SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
...

మోత్కూర్ లో రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో అపశృతి

మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో అపశృతి చోటుచేసుకుంది. అగ్నిగుండంలో ఇద్దరు భక్తులు జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పల్లకిలో స్వామివారిని మోస్తూ అగ్నిగుండం దాటుతుండగా భక్తుల తోపులాటలో జారిపడ్డారు. 

మన తెలంగాణ 9 Mar 2026 9:23 am

టీమిండియాకు దేవినేని అభినందనలు..

టీమిండియాకు దేవినేని అభినందనలు.. విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో

ప్రభ న్యూస్ 9 Mar 2026 9:20 am

Weekend Box-office: No Impressive Footfalls

Last weekend witnessed the clash of four films in Telugu cinema: Sree Vishnu’s Mrithyunjay, Sivaji’s Sampradayini Suppini Suddapoosani, Varalaxmi Sarathkumar’s Saraswathi and Mension House Mallesh. None of the films reported decent to good numbers at the box-office over the weekend. Mrithyunjay received appreciation from the critics but the numbers did not witness any big growth […] The post Weekend Box-office: No Impressive Footfalls appeared first on Telugu360 .

తెలుగు 360 9 Mar 2026 9:03 am

వలిగొండలో ప్రేమపెళ్లికి నిరాకరించిన ప్రియుడు.... యువతి ఆత్మహత్య

వలిగొండ: ప్రేమించాడు కానీ పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మొగలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి అనే యువకుడు మాయమాటలతో ఎం తుర్కపల్లికి చెందిన ముంత మమత (25) ను ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ప్రేమాయణం నడిపించాడు. ఇటీవల వివాహం చేసుకుందామని మత్యగిరిని మమత కోరడంతో అతడు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఆదివారం తల్లిదండ్రులు పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లగా సోదరి పొలం పనులకు వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మమత ఉరేసుకొని చనిపోయింది. సోదరి భవాని ఇంటికి వచ్చేసరికి ఫ్యాన్ వేలాడుతూ కనిపించడంతో కన్నీంటిపర్యంతమైంది. సూసైడ్ నోట్‌లో అమ్మనాన్న జాగ్రత్త అని రాసింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మత్స్యగిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 9 Mar 2026 8:51 am

Ys Jagan : చంద్రబాబు పాలనపై జగన్ లేటెస్ట్ ట్వీట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ట్వీట్ చేశారు

తెలుగు పోస్ట్ 9 Mar 2026 8:48 am

ఫ్యాక్ట్ చెక్: ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుండి ఇరాన్ మీదుగా ఎగరలేదు

ఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్ మధ్య ఎయిర్ ఇండియా విమానం ఇరాన్ మీదుగా

తెలుగు పోస్ట్ 9 Mar 2026 8:48 am

నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 9 Mar 2026 8:41 am

ఇది సమిష్టి విజయం..

ఇది సమిష్టి విజయం.. విజయవాడ, ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో

ప్రభ న్యూస్ 9 Mar 2026 8:39 am

Big Day for Vijay’s Jana Nayagan

Tamil actor Vijay’s last film Jana Nayagan was initially planned for Sankranthi 2026 release but it was pushed due to the censor hurdles. The film was referred to the Revising Committee and the film’s release was pushed by months. The Revising Committee will watch the film and they will reveal their decision soon. As the […] The post Big Day for Vijay’s Jana Nayagan appeared first on Telugu360 .

తెలుగు 360 9 Mar 2026 8:35 am

తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని  77,879 మంది భక్తులు దర్శించుకోగా 25,520 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు. 

మన తెలంగాణ 9 Mar 2026 8:34 am

టీమ్ ఇండియాకు గద్దె క్రాంతి అభినందనలు..

టీమ్ ఇండియాకు గద్దె క్రాంతి అభినందనలు.. పటమట, ఆంధ్రప్రభ : టి20 వరల్డ్

ప్రభ న్యూస్ 9 Mar 2026 8:32 am

Tirumala : నేడు తిరుమలకు వెలుతున్నారా.. మీకొక అలెర్ట్

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 9 Mar 2026 8:28 am

కాటమరాయుని మహా రథోత్సవం..

కాటమరాయుని మహా రథోత్సవం.. శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి

ప్రభ న్యూస్ 9 Mar 2026 8:27 am

పశ్చిమ గోదావరిలో బాలుడిని చంపి?.. ఊరు బయటపడేశారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటికొప్పాక గ్రామ శివారులో బాలుడి మృతదేహం కనిపించిడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి శరీరంపై గాయాలు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యలమంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 9 Mar 2026 8:25 am

భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.  అహ్మదాబాద్‌లో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించిందని ప్రశంసించారు. ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు భారత జట్టు సమన్వయంతో, ధైర్యసాహసాలతో ఆడుతూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిందని కొనియాడారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు. టీమ్ ఇండియా సాధించిన విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని మెచ్చుకున్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు టీమ్ సభ్యులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆతిథ్య భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

మన తెలంగాణ 9 Mar 2026 8:14 am

Andhra Pradesh : నేడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిబిఐ విచారణ చేయాలని అంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణజరగనుంది

తెలుగు పోస్ట్ 9 Mar 2026 8:14 am

Chandrababu : నేడు డోన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 9 Mar 2026 8:05 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಇಸ್ರೇಲ್‌ಗೆ ಬೆಂಬಲ ನೀಡಿದ ಮೋದಿಗೆ ಇಸ್ರೇಲಿನ ಜನರು ಧನ್ಯವಾದ ಹೇಳಿದರು ಎಂದು 2024ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಇಸ್ರೇಲ್‌ಗೆ ಬೆಂಬಲ ನೀಡಿದ ಮೋದಿಗೆ ಇಸ್ರೇಲಿನ ಜನರು ಧನ್ಯವಾದ ಹೇಳಿದರು ಎಂದು 2024ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 9 Mar 2026 8:00 am

Rs165821 |బంగారు బాతు

Rs165821 | బంగారు బాతు Rs165821 | బాతు కడుపులో బంగారం Rs165821

ప్రభ న్యూస్ 9 Mar 2026 7:57 am

T20 World Cup Finals :ఒట్టేసి చెబుతున్నా... భారత్ విశ్వ విజేత కావడానికి వీళ్లు కారణం కాక మరెవరు?

టీ20లో ప్రపంచంలో మేటి జట్టు ఏదయ్యా అంటే.. నో డౌట్ ..టీం ఇండియానే.

తెలుగు పోస్ట్ 9 Mar 2026 7:45 am

T20 World Cup Finals : ఈ బ్యాట్ మాదే.. ఈ బంతి మాదే..గెలుపు మాదే

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ చరిత్ర సృష్టించింది.

తెలుగు పోస్ట్ 9 Mar 2026 7:18 am

మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో..

మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో.. చల్లపల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా

ప్రభ న్యూస్ 9 Mar 2026 7:08 am

భారత్ తీన్‌మార్

అదరగొట్టిన సంజు, అభిషేక్, ఇషాన్ బుమ్రా, అక్షర్ హవా, ఫైనల్లో కివీస్ ఓటమి ప్రపంచ ఛాంపియన్ టీమిండియా అహ్మదాబాద్: టి20 క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆతిథ్య భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో మూడో ట్రోఫీ సాధించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో టీమిండియాకు చారిత్రక విజయం సాధించి పెట్టారు. కివీస్‌లో ఓపెనర్ టిమ్ సిఫర్ట్ 26 బంతుల్లోనే 5 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 52 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ సాంట్నర్ (43), మిఛెల్ (17) తప్ప మిగతా వారు ఘోరంగా విఫలం కావడంతో న్యూజిలాండ్‌కు ఘోర పరాజయం తప్పలేదు. భారత బౌలర్లలో జస్‌ప్రిత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ మూడు వికెట్లు తీసి తనవంతు సహకారం అందించాడు. శుభారంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లు కళ్లు చెదిరే శుభారంభం అందించారు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న అభిషేక్ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ప్రారంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. సంజు కూడా తన జోరును కొనసాగించాడు. ఇటు సంజు అటు అభిషేక్‌లు చెలరేగి పోవడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెలరేగి ఆడిన అభిషేక్ 21 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 7.1 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. అతని అండతో సంజు మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇషాన్, సంజులు పోటీ పడి షాట్‌లు కొట్టడంతో స్కోరు సునామీల పరిగెత్తింది. వీరిని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక చెలరేగి బ్యాటింగ్ చేసిన ఇషాన్ 25 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) డకౌటయ్యాడు. చివర్లో శివమ్ దూబె 8 బంతుల్లోనే అజేయంగా 26 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు.

మన తెలంగాణ 9 Mar 2026 6:50 am

విద్యార్థినులకు ఈవీ స్కూటీలు

డిసెంబర్ 9లోపు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తాం పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్‌గా మార్చుతాం ఇవి వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్ ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ వచ్చింది దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది మహిళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి అండగా ఉండటం కోసం హైటెక్ సిటీ పక్కనే రూ.1000 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల స్థలంలో 150 స్టాల్స్‌కు స్థలం కేటాయించాం స్థానిక టాలెంట్‌ను గ్లోబల్ టాలెంట్‌గా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు చర్యలు మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారు మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా... తొలగింపులు వద్దంటున్నారో స్పష్టత ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు మహిళా జర్నలిస్టులకు సన్మానం మనతెలంగాణ/హైదరాబాద్ : ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి అండగా ఉండటం కోసం హైటెక్ సిటీ పక్కనే రూ.1000 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల స్థలంలో 150 ఇందిరా మహిళా స్టాల్స్‌కు స్థలం కేటాయించినట్లు తెలిపారు. స్థానిక టాలెంట్‌ను గ్లోబల్ టాలెంట్‌గా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణను అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని చెప్పారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రజాభవన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులుగా దేశంలో అన్ని పదవులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఎక్కడ అవకాశం ఉన్నా, ఉన్నత పదవుల్లో మహిళలను నియమిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ కలెక్టర్‌గా మహిళ బాధ్యత వహిస్తున్నారని, ఎస్‌ఐబి అధిపతిగా మహిళను పెట్టామని తెలిపారు. వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని అన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్ 9లోపు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని అన్నారు. పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్‌గా మార్చుతామని అన్నారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈవీ వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్ అని పేర్కొన్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని కొనియాడారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఒఆర్‌ఆర్ బయటకు పంపిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్‌లోపు జిల్లాలకు తరలిస్తామని, హైదరాబాద్‌లో 100 శాతం ఈవీ బస్సులను తెస్తున్నామని అన్నారు. డిసెంబర్ 9లోపు డీజిల్ బస్సులు హైదరాబాద్‌లో ఉండవని, హైదరాబాద్‌లో ఎసి ఈవీ బస్సులు తెస్తామని తెలిపారు. మహిళ శ్రమకు గుర్తింపు లేదు మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని సిఎం అన్నారు. దేశంలో మహిళ శ్రమకు గుర్తింపు లేదని విచారం వ్యక్తం చేశారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని, అమెరికాలో కూడా వివక్ష ఉందని.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇక్కడ మాత్రం కష్టపడే వారికి గుర్తింపు ఉండదని చెప్పారు. కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకంగా వ్యవహరించారని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రణాళికలను తయారు చేశామని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా..? హైదరాబాద్‌లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని, మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా... తొలగింపులు వద్దంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. నష్ట పరిహారం ఇచ్చే బఫర్ జోన్‌లోని ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్ అనేది చట్టంలో ఉందని తాను మార్చలేనని చెప్పారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ మీతో ఉండరని, ఓట్ల కోసమే మీ దగ్గరకు వస్తున్నారని ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్ విషయంలో రాద్ధాంతం చేశారని దుయ్యబట్టారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా..?, తొలగింపులు వద్దంటున్నారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. నదుల బఫర్ జోన్లలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. అలాంటి చోట నిర్మాణాలు చేపట్టినా తొలగించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. ఇలాంటి అంశాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఢిల్లీలో యమునా రివర్ ఫ్రెంట్, యూపీలో గంగా నది రివర్ ఫ్రెంట్ చేశారు.. కాని హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రెంట్ మాత్రం వద్దంటున్నారని అన్నారు. పొలిటికల్ క్యాపీటల్ గా ఉన్న ఢిల్లీ వాయు కాలుష్యం వల్ల ఇబ్బందిపడుతోందని, ముంబయి కూడా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతోందని చెప్పారు. చైన్నైలో వరదల సమస్య ఉందని అన్నారు. దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్ అని వ్యాఖ్యానించారు. సౌత్ కొరియా, న్యూయార్క్,టోక్యోతో హైదరాబాద్ పోటీ పడేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈనెల 13వ తేదీన మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని, డిపిఆర్ కూడా ప్రజెంట్ చేస్తామని పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చు గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చు అవుతుందని చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద విజ్ఞాన మందిరానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కాలుష్యంతో హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అవాస్తవాల ఫిర్యాదులకు ఏర్పాట్లు సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులకు ఏర్పాట్లు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాపై ఫిర్యాదు చేయడానికి ఒక అథారిటీ ఉందని, అలాగే సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలపై ఫిర్యాదు కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. జర్నలిస్టు ముసుగులో వ్యాపారం, వ్యవహారం చేసేవాళ్ళపై చర్యలకు ఒక విధానాన్ని తెస్తామని సిఎం అన్నారు. ఫీల్డ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు తేడా లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపైన త్వరలోనే మంచి వార్త చెపుతామని వెల్లడించారు. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్యూచర్ సీటీలో జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేద్దామని చెప్పారు. సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికను నడిపించారని, గొప్ప పోరాటలను పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా యుద్ధాని గెలవవచ్చునని నిరూపించారని వ్యాఖ్యానించారు. ఆయుధాలతో కూడిన యుద్ధం విషాదంతో ముగుస్తుందని అన్నారు. సిద్ధాంతపరమైన యుద్ధం చేస్తే దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చుకోవచ్చునని మహాత్మాగాంధీ నిరూపించారని తెలిపారు. తన ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు,మహిళా జర్నలిస్టులు తన శ్రేయోభిలాషులుగా ఉన్నారని చెప్పారు.

మన తెలంగాణ 9 Mar 2026 6:50 am

సింగరేణిలో కాంగ్రెస్ సిండికేటు

సిఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కనుసన్నల్లో దోపీడీకి భారీ స్కెచ్ సైట్ విజిట్ సర్టిఫికెట్ ముసుగులో కాంట్రాక్టర్ల రింగ్ ప్రభుత్వ సంస్థలను రాజకీయ కమీషన్లకు అడ్డాగా మారుస్తే ఊరుకోం రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలోనూ కమీషన్ల దందా సిండికేట్ భాగోతంపై సమగ్ర విచారణ జరపాలి శ్రీరాంపూర్ టెండర్లలో కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది మా పోరాటం వల్లే ప్రజాధనం ఆదా:  బిఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి ఓవర్ బర్డెన్ (ఒబి) టెండర్లలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీష్‌రావు వెల్లడించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ముసుగులో కాంట్రాక్టర్ల రింగ్ ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రజల ఆస్తిని ఎలా లూటీ చేస్తుందో బిఆర్‌ఎస్ బయటపెట్టిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ అడుగడుగునా నిలదీయడంతోనే శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పి ఒసి 2 టెండర్ ఫైనాన్షియల్ బిడ్ల అసలు బాగోతం బయటపడిందని చెప్పారు. టెక్నికల్ బిడ్ అయిన తర్వాత కూడా ఫైనాన్షియల్ బిడ్‌ను దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏడుసార్లు ఎందుకు వాయిదా వేశారని నిలదీసి సింగరేణి కార్మిక లోకాన్ని బిఆర్‌ఎస్ పార్టీ చైతన్యపరిచిందని తెలిపారు. నిరంతర ఒత్తిడికి తలొగ్గి, ఎట్టకేలకు సిండికేట్ ప్రమేయం లేకుండా పారదర్శకంగా బిడ్లు తెరిచేసరికి.. ఈ టెండర్ ఏకంగా మైనస్ 12 శాతం (-12 శాతం)కు క్లోజ్ అయిందని పేర్కొన్నారు. కొత్త నిబంధనలు తెచ్చాక సింగరేణిలో నమోదైన తొలి నెగెటివ్ బిడ్ ఇదే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి సిండికేట్‌ను బద్దలు కొడితే అసలైన పోటీ ఎలా ఉంటుందో, ధరలు ఎలా దిగి వస్తాయో ఈ ఒక్క టెండర్ నిరూపించిందని వ్యాఖ్యానించారు. గతంలో సింగరేణిలో ఒబి టెండర్లు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జరిగేవని గుర్తుచేశారు. అప్పట్లో -7 శాతం నుంచి -20 శాతం తక్కువకే పనులు పూర్తయి, సంస్థకు వందలాది కోట్లు ఆదా అయ్యేవని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో ఈ దోపిడీకి స్కెచ్ గీశారని ఆరోపించారు. ఆన్‌లైన్ టెండర్ల పారదర్శకతను దెబ్బతీయడానికే కావాలని ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన తెచ్చార తెలిపారు. ఎవరెవరు టెండర్ వేస్తున్నారో అధికార పార్టీ నేతలకు ముందుగానే తెలిసుకునేందుకే టెండర్ వేయకముందే అధికారుల దగ్గర ఈ సర్టిఫికెట్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం వెనుక ఉన్న కుట్ర అని పేర్కొన్నారు. వాళ్లను బెదిరించి, పోటీ లేకుండా చేసి, తమకు కావాల్సిన వారికే టెండర్లు దక్కేలా సిండికేట్ ఏర్పాటు చేయడానికి ఇది బ్రహ్మాస్త్రంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ సిండికేట్ పుణ్యమా అని తక్కువకు పోవాల్సిన టెండర్లన్నీ +7 శాతం నుంచి +10 శాతం ఎక్కువకు ఖరారవుతూ సింగరేణి ఖజానాకు భారీ గండి కొట్టాయని మండిపడ్డారు. ఈ -12 శాతం బిడ్ చూశాక.. గతంలో +10 శాతం అదనంగా కోట్ చేస్తూ దక్కించుకున్న టెండర్లలో కమిషన్ల కోసం ఎంత దారుణమైన కుమ్మక్కు జరిగిందో స్పష్టమవుతున్నదని అన్నారు. ఈ సిండికేట్ దందా కేవలం టెండర్లకే పరిమితం కాలేదని, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను, సామాన్యుడి జేబును కూడా గుల్ల చేస్తోందని పేర్కొన్నారు. ఈ కమీషన్ల కక్కుర్తి వల్ల ఒబి పనుల్లో తీవ్ర జాప్యం జరిగి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పడిపోయిందని హరీష్‌రావు తెలిపారు. బొగ్గు లేక జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి తగ్గించి, అనివార్యంగా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి తగ్గి సింగరేణికి ఆదాయం గండి.. ఎక్కువ రేటుకు కరెంటు కొని జెన్‌కో నష్టం.. అంతిమంగా ఈ భారం అంతా విద్యుత్ చార్జీల రూపంలో సామాన్య ప్రజల నెత్తిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బొగ్గు ఉత్పత్తి తగ్గి, సంస్థ లాభాలు పడిపోతుండటంతో.. బొగ్గు గని కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తూ ప్రతి ఏటా ఎంతో ఆశగా ఎదురుచూసే దసరా బోనస్ లాభాల వాటా శాతానికి కోత పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల వాటాల కోసం, ముఖ్యమంత్రి బంధువుల కమిషన్ల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ సంపదను కాపాడే విధంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి టెండర్లలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. అవినీతికి ఆస్కారం ఇస్తున్న సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన కాంట్రాక్టర్ల సిండికేట్ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థను రాజకీయ కమీషన్లకు అడ్డాగా మారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శ్రీరాంపూర్ టెండర్లలో వచ్చిన -12 శాతం బిడ్ కాంగ్రెస్ అసలు రంగును బయటపెట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సిండికేట్ బద్దలైతే ప్రజాధనం ఎలా ఆదా అవుతుందో ఈ పరిణామంతో రుజువైందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల విజయం...బిఆర్‌ఎస్ పోరాట విజయమని అని స్పష్టం చేశారు. తెలంగాణ వనరులను కాపాడేది ఎవరో, కాంట్రాక్టర్ల కమీషన్లను కాపాడేది ఎవరో ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైందని హరీష్‌రావు అన్నారు.

మన తెలంగాణ 9 Mar 2026 6:40 am

ట్రంప్‌ను వదలం

ఖమేనీ హత్యకు మూల్యం చెల్లించక తప్పదు ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు తప్పు  అంచనా వేశారు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్, ఖమేనీ సన్నిహితుడు అలీ హెచ్చరిక టెహ్రాన్ : అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ ఎప్పటికైనా విడిచిపెట్టదని, అతడి అంతు చూస్తామని, ఖమేని అనుచరుడు, ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని ఆదివారంనాడు హెచ్చరించారు. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ట్రంప్ తగిన మూల్యం చెల్లించకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై మెరుపుదాడులు ప్రారంభించాయి. అదే రోజు 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ నివాసంపై బాంబులవర్షం కురిపించి ఆయనను హతమార్చాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. కేవలం కక్షతో ఇరాన్ అధినేతను అంతం చేసిన అమెరికాపై మేం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ భారీ మూల్యం చెల్లించాలి. చెల్లించుకు తీరతారు అని లారిజాని ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ లో ఒక పోస్ట్ లో హెచ్చరించారు. ఇరాన్ ఇరుగు పొరుగు దేశాలు తమ భూభాగాన్ని అమెరికా ఉపయోగించుకోకుండా నిరోధించాలని డిమాండ్ చేశారు. ఆ దేశా లు అలాంటి పని చేయలేని పక్షంలో మనమే చేసి తీరాలని, మరో మార్గం లేదని కూడా అలీ లారిజాని తన పోస్ట్ లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని తమ ఇరుగు పొరుగు దేశాల లోని స్థావరాలనుంచి నుంచి శతృవు విరుచుకుపడుతుంటే, తాము ఖచ్చితంగా ప్రతిస్పందించి తీరతామని ఆయన హెచ్చరించారు. ఇరాన్ కూడా కొంతమంది అమెరికన్ సైనికులను బంధించిందని కూడా ఆయన ప్రకటించారు. లారిజాని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జిసి) మాజీ కమాండర్ కూడా. ఇరాన్ ట్రంప్ ను ఎప్పటికీ వదిలిపెట్టదని ఆయన ఇరాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో స్పష్టం చేసారు.ట్రంప్ యుద్ధోన్మాదానికి సుప్రీంలీడర్ తో పాటు వేయిమందికి పైగా ఇరాన్ ప్రజలు మరణించారని,అది అంత తేలికైన విషయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ను సర్వనాశనం చేసే ఉద్దేశ్యంతోనే అమెరికా, ఇజ్రాయెల్ తో కలిపి ఈ దాడులకు పూనుకున్నదని ఆయన నిందించారు. వెనెజువెలా లో మదురోను బంధించిన తర్వాత బెదిరింపుతో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తనకు సహకరించేలా చేసుకున్న ట్రంప్ ఇరాన్ లో కూడా అలాంటి కుట్రకు తెరలేపాడని లారిజానీ ఆరోపించారు. పశ్చిమాసియాలో పరిస్థితులను, ముఖ్యంగా ఇరాన్ ను ట్రంప్ తక్కువగా అంచనా వేశారని హెచ్చరించారు. ఇరాన్ పై అమెరికా - ఇజ్రాయెల్ దాడులు, ఖమేని హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా హెచ్చాయి. ఇరాన్ ఈ ప్రాంతంలోని వివిధ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. 

మన తెలంగాణ 9 Mar 2026 6:30 am

నేటి నుంచి రెండో దశ పార్లమెంట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు విరామం తరువాత సోమవారం నుంచి తిరిగి ఆరంభం కానున్నాయి. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఉమ్మడిగా ఆయన తొలిగింపునకు అవిశ్వాస తీర్మానం తొలిరోజే తీసుకురానున్నాయి. దీనితో బడ్జెట్ రెండో దశ పార్లమెంట్ వాడివేడిగా మారనుంది. ఇక ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం, అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ వంటి అంశాలపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడనున్నాయి. ప్రధాని మోడీ ఇటీవలి ఇజ్రాయెల్ పర్యటన, ఆ తరువాతి ఇరాన్‌పై దాడులు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి కూడా విపక్షాలు అస్త్రశస్త్రాలు సంధించేలా ఉన్నాయి. ఎప్‌స్టీన్ ఫైళ్ల వ్యవహారం కూడా సభలలో ప్రస్తావనకు రానుంది. పార్లమెంట్ విరామానికి ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌పై చేసిన ఘాటైన వ్యాఖ్యలు , ఇందుకు ప్రతిగా ఆయనను సభ నుంచి వెలివేయాలనే అధికార పక్షం పావులు వంటివి కూడా సెషన్‌ను రగిలించే విధంగా సిద్ధంగా ఉన్నాయి. ఈ సెషన్ ఏప్రిల్ 2న ముగుస్తుంది. ఇక ఈ ఏడాది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున ఈ సెషన్ ద్వారా తమ రాజకీయ లబ్థికి ప్రతిపక్షాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించేందుకు అధికార పక్షం వ్యూహాలకు పదును పెట్టుకుంది. బెంగాల్ తాజా ఉదంతం బిజెపి అస్త్రం రెండు రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, ఈ సందర్భంగా అక్కడి టిఎంసి ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘన అంశం కూడా ప్రస్తావనకు రానుంది. మహిళ, ఆదివాసి నేత అయిన రాష్ట్రపతిని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ దురుసుగా వ్యవహరించారని పేర్కొంటూ ప్రతిపక్షాలను విమర్శించేందుకు బిజెపి, మిత్రపక్షాలు శనివారం, ఆదివారాలలో కసరత్తులకు దిగారు. సోమవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌లీడర్ల సమావేశం జరుగనుంది. ఏఏ అంశాలపై ఏ విధంగా ప్రభుత్వంపై దాడికి దిగాలి? సంఘటిత శక్తిని చాటుకోవాలనే విషయంపై చర్చిస్తారు.టిఎంసి వ్యవహారశైలి పడని ఇతర ప్రతిపక్షాలు కూడా ఈసారి బెంగాల్ కేంద్రీకృతంగా చేసుకుని మోడీ ప్రభుత్వంపై విమర్శలకు దిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 9 Mar 2026 6:20 am

పాలమూరు ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తాం

30 నెలల్లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి వచ్చే ఏడాది మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ జూన్ నాటికి భూసేకరణ పనులకు రూ.5 కోట్లు విడుదల సత్వరమే జూరాల డీలిస్టింగ్ పనులు సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ మన తెలంగాణ/హైదరాబాద్: పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను వచ్చే 30 నెలల్లో పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువస్తామని రాష్ట్ర సాగునీటి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పాలమూరు ప్రాంతానికి చెందిన ముఖ్య సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరగా సాగునీటి ప్రయోజనాలు అందించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అలాగే 2027 మార్చి మాసంతానికి కల్వకుర్తి, నెట్టెంపాడు ,భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సమృద్ధిగా సాగు నీరు, త్రాగు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఆదివారం నిర్వహించిన సమీక్షకు ఆయన అధ్యక్షత వహించగా, ఈ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్థక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్, జూపల్లి, వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కొయిలసాగర్ సాగునీటి ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు గత ప్రభుత్వం రూ.35,200 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చి సుమారు రూ.27,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. 2023 సెప్టెంబర్‌లో ఒక పంపును కేవలం గంటపాటు మాత్రమే నడిపారని, ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని వారు విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగి రూ.55,000 కోట్లకు పైగా చేరిందని, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కలుపుకుంటే మొత్తం వ్యయం రూ.80,000 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.7,161 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. దీనిలో ప్రాజెక్టు పనులకు రూ.6,718 కోట్లు, భూసేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర పనులకు రూ.94 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. హక్కు మేరకు కృష్ణా జలాల్లో ఒక్క చుక్క కూడా వదలం తెలంగాణకు కృష్ణా నదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడు ప్రాజెక్టుకు రూ.252 కోట్లు, భీమా ప్రాజెక్టుకు రూ.200 కోట్లు, కొయిలసాగర్ ప్రాజెక్టుకు రూ.185 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. ఈ పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేసేందుకు భూసేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ పనుల కోసం జూన్ 2 నాటికి రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలం 2014 తర్వాత అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని వారు విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో నీటి ఎత్తిపోతల పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల ఖర్చులు పెరిగి రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. ఇదే విధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి స్థానంలో మేడిగడ్డను ఎంచుకోవడం కూడా తెలంగాణ రైతులకు అన్యాయం చేసిన నిర్ణయమేనని మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అవసరమైన నిధులను కేటాయించి ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని మంత్రి తెలిపారు. అన్ని పనులు పారదర్శకంగా, చట్టబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని రైతులకు నీటి అందుబాటు, పంటల ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కేంద్రిత విధానాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డీసిల్టింగ్ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు మంత్రులు ఆదేశించారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదట 11.94 టీఎంసీల స్థూల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నప్పటికీ, కాలక్రమేణా మట్టికూడిక కారణంగా ప్రస్తుతం సుమారు 9 టీఎంసీలకు తగ్గిందని తెలిపారు. డీసిల్టింగ్ ద్వారా తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. తెలంగాణకు కృష్ణా నదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నమోదు కావడం దేశంలోనే అత్యధికమని పేర్కొన్నారు. అలాగే సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20,000 కోట్లు నేరుగా జమ చేశామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ఈ. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 9 Mar 2026 6:20 am

9th March 2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

9th March 2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 9 Mar 2026 6:00 am

ఆదర్శగ్రామం గంగదేవిపల్లి మాజీ సర్పంచి రాజమౌళి మృతి

మన తెలంగాణ/గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామానికి చెందిన కూసం రాజమౌళి(76)గుండె పోటుతో ఆదివారం మరణించారు. జాతీయ స్థాయిలో గ్రామ అభివృద్ధిలో కూసం రాజమౌళి రాజకీయ ప్రస్థానం ఆయన కృషి ఎంతో కీలకమైంది. ఆయన నాయకత్వంలో గంగదేవిపల్లి గ్రామం దేశానికే దిక్సూచిగా నిలిచింది. గంగదేవిపల్లి అంటే రాజమౌళి, రాజమౌళి అంటే గంగాదేవిపల్లి అనే స్థాయికి ఆయన తన ముద్ర వేశారు. గ్రామంలో నెలకొన్న మధ్యపానం, నిరక్షరాస్యత వంటి సమస్యలను రూపుమాపడానికి ఆయన గ్రామస్థులను ఏకం చేశారు. 1994లో మచ్చాపూర్ గ్రామం నుంచి గంగదేవిపల్లి వేరేగా ఏర్పడి 1995 నుంచి వారి భార్య కూసం లలిత రెండు సార్లు, రాజమౌళి ఒక సారి సర్పంచ్‌గా సుదీర్ఘ సేవలుఅందించారు. గంగదేవిపల్లి సాధించిన ప్రగతిని చూసి కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు వైస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ తో ప్రశంసలు అందుకున్నారు. విదేశీ ప్రతినిధులు సైతం గంగాదేవిపల్లిని సందర్శించి రాజమౌళి ప్రణాళికలను అధ్యాయనం చేశారు. కెసిఆర్ నివాళి వరంగల్ జిల్లా గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి మరణం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం ప్రకటించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన తెలంగాణ పల్లెగా, గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌళిది కీలక పాత్ర అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి, అన్ని రంగాలను అభివృద్ధి పరిచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, పల్లెల అభ్యున్నతికి అసలైన నిర్వచనం చెప్పిన వ్యక్తి కూసం రాజమౌళి అని కొనియాడారు. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన పల్లె ప్రగతి, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజమౌళి అనుభవాలను నాటి ప్రభుత్వం వినియోగించుకున్నదని తెలిపారు. 

మన తెలంగాణ 9 Mar 2026 5:40 am

ఇరాన్ బస్తీమే సవాల్..

` ఆరునెలైనా యుద్ధాన్ని ఆపం ` గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తుంది: ఐఆర్‌జీసీ కువైట్‌పై బాంబుల వర్షం.. అగ్నికీలల్లో భారీ టవర్ నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద …

జనం సాక్షి 9 Mar 2026 2:37 am

మహిళా భద్రత తొలి ప్రాధాన్యత

` అమ్మాయిలకు ఈవీ స్కూటీలను ఇవ్వాలనుకుంటున్నాం ` సీఎం రేవంత్ రెడ్డి ` మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాం ` దేశంలోని ఏ పదవైనా మహిళలకు …

జనం సాక్షి 9 Mar 2026 2:35 am

టీ20 ప్రపంచకప్ టీమిండియాదే..

` ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపు ` రాణించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ,అభిషేక్ శర్మ ` మూడోసారి పొట్టికప్ దక్కించుకున్న భారత్ …

జనం సాక్షి 9 Mar 2026 2:33 am

T20Victory |భారత్ విజయంలో హీరో ఎవరు?

T20Victory | భారత్ విజయంలో హీరో ఎవరు? T20Victory | ఫైనల్ మ్యాచ్‌లో

ప్రభ న్యూస్ 8 Mar 2026 11:35 pm

India Win T20 World Cup 2026: Bumrah the Saviour

The India national cricket team are the champion of the ICC Men’s T20 World Cup once again. India crushed the New Zealand national cricket team by 96 runs in the final at the Narendra Modi Stadium, delivering a dominant performance in front of a packed home crowd. With this victory, India created history. They became […] The post India Win T20 World Cup 2026: Bumrah the Saviour appeared first on Telugu360 .

తెలుగు 360 8 Mar 2026 11:16 pm

ఫైనల్ లో ఘన విజయం.. టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్‌

టీ20 ప్రపంచ కప్‌ 2026 విజేతగా భారత్ నిలిచింది. దీంతో మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 96 పరుగుల భారీ తోడాతో విజయాన్ని అందుకుని.. వరుసగా రెండోసారి కప్ ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(52), సంజూ శాంసన్(89), ఇషాన్ కిషన్(54)లు విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగారు. చివర్లో శివమ్ దూబే(26 నాటౌట్) భారీ షాట్లతో చెలరేగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.

మన తెలంగాణ 8 Mar 2026 11:10 pm

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు.. లెబనాన్‌లో 48 మంది పిల్లలు బలి

దుబాయ్: హెజ్‌బోల్లా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య పోరులో వారం రోజుల్లో మొత్తం 400 మంది చనిపోయారు. వీరిలో 48 మందికి పైగా బాలలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తమ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం దశలోనే లెబనాన్‌లో బలీయంగా ఉన్న హెజ్‌బోల్లా వర్గాలను ఏరిపారేయడానికి ఇజ్రాయెల్ సేనలు (ఐడిఎఫ్) బీకర దాడులకు దిగుతోంది. పౌర ప్రాంతాల్లో దాడులతో రక్తపాతం జరుగుతోంది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో నిర్ణీత లక్షాలను ఎంచుకుని లెబనాన్‌లో ప్రభుత్వ వర్గాలకు కట్టుబడకుండా ఉండే మిలిటెంట్లు రాకెట్లతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం తమ దాడులను తీవ్రతరం చేసింది.బీరూట్ ఇతర ప్రాంతాల్లో పలు ఆసుపత్రులలో గాయపడ్డ వారికి చికిత్సలకు అవసరం అయిన ఏర్పాట్లు లేకపోవడంతో దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ సంకట స్థితిని ఎదుర్కొంటోంది. 

మన తెలంగాణ 8 Mar 2026 10:56 pm

WonT20WorldCup |భారత్ విజయం… ప్రపంచ కప్ మరోసారి భారత్ ఖాతాలో

WonT20WorldCup | భారత్ విజయం… ప్రపంచ కప్ మరోసారి భారత్ ఖాతాలో WonT20WorldCup

ప్రభ న్యూస్ 8 Mar 2026 10:53 pm

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: రాంచందర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ‘వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం..’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తేల్చి చెప్పారు. బిఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ మేకల విజయలక్ష్మీ రవీందర్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రసంగిస్తూ గతంలో బిఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు బేజారెత్తారని విమర్శించారు. ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయి, కాబట్టి ఈసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇరాన్, యూఎస్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశంలో ఎక్కడా క్రూడ్ ఆయిల్ కొరత లేదన్నారు. ఒకే దేశంపై ఆధారపడకుండా వ్యూహాత్మకంగా అనేక దేశాల నుంచి మన దేశం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నదని ఆయన చెప్పారు. యుపిఏ హయాంలో మన దేశం కేవలం 16 దేశాల నుంచి మాత్రమే ఆయిల్ దిగుమతి చేసుకునేదని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడి ఆ సంఖ్యను 40 దేశాలకు పెంచారని ఆయన వివరించారు. మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు.. దేశంలో తగినంత బఫర్ స్టాక్ ఉందని, దిగుమతి కవరేజ్ కూడా పెరిగిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ యుద్ధం జరిగినా మన దేశ చమురు నిల్వలు, సరఫరా లేదా దిగుమతులపై ప్రభావం ఉండదని, చమురు కొరత రాదన్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలు 9 శాతం కంటే ఎక్కువ పెరిగినా కూడా దేశంలో ఇంధన ధరల సంక్షోభం ఏర్పడలేదని, ఇది ఎన్డీఏ ప్రభుత్వ వ్యూహం - స్ట్రాటజిక్ నిల్వలు, విభిన్న సరఫరాదారులు, ముందస్తు ఒప్పందాల ఫలితం అని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను గ్యాస్ సిలిండర్లు, ఇంధనం నిల్వ చేసుకోవాలని భయపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. చైనాతో రహస్య ఒప్పందాలు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి వారి ఉద్దేశాలపై అనుమానాలు కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రపతిని గౌరవించకుండా, ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. 2012లో ఇరాన్ భారత్‌కు ఆయిల్ సరఫరా నిలిపివేయడానికి కారణం 2005లో యూపీఏ ప్రభుత్వం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఇఏ)లో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం అని ఆయన చెప్పారు. ఆ నిర్ణయం భారత్-ఇరాన్ సంబంధాలను దెబ్బతీసిందని, దీంతో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై తీవ్రంగా ప్రభావం చూపించాయని రాంచందర్ రావు విమర్శించారు.

మన తెలంగాణ 8 Mar 2026 10:36 pm

జిష్ణుదేవ్ వర్మను ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు: మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: ములుగు జిల్లా పట్ల గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక అభిమానం చూపించారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుర్తు చేశారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు సార్లు ములుగు నియోజకవర్గంలో పర్యటించడం మాత్రమే కాకుండా, కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ములుగు ప్రజలు జిష్ణుదేవ్ వర్మను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. లోక్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులను మంత్రి సీతక్క ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతుల యోగక్షేమాలను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అవుతున్న వార్త తమకు ఆశ్చర్యం కలిగించిందని, ఇది తమను షాక్‌కు గురిచేసిందని మంత్రి తెలిపారు. తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యంగా కారంపొడి మిల్లు, పసుపు మిల్లు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో పలు మౌలిక వసతులను కల్పించి మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచారని, అందుకు ములుగు ప్రజలు రుణపడి ఉంటారని సీతక్క చెప్పారు. గవర్నర్ ఇచ్చిన ప్రోత్సాహంతో కొండపర్తి గ్రామ మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వు లడ్డూలు తయారీని ఉపాధిగా చేపట్టారని మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతరలో ఈ లడ్డూలను విక్రయించి మహిళలు మంచి ఆదాయం పొందారని ఆమె వివరించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను మంత్రి సీతక్క వివరించగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు అరగంటకుపైగా మంత్రి సీతక్కతో గవర్నర్ దంపతులు ఆసక్తిగా మాట్లాడి పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గవర్నర్‌కు సమ్మక్క-సారలమ్మ జాతర జ్ఞాపికను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ సతీమణికి తెలంగాణ సంప్రదాయ చీరను బహుకరించారు.

మన తెలంగాణ 8 Mar 2026 10:25 pm

రియల్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం: మంత్రి పొంగులేటి

మన తెలంగాణ/హైదరాబాద్: గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంలో హైదరాబాద్ మిగతా నగరాల కంటే ముందంజలో ఉందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాల వల్ల రియల్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సచివాలయంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త నిర్ణయాల్ని తీసుకుంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతినార్జించిందని వెల్లడించారు. అనేక దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. నగరానికే తలమానికమైన మెట్రో సెకండ్ ఫేజ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్ రోడ్డు వంటివి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి రియల్ ఎస్టేట్ వీక్లీ పేపర్ హైదరాబాద్ నుంచి ఆరంభం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పట్లోళ్ల కిరణ్, గొట్టేటి రాజేష్, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్, ఈసీ సభ్యులు అమిత్ బట్టు, వనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 8 Mar 2026 10:17 pm

హైదరాబాద్‌లో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

నగరంలో తయారైన డగ్స్ రాజస్థాన్‌కు తరలించి విక్రయాలు రాజస్థాన్‌లో పట్టుబడ్డ నిందితుల విచారణలో షాద్‌నగర్ డ్రగ్ తయారీ నెట్‌వర్క్ బట్టబయలు మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. షాద్ నగర్ లో మెఫెడ్రోన్ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌పై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఈగల్ టీం సమాచారంతో ఆదివారం షాద్ నగర్‌లోని సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్ ఇన్నోవేషన్స్ ఇండియా సంస్థ ద్వారా డ్రగ్స్ తయా కి ఉపయోగించే ప్రికర్సర్ కెమికల్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని 2-బోమో 4-మిథైల్ప్రొపియోఫెనోన్‌వంటి కెమికల్స్‌ను ఆన్ లైన్లో విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ కెమికల్స్‌తో నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ప్రధాన నిందితుడు వీరేంద్ర స్వామి అలియాస్ గిరీష్ తాపర్ సహా పలువురు నిందితులు డ్రగ్స్ తయారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు నకిలీ అడ్రస్‌లతో కెమికల్స్ ఆర్డర్ చేసి షాద్ నగర్‌లో ల్యాబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నారని తెలిపారు. మొత్తం 300 కిలోల వరకు కెమికల్ కొనుగోలు చేసి ట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. నగరంలో తయారైన డ్రగ్స్‌ను రాజస్థాన్‌కు తరలించి అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. రాజస్థాన్‌లో పోలీసులు వీరేంద్ర స్వామి, మనీష్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ విచారణలో షాద్‌నగర్ డ్రగ్ తయారీ నెట్‌వర్క్ బయటపడిందని హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు వెల్లడించారు.

మన తెలంగాణ 8 Mar 2026 10:08 pm

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన నన్ను కలచివేసింది: పవన్ కల్యాణ్

మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన ’అంతర్జాతీయ సంతాల్ సదస్సు’ నిర్వహణ తీరు, అక్కడ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎదురైన పరిణామాలపై ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ద్రౌపది ముర్ము, అక్కడి పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, అవి తనను తీవ్ర ఆందోళనకు గురి చేశాయని పవన్ పేర్కొన్నారు. గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా సంతాల్ సామాజిక వర్గం ఒక సదస్సును నిర్వహించినప్పుడు, అందులో ఆ వర్గానికి దక్కాల్సిన గౌరవం, ప్రాధాన్యత కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎవరి కోసమైతే ఈ సదస్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో, ఆ సంతాల్ కమ్యూనిటీకి చెందిన సభ్యులే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తడం అత్యంత విచారకరమని ఆయన అన్నారు. ఇలాంటి సాంస్కృతిక సమావేశాలు అందరినీ కలుపుకుపోయేలా, సున్నితత్వంతో కూడిన పరిపాలనా ప్రణాళికతో జరగాలని హితవు పలికారు. భారత రాష్ట్రపతి పదవి అనేది దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అని, ఆ పదవికి, ఆ వ్యవస్థకు ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం దక్కాలని గుర్తు చేశారు. రాష్ట్రపతి పర్యటన అంటే ఎంతో హుందాగా, పకడ్బందీగా జరగాలని, అది ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్, మర్యాదలకు భంగం వాటిల్లడం సరికాదన్నారు. భారతదేశ అస్తిత్వంలో, మన దేశ ఖ్యాతిలో గిరిజన సమాజాలు అంతర్భాగమని పవన్ కల్యాణ్ కొనియాడారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు, వారి గళానికి ఎల్లప్పుడూ నిజాయతీతో కూడిన గౌరవం లభించాలన్నారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా, రాజ్యాంగ అధిపతికి అసౌకర్యం కలిగించేలా జరిగిన ఈ సంఘటన దురదృష్టకరమని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా పాలకులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

మన తెలంగాణ 8 Mar 2026 9:58 pm

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు నిజామాబాద్ ,ఆంధ్రప్రభ : ఇందూరు

ప్రభ న్యూస్ 8 Mar 2026 9:15 pm

Election Results of Telugu Film Directors Association

The Elections of Telugu Film Directors Association (TFDA) are held today in Saradhi Studios, Hyderabad and the results are declared this evening. VN Aditya and his panel won with a large majority. 15 members out of his 18 members won in the elections. VN Aditya promised to work hard for the welfare of the directors […] The post Election Results of Telugu Film Directors Association appeared first on Telugu360 .

తెలుగు 360 8 Mar 2026 9:11 pm

TG Rajya Sabha candidate Abhishek Singhvi Declares Assets Over ₹2,860 Crore

HYDERABAD – Senior Advocate and Indian National Congress leader Dr. Abhishek Manu Singhvi has set a new financial benchmark for legislative candidates in India. According to his official affidavit filed for the 2026 Rajya Sabha elections from Telangana, he has declared a staggering combined asset value of ₹2,860.36 crore for himself and his spouse, Anita […] The post TG Rajya Sabha candidate Abhishek Singhvi Declares Assets Over ₹2,860 Crore appeared first on Telugu360 .

తెలుగు 360 8 Mar 2026 9:09 pm

అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ విష్ణు ప్రియకు సన్మానం

అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ విష్ణు ప్రియకు సన్మానం పల్నాడు,ఆంధ్రప్రభ: అసిస్ట్ సంస్థ ద్వారా

ప్రభ న్యూస్ 8 Mar 2026 9:04 pm

India’s Top 3 Richest Women Legislators Are From Andhra Pradesh

Women legislators from Andhra Pradesh rank among the wealthiest in the country, with three sitting representatives declaring assets worth more than ₹100 crore each, according to a report by the Association for Democratic Reforms (ADR). The study analysed the affidavits of 24 sitting women MPs and MLAs from Andhra Pradesh, whose combined declared assets total […] The post India’s Top 3 Richest Women Legislators Are From Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 8 Mar 2026 9:04 pm

సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం మక్తల్, ఆంధ్రప్రభ: బీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన

ప్రభ న్యూస్ 8 Mar 2026 8:57 pm

టీమిండియా విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

టి20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విధ్యంసం సృష్టించారు. దీంతో భారత్, న్యూజిలాండ్ పై భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(52), సంజూ శాంసన్(89)లు న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తొలి వికెట్ కు 7.1 ఓవర్లలోనే 98 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(54) కూడా అర్ధశతకంతో మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బౌలర్ నీషమ్ అద్భుతమైన బౌలింగ్ తో ఒకే ఓవర్ లో మూడు కీలక వికెట్లు తీసి భారత్ జోరుకు బ్రేకు వేశాడు. ఇక, చివర్లో శివమ్ దూబే భారీ షాట్లతో చెలరేగాడు. దీంతో లాస్ట్ ఓవర్ లో 24 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.

మన తెలంగాణ 8 Mar 2026 8:55 pm

టెహ్రాన్‌లో టెర్రర్.. మిస్సైల్ తో విరుచుకుపడిన ఇజ్రాయెల్

ఇరాన్‌ను నిప్పుల గుండం చేసిన ఇజ్రాయెల్ ఐదు చమురు డిపోలు, రిఫైనరీలపై క్షిపణి దాడులు క్షిపణి వ్యవస్థ, కమాండ్ సెంటర్లు విధ్వంసం తిప్పికొట్టిన ఇరాన్.. కువైట్ ఎయిర్‌పోర్ట్, చమురు నిల్వలపై దాడులు దుబాయ్‌లోని మెరీనా టవర్‌పై కుప్పకూలిన క్షిపణి శకలాలు బహ్రెయిన్ డిశాలినేషన్ ప్లాంట్‌పై దాడి నార్వేలో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు మున్ముందు మరిన్ని ఆశ్చర్యకరదాడులు : నెతన్యాహు యుద్ధంలో భాగంగా తొమ్మిదో రోజైన ఆదివారంనాడు ఇరాన్‌తో పాటు అమెరికాఇజ్రాయెల్ సంయుక్త బలగాల పరస్పర పోరు నిప్పుల వానను తలపించింది. తెల్లవారుజాము నుంచే ఇరు వర్గాలు క్షిపణులు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన చమురు డిపోలను ఇజ్రాయెల్ వైమానిక దళాలు లక్షంగా చేసుకున్నాయి. టెహ్రాన్‌లోని ఐదు చమురు డిపోలతోపాటు రిఫైనరీలపై క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఆకాశంలో నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, కమాండ్ సెంటర్లు, చమురు డిపోలపై విచక్షణారహితంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. శత్రువును తీవ్రంగా దెబ్బతీశామని తెలిపింది. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో 10వేల నిర్మాణాలు నేలమట్టమయ్యాయని ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో ఇప్పటి వరకు 400మంది తమ దేశ పౌరులు మృత్యువాతపడ్డారని, అందులో 83 మంది చిన్నారులు ఉన్నట్లు లెబనాన్ ప్రకటించింది. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు. గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడబోమని చెబుతూ ఇరాన్ దేశాధ్యక్షుడు క్షమాపణ ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా విరుచుకుపడింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు సమీపంలో చమురు డిపోలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సోషల్ సెక్యూరిటీ టవర్‌పై డ్రోన్ల శకలాలు పడడంతో దానికి మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో దుబాయ్‌ను కూడా లక్షంగా ఎంచుకుని వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించింది. ఈ ఘటనలో దుబాయ్‌లోని ప్రఖ్యాత మెరీనా టవర్‌పై ఓ క్షిపణ శకలాలు కుప్పకూలడంతో ప్రజలంతా భయకంపితులయ్యారని తెలుస్తోంది. అయితే ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లను యుఎఇ నేలకూల్చింది. బహ్రెయిన్‌లోని డిశాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మీదుగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. నష్టం వివరాలు తెలియకున్నా ఇజ్రాయెల్ కూడా దాడులను ధ్రువీకరించింది. భారీ ఎత్తున్న క్షిపణులు తమ దేశంపైకి దూసుకొచ్చాయని, పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మున్ముందు మరిన్ని సర్‌ప్రైజ్‌లు చవిచూడబోతోందని హెచ్చరించారు. ఇరాన్ విభజన తమ లక్షం కాదని, అక్కడి నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమేనని స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 8 Mar 2026 8:46 pm

యాదాద్రిలో వైభవంగా స్వామివారి జన్మనక్షత్ర వేడుకలు

యాదాద్రిలో వైభవంగా స్వామివారి జన్మనక్షత్ర వేడుకలు ప్రతినిధి, యాదాద్రి, ఆంధ్రప్రభ: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం

ప్రభ న్యూస్ 8 Mar 2026 8:46 pm

గుడిసె వాసులపై సీపీఐ నేత ఆర్థిక అరాచకాలు

గుడిసె వాసులపై సీపీఐ నేత ఆర్థిక అరాచకాలు నర్సంపేట,ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని

ప్రభ న్యూస్ 8 Mar 2026 8:31 pm

మహిళల సాధికారతతోనే సమాజ ప్రగతి..

మహిళల సాధికారతతోనే సమాజ ప్రగతి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ

ప్రభ న్యూస్ 8 Mar 2026 8:18 pm

Bihar’s Next CM? Intense Power Struggle Begins

Political activity in Bihar has intensified as speculation grows over who will become the next Chief Minister after Nitish Kumar is expected to move to the Rajya Sabha. After nearly two decades of leadership, the possibility of his transition to national politics has opened a fresh debate about the future leadership of the state. The […] The post Bihar’s Next CM? Intense Power Struggle Begins appeared first on Telugu360 .

తెలుగు 360 8 Mar 2026 8:16 pm

ముధోల్ ఎఫ్ఎసి ఎంపిడిఓ గా చంద్రశేఖర్

ముధోల్ ఎఫ్ఎసి ఎంపిడిఓ గా చంద్రశేఖర్ ముధోల్, ఆంధ్రప్రభ: ముధోల్ మండల కేంద్రంలోని

ప్రభ న్యూస్ 8 Mar 2026 8:11 pm

గ్రామ కార్మికులకు ప్రభుత్వం వేతనం ఇవ్వాలి

గ్రామ కార్మికులకు ప్రభుత్వం వేతనం ఇవ్వాలి కొడిమ్యాల, ఆంధ్రప్రభ: గ్రామ పంచాయతిలో పని

ప్రభ న్యూస్ 8 Mar 2026 8:06 pm

ఇబ్రహీంపట్నం సీఐగా సుబ్రహ్మణ్యం

ఇబ్రహీంపట్నం సీఐగా సుబ్రహ్మణ్యం ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్ స్పెక్టర్

ప్రభ న్యూస్ 8 Mar 2026 8:03 pm

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రాప్తాడు, ఆంధ్రప్రభ : కుటుంబాన్ని సమర్థవంతంగా

ప్రభ న్యూస్ 8 Mar 2026 8:00 pm

కన్నుల పండువగా శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి రథోత్సవం

కన్నుల పండువగా శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి రథోత్సవం శివ నామ స్మరణతో

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:55 pm

Trust Board |భక్తులకు జలప్రసాదం, మజ్జిగ పంపిణీ…

Trust Board | భక్తులకు జలప్రసాదం, మజ్జిగ పంపిణీ… మహా కుంభాభిషేకం సందర్భంగా

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:55 pm

మహిళలు వ్యవసాయం, రాజకీయాల్లో రాణించాలి….

మహిళలు వ్యవసాయం, రాజకీయాల్లో రాణించాలి…. రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రతి మహిళా సాధికారిక

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:52 pm

Maternity Leave Men AP : మగాళ్లకూ మెటర్నిటీ లీవ్​ AP SPl News

Maternity Leave Men AP : మగాళ్లకూ మెటర్నిటీ లీవ్​ AP SPl

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:47 pm

వట్టెం రిజర్వాయర్ ఆయకట్టు పనులను పూర్తి చేయాలి..

వట్టెం రిజర్వాయర్ ఆయకట్టు పనులను పూర్తి చేయాలి.. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:43 pm

23న బిసిల చలో ఢిల్లీకి జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

 హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుండి మొదలుకానున్న జాతి జనగణనలో బిసి కులగణన చేపట్టాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన బిసి రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలని ఆయన కోరారు. పై డిమాండ్‌ల సాధన కోసం ఈ నెల 23న బిసిల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బిసిల చలో ఢిల్లీ సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని బిసిలు ఉద్యమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి జాతి జన గణనలో సమగ్ర కులగణన చేపడతామని ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తాము ప్రకటించినట్లుగా వచ్చే నెల ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి దేశవ్యాప్తంగా జాతి జనగణన చేపడుతుందని మొదటి దఫాలో కుటుంబ ఇంటి లెక్కలు తీస్తుందని, ఇందులో 33 ప్రశ్నలను రూపొందించి అందులో ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు ఎన్ని అడిగిన కేంద్ర ప్రభుత్వం బిసి కుటుంబాల సంఖ్యను విస్మరించడం చాలా బాధాకరమన్నారు. ఇండ్ల లెక్కింపులో కూడా బిసి ఇండ్లను లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. బిసిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టానిన కేంద్ర ప్రభుత్వానికి పంపించి సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇంతవరకు బిసి రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో బిసి రిజర్వేషన్ల విషయంలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటింటి లెక్కింపులో బిసి కుటుంబాల లెక్కింపు, బిసి రిజర్వేషన్ల పెంపుకు జరుగుతున్న ఈ భారీ ధర్నాకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి బిసిలంతా పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 8 Mar 2026 7:42 pm

జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం

జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:28 pm

మహిళలు ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలి…

మహిళలు ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : మహిళలు విద్యా ఉద్యోగం

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:25 pm

నిరుపేదలకు నిత్యవసరాల పంపిణీ

నిరుపేదలకు నిత్యవసరాల పంపిణీ చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:21 pm

భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ షాక్‌తో మృతి

భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ షాక్‌తో మృతి విస్సన్నపేట, ఆంధ్రప్రభ : స్థానిక

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:15 pm

ముదిరిన ప్రొటోకాల్‌ వివాదం

ముదిరిన ప్రొటోకాల్‌ వివాదం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: రాష్ట్రపతి ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై కేంద్రం,

ప్రభ న్యూస్ 8 Mar 2026 7:14 pm

Temple |ధర్మ రక్షణతోనే సమాజానికి శ్రేయస్సు

Temple | ధర్మ రక్షణతోనే సమాజానికి శ్రేయస్సు కుంభాభిషేకం ఆలయ శక్తిని పునరుజ్జీవింపజేసే

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:59 pm

మహిళలు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి…

మహిళలు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి… విజయవాడ, ఆంధ్ర ప్రభ : సర్వైకల్ కాన్సర్

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:50 pm

7mar2026 |షా(క్రా)కర్స్…కంటే పాతికవేలు..!

7mar2026 | షా(క్రా)కర్స్…కంటే పాతికవేలు..! వంటింట్లో సిలిండర్ స్టంట్….వార్ పేరుతో పరివార్ గిఫ్ట్

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:46 pm

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో విఎంసి ప్రథమ స్థానం

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో విఎంసి ప్రథమ స్థానం స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:45 pm

టి-20 వరల్డ్‌కప్ ఫైనల్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

అహ్మదాబాద్: టి-20 ప్రపంచకప్ 2026లో అసలైన మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. గ్రూప్ స్టేజ్, సూపర్-8, సెమీ ఫైనల్స్‌ని దాటుకొని ఫైనల్స్‌కి చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తొలిసారి ట్రోఫీ అందుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుంటే. ఈసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకొని మూడుసార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న జట్టుగా రికార్డు సృష్టించాలని భారత్ పట్టుదలతో ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక మార్పు చేసింది. మెక్‌కోంచీ స్థానంలో జాకబ్ డఫీని జట్టులోకి తీసుకుంది. భారత సెమీస్‌లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతుంది. తుది జట్లు: న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ. భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

మన తెలంగాణ 8 Mar 2026 6:45 pm

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; మండలంలోని పాత కొమ్ముగూడెంలో ఆదివారం ఎన్ఆర్జీఎస్ నిధులతో నూతన

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:26 pm

బంగ్లాదేశ్‌లో దారుణం.. పూజ చేసుకుంటున్న వారిపై బాంబుదాడి

ఢాకా: బంగ్లాదేశ్‌లో రోజురోజుకీ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. కోమిల్లా ప్రాంతంలో శనివారం రోజున పూజ చేసుకుంటున్న హిందూ బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. పూజూ కార్యక్రమానికి హాజరైన పలువురు ఈ ఘటనలో గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాధీ హత్యతో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగాయి. అప్పటి నుంచి దేశంలోని హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయారు. 

మన తెలంగాణ 8 Mar 2026 6:25 pm

T20 World Cup Finals : మరి కాసేపట్లో భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్.. గెలుపు అంచనాలివే

టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది

తెలుగు పోస్ట్ 8 Mar 2026 6:23 pm

మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి

మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:16 pm

పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అభినందనీయం….

పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అభినందనీయం…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రైవేటు

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:15 pm

హెచ్ పీవీ టీకాతో బాలికలకు భరోసా

హెచ్ పీవీ టీకాతో బాలికలకు భరోసా తొర్రూరు, ఆంధ్రప్రభ : హెచ్ పీవీ

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:12 pm

గ్రామ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉంటా..

మంథని రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఖానాపూర్

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:10 pm

పైరవీలకు కాదు.. ప్రతిభకు పట్టం కట్టాలి..

పైరవీలకు కాదు.. ప్రతిభకు పట్టం కట్టాలి.. కరీంనగర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రతిభతో

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:09 pm

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సన్మాన సభ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సన్మాన సభ నల్లబెల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:09 pm

మహిళలకు అన్నిట్లో సముచిత స్థానం కల్పించాలి

మహిళలకు అన్నిట్లో సముచిత స్థానం కల్పించాలి నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నేటి

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:04 pm

కొమరగుంటలో కోలాహలంగా జల్లికట్టు

కొమరగుంటలో కోలాహలంగా జల్లికట్టు వెదురుకుప్పం,ఆంధ్ర ప్రభ : మండలంలోని కొమర గుంట పంచాయతీ

ప్రభ న్యూస్ 8 Mar 2026 6:00 pm

వెంకటగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం

ఒక వ్యక్తి కాలు కోల్పోయిన ఘటనవిశాలాంధ్ర వెంకటగిరి పట్టణంలోని ఒక ఆర్ఎంపీ (గ్రామీణ) వైద్యుడి నిర్లక్ష్య వైద్యం కారణంగా ఒక వ్యక్తి తన కాలును కోల్పోయినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. చిన్నపాటి గాయాలకు రక్తస్రావం ఆపేందుకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించాల్సిన గ్రామీణ వైద్యులు, తమ పరిధిని దాటి సర్జరీలకు పాల్పడుతున్నారని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తికి జరిగిన ప్రమాదకర గాయానికి సరైన వైద్య చికిత్స అందించకుండా, ఫస్ట్ ఎయిడ్ […] The post వెంకటగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Mar 2026 5:51 pm

మహిళా సాధికారతే స‌మ‌గ్ర ప్రగతికి పునాది..

మహిళా సాధికారతే స‌మ‌గ్ర ప్రగతికి పునాది.. దేశాన్ని ఆర్థికంగా బ‌లంగా నిల‌ప‌డంలో మ‌హిళామ‌ణులే

ప్రభ న్యూస్ 8 Mar 2026 5:28 pm