Ticket | భారీ ఆదాయం.. మోపిదేవి, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి
Tadwai | బైక్ అదుపుతప్పి… ఒక్కరు మృతి Tadwai | తాడ్వాయి, ఆంధ్రప్రభ
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ ఐ యామ్ గేమ్’ మూవీతో అలరించబోతున్నారు. వేఫెరర్ ఫిలిమ్స్ సమర్పణలో నహాస్ హిధాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నైట్ క్లబ్, క్యాసినో బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ షూట్ వేసుకున్న దుల్కర్ రక్తం తడిసిన చేతితో గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం అదిరిపోయింది. ఈ చిత్రంలో మిస్కిన్ , ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
MLA | పుట్టినరోజున సైతం… MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : నిరంతరం
Telangana : నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు
నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు తెలంగాణలో ప్రారంభం కానున్నాయి.
Revanth Reddy : ఫుట్బాల్ ప్రాక్టీస్ లో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు
ఆమె అతడి కోసం ఎదురు చూస్తోంది కాల్వ ఒడ్డున చెట్టు కింద కూర్చుని అతడు ఇంకా రాలేదు సాయంకాలపు గాలిలో కలిసి సూర్యుడు మెరుస్తున్నాడు పారే ఏరు కూడా వందల కళ్ళతో రెప్పలు తెరిచి చూస్తోంది చెట్టు కూడా చుట్టూ తిరిగి చూస్తోంది అతడి జాడ కోసం ఆమె తన జూకాలకు వేలాడుతోంది చూపుడు వేలికి చుట్టిన కొంగులో నలిగిపోతోంది ఆమె పాదాల కింద పచ్చగడ్డి మౌనంగా తలదించుకుంది ఆమె ఉఛ్వాస నిశ్వాసలు సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి ఆకాశం రాలుతోంది చెట్ల ఆకుల సందుల్లోంచి కొద్ది కొద్దిగా సాయంకాలపు ధూళిలోకి చీకటి వచ్చి వాలుతోంది ఏకాంతాన్ని మరింత దట్టంగా మార్చేస్తూ సూర్యుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు భూమి ఆమె చుట్టూ తిరుగుతోంది కాళ్ళ మీంచి దుప్పటిని పైకి లాక్కుంటోంది కదిలీ కదలక పారుతున్న ఏరు చెట్టు నిద్రపట్టని కుక్కపిల్లలా ఆమె పక్కనే కూర్చుని చెవులాడిస్తోంది ఆమె లోపల గుత్తులు గుత్తులుగా విచ్చుకుంటున్నాయి నక్షత్రాలు ఈ అద్భుతంలోకి దేహాంతర దేహాలతో అతడు వస్తున్నాడు ఒక్కటైన ఇద్దరి ఏకాంతం ఒక్కటైంది గాఢంగా పాలపుంతల ఆత్మగానాల గాలులే ఇక నిలువెల్లా - పసునూరు శ్రీధర్ బాబు
అమరావతిలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వ స్తున్న డివైన్ యాక్షన్ ఎక్స్ట్రావగాంజా ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా రు. ఎం తేజస్విని నందమూరి సగర్వం గా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెం డు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో జనని అనే క్యారెక్టర్లో కనిపిస్తాను.జనని ఎప్పుడు ప్ర మాదంలో ఉన్న అఖండ తనకోసం వస్తారు. లెజెండరీ నందమూరి బాలకృష్ణతో నటించడం నా అదృష్టం. బోయపాటి శ్రీను ప్రో త్సాహం నాలో మరింత ఎనర్జీని నింపింది. జననీ పాత్ర కోసం బోయపాటి నన్ను ఎం చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన స్టార్స్ బాలయ్య, అల్లు అర్జున్, ప్రభాస్. ఇక నాకు సంజయ్ లీలా బన్సాలీ సినిమాలో చేయాలని ఉంది. ఆయన హీరోయిన్స్ ని చూపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నాకు అన్ని రకాల జానర్స్ చేయాలనీ వుంది‘ అని అన్నారు.
సర్పంచ్ పదవికి నామినేషన్ కోసం ప్రియురాలితో పెళ్లి!#TeluguPost #telugu #post #news
ఒట్టి చేతులతోనే రుణపడి వెళుతున్న
తొమ్మిది నెలలు మోసి, పురుడు పోసి, జన్మనిచ్చి జీవితాన్ని నేర్పి ఎద మీద ఆడించి, లాలించి పాలిచ్చిన తల్లికి పాదాభివందనాలు తెలిపానని చెప్పండి ఎప్పుడూ నన్నే చూస్తున్న గుంజకు కట్టేసిన తెల్లావు దూడకు నేను కనిపించనని చెప్పకండి పొలంలో నాతో సాగు చేసిన నాగలికి, జత ఎడ్లకు చిగురు తొడుగుతున్న పంటకు నేను మీతో పాటే ఆకలికి ఇక ఏడవనని చెప్పకండి ఎండకు, వానకు, చలికి,కూడ నేను అలసి ఒరిగి సేద తీరటానికి ఇక రానని చెప్పకండి చిరుగాలికి చెప్పకండి నాపై కారుతున్న చెమట వరదను ఇట్టే పట్టుకుపోవాల్సిన అవసరం లేదని మేఘానికి చెప్పకండి నాకు ఎండను కాసేందుకు ఇక రావద్దని అరుగు మీద పిల్లలకు చెప్పకండి నాకోసం వెతకమని నేను అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోని నవయుగపు కాలాన్ని తెస్తందుకు వెళుతున్న - గుండెల్లి ఇస్తారి
Ditva Cyclone : రెడ్ అలెర్ట్.. ముంచేస్తుందంటరోయ్.. పారా హుషార్
దిత్వా తుపాను దూసుకు వస్తుంది.
100 Years |మండల వెంకట కృష్ణారావు..
100 Years | మండల వెంకట కృష్ణారావు.. 100 Years, ఆంధ్రప్రభ :
Delhi : ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతుంది.
తెలుగులో మొదటి నార్డిక్ క్రైం ఫిక్షన్ నవల.. జార్ సిటీ
స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్ లాండ్లకు చెందిన రచయితలు గత కొన్ని దశాబ్దాలు గా గొప్ప క్రైమ్ ఫిక్షన్ నవలలు రాస్తున్నారు. ఎక్కువ శాతం ఇవి నేర పరిశోధన ముఖ్యాంశంగా ఉం టాయి. ఈ భాషల్లో వచ్చే నేర కథల సాహిత్యం ‘నార్డిక్ క్రైమ్ ఫిక్షన్’ పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. అలా నవలలు రాసి ప్రసిద్ధులైనవారిలో నార్వేకు చెందిన జో నెస్బో, స్వీడన్కు చెం దిన హెన్నింగ్ మాంకెల్, స్టీగ్ లార్సన్, కెమిల్లా లాక్బర్గ్, డెన్మార్క్కు చెందిన సారా బ్లేడెల్, ఐస్ లాండ్కు చెందిన ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ ముఖ్యులు. ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ రాసిన ప్రసిద్ధ నవల, ‘జార్ సిటీ’ని వై.కృష్ణజ్యోతి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ మధ్యనే ఛాయా పబ్లికేషన్స్ నించి విడుదలైంది ఈ నవల. ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ ఐస్లాండ్కు చెందిన సుప్రసిద్ధ డిటెక్టివ్ నవలల రచయిత. ఆయన గతంలో జర్నలిస్టుగా, ఫిల్మ్ క్రిటిక్గా పనిచేశారు. డిటెక్టివ్ ‘ఎర్లెండర్’ ప్రధానపాత్రధారిగా ఆయన ఇప్పటిదాకా పదకొండు నవలలు రాశారు. ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ వరుసగా రెండు సంవత్సరాలు నార్డిక్ క్రైమ్ నవల బహుమతి (Nordic Crime Novel Prize) గెలుచుకున్న అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అంతేకాక, ఆంగ్ల భాషలో అత్యుత్త మ నేర నవల కోసం ఇచ్చే ప్రపంచ ప్ర ఖ్యా త CWA గోల్డ్ డాగర్ అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు. ఆర్నాల్డుర్ నవల లు ప్రపంచవ్యాప్తంగా 40 భాషలలో ఇప్పటిదాకా 14 మిలియన్ల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. కథలోకెళితే హోల్బర్గ్ అనే వయసు పైబడ్డ వ్యక్తి ఇంట్లో హత్య చేయబడటంతో మొదలవుతుంది. హత్యా స్థలంలో హంతకుడు రాసివెళ్ళిన నోట్ తప్ప వేరే ఆధారాలేం దొరకవు. రేకవిక్ నగరంలో మొదలైన పరిశోధన, ఐస్లాండ్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి, ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగి చివరికొస్తుంది. ఇన్స్పెక్టర్ ఎర్లెండర్ ఈ పరిశోధనకు ఆధ్వర్యం వహిస్తాడు. ఎర్లెండర్ కుటుంబ జీవితం అంత సజావుగా సా గుతూ ఉండదు. ఎ ర్లెండర్కు ఇద్దరు ఎదిగిన పిల్లలు. వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి, ఇబ్బంది పడు తూ, పెడుతూ ఉం టారు. ఎర్లెండర్తో పనిచేసే పోలీస్ ఆఫీసర్ల పాత్రలు కూడా నవలలో కీలకం. యాబైమూడు సంవత్సరాల వయసులో అకస్మాత్తు గా మరణించిన బెర్నార్డ్ స్కడర్ ఈ నవలను ఐస్లాండిక్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఆయన ఐస్లాండిక్ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ప్రముఖులలో ఒకడు. కాంటర్బరీలో జన్మించిన ఆయన, యార్క్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. 1977లో ఆయన రేక్జావిక్ విశ్వవిద్యాలయంలో ఐస్లాండిక్ భాషను అభ్యసించడానికి వెళ్లారు. ఆ తర్వాత ఐస్లాండ్ రివ్యూ, న్యూస్లో రిపోర్టర్గా, రాయిటర్ న్యూస్ ఏజెన్సీ కరస్పాండెంట్గా పనిచేశారు. అనేక సంవత్సరాలు కవిత్వం రాస్తూ సాహితీ అనువాదకుడిగా కూడా ఆయన గొప్ప గౌరవాన్ని పొందారు. ఆయ న అనువదించిన పురస్కారం పొందిన నవలల్లో థోర్ విల్హెల్మెసన్ రచించిన జస్టిస్ అన్డన్, గుడ్బెర్గర్ బెర్గెన్ రచించినది స్వాన్, ఎనార్ మార్ గుడ్మండ్సన్ రచించిన ఏంజెల్స్ ఆఫ్ ది యూనివర్స్, ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ అవార్డు గెలుచుకున్న నవలలు ఉన్నాయి. ‘జార్ సిటీ’ తెలుగులోకి అనువాదం చేసిన వై.కృష్ణజ్యోతి గత ఇరవై ఏళ్ళుగా అనువాద రంగంలో ఉ న్నారు. ‘జార్ సిటీ’ ఆమె అనువాదం చేసిన మొ దటి క్రైమ్ ఫిక్షన్ నవల. - హర్షణీయ బృందం
కొండ పోచమ్మ సాగర్: హైదరాబాద్ సమీపంలో ప్రశాంతమైన వీకెండ్ గెట్అవే
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో ఉన్న కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ మాత్రమే కాదు, హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ముఖ్యమైన భాగమైన ఈ జలాశయం, చుట్టూ కొండలు, ప్రశాంతమైన నీటితో కనువిందు చేస్తుంది. హైదరాబాద్ నుండి ఆహ్లాదకరమైన ప్రయాణం హైదరాబాద్ నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పోచమ్మ సాగర్కు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా […] The post కొండ పోచమ్మ సాగర్: హైదరాబాద్ సమీపంలో ప్రశాంతమైన వీకెండ్ గెట్అవే appeared first on Dear Urban .
Students |సస్పెండ్.. కారణం ఇదే..
Students | సస్పెండ్.. కారణం ఇదే.. Students, బాపులపాడు, ఆంధ్రప్రభ : బాపులపాడు
Tirumala : తిరుమలలో ఘాట్ రోడ్డులో ప్రయాణంలో జాగ్రత్త.. తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చా ర్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 72 మిలియన్లకు పై గా వ్యూస్ ని సంపాదించి ఇప్పటికే ఈ చిత్రం భారీ అం చనాలను సృష్టించింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ ని విశేషంగా అలరించనుంది. హైదరాబాద్ లో వేసిన భా రీ సెట్లో చిరంజీవి, వెంకటేష్ లపై స్టైలిష్ డ్యాన్స్ సాం గ్ షూటింగ్ ని మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా, చిరంజీ వి, వెంకటేష్ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్ లో కలిసి అలరిస్తున్నా రు.ఈ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలి యో అద్భుతమైన బీట్స్తో పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేశా రు. ఈ పాటలో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నా రు. ఈ పాటలో సెట్ ని కలర్, రిథమ్, వైబ్ ల కార్నివాల్ గా మార్చారు. ఇద్దరు స్టార్ల కెమి స్ట్రీ, ఎనర్జీ ప్రేక్షకులని అభిమానులను ఫుల్గా ఎంటర్టైన్ చేయనుంది. చిరంజీవి, వెం కటేష్ కలసి అదరగొట్టబోతున్న ఈ సాంగ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫీస్ట్ కానుంది. త్వరలోనే చిరంజీవి నయనతారలపై చిత్రీకరించిన ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు.
What’s Next from Mana Shankara Vara Prasad Garu
Megastar Chiranjeevi and successful director Anil Ravipudi’s first outing is Mana Shankara Vara Prasad Garu and the film is announced for Sankranthi 2026 release. The first single ‘Meesaala Pilla’ is a stupendous hit and the film is trending on the music charts from the past few weeks. The team is now gearing up to release […] The post What’s Next from Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .
రచయిత శ్రీ పద్మతో మెహఫిల్ గెస్ట్ ఎడిటర్ విమల ఇంటర్వూ డాక్టర్ శ్రీ పద్మ దక్షిణాసియా సాంస్కృతిక చరి త్ర పరిశోధకులుగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినవారు. మన తెలుగువారు. దాదాపు ఇరవై ఏళ్లపాటు ఆవిడ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటనలు, చేసి, గ్రామ దేవతల ఆవిర్భావము, చారిత్రక పరిణామాలపై, లోతైన అకాడమిక్ పరిశోధన చేశారు. ఈ చరిత్ర పరిశోధన, విశ్లేషణ ఈనాటి సమాజంలోని అనేక ప్రశ్నలకు కూడా సమాధానాలను అందించేదిగా ఉంది. డాక్టర్ శ్రీ పద్మ గ్రామదేవతలపై ’‘Vicissitudes of the Goddess : Reconstructions of the Gramadevata in India’s Religious Traditions’ అనే పుస్తకాన్ని రాయగా, 2013లో ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ దీనిని ప్రచురించింది. ఇటీవలే ఈ పుస్తకాన్ని తెలుగులోకి ‘గ్రామ దేవత-చారిత్రక పరిణామం’ అనే పేరుతో అరుణ ప్రసాద్ అనువదించగా, అజు పబ్లికేషన్ ప్రచురించింది. హైదరాబాద్ నగరంలోని సాంస్కృతిక ఆవరణ లామకా న్లో పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సందర్భం గా హైదరాబాద్ నగరానికి వచ్చిన శ్రీ పద్మతో మెహఫిల్ గెస్ట్ ఎడిటర్ విమల సంభాషిం చారు. శ్రీ పద్మ గారు మీరు ఒక గొప్ప పుస్తకాన్ని తెలుగు వాళ్లకి అందించారు. మీ నేపథ్యం గురించి కొంచెం వివరిస్తారా? నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న, మా తాతగారు అందరూ వ్యవసాయ కుటుంబం వాళ్ళే. మేము మా నాయనమ్మ ఇంట్లో పెరిగాము. ఆమెకి మా నాన్నగారు ఒక్కడే కొడుకు. నానమ్మకి అన్నదమ్ములు ఎవరూ లేరు. మా నానమ్మ తన తం డ్రి ఇంట్లోనే ఉండింది. ఆయన కట్టించిన ఇంట్లోనే మేమంతా ఉన్నాము. మొన్నటివరకు కూడా. చిన్న విలేజ్లో పెరిగాను నేను. మూడేళ్లప్పుడు ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ నన్ను అప్పుడే మా మేనత్త గారి ఇంటికి పంపించారు. మా నాయనమ్మ స్కూల్కి ఏమి వెళ్ళలేదు కానీ, అక్కడ, దడి పక్కన నలబడి వింటూ నేర్చుకున్నారట. ఆమె కావ్యాలు, భారత భాగవతాలు ఎప్పుడూ చదువుతూ ఉండేది. పద్యాలు కూడా రాసింది చందస్సు తోటి. చాలా తెలివి ఉన్న మనిషి ఆమె. తెలివి ఉండటమే కాదు, ఆమెకి తనకు చాలా తెలివి ఉందని కూడా తెలుసు. చాలా క్రిటికల్గా ఉండేది. నిజంగా ఆమె ఒక ఫోర్స్. ఆమెకి, ఆమె స్నేహితులకి నేను ఫిలాసఫీ చదివేదాన్ని. మా అమ్మతో కూడా ఆమె చదివించుకునేదట నాకన్నా ముందు. అయితే మీరు చిన్నప్పటినుంచి పురాణాలు, సాహిత్యం ఇలాంటి వాతావరణం మధ్య పెరిగా రన్నమాట. మీరు ఎక్కడ చదువుకున్నారు? అవును అలాంటి వాతావరణమే ఉండింది నా చుట్టూ. నేను ఇట్లా రాయడం వెనుక కూడా ఈ వాతావరణమే ఉంది అని నా గట్టి నమ్మకం. మామూలు స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో మైలవరంలో చదువుకున్నాను. గుడ్లవల్లేరులో ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్ చదివే నాటికి నిజానికి నాకు అంత వయసు లేదు. నేను ఇంటికొచ్చేసరికి నా పెళ్ళికి ఐదు రోజులే సమయం ఉందని తెలిసిం ది. నా పెళ్లికి మాత్రం నా స్నేహితుల్ని ఎవరిని పిలవలేదు. ఎందుకంటే ఆ పెళ్లి మా ఇంట్లో జరగలేదు. పెద్దవాళ్లు డిసైడ్ చేసుకుంది అంతా. వాళ్లు నాకు చెబుదామని అనుకోలేదు. సెలవులకు వచ్చినప్పుడు నన్ను చూపించారు. అప్పుడు నేను ఏడ్చా ను. ఎందుకు నన్ను చూపిస్తున్నారు అని. పెళ్లినాటి కి నాకు 15 ఏళ్లు. 1972లలో నా పెళ్లి జరిగింది. 1990లలో కూడా ఇంకా బాల్య వివాహాలు జరగడం చూశాను మా గ్రామం వచ్చినప్పుడు. అయితే మీది చైల్డ్ మ్యారేజ్ అన్నమాట? చైల్డ్ మ్యారేజ్ అని చిన్నగా అంటున్నారా. అవును. నాకు చాలా గట్టి భావాలు ఉండేవి. కానీ నాకు ఏం చేయాలో అప్పుడు తెలియలేదు. అప్పుడు నేనేం ఆ లోచిస్తున్నాను అనేది ఎవరూ పట్టించుకోలేదు. ఏదేమైనప్పటికీ, నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అయినప్పటికీ చదువు కంటిన్యూ చేశాను. మెడిసిన్ చదవాలని కోరిక ఉండేది. మా నాయనమ్మ అంటే నాకు ఎడరేషన్ ఉన్నది బట్ సేమ్ టైం, ఇప్పుడు నేను రీసెర్చ్ చేసి ఉన్నాను కదా, నా గురించి కూడా నే ను క్రిటికల్ గానే ఉంటాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ విషయమే కాదు, ఇంకా అనేక విషయాలపై కూడా, నన్ను నేను జడ్జ్ చేసుకోవడం కూడా ఎక్కువే. అది అలవాటైపోతుంది. ప్రతి దాన్ని ఎనలిటికల్గా చూస్తాము. అన్నింటినీ బాగా విశ్లేషణ చేస్తాం. మా నాయనమ్మని కూడా నేనే ఎక్కువ ఎనలైజ్ చేసాను. ఏ పుస్తకం రాసినా చెప్తా ను. నా ఇన్స్పిరేషన్ మా నాయనమ్మ నుంచి వ చ్చిందని. ఈ పుస్తకంలో కూడా చెప్పాను. నా పెళ్లి తర్వాత కూడా నేను చదువు కంటిన్యూ చేశాను. మొదట బిఎ హిస్టరీ చేశాను. అప్పుడు వైజాగ్లో, చిన్న వాల్తేరులో ఉన్నాము. ఆంధ్ర యూనివర్సిటీ లో అప్లై చేశాను. బిఎ స్పెషల్ తెలుగు, హిస్టరీ చేశా ను. నేను ఎంఎ, ఆర్కియాలజీ, ఆ తరువాత ఎంఎ హిస్టరీ చేశాను. దీని తర్వాత పిహెచ్డి కూడా చేశా ను. టెంపుల్స్ మీద రీసెర్చ్ చేశాను. టెంపుల్ ఆర్ట్ లో కాస్ట్యూమ్స్ అండ్ ఆర్నమెంట్స్ మీద చేశాను. టెంపుల్స్లో స్రీలు, పురుషులు సెక్యులర్ ఫిగర్స్గా ఉండేవాళ్ళు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అనేక రకాలైన హెయిర్ స్టైల్స్ చూశాను గుళ్ళలో. మిడీవల్ టైమ్స్లో మగవాళ్ళు, ఆడవాళ్లు ఎంతో ఆర్టిస్ట్గా శిరోజాలు అలంకరించుకునేవారు. దీనిపైన రాసిన పుస్తకం ఆగం కళా ప్రకాశన్, ఢిల్లీ వారు వేశారు. అది నా ఫస్ట్ రీసెర్చ్ పుస్తకం. ఆ తరువాత నాకు యూజీసీ రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ వచ్చింది. మా ఆంధ్ర యూనివర్సిటీలోనే. 1990 ప్రాంతంలో వచ్చింది. 3+2 ఇయర్స్ ఇస్తా రు ఫెలోషిప్. 1994లో హార్వర్డ్ ఫెలోషిప్ వస్తే వె ళ్ళాను నేను పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, విసిటింగ్ ప్రొఫెసర్గా. అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నేను టీచ్ చేస్తున్నాను. మా డిపార్ట్మెంట్ లోనే కొన్ని క్లాసులు ఇస్తే అవి టీచ్ చేసేదాన్ని. 1989కి నా పిహెచ్డి పూర్తి చేశాను. ఆ తరువాత ఒక సంవత్సరం యూనివర్సిటీలోనే సెంటర్ ఫర్ మెరైన్ ఆర్కియాలజీలో పరిశోధన చేశాను. దాంట్లో నా పని వివిధ ప్రాంతాల్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఓల్డ్ పోర్ట్స్ను కనుగొనడం, వాటికి బుద్ధిజంతో ఉ న్న సంబంధం చూడడం. బుద్ధిస్టు స్థూపాలు సాధారణంగా వాణిజ్య మార్గాల అంతట ఉండేవి. వాణి జ్యం మధ్యయుగాలలో దక్షిణ భారతదేశంలో ఎలా ఉండేది, కోస్తా తీర ప్రాంతాలలోని పోర్టుల వద్ద పరిశోధించడం సులభంగా ఉంటుంది కొంత. ఒక ఏడాది పాటు ఈ పరిశోధన చేశాను. ఉమెన్స్ రిలీజియన్ ప్రోగ్రాంలో భాగంగా నాకు ఫెలోషిప్ వచ్చింది. నేను ప్రత్యేకించి అమ్మ దేవత అంశాన్ని నా పరిశోధన కోసం ఎంచుకున్నాను. బుద్ధిజంపైన చేస్తున్న పరిశోధన విమెన్ గాడ్స్, గ్రామ దేవతలపైకి మళ్ళడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ‘స్త్రీల స్థానం సమాజంలో అంత తక్కువగా ఎందు కు ఉంది? అదే సమయంలో కాళీ, దుర్గ వంటి దేవతలకు అంత ఉన్నత స్థానం సమాజంలో ఎందుకుంది?’ ఈ విషయాన్ని నేను పదేపదే ఆలోచించా ను. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. స్త్రీ దేవతల చరిత్రను పరిశీలించటం మొదలుపెట్టాను. నన్ను నేను కూడా అనలైజ్ చేసుకున్నాను. ఎందుకు నేను ఇట్లా ఒక టాపిక్ నుంచి మరో టాపిక్కి జంప్ చేస్తున్నా ను అని. నేనెప్పుడూ క్లిష్టంగా ఉండే విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాను. అట్లా ఎందుకు చేస్తానో నాకు కూడా తెలియదు. ఏదైనా ఒక అం శంపైన మాట్లాడమన్నా, ఇంతకుముందే నేను ఆ విషయం పైన రాసి ఉన్నా, పేపర్ ప్రజెంట్ చేయాలన్నప్పుడు, ఆల్రెడీ దానిపైన మాట్లాడే ఉన్నప్పటికీ అనేక విషయాలు తెలిసినా, ప్రతిసారి నేను కాంప్లికేటెడ్గానే ఆలోచిస్తాను. వేరు వేరు కోణాల నుంచి, రకరకాల డీవియేషన్స్ని, ఇది ఇట్లా ఎందు కు ఉంది, అది అట్లా ఎందుకు లేదు అంటూ.. వచ్చే ఈ ఆలోచనలను నేను ఆపలేను. అది ఒక ప్రాబ్లం కూడా ఏమో నాకు తెలియదు కానీ, ఆ పని తెలిసి కూడా చేస్తూ ఉంటాను. అందరూ చేస్తున్న అదే పనిని చేయాలనిపించదు. కొత్తగా చేద్దామని అనుకుంటాను. అయితే అది మనల్ని కష్టమైన పరిస్థితుల్లో కూడా నెడుతుంది. అప్పటికే వేసి ఉన్న దారుల్లో కంటే కొత్తదారుల్ని, మన సొంత దారిని వేయడం, ఒక ప్రత్యేకత కూడా. పురుష దేవుళ్ళ మీద జరిగినంత పరిశోధన విమె న్ గాడెసిస్ మీద జరిగినట్టు లేదు. రీసెర్చ్లోనూ మెయిల్ ఓరియంటెడ్ పరిశోధనలు ఉంటాయా? మహిళా దృక్పథంతో ఈ అంశంపై పరిశీలన చేయాలి అని మీరు అనుకున్నారా? ఉన్నది అలాంటి దృక్పథం. అందుకే నేను ప్రత్యేకిం చి ఈ సబ్జెక్టును ఎంచుకున్నాను. పరిశోధన చేయాలంటే చాలా అంశాలే ఉంటాయి. మతము, మహిళలు వంటి అంశాలు కూడా ఉంటాయి. నాకెందు కో అందరూ చూసే అంశాలని ఎంచుకోవాలని అ నిపించదు పరిశోధనకి. మళ్లీ నన్ను నేను ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్లో పెట్టుకుంటాను (నవ్వు) సులభమైన దారిని ఎంచుకోను. ఇది మీ స్టయిల్ కావచ్చునేమో..? అవును మీరు అన్నది కరెక్ట్. నా దారిని నేను స్వ యంగా వెయ్యాలి అని అనుకుంటాను. అందుకే ఈ అంశాన్ని ఎంచుకున్నాను. అమెరికాలో కరుకు లం మారుతూ ఉంటుంది. ఏళ్ల తరబడి అదే పాత సిలబస్ కాకుండా, కొత్త విషయాలు, కొత్త పరిశోధనలు మన అధ్యయనంలో రావాలి. అప్పుడే విద్యార్థులు ఇప్పుడు జరుగుతున్నది ఏమిటో తెలుసుకోగలుగుతారు. అవును ఆ కాలంలో కూడా గొప్ప స్కా లర్స్ ఉన్నారు. పరిశోధన చేశారు. కొన్ని తరాలుగా ఎలాంటి పరిశోధనలు జరగలేదని మనం అనలేం వాళ్ళు చేశారు. అమెరికా వెళ్ళాక, అక్కడ రీసెర్చ్ చూశాక నాకు అర్థమైంది మన విద్యా వ్యవస్థలో, కరికులం రూపొందించుకో వడంలో, పరిశోధనలో ఎక్కడో స్టాగ్నేషన్ వచ్చింది అనుకుంటాను.. అంతే కదా? అవును. అలాంటి స్థితి వచ్చింది. కానీ బ్రిటిష్ వా ళ్ళ విద్యా విధానం పూర్తిగా తప్పని కూడా అనడం లేదు. కొత్త పరిశోధనలు జరగాలి. సరే మళ్లీ మనం మనం మాట్లాడుతున్న విషయంలోకి వద్దాం. అమెరికా వెళ్ళాక అక్కడ ఒక టీంతో పనిచేస్తున్నప్పుడు చాలా ఆలోచించాను. 16వ శతాబ్దంలో మీరాబా యి, అలాగే ఆండాళ్, అక్క మహాదేవి ఇలాంటి భక్తురాళ్ళు అయిన మహిళలు ఎందుకు ఇలాంటి మార్గం ఎంచుకున్నారు. అక్కమహాదేవి అయితే నగ్నంగా తిరిగింది. దేనికీ కట్టుబడలేదు. కఠినం గా, మారకుండా ఉన్న రూల్స్ అన్నింటినీ ఆమె తిరస్కరించింది. ప్రధాన స్రవంతిలోని వారూ, ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఆమెని విమర్శించారు. ఆమె ని ఒప్పుకోలేదు. ఆమె శివ భక్తురాలు. ఆ రోజుల్లో ఇలాంటి పని చేయడానికి ఆమె ఎంత శక్తిని కూడా తీసుకొని ఉంటుందో కదా! ఆమె ఎక్కువ కాలం జీవించలేదు. ఎందుకంటే సరైన పోషణ, ఆహారం కూడా ఆమెకి దొరకలేదు. కానీ ఆమె ఎటువంటి మనిషి అనుకోవాలి? ఆమె ఎంత ధైర్యవంతురాలు. మగ ప్రపంచంలో ఇలా ఉండగలగడం అంటే.. ఆరాధించదగ్గ మనుషులు వీళ్లంతా. ఎలా వాళ్ళు సాంఘిక కట్టుబాట్లను ఉల్లంఘించారు. ఆధ్యాత్మికంగా కూడా స్త్రీలకి అవకాశం లేదు. సన్యసించటం కూడా మగవాళ్ళకే ఉంది. పెళ్ళాం నచ్చలేదు అనుకోండి, మగవాడు సన్యసించి వెళ్ళిపోతాడు. అదే ఆడవాళ్ళకి? ఆడవాళ్ళకి మోక్షానికి కూడా హక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ధైర్యం చేసి వా ళ్ళు స్వేచ్ఛను కనుగొన్నారు. నేను రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఈ విషయాలతో పాటు అనేక అం శాలను ఆలోచించాను. చివరికి నా, నేను ఎంచుకు న్న అంశం సరిపోతుంది అనిపించింది. కాళీ, దుర్గ ఉన్నారు. దేవతలను, ఆడవాళ్ళను పాట్రనైస్ చేశా రు. నువ్వు చాలా గొప్ప దానివి, అమ్మవి, అని వాళ్ల ని పొగుడుతూ, వాళ్లు మరింత ఎక్కువగా త్యాగా లు చేయడాన్ని, తమకున్నదంతా ఇవ్వడాన్ని ప్రో త్సహించారు. అది వాళ్ళ సొంత లాభాల కోసం జరిగిన పని. మీ పరిశోధనలో భాగంగా మీరు ఏ ఏ ప్రాంతాలు తిరిగారు. మీకు కలిగిన అనుభవాలు ఏమిటి? బ్రిటిషు వాళ్ళు గెజిటీస్ (గెజిట్లు), వాటి ఉద్దేశాలు ఏమైనా కావచ్చు కానీ ఆ డాక్యుమెంటేషన్లో ఇక్క డి జనం పల్స్ ఏమిటో రికార్డు చేసే ప్రయత్నం చే శారు. ఎందుకంటే భారతదేశం సంక్లిష్టమైనది. ‘ఫే స్ అండ్ ఫెస్టివల్’ పేరుతో కొన్ని ప్రత్యేకమైన గెజి ట్స్ తీసుకొచ్చారు. అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. గ్రామాల్లో ప్రజలు ఎవరిని పూజించేవారు వంటి సమాచారం కూడా ఉండింది. వాళ్లు ప్రతి గ్రామం నుంచి కూడా ఇలాంటి వివరాలు సేకరించారు. ఆ కథలు నా పరిశోధనలో ఒక గైడ్గా ఉపయోగపడ్డాయి. మొదట చాలా సమయం నేను ఆర్కైవ్స్లో నోట్స్ తీసుకుంటూ గడిపాను. అట్లా స్త్రీలు దేవతలుగా గ్రామ దేవతలుగా మారారని తెలిసింది. - సశేషం... తరువాయి భాగం వచ్చేవారం
Bigg Boss Telugu 9 Weekend Episode: Fun Games, Tough Questions and Divya’s Exit
The weekend episode of Bigg Boss Telugu 9 delivered a mix of entertainment, emotional moments and hard-hitting reality checks. Host Nagarjuna kept the mood light initially but quickly steered the house into deeper introspection before announcing one more crucial elimination. Fun Task Begins the Episode Nagarjuna opened the show with a lively game. The house […] The post Bigg Boss Telugu 9 Weekend Episode: Fun Games, Tough Questions and Divya’s Exit appeared first on Telugu360 .
November has come to an end and Ram tested his luck with Andhra King Taluka which released on Thursday. Leaving many in shock, the film opened to poor occupancies. The word of mouth is decent but the film did not witness great growth on Friday. The Saturday and Sunday numbers for the film are just […] The post Weekend Box-office: AKT Show appeared first on Telugu360 .
Nara Lokesh : నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్
నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్ బయలుదేరి వెళుతున్నారు
Ditva Cyclone : దిత్వా తుపాను ఎఫెక్ట్.. ఏపీలో రెండు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలెర్ట్
నేడు దిత్వా తుపాను ఎఫెక్ట్ తో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు
1.20 Lakhs Acres Ditwah |రైతుల గుండెల్లో..
1.20 Lakhs Acres Ditwah | రైతుల గుండెల్లో.. 1.20 Lakhs Acres
Flood Effect : వరదల విలయం.. 800 మంది మృతి
ఇండోనేషియా, శ్రీలంక, థాయ్ లాండ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి
మూఢమి మొదలయింది.. మూడు నెలలు ముహూర్తాల్లేవ్... పెళ్లి కాని ప్రసాదులకు కష్టకాలమే
పెళ్లిళ్ల సీజన్ పూర్తయింది. శుభకార్యాలకు బ్రేక్ పడింది.
బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. గర్భవతి
అమరావతి: బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ధర్మవరంలో ఓ గ్రామానికి చెందిన జంట 14 సంవత్సరాల క్రితం ఆడ శిశువును తెచ్చుకొని పెంచుకన్నారు. ఇప్పుడు బాలిక వయసు 14 సంవత్సరాలుగా ఉంది. బాలికపై తండ్రి, తల్లి సోదరుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి బాలిక గర్భం దాల్చిందని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా షాక్కు గురైంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక చెప్పిన వివరాల ప్రకారం పెంపుడు తండ్రి, తల్లి సోదరుడి పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
6th semester krishna university |రీ వాల్యుయేషన్..
6th semester krishna university | రీ వాల్యుయేషన్.. krishna university, మచిలీపట్నం,
Ditwah cyclone |అన్నదాతల ఆందోళన..
Ditwah cyclone | అన్నదాతల ఆందోళన.. Ditwah cyclone, గూడూరు, ఆంధ్రప్రభ :
Under 17 Rugby |జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు..
Under 17 Rugby | జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు.. Rugby |
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి
Pensions | 1వ తారీఖు వచ్చిందిగా..
pensions | 1వ తారీఖు వచ్చిందిగా.. Pensions, ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల
నూజివీడులో కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు.... వీడియో వైరల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సరిహద్దు వివాదంలో రెండు గ్రామాల రైతులు దాడులు చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేవరగుంట, జంగం గూడెం గ్రామాల మధ్య చింతలగట్టులో ఆర్ఎస్ నెంబర్ వన్ ప్రభుత్వ భూమిలో సాగు విషయంలో వివాదం నడుస్తోంది. రాత్రి వేళల్లో పొలంలోని నీటిబోర్లు ధ్వంసం చేయడంతో పాటు నాటిన మొక్కలు తొలగించారు. ఒకరిపై మరొకరు కవ్వింపు చర్యలతో ఇరు గ్రామాల రైతుల మధ్య వివాదం ముదిరింది. రెండు గ్రామాల రైతులు ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఘర్షణలో రెండు గ్రామాలకు చెందిన నలుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Revnanth Reddy : నేటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.
AP | న్యూ టూరిజం పాలసీ.. AP, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం
Chandrababu : నేడు ఏలూరు జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు
India vs South Africa : భయపెట్టారు.. కానీ చివరకు విజయం భారత్ దే
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ టీ20ని తలపించింది
‘సర్పంచ్’ నామినేషన్ కోసం ప్రియురాలితో పెళ్లి
భార్య శ్రీజతో నామినేషన్ వేయించిన యువకుడు స్క్రూటినీకి వెళ్లకుండా కొత్త జంటను ఠాణాలో ఉంచిన పోలీసులు ఎంఎల్ఎ చింతా ప్రభాకర్ జోక్యం.. బాధితులకు అండగా ఉంటామని భరోసా సంగారెడ్డి మండలం, తాళ్లపల్లిలో ఘటన మన తెలంగాణ/సంగారెడ్డి ః పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని నిరాశ చెందిన యువకుడు కులాంతర వివాహం చేసుకుని తన భార్య శ్రీజతో నామినేషన్ వేయించాడు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఇలావున్నాయి. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలం, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సికి రిజర్వ్ కాగా, ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. కానీ నవదంపతుల చర్యతో ఇప్పుడు ఎన్నిక తప్పడం లేదు. బిఆర్ఎస్ మద్దతుతో శ్రీజ నామినేషన్ వేయగా, స్క్రూటినీకి వెళ్లకుండా పోలీసులు అతనిని, అతని భార్యను పోలీస్ స్టేషన్లో ఉంచారు. తాము స్క్రూటినీకి వెళ్లాలని నవ దంపతులు చెప్పినప్పటికీ, విచారించి పంపుతామని పోలీసులు వారించారు. ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీస్లతో మాట్లాడి చంద్రశేఖర్ గౌడ్ను, అతని భార్యను స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. కొత్త జంటకు అండగా నిలిచారు. తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని కొత్త జంట ఈ సందర్భంగా తెలిపింది. ఆ తర్వాత కొత్త జంట పోలీస్ స్టేషన్ నుంచి స్క్రూటినీ కేంద్రానికి వెళ్లింది. అనంతరం తిరిగి పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఈ విషయం సంగారెడ్డి ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
Trivikram |వెంకీ కోసం మూడు టైటిల్స్…?
Trivikram | వెంకీ కోసం మూడు టైటిల్స్…? Trivikram , ఆంధ్రప్రభ వెబ్
తెలంగాణ భవిష్యత్కు మూడంచెల అభివృద్ధి విజన్ 4 లక్షల మందితో ప్రజాభిప్రాయ సేకరణ ఐఎస్బి, నీతి ఆయోగ్ సంస్థల సహకారంలో డాక్యుమెంట్ రూపకల్పన విజన్..స్ట్రాటజీ ప్రాతిపదికన భవిష్యత్ ప్రణాళిక రోడ్మ్యాప్ సిద్ధం..జాతికి పాలసీ అంకితం ప్రజాభవన్లో వార్ రూమ్ ఏర్పాటు ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేలా విజన్ డాక్యుమెంట్ తయారీ 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం 2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఎకనమీ లక్షం దేశంలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచేలా ప్రణాళిక రోల్మోడల్గా చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు - డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ విడుదల తెలంగాణ రైజింగ్ 2047లో పాలసీ డాక్యుమెంట్ను ప్రకటిస్తాం విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి 2047కు సంబంధించి మూడంచెల ప్రణాళికను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం కొత్తగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ( క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) గా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం మంత్రివర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు అంశాలతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను తయారు చేస్తున్నామన్నారు. పాలసీ/స్ట్రాటజీ ప్రాతిపదికన ఈ డాక్యుమెంట్ను రూపొందించామని చెప్పారు. రాష్ట్రాన్ని సమగ్ర సమీకృత అభివృద్ధి దిశగా పయనింపచేసి ఆదాయం పెంచి పేదలకు పంచడమే లక్షంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తయారు చేస్తున్నామని వివరించారు. ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి పారదర్శక పాలసీలు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పాలసీలకు పెరాలసిస్ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. విజన్ డాక్యుమెంట్లో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో 4 రకాలుగా స్థానిక సంస్థల పాలన జరిగేదని,. దీంతో తెలంగాణను 3 విభాగాలుగా విభజించుకున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలపై ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ వరకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా , ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు పెరీ అర్బన్ రీజియన్ ఎకనామీగా, త్రిబుల్ ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్గా మూడంచెల వ్యవస్థగా అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నెట్ జీరో సిటీ, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ను మార్చాలని ఆయన పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్లో సంక్షోభాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద (క్యూర్) : వాహనాల కాలుష్యం తగ్గించడం, నెట్ జీరో సిటీగా కాలుష్య రహిత నగరంగా మార్చాలంటే క్యూర్ చేయాల్సిందే అని రేవంత్ రెడ్డి చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్లో పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్లో సంక్షోభాలను అధిగమించేలా 2170 చదరపు సర్వీస్ సెక్టార్గా మారుస్తున్నామని చెప్పారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను బయటలకు తరలించడంతోపాటు కుంటలు, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా మెట్రో విస్తరణ, మూసీ రివర్ డెవలప్మెంట్ పై ప్రణాళిక తయారు చేసుకున్నామన్నారు. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్లును 360 కిలోమీటర్లతో రెండో మణిహారంగా తయారు చేసుకుంటున్నాం పెరీ అర్బన్ రీజియన్ ఎకనామీ (ప్యూర్) : భారత్ ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ ఇలా పెరీ అర్బన్ రీజియన్ అకానమీ తయారవుతోందని రేవంత్రెడ్డి వెల్లడించారు. అమరావతి నుంచి చెన్నై వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ రైళ్ల ద్వారా రవాణాను సులభతరం చేస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం పోర్టుకు కూడా కనెక్టివిటీ తీసుకువస్తున్నామని, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మరింత అభివృద్ధి చెందుతామన్నారు. అదనంగా నాలుగు ఎయిర్పోర్టులు అందుబాటులోకి తీసుకురానున్నామని, సులభతరమైన రవాణా కోసం వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో కొత్త విమానాశ్రయాలు నిర్మాణం కానున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి బుల్లెట్ రైళ్లు తీసుకువస్తున్నామని, వస్తువుల రవాణాకు సముద్ర మార్గం అవసరం కావడంతో మచిలీపట్నంకు గ్రీన్ఫీల్డ్ డెడికేటెడ్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, పెరీ అర్బన్ మాన్యుఫాక్చరింగ్ జోన్ లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచనున్నట్లు వివరించారు. రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్ (రేర్) : వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్షం చేయకుండా రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజియన్ తీసుకురానున్నట్లు చెప్పారు. అగ్రికల్చర్ పార్కులు, పండ్లు, కూరగాయల పరిశ్రమలతో పాటు మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం అని, సేంద్రీయ వ్యవసాయ భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మూడు రకాల వ్యవస్థలను, ప్రణాళికలను క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్ తీసుకురానున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని, ఆదాయం పెంచి పేదలకు పంచేలా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో జవహర్లాల్ నెహ్రూ తీసుకువచ్చిన పాలసీల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ముందున్నామన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించలేకున్నామని, ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విద్య తండాలకు కూడా చేరినా సాంకేతిక పరమైన, నాణ్యమైన విద్యను ఇవ్వాలని చూస్తున్నామన్నారు. సింగిల్ టీచర్ స్కూల్ నుంచి మహానగరం వరకు విద్యావ్యవస్థలో ప్రణాళికలు తీసుకువచ్చి నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. తద్వారా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని స్పష్టం చేశారు. దేశం వందేళ్ల ఉత్సవాలు జరుపుకునేలాగా భవిష్యత్లో తెలంగాణలో 10 శాతానికి పెరిగేలా ఫ్యూచరిస్టిక్ పాలసీ రూపొందింమన్నారు. దార్శనికతే భవిష్యత్ ప్రణాళికలు అని, తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ అందించాలని నిర్ణయించామని, ఉత్సవాల్లో అతిధులకు భవిష్యత్ ప్రణాళికలు వివరిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రజాభవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. తమకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్ అని, వాటినే ఆదర్శంగా తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తమకు పోటీ కాదని, ప్రపంచ దేశాలతో పోటీ పడనున్నామని, వారితో పోటీ పడి ఆయా దేశాలనుంచి పెట్టుబడులను ఆకర్షిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్కు కేంద్రం అంగీకారం : హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని అన్నారు. హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టు కనెక్టివిటీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపొందించడమే తమ లక్షమన్నారు. అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకుని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అందించాలన్న ఆలోచనతో భవిష్యత్ కోసం పారదర్శకమైన పాలసీలు తీసుకువచ్చి జాతికి అంకితం చేయబోతున్నామని చెప్పారు. ఇందుకుగాను ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్కు నష్టం జరగకుండా విజన్ డాక్యుమెంట్లో లక్షలాదిమందిని భాగస్వాములను చేశామని వివరించారు. ఐఎస్బి, నీతి ఆయోగ్ సహకారం తీసుకుని పాలసీ డాక్యుమెంట్ను తయారు చేస్తున్నామని, చాలా నిశితంగా ప్రతి అంశాన్ని విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్కు మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్డు ఉందని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండడంతో అభివృద్ధిలో అనేక సమస్యలు ఎదురయ్యాయని, వీటన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడం ద్వారా కొత్త నగరం నిర్మాణమవుతుందని స్పష్టం చేశారు. ఇదీ ప్రభుత్వ కార్యాచరణ * నేడు, రేపు రైజింగ్ విజన్ డాక్యుంట్పై మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. * 2వ తేదీ రాత్రికి నివేదక సమర్పించాలి. * 3,4 తేదీల్లో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎం, సిఎంఓ అధికారులు పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది ప్రతి సిద్ధం చేయాలి. * 6వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలి. * అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలి * గ్లోబల్ సదస్సు ఏర్పాట్ల నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలి.
వేలం వెర్రి.. ఆశావహులకు కొర్రీ
సర్పంచి పోస్టు ఏకగ్రీవాల కోసం భారీగా ఖర్చు ఓటు హక్కుతో దక్కాల్సిన పదవులను వేలం పాట ద్వారా దక్కించుకునేందుకు కొందరు అభ్యర్థుల ప్రయత్నాలు గ్రామ పెద్దలు, కుల సంఘాల నేతలతో మద్దతుతో ముందుగానే కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ఆ మేరకు ఒక్కరే నామినేషన్లు దాఖలు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన నిబంధనలు పాటిస్తేనే ఏకగ్రీవం చెల్లబాటు మార్గదర్శకాలు జారీ చేసిన ఎస్ఇసి మనతెలంగాణ/హైదరాబాద్ : ఓటు హక్కుతో రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన సర్పంచి పదవులను కొందరు వేలం పాట ద్వారా సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు బడా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామపంచాయతీల్లో సర్పంచి పీఠాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు పలువురు అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లోకి వెళితే అనవసరంగా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకోవాల్సి రావడంతో పాటు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ ఉండదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకుల మద్దతుతో సర్పంచి పదవికి ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పలు గ్రామాలలో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుని కేవలం ఒక్కరే నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్, రాయిపోల్, వర్గల్ మండలాల్లోని కొన్ని గ్రామాలలో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు కేవలం ఒక్కరే నామపత్రాలు దాఖలు చేసినట్లు సమాచారం. ఏకగ్రీవం కోసం రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. హత్నూర మండలంలోని రెండు తండాల్లో ఏకంగా ఎన్నికలు లేకుండానే పదవులు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం రూ.కోటి వరకు వెచ్చిస్తానని ఓ వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. నవాబుపేట మండలం దొడ్డిపల్లి సర్పంచి, ఉప సర్పంచి పదలను ఏకగ్రీవం చేశారు.జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్ ఆర్గనైజర్కు రూ.90 లక్షలకు, ఇదే మండలం గోర్లాఖాన్దొడ్డిలో రూ.57 లక్షలకు, అలాగే లింగాపురం గ్రామంలో రూ.34 లక్షలకు వేలంలో పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు. గద్వాల మండలం కొండపల్లిలో రూ.60 లక్షలకు ఓ సీడ్ ఆర్గనైజర్ వేలంతో పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే నల్లదేవునిపల్లి (కుర్వపల్లి)లో రూ.45 లక్షలకు ఒకరు కైవసం చేసుకోగా, రూ.15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిస్తోంది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవిని రూ.42 లక్షలకు ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. వీరాపురంలో రూ.50 లక్షలకు వేలం పాడుకున్నట్లు సమాచారం. మరోవైపు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం వాసులు తమ గ్రామ సర్పంచి పదవిని రూ.20 లక్షలకు వేలం పాడిన వ్యక్తికి అప్పగించాలని నిర్ణయించారు. ఇక్కడ పూర్తిగా ఎస్టి లంబాడీ తెగకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. నల్గొండ జిల్లా బంగారిగడ్డ గ్రామ పంచాయతీకి 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, గ్రామస్థులందరూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి ఏకగ్రీవం చేసేందుకు ఆదివారం గ్రామంలో చర్చించారు. గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం, గ్రామ అభివృద్ధి కోసం తాము సిద్ధంగా ఉన్నామని నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు తెలిపారు. దీనికి గ్రామస్థులందరూ వేలం నిర్వహించగా, మహ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలతో గ్రామాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి సర్పంచ్ పదవికి కైవసం చేసుకున్నారు. దీనికి అభ్యర్థులందరూ అంగీకారం తెలుపుతూ దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటామంటూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏకగ్రీవం అయ్యింది. ఎస్సి కేటగిరీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లె సర్పంచ్ పదవికి 15 మంది పోటీ పడగా,గ్రామ పెద్దలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. గ్రామ పెద్దలు 15 మందిలో ఒకరి పేరును ప్రకటించారు. ఈ ఏకగ్రీవాలను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. రిజర్వేషన్ల మార్పుతో తగ్గిన బలమైన అభ్యర్థులు పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎంఎల్ఎ పోరు కంటే పల్లెపోరునే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. గ్రామంలో సర్పంచి పదవి అంటేనే అందరూ ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ సర్పంచి పీఠం కోసం అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉంటుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికలకు ముందు నుంచే ఊళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వారి సొంత డబ్బులతో చేస్తుంటారు. మరికొంత మంది సర్పంచి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కొందరు ఆస్తులను, భార్యల పుస్తెల తాడులను కూడా తాకట్టు పెట్టి సర్పంచి పీఠం కోసం పోటీ చేస్తారు. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం కొంతమంది అభ్యర్థులు గ్రామానికి ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏకగ్రీవం చేసుకుంటుంటున్నారు. అయితే చాలా గ్రామాల్లో సర్పంచి స్థానాలకు ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్ అభ్యర్థులకు అనుకూలంగా రాకపోవడంతో పోటీ చేయాలని భావించిన బలమైన అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఆశావహులు తగ్గడంతో ప్రధానంగా పలు గ్రామాల్లో ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులే కనిపించడం లేదు. దీంతో స్వతంత్య్ర అభ్యర్థుల వైపు రాజకీయ పార్టీల చూపు మళ్లింది. స్థానిక కార్యకర్తల బలంతో గెలిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాలకు ఆమోదం : ఎస్ఇసి మార్గదర్శకాలు పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఇసి) దృష్టి సారించింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలోజిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎంపిడిఒలకు సూచనలు చేస్తూ ఎస్ఇసి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని ఎస్ఇసి స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) చట్టం -2018లోని 15వ నిబంధన ప్రకారం.. ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి.. ఒక్కరే పోటీలో ఉండడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు, రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా.. లేదా..? అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపింది. ఏకగ్రీవాల ప్రకటన కోసం జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాలను నియమించాలని పేర్కొంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 211 ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపింది. సర్పంచ్, వార్డు స్థానానికి ఏకగ్రీవమైతే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది. అదేసమయంలో పోటీలో ఉన్న ఒకే ఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని, వేలంపాటలో పాల్గొనలేదని ధ్రువీకరించే పత్రాన్ని తీసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణకు వస్తే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలని పేర్కొంది. ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించి, వాటిపై ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాన్ని ఆమోదించాలని తెలిపింది. అదే సమయంలో ఈ ఫలితం సమాచారంతో ఓ నివేదికను రూపొందించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొంది. గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు గుర్తిస్తే.. ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో తెలిపింది.
* 7న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంబరాల్లో పాల్గొననున్న సీఎం * 10, 11, 12 తేదీల్లో లక్షల మంది ప్రజలు సందర్శించేలా ఏర్పాట్లు * విలేకర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ డిసెంబర్ 8,9 తేదీల్లో జరగనున్న తరుణంలో ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచే రాష్ట్రవ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను ప్రారంభించుకుని మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 1న (సోమవారం) మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో , 3 న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో, 4 న ఆదిలాబాద్లో , 5న వరంగల్ జిల్లా నర్సంపేటలో, 6న నల్గొండ జిల్లా దేవర కొండలో ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో జరిగే అన్ని ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారని, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు సంబరాల్లో పాల్గొంటారని చెప్పారు.7 న హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాలను ప్రకటిస్తారని చెప్పారు. 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో రెండేళ్లలో ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. 9న భవిష్యత్లో తెలంగాణ 2047 రైజింగ్ తెలంగాణ కోసం ప్రణాళికలు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నామో విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమ్మిట్కు రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశంలోని ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, విజయాలను సాధించిన వ్యక్తులను, ప్రపంచంలో కూడా అత్యున్నత విజయాలను సాధించిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామన్నారు. 2047 నాటికి ఇది మా విజన్ అని ప్రకటిస్తామని, ఇక్కడ ఎలాంటి మౌలికవసతులు కల్పిస్తున్నామో వివరిస్తామన్నారు. 10, 11, 12 తేదీల్లో లక్షల మంది రాష్ట్ర ప్రజలు సందర్శించేలా స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన 13న క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారన్నారు. ఈ వేడుకల్లో అందరం భాగస్వాములవుదామని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Bhagyashri Borse |దశ తిరిగినట్టేనా..?
Bhagyashri Borse | దశ తిరిగినట్టేనా..? Bhagyashri Borse, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
* సమగ్ర రోడ్ మ్యాప్ను రూపొందించండి * అధికారులకు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశం * ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి రూ. వెయ్యి కోట్లతో అదితి అమలు * రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు వంటి ఇతర క్లస్టర్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి * ఎంఎస్ఎంఈ రంగాలను ఆర్ధికంగా బలోపేతం చేయడంలో అదితి గేమ్ ఛేంజర్ * జాతీయస్థాయిలో రోల్ మోడల్గా మార్చడానికి తెలంగాణ సమగ్ర రోడ్మ్యాప్ మెదక్ లోని ఫార్మా పరిశ్రమను ఎంచుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీధర్బాబు మన తెలంగాణ / హైదరాబాద్: అదితి పథకం కింద ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడానికి సమగ్ర రోడ్మ్యాప్ను రూపొందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలకు నిజమైన గేమ్-ఛేంజర్లుగా మారగలవని మంత్రి పేర్కొన్నారు. అదితి పథకాన్ని ప్రోత్సహించడంపై విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బీఈఈ, ఈఈఎస్ఎల్ మీడియా సలహాదారు ఏ చంద్ర శేఖర రెడ్డి తయారుచేసిన ప్రత్యేక నివేదికను ఆదివారం మంత్రి శ్రీధర్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతది పథకం ఎంఎస్ఎంలకు ఒక వరమని ప్రశంసించారు. తెలంగాణలోని అదనపు ఎంఎస్ఎంఈ క్లస్టర్లకు అదితి ప్రయోజనాలను విస్తరించాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వీటిలో రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్, స్టీల్ రీ-రోలింగ్, ఇతర రంగాలకు ఆర్థిక, పర్యావరణ లాభాలను కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ త్మ కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లను ఇంధన సామర్థ్యంతో కూడినవిగా చేయడం కేవలం తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా ఉత్పాదకతను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా ఎంఎస్ఎంఈలను బలోపేతం చేస్తుందని చెప్పిన ఆయన స్థిరమైన అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. అదితి అమలులో తెలంగాణ జాతీయ రోల్ మోడల్గా మారాలని తాము కోరుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2035 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్షం: ఈ లక్ష్యాన్ని సాధించడానికి, రాష్ట్రం జాతీయ స్థాయిలో బీఈఈ, ఈఈఎస్ఎల్, విద్యుత్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలులు రాష్ట్ర స్థాయిలో ఇంధన శాఖ కింద టీఎస్ రెడ్కో తో కలిసి పనిచేస్తుందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2035 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా మార్చడానికి అన్ని వాటాదారులూ కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన వనరుల అమలు, గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్లో 24/7 విద్యుత్ సరఫరా అందించడం ఈ భారీ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వివరించారు. తెలంగాణ వేగవంతమైన పారిశ్రామిక పురోగతిని ఆయన మరింతగా హైలైట్ చేశారు. రాష్ట్రం కేవలం 18 నెలల్లో రూ. 3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని, ఇది చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు ఆర్ అండ్ డీ, ఏఐ, డేటా సెంటర్ పెట్టుబడులలో దేశంలోని టాప్ మూడు పట్టణ ఎఫ్డీఐ గమ్యస్థానాలలో ఒకటిగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ వెన్నెముక : లక్షలాది మందికి ఉపాధి కల్పించే, నూతన ఆవిష్కరణలను తీసుకువచ్చే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఈ రంగాన్ని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన ‘అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎన్జ్రీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ (అదితి)కు పూర్తి మద్దతును అందించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మద్దతుతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అమలు చేస్తున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా ఊపందుకుంది. నేషనల్ అదితి సిరీస్లో భాగంగా తెలంగాణ ఈ పథకాన్ని అధికారికంగా స్వాగతించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందే మొదటి క్లస్టర్లలో ఒకటిగా మెదక్ జిల్లాలోని ఫార్మా పరిశ్రమను ఎంచుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి బీఈఈ కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి : బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్ దేశ వ్యాప్తంగా అదితి పథకం యొక్క ప్రయోజనాలను అమితంగా పెంచడమే లక్షంగా పనిచేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరుతున్నామని బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పెంచుకునేలా ఈ ఏడాది రూ. వెయ్యి కోట్ల నిధిని కేటాయించామన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఇది ఎంఎస్ఎంఈ రంగంలో ఇంధన సామర్థ్యంతోపాటు పోటీతత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. ఫార్మా పరిశ్రమలో గణనీయమైన సామర్థ్యం కారణంగా తెలంగాణలోని మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అదితి పథకంలో పరిశ్రమలకు ఎండ్-టు-ఎండ్ మద్దతు ఉంటుంద్న్నారు. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్స్ (ఐజీఈఏ), వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు (డీపీఆర్లు), ఫైనాన్సింగ్ సహాయం, పర్యవేక్షణ - ధృవీకరణ (ఎం అండ్ వీ) వంటి సహకారాలతో సహా మొత్తం రూ. 9 వేల కోట్లకు పైగా భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నామన్నారు. అదితి పథకం యొక్క విజయం ఆయా రాష్ట్రాల పటిష్ట అమలుపై ఆధారపడి ఉంటుందని డియోర్ అన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, పర్యావరణ బాధ్యతాయుతంగా మారడానికి ఎస్డీఏలు ఈ పథకాన్ని చేరుకోవడం, హ్యాండ్హోల్డింగ్ చేయడం, స్కేలింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అదితి కార్యక్రమం ప్రస్తుతం 60 పారిశ్రామిక క్లస్టర్లు, 14 శకి ్త-ఇంటెన్సివ్ రంగాల్లో పనిచేస్తోందని తెలిపారు. వీటిలో వస్త్రాలు, ఫౌండ్రీలు, ఆహార ప్రాసెసింగ్ వంటివి ఉన్నాయన్నారు. ఈ రంగాల్లో నిర్దేశించుకున్న ఫలితాలను సాధించడానికి దశల వారీగా క్లస్టర్-నిర్దిష్ట అమలు నమూనాను అనుసరిస్తున్నాయని తెలిపారు.
Ditwah cyclone |దిత్వా బలహీనపడినా…?
Ditwah cyclone | దిత్వా బలహీనపడినా…? Ditwah cyclone, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
నేటినుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, జాతీయ భద్రత తదితర అంశాలపై చర్చకు పట్టుపట్టనున్న విపక్షాలు 14 బిల్లులతో సిద్ధమైన ప్రభుత్వం చర్చల ఎజెండాను బిఎసి నిర్ణయిస్తుంది అఖిలపక్ష భేటీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు న్యూఢిల్లీ: డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాలం సమావేశాలకు రంగం సిద్ధమైంది. పార్లమెంటులో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రి విజన్, జాతీయ భద్రత పరిస్థితిపై స్పష్టమైన చర్చ జరగాలని, ఆదివారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశంలోనే ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు ఉభయసభలు సజావుగా జ రిగేందుకు సహకరించాలని, అన్ని పక్షాలతో కలి సి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్ర భుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. శీతాకాలం సమావేశాలకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి 36 రాజకీయ పా ర్టీలకు చెందిన 50మంది నాయకులు హాజరయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, బిజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జెపినడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రిజిజు సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్ మురుగేశన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సర్తో పాటు, ఢిల్లీ పేలుడు తర్వాత జాతీయ భద్రత పరిస్థితి, కార్మిక కోడ్లు వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చా యి. అలాగే ఫెడరలిజం, అసెంబ్లీలు ఆమోదించి న బిల్లులను కొందరు గవర్నర్లు తొక్కి పెట్టిన అం శాలు, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులఅంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పార్లమెంటు శీతాకాలం సమావేశా లు సజావుగా, ప్రశాంతంగా సాగేటట్లు సహకరించాలని అన్ని పార్టీలను పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరారు. బొత్తిగా 15 రోజులేనా సమావేశాలు? శీతాకాలం సమావేశాలను కేవలం నామ్ కే వాస్తే ని ర్వహిస్తున్నట్లు కన్పిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి జయ రాం రమేశ్ అన్నారు. ప్రతిపక్షాలతో సంప్రదింపులు జ రపకుండా కేవలం తక్కువ కాలం వ్యవధి నిర్ణయించడం నరేంద్రమోదీ సర్కార్ వైఖరికి అద్దంపడుతోందన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు పార్లమెంటరీ చరిత్రలోనే అతి తక్కువ సమయం జరుగుతాయని, మోదీ సర్కార్ 13 బిల్లులను ఆమోదం కోసం సిద్ధం చేసిందని, అందులో ఒకటి ఆర్డినెన్స్ స్థానే ప్రవేశపెట్టే బిల్లు అనీ, రెండు లోక్ సభ కమిటీ పరిశీలించినవని, కాబట్టి పది బిల్లులను సంబంధిత స్టాండింగ్ కమిటీ పరిశీలించనే లేదని జైరాంరమేశ్ విమర్శించారు. అణుశక్తి బిల్లుతో సహా 14 బిల్లులు సిద్ధం పార్లమెంటులో ప్రతిపాదిత అణుశక్తి బిల్లు 2025 తో సహా 14 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండి యా బిల్లు 2025, జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు 2025, ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ బిల్లు 2025, ఆర్డినెన్స్ స్థానే మణిపూర్ వస్తువులు సేవల పన్ను(రెండో సవరణ) బిల్లు, హైవే అభివృద్ధి కోసం పారదర్శకంగా భూసేకరణకు ఉద్దేశించిన జాతీయ రహదారుల (సవరణ)బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.
కొండగట్టులో 30 దుకాణాలు బుగ్గి
అర్ధరాత్రి అగ్రిప్రమాదం 2 గంటల పాటు ఎగిసిపడిన మంటలు ఆలస్యంగా వచ్చిన అగ్నిమాపక వాహనం కాలిబూడిదయిన షాపులు బాధితుల కన్నీరుమున్నీరు ఆదుకుంటామని మంత్రులు అడ్లూరి, పొన్నం భరోసా ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి/మల్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 30 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్కూట్తో ఓ దుకాణంలో మంటలు లేచి పక్కనున్న దుకాణాలన్నింటికీ మంటలు వ్యాపించి అందులోని సామగ్రి కాలి బూడిదైంది. సుమారు రెండు గంటల పా టు మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలోని జనమంతా భయంతో రోడ్డు పైకి వచ్చి హాహాకారాలు చేశారు. ఉవ్వెత్తున మంటలు లేవడంతో మంటలను ఆర్పే పరిస్థితి లేకుండా పోయింది. జగిత్యాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వెంటనే రావాల్సిన ఫైర్ సిబ్బంది గంటన్నర ఆలస్యంగా రావడంతో అప్పటికే దుకాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం లో కళ్ల ముందే తమ దుకాణాలు తగలబడి మంటల్లో లక్షల రూపాయల విలువ చేసే సామగ్రి అంతా కాలిపోవడంతో రోడ్డున పడ్డ మమ్మల్ని ఆదుకునేవారెవరు... తాము బతికేదెట్లా అంటూ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంతా బతుకుదెరువు కోసం వచ్చిన వారే... అగ్ని ప్రమాదంలో దుకాణాలు కాలిపోయిన బాధితులంతా వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం కొండగట్టుకు వచ్చిన వారే. కొందరు ఇళ్లను అద్దెకు తీసుకుని దుకాణాలు నిర్వహిస్తుండగా, మరికొందరు స్థలాలను అద్దెకు తీసుకుని షెడ్డు నిర్మించుకుని దుకాణాలను నిర్వహిస్తున్నారు. అప్పు సప్పు చేసి దుకాణాల్లోకి సామగ్రిని తెచ్చుకుంటే రెండు గంటల్లోనే అగ్నికి అహుతై బుగ్గి కావడంతో బతికేదెట్లా... తమను ఆదుకునేదెవరు అంటూ బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో అన్ని కాలిపోయాయని, కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభు త్వం ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు. కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 దుకాణా లు కాలిపోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆదివారం పరామర్శించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఫోన్లో ఆదేశించారు. అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరమని, బాధితులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
రెండో దశ పంచాయతీకి నామినేషన్లు షురూ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, వార్డు స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనున్నాయి. ఈ నెల 2 వరకు అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పింవచ్చు. ఈ నెల 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 6 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. తొలి విడత నామినేషన్ల గడువు శనివారం ముగియగా, చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 17,940, వార్డు స్థానాలకు 70,596 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు మొత్తం 25,654 నామినేషన్లు దాఖలు కాగా, 37,440 వార్డు స్థానాలకు మొత్తం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి.
తమిళనాడులో హైవేపై బస్సులు ఢీ.. 11 మంది మృతి
చెన్నై : తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 11మంది మృతి చెందారు. దాదాపు 40 మంది వరకూ గాయపడ్డారు. రాష్ట్రంలోని శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు వద్ద తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు మృతి చెందారని అధికారులు తెలిపారు.వీరిలో తొమ్మండుగురు మహిళలు ఉన్నారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ముందు మృతుల సంఖ్య ఏడు అని ప్రకటించారు. కానీ చికిత్స పొందుతున్న వారిలో కొందరు చనిపోవడంతో ఈ సంఖ్య పెరిగింది.హైవేపై ఓ బస్సు కరైకూడకి మరోటి మధురైకు వెళ్లుతుండగా బస్సులు ఢీకొన్నాయి. దీనితో వాహనాల ముందు భాగాలు ఒకదానిలోకి మరోటి చొ చ్చుకువెళ్లాయి. లోపల ప్రయాణికులు విలవిలలాడుతూ ప్రా ణాలు కోల్పోయ్యారు.. ఘటన గురించి తెలియగానే అక్కడికి స్థానికులు , సహాయక బృందాలు వచ్చి గాయపడ్డ వారిని హు టాహుటిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. ఘటనపై సిఎం ఎంకె స్టాలిన్ స్పందించారు.
అవినీతి కేసుల నుంచి విముక్తి కల్పించండి ఇజ్రాయెల్ అధ్యక్షుడికి ప్రధాని నెతన్యాహూ వినతి టెల్ అవీవ్ ః ప్రస్తుత అవినీతికేసుల విచారణ నుంచి తనకు విముక్తి కల్పించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వేడుకున్నారు. ఈ మేరకు దేశ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్కు ఆదివారం నాడు క్షమాభిక్ష దరఖాస్తు చేసుకున్నారు. నెతన్యాహుపై అవినీతి అభియోగాల కేసులపై విచారణ సుదీర్ఘకాలంగా సాగుతోంది. దేశంలో నెతాన్యాహు అనుకూల, వ్యతిరేక వర్గాల స్థాయికి ఈ కేసుల విచారణ దారితీసింది. దేశ న్యాయవ్యవస్థపై నెతాన్యాహు తలపడుతున్నాడు. తప్పుడు అభియోగాలతో తలెత్తిన కేసుల విచారణ కుదరదని చెపుతున్నారు. ఇటీవలే హమాస్తో కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి కీలక మార్పుల పరిణామం దశలో కేసుల నుంచి తనకు క్షమాభిక్ష అవసరం అని, దీనితో దేశం సంఘటితంగా ముందుకు వెళ్లుతుందని భావిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. అయితే ఆయనకు ఉపశమనం కల్పిస్తే అది చివరికి దేశ ప్రజాస్వామిక సంస్థలకు విఘాతం అవుతుందని, ఆయన చట్టానికి అతీతులు అనే అభిప్రాయం నాటుకుపోతుందని ఆయన వ్యతిరేకులు స్పష్టం చేస్తున్నారు. నెతన్యాహు తరఫున ప్రెసిడెంట్కు అధికారిక లేఖ పంపించినట్లు ప్రధాని కార్యాలయం నిర్థారించింది. దీనిని అందుకున్నట్లు ప్రెసిడెంట్ కార్యాలయంలోని లీగల్ విభాగం ధృవీకరించింది. ఇది అసాధారణ అభ్యర్థన అని, పలు తీవ్రస్థాయి పరిణామాలు ఉంటాయని ఆలోచించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రధానిపై వచ్చిన అవినీతి ఆరోపణ కేవలం రాజకీయ దురుద్ధేశపూరితం, అనుచిత చట్టవ్యతిరేక ప్రా సిక్యూషన్ అని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇటీవల చెప్పారు. నెతాన్యాహుకు క్షమాభిక్ష అవసరం ఉందని ప్రెసిడెంట్కు లేఖ పంపించారు. విచారణ వద్దని, కావాలని వేర్వేరు వాదనలతో దేశ ప్రజల మధ్య చిచ్చు ఏర్పడుతోందని, దీనిని పరిష్కరించేందుకు ప్రెసిడెంట్ స్పందించాలని విచారణ నిలిపివేత దిశలో తనకు మినహాయింపులు ఇవ్వాలని నెతాన్యాహు ప్రెసిడెంట్కు వీడియో ద్వారా కూడా సందేశం పంపించాడు.
సోమవారం రాశి ఫలాలు (01-12-2025)
మేషం సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృషభం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిధునం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కర్కాటకం కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. సింహం గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కన్య నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు. తుల వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు. వృశ్చికం కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు అధికమవుతాయి. స్వంత ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వ్యాపారాలలో భాగస్వాములతో బేధాభిప్రాయాలు కలుగుతాయి. ధనస్సు ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. మకరం దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగమున మీప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుంభం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. మీనం ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు.
పెళ్లిళ్లు ఔట్డేటెడ్.. యువత జీవితం అనుభవించాలి: జయబాధురి
ముంబై ః పెళ్లి ఓ కాలం చెల్లిన కట్టుబాట్ల వ్యవస్థ. తన ఉద్ధేశంలో యువతరం ఈ పెళ్లి తంతుకు వెళ్లకుండా హాయిగా తన జీవితం తాను అనుభవిస్తూ ఆనందించాలని ప్రముఖ నటి జయ బాధురి చెప్పారు. సామాజిక, రాజకీయ, సిని రంగ విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడే జయ బాధురి ఇప్పుడు భారతీయ వివాహ వ్యవస్థపై స్పందించారు. తన మనవరాలు నవ్య నవేలీ నందా పెళ్లి చేసుకోకుండా ఉండటం తనకు ఇష్టం అని కూడా తెలిపారు. తన తరం వంతు అయిపోయింది. ఇప్పుడు నవ యువ తరం వచ్చింది. ఈ తరం పెళ్లి బంధంలో చిక్కుకుపోరాదని ఆమె ఇటీవల వి ది ఉమెన్ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. తాను వయస్సు మీద పడినదానిని, మనవరాలు నవ్యకు త్వరలో 28 ఏండ్లు వస్తాయి. పెళ్లికి చట్టబద్ధతతోనే బాంధవ్యం ఖరారు అయిపోతుందని అనుకోరాదని కూడా జయ బాధురి చెప్పారు. ముంబైలోని బాల్ గంధర్వ రంగ్ మందిర్లో ఆదివారం వి ది ఉమెన్ కార్యక్రమం బర్కా దత్ ఆధ్వర్యంలో జరిగింది. జయా బాధురితో పాటు రాణి ముఖర్జీ, జాన్వి కపూర్, మసాబా గుప్తా, సిద్థార్థ్ మల్హోత్రా పాల్గొన్నారు. పలు అంశాలపై వక్తలు తమ స్పందన వెలువరించారు.
ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్ విజయం..
కదంతొక్కిన విరాట్ కోహ్లి రోహిత్, రాహుల్ అర్ధ సెంచరీలు కుల్దీప్, హర్షిత్ మ్యాజిక్ రాంచీ: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్యటీమిండియా 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు కెప్టెన్ కెఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్తో జట్టునుఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన సఫారీ టీమ్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు మార్క్రమ్ (7), రియాన్ రికెల్టన్ (0), వన్డౌన్లో వచ్చిన డికాక్ (0) విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా 11 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మాథ్యూ బ్రిట్జ్కె (72), టోనీ డి జోర్జి (39) డెవాల్డ్ బ్రేవిస్ (39) అద్భుత బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలిచారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మార్కొ జాన్సన్ 39 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. కార్బిన్ బోస్చ్ (67) కూడా అసాధారణ బ్యాటింగ్ను కనబరచడంతో సౌతాఫ్రికా పోరాడి ఓడింది. భారత బౌలర్లలో కుల్దీప్ నాలుగు, హర్షిత్ మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను విరాట్ కోహ్లి ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన కోహలి 120 బంతుల్లోనే 11 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. రోహిత్ 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57, కెప్టెన్ రాహుల్(60), జడేజా (32) పరుగులు సాధించారు.
IND vs SA |తొలి వన్డేలో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ !!
IND vs SA | తొలి వన్డేలో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్
బెల్టు షాపుల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు…
సంగెం, ఆంధ్రప్రభ : ఎస్సై వంశీకృష్ణతో పాటు కానిస్టేబుల్ బృందం మండలంలోని మొండ్రాయి
Bodhan |ఆపన్నులకు చేయూత సాయం…
బోధన్, ఆంధ్రప్రభ: యాచకులు, బీదవారు, రోడ్డు వెంట దుకాణాల ముందు ఇల్లు లేక
గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా నందివాడ మండలం గాజులపాడు శివారులో భారీ పేకాట
Panchayat Elections |ఉరుకులు.. పరుగుల్లో ప్రధాన పార్టీలు
Panchayat Elections | ఉరుకులు.. పరుగుల్లో ప్రధాన పార్టీలు డోంగ్లి, ఆంధ్రప్రభ :
Be alert | భారీ వర్షం తప్పదు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్పై కీలక ఎఫ్ఐఆర్ దాఖలు
మరో ఏడుగురిపైనా నమోదు..ఇడి కేసుకు స్పందన రూ.50 లక్షలతో రెండున్నరవేల కోట్లకు ఎసరు అభియోగాలు న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసు విభాగం స్పందించింది. కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది. వీరితో పాటు మరో ఏడుగురిపై కూడా ఎఫ్ఐఆర్లు దాఖలు అయినట్లు తెలిపారు. కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ సంబంధిత నిధుల్లో బదలాయింపులు ఇతరత్రా ఆర్థిక నేరాలు జరిగాయనే కోణంలో ఇడి రంగంలోకి దిగింది. దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఇడి నుంచి తమకు అందిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. గాంధీలు ఇతరులపై తమకు అక్టోబర్ 3వ తేదీనే ఫిర్యాదు అందిందని వివరించారు. ఇప్పుడు ఈ మేరకు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశారు. క్రిమినల్ కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, చీటింగ్కు సంబంధించిన 420 వంటి సెక్షన్ల పరిధిలో ఇప్పుడు సోనియా , రాహుల్ ఇతరులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లు దాఖలు అయిన వారిలో కాంగ్రెస్ ప్రముఖులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియా, డోటెక్స్ మార్కండైజ్ లిమిటెడ్, డోటెక్స్ ప్రమోటర్ సునీల్ భండారితో పాటు అసోసియేటెడ్ జర్నలిస్టు లిమిటెడ్ (ఎజెఎల్) పేర్లు ఉన్నాయి. వీరిని నిందితులుగా చేర్చారు. కాగా ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరాలు మృతి చెందారు. నిందితులు తమ వంతుగా రూ 50 లక్షలే చెల్లించి ఎజెఎల్కు చెందిన రూ 2500కోట్ల విలువైన ఆస్తులపై అధికారం పొందారని, ఈ క్రమంలో ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించామని ఇడి తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ కేసులో పోలీసు ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో సంబంధిత నిందితులను పోలీసులు అరెస్టు చేసే అధికారం ఉంటుంది. ఈ విషయంపై కాంగ్రెస్ వర్గాలలలో కలవరానికి దారితీసింది. ఇడి కేసుకు సంబంధించి డిసెంబర్ 16వ తేదీన తదుపరి విచారణ జరుగుతుంది. ఈలోగా ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ దాఖలుపై న్యాయస్థానం స్పందన వెలువడాల్సి ఉంది. మోడీ, అమిత్ షా రాజకీయ వేధింపులు, బెదిరింపులు: కాంగ్రెస్ ఆగ్రహం ఇడి పిర్యాదుతో తమ నేతలపై ఢిల్లీ పోలీసు ఎఫ్ఐఆర్ దాఖలు కావడం గర్హనీయం అని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటన వెవరించారు. రాజకీయ ప్రత్యర్థులపై మోడీ అమిత్ షాల వేధింపులు బెదిరింపుల పర్వం సాగుతోందని తెలిపారు.ఇది కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. బెదిరింపులకు దిగేవారే అభద్రతతో భయాలతో కొట్టుమిట్టాడుతున్నారని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఈ కేసు బోగస్, సత్యమే గెలుస్తుందని జై రాం రమేష్ , మరో నేత అభిషేక్ మనూ సింఘ్వీ తెలిపారు. సారా కానీ సీసా కానీ చివరికి గ్లాసులు కానీ కొత్తవి కావని, ఇదంతా కూడా పాత సీసా మూతలు తెరవడం కథ అని సింఘ్వీ చమత్కరించారు.
సుబ్బరాయుడి సన్నిధిలో జడ్జీ దంపతులు
కొత్తూరు, నంద్యాల జిల్లా , ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాణ్యం మండలం
బస్తర్లో 37 మంది మావోయిస్టులు సరెండర్..
దంతేవాడ : ఛత్తీస్గఢ్లో ఆదివారం 37 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 27 మందిపై కలిపి మొత్తం మీద రూ 65లక్షల రివార్డు ప్రకటితం అయి ఉంది దంతేవాడ జిల్లా వీరు తమ ముందు సరెండర్ అయినట్లు పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇప్పుడు లొంగిపోయిన వారిలో 12 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పూనా మార్గెం పునరావాస, సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా వీరు తమ మావోయిస్టు పంథా వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ విషయాన్ని మీడియాకు దంతేవాడ ఎస్పి గౌరవ్ రాయ్ తెలిపారు. బస్తర్ ప్రాంతంలో శాఆంతి స్థాపనకు, సమగ్ర ప్రగతికి, గౌరవ మర్యాదల వాతావరణం నెలకొనేలా చేసేందుకు ప్రభుత్వం పునరావాస పథకం తీసుకు వచ్చిందని ఎస్పి తెలిపారు. దీనిని ఇప్పటికీ అడవుల్లో ఉన్న మావోయిస్టులు వినియోగించుకుని సరెండర్ కావాలని అభ్యర్థించారు. ఇప్పుడు సరెండర్ అయిన వారిలో కొందరు ముఖ్యులు కూడా ఉన్నారు. కుమాలి అలియాస్ అనిత మాధవి, గీతా అలియాస్ లక్ష్మి మద్కం, రంజన్ అలియాస్ సోమ మందవి , భీమా అలియాస్ జహాజ్ కల్మూ ఉన్నారు. వీరిపై తలో రూ 8 లక్షల పారితోషికం ప్రకటితం అయి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల పరిధిలో ఇప్పటివరకూ 500 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని ఎస్పి వివరించారు.
కరీంనగర్ రూరల్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా నగునూరు శివారులో తీవ్ర విషాద
అమెరికాలో విందు పార్టీపై కాల్పులు.. నలుగురు మృతి
స్టాక్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఫంక్షన్హాల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. పది మంది వరకూ గాయపడ్డారు. అక్కడి స్టాక్టన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం వేడుక కోసం అక్కడికి చేరిన దశలోనే ఎవరో వారిపై దాడికి దిగాడని షెరీఫ్ అధికారులు తెలిపారు. బాధితులలో పిల్లలు , పెద్దలు ఉన్నారు. కాల్పులకు దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. దాడికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు. గాయపడ్డ వారి పరిస్థితి ఏమిటనేది వెలుగులోకి రాలేదు.
శబరిమలకు ఆర్టిసి సేవలు... ఆ ముగ్గురికి ఉచితం
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలను మరింత సులభతరం చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. గ్రూపులుగా వెళ్లే అయ్యప్ప భక్తులకు అతి తక్కువ ధరకే అద్దె బస్సులు సమకూర్చాలని ఆర్టిసి నిర్ణయించింది. ప్రత్యేక సౌకర్యాలను కల్పించనుంది. పలువురికి ప్రత్యేకంగా ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టిసి అద్దె ప్రాతిపదికన బస్సులను కేటాయించింది. భక్తుల ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా సంస్థ ఈ బస్సులను ఏర్పాటు చేస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆర్టిఓ పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, అల్ట్రాడీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ నలు మూలల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టిసి సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 200 బస్సులను నడపాలని నిర్ణయించింది. సుమారు లక్ష మంది భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టిసి లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తూ ప్రతీ డిపోకు రెండు బస్సులు కేటాయించింది. ఈ ప్రత్యేక బస్సులకు ప్యాకేజీలను ఖరారు చేసింది. ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటరుకు ఛార్జీలు నిర్దారించింది. బస్సుల వెయిటింగ్ సమయానికి గంటకు రూ.300 చొప్పున వెయిటింగ్ ఛార్జి చెల్లించాల్సి ఉంటుందని ఆర్టిసి స్పష్టం చేసింది. గురుస్వామి పేరుతో బస్సు బుక్ చేసుకుంటే ఒక యాత్రికుడి(గురుస్వామి) ఛార్జి అంటే సుమారు రూ.5,498 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.10 వేల కాష్ ను డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. యాత్ర పూర్తయిన తర్వాత భక్తులకు తిరిగి చెల్లిస్తారు. రాజధాని బస్సుల్లో 40 సీట్లు ఉంటుండగా కి.మీకు రూ.77 వసూలు చేయనున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 36 సీట్లకు కి.మీకు రూ.59 వసూలు చేయనున్నారు. డీలక్స్ 40 సీట్లకు కి.మీకు రూ.57, ఎక్స్ప్రెస్ 50 సీట్లకు కి.మీ రూ.62 వసూలు చేస్తారు. ఈ బస్సుల్లో గురుస్వామికి ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. భక్తులతో పాటు వచ్చే లగేజ్ అటెండెంట్లు, వంట మాస్టర్లకు కూడా సీట్లు కేటాయించకుండా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు.
Andhra King Taluka, Memorable Film: Hanu Raghavapudi
Ram Pothineni’s latest outing Andhra King Taluka is running successfully in theatres, earning appreciation from audiences and industry insiders alike. Directors Hanu Raghavapudi and Bobby extended their praises to the team for crafting such an emotionally resonant film. Hanu Raghavapudi, who is currently directing Prabhas in Fauzi, watched Andhra King Taluka and was highly impressed. […] The post Andhra King Taluka, Memorable Film: Hanu Raghavapudi appeared first on Telugu360 .
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని నంద్యాల జిల్లాకు తీసుకు
Korutla |సర్పంచ్ బరిలో తల్లి, కూతుళ్ళు …
Korutla | సర్పంచ్ బరిలో తల్లి, కూతుళ్ళు … కోరుట్ల, ఆంధ్రప్రభ :
Nirmal |నామినేషన్ వేసిన మరుసటి రోజే…
మామడ, ఆంధ్రప్రభ : మండలంలో విషాదం చోటుచేసుకుంది… పొన్కల్ గ్రామానికి చెందిన దుబ్బాక
ఐదు వికెట్లు కోల్పోయి.. ఆచితూచి ఆడుతున్న సౌతాఫ్రికా
రాంచీ: జెఎస్సిఎ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్లో సఫారీ జట్టు టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. 350 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ రికల్టన్ వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో రికల్టన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మరో కీలక ఆటగాడు డికాక్(0) కూడా హర్షిత్ రాణా బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఆర్ష్దీప్ బౌలింగ్లో కెప్టెన్ మార్క్రమ్(7) రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని బ్రీట్జ్కే, జోర్జిల జోడీ ఆదుకుంది. వీరిద్దరు కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోర్జి ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 37 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బ్రీట్జ్కే, యాన్సెన్ల జోడీ పట్టు వదలకుండ స్కోర్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బ్రీట్జ్కే, యాన్సెన్లు అర్థ శతకం సాధించారు. యాన్సెన్ అర్థశతకం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. క్రీజ్లో బ్రీట్జ్కే(67), యాన్సెన్(54) ఉన్నారు.
ఐబొమ్మ రవిని కాదు.. వారిని ఉరి తీయాలి.. సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్
ఐబొమ్మ వెబ్సైట్లో నేను కూడా సినిమాలు చూశా వందల్లో టికెట్ ధరలవల్లే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది పుడతారు సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ మన తెలంగాణ / హైదరాబాద్ : ఐబొమ్మ’ వెబ్సైట్లో తాను కూడా సినిమాలు ఉచితంగా చూశానని సిపిఐ సీనయర్ నాయకుడు డా. కె. నారాయణ అన్నారు. ఐబొమ్మ రవిని శిక్షించడం కంటే అసలైన సినిమా మాఫియాను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ డా. నారాయణ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరలను రూ. 600 నుండి రూ.700 వరకు పెంచితే సామాన్యులు సినిమాలు ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కోట్లు ఖర్చుపెట్టి, టికెట్ ధరల కోసం అడుక్కుంటారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం సాయం చేస్తుందా? కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బకొట్టారు‘ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఒకరిని జైల్లో వేయడం వల్ల ప్రయోజనం లేదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు. వ్యవస్థలోని లోపాలను సరిచేయనంత వరకు ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని నారాయణ హెచ్చరించారు. ‘ఒక ఐబొమ్మ రవిని జైలులో వేస్తే మరో వంద మంది వస్తారన్నారు. అలాగే మావోయిస్టు నేత హిడ్మాను చంపడం ద్వారా వెయ్యి మంది హిడ్మాలు పుడతారని నారాయణ వ్యాఖ్యానించారు. వ్యవస్థాగత వైఫల్యాల వల్లే రవి లాంటి వారు తప్పుడు మార్గంలోకి వెళుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తులను శిక్షించడం సమస్యకు పరిష్కారం కాదని, అసలు సమస్య వ్యవస్థలోనే ఉందని నారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులను సృష్టిస్తోందని, లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి వారు వస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో భారీ భూ స్కామ్ జరుగుతోంది.. రాహుల్ గాంధీకి కెటిఆర్ లేఖ
హిల్ట్ పి పేరుతో రూ. లక్షల కోట్ల కాంగ్రెస్ భూ కుంభకోణం దీనిపై రాహుల్ గాంధీ మౌనం ఆమోదానికి సంకేతం ఆయన స్పందించకుంటే ఈ అవినీతిలో భాగ్యస్వామ్యం ఉన్నట్లే మనతెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్ పి) అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదా..? అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. సిఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన హిల్ట్ పి విధానం వల్ల తెలంగాణ ప్రజలకు రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్నగర్ వంటి కీలక క్లస్టర్లలో మునుపటి ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని కెటిఆర్ తన లేఖలో వివరించారు. ఈ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, కొత్త హిల్ట్ పి కింద, పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్లుగా మార్చుకోవడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం(ఎస్ఆర్ఒ) విలువలో కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే చాలు అని ఆరోపించారు. ప్రస్తుత మార్కెట్ ధరలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ విధానం ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరిస్తుందని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేదు వేల కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కెటిఆర్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియలో పారదర్శకత లేదని, కేవలం డబ్బులు దండుకోవాలని మాత్రం వలననే సరైన విచారణ లేకుండానే ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొందరపాటుతనం, ఈ మొత్తం పాలసీలో దాగున్న రాజకీయ అవినీతి అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్ఆర్) వెలుపలికి కాలుష్య పరిశ్రమలను తరలించాలనే ఈ విధానం లక్ష్యం పేరు చెప్పి తప్పుడు దారిలో లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసిందని ఆరోపించారు. పరిశ్రమల తరలింపు ప్రధాన లక్ష్యం అయితే, ఇది మొత్తం పరిశ్రమలకు ఒక పాలసీ నిర్ణయంగా కాకుండా పూర్తి స్వచ్ఛందంగా నచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలనడం, ఒక్కొక్క దరఖాస్తు వారీగా ప్రత్యేకంగా ప్రభుత్వం భూముల ట్రాన్స్ఫర్కి ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల తరలింపుకు ఎలాంటి గడవు నిర్ధారించకపోవడం, పరిశ్రమలు తరలి వెళ్తాయా లేదా అన్న అంశాన్ని ప్రకటించకపోవడం వంటి అనేక లోపభూహిష్ఠమైన పాలసీని కేవలం డబ్బులు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా తీసుకువచ్చిందని పేర్కొన్నారు. తరలించాలనుకునే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ విధానం గుర్తించలేదని, ఈ భూముల ట్రాన్స్ఫర్ వలన కలిగి ఆవరణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వంటి లోపాలు పాలసీలో ఉన్నాయని కెటిఆర్ లేఖలో ప్రస్తావించారు. దీనివల్ల నగరంలో కొత్త పారిశ్రామికాభివృద్ధికి బదులుగా, పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విధానం కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి గల రియల్ ఎస్టేట్ గ్రూపులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించబడిందని ఆరోపించారు. ఈ అవినీతికి రాహుల్గాంధీ అడ్డుకట్ట వేయాలి బిఆర్ఎస్ ప్రభుత్వం భూ వినియోగ మార్పిడికి పారిశ్రామిక యూనిట్లు ఎస్ఆర్ఒ విలువలో 100 నుండి 200 శాతం చెల్లించాలని కఠినమైన నిబంధనలను అమలు చేసిందని కెటిఆర్ గుర్తు చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు సరైన పరిహారం అందేలా చూసుకుందని వివరించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిబంధనలు తొలగించి, తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతల అనుచరులకు ఎటిఎంగా మార్చేశారని విమర్శించారు. పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న ఐదు లక్షల కోట్ల అవినీతి స్కామ్ని అడ్డుకోవాలని రాహుల్గాంధీని కోరారు. లేకుంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే తనకు తన పార్టీకి భాగస్వామ్యం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం తెలంగాణలో జరుగుతున్నదని భావించాల్సి ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో ఇప్పటికైనా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, ప్రజల తరఫున బిఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని కెటిఆర్ డిమాండ్
Maktal |డిసెంబర్ 1న మక్తల్ కు సీఎం రేవంత్..
Maktal | డిసెంబర్ 1న మక్తల్ కు సీఎం రేవంత్.. మక్తల్, ఆంధ్రప్రభ
November Box-office: Below Par for Telugu Cinema
A heap of films tested their luck in November in Telugu cinema and most of them fell short of expectations and ended up as disasters at the box-office. During the first week of November, Sudheer Babu’s Jatadhara, Rashmika’s The Girlfriend, Premistunnaa and The Great Pre Wedding Show released. The Girlfriend performed well in multiplexes and […] The post November Box-office: Below Par for Telugu Cinema appeared first on Telugu360 .
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
దిత్వా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో పలు జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమశాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలి గాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబరు మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబరు నెలలో చలి అధికంగా ఉంటుందని, ప్రస్తుతం నవంబరు నెల నుంచే చలి పంజా విసరుతోందని చెపుతున్నారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు చలిగాలులు అధికంగా వీచే అవకాశందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
సరూర్నగర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్పై యువకుడి దాడి #Crime #SaroorNagar #Hyderabad #TrafficPolice
Palnadu Mu*der|అక్క కళ్లల్లో నీళ్లు చూడలేక…
Palnadu Mu*der | అక్క కళ్లల్లో నీళ్లు చూడలేక… ఆంధ్రప్రభ, పల్నాడు బ్యూరో
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం#TamilNaduAccident #BusCollision #RoadAccident #Sivaganga
కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కెటిఆర్ ఆవేదన..
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం.. ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ ఎంఎల్ఎ సుంకె రవిశంకర్తో మాట్లాడిన కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆయన చొప్పదండి మాజీ ఎంఎల్ఎ సుంకే రవిశంకర్కు ఫోన్ చేసి మాట్లాడి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. షాపుల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామాగ్రి సర్వం అగ్నికి ఆహుతి అయ్యాయని, దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనమైందని విచారం వ్యక్తం చేశారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంత భారీగా ఆస్తి నష్టం పెరగడానికి సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడమే ప్రధాన కారణమని మండిపడ్డారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్లో ఉండటం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయకపోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు తక్షణ సాయంగా రూ. 5000 అందజేసిన మాజీ ఎంఎల్ఎ సుంకే రవిశంకర్ను కెటిఆర్ అభినందించారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కెటిఆర్ హెచ్చరించారు.
చిన్నారిని కాలితో తొక్కుతూ ఆయా పైశాచిక ఆనందం
హైదరాబాద్: నర్సరీ విద్యార్థినిపై ఆయా అమానవీయంగా ప్రవర్తించింది. చిన్నారిపై కాలు వేసి తొక్కుతూ ఆయా లక్ష్మి పైశాచిక ఆనందం పొందింది. జీడిమెట్ల పరిధి షాపూర్నగర్లోని పూర్ణిమా స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా లక్ష్మి ఇష్టారీతిన కొట్టింది. చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల ముగిసిన గంట తర్వాత వచ్చారు. ఆయా తనని కొట్టినట్లు తల్లిదండ్రులకు చిన్నారి తెలిపింది. దీంతో ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఈ ఘటన కారణంగా చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. దాడి జరిగిన సమయంలో పాఠశాల పక్కింటి వ్యక్తి ఆ ఘటనను వీడియో తీశాడు. ఆయా దాడి దృశ్యాలను ఆ వ్యక్తి తల్లిదండ్రులకు ఇచ్చాడు. దాడి దృశ్యాల ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మాదాపూర్లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు #Madhapur #Hyderabad #DemolitionDrive #Mindspace
Nagarkurnool |సర్పంచ్ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం..
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ : సర్పంచ్ పదవి తనకు కేటాయించాలని కోరుతూ వచ్చిన కాంగ్రెస్
CHAMPIONS |ఫైనల్లో దుమ్ము రేపిన డబుల్స్ జోడీ…
CHAMPIONS | ఫైనల్లో దుమ్ము రేపిన డబుల్స్ జోడీ… సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్
ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. 8 మంది మృతి
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టిసి బస్సులు ఢీకొనగా.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. శివగంగ జిల్లా తిరువత్తూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తున్న ఓ బస్సు.. కారైకుడి నుంచి దిండిగల్కు వెళ్తున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్లు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బస్సుల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
భారీ ధరకు ‘పెద్ది’ ఒటిటి రైట్స్.. ఎంతంటే..
రామ్చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంపై రామ్చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. కొన్ని నెలల క్రితం వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ నుంచి ఈ మధ్యే వచ్చిన ‘చికిరి చికిరి’ అంటూ సాగే తొలి సింగిల్ వరకూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకున్నాయి. అయితే విడుదలకు ముందే పెద్దికి వచ్చిన బజ్తో పలు ఒటిటి సంస్థలు దీని డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రెండు ప్రముఖ ఒటిటి సంస్థలు ఈ పోటీలో ఉన్నాయి. అందులో నెట్ఫ్లిక్స్ సంస్థకు రైట్స్ దక్కినట్లు సమాచారం. దాదాపు రూ.130 కోట్లతో పెద్ది డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించనుందట. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో స్పోర్ట్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.
Big Breaking : ఘోర రోడ్డు ప్రమాదం ...11 మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదకొండు మంది మరణించారు
BRS|బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు..
BRS| జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని
Election |అక్కడ 11 ఏళ్ల తర్వాత.. !
Election | అక్కడ 11 ఏళ్ల తర్వాత.. ! ఉట్నూర్ మేజర్ గ్రామ

24 C