SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం.. కెసిఆర్ ఫైర్

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, రైతు బంధు వేయడంలేదని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేద ప్రజలను ఏడిపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ 100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని చెప్పారు. సోమవారం జగిత్యాలలో బిఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హైడ్రా తెచ్చాం.. నిజామాబాద్‌లో నిడ్రా తెస్తామంటున్నారు. జగిత్యాలలో జిడ్రా కూడా తెస్తారేమో?. ఇంట్లో సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూల్చి వేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే.. హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం చేస్తా. మూసీ దగ్గర ఉన్న పేదలను కూడా ఏడిపిస్తున్నారు. 15 వేల ఇళ్లు కూలగొడతామని అనడం ధర్మమేనా?. మూసీని మంచిగా చేయడం మంచిదే.. కానీ, 15 వేల ఇళ్లు కూలగొడతారా? అంటూ కెసిఆర్ ఫైరయ్యారు.

మన తెలంగాణ 20 Apr 2026 9:25 pm

PMF has Big Plans for 2027

TG Vishwa Prasad, an NRI who returned back from USA floated People Media Factory and is producing a number of films. He introduced several talented actors, directors and technicians to Telugu cinema. Mirai was one of the biggest hits for the production house last year. The VFX work done by the home team of PMF […] The post PMF has Big Plans for 2027 appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 9:21 pm

తెలంగాణ పదం పలకడానికే భయపడే రోజులు.. కరెంట్ అడిగితే కాల్చి చంపారు

పొద్దున లేస్తే కెసిఆర్‌ చావాలని మాట్లాడుతున్నారని.. వాళ్లు వెయ్యి జన్మలు ఎత్తినా తాను చావని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ దళపతి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడే వరకు సేవ చేస్తానని చెప్పారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ అనే పదం పలకడానికే భయపడే రోజులు.. తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు ఉండేవి. మన నీళ్లు, వనరులను దోపిడీ చేశారు. పాలమూరు వంటి జిల్లాలో 90 శాతం వలసలే. కొన్ని పార్టీల తీరుతో ఆవేశం, బాధ కలిగేవి. మూలిగే నక్కపై తాటిపండులా చంద్రబాబు కరెంట్‌ ఛార్జీలు పెంచారు. కరెంట్‌ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలిపితే బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారు. బషీర్‌బాగ్‌ ఘటనతోనే తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమానికి వచ్చా. కెసిఆర్‌ రాక ముందు రాష్ట్రంలో కరెంట్‌ సరిగా ఉండేదా?. మేం వచ్చాక 24 గంటల కరెంట్‌ ఇచ్చాం. మరి ఇప్పుడు ఏమైంది?. ఈ దుర్మార్గులు గెలిస్తే రైతు బంధుకు రాంరాం. దళితబంధుకు జైభీమ్‌ అంటారని చెప్పా. నేను చెప్పినట్టే జరిగిందా? లేదా?. ఒకేసారి వెయ్యాల్సిన రైతు బంధును ఎకరానికి ఒకసారి వేస్తున్నారు అని మండిపడ్డారు.

మన తెలంగాణ 20 Apr 2026 9:08 pm

నిప్పుల కొలమిలా నగరం

భానుడి భగ భగలతో నగరం నిప్పుల కొలమిలా మారుతోంది. దీంతో నగర వాసులు ఉదయం 11 గంటలకు ముందే తమ పనులు చక్క పెట్టు కుంటున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనాల దారులు బయటకు రాక పోవడంతో పూర్తిగా మధ్యాహ్న సమయంలో కర్ఫూ వాతావరణం తలపిస్తొంది.. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఇటువంటి ఇటువంటి పరిస్థితులు ఏర్పాడ్డాయని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికె తెలిపారు. ఇవే పరిస్థితులో మే, జాన్ నెలల్లో కూడా కొనసాగుతాయన్నారు. వీటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులతో పాటు, వైద్యు కూడా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇళ్ళల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఏవైనా పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవాలని, అత్యవసరం అనుకుంటే మాత్రమే తగు జాగ్రత్తలో బయటకు వెళ్ళాలని సూచిస్తున్నారు.అంతే కాకుండా దీని ప్రభావంతో మే నెలాఖరులో వర్షాలు తీసుకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తద్వారా వర్షాలు కురవడంలో కూడా వర్షాలు పడటం కూడా జాప్యం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

మన తెలంగాణ 20 Apr 2026 8:47 pm

హరీష్ రావు గురించి కవిత మొదటి నుంచి చెబుతూనే ఉంది: మంత్రి అడ్లూరి

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దీనిని బట్టి బిఆర్‌ఎస్ ముసలం మొదలైందని, వర్గ పోరు జరుగుతోందని స్పష్టమవుతున్నదన్నారు. హరీష్ రావు గురించి కవిత మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని ఆయన తెలిపారు. హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నారన్న విషయాలు బయటకు రావాలన్నారు. బిఆర్‌ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.

మన తెలంగాణ 20 Apr 2026 8:41 pm

KCR : వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. మొదటి సంతకం హైడ్రాను రద్దు చేయడమే

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని కేసీఆర్ అన్నారు

తెలుగు పోస్ట్ 20 Apr 2026 8:37 pm

రూ.30 కోట్లతో పది సినిమాలు..

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టిఎఫ్‌డిఎ) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నారు.ఈ మేరకు టీఎఫ్‌డీఏ సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, కార్యదర్శి సాయి రాజేష్, ఉపాధ్యక్షులు సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ “చదలవాడ శ్రీనివాసరావు వారి బ్యానర్ మీద ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు” అని అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియల్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని తెలిపారు.

మన తెలంగాణ 20 Apr 2026 8:33 pm

సోమవారం పెరిగిన చమురు ధరలు

ఇస్లామాబాద్‌లో చర్చలు ముందుకు సాగలేదనే విషయం తెలియగానే అంతర్జాతీయ చమురు మార్కెట్ తిరిగి కుదుపులకు గురైంది. కొద్దిరోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన ధరలు ఇప్పుడు తిరిగి పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్‌కు 95 డాలర్లకు ఎగబాకింది, యుద్ధం ఆరంభం నుంచి చూస్తే ఇది 30 శాతం పెరుగుదల అయింది, హర్మూజ్ మీదుగా నౌకా రవాణాను మరింత కట్టుదిట్టంగా అడ్డుకుంటామని ఇరాన్ సోమవారం తెలిపింది. దీనితో ఇప్పటికే ఇక్కడ రవాణాకు నిలిచిపోయి ఉన్న వందలాది చమురు నౌకలు మరింత ఆటుపోట్లకు గురయ్యాయి. హర్మూజ్‌పై ట్రంప్ ప్రకటనలతో ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ అనుమతి ఉన్న భారత్ వంటి కొన్ని దేశాలు కూడా ఈ మార్గం ద్వారా వెంటనే నౌకల రవాణా సురక్షితమేనా అనే సంశయంలో పడ్డాయి. 

మన తెలంగాణ 20 Apr 2026 8:30 pm

బిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నా: కెసిఆర్‌

బిఆర్ఎస్ లో చేరిన జీవన్‌ రెడ్డికి పార్టీ అధినేత కెసిఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. జీవన్ రెడ్డి.. జగిత్యాల జిల్లా మాత్రమే కాదు, పాత కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల బాధ్యతలు కూడా చూడాలని కెసిఆర్ అన్నారు. ఈ క్షణం నుంచి జీవన్‌ రెడ్డిని బిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నానని చెప్పారు. జగిత్యాల బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసమే జీవన్‌రెడ్డి బిఆర్ఎస్‌లో చేరారన్నారు. జీవన్‌రెడ్డి గుండె ధైర్యమున్నోడని.. జీవన్‌రెడ్డి తన ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పారు. జీవన్‌రెడ్డితో తకు 40 ఏళ్ల స్నేహం ఉంది. భిన్న రాజకీయాల వల్లే వేర్వేరుగా పనిచేశాం. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు పక్క జిల్లాల్లో కూడా జీవన్‌రెడ్డికి అభిమానులు ఉన్నారు.. జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. వెంటనే ప్రజలు ఎమ్మెల్సీగా గెలిపించారు. జీవన్‌రెడ్డికి పదవులు కొత్తకాదు. ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లా పనిచేద్దామని జీవన్‌రెడ్డితో చెప్పా అని కెసిఆర్ అన్నారు.

మన తెలంగాణ 20 Apr 2026 8:27 pm

45 years |జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై కేసీఆర్

45 years | జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై కేసీఆర్ 45 years

ప్రభ న్యూస్ 20 Apr 2026 8:26 pm

చందానగర్‌లో వైభవ్ జ్యూయలర్స్‌ను ప్రారంభించిన సినీ నటి మానస వారణాసి

 ప్రముఖ సినీ నటి మానస వారణాసి సోమవారం చందానగర్‌లోని ఇక్రిసాట్ కాలనీలో వైభవ్ జ్యూయలర్స్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైభవ్ జ్యూవెలర్స్ అద్భుత ప్రయాణంలో తాను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.32 సంవత్సరాల నమ్మకం, 30 మిలియన్ల సంతోషకరమైన కస్టమర్లు, 20 స్టోర్లతో అద్భుతమైన డిజైన్ల ఆభరణాలతో చందానగర్ 21వ స్టోర్‌ను చందానగర్‌లో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు.అనంతరం సంస్థ వైస్ ప్రసిడెంట్ జె.రఘునాథ్ మాట్లాడుతూ వినియోగదారులకు అద్భుత శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు ప్రారంభోత్సవఆఫర్‌గా విస్తృత శ్రేనిలో 916 హాల్ మార్క్‌డ్ బంగారు ఆభర ణాలపై ప్రతి గ్రాముకు రూ.777 వరకు తగ్గింపు ఇస్తున్నామని,డైమండ్ మేకింగ్ చార్జీలపై 100శాతం తగ్గింపు,సాధారణ వెండివస్తువులు, పట్టీలపై తయారీ చార్జీలు లేకుండా చందానగర్ షోరూమ్‌లో అందిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సేవలను వినియోగదారులు వినియోగించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షురాలు ప్రీతి రెడిఓ్డ,ఐపిఎస్ అధికారి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 20 Apr 2026 8:23 pm

Biggest Theatrical Deal for Shah Rukh Khan’s King

After a decent break, Shah Rukh Khan has delivered two back-to-back blockbusters: Jawan and Pathaan. The actor is not in a hurry and he started King directed by Siddharth Anand. King is one of the craziest films made in Bollywood cinema. The film is rumored to be made on a budget of Rs 400 crores […] The post Biggest Theatrical Deal for Shah Rukh Khan’s King appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 8:23 pm

అనసూయపై అసభ్య కామెంట్లు... యువకుడి అరెస్టు

సినీనటి, యాంకర్ అనసూయపై ఇన్‌స్టాగ్రాంలో అసభ్య కామెంట్లు పెట్టిన యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెట్టడంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు నల్గొండ జిల్లాకు చెందిన చంటిగా గుర్తించారు, అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు, నెటిజన్లకు పలు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఎవరిపై అయినా అసభ్యకరమైన కంటెంట్, దూషణలు లేదా వ్యక్తిగత దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలను వేధించే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

మన తెలంగాణ 20 Apr 2026 8:20 pm

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. రూ 3650 నగదు స్వాధీనం.. నలుగురి అరెస్ట్

ప్రభ న్యూస్ 20 Apr 2026 8:19 pm

Rs1.50 lakh cr |సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Rs1.50 lakh cr | సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు Rs1.50 lakh

ప్రభ న్యూస్ 20 Apr 2026 8:13 pm

Interesting: Dhanush to direct Mrunal Thakur?

The entire nation is speculating about the relationship between Dhanush and Mrunal Thakur. The speculations never died despite the duo condemning the rumors. The latest buzz making rounds across the Tamil media circles is that Dhanush will soon direct his next film and it is a women-centric attempt featuring Mrunal Thakur playing the lead role. […] The post Interesting: Dhanush to direct Mrunal Thakur? appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 8:11 pm

టివికె చీఫ్ విజయ్‌కు హైకోర్టు నోటీసులు

టివికె అధినేత విజయ్‌కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లతో వ్యత్యాసాలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని సోమవారంనాడు విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ఆదాయపన్నుశాక డెరెక్టర్ జనరల్, ఎన్నికల సంఘం, పెరంబూరు, తిరుచ్చి (ఈస్ట్) రిటర్నింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు విజయ్ సమర్పించిన అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని చెన్నైకి చెందిన వి.విఘ్నేశ్ పిటిషన్ వేశారు. పెరంబూర్‌లో దాఖలు చేసిన అఫిడవిట్ రూ.105కోట్ల ఆస్తులు ప్రకటించగా, తిరుచ్చి ఎన్నికల అఫిడవిట్‌లో రూ.220 కోట్లుగా పేర్కొన్నారు. రెండు అఫిడవిట్ల మధ్య రూ.105 కోట్ల భారీ వ్యత్యాసంపై ఆదాయం పన్ను శాఖ దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ ధర్మాధికారి, జస్టిస్ జి అరుళ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం సోమవారంనాడు విచారణ జరిపింది. ఒక నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా ఆస్తులను వెల్లడించకపోవడం అక్రమమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విజయ్, తదితరులకు నోటీసులు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణలో ఏమి జరుగుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈనెల 23, 29 తేదీల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. విడాకుల కేసు జూన్ 15కు వాయిదా మరోవైపు విజయ్ విడాకుల కేసు చెంగల్పట్టు కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందుకు వాయిదా వేయాలన్న అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం ప్రకటించింది. విజయ్ భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఆ రోజు ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది. 

మన తెలంగాణ 20 Apr 2026 8:10 pm

మూడున్నర గంటలు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో

హైదరాబాద్ నుంచి హుబ్లీకి ఆదివారం బయలుదేరిన ఫ్లై 91 విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ అత్యవసర చర్యకు దిగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు. ప్రయాణికులు అంతా భద్రంగా ఉన్నట్లు తెలిపారు. అయితే విమానం దాదాపు మూడున్నర గంటల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. దీనితో విమానంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురి కావల్సి వచ్చింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో ఇటువంటివి మామూలే అని అధికారులు తేలిగ్గా కొట్టిపారేశారు. పైగా సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయని, ఎటువంటి ముప్పు తలెత్తలేదని వివరణ ఇచ్చుకున్నారు. ప్రయాణికులలో కొందరు బిగ్గరగా ఏడుస్తూ, తాము ప్రాణాలతో బయటపడేలా చూడాలని భగవంతుడిని వేడుకుంటూ గడిపారు.విమానం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. 90 నిమిషాల ప్రయాణం తరువాత 4.30కు హుబ్లీ చేరాలి. అయితే బెంగళూరుకు దారి మళ్లించాల్సి వచ్చింది. ఇటువంటివి భద్రతా చర్యలలో తీసుకునే ప్రామాణిక విషయాలు అని కూడా అధికారులు తెలిపారు. 22 మందితో కూడిన ఈ విమానం సాయంత్రం ఆరుగంటల తరువాత బెంగళూరు నుంచి హుబ్లీకి రాత్రి 11 గంటల ప్రాంతంలో చేరింది. అంతా సుఖాంతం అయిందని ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు తెలిపారు. అయితే తమకు హైదరాబాద్ నుంచి హుబ్లీ చేరేలోపు చుక్కలు కన్పించాయని , ప్రాణాలు బిగపట్టుకుని ప్రయాణించాల్సి వచ్చిందని హుబ్లీకి చేరిన తరువాత ప్రయాణికులు స్పందించారు. ఇక ఆదివారమే ముంబై నుంచి కొల్హాపూర్‌కు బయలుదేరిన విమానాన్ని గోవాకు దారి మళ్లించాల్సి వచ్చింది. విమానంలో ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తలేదు. ప్రతికూల పరిస్థితులతోనే విమానం దారి మళ్లించాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. 

మన తెలంగాణ 20 Apr 2026 8:09 pm

కారు ఢీకొని జంక మృతి…

కారు ఢీకొని జంక మృతి… సంఘటన స్థలంలో పోస్టుమార్టమ్ నిర్వహించి ఖననం పెనుగంచిప్రోలు,

ప్రభ న్యూస్ 20 Apr 2026 8:04 pm

ఇసుక, రబ్బిష్ కు అడ్డగా మారిన సి.వి.ఆర్ ఫ్లైఓవర్..

ఇసుక, రబ్బిష్ కు అడ్డగా మారిన సి.వి.ఆర్ ఫ్లైఓవర్.. ఇసుక, రబ్బిష్ లోడ్ల

ప్రభ న్యూస్ 20 Apr 2026 8:01 pm

ఈ నెల 23 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 23 వరకు పొడిగించారు.ఈ మేరకు ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి రోజుకు రెండు సెషన్లలో జరుగనున్నాయి. మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మన తెలంగాణ 20 Apr 2026 7:59 pm

ఈనెల 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం

రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 23వ తేదీన జరుగనుంది. సచివాలయంలో మధ్యాహ్నాం 3 గంటలకు సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు (99 రోజులు), రోహిత్ వేముల చట్టం, ఇద్దరు ఎమ్మెల్సీ (కోదండరాం, అజహరుద్దీన్) పేర్లను మరోసారి గవర్నర్‌కు పంపడం, తుమ్మిడిహెట్టి డిపిఆర్‌పై చర్చతో పాటు భూముల మార్కెట్ వాల్యూ పెంపు, మద్యం ధరల పెంపు గురించి మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

మన తెలంగాణ 20 Apr 2026 7:54 pm

బిసి గురుకుల జూనియర్ ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

బిసి గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 22 నుండి మే నెల 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంజెపి బిసి గురుకులాల సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in  లేదా https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఎంపిసి, బైపిసి, ఎంఈసి, సిఈసి, హెచ్‌ఈసి రెగ్యులర్ గ్రూపులతో పాటు అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపిహెచ్‌డబ్లు), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ అనే 7 వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 146 బాలుర కాలేజీల్లో 12,640 సీట్లు, 144 బాలికల కాలేజీల్లో 12,080 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. బిసి గురుకులాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయనవసరం లేదని, తమ స్కూల్ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 040 -23328266 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

మన తెలంగాణ 20 Apr 2026 7:52 pm

H-1B Visa Fraud in US: Two Telugu-Origin Men Plead Guilty in Fake Job Scam

A visa fraud case in the United States has brought two Telugu-origin individuals under the spotlight. Sampath Rajidi and Sridhar Mada pleaded guilty in connection with the H- 1B visa scam, which involved creating and submitting fabricated employment records to secure work visas for foreign applicants. The case was investigated by federal authorities in California. […] The post H-1B Visa Fraud in US: Two Telugu-Origin Men Plead Guilty in Fake Job Scam appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 7:52 pm

అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం – కార్మికుడు మృతి

విశాలాంధ్ర, యాడికి:యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పవన్ కుమార్ రెడ్డి మృతి చెందాడు.ఫ్యాక్టరీ మైన్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాడికి సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. The post అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం – కార్మికుడు మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Apr 2026 7:48 pm

Police |జంట హత్యల కలకలం

Police | జంట హత్యల కలకలం Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 20 Apr 2026 7:47 pm

మూడు సార్లు మరమ్మ తులు

మూడు సార్లు మరమ్మ తులు స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్

ప్రభ న్యూస్ 20 Apr 2026 7:41 pm

బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కెసిఆర్

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి.. బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు జీవన్‌రెడ్డి. ఈ సందర్భంగా గులాబి బాస్ కెసిఆర్.. జీవన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన అనుచరులతో పాటు జీవన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 20 Apr 2026 7:38 pm

ఓటిటిలోకి ధురంధర్ 2.. రిలీజ్ ఎప్పుడంటే?

న్యూఢిల్లీ: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్: ది రివెంజ్' మూవీ విడుదలైన నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మార్చి19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా రెండు భాగాలు.. ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. వెండితెరపై సంచలన విజయం సాధించిన ఈ మూవీని.. ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మొదటి భాగాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన మేకర్స్.. రెండో భాగాన్ని జియో హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే 2026 చివరిలో లేదా జూన్ 2026 ప్రారంభంలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

మన తెలంగాణ 20 Apr 2026 7:29 pm

టూరిజం డెస్టినేషన్ గా ఏపీ..

టూరిజం డెస్టినేషన్ గా ఏపీ.. సీఎం చంద్రబాబు దర్శినికతతో పూర్వవైభవం..ఏపీ టూరిజం కార్పొరేషన్

ప్రభ న్యూస్ 20 Apr 2026 7:28 pm

Revanth Reddy : కాళేశ్వరంలో దోషులను శిక్షిస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు

తెలుగు పోస్ట్ 20 Apr 2026 7:21 pm

హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్‌ మీదే..!

హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్‌ మీదే..! రాప్తాడు, ఆంధ్రప్రభ : హంద్రీనీవాను నాశనం

ప్రభ న్యూస్ 20 Apr 2026 7:21 pm

వేణుగోపాలస్వామికి వెన్నపూస అలంకరణ

వేణుగోపాలస్వామికి వెన్నపూస అలంకరణ గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని

ప్రభ న్యూస్ 20 Apr 2026 7:16 pm

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

అహ్మదాబాద్: ఐపిఎల్‌ 2026లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుని.. ముందుగా ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. క్వింటన్ డికాక్ ఫామ్‌లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. పంజాబ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో డికాక్ అజేయ శతకంతో కదంతొక్కిన సంగతి తెలిసిందే. అయితే కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రిత్ బుమ్రా, తిలక్ వర్మ తదితరుల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య తన పాత్రను సమర్థంగా నిర్వర్తించలేక పోతున్నాడు. మరోవైపు, గుజరాత్ ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో గెలిచి జోరు మీదుంది.

మన తెలంగాణ 20 Apr 2026 7:13 pm

పాతబస్తీ లో జంట హత్యలు కలకలం

హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరు ఖాన్ బజార్ లో జంట హత్యలు కలకలం రేపింది..అదిల్ ఖాన్ అనే వ్యక్తి అతని సోదరుడు అఖ్వీల్ ఖాన్ ,అజ్మీరి బేగం అనే ఇద్దరిని ఇంట్లో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సంఘటన స్థలానికి చేరుకున్న మీర్ చౌక్ పోలీసులు.క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు పై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 20 Apr 2026 7:12 pm

Cyber ​​Crime |నల్గొండ యువకుడి అరెస్ట్

Cyber ​​Crime | నల్గొండ యువకుడి అరెస్ట్ Cyber ​​Crime | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 20 Apr 2026 7:09 pm

వాహనం నుండి బయటకు దూకి ఖైదీ పరారీ

చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురిని మరో కేసులో పీటీ వారెంట్‌పై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణ కోసం తీసుకెళ్లి  తిరిగి జైలుకు తీసుకెళ్తుండగా ఒక చోట ట్రాఫిక్ లో వాహనం ఆగిన సమయం చూసి రెప్పపాటులో వాహనం దిగి ఒక ఖైదీ పరారైనాడు. ఖైదీలను పోలీస్ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తీసుకొస్తుండగా  ఈ ఘటన జరిగింది. చంచలగూడ జైలు సమీపంలోనే వాహనం నుంచి దూకి పరారైనట్లు సమాచారం. పరారైన నిందితుడు నరేష్‌గా గుర్తింపు. మిగతా ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ నెల 12న ముగ్గురు దొంగలను పోలీసులు రిమాండ్‌కు పంపారు.పరారైన నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. లేక ఎవరైనా పరారైన ఖైదీకి సహకరించారా..? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

మన తెలంగాణ 20 Apr 2026 7:09 pm

5 ఏళ్ల వయస్సు తప్పిపోయి 25 ఏళ్ల వయసులో తల్లిని కలిసిన యువకుడు

అనుకోకుండా కుటుంబానికి దూరమై 25 ఏళ్ల తర్వాత తన తల్లిని కలిశాడు ఓ యువకుడు. ఆ యువకుడు పేరు సరూ అసలు పేరు షేరు మున్షీ ఖాన్. వివరాలలోకి వెళితే.. 1986లో సరూ కి కేవలం 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన అన్నయ్యతో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్ళాడు. అలసట వల్ల ఒక ఖాళీ రైలులో నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రైలు ఎక్కడికో వెళ్ళిపోతోంది. అలా అతను తన ఊరు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నుండి దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్‌కతా చేరుకున్నాడు. కోల్‌కతా వీధుల్లో సరూ ఎన్నో కష్టాలు పడ్డాడు. తన ఊరు పేరు సరిగ్గా చెప్పలేకపోయాడు . చివరికి ఒక అనాథాశ్రమానికి చేరాడు. అక్కడ నుండి ఆస్ట్రేలియాకు చెందిన బ్రియర్లీ దంపతులు అతడిని దత్తత తీసుకున్నారు. షేరు మున్షీ ఖాన్ అలా సరూ బ్రియర్లీగా మారి టాస్మేనియాలో పెరిగాడు. సరూ ఆస్ట్రేలియాలో సుఖంగా ఉన్నప్పటికీ తన కన్నతల్లి జ్ఞాపకాలు అతడిని వెంటాడేవి. తన చిన్ననాటి అస్పష్టమైన గుర్తుల ఆధారంగా (స్టేషన్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్, వంతెన వంటివి) గూగుల్ ఎర్త్ ద్వారా భారతదేశంలోని రైల్వే లైన్లను గంటల తరబడి పరిశీలించేవాడు.2012లో తను చిన్నప్పుడు తప్పిపోయిన స్టేషన్‌ను గూగుల్ ఎర్త్‌లో గుర్తించాడు. వెంటనే భారతదేశానికి వచ్చి తన పాత ఊరు వెతికాడు. చివరికి తన తల్లిని కలుసుకున్నాడు. అప్పటి వరకు తన కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆ తల్లి ఎదురుచూస్తూనే ఉంది. ఈ కథ ఆధారంగా 2016లో 'Lion' అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. ఇందులో సరూ పాత్రను దేవ పటేల్ పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

మన తెలంగాణ 20 Apr 2026 7:00 pm

వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్..

వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్.. సర్వీస్ నుంచి డిస్మిస్ ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:57 pm

Video : Music Director Naga Vamshi Exclusive Interview

The post Video : Music Director Naga Vamshi Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 6:54 pm

నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇప్పించండి!”

నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇప్పించండి!” ఏటూరునాగారం, ఆంధ్ర‌ప్ర‌భ : తాను బతికే

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:50 pm

Telangana : ఇద్దరూ కాళేశ్వరాన్ని ఏరియల్ వ్యూలో చూసి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు మేడిగడ్డ బ్యారేజీని ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించారు

తెలుగు పోస్ట్ 20 Apr 2026 6:47 pm

ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు..

టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు గానీ, షూటింగ్ ఇప్పట్లో మొదలు పెట్టకపోవచ్చుననే మాట వినిపించింది. కానీ, సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చాడు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెల్దాం. నిర్మాత దిల్ రాజుకి అత్యంత సన్నిహితుడు దర్శకుడు వంశీ పైడిపల్లి. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఓ సినిమాను […] The post ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు.. appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 20 Apr 2026 6:45 pm

నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు..

నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:45 pm

మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం…

మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం… ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:42 pm

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సిఎం రేవంత్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. డ్రోన్‌ ఎగురవేసి.. ఏరియల్‌ వ్యూ ద్వారా మేడిగడ్డను సిఎం పరిశీలించారు. సిఎం రేవంత్ తోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎన్డిఎస్ఎ చైర్మన్ అనిల్ జైన్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, అంతకుముందు.. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని సిఎం రేవంత్ దర్శించుకున్నారు. తర్వాత రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సిఎం భూమిపూజ చేశారు. 

మన తెలంగాణ 20 Apr 2026 6:35 pm

చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు

చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:28 pm

విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా…

విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా… ర్యాంకులు సాధించటం అభినందనీయంస్టేట్ ర్యాంకు సాధించిన అనూష

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:25 pm

సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన ఎంఈఓ

గరిడేపల్లి, ఆంధ్రప్రభ ; మండలంలోని గడ్డిపల్లి లో ఉన్న బాలుర ప్రభుత్వ సాంఘిక

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:24 pm

వాల్ పోస్టర్లను ఆవిష్కరణ….

తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈనెల 23న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే శ్రీ

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:23 pm

ఒకేసారి బరిలోకి రెండు జట్లు.. 30-35 మంది జాబితా సిద్ధం..

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీం ఇండియా పలు ద్వైపాక్షిక సిరీసులు ఆడనుంది. ఇందుకోసం ఆటగాళ్లను ఎంపిక చేయడం ఇప్పుడు బిసిసిఐ ముందు ఉన్న అతి పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడున్న టాప్ ప్లేయర్లతో పాటు ఐపిఎల్‌తో తమ్ ప్రతిభ కనబర్చిన యువ ప్లేయర్లు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలో ఎవరిని పక్కన పెట్టాలో పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బిసిసిఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టులోకి రావడానికి ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఆధారంగా కనీసం 30-35 మందితో బిసిసిఐ ఓ జాబితాను సిద్ధం చేయనుంది. ఒకేసారి రెండు జట్లు బరిలోకి దిగేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న సిరీస్‌ల దృష్ట్యా దీనిని వర్కౌట్ చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు ఆసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్‌లు వేదికలుగా కానున్నాయి. ఇందులో బరిలోకి దిగే జట్లలలో ఒక జట్టుకు శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇవ్వగా.. మరో జట్టుకు సూర్య కానీ, మరెవరైనా కానీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 20 Apr 2026 6:23 pm

ప్రజల వద్దకు పాలన…

ప్రజల వద్దకు పాలన.. తీసుకు వచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేఅభివృద్ధి సంక్షేమ పాలన

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:22 pm

విషాదం: కొండను ఢీకొట్టిన విమానం.. పైలట్, కో పైలట్ మృతి

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఓ చార్టర్డ్ విమానం, కొండచరియను ఢికొట్టడంతో.. పైలట్, కోపైలట్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జష్‌పూర్ జిల్లాలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. వెంటనే సంఘటనాస్థలానికి రెస్క్యూ టీమ్ ను పంపించి సహాయక చర్యలు ప్రారంభించింది. అనంతరం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్లు వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో వీరితోపాటు విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో విమానం కొండపై కూలిపోవడయంతో దట్టమైన పొగ, మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 20 Apr 2026 6:21 pm

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి పరకాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:20 pm

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సీఓఈలు,

ప్రభ న్యూస్ 20 Apr 2026 6:16 pm

Breaking : వెంకట్రామిరెడ్డి డిస్మిస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

సచివాలయం ఉద్యోగి వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది

తెలుగు పోస్ట్ 20 Apr 2026 6:09 pm

Karunakaran, Anudeep and Bheems trio for Ganesh

Bellamkonda Ganesh is all set to charm audiences in a new-age romantic comedy directed by the acclaimed A. Karunakaran. This exciting project is produced by Mounika Reddy under the Golden Turtle Entertainments banner. Karunakaran, celebrated for youthful blockbusters like Tholi Prema, Happy, and Darling, is returning to his beloved genre. He is widely recognized for […] The post Karunakaran, Anudeep and Bheems trio for Ganesh appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 6:01 pm

Ambati Rambabu : అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?

చంద్రబాబుపై మరోసారి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు

తెలుగు పోస్ట్ 20 Apr 2026 5:58 pm

మొగుడిపై కోపం.. కోటిన్నర నోట్లు గాల్లో విసిరేసిన మహిళ

భర్తపై ఆగ్రహించిన ఒక మహిళ నోట్ల కట్టలను రోడ్డు మీదకు విసిరేసింది

తెలుగు పోస్ట్ 20 Apr 2026 5:46 pm

గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం

జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో సోమవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామిక వాడలోని ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో బాయిలర్ వద్ద షార్ట్ సర్య్కూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు పరిశ్రమలో ఎలాంటి పరికరాలు లేవని స్థానికులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఇదే పరిశ్రమను ఆనుకొని మరో భారీ పరిశ్రమ ఉండటంతో అక్కడి నుంచి సేఫ్టీ విభాగం రసాయనాలు వెదజల్లారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో లేకపోవడం వల్లనే సమస్య తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు.

మన తెలంగాణ 20 Apr 2026 5:45 pm

Will Ram Pothineni turn Director?

Tollywood actor Ram Pothineni needs a solid box-office hit. His last film Andhra King Taluka received decent response but the film failed to register decent numbers. He is on a break and is working on two projects. From the past one year, there are speculations that Ram is working on a script and he will […] The post Will Ram Pothineni turn Director? appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 5:36 pm

Revanth Reddy : మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు

తెలుగు పోస్ట్ 20 Apr 2026 5:35 pm

సంగారెడ్డి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 20 Apr 2026 5:25 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తంతో చిత్రం…

ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తంతో చిత్రం… నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు

ప్రభ న్యూస్ 20 Apr 2026 5:21 pm

కాళేశ్వరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మహాదేవపూర్, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా

ప్రభ న్యూస్ 20 Apr 2026 5:20 pm

ఫిన్లాండ్ లో స్వదేశీ సాఫ్ట్వేర్ ఉద్యోగి స్వాగతం..

జన్నారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీ విద్యా విధానంపై అధ్యయనం

ప్రభ న్యూస్ 20 Apr 2026 5:17 pm

19 years |టాలీవుడ్‌లో దూసుకుపోతున్న డింపుల్ హయాతి!

19 years | టాలీవుడ్‌లో దూసుకుపోతున్న డింపుల్ హయాతి! 19 years |

ప్రభ న్యూస్ 20 Apr 2026 5:17 pm

చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మజ్జిగ పంపిణీ

చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మజ్జిగ పంపిణీ భవానిపురం, ఆంధ్రప్రభ : విజనరీ

ప్రభ న్యూస్ 20 Apr 2026 5:16 pm

హిందూ సమ్మేళనంలో పాల్గొన్న వక్తలు..

బెల్లంపల్లి రూరల్, ఆంధ్రప్రభ : దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడం రాష్ట్రీయ స్వయంసేవక్

ప్రభ న్యూస్ 20 Apr 2026 5:13 pm

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ

ప్రభ న్యూస్ 20 Apr 2026 5:12 pm

పేదలకు అన్నదానం…

పేదలకు అన్నదానం… పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్ లూనా సెంటర్ లోని

ప్రభ న్యూస్ 20 Apr 2026 5:08 pm

మరోసారి తన దాతృత్వం చాటుకున్న మెగాస్టార్.. ఈసారి ఏం చేశారంటే..

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి స్క్రీన్‌ మీద తన యాక్టింగ్‌తో ఎలా కట్టి పడేస్తారో.. అలాగే బయట ఆయన చేసే సేవా కార్యక్రమాలను చూసి ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పటికే చిరంజీవి ‘ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌’తో ఎందరి జీవితాల్లోనూ వెలుగు నింపారు చిరు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అందించిన ఎన్టిఆర్ జాతీయ పురస్కారంతో వచ్చి రూ.10 లక్షల నగదును పలు సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న తన సిబ్బందిని ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీ కోసం రూ.10.5 లక్షలు, మాజీ మేనేజర్ నరసయ్య సతీమణి బైపాస్ సర్జరీ కోసం రూ.9.5 లక్షలు అందజేశారు. సాయం చేయడమే కాదు.. శస్త్ర చికిత్సల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా చిరు చేసిన పనిని ప్రశంసిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

మన తెలంగాణ 20 Apr 2026 5:02 pm

కెసిఆర్ మోసాలపై జీవన్ రెడ్డి మాకు పాఠాలు చెప్పేవారు: మహేష్ గౌడ్

హైదరాబాద్: ఫామ్ హౌస్ పులి..తిన్న ఆవుల గురించి బయటపెడతామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ దగ్గరుండి చూస్తేనే మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అర్థమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఎమ్ఎల్ఎ, ఎంపిగా పోటీ చేసినప్పుడు కనిపించలేదా? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కెసిఆర్ సభకు..తమది  కౌంటర్ ప్రోగ్రాం కాదని..20 రోజుల ముందే ఖరారైందని అన్నారు. ఆశలపల్లకిలో ఊరేగించడం కెసిఆర్ కు అలవాటు అని విమర్శించారు. మేడిగడ్డలో కెసిఆర్ మోసాలపై జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వారికి పాఠాలు చెప్పేవారని తెలియజేశారు. కెకె, డిస్ లానే త్వరలో జీవన్ రెడ్డి బాధపడతారని మహేష్ గౌడ్ సూచించారు.      

మన తెలంగాణ 20 Apr 2026 4:46 pm

ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:28 pm

ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు…

ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:27 pm

tg |జీవ‌న్‌రెడ్డి చేరిక‌తో బీఆర్ఎస్‌లో ముస‌లం

tg | జీవ‌న్‌రెడ్డి చేరిక‌తో బీఆర్ఎస్‌లో ముస‌లం జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:25 pm

అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తాను…

అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తాను… ముధోల్ శాసన సభ్యులు పవార్

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:24 pm

రేపు మోడీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో అగ్ని ప్రమాదం

బలోత్రా: రాజస్థాన్‌లోని ఓ రిఫైనరీలో భారీ అగ్న ప్రమాదం చోట చేసుకుంది. బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని రిఫైనరీలో మంటలకు చెలరేగాయి. రిఫైనరీ క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్‌లో కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. రిఫైనరీలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే, నిజారకి మంగళవారం ఈ రిఫైనరీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిచాల్సి ఉంది. ఈ క్రమంలో దీన్ని సిఎం భజన్‌లాల్ శర్మ సాయంత్రం సందర్శించాల్సి ఉంది. ఈ లోపే ఈ ప్రమాదం జరిగింది. బలోత్రా రిఫైనరీ దేశంలోనే మొదటి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కావడం మరో విశేషం.

మన తెలంగాణ 20 Apr 2026 4:23 pm

Andhra Prabha Smart Edition |AP|ఆకలి మాటే/నాకోసం పుట్టావు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 20-04-2026, 4.00PM ap ఆకలి మాటే రావొద్దు..

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:22 pm

Intense interest |ప్రజా సమస్యలపై పోరాడేందుకే..: జీవ‌న్‌రెడ్డి

Intense interest | ప్రజా సమస్యలపై పోరాడేందుకే..: జీవ‌న్‌రెడ్డి Intense interest |

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:22 pm

15 రోజుల్లోనే వెలిదండ రహదారి పనులు పూర్తి

15 రోజుల్లోనే వెలిదండ రహదారి పనులు పూర్తి సూర్యాపేట జిల్లా​గరిడేపల్లి,ఆంధ్రప్రభ : ప్రజా

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:16 pm

గిట్టుబాటు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు…

గిట్టుబాటు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు… ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:15 pm

Vaala 2 Trailer: Highly Relatable and Youthful

Producer Sahu Garapati, who originally produced the film Vaazha 2, the Malayalam Super Blockbuster under his Shine Screens banner, is now bringing it to the Telugu states, as Vaala 2. Natural Star Nani, known for always encouraging new talent, has officially released the Telugu trailer of Vaala 2 today. After achieving massive blockbuster status with […] The post Vaala 2 Trailer: Highly Relatable and Youthful appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 4:13 pm

TG |జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలిక..

TG | జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలిక.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

ప్రభ న్యూస్ 20 Apr 2026 4:13 pm

Chiranjeevi Glimpse: Emotional Journey of a Young Man with Dextrocardia

The upcoming film “Chiranjeevi” glimpse launched today. The launch has created interest around this emotionally driven project. The makers, confident in their film’s unique concept, unveiled the glimpse at a grand event. Chiranjeevi glimpse introduces Chiru, played by Kiku Yamanala, and focuses on his rare condition, dextrocardia. The film is designed as an inspiring tale […] The post Chiranjeevi Glimpse: Emotional Journey of a Young Man with Dextrocardia appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 3:41 pm

CBN Slams DMK-Congress, Highlights Women’s Reservation and Growth Agenda

Chandrababu Naidu intensified his campaign in Tamil Nadu with a direct attack on the alliance between the Dravida Munnetra Kazhagam and Indian National Congress. He questioned the ideological shift of the DMK, pointing out that the party was originally founded in opposition to Congress, yet now works closely with the same party. Addressing public meetings […] The post CBN Slams DMK-Congress, Highlights Women’s Reservation and Growth Agenda appeared first on Telugu360 .

తెలుగు 360 20 Apr 2026 3:27 pm

State Minister |హరీష్ రావుకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

State Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీష్

ప్రభ న్యూస్ 20 Apr 2026 3:24 pm

పోలీసుల అదుపులో నిందితుడి మృతి

సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేటలో వృద్ధురాలు ఇరుగు పాపమ్మ హత్య, చోరీ కేసులో

ప్రభ న్యూస్ 20 Apr 2026 3:18 pm

దక్షిణ కొరియాతో బంధాలు మరింత బలోపేతానికి చర్యలు: మోడీ

న్యూఢిల్లీ: భారత్-దక్షిణ కొరియా మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ పాల్గొన్నారు. మోడీ, లీ జే మ్యూంగ్ సమక్షంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్, చోహ్యూన్‌లు ఎంవొయులు మార్చుకున్నారు. ఆ తర్వాత లీ జే మ్యూంగ్‌తో కలిసి ప్రధాని మోడీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చిప్స్ నుంచి షిప్స్, ట్యాలెంట్ నుంచి టెక్నాలజీ వరకు, ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎనర్జీ వరకు దక్షిణ కొరియాతో భాగస్వామ్యం ఉంటుందని మోడీ అన్నారు. దక్షిణ కొరియాతో బంధాలు మరింత బలోపేతానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రపంచ సంక్షోభ పరిస్థితుల వేళ ఇరు దేశాలు శాంతి, స్థిరత్వ సందేశం ఇస్తున్నాయని తెలిపారు. భారత్-కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లకు చేరిందని.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చేందకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక ప్రవాహాల కోసం ఫైనాన్షియల్ ఫోరం ప్రారంభించామని మోడీ తెలిపారు. వ్యాపాచర సహకారానికి ఊతం ఇచ్చేందుకు పారిశ్రామిక సహకార కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 

మన తెలంగాణ 20 Apr 2026 3:10 pm