SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

నేరాల నియంత్రణ కోసం..

నేరాల నియంత్రణ కోసం.. క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ

ప్రభ న్యూస్ 11 Nov 2025 7:26 am

Bihar : నేడు బీహార్ లో మలిదశ ఎన్నికలు

బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది

తెలుగు పోస్ట్ 11 Nov 2025 7:25 am

మరో బస్సు దగ్ధం..

మరో బస్సు దగ్ధం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద మరో

ప్రభ న్యూస్ 11 Nov 2025 7:19 am

Jubilee Hills Bye Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రారంభమయింది.

తెలుగు పోస్ట్ 11 Nov 2025 7:16 am

ఢిల్లీ పేలుడు.. ఎవరెవరు ఏమన్నారు..?

ఢిల్లీ పేలుడు.. ఎవరెవరు ఏమన్నారు..? ఢిల్లీలో పేలుడు ఘటనతో ఒక్కసారిగా దేశం హై

ప్రభ న్యూస్ 11 Nov 2025 7:03 am

లవ్ స్టోరీతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. నిర్మా త మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..“సంతాన ప్రాప్తిరస్తు స్క్రిప్ట్‌ను సంజీవ్ బాగా హ్యాండిల్ చేశారు. మొత్తం 56 రోజులలో ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా షూటింగ్ పూర్తి చేశాం. ఈ సినిమా కోసం కొత్త అబ్బాయితో వెళ్దామని, ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్ ను తీసుకున్నాం. మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సినిమా ఉన్నా, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఎంటర్ టైనింగ్ గా సినిమా ఉంటుంది. కామెడీ ఎక్కడా కావాలని ఇరికించినట్లు ఉండదు. చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. ఇప్పటి ట్రెండ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో అలాంటి వినోదాన్ని సృష్టిం చాం. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్..ఇలా నటులంతా అంతా బాగా ఎంటర్‌టైన్ చేస్తారు. సామజవరగమన తర్వాత మళ్లీ తెలుగులో వస్తున్న లవ్ స్టోరీతో సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు” అని అన్నారు. నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో దశాబ్దంన్నర అనుభవం ఉన్న మధు ర శ్రీధర్‌తో, హీరో విక్రాంత్‌తో కలిసి ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాను చేశాం. మేల్ ఫెర్టిలిటీ సమస్యతో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎక్క డా అసభ్యత లేకుండా, హద్దులు దాటకుం డా, బలమైన కథతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైన ర్ నిర్మించాం.- పిట్టకొంచెం కూత ఘనం అన్న ట్లు...మా సినిమా పేరుకే చిన్నది కానీ ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది”అని తెలిపారు.

మన తెలంగాణ 11 Nov 2025 7:00 am

దద్దరిల్లిన ఢిల్లీ..

దద్దరిల్లిన ఢిల్లీ.. ఢిల్లీలో భారీ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా దద్దరిల్లింది. దేశ రాజధాని

ప్రభ న్యూస్ 11 Nov 2025 6:42 am

ఓట్ల కోసం ఖజానాకు తూట్లు

బీహార్ రెండో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 1.30 మిలియన్ మంది జనాభా కలిగిన బీహార్‌లో ఓట్లను కొల్లగొట్టడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం అపారమైన సంక్షేమ ప్యాకేజీని ప్రకటించింది. ఇది తీవ్రమైన ఆర్థిక పరిణామాలతో కూడుకుని ఉంటోంది. అత్యంత ప్రధానమైన ప్రస్తుత ప్రధాన రెండు పథకాలు ఇప్పటికే రాష్ట్ర ఆదాయంలో 10 శాతం వరకు హరించి వేస్తున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేయడానికి వెళ్లక ముందే 1.5 కోట్ల మంది మహిళలు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన (ఎంఎంఆర్‌వై) పథకం కింద నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ. 10 వేలు వంతున నగదు అందుకోగలిగారు. ఎక్కువ మంది మహిళలు నమోదు కావడంతో అసలు వ్యయం ఇంకా పెరగవచ్చు. మరో 1.1 కోట్ల మంది ముఖ్యంగా వితంతువులు, వృద్ధమహిళలు, వికలాంగులు వీరందరికీ నెలవారీ పెన్షన్ రూ. 400 నుంచి రూ. 1100 వరకు మూడు రెట్లు పెరిగింది. ఫలితంగా ఏటా పెన్షన్ కింద ప్రతి పెన్షనర్‌కు రూ. 8400 వంతున పెరిగింది. ఈ మొత్తం అంతా రూ. 9420 కోట్ల వరకు అదనపు భారాన్ని పెంచింది. ఈ రెండు పథకాలకు కలిపి 2025 26 రాష్ట్ర బడ్జెట్ ఆదాయంలో పదో వంతు వ్యయాన్ని కేటాయించవలసి వస్తోంది. ఇవి కేవలం హామీలు మాత్రమే కాదని గుర్తించడం అవసరం. ఎంఎంఆర్‌వై పథకం నిధులు ఇప్పటికే పంపిణీ అయ్యాయి. పెన్షన్ నిధుల కేటాయింపు కూడా జులై నుంచి మొదలైంది. ఇంత భారీ మొత్తాన్ని ఎవరు భరిస్తారు? ఎంఎంఆర్‌వై పథకం నిధులు రుణం నుంచి లభిస్తాయా? లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా అందుతాయా? సామాజిక భద్రత కింద పెరిగిన ఈ మొత్తం అంతా రాష్ట్ర ఖజానా నుంచే భరిస్తారని నివేదించడమైంది. కానీ దీని ప్రభావం ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిధులపై ఎంతవరకు పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం తన మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందా? అంటే దీని అర్థం కొత్తగా రోడ్లు, స్కూళ్ల నిర్మాణానికి, విద్యుత్ ఉత్పత్తికి, ఇతర అభివృద్ధి పథకాలకు కావలసిన పెట్టుబడుల్లో కోత విధిస్తుందా? ఈ మేరకు పెరిగిన ద్రవ్యలోటు ఫలితంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందా? ఇవన్నీ తలెత్తుతున్నాయి. ముక్తసరిగా చెప్పాలంటే ఎన్‌డిఎ సంక్షేమ ప్యాకేజీ దేశంలోని అత్యంత నిరుపేద, కనీస అభివృద్ధి కూడా లేని బీహార్ రాష్ట్రంలో ఆర్థిక వినాశనానికి విత్తనాలు నాటిందా? గత ఏడాది బీహార్ ఆర్థికలోటు రాష్ట్ర జిడిపిలో 9.2 శాతంగా ఉంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మూడు సార్లు ఆర్థిక లోటును భరించడానికి వీలుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను గత మార్చిలో ప్రవేశ పెట్టినప్పుడు ఆర్థిక లోటును 3 శాతానికి తగ్గిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా హామీ ప్రకటించింది. అయితే అది ఇప్పుడు జరిగే అవకాశం లేకుండా సంక్షేమ ప్యాకేజీ ఆశలను చెల్లాచెదురు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ భారీ సంక్షేమ ప్యాకేజీ ప్రకటనకు ఓటర్లు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆర్థిక బాధ్యతారాహిత్యానికి విపక్షాలు ఏ విమర్శలు చేయకుండా దూరంగా ఉంటున్నాయి. దీనికి పోటీగా అవి కూడా భారీ హామీలతో తమ స్వంత సంక్షేమాన్ని ప్రకటించాయి. క్షేత్రస్థాయిలో ఈ రాజకీయ క్రీడ చాలా తేడాగా ఉంటోంది. ఎందుకంటే నితీశ్ ప్రభుత్వం ఇప్పటికే తమ హామీలను అమలు చేస్తుండడంతో విపక్షకూటమి కేవలం హామీలు ఇస్తుందనే భావనతో ఓటర్లు ఉన్నారు. దళారుల ప్రమేయం కానీ, అవినీతి కానీ చోటు చేసుకోకుండా ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం నితీశ్‌కు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. గతంలో ఇలాంటి నగదు పంపిణీ, తదితర పథకాల్లో కేవలం 15 శాతం వరకే ప్రయోజనాలు లబ్ధిదారులకు అందేవి. సాధారణంగా పాలనలోఉన్న ముఖ్యమంత్రులపై ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం సహజం. రాష్ట్రాల్లో పాలన సరిగ్గా లేకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఓట్లు వేసి తమ కోపం తీర్చుకుంటుంటారు. ఈ విషయంలో నితీశ్ ముందుగానే జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గమనించి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. మోడీ ప్రభుత్వంతో జతకట్టి అధికారంలో ఉండడంతో ఓటర్లలో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను అధిగమించడానికి ప్రయత్నించారు. భారీ సంక్షేమ పథకాలతో ఓటర్లను ఊరించే పనిచేశారు. ఈ పరిస్థితుల్లో భారీ సంక్షేమ పథకాలు గేమ్ ఛేంజర్ అవుతాయా? మరోవైపు ప్రధాన విపక్షకూటమి ‘మహాఘట్‌బంధన్’ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోనే కుటుంబానికి ఓ ఉద్యోగం కల్పిస్తామని హామీ ప్రకటించింది. బీహార్‌లో 2.97 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. నెలకు రూ.15,000 నుంచి రూ. 20,000 వంతున ప్రతి కుటుంబానికి ఖర్చు పెట్టవలసి వస్తుందని లెక్క వేసినా మొత్తం వ్యయం రూ. 5.35 లక్షల కోట్లు నుంచి రూ.7.13 లక్షల కోట్ల వరకు వ్యయం కాక తప్పదు. ఇది ఉద్యోగ వాగ్దాన అసంబద్ధతను తెలియజేస్తుంది. ఈ సరళమైన గణాంకం మహాఘట్‌బంధన్ ఆలోచన లోని శూన్యతను తెలియజేస్తుంది. ఇది కాక ఐదేళ్ల పాటు వడ్డీ లేని నగదు రూ. 5 లక్షల వరకు అందజేస్తామని, పంటల సేకరణ గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా ఇవన్నీ మహాఘట్‌బంధన్ మేనిఫెస్టోలో చేర్చిన ప్రధాన అంశాలు. అయితే ఆర్థిక నిపుణులు, రాజకీయ పరిశీలకులు ఈ ఉచిత హామీలు వచ్చే ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించవని వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 10 వేలు అందుకుంటున్న మహిళలు కూడా చాలామంది ప్రభుత్వం మార్పును కోరుతుండడం గమనార్హం.

మన తెలంగాణ 11 Nov 2025 6:20 am

ఆ.. దొంగల ముఠా అరెస్ట్..

ఆ.. దొంగల ముఠా అరెస్ట్.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పలు రాబరీలు, దొంగతనాలు,

ప్రభ న్యూస్ 11 Nov 2025 6:14 am

హస్తం హవానా.. కారు జోరా?

జూబ్లీహిల్స్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నా ఆయన తెచ్చిన నిధులేమీ లేవని, కిషన్ రెడ్డి, కెసిఆర్ అభివృద్ధి నిరోధకులని రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్రం 2014- 23 మధ్య తెలంగాణకు 9 లక్షల కోట్ల నిధులిచ్చిందని, సిఎం అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొట్టడం మినహా పేదలకు చేసిందే లేదని కెటిఆర్ విమర్శించగా, చెరువుల ఆక్రమణలు తొలగించి నీటివనరులను అభివృద్ధి పరుస్తున్నా మని, మూసీ ఆక్రమణలు తొలగించి నగరాన్ని నందనవనం చేస్తుంటే కెటిఆర్, హరీశ్ సహించలేకపోతున్నారని సిఎం విమర్శించారు.  సిఎం రేవంత్, కెసిఆర్‌ల ప్రతిష్ఠకు అగ్నిపరీక్ష. హైదరాబాద్ మహానగర పరిధిలోని జూబ్లీహిల్స్ శాసనసభా స్థానానికి 11న జరిగే ఉపఎన్నిక ప్రచారం పూర్తయి, పోలింగ్‌కు సర్వం సిద్ధంగా ఉంది. బిజెపితో సహా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ విజయసాధనకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధినేత, మాజీముఖ్యమంత్రి కెసిఆర్‌ల ప్రతిష్ఠకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అగ్నిపరీక్షగా నిలిచింది. జూబ్లీహిల్స్ స్థానానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా మరణించడంతో జరుగుతున్న ఉపఎన్నికలో గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకిదింపి సానుభూతి ఓట్లతో మళ్ళీ గెలవాలని భారత రాష్ట్రసమితి గట్టి ప్రయత్నాలే చేస్తున్నది.ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటి, కెసిఆర్‌ను మళ్లీ సిఎంగా తేవాలనే వ్యూహంతో బిఆర్‌ఎస్ శ్రమిస్తోంది. కెటిఆర్, హరీశ్‌రావు పలువురు మాజీమంత్రులు, శాసనసభ్యులు, స్థానిక నేతలను వీరేంటబెట్టుకుని ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం చేశారు. నియోజక వర్గంలోని శ్రీనాగరకాలనీ, బోరబండ, వెంగళరావునగర్, షేక్‌పేట, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, 7 కార్పొరేట్ డివిజన్లలోని బస్తీలు, మురికివాడలు, ప్రధాన రహదారులలో బిఆర్‌ఎస్ మాజీమంత్రులు, శాసనసభ్యులు సిహెచ్ మల్లారెడ్డి, ఎస్. నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద గౌడ్ ప్రభృతులు గల్లీగల్లీలో ఇంటింటికీ తిరిగి కారుగుర్తుకు ఓటేసి కెసిఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ బిసి సాధికారత నినాదంతో యువకుడు, శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్‌ను హస్తం అభ్యర్థిగా పోటీకి దింపి గెలుపుకోసం చెమటోడుస్తోంది. తెలంగాణ మంత్రు లు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సహా మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ వంటి నేతలే గాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకుని వివిధ డివిజన్‌లలో విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్‌లో లక్షా 1.4 లక్షల బిసి, లక్ష ముస్లిం, 20 వేలు క్రైస్తవ ఓటర్లున్నారు. నిజానికి ఈ స్థానం మినీ భారత్. ఉత్తరాది వారుతెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన సామాజిక వర్గాల వారూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో వున్నారు. ఈ ఎన్నిక మోడీ, కెసిఆర్ ద్వయానికి, రేవంత్, రాహుల్, ఒవైసిల మధ్య జరుగుతున్న పోరుగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న ముస్లింలను ఆకట్టుకోవడానికి కొద్దిరోజుల ముందే క్రికెట్ ఆటగాడు అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇచ్చి మైనారిటీ వ్యవహారాల శాఖను కట్టబెట్టారు. మజ్లిస్ పార్టీ పోటీ చేయకుండా ఈసారి హస్తం పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం. కెసిఆర్ ప్రభుత్వం మైనారిటీలను నిర్లక్ష్యం చేసిందని, ముస్లిం రిజర్వేషన్లను 4 నుండి 12 శాతానికి పెంచుతామని చెప్పి మోసం చేశారని మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చిస్తోందని, పదేళ్ల తర్వాత కొత్తకార్డులను ఇచ్చిందని, ఇళ్లకు ఉచిత కరెంటు, రూ. 500 కే వంట గ్యాస్ సరఫరా చేస్తోందని చెబుతూ, జూబ్లీహిల్స్‌లో గెలిస్తే మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం వేలకోట్లు కొల్లగొట్టి యువతకు ఉద్యోగ, ఉపాధిని నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసి ఆదుకున్నామని, రానున్న కాలంలో మరిన్ని పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని సిఎం భరోసా ఇచ్చారు. పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు బిఆర్‌ఎస్ ఎంపిలు మద్దతు పలకడం చూస్తే కెసిర్ మోడీకి నమ్మకమైన మిత్రుడుగా ఉన్న సంగతి తెలుస్తోందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్‌కు ఎటిఎంగా ఉందని గతంలో ఆరోపించిన మోడీకి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణ జరిపి, సిబిఐ, ఇడిలతో విచారణ జరిపించాలని శాసనసభ తీర్మానించి కేంద్రానికి పంపినా, ఇకారురేస్‌లో అవినీతి జరిగినా మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కారుగుర్తుకు ఓటేస్తే కమలానికి ఓటేసినట్లేనని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ముస్లింల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఇది ముస్లింలను బుజ్జగించడమేనని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరరావు స్పందించారు. బిజెపి నేతలు కమలం గుర్తుకు ఓటేయాలని వారు కోరారు. జూబ్లీహిల్స్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నా ఆయన తెచ్చిన నిధులేమీ లేవని, కిషన్ రెడ్డి, కెసిఆర్ అభివృద్ధి నిరోధకులని రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్రం 2014- 23 మధ్య తెలంగాణకు 9 లక్షల కోట్ల నిధులిచ్చిందని, సిఎం అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొట్టడం మినహా పేదలకు చేసిందే లేదని కెటిఆర్ విమర్శించగా, చెరువుల ఆక్రమణలు తొలగించి నీటివనరులను అభివృద్ధి పరుస్తున్నామని, మూసీ ఆక్రమణలు తొలగించి నగరాన్ని నందనవనం చేస్తుంటే కెటిఆర్, హరీశ్ సహించలేకపోతున్నారని సిఎం విమర్శించారు. బోరబండ చౌరస్తాలో పిజెఆర్ విగ్రహం, అమీర్ పేట మైత్రీవనం కూడలిలో తెలుగుతేజం ఎన్‌టిఆర్ విగ్ర హం నెలకొల్పుతామని హామీ ఇచ్చి రేవంత్ వారి మన్ననలు పొందారు. జూబ్లీహిల్స్‌లో ఆధునిక ఐటిఐ, మహిళా కళాశాల నెలకొల్పుతామని, మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని చెబుతూ ఎలాగైనా హస్తం పార్టీ గెలుపుసాధించి తీరాలనే పట్టుదలతో సిఎం ప్రచారం సాగించారు. జూబ్లీహిల్స్‌లో సంపన్న వర్గాలు ఉన్నా పేద, మధ్య తరగతి వారే అధికం. బస్తీలు, మురికివాడలలో పారిశుద్ధ్య, మంచినీటి సరఫరా సరిగాలేకపోవడం, మురుగునీటి పారుదల సరిగాలేక నీరు రోడ్లపైకి రావడం, రోడ్లు గండ్లుపడి అధ్వానంగా, దుర్గంధం వేదజల్లడం ప్రజలను పీడిస్తున్న ప్రధాన సమస్యలు. రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయితే సమస్యలు తీరుతాయని మంత్రులు, అధికార పార్టీల నేతలు అంటున్నారు. ఉప ఎన్నికలో హస్తం పార్టీ ఓడితే సిఎం రేవంత్ పదవికి వెంటనే ముప్పులేకపోయినా అసమ్మతి పెరిగి, నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ నేతలు మళ్లీ అసమ్మతి కార్యక్రమాలు మొదలెడితే ఇబ్బందులు తప్పకపోవచ్చు. కెసిఆర్ ప్రచారానికి రాకపోగా, కనీసం కారుగుర్తుకు ఓటేయమని ప్రకటన చేయక పోవడం ఆ పార్టీ శ్రేణులకు కొంత నిరుత్సాహం కలిగించింది. ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రతిష్ఠకు పోటీగా భావిస్తున్నారు. మాగంటి సునీతపై బిఆర్‌ఎస్ సానుభూతి, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రభావం చూపితే హస్తం పార్టీ విజయం. పోటాపోటీగా ఉన్నందున ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో చూడాల్సిందే. పతకమూరు దామోదర్ ప్రసాద్ 94409 90381

మన తెలంగాణ 11 Nov 2025 6:10 am

కృష్ణాజిల్లా పోలీసుల హై అలర్ట్..

కృష్ణాజిల్లా పోలీసుల హై అలర్ట్.. కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఢిల్లీలో సంభవించిన పేలుళ్ల

ప్రభ న్యూస్ 11 Nov 2025 6:04 am

తనిఖీ సరే, బోధన ఎలా!

ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు శాశ్వతంగా తనిఖీ బృందాలు నియమించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. సుమారు 24 వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి 299 కమిటీలువేసి వాటిలో పాఠశాలల్లో బోధించి కనీసంగా పదేళ్ళ బోధనానుభవం కలవారిని శాశ్వతంగా తనిఖీ బృందాలుగా నియమిస్తారు.16,474 ప్రాథమిక పాఠశాలల తనిఖీకి 504 మంది ఉపాధ్యాయులతో 168 తనిఖీ బృందాలు, 3,100 మాధ్యమిక పాఠశాలలకు 105 మంది ఉపాధ్యాయులను 35 బృందాలుగా, 4,672 ఉన్నత పాఠశాల పర్యవేక్షణకు 864 మంది ఉపాధ్యాయులతో 96 పర్యవేక్షణా బృందాలు వెరసి 1473 మంది ఉపాధ్యాయులు శాశ్వతంగా మానెటరింగ్ ప్రక్రియలో వినియోగం చేస్తారు. ఇక ఈ తనిఖీ బృందాలలో నియమితులైన వారెవరూ ఇంకా వారివారి పాఠశాలల కెళ్ళి పాఠాలు చెప్పవలసిన పనిలేదు. అంటే 1473 పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనా సేవలు ఇంకా అందవని అర్థం. ఇక గత ముప్పైఏళ్ళుగా పాఠశాలల తనిఖీ అధికారులు అయిన మండల విద్యాశాఖ్య అధికారులు, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ పోస్టులు నింపకుండా విద్యాశాఖ చోద్యం చూస్తా ఉంది. అత్యంత కీలకమైన ఈ పాఠశాల తనిఖీ అధికారులు పోస్టులు నింపకపోగా తాత్కాలిక ప్రాతిపదికన ఇన్‌ఛార్జీలను వేసి చేతులు దులుపుకుంటున్నారు. నియమించిన ఈ తనిఖీ అధికారులు ఎప్పటిదాకా ఉంటారో, పోస్టు ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 634 మండల విద్యాశాఖ అధికారులు, 70 మంది జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, 33 మంది జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీకి అధికారికంగా ఉండగా, తాజాగా ఈ నియామకాల వల్ల విద్యాశాఖ సాధించేది ఏమీ ఉండదు? ఇంతకు ముందు అనుభవాలు మనకు ఉండనే ఉన్నాయి. సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో ఓ 30 ఏళ్ళ క్రితం మండల విద్యా వనరుల కేంద్రంలో ముగ్గురు ఉపాధ్యాయులు బృందాలను మండల రీసోర్స్ పర్సన్ లుగా నియమించి ఓ దశాబ్దం పాటు ప్రయోగం చేశారు. ఈ రీసోర్స్ పర్షన్ల నియామకం వలన ఎలాంటి అదనపు ప్రయోజనం చేకూరే లేదని, పైగా ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందని తిరిగి వారందరినీ వారివారి పాఠశాలకు పంపించి వేశారు. తనిఖీ బృందాలలో నియమితులైన వీరు ఉద్యోగ ధర్మం కంటే సొంతపనులపై తిరిగారనే విమర్శలు ఉన్నాయి. కొందరైతే సొంత వ్యాపారాలు ప్రారంభించారు. మరికొందరు ఉద్యోగ ధర్మం నిర్వర్తించాల్సిన సమయంలో సొంత పనులు చక్కబెట్టుకున్నానే ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే విద్యాహక్కు చట్టం -2009 వచ్చిన తర్వాత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతృత్వంలో ఒక సబ్జెక్టు నిపుణుల బృందంను వారంలో ఒకరోజు ఇతర పాఠశాలల తనిఖీకి వాడుకున్నారు. అయితే ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధానానికి కూడా మంగళం పాడారు. గత అనుభవాలు ఉండికూడా ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేయడం వలన విఫల ప్రయోగం కాదా? తెలంగాణ విద్యా శాఖ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఈ తనిఖీ బృందాలు నియామకం వలన మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ ఉప అధికారులకు ప్రత్యామ్నాయంగా మరో అధికార కేంద్రం అనధికారికంగా పెట్టారనే భావన, పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు తమ తోటి ఉపాధ్యాయులే, సమాన హోదాలో తమను తనిఖీ చేయడం ఏమిటి? అనే ఒక రకమైన ఆత్మనూన్యతకు గురయ్యేఅవకాశం ఉంది. ఇక తనిఖీ బృందాలకు టిఎ, డిఎల కోసం లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతచేస్తే చివరకు 60 శాతం విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలలు తనిఖీకి వీరికి అధికారం కల్పిస్తారా? లేదా? కేవలం 40 శాతం పిల్లలున్న ప్రభుత్వ పాఠశాలకే ఈ తనిఖీలను పరిమితం చేస్తారా? ఇలా చేసినట్లైతే అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ నియంత్రణ కనీసంగా లేని ప్రైవేటు పాఠశాల మానెటరింగ్‌కు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రైవేటు పాఠశాలల ప్రక్షాళన, నియంత్రణ అవసరం లేదా? అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన, కేవలం గణితం, సైన్స్ తప్ప మరో సబ్జెక్టుపై బోధన కేంద్రీకరించలేని ప్రైవేటు పాఠశాల తనిఖీ బాధ్యత ఎవరు చేపట్టాలి? ఇక విద్యాహక్కు చట్టం -2009 లోని నిబంధన 19 (1)హెచ్ ననుసరించి 2010 ఏప్రిల్ నుండి మన పరీక్షా విధానం సమూలమైన మార్పుకు గురైంది. సులభతరమైన, ఒత్తిడి లేని నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో తనిఖీ అధికారులు అవసరం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తరగతి గది మధ్య ఎప్పటికప్పుడు అత్యంత సులభతరంగా ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈ పునచ్ఛరణ అనుభవం నుండే అటు ఉపాధ్యాయుడు తన బోధనా అనుభవాలు స్థిరీకరణ జరుగుతుంది. మరోవైపు విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకొంటారు. ఎందుకో మన తెలంగాణ విద్యాశాఖ ఇసిసిఇ విధానాన్ని జీర్ణించుకున్నట్లు కనిపించడంలేదు. అందుకు తాజా ఉదాహరణ గత దశాబ్ద కాలంగా నడుస్తున్న పదవ తరగతి పరీక్షలలో గ్రేడులకు బదులు తిరిగి మార్కులు ప్రవేశపెట్టడం. తరగతి గది మూల్యాంకనం ప్రక్రియ అయిన నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అవుతుంది. పరీక్షలను చట్టబద్ధ స్థితి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మెప్పు కోసం గ్రేడుల నుండి మార్కుల వైపు మోగ్గు చూపిన వైనం స్పష్టంగా కనపడుతుంది. గతంలో మండల రీసోర్స్ పర్షన్ల నియామకాలు వలన తేలింది ఏమంటే చాలా చోట్ల ఎంఆర్‌పిలు తమ విధులు విస్మరించి సొంత పనుల వైపు మొగ్గారు. విద్యాశాఖ అధికారులకు దళారీ వ్యవస్థగా పని చేశారు. పాఠశాలలు తనిఖీలు చేయాల్సిన వీరు కాగితాలు స్వీకరించి, కాకి లెక్కలు, గణాంకాలు, నివేదికలు స్వీకరించే పరిస్థితి మాత్రమే ఉండేది. ఆ కాగితాలు కంప్యూటర్ కెక్కించడంపై సమీక్షలు తప్ప ఎలాంటి ప్రయోజనం ఒనగూడలేదు! కనుక తెలంగాణ విద్యాశాఖ పెద్ద సంఖ్యలో శాశ్వతంగా మానెటరింగ్ జట్టును నిర్మించేటప్పుడు గత అనుభవాలను తప్పనిసరిగా సమీక్షించుకోవాలసిన అవసరం ఉంది. తనిఖీ అధికారులు ఏర్పరిచే ముందు నమోదు క్షీణించిపోతున్న ప్రభుత్వ బడుల సంస్కరణ, పునర్వ్యవస్థీకరణ వైపు దృష్టి పెట్టడంతోపాటు, ప్రైవేటు పాఠశాలల వనరులలోపం, నిబంధనలు ఉల్లంఘన, ఫీజుల క్రమబద్ధీకరణ తదితర విషయాలు తనిఖీ చేసి చక్కదిద్దాల్సిన బాధ్యత విద్యాశాఖ పైన ఉంది. ఎన్. తిర్మల్ 94418 64514 

మన తెలంగాణ 11 Nov 2025 6:00 am

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అస్తమయం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అందెశ్రీ ఐదు సంవత్సరాలుగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి ఆయన బాత్రూంకు వెళ్లి కిందపడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన అందెశ్రీ కుటుంబసభ్యు లు ఆయన్ను వెంటనే సోమవారం ఉదయం 7.25 గంటలకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 15రోజులుగా అందెశ్రీ తీవ్రమైన రక్తపోటుతో ఇబ్బందులు పడుతున్నారని, నెలరోజులుగా బిపి మందులు వాడడం లేదని, రాత్రి భోజ నం చేశాక మాములుగానే వెళ్లి పడుకున్నారని, ఉదయం వెళ్లిచూసేసరికి కిందపడి ఉన్నారని అందెశ్రీ కుటుంబసభ్యులు తెలిపినట్లు గాంధీ వైద్యులు సునీల్ కుమార్ తెలిపారు. మా దగ్గరికి వచ్చేటపటికే ఆయన మృతిచెంది ఐదు నుంచి ఆరు గంట లు అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైద్యులు మృతదేహాన్ని అప్పగించిన తరువాత అం దెశ్రీ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలాపేటలోని ఆయన నివాసానికి తరలించారు. కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలాపేటలోని ఆయన నివాసానికి సోమవారం తండోపతండాలుగా వచ్చారు. అందెశ్రీ హఠాన్మరణంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సిఎం రేవంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, ఆ పార్టీ నేతలు కెటిఆర్, హరీశ్‌రావు పలువురు రాష్ట్ర మంత్రులు, బిజెపి అధ్యక్షుడు రాంచందర్‌రావు, వామపక్ష నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకూలింది: సిఎం అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మృ తి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని సిఎం రేవంత్ గుర్తు చేశారు. అందెశ్రీతో తరువాయి 8లో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్ర జా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రా ష్ట్ర గీతం కొత్త    (మొదటి పేజీ తరువాయి) స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సిఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపించాలని సిఎస్ రామకృష్ణా రావును ఆదేశించారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లను సమీక్షించాలని అధికార యంత్రాంగానికి సిఎస్ సూచించారు. నేడు అందెశ్రీ అంత్యక్రియలకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. అంత్యక్రియలకు సిఎం హాజరై ఆయన పార్ధీవ దేహానికి నివాళ్లు అర్పించనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు అందెశ్రీ అంతిమయాత్ర నిర్వహించనుండగా ఆ అంతిమయాత్రలో సిఎం పాల్గొననున్నారు. ఈ అంతిమయాత్రలో ఆప్తులు, అభిమానులు సైతం పాల్గొననున్నారు. రాష్ట్రీయ గీతంగా ‘జయజయహే తెలంగాణ’.. ప్రకృతి, తెలంగాణ ఉద్యమం, జానపద శైలిలో అందెశ్రీ అనేక పాటలు రాశారు. వాటిలో అందెశ్రీ కలం నుంచి వచ్చిన ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్రీయగీతంగా గుర్తించబడింది. ఈ గీతం రూపంలో అందెశ్రీ శాశ్వతంగా తెలంగాణ సమాజం నోట నిలిచిపోయారు. ఎర్ర సముద్రం సినిమాలో మనిషి మనస్థత్వం గురించి రాసిన పాట ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు’ సైతం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలోని ‘జన జాతరలో మన గీతం’ అనే పాట ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. దీంతో పాటు అందెశ్రీ రాసిన ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ పాట సైతం ఉద్యమం సమయంలో రోమాలు నిక్కబొడిచేలా చేసిన పాటగా నిలిచింది. ప్రకృతిపై ప్రేమతో అందెశ్రీ రాసిన ‘పల్లెనీకు వందనాలమ్మా’ పాట పల్లెల గొప్పదనాన్ని చెప్పే విధంగా ఉంటుంది. ఈ పాటను రసమయి బాలకిషన్ పాడారు. ‘గల గల గజ్జలబండి ఘల్లు చూడు’ అంటూ ఓరుగల్లును గొప్పగా వర్ణిస్తూ అందెశ్రీ రాసిన పాట, వీటితో పాటు ‘కొమ్మ చెక్కితే బొమ్మరా, ఎల్లిపోతున్నావా తల్లి, చూడు తెలంగాణ, అల్లంత దూరం చూడు, ఆడ బ్రతుకు’ అనే పాటలు ఎంతోమందిని కదిలించాయి. గొర్రెల కాపరిగా, కూలీగా పనిచేసి.... అందెశ్రీ 1994లోనే బ్రతకలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలోనే యలమంచి శేఖర్ సినిమాల్లో పాటలు రాసే అవకాశం కల్పించారని ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. తరువాత అందెశ్రీకి సినిమాల్లో విప్లవ పాటలు రాసే అవకాశం వచ్చింది. నారాయణమూర్తి నటించిన చాలా సినిమాలకు అందెశ్రీనే పాటలు రాశారు. ఆయన రాసిన బతుకమ్మ సినిమా పాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తున పైకి లేచేలా చేశాయి. అందెశ్రీ ప్రపంచంలోని మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైలునది లాంటి నదుల వెంట ప్రయాణిస్తూ నదులపై కవిత్వం రాసేందుకు ప్రపంచం అంతా తిరిగారు. తన పాటలకు, రచనలకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. అనాథగా ఎన్నో కష్టాలను అనుభవించి గొర్రెల కాపరిగా, కూలీగా పనిచేసి కవిత్వంతో డాక్టరేట్ అందుకునే స్థాయికి ఎదిగారు. పాఠశాల చదువు లేకుండానే మేటి రచయితగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రకృతి, తెలంగాణ ఉద్యమం, జానపద శైలిలో అందెశ్రీ అనేక పాటలు రాశారు. బడికి వెళ్లకుండా బలపం దిద్దకుండానే అందెశ్రీ సాహితీప్రపంచంలో అడుగుపెట్టి గొప్పస్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆయన మరణం తెలంగాణ కవితాలోకానికి తీరనిలోటుగా మిగిలింది. అసలు పేరు అందె ఎల్లయ్య 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయనకు చదువుకునే అవకాశం కూడా దక్కలేదు. ఆయన జీవితం గొర్లకాపరిగా ప్రారంభమయ్యింది. ఒకరోజు ఆయన పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ చేరదీయడంతో అతడి జీవితం కీలక మలుపు తిరిగింది. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం ‘మాయమైపోతున్నడమ్మా’ పాటతో ప్రజల్లో విశేషమైన పేరును అందెశ్రీ సంపాదించుకున్నారు. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన సినీ రంగానికి సేవలందించారు. 2006లో వచ్చిన గంగ సినిమాకు గాను అందెశ్రీకి నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అందెశ్రీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇటీవల అందెశ్రీకి రూ.కోటి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. నూతన గృహం పూర్తి కాకముందే.... ఎంతో ఇష్టంతో నిర్మించుకుంటున్న నూతన గృహం పూర్తి కాకముందే అందెశ్రీ మృతిచెందారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీ ఎన్‌ఎఫ్‌సినగర్‌లో అందెశ్రీ కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. మృతిచెందే ముందు రోజు నవంబర్ 09 వ తేదీ సాయంత్రం వరకు అందెశ్రీ అక్కడే ఉన్నారు. సాయంత్రం వరకు ఇల్లు నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. ఎన్‌ఎఫ్‌సి నగర్‌లోని 348 గజాల్లో జి+3 పెంట్ హౌస్‌ను అందెశ్రీ నిర్మించుకుంటున్నారు.

మన తెలంగాణ 11 Nov 2025 5:30 am

నేడే జూబ్లీ ఫైట్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం మొ త్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పో లింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పో లింగ్ జరుగనుంది. సాయంత్రం 6 గంట ల లోపల కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్క ఓట రు.. ఎంత రాత్రి అయినా ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నిక కోసం 2,394 ఇవిఎంలు, 595 వీవీప్యాట్లు, 561 కం ట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇవిఎంలలో సమస్య వస్తే వెంటనే సరిచేయడానికి పెద్ద ఎత్తున ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు. ఉప ఎన్నికకు 139 ప్రాంతాలలో 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయా కేంద్రాలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక లో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ని ర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలతో పా టు వికలాంగులు, వృద్ధులకు వీల్ ఛైర్లనూ ఏర్పా టు చేస్తున్నారు. తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణతో పాటు ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టింది. మొత్తం ఓటర్లు 4,01,365 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లుండగా.. అందులో 2,08,561 మంది పురుషులు.. 1,92,779 మంది మహిళలు.. ఇతరులు 25 మంది ఉన్నారు.18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు 6,859 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6,053 మంది 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన హోమ్ ఓటింగ్‌లో దరఖాస్తు చేసుకున్న 103 మంది తమ హక్కు వినియోగించుకున్నారు. 58 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా 1,761 మంది రాష్ట్ర పోలీసులు, 8 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 45 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, 4 వీడియో సర్వలెన్స్ టీమ్‌లు, 4 వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, రెండు అకౌంటింగ్ బృందాలు పని చేయనున్నాయి. 68 కేంద్రాల వద్ద సిఆర్‌పిఎఫ్‌తో భద్రత : సిఇఒ సుదర్శన్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిఆర్‌పిఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎన్నికలో మొదటిసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 24 గంటలపాటు అందుబాటులో ఉండే కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు 1950 నెంబర్ ఫోన్ చేసిన ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ ఎన్నిక కోసం 2060 మంది ఎన్నికల సిబ్బంది, 2000 మంది పోలీసు సిబ్బంది పనిచేయబోతున్నట్లు చెప్పారు. వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నిఘా పెడతామని తెలిపారు.

మన తెలంగాణ 11 Nov 2025 5:00 am

ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 11-11-2025

ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 11-11-2025

ప్రభ న్యూస్ 11 Nov 2025 1:00 am

బంగారం ధర మళ్లీ పెరుగుతోంది..

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలపడడం, పసిడికి డిమాండ్ తగ్గడం వల్ల అం తర్జాతీయ మార్కెట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం 4 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా ఉంది, ఇది క్రితం రోజు 1,22,020తో పోలిస్తే రూ.1,200 పెరుగుదలను చూసిం ది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 1,12,950గా ఉంది, ఇది క్రితం రోజు రూ.1,11,850తో పోలిస్తే రూ.1,100 పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2500 పెరిగి రూ.1,55,000కు చేరుకుంది. క్రితం రోజు ఇది రూ. 1,52,500గా ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) తెలిపింది. వే2వెల్త్ బ్రోకర్స్ రీసెర్చ్ అనలిస్ట్ అభిషేక్ ఎం పెలు ప్రకారం, ఎంసిఎక్స్ గోల్డ్ ప్రస్తుతం కన్సాలిడేషన్ జోన్‌లో ఉందని, తక్షణ నిరోధకం రూ.1,22,145 వద్ద, మద్దతు రూ.1,19,150 వద్ద ఉంది. బంగారం ధరలు బలహీన ధోరణిలోనే ఉన్నందున ట్రేడర్లు రూ.1,21,630 వద్ద అమ్మకాలు పరిగణించవచ్చు అని ఆయన అన్నారు. ఐసిఐసిఐ డైరెక్ట్ విశ్లేషణ ప్రకారం, ఎంసిఎక్స్ గోల్డ్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,20,000 స్థాయి పైన ఉంటే రూ.1,22,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా ఎంసిఎక్స్ సిల్వర్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,46,000 పైన ఉంటే రూ.1,50,000 వరకు జంప్ చేసే అవకాశం ఉంది. నిర్మల్ బాంగ్ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక బలహీనత, గవర్నమెంట్ షట్‌డౌన్‌పై అనిశ్చితి వల్ల గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. ఐసిఐసిఐ డైరెక్ట్ రీసెర్చ్ ప్రకారం, స్పాట్ గోల్డ్ 4,080 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక మందగమనం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారానికి మద్దతు ఇస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.

మన తెలంగాణ 11 Nov 2025 12:54 am

‘పాంచ్ మినార్’ వచ్చేది అప్పుడే

రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. సోమవారం మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. రాజ్ తరుణ్, అజయ్ ఘోష్, రాశి సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మన తెలంగాణ 11 Nov 2025 12:49 am

లోపాలు సరిదిద్దుకోవాల్సిందే: ప్రధాన కోచ్ గంభీర్

ముంబై: రానున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో జట్టు సభ్యులు తమ లోపాలను సరిదిద్దు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్‌నకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలివుందని, ఇలాంటి స్థితిలో ప్రతి ఆటగాడు వైఫల్యాలపై దృష్టి సారించాల్సిందేనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ ఆట తీరు తనను ఆందోళన గురి చేసిందన్నాడు. ఇలాంటి ఆటతో వరల్డ్‌కప్ వంటి మెగా ట్రోఫీని సాధించడం చాలా కష్టమైన అంశమన్నాడు. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్ లేమీతో బాధపడుతున్నారన్నాడు. అంతేగాక చాలా మంది క్రికెటర్లు పూర్తి ఫిట్‌నెస్‌తో లేరన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్ కలవరానికి గురి చేస్తుందన్నాడు. ప్రపంచకప్ కోసం పూర్తిగా సన్నద్ధమవ్వాలని, ఫిట్‌నెస్ పరంగా సిద్ధంగా ఉండాలని గంభీర్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ ఆటగాళ్లతో మాట్లాడిన వీడియో క్లిప్‌ను బిసిసిఐ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో గంభీర్ టీమిండియా సభ్యులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. అంతేగాక కొంత మంది కీలక ఆటగాళ్ల ఆట తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గంభీర్ వీడియో వైరల్‌గా మారింది.

మన తెలంగాణ 11 Nov 2025 12:33 am

మంగళవారం రాశి ఫలాలు (11-11-2025)

మేషం బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృషభం నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. మిధునం ఉద్యోగాలలో అనుకూల వాతావరణంఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసివస్తాయి. వ్యాపారాలు అనుకులిస్తాయి. కర్కాటకం స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం. సింహం వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కన్య స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తుల కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృశ్చికం మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ధనస్సు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరో భాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మకరం ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. కుంభం వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీనం ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  

మన తెలంగాణ 11 Nov 2025 12:10 am

ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు

అందెశ్రీకి సీపీఐ ఘన నివాళివిశాలాంధ్ర- హైదరాబాద్‌: కవి, నంది అవార్డు గ్రహీత అందెశ్రీ మృతి తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని, ఆయన మృతి కళారంగానికి తీరని లోటని సీపీఐ ప్రముఖులు పేర్కొన్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా ప్రకటించిం దన్నారు. అది కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. మనిషి గురించి ఆయన రాసిన పాట కళ్లకు కట్టినట్టు చూపించారని […] The post ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 11:44 pm

ఎర్రకోట వద్ద భారీ పేలుడు

. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని. ఆగి ఉన్న రెండు కార్లలో వరుస పేలుళ్లు. పేలుడు ధాటికి అనేక వాహనాలు ధ్వంసం. మెట్రో స్టేషన్‌ గేట్‌`1 పార్కింగ్‌లో ఘటన. దిల్లీ సహా అనేక నగరాల్లో హైఅలర్ట్‌. దర్యాప్తునకు హోంమంత్రి అమిత్‌షా ఆదేశం న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో భారీ పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన రెండు కార్లలో వరుస పేలుళ్లు సంభవించగా… పెద్ద ఎత్తు మంటలు ఎగిసిపడి పక్కనున్న వాహనాలకు […] The post ఎర్రకోట వద్ద భారీ పేలుడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 11:38 pm

భారీగా పేలుడుపదార్థాలు స్వాధీనం

శ్రీనగర్‌: ఉగ్రనిరోధక చర్యల్లో జమ్మూకశ్మీర్‌ పోలీసులు భారీ విజయం సాధించారు. హర్యానా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్‌ గుట్టురట్టు చేశారు. నిషేధిత జైషే మహమ్మద్‌, అన్సార్‌ ఘజ్‌వత్‌-ఉల్‌-హింద్‌ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు ఉన్నారు. పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌ పోలీసు ప్రతినిధి వెల్లడిరచిన వివరాల ప్రకారం ‘అక్టోబరు […] The post భారీగా పేలుడుపదార్థాలు స్వాధీనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 11:31 pm

అభిషేక్ అద్భుత క్రికెటర్.. కెవిన్ పీటర్సన్ ప్రశంసలు

లండన్: టీమిండియా యువ సంచలనం, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. టి20 ఫార్మాట్‌లో అభిషేక్‌ను మించి ఓపెనర్ ఎవరూ లేరని పేర్కొన్నాడు. పొట్టి క్రికెట్‌లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడన్నాడు. ఎంత పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా అతనికుందన్నాడు. రానున్న రోజుల్లో వన్డేల్లోనూ అతను మెరుగైన ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదన్నాడు. అతి చిన్న వయసులోనే అభిషేక్ అగ్రశ్రేణి ఓపెనర్‌గా ఎదగడం టీమిండియాకు అతి పెద్ద ఊరట అని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో అతను టి20 ఫార్మాట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవడం ఖాయమన్నాడు. అతని బ్యాటింగ్ తీరు ఎంతో ఆకట్టుకుంటుందన్నాడు. భారత్‌కు లభించిన అత్యుత్తమ ఓపెనర్లలో అభిషేక్ ఒకడని, అతనికి ఎంతో భవిష్యత్తు ఉందని పీటర్సన్ పేర్కొన్నాడు.

మన తెలంగాణ 10 Nov 2025 11:24 pm

అసైన్డ్‌ భూములకు రెక్కలు

. బదిలీల నిషేధం చట్ట సవరణకు గ్రీన్‌ సిగ్నల్‌. లక్ష కోట్ల ఎస్‌ఐపీబీ పెట్టుబడులకు ఆమోదం. పార్టీ కార్యాలయాల లీజు 99 ఏళ్లకు పొడిగింపు. ఉండవల్లి వద్ద మరో పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం. ఏపీపీఎఫ్‌సీఎల్‌కు 5 వేల కోట్ల రుణం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రెవెన్యూ శాఖలో 1977 నాటి అసైన్డ్‌ భూముల బదిలీల నిషేధం బిల్లును సవరించడానికి మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ […] The post అసైన్డ్‌ భూములకు రెక్కలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 11:23 pm

రూ.6,384 కోట్ల నష్టం

. రూ.901 కోట్ల తక్షణ సాయం. కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. 6 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన విశాలాంధ్ర – సచివాలయం: మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వల్ల రూ.6384 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తుపాన్‌ వల్ల వాటిల్లిన […] The post రూ.6,384 కోట్ల నష్టం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 11:17 pm

సిద్ధరామయ్యకు హైకమాండ్ ఝలక్.. సిఎం మార్పుపై జోరుగా ప్రచారం

న్యూఢిల్లీ : కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధమైందా? డిప్యూటీ సిఎం డికె శివకుమార్ వరుస హస్తిన పర్యటనలు దేనికి సంకేతం. ఢిల్లీకి వస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకమాండ్ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వకం పోవడం వెనక ఏం దాగుంది. ఇదంతా ఎలాంటి పరిణామాలకు తావివ్వబోతోందన్న చర్చ కర్నాటకలో మళ్లీ జోరందుకుంది. ఇదంతా నాయకత్వ మార్పు దిశగానే వెళ్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధరామయ్య తమను కలిసేందుకు అధిష్టానంలోని ప్రముఖులు మొహం చాటేశారని జాతీయ మీడియా కథనాలు వెలువరించడం, ఈ నెలాఖరులో ఆ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కూడా ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఒక పుస్తకావిష్కరణ కోసం సిద్ధరామయ్య ఢిల్లీ రావాల్సి ఉందని, అదే సమయంలో హై కమాండ్‌లోని కీలక నేతలను కలిసేందుకు అపాయింట్‌టమెంట్ కోరినట్లు తెలిసింది. అయితే దానికి వారు ససేమిరా అనడమే కాకుండా ఇప్పుడు అలాంటివేమీ వద్దని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఇక ఓటు చోరీ అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తరచూ డికె శివకుమార్ చెబుతున్నప్పటికీ అవి నమ్మశక్యంగా లేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య, డికె శివకుమార్ సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. అయితే చివరికి సీనియర్ అయిన సిద్ధరామయ్యవైపే అధిష్టానం మొగ్గు చూపింది. డికె శివకుమార్‌ను బుజ్జగిస్తూనే ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంపకాలు చేసినట్లు, తదనుగుణంగా ఒప్పందం కుదర్చినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ సమయం రావడంతో మళ్లీ సిఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది. 

మన తెలంగాణ 10 Nov 2025 11:15 pm

ఇంచార్జ్‌ మంత్రులదే బాధ్యత

విశాలాంధ్ర-సచివాలయం : కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పులు చేస్తే ఇంచార్జ్‌ మంత్రులు బాధ్యత తీసుకొని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు మంత్రులతో కూటమి నేతల తీరుపై చర్చించారు. పార్టీ, ప్రభుత్వ ఇమేజ్‌కు దెబ్బ తగలకుండా ఎమ్మెల్యేల తీరును నివారించాలని సూచించారు. ఎమ్మెల్యేల చర్యలు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ప్రశ్నిస్తూ… ఈ విషయమై […] The post ఇంచార్జ్‌ మంత్రులదే బాధ్యత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 11:08 pm

ఢిల్లీ పేలుడుపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు : అమిత్‌షా

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడుపై అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఈ సంఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. “సాయంత్రం దాదాపు 7 గంటల ప్రాంతంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ కారులో పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సంఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు పాదచారులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ , ఫోరెన్సిక్ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సమీపం లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశించాం. ఢిల్లీసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ఛార్జితో మాట్లాడాను. వారు ప్రస్తుతం సంఘటన స్థలంలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో సమగ్రదర్యాప్తు నిర్వహిస్తాం. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం” అని అమిత్ షా తెలిపారు.

మన తెలంగాణ 10 Nov 2025 11:01 pm

అంతర్రాష్ట ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టు రట్టు...

న్యూఢిల్లీ : హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్‌వత్‌ఉల్‌హింద్ ఉగ్రవాద సంస్థలతో అత్యంత సబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వైద్యుల్లో జమ్ముకశ్మీర్ లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్, లఖ్‌నవూకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ ఉన్నారు. షహీన్ లక్నో లోని లాల్‌బాగ్‌కు చెందినది. ఆమెకు చెందిన కారును డాక్టర్ ముజమ్మిల్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఆ కారు నుంచి రైఫిల్, తూటాలు పట్టుబడ్డాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అల్ ఫలాహ్ యూనివర్శిటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీకి 45 కిమీ దూరంలో హర్యానా లోని ధోజ్‌లో ఈ యూనివర్శిటీ ఉంది. ప్రైవేట్‌గా నడుపుతున్న ఈ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉంది. ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంపై ఆదివారం రాత్రి దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లో జేషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులో కూడా ముజమ్మిల్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఆయన నుంచి 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఫరీదాబాద్ పోలీస్ కమీషనర్ సతేందర్ గుప్తా వెల్లడించారు. అది ఆర్‌డిఎక్స్ కాదని, కానీ అమోనియం నైట్రేట్ కావచ్చని చెప్పారు. ఇవి కాక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికి 20 టైమర్లు, బ్యాటరీలతో నాలుగు టైమర్లు, ఐదు కిలోల మెటల్, వాకీ టాకీ సెట్, బ్యాటరీలు, రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మరో 83 తూటాలు, 8 తూటాలతో ఉన్న పిస్టోలు, రెండు ఖాళీతూటాలు, స్వాధీనం అయ్యాయన్నారు. 8 పెద్ద సూట్‌కేసులు, నాలుగు చిన్న సూట్‌కేసులు, బకెట్ ధౌజ్ లోని ఆయన గది నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్‌లో అరెస్టు కాగా, మరో నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్‌పూర్ నుంచి జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ గుప్తా వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీస్ అధికార ప్రతినిధి వివరాల ప్రకారం అక్టోబర్ 19న శ్రీనగర్ లోని బన్‌పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలను లక్షం చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. దర్యాప్తులో ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెసర్‌తోకూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగు చూసింది. పాకిస్థాన్ తదితర దేశాల నుంచి పనిచేసే ఉగ్రమూకలతో వీరికి సంబంధాలు ఉన్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో వీరు నిధులు సేకరించడం, తీవ్ర వాద భావజాలాన్ని పేరేపించడం, ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం తదితర కార్యకలాపాలు సాగిస్తున్నారని బయటపడింది. భద్రతా దళాలు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం ఈ ముఠా చర్యల్లో భాగంగా ఉంటోంది. ఆయుధాల చట్టం లోని సెక్షన్లు 7,25 కింద, చట్టవిరుధ్ధ కార్యకలాపాల నివారణ ఉపా చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

మన తెలంగాణ 10 Nov 2025 10:34 pm

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లీ నర్సాగౌడ్ అనే గీతా కార్మికుడు తాటి చెట్టుపై నుండి పడి మరణించాడు. సోమవారం ప్రతి రోజులాగానే కల్లు తీయడానికి చెట్టు ఎక్కి గీత గీస్తుండగా చెట్టుపై నుండి పడి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె వున్నారు. అందరితో కలుపుగోలుగా వుండి తన పని చేసుకునే నర్సాగౌడ్ మృతి గ్రామస్తులను కలిచివేసింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 10 Nov 2025 10:30 pm

చేయని నేరానికి కేసు పెట్టి వేధింపులు.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య?

మన తెలంగాణ/మానకొండూర్: చేయని నేరాన్ని తనపై మోపి, తనను వేధింపులకు గురి చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించి చితకబాదారని, మనస్థాపానికి గురైన ఓ యువకుడు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఎలుకల మందు తాగాడు. మృతుక్షి బంధువులు,గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన ఇల్లందుల కిషోర్(24)అనే యువకుని తండ్రి ఉపాధి నిమిత్తం గతంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు వలస వెళ్ళాడు.లక్ష్మయ్య దంపతులకు కిషోర్,వెంకటలక్ష్మి జన్మించారు.మృతుడు కిషోర్ తన తల్లితో కలిసి అమ్మమ్మ గ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని తిమ్మక్కపాలెం(బుల్లవారి పాలెం)లో జీవిస్తున్నారు.వారం రోజుల క్రితం ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజిలో పని చేస్తున్న సర్వేష్ అనే లెక్చరర్ కిషోర్ పై దొంగతనం మోపి డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు.అంతే కాకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాది పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించినట్లు కిషోర్ ఆరోపంచారు.లెక్చరర్ వేధింపు గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.దీంతో మనస్థాపానికి గురైన కిషోర్ కూల్ డ్రింక్స్ లో ఎలకల మందు కలుపుకొని తాగి అపస్మారకస్థితికి చేరుకోగా,స్థానికులు చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.4 రోజులపాటు చికిత్స పొంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.తన మృతికి కారణమైన ప్రైవేట్ లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మృతుడు కిషోర్ సెల్ఫీ వీడియోలో అధికారులను కోరాడు. కిషోర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విజయవాడ నుండి మృతదేహాన్ని స్వగ్రామం వెల్ది తీసుకువచ్చి సోమవారం అంతక్రియలు నిర్వహించారు.కిషోర్ కబడ్డీ క్రీడలో రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నట్లు బంధువులు తెలిపారు.మృతుని తండ్రి లక్ష్మయ్య గతంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మన తెలంగాణ 10 Nov 2025 9:54 pm

స్కూల్ బస్సును తప్పించబోయి బోల్తా పడ్డ లారీ

 రెండు తెలుగు రాష్ట్రాలలో వరుస బస్సు ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులు ఒకవైపు, బస్సు ప్రమాదాలతో విషాద ఛాయలు చోటు చేసుకుంటున్న వేళ అధికారులు ప్రమాదాల నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నప్పటికీ ,వాహన డ్రైవర్ల నిర్లక్షంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, సంబంధిత అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదాలకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం హైద్రాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై లింగోటం వద్ద జరిగిన సంఘటనలో లారీ డ్రైవర్ సమయస్ఫూర్తితో విద్యార్థులకు ప్రాణహాని తప్పింది.లింగోటం వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టకుండా లారీ డ్రైవర్ దారిమళ్లించడంతో , లారీ అక్కడే బోల్తా పడగా,లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ వ్యవహరించిన తీరుతో సుమారు 15మంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.మహారాష్ట్రనుండి ఉల్లిగడ్డ లోడ్‌తో లారీ హైద్రాబాద్ మీదుగా విజయవాడ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించి,విద్యార్థులకు ప్రాణ హాని కాకుండా కాపాడింనందు నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతి కుమార్‌తోపాటు పలువురు అధికారులు లారీ డ్రైవర్‌ను అభినందించారు.గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు జాతీయ రహదారిపై గట్టి నిఘా పెట్టాలని,నిబంధనలు ఉల్లంఘిచిన వాహనాల డ్రైవర్లు,యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ 10 Nov 2025 9:33 pm

Fact Check: Viral Claim of Hindu Student Suspended in Kerala for Wearing Ayyappa Mala Is Misleading

Social media posts falsely claim that a Hindu student in Kerala was suspended for wearing an Ayyappa mala

తెలుగు పోస్ట్ 10 Nov 2025 9:32 pm

Fact Check: Fake Telugu Newspaper Clippings Target Naveen Yadav and Konda Sushmita Ahead of Jubilee Hills By-Election

Viral newspaper clippings about Naveen Yadav, Konda Sushmita, and Jubilee Hills by-election are fake

తెలుగు పోస్ట్ 10 Nov 2025 9:31 pm

అమెరికాలో ఎపి విద్యార్థిని మృతి

 అమెరికాలో ఎపికి చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నవంబర్ 7న యార్లగడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది. యార్లగడ్డ రాజ్యలక్ష్మి టెక్సాస్‌లోని ఎ అండ్ ఎమ్ యూనివర్సిటీ-కార్పస్ క్రిస్టి నుంచి పట్టభద్రు రాలు. అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. నవంబర్ 7వ తేదీన నిద్రలోనే ఆమె చనిపోయిన ట్లుగా తెలుస్తోంది. ఉదయాన్నే లేపగా మేల్కోకపోవడంతో స్నేహితులు గుండెలు బాదుకుంటూ ఏడ్చేశారు. రెండు, మూడు రోజులగా తీవ్రమైన ద గ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతుందని బంధువు చైతన్య వెల్లడించారు. ఇక మృతదేహాన్ని ఎపికి పంపించేందుకు చైతన్య టెక్సాస్‌లో నిధులు సేకరిస్తు న్నారు. రాజ్యలక్ష్మిది ఆంధప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కర్మెచెడు గ్రామం. తల్లిదండ్రులు అన్నదాతలు. ఎన్నో కలలతో అమెరికాకు పంపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఆమె మరణానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అక్కడి అధికారులు శవపరీక్ష నిర్వహిస్తున్నారు .

మన తెలంగాణ 10 Nov 2025 9:24 pm

అల్లుడి కిరాతకం

గొల్లల కోడేరులో భార్య సహా ముగ్గురికి కత్తిపోట్లు ( భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో)

ప్రభ న్యూస్ 10 Nov 2025 9:22 pm

తిరుమలలో నాన్ వెజ్ తింటూ దొరికిన ఇద్దరు టీటీడీ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది

ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్ని నిబంధనలు తెలిసిన టిటిడి సిబ్బందే అపచారం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇద్దరు టిటిడి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాంసాహారం తింటుండగా భక్తులు ప్రశ్నించారు. ఆ సిబ్బంది తప్పు ఒప్పుకోకపోగా తిరిగి బెదిరింపు ధోరణిలో వ్యవహరిం చడంతో భక్తులు ఆగ్రహం కనబర్చారు. అలిపిరి మార్గంలో నాన్ వెబ్ తిన్నారన్న ఆరోపణలతో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టిటిడి పేర్కొంది. ఈ విషయంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై కఠిన చర్యలు తీసుకున్నామని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. టిటిడి ఫిర్యాదుతో ఎపి ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. టిటిడి నిబంధనల మేరకు తిరుమల పరిధిలో మాంసాహారం, మద్యం, పొగాకు వినియోగం పూర్తిగా నిషేధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని టిటిడి స్పష్టం చేసింది. కాగా, అలిపిరిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కొంత మంది భక్తులు తిరుమలకు మాంసాహారాన్ని తీసుకొచ్చి తింటూ దొరికిపోయారు. మార్చిలో ఇద్దరు వ్యాపారులు మద్యం, గంజాయి తిరుమలకు తరలిస్తూ పట్టుబడ్డారు. అప్పటి నుంచి టిటిడి అధికారులు అలిపిరి వద్ద తనిఖీలను తీవ్రతరం చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

మన తెలంగాణ 10 Nov 2025 9:20 pm

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ లో హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ తోపాటు దేశంలోని ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా వంటి ప్రధాన నగరాల్లో కేంద్రహోంశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో హైదరాబాద్ లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని నగర సిపి సజ్జనార్... ప్రజలకు సూచించారు.  కాగా, ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని  8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. తర్వాత NIA, NSG టీమ్స్‌ ప్రమాదస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన కారులో పేలుడు సంభవించినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీతోపాటు హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఆరా తీస్తున్నారు.

మన తెలంగాణ 10 Nov 2025 9:14 pm

Terror Strikes the Capital: Deadly Car Blast Near Delhi’s Red Fort

Delhi witnessed a tragic evening on Monday as a massive car explosion near the historic Red Fort claimed several lives and left many injured. The blast, which occurred around 6:45 pm near Gate No. 1 of the Lal Quila Metro Station, sent shockwaves across the national capital and raised fears of a possible terror attack. […] The post Terror Strikes the Capital: Deadly Car Blast Near Delhi’s Red Fort appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 9:14 pm

Fresh Twist in Jagan Mohan Reddy’s Assets Case

A new development has surfaced in the long-running disproportionate assets case involving former Andhra Pradesh Chief Minister and YSR Congress Party chief Y.S. Jagan Mohan Reddy. The case, which has been under trial for years, has once again drawn attention after Jagan sought permission from the CBI court to travel to Europe. The court permitted […] The post Fresh Twist in Jagan Mohan Reddy’s Assets Case appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 9:13 pm

Tamannaah hits back on Trolls over Weight Loss

It is like a second innings for Tamannaah Bhatia and the Milky Beauty is occupied with work in Bollywood. She has been picking up glamorous roles, item numbers and is doing steamy romantic scenes in web series. The actress who gained weight a few months ago returned back in a slim look. There are speculations […] The post Tamannaah hits back on Trolls over Weight Loss appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 9:11 pm

కల్తీ సూత్రధారి అతడే

రూ.250 కోట్లు బుక్కేశారు.. తిరుపతి లడ్డూపై సిట్​ నిర్ధారణ సిట్​ ఉచ్చులో సుబ్బారెడ్డి

ప్రభ న్యూస్ 10 Nov 2025 9:04 pm

Delhi : ఢిల్లీలో భారీ పేలుడు..పది మంది మృతి.. 24 మందికి గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్‌ సమీపంలో జరిగిన కారు పేలుడులో కుట్రకోణం కేసులో దర్యాప్తు చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:51 pm

శివ కేవలం నాగార్జున కోసం తీసిన సినిమా:రామ్ గోపాల్ వర్మ

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను బిఫోర్ శివ, ఆఫ్టర్ శివగా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4కె డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “శివకి ఇంత ఆదరణ కల్టి ఫాలోయింగ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రాము అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ శ్రద్ధ తీసుకుని చేశాడో రీ రిలీజ్ కోసం కూడా గత ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుందని అంటున్నారు. నేను సినిమా చూసి కొత్తగా ఫీలయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. రాము ‘శివ’తో సినిమాని ఇలా కూడా తీయొచ్చని చూపించారు. నేను కూడా చాలాసార్లు ఎందుకు ఇది కల్ట్ సినిమా అయిందని భావిస్తుంటాను. సమ్‌థింగ్ మ్యాజిక్ జరిగింది. సినిమాని చాలా ఇష్టపడి చేశాం. శివ అందమైన అనుభవాన్నిచ్చింది. నేను అప్పటికే 8 సినిమాలు చేశాను. అయినప్పటికీ శివ అనేది నాకు షూటింగ్ పరంగా కూడా కొత్త అనుభవాన్నిచ్చింది”అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “శివ కేవలం నాగార్జున కోసం తీసిన సినిమా. -నాగార్జున క్యారెక్టర్ ఒక స్టూడెంట్. తను రౌడీ కాదు. కానీ ఒక సందర్భంలో తన చేతిలో ఆయుధం ఉండాలనుకున్నప్పుడు, అది సహజంగా ఉండాలి. అలా సైకిల్ చైన్ ఆలోచన వచ్చింది”అని తెలిపారు.

మన తెలంగాణ 10 Nov 2025 8:44 pm

సిపిఐ మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మహిళ మావోయిస్టు సభ్యురాలు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమవారం జిల్లా పొలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ లొంగుబాటు వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా పోలీసులు ఆదివాసీ ప్రజల అభివృది, సంక్షేమం కోసం చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్నా, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల గురించి తెలుసుకొని, మావోయిజాన్ని విడిచి ప్రశాంత జీవనం గడపాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టికి చెందిన మహిళా సభ్యురాలు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మడకం సోమి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. రాష్ట్రానికి చెందిన సభ్యురాలు ములుగు జిల్లా ఎసీ డా. శబరిష్ పి, ఐపిఎస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టుల దళ సభ్యురాలికి రూ. 25 వేలు ఆర్ధిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఇంచార్జ్ ఓఎస్డీ, డిఎస్పీ నలువాల రవిందర్, ఆర్‌ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Nov 2025 8:38 pm

థార్, బుల్లెట్ ఓనర్లు అలాంటి వాళ్ళే!!

హర్యానా డీజీపీ ఓపీ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:30 pm

టెస్లా అమ్మకాలు అంతంత మాత్రమే!!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌‌ లో పాగా వేయడానికి అమెరికన్ కంపెనీ టెస్లా ముందుకు వచ్చింది.

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:30 pm

సకాలంలో వైద్యం అందక గిరిజన మహిళ మృతి

గర్భస్రావం జరిగి సకాలంలో వైద్యం అందక ఓ గిరిజన మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండలంలో కుమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలంలోని చిచ్చుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల మారుమూల గ్రామం ఖాతిగూడకు చెందిన మడావి మారుబాయి (21)కి ఆత్రం సునీల్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఖాతిగూడలోని తన తల్లిగారి ఇంట్లోనే ఉంటూ దంపతులిద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న మారుబాయికి గత నాలుగు రోజుల క్రితం గర్భ స్రావం జరిగింది. ఇంట్లోనే గర్భస్రావం కాగా తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో సోమవారం మారుబాయి అస్వస్థతకు గురి కాగా 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. గుట్టపైన ఉన్న ఖాతిగూడ గ్రామానికి రోడ్డు మార్గం లేని కారణంగా చొపనూడ వద్దనే అంబులెన్స్ను నిలిపేశారు. కుటుంబ సబ్యులు కలిసి మారుబాయిని ఎత్తుకుని అంబెలెన్స్ వరకు తీసుకు వచ్చారు. అక్కడి నుంచి మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు ఆసిఫాబాద్కు తీసుకెళ్ళాల్సిందిగా సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మద్యాహ్నం మార్గ మద్యలో మృతి చెందింది. కాగా గత ఆగష్టు నెలలో మండలంలోని గోందాపూర్ గ్రామానికి చెందిన దేవబాయి అనే గిరిజన బాలింత సకాలంలో వైద్యం అందక రక్తహీనతతో మృతి చెందిన విషయం తెలిసిందే.. మూడు నెలలు గడవక ముందే మరో గిరిజన మహిళ సకాలంలో వైద్యం అందక మృతి చెందడం శోచనీయంగా మారింది. రహాదారి సౌకర్యం లేని కారణంగానే ఆంబులెన్స్. గ్రామం వరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. పర్యావసనంగా అత్యవసర సమయంలో వైద్యానికి నోచుకోలేక ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. |

మన తెలంగాణ 10 Nov 2025 8:29 pm

2900 కిలోల ఐఈడీ తయారీ పదార్ధాలు స్వాధీనం

హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్‌వత్‌ఉల్‌హింద్ ఉగ్రవాద సంస్థలతో అత్యంత సబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వైద్యుల్లో జమ్ముకశ్మీర్ లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్, లఖ్‌నవూకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ ఉన్నారు. షహీన్ లక్నో లోని లాల్‌బాగ్‌కు చెందినది. ఆమెకు చెందిన కారును డాక్టర్ ముజమ్మిల్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఆ కారు నుంచి రైఫిల్, తూటాలు పట్టుబడ్డాయి. హర్యానా లోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అల్ ఫలాహ్ యూనివర్శిటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీకి 45 కిమీ దూరంలో హర్యానా లోని ధోజ్‌లో ఈ యూనివర్శిటీ ఉంది. ప్రైవేట్‌గా నడుపుతున్న ఈ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉంది. ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంపై ఆదివారం రాత్రి దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లో జేషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులో కూడా ముజమ్మిల్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఆయన నుంచి 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఫరీదాబాద్ పోలీస్ కమీషనర్ సతేందర్ గుప్తా వెల్లడించారు. అది ఆర్‌డిఎక్స్ కాదని, కానీ అమోనియం నైట్రేట్ కావచ్చని చెప్పారు. ఇవి కాక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికి 20 టైమర్లు, బ్యాటరీలతో నాలుగు టైమర్లు, ఐదు కిలోల మెటల్, వాకీ టాకీ సెట్, బ్యాటరీలు, రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మరో 83 తూటాలు, 8 తూటాలతో ఉన్న పిస్టోలు, రెండు ఖాళీతూటాలు, స్వాధీనం అయ్యాయన్నారు. 8 పెద్ద సూట్‌కేసులు, నాలుగు చిన్న సూట్‌కేసులు, బకెట్ ధౌజ్ లోని ఆయన గది నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్‌లో అరెస్టు కాగా, మరో నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్‌పూర్ నుంచి జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ గుప్తా వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీస్ అధికార ప్రతిని ధి వివరాల ప్రకారం అక్టోబర్ 19న శ్రీనగర్ లోని బన్‌పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలను లక్షం చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. దర్యాప్తులో ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెసర్‌తోకూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగు చూసింది. పాకిస్థాన్ తదితర దేశాల నుంచి పనిచేసే ఉగ్రమూకలతో వీరికి సంబంధాలు ఉన్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో వీరు నిధులు సేకరించడం, తీవ్ర వాద భావజాలాన్ని పేరేపించడం, ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం తదితర కార్యకలాపాలు సాగిస్తున్నారని బయటపడింది. భద్రతా దళాలు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం ఈ ముఠా చర్యల్లో భాగంగా ఉంటోంది. ఆయుధాల చట్టం లోని సెక్షన్లు 7,25 కింద, చట్టవిరుధ్ధ కార్యకలాపాల నివారణ ఉపా చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

మన తెలంగాణ 10 Nov 2025 8:25 pm

క‌బ‌డ్డీ పోటీల్లో హోరాహోరీ…

క‌బ‌డ్డీ పోటీల్లో హోరాహోరీ… పినపాక, ఆంధ్రప్రభ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని

ప్రభ న్యూస్ 10 Nov 2025 8:25 pm

ఆన్ లైన్ లో అనుపమకు వేధింపులు

నటి అనుపమ పరమేశ్వరన్‌ కేరళ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:20 pm

పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు వ‌రం…

పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు వ‌రం… కడం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ

ప్రభ న్యూస్ 10 Nov 2025 8:17 pm

#SSMB29: ప్రమోషన్స్ రంగంలోకి హీరోయిన్ ప్రియాంక

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘#SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రివీల్.. నవంబర్ 15వ తేదీన రామోజీ ఫిలిమ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్‌లో జరగనుంది. ‘GlobeTrotter’ అనే పేరుతో జరిగే ఈ ఈవెంట్ కోసం మహేశ్ అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ ఈవెంట్ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ప్రియాంక చోప్రా రంగంలోకి దిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించి ప్రియాంక ఓ వీడియోని విడుదల చేసింది. ‘నేనెందుకు ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉంటున్నానో నవంబర్ 15న తెలుస్తోంది. మాతో జాయిన్ అవ్వండి. ఈ ఈవెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని ప్రియాంక వీడియో ద్వారా తెలిపింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి సోమవారం ఓ అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రం కోసం నటి శృతిహాసన్ పాడిన పాటను సైలంట్‌గా విడుదల చేసింది. చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ విడుదలైంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో నటిస్తున్నారని ఆయన ఫస్ట్‌లుక్‌లో పేర్కొన్నారు. ఇక నవంబర్ 15వ తేదీన జరిగే ఈవెంట్‌తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. She’s been everywhere And now @priyankachopra is here to tell you why this is the one event you can’t miss… #GlobeTrotter #GlobeTrotterEvent @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @thetrilight @JioHotstar pic.twitter.com/AZyfQBlO62 — Sri Durga Arts (@SriDurgaArts) November 10, 2025

మన తెలంగాణ 10 Nov 2025 8:15 pm

గొల్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

చేగుంట మండలం జేత్రాం తండా గొడుగుపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత కనిపించడంతో చుట్టు ప్రక్కల ప్రాంత తండాలో ప్రజలు ,మేకల కాపరులు భయాందోళనలో ఉన్నారు. చేగుంట మండలంలోని దౌల్తాబాద్ మండల శివారులోని అటవీ ప్రాంతంతో ఈ రోజు ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన వారు చిరుతను చూసి 100కు డయల్ చేయడంతో పోలీసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిరుత ఉందని తెలిసి చూడడానికి అటవికి కొంతమంది పశువుల, మేకల కాపరులు వెళ్లగా అటవీ అధికారులు ఎవరు ఉండకూడదని నిద్రలో ఉంది అదే లేచి వెళ్ళిపోతుంది లేదా పై అధికారులతో మాట్లాడి ఎమి చేయాలో చూస్తాం రెండు మూడు రోజులు ఇటు అడవిలో ఎవరు తిరుగ వద్దని తెలిపారు.

మన తెలంగాణ 10 Nov 2025 8:12 pm

ఎర్రకోటలో భారీ పేలుడు.. 8 మంది మృతి

పేలిన కారు బాంబు అనేక మందికి గాయాలు.. ఢిల్లీ సర్కారు హై అలెర్ట్​.

ప్రభ న్యూస్ 10 Nov 2025 8:12 pm

అయోధ్యలో భారీ రావణాసురుడి విగ్రహం

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాయణ థీమ్‌ పార్కు సిద్ధమవుతూ ఉంది.

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:10 pm

మధ్యాహ్న భోజనం వికటించి 17 మంది విద్యార్థులకు ఆస్వస్థత

 కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మరో పదిమంది కూడా వాంతులు అవుతున్నాయని తెలపడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తము జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పాఠశాల పంపించి చికిత్స అందించారు. పచ్చి పులుసు తీసుకోవడం వలన కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోఅస్వస్థతకు గురైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన పట్ల మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ హాస్టళ్లు,పాఠశాలల్లో భోజన నిర్వహణ ను ప్రభుత్వం గాలికొదిలేసినట్టు ఇటీవల జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలోనే ప్రభుత్వం , అధికార యంత్రాంగం హడావిడి చేయడం ఆ తర్వాత మర్చిపోవడమే ఇందుకు కారణమన్నారు. తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నప్పటికీ నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆస్పత్రిలో చేరిన 17 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు,పాఠశాలలను ప్రక్షాళన చేయాలని, నిరంతర బాధ్యతాయుత పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బాధితులను పరామర్శించిన వారిలో మాజీ మున్సిపల్ ఛైర్మెన్ రాజేశ్వర్ రావు, సొసైటీ ఛైర్మెన్ పొనగంటి సంపత్ మాజీ మున్సిపల్ సభ్యులు తదితరులు ఉన్నారు.

మన తెలంగాణ 10 Nov 2025 8:08 pm

చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ…

చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ… మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలో నూతనంగా

ప్రభ న్యూస్ 10 Nov 2025 8:08 pm

అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి స్టేషలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఆసౌకర్యం కలుగకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 715 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని దశలవారీగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి రోజు దాదాపు 1.97 లక్షల మంది సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తుంటారని తెలిపారు. 3 వేల మంది ప్రయాణికులు కూర్చునేలా 3 ఎకరాల్లో వెయిటింగ్ హాల్, క్యాంటీన్ వంటి సదుపాలు కల్పిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు మాదిరిగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నామని ఈ స్టేషన్‌కు నేరుగా మెట్రో అనుసంధానం చేపడుతున్నామని బస్ స్టేషన్‌కు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 26 లిప్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు సబ్‌స్టేషన్‌లు, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ సిస్టమ్‌లు స్టేషన్‌లో ఉంటాయన్నారు. రోజుకు 5 లక్షల మురుగునీటి శుద్ద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్టేషన్ పూర్తయితే ప్రతి రోజు 2.70 లక్షల మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బందులు కలుగకుండా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 1.65 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతున్నదని ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ స్టేషన్‌ను ప్రారంభించాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు రోడ్డు విస్తరణ పనులు చేయాలని ఎన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేయాలని, అలాగే చర్లపల్లి రోడ్డు కనెక్టివిటీని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి కావాల్సిన మద్దతు అందుతుందన్నారు. ఇప్పకిటే 50 శాతం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో సౌత్‌బ్లాక్ బేస్‌మెంట్, మల్లీలెవెల్ కారు పార్కింగ్, కాజీపేట వైపు పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, సౌత్ మెయిన్ బిల్డింగ్, నార్త్ మెయిన్ బిల్డింగ్, కవర్ ఓవర్ ప్లాట్‌ఫారం, హైదరాబాద్ వైపు పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. 

మన తెలంగాణ 10 Nov 2025 8:04 pm

Delhi : ఢిల్లీలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్‌ సమీపంలో సోమవారం సాయంత్రం కారు పేలుడు సంభవించింది

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:02 pm

వెలుగుల‌తో నిండిన ప‌వ‌ర్‌గూడ‌…

వెలుగుల‌తో నిండిన ప‌వ‌ర్‌గూడ‌… ఉట్నూర్/ జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:55 pm

కుటుంబంలో ఒక్కరికే పిఎం కిసాన్ సమ్మాన్ పథకం

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింస్తుందని కేంద్రం ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్‌లో స్పష్టం చేసింది. కేంద్రం లక్ష మంది రైతుల పేర్లను తొలగించడంపై వివరణ ఇచ్చింది. చాలా మంది రైతులు నిబంధనల ప్రకారం పథకానికి దరఖాస్తు చేయలేదని, అర్హత లేని వారు పథకానికి అప్లై చేస్తున్నారని, కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు వేరు వేరుగా పథకానికి దరఖాస్తు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది. ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదని, అర్హుల జాబితా నుంచి పేర్లు తొలగించిన రైతులకు భౌతికంగా విచారణ ప్రక్రియ ఉంటుందని, ఈ ప్రక్రియలో అర్హులయితే తిరిగి జాబితాలో నమోదు చేయడం, అనర్హులయితే పథకం వర్తించదని స్పష్టం చేసింది. కాగా, రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. సిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 20 విడతల్లో రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. గత ఆగస్టు నెలలో 2 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో పడ్డాయి. 21వ విడతకు సంబంధించిన డబ్బుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను సిఎం కిసాన్ సమ్మాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారంపై అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన విడుదల చేసింది.

మన తెలంగాణ 10 Nov 2025 7:52 pm

వారం రోజులు  ఊరించి..

అకస్మాత్తుగా పెరిగిన బంగారం ధర ( ఆంధ్రప్రభ, బిజినెస్​ డెస్క్) ​ మదుపుర్లకు

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:49 pm

భూములు ఇచ్చేది లేద‌ని…

భూములు ఇచ్చేది లేద‌ని… తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:48 pm

ముదిగుబ్బలో మూడు కిలోల గంజాయి స్వాధీనం – 14 మంది అరెస్ట్

విశాలాంధ్ర, ముదిగుబ్బ: ముదిగుబ్బ పోలీసు బృందం భారీగా గంజాయి విక్రయ, సేవించే వారిని పట్టుకొనడం ముదిగుబ్బ లో కలకలం రేపింది. ముదిగుబ్బ గ్రామ శివారులోని కాకతీయ హోటల్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పోలీసులు సోమవారం దాడి చేసి, గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను, గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ బి.హేమంత్‌కుమార్ తెలిపారు.ఈ పోలీసుల దాడిలో మొత్తం మూడు కిలోల గంజాయి మరియు ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నామని, ముదిగుబ్బ తహసీల్దార్ […] The post ముదిగుబ్బలో మూడు కిలోల గంజాయి స్వాధీనం – 14 మంది అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 7:45 pm

త‌ల్లి అనికూడా చూడకుండా…

కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం నర్సింహులపేట, ఆంధ్రప్రభ : కత్తితో ఓ వ్యక్తిని పొడుస్తుండగా

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:38 pm

సర్ ప్రైజ్.. #SSMB29 నుంచి శ్రుతిహాసన్‌ సాంగ్ రిలీజ్

దర్శకధీరుడు రాజమౌళి- సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘‘#SSMB29’’. నవంబర్ 15న ఈ మూవీ టైటిల్ తోపాటు వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం మేకర్స్, అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సిినిమాలో హీరోయిన్ శ్రుతిహాసన్ పాడిన పాటను కొద్దిసేపటిక్రితం రిలీజ్ చేశారు. ఈ ఆడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి.. అప్డేట్స్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి.. రామోజీ ఫిలీం సిటీలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మహేష్, హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు తదితరులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్ కు ముందే మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. గత శుక్రవారం ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘కుంభ’ అనే పాత్రలో కనిపించనున్న పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

మన తెలంగాణ 10 Nov 2025 7:37 pm

సాహితీ లోకానికి తీరని లోటు…

సాహితీ లోకానికి తీరని లోటు… మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రజాకవి, రాష్ట్రీయ గీతం

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:31 pm

20 రోజులలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం…

20 రోజులలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం… పెద్దపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:25 pm

Breaking : ఢిల్లీలో భారీ పేలుడు.. ఎర్రకోట సమీపంలో

ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఈ పేలుడు జరిగింది. ఒక కారులో ఈ పేలుడు జరిగినట్లు తెలిసింది.

తెలుగు పోస్ట్ 10 Nov 2025 7:25 pm

నవంబర్ 30 వరకు దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ 2025

దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ (DFC) 2025 తిరిగి వచ్చింది, ఇది నగరంలోని ప్రతి ఒక్కరూ చురుకుగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఫిట్‌నెస్‌ను జీవన విధానంగా మార్చడానికి స్ఫూర్తినిస్తుంది. 2025 నవంబర్ 1 నుండి 30 వరకు జరిగే ఈ తొమ్మిదవ ఎడిషన్, నివాసితులు , సందర్శకులను దుబాయ్ 30x30 ఉద్యమం- 30 రోజుల పాటు ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామానికి కట్టుబడి ఉండటం- లో చేరమని ఆహ్వానిస్తుంది. మీరు యోగా, సైక్లింగ్, రన్నింగ్, HIIT, స్విమ్మింగ్ లేదా పాడెల్‌లో ఉన్నా, DFC అందరికీ ఏదో ఒకటి అందిస్తుంది. విస్తృత శ్రేణిలో ఉచిత వ్యాయామాలు, గ్రూప్ సెషన్‌లు, వెల్‌నెస్ ఈవెంట్‌లను నగరం నిర్వహిస్తుంది. దుబాయ్ అంతటా ఫిట్‌నెస్ విలేజ్‌లు మరియు కమ్యూనిటీ హబ్‌లు నిపుణులైన శిక్షకుల నేతృత్వంలో వేలాది తరగతులను అందిస్తాయి. ప్రధాన ఈవెంట్‌లలో మై దుబాయ్ నిర్వహించే దుబాయ్ రన్ (నవంబర్ 23) - RTA ప్రదర్శించే దుబాయ్ స్టాండ్-అప్ ప్యాడిల్ (నవంబర్ 8–9) , దుబాయ్ యోగా (నవంబర్ 30) వంటివి వున్నాయి. అదనంగా, DFC 2025 దుబాయ్ ప్రీమియర్ పాడెల్ P1 (నవంబర్ 9–16), దుబాయ్ T100 ట్రయాథ్లాన్ (నవంబర్ 15–16), DP వరల్డ్ టూర్ ఛాంపియన్‌షిప్ (నవంబర్ 13–16), బేస్‌బాల్ యునైటెడ్ సీజన్ వన్ (నవంబర్ 25–26) మరియు ఐకానిక్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ దుబాయ్ రగ్బీ సెవెన్స్ (నవంబర్ 28–30) వంటి ప్రపంచ స్థాయి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను కూడా కలిగి ఉంటుంది. ఈ ప్రపంచవ్యాప్త కార్యక్రమాలు క్రీడ, ఆరోగ్యం మరియు వెల్నెస్‌కు ప్రధాన గమ్యస్థానంగా దుబాయ్ యొక్క పెరుగుతున్న ఖ్యాతిని నొక్కి చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన మీ కోసం మొదటి అడుగు వేయడానికి ఇది సరైన సమయం. మీరు నడిచినా, పరుగెత్తినా, సైకిల్ తొక్కినా, తెడ్డు వేసినా లేదా యోగా సాధన చేసినా - ప్రతి కదలిక లెక్కించబడుతుంది.

మన తెలంగాణ 10 Nov 2025 7:20 pm

అర్హులైన పేద‌ల‌కే ఇండ్లు….

అర్హులైన పేద‌ల‌కే ఇండ్లు…. కడం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:18 pm

నిరాశ వద్దు.. మహిళ క్రికెటర్లకు గవాస్కర్ సందేశం

భారత మహిళ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి భారీ ఎత్తున నగదు, బహుమానాలు ఇస్తామని చాలా సంస్థలు ప్రకటించాయి. అయితే ఈ విషయంపై టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వారికి ఓ సందేశాన్ని అందించారు. తమకు ప్రకటించిన బహుమతులు నగదు అందకపోతే నిరాశ చెందవద్దని ఆయన సందేశంలో పేర్కొన్నారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపారు. ఛాంపియన్‌గా నిలిచిన హర్మన్‌ప్రీత్ సేనకు ఐసిసి నుంచి దాదాపు రూ.40 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. బిసిసిఐ రూ.51 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాక ప్రపంచకప్ గెలిచి క్రికెటర్లకు తమ తమ రాష్ట్రాలు నగదు బహుమతులు ప్రకటించాయి. జట్టులోని స్టార్ ఆటగాళ్లతో కొన్ని బ్రాండ్లు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వాగ్దానాలు నెరవేర్చకపోతే నిరాశ చెందవద్దని గవాస్కర్ సూచించారు. ‘‘కొంత మంది ప్రకటనదారులు, బ్రాండ్లు, వ్యక్తులు ఉచితంగా ప్రచారం పొందడానికి మిమ్మల్ని వాడుకుంటారని.. జట్టును అభినందిస్తూ.. పూర్తి పేజీ ప్రకటనలు చేస్తారు.. హోర్డింగ్‌లు పెడతారు. జట్టు, వ్యక్తిగత స్పాన్సర్లు కాకుండా మిగిలిన వారు తమ బ్రాండ్లను లేదా తమ గురించి ప్రచారం చేసుకోవాడానికి ప్రయత్నిస్తారు తప్ప భారత క్రికెట్‌కు కీర్తిని తెచ్చిన వారికి ఏమీ ఇవ్వరు. 1983 ప్రపంచకప్ సాధించిన జట్టుకు కూడా చాలా వాగ్దానాలు చేశారు. అప్పట్లో మీడియా కూడా చాలా కవరేజ్ ఇచ్చింది. దాదాపు అవన్నీ ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను నిందించలేం. ఎందుకంటే వారు ఈ సిగ్గులేని వ్యక్తులు తమను కూడా ఉపయోగించుకుంటున్నారని గ్రహించకుండా గొప్ప ప్రకటనలను సంతోషంగా ప్రచారం చేస్తారు. కాబట్టి అమ్మాయిలారా.. ఈ సిగ్గులేని వారు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మీ విజయాన్ని ఉపయోగిస్తుంటే బాధపడకండి. ప్రపంచకప్ సాధించిన మీకు మరోసారి అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది. జై హింద్’’ అని గవాస్కర్ సందేశం ఇచ్చారు. 

మన తెలంగాణ 10 Nov 2025 7:12 pm

పురుగుల మందు తాగి నవ వధువు ఆత్మహత్య

మన తెలంగాణ/ఇల్లందు టౌన్: పురుగుల మందు తాగి నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని లచ్చగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్ధ్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.... మృతురాలు కమటం అంజలికి అదే గ్రామానికి చెందిన చిట్టూరి సాయికుమార్‌తో ఆరునెలల క్రితం వివాహం జరిగింది. భర్త సాయికుమార్ హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. అత్తమామల వద్ద ఉన్న అంజలి కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన అత్తింటి వారు హుటాహుటిన ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన చికిత్సకోసం ఖమ్మంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అంజలి మృతి చెందింది. ఇకపోతే అత్తింటి వేధింపులతోనే తమ కూతురు మరణించిందని అంజలి తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. 

మన తెలంగాణ 10 Nov 2025 7:11 pm

వివాహానికి హాజ‌రు…

వివాహానికి హాజ‌రు… చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:10 pm

Shilpa Shetty Restless over Rs 60 Cr Cheating Case

Bollywood actress Shilpa Shetty and her businessman husband Raj Kundra have been facing allegations in a Rs 60 crore fraud case. The actress has now moved to Mumbai High Court to quash the case that was lodged against the star couple. Shilpa Shetty approached the Mumbai High Court to direct the cops not to file […] The post Shilpa Shetty Restless over Rs 60 Cr Cheating Case appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 6:59 pm

Shruti Haasan’s Vocals for GlobeTrotter

The title glimpse of SS Rajamouli – Mahesh Babu will be unveiled in a grand manner on November 15th in a grand event that will take place in Ramoji Film City. Talented actress Shruti Haasan will lend her voice for a song from the film and MM Keeravani has chosen Shruti Haasan for the song. […] The post Shruti Haasan’s Vocals for GlobeTrotter appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 6:58 pm

దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి — సిపిఐ జగదీష్

సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం జనగణనలో కులగణన చేపట్టాలని నవంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు విశాలాంధ్ర బ్యూరో, అనంతపురం:దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయని, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలోని సిపిఐ కార్యాలయంలో బి. కేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.జగదీష్ మాట్లాడుతూ, దేశంలో సామాజిక […] The post దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి — సిపిఐ జగదీష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 6:57 pm

200 మంది విద్యార్థుల‌కు వైద్యం…

200 మంది విద్యార్థుల‌కు వైద్యం… చిట్యాల, ఆంధ్రప్రభ : దివిస్ లేబో రే

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:56 pm

VX2 గో 3.4 kWh వేరియంట్ ను ప్రకటించిన హీరో విడా

న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ చేత నడిచే విడా - ఈ రోజు VX2 గో 3.4 kWh వేరియంట్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది, ఇది ఈవూటర్స్ యొక్క VX2 పోర్ట్ ఫోలియోను మరింత పెంచింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ స్వీకరణను వేగవంతం చేయడంపై ప్రభుత్వ దృష్టిని నొక్కిచెబుతూ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ కొత్త వేరియంట్ను ఆవిష్కరించారు. ఈ కొత్త వేరియంట్ యొక్క పరిచయం ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రజాస్వామ్యీకరించే దాని దృష్టికి మరియు ఇంటింటా ఈవూటర్ యొక్క తత్వానికి విడా యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది - ప్రతి ఇంటికి ఆచరణాత్మకమైన, సరసమైన ఎలక్ట్రిక్ మొబిలిటీని తీసుకువస్తుంది. అరంగేట్రం చేసినప్పటి నుండి, విడా ఈవూటర్ VX2 దాని విశ్వసనీయత, సౌలభ్యం మరియు సుపరిచితమైన డిజైన్ కోసం బలమైన వినియోగదారుల ఆమోదాన్ని సంపాదించింది. మారుతున్న భారత్ యొక్క స్కూటర్గా గుర్తింపు పొందిన ఇది స్కూటర్ యొక్క విశ్వసనీయతను ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణతో మిళితం చేస్తుంది, ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారాలని చూస్తున్న రైడర్లకు ఇష్టపడే ఎంపికగా చేస్తుంది. కొత్త ఈవూటర్ విఎక్స్2 గో 3.4 కిలోవాట్ ఈ విజయంతో నిర్మింపబడి, మెరుగైన పనితీరు, విస్తరించిన పరిధి మరియు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది - ఇది భారతీయ ప్రయాణికులు మరియు కుటుంబాల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈవూటర్ విఎక్స్2 గో 3.4 కిలోవాట్ డ్యూయల్-రిమూవబుల్-బ్యాటరీ సిస్టమ్ ను కలిగి ఉంది, ఇది ఒక ఛార్జ్ కు 100 కిలోమీటర్ల వరకు రియల్-వరల్డ్ రేంజ్ మరియు 26 ఎన్ఎమ్ టార్క్ తో 6 కిలోవాట్ల గరిష్ట శక్తిని అందిస్తుంది. రైడర్లు సౌకర్యవంతమైన పనితీరు కోసం ఎకో మరియు రైడ్ మోడ్ ల మధ్య ఎంచుకోవచ్చు, అయితే గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగం పట్టణ రోడ్లపై విశ్వసనీయంగా ఉంటుంది. రోజువారీ ఆచరణాత్మకతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది, ఇది ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్, పెద్ద సీటు, 27.2-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ మరియు భారతీయ రోడ్ల కోసం ట్యూన్ చేయబడిన సస్పెన్షన్ ను కలిగి ఉంది - ఇది ఒంటరి మరియు కుటుంబ ప్రయాణాలకు రెండింటికీ అనువైనది. ఈ లాంచ్ గురించి హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీమతి కౌసల్య నందకుమార్ మాట్లాడుతూ, భారతీయ రైడర్ల జీవితాన్ని మెరుగుపరచడానికి సృజనాత్మకతతో సృజనాత్మకతను మిళితం చేస్తూ విడా ఎల్లప్పుడూ పురోగతి కోసం నిలుస్తుంది. కొత్త ఈవూటర్ VX2 గో 3.4 కిలోవాట్, పనితీరు, ఆచరణాత్మకత మరియు ప్రయోజనం గురించి స్పృహతో తమ ప్రయాణంలో ఎక్కువ పరిధి మరియు సామర్థ్యాన్ని కోరుకునే వారి కోసం రూపొందించబడింది. రోజువారీ రాకపోకలకు సాధికారత కల్పించడంతో పాటు భారతదేశాన్ని పరిశుభ్రమైన, ఉత్తమమైన రేపటి వైపు నడిపించాలనే మా నిబద్ధతను ఇది బలపరుస్తుంది. అని పేర్కొన్నారు. విడా తన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బిఎఎఎస్) మోడల్ ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తెస్తూనే ఉంది, ఇది వినియోగదారులను బ్యాటరీని పూర్తిగా కొనుగోలు చేయడానికి బదులుగా సబ్ స్క్రైబ్ చేయడానికి అనుమతిస్తుంది - ముందస్తు యాజమాన్య ఖర్చులను తగ్గిస్తుంది మరియు సౌకర్యవంతమైన ఛార్జింగ్ మరియు నిర్వహణ ఎంపికలను అందిస్తుంది. భారతదేశం అంతటా 4,600+ ఛార్జింగ్ పాయింట్లు మరియు 700+ సర్వీస్ టచ్ పాయింట్లతో విడా యొక్క విస్తరిస్తున్న పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది, ఇది దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత సరసమైనదిగా మరియు అనుకూలంగా చేస్తుంది. విడా ఎవూటర్ విఎక్స్2 గో 3.4 కిలోవాట్ ధర రూ. 102 000*, అయితే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బిఎఎఎస్) తో కిలోమీటర్ కు రూ. 0.90 చొప్పున చెల్లించి రూ. 60 000 ప్రారంభ ధరతో పొందవచ్చు. విడా ఈవూటర్ VX2 Go 3.4 kWh నవంబర్ 2025 నుండి విడా డీలర్ షిప్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ లాంచ్ తో, ఈవూటర్ VX2 పోర్ట్ ఫోలియోలో ఇప్పుడు VX2 Go 2.2 kWh, VX2 Go 3.4 kWh మరియు VX2 ప్లస్ ఉన్నాయి, ఇది ప్రయాణికుల నుండి పనితీరు కోరుకునే వారి వరకు విభిన్న రైడింగ్ అవసరాలకు అనుగుణంగా పూర్తి శ్రేణి కుటుంబ ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తుంది. ఇన్నోవేషన్, సర్వీస్ మరియు బలమైన సపోర్ట్ ఎకోసిస్టమ్ ద్వారా భారతీయ రైడర్లను శక్తివంతం చేయడంపై విడా దృష్టి సారించింది - విశ్వసనీయమైన మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ అనుభవాన్ని అందిస్తుంది.

మన తెలంగాణ 10 Nov 2025 6:50 pm

ఘనంగా ఆదివాసి ఫెస్టివల్స్..

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు జైనూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఐటీడీఏ పీవో, డీడీల‌

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:48 pm

విషాదం: 3 నెలల గర్భణీ ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు మండలం లచ్చగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి వివాహిత అంజలి (20) ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. 6 నెలల క్రితం వివాహమైన అంజలి ప్రస్తుతం 3 నెలల గర్భణి. అత్తింటి వేధింపులే అంజలి మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 10 Nov 2025 6:43 pm

ఆంధ్రపభ కథనానికి స్పందన

మరమ్మతులు చేపడతాం తాడ్వాయి, ఆంధ్రప్రభ : వృధాగా పోతున్న మిషన్ భగీరథ(Mission Bhagiratha)

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:36 pm

వితంతువును ప్రేమ పేరుతో మోసం – బిడ్డతో కనిపించని వ్యక్తి..

విశాలాంధ్ర, పుట్టపర్తి: వితంతువుని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్‌కి వినతి పత్రం అందజేసింది.బాధితురాలు పసుపులేటి పావని మాట్లాడుతూ కురుబలకోట మండలం రిషి వ్యాలీకి చెందిన తనకు ధర్మవరానికి చెందిన వినోద్ కుమార్‌తో వివాహం జరిగిందన్నారు . ఐదేళ్ల దాంపత్య జీవితం తర్వాత వినోద్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందడంతో తన స్వగ్రామంలో ఉండిపోయానని తెలిపారు. తరువాత మదనపల్లిలో వైద్యం […] The post వితంతువును ప్రేమ పేరుతో మోసం – బిడ్డతో కనిపించని వ్యక్తి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 6:35 pm

మ‌సీదుల‌ను ఎందుకు కూల్చ‌లేదు?

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:28 pm

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందుచేత..

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందుచేత.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : మెరుగైన వైద్యం

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:21 pm