SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

Ys Jagan : జగన్ పాదయాత్ర కొనసాగుతుందా? పెద్ద డౌట్

వైఎస్ జగన్ పాదయాత్ర ఈసారి సాగుతుందా? అన్నది అనుమానం వ్యక్తమవుతుంది

తెలుగు పోస్ట్ 7 Mar 2026 2:27 pm

సత్తుపల్లిలో ట్రాక్టర్ ను ఢీకొట్టిన బైక్: ఇద్దరు యువకులు మృతి

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం మధ్యాహ్నం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు సిద్దారం గ్రామానికి చెందిన గద్దెల మనోజ్, గద్దెల కార్తీక్‌గా గుర్తించారు.  సిద్ధారం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతులు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మన తెలంగాణ 7 Mar 2026 2:25 pm

Duvvada Srinivas Rao Drags B.R. Naidu Into Tirumala Cake Row

A cheap political controversy from MLC Duvvada Srinivas Rao to justify the birthday cake-cutting episode at Tirumala by dragging TTD Chairman B.R. Naidu into the debate. The controversy was began after a birthday celebration involving Bigg Boss Telugu Season 9 fame Thanuja Puttaswamy at Tirumala, where an eggless cake was cut and the video circulated […] The post Duvvada Srinivas Rao Drags B.R. Naidu Into Tirumala Cake Row appeared first on Telugu360 .

తెలుగు 360 7 Mar 2026 2:24 pm

170 people |మహిళా సాధికారతకు పెద్దపీట వేద్దాం…

170 people | మహిళా సాధికారతకు పెద్దపీట వేద్దాం… చిన్నతనం నుండే బాలికలను

ప్రభ న్యూస్ 7 Mar 2026 2:18 pm

కరీంనగర్ ను తీర్చిదిద్దింది బిఆర్ఎస్ ప్రభుత్వమే : హరీష్ రావు

హైదరాబాద్: బిఆర్ఎస్ హయాంలో దేశంలోనే అత్యధిక పంటలు పండించింది తెలంగాణ అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. కోరుట్ల, చొప్పదండి ప్రాంతాలకు సాగునీళ్లొచ్చేలా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ..వరద కాల్వను రిజర్వాయర్ లా మార్చడంతో సాగునీళ్లు పారుతున్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం కూలిందని సిఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని, కాళేశ్వరం లేకుండానే దేశంలోనే అత్యధిక పంటలు పండించామని అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. రైతులపై కక్షగట్టి సాగునీళ్లు రేవంత్ సర్కార్ ఇవ్వడం లేదని, మెదక్, సిరిసిల్ల, కరీనగర్ జిల్లాల్లో పంటలు పండుతున్నది కాళేశ్వరం నీటితో కాదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. అద్భుతంగా కరీంనగర్ ను తీర్చిదిద్దింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, లక్ష్మి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయడంతో వరద కాల్వల ద్వారా నీళ్లు వచ్చాయని, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. మిడ్ మానేరు పనులు 90శాతం పూర్తి చేసిందని, తూములు, రెండు వైపులా కాల్వల ద్వారా నీళ్లిచ్చిందని చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంత ప్రజలకు సాగు.. తాగునీళ్లిచ్చిందని, గౌరెల్లి ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేసిందని అన్నారు. ఉన్న ప్రాజెక్టుల నీళ్లు పారించని తెలివిలేని ప్రభుత్వం కాంగ్రెస్ అని.. కాల్వల్లో పూడిక తీయడం లేదు.. దీంతో నీళ్లురాని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం మోటార్లు గతవారం రోజులు నడిస్తేనే కదా ఇక్కడి దాకా నీళ్లు వచ్చింది అని..మిడ్ మానేరు, ఎల్లంపల్లి ద్వారా నడిచే మోటార్లు కాళేశ్వరంవేనని అన్నారు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్ నుంచి 20 టిఎంసిలు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. కాళేశ్వరంలోని రిజర్వాయర్ల నుంచి సాగు, తాగునీళ్లు అందుతున్నాయని, రైతుల పంటలు పండుతున్నది నిజం.. ప్రజలకు తాగునీళ్లు అందుతున్నది నిజం అని ..కరీంనగర్ తాగునీళ్లు అందున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం కృపేనని హరీష్ రావు హరీష్ రావు స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 7 Mar 2026 2:13 pm

ఉగాది విశిష్ట పురస్కారానికి బుద్ధప్రసాద్…

ఉగాది విశిష్ట పురస్కారానికి బుద్ధప్రసాద్… ప్రకటించిన కలకత్తా ఆంధ్ర సంఘంఈ నెల 29వ

ప్రభ న్యూస్ 7 Mar 2026 2:09 pm

Collector |మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Collector | మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ Collector |

ప్రభ న్యూస్ 7 Mar 2026 2:03 pm

తొలి భాగానికి మించిన యాక్షన్.. ‘ధురంధర్-2’ ట్రైలర్ వచ్చేసింది..

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ధురంధర్’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రకటించారు. ఆ సీక్వెల్ త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. ‘ధురంధర్-ది రివేంజ్’ పేరుతో ఆ సీక్వెల్ విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగం పెంచేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రెహమాన్ డెకాయిట్ మృతి జరిగే అల్లర్లను ట్రైలర్ ప్రారంభం అవుతోంది. ఈ ట్రైలర్ చూస్తే మొదటి భాగం కంటే ఎక్కువ యాక్షన్ ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక సంజయ్ దత్, సారా అర్జున్‌లు ఈ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. తొలి భాగం కేవలం హిందీలో విడుదల కాగా.. రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

మన తెలంగాణ 7 Mar 2026 2:02 pm

Vijay gets one more Shock from his Wife

Tamil actor Vijay is all set for his political debut and he floated TVK. With the elections just weeks away, his wife Sangeetha Sornalingam has approached a Family Court for divorce. What’s sensational is that his wife alleged about his illegal relationship with an actress. Soon after this, Vijay was seen along with Trisha in […] The post Vijay gets one more Shock from his Wife appeared first on Telugu360 .

తెలుగు 360 7 Mar 2026 1:57 pm

YSRCP : రాజకీయ కుట్ర కాక మరేంటి : సజ్జల

వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు కుట్రలకు దిగారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 7 Mar 2026 1:49 pm

యుక్త ధార సాఫ్ట్వేర్ పోర్టల్ ఉపాధి పనులు

యుక్త ధార సాఫ్ట్వేర్ పోర్టల్ ఉపాధి పనులు రంపచోడవరం (పోలవరం జిల్లా) ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:48 pm

World War 3 Fear : ప్రపంచం ఉక్కిరి బిక్కిరి Andhta Prabha Detail Report

World War 3 Fear : ప్రపంచం ఉక్కిరి బిక్కిరి Andhta Prabha

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:44 pm

2002Haryana |ఏ కేసులో అంటే….

2002Haryana | ఏ కేసులో అంటే…. 2002Haryana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:41 pm

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్ట్ నుంచి ఆగిన ఎగుమతులుఉత్పత్తికి తగ్గ ధర లేక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ […] The post ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Mar 2026 1:35 pm

NTR Award Celebrates Chiru’s Contribution To Indian Cinema

In a proud moment for the film fraternity, Megastar Chiranjeevi has been awarded with the coveted NTR National Film Award at the Gaddar Awards 2025. The recognition celebrates his decades-long contribution to Indian cinema and his unmatched influence on the industry. Over the years, Chiranjeevi has built a legacy defined by blockbuster films, memorable performances, […] The post NTR Award Celebrates Chiru’s Contribution To Indian Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 7 Mar 2026 1:32 pm

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం అచ్చంపేట,ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:31 pm

విజయవాడలో కాల్పుల కలకలం

విజయవాడలో పోలీసులపైకి కాల్పుల జరిపిన ప్రయత్నం ఘటన వెలుగు చూసింది

తెలుగు పోస్ట్ 7 Mar 2026 1:28 pm

Adivi sesh |ప్రయోగం చేయబోతున్నారా…?

Adivi sesh | ప్రయోగం చేయబోతున్నారా…? క్షణం సినిమాతో టర్నింగ్ పాయింట్వరుస విజయాలతో

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:26 pm

Journalists |వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు…

Journalists | వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు… Journalists | మహబూబ్‌న‌గర్, ఆంధ్ర‌ప్ర‌భ‌

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:17 pm

విజయవాడలో పోలీసులపై కాల్పులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజ‌య‌వాడ‌లో కాల్పుల క‌ల‌క‌లం సృషించాయి. కార్డెన్ సెర్చ్ లో పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బస్టాండ్ వద్ద బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు.  కాల్పులకు యత్నించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఒక 9ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు యత్నించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన వాడిగా గుర్తించారు. హోటల్ గదిలో తుపాకీతో ఎందుకు ఉన్నాడు? పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మన తెలంగాణ 7 Mar 2026 1:17 pm

Inspections |భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం

Inspections | భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం Inspections | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:14 pm

చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని

డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ డిమాండ్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని, గిరిజనులను …

జనం సాక్షి 7 Mar 2026 1:12 pm

గద్దర్ సినీ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడు, నటి వీరే..

హైదరాబాద్: 2025 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2025 వరకూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) పొందిన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు. అంతేకాక.. సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ప్రత్యేక అవార్డులు ప్రధానం చేయనున్నారు. ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డుల ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డు ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రానికి దక్కగా.. ‘తండేల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా నాగచైతన్య నిలిచాడు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి రష్మికకు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఎన్టిఆర్ జాతీయ అవార్డు, నటుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్‌ అవార్డు లభించాయి. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, నటి జయసుధకు ఎఎన్నార్ అవార్డు దక్కింది. కాంతారావు అవార్డు నటుడు ఆర్.నారాయణమూర్తికి, సింగీతం శ్రీనివాసరావుకు బి.ఎన్.రెడ్డి అవార్డు దక్కింది. మిగితా అవార్డుల జాబితా ఇదే.. ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా ఉత్తమ తృతీయ చిత్రం - ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ - తండేల్ ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం - కోర్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ - యూనిటీ ఉత్తమ ప్రజాదరణ చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం! ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు - సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్) ఉత్తమ బాలల చిత్రం - అనగనగా ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా) ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా) ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్ రాబిన్ (దండోరా) ఉత్తమ గాయకుడు - అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ గాయని - సాహితీ (కన్నప్ప) ఉత్తమ బాలనటుడు - మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో) ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్ (యుఫోరియా) ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్) ఉత్తమ ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి) ఉత్తమ కొరియోగ్రాఫర్ - సందీప్ (ఛాంపియన్) ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - తోట తరణి (ఛాంపియన్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవిందరాజు (అఖండ-2) ఉత్తమ కాన్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ (ఛాంపియన్) ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ - పీటర్ (ఛాంపియన్) ఉత్తమ పర్యవరణ చిత్రం - ఇగ్వా స్పెషల్ జ్యూరీ అవార్డులు శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్) చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి) రోషన్ మేక (ఛాంపియన్) అనంతిక (8 వసంతాలు)

మన తెలంగాణ 7 Mar 2026 1:10 pm

మంత్రి అడ్లూరికి మరో కీలక బాధ్యత..

మంత్రి అడ్లూరికి మరో కీలక బాధ్యత.. ధర్మపురి, ఆంధ్రప్రభ : రాష్ట్ర సంక్షేమ

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:08 pm

ఆడబిడ్డలకు అండగా నిలబడుతున్నాం : రేవంత్

హైదరాబాద్: అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలు భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.  హైదరాబాద్ జెఎన్ టియు స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశం ఇచ్చారు. తెలంగాణలో ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రతిభను గుర్తించిందని, వారి శక్తికి తగ్గట్టు మహిళలకు కాంగ్రెస్ పదవులు కట్టబెట్టందని తెలియజేశారు. ఆర్థికంగా నిలబడానికి ఆడబిడ్డలకు అండగా నిలబడుతున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలకు మహిళల పేర్లు పెడుతున్నామని రేవంత్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ పక్కనే ఇందిరా మహిళా స్టాల్స్ కోసం స్థలం కేటాయించామని, గ్రామీణ మహిళల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయిస్తున్నామని అన్నారు. మహిళలకు సంపూర్ణ భద్రత ఉందా అంటే కాస్త ఆలోచించాలని, సోషల్ మీడియా పెరగడంతో మహిళలపై వేధింపులు పరిధి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మహిళలపై వేధింపులు పట్టణాలకే పరిమితమయ్యేవి అని..మహిళల కోసం చట్టాలు చేసే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు అని..  వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 7 Mar 2026 1:08 pm

తిరుపతిలో బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ అత్యాచారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో మ‌రో దారుణం జరిగింది.11 ఏళ్ల బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై తిరుచానూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను మహిళ రెండో వివాహం చేసుకుంది.  స‌ద‌రు మ‌హిళ‌కు మొద‌టి భ‌ర్త‌తో బాలిక (11)కు జ‌న్మించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య చికిత్సలు నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు తిరుచానూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

మన తెలంగాణ 7 Mar 2026 1:07 pm

ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, ఉపయోగించుకోవాలి

డీఎస్ఆర్ఆజెండాల్ తండ సర్పంచ్ గుగులోతు. రమేష్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహరం లబ్ధిదారులందరికి అందేల అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ సక్రమంగా జరగాలని, అంగనవాడి కేంద్రాల …

జనం సాక్షి 7 Mar 2026 1:07 pm

శ్రీ శివ విఘ్నేశ్వర ధ్వజస్తంభ మహోత్సవ పూజలు….

శ్రీ శివ విఘ్నేశ్వర ధ్వజస్తంభ మహోత్సవ పూజలు…. కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:06 pm

world cup|హైబ్రిడ్ పిచ్ వినియోగం?

world cup|హైబ్రిడ్ పిచ్ వినియోగం? ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:04 pm

JNTU |చట్టాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలి…

JNTU | చట్టాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలి… JNTU | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:02 pm

మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత

మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల

ప్రభ న్యూస్ 7 Mar 2026 1:02 pm

Hyderabad : హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయం.. ఈ నెల 12న ప్రారంభం

హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనుంది

తెలుగు పోస్ట్ 7 Mar 2026 1:00 pm

యూనిఫాం వేసుకోలేదని..

యూనిఫాం వేసుకోలేదని.. ఉయ్యూరు, ఆంధ్రప్రభ ; ఓ ప్రైవేటు విద్యాసంస్థలో విద్యార్థులకు అవమానం

ప్రభ న్యూస్ 7 Mar 2026 12:59 pm

Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 7 Mar 2026 12:43 pm

Varalaxmi Sarathkumar Clarifies about Saraswathi Controversy

Tamil actress Varalaxmi Sarathkumar has turned director and made a sensitive film Saraswathi. The film released on Friday. Right after the film’s release, top Telugu writer Burra Sai Madhav took his social media page to make strong comments without mentioning the name of the film. He said that the film started with his story but […] The post Varalaxmi Sarathkumar Clarifies about Saraswathi Controversy appeared first on Telugu360 .

తెలుగు 360 7 Mar 2026 12:36 pm

2025 Telangana Gaddar Awards Announced

Telangana FDC Chairman Dil Raju on behalf of the government of Telangana has announced the Telangana Gaddar Awards for the year 2025. Naga Chaitanya bagged the Best Actor award for his performance in Thandel and Rashmika is the Best Actress for The Girlfriend. Raju Weds Rambai has been named as the Best Feature Film and […] The post 2025 Telangana Gaddar Awards Announced appeared first on Telugu360 .

తెలుగు 360 7 Mar 2026 12:32 pm

మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’జాతీయ పురస్కారం

గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డుల ప్రకటన హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్’ అవార్డులను శనివారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పుష్కారంతో సత్కరించనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. మార్చి 19వ తేదీ ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. దివంగత ప్రజాయకుడు […] The post మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పురస్కారం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Mar 2026 12:31 pm

శబరి కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపాలిటీలో పరిధిలోని 8వ వార్డులోని శబరి

ప్రభ న్యూస్ 7 Mar 2026 12:21 pm

టెహ్రాన్ విమానాశ్రయంపై క్షిపణుల వర్షం

మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ మెరుపుదాడి.. దాడిలో పలు విమానాలు దగ్ధం, భారీగా ఎగసిపడిన మంటలుపశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మెరుపు దాడులకు తెగబడింది. నగరంలోని కీలకమైన మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో విమానాశ్రయంలో భారీ ఎత్తున మంటలు చెలరేగి, రన్‌వేపై ఉన్న పలు విమానాలు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో […] The post టెహ్రాన్ విమానాశ్రయంపై క్షిపణుల వర్షం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Mar 2026 12:20 pm

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; మహిళల

ప్రభ న్యూస్ 7 Mar 2026 12:18 pm

భారీగా పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.దీంతో హైదరాబాద్‌లో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.965కి చేరింది. ఉజ్వల్‌ పథకం ద్వారా అందించే సిలిండర్‌ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా..(గృహ వినియోగ సిలిండర్‌..14.2కేజీ)దిల్లీ – రూ.913ముంబయి […] The post భారీగా పెరిగిన వంట గ్యాస్‌ ధరలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Mar 2026 12:13 pm

HYD |వైన్‌షాపు దగ్ధం

HYD | వైన్‌షాపు దగ్ధం HYD |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని

ప్రభ న్యూస్ 7 Mar 2026 12:11 pm

ఎసిలో ఐదు పాములు..... బెడ్‌రూమ్‌లో చూసి షాక్

తిరువనంతపురం: ఎసిలలో ఐదు పాములు కనిపించిన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. చెరువక్కల్ చెందిన మాధవ్ జె పణికర్ శ్రీకార్యం ప్రాంతంలో నివసిస్తున్నాడు. టెక్నో పార్క్ లో మాధవ్ స్టాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.  ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఎసిలో ఎదో కదలుతున్నట్టు అనుమానం కలిగింది. వెంటనే దగ్గరికి వెళ్లి చూడగా శబ్ధాలు వినిపించడంలో రంద్రంలో పరీక్షించి చూడగా పాముగా గుర్తించాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు ఎసి మెకానిక్‌ను పిలిపించాడు. టెక్నీషియన్ సాయంతో ఎసి ఓపెన్ చేసి చూడగా ఐదు పాములు కనిపించాయి. నాలుగు పాములను స్నేక్ క్యాచర్స్ బయటకు తీయగా ఒక పాము ఎసి పైపు ద్వారా బయటకు వెళ్లిపోయింది. ఆ ఇంటికి చెట్టు ఆనుకొని ఉండడంతో పాములు వచ్చాయని స్నేక్ క్యాచర్స్ తెలిపారు. చెట్టు నుంచి ఎసి పైపు లోపలికి వచ్చాయని వివరించారు. విషపూరిత సర్పాలు కావని చెప్పడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.  

మన తెలంగాణ 7 Mar 2026 12:11 pm

Dhurandhar 2 Trailer: Epic Revenge Drama

The wait is finally over. The makers of Ranveer Singh’s Dhurandhar: The Revenge have unveiled the film’s trailer just a while ago. The trailer offers a glimpse into the sequel’s story. While the first part followed undercover agent Hamza Ali Mazari infiltrating Karachi’s underworld by earning gangster Rehman Dacait’s trust, the second part explores the […] The post Dhurandhar 2 Trailer: Epic Revenge Drama appeared first on Telugu360 .

తెలుగు 360 7 Mar 2026 12:11 pm

దమ్మపేట పీహెచ్‌సీలో ఎమ్మెల్యే జారే ఆకస్మిక తనిఖీ

దమ్మపేట, ఆంధ్రప్రభ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట నియోజక వర్గం

ప్రభ న్యూస్ 7 Mar 2026 12:05 pm

రెండో అంతస్తు నుంచి జారిపడి బేల్దారి మృతి..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రెండో అంతస్తు నుంచి కిందికి జారిపడి బేల్దారి

ప్రభ న్యూస్ 7 Mar 2026 12:02 pm

2025 year |గద్దర్ అవార్డుల ప్రకటన

2025 year | గద్దర్ అవార్డుల ప్రకటన 2025 year |ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:57 am

చంద్రబాబువి తప్పుడు లెక్కలు

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలపై పేర్ని నాని విమర్శలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గణాంకాలు, బడ్జెట్ వివరాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభ సాక్షిగా అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు. గతేడాది సుమారు రూ. 1.03 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ. 97 వేల కోట్లు తీసుకుంటామని బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ, కార్పొరేషన్ల ద్వారా పొందుతున్న రుణాలను మాత్రం […] The post చంద్రబాబువి తప్పుడు లెక్కలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Mar 2026 11:53 am

మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:45 am

Sampradayini Suppini Suddapoosani: A Big Disappointment

Actor Sivaji made a huge comeback with Court, a courtroom drama produced by Nani. Sivaji bagged back-to-back offers and he also produced an interesting small film titled Sampradayini Suppini Suddapoosani. ETV Win backed the film and Sampradayini Suppini Suddapoosani was made for the digital space. But Sivaji admitted that he showed the film to celebrities […] The post Sampradayini Suppini Suddapoosani: A Big Disappointment appeared first on Telugu360 .

తెలుగు 360 7 Mar 2026 11:45 am

నివాళులర్పించిన ఎమ్మెల్యే సింహాద్రి..

కోడూరు, ఆంధ్రప్రభ ; కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన మాజీ మున్సబ్

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:42 am

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 07(జనంసాక్షి ):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణను ఉమ్మడి జిల్లాలో …

జనం సాక్షి 7 Mar 2026 11:41 am

Netflix’s Biggest Hub to open in Hyderabad

Digital giant Netflix has announced that they would be operating from Hyderabad very soon. A hub with high-value post-production, VFX, and virtual production capabilities will open in Hyderabad on March 12. Telangana Chief Minister A. Revanth Reddy along with Minister D. Sridhar Babu will inaugurate the hub on March 12th. This is the second office […] The post Netflix’s Biggest Hub to open in Hyderabad appeared first on Telugu360 .

తెలుగు 360 7 Mar 2026 11:39 am

పూర్వ వైభవం తీసుకువస్తాం..

పూర్వ వైభవం తీసుకువస్తాం.. ఆధునిక ఫంక్షన్ హాలుగా మచిలీపట్నం టౌన్ మచిలీపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:38 am

అమీనాబాద్ లో ఇందిరమ్మ నూతన గృహం ప్రారంభం

కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్… చెన్నారావుపేట, మార్చి 7( జనం సాక్షి): ఇందిరమ్మ పథకంలో నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్ …

జనం సాక్షి 7 Mar 2026 11:34 am

వర్ని మండలంలో పిచ్చికుక్క దాడి

వర్ని మండలంలో పిచ్చికుక్క దాడి వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలో

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:33 am

ఆత్మ వరంగల్ జిల్లా డైరెక్టర్ గా గుర్రం అచ్చయ్య

చెన్నారావుపేట, మార్చి 6 ( జనం సాక్షి): ఆత్మ జిల్లా డైరెక్టర్ గా గురిజాల గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గుర్రం అచ్చయ్య నియమితులయ్యారు. శుక్రవారం …

జనం సాక్షి 7 Mar 2026 11:27 am

ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవోగా ఆత్రం భాస్కర్

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ లో ఖాళీగా ఉన్న

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:27 am

టీఆర్పీలను ఆపండి.. బార్క్‌కు కేంద్రం ఆదేశం

న్యూదిల్లీ: పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రసారమవుతున్న వార్తలపై కేంద్రం స్పందించింది. టీవీ వార్తా ఛానళ్లకు టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్లు(TRP) తెలియజేసే ప్రక్రియను తక్షణం నిలిపివేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌(BARK)ను శుక్రవారం ఆదేశించింది. నాలుగు వారాలు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే దాకా టీఆర్పీలను నిలిపి ఉంచాలని స్పష్టంచేసింది. టీఆర్పీల కోసం కొన్ని వార్తా ఛానళ్లు ప్రస్తుతం పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధానికి సంబంధించి అత్యుత్సాహంతో ఊహాజనిత, సంచలన కథనాలు వెలువరిస్తుండటంతో […] The post టీఆర్పీలను ఆపండి.. బార్క్‌కు కేంద్రం ఆదేశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Mar 2026 11:25 am

రోగులకు మెరుగైన సేవలు అందించాలి..

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రం లో గల ప్రాథమిక ఆరోగ్య

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:24 am

బిజెపి చేతికి బీహార్ సారథ్యం!

బీహార్ రాజకీయాల్లో అత్యంత వెనుకబడిన కులాలు పునాదిగా నితీశ్ కుమార్ ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన నితీశ్‌కుమార్ తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయ ప్రవేశం చేయిస్తున్నారు. అయితే బిజెపి నాయకత్వంలోని జెడి(యు)లో చీలికలు వస్తాయా అన్న అనుమానం కలుగుతుంది. బిజెపి తన అధికారంలోనున్న రాష్ట్రాల్లో స్థానిక ప్రాంతీయ పార్టీలను చీల్చడం, బలహీనపరచడం తెలిసిందే. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిందీ భాషా రాష్ట్రాల్లో బిజెపికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2019 ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని 225 సీట్లలో 203 గెలుచుకుంది. కాని 2024 లో 55 సీట్లు కోల్పోయింది. ఫలితంగా బిజెపి లోక్‌సభలో 240 సీట్లతో మైనారిటీలో పడింది. కాని టిడిపి, జెడి(యు) ప్రధాన మద్దతుదారులుగా శివసేన, ఎన్‌పి మరికొన్ని చిన్న పార్టీల అండదండలతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఈ నేపథ్యంలో తూర్పు కారిడార్‌కు (యుపి, బీహార్, జార్ఖండ్ బెల్ట్) విస్తరించడానికి పటిష్టం కావడానికి బీహార్‌నే తన పాలనా కేంద్రంగా మార్చడానికి బిజెపి ఇప్పుడు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ బీహార్ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్లడం వల్ల బీహార్ కుల రాజకీయాల్లో మార్పు కనిపించవచ్చు. దీన్ని నివారించే ఉద్దేశంతో నితీశ్ వెనుకనున్న ఇబిసి, ఒబిసిలను తన వైపు రాబట్టుకోవడానికి బిజెపి వ్యూహాలు రూపొందిస్తోంది. నితీశ్ నిష్క్రమణతో బీహార్‌లో ఒక విధమైన రాజకీయాల శకం ముగిసింది. ఇక బిజెపి ఆధిపత్య రాజకీయ శకం ఆరంభం అవుతుంది. నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) నేతగానే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పరిపాలించారు. గత కొన్ని దశాబ్దాలుగా సోషలిస్టుగా ముద్రపడిన రాజకీయాలకు ఇప్పుడు ముగింపు పలకడమే అవుతుంది. అంతేకాక కాషాయ రాజకీయాలు పూర్తి ఆధిపత్యంతో రాష్ట్రంలో ప్రవేశించడానికి సంకేతం పలుకుతుంది. ఎర్ర సమూహం నీడల నుంచి తను ఆవిర్భవించినప్పటికీ ఇప్పుడు ఆ నీడలు నీరసించిపోయాయి. 1970లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమంలో నితీశ్ ప్రముఖ నేతగా పుట్టకొచ్చారు. దేశ రాజకీయాల్లో పూర్తి విప్లవాత్మక మార్పులు తీసుకు రావడమే ఆ నాడు లక్షంగా నితీశ్ భావించారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని ఫాసిస్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్షంగా పెట్టుకున్నారు. ఇందిరా గాంధీని పదవి నుంచి తొలగించ గలిగినా తాను ఆశించిన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను సాధించలేకపోయారు. అయితే ఈ సమయంలో యూనివర్శిటీ క్యాంపస్ నుంచి కొత్త యువ నేతలు రంగంలోకి దిగారు. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ ఈ గ్రూపు వారే. ఎమర్జెన్సీలో జరిగినఘోరమైన తప్పిదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా జాతీయ స్రవంతిలో ఒక పార్టీని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం జరిగింది.ఆ సమయంలో కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా జనతా పార్టీ ఏర్పాటయింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయ విభాగంగా ఉన్న జనసంఘ్‌కు కొంత సహాయపడింది. రాజకీయ అంటరానితనాన్ని నిర్మూలించింది. 1977 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఒక భాగమైంది. ఈలోగా హిందుత్వ దూకుడు రాజకీయాలతో బిజెపి రాజకీయ శక్తిగా అవతరించింది. అయితే బీహార్‌లో సోషలిస్టువాదులు ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వ జాతీయతను వ్యతిరేకించారు. అయినా సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో 1990లో హిందుత్వ గ్రూపులకే సహాయం అందించారు. అదే తర్వాత బిజెపి నాయకుడు వాజ్‌పేయ్ ప్రధాని కావడానికి దోహదం చేసింది. ఇప్పుడు నితీశ్ కుమార్ తన ముఖ్యమంత్రి స్థానాన్ని ఖాళీ చేసి దేశ జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోడీ అండదండలు అందించడం చెప్పుకోదగిన మార్పు. ఇండియా కూటమి సమయంలో ప్రధాని అభ్యర్థిగా నితీశ్ తెరమీద కనిపించినప్పటికీ కాంగ్రెస్‌తో తలెత్తిన విభేదాల వల్ల ఎన్‌డిఎకే మద్దతు ఇచ్చారు. ఇది మోడీ మూడోసారి ప్రధాని కావడానికి దోహదం చేసింది. ఇక నితీశ్ కుమార్‌డు నిషాంత్‌ను బీహార్‌లో చోటు కల్పించడం ఎంత వరకు జెడి(యు) పార్టీని సమైక్యంగా ఉంచగలుగుతుందో ప్రశ్నార్థకం. కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో నితీశ్ ఏదైనా మంత్రి పదవిని సాధించగలరని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే బీహార్‌లోని కుల రాజకీయాలను ఒక దిశలో నడిపించగలరా అన్న అనుమానం కలుగుతుంది. నిషాంత్ రాజకీయాలకు కొత్త అయినందున రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వాన్ని ఆశించలేదని నితీశ్ వర్గం చెబుతోంది. అయితే నితీశ్ రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నిషాంత్ ఎన్నిక కావచ్చు. మరి జెడి(యు)లో సీనియర్లు ఉండగా నిషాంత్‌కు పగ్గాలు అప్పగిస్తారా లేక కొన్నాళ్లు నిరీక్షించి ఆచితూచి వ్యవహరిస్తారా అన్నది ఇప్పుడు తేలాలి. బీహార్‌లో చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జిపి ఆర్‌విపి తదితరులతో కూడిన వర్గం ఇప్పుడు నిషాంత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంలోకి ఆధిపత్యం వహించేలా ప్రయత్నాలు జరిగితే జెడి(యు)లో చీలికలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. అయితే కేంద్రంలోని బిజెపి మాత్రం బీహార్ కుల రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలన్న లక్షంతో ఇప్పుడు ఈ వ్యూహాలు రూపొందిస్తోంది. అయితే రాజ్యసభకు తాను వెళ్లినా రాష్ట్రంలో తన మద్దతుదారులకు ఎటువంటి నష్టం ఉండదని నితీశ్ కుమార్ హామీ ఇస్తున్నారు. 

మన తెలంగాణ 7 Mar 2026 11:23 am

9mm Pistol |కార్డన్ సెర్చ్ లో కలకలం

9mm Pistol | కార్డన్ సెర్చ్ లో కలకలం ట్రిగ్గర్ లాక్ తో

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:19 am

అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక

అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక నిజామాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:19 am

4hours |నేడు భారీ సంఖ్యలో లొంగుబాటు

4hours | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:13 am

డేరా బాబాకు హైకోర్టులో ఊరట

డేరా బాబాకు హైకోర్టులో ఊరట లభించింది

తెలుగు పోస్ట్ 7 Mar 2026 11:10 am

ఇద్దరు అభ్యర్థుల ప్రతిభ..

ఇద్దరు అభ్యర్థుల ప్రతిభ.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కేంద్ర పబ్లిక్ సర్వీస్

ప్రభ న్యూస్ 7 Mar 2026 11:10 am

సామ్రాజ్యవాదపు బరితెగింపు

ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. అంతా కళ్లముందే ఉంది. ఇరాన్‌పై దాడుల గురించి అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నెన్ని అబద్ధాలు చెప్పినా, అందుకు ఏకైక కారణం ఆ రెండు దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాలని ప్రపంచానికంతా బోధపడుతూనే ఉంది. క్రమంగా బలహీనపడుతున్న అమెరికాకు కావలసింది తిరిగి ఏదో విధంగా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం. ఇజ్రాయెల్ లక్షం గ్రేటర్ ఇజ్రాయెల్‌ను సృష్టించటం. ఈరెండింటికి పశ్చిమాసియా ప్రాంతానికి సంబంధించినంత వరకు కొరకరాని కొయ్యగా మిగిలింది ఇరాన్ ఒక్కటే. కనుక రకరకాల పచ్చి అబద్ధాలు చెప్తూ ఇరాన్‌పై ఉమ్మడిగా యుద్ధం మొదలుపెట్టారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా తాము చెప్తున్నవి ప్రతి ఒక్కటీ అబద్ధాలని తమ యూరోపియన్ మిత్రులతో సహా అందరికీ తెలిసిపోయినా వెనుకడుగు వేయటం లేదు. ఇటువంటి పచ్చి సామ్రాజ్యవాదం ఇంకా కొనసాగుతుండటం ప్రపంచానికి అనేక కష్టనష్టాలను కొనితెస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదం ఇచ్చి, అందుకోసం సవ్యమైన మార్గాన్ని ఈ 14 నెలల కాలంలో ఎన్నడూ అనుసరించలేదు. విచక్షణా రహితమైన సుంకాలతో, అమెరికన్ కంపెనీలు ఇతర దేశాల నుంచి తిరిగి రావాలనే బెదిరింపులతో, ఇతరులు తమ వద్ద భారీ పెట్టుబడులు పెట్టాలనే వత్తిడులతో, అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులను వెళ్లగొట్టటంతో తమ ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వాణిజ్య లోటు వంటివన్నీ మటుమాయం కాగలవనుకున్నారు. కాని అధికారానికి వచ్చి 14 నెలలు గడిచినా వీటిలో ఒక్కటైనా పరిష్కారం దిశగా కదలకపోగా కొత్త సమస్యలు రావటం మొదలైంది. అన్నీ తన అసమర్థతకు రుజువులుగా నిలుస్తున్నాయి. అటువంటి స్థితిలో సమీక్షలు జరిపి సవరణలు చేసుకునే బదులు, తమ సైనికబలమే తరుణోపాయ మనుకున్నారు. ఈ వక్రమైన ఆలోచనకు కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ యుద్ధం. అమెరికా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు వేర్వేరు దేశాలలోని చమురు, అరుదైన ఖనిజాలు, లోహాలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని, ఇతర దేశాలను బ్లాక్ మెయిల్ చేసి తమకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలను వారిపై రుద్దాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల వెనిజులాపై, అక్కడ నుంచి మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనే అబద్ధాలు చెప్తూ గత జనవరిలో దాడిచేసారు. మాదకద్రవ్యాల ఆరోపణ నిజం కాదని సాక్షాత్తూ అమెరికన్ ప్రభుత్వ నివేదికలలోనే వెల్లడైంది. వెనిజులా చమురు నిక్షేపాలనంతా తమ అధీనంలోకి తెచ్చుకున్న వెనుక ఇపుడు ఇరాన్ చమురుపై కన్నువేసారు. ఇతరత్రా మాటలు ఎన్నెన్ని చెప్పినా అసలు లక్షం చమురు అన్నది బహిరంగ రహస్యం. ఇరాన్ అణ్వస్త్ర తయారీకి ‘కొద్ది రోజుల’ దూరంలోనే ఉందని, అందువల్లనే ఆ ప్రమాదాన్ని నివారించేందుకు దాడి చేసామన్న అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటనలు హాస్యాస్పదమైన అబద్ధాలని వారికి కూడా తెలుసు. ఎందుకంటే ఇరాన్ అణు పరిశోధన కేంద్రాలపై నిరుడు జూన్‌లో దాడుల వల్ల అవి ‘పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి’నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఆ శిధిలాలు నేటికీ అదేవిధంగా ఉన్న స్థితిలో అణ్వస్త్రాల తయారీ కొద్ది రోజులలో జరగనుందనటం ఎవరూ నమ్మని బుకాయింపు మాత్రమే. పైగా, అస్త్రాల తయారీకి యురేనియం శుద్ధి 90 శాతం వరకు అవసరం కాగా, అది 60 శాతానికి ఎప్పుడూ మించలేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్థతోపాటు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలు చెప్తున్నాయి. మరొక వైపు అణుశుద్ధి విషయమై అమెరికా, యూరప్ లతో ఇరాన్ గతంలో చర్చలు జరపటమే గాక, ప్రస్తుత దాడులకు ముందు కూడా జరుపుతున్నది. చర్చలు సంతృప్తికరంగా పురోగమిస్తుండినట్లు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమాన్ సైతం ప్రకటించింది. కనుక ట్రంప్, నెతన్యాహూల వాదనలు అన్నింటికి అన్నీ వంద శాతం అబద్ధాలు మాత్రమే. పశ్చిమాసియాలోని భారీ చమురు నిల్వలు మొదటి నుంచి పాశ్చాత్య దేశాల యాజమాన్యంలో ఉండగా, ఇరాన్ నిల్వలపై వివాదం 1951 నుంచి మొదలైంది. అపుడు ప్రధానిగా ఎన్నికైన మొసాదెగ్ ఆ నిల్వలన్నింటిని జాతీయం చేయగా అందుకు ఆగ్రహించిన బ్రిటన్, అమెరికాలు తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను రంగంలోకి దింపి ఆయన ప్రభుత్వాన్ని కూలదోసాయి. ఈ కథకు కొనసాగింపే ఇపుడు అమెరికా ఆ నిల్వలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు. అమెరికా గతంలో ఇరాక్, లిబియా వంటి దేశాలలో చేసింది కూడా ఇదే. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి, రాజువంశపు వారసుడు రెజా పహ్లవీని విదేశాలనుంచి రప్పించి అధికారానికి తెచ్చి, చమురును కాజేయటం ట్రంప్ పన్నాగం. ఇది తమ స్వప్రయోజనంగా కాగా, మొత్తం పశ్చిమాసియాలో తమ ప్రయోజనాల పరిరక్షణను ఇజ్రాయెల్ చూస్తున్నదని ట్రంప్ స్వయంగా కొద్ది నెలల క్రితం తమ అధికారిక ప్యూహ పత్రంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇజ్రాయెల్ ప్రయోజనాల పరిరక్షణ కూడా జరగాలి. ఇజ్రాయెల్ ప్రయోజనాలు రెండు. ఒకటి, స్వతంత్ర దేశంగా పాలస్తీనా ఎట్టి పరిస్థితులలో ఏర్పడకపోవటం. అందుకు కొనసాగింపుగా గాజా, వెస్ట్ బ్యాంక్‌లను ఆక్రమించి గ్రేటర్ ఇజ్రాయెల్‌ను సృష్టించటం. రెండు, అమెరికా తోపాటు తమ ప్రణాళికలన్నింటికి ఏకైక ఆటంకంగా మిగిలిన ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయటమే గాక ఒక దేశంగా విచ్ఛిన్నం చేయటం. ఈ మాటలను నెతన్యాహూ, ఆయన ముఖ్య సహచరులు ఎటువంటి దాపరికం లేకుండానే పదేపదే చెప్తున్నారు. అందువల్ల, ఇరాన్ అణ్వస్త్రం వగైరా మాటలన్నీ రుజువు చేయనక్కరలేని అబద్ధాలు, ఇందులో తాజా వార్త ఒకటున్నది. వెనిజులాలో మదురో వారసురాలిని ఎంపిక చేసినట్లే, ఇరాన్‌లో ఖమేనీ వారసుడిని కూడా తానే ఎంపిక చేస్తానన్న ది ట్రంప్ వాంఛ! నాటకంలో ఉపనాటకంవలే ఒక వింత ఏమంటే, ఇరాన్‌పై దాడులకు కొన్ని లక్షాలు ప్రకటించిన ట్రంప్, వాటి గురించి తనకు స్పష్టత లేదని ఇపుడు స్వయంగా ఒప్పుకుంటున్నారు. యుద్ధం మొదట భావించినట్లు రెండు రోజులలో ముగియటం, ఇరాన్ అధినేత ఖమేనేయే హత్యతో ప్రభుత్వం కుప్పకూలటం, ట్రంప్ బహిరంగ పిలుపు ప్రకారం ప్రజలు తిరగబడి అధికారాన్ని వశపరచుకోవటం వంటివేమీ జరగకపోగా, ఇరాన్ సైన్యం ముందే హెచ్చరించినట్లు భీకరమైన ఎదురు దాడులు సాగిస్తుండటంతో, ట్రంప్‌ను అమెరికన్ కాంగ్రెస్ సభ్యులే సవాలు చేస్తున్నారు. మరొక వైపు కొన్ని యూరోపియన్ దేశాలు సహకరించకపోగా ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ ఎదురు దాడులలో స్వయంగా పశ్చిమాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలు, నిఘా కేంద్రాలు, రాయబార కార్యాలయాలవంటివి దెబ్బతింటున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు గల గల్ఫ్ దేశాల మాట చెప్పనక్కరలేదు. ఆ వార్తలు రోజువారీగా వెలువడుతున్నవే అయినందున ఇక్కడ ఏకరవు పెట్టటం అనవసరం. గమనించవలసిందేమంటే అమెరికా, ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైన దేశాలు వారాల తరబడి సన్నాహాలు చేసాయి. తాము ఏక కాలంలో సైన్యాన్ని, వైమానిక బలాన్ని, నౌకా బలాన్ని ఇంతటి స్థాయిలో మోహరించటం చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. ఇజ్రామెల్‌ది అదనపు బలం. ఇంత చేసినా ట్రంప్ మొదటి ప్రకటించిన లక్షాలలో ఒక్కటీ నెరవేరలేదు. ఖమేనీని హత్య చేసినా ప్రభుత్వం గాని, వ్యవస్థగాని కూలలేదు. రివల్యూషనరీ గార్డ్ అంతం కాలేదు. ప్రజలు తిరుగుబాటు చేయలేదు. అణు పరిశోధనా కేంద్రాలను కొత్తగా ధ్వంసం చేసేందుకు ఏమీ మిగిలిలేదు. ఇరాన్ లొంగిపోయి అమెరికా షరతులకు అంగీకరిస్తామంటూ పాగిలపడలేదు. చివరకు ఏది ఎట్లా జరిగినా, అసమతుల యుద్ధం (అసిమ్మెట్రిక్ వార్ ఫేర్) అనే వ్యూహాన్ని అనుసరిస్తూ పలు విధాలైన ఎదురుదాడులతో నష్టాలు కలిగిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌లను, వారి గల్ఫ్ మిత్రులను హడలగొడుతున్నది. చర్చలకు సిద్ధమని ఇరాన్ అనకపోయినా, అన్నదని తానే అబద్ధాలు చెప్తూ, ట్రంప్ తన బలహీనతను బయటపెట్టుకుంటున్నారు. యుద్ధం గురించిన ప్రణాళిక ఏదీ తన వద్ద లేనట్లు ఆయన ఒప్పుకోవటం అమెరికాలో దుమారం రేపుతున్నది. అట్లాగే యుద్ధం ఎంత కాలం సాగేదీ చెప్పలేనంటున్నారాయన. అమెరికా సైనిక స్థావరాలకు అవకాశం ఇచ్చిన దోషానికి గల్ఫ్ దేశాలు దెబ్బతింటూ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. తమపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్‌ను విమర్శిస్తున్న ఆ దేశాలు, ఇరాన్‌పై దుర్మార్గపు దాడి జరిపి దేశాధినేత ప్రాణాలు తీసిన అమెరికా, ఇజ్రాయెల్‌లను ఖండించకపోవటం వాటి ద్వంద్వ నీతి ఎత్తి చూపింది. ఈలోగా చమురు రంగంతో సహా ఆర్థిక వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి. ఇదే విధమైన నిందను భారత ప్రభుత్వం కూడా ఎదుర్కొంటుండటం మోదీ ప్రభుత్వపు దౌత్య నీతి వైఫల్యానికి తార్కాణంగా మారింది. వెనిజులాపై దాడి, అధ్యక్షుడు మదురో దంపతుల అపహరణను ఖండించక మౌనం వహించిన తర్వాత, ఇరాన్ దాడిని ఖండించకపోవటమే గాక దాడి చేసిన వారికే మద్దతు పలకటం మోడీ ప్రభుత్వంపు దౌత్య నీతి చరిత్రకు పెద్ద మచ్చగా మిగిలిపోనున్నది.  - టంకశాల అశోక్ (దూరదృష్టి) -రచయిత సీనియర్ సంపాదకులు 

మన తెలంగాణ 7 Mar 2026 11:10 am

‘హయ్య ఏ1్ణ వీసాదారులకు.. భారత్‌ ఎంబసీ అడ్వైజరీ

ఖతార్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వివరాలు ఈ వెబ్ సైట్ ద్వారా తెలియచేయాలి న్యూదిల్లీ: ఖతార్‌ లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ‘హయ్య ఏ1 వీసాదారులు, తాత్కాలిక వీసా కలిగిన భారత పౌరులు వెంటనే తాము షేర్ చేసిన లింక్‌లో వివరాలు నింపాలని ఎంబసీ సూచించింది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ ఘర్షణల వేళ.. పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశంలో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోయారో […] The post ‘హయ్య ఏ1్ణ వీసాదారులకు.. భారత్‌ ఎంబసీ అడ్వైజరీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Mar 2026 11:01 am

సివిల్స్ కు ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు శుభాకాంక్షలు: పొన్నం

హైదరాబాద్: భారత సివిల్ సర్వీసుల 2025 తుది ఫలితాలు వెలువడిన సందర్భంగా విజయం సాధించిన తెలంగాణ అభ్యర్థులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణతో చేసిన కృషి, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగిన మీ ప్రయాణం ఈ గొప్ప విజయానికి కారణమైందన్నారు.  ప్రజా ప్రభుత్వం సింగరేణి సంస్థతో కలిసి అమలు చేస్తున్న ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ పథకం ద్వారా ప్రోత్సాహం పొందిన తెలంగాణకు చెందిన 20 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసుల తుది జాబితాలో స్థానం సంపాదించడం ప్రత్యేకంగా అభినందనీయమని, ఇది ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని పొన్నం తెలియజేశారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత కూడా ఉన్నత లక్ష్యాలు సాధించేలా విద్య, మార్గదర్శకత్వం, అవకాశాలు కల్పించడమే మన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా మరింత మంది యువత సివిల్ సర్వీసుల వంటి ఉన్నత సేవల వైపు ముందుకు రావాలని ఆశిస్తున్నానని చెప్పారు.  ఈసారి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులు ప్రజాసేవను ధ్యేయంగా చేసుకుని దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ అభివృద్ధి, పునర్ నిర్మాణానికి కూడా తమ సహకారం అందించాలని కోరుకుంటున్నానన్నారు. 

మన తెలంగాణ 7 Mar 2026 11:01 am

Earthquakes |రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు

Earthquakes | రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు Earthquakes | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 7 Mar 2026 10:58 am

Telangana : నేడు రేవంత్ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోనున్నారు

తెలుగు పోస్ట్ 7 Mar 2026 10:58 am

ప్రమాదపుటంచున ప్రజారోగ్యం

ఆహార భద్రత ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రాథమిక బాధ్యతల్లో ఒకటి. ప్రజలు తాగే పాలు, తినే తిండి భద్రంగా ఉన్నాయా అనే విషయంలో నమ్మకం లేకపోతే, పాలనపట్ల తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. భారతదేశంలో తరచుగా వెలుగులోకి వస్తున్న పాలకల్తీ ఘటనలు, అలాగే నిద్రపోతున్న నియంత్రణ వ్యవస్థ, అమలు కాని ఆహార భద్రత చట్టాలు, ఆహార భద్రతను నిర్ధారించాల్సిన వ్యవస్థ ఇంకా సరైన స్థాయిలో పనిచేయడం లేదని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకే వ్యాపారి సరఫరా చేసిన కల్తీ పాలు తాగినందున వందకుపైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. తొమ్మిది మంది తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయారు. చిన్నపిల్లలు సహా పలువురు ఇంకా పదుల సంఖ్యలో వెంటిలేటర్‌పై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన తర్వాత కూడా కల్తీ పదార్థాన్ని గుర్తించడానికి రాష్ట్రం వెలుపల ఉన్న ప్రయోగశాలల నివేదికలు రావాల్సి వచ్చింది. స్థానిక స్థాయిలో తక్షణంగా పరీక్షించే సామర్థ్యం లేకపోవడంవల్ల, ప్రమాదాన్ని ముందుగానే అరికట్టాల్సిన వ్యవస్థ ప్రాణనష్టాల తర్వాత మాత్రమే స్పందించింది. ఇలాంటి సమయంలో ఆహార భద్రత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై దృష్టి సారించింది. పోషణ -శిక్ష సురక్ష ప్యాకేజ్‌ద్వారా రాష్ట్రంలో మొత్తం ఫెర్టిలిటీ రేటును 1.5 నుంచి 2.1కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడో బిడ్డకు ప్రోత్సాహకరంగా ప్రసవ సమయంలో రూ. 25,000, ఐదేళ్లపాటు ప్రతి నెల రూ. 1,000 ఆర్థిక సహాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య ఇవ్వాలని ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ, జననాల రేటు తగ్గిపోతే జపాన్, ఇటలీ, దక్షిణకొరియా వంటి దేశాల్లో ఎదురైన జనాభా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక జనాభా ప్రణాళిక అవసరమే అయినప్పటికీ, పాలకల్తీ వంటి తక్షణ ప్రజాఆరోగ్య సమస్యలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని విమర్శకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా పాలనాణ్యతపై ఆందోళన కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ నిర్వహించిన సర్వేలు, పెద్ద సంఖ్యలో పాల నమూనాలు నాణ్యత ప్రమాణాలను తీరకపోవడం చూపిస్తున్నాయి. పాలలో నీరు కలపడం అత్యంత సాధారణమైన కల్తీ విధానం. దీనివల్ల పాలపోషక విలువ తగ్గిపోవడమే కాకుండా, కలుషిత నీరు వాడితే పురుగుమందులు, భారీ లోహాలు వంటి హానికర పదార్థాలు కూడా చేరే ప్రమాదం ఉంది. కొన్ని నమూనాల్లో డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్, గ్లూకోజ్, ఫార్మలిన్ వంటి పదార్థాలు కూడా కనిపించాయి. ఇవి పాల మందాన్ని పెంచడానికి లేదా నిల్వకాలాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే ఇవి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. వైద్య పరిశోధనలు చూపుతున్నట్లుగా, ఇటువంటి కల్తీ పదార్థాలు జీర్ణాశయ సమస్యలు, ఆహార విషబాధ, అవయవాల నష్టం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మునుపటి సర్వేలు పరీక్షించిన నమూనాల్లో దాదాపు 70 శాతం నాణ్యత ప్రమాణాలను తీరలేదని సూచించాయి. అయితే అన్ని నమూనాలు ప్రమాదకరంగా ఉండేవి కావు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నిర్వహించిన సమగ్ర జాతీయ సర్వేలో దేశవ్యాప్తంగా 6,432 నమూనాలను పరీక్షించారు. వాటిలో కొద్దిపాటి నమూనాల్లో మాత్రమే హైడ్రోజన్ పెరాక్సైడ్, డిటర్జెంట్లు, యూరియా వంటి ప్రమాదకర కల్తీలు కనిపించాయి. కానీ దాదాపు 41 శాతం నమూనాలు కొవ్వు, సాలిడ్ నాట్ ఫ్యాట్ వంటి ముఖ్య నాణ్యత ప్రమాణాలను తీరలేదని వెల్లడైంది. ఈ సర్వేలో 5.7 శాతం నమూనాల్లో అఫ్లాటాక్సిన్ ఎం1 అవశేషాలు కనిపించాయి. ఇది పశువులకు ఇచ్చే ఆహారంలో కలుషితం కారణంగా పాలలో చేరుతాయి. ఇది డెయిరీ వ్యవసాయం, సరఫరా నిర్వహణలో ఉన్న సమస్యలను సూచిస్తుంది. ఈ వివరాలు పాల భద్రత, పాల నాణ్యత మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను చూపిస్తున్నాయి. భద్రత నాణ్యతను నిర్ధారించడం కేవలం నియంత్రణ సమస్య కాదు, అది కీలకమైన ప్రజాఆరోగ్య బాధ్యత. ప్రభుత్వాలు ఆహార పరీక్షా ప్రయోగశాలలను బలోపేతం చేయాలి, తగిన సంఖ్యలో నిపుణులను నియమించాలి, డెయిరీ సరఫరా వ్యవస్థపై కఠిన పర్యవేక్షణ అమలు చేయాలి.ఈ చర్యలు తీసుకోకపోతే, ప్రతి రోజు కోట్లాది వినియోగదారుల మనసులో ఒక ప్రశ్న మిగిలిపోతూనే ఉంటుంది. మనము తాగే పాలు నిజంగా భద్రమేనా? - డా. ఎం. సురేష్ బాబు -9989988912

మన తెలంగాణ 7 Mar 2026 10:56 am

ఆలేరు మున్సిపల్ చైర్మన్ వార్డుల పర్యటన

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 8,12

ప్రభ న్యూస్ 7 Mar 2026 10:55 am

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నవ యువ శివ యూత్ సహాయం

కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన

ప్రభ న్యూస్ 7 Mar 2026 10:52 am

నిత్య చదువరి, నిజమైన జర్నలిస్టు చెన్నమనేని

అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీని ఒక ప్రశ్న అడిగి చెన్నమనేని రాజేశ్వర్ రావు సంచలనం సృష్టించారు. మీరు మరింత నిరంకుశంగా మారుతున్నారా అని ఇందిరాగాంధీనే నేరుగా అడిగిన గుండెబలం గల ఘనాపాటి రిపోర్టర్ ఆయన. హైదరాబాద్‌లో జరిగిన ఆ పత్రికా సమావేశంలో ఈ ప్రశ్న విన్న ఇందిరాగాంధీ ఆ మాట మీరెలా చెప్పగలరని ఎదురు ప్రశ్న వేసి వివరణ కోరారు. కేబినెట్‌లో మంత్రివర్గ శాఖల పునర్వవస్థీకణ చేస్తూ హోం, రెవెన్యూ శాఖలలోని ఇంటెలిజన్స్ విభాగాలని ప్రధానమంత్రి పరిధిలోకి తీసుకోవడం అనేది మరింత నిరంకుశత్వానికి దారితీస్తుందని రాజేశ్వరరావు తన జవాబుగా వివరించారు. దానికి సమాధానం ఇవ్వని ఇందిరాగాంధీ చిరునవ్వు నవ్వి, తెలివిగా తరువాతి ప్రశ్నకు వెళ్ళిపోయారు! తెలుగువారు గర్వించదగ్గ జర్నలిస్టు. వారు అనునిత్య చదువరి. ఇంగ్లీషు, తెలుగులో నిష్ణాతులైన పాత్రికేయులు. ఢిల్లీలో తొలిసారి ఒక తెలుగు పత్రికకు (ఆంధ్ర పత్రికకు) కరస్పాండెంట్‌గా పూర్తిస్థాయిలో పనిచేసిన వ్యక్తి. 1965 నుంచి ఒక 17 ఏళ్లు ‘ఆంధ్ర పత్రిక’ ప్రతినిధిగా సేవలందించి తెలుగు జర్నలిస్టుల గౌరవాన్ని రాజధానిలో ఇనుమడింప చేశారు. అంతకు ముందు ఎంతోమంది తెలుగు ప్రముఖులు ఆంగ్ల పత్రికా సంపాదకులుగా రాణించారు, కానీ తెలుగు పత్రికలకు ప్రతినిధులుగా వార్తలు రాయలేదు. రాజకీయ నాయకుడుగా కూడా రాణించిన వి.బి. రాజు నడిపిన ఇంగ్లీషు దినపత్రిక ‘డైలీ న్యూస్’లో 1963 లో చేరి రెండేళ్ళు పని చేశారు. రాజేశ్వర్ రావు ప్రతిభను గమనించి ’ఆంధ్రపత్రిక’ యజమాని శివలెంక శంభు ప్రసాద్ కొన్ని రోజులపాటు ఇంటర్వ్యూ నిర్వహించి, అటు పిమ్మట చివరి రోజున అప్పాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చి తొలుత హైదరాబాద్‌కి, తర్వాత ఢిల్లీకి తమ పత్రికా ప్రతినిధిగా పంపారు. 1981లో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత విద్యున్మండలి అధికారిగా, ‘ఉదయం’ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అడ్వైజర్‌గా సేవలందించారు. తరువాతి కాలంలో ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల ప్రత్యేక ప్రతినిధిగా కూడా సేవలందించారు. ఆయన సామర్థ్యం, విలువలు గురించి ఆలోచించినప్పుడు ‘ఆంధ్రపత్రిక’ సంబంధించి ఒక సంఘటనా, మరో దినపత్రికకు సంబంధించి ఇంకో సంఘటన గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసిన సందర్భంలో విజయాలతోపాటు తీసుకున్న పొరపాటు నిర్ణయాలను కూడా సమీక్షిస్తూ ‘ఆంధ్ర పత్రిక’లో చెన్నమనేని వ్యాసం రాశారు. ‘ఆంధ్ర పత్రిక’ యజమాని శంభుప్రసాద్, కాసు బ్రహ్మానందరెడ్డి అన్యోన్యమైన మిత్రులు కనుక, మరుసటి రోజు యజమాని నుంచి పిలుపు రాగానే ఉద్యోగం పోయిందని రాజేశ్వరరావు భావించారు. అయితే అనుకోని విధంగా శంభుప్రసాద్ నుంచి అభినందనలు రావడమే కాకుండా, తరువాతి కాలంలో మరింత గౌరవం కల్పిస్తూ తమ ప్రతినిధిగా ఢిల్లీకి పంపారు. ఇది వారి జర్నలిస్టు జీవితంలో తొలి సంవత్సరాలలో జరిగింది కాగా; రెండు దశాబ్దాల తర్వాత జరిగిన మరో సంఘటన కారణంగా తన ఉద్యోగానికే రాజీనామా చేశారు. తాను సన్యాసినంటూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ప్రకటించిన మరుసటి రోజే ఆయన పేరున ఉన్న ఆస్తుల వివరాలన్నీ సేకరించి వాటి ఆధారంగా చెన్నమనేని పెద్ద వ్యాసమే రాశారు. అప్పటి ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందన వచ్చిందో సమాచారం లేదు. కానీ పర్యవసానంగా సదరు పత్రికా యజమాని జగదీష్ ప్రసాద్ పిలిచి విజయవాడకు బదిలీ చేస్తున్నట్టు చెప్పారు. కానీ రాజేశ్వరరావు తన నియామకం హైదరాబాదు రిపోర్టురుగానే, కాబట్టి బదిలీచేసే అధికారం ఆ సంస్థకు లేదని తనే రాజీనామా చేసి అక్కడి నుంచి తప్పుకున్నారు. బాగా గుర్తు నాకు, అది అక్టోబరు నాలుగు 2022! ఎందుకు గుర్తంటే అంతకు ముందు రోజు అడివి బాపిరాజు జర్నలిజం ప్రతిభ గురించి నేను రాసిన వ్యాసం చదివి, ఫోన్ చేసి ఉన్నారు. అయితే ఆయన నెంబరు నా దగ్గర లేదు, ఆయన చేసిన సమయంలో మరొకరితో మాట్లాడుతున్నాను. నేను మరల ప్రయత్నం చెయ్యలేదు, కానీ వారే మరుసటి రోజు రెండవసారి ఫోన్ చేశారు. తెలుగు దినపత్రికలలో డైలీ సీరియల్స్‌ని తొలిసారి ప్రవేశపెట్టిన సంపాదకుడు అడివి బాపిరాజు. 1944లో ‘మీజాన్’ తెలుగు దినపత్రిక హైదరాబాద్ లో ఆయన సంపాదకత్వంలో వెలువడినప్పుడు అందులో డైలీ సీరియల్ ప్రారంభించారు, అంతేకాదు విజయవంతమైన తన ఎన్నో నవలలను అందులో ప్రచురించారు. అంతకుముందు ‘ఆంధ్రపత్రిక’ డైలీలో వారానికోరోజు సీరియల్ నవల ఉండేది. ఈ ధోరణిని స్ఫూర్తిగా తీసుకుని బాపిరాజు దినసరి ధారావాహిక నవలా ప్రచురణను తెలుగు ‘మీజాన్’ పత్రికలో ప్రారంభించారు. అందుకే దినపత్రికలో డైలీ సీరియల్స్‌ను రాసిన తొలి సంపాదకుడు కూడా అడివి బాపిరాజే. తెలంగాణ తెలుగు పత్రికలలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టడమే కాకుండా, అడివి బాపిరాజు వ్యంగ్య రచనల ప్రచురణతో పాటు సినిమా శీర్షికలను పూర్తి స్థాయిలో తెలంగాణ పత్రికల్లో తొలిసారి ప్రవేశపెట్టినవాడు కూడా. ఆయన దగ్గర పనిచేసిన ఉపసంపాదకులు తిరుమల రామచంద్ర, విద్వాన్ విశ్వం, రాంభట్ల కృష్ణమూర్తి, బిసికామరాజు మొదలైన వారు తరువాతి కాలంలో వేర్వేరు పత్రికల సంపాదకులుగా రాణించారు. ఇటువంటి విషయాలను బాపిరాజు జయంతి అక్టోబరు 8 సందర్భంగా 2022న ఓ తెలుగు డైలీ సాహిత్య పేజీ వ్యాసంలో నేను రాసినపుడు, ఫోన్‌లో అభినందించిన వ్యక్తి చెన్నమనేని రాజేశ్వర్‌రావు! అసలు కారణం ఏమిటంటే అడివి బాపిరాజు అసలు సంపాదకుడే కానట్టు ఆ మధ్యకాలంలో తెలుగుపత్రికల చరిత్ర రాసిన మరో సంపాదకుడి వాదనను పూర్వపక్షం చేస్తూ నా వ్యాసం సాగింది. ఆ రోజు టెలిఫోన్‌లో రాజేశ్వరరావు మరొక మాటను కూడా చెప్పారు; తెలుగులో క్యాంపెయిన్ జర్నలిజాన్ని ప్రారంభించిన వారు నార్ల వెంకటేశ్వరరావు అని అంటూ మూడు, నాలుగు ఉదాహరణలను కూడా పేర్కొన్నారు. నాగార్జునసాగర్ మొదలైనప్పుడు దాని కారణంగా ఎంత విస్తీర్ణం అదనంగా సాగుబడి అవుతుంది? ఎంతమంది ఆకలి తీరుతుంది? ఏ స్థాయిలో మన సమాజం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది? అనే విషయాలు చెప్పకుండా నాగార్జునుడు, బుద్ధుడు, బౌద్ధ స్థూపం అంటూ సంపాదకీయాలు రాయటం ఎలా సబబు అని ఆయన దీటైన ప్రశ్నలు సంధించారు. 2023 మార్చి 6వ తేదీన 82 ఏళ్ళ వయస్సులో హైదరాబాదులో చెన్నమనేని రాజేశ్వరరావు కనుమూసినపుడూ, తర్వాత్తర్వాత బాధ కలిగింది-- ఇంతటి నిక్కచ్చితనం, ఇటువంటి నిజాయితీతో కూడిన అధ్యయన శీలమున్న రాజేశ్వరరావు గురించి ఇంకా ముందుగా నేనెందుకు తెలుసుకోలేకపోయానని! 1941 సెప్టెంబర్ 22న జన్మించిన చెన్నమనేని రాజేశ్వర్ రావు నికార్సయిన జర్నలిస్టు. వారి వ్యక్తిత్వాన్ని, పాత్రికేయ నిబద్ధతను తేటతెల్లం చేస్తూ ఒక విలువైన గ్రంథమింకా రావాల్సి ఉంది. - డా. నాగసూరి వేణుగోపాల్  9440732392

మన తెలంగాణ 7 Mar 2026 10:32 am

మా ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ను ఇవ్వండి…

మా ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ను ఇవ్వండి… డాక్టర్ కొరతతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది…ఉన్నత

ప్రభ న్యూస్ 7 Mar 2026 10:27 am

మహిళలకు సువర్ణ అవకాశం..

మహిళలకు సువర్ణ అవకాశం.. ఆరు అంగన్వాడి కార్యకర్త పోస్టులు మరియు 77 అంగన్వాడి

ప్రభ న్యూస్ 7 Mar 2026 10:22 am

వైభవంగా మహా కుంభాభిషేక మహోత్సవం..

వైభవంగా మహా కుంభాభిషేక మహోత్సవం.. దుర్గమ్మ సన్నిధిలో ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు..మహోత్సవాల్లో

ప్రభ న్యూస్ 7 Mar 2026 10:20 am

Gas Bomb |మధ్యతరగతిపై గ్యాస్​ బండ..

Gas Bomb | మధ్యతరగతిపై గ్యాస్​ బండ.. Gas Bomb | అకస్మికంగా

ప్రభ న్యూస్ 7 Mar 2026 10:17 am

Road Accident : రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు

తెలుగు పోస్ట్ 7 Mar 2026 10:14 am

Telangana : రైతులకు తీపి కబురు.. ఖాతాల్లో నగదు పడేది ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 7 Mar 2026 10:04 am

Andhra Pradesh : వాయుసేనలో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. అర్హతలివే

భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు సేనలో నియామకాల కోసం గుంటూరులో ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 7 Mar 2026 9:59 am

Hruthik roshan |సినిమా ఎవరితో…?

Hruthik roshan | సినిమా ఎవరితో…? Hruthik roshan | టాలీవుడ్ పై

ప్రభ న్యూస్ 7 Mar 2026 9:56 am

‘డేవిడ్ రెడ్డి’లో హీరోయిన్‌గా..

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా డేవిడ్ రెడ్డి. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా నటించనుందని అధికారికంగా ప్రకటించారు. మంచు మనోజ్, మరియా ర్యాబోషాప్కా మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయని మూవీ మేకర్స్ చెబుతున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యోధుడి తిరుగుబాటు కథగా రూపొందుతున్న ‘డేవిడ్ రెడ్డి’ చిత్రంలో మంచు మనోజ్ కొత్త అవతార్ లో కనిపించనున్నారు. 

మన తెలంగాణ 7 Mar 2026 9:46 am

పామర్రులో కార్డెన్ అండ్ సెర్చ్..

పామర్రులో కార్డెన్ అండ్ సెర్చ్.. పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు రావిహరిగోపాల్ నగర్

ప్రభ న్యూస్ 7 Mar 2026 9:44 am

ఆసుపత్రులకు హెచ్చరిక చేసిన ప్రభుత్వం..

ఆసుపత్రులకు హెచ్చరిక చేసిన ప్రభుత్వం.. నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు..మంత్రి

ప్రభ న్యూస్ 7 Mar 2026 9:40 am