మేడారంలో.. ఆ నలుగురు.. తాడ్వాయి, ఆంధ్రప్రభ – ములుగు జిల్లా తాడ్వాయి మండలం
కిడ్నీ రాకెట్ ఎలా బయటపడిందో తెలుసా..?
కిడ్నీ రాకెట్ ఎలా బయటపడిందో తెలుసా..? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గుట్టుగా సాగుతున్న
నెంబర్ 1 ప్లేస్ లో.. తెలంగాణ..
నెంబర్ 1 ప్లేస్ లో.. తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1
దేశంలో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు భయానక సంఘటనలు జాతి యావత్తును దిగ్భ్రాంతి గొలిపాయి. అంతకుమించి, ఉగ్రవాదులు తమ విధ్వంసకాండను అమలుపరిచేందుకు అనుసరిస్తున్న కొత్త తరహా పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఓ మెట్రోస్టేషన్ వద్ద మొన్న రాత్రి పొద్దుపోయాక ఒక కారులో జరిగిన భారీ పేలుడు పదమూడు మందిని బలిగొనగా, మరో 24మందిని గాయాలపాలు చేసింది. పేలుడు తీవ్రత పరిసర జనాలను కకావికలం చేసింది. అనేక వాహనాలు ధ్వంసం కాగా, చుట్టుపక్కల దుకాణాలు సైతం దెబ్బతిన్నాయి. ఇంతటి భారీ పేలుడుకు కారణం ఉగ్రవాదమే అయి ఉంటుందనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు, అదే రోజు భారీ ఉగ్ర కుట్రను మన పోలీసులు భగ్నం చేశారు. మూడు రాష్ట్రాలలో ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి, ఆరా తీయగా ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు భారీయెత్తున మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు, విద్యావంతుల్ని తమవైపు తిప్పుకుని, వారి సహాయంతో విధ్వంసకాండకు ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నారని తేలడం విస్తుగొలుపుతోంది. హస్తినలో కారుబాంబు పేలుడుకు పాల్పడినది ఉమర్ అనే ఒక వైద్యుడని, శక్తిమంతమైన అమోనియం నైట్రేట్ను ఉపయోగించి ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చునని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఈ రెండు సంఘటనలకూ ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే, ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులకు లభించిన పేలుడు పదార్ధాలలో భారీయెత్తున అమోనియం నైట్రేట్ ఉండటమే కాదు, ఆ కేసులో అరెస్టయిన వైద్యులతో ఆత్మాహుతి చేసుకున్న వైద్యుడికీ సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజధాని హస్తినలో విధ్వంసం సృష్టించి, దేశంలో శాంతిభద్రతలకు సవాల్ విసిరేందుకు ఉగ్రవాదులు సాగిస్తున్న ప్రయత్నాలు ఈనాటివి కావు. 1985లో ట్రాన్సిస్టర్ బాంబులతో 49మందిని బలిగొనడం ద్వారా తమ దాడులను ఆరంభించిన ముష్కరులు, పార్లమెంటుపై దాడి సహా పలుమార్లు హింసాకాండకు తెగబడ్డారు. ఈ నలభయ్యేళ్లలో ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 92 మందికి పైగానే అసువులు బాసినట్లు ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ చేపట్టిన అధ్యయనంలో తేలింది. అయితే కొంతకాలంగా ఉగ్రవాదం కోరలు పెరికివేసేందుకు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంటా బయటా చేస్తున్న ప్రయత్నాలతో ఊపిరి సలపని ఉగ్రవాదులు కొత్త పంథాను ఎంచుకున్నట్లుగా తాజాగా వెలుగుచూసిన ఉగ్రకుట్రతో వెల్లడైంది. భారతదేశంలో తమ ఆటలు ఇక సాగవని తెలుసుకున్న జైషే మహమ్మద్, ఐఎస్ఐఎస్కు అనుబంధంగా పనిచేస్తున్న ఎజియుహెచ్ ఉగ్ర సంస్థ.. ఉన్నత విద్యావంతులను లోబరచుకుని, వారి సహాయంతో ధ్వంసరచన అమలుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళా వైద్యురాలితో సహా ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేసి, వారినుంచి భారీయెత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఫరీదాబాద్లో అరెస్టయిన ఒక డాక్టర్ ఇంట్లో 360 కిలోల పేలుడు పదార్ధాలు లభ్యం కావడాన్ని చూస్తే, విద్యావంతులు సైతం ఉగ్రవాదం వైపు ఎంతలా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతుంది. హైదరాబాద్కు చెందిన మరో డాక్టర్ స్వయంగా ఒక విషాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషాలలో ఒకటిగా పేర్కొనే రిసిన్ అనే విష ద్రావకాన్ని ఆలయ ప్రసాదాలలోనూ, మంచినీళ్లలోనూ కలిపి అమాయకుల ప్రాణాలు హరించడమే సదరు వైద్యుడి పథకమని వెల్లడి కావడం గమనార్హం. అంటే, బాంబులు, ఆత్మాహుతి దాడులతోనే కాకుండా, సామూహిక విషప్రయోగాలు చేసి, వేలాదిమంది అమాయకుల ప్రాణాలను కబళించాలన్నది ఉగ్రవాదుల దుర్మార్గపుటాలోచనగా తెలుస్తోంది. దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం వేళ్లూనుకుంటున్నట్లు తాజా సంఘటనలను బట్టి విశదమవుతోంది. ప్రాణాలను రక్షించవలసిన వైద్యులే ఉగ్రవాదులై అమాయకుల ప్రాణాలను కబళించబూనడం అమానుషం. మొక్కై వంగనిది మానై వంగదన్నట్లు మొగ్గ దశలోనే ఈ తరహా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టకపోతే, భరతజాతి ప్రమాదపుటంచుల్లోకి జారుకుంటుందనడంలో సందేహం లేదు. ముందుగా, ఢిల్లీ పేలుళ్లకు కారకులెవరో, వారివెనుక ఉన్నదెవరో కూపీలాగి, వారి భరతం పట్టాలి. ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని, వారికి ఊతమిచ్చింది దాయాది దేశమేనని తేలిన పక్షంలో అంతర్జాతీయ సమాజాన్ని జాగృతం చేసి, గట్టి గుణపాఠం చెప్పాల్సిందే. భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఫలితమెంత దారుణంగా ఉంటుందో ఈసారి దాయాదికి మరింత స్పష్టంగా తెలియజేయాలి.
చలి ఎన్ని రోజులు ఉంటుందంటే.. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమక్రమంగా విజృంభిస్తోంది.
పాక్లో భారీ పేలుడు...12 మంది మృతి
ఇస్లామాబాద్ : ఇస్లామాబాద్ లోని కోర్టు ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది న్యాయవాదులు, సిబ్బంది ఉన్నారు. కోర్టు కాంప్లెక్సు వద్ద పార్కింగ్ స్థలంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి అని కారులో అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రద్దీ సమయంలో ఈ సంఘటన జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఇస్లామాబాద్ జిల్లాకోర్టు లోని న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు వినిపించిందంటే పేలుడు తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దగ్ధమైన కారు నుంచి మంటలు, పొగలు ఉవ్వెత్తున పైకి కమ్ముకోవడం వీడియోల్లో కనిపించింది. సమీపాన పార్కింగ్ చేసి ఉన్న అనేక వాహనాలు ఈ పేలుడుకు భారీగా దెబ్బతిన్నాయి. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ, ఈ ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. దక్షిణ వజీరిస్థాన్ లోని కాడెట్ కాలేజ్ వానా వద్ద తెహ్రీక్ఇతాలిబన్ పాకిస్థాన్ ( టిటిపి) దాడిని పాక్ భద్రతా దళాలు భగ్నం చేసిన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన జరిగింది. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న తెహ్రీక్ ప్రయత్నాన్ని పాక్ బలగాలు అడ్డుకున్నాయి. ఈ ఆపరేషన్లో టిటిపికి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ సైన్యం మట్టుపెట్టింది.
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీని కోల్పోవడం తెలంగాణకు తీరని నష్టమని సి ఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన గళాన్ని, కలాన్ని తెలంగాణ సమాజానికి అంకితమిచ్చిన అందెశ్రీ కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అలాగే, ఆయన రచించిన జయజయహే తెలంగాణ పాటను పాఠ్యాంశంగా తీసుకొస్తామని సిఎం తెలిపారు. అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఆయన పాటల సంకలనం ‘నిప్పుల వాగు’ ఒక భగవద్గీతగా, బైబి ల్గా, ఖురాన్గా తెలంగాణ సమస్యలపై పోరాడే వారికి గైడ్గా ఉపయోగపడుతుందని, ఆయన రచనల తో 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో నిప్పుల వాగును అందుబాటులో ఉంచుతామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అందెశ్రీ రచనలు అన్ని లైబ్రరీల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేరు, స్ఫూర్తి శాశ్వతంగా ఉండేలా చూస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. అందెశ్రీ చివరి వరకు సాధారణ జీవితం గడిపారన్నారు. రాజకీయ నేతలను నేరుగా కలవనని చెప్పిన అందెశ్రీ, ఆ తరువాత మీడియా మాధ్య మం ద్వారా కలిశామన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా ఆప్తుడిని కోల్పోయిన బాధను కలిగించింన్నారు. అందెశ్రీని కలిసినప్పుడల్లా సొంత అన్నను కలిసినట్టుగా ఉండేదన్నారు. తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కటిగా నడిపించారని సిఎం రేవంత్రెడ్డి కొనియాడారు. అందెశ్రీ పాట, మాట గొప్ప స్ఫూర్తిని ఇచ్చిందని, ఎన్నో సందర్భాల్లో ఇద్దరం కలిసి అనేక కీలక అంశాలపై చర్చించామని సిఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. గద్దర్తో పాటు అందెశ్రీ పాటు తెలంగాణ ఉద్యమానికి ఎంతో బలాన్ని ఇచ్చిందన్నారు. అందెశ్రీ పేరుతో స్మృతివనం ఏర్పాటు అందెశ్రీ జయజయహే పాట తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని అందుకే జయజయహే పాటను రాష్ట్ర గీతంగా గుర్తించామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందెశ్రీ వ్యక్తిగతంగా తన మనసుకు దగ్గరి వ్యక్తి అని ఆయన లేని లోటు తన కుటుంబానికి వ్యక్తిగతంగా తీరని లోటని సిఎం రేవంత్ అన్నారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాశామని కానీ, అవార్డు రాలేదన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలుగా అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేయాలని సిఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. జీవితాంతం తెలంగాణ కోసం జీవించిన వ్యక్తి కళాకారుడిగా, రచయితగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ కీర్తీ శాశ్వతం చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాడె మోసిన సిఎం రేవంత్రెడ్డి అంతకు ముందు అందెశ్రీ పార్థివ దేహాన్ని సిఎం రేవంత్రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి ఆయన అంతిమయాత్రలో పాల్గొని పాడెను మోశారు. ఈ సందర్భంగా రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఆయన ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు. మొదటగా లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సినగర్ వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు అందెశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. రెండు నిమిషాలు పాటు అందరూ మౌనం పాటించగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల పాటు గౌరవ సూచికంగా కాల్పులు జరిపారు. అనంతరం అందెశ్రీ సతీమణి మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ కుమారుడు దత్తసాయి సంప్రదాయ పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. అంతియయాత్రలో సిఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, సీనియర్ నేత కేశవరావు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు అందెశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ లేకపోవడం తో నరేంద్ర మోడీ ప్రభుత్వం టిడిపి, జెడి(యు) పార్టీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికలు దేశరాజకీయలపై ప్రభావం చూపనున్నాయి. బీహార్లో బిజెపి, జెడి(యు) పార్టీల మధ్య మైత్రి కొనసాగింపుకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలువనున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా అధికారం ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలకు పట్టం గడుతున్న బీహార్ ప్రజలు మరోసారి ఎన్డిఎకే జైకొట్టనున్నారని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్గిట్ పోల్ సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో మరోసారి అధికారం రావడానికి ఎన్డిఎకి నిమో (నితీశ్+మోడీ) ఫార్ములా దోహదపడింది. నితీశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో మహిళా రోజ్గార్ యోజన పథకం కింద దాదాపు కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డిఎ విజయానికి కీలకంగా మారింది. బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జెడి(యు) నేతృత్వంలోని ఎన్డిఎ, కాంగ్రెస్, ఆర్జెడి నేతృత్వంలోని మహాఘట్బంధన్పై భారీ ఆధిక్యంతో అధికారం చేపడుతుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్డిఎ దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్బంధన్ కూటమి మీద పైచేయి సాధిస్తోంది. ఎన్డిఎకి 46.2 శాతం ఓట్లు, మహాఘట్బంధన్కు 37.9%, కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలున్నాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ లో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డిఎకు 133- 159 స్థానాలు వచ్చే అవకాశాలుండగా, మహాఘట్ బంధన్ 75 -101 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇతరులకు 2 8 స్థానాలు, జన్సురాజ్ పార్టీకి 0 -5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. పార్టీల వారీగా సాధించే స్థానాలను పరిశీలిస్తే ఎన్డిఎ కూటమిలో బిజెపి 63- 70, జెడి(యు) 55- 62, ఎల్జెపి (ఆర్వి) 12-17, హెచ్ఎఎమ్ 2-5, ఆర్ఎల్ఎం 1-4 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. మహాఘట్ బంధన్లో ఆర్జెడి 62-69, కాంగ్రెస్ 9- 18, సిపిఐ (ఎంఎల్) 4-9 గెలిచే అవకాశాలున్నాయి. కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఎఐఎంఐఎం పార్టీ 0-2, సిపిఐఎంకి 0-3, విఐపికి 0- 5, సిపిఐ 0- 2, ఇతరులు 2- 8 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఒక్కొక్క పార్టీ పొందే ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బిజెపికి 21.4 శాతం, ఆర్జెడికి 23.3 శాతం, జెడి(యు)కి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్జెపికి 5%, ఇతరులకు 7.2%ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 19.46% ఓట్లతో 74 స్థానాలు, జెడి(యు) 15.39 శాతం ఓట్లతో 43 స్థానాలు, ఆర్జెడి 23.11% ఓట్లతో 75 స్థానాలు, కాంగ్రెస్ 9.48% ఓట్లతో 19 స్థానాల్లో గెలిచాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఎ మహాఘట్ బంధన్ కూటమిపై కేవలం 0.03 ఓట్ల వ్యత్యాసంతో సుమారు 11 వేల ఓట్ల ఆధిక్యంతోనే అధికారం చేపట్టగా, ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డిఎ భారీ ఆధిక్యత పొందడానికి ప్రధాన కారణం జెడి(యు) మంచి ఫలితాలు సాధించడమే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని ఓటర్లను ప్రశ్నించినప్పుడు ఆర్జెడి యువ నేత తేజస్వి యాదవ్ 32 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. 2005 నుండి కొన్ని నెలలు మినహా 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ 30 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 8%, ఎల్జెపి నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ 8 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. బిజెపి నేత సామ్రాట్ చౌదరికి 6%, కాంగ్రెస్ నేత రాజేశ్ కుమార్కి 2% మంది మద్దతిచ్చారు. సామాజిక వర్గాలవారీగా పరిశీలిస్తే అగ్రవర్ణాలు, ఎస్సిలు, ఎస్టిలు, ఇబిసి వర్గాలు ఎన్డిఎకు మద్దతుగా నిలుస్తున్నారు. ముస్లిం, బుద్ధిస్టులు, ఒబిసి సామాజిక వర్గాల్లో అధిక శాతం మహాఘట్బంధన్ వైపు ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. బీహార్లో ఎన్డిఎకు పట్టంకట్టడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో 66.8% మహిళలు ఎన్డిఎ వైపుఉండగా, మహాఘట్బంధన్కు 24.8% ఓటర్లు మాత్రమే మద్దతిస్తున్నారు. బ్రాహ్మణ, కుశ్వ, పాశ్వాన్, రాజ్పుత్, కుర్మి, చమార్, భూమియార్, మల్లా, తేలి, బనియా, కాను, నోనియా సామాజిక వర్గాల్లో ఎన్డిఎకు బాసటగా నిలుస్తున్నాయి. మహాఘట్ బంధన్ కేవలం యాదవ్, ముస్లిం, ఒబిసిల్లోని కొన్ని వర్గాల్లో మాత్రమే కొంత ఆధిక్యత కనబరుస్తోంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి ఉన్న జనాకర్షణ, రాష్ట్రంలో నితీశ్ కుమార్పై ఉన్న ప్రజాదరణ బీహార్ లో ఎన్డిఎ గెలుపుకు అనుకూలంగా మారాయి. బీహారీలను ఆకర్షించడంలో నితీశ్ కుమార్ వంటి జనాకర్షణ కలిగిన నాయకుడు తమ పార్టీలో లేకపోవడంతో బిజెపి ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది. అందుకే మోడీ ప్రచారంలో నితీశ్ను పొగడ్తలతో ముంచెత్తారు. 75 ఏళ్ల వయసులోనూ నితీశ్ ఎన్డిఎకు ట్రంప్ కార్డుగా ఉన్నారు. ఆయనకున్న క్లీన్ చీట్ ఇమేజీ ఎన్డిఎకు బలంగా మారింది. రెండు దశాబ్దాలుగా సిఎంగా ఉన్నా నితీశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎంఎల్సిగా ఎన్నికవుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఎలు అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతికి పాల్పడ్డారనే వ్యతిరేకత ప్రజల్లో కనిపించినా ‘నిమో’ ఫార్ములా ఎన్డిఎకు అనుకూలించింది. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నా నితీశ్ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడడానికి ప్రధాన కారణం మహిళల ఆశీర్వాదమే. ఎన్డిఎతో పోలిస్తే మహాఘట్బంధన్ బలహీనంగా ఉంది. ఆ కూటమి సిఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్లో 2020 ఎన్నికల్లో ఉన్న ఉత్సాహం 2025 ఎన్నికల్లో కనిపించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీయాదవ్ నిరుద్యోగం, వలసలు అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకున్నా 2020లో ఆయనకు యువతలో ఉన్న క్రేజీ ఇప్పుడు తగ్గింది. నిరుద్యోగం, వలసలపై యువతలో అసంతృప్తి ఉన్నా అది పూర్తిగా తేజస్వి యాదవ్కు అనుకూలంగా మారలేదు. జన్సురాజ్ పార్టీ, బిజెపి కూడా యువత ఓట్లను ఆకర్షించాయి. మహాఘట్బంధన్ కూటమి ముస్లిం, యాదవ్ సామాజికవర్గాల్లో ఇప్పటికే 33% మద్దతున్నా, దాన్ని 40 శాతానికిపైగా దాటించడమే తేజస్వి యాదవ్కు ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు తేజస్వి యాదవ్కు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్పై ఉన్న ‘జంగల్ రాజ్’ అభియోగం పెద్ద గుదిబండగా మారింది. లాలూప్రసాద్ పాలనలో యాదవ్ సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని ఇప్పటికీ దళితులు, అగ్రవర్ణాలు మరవకపోవడం తేజస్వి యాదవ్కు ప్రతికూలమైంది.మహాఘట్బంధన్లో ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీవలే ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యారు. ఆయన ఎత్తుకున్న ‘ఓట్ చోరీ’ నినాదం బీహార్లో ఓట్లను రాల్చలేకపోయింది. రెండు కూటములు సంక్షేమ పథకాలపై పోటాపోటీగా హామీలిచ్చాయి. మహాఘట్బంధన్ నిరుద్యోగం, వలసలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటే, ఎన్డిఎ ‘జంగల్ రాజ్’ తో పాటు అభివృద్ధిపై ప్రచారం చేసింది. ప్రధాని మోడీ లాలూప్రసాద్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలుచేస్తూ ‘జంగల్ రాజ్’ను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్డిఎ చెబుతున్నట్టు అభివృద్ధి జరిగితే బీహారీలు ఎందుకు వలసెళ్తున్నారని మహాఘట్ బంధన్ ప్రచారం చేసింది. ఇతర పార్టీలతో పోలిస్తే బిజెపికి వనరులు అధికంగా ఉండడం ఎన్డిఎకు అనుకూలంగా మారింది. డిజిటల్ ప్రచారంలో అన్ని పార్టీలు చేసిన ఖర్చులను కలిపినా ఒక్క బిజెపి చేసిన ఖర్చు కంటే తక్కువే. 2020 ఎన్నికలకు ప్రస్తుత 2025 ఎన్నికలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దళితులలో ఆదరణ ఉన్న ఎల్జెపి 2020లో విడిగా పోటీ చేయగా ప్రస్తుతం ఎన్డిఎలో ఉండడంతో ఎన్డిఎ మరింత బలపడింది. యావత్ దేశాన్ని ఆకర్షించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ యువతను ఆకర్షించడంలో విజయవంతం అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు చెప్పుకోదగ్గ సీట్లు రాకపోయినా భవిష్యత్లో బీహార్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే పార్టీగా జన్సురాజ్ ఎదగడం ఖాయమని పీపుల్స్పల్స్ అధ్యయనంలో స్పష్టమైంది. ఎన్డిఎలో బిజెపి, జెడి (యు) భారీగా సీట్లు పొందే అవకాశాలు కనిపిస్తుండగా, ఆర్జెడి చెప్పుకోదగ్గ స్థానాలు సాధిస్తున్నా, కాంగ్రెస్కు ఆశించిన మేరకు సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో మహాఘట్బంధన్కు నష్టం జరుగుతోంది. ప్రధానంగా మహిళా ఓటర్లు ఆదరిస్తుండడంతో బీహార్లో మరోసారి ఎన్డిఎ జయకేతనం ఖాయంగా కనిపిస్తోంది. జి. మురళీ కృష్ణ
న్యుమోనియా రహిత భారతాన్ని నిర్మించుకోలేమా?
న్యుమోనియా అంటువ్యాధితో 2021లో 2.2 మిలియన్లు మరణించగా, అందులో 5.02 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల అధిక మరణాలకు కారణమైన వ్యాధి న్యుమోనియా. కొవిడ్- 19 కారణంతో మరో 10 మిలియన్లు కూడా అదనంగా మరణించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక ప్రాణాలను గైకొంటున్న వ్యాధుల్లో న్యుమోనియా ప్రధానమైనదని తేలింది. వాతావరణ ప్రతికూల మార్పులు, గాలి కాలుష్యం కోరలు చాచడంతో శ్వాసవ్యవస్థ, ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నం కావడం, న్యుమోనియా మహావిపత్తు వస్తుందనే భయం కూడా ఉందని, పది లక్షలమందికి న్యుమోనియా సోకే ప్రమాదంలో ఉన్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. న్యుమోనియా వ్యాధి ఐదేండ్ల లోపు పిల్లలకు, వృద్ధులకు వస్తుంది. టీకాలు వేయించుకోనివారు, పోషకాహార లోపాలు, ఇంట్లో వంట చెరుకువాడేవారు, కలుషిత గాలి పీల్చే పెద్దలు, పొరతాగే దురలవాటు ఉన్నవారు అధికంగా న్యుమోనియా బారినపడే ప్రమాదం ఉంటుంది. న్యుమోనియా వ్యాధి తీవ్రత, ప్రమాదాన్ని గుర్తించిన అంతర్జాతీయ సమాజం 2009 నుంచి ఏటా 12 నవంబర్ రోజున ప్రపంచ న్యుమోనియా దినం పాటిస్తూ ఆ వ్యాప్తిపట్ల కనీస అవగాహన కల్పించడం జరుగుతోంది. బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగీ సంక్రమణ కారణంగా తాపజనక శ్వాస రుగ్మత (ఇన్ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిసార్డర్) లేదా న్యుమోనియా వ్యాధి అంటుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు ఊపిరితిత్తుల్లో చేరి ఎల్వియోలి అనే భాగంపై ప్రభావాన్ని చూపి న్యుమోనియాకు దారి తీస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. బలహీన వ్యాధి నిరోధకశక్తి కలిగిన పిల్లలు, వృద్ధులకు న్యుమోనియా సోకి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ప్రపంచ న్యుమోనియా దినం -2025 ఇతివృత్తంగా పిల్లల మనుగడ (చైల్ సర్వైవల్) అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. న్యుమోనియా నివారించదగిన అంటువ్యాధి. వ్యాధిగ్రస్థులు తుమ్మడం, దగ్గడం, ముక్కు చీదడం లాంటి సందర్భాల్లో మరొకరికి సంక్రమిస్తుందని తెలుసుకోవాలి. పిల్లల్లో బ్యాక్టీరియా కారణ స్ట్రెప్టోకోకల్ న్యుమోనియా అతి ప్రధానమైనది. దాని తర్వాత హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా రెండవ ప్రధానమైనది. న్యుమోనియాలో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వ్యాధి వైరస్ వర్గంలో ముఖ్యమైనది. న్యుమోనియా వ్యాధికి చికిత్స కూడా అందుబాటులో ఉన్నది. ప్రపంచ న్యుమోనియా దినం వేదికగా ప్రభుత్వాలు, వైద్యఆరోగ్యశాఖ, ఎన్జిఒలు, ఇతర సంస్థలు కలిసి న్యుమోనియా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగగ్రస్థులకు చికిత్సా పద్ధతులు వివరించడం మంచి ఫలితాలను ఇస్తాయి. న్యుమోనియాను తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఏట 14 లక్షల పిల్లలు న్యుమోనియా సోకి చనిపోవడం, పిల్లల మరణాల్లో 18% వరకు న్యుమోనియా కారణం కావడం గమనార్హం. యూనిసెఫ్ వివరాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పిల్లవాడు న్యుమోనియాతో మరణిస్తున్నాడు. వృద్ధుల్లో న్యుమోకోకల్ న్యుమోనియా అధికంగా సోకుతుంది. న్యుమోసిస్టిక్ జిరోవెస్సీ వ్యాధి ఫంగస్ సోకడంతో వస్తుంది. గాలి కాలుష్యం, స్మోకింగ్ వల్ల 16 లక్షల వృద్ధులు మరణిస్తున్నారు. డబ్ల్యుహెచ్ఒ, యూనిసెఫ్లు సంయుక్తంగా న్యుమోనియా, డయేరియా వ్యాధుల కట్టడికి గ్లోబల్ ఆక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులు, పర్యావరణ కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న జనులు, హెచ్ఐవి/కేన్సర్ లాంటివి సోకిన వ్యాధిగ్రస్థులు న్యుమోనియా ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ. టీకాలు వేయించడం, పోషకాహారం అందిచడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల న్యుమోనియా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఆంటీబ్యాక్టీరియల్, అంటీ వైరల్, ఆంటీ ఫంగల్ ఔషధాలతో న్యుమోనియా కట్టడి జరుగుతుంది. భౌతిక దూరాలు పాటించడం, మాస్కులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకుండా ఉండడం, దగ్గినపుడు లేదా తుమ్మినపుడు కండువా కప్పుకోవడం వంటి పలు జాగ్రత్తలు న్యుమోనియా కేసులను తగ్గిస్తాయి. పిల్లలకు, పెద్దలకు అతి ప్రమాదకరమైన అంటువ్యాధిగా నిలిచిన న్యుమోనియా పట్ల సరైన అవగాహన పెంచుకొని అలాంటి ప్రాణాంతక రుగ్మతకు చరమగీతం పాడదాం, న్యుమోనియా కానరాని భారతాన్ని నిర్మించుకుందాం. డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి 9949700037
పట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఘనవిజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఘోషిస్తున్నాయి. 8 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ నే విజయం సాధిస్తోందని అంచనా వేశాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీ లో ఎన్డీఏ 135 నుంచి 160 సీట్లను గెలుచుకుంటుందని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మాట్రిజ్ అంచనా ప్రకారం ఎన్డీ ఏ 147 నుంచి 167 మధ్య సీట్లు గెలుచుకుంటుంది. బీహార్లో అధికారం అందుకోవాలం టే మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు చాలు. కా నీ తొలిసారి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. మ్యాట్రిజ్ ప్రకా రం జెఎస్ పీ గెలిచే స్థానాలు. 2 సీట్లు కూ డా మించదు. దైనిక్ భాస్కర్ ప్రకారం ఆ పా ర్టీకి 0నుంచి 3కి మించవు. చాణగ్య స్ట్రాటజీ స్, దైనిక్ భాస్కర్, జెవిసి, మ్యట్రిజ్, పి- మా ర్క్, పీపుల్స్ ఇన్ సైట్ సహా అన్ని పోల్ స్టర్లు ప్రశాంత్ కిషోర్ పార్టీకి 2 సీట్ల కన్నా ఎక్కు వ రావని స్పష్టం చేశాయి. జేవీసీ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏ 135 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుంది. పీపుల్స్ పల్స్, పీపుల్స్ ఇన్ సైట్ మాత్రం బీజేపీ -జెడియు కూటమికి 133 స్థానాలు దక్కుతాయని పేర్కొన్నాయి. దాదా పు అన్ని ఎగ్జిట్ పోల్స్ మహా ఘట్బంధన్ కు రెండో స్థానం ఇచ్చాయి. దైనిక్ భాస్కర్ ప్రకా రం మహాఘట్బందన్ కు 71 నుంచి 91 సీట్లవరకూ దక్కవచ్చు. జేవిసి ప్రకారం 88 నుం చి 103 స్థానాలు లబించే అవకాశం ఉంది . ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల సెంటిమెంట్, అభిప్రాయాలు క్రోడీకరించి ప్రివ్యూలు అందిస్తున్నా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తరచుగా తప్పు అ వుతాయని తెలిసిందే. అందువల్ల కాస్త అటు ఇటుగా ఫలితాలు ఉండవచ్చు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఈ ఎన్నికలు బీహార్లో ఒక శకానికి ముగింపు పలుకుతాయి. దాదాపు 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న జేడి(యు) అధినేత నితిశ్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలని ప్రచారం సాగుతోంది. మ రో పక్క ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాద వ్ పార్టీ పగ్గాలను తన కొడుకు తేజశ్వీయాదవ్కు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్ :మొంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటల వివరాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొంథా తుఫాన్ కారణంగా రా ష్ట్రంలో 1,17,757 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నివేదికను సమర్పించిందన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సి ద్ధం చేసినట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అత్యధికంగా వరి 83,407 ఎకరాలలో, పత్తి 30,144,మొక్కజొన్న2,097 ఎకరాలలో న ష్టం జరిగిదని, నాగర్ కర్నూల్ జిల్లాల్లో న ష్టం జరిగినట్లు వ్యవసాయ నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 33 శా తంకి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించామని, 27 జిల్లాల్లోని 1,22,142 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరా ల్లో నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. కేం ద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్డిఆర్ఎఫ్ కింద ఇసుక మేటలకు ఎకరానికి రూ 7,285, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి రూ.6,880, వర్షాధార పంటలకు ఎకరానికి రూ. 3,440,- తోటలకు ఎకరానికి రూ. 9,106- చొప్పున మొత్తం 70 కోట్ల నిధులు రాష్ట్రానికి నిధులు రావల్సి ఉందని మంత్రి చెప్పారు. గతంలో వరదలు సంభవించినప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని, ఈ పంట నష్టం వివరాలు కేంద్రానికి పంపి ఎన్డిఆర్ఎఫ్లో కేంద్రాన్ని నిధులు అడుగుతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మొంథా తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపించాలని కోరామన్నారు. త్వరలోనే పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పంట నష్టం వివరాలు మొంథా తుఫాన్ దాటికి జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ పంటం నష్టం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్లో 23,508.6 ఎకరాల్లో పంట నష్టం కాగా, తరువాత వరుసగా వరంగల్లో 19,736.22, కరీంనగర్లో 11,473.32, హన్మకొండలో 11,310.10, జనగాంలో 8,457.04, మహబూబాబాద్లో 8, 318.07, సూర్యాపేటలో 7,476, సిద్దిపేటలో 5,277, నల్గొండలో 5,259.20, సంగారెడ్డిలో4,858.01, ఖమ్మంలో 3,901.34, వనపర్తిలో 1,884.01, మెదక్లో 1,634.19, జగిత్యాలలో 1,157.16, మంచిర్యాలలో 570.15, వికారాబాద్లో 523.35, జయశంకర్ భూపాలపల్లిలో 481.25, మహబూబ్నగర్లో463.36, యాదాద్రి భువనగిరిలో 421.04, రంగారెడ్డిలో 316.19, నిర్మల్లో 252.23, నిజామాబాద్లో 250.14, ఆదిలాబాద్లో 62.38, రాజన్న సిరిసిల్లలో 55.03, కుమురం భీం ఆసిఫాబాద్లో 13.28, జోగులాంబ గద్వాల్లో 12.16, మేడ్చల్ మల్కాజ్గిరిలో 7.30 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వ్యవసాయ శాఖ వెల్లడించింది.
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేసినట్టు హౌసిం గ్ కార్పొరేషన్ ఎండి వి.పి.గౌతం తెలిపారు. ఇళ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగా నవంబర్ 11 వ తేదీ నాటికి పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వారం లబ్ధిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్మెం ట్ లెవల్ నిర్మాణాలు 4,615, రూఫ్ లెవల్ (గోడలుపూర్తి) అయిన 8,517, శ్లాబ్ వేసిన 5,115 ఇళ్ల్లు ఉన్నాయని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంతవరకు మొత్తం రూ.2900.35 కోట్లను చెల్లించినట్టు ఆయన తెలిపారు. వీటిలో బేస్ మెంట్ లెవల్ (బిఎల్) దా టిన ఇళ్లకు రూ.1610.79 కోట్లు, రూఫ్ లెవల్ (ఆర్ ఎల్) - రూ.716.91 కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ (శ్లాబ్ పూర్తి -ఆర్సి)- అయిన ఇళ్లకు రూ.572.65 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 2,33,069 ఇళ్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో బేస్మెంట్ (బిఎల్) స్థాయిలో 90,613, గోడల నిర్మాణం పూర్తయినవి (ఆర్ఎల్) 41,212 ఇళ్లు శ్లాబ్ పూర్తి (ఆర్సి) అయినవి 37,400 ఇళ్లు ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: జీఎస్టీరేట్ల త గ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో పన్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10 శాతం వృ ద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేం ద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో ప న్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10 శాతం వృ ద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేం ద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు. సవరించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల కారణంగా వస్తువుల ధరలు దిగివచ్చాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా మరికొన్నింటి శ్లాబులు తగ్గించారు. అయితే దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు తగ్గుతాయని.. నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనాలు వేశారు. అయితే జీఎస్టీ పన్ను రేట్లు తగ్గినా వ సూళ్లు మాత్రం తగ్గట్లేదు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల లబ్ధి పొందిన అతిపెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. తాజా ‘ఎకోరాప్’ నివేదిక ప్రకారం జీఎస్టీ వసూళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసి దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. జీఎస్టీ రేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆ దాయంలో 7 శాతం నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ రాష్ట్రం దానికి భిన్నంగా 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2025 అక్టోబర్ నెలలో తెలంగాణ జీఎస్టీ ద్వారా రూ.5,726 కోట్లు వ సూలు చేసింది. ఇది అంతకుముందు సంవత్స రం (2024 అక్టోబర్) వసూలు చేసిన రూ.5, 211 కోట్లతో పోలిస్తే 10శాతం అధికం. రాష్ట్రం అంచనా వేసిన నెలవారీ రూ.583 కోట్ల నష్టానికి బదులు.. ఏకంగా రూ.783 కోట్ల లాభాన్ని న మోదు చేసింది. ఎకోరాప్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 8-9 శాతం వార్షిక జీఎస్టీ వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో కర్ణాటక 10 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా తెలంగాణకు సమానంగా 8-9 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా. కర్ణాటక రాష్ట్రం నెలవారీ రూ.7,083 కోట్ల నష్టాన్ని అంచనా వేసినా అది కూడా 10శాతం వృద్ధిని చూసింది. పంజాబ్ 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్లో స్వల్పంగా 1 శాతం క్షీణత కనిపించగా కేరళలో జీఎస్టీ ఆదాయం 2 శాతం తగ్గింది. బడ్జెట్ అంచనాలను మించే అవకాశం : జీఎస్టీ కౌన్సిల్ డేటా ప్రకారం ధరల సవరణల తర్వాత చాలా రాష్ట్రాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. దేశీయ జీఎస్టీ వసూళ్ల అంచనాల ఆధారంగా చూస్తే రాష్ట్రాలు అక్టోబర్ 2025లో చూపిన వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే 2025 -26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జీఎస్టీ ఆదాయాలు కేంద్ర బడ్జెట్లో అంచనా వేసిన ప్రొజెక్షన్లను మించిపోయే అవకాశం ఉందని ఎకోరాప్ నివేదిక పేర్కొంది. గతంలో 2018 జూలై, 2019 అక్టోబర్ నెలల్లో జీఎస్టి రేట్ల మార్పుల తర్వాత కూడా స్వల్ప సర్దుబాటు దశ అనంతరం ఆదాయాలు నెలవారీ 5-6 శాతం వృద్ధి చెందాయని నివేదిక గుర్తు చేసింది. ప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల స్వల్పకాలంలో 3-4 శాతం క్షీణత ఉన్నప్పటికీ మొత్తం జీఎస్టీ పన్ను పరిధిని బలోపేతం చేసిందని, భవిష్యత్తులో స్థిరమైన వృద్ధికి ఇది మార్గం సుగమం చేస్తుందని నివేదిక వెల్లడించింది. రూ.1.22 లక్షల కోట్లు దాటిన ఆదాయం రాష్ట్ర ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది పెరిగింది. కొత్త రుణాలతోపాటు పన్నుల ఆదాయం అధికంగా ఉండటంతో రాష్ట్ర ఆదాయ, వ్యయాల్లో గణనీయంగా వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025- 26) తొలి అర్ధభాగం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు) రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1.22 లక్షల కోట్లు దాటగా వ్యయం రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నట్లు కాగ్ తాజా ఆడిట్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది(2024- 25) ఇదే అర్ధ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రూ.14 వేల కోట్ల ఆదాయం అధికంగా ఉంది. పన్నుల ద్వారా ఈ ఏడాది మొత్తం కలిపి రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అర్ధ సంవత్సరం ముగిసేనాటికి అందులో 40.97 శాతం (రూ.71,836 కోట్లు) మాత్రమే సాధించింది. గత ఏడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో పన్నులపై ఆదాయం అదనంగా రూ.2,913 కోట్లు మాత్రమే పెరిగింది. కానీ కొత్త రుణాలు రూ.12,626 కోట్లు అదనంగా సేకరించడంతో మొత్తం ఆదాయం రూ.1.22 లక్షల కోట్లు దాటినట్లు కాగ్ వివరించింది. కొత్త రుణాల సేకరణ భారీగా పెరగడంతో అదే నిష్పత్తిలో వ్యయం కూడా రూ.1.01 లక్షల కోట్ల నుంచి రూ.1.11 లక్షల కోట్లకు చేరింది. సంక్షేమ పథకాలు, రాయితీలతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు, రిటైరైన వారికి పింఛన్లు, పాత బాకీలపై వడ్డీలు, అసలు కిస్తీల చెల్లింపులకే భారీగా వ్యయం అవుతున్నట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం భారీగా పెరగడం అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోంది. బడ్జెట్ లక్ష్యాల మేరకు పన్నుల ఆదాయం భారీగా పెరగకపోగా కనీసం తొలి అర్ధభాగంలో సగమైనా రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు రూ.45,139 కోట్లకు విస్తరించింది. దీన్ని పూడ్చుకునేందుకు అంతమేర కొత్త రుణాలను సేకరించినట్లు తేలింది. ఇక ఈ ఏడాది ఆదాయ, వ్యయాల అనంతరం రెవెన్యూ మిగులు రూ.2,738 కోట్లకుపైగా ఉండవచ్చని బడ్జెట్లో అంచనావేస్తే తలకిందులై తొలి ఆరు నెలల్లోనే రూ.12,452 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటు మైనస్ 454 శాతం అని కాగ్ స్పష్టం చేసింది.
భారత్పై సుంకాలు తగ్గిస్తాం:ట్రంప్
న్యూయార్క్ / వాషింగ్టన్ : భారత్పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యో చిస్తోందని, భారత్తో తా ము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గర గా ఉన్నామని అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ వెల్లడించా రు. భారత్తో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భి న్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నా రు. భారత్కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్హౌస్లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్పై సుంకాల గురించి ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 12-11-2025
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా.. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద భారీగా విదేశీ గంజాయిని గుర్తించారు. మొదట లగేజి బ్యాగ్ను చెక్ చేస్తుంటే NIA అధికారినంటూ నిందితురాలు బుకాయించింది. ఫేక్ ఐడీ కార్డు చూపించి కస్టమ్స్ అధికారులను బెదిరింపులకు దిగింది. అంతేకాదు, వాష్రూమ్లో NIA జాకెట్ వేసుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై అనుమానం కలగడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని చెక్ చేయగా.. 12 కిలోల విదేశీ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్ లో రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.
స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి
మండలంలోని కరిసెలబోడు గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కరిశలబోడు తండాకు చెందిన భూక్యా గోపి, అఖిల దంపతులకు కవల పిల్లలు లక్ష, దర్షిత్లు ఉన్నారు. దర్షిత్ (2) రోడ్డుపై ఆడుకుంటున్న క్రమంలో జూలూరుపాడుకు చెందిన సాయి ఎక్స్లెంట్ ప్రైవేట్ స్కూల్ బస్సు పిల్లలను తీసుకెళ్లేందుకు గ్రామంలోనికి వచ్చింది. దర్షిత్ ఇంటి ముందు పిల్లలను ఎక్కించుకున్ను బస్సు డ్రైవర్ రోడ్డుపై ఆడుతున్న దర్షిత్ను గమనించకపోవడంతో బస్సు ఢీకొని దర్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి తండ్రి గోపి ఫిర్యాదు మేరకు బస్ డ్రైవర్ ఆరెం వంశీకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ... అన్ని స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు పిల్లలను తీసుకెళ్లే సమయంలో అత్యంత జాగ్రత్త పాటించాలని, భద్రత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్..
ములుగు, (ఆంధ్రప్రభ) : ములుగు పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్
Prabhas wraps up The Raja Saab on a big day
Pan-India superstar Prabhas has his platter full with a bunch of projects. The Raja Saab, a horror comedy, will be his immediate next release and the shooting formalities are on the verge of completion. The makers have already announced that the film will hit the screens on January 9th. Director Maruthi surprised Prabhas fans with […] The post Prabhas wraps up The Raja Saab on a big day appeared first on Telugu360 .
బంగ్లాదేశ్తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఐర్లాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్తో పాటు వన్డౌన్లో వచ్చిన కేడ్ కర్మిఛెల్లు అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ధాటిగా ఆడిన స్టిర్లింగ్ 9 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన కేడ్ 129 బంతుల్లో ఏడు బౌండరీలతో 59 పరుగులు సాధించాడు. కుర్టిస్ కాంఫెర్ (44), వికెట్ కీపర్ లొర్కాన్ టక్కర్ (41), జోర్డాన్ నీల్ (30) పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి మెక్కార్తీ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మీరాజ్ మూడు, హసన్ మురాద్ రెండే వికెట్లను పడగొట్టారు.
టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయం.. ధ్రువ్ జురెల్ పై ప్రశంసలు
కోల్కతా: యువ ఆటగాడు ధ్రువ్ జురెల్పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల సౌతాఫ్రికాఎతో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్లో ధ్రువ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు. రానున్న రోజుల్లో ధ్రువ్ జురెల్ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయమన్నాడు. అతని బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు అండగా నిలిచే సత్తా అతనికుందన్నాడు. రానున్న రోజుల్లో అతను టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడం ఖాయమని గంగూలీ జోస్యం చెప్పాడు.
పేలుడు బాధితులకు ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా
ఎర్రకోట సమీపంలో పేలుడు మృతుల కుటుంబాలకు ఢిల్లీ సిఎం రేఖాగుప్తా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారంగా అందజేయనున్నట్లు మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యానికి గురైనా వారికి రూ.5లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.2లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ.20వేలు అందజేస్తామని సిఎం వివరించారు. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
ఎడపల్లి, (ఆంధ్రప్రభ): ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబంలో
ఢిల్లీ పేలుడు ఘటన...12కు చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో పేలుడు ఘనటలో మృతుల సంఖ్య 12కు చేరింది. సోమవారంనాడు రాత్రి వరకు 9మంది మృత్యువాత పడగా, మరో 20మంది గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమానిత ఉగ్రవాదులు ఢిల్లీలో సోమవారం సాయంత్రం కారు బాంబు పేలుడు సృష్టించి మారణకాండకు కారణమైన సంగతి తెలిసిందే. దుండగులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు రాజధానితో పాటు దాని చుట్టుపక్కల భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎర్రకోట పేలుడు నిందితులను విడిచిపెట్టేది లేదు: అమిత్షా
న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపాంలో పేలుడు సంఘటనకు సంబంధించి దీని వెనుక ఉన్న ప్రతి నిందితుడిని విడిచిపెట్టేది లేదని, ఈ ఘోరానికి బాధ్యులైన వారిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై మంగళవారం ఉన్నతాధికారులతో అమిత్షా రెండు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పేలుడు తరువాతి పరిస్థితులను ఉన్నతాధికారులు కేంద్రమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. ఈ సంఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు సమగ్ర దర్యాప్తు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీల్లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.
వదంతులు వ్యాప్తి చేయొద్దు.. ధర్మేంద్ర ఆరోగ్యంపై కూతురు
ముంబై : ప్రముఖ నటుడు 89 ఏళ్ల ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని కుమార్తె ఈషా దేవోల్ మంగళవారం వెల్లడించారు. ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన మృతి చెందారంటూ మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు రావడంపై ఆమె ఖండించారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని మీడియాకు ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా సూచించారు. ధర్మేంద్ర మంచి ఆరోగ్యంగా ఉండాలని సుదీర్ఘకాలం జీవించాలని మనమంతా ప్రార్ధిద్దామని ఆమె అభ్యర్థించారు.
భారత్పై సుంకాలు తగ్గించాలని యోచిస్తున్నాం : ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారత్తో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. భారత్తో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. భారత్కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్హౌస్లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్పై సుంకాల గురించి ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు.
జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తొలిస్థానంలో తెలంగాణ
జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి 1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవతరించిందని జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. అలాగే 4.05 లక్షల టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టులతో ఛత్తీస్ గఢ్ 2వ స్థానంలో, 3.64 లక్షల నీటి సామర్థ్య ప్రాజెక్టులతో రాజస్థాన్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు.‘జల్ శక్తి అభియాన్ : క్యాచ్ ది రెయిన్’ ప్రచారం కింద ఈ ఏడాది అవార్డులను అందిస్తున్నట్లు పాటిల్ ప్రకటించారు. నవంబర్ 18న జరిగే 6వ జాతీయ జల అవార్డుల కార్యక్రమంలో జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
గత పది రోజుల వరకు రాష్ట్రాన్ని తడిచి ముద్ద చేసిన వర్షాలు తగ్గాయనే లోపే చలి పంజాతో రాష్ట్రాన్ని వణికిస్తుంది. గత రెండు రోజులుగా చలి తీవ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. ఆదిలాబాద్లో 10.2 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 11.5, నిర్మల్లో 11.7, నిజామాబాద్లో 11.8, వికారాబాద్లో 12.0, సంగారెడ్డిలో 12.1, కామారెడ్డిలో 12.2, జగిత్యాలలో 12.5, మెదక్లో 12.8, సిద్దిపేటలో 13.3, రంగారెడ్డి, కరీంనగర్లో 13.4న, మంచిర్యాలలో 13.6, పెద్దపల్లిలో 13.7, మహబూబ్నగర్లో 14, నారాయణపేటలో 14.1, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లిలో 14.4, యాదాద్రి భువనగిరిలో 14.7, జనగాంలో 14.8, మేడ్చల్ మల్కాజ్గిరిలో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు రాష్ట్ర డెవలెప్మెంట్ ప్రణాళికా సంఘం వెల్లడించింది.దీంతో పాటు రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటాయని పేర్కొంది. చలి తీవ్రత దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హుజూర్నగర్/మంథని (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. రేపు బుధవారం నీటిపారుదల, పౌరసరఫరాల
రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్దీప్ సింగ్#TeluguPost #telugu #post #news
ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి కారులో వచ్చి మారణాకాండ
ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు రోజు హర్యానాలోని ఫరీదాబాద్లో పట్టుబడ్డ 8మందితో కూడిన ఉగ్రవాద నెట్వర్క్తో ఉమర్కు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు విచారణ క్రమంలో బదర్పూర్ అనే టోల్ప్లాజా వద్ద ఉమర్ నబీ ఫీజు చెల్లించడాన్ని సిసిటివి ఫుటేజీ ద్వారా గుర్తించారు. కారు హర్యానాలో ఫరీదాబాద్ నుంచి సోమవారంనాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టినట్లు అంచనాకు వచ్చారు. తొలుత ఫరీదాబాద్లోని ఏషియన్ ఆస్పత్రి వెలుపల ఉదయం 7.30గ.లకు కారు కనిపించింది. బదర్పూర్ టోల్ప్లాజాను సుమారు 8.13గంటలకు, ఒక్లాహా పారిశ్రామిక వాడకు సమీపంలోని పెట్రోల్ పంప్ను 8.20గంటలకు దాటింది. ఢిల్లీహర్యానా సరిహద్దుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. మధ్యాహ్నం 3.19గంటలకు ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి కారు ప్రవేశించింది. అక్కడ మూడు గంటల పాటు నిలిపివుంది. 6.22గంటలకు పార్కింగ్ ఏరియాను వీడిన కారు ఎర్రకోటకు సమీపించింది. అనంతరం 6.52గంటలకు పేలుడు సంభవించింది. పార్కింగ్ ఏరియాను వీడిన అర్ధగంట తర్వాత భారీ పేలుడును సృష్టించింది. ఇంకా ఢిల్లీ పొరుగు ప్రాంతాలు, ముఖ్యంగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రహదారులపై ఉన్న సిసిటివి ఫుటేజీలను తెప్పిస్తున్నామని, వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత కారు ప్రతి కదలికను గుర్తించగలుతామని పోలీసులు వివరించారు. కాగా సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో బదర్పూర్ టోల్ప్లాజా వద్ద ఫీజు చెల్లించి ఉమర్ రిసిప్ట్ అందుకున్న దృశ్యాలు, ఆ సమయంలో నిందితుడు మాస్క్ ధరించి ఉన్నట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఇదే కారులో రెండు వారాల క్రితం ఉమర్ సహా ముగ్గురు కలిసి ప్రయాణించారని, ఒకచోట కారుకు పొల్యూషన్ చెకప్ కూడా చేయించినట్లు గుర్తించారు. ఆ మిగతా వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన కారు హర్యానా నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. దాని యజమాని పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
హైదరాబాద్లో అడ్వాన్స్ రోబోటిక్స్ ఇన్ రిహాబ్ అండ్ రికవరీ’ సదస్సు
హైదరాబాద్లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు , రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన - పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన మరియు అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్ ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది. ‘అడ్వాన్స్ రోబోటిక్స్ ఇన్ రిహాబ్ & రికవరీ’ పేరిట నిర్వహించిన ఈ సదస్సు భారతదేశ ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో ఒక ప్రాథమిక అంతరాన్ని వెలుగులోకి తెచ్చింది. దేశంలో పెద్ద వయసు వ్యక్తుల వైకల్యానికి స్ట్రోక్ ప్రధాన కారణాలలో ఒకటిగా ఉన్నప్పటికీ చాలా మంది రోగులకు, వైద్య జోక్యం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్తోనే ముగుస్తుంది. రికవరీ కోసం నిజమైన యుద్ధం ఇక్కడే ప్రారంభమవుతుందని నిపుణులు నొక్కి చెప్పారు. “భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అత్యవసర సంరక్షణలో ప్రావీణ్యం సంపాదించింది, కానీ రీహాబిలిటేషన్ అంటే జీవితాలను నిజంగా పునర్నిర్మించే ప్రదేశం” అని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ బిఎస్వి రాజు అన్నారు. “స్ట్రోక్లో, ప్రతి రోజు లెక్కించబడుతుంది. రోగి గైడెడ్ రిహాబిలిటేషన్ను ఎంత త్వరగా ప్రారంభిస్తే, అతను తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. రోబోటిక్ రీహాబిలిటేషన్ చికిత్సకు ఖచ్చితత్వం మరియు తీవ్రతను జోడిస్తుంది” అని అన్నారు. HCAH సహ వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ, “మేము ఇటీవల తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్ ల్యాబ్ ను ప్రారంభించాము, ఇందులో ఏఐ -శక్తితో పనిచేసే ఎక్సోస్కెలిటన్లు మరియు మోషన్-ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రారంభ మరియు నిర్మాణాత్మక రీహాబిలిటేషన్ క్లినికల్గా ప్రభావవంతంగా ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా తెలివైనది. చికిత్సను ముందుగానే ప్రారంభిస్తే రోగులు వేగంగా కోలుకుంటారు” అని అన్నారు. “శస్త్రచికిత్స ప్రాణాలను కాపాడుతుంది; రీహాబిలిటేషన్ దానిని తిరిగి ఇస్తుంది. పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ ను మనం సంరక్షణలో ఒక ప్రామాణిక భాగంగా మార్చాలి” అని డాక్టర్ తుక్రాల్ జోడించారు.
పసుపు రంగు చెప్పులు పట్టించేశాయ్!!
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో నాదర్గుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో వరుసగా నేరాలు చేసింది.
Observed Sridevi, Savitri For Kaantha: Bhagyashri
Bhagyashri Borse played the leading lady in the upcoming period drama Kaantha which is due for release in 3 more days on November 14th. The actress feels blessed to portray such a challenging role as Kumari at the very beginning of her career. “Since the film is set in the 1960s, recreating that era was […] The post Observed Sridevi, Savitri For Kaantha: Bhagyashri appeared first on Telugu360 .
డిసెంబరు 13న హైదరాబాద్కు మెస్సీ
అర్జెంటీనాకు చెందిన దిగ్గజ అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్కు రానున్నారు.
పొదల్లో కదల్లేని స్థితిలో చిరుత
మెదక్, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని చేగుంట మండల జైత్రాం తండా, దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కనిపించింది.
‘కాంత’లో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం:భాగ్యశ్రీ బోర్సే
హీరో దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ డ్రామా ’కాంత’ను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మీడియాతో మాట్లాడుతూ “-కాంత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది. దుల్కర్, రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. -నేను చేసిన కుమారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. -డైరెక్టర్ సెల్వ చాలా టాలెంటెడ్. కుమారి క్యారెక్టర్ని ఆయన రాసుకున్న విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. అందరి నటుల నుంచి చాలా మంచి నటనను రాబట్టుకున్నారు. ‘కాంత’లో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం. నేను చేసిన కాంత, ఆంధ్ర కింగ్ సినిమాలు వరుసగా వస్తుండడం ఎంతో హ్యాపీగా ఉంది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను. -కాంతలో సినిమాలో సినిమా ఉంటుంది. ఆంధ్ర కింగ్ ఒక ఫ్యాన్ బయోపిక్. ఈ రెండు కూడా దేనికవే డిఫరెంట్ సినిమాలు. కాంతలో కుమారి క్యారెక్టర్కి ఆంధ్ర కింగ్ లో మహాలక్ష్మి క్యారెక్టర్కి అసలు పోలికే ఉండదు. దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. రెండు సినిమాలు ప్రేక్షకులని అలరిస్తాయని నమ్ముతున్నాను. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీని మంచి నటి అంటారని ఆశిస్తున్నాను. -ఇక ప్రస్తుతం నాకు తెలుగు సినిమాలు, అలాగే హిందీ సినిమాలు ఉన్నాయి. నా ప్రాజెక్ట్ల గురించి మేకర్స్ ప్రకటిస్తారు”అని అన్నారు.
గర్భిణి మృతి కామినేని హాస్పిటల్కు కోటి ఫైన్
నల్గొండ జిల్లా నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ లో గర్భిణి చనిపోయిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం మృతురాలి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
17 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
అమ్మవారి బ్రహ్మోత్సవాలను పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలి పంచ్మితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు కంట్రోల్ కమాండ్ సెంటర్ నుండి పర్యవేక్షణ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మన తెలంగాణ, నవంబర్ 11: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్హ్మ్రోత్స్వాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థానమండంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి సీవీఎస్వో కే. వి. మురళీకృష్ణ లతో కలసి టిటిడి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే రెండుమార్లు జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో, టిటిడి జేఈవో సమీక్ష నిర్వహించారు. తిరుచానూరు ఆలయం పరిసరాలలోను, పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్లు వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారన్నారు. అదేవిధంగా, రోజువారి 10 వేల మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వేచియుండే అవకాశం ఉందన్నారు. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వచ్చారని, శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వస్తున్నారని చెప్పారు. తిరుచానూరులో భారత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుచానూరులో ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి ఈవో ఆహ్వానించారు.
బిహార్లో రికార్డు స్థాయి పోలింగ్…
బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతం రికార్డు
పాక్లో భారీ పేలుడు..12 మంది మృతి
ఇస్లామాబాద్ లోని కోర్టు ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది న్యాయవాదులు, సిబ్బంది ఉన్నారు. కోర్టు కాంప్లెక్సు వద్ద పార్కింగ్ స్థలంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి అని కారులో అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రద్దీ సమయంలో ఈ సంఘటన జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఇస్లామాబాద్ జిల్లాకోర్టు లోని న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు వినిపించిందంటే పేలుడు తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దగ్ధమైన కారు నుంచి మంటలు, పొగలు ఉవ్వెత్తున పైకి కమ్ముకోవడం వీడియోల్లో కనిపించింది. సమీపాన పార్కింగ్ చేసి ఉన్న అనేక వాహనాలు ఈ పేలుడుకు భారీగా దెబ్బతిన్నాయి. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ, ఈ ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. దక్షిణ వజీరిస్థాన్ లోని కాడెట్ కాలేజ్ వానా వద్ద తెహ్రీక్ఇతాలిబన్ పాకిస్థాన్ ( టిటిపి) దాడిని పాక్ భద్రతా దళాలు భగ్నం చేసిన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన జరిగింది. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న తెహ్రీక్ ప్రయత్నాన్ని పాక్ బలగాలు అడ్డుకున్నాయి. ఈ ఆపరేషన్లో టిటిపికి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ సైన్యం మట్టుపెట్టింది.
బీహార్లో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే హవా
బీహార్లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన పోలింగ్ లో అత్యధిక స్థాయిలో దాదాపు 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. కాగా, ఈనెల 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, బీహార్లో రెండో దశ పోలింగ్ పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఇందులో ఎన్డీయే హవా చూపుతోంది. ఎన్డీయే కూటమే ప్రభుత్వంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా..
మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా.. బిచ్కుంద, ఆంధ్రప్రభ : బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలు
Aamir Khan Shelves Third Film in a Row?
Bollywood Superstar Aamir Khan has been in talks for several projects and he is yet to take any of them to the next level as he is not convinced with the final scripts. He recently rejected Vamshi Paidipally’s film which has been under discussion. After the poor response for Coolie, Aamir Khan shelved his superhero […] The post Aamir Khan Shelves Third Film in a Row? appeared first on Telugu360 .
పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగింది:మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని, ఓటర్లను భయపెట్టారని బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు జూబ్లీహిల్స్లో ఏం పని..? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో మంగళవారం మధ్యాహ్నం మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ, ఉద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు ఓటర్ల భయపడవద్దని, తాను ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్కు ఓటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి అని చూడకుండా బూతులు మాట్లాడతారా..?అని మండిపడ్డారు. ఓటర్లు విజ్ఞతతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలంతా జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారని పేర్కొన్నారు. సురేశ్ యాదవ్ అనే వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బిఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లను కూర్చోనివ్వలేదని, లేదని, పోలింగ్ బూతుల్లోని టేబుళ్లను బయట పడేశారని మండిపడ్డారు. బిర్యానీల్లో డబ్బులు పెట్టి ఓటర్లకు ఇచ్చారని, బిర్యానీ ప్యాకెట్లను చూసి కూడా పోలీసులు వదిలేశారని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు వీల్చైరుల కూడా సరిపడేంతగా పెట్టలేదని తెలిపారు. రజియా అనే అమ్మాయి ఇంటికి వెళ్లి దాడులకు దిగారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీరాజ్యంగా మార్చారని, నవీన్ యాదవ్ మనుషులు వచ్చి తన సంగతి చెప్తానని తననే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మాగంటి గోపీనాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదని సునీత పేర్కొన్నారు. 13వ తేదీవరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి.. 14వ తేదీ తర్వాత తాను గెలిచాక అందరి సంగతి చెబుతానని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ బిఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద బైఠాయించిన సునీత కాంగ్రెస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి సునీత కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద బైఠాయించారు. దొంగ ఓటర్లకు పోలీసులు సహకరించారని మండిపడ్డారు. తాము దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడి, తమ పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగి వారి మీదనే కేసులు పెడతామని నవీన్ యాదవ్ అనుచరులు బెదిరించారని పేర్కొన్నారు.
BREAKING |ఢిల్లీ దుర్ఘటన బాధితులకు ఎక్స్-గ్రేషియా..
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను తరలిస్తున్న ఆటో బోల్తా..నలుగురు విద్యార్థులకు గాయాలు
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు తరలించడం కోసం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తీసుకెళ్తుండ గా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడ్డ సంఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పాఠ్యపుస్తకాలను ఆటోలో తరలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆటో టైర్ పగిలి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు పార్ట్ 2 పాఠ్య పుస్తకాలను ఆటోలో తరలించేందుకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను పుస్తకాలను తరలించేందుకు వినియోగించారు. సాతాపూర్ గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు టైరు పేలి ఆటో బోల్తా కొట్టింది. 9వ తరగతి చదువుతున్న కార్తీక్, అశోక్, నాని, శివ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నాగర్కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో శివ అనే విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులను పాఠ్యపుస్తకాలు తరలించేందుకు వినియోగించడం పై ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ను వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం ఫై విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సంఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి శివకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు.
Bihar Assembly Elections 2025: Exit Polls Predict a Clear NDA Surge
The political battle in Bihar appears to have a decisive outcome even before the official results. Multiple exit polls conducted after the second phase of voting predict a strong return to power for the National Democratic Alliance (NDA), led by Chief Minister Nitish Kumar. NDA Heads for Comfortable Majority According to exit poll data, the […] The post Bihar Assembly Elections 2025: Exit Polls Predict a Clear NDA Surge appeared first on Telugu360 .
నిఠారీ హత్యల కేసు..సురేంద్ర కోలీని నిర్దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈకేసుల్లో దోషిగా తేలి మరణశిక్షను ఎదుర్కొంటున్న సురేందర్ కోలీని సుప్రీం కోర్టు మంగళవారం నిర్దోషిగా తేల్చింది. ఆయనపై నమోదైన ఆఖరి కేసులో కూడా నిర్దోషిగా తేలడంతో సురేంద్ర దాదాపు 19 ఏళ్ల తరువాత విడుదల కాబోతున్నాడు. నిఠారీ హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోలీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. నిందితుడిపై నేరారోపణలు రుజువు కానందున నిర్దోషిగా విడుదల చేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది.న ఈ కేసుపై తాజాగా సీజేఐ జస్టిస్ బిఆర్గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమనాథ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేవలం ఒక కత్తి ఆధారంగా అతడిని నిందితుడిగా భావించలేమని పేర్కొంది. ఇప్పటికే 12 కేసుల్లో నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోలీని వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. నోయిడా సమీపం లోని నిఠారీ గ్రామంలో 20052006 మధ్య కాలంలో చిన్నారులు,యువతులు అదృశ్యం కావడం కలకలం రేపింది. 2006 డిసెంబర్ 29న నొయిడా లోని నిఠారీ వద్ద మోనిందర్ సింగ్ ఫండేర్ ఇంటి వెనుక మురుగు కాల్వలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడటం తీవ్ర అలజడి రేపింది. ఈ కేసుల దర్యాప్తు సిబిఐ చేపట్టింది. ఫండేర్తోపాటు అతని ఇంట్లో సహాయకుడిగా ఉండే కోలీని కూడా అరెస్టు చేసింది. ఈ హత్యలకు సంబంధించి 2007లో మొత్తం 19 కేసులను నమోదు చేసింది. సాక్షాధారాలు తగినంతగా లేకపోవడంతో ఆ కేసుల్లో మూడింటిని మూసివేసింది. మిగతా 16 కేసులకు గాను పన్నెండు కేసులకు సంబంధించి కోలీని నిర్దోషిగా 2023 అక్టోబరు 16న అలహాబాద్ హైకోర్టు తేల్చింది. ఇంకా ఫండేర్పై మూడు కేసులు మిగిలి ఉండగా, వాటిలోనూ అతడిని నిర్దోషిగా నిర్ధారించింది. ఈ కేసుల దర్యాప్తులో సిబిఐ నిర్లక్షంగా వ్యవహరించిందని, నిందితులే నేరం చేసినట్టు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో సీబీఐ , మృతుల తరఫు బంధువులు పిటిషన్లు వేయడంతో వాటన్నింటినీ సుప్రీం కోర్టు ఈ ఏడాది జులైలో కొట్టివేసింది. అయితే నిఠారీ హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలికకు సంబంధించిన హత్య కేసులో కోలీ నిర్దోషిగా తేలక పోవడంతో అతడు జైల్లోనే ఉన్నాడు.
ఢిల్లీ పేలుడు... ఆస్పత్రి వద్ద కుటుంబీకుల కన్నీటి ఘోష
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం సంభవించిన కారు పేలుడులో మృతులైన వారి అవశేషాలను తీసుకెళ్లడానికి ఎల్ఎన్జెపి ఆస్పత్రి వద్ద మంగళవారం ఉదయం చేరుకున్న కుటుంబీకుల కన్నీటి ఘోష హృదయాలను ద్రవింప చేస్తోంది. ఆస్పత్రి మాచ్చురీ గేట్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కేవలం అధికారిక సిబ్బందిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. కొంతమంది గల్లంతైన తమ వారి కోసం ఆస్పత్రి సిబ్బందితో వాదించడం కనిపించింది. మరికొంతమంది వచ్చిపోయే అంబులెన్స్ల వంక దీనంగా చూస్తూ రోదిస్తున్నారు. ఎల్ఎన్జెపి ఆస్పత్రి మార్చురీ వద్ద తెల్లవారు డ్యూటీ పూర్తి చేసిన ఒక ఉద్యోగి మార్చురీ వద్ద ఈ దృశ్యాలన్నీ చాలా భయంకరంగా కనిపిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చాడు. “మార్చురీకి వచ్చిన మృతదేహాలు గుర్తుపట్టలేకుండా ఉన్నాయి. కొన్ని మృతదేహాలు కేవలం మాంసం ముద్దలే. కొన్నిటిలో లోపల అవయవాలు చెల్లాచెదురై పోవడం లేదా అదృశ్యమై పోవడం జరిగింది. ఇవన్నీ ఒకరికొకరు చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంటోంది. ఈ విధ్వంసం ఎలా ఉందో చెప్పలేకపోతున్నాం” అని అక్కడ అనుభవాలు ఏకరువు పెట్టాడు. బాధిత కుటుంబాల్లో నోమన్ కుటుంబం ఒకటి. పేలుడుకు నోమన్ బలైపోయాడు. ఆయన కుటుంబం మంగళవారం ఉదయం నోమన్ మృతదేహాన్ని గుర్తించాక తట్టుకోలేక ఒకరినొకరు పట్టుకుని ఓదార్చుకుంటున్నారు. నోమన్ అవశేషాలను సిబ్బంది ఒక తెల్లని గుడ్డలో చుట్టి అంబులెన్స్లో మార్చురీకి తీసుకొచ్చారు. ఆ అంబులెన్స్ను కుటుంబీకులు నిశ్శబ్దంగా అనుసరించడం కనిపించింది. నోమన్ స్నేహితుడు సోను ఈ పరిస్థితిలో తన ప్రియమిత్రుడిని చూడలేనని కుప్పకూలిపోయాడు. మంగళవారం ఉదయం నుంచి కుటుంబీకులు గుర్తించిన మృతదేహాలను వారికి అప్పగించడం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగుల కుటుంబీకులు తమ వారిని ఆస్పత్రిలో కలుసుకోవడం చాలా ఇబ్బందిగా తయారైంది. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డును పూర్తిగా మూసివేశారు. వైద్యం కోసం వచ్చే రోగులను ఇతర బ్లాక్లకు పంపిస్తున్నారు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ వార్డుల వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. ఇతర గేట్లు కూడా చాలావరకు మూతపడ్డాయి. ఆస్పత్రి లోకి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వేరే దారిలో వెళ్లాలని చెబుతున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు.
తవ్వకాల్లో బయటపడిన దుర్గామాత విగ్రహం
ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సమీపంలో తవ్వకాల్లో సింహవాహిని రూపంలో ఉన్న దుర్గామాత విగ్రహం బయటపడింది. దుర్గామాత విగ్రహాన్ని శాలపల్లి గ్రామ ప్రజలు మంగళవారం ఉదయం తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ బి టైప్ గేట్ సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద జరిపిన మినీ చెరువు నిర్మాణం పనుల్లో అష్టభుజాలతో సింహవాహిని రూపంలో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే హిందు వాహిని బిజెపి నాయకులు వెళ్లి పూజలు నిర్వహించారు. ఎన్టీపీసీకి చెందిన సోలార్ ప్లాంట్ పరిధిలో అమ్మవారి విగ్రహం లభించడంతో మంగళవారం ఉదయం హెచ్ఆర్ ఎజిఎం బిజయ్ కుమార్ సిక్దర్, హెచ్ఆర్ అధికారులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది వెళ్లి దుర్గామాత విగ్రహాన్ని పరిశీలించారు. దుర్గామాత మందిరాన్ని నిర్మించాలని హిందూ వాహిని, బిజెపి నాయకుల డిమాండ్ ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సమీపంలో లభించిన దుర్గామాత రాతి విగ్రహం సమీపంలోనే మందిరాన్ని నిర్మించి ఇవ్వాలని హిందూ వాహిని నాయకులు, బిజెపి నాయకులు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరారు. మంగళవారం ఉదయం దుర్గామాత విగ్రహం లభించిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం హిందు వాహిని నాయకులు ఇసంపల్లి వెంకన్న, కొండపర్తి సంజీవ్, కాంతుల సంతోష్ రెడ్డి, మిట్టపల్లి సతీష్, బిజెపి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, గాండ్ల ధర్మపురి స్థానిక విలేకరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు రమేష్, తన్నీరు రమేష్, బండి సమ్మయ్య, గోలివాడ శ్రీకాంత్, ఇదినూరు వెంకటేష్, మేకల సదానందం, రవీందర్, వంశీతోపాటు పలువురు పాల్గొన్నారు.
పోలీసుల వాహన తనిఖీలు… చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ - ఏ పార్టీ విన్?#JubileeHills #ExitPoll #Congress #BRS #Bypoll #viralvideo
యువ పారిశ్రామిక వేత్తలు వినూత్నంగా ఆలోచించాలి..
శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో) : రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా,
త్వరలో మధ్యాహ్న భోజనంలో చేపల ఆహారం
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చేపలను ఆహారంలో జత చేసి విద్యార్థులకు అందించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఐసిసి నోవాటెల్లో ఏర్పాటు చేసిన ‘వరల్డ్ అక్వాకల్చర్ ఇండియా 2025’ కాన్ఫఫెరెన్స్కు ముఖ్యఅతిథిగా మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మత్స్య శాఖపై రూపొందించిన పాటను మంత్రి సమక్షంలో విడుదల చేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో మత్స్య సంపద, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి పైన ప్రధాన చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇప్పటి వరకు మత్స్య శాఖను ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని, మొదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో నిర్వీర్యానికి గురైన మత్స్య శాఖను పునర్నిర్మాణం చేస్తూ నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి మంత్రివర్గ సమావేశంలోనే మత్స్య శాఖకు దాదాపుగా రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. మత్స్యకారులందరి తరుపున సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎపిలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో నలుగురు యువకులు దుర్మరణం చెందగా. పోలీసుల ప్రాథమిక విచారణలో అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైం దని పోలీసులు వెల్లడిం చారు. ప్రమాదం తీవ్రతను బట్టి కారు వేగం 120 కి.మీ.లకు పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చింతయ్య (17), రాకేష్ బాబు (24), ప్రిన్స్ (24) సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో యువకు డుకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వాహనం శకలాల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉయ్యూరు పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రమాదం కారణాలపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని సిఐ వెల్లడించారు.
ముమ్మరంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు
ముమ్మరంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు హుజూర్నగర్, ఆంధ్రప్రభ : డిల్లీలో జరిగిన బాంబు
అల్లరి నరేష్.. ‘12ఎ రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..
అల్లరి నరేష్ నటిస్తున్న యూనిక్ థ్రిల్లర్ మూవీ ‘12ఎ రైల్వే కాలనీ’. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. కొత్త డైరెక్టర్ నాని కాసరగడ్డ తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్టాత్మక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈమూవీ ట్రైలర్ ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్.. మూవీపై అంచనాలను పెంచేసింది. ఇప్పటికే విడుదలైన సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తనదైన మూవ్స్ తో నరేష్ ఆకట్టుకున్నారు. అల్లరి నరేష్ ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. పొలిమేర సిరీస్లో ఆకట్టుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. కాగా, నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
జనంసాక్షి ఎగ్జిట్ పోల్స్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్దే..
హైదరాబాద్ (జనంసాక్షి) : విశ్వసనీయతకు మారుపేరైన జనంసాక్షి సర్వే సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఇందులోనూ కాంగ్రెస్ ముందంజలోనే ఉంది. …
యూసుప్గూడలో భారీగా దొంగ ఓట్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓడిపోతామని యూసుఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు. ఈ విషయాన్ని గ్రహించిన బీఆర్ఎస్ నేతలు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో భారీగా మహిళా ఓటర్లు పట్టుబడ్డారు. ఎల్బీనగర్ మహిళ యూసుప్గూడలో ఓటు వేసిందని బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
తాళాలు వేసిన ఇండ్లకే కన్నాలు…
తాళాలు వేసిన ఇండ్లకే కన్నాలు… — దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్— 5తులాల
జూబ్లీహిల్స్ లో ముగిసిన పోలింగ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ శాతం
జూబ్లీహిల్స్ లో ముగిసిన పోలింగ్..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే, సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికే ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో ప్రధానంగా బిఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్ మధ్యనే తీవ్ర పోటీ ఉంది. ఇరు పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. బిఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేయగా.. కాంగ్రెస్ తరుఫున నవీవ్ యాదవ్ పోటీ చేశారు.
చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి
పేదింటిబిడ్డ పెండ్లికి… లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : పేదలకు అండగా ప్రభుత్వం ఉందని
హిందూపురంలో ఎఐఎస్ఎఫ్ బహిరంగ సభ – ప్రభుత్వంపై మండిపడ్డ ఎస్.ఎఫ్ నేతలు
విశాలాంధ్ర – హిందూపురం:రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన రాష్ట్రవ్యాప్త బస్సు జాతా మంగళవారం 21వ రోజు హిందూపురం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా చర్చి గ్రౌండ్లో వందలాది మంది విద్యార్థుల సమక్షంలో బహిరంగ సభను జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కార్యదర్శి శేషం మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు వేమయ్య యాదవ్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, నాసర్ జీ, […] The post హిందూపురంలో ఎఐఎస్ఎఫ్ బహిరంగ సభ – ప్రభుత్వంపై మండిపడ్డ ఎస్.ఎఫ్ నేతలు appeared first on Visalaandhra .
చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి భద్రత బలగాలు భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Exit Polls : బీహార్ ఎన్డీఏదే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కే
బీహార్ అసెంబ్లీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి
విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి…
విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి… లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : విద్యార్థులు విద్యతో
సిగ్నేచర్ గ్లోబల్ స్టాక్పై 75% వరకు లాభాలకు అవకాశం
హైదరాబాద్: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన ఐసిఐసిఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, నువమా... సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్పై 'బయ్' (BUY) రేటింగ్ను సిఫార్సు చేశాయి. కంపెనీ స్థిరమైన వ్యాపార వేగం, దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సిఫార్సు చేస్తున్నట్లు తెలిపాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ కంపెనీపై 'బయ్' రేటింగ్ను కొనసాగిస్తూ, టార్గెట్ ధరను రూ. 1,786గా నిర్ణయించింది. యాక్సిస్ క్యాపిటల్, నువమా సంస్థలు తమ టార్గెట్ ధరలను వరుసగా రూ. 1,780, రూ. 1,376గా నిర్ణయించాయి. ఇది ప్రస్తుత స్టాక్ ధర నుండి 75% వరకు వృద్ధికి అవకాశం ఉందని సూచిస్తోంది. నవంబర్ 11, 2025న, ఉదయం ట్రేడింగ్లో సిగ్నేచర్ గ్లోబల్ స్టాక్ ఒక్కో షేరుకు రూ. 1029.90 వద్ద ప్రారంభమైంది. 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (H1FY26), కంపెనీ రూ. 46.6 బిలియన్ల బలమైన ప్రీ-సేల్స్ను నమోదు చేసింది. రూ. 12.0 బిలియన్ల ఆదాయాన్ని నివేదించగా, కలెక్షన్లు రూ. 18.7 బిలియన్లుగా ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (H2FY26), గురుగ్రామ్లోని తమ అధిక-విలువ కలిగిన ప్రాజెక్టులలో కీలక నిర్మాణ మైలురాళ్లను చేరుకుంటున్నందున, కలెక్షన్లు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది. బ్రోకరేజ్ సంస్థల సిఫార్సులు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తమ 'బయ్' రేటింగ్ను కొనసాగిస్తూ, టార్గెట్ ధరను రూ. 1,786కు అప్డేట్ చేసింది. ఇది స్టాక్ 75% పెరిగే అవకాశం ఉందని సూచిస్తోంది. సిగ్నేచర్ గ్లోబల్... 2021-25 ఆర్థిక సంవత్సరాల మధ్య, ప్రధానంగా అందుబాటు/మధ్య-ఆదాయ గృహ ప్రాజెక్టుల ద్వారా, సేల్స్ బుకింగ్లలో 57% సిఏజిఆర్ (CAGR) వృద్ధిని సాధించిందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. 2025-28 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ. 450 బిలియన్లకు పైగా సంచిత గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ (జీడీవీ)తో కూడిన బలమైన లాంచ్ పైప్లైన్ సిగ్నేచర్ గ్లోబల్కు ఉందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. దీని మద్దతుతో, కంపెనీ సేల్స్ బుకింగ్లు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 119 బిలియన్లకు, 2027లో రూ. 127 బిలియన్లకు, 2028లో రూ. 139 బిలియన్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. యాక్సిస్ సెక్యూరిటీస్ (యాక్సిస్ క్యాపిటల్), కంపెనీ స్టాక్ ధరలో 74% వృద్ధిని ఆశిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రూ. 130 బిలియన్లకు పైగా విలువైన బలమైన ప్రాజెక్టులను ప్రారంభించాలని కంపెనీ ప్రణాళిక వేస్తోందని, దీనితో ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలదని విశ్వసిస్తోంది. ఇప్పటి నుండి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం క్రమంగా పుంజుకుంటుందని మేము ఆశిస్తున్నాము. కొత్త లాంచ్ల వద్ద ఆరోగ్యకరమైన బుకింగ్లతో పాటు, ఇది కలెక్షన్లను, ఓసిఎఫ్ (ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో)ను పెంచుతుంది అని యాక్సిస్ క్యాపిటల్ తమ నివేదికలో పేర్కొంది. నువమా కూడా తన 'బయ్' రేటింగ్ను కొనసాగిస్తూ, ఒక్కో షేరుకు టార్గెట్ ధరను రూ. 1,376గా నిర్ణయించింది. ఈ రంగంలోకి సాపేక్షంగా ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, గత కొన్నేళ్లుగా గురుగ్రామ్ హౌసింగ్ మార్కెట్లో సేల్స్ బుకింగ్స్ పరంగా సిగ్నేచర్ గ్లోబల్ అతిపెద్ద డెవలపర్లలో ఒకటిగా ఉద్భవించింది అని నువమా తన నివేదికలో పేర్కొంది. సిగ్నేచర్ గ్లోబల్ (SGIL) విజయంలో అతిపెద్ద అంశాలలో ఒకటి, కంపెనీ చాలా ఆకర్షణీయమైన ధరలకు భూమిని సేకరించగలగడం. సగటున, కంపెనీకి భూమి/ఆమోదాలకు సంబంధించిన ఖర్చులు, అమ్మకపు ధరలో 10-15% మాత్రమే ఉంటున్నాయి అని ఆ నివేదిక జోడించింది.
దొరికిన రూ.1.5 లక్షలు తిరిగిచ్చేసాడు #Hyderabad #Honesty #GoodDeed #RailwayStation #GaribExpress
మేడారానికి రేపు నలుగురు మంత్రులు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మేడారం మహాజాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నలుగురు రాష్ట్ర మంత్రులు రేపు
పొగొట్టుకున్న ఫోన్లు పొందవచ్చు…
పొగొట్టుకున్న ఫోన్లు పొందవచ్చు… నకిరేకల్, ఆంధ్ర ప్రభ : నకిరేకల్ పోలీసులు సీఈఐఆర్
Jubilee Hills Bye Elections : పోలింగ్ దారుణం.. ఇది ఎవరికి లాభమంటే?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదయింది.
అసభ్య గీతాలకు విద్యార్ధుల నృత్యం
అసభ్య గీతాలకు విద్యార్ధుల నృత్యం మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా
హిందూపురం పోలీసుల నిఘాలో.. చిక్కిన బైక్ దొంగలు
విశాలాంధ్ర – హిందూపురం :హిందూపురం పట్టణంలో ఇటీవల పెరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై కొంతకాలంగా పోలీసులు నిఘా ఉంచారు. ఎస్పీ యస్. సతీష్ కుమార్, డీఎస్పీ కెవి. మహేష్ పర్యవేక్షణలో హిందూపురం 1 టౌన్ సీఐ కె. రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ శ్రీధర్, ఏఎస్ఐ మద్దిలేటి నేతృత్వంలోని పోలీసు బృందం మంగళవారం తెల్లవారుజామున గుడ్డం అండర్ బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులను చూసి పారిపోబోయిన దుండగులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. […] The post హిందూపురం పోలీసుల నిఘాలో.. చిక్కిన బైక్ దొంగలు appeared first on Visalaandhra .
ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్.. వెలుగులోకి మరో వీడియో #DelhiBlast #Crime #DelhiPolice #TerrorProbe
వినూత్నంగా ఆలోచించాలి… సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుపైడి భీమవరంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ… బిచ్కుంద, ఆంధ్రప్రభ : సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్
Bihar : బీహార్ లో పోలింగ్ శాతం ఎంతంటే?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది.
భారీ పెట్టుబడులే లక్ష్యం విశాఖ సీఐఐకి 45 దేశాల ప్రతినిధులుమంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
మానసిక బలాన్ని పెంచుకోవాలి.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, ఆంధ్రప్రభ : పోలీసులు తమ
Video : Exclusive Interview with Hero Priyadarshi
The post Video : Exclusive Interview with Hero Priyadarshi appeared first on Telugu360 .
న్యాయవాది పై దాడికి నిరసనగా విధులకు గైర్హాజరు..
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం… తిరుపతి కి చెందిన న్యాయవాది ఎ. రాజశేఖర్పై పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కళ్యాణదుర్గం న్యాయవాదులు కోర్టు విధులకు గైర్హాజయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన ఈ దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, న్యాయవాదుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.పార్ధసారధి చౌదరి, కార్యదర్శి కె.శ్రీనివాసులు, […] The post న్యాయవాది పై దాడికి నిరసనగా విధులకు గైర్హాజరు.. appeared first on Visalaandhra .
రెండు గంటలు విజయ్ దేవరకొండ విచారణ
బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ హీరో విజయ్ దేవరకొండ ను సిట్ అధికారులు విచారించారు
Case filed against Dulquer Salmaan’s Kaantha
Malayalam actor Dulquer Salmaan has been scoring hits in all the languages. The actor has spent ample time on Kaantha, an interesting attempt and the film is all set for a grand release this Friday. A case has been filed against the film to stall the release of Kaantha. There are rumors that the film […] The post Case filed against Dulquer Salmaan’s Kaantha appeared first on Telugu360 .
పరిశుభ్రతపై అవగాహన సదస్సు…
పరిశుభ్రతపై అవగాహన సదస్సు… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : రాష్ట్రీయ బాల
విద్యావ్యవస్థకు పునాదులు వేసిన ఆజాద్
విద్యావ్యవస్థకు పునాదులు వేసిన ఆజాద్ జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం,
రెండో స్థానంలో నంద్యాల.. నంద్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల మధ్య

19 C