవీ, రేడియో స్టేషన్లకు నష్టం వాటిల్లింది. దక్షిణ లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ తరలిస్తోంది. హెజ్‌బొల్లాలు స్థావరాల చుట్టూ ఉన్న 80 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. 200మందికిపైగా గాయపడ్డారు. బీరూట్‌లోని దహియేలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది.

మన తెలంగాణ 3 Mar 2026 9:03 pm

ఒమన్ ఓడరేవు పై ఇరాన్ డ్రోన్ దాడి

గతవారం అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడులలో సుప్రీ లీడర్ ఖమేని హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడులలో భాగంగా మంగళవారం ఉదయం ఒమన్ లోని రాస్ అల్ -జైమా ఓడరేవుపై ఇరానియన్ డ్రోన్ దాడి చేసింది. దాడులలో మంటలు ఎగసి పడ్డాయి. డ్రోన్ మంటల్లో దూసుకుపోతూ, కెమెరాకు చిక్కింది. ఓడరేవు అంతటా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే గల్ఫ్ లోని దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులు, ఓడరేవులు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఇరానియన్ షాహెద్ సూసైడ్ డ్రోన్లు జరిపిన ఇలాంటిదాడిలోనే సౌదీ అరేబియా లోని తనూరా శుద్ధి కర్మాగారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలకు అంతరాయం కలుగకుండా తక్షణం మూసివేశారు. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్మూలించే లక్ష్యంతోనే అమెరికా - ఇజ్రాయెల్ ఫిబ్రవరి 20 నుంచి ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించాయి. బాంబులు, వైమానికదాడులతో విరుచుకుపడుతుంటే, ఇరాన్ అమెరికా స్థావరాలు ఉన్న ఇతర గల్ఫ్ దేశాలపై ప్రతీకారదాడులు చేస్తోంది. మరో పక్క ప్రపంచంలో పలు దేశాలకు చమురు సరఫరాలు జరిగే సముద్రమార్గం అయినహోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరా ప్రకటించింది. దాని గుండా వెళ్లే ఏ నౌకనైనా ధ్వంసం చేసే ప్రమాదం ఉండడంతో చమురు ట్యాంకర్లు, ఇతర నౌకలు జలసంధికి ఇరువైపులా నిలిచి పోయాయి.

మన తెలంగాణ 3 Mar 2026 8:58 pm

ఉద్రిక్తంగానే పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు బహ్రెయిన్‌లో ఎయిర్‌బేస్ ధ్వంసం ఇంధన ట్యాంకులకు మంటలు ఒమన్ పోర్టుపై డ్రోన్ దాడులు ఖతార్‌లో ఇంధన కేంద్రంపై దాడి కువైట్‌లో అమెరికా రాయబార కార్యాలయం లక్షం, మూసివేత ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం మిలిటరీ శిక్షణ కార్యాలయంతో పాటు ప్రధాన ఆఫీసులు ధ్వంసం టెహ్రాన్ విమానాశ్రయంపై ఉమ్మడి సేనల దాడి లెబనాన్‌పైనా దాడులు, 40 మంది మృతి నతాంజ్ అణు కేంద్రంపై దాడి నిర్ధారించిన ఐఎఈఏ టెహ్రాన్/దుబాయి/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నాలుగో రోజూ యుద్ధం ఉధృతంగానే సాగింది. ఇరాన్, అమెరికాఇజ్రాయెల్ పరస్పర దాడులకు పాల్పడ్డాయి. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ తదితర దేశాల్లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో రెచ్చిపోయింది. అమెరికా స్థావరాలను లక్షంగా చేసుకుంది. బహ్రెయిన్ షేక్ ఇసాలోని అమెరికా ఎయిర్‌బేస్‌ను క్షిపణులు, డ్రోన్లతో ధ్వంస చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కాప్స్ ప్రకటించుకుంది. ఇంధన నిల్వ ట్యాంకులకు మంటలు అంటుకున్నాయని, ఉవ్వెత్తున పొగలు ఎగిసినట్లు తెలిపింది. లక్ష్యాన్ని పక్కాగా ఢీకొట్టినట్లు వెల్లడించింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడిలో అమెరికా ప్రధాన హెడ్‌క్వార్టర్ ధ్వంసమైందని, ప్రధాన కార్యాలయంతో పాటు ఉద్యోగుల క్వార్టర్లు సల్వంగా దెబ్బతిన్నాయని తెలుపుతూ సంబంధిత చిత్రాలను ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇక రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను సౌదీ అరేబియా విజయవంతంగా కూల్చివేసింది. మరోవైపు ఒమన్‌లోని ‘రస్ అల్ జైమా’ పోర్టుపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో ఆ ప్రాంతమంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంబంధిత వీడియో కూడా వైరల్ అయ్యింది. ఖతార్‌లోని ఇంధన కేంద్రంపై కూడా జరిగినట్లు తెలుస్తోంది. కువైట్‌లో రాయబార కార్యాలయంపైనా ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడడంతో దాన్ని మూసివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇదిలావుండగా నాలుగు రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది చనిపోయారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ మంగళవారంనాడు ‘ఎక్స్’లో వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ గురి... ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తాజాగా ఆ దేశ అధ్యక్షుడిపై గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. మంగళవారంనాడు టెహ్రాన్‌లో అధ్యక్ష కార్యాలయమే లక్షంగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మిలిటరీ శిక్షణ ప్రధాన కార్యాలయంపైనా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దానితో పాటు ఇతర ప్రధాన కార్యాలయాను కూడా టార్గెట్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్‌లో అత్యంత సీనియర్ అధికారుల కాంపౌండ్‌లను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ ఇరాన్‌లోని అమెరికాఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 13 మంది ఇరాన్ సైనికులు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. టెహ్రాన్‌కు 500 మైళ్ల దూరంలోని కెరామిన్ ఎయిర్‌బేస్ లక్షంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఇదిలావుండగా టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ మేరకు టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హకీమే ఏరియాలో కూడా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలే లక్షంగా ఉమ్మడి సేనలు విధ్వంసానికి తెగబడినట్లు వెల్లడైంది. లెబనాన్‌లో 40 మంది మృతి.. మరిన్ని బలగాలు పయనం మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లాల టీవీ, రేడియో స్టేషన్లకు నష్టం వాటిల్లింది. దక్షిణ లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ తరలిస్తోంది. హెజ్‌బొల్లాలు స్థావరాల చుట్టూ ఉన్న 80 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. 200మందికిపైగా గాయపడ్డారు. బీరూట్‌లోని దహియేలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది. నతాంజ్‌పై దాడిని నిర్ధారించిన ఐఎఈఏ ఇదిలావుండగా ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు నిజమేనని ఐఎఈఏ నిర్ధారించింది. కేంద్రానికి స్వల్పంగా నష్టం జరిగిందని, అయితే అణు ధార్మికత ప్రమాదం ఇప్పటికేమీ లేదని వెల్లడించింది. అణుకేంద్రంలోకి ప్రవేశించే క్రమంలో భూగర్భ ప్రవేశ ద్వారాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుర్తించామని తెలిపింది. ఖాళీ చేసి రండి.. ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాలను లక్షంగా చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఆ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. బహ్రెయిన్, జోర్డాన్‌లలోని అత్యవసర సేవల సిబ్బంది మినహా మిగతా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, లేకపోతే స్వదేశానికి విచ్చేయాలని సూచించింది. భద్రతా పరమైన రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించింది. 

మన తెలంగాణ 3 Mar 2026 8:53 pm

రాజ్యసభ రేసులో 16 మంది

రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీలేర్పడనున్న రెండు స్థానాలకు తమ పార్టీలో 16 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందులో నలుగురు బిసి ముఖ్య నేతలు ఉన్నారని ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.సోమవారం వికారాబాద్‌కు వచ్చిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో తాను, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొంత సేపు చర్చించామని ఆయన చెప్పారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీకి పిలుస్తామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అన్నారని ఆయన చెప్పారు. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి ఢిల్లీకి పిలుస్తారా? లేక ఫోన్లో చర్చిస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుల ఆశావాహుల జాబితా ఇవ్వాల్సిందిగా రాహుల్, కెసి వేణుగోపాల్ అడగడంతో సామాజిక వర్గాల వారిగా 16 మంది పేర్ల జాబితా ఇచ్చామని ఆయన వివరించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఏ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జస్టిస్ పి. సుదర్శన్ రెడ్డికి నష్టపరిహారంగా ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నదా? అని ప్రశ్నించగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు తనకు రాజ్యసభ పదవి కావాలని అడగలేదని ఆయన స్పష్టం చేశారు.

మన తెలంగాణ 3 Mar 2026 8:50 pm

Buzz: Manchu Manoj in talks for NBK 111

NBK 111 is all set to roll from March 5th in Hyderabad in a grand manner. Nandamuri Balakrishna is preparing himself for the role while Gopichand Malineni has completed the entire pre-production work. Venkata Satish Kilaru, the producer of Ram Charan’s Peddi is the producer of this mass entertainer. As per the latest speculation, the […] The post Buzz: Manchu Manoj in talks for NBK 111 appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 8:47 pm

దుబాయ్‌లో చిక్కుకున్న 2 వేల మంది హైదరాబాదీయులు

 ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నగర వాసులను భయాందోళనల్లో నెట్టేస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయిన వారిలో సుమారు 2వేల మంది హైదరాబాదీయులే ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటు న్నాయి. దీంతో ఇక్కడ ఉంటున్న వారి కుటుంబీకులు ఆందోళన అంతా ఇంతా కాదు. అయితే, సోమవారం రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టును పునరుద్ధరించారు. భారత్‌కు వెళ్లే చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై విమానాలు టేకాఫ్ అయ్యాయి. హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పాసులు ఇచ్చినా ఫ్లైట్‌ను రద్దు చేసింది. ప్రయాణికులను తిరిగి హోటల్‌కు తరలిస్తున్నట్లు ఓ ప్రయాణికుడు వెల్లడించారు. దుబాయి పర్యాటకం ప్రత్యేక అనుభూతిని కల్పించనుండటంతో నగరానికి చెందిన చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి కన బరుస్తారు. గతేడాది శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 5,23,107 మంది ప్రయాణించినట్లు సమాచారం. ఇందులో 50--60శాతం మంది టూరి స్టులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతీ రోజు 5-6 విమానాలు నేరుగా వెళుతుండగా, 15 వరకు కనె క్టింగ్ విమానాలున్నాయి. రోజుకు సగటున 1400--1500 మంది వెళ్తుంటారు. నగరంలో దాదాపు 1801 ట్రావెల్ ఏజెన్సీలున్నాయి. ఇందు లో 123 పేరొందిన సంస్థలే ఉన్నాయి. గల్ఫ్‌లో యుద్ధం జరుగుతుండడంతో దుబాయికి వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. దుబాయితో పాటు ఇతర దేశాల ప్రయాణాలకు కూడా ఎవరూ ఇష్టపడడంలేదని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహ కులు చెబుతున్న మాటగా ఉంది. మార్చిలో ప్రయాణించేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న నగరవాసులు ఆందోళనకు లోనవు తున్నారు. యుద్ధ భయంతో అక్కడికి వెళ్లలేమని చెబుతూ డబ్బులు రీఫండ్ చేయాలని ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగాడుతున్నారు. దీంతో నిర్వాహకులు కొందరికి సర్దిచెబుతూ, వారు కోరిన విధంగా ఇతర తేదీల్లో ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. మరికొందరికి డబ్బులను రీఫండ్ చేస్తున్నారు. కాగా, డబ్బులు ఇవ్వలేని సంస్థలు వారికి మరికొన్ని ఇతర ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దేశాలు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పర్యాటకాన్ని సంద ర్శించేందుకు వీలు కల్పిస్తున్నారు. మొత్తంగా ఇరాన్--ఇజ్రాయెల్ నడుమ జరుగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జా తీయ పర్యాటకంపై భారీగా పడిందని పలువురు ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.

మన తెలంగాణ 3 Mar 2026 8:45 pm

విడాకులు ఇవ్వడంలేదని భార్యపై భర్త దాడి

భార్య తనకు విడాకులు ఇవ్వడంలేదనే కోపంతో కత్తితో దాడి చేసిన భర్తను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 14లోని నందినగర్‌లో నివాసం ఉంటున్న వడ్డెమాన్ నిర్మల, వడ్డెమాన్ అడివన్నకు 2009లో వివాహం అయింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అడివన్న, ఈ సంబంధాన్ని మూడేళ్ల నుంచి కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య విడాకులు ఇస్తే ఆ మహిళను వివాహం చేసుకుంటానని నిర్మలతో పలుమార్లు గొడవపడ్డాడు. గత నెల 18వ తేదీన నిర్మలతో గొడవపడిన అడివన్న ఆమెను విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో గాయపడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించడంతో ఆరోగ్యం బాగుపడి, ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. పెద్దలు సర్ది చెప్పడంతో నిర్మల, అడివన్న పై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనిని అలుసుగా తీసుకున్న అడివన్న రెండు రోజుల క్రితం మరోసారి మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిర్మలను దూషించడంతో పాటు కడుపులో తన్నాడు. అంతటితో ఆగకుండా కత్తితో బెదిరిస్తూ నిర్మలతో పాటు పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకుల కోసం తన భర్త తనపై కత్తితో దాడి చేశాడని, అతడివల్ల తనకు, తనపిల్లలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై అడివన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మన తెలంగాణ 3 Mar 2026 8:35 pm

కాలువలలో గుర్రపు డెక్క ఆకు తొలగింపు

కాలువలలో గుర్రపు డెక్క ఆకు తొలగింపు విజయవాడ,ఆంధ్ర ప్రభ: విజయవాడ నగరం లో

ప్రభ న్యూస్ 3 Mar 2026 8:33 pm

యుద్ధోన్మాదానికి మోదీ మద్దతు!

ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఒక్కుమ్మడిగా దాడి చేసి బీభత్సం సృష్టిస్తూ ఉంటే మనం ఎక్కడున్నాం? ఈ యుద్ధంపై మోదీ ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఎప్పుడూ నైతికత గురించి ఉపన్యాసాలు గుప్పించే ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు నిర్దిష్టమైన ప్రకటన చేయనే లేదు. మన దేశంలో పర్యటిస్తున్న కెనడా ప్రధానమంత్రి కార్నీతో మాట్లాడుతూ మోదీ ఇచ్చిన శాంతి సందేశం ఎవరిని ఉద్దేశించిందనుకోవాలి? మొట్టమొదట దాడి చేసింది ఇరాన్ కాదు. శాంతికి భంగం కలిగించిందీ ఇరాన్ కాదు. ఏకపక్షంగా ఇజ్రాయెల్, […] The post యుద్ధోన్మాదానికి మోదీ మద్దతు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 8:25 pm

అస్తమించిన ప్రజాసూర్యుడు

గిడ్డకింద మాణిక్యం చరిత్రలో కొందరు తమ కాలానికి సాక్ష్యంగా మాత్రమే కాదు కాలాన్ని అధిగమించి ఒక విలువగా నిలుస్తారు. వారు ఉద్యమానికి నాయకులు మాత్రమే కాదు ఒక నిశ్శబ్ద తరాన్ని తట్టిలేపే దండోర. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు కామ్రేడ్ ఆర్.నల్లకన్ను. ఆయన జీవితం ఒక రాజకీయ ప్రస్థానమే కాదు. ఒక సిద్ధాంతం శరీరాన్ని ధరించి సామాజిక సమస్యల పై నడిచిన యాత్ర. స్వాతంత్రోద్యమ నాయకుడిగా, రైతు సమస్యలు, వివక్ష, అంటరానితనం వంటి సామాజిక అసమానతల పై […] The post అస్తమించిన ప్రజాసూర్యుడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 8:25 pm

సంపద సృష్టి నినాదమేనా…విధానంలోకి దిగుతారా?కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

నేటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే జనంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక వాక్యం వెల్లడిస్తుంటారు. “సంపద సృష్ష్టించడం నాకు తెలుసు, సంపద సృష్టిస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తాను” అని. అది ఒక నినాదంగా ఆయన వెల్లడిస్తుంటారు. ఆ నినాదాన్ని అమలుజరిపే విధానం మాత్రం వెల్లడించడం మరుస్తున్నారేమో అనిపిస్తూంది. రాష్ట్రాభివృద్ధిని కలలు గనే తపస్సులో ఫలసిద్ధి యింకా సూత్ర-బద్దమై ఆయనకు సానుకూల పడలేదేమోనన్న అనుమానము జనంలో తలెత్తుతూంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అప్పుల ఊబిలో తలమునకలై […] The post సంపద సృష్టి నినాదమేనా…విధానంలోకి దిగుతారా?కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 8:24 pm

రాష్ట్రంలో కల్తీ ప్రభుత్వం.. అరాచక, కల్తీ పాలన

రాష్ట్రంలో కల్తీ ప్రభుత్వం.. అరాచక, కల్తీ పాలన ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో

ప్రభ న్యూస్ 3 Mar 2026 8:24 pm

నడి వేసవి రాత్రులు

చింతపట్ల సుదర్శన్ దారికి అడ్డంగా మనుషుల గుంపు కనిపించింది. అది పెళ్లి ఊరేగింపో, చావు సాగనంపో, రోడ్డు షోనో, రాస్తారోకోనో అర్థం కాలేదు. ఏదో ఓ కారణంగా రోడ్లకి జనం అడ్డం పడటం మామూలే కదా! అంటూ మెయిన్ రోడ్డు వదిలి పక్కదారి పట్టింది డాంకీ. అలా ఓ సందులో నుంచి మరో దాన్లోకి, ఓ వీధిలోంచి మరో వీధిలోకి మర్లుతూ, తిర్గుతూ దారి తప్పింది. తను ఎన్నడూ చూడని చోట్లని వింతగా చూస్తూ నడుస్తున్న డాంకీ […] The post నడి వేసవి రాత్రులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 8:22 pm

Buchi Babu’s next Target is Prabhas

Uppena marked the directorial debut of Buchi Babu and the super success of the film made him bag an opportunity to direct Ram Charan in his second. The film titled Peddi is high on expectations and the film is doing record pre-release business. Peddi is slated for summer release and it is in the final […] The post Buchi Babu’s next Target is Prabhas appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 8:22 pm

నెమలి వేణుగోపాలస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా..

నెమలి వేణుగోపాలస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా.. గంపలగూడెం, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన

ప్రభ న్యూస్ 3 Mar 2026 8:12 pm

ఇంద్రకీలాద్రి మహోత్సవానికి మంత్రులకు ప్రత్యేక ఆహ్వానం..

ఇంద్రకీలాద్రి మహోత్సవానికి మంత్రులకు ప్రత్యేక ఆహ్వానం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి

ప్రభ న్యూస్ 3 Mar 2026 8:00 pm

రాజముద్రతోనే సమస్యలకు చరమగీతం…

రాజముద్రతోనే సమస్యలకు చరమగీతం… పాస్ బుక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేపట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:52 pm

పశ్చిమాసియాలో డేటా సెంటర్లపై దాడి

అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య మొదలైన యుద్ధంలో డ్రోన్ దాడుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లోని రెండు అమెజాన్ డేటా సెంటర్లు, బహ్రెయిన్ లోని ఒక సెంటర్ లో కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. పశ్చిమాసియా అంతటా బ్యాంకింగ్ వంటి రంగాలలో క్లౌడ్ సేవలు, కంప్యూటింగ్ సౌకర్యాలకు అంతరాయం కలిగినట్లు టెక్నాలజీ, ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఆదివారంనాడుయూఏఇ లోని రెండు డేటా కేంద్రాలను డ్రోన్ లు ఢీ కొట్టాయని అమెజాన్ తెలిపింది. బహ్రెయిన్ లోని డేటా సెంటర్ సమీపంలో భారీ దాడి వల్ల దాని మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం జరిగింది. తక్షణమే మరమ్మతులు చేపట్టినా, నష్టం తీవ్రంగా ఉండడంతో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. డేటా సెంటర్ లే లక్ష్యమా? సాంకేతిక పరమైన అంతరాయాల వల్ల సోమవారం, మంగళవారం యుఏఇ స్టాక్ మార్కెట్ మూతపడింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేదా ఏడబ్ల్యూ ఎస్ అంతరాయల వల్ల విమాన సేవలపైనా, ప్రయాణికులపైన ప్రభావితం చూపాయి. దుబాయ్ , కువైట్ లోని విమానాశ్రయాలలో దాదాపు పదివేల మంది చిక్కుకుపోవడం ఈ స్థాయిని తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుతం కమ్యూనికేషన్లు, లాజిస్టిక్స్, సైనిక దళాల రవాణా, విస్తరణ, నిఘా సమాచారం సేకరణ, ఆయుధాల టార్గెట్, కాల్పుల వంటి కీలకమైన సైనిక చర్యలలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, లేదా ఇరానియన్ లలో ఏ డ్రోన్ లు విరుచుకుపడ్డా పూర్తిగా ఇంటర్ నెట్ పై ఆధారపడిన ప్రపంచంలో మౌలిక సదుపాయాలకు కీలకమైన కేంద్రాలు యుద్ధ వ్యూహాలలో భాగం అవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది.కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయంగా జరిగే యుద్ధాలలో సైనిక శిబిరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేవారు. ఆహారం, నీటి సరఫరా కేంద్రాలు, ఇంధన వనరులను తర్వాతి కాలంలో లక్ష్యంగా చేసుకునేవారు.పశ్చిమాసియాలో సాంకేతిక సంస్థలు, డేటా సెంటర్ల ను లక్ష్యంగా చేసుకోవడం భవిష్యత్ లో జరిగే యుద్ధాలకు సంకేతమా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మన తెలంగాణ 3 Mar 2026 7:38 pm

బ్లడ్‌మూన్‌ను చూశారా..

బ్లడ్‌మూన్‌ను చూశారా..

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:37 pm

కెసిఆర్ దూరదుష్టిలో తెలంగాణలో తెల్లకోటు విప్లవం: హరీష్ రావు

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరదుష్టితో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో వైట్ కోట్ విప్లవం సాకారమైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. దీని ద్వారా వైద్య విద్య అవకాశాలు విస్తరించి, ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు. ఉప్పల్ ఎంఎల్‌ఎ బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హరీష్ రావు నివాసంలో ఏడుగురు ఎంబిబిఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, బిఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు చెక్కులు అందజేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఇది కేవలం దానంగా కాకుండా, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని చెప్పారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తూ, విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి ,ప్రభుదాస్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 3 Mar 2026 7:32 pm

కోడిపందాల నిర్వాహకులు అరెస్టు

కోడిపందాల నిర్వాహకులు అరెస్టు తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: మండలంలోని గుంటూరు గ్రామ శివారులో

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:31 pm

మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన సినీనటి మంచు లక్ష్మి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మంత్రి సీతక్కను మంచు లక్ష్మి ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంత్రికి ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం తమ సంస్థ చేయూతగా నిలుస్తోందని మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. అనంతరం మంచు లక్ష్మిని మంత్రి సీతక్క అభినందించారు.

మన తెలంగాణ 3 Mar 2026 7:29 pm

హోలీ సంబరాలలో మంత్రి సవిత..

విశాలాంధ్ర పెనుకొండ.. పెనుకొండ పట్టణంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి వద్ద అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైభవంగా హోలీ సంబరాలను నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాలలోనూ రంగుల రంగుల జీవితమయం కావాలని కోరుకుంటూ అందరికీ మంచి జీవితం ప్రసాదించాలని అందరి జీవితాలు రంగుల మయంగా ఉండాలని ఒకరినొకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో […] The post హోలీ సంబరాలలో మంత్రి సవిత.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 7:23 pm

ఘనంగా వెంటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

ఘనంగా వెంటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ: హన్మకొండ… కరీంనగర్ ప్రదాన

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:22 pm

హోళీతో కొత్త ఆశలు నింపుకుందాం..

హోళీతో కొత్త ఆశలు నింపుకుందాం.. నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:17 pm

3mar2026 |షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం

3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం 3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం ఇరాన్ అణు

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:12 pm

అక్రమ ఇసుక తవ్వకాల ప్రచారం అవాస్తవం..

అక్రమ ఇసుక తవ్వకాల ప్రచారం అవాస్తవం.. మహాదేవపూర్,ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:11 pm

చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధి పంతులు చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.హోళీ పండగ అనంతరం స్నానం కోసం స్నేహితులతో కలిసి చెరువులోకి ఇద్దరు యువకులు దిగారు.లోతులోకి వెళ్లిన తర్వాత ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందారు. తోటి స్నేహితుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు వివరాలు అడగి తెలుసుకున్నారు. మృతులు సాగర్(17),అభిషేక్(17)పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకునిమృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మన తెలంగాణ 3 Mar 2026 7:11 pm

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:03 pm

Football|వార్ ఎఫెక్ట్‌..

Football| వార్ ఎఫెక్ట్‌.. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడులుఅమెరికాలో ఫిఫా ప్రపంచకప్‌-2026

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:01 pm

పెద్ద ఉల్లగల్లు గ్రామంలో భారీ చోరీ

పెద్ద ఉల్లగల్లు గ్రామంలో భారీ చోరీ ముండ్లమూరు,ఆంధ్రప్రభ: ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:55 pm

మాజీ ‘మావో’లు మా పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తాం: మహేష్ కుమార్ గౌడ్

“మాజీ ‘మావోయిస్టులు’ మా పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తాం..” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పది రోజుల పాటు వికారాబాద్‌లో జరిగిన తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంతో బిజి-బిజీగా గడిపిన మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ శిక్షణా శిబిరం సంతృప్తికరంగా జరిగిందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతాం అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఈ విషయంలో తాము ఎవరినీ అడగలేదని, వారూ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారని ఆయన చెప్పారు. ప్రజల కోసం పోరాడిన వారిపై తమకు గౌరవం ఉందన్నారు. తామైనా, మావోయిస్టులైనా పేద ప్రజల అభ్యున్నతి కోసమే పోరాటం చేస్తున్నామని ఆయన వివరించారు.ఆపరేషన్ కగార్‌ను తాము వ్యతిరేకించామని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ మావోయిస్టులతో చర్చలకు ఎందుకు అంగీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌పై మండిపాటు రాజ్యసభ స్థానాల ఎంపిక గురించి ప్రశ్నించగా, బుధవారం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌కు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీ కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించిందే తప్ప తెలంగాణ కోసం పని చేసిన వారిలో ఒక్కరికైనా రాజ్యసభ అవకాశం ఇచ్చిందా? అని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నించారు. త్వరలో కొన్ని నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించామని ఆయన చెప్పారు. పలు కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా, వెలుగుమట్ల గ్రామ ప్రజల విషయంలో పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెబుతారని ఆయన చెప్పారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 3 Mar 2026 6:53 pm

బీహార్ నుంచి రాజ్యసభకు బిజెపి అధ్యక్షుడు..

న్యూఢిల్లీ/పాట్నా: ఈనెల16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు బిజెపి తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను మంగళవారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పోటీ చేయనున్నారు. అదే రాష్ట్రం నుంచి శివేష్ కుమార్, -అస్సాం నుంచి తారేష్ గోవాలా, జోగెన్ మోహన్, -ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీవర్మ, -హర్యానా నుంచి సంజయ్ భాటియా, -ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్‌మోహన్ సామల్, సుజీత్ కుమార్, త్వరలో ఎన్నికలు జరగనున్న -పశ్చిమబెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను అభ్యర్థులుగా ప్రకటించారు. సంజయ్ భాటియా 2019 నుంచి 2024 వరకూ కర్నాల్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాల్ నుంచి రికార్డు స్థాయిలో 6,56,142 ఓట్ల అధిక్యంతో గెలిచారు. జోగెన్ మోహన్ ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో రవాణా సహా పలు శాఖలు నిర్వహిస్తున్నారు. తారేష్ గోవాలా అసోంలోని దిబ్రూగఢ్ జిల్లా దులియాజన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. శివేష్ కుమార్ ఇంతకుముందు బీహార్‌లోని అజియోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. రాహుల్ సిన్హా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం మాజీ అధ్యక్షుడుగా ఉన్నారు. లక్ష్మీ వర్మ ఛత్తీస్‌గఢ్ బీజేపీలో సీనియర్ మహిళా నేతగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. సుజీత్ కుమార్ గతంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) సభ్యుడిగా ఉండేవారు. అయితే 2024లో ఆ పార్టీకి, రాజ్యసభ సీటుకు ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో అదే స్థానానికి ఆయన పోటీ చేసి తిరిగి ఎన్నికకావడం విశేషం. 

మన తెలంగాణ 3 Mar 2026 6:50 pm

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి..

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి.. విజయవాడ, ఆంధ్రప్రభ : వీరులపాడు మండలం,

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:43 pm

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ లో 160 మంది స్కూలు పిల్లల మృతి

టెహ్రాన్ : దక్షిణ ఇరాన్ లో మినాబ్ నగరంలోని భూమి 165 చిన్నారుల సమాధుల తవ్వకాలకు సిద్ధమవుతోంది. ఇందులో 160 కి పైగా విద్యార్థినుల మృతదేహాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో వేగంగా యుద్ధం విస్తరిస్తున్న సమయంలో శనివారం అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రాథమిక పాఠశాల బలైపోవడం తీరని విషాదం. ఈ సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌అరాగ్చీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాంబు దాడులకు చిన్నారుల మృతదేహాలు ముక్కలుముక్కలుగా చిందరవందరయ్యాయన్నారు. ప్రజలకు భద్రత కల్పిస్తానని, అందర్నీ రక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన “వాగ్దానం” అసలు స్వరూపం ఇదని అనాగ్చీ ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు. గాజా నుంచి మినాబ్ వరకు అమాయకుల రక్తాన్ని ట్రంప్ కళ్లారా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలపై ఆస్పత్రులపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం యుద్ధనేరమని భగ్గుమన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఈ సామూహిక ఖననం మంగళవారం నిర్వహించినప్పుడు మరోవైపు టెలివిజన్ దృశ్యాల్లో వేలాది మంది విషాదంతో “ ఇది అమెరికాకే మరణం ” అని నినదించడం గమనార్హం. మృతుల్లో ఎటేనా అనే బాలిక తల్లి అక్కడి జనం ముందు నిల్చొని ముద్రించిన మృతుల చిత్రాలను పట్టుకుని భావోద్వేగం చెందింది. మృతుల ముఖాలు “అమెరికా నేరాలకు సాక్షంగా కనిపించే ఒక డాక్యుమెంట్‌” అని గట్టిగా అరిచారు. “ఈ చిన్నారులు భగవంతుని మార్గంలో చనిపోయారు.” అని బాధను వ్యక్తం చేశారు. అక్కడి జనం అంతా “ఇది అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు” “ లొంగేది లేదు ” అని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, ఈ విషాద సంఘటనకు అమెరికా అధికారులు తమంత తాము వేగంగా దూరమయ్యారు. అమెరికా రక్షణ మంత్రి మార్కో రుబియో విలేకరులతో మాట్లాడుతూ డిపార్టుమెంట్ ఆప్ వార్ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తోందని, ఉద్దేశపూర్వకంగా ఒక పాఠశాలను అమెరికా టార్గెట్ చేసుకోలేదని చెప్పుకొచ్చారు. దీనికి ఇజ్రాయెల్ అధికారులు విరుద్ధ సమాధానాలు చెప్పారు. మీనాబ్‌పై దాడుల గురించి అంతగా తెలియదని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి మొదట్లో చెప్పినప్పటికీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్( ఐఆర్‌జిసి ) ఈ దాడికి బాధ్యులై ఉండవచ్చని ఇజ్రాయెల్ పేర్కొంది. 

మన తెలంగాణ 3 Mar 2026 6:34 pm

జగన్ ను కలిసిన మల్లు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు

తెలుగు పోస్ట్ 3 Mar 2026 6:32 pm

కర్నూలు నగరంలో అగ్నిప్రమాదం

కర్నూలు నగరంలో అగ్నిప్రమాదం కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు నగర శివారులోని భారీ

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:32 pm

Chandrababu : ఈ నెల 9న నంద్యాల జిల్లాకు చంద్రబాబు

ఈ నెల 9న నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదశే్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 3 Mar 2026 6:26 pm

భారత్-కెనడా మధ్య యురేనియం ఒప్పందం

న్యూఢిల్లీ : భారత్‌-కెనడా మధ్య సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది. ఈమేరకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి నిరంతర సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లపై కలిసి పనిచేయనున్నామని మోడీ తెలిపారు. అలాగే 2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొలిక్కి రావాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్టు కార్నీ వెల్లడించారు. స్వామి వివేకానంద సూక్తి ప్రస్తావన 1893లో స్వామి వివేకానంద కెనడాలో పర్యటించిన విషయాన్ని మార్క్ కార్నీ గుర్తు చేసుకున్నారు. “లేవండి, మేల్కొనండి.. లక్షం చేరేవరకు ఆగకండి”’ అని వివేకానంద సూక్తిని ప్రస్తావించారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు. 

మన తెలంగాణ 3 Mar 2026 6:25 pm

రోడ్డున పడిన టమాటా

టమాటా రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు

తెలుగు పోస్ట్ 3 Mar 2026 6:15 pm

Photos : Manchu Manoj & Bhuma Mounika Reddy Celebrate 3 Years of Togetherness

The post Photos : Manchu Manoj & Bhuma Mounika Reddy Celebrate 3 Years of Togetherness appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 6:14 pm

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం.. సీఎంకి ఆహ్వానం

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం.. సీఎంకి ఆహ్వానం ఇంద్రకీలాద్రి ,ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:12 pm