విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి.. చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం క్రీడ శాఖకు
పూజలు.. వన భోజనాలు ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్రప్రభ : కార్తీకమాసంలో ఆలయాలకు
నిందితుల నుంచి 3 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం కాటారం,
మహిళా సంఘాలను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : భట్టి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏ పదవి లేకపోయినా.. కొనాళ్లుగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ ను గెలిపించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని తెలియజేశారు. పదేళ్లపాటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి.. సన్నబియ్యం కూడా ఇస్తోందని అన్నారు. మహిళా సంఘాలను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు ఇస్తోందని, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్-1 పరీక్షలు జరగలేదని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి.. నియామకాలు కూడా చేసిందని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు.. ప్రైవేటులోనూ ఉద్యోగాల కల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం రెండేళ్లలోనే రూ.1.06 లక్షల కోట్లు ఖర్చు చేశామని, బిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన సంక్షేమ పథకాల బిల్లులను తాము చెల్లించామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి..
వరంగల్ జిల్లా, నెక్కొండ, (ఆంధ్రప్రభ) : మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా
భారీ ఉగ్రకుట్ర.. గుజరాత్లో హైదరాబాదీ అరెస్ట్
హైదరాబాద్: గుజరాత్లో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ ఎటిఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రకు ప్రయత్నించిన హైదరాబాద్కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్తో పాటు మరో ఇద్దరిని గుజరాత్ ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొహియుద్దీన్ ఫ్రాన్స్లో ఎంబిబిఎస్ చేసినట్లు గుర్తించారు. ఆదివారం అతడి నివాసంలో సోదాలు జరిపిన గుజరాత్ పోలీసులు.. రెండు గ్లాక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. మొహియుద్దీన్ ఐఎస్కెపి సభ్యులతో చర్చలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా.. ఈ నెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
దండేపల్లి, (ఆంధ్రప్రభ) : దండేపల్లి మండలం గూడెం శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి
రామప్పలో అమెరికా దేశస్థుడు… వెంకటాపూర్, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని
తపాలా సేవలు ఇప్పుడు మొబైల్లో #PostalDept #DigitalIndia #DocSeva #Technology #Apps #IndiaPost
జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగురుతుంది… సునీత అసెంబ్లీకి వెళతారు…
కేటీఆర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం.. మాగంటి సునీత(Maganti
సఫారీలతో సిరీస్.. ఫామ్లో ఉన్న ఆటగాడికి గాయం..
బెంగళూరు: సౌతాఫ్రికాతో నవంబర్ 14వ తేదీ నుంచి స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్లో తలపడనుందనే విషయం తెలిసిందే. ఈ సిరీస్కి ముందు భారత్కు ఊహించని ఎధురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా ఎతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధృవ్ జురేల్ గాయపడ్డాడు. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న అతని కుడి చేతి వేలికి గాయమైంది. సఫారీ ఓపెనర్ లెసెగో సెనోక్వానే ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చిన డెలివరీని డ్రైవ్ ఆడాడు. అది ఎడ్జ్ తీసుకొని థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ధృవ్ జురేల్ ఆ బంతిని అందుకొనే ప్రయత్నం చేయగా.. బంతి అతని చేతి వేలికి బలంగా తగిలింది. దీంతో తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. కనీసం ఫిజియో రాకుండానే మైదానం వీడి వెళ్లిపోయాడు. తిరిగి అతడు ఫీల్డింగ్కు రాలేదు. ప్రస్తుతం జురేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సౌతాఫ్రికా ఎతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ రెండు ఇన్నింగ్స్లోనూ అతడు సెంచరీలు చేశాడు. అంతకు ముందు వెస్టిండీస్పై కూడా శతకం సాధించాడు. దీంతో అతడిని సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో ఆడించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. రెగ్యులర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నప్పటికీ.. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్ను ఆడించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తీరా చూస్తే అతడు గాయపడటం ఆందోళనకు గురి చేస్తోంది.
కెసిఆర్ కార్పొరేట్ తో పోటీపడి పేదలకు విద్య అందించారు : జగదీష్ రెడ్డి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలని నిరుద్యోగులు తిరుగుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ ఒక్కటైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిజిఆర్ ను చంపిందే కాంగ్రెస్ పార్టీ అని.. 2004 నుంచి 2014 వరకు స్వర్ణయుగం అని సిఎం అన్నారని ఎద్దేవా చేశారు. సిఎం సొంత జిల్లాలోనూ ఆకలిచావులు మర్చిపోయారా? అని.. మాజీ సిఎం కెసిఆర్ ఏం చేశారో అధికారులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. కార్పొరేట్ తో పోటీపడి కెసిఆర్ పేదలకు విద్య అందించారని, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిందే కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని జగదీష్ రెడ్డి కొనియాడారు. ఉచిత బస్సు పేరు చెప్పి అసలు బస్సులే లేకుండా చేశారని, మహిళలకు ఉచితమన్నారని.. మగవాళ్లకు ఛార్జీలు డబుల్ చేశారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబ సమస్యల గురించి సిఎం మాట్లాడారని, కెసిఆర్ కుటుంబ విషయాలతో పార్టీకి ఏం సంబంధం? అని నిలదీశారు. సిఎం అన్న కుమార్తె పెళ్లికి.. సిఎం భార్య, ఆయన కుమార్తె ఎందుకెళ్ల లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
శ్రీచరణి నిర్ణయానికి దేశ ప్రశంస #Sports #Kadapa #SriCharani #WorldCup #viralvideo #latestnews
కాంగ్రెస్ సీఎంల నిర్ణయాలతో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి
మీట్ ది ప్రెస్లో రేవంత్ హాట్హాట్ కామెంట్స్… హైదరాబాద్, ఆంధ్రప్రభ : ‘
కార్మికులతో కలిసి మంత్రి నిమ్మల శ్రమదానం #APPolitics #Palakollu #NimmalaRamanayudu #LaborDonation
ఆన్లైన్ మోసాలపై కర్నూలు ఎస్పీ సూచనలు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆన్లైన్
Thiru Veer, Aishwarya Rajesh and Gangaa Entertainments Pan-India movie launched
Thiru Veer has delivered a good success with The Great Pre Wedding Show. Now, he has joined hands with Gangaa Entertainments for their Pan-India film. Aishwarya Rajesh is playing the leading lady role. The film, a hilarious entertainer, has been launched grandly, in Hyderabad, today. Bharat Dharshan makes his directorial debut with this project, which […] The post Thiru Veer, Aishwarya Rajesh and Gangaa Entertainments Pan-India movie launched appeared first on Telugu360 .
అర్హులు తప్పిపోవద్దు చెన్నై, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
డెహ్రాడూన్, ఆంధ్రప్రభ : కొండ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
అభిషేక్ ఆ విషయంలో తగ్గాలి.. లేకుంటే కష్టం: మాజీ ఆల్ రౌండర్
టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టి-20 సిరీస్ని భారత్ కైవసం చేసుకుంది. ఇక ఈ టి-20 సిరీస్లో మరోసారి టీం ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఆసీస్ బౌలర్లు అభిషేక్ కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించారు. దీంతో అతను పెద్దగా స్కోర్ చేయకపోయినా.. అన్ని మ్యాచ్లు కలిపి 176.34 స్ట్రైక్ రేటుతో 163 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. అయితే అభిషేక్ ఆటపై సర్వత్ర ప్రశంసలు కురుస్తుంటే.. మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్కు వార్నింగ్ ఇచ్చారు. అభిషేక్ తన దూకుడు తగ్గించుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని ఇర్ఫాన్ అన్నారు. ప్రతి బంతిని ముందుకు వచ్చి బాదాలనుకుంటే బౌలర్లు దాని మీద దృష్టి పెట్టి బోల్తా కొట్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘అభిషేక్ నిర్భయంగా ఆడుతున్నాడు. అది బాగానే ఉంది. ప్రస్తుతం అన్ని ద్వైపాక్షిక సిరీస్లు జరుగుతున్నాయి.. ప్రపంచకప్ కాదు. ప్రపంచకప్ కోసం జట్లు చాలా సన్నాహాలతో వస్తారు. ఇప్పుడు అభిషేక్ ప్రతి బంతిని క్రీజు వదిలి బయటకు వచ్చి ఆడాలనుకుంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు దీనిపై దృష్టిపెడతారు. కాబట్టి, అభిషేక్ షాట్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. టీమ్ మేనేజ్మెంట్ కచ్చితంగా దీనిపౌై ఫోకస్ పెడుతుందని అనుకుంటున్నా. అతడి వ్యక్తిగత కోచ్ యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. నేను యువీతో మాట్లాడుతా. అభిషేక్ కూడా దూకుడుగా ఆడే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందరి బౌలింగ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే ముందుకు వచ్చి భారీ షాట్ ఆడలేవు’’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
హ్యాట్సాప్ నేరేడుచర్ల ఎస్సై రవీందర్ సాబ్…
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్ . మండలం సోమరం గ్రామానికి చెందిన కోమర్రాజు సుస్మిత మూసి నదిలో గల్లంతైన సమయం నుండి నేరేడుచర్ల …
Epic Fantasy Gatha Vaibhavam Telugu release by PrimeShow
Gatha Vaibhavam starring SS Dushyanth and Ashika Ranganath is a sweeping love story that spans across ages. The epic fantasy is written, directed by and co-produced by Suni. It promises audiences a potent blend of emotional depth and visual grandeur. The film’s market reach is set to expand significantly with PrimeShow Entertainment acquiring the Telugu […] The post Epic Fantasy Gatha Vaibhavam Telugu release by PrimeShow appeared first on Telugu360 .
కర్నూలు స్కేటింగ్ క్రీడాకారుల ర్యాలీ
వందేమాతరం అంటూ నినాదాలు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ
రాజు మరణం… తీరని లోటు.. నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేసే
సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 9 (ఆంధ్రప్రభ): మంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వం లో
వైసీపీకి ఒక్కచాన్స్తో.. ఏపీకి నష్టం..
వైసీపీకి ఒక్కచాన్స్తో.. ఏపీకి నష్టం.. పాట్నా(బీహార్), ఆంధ్రప్రభ : వికసిత్ భారత్ లక్ష్యసాధనలో
న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తం నల్గొండ, ఆంధ్రప్రభ : రాజ్యాంగం
బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన ప్రధాన్ పాట్నా (బీహార్): కేంద్ర విద్యాశాఖ
కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసిన భక్తురాలు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో నోట్లకు మంటలు అంటుకున్నాయి. ఆలయ సిబ్బంది హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించి నీళ్ళు పోసి మంటల్ని ఆర్పేశారు. కాలిన నోట్లను వేరు చేసి నోట్లను హెయిర్ డ్రైయర్ తో సిబ్బంది ఆరబెట్టారు. భక్తురాలికి భక్తి ఎక్కువగా ఉండడంతో ఆ పని చేసింది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇది పేదోళ్ల సొంతింటి కల… నర్సంపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి
ఆ బాధ్యత నాదే – బలరాం నాయక్ గోదావరిఖని, ఆంధ్రప్రభ – సింగరేణి
థార్, బుల్లెట్దారులు పోకిరీలే! #Haryana #Police #DGP #ViralVideo #telugupost #latestnews
పొన్నం ఆదేశం.. ఉమ్మడి వరంగల్ ఆంధ్రప్రభ ప్రతినిధి – మొంథా తుఫాన్ నష్టం
ఐదేళ్లలో ఎపికి తీరని నష్టాన్ని మిగిల్చారు : లోకేష్
అమరావతి : తాను ఓ మంత్రిగా ఇక్కడకు రాలేదు అని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. బాధ్యత గల భారతీయ పౌరుడిగా వచ్చానని అన్నారు. బిహార్ లో లోకేష్ పర్యటన చేశారు. పాట్నాలో ఎన్ డిఎకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వ్యక్తికి ఎపి ప్రజలు పట్టం కట్టారని, ఐదేళ్లలో ఎపికి వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తీరని నష్టాన్ని మిగిల్చారని మండిపడ్డారు. వైసిపి హయాంలో ఎపిలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, జగన్ పాలనలో పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఎపిని విడిచి వెళ్లారని, అలాంటి పరిస్థితి బిహార్ కు రాకూడదని లోకేష్ కోరారు.
ఆదాయంపైనే గురి సర్కారుపై బ్రహ్మర్షి ఆర్ ఎం దాస్ ఫైర్ ( నర్సాపురం
(మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ) కేసముద్రం మండలంలో కొన్ని రోజుల నుంచి పాత
Revanth Reddy : 2034 వరకూ కాంగ్రెస్ దే అధికారం
మరో పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్ ఎవరంటే..
సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోలు రావడం సాధారణమే. స్టార్ హీరోలకు వారసులుగా ఇప్పటికే చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలై ఇంటి బాట పట్టక తప్పలేదు. ఇక ఒకప్పటి స్టార్ హీరో కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా మరో అబ్బాయి రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మహేశ్బాబు సోదరుడు, దివంగత రమేశ్ బాబు తనయుడు నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి రమేశ్బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ రూమర్సే నిజం అయ్యాయి. జయకృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నట్లు అజయ్ భూపతి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఎబి4’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు. తిరుమల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. జయకృష్ణను హీరోగా పరిచయం చేయడం తనకు ఎంతో థ్రిల్లింగ్గా, గర్వంగా ఉందన్నారు. ‘ఒక గొప్ప కథతో మరింత గొప్ప బాధ్యత వస్తుందని’ పేర్కొన్నారు. అశ్వినీ దత్ ఈ సినిమాను సమర్పిస్తుండగా.. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను త్వరలోనే ప్రకటిస్తామని అజయ్ స్పష్టం చేశారు. With a Great Story comes Greater Responsibility... Thrilled and honoured to introduce #JayaKrishnaGhattamaneni through my next film From the heart of the hills, a raw, intense and realistic love story, #AB4 Title announcement soon❤️ Presented by @AshwiniDuttCh Produced by… pic.twitter.com/Fmn2AoYeEU — Ajay Bhupathi (@DirAjayBhupathi) November 9, 2025
America : అమెరికా షట్ డౌన్ తో ఎన్ని కష్టాలు.. భారమంతా వాటిపైనే?
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడనుంది.
మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ #MaheshBabu #Jayakrishna #Cinema #FilmLaunch #Ghattamaneni
అదే నా లక్ష్యం – కవిత.. హనమకొండ, ఆంధ్రప్రభ – 20 ఏళ్లుగా
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్ వాహనం..
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్ వాహనం.. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ బస్సును
శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం..#telugupost #latestnews #viralvideo #caraccidentvideos
ఆసీస్పై సిరీస్లో విక్టరీ.. ఇంపాక్ట్ ప్లేయర్ మెడల్ అతడికే..
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టి-20ల సిరీస్ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం జరగాల్సిన ఐదో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ భారత్కు దక్కింది. అయితే ఈ సిరీస్ అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డును ఇచ్చే సాంప్రదాయాన్ని భారత మేనేజ్మెంట్ కొనసాగించింది. ఈ మెడల్ను టీమ్ ఆపరేషన్స్ మేనేజర్ రహిల్ ఖాతా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ సోషల్మీడియాలో విడుదల చేసింది. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ.. రహిల్పై ప్రశంసలు కురిపించాడు. రహిల్ చేతుల మీదుగా ఈ పతకాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ప్రతి రోజు ఆయన చాలా కష్టపడుతూ.. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు రావడం, తుది జట్టులో చోటు దక్కించుకోవడం, టీమ్ విజయానికి తోడ్పడటం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని తెలిపాడు. ఈ సిరీస్లో సుందర్ మూడు మ్యాచ్లు ఆడాడు. సిరీస్లో ఆసీస్ ఆధిక్యంలో ఉన్న తరుణంలో, మూడో టి-20లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నాలుగో మ్యాచ్లో 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)
Cyber Crime : ఆదమరిస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో వస్తున్నారో తెలుసా?
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా అంటే.. అమాయకులను వలలో వేసుకుని నేరగాళ్లు ఏ ఎత్తుగడతో వస్తారో తెలియదు
30 శాతం కమీషన్లు... అందుకే ఆ రంగం పడిపోయింది: హరీష్ రావు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఓటమి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. బిజెపి, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, రేవంత్ సర్కార్ను బిజెపి కాపాడుతోందని ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలోని మోతి నగర్ కాలనీ వాసవి బృందావనం అపార్ట్ మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా కొరత వస్తే సంజయ్ ఎక్కిడికెళ్లారని ప్రశ్నించారు. కన్నీళ్లను కూడా రాజకీయం చేయడం చిల్లర రాజకీయమని దుయ్యబట్టారు. చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు సహించరని, కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసిన తరువాత అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని, పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు భూమమ్ముదామంటే ధర లేక నష్టపోతున్నారని, రేవంత్ రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని హరీష్ రావు దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దివంగత ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ కాదు మా ఇంటి గోపీనాథ్ గా జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించారని, దురదుష్టవశాతూ ఆయన చనిపోయారని, కుటుంబానికి, వారి పిల్లలకి అండగా బిఆర్ఎస్ పార్టీ నిలిచిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ అని ఘాటు విమర్శలు చేశారు. వాళ్లది రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్ లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండ్ ఓవర్ చేశారని ప్రశ్నించారు. బైండోవర్ చేసిన వాళ్లని రౌడీ అనకపోతే ఏమంటారని హరీష్ రావు అడిగారు. సునీతమ్మ ఒక్కరు కాదు అని, ఆమె వెంట కెసిఆర్, మొత్తం బిఆర్ఎస్ పార్టీ ఉందని తెలియజేశారు. జూబ్లీహిల్స్ లో సునీతమ్మ గెలుపుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని, జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సి వస్తుందన్నారు. ఈ రోజు ప్రజలందరూ మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సరి చేయాలంటే మళ్ళీ ఇంకెంత సమయం పడుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో బిఆర్ఎస్ ప్రభుత్వం 43 ఫ్లైఓవర్లు నిర్మించిందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా? అని చురకలంటించారు.
శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమల శ్రీవారిని
(ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : వానలు పుష్కలంగా కురిస్తేనే నీటిమట్టం పెరుగుతుంది.. గతసారితో
భారీ అగ్ని ప్రమాదం. ఎలా జరిగింది..?
భారీ అగ్ని ప్రమాదం. ఎలా జరిగింది..? సంగారెడ్డి,ఆంధ్రప్రభ: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ #Tirumala #MukeshAmbani #TTD #Darshan #AndhraPradesh
ప్రశంసిస్తూ జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీ వరద ముంపు దారి మళ్లింపు బాపట్ల
Bigg Boss 9 : రాము రాధోడ్.. నువ్వే గెలిచావు... నువ్చే నిజమైన ఛాంపియన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ప్రేక్షకులు ఎలిమినేట్ చేయకుండా సెల్ఫ్ ఎలమినేషన్ చేసుకుని రాము రాధోడ్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు
స్నేహం కోసం.. వెల్గటూర్, ఆంధ్రప్రభ – మానవత్వానికి, స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా పదవ
ఆ విషయంలో కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రజాపాలన ప్రారంభమై రెండు సంవత్సరాలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామన్నారు. రాష్ట్రం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలు బిఆర్ఎస్ ను గెలిపించారన్నారు. మీట్ ది ప్రెస్ లో సిఎం రేవంత్ మాట్లాడారు. జిసిసిలు, డెటా సెంబర్లకు హైదరాబాద్ హబ్గా మారిందని, భారత దేశానికి వచ్చిన జిసిసి, డెటా సెంటర్లలో 70 శాతం హైదరాబాద్కే వచ్చాయని, దివంగత ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్ రెడ్డి పునాది వేసిన ఐటి రంగం హైదరాబాద్లో అభివృద్ధికి ఎంతో కీలకంగా మారిందని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. 2004లో ఉచిత కరెంట్ పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని, రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకుందని, కరువు ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి జలయజ్ఞం చేపట్టారని మెచ్చుకున్నారు. హైదరాబాద్లో ఐటి, ఫార్మా రంగాలను గత పాలకులు ఎంతో ప్రోత్సహించారని కొనియాడారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు పడ్డాయని ప్రశంసించారు. గతంలో కాంగ్రెస్ హయాం లోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మార్చి నిధులు కొల్లగొట్టిందని, గతంలో నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉండేవన్నారు.
బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాపై ఆంక్షలు పెట్టారు: కవిత
హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉరివేసే ఖైదీని చివరి కోరిక అడుగుతారు. కానీ తనకు షోకాజ్ నో నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. హనుమకొండలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని, ప్రొటోకాల్ పేరుతో తనను కట్టేశారని.. అందుకే జనంలో తిరగలేకపోయానని తెలియజేశారు. తాను సిఎం కూతురునైనా బిఆర్ఎస్ హయాంలో తన పనులు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సిఎం కెసిఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తానని, బిఆర్ఎస్ తో తనకు సంబంధం లేదని కవిత పేర్కొన్నారు.
టెన్షన్ పెడుతున్న ట్రాన్స్ఫార్మర్..
టెన్షన్ పెడుతున్న ట్రాన్స్ఫార్మర్.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రమాదం పొంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్
శ్రీశైలంలో విశేష పూజలు నంద్యాల బ్యూరో నవంబర్ 9 ఆంధ్రప్రభ : నంద్యాల
రాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం రేవంత్ ప్రకటన #Hyderabad #CMRevanthReddy #Kotideepotsavam #Festivals
రష్మీతో ప్రేమలో పడిన రాజమౌళి... వీడియో వైరల్
హైదరాబాద్: అప్పుడప్పుడు పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి, యాంకర్ రష్మీ గౌతమికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2007లో రాజమౌళి యమదొంగ సినిమాతో సినీ రంగంలో ప్రవేశించారు. అక్కడి నుంచి విక్రమార్కుడు, సింహాద్రి, ఛత్రపతి, మర్యాదరామన్న, ఈగ, మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. బహుబలి సినిమాతో భారత దేశపు సినిమా ప్రపంచానికి తెలియజేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తన కెరీర్ ప్రారంభంలో నేరుగా సినిమా ద్వారా కాకుండా సీరియల్స్తో ప్రారంభించారు అనే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. గతంలో రష్మీ, రాజమౌళి ఒక సీరియల్ నటించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియో రష్మీ కంట్లో పడడంతో హీరో నాగార్జునను ఒక కోరిక కోరింది. రష్మీ-రాజమౌళి ఎప్పుడు కలిసి నటించారని అభిమానులు గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. యువ సీరియల్ నుంచి తనకు చాలా మంచి మెమొరీలు ఉన్నాయని, సీరియల్ యూనిట్తో రీయూనియన్ ఎపిసోడ్ చేయాలని ఉందని నాగార్జునను యాంకర్ రష్మీ కోరింది. రాజమౌళి దర్శకధీరుడు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. రష్మీ మాత్రం పలు టీవీ షోలలో యాంకర్గా దూసుకుపోతుంది. రష్మీతో రాజమౌళి యువ సీరియల్ లో నటించారు.
స్కూటీలో పాము కలకలం #telugupost #snake #viralvideo #snakerescue
వివాహ వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తాటి
వివాహ వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తాటి అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: నియోజకవర్గ కేంద్రంలో శ్రీశ్రీ
ఈ క్యాష్ .. కలెక్టర్ దే.. బీహారీ వ్యాపారి అఫిషీయల్ కార్డ్
త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయి: బండి
హైదరాబాద్: హెచ్ సిఎలో గ్రామీణ స్థాయి క్రికెటర్ల అవకాశం కల్పించట్లేదని తల్లిదండ్రులు తనను కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.ఈ విషయంపై స్పందిస్తూ.. బిసిసిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. హెచ్ సిఎలో జరుగుతున్న జూనియర్, సీనియర్ సెలెక్షన్లపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీలో రూ. లక్షలు తీసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారని, గతంలో బాగా ఆడేవారిని కూడా ఎంపిక చేయలేదని తల్లిదండ్రులు ఆరోపించారని మండిపడ్దారు. త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయని బండిసంజయ్ హెచ్చరించారు.
బిగ్బాస్ హౌస్లో క్లియర్ కట్ వెబ్ డెస్కు, ఆంధ్రప్రభ : బిగ్బాస్ హౌస్
నిరుపేద కుటుంబానికి అండగా.. మక్తల్, ఆంధ్రప్రభ – మక్తల్ ప్రాంతానికి చెందిన సత్తమ్మ
₹1 లక్ష స్కూటర్కు ₹21 లక్షల జరిమానా #TrafficFine #Muzaffarnagar #ViralChallan #PoliceClarification
క్రిష్ణగిరి: నాగర్ కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలో కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫార్చునర్ కారులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈగలపెంట దగ్గరలో కారులో నుంచి మంటలు వచ్చాయి. కారులో ఉన్నవారి బయటకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. క్షణాల వ్యవధిలో కారు మొత్తానికి మంటల వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పోలీసులు క్రేన్ సహాయం తో వాహనాన్ని పక్కకు తొలగించారు.
టెన్షన్ లో రైతులు.. నల్గొండ, ఆంధ్ర ప్రభ:దేవుడు కనికరించినా పూజారి కనకరించలేదు అన్నట్టుగా..
అమెరికాలో భారీగా లేఆఫ్స్.. అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగ కోతలు గరిష్ట స్థాయికి
ములుగు అడవుల్లో కొత్త సీతాకోకచిలుకల జాతులు #Wildlife #Mulugu #ForestDepartment #ButterflySurvey
130 మంది జంటలుశ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు గుడివాడ – ఆంధ్రప్రభ:
డిబోట్ అనే ఈ రోబోట్ పనిమనిషి ఇంటిని శుభ్రపరిచే శక్తి వంతమైన మహిళల నేస్తం. సెట్ చేసిన సమయం ప్రకారం మొదటి దుమ్ము ధూళి శుభ్రంగా చేస్తుంది. తరువాత అది తన ఛాంబర్ కెళ్ళి దుమ్ము వదిలేసి మరల తడిగుడ్డ పెట్టి తుడుస్తుంది. ఒకటికి రెండుసార్లు నీట్ గా శుభ్రం చేసిన తరువాత తన స్ధానంలోకి వెళ్లి ఛార్జింగ్ చేసుకుంటుంది. దీని ధర. రూ. 55000 అమెజాన్ లో ఉంది. దుమ్ము ఓ బ్యాగ్ లోకి వెళ్లి పోతుంది. అది మనం పడేయాలి. శుద్ధి చేసి మరలా వాడుకోవచ్చు. మాది గ్రానైట్ ఫ్లోరింగ్ కావున శుభ్రంగా తుడుస్తోంది. మార్బుల్ కూడా బాగానే ఉంటుంది. మన సెల్ ఫోన్ ద్వారా దీనిని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
ఇటీవల కాలంలో సంభవిస్తున్న తుఫానులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను దాటిన మొంథా తుఫాను తీవ్రవిధ్వంసం సృష్టిస్తుందనే భయంకరమైన పరిస్థితులనుండి ప్రజలు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాను తీరం దాటిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ప్రకృతిలో ఎందుకు అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి? ఆకస్మిక వాతావరణ మార్పులకు కారణమేమిటి? ఇలాంటి కీలకమైన అంశాలపై తీవ్రమైన పరిశీలన, మేధో మథనం జరగాలి. మానవ చర్యల వలన ప్రకృతిలో సంభవించే విపత్తులనుండి ప్రజలను కాపాడుకోవాలి. ప్రకృతి విధ్వంస దుష్ఫలితాలను కనీసస్థాయికి తగ్గించాలి. ప్రకృతి భూమికి రక్షణ కవచం వంటిది. అలాంటి ప్రకృతిని విధ్వంసం చేయడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిని నిర్లక్ష్యం చేసి, పర్యావరణానికి ముప్పు కలగచేయడం క్షమార్హం కాదు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, ఎన్నోఅవగాహనా సదస్సులు, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణ విధ్వంసంతో మానవ ప్రపంచం విలపిస్తున్నది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపితేనే భూగ్రహాన్ని కాపాడగలం. స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఐస్లాండ్, డెన్మార్క్, యు.కె, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు హరిత దేశాలుగా పేర్కొనబడుతున్నాయి. సహజ వనరులను పరిరక్షించి, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెన్మార్క్ గ్రీనెస్ట్ కంట్రీ దిశగా పయనిస్తున్నది. ఖతార్, నైజర్, గ్రీన్ లాండ్ వంటి దేశాల్లో పచ్చదనం తక్కువగా ఉంది. ధరిత్రిని కలుషిత వ్యర్ధాలనుండి కాపాడడం, ప్లాస్టిక్ను నెమ్మదిగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచాన్ని మళ్ళించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, అడవులను సంరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రస్తుత కలుషితభరితమైన ప్రపంచంలో ప్రతీ చోట వినిపించే మాట ‘పర్యావరణం’. పర్యావరణం అనే పదానికి నిర్వచనం చాలా మందికి తెలియకపోవచ్చు. పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు నిజమైన పరిష్కారమన్న అవగాహన మాత్రం సామాన్య ప్రజల్లో కూడా ఏర్పడింది. కాని ఆచరణలో పర్యావరణ పరిరక్షణ అంశం విఫలమవుతూనే ఉంది. పర్యావరణం శరవేగంగా విధ్యంసమవుతూనే ఉంది. మానవ ప్రపంచాన్ని పెను ప్రమాదం వెంటాడుతూనే ఉంది. మన చుట్టూ పంచభూతాలతో ఆవరించి ఉన్న సహజసిద్ధమైన ఏర్పాటును ‘పర్యావరణం’గా పేర్కొనవచ్చు. అలాంటి పర్యావరణం మానవ స్వార్థంతో, తప్పిదాలతో విధ్వంసం కావడం పెను ప్రమాదానికి సంకేతం-, మానవ మనుగడకు శరాఘాతం. సకల జీవరాశుల మనుగడకు ఏకైకఆధారం భూగ్రహం. మిగిలిన గ్రహాల్లో జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. ఇతర గ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటి వరకు జీవరాశుల జాడ కనిపించలేదు. వేలాది కోట్ల ధనం ఇతర గ్రహాలపై పరిశోధనలకు ఖర్చుపెడుతున్నా ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. ఇతర గ్రహాలపై తిష్ఠవేయాలనే మానవ జిజ్ఞాస కేవలం అత్యాశగానే మిగిలిపోతుందేమో అనే సంశయం కలగడం సహజం. సువిశాలమైన భూగ్రహాన్ని నాశనం చేసి, ఇతర గ్రహాలపై నివాసానికి కలలు కనడం హాస్యాస్పదం. ప్రకృతి హొయలతో అలరాడే అందమైన భూగ్రహాన్ని కాలుష్యంతో కురూపిగామార్చి, ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడం కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది. భూగ్రహం కూడా ఈ సమస్త విశ్వంలో ఒక భాగమే. భూగ్రహంపై మూడొంతుల నీరు, ఒక వంతు భూమి కలదు. వృక్షాలతో, నదీనదాలతో, కొండలు, లోయలు, సముద్రాలతో పలు జీవరాశులతో, విభిన్నమైన భౌగోళిక నైసర్గీక స్వరూపాలతో, పచ్చని ప్రకృతి మధ్య జీవించే మహాద్భాగ్యాన్ని మానవుడే చెరిపేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం విచక్షణ కోల్పోయి ప్రకృతిని చెరబట్టి, వికృతంగా మారుస్తున్నాడు. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్యపు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వలన, అడవులను ధ్వంసం చేయడం వలన, పారిశ్రామిక విప్లవం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువుల శాతం పెరిగి, భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘గ్లోబల్ వార్మింగ్’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణం. ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను అవసరాలకు మించి వినియోగించడం, ధనాశతో, దురాశతో దూరదృష్టి కోల్పోయి, పర్యావరణానికి చేటుతేవడం మానవ మనుగడకు పెనుముప్పు. పచ్చదనమే ప్రపంచ మానవాళికి నిజమైన ధనం. ఈ విషయాన్ని మరచిపోయి, కలుషితాల మధ్య జీవిస్తూ సుఖసౌఖ్యాలను ఆస్వాదిస్తున్నామని భ్రమించడం దురదృష్టకరం. పంచభూతాలు కలుషితమైపోయాయి. పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోవు ప్రళయానికి సంకేతాలు. సూర్యరశ్మి, గాలి, నీరు మొదలైన వనరులను పునరుత్పాదక శక్తివనరులుగా పిలుస్తారు. జంతువుల, మొక్కల వ్యర్ధాల నుండి ఉత్పత్తి కాబడే ఇంధనాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. ఇది కూడా పునరుత్పాదక ఎనర్జీ. పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించే కొద్దీ తిరిగి భర్తీ చేయబడతాయి. సౌరశక్తి, గాలి వంటి సహజసిద్ధమైన వనరులను వినియోగించుకుని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటి వలన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. సూర్యరశ్మి, గాలి వంటి ప్రకృతి సిద్ధమైన వనరుల నుండి లభ్యమయ్యే శక్తి కారకాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించినా తిరిగి పొందగలం. వీటిని వినియోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పునరుత్పాదక శక్తివనరులతో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చు. దీనినే క్లీన్ ఎనర్జీ అంటారు. ప్రపంచంలో ప్రకృతి ప్రేమికులకు కొదవలేదు. అయినా ఆశించినంత ప్రయోజనం ఆచరణలో కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా, ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికలు చేపట్టకుండా పర్యావరణ విధ్వంసాన్ని ఆపలేం. పర్యావరణాన్ని పరిరక్షించి, భూతలాన్ని కాపాడేందుకు ‘రాచెల్ లూయీస్ కార్సన్’ వంటి పర్యావరణ వేత్తల ఆలోచనలు స్ఫూర్తి కావాలి. గేలార్డ్ నెల్సన్ లాంటి దూరదృష్టిగల పర్యావరణ ప్రేమికులను వర్తమాన ప్రపంచం తయారు చేయాలి. జాదవ్ పాయెంగ్, వనజీవి రామయ్య వంటి ప్రకృతి, పర్యావరణ సేవకులు సమాజం నుండి ఉద్భవించాలి. ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తలు పర్యావరణ పునరుద్ధరణకు నడుంబిగించి, మానవాళిని పెను సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి వడివడి అడుగులు వేయాలి. సహజసిద్ధమైన, కలుషిత రహితమైన గత కాలం నాటి,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునర్జీవింపచేయాలి. మానవ చర్యల వలన ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను కాపాడాలి. - సుంకవల్లి సత్తిరాజు 97049 03463
Exclusive: Suresh Babu walks out of ENE Repeat
Ee Nagaraniki Emaindi is a cult classic in Telugu cinema and it impressed the youth big time. After Pelli Choopulu, director Tharun Bhascker picked up a film on bonding between four friends and the film is all about their life experiences. After years, the sequel for the film titled ENE Repeat was announced early this […] The post Exclusive: Suresh Babu walks out of ENE Repeat appeared first on Telugu360 .
యూట్యూబ్ నేర్పిన దారుణ హత్య #Crime #Visakhapatnam #YouTubeMurder #PoliceInvestigation #LalithaArrest
శివాలయాల్లో భక్తుల తాకిడి.. సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీకమాసం
పిల్లలమర్రికి భక్తుల తాకిడి
శివాలయాల్లో ప్రత్యేక పూజలు సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని
నితీశ్ కు అగ్ని పరీక్ష..? రెండు దశాబ్ధాల పాటు వరుసగా సీఎంగా కొనసాగుతూ
యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్నెస్తో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది. దర్శకుడు వరుణ్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించాడు, శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో ఎంటర్టైనింగ్ చేశారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ “ఈ సినిమాలో ఫన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. అందరికీ నచ్చే యూనిక్ ఫన్ ఎంటర్టైనర్ ఇది”అని అన్నారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ “చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. ఈ సినిమాతో నందులోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు”అని తెలిపారు.
గోడకు రంధ్రం వేసి 15 కిలోల వెండి చోరీ #Crime #Medchal #JewelleryTheft #DundigalPolice #viralvideo
అత్తను చంపడానికి యూట్యూబ్ లో సెర్చ్... దాగుడుమూత ఆట పేరుతో పెట్రోల్ పోసి తగలబెట్టింది
అమరావతి: అత్త వేధింపులు ఎక్కువ కావడంతో యూట్యూబ్లో వీడియోలు చూసి ఆమెపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి ఆపార్ట్మెంట్ ఎఫ్ బ్లాకులో కనకమహాలక్ష్మి (66) అనే వృద్ధురాలు తన కుమారుడు, కోడలితో కలిసి ఉంటుంది. అత్త తన భర్తకు లేనిపోనివి చాడీలు చెప్పి తనని వేదిస్తుందని కోడలు పగ పెంచుకుంది. అత్తను చంపడానికి యూట్యూబ్లో సెర్చ్ చేసింది. 'హౌటు కిల్ ఓల్డ్ లేడీ' అని సెర్చ్ చేసింది. నవంబర్ 6న సాయంత్రం పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లో దాచి పెట్టింది. నవంబర్ 7న ఉదయం 8 గంటలకు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. లలిత తల్లి స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లింది. ఇదే సరైన సమయం అనుకొని పిల్లలను అత్తతో దాగుడు మూతలు ఆట ఆడుకోవాలని సూచించింది. అత్తను చైర్లో కూర్చొబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లు, నోటికి గంతలు కట్టేసి దాక్కోమ్మని పిల్లలకు చెప్పింది. పిల్లలను గదిలోనికి పంపించిన తరువాత అత్తపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. అత్త అరుపులు బయటకు వినపడకుండా టివి సౌండ్ పెద్దదిగా పెట్టింది. మంటలకు కట్లు కాలిపోవడంతో చైర్లో నుంచి వృద్ధురాలి లేచి దేవుడి రూమ్ వైపుకు పరుగులు తీసింది. మనవరాలికి కూడా మంటలు అంటుకోవడంతో చేతులు, కాళ్లు కాలిపోయాయి. టివి వైర్లు తగిలి నాన్నమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పింది. బాత్రూమ్లో నుంచి లలిత తల్లి బయటకు వచ్చేసరికి కనకమహాలక్ష్మి కాలిపోయి కనిపించింది. ఎదురింట్లో ఎసి బిగిస్తున్న వ్యక్తి మంటలను ఆర్పడానికి ఇంట్లోకి పరుగెత్తుకొచ్చాడు. అతడిని ఇంట్లోకి రానివ్వకుండా కోడలు ఆపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులున ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎసి బిగిస్తున్న వ్యక్తిని వివరాలు పోలీసులు అడిగి తీసుకున్నారు. వెంటనే ఆమె ఫోన్ తీసుకొని యూట్యూబ్లో హిస్టరీలో ఓపెన్ చేశారు. 'హౌ టు కిల్ ఓల్డ్ లేడీ' అని ఆమె పలుమార్లు సెర్చ్ చేసినట్టు గుర్తించారు. కోడలిని అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించారు. తనని అత్త వేధించడంతోనే హత్య చేశానని కోడలు ఒప్పుకుంది. వెంటనే ఆమెపై పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Huge Social Media Appreciation for The Girlfriend
Top actress Rashmika attempted an interesting film ‘The Girlfriend’, a film that is filled with emotional drama and a strong message. The box-office numbers have seen a steady rise on the second day when compared to the registered openings on day one. The film is appreciated across social media well. The film’s director Rahul Ravindran […] The post Huge Social Media Appreciation for The Girlfriend appeared first on Telugu360 .
అదరగొట్టిన పవర్ఫుల్ ‘తాండవం’ ప్రోమో
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ అఖండ 2: తాండవం నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పవర్ఫుల్ బీట్స్, డివోషనలో చాంట్స్తో ఈ సాంగ్ని అద్భుతంగా కంపోజ్ చేశారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకంతో బాలకృష్ణ చేసిన అఖండ తాండవం గూస్ బంప్స్ తెప్పించింది. ప్రోమో సాంగ్పై అంచనాలని భారీగా పెంచింది. ఫుల్ సాంగ్ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖండ 2: తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Thaman appeals to Prabhas’ fans, gives an update
Prabhas starrer The Raja Saab, a horror comedy with jump scares and humourous romance, is slated for release on January 9th as a Sankranti gift. As the release date is just two months away, fans are eagerly waiting for the team to kick start promotions to amplify the hype on the film as it is […] The post Thaman appeals to Prabhas’ fans, gives an update appeared first on Telugu360 .
యువకుని మృతదేహం లభ్యం.. జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని
వణికిపోతున్న ఢాకా ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: పదవీచ్యుతుడైన ప్రధాన మంత్రి షేక్ హసీనా
50 మిలియన్ల వ్యూస్తో ‘మీసాల పిల్ల..’ హల్చల్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల...’ 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్కి కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పింది. హిట్మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఆ వైబ్ను అద్భుతంగా అందించిన సాంగ్ మీసాల పిల్ల. భీమ్స్ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్ ట్యూన్, బీట్లతో ఈ పాట దేశవ్యాప్తంగా చార్ట్బస్టర్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి తన సిగ్నేచర్ చార్మ్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా నయనతారతో ఉన్న సీన్స్లో ఆయన టైమింగ్ ఫ్యాన్స్ని అలరించింది. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ గాత్రాలు కట్టిపడేశాయి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్ ఎక్కడ చూసినా మీసాల పిల్ల ఫీవర్నే కనిపిస్తోంది. అభిమానులు డాన్స్ చేస్తూ, రీమిక్స్లు చేస్తూ, తమ ప్రేమను అద్భుతంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మిగతా సాంగ్స్పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు 2026 సంక్రాంతికి గ్రాండ్గా విడుదల కానుంది.
జురేల్ శతకం.. గెలుపు దిశగా టీమిండియా
ముంబై: సౌతాఫ్రికాఎతో జరుగుతున్న అనధికార టెస్టులో టీమిండియా ఎ జట్టు గెలుపు దిశగా దూసుకెళుతోంది. తొలి టెస్టులో భారీవిజయంతో ఆధిక్యంలో ఉన్న భారత్ఎ రెండో టెస్టులోనూ అదే జోరును కొనసాగిస్తోంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(127 నాటౌట్) రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీతో చెలరేగాడు. అతని తోడు జట్టు సారథి రిషభ్ పంత్(65 నాటౌట్) సయితం అర్ధ శతకంతో రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ను 382/-7వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. చివరిదైన నాలుగో రోజు ఆదివారం ప్రత్యర్థి బ్యాటర్లను ఆటకట్టిస్తే సునయాస విజయం ఖాయం. తొలి ఇన్నింగ్స్లో ధ్రువ్ జురెల్ (132 నాటౌట్) సెంచరీతో గాడిలోపడిన భారత్.. బౌలర్ల విజృంభణతో సఫారీలను 221కే ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ విఫలమైనా.. జురెల్ మెరుపు శతకంతో జట్టును మరోసారి గట్టెక్కించాడు. 17 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడిన పంత్.. హర్ష్ దూబే(84) వికెట్ పడ్డాక బ్యాటింగ్ వచ్చి చెలరేగాడు. జురెల్తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించిన పంత్.. సిక్సర్తో అర్ధ శతకం సాధించాడు. అప్పటికే ఆధిక్యం 400 మార్క్ దాటింది. టైమింగ్ కుదరక పంత్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. దీంతో 382/-7 వద్ద భారత ఏ జట్టు రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి, 416 పరుగుల భారీ లక్షాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. అనంరతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీఏ జట్టు ఆట ముగిసేసరికి 25 పరుగులు చేసింది. ఓపెనర్లు జొర్డాన్ హెర్మన్(15 నాటౌట్), లెసెగో సెనొకెవెనె(9 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్లో బంతిలో చెలరేగిన ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సిరాజ్లు మరోసారి రాణిస్తే.. సౌతాఫ్రికా బ్యాటర్లు కట్టడి చేయడం తేలికే.
ఖాట్మండులోనూ ఢిల్లీ తరహాలోనే..
రన్వే లైటింగ్ వ్యవస్థలో సమస్యలుఖాట్మండు: (నవంబర్ 9) రన్వే లైటింగ్ వ్యవస్థలో సమస్యలు
నేటితో అంతా గప్ చుప్.. రాష్ట్రమంతా ఆసక్తితో ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప

26 C