SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

వారంలో పంచాయతీ నగారా?

మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సం స్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) సిద్ధమవుతోంది. ఈనెల 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో గ్రామ పం చాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీల్లో 50 శాతానికి లోబడి ఎస్‌సి,ఎస్‌టి, బిసి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నివేదికకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలు వెంటనే జిల్లాల్లో ఆ యా పంచాయతీల వారీగా జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ఖరారుకు చేయనుంది. ఒ కటి రెండు రోజుల్లోనే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీల వా రీగా రిజర్వేషన్లను సిద్ధం చేస్తారు. ఈ నెల 24న హైకోర్టులో రిజర్వేషన్ల అమలుపై వి చారణ ఉన్న నేపథ్యంలో ఆలోపే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి,  హైకోర్టుకు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. పంచాయతీల్లో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎన్నికలు నిర్వహించుకునేందుకు గతంలో హైకో ర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కా గా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నిక లు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. పంచాయతీల్లో ఓటరు జాబితా మ రోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) షెడ్యూల్ ప్రకటించిన సంగతి తె లిసిందే. ఈ నెల 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వార్డుల మ్యాపింగ్‌లో తప్పుల సవరణ (అడ్రస్‌లో మార్పు లేకుండా కేవలం వార్డు మార్పులు మాత్రమే) అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ/వార్డు/పోలింగ్‌స్టేషన్ వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల్లో మిస్ మ్యాపింగ్‌పై ఓటర్ల నుంచి దరఖాస్తు స్వీకరణ, వాటి పరిశీలన 22వ తేదీన అందిన ఫిర్యాదులు, అభ్యర్థనలు, అభ్యంతరాలను సంబంధిత డిపిఒల ద్వారా పరిష్కారించనున్నారు. 23వ తేదీన సంబంధిత గ్రామపంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు తిరిగి ప్రచురించాలి. అందులో ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌లో తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుతారు. పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం.. ఓటర్ల జాబితాను పరిశీలించి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ ప్రచురిస్తారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తవ్వగానే.. ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. 31 జిల్లాల్లో 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించి, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా.. గత సెప్టెంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు. సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించాలి: కమిషనర్ రాణి కుముదిని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఈ ఎన్నికల నిర్వహణపై గురువారం జిల్లా కలెక్టర్లు,ఎస్‌పిలు, ఉన్నతాధికారులతో కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఇసి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డి.జి.పి. శివధర్ రెడ్డి,ఇతర ఎన్నికల సంఘం అధికారులతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు.

మన తెలంగాణ 21 Nov 2025 5:00 am

సిబిఐ కోర్టుకు జగన్ హాజరు

మన తెలంగాణ/హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువా రం సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ నిమిత్తం హా జరయ్యారు. ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాం పల్లిలోని సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసు లో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ మోహన్‌రెడ్డి చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ కోర్టు కు ప్రత్యక్షంగాహాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామం నేపథ్యంలోనే శుక్రవారం లోపు వ్యక్తిగతంగా హాజరవ్వాలని జగన్ను కోర్టు ఆదేశించడంతో ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు. విచారణ ప్రారంభం కాగానే, కోర్టు సిబ్బంది ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచిన వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తికి నమస్కరించారు. అనంతరం, న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్‌ను కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. విచారణ సందర్భంగా జగన్ ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణనలోకి తీసుకుని, సంతకం చేయించుకుని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది. అనంతరం ఆయన లోటస్‌పాండ్ లోని తన నివాసానికి చేరుకున్న కాసేపు ఉన్న అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. తరలి వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద, నాంపల్లి సీబీఐ కోర్టు సమీపంలో హల్ చల్ చేశారు. వైసీపీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్ మోహన్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ‘2029లో రప్ప రప్పా’ అంటూ జగన్ అభిమానులు నినాదాలు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే నాంపల్లి కోర్టు సమీపంలో కేసు విచారణకు వచ్చిన జగన్ కోసం వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

మన తెలంగాణ 21 Nov 2025 4:30 am

రాష్ట్రంలో ‘సన్నబియ్యం’ సక్సెస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అమ లు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పేర్కొన్నారు. దే శంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేష న్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సిఎం వివరించారు. దీంతో పిడిఎస్ బియ్యం రీ సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని ఆయన చెప్పారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందన్నారు. తెలంగాణలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని సిఎం సూచించారు. దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో సిఎంతో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సివిల్ సప్లయిస్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలి ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 202425 రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని ఆయన కోరారు. పిడిఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైసుకు సంబంధించిన రూ.1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలన్నారు. పిఎంజీకేఏవై అయిదో దశకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 343.27 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలని సిఎం కోరారు. 2024-25 ఖరీఫ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవధి పొడిగించాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌సిఐ గోదాంల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్ రైస్ ర్యాకులను కేటాయించాలని, రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్రం సాయం అందిం చాలని సిఎం రేవంత్ కోరారు. 2025-26 ఖరీఫ్‌లో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ అవసరం తగ్గిందని, అందువల్ల మిల్లింగ్‌కు అనువైన ముడిబియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మిగులు ధాన్యం నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ఎగుమతి అవకాశాలను పరిశీలించాలని సిఎం రేవంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని, బాయిల్డ్ రైస్ అదనపు కోటాను కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రా రైస్‌కు అనువైన రకాల వరిసాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

మన తెలంగాణ 21 Nov 2025 4:00 am

బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం

మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 22న ఆగ్నే య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయు వ్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈనెల 24 నాటికి వాయుగుండంగా మా రే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 48 గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాగల 2రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుండి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రం మొత్తం చలితో గజగజ : కొద్దిరోజులుగా సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు రాష్ట్రం మొత్తం చలితో గజగజా వణికిపోతోంది. ఉదయం 9 గంటలైనా ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంది. రాత్రి నుంచి ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి 7.1, ఆదిలాబాద్ 7.7, వికారాబాద్ 8.1, రంగారెడ్డి 8.2, కామారెడ్డి 8.5, సిద్దిపేట 8.6, నిజామాబాద్ 8.9, జగిత్యాల 9, మెదక్ 9.3, నిర్మల్ 9.4, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 9.9 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత పది రోజులుగా చలి తీవ్రత ఉధృతంగా కొనసాగుతుండగా మరింత అధికమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్‌కు చేరగా మిగిలిన జిల్లాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు కూడా 27.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గటంతో పొద్దంతా కాస్తా చలితో కూడిన వాతావరణం ఉంటోంది. ఉష్ణోగ్రతల తగ్గుదలకు తోడుగా ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు చలి ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో పెరిగిన తేమ శాతం అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమశాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలి గాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబరు మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబరు నెలలో చలి అధికంగా ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం నవంబరు నెల నుంచే చలి పంజా విసరుతోంది. తెలంగాణలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది తెలంగాణకు ఉన్న ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితి. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఉత్తర, మధ్య భారతదేశానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇటీవల ఆ ప్రాంతాల్లో అధిక పీడనం ఏర్పడింది. దాని వల్ల అక్కడి నుంచి చల్లని, పొడి గాలులు దక్కన్ పీఠభూమిపై ఉన్న తెలంగాణ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.

మన తెలంగాణ 21 Nov 2025 3:30 am

కడియం, దానంకు మరోసారి స్పీకర్ నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ గురువారం నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగింది. దానం, కడియం మాత్రం సమాధానం ఇచ్చేందు కు మరికొంత సమయం కావాలని కోరారు. గురువారం 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తయిన నేపథ్యంలో స్పీకర్ వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సభాపతి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 21 Nov 2025 3:20 am

తెలంగాణ రైజింగ్ కు అండదండ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్‌కు నాబార్డ్ సహకరించాలని డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభు త్వం ధృఢ సంకల్పంతో ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. గురువారం మాదాపూర్‌లోని హై టెక్స్‌లో ఏర్పాటు చేసిన నాబార్డ్ మొదటి ఎర్త్ స మ్మిట్‌లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద రుణమాఫీల్లో ఒకదాన్ని అమ లు చేసి దాదాపు 22 లక్షల కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల ఉపశమనం అందించామన్నారు. కొనుగోలు వ్యవస్థను విస్తరించి పారదర్శకంగా మార్చామని, రైతులకు నేరుగా, సమయానుసారం మద్దతు అందుకునేలా రైతు భరోసా అ మలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. సాగునీరు, డిజిటల్ పంట రికార్డులు, కోత తర్వా త మౌలిక వసతులలో పెట్టుబడులతో గ్రామీణ కు టుంబాల్లో బలమైన నమ్మకాన్ని పునరుద్ధరించామని తెలిపారు. సంక్షోభ సమయాల్లోనే కాదు, రై తుల ప్రతి రోజూ అభివృద్ధి పయనంలో ప్రజా ప్ర భుత్వం తోడుగా ఉంటుందని, ఇది తమ నిబద్ధత అన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ ఎర్త్ సమ్మిట్‌లో పాల్గొనడం తనకు లభించిన గొప్ప గౌరవం అన్నారు. వ్యవసాయం గురిం చి మనం మాట్లాడినప్పుడు సంస్థాగత విప్లవం లేకుండా ఏ గ్రీన్ రేవల్యూషన్ కూడా సాధ్యం కా దని గుర్తు చేసుకోవాలని, ఈ సత్యాన్ని అర్థం చే సుకున్న నాయకులు మన దేశానికి లభించటం ఒ క వరం అని వివరించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మిగతా అన్నీ ఆగవచ్చని, వ్యవసాయం ఆగకూడదనే నమ్మకంతో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సాగునీటి సంఘాలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు వంటి వ్యవస్థాగత నిర్మాణాన్ని సృ ష్టించారని తెలిపారు. ఇందిరా గాంధీ ముఖ్యంగా గ్రీన్ రేవల్యూషన్ కాలంలో ఆమె చూపిన ధైర్యం రైతుకు భారత ప్రభుత్వ సంపూర్ణ అండ లభించేలా చేసిందన్నారు.పిఏసీల ఆధునికీకరణ, సహకార సంస్థల బలోపేతం, వ్యవసాయ డిజిటలైజేషన్, ఎఫ్‌పిఓలకు సుస్థిర శక్తి ఇవ్వడం, గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. సమ గ్ర గ్రామీణ దృష్టికోణం విషయానికి వస్తే తెలంగాణలో మనం నిర్మిస్తున్న ప్రతిదీ డిజిటల్ మౌలిక వసతులు, అగ్రిటెక్, ఫిన్‌టెక్, పునరుత్పాదక శక్తి, ఇంక్యుబేషన్ ఇవన్నీ ఒకే దృష్టి వైపు సాగుతున్నాయన్నారు.నాబార్డ్ గ్రామీణ భారతానికి ఎప్పుడూ భాగస్వామి, మార్గదర్శి అని తెలిపారు. 

మన తెలంగాణ 21 Nov 2025 3:00 am

فیکٹ چیک: بیشتر میڈیا اداروں نے کیرلہ کے ہم نام کارڈِیالوجسٹ کی تصویر دہلی دھماکہ کیس کے مشتبہ ڈاکٹرعارف کے گمراہ کن دعوے کے ساتھ کی وائرل

کیرلہ کے کارڈیالوجسٹ ڈاکٹر عارف محمد کی تصویر غلطی سے دہلی دھماکے میں گرفتار میڈیکل طالب علم سے جوڑ کر شیئر کی گئی، جس کے باعث سوشل میڈیا پر گمراہ کن معلومات پھیلتی چلی گئی

తెలుగు పోస్ట్ 21 Nov 2025 12:09 am

సిగాచి బాధితులకు కోటి పరిహారం ఏమైంది?

 సిగాచి ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి ప్రమాద బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇప్పటికీ అందలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికుల కుటుంబాలు రో డ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ‘సిగాచి‘ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి, నాలుగు నెలలు గడిచిందని పేర్కొన్నారు. 54 మంది కార్మికులను పొట్టనపెట్టుకున్న నాటి దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతున్నదని అన్నారు. ఆనాడు ప్రమాద స్థలానికి వచ్చి, మృతదేహాల సాక్షిగా మీరు ఇచ్చిన హామి ఇప్పటివరకు నెరవేర్చకపోవడం శోచనీయం అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పైగా పరిహారం అందించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుంటే ఇక ఆ బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని అడిగారు. సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. ప్రమాదం జరిగిన జూన్ 30న సిఎం స్వ యంగా వచ్చి, మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పు న పరిహారం అందిస్తామని ఘనంగా ప్రకటించారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, పరిహారా న్ని పరిహాసంగా మార్చారని మండిపడ్డారు. నాలుగు నెలలు గడిచినా పరిహారం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని అన్నారు. గడిచిన నాలుగు నెలల్లో బాధితుల చేతికి అందింది కేవలం రూ. 26 లక్షలు మాత్రమే అని, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి ఇంకా రూ. 74 లక్షలు బాకీ పడ్డారని పేర్కొన్నారు. ఇది మాట తప్ప డం కాదా..? అని ప్రశ్నించారు. కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా బాధితులకు రూ.40 నుండి 50 లక్షలు అం దించామని ప్రకటించడం అత్యంత శోచనీయం అని పేర్కొన్నారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో కలిపి లెక్కలు చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఇప్పటికీ బాధితులకు అందలేదని అన్నారు. కేంద్రంతో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సాక్షాత్తు హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసినా మీలో చలనంలేదని విమర్శించారు.  

మన తెలంగాణ 20 Nov 2025 11:38 pm

Nikhat Zareen |లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా !

Nikhat Zareen | లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా !

ప్రభ న్యూస్ 20 Nov 2025 11:32 pm

TG |పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పణ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన పూర్తి నివేదికను రాష్ట్ర

ప్రభ న్యూస్ 20 Nov 2025 11:21 pm

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై సుప్రీం యూటర్న్‌

న్యూదిల్లీ: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే అంశంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌)పై అత్యున్నత న్యాయస్థానం సమాధానమిచ్చింది. పెండిరగ్‌ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదని సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు […] The post రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై సుప్రీం యూటర్న్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 11:20 pm

రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలి: ఎంఎల్ఎ రాజాసింగ్

హిందూ ధర్మంపై ఏ మాత్రం అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల కారణంగా రాజమౌళిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనపై హిందువులు అంతా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. దేవుడిపై నమ్మకం లేకపోతే వారి పేరుతో సినిమాలు ఎందుకు తీస్తున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘ బాహుబలి’లో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు, వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. ‘వారణాసి’ సినిమా ప్రచారం కోసమే ఇలా మాట్లాడారా, లేక నిజంగానే నాస్తికులా అనే విషయంపై రాజమౌళి స్పష్టత ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాజమౌళి హిందూ దేవుళ్లను కించపరచడం ఇది మొదటిసారి కాదని, గతంలో రాముడు, కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని రాజాసింగ్ ఆ వీడియో సందేశంలో గుర్తు చేశారు.

మన తెలంగాణ 20 Nov 2025 11:20 pm

బీహార్‌లో కొలువైన ఎన్డీయే సర్కార్‌

10వ సారి సీఎంగా నితీశ్‌ . మంత్రులుగా 26 మంది ప్రమాణస్వీకారం. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు. ప్రధాని మోదీ సహా హాజరైన ప్రముఖులు పట్నా: జనతాదళ్‌ (యునైటెడ్‌) అధినేత నితీశ్‌ కుమార్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పట్నాలోని గాంధీ మైదా నంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు […] The post బీహార్‌లో కొలువైన ఎన్డీయే సర్కార్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 11:17 pm

WGL |హాస్పిటల్‌లో రోగి బంగారం మాయం..

వరంగల్, (ఆంధ్రప్రభ సిటీబ్యూరో): వరంగల్‌లోని ఆరేపల్లి సమీప రిలీఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

ప్రభ న్యూస్ 20 Nov 2025 11:16 pm

కొనేదెలా… తినేదెలా?

కేక పుట్టిస్తున్న కూరగాయ ధరలు . చికెన్‌ కంటే చిక్కుళ్లే ప్రియం. ఆర్థికభారంతో సామాన్యుల బెంబేలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు పేద, మధ్య తరగతి వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా కాయగూరల రేట్లు ఆకాశాన్నంటుతుం డటంతో ఆర్థిక భారం పడుతోంది. ధరలు చూసి మహిళలు బెంబేలెత్తు తున్నారు. రూ.200తో మార్కెట్‌కు వెళితే మూడు రోజులకు సరిపడా కూరగాయలు రావడం లేదని వాపోతున్నారు. వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేయాలంటే […] The post కొనేదెలా… తినేదెలా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 11:13 pm

నెల్లూరు లేడీ డాన్ అరుణకు బెయిల్ మంజూరు

నెల్లూరు లేడీ డాన్ అరుణ కు బెయిల్ మంజూరు అయింది. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూళ్లు చేసి కేసులో ఆమెను సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయ వాడ కోర్టును అరుణ కోరారు. ఆమె పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.25 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. దీంతో ఆమె నెల్లూరు జైలులో జుడీషియర్ రిమాండ్ ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ మంజూరు కావడంతో అరుణ జైలు నుంచి శుక్రవారం విడుదల కానున్నారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ పేరు విపరీతంగా వినిపించింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో శ్రీకాంత్‌ను ఆమె జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. అంతేకాదు జగన్ ప్రభుత్వ హయాంలో పలువురిని బెదిరించినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. దీంతో అరుణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

మన తెలంగాణ 20 Nov 2025 11:10 pm

‘రాజాసాబ్’ తొలి పాట వచ్చేస్తోంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌లో స్టైల్, స్వాగ్‌తో ఎంట్రీ ఇచ్చేందుకు రెబల్ సాబ్ సిద్ధమయ్యాడు అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ స్పెషల్ పోస్టర్‌తో చిత్రబృందం ఫస్ట్ సింగిల్ వివరాలను తెలియజేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తొలి పాటకు సంబంధించిన అప్‌డేట్ రానున్నట్టు పేర్కొన్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ట్రైలర్‌లో రెండు డిఫరెంట్ షేడ్స్ లో ప్రభాస్ కనిపించిన తీరు రెబల్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్ని మైమరపించింది. టెర్రఫిక్ రాజా సాబ్ క్యారెక్టర్‌తో పాటు వింటేజ్ లుక్ లో ప్రభాస్ వర్సటైల్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

మన తెలంగాణ 20 Nov 2025 11:00 pm

రైతుల ప్లాట్లకు సరిహద్దు రాళ్లు

. మూడు నెలల్లో పూర్తి. 15 నుంచి పెగ్‌ మార్కింగ్‌. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు. ప్రభుత్వం కీలక నిర్ణయం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర రాజధాని అమరావతి రైతులు కొంతకాలంగా తమ సమ స్యలు తీరడం లేదని ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే ఏడాదిన్నర అవుతున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతు న్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు అధికారులకు మున్సిపల్‌ మంత్రి నారాయణ కీలక […] The post రైతుల ప్లాట్లకు సరిహద్దు రాళ్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:55 pm

పెట్టుబడికి సానుకూల వాతావరణం వైపు ముందడుగు!

టి. లక్ష్మీనారాయణ పారిశ్రామిక – ఆర్థిక – ఆధునిక నగరం, రాప్ట్రానికి తలమానికమైన విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025 ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడికి సానుకూల వాతావరణం సృష్టించింది. సదస్సుకు ‘‘హై-వోల్టేజ్‌’’ ప్రచారం లభించింది. తద్వారా, గత ప్రభుత్వ కాలంలో, పారిశ్రామిక రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం నుంచి రాష్ట్రం బయటపడిరదన్న భావన కలుగుతున్నది. ఇది అతి ముఖ్యమైన సానుకూల అంశం. రు.13,25,716 కోట్ల విలువైన 613 అవగాహన ఒప్పందాలు జరిగాయని, వాటి ద్వారా 16,31,188 ఉపాధి […] The post పెట్టుబడికి సానుకూల వాతావరణం వైపు ముందడుగు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:52 pm

నితీశ్‌కు పాలన నల్లేరుపై నడకేనా!

పతకమూరు దామోదర్‌ప్రసాద్‌ బీహార్‌ 18 వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ప్రధాని మోదీ సారధ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) అంచనాలకు మించి విజయం సాధించింది. ప్రతిపక్ష మహాఘట్బంధన్‌ నేతగా బరిలో నిలిచి హోరాహోరీగా తలపడి ఈసారైనా ముఖ్యమంత్రి కావాలని ఉధృతంగా ప్రచారం సాగించిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడి) యువనేత తేజస్వి యాదవ్‌ ఆశలు ఆడియాసలయ్యాయి. ఎన్డీయేను దీటుగా ఢీ కొట్టడానికి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి మహిళ ఖాతాలో […] The post నితీశ్‌కు పాలన నల్లేరుపై నడకేనా! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:51 pm

బ్యాంకుల ప్రైవేటీకరణ వైపేకేంద్రం మొగ్గు

గోపాలుని రాధాకృష్ణ కేంద్రంలో ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక పథకం ప్రకారం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పచెప్పే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్నత పదవిలో ఉన్న వారి నియామకాల్లో ప్రైవేటు రంగం నుంచి తీసుకునేలా ఇటీవల ఆదేశాలు జారీ చేయడం కూడా తెలిసిందే. మరోవైపు విలీనాలంటూ ఆర్థికశాఖ మంత్రి భారతీయ రిజర్వుబ్యాంకుతో, సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చలు జరపటం చూస్తుంటే త్వరలో బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర […] The post బ్యాంకుల ప్రైవేటీకరణ వైపేకేంద్రం మొగ్గు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:50 pm

నోరు జారి నిజం చెప్పిన దోవల్‌

ఎవరైనా నోరు జారొచ్చు. అలా నోరు జారినప్పుడు అసంకల్పితంగానే నిజాలు బయట పెట్టొచ్చు. ఆ నిజం ఇబ్బందికరమైంది అయినప్పుడు ఆ నిజం చెప్పిన వారే తాను ఆ మాట అనలేదని వితండవాదానికి దిగొచ్చు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఇప్పుడు ఇదే సంకట స్థితిలో పడిపోయారు. ఆయన ఎవరి అధీనంలో అయితే జాతీయ భద్రతా సలహాదారుగా పని చేస్తున్నారో వారి నడవడిక ప్రభావం ఆయన మీద కూడా అమితంగానే ఉండొచ్చు. మోదీ ప్రభుత్వానికి దోవల్‌ సలహాదారుగా […] The post నోరు జారి నిజం చెప్పిన దోవల్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:49 pm

HYD |తెలంగాణ ప్రజలు బాగుండాలే..

HYD | తెలంగాణ ప్రజలు బాగుండాలే కొత్తూరు, (ఆంధ్రప్రభ): జహంగీర్ పీర్ దర్గా

ప్రభ న్యూస్ 20 Nov 2025 10:40 pm

మళ్లీ ఆందోళనలతో భగ్గుమన్న నేపాల్

 రెండు నెలల క్రితం చెలరేగిన జెన్‌జడ్ ఆందోళనలు చివరకు అప్పటి ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రుల రాజీనామాకు దారి తీసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జెన్‌జడ్ ఆందోళనలు చెలరేగాయి. మాజీ ప్రధాని కేపీ శర్మ మద్దతుదారులు, యువ నిరసన కారుల మధ్య సిమారా పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల వారు ర్యాలీలు నిర్వహించారు.సాధారణ పరిస్థితులు లేకపోవడంతో గురువారం రాత్రివరకు అధికారులు కర్ఫూ విధించారు. ఈ సందర్భంగా నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కీ ప్రజలంతా రాజకీయంగా రెచ్చగొట్టే సమాచారానికి దూరంగా ఉండాలని , ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం ఉంచాలని పిలుపునిచ్చారు. 

మన తెలంగాణ 20 Nov 2025 10:28 pm

ఐదు కూనలకు జన్మనిచ్చిన చీతా

 భారత సంతతికి చెందిన చీతా ముఖి ఐదు కూనలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో చీతా పిల్లల్ని కనడం ప్రాజెక్టు చీతాకు మైలు రాయివంటిదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం అభివర్ణించారు. భారత్‌లో మొదటగా జన్మించిన స్వదేశీ చీతా ఇప్పుడు తిరిగి పిల్లలను కనే మొదటి భారత చీతాగా రికార్డుకెక్కింది. దేశంలో చీతాల సంతతి క్షీణించుకుపోవడంతో 2022 సెప్టెంబరు 17న భారత్‌లో చీతాలను తిరిగి ప్రవేశ పెట్టారు. 

మన తెలంగాణ 20 Nov 2025 10:26 pm

NZB |మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

బాల్కొండ (ఆంధ్రప్రభ): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో

ప్రభ న్యూస్ 20 Nov 2025 10:13 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଖେସାରି ଲାଲଙ୍କ ବକ୍ତବ୍ୟକୁ ଭୁଲ ଦାବିସହ ସେୟାର କରାଯାଉଛି

ବିହାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ଗ୍ରହଣ କରିଛନ୍ତି ନୀତିଶ କୁମାର । 10 ଥର ପାଇଁ ବିହାରର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ଗ୍ରହଣ କରି ରେକର୍ଡ କରିଛନ୍ତି ନୀତିଶ । ଏହା ସହ ସେ ବିହାରର ସବୁଠାରୁ ଦୀର୍ଘକାଳୀନ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ହୋଇଛନ୍ତି । ରାଜ୍ୟପାଳ ଆରିଫ୍ ମହମ୍ମଦ ଖାନ ତାଙ୍କୁ ପଦ ଏବଂ ଗୋପନୀୟତାର ଶପଥ ପାଠ କରାଇଛନ୍ତି । ବିହାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ଗ୍ରହଣ କରିଛନ୍ତି ନୀତିଶ କୁମାର । 10 ଥର ପାଇଁ ବିହାରର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ଗ୍ରହଣ କରି ରେକର୍ଡ କରିଛନ୍ତି ନୀତିଶ । ଏହା ସହ ସେ ବିହାରର ସବୁଠାରୁ ଦୀର୍ଘକାଳୀନ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ହୋଇଛନ୍ତି । ରାଜ୍ୟପାଳ ଆରିଫ୍ ମହମ୍ମଦ ଖାନ ତାଙ୍କୁ ପଦ ଏବଂ ଗୋପନୀୟତାର ଶପଥ ପାଠ କରାଇଛନ୍ତି । ସେହପରି ବିଜୟ କୁମାର ଚୌଧୁରୀ, ମଙ୍ଗଲ ପାଣ୍ଡେ, ଦିଲୀପ ଜୟସ୍ବାଲ, ଅଶୋକ ଚୌଧୁରୀ, ଶ୍ରବଣ କୁମାର ଓ ବିଜେନ୍ଦ୍ର ପ୍ରସାଦ ଯାଦବ ବିହାର କ୍ୟାବିନେଟରେ ମନ୍ତ୍ରୀ ପଦ ପାଇଁ ଶପଥ ଗ୍ରହଣ କରିଛନ୍ତି । ପରେ ଲେଶୀ ସିଂ, ମଦନ ସିହ୍ନା, ନୀତିନ ନବୀନ, ରାମ କୃପାଲ ଯାଦବ, ସନ୍ତୋଷ କୁମାର ସୁମନ ଓ ସୁନିଲ କୁମାର, ବିହାର କ୍ୟାବିନେଟରେ ରାଜ୍ୟ ମନ୍ତ୍ରୀ ଭାବେ ଶପଥ ନେଇଛନ୍ତି । ତେବେ HAM(S)କୁ ଗୋଟିଏ ମନ୍ତ୍ରୀପଦ ମଳିବ ବୋଲି ଆଶା କରାଯାଉଥିଲା । HAM(S) ସନ୍ତୋଷ କୁମାର ସୁମନ ବିହାର ମନ୍ତ୍ରୀମଣ୍ଡଳରେ ସାମିଲ ହୋଇଛନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଆରଜେଡି ନେତାଙ୍କୁ ଅହଙ୍କାରୀ ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ବ୍ରହ୍ମାଙ୍କ ଲେଖନିକୁ ମଧ୍ୟ ନିଜେ ବଦଳାଇ ଦେଇପାରିବ ବୋଲି ଦାବି କରୁଥିବା ବ୍ୟକ୍ତି ଆଜି ନିଜେ ନିର୍ବାଚନ ହାରିଯାଇଛି ବୋଲି ଲେଖିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଆରଜେଡି ନେତା ଖେସାରି ଲାଲ ବ୍ରହ୍ମାଙ୍କ ଲେଖନିକୁ ମଧ୍ୟ ବଦଳାଇଲାରିବେ ବୋଲି କହୁଥିବାଇ ଶୁଣିବାକୁ ମିଳିଛି । ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି ।  ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ବ୍ରହ୍ମାଙ୍କ ଲେଖନି ବଦଳାଇ ପାରିବେ ବୋଲି ଖେସାରି ଯାଦବ ନିଜପାଇଁ ନୁହେଁ, ଦିନେସ ଲାଲ ଯାଦବଙ୍କୁ ଆକ୍ଷେପ କରି କହିଥିଲେ । ଭାଇରାଲ ଭିଡିଓର ତଦନ୍ତ କରିବାକୁଯାଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଖେସାରି ଲାଲ ଏଭଳି କହିଥିବା କୌଣସି ସୂଚନା ପାଇନଥିଲୁ । ଯଦି ଖେସାରି ନିଜକୁ ଏଭଳି କହିଥାନ୍ତେ ତେବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମ ନିଶ୍ଚିତ ପ୍ରକାଶ କିମ୍ବା ପ୍ରସାରିତ କରିଥାନ୍ତେ । ନଚେତ ପ୍ରତିପକ୍ଷ ପ୍ରତିଦ୍ବନ୍ଦି ତାଙ୍କୁ ନିଶ୍ଚିତ କଟାକ୍ଷ କରିଥାନ୍ତେ । ତେବେ ଉକ୍ତ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର କିଛି ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ରୋହିତ ବାବୁ ନାମକ ଜଣେ ଇନଷ୍ଟାଗ୍ରାମ ୟୁଜର୍ସ ଏକ ଭିଡିଓ ନିଜ ଆକାଉଣ୍ଟ ଅପଲୋଡ କରିଥିବା ବେଳେ ଉକ୍ତ ଭିଡିଓଟିରେ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଚଳିତ ବର୍ଷ ବିହାର ବିଧାନସଭା ନିର୍ବାଚନ ନିର୍ବାଚନ ର ହୋଇଥିବା ବେଳେ ଏହା ହରିସିଦ୍ଧି ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀର ଘଟଣା ବୋଲି ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । View this post on Instagram A post shared by Rohit_babu_ahir (@rohit_babu_ahir) ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରାରେ ମେଳ ଖାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ କିୱାର୍ଡ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଫେସବୁକ ଭିଡିଓ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଦବଙ୍ଗ ଷ୍ଟେଜ ସୋ ନାମକ ଏକ ଫେସବୁକ ପେଜ୍ ଉକ୍ତ ଭିଡିଓଟିକୁ ଅପଲୋଡ଼ କରିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ଖେସାରିଲାଲ ଭାଷଣ ଦେଇ କହିଛନ୍ତି, ନିର୍ବାଚନ ସମୟରେ ଆମ ଦିନେସ ଭାଇ କହିଥିଲେ: ମତେ ହରାଇ ପାରିବା ଭଳି କୌଣସି ବ୍ୟକ୍ତି ଏପର୍ଯ୍ୟନ୍ତ ଜନ୍ମହିଁ ହୋଇନାହିଁ । ଦିନେସ ଏହା ମଧ୍ୟ କହିଥିଲେ ଯେ, ସିଏ ବ୍ରହ୍ମା ଲେଖିଥିବା ଲେଖନିକୁ ମଧ୍ୟ ଲିଭାଇ ଦେଇପାରିବେ । ଆଉ ଏକ ନାରାବାଜି ହେଉଥିଲା ଯିଏ ରାମଙ୍କୁ ଆଣିବ ଆମେ ତାଙ୍କୁ ଆଣିବୁ । ଆରେ ଭାଇ ତୁମ ଔକାଦ କଣଯେ ତୁମେ ରାମଙ୍କୁ ଆଣିବ । ଉକ୍ତ ଭିଡିଓ ଦେଖି ଏହା ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ହେଉଥିବା ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ବ୍ରହ୍ମାଙ୍କ ଲେଖନି କୁ ମଧ୍ୟ ବଦଳାଇପାରିବେ ବୋଲି ଖେସାରି ଲାଲ ନିଜ ପାଇଁ ନୁହେଁ ଦିନେସଙ୍କୁ ଆକ୍ଷେପ କରି କହିଥିଲେ । ପ୍ରକୃତରେ, ୨୦୧୯ ଲୋକସଭା ନିର୍ବାଚନ ସମୟରେ ନିରୁଆରେ ଏହି ବକ୍ତବ୍ୟ ପାଇଁ ବହୁଳ ଭାବରେ ଚର୍ଚ୍ଚାରେ ଥିଲେ । ସେସମୟରେ ଏକ ଟିଭି ଚ୍ୟାନେଲ ସହିତ ଏକ ସାକ୍ଷାତକାରରେ ସିଏ କହିଥିଲେ, ମୁଁ ଜଣେ ସ୍ୱାଧୀନ ବ୍ୟକ୍ତି ହୋଇଥିବାରୁ ମୋତେ ପରାସ୍ତ କରିପାରିବା ଭଳି କେହି ଜନ୍ମ ହୋଇନାହାଁନ୍ତି। ମୋର ବିଚାରଧାରା ସ୍ୱାଧୀନ, ମୁଁ କାହାର ଦାସ ନୁହେଁ। ପରେପରେ ରାମଧାରୀ ସିଂହ ଦିନକରଙ୍କ ଏକ କବିତା ପାଠ କରି କହିଥିଲେ, ଯଦି ମୋର ନିଜସ୍ୱ ଚିନ୍ତାଧାରା ଳ ଥାଏ, ତେବେ ମୁଁ ପରମେଶ୍ୱର ଯାହା ଲେଖିଛନ୍ତି ତାହା ମଧ୍ୟ ଲିଭାଇ ପାରିବି। ଖେସାରି ଲାଲ ତାଙ୍କ ଭାଷଣରେ ଏହି ସମାନ ବକ୍ତବ୍ୟକୁ ପୁନରାବୃତ୍ତି କରି ନିରୁଆରେ ଦିନେଶଙ୍କୁ ତାଚ୍ଛଲ୍ୟ କରିଥିଲେ, କିନ୍ତୁ ତାଙ୍କର ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭିଡିଓକୁ ଏଡିଟ କରି ବିଭ୍ରାନ୍ତିକର ଦାବି ସହ ସେୟାର କରାଯାଇଛି । 

తెలుగు పోస్ట్ 20 Nov 2025 10:11 pm

WGL |పట్టా లేకుండా ప్రాక్టీస్…

వరంగల్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : హనుమకొండ మహానగరంలో ఎండిఎస్ పట్టా లేకుండానే తాను

ప్రభ న్యూస్ 20 Nov 2025 10:08 pm

Kamareddy |హైకోర్టు తీర్పుతో…

తాడ్వాయి (ఆంధ్ర ప్రభ): హైకోర్టు ఆదేశాల మేరకు తాడ్వాయి సొసైటీ చైర్మన్‌గా నల్లవెల్లి

ప్రభ న్యూస్ 20 Nov 2025 10:04 pm

NOT   HIDMA :   హిడ్మా కాదు.. దేవా

NOT HIDMA : హిడ్మా కాదు.. దేవా ఆంధ్రప్రభ, చింతూరు, (ఏఎస్‌ఆర్‌ జిల్లా)

ప్రభ న్యూస్ 20 Nov 2025 10:01 pm

WGL |వైద్యం అంద‌ని ద్రాక్షే !!

నర్సంపేట రూరల్ (ఆంధ్రప్రభ) : వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ గ్రామీణ ప్రజలకు

ప్రభ న్యూస్ 20 Nov 2025 9:47 pm

NZB |రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు !

NZB | రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు ! కామారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ)

ప్రభ న్యూస్ 20 Nov 2025 9:39 pm

Maredumilli |బంధువుల రోదన..

రంపచోడవరం/మారేడుమిల్లి, (ఆంధ్రప్రభ) : రంపచోడవరం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌

ప్రభ న్యూస్ 20 Nov 2025 9:29 pm

డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జిల్లాల్లో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ జిల్లాల పర్యటన ఉండనుంది. డిసెంబర్ 1వ తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి ఈ పర్యటన మొదలుకానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. దీంతోపాటు స్థానిక సంస్థలు కూడా త్వరలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోపాటు డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజా పాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. జిల్లాల పర్యటనకన్నా ముందే ముఖ్యమంత్రి వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలిసింది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పర్యటనలో భాగంగా వివిధ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించడంతో పాటు ప్రజా సభల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనను ప్రజలకు వివరించడం, కొనసాగుతున్న సంక్షేమ-ం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం గా తెలుస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగనుంది. ఈ అంతర్జాతీయ సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047ను విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మన తెలంగాణ 20 Nov 2025 9:20 pm

Banks, Crypto and Hidden Servers: Ibomma Ravi’s Tight Piracy Network Begins to Unravel

The first day of custody in the I-Bomma piracy case has exposed how deeply the operation was planned and how far the accused, Imandi Ravi, went to hide his tracks. Cyber Crime officers questioned him for six hours and examined every part of the digital network he created. They inspected his bank accounts, crypto activity, […] The post Banks, Crypto and Hidden Servers: Ibomma Ravi’s Tight Piracy Network Begins to Unravel appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 9:16 pm

Chukka Ramaiah |చుక్క రామయ్య సెంచ‌రీ.!!

Chukka Ramaiah | చుక్క రామయ్య సెంచ‌రీ.!! కరీమాబాద్ (ఆంధ్ర ప్రభ) :

ప్రభ న్యూస్ 20 Nov 2025 9:14 pm

After Two Decades, Kamal Haasan to Revive his Dream Project

Legendary actor and director Kamal Haasan has announced Marudhanayagam long ago and the film got shelved. It happens to be the dream project of Kamal and the actor announced several times that he has plans to revive the film at the earliest. The project started in 1996 but it was shelved due to various reasons. […] The post After Two Decades, Kamal Haasan to Revive his Dream Project appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 9:14 pm

Cartoon 21 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

Cartoon 21 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా Cartoon 21

ప్రభ న్యూస్ 20 Nov 2025 9:11 pm

NZB |అప్పుల్లో ఉన్నా .. అభివృద్ది ఆగదు !

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క,

ప్రభ న్యూస్ 20 Nov 2025 9:06 pm

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ ఎస్ వేంకటేశ్వర్ , జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి.మురళీకృష్ణ, స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్రపతి ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అనంతపురం డిఐజీ సీమోషీ ఘోష్, టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు శ్రీ బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 20 Nov 2025 9:00 pm

NLGD |రైతులకు ఇబ్బందులు కలిగించకండి…

NLGD | రైతులకు ఇబ్బందులు కలిగించకండి… మోత్కూరు, నవంబర్ 20 (ఆంధ్రప్రభ): ధాన్యం

ప్రభ న్యూస్ 20 Nov 2025 9:00 pm

Nlgd |క‌డుపుతీసిన డాక్ట‌రమ్మ..

చిట్యాల, (ఆంధ్రప్రభ) : మైనర్ బాలికకు తల్లిదండ్రులకు తెలియకుండా అక్రమంగా అబార్షన్ నిర్వహించిన

ప్రభ న్యూస్ 20 Nov 2025 8:56 pm

NZB |మీరు అస‌లు రైతులేనా..?

NZB | మీరు అస‌లు రైతులేనా..? కామారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): కామారెడ్డి జిల్లాలో

ప్రభ న్యూస్ 20 Nov 2025 8:52 pm

తెలుగులో గలగలా మాట్లాడుతున్న జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ చూస్తుండగానే తెలుగు నేర్చేసుకొంది. దేవర షూటింగ్ పూర్తి చేసేటప్పటికే కొంత నేర్చుకొంది. కానీ ఇప్పుడు పూర్తిగా గలాగలా మాట్లాడేస్తోంది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. మూఢు భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. అందుకే ఆమె ఆలిండియా స్టార్ అనిపించుకున్నారు. ఇక జాన్వీకి హిందీ, తమిళం ముందు నుంచే వచ్చు. ఇంగ్లీష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా తెలుగు కూడా బాగా నేర్చుకొని మాట్లాడుతోంది. పెద్ది సినిమా వల్ల ఆమెకి తెలుగు మీద మంచి పట్టు వచ్చిందట. దేవర సినిమా టైంలోనే ఆమె తెలుగు బాగా నేర్చుకొని మాట్లాడుతాను అని తన తెలుగు అభిమానులకు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఇప్పుడు తెలుగులో మాట్లాడుతోంది. మరి భవిష్యత్ లో తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటుందా అనేది చూడాలి. పెద్ది సినిమాలో ఈ భామ రామ్ చరణ్‌కి చికిరిగా నటించింది. ఆ పాట ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

మన తెలంగాణ 20 Nov 2025 8:50 pm

 OPRRATION SAMBHAV SUCCESS :  మావోయిస్టు రహిత రాష్ట్రం లక్ష్యం

OPRRATION SAMBHAV SUCCESS : మావోయిస్టు రహిత రాష్ట్రం లక్ష్యం ​

ప్రభ న్యూస్ 20 Nov 2025 8:48 pm

ముగిసిన హిడ్మా అంత్యక్రియలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ మడావి హిడ్మా అతడి భార్య రాజే అలియాస్ రాజక్క అంత్యక్రియలు గురువారం సాయంత్రం హిడ్మా స్వగ్రామమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో ముగిశాయి. బుధవారం రాత్రి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి అవ్వడంతో భారీ బందోబస్తు నడుమ గురువారం ఉదయం మృత దేహాలను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పువ్వర్తి గ్రామానికి తరలించారు.హిడ్మా దంపతుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పరిసర గ్రామాల ప్రజలతో పాటు వివిధ జిల్లాల నుండి ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో పువ్వర్తి గ్రామం జన సంద్రంగా మారింది. కీకారణ్యంలో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. మరోవైపు పువ్వర్తి గ్రామం కన్నీటి సంద్రంగా మారింది.హిడ్మా దంపతుల మృతదేహాలను చూసిన అతడి బంధువుల రోదనలు మిన్నంటాయి.హిడ్మా మృతదేహాన్ని గుండెలకు హత్తుకున్న అతడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు.ఒక్కసారి లే కొడుక అంటూ రోదించింది.. జనసంద్రంగా మారిన పువ్వర్తి గ్రామం మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా మృతి చెందడంతో అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతడి బంధువులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పువ్వర్తి గ్రామం జన జాతరను తలపించింది. సుదూర ప్రాంతాల నుండి సైతం ఆదివాసీ ప్రజలు కాలినడకన పువ్వర్తి గ్రామానికి చేరుకున్నారు.అనంతరం అంత్యక్రియలు ముగియడంతో తిరుగు ప్రయాణం అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసు బలగాలు మావోయిస్టు అగ్రనేత పిఎలజీఏ ఒకటవ నంబర్ బెటాలియన్ కమాండర్ మడావి హిడ్మా అంత్యక్రియల వేల పువ్వర్తి, పువ్వర్తి పరిసర గ్రామాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. పువ్వర్తి గ్రామానికి వచ్చే వారిని ఎక్కడిక్కడ నిలిపివేసి ఆరాతీశారు. హిడ్మా మృతి చెందిన వేళ మావోయిస్టులు ఏదైన అవాంఛనీయమైన ఘటనలకు పాల్పడకుండా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు హిడ్మా అతడి భార్య సన్నిహితులది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మన తెలంగాణ 20 Nov 2025 8:40 pm

షాద్‌నగర్‌లో పర్యటించిన కవిత

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగాతెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గురువారం షాద్‌నగర్ లో పర్యటించారు.గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఆస్పత్రి వైద్యులతో సిబ్బందితో పాటు రోగులను అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో కవిత మాట్లాడుతూ.. ఆసుపత్రిలో వైద్య సేవల స్థాయిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి కేవలం నిరుపేదలు మాత్రమే వస్తారని అలాంటి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే సకల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో భవనం పెచ్చులూడిపోతుందని, ఎప్పుడు కురుస్తుందో తెలియదని వెంటనే దీనిని వంద పడకల ఆసుపత్రికి నూతన భవనంలో వైద్య సేవలను బదిలీ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి నిధులు ప్రభుత్వం ద్వారా రావడంలేదని దీంతో అరకొర వసతులతో సదుపాయాలతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం లభించడం లేదని కవిత విమర్శించారు. ఇక్కడ రోగులకు మందులు ఇవ్వాలన్న లేక అనేక సదుపాయాలు కల్పించాలన్న నిధులు ఎంతో ముఖ్యమని ప్రభుత్వం ఆ దిశగా దృష్టిని సాటించాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తను ఈ ఆస్పత్రి సందర్శించాక తను రెండు విషయాలు గుర్తించడం జరిగిందని శిథిలమైన భవనాన్ని వెంటనే వంద పడకల ఆసుపత్రికి మార్చాలని, అదేవిధంగా నాణ్యమైన వైద్య సేవల కోసం సిబ్బంది సంఖ్య పెంచాలని ఆమె కోరారు. గత నెల ఆసుపత్రిలో 120 ప్రసవాలు జరిగాయని, గైనకాలజిస్టుల కొరత ఉందని ఆరు మందికి ఒకరే ఉన్నారని పేర్కొన్నారు. 28 మంది సిబ్బందికి 12 మంది ఉన్నారని ఈ స్థాయి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

మన తెలంగాణ 20 Nov 2025 8:31 pm

ఎర్రకోట పేలుడు కేసు..మరో నలుగురు ఎన్‌ఐఎ కస్టడీకి

ఎర్రకోట వద్ద పేలుడు కేసు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం ముగ్గురు డాక్టర్లను, ఓ మత బోధకుడిని అదుపులోకి తీసుకుంది. 15 మంది మృతికి దారితీసిన పేలుడు ఘటన వెనుక భారీ స్థాయి వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉన్నట్లు గుర్తించారు. దీనితో పలు రాష్ట్రాలలో మూలాలను వెతికి పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇంతకు ముందు అరెస్టు సిన ముజమ్మిల్ గనియి, అదీల్ రథెర్, షహీనా సయీద్‌లను ఎన్‌ఐఎ తమ కస్టడీకి తీసుకుంది. వీరితో పాటు మత ప్రచారకుడు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాఘే కూడా ఉన్నారు. ఉగ్ర నిరోధక సంస్థ వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణకు గట్టి బందోబస్తు నడుమ శ్రీనగర్ నుంచి తీసుకువెళ్లింది. విచారించడం ద్వారా ఉగ్రలింక్‌లు ఇతరత్రా కుట్ర సమాచారం రాబట్టేందుకు రంగం సిద్ధం అయింది. ఢిల్లీలోని పాటియాలా కోర్టు నుంచి జిల్లా సెషన్స్ జడ్జి నుంచి అనుమతి పొందిన తరువాత వీరిని గట్టి బందోబస్తు నడుమ శ్రీనగర్‌లో ఎన్‌ఐఎ బృందాలు కస్టడీకి తీసుకున్నాయని అధికారులు తెలిపారు. ఇటీవలే ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అమిర్ రషీద్ అలీ, జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డాన్షిన్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడు ముగ్గురు అదుపులోకి రావడంతో ఎన్‌ఐఎ విచారణ పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇక పేలుడు కేసులో నిందితులు అయిన మరో నలుగురిని కూడా ఢిల్లీ కోర్టు ఎన్‌ఐఎ కస్టడీకి అనుమతించింది. వీరిని కూడా కశ్మీర్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి, విచారిస్తారు. ఇప్పుడు పట్టుబడ్డ , కస్టడీకి తీసుకున్న నలుగురిని పది రోజుల ఎన్‌ఐఎ విచారణకు పాటియాలా కోర్టు అనమతిని ఇచ్చింది. 

మన తెలంగాణ 20 Nov 2025 8:30 pm

త్వరలో కెటిఆర్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు

ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై కెటిఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి లభించడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు ఎసిబి అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి, విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఎసిబి భావిస్తోంది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై 2022 అక్టోబరు 25న ఒప్పందం కుదిరింది. ఫార్ములా -ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్ జెన్, మున్సిపల్ శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు హైదరాబాద్‌లో నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్‌లో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. తదుపరి ఏడాది 10వ సీజన్ నుంచి ఏస్ నెక్ట్ జెన్ అకస్మాత్తుగా తప్పుకుంది. దాంతో ప్రమోటర్‌గా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ)నే పోషించాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2023 అక్టోబరు రూ.54.88 కోట్లను ఫార్ములా -ఈ ఆపరేషన్స్ సంస్థకు హెచ్‌ఎండిఎ నేరుగా బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి తెరలేపింది. హెచ్‌ఎండిఎ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్‌బిఐ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయని, వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. ఈ మేరకు ఎసిబి విచారణ జరుపుతోంది. కాగా, ఈ- కార్ రేసింగ్ కేసులో కెటిఆర్‌ను ఎసిబి విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల బిఆర్‌ఎస్ నేతలు భగ్గుమన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కెటిఆర్‌పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

మన తెలంగాణ 20 Nov 2025 8:20 pm

temple |కార్తీక మాస పూజలు ఎంతో పవిత్రం….

temple | కార్తీక మాస పూజలు ఎంతో పవిత్రం…. temple | బిక్కనూర్,

ప్రభ న్యూస్ 20 Nov 2025 8:17 pm

పోలీస్ కస్టడీకి ఐ బొమ్మ రవి

 సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు తొలి రోజు విచారణ చేశారు. రవిని విచారించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీలు నాంపల్లి కోర్టులో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటీషన్ వేశారు. దీంతో కోర్టు రవి కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో గురువారం అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు పలు విషయాలపై విచారణ చేశారు. రవికి ఉన్న ఐ బ్యాంక్ ఖాతాలు వాటి లావాదేవీలపై ఫోకస్ చేసిన పోలీసులు వాటి గురించి వివరాలు రాబట్టారు. ఎక్కడి నుంచి బ్యాంక్ ఖాతాలకు రూ.20కోట్లు వచ్చాయి. వాటిని ఎలా విత్ డ్రా చేసింది. క్రిప్టో కరెన్సీ గురించి ఆరా తీశారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి రవికి నెలకు ఎన్‌ఆర్‌ఐ బ్యాంక్ ఖాతాకు రూ.15లక్షలు వచ్చేవి. కరేబియన్ దీవులను కేంద్రంగా రవి నిర్వహించిన 66 వెబ్‌సైట్లు, సినిమాల అప్‌లోడ్ చేసి విషయాలపై ఆరా తీవారు. 50లక్షలు డేటా సేకరించిన రవి వాటిని సైబర్ నేరస్థులు, గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. వెబ్‌సైట్లను నిర్వహించడంతోపాటు సర్వర్ల గురించి విచారణ చేశారు. రవి అమెరికా, స్విర్జర్‌లాండ్‌లో సర్వర్లను ఏర్పాటు చేసి వాటిలో టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను స్టోర్ చేశాడు. అవసరం ఉన్నప్పుడు వాటిని తిరిగి ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో పెట్టేందుకు సిద్ధంగా ఉంచుకున్నాడు. ఐపి అడ్రస్‌లను పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు రవి తీసుకున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు. తొలిరోజు రవి విచారణ పూర్తయింది, నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. రవి కేసులో పోలీసులు ఫారెనర్స్ యాక్ట్‌ను కలిపారు.

మన తెలంగాణ 20 Nov 2025 8:16 pm

బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట

 కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉందంటూ 2023లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును హైకో ర్టు కొట్టివేసింది. బండి సంజయ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చింది. గత బిఆర్‌ఎస్ హాయంలో 2023లో జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్షల సమయంలో హిందీ ప్రశ్నా పత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఈ లీకేజీలో బండి సంజయ్ ప్రమేయం ఉందని ఆయనపై ఐపిసిసెక్షన్లు 120-బి, 420, 447, 505(1)(బి), తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్) యాక్ట్, 1997 లోని సెక్షన్లు 4(ఎ), 6 r/w 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66డి కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అప్పట్లో బండి సంజ య్‌ను పోలీసులు అరెస్టు సైతం చేశారు. ఈ కేసుపై తాజాగా గురువారం విచారణ జరిపిన హైకోర్టు బండి సంజయ్‌కు ఉపశనమం కలిగిస్తూ ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై బండి స్పందన 2023లో పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కమలాపురం పిఎస్‌లో తనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎక్స్ వేదిగా రియాక్ట్ అయిన ఆయన సత్యమేవ జయతే అంటూ పోస్టు ప్రారంభించారు. ’నాడు అధికారంలో ఉన్న ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం నాపై పెట్టించిన కట్టుకథ 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసును హైకోర్టు రద్దు చేసింది. బిజెపిని సైలెన్స్ చేయడానికి చేసిన అధికార దుర్వినియోగానికి ఇదో ఉదాహరణ. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లకే తెలిసినా ప్రతీకార రాజకీయాల కోసం పోలీసులను ఆయుధాల్లా ఉపయోగించారు. బిఆర్‌ఎస్ నాయకత్వం ఎంత దిగజారిందో దీంతో స్పష్టమైంది. మానవత్వం, మర్యాద లేకుండా నా అత్త దశదిన కర్మ రోజే నన్ను ఈడ్చుకెళ్లారు. ఇది పూర్తిగా రాజకీయ పగ. గురువారం కోర్టు తీర్పుతో బిఆర్‌ఎస్ అబద్ధాలు, దుర్వినియోగం, అధికార దౌర్జన్యం అంతమైంది. నిజం గెలిచి. న్యాయం నిలిచింది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు తనను అరెస్టు చేసినప్పటి విజువల్స్ ను బండి సంజయ్ షేర్ చేశారు.

మన తెలంగాణ 20 Nov 2025 8:08 pm

oss of Rs. 6 lakh |కన్నెపల్లిలో ఘోరం..

loss of Rs. 6 lakh | కన్నెపల్లిలో ఘోరం.. అంతుచిక్కని వ్యాధితో

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:58 pm

GATE Registrar |ధాన్యం కొనుగోలు సెంట‌ర్ ప‌రిశీల‌న‌…

GATE Registrar | ధాన్యం కొనుగోలు సెంట‌ర్ ప‌రిశీల‌న‌… GATE Registrar |

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:48 pm

బెంగళూరులో 7 కోట్లు దోచుకెళ్లారు

బెంగళూరు నగరంలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు.

తెలుగు పోస్ట్ 20 Nov 2025 7:36 pm

Drunk and Drive |రూల్స్ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లే…

Drunk and Drive | రూల్స్ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లే… Drunk and

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:35 pm

మంత్రి బంగ్లాలో చిరుత

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సురేశ్ సింగ్ రావత్ అధికారిక బంగ్లాలోకి ఓ చిరుతపులి చొరబడింది.

తెలుగు పోస్ట్ 20 Nov 2025 7:33 pm

AP |అరసవల్లి సన్నద్ధం

AP | అరసవల్లి సన్నద్ధం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : అరసవల్లి సూర్యనారాయణ

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:32 pm

భారత్ కు జావెలిన్ మిసైల్స్

భారత్‌-అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది.

తెలుగు పోస్ట్ 20 Nov 2025 7:30 pm

Rs. 1.2 crore |నర్వ యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్ష

Rs. 1.2 crore | నర్వ యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్ష Rs.

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:22 pm

Vegan diet |పోషకాలు తగ్గకుండా ‘వీగన్’డైట్‌కు మారడం ఎలా?

Vegan diet | పోషకాలు తగ్గకుండా ‘వీగన్’ డైట్‌కు మారడం ఎలా? న్యూఢిల్లీ,

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:19 pm

hospital |తాటి చెట్టు పైనుండి పడి…

hospital | తాటి చెట్టు పైనుండి పడి… hospital | మునుగోడు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:14 pm

మంత్రి ఇంట్లోకి చొరబడిన చిరుత

మంత్రి ఇంట్లోకి చిరుత చొరబడిన సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో గురువారం  చోటుచేసుకుంది. రాజస్థాన్ లోనే అత్యంత భద్రత కలిగిన సివిల్ లైన్స్ లో చిరుతపులి చొరబడడం కలకలం రేపింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సురేశ్ సింగ్ రావత్ ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. అనంతరం సమీపంలోని పాఠశాలలోకి వెళ్లింది. భద్రతా బలగాలు, అటవి సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి చిరుతపులిని బంధించారు. ఈ నేపథ్యంలో చిరుత ప్రవేశించడం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది

మన తెలంగాణ 20 Nov 2025 7:09 pm

4,265 workers | 4,265 మంది కార్మికులు స‌భ్యులుగా…

4,265 workers | 4,265 మంది కార్మికులు స‌భ్యులుగా… 4,265 workers |

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:06 pm

Harish Rao |సీఎంకు హ‌రిష్ రావు లేఖ‌

Harish Rao | సీఎం కు హ‌రిష్ రావు లేఖ‌ సంగారెడ్డి జిల్లా

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:06 pm

CPI FIRE  :  బూటకపు ఎన్ కౌంటర్లే AndhraPrabha News

CPI FIRE : బూటకపు ఎన్ కౌంటర్లే AndhraPrabha News ఆంధ్రప్రభ బ్యూరో,

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:57 pm

9th Schedule | 9వ షెడ్యూల్‌లో చేర్చిన‌ తర్వాతే ఎన్నికలు జరపాలి…

9th Schedule | 9వ షెడ్యూల్‌లో చేర్చిన‌ తర్వాతే ఎన్నికలు జరపాలి… 9th

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:56 pm

Bhuvaneswari |భువనమ్మ జల హారతి..

Bhuvaneswari |భువనమ్మ జల హారతి.. కుప్పం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్య మంత్రి

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:55 pm

CPM district |బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం…

CPM district | బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం… CPM district | కామారెడ్డి

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:48 pm

Out sourcing |ఆదివాసులకు ఆన్యాయం…

Out sourcing | ఆదివాసులకు ఆన్యాయం… Out sourcing | జైనూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:41 pm

Keerthy Suresh Slams AI Misuse on Her

The biggest challenge for film celebrities in the recent times is all about the misuse of pictures through AI. The morphed pictures of the actresses are released and they are going viral instantly on social media. The latest one to voice against the misuse of Artificial Intelligence (AI) is Keerthy Suresh. The actress called it […] The post Keerthy Suresh Slams AI Misuse on Her appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 6:34 pm

హైదరాబాద్‌లో టెకీకి ₹1.26 కోట్లు మోసం

చందానగర్‌ ఇంజనీర్‌ ఫిర్యాదుAI ట్రేడింగ్ పేరుతో మోసగాళ్ల వల

తెలుగు పోస్ట్ 20 Nov 2025 6:31 pm

మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

వేసవి రాకముందే చలికాలంలోనే మంచి నీటికి కటకట ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చలికాలంలోనే నీటికి కటకటా ఉంటే రానున్న వేసవిలో మంచినీటి మరింత కొరత ఏర్పడి అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్తపెళ్లి మండలంలోని బద్దిపల్లి గ్రామంలో ఈ చలికాలంలోనే మంచినీటికి కొరత ఏర్పడి మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం లేకపోవడం సర్పంచి ఎన్నికలు లేకపోవడంతో గ్రామం అభివృద్ధిలో అధోగతి పాలవుతుందని ప్రజల నుంచి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పాలన గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారులను నియమించి చేతులు దులుపుకుంది. కానీ ప్రత్యేక పాలన అధికారులు చూసి చూడనట్టు వివరించడం గ్రామంలో పలు సమస్యలు ఆటకిక్కడంతోపాటు ప్రధాన సమస్య అయిన మంచినీటి సమస్యను పట్టించుకోకపోవడంపై బద్దిపల్లి తో పాటు పలు గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామవాసులు వాపోతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన తో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. సర్పంచులు ఉంటేనే స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా సమస్యలు పరిష్కరించి, గ్రామం పట్ల అవగాహన ఉండి ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించే దిశగా సర్పంచులు ఉంటారనే భావన గ్రామాల్లో వినిపిస్తున్నాయి. బద్దిపల్లి గ్రామంలో సంబంధిత పంచాయతీ అధికారి గ్రామ సమస్యలు పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయని ప్రజలను నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత బద్దిపల్లి గ్రామ పంచాయతీ అధికారి మరో గ్రామ పంచాయతీకి ఇన్చార్జిగా వ్యవహరించడంతో ఈ రెండు గ్రామాల్లో సమస్యలు పెరిగిపోతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. బద్దిపల్లి గ్రామం తో పాటు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో సమస్యలు పెరిగిపోతున్నాయని, ప్రత్యేక అధికారులు సమస్యలను పట్టించుకోకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీటి కొరత కొరకు బోర్లు వేసి మంచినీటిని అందించాలని బద్దిపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి వసతి ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటిని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని బద్దిపల్లి గ్రామ ప్రజలు, మహిళలు కోరుతున్నారు. ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ అనూషను వివరణ కోరగా వాటర్ సమస్య పరిష్కరించామని, ఇప్పుడు మంచినీటిని అందించామని ఆమె తెలిపారు .అదే విధంగా పంచాయతీ సెక్రటరీ కన్యకుమారి వివరణ కోరగా సమస్యను పరిష్కరించి మంచినీటిని ఈరోజే అందించామని తెలిపారు.

మన తెలంగాణ 20 Nov 2025 6:27 pm

150 years | 150 సం.లు పూర్తి చేసుకున్న వందేమాత‌ర గీతం…

150 years | 150 సం.లు పూర్తి చేసుకున్న వందేమాత‌ర గీతం… 150

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:23 pm

లారీ బోల్తా .. ఒకరు మృతి

బొగ్గు లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం గుండా వెళ్లే జాతీయ రహదారి పై , అయ్యప్ప ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బొగ్గు లోడ్ తో, చంద్రాపూర్ నుండి నాందేడ్ వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు.  మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు  క్షతగాత్రులను చికిత్స  కోసం రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

మన తెలంగాణ 20 Nov 2025 6:22 pm

108 Ambulance |ఆక‌స్మిక అంబులెన్స్ తనిఖీ…

108 Ambulance | ఆక‌స్మిక అంబులెన్స్ తనిఖీ… 108 Ambulance | కమ్మర్

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:16 pm

NC24 BTS: Unprecedented Scale & Immersive Visuals

Yuvasamrat Naga Chaitanya has been aiming to take a huge leap into the high octane action spectacle world with his next biggie, NC24. The movie directed by Karthik Dandu and produced by SVCC is slated to be one of the best mythical thrillers ever envisioned on Indian Screen. Sukumar Writings is presenting the film and […] The post NC24 BTS: Unprecedented Scale & Immersive Visuals appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 6:16 pm

NIA అదుపులో మ‌రో న‌లుగురు !!

NIA అదుపులో మ‌రో న‌లుగురు !! ఆంధ్రప్రభ : ఢిల్లీ ఎర్రకోట వద్ద

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:15 pm

అదిరిందయ్యా... చంద్రం #TeluguPost #telugu #post #news

తెలుగు పోస్ట్ 20 Nov 2025 6:14 pm

Achampet |ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి

Achampet | ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి బీసీ రాష్ట్ర కార్యదర్శి

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:13 pm

80 crore people | 80 కోట్ల మందికి ఉచితబియ్యం

80 crore people | 80 కోట్ల మందికి ఉచితబియ్యం 80 crore

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:10 pm

Dog Attack |ఇద్దరికి గాయాలు

Dog Attack | ఇద్దరికి గాయాలు పెరుగుతున్న కుక్క కాటు బాధితులు… పట్టించుకోని

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:03 pm

Droupadi Murmu |పద్మావతి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి…

Droupadi Murmu | పద్మావతి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి… తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రభ):

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:01 pm

18 years old |ఆంక్షలు లేకుండా చీరలు పంపిణీ చేయాలి…

18 years old | ఆంక్షలు లేకుండా చీరలు పంపిణీ చేయాలి… 18

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:00 pm

MEDICAL|కాటూరి మెడికల్ కళాశాల సేవలు అభినందనీయం

కాటూరి మెడికల్ కళాశాల సేవలు అభినందనీయం MEDICAL| శావల్యాపురం, ఆంధ్రప్రభ: పేద ప్రజలకు

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:59 pm

Revanth Reddy : బీజేపీ ట్రాప్ లోరేవంత్ ...ఇరకాటంలో పడినట్లేగా

బీజేపీ వేసిన ట్రాప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడిపోయినట్లే కనిపిస్తుంది.

తెలుగు పోస్ట్ 20 Nov 2025 5:57 pm