Hyderabad : నీటి ట్యాంకర్ల కోసం నగరవాసుల కష్టాలు
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.
GAS |హోటళ్లు, రెస్టారెంట్లు బంద్
GAS | హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ GAS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Video: Exclusive Interview For Anantha Sriram
The post Video: Exclusive Interview For Anantha Sriram appeared first on Telugu360 .
–పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై చర్చలు మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై ఇరువురి అగ్రనేతలు చర్చలు జరిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల గురించి ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం […] The post పుతిన్కు ట్రంప్ ఫోన్ కాల్ appeared first on Visalaandhra .
చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్
మండలంలో జోరందుకున్న ప్రచారం… చెన్నారావుపేట, మార్చి 10( జనం సాక్షి): చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నట్లు …
అలా మాట్లాడితే ఎలా విజయ్: టివికె నాయకురాలు
హైదరాబాద్: రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట సమాజంలోనికి వెళ్తోందని టివికె అధ్యక్షుడు విజయ్ ఉద్దేశించి ఆ పార్టీ నాయకురాలు రంజనా నాచ్చియర్ విమర్శించారు. మహిళల గౌరవాన్ని కాపాడే పదాలు విజయ్ నోటి వెంట రాకపోతే రాజకీయం ఎందుకుని అడిగారు. భార్యకు విజయ్ విడాకుల కోరడంతో పరోక్షంగా ఆయనపై ఘాటుగా స్పందించారు. మహళా దినోత్సవం సందర్భంగా అది వర్త్ కాదు అని వర్త్ కానది అయితే 'మీ వైవాహిక జీవితం ఇదేనా?' అని చురకలంటించారు. ఓ నటిని వెంట పెట్టుకొని తిరిగితే యువతకు ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. భార్యను ఇంట్లోకి రానివ్వకుండా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎలా చెబుతారని రంజనా ఎద్దేవా చేశారు. ప్రతి బిడ్డకు మేనమామలాగా సారె ఇస్తానని చెబుతున్నారు కానీ కన్న కొడుకులు కూడా తండ్రికి ముఖ్యమే అనే విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. తమిళానాడు యువతకు ఎలా ఆదర్శం అవుతారని రంజనా ప్రశ్నించారు.
అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ అత్యుత్తమ ప్రతిభ… హర్షం వ్యక్తం చేసిన తిమ్మరాయిని …
Andhra Pradesh :ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అమరావతి, తిరుపతి వాసులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో సత్య ఫన్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. మత్తు వలదరా వెనుక ఉన్న మెయిన్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. రితేష్ రాణా స్టైల్, హాస్యంతో పాటు హై-ఎనర్జీ యాక్షన్ మేళవించిన జెట్లీ ఫన్- ప్యాక్డ్ అనుభూతిని అందించబోతుంది.
రేషన్ బియ్యం పట్టివేత.. ఎన్ని క్వింటాళ్లు అంటే..
రేషన్ బియ్యం పట్టివేత.. ఎన్ని క్వింటాళ్లు అంటే.. గంపలగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని
Fact Check: Did a General Accused of Betraying Khamenei Suicide on Live Television?
Viral video claiming a general who betrayed Khamenei shot himself on live TV is false. The clip is from 2024 and unrelated to Iran’s current conflict.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం (7.3.2026) డార్జిలింగ్లో అంతర్జాతీయ సంతాల్ గిరిజన సదస్సులో పాల్గొన్నప్పుడు సరిగ్గా ప్రోటోకాల్ పాటించలేదనీ, అంతేకాదు చివరి నిమిషంలో వేదిక కూడా మార్చారనీ ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమం విషయంలో రాష్ట్రప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదనీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్లో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన ‘ఘోర అవమానం’గా రాజకీయ దుమారం రేపుతోంది. బిజెపి వర్గాలనుంచి విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఆరోజున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమగ్ర ఓటర్ల సవరణ లోపాలపైన, ఎల్పిజి గ్యాస్ ధర పెరగడంపైన ధర్నా నిర్వహిస్తున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు గవర్నర్ గానీ లేదా రాష్ట్రం లోని సీనియర్ మంత్రులు ఎవరైనా ప్రోటోకాల్ పాటించి విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలకాల్సి ఉంది. అయితే రాష్ట్ర గవర్నర్ ఆనంద్ రాజీనామా చేశారు. సిలుగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఇవన్నీ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గత 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని నిరంతరాయంగా పరిపాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నుంచి దించేయాలని కంకణం కట్టుకున్న బిజెపి అధినేతలకు ఈ వివాదం ప్రచారాస్త్రంగా చేతికి అందివచ్చినట్టయింది. అందుకనే ప్రధాని మోడీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఇప్పటినుంచే శాపాలు పెట్టడం ప్రారంభించారు. గిరిజన సమాజం నుంచి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జరిగిన అవమానం గిరిజన ప్రపంచానికే అవమానమని, అంతేకాక రాజ్యాంగానికి, స్ఫూర్తికి తీరని అవమానమని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఎవరైతే అధికారంలో అహంకార మత్తులో ఉంటారో వారికి వినాశనం తప్పదని శాపం పెట్టారు. దీనికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగా స్పందించారు. గిరిజన నాయకురాలైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును గౌరవించని వ్యక్తి మీరు తప్ప తాము కాదని తిప్పికొట్టారు. అంతేకాదు బిజెపి కాకలు తీరిన వయోవృద్ధనేత ఎల్కె అద్వానీకి భారత రత్న బిరుదు ప్రదానం సందర్భంగా జ్ఞాపికను అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేసినప్పటి ఫోటోను టాగ్ చేసి చూపించారు. అందులో అద్వానీ, మోడీ కూర్చుండగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాత్రం నిల్చుని ఉండడం గమనార్హం. ఇది రాష్ట్రపతిని అవమానించడం కాదా? అని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. అసలు సంతాల్ గిరిజన సదస్సుకు సరైన ఏర్పాట్లు జరగలేదన్నది వాస్తవం. అధికారులు ముందుగానే సదస్సు ఏర్పాట్లు ఎంతవరకు నిర్వాహకులు చేస్తున్నారో పరిశీలించారు. కానీ సదస్సు ఇంకా రెండు రోజుల్లో జరగవలసి ఉన్నా నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులకు వివరించారు. సన్నాహాలు వెంటనే ప్రారంభించాలని నిర్వాహకులను హెచ్చరించాలని సూచించారు. ఇది చివరకు రాష్ట్రపతి సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్ ప్రోటోకాల్, టూర్ ఆఫీసర్ దృష్టికి కూడా వెళ్లింది. కానీ వారదేమీ పట్టించుకోకుండా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీ చేసిన ‘బ్లూబుక్స్’ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్, భద్రత, ఏర్పాట్లు అన్నీ పక్కాగా నిర్వహించాల్సిన పూర్తి బాధ్యత పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెబుతున్నారు. అందువల్ల రాష్ట్రపతికి అవమానం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే అన్న ప్రచారాన్ని బిజెపి నాయకులు ముందుకు తీసుకెళ్లున్నారు. అయితే ఈ సంఘటనను బిజెపి నాయకుల సలహాపై రాజకీయ వివాదంగా మార్చవద్దని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్కు ఎక్కడా భంగం కాలేదని వివరించారు. సంతాల్ సదస్సును నిర్వహిస్తున్న ప్రైవేట్ యాజమాన్య నిర్వాహకులు సరిగ్గా నిర్వహించలేకపోవడమే కారణమని పేర్కొన్నారు.ఇందులో ఎయిర్పోర్టు అథారిటీ బాధ్యత కూడా ఉందని వారే వేదిక మార్చారని వివరించారు. మరి మణిపూర్ గిరిజనులపై గత కొన్నేళ్లుగా అత్యాచారాలు జరుగుతుండడంపై రాష్ట్రపతి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ అవమాన ఘట్టం ఎన్నికల ముందు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బిజెపి చూస్తోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అవమానం జరిగే సంఘటనలు గతం లో కూడా ప్రభుత్వప్రవర్తన వల్లనే జరిగాయి. 2023 మే 28న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకపోవడం, ప్రధాని నరేంద్ర మోడీయే ప్రారంభించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి ఆమె ప్రారంభించాలని కాంగ్రెస్ తదితర పక్షాలువాదించాయి. ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించడంతో ఇది రాష్ట్రపతికి, గిరిజన సామాజిక వర్గానికి, రాజ్యాంగానికి అవమానంగా కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అంతేకాదు ఈ చారిత్రక కార్యక్రమాన్ని కాంగ్రెస్తో సహా ఆప్, తృణమూల్, సమాజ్వాది తదితర 20 పార్టీలు బహిష్కరించాయి. అయితే అధికార పక్షం పాత పార్లమెంట్ భవన నిర్మాణ శంకుస్థాపన నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా జరగలేదని వాదించింది. 2024 జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకాకపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆమె ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ కావడం, వితంతు కావడం వల్లనే ఆహ్వానించలేదని కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ తదితరులు బాహాటంగా విమర్శించారు. అప్పుడు బిజెపి దీన్ని తమ తప్పు కాదని సమర్థించుకుంది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని వాదించాయి. ఇవన్నీ రాష్ట్రపతికి అవమానంగా అధికార వర్గం ఎందుకు పరిగణించడం లేదో చెప్పాల్సిందే.
సౌదీ అరేబియాలో ప్రవాస తెలుగు యువకుడు అరెస్ట్#SaudiArabia#PravasiTelugu#TeluguYouth#Arrest#Social
ఎమ్మెల్యే ఆదేశాలతో.. మొవ్వ, ఆంధ్రప్రభ : మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో కొన్ని
Dharmavani |విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే..
Dharmavani | విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. Dharmavani | దేవాదాయ శాఖ
దక్షిణాసియా ఓ శక్తివంతమైన కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావాన్ని చూస్తోం ది. జనరేషన్ జెన్ అనే యువతరంగం. విరామం లేని, డిజిటల్గా మమేకమై, అసహన తరం. స్మార్ట్ ఫోన్లు, సోషల్మీడియా, గ్లోబల్ కనెక్టివిటీ యుగంలో ఆవిర్భవించిన ఈ తరం దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన రాజకీయ స్తబ్దత, అవినీతి, వంశపారంపర్య అధికార వ్యవస్థలను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. నేపాల్లో ఈ మధ్య జరిగిన ఎన్నికలు ఈ తరం మార్పునకు ఓ అద్భుతమైన ఉదాహరణ. బాలేంద్ర షా విజయం, యువత నడిపే రాజకీయ ఉద్యమం విస్తరణ నేపాల్ సాంప్రదాయ రాజకీయ వ్యవస్థను కూల్చివేసింది. అదే సమయంలో, బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ప్రయోగం నిరసనలను రాజకీయ శక్తిగా మరల్చడంలో విఫలమైంది. నేపాల్కు విరుద్ధమైన కథ ఇది. ఈ కథనాలు పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. జనరేషన్ జెన్ భారతదేశంతో సహా దక్షిణాసియా అంతటా రాజకీయాలను పునర్నిర్మించగలదా. నేపాల్లో ఈ మధ్య జరిగిన ఎన్నికలు ఓ రాజకీయ భూకంపం వంటివే. దశాబ్దాలుగా నేపాల్ రాజకీయం సాంప్రదాయ పార్టీలు, అనుభవజ్ఞులైన నాయకుల ఆధిపత్యంలో సాగేవి. నేపాలీ కాంగ్రెస్ వర్గాలు, కె.పి.శర్మ ఓలి వంటి ప్రముఖుల నేతృత్వంలో కమ్యూనిస్ట్ గ్రూప్ల మధ్య రాజకీయ అధికారం ఊగిసలాడింది. 2008లో రాచరిక వ్యవస్థ రద్దయి గణతంత్ర రాజ్యాంగం ఆమోదం పొందినా, వ్యవస్థ మారలేదు. నేపాల్ లో రాజకీయ వ్యవస్థ ఒక ఉన్నత వర్గం నుంచి మరో ఉన్నత వర్గానికి బదలీ అయిందని చాలామంది నేపాలీ పౌరులు భావించారు. అవినీతి, కుంభకోణాలు, వర్గపోరు, దీర్ఘకాలిక అస్థిరత ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న యువ నేపాలీల నిరాశ నిసృ్పహలు తారస్థాయికి చేరాయి. నేపాల్లో జనరేషన్ జెన్ కొత్త తరహా రాజకీయాలను కోరింది- పారదర్శకంగా, జవాబుదారీగా, దేశపాలనను నియంత్రించిన పాలకులనుంచి విముక్తి పొందింది. ఇందుకు సోషల్ మీడియా ప్రధాన సాధనంగా మారింది. కార్యకర్తలు నిరసనలు నిర్వహణకు, సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి, రాజకీయ సంకేతాలను అనూహ్యమైన వేగంతో సమన్వయం చేయడంలో వీలు కల్పించింది. డిజిటల్ లాండ్ స్కేప్ నేపాలి యువతలో కొత్తరాజకీయ చైతన్యాన్ని సృష్టించడంలో కీలకం అయింది. పట్టణాలలోని కార్యకర్తలు, విద్యార్థులు, యువ నిపుణులను శక్తివంతమైన సమష్టి శక్తిగా ఏకంచేసింది. ఈ పరిణమాలనుంచి బాలేంద్ర షా అనే యువ తరంగం ఉద్భవించాడు. అందరూ బాలెన్ అని పిలిచే, రాపర్, ఇంజనీర్, ఆతర్వాత కాలంలో ఖాట్మండు మేయర్ అయిన బాలేంద్ర షా, సాంప్రదాయ రాజకీయ తరగతికి పూర్తి భిన్నంగా ప్రాతినిధ్యం వ్యవహరించాడు. యువకుడు, నిష్కపటంగా మాట్లాడేవాడు కావడం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అతడు నేపాల్ పట్టణ యువత ఆకాంక్షలను నేరుగా తీర్చాడు. అతడి ఆవిర్భావం దశాబ్దాలుగా నేపాల్పై ఆధిపత్యం సాగించిన పాత రాజకీయ సంసృ్కతి నీరుగారిపోయింది. బాలెన్ షా రాజకీయ విజయం యాదృచ్ఛికం కాదు. అతడి ప్రచారం యువత నిరసన శక్తిని సమర్థంగా ఉపయోగించుకుంది. దానిని ఒక వ్యవస్థీకృత ఎన్నికల ఉద్యమంగా మార్చింది. సోషల్ మీడియా కీలక పాత్ర, అట్టడుగు వర్గాల సమీకరణ, సుపరిపాలన, అవినీతి నిరోధక సంస్కరణలతో కేంద్రీకృతమైన సందేశంతో బాలేంద్ర షా, అతని మిత్రులు నేపాల్లో రాజకీయ పార్టీలకు దీటైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో విజయం సాధించారు. నేపాల్ ఎన్నికల ఫలితాలు సాంప్రదాయ రాజకీయ ఉన్నత వర్గాలపట్ల ప్రజల సంతృప్తిని ఎత్తిచూపాయి. దశాబ్దాలలో మొదటిసారిగా, నేపాల్ ప్రధాన పార్టీల దీర్ఘకాలిక ఆధిపత్యం, యువత క్రియాశీలతతో తలెత్తిన కొత్త రాజకీయశక్తినుంచి తీవ్రమైన సవాలు ఎదుర్కొంది. షా విజయం ఒకప్పుడు నిరసనల ద్వారా తమ కోపాన్ని వ్యక్తం చేసిన తరం ఇప్పుడు అధికార రాజకీయ రంగంలో అడుగు పెట్టడాన్ని సూచిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్లో యువరాజకీయాలు భిన్నమైన పంథాను అనుసరించాయి. బంగ్లాదేశ్లో కూడా యువత, విద్యార్థుల తీవ్రమైన ప్రతిఘటనలు ఎదుర్కొన్నా, గతంలో ప్రభుత్వాన్ని తొలగించిన రాజకీయ సంక్షోభానికి దోహదపడింది. ప్రజాస్వామ్య సంస్కరణలు, జవాబుదారీ తనం, సమగ్ర రాజకీయ వ్యవస్థను డిమాండ్ చేస్తూ యువ నిరసనకారులు వీధులకు ఎక్కారు. ఒక దశలో బంగ్లాదేశ్ వాసులు కూడా నేపాల్ మాదిరిగానే తరాల రాజకీయ మార్పునకు శ్రీకారం చుడతారని అన్పించింది. కానీ, బంగ్లా విద్యార్థులు, కార్యకర్తలు తమ ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా తీర్చే యత్నం చేశారు. కానీ ఎదురైన సవాళ్లు బలీయంగా అన్పించాయి. పటిష్టమైన నాయకత్వ నిర్మాణం, దేశవ్యాప్తంగా రాజకీయ నెట్వర్క్ లేకపోవడం వల్ల విద్యార్థి ఉద్యమం ఎన్నికల విజయానికి అవసరమైన సంస్థాగత రూపాన్ని నిర్మించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. బిఎన్పి పునరాగమనం, ప్రభుత్వ మార్పును సూచిస్తున్నా, యువత ఆశించిన పరివర్తనను అది పాదుకొల్పలేదు. బంగ్లాదేశ్ అనుభవం నిరసన ఉద్యమాలను స్థిరమైన రాజకీయ సంస్థలను మార్చడంలో ఎదురయ్యే ఇబ్బందులను చెప్పక చెబుతోంది. నేపాల్, బంగ్లాదేశ్లలో ఎదురైన విభిన్నమైన ఫలితాలు, యువత రాజకీయాల గురించి ఓ ప్రాథమిక సత్యాన్ని వివరిస్తాయి. సామూహిక నిరసనలు, రాజకీయ వ్యవస్థలను సవాల్ చేయగలవు కానీ, మార్చలేవు. విశ్వసనీయమైన నాయకత్వం, స్పష్టమైన దృక్పథం, ఎజెండాతో నిసనలు రాజకీయ ఉద్యమాలుగా పరిణామం చెందకపోతే, ఉన్న వ్యవస్థ స్థానే కొత్త వ్యవస్థను నిర్మించలేవు. నేపాల్లోని జనరేషన్ జెడ్ తిరుగుబాటు యువతశక్తిని ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశపెట్టగల నాయకుడిని తయారు చేయడం వల్లే విజయవంతం అయ్యాయి. ఇందుకు విరుద్ధంగా, బంగ్లాదేశ్ ఉద్యమం ఆ కీలక అంశాన్ని గ్రహించనందువల్ల కుంటుపడింది. భారతదేశం పరిస్థితికి వస్తే, ఈ పరిణామాలు అనివార్యంగా పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభాగలదేశం. భారతదేశ జనరేషన్ జెడ్ అపారమైన శక్తిని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువ భారతీయులు రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నారు. డిజిటల్ కనెక్టివిటీ, ప్రపంచ అవగాహనపై కొత్త అంచనాలను కల్పిస్తున్నారు. భారతదేశం గతంలో యువత నేతృత్వంలో శక్తివంతమైన ఉద్యమాలు సాగాయి. 2011 అవినీతి వ్యతిరేక నిరసనలు పట్టణ ప్రాంతాలలో యువతను ఏకం చేశాయి. చివరికి కొత్త రాజకీయ నటుల ఆవిర్భావానికి దోహద పడ్డాయి. యూనివర్శిటీలలో విద్యార్థుల నిరసనలు పదేపదే ప్రభుత్వ విధానాలను సవాల్ చేశాయి. యువ పౌరులలో పెరుగుతున్న రాజకీయ ఆసక్తిని హైలైట్ చేశాయి. అయినా, భారతదేశ రాజకీయ వ్యవస్థ, నేపాల్ కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అతి పెద్ద దేశం, ఎన్నో రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లోతైన సంస్థాగత నెట్ వర్క్, ఆర్థిక వనరులు కలిగి ఉంటాయి. అవి కొత్త ఉద్యమాలను కష్టతరం చేస్తాయి. భారతదేశంలో ఎన్నికల రాజకీయాలకు విస్తృత స్థాయిలో అట్టడుగు స్థాయినుంచి సమీకరణ, సంస్థాగతంగా సంకీర్ణపరమైన నిర్మాణం అవసరం. ఇంకా కులం, మతం, భాష, ప్రాంతీయ గుర్తింపులతో కూడిన విస్తృతమైన సామాజిక వైవిధ్యం, తరచు రాజకీయ సమీకరణలను విచ్ఛిన్నం చేస్తుంది. యువత క్రియాశీలత జాతీయ దృష్టిని ఆకర్షించినా, ఆ శక్తి ఏకీకృత రాజకీయ ఉద్యమంగా మార్చడం సవాల్గా మిగిలిపోతుంది. అయినా, భారతదేశంలో జనరేషన్ - జెడ్ రాజకీయ తరంగాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లు నిర్మాణాత్మక ఎన్నికల కూటమిగా మారుతున్నారు. రాజకీయ పార్టీలు, తమ అజెండాలు, నాయకత్వాలను నిర్మించడంలో యువ ఓటర్ల డిమాండ్లను ప్రతిబింబించేలా మార్చుకోవచ్చు. డిజిటల్ సమీకరణతో అట్టడుకు స్థాయి యువత ఆధారిత ఉద్యమం ఉద్భవిస్తే, భారతదేశ రాజకీయ దృశ్యం సమర్థవంతంగా పునర్మాణం కాదలదు. ఈశాన్య భారతంలో అటువంటి మార్పునకు వీలు కల్పిస్తున్నది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో సిలిగురి కారిడార్ ద్వారా అనుసంధానమై ఉన్నాయి. ఈ ప్రాంతానికి అటు నేపాల్, ఇటు బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ పొరుగు దేశాలలో రాజకీయ పరిణామాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా మారాయి. నేపాల్ రాజకీయ కొత్త నాయకత్వంలో మార్పు, సరిహద్దు ఆర్థిక సహకారాన్ని ప్రభావితం చేయవచ్చు. యువ నాయకత్వంలో సంస్కరణలతో కూడిన ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వగలదు. ఈ విధానాలు నేపాల్, బంగ్లాదేశ్, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయగలవు. బంగ్లాదేశ్ రాజకీయ పథం అంతే కీలకమైనది. భారదేశ ప్రధాన భూ భాగాన్ని ఈశాన్య ప్రాంతాలతో కలిపే కనెక్టివిటీ ప్రాజెక్టులకు ఈ దేశం ప్రధాన రవాణా మార్గంగా పని చేస్తుంది. బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వం నెలకొంటే ఈ ప్రాంత ఆర్థిక భవిష్యత్ను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. నేపాల్లో, దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో యువత నేతృత్వంలో రాజకీయ ఉద్యమాలు ఊపందుకుంటే, ఈ ప్రాంతం అంతటా రాజకీయ చర్చను ప్రభావితం చేయవచ్చు. నేపాల్, బంగ్లాదేశ్ నుంచి అందిన పాఠాలు భారతదేశానికి ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని యువజనాభా ప్రజాస్వామ్య రాజకీయ ఉద్యమాలను పునర్నిర్మించే సామర్థ్యం కలిగి ఉంది. ఆ సామర్థ్యాన్ని నిజమైన రాజకీయశక్తిగా మార్చే నాయకత్వం, సంస్థ, సంస్థాగత ఆవిష్కరణలు అవసరం. - గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
Ritu Varm’s First Look In Gopichand33: Magnetic
Macho Star T Gopichand joins forces with Sankalp Reddy for the ambitious historical action drama #Gopichand33, backed by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen and presented by Pavan Kumar. Marking the birthday of Ritu Varma, the team released her magnetic first-look poster, and it instantly commands attention. Stepping into the skin of Sathyavati, Ritu is […] The post Ritu Varm’s First Look In Gopichand33: Magnetic appeared first on Telugu360 .
తెలంగాణలో సిపిఎం అగ్రనాయకుడు తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటి అభిశంసనకు గురిచేయడం ఆ పార్టీని కుదిపేసింది. తెలంగాణలో సిపిఎం అంటేనే తమ్మినేని, తమ్మినేని అంటేనే సిపిఎం అనే స్థాయికి తీసుకొచ్చిన ఒక మాజీ ఎంపి, మాజీ ఎంఎల్ఎ, పదేళ్ళపాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర కమిటి సభ్యుడిగా వ్యవహరిస్తునే తమ్మినేనిపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్రం విడిపోయిన తరువాత టి-సిపిఎం పార్టీ -అంటే ‘తెలంగాణ’ సిపిఎం పార్టీగా కాకుండా టి-అంటే ‘తమ్మినేని’ సిపిఎం పార్టీగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. తెలంగాణలో ఒకనాడు పార్టీ బలంగా ఉందంటే ఆయనే కారణం. ఇప్పుడు బలహీనంగా మారిదంటే అందరి వేళ్లూ ఆయన వైపువెళ్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలో పార్టీ లైన్ తప్పితే ఎంతటి అగ్రనాయకులపైన చర్యలు తీసుకుంటారనేది గతంలో జరిగిన అనేక సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి. లోక్సభ స్పీకర్గా పనిచేసిన చేసిన సోమనాథ్ ఛటర్జీ నుంచి త్రిపుర ముఖ్యమంత్రి, అప్పటి పొలిట్ బ్యూరో సభ్యుడు నృపేన్ చక్రవర్తి తెలుగు రాష్ట్రాల్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్దికాయల ఓంకార్ లాంటి సీనియర్ నాయకులపైనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో అంటే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని ఉన్న సమయంలో ఆయన అనుసరించిన ఒంటేద్దు పొకడలు, గ్రూపుయిజం, క్యాస్టిజయం వంటి అభియోగాలపై కేంద్ర కమిటి అభిశంసన విధించినప్పటికీ 2004లో ఆయన ఎంఎల్ఎగా ఉన్నప్పుడు, అంతకుముందు ఏడాదిపాటు ఎంపిగా పనిచేసినప్పుడు వ్యవహరించిన తీరు. వచ్చిన అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలు, పంచాయతీల సెటిల్ మెంట్లు, భూకబ్జాలు, నియంతగా మారి ప్రశ్నించినవారిని అణగదొక్కడం, నిజాయితీపరులను పార్టీనుంచి బైటికి పంపించడం, నిర్మాణ రాహిత్యం, అనైతిక చర్యలు, తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని దుర్వినియోగం వంటి అనేక అభియోగాలు వచ్చిన 2008లోనే ఆ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర, రాష్ట్ర కమిటీలకు అనేక లేఖలు రాసినా అవి బుట్టదాఖలయ్యాయి. ఆనాడే కేంద్ర కమిటీ మేల్కొని ఉంటే పరిస్థితి చేయి దాటి ఈ స్థితికి వచ్చేది కాదనే వాదన విన్పిస్తుంది. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ బాల్యదశనుంచే పార్టీలో పనిచేసిన అనతికాలంలోనే అగ్రనాయకుడిగా ఎదిగిన మంచి వక్తగా, వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి ఆనాడు కేంద్ర కమిటి నాయకులు, పొలీట్ బ్యూరో సభ్యులు అమోద ముద్రవేసినవే. ఆనాడు అంగీకారం తెలిపిన నేతలే ఇప్పుడు తప్పుపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసం అనే వాదన ఆ పార్టీలో విన్పిస్తున్నది. తెలంగాణ పార్టీలో ఏర్పడ్డ అనారోగ్యకర పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ముగ్గురు పొలిట్ బ్యూరో సభ్యులను కేంద్ర పార్టీ నిర్ణయించింది. ఈ ముగ్గురిలో ఒక్కరు ఆనాడు తమ్మినేని తప్పిదాలపై పార్టీ సీనియర్, ముఖ్య నాయకులు లేఖలు రాస్తే పట్టించుకోలేదు. కాని మారిన సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పార్టీ తీరు, తమ్మినేని పాత్ర బాగా లేదని సదరు నాయకుడు పెద్ద మనిషిగా కేంద్ర కమిటీకి నివేదిక ఇచ్చి తీర్పు చెప్పడం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యాన్ని గురిచేసింది. రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని ఒంటెద్దు పోకడలు పోలేదు. ఈ నిర్ణయం తీసుకున్నా, ఏ వ్యూహ రచన చేసినా దానికి ఆనాడు తెలంగాణ బాధ్యతలను చూసే కేంద్ర కమిటీ సభ్యుల, కేంద్ర కమిటీ ఆమోదం ఉందనే విషయం జగద్వితమే. ఆనాడు ఆమోదించినవారే ఇప్పుడు ‘పెద్దరాయుడి’గా మారి తీర్పుచెప్పడం -శిక్షలు వేయడంపై ఆ పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. తెలంగాణలో పార్టీని విస్తరించడానికి, ప్రజాపోరాటాలను నిర్వహిస్తూ, తద్వారా పార్టీని బలోపేతం చేయడలో తమ్మినేని క్రియాశీలకంగా పనిచేశారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రధానంగా కమ్యూనిస్టు జిల్లా గా పేరుగాంచిన ఖమ్మం జిల్లాలో పార్టీని అగ్రపథంలో నిలబెట్టడానికి తమ్మినేని చేసిన కృషి అనితర సాధ్యమైనది. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల కోసం భూస్వాములను ఎదిరించి నిర్వహించిన కూలి పోరాటాలవల్ల ఆ పార్టీకి నష్టం జరుగుతుందని, భూస్వాములకు వ్యతిరేకంగా ఆయన సాగించిన ఉత్తరాల ఉద్యమంవల్ల పార్టీ ఓడిపోతుందని తెలిసి కూడా, పార్లమెంటు సీటును సైతం తృణప్రాయంగా పెట్టిన విషయం తెలియనది కాదు. సమాజ గమనాన్ని, పాలక వర్గాల వైఖరులను సరిగ్గా అంచనావేసి తదనుగుణంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా సృజనాత్మకమైన పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేయడంలో తమ్మినేని దిట్టగా పేరుంది. వ్యక్తిగత విమర్శలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీని ప్రజల్లో బలంగా నిలబెట్టేందుకు ఆయన పడిన శ్రమ అంతఇంతకాదు. తమ్మినేని ఏ కార్యక్రమం చేసినా, అందులో పార్టీ ప్రయోజనం ఇమిడి ఉంటుంది. అంతేగాక ప్రతిదీ కేంద్ర కమిటికి చెప్పే ముందుడుగు వేసేవారు. ఆనాడు తమ్మినేని మాటకు కూడా కేంద్ర కమిటీ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దుమ్ముగూడెం ప్రాజెక్టుకోసం ‘మహాప్రస్థ్దానం’ పేరుతో దుమ్ముగూడెం నుంచి ఖమ్మం వరకు వంద రోజులపాటు 2,792 కి.మీ. వరకు సుదీర్ఘంగా నిర్వహించిన పాదయాత్ర అప్పట్లో సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో తీసుకున్న పొత్తుల నిర్ణయాలు, బహుజన లెప్ట్ ఫ్రంట్(బిఎల్ఎఫ్) ఏర్పాటు వంటివి రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని ఒక్కరే నిర్ణయం తీసుకున్నవి కావు. ఆనాటి కేంద్ర కమిటి అమోదంతోనే అమలు చేసినవే. అయితే అవి విఫలప్రయోగం అయితే తప్పు ఒక్కరిపైనే నెపం నెట్టడం సరైంది కాదనే వాదన విన్పిస్తుంది. శిబిరంలో చోటుచేసుకున్న అన్నిరకాల అవాంఛనీయ సంఘటనలపై ఛార్జిషీట్ పెట్టగా ఆనాడు ‘తన తప్పు జరిగిందని భవిష్యత్తులో మరోసారి తప్పు చేయనని సరిదిద్దుకుంటానని’ తమ్మినేని స్టేట్మెంట్ ఇచ్చారు. గడిచిన కొద్దికాలంగా తమ్మినేనిలో మార్పుకోసం పదేపదే పొలిట్ బ్యూరో కమిటీ సభ్యులు తమ ప్రయత్నాలు చేసినప్పటికీ పెడధోరణులు పెరిగి, బహిరంగంగా అస్తిత్వవాద ప్రచారపు రూపుదాల్చిందని ఉద్దేశంతో చివరికి అభిశంసన అస్త్రాన్ని ఆ పార్టీ ప్రయోగించక తప్పలేదని తెలుస్తోంది. వయోభారం మీదపడి, 72 ఏళ్ల వయస్సులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కేంద్ర పార్టీ తీసుకున్న చర్య సరైంది కాదని ఆయన వ్యతిరేకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తప్పులుచేస్తే సరిచేసుకోవాలని సుతిమెత్తగా అంతర్గతం హెచ్చరించించవచ్చు. కాని దానిని బహిర్గతం చేయడాన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. పార్టీకి ఎదో చేయాలనే తపనలో కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. కాని కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని బలంగా అనుసరించే ఈ పార్టీలో ఎంతటి పెద్ద నాయకుడైన క్రమశిక్షణ కట్టుతప్పితే శిక్షతప్పదనే హెచ్చరికను మరోసారి పైనుంచి క్రింది స్థాయి పార్టీ శ్రేణులకు చేరవేసేందుకే ‘అభిశంసన’ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. - వనం వెంకటేశ్వర్లు (ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)
మంగళవారం రాశి ఫలాలు (10-03-2026)
మేషం స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృషభం ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మిధునం సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంభందిత వ్యవహారాలు కలసివస్తాయి. అన్ని రంగాలవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. కర్కాటకం బంధు మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు సమస్యలుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. సింహం ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలసివస్తాయి. వస్త్ర,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు. కన్య నిరుద్యోగులకు శుభవార్తలుఅందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాల వలన సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు అధికారుల సహాయంతో సర్దుమణుగుతాయి. తుల ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా పెట్టుబడులు లాభించవు. వృత్తి, ఉద్యోగాలలో చేసే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్య సూచనలున్నవి. వృశ్చికం ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలలో వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతోంది. ధనస్సు వృధా, ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. విద్యారంగం వారి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో మరింత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు నత్తనడక సాగుతాయి. మకరం వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఋణాలు తీర్చగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు.ధనదాయం బాగుంటుంది. కుంభం సంతాన పరంగా చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. పనులలో జాప్యం కలిగినా సమయానికి పూర్తిచేస్తారు. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది. మీనం అన్ని రంగాలవారికీ సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చెయ్యడం మంచిది. బంధు వర్గం నుండి శుభవార్తలు ఊరటను ఇస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు. వృత్తి , ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.
బెంగళూరు వెళ్లే వారికి నేడు అలెర్ట్
ఈరోజు బెంగళూరులో హోటళ్లు బంద్ ను పాటిస్తున్నారు
ఇంద్రకీలాద్రి పై ఉగాది ఉత్సవాలు..
ఇంద్రకీలాద్రి పై ఉగాది ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై
Ration Cards : రేషన్కార్డులు ఉన్నవారిపై భారం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులున్న వారిపై భారం మోపింది
ఆయుధ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానం#IndiaDefense#ArmsImports#GlobalDefense
Summer Effect : ఉక్కపోత.. వేడిగాలులు.. ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
Road Accident : నల్గొండ జిల్లాలో లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
నల్గొండ జిల్లాలో లో ఘోర ప్రమాదం జరిగింది.
దళిత ఎమ్మెల్యే కొలికపూడి పై దాడి దారుణం..
దళిత ఎమ్మెల్యే కొలికపూడి పై దాడి దారుణం.. తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు
గ్రేటర్ హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత…#HyderabadGas#CommercialGas#GasCylinder#Hotel
డ్రైవర్ల మధ్య ఘర్షణ... లారీ ఢీకొని ఇద్దరు మృతి
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో నార్కట్ పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు ఘర్షణ పడుతుండగా లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. లారీని ఓవర్ టేక్ చేస్తూ తాకుతూ ట్రావెల్స్ బస్సు ముందుకెళ్లింది. లారీ డ్రైవర్ ఆగ్రహంతో లారీ, ట్రావెల్స్ బస్సును రహదారి పక్కన ఆపి డ్రైవర్లు ఘర్షణ పడ్డారు. లారీ వెనకాల ఉండి ఘర్షణ పడుతుండగా ఇంతలో వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. రెండు లారీల మధ్యలో ఇరుక్కుపోయి ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శ్రీనివాస్, బంగారయ్యగా పోలీసులు గుర్తించారు.
ఈరోజు రాశిఫలాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకంటున్నారా?
ఈరోజు వివిధ రాశిఫలాలకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి
వైభవంగా ఎల్లమ్మ బోనాలు.. వెల్గటూర్, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల
విశాల్, సుందర్.సి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలిచా యి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే క్రమం లో ఈ ఇద్దరూ కలిసి ‘మొగుడు’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. డా. ఎ.సి. షణ్ముఖం ఆశీస్సులతో అవని సినిమాస్ ప్రై.లి., బెంజ్ మీడియా ప్రై.లి. బ్యానర్లపై ఈ మూవీని అరుణ్ కుమా ర్, ఖుష్బూ సుందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.‘మొగుడు’ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రోమోను ఇదివరకే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సాధారణ మొగుడిలా ఇం ట్లో అన్ని పనులు చేస్తూనే.. అండర్ కవర్ పోలీస్లా రౌడీలను చితక్కొట్టేశాడు విశాల్. ఈ మూవీని ఫుల్ మాస్ కమర్షియల్ యాంగిల్లో సుందర్. సి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా టైటిల్ ప్రోమోతో చెప్పకనే చెప్పేశారు. ఇక సుందర్. సి చిత్రాలకు మాస్ ఆడియెన్స్లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ‘మొగుడు’ మూవీని కూడా వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ‘మొగుడు’ టీం ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఇక నెక్ట్ట్స్ షెడ్యూల్ను కోల్కత్తా, గోవా, చెన్నైలో ప్లాన్ చేశారు. ఈ మూవీకి సంగీతాన్ని హిప్హాప్ తమిళ అందిస్తున్నారు.
BRS: గండిపేట గోల్కొండ రిసార్ట్స్లో బీఆర్ఎస్ వర్క్షాప్
బీఆర్ఎస్ వర్క్ షాప్ నేడు జరగనుంది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలోనే సరైన
Loksabha : నేడు స్పీకర్ పై అవిశ్వాసం చర్చ
నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి
క్రాంతినగర్ సమస్యలు పరిష్కరం కోసం..
క్రాంతినగర్ సమస్యలు పరిష్కరం కోసం.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
Did Aamir Khan’s Plan work for Sitaare Zameen Par?
Bollywood Mr Perfect Aamir Khan has been debating against the early OTT window and he made sensational comments that the early digital premieres are killing the theatrical footfalls. Not restricting himself to words, he did not sell the digital rights of Sitaare Zameen Par to any digital platform. After the theatrical run of the film […] The post Did Aamir Khan’s Plan work for Sitaare Zameen Par? appeared first on Telugu360 .
Gold Prices Today : బంగారం ఇప్పుడు కొనడం మంచిదేనా? వేచి చూడటమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండిధరలు స్వల్పంగా తగ్గాయి.
భక్తి శ్రద్ధలతో రామలింగేశ్వర స్వామి అగ్ని గుండాలు...
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారి అగ్ని గుండాలు నిర్వహించారు. స్వామి అమ్మ వార్లను శేష వాహనం పై ప్రతిష్టించి పట్టణంలో ని విధుల్లో ఊరేగింపు నిర్మావహించి భక్తులు అగ్ని గుండాల గుండా నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ఆవరణలో గెలుపు నిర్వహించారు.. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన యలగందుల సుజన వేణుధర్ మోత్కూరు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం (ఎన్ఆర్ఐ) యలగందుల సుజన వేణుధర్ దంపతుల సౌజన్యంతో ఆలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుండుగోని రామచంద్రు గౌడ్ సభ్యులు అరవింద రాయుడు బయ్యని రాజు గుండు శీను భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ಭಾರತದಲ್ಲಿ ಪೋರ್ಟಬಲ್ ಜನರೇಟರ್ ಬಳಸಿ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಕಾರನ್ನು ಚಾರ್ಜ್ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ధురంధర్ సినిమా బాగుంది: ఫిన్లాండ్ అధ్యక్షుడు
హైదరాబాద్: దురంధర్ 2: ది రివెంజ్ సినిమా ట్రైలర్ మార్చి 7న విడుదలైంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ అనే హీరో జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో అద్భుతంగా నటించాడు. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భారత్లో కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్-ఫిన్లాండ్ మధ్య దౌత్య సంబంధాలు రక్షణ ఒప్పందాలుపై చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి అందరూ అనుకుంటారు కానీ అలెగ్జాండర్ మాత్రం ధురంధర్ సినిమాపై మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ధురంధర్2 సినిమా వీక్షించడానికి చాలా ఉత్సహంతో ఉన్నానని చెప్పాడు. ఇండియాకు రాకముందు తన కుమారుడు ధురంధర్ సినిమా చూడాలని కోరడంతో సినిమాను వీక్షించాని తెలియజేశాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. మార్చి 19న ధురంధర్ 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చూస్తానని చెప్పారు.
Buzz: SRK’s surprise as a Cop with Rajinikanth
It is known that Bollywood Superstar Shah Rukh Khan has been finalized to play an extended cameo in Rajinikanth’s upcoming film Jailer 2 which is in the final stages of shoot. SRK will join the sets of the film this month and he will be seen essaying the role of a cop. Rajinikanth plays the […] The post Buzz: SRK’s surprise as a Cop with Rajinikanth appeared first on Telugu360 .
డాక్టర్ దీపిక మృతి కేసులో వీడిన మిస్టరీ
విజయవాడ డాక్టర్ దీపిక మృతి కేసులో మిస్టరీ వీడింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు
అసత్య ప్రచారాలను నమ్మవద్దు భక్తులకు టిటిడి విజ్ఞప్తి తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని టిటిడి స్పష్టం చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని అసత్య ప్రచారం చేయడం సరికాదని టిటిడి హెచ్చరించింది శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోందని, ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతున్నందున ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా తాము ముందస్తు చర్యలు తీసుకున్నామని టిటిడి ప్రకటించింది. ఈ క్రమంలో ఇందాపూర్ డైరీ నుండి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని టిటిడి స్పష్టం చేసింది. మిగిలిన రెండు సంస్థల నుండి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని వివరించింది. ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేయడానికి సుమారు 7 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని వెల్లడించింది. అదేవిధంగా వేసవి కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి పేర్కొంది. లడ్డూ తయారీకి సంబంధించిన పోటు విభాగంలో యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్లు వంటి పరికరాల మరమ్మత్తులు సంబంధిత సంస్థల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వాస్తవాలు ఇలా ఉండగా టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. ఇటువంటి తప్పుదోవ పట్టించే ప్రచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ప్రజలు, భక్తులు వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని టిటిడి మరోసారి స్పష్టం చేసింది.
అవనిగడ్డ ఎమ్మెల్యే కీలక నిర్ణయం..
అవనిగడ్డ ఎమ్మెల్యే కీలక నిర్ణయం.. అవనిగడ్డ, ఆంధ్రప్రభ : సోమవారం కోడూరు గ్రామంలో
మిడిల్ ఈస్ట్లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
మిడిల్ ఈస్ట్లో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది
వివాహ వేడుకలో మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యే కొలికపూడి..
వివాహ వేడుకలో మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యే కొలికపూడి.. విజయవాడ, ఆంధ్రప్రభ : తుళ్లూరు
TVK : ఈరోజు విచారణకు హాజరు కాలేను : విజయ్
సీబీఐ నోటీసులకు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు
భార్య ప్రాణం తీసిన సాంబార్ గొడవ
బెంగళూరు: సాంబార్ వంటకం విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కావ్య(27), రంగస్వామి అనే దంపతులు బెంగళూరు శివారులో నివస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మూడో రోజుల క్రితం ఇంట్లో విందు కోసం సాంబార్ వంటకం చేసింది. సాంబార్ను ప్రీజులో పెట్టి మూడు రోజుల నుంచి భర్తకు వడ్డిస్తుండడంతో ఆమెపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కావ్య మనస్తాపానికి గురై బాత్రూమ్లోకి వెళ్లింది. పొలాల కోసం తెచ్చిన పురుగుల మందు తాగి బాత్రూమ్లో పడిపోయింది. బాత్రూమ్ నుంచి భార్య బయటకు రాకపోవడంతో రెండు మూడు సార్లు పిలిచిన ఉలుకుపలుకులేకపోవడంతో డోర్లు బద్దలు కొట్టాడు. భార్య అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కావ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fact Check: Kamal Haasan’s Fat Remuneration for Kalki Sequel
Padmashri Kamal Haasan who has been struggling with a series of debacles made his comeback with Vikram. Soon, Nag Ashwin finalized him to play the role of the lead antagonist in Kalki 2898 AD. Soon after the shoot commenced, the team decided to make the film in two parts. A major portion of Kamal Haasan’s […] The post Fact Check: Kamal Haasan’s Fat Remuneration for Kalki Sequel appeared first on Telugu360 .
Telangana : మహిళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
మహిళ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Colombia : కొలంబియా కాంగ్రెస్ ఎన్నికల్లో పెట్రో పార్టీ ముందంజ
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు చెందిన హిస్టారికల్ పాక్ట్ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల్లో ముందంజ సాధించింది.
Iran - Israel War : ఇరాన్ యుద్ధం… శుద్ధ ఇంధనాల వైపు మలుపు?
మధ్య ప్రాచ్యంలో యుద్ధం వల్ల ఇంధన సరఫరాకు అంతరాయం కలిగే అవకాశముందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
చెరువుల పునరుద్ధరణపై విమర్శలు పట్టించుకోను నిర్వాసితులకు డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తాం పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే కూకట్పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ మనతెలంగాణ/ కూకట్పల్లి : వ్యక్తిగతంగా, రాజకీయంగా తనను ఇబ్బందులకు గురిచేస్తూ తిట్టిన తిట్లే తనకు ఆశీర్వాదాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ నుముల రేవంత్రెడ్డి తెలిపారు.హైడ్రా పునరుద్ధరించిన కూకట్పల్లి నల్ల చెరువును ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం రేవంత్ ప్రసంగించా రు. చెరువుల పునరుద్ధరణ వల్ల పేదలకు నష్టం జరిగి ఉండవచ్చు. నిర్వాసితుల్లో అర్హులైన పేదలుంటే వారికి డబుల్బెడ్ రూం ఇళ్లు ఇస్తాం. పేదవారి ఇల్లు కూల్చ డం ప్రభుత్వ ఉద్ధేశం కాదు. వరదల వల్ల ఇల్లు మునిగిపోతే కుటుంబం మొత్తం నష్టపోతుంది. వరద ముప్పును తప్పించాలంటే చెరువులను పునరుద్ధరించాలి. మూసీని పునరుద్ధరించకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. మూసీ పు నరుద్ధరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే. ఎవరికైనా నష్టం జరిగితే మంచి పరిహారం ఇచ్చి ఆదుకుంటాం అని రేవంత్రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నియోజకవర్గాలను అన్ని వి ధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని, చెరువుల అభివృద్ధి కో సం నిధులను మంజూరు చేస్తానన్నారు. తాను రాజకీయాల్లో కష్టాలను అను భవి స్తున్న సమయంలో మల్కాజిగిరి ఎంపిగా గెలిపించి ఢిల్లీకి పంపించడాన్ని ఎన్న టికీ మరవబోనన్నారు. ముఖ్యంగా మల్కాజిగిరిలోని నియోజకవర్గంలో ఆనాడు చేయలేని అభివృద్ధి పనులను తాను సిఎంగా చేసి చూపిస్తానన్నారు. చెరువులను, నాలాలను అభివృద్ధి చేసే సమయంలో కొంతమందికి జరిగే నష్టాలను తన దృష్టికి తీసుకువస్తే వారికి కావాలిసన పరిహారాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామ న్నారు. ఢిల్లీ, ముంబాయి తదితర ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించుకోలేక ఆ నగరాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. మన నగరాన్ని అన్ని విధాలు గా అభివృద్ధి చేసుకునేందుకు కొంత మందికి ఇబ్బందులు ఎదురైనా రానున్న భావితరాల కోసం అనుభవించక తప్పదన్నారు. కూకట్పల్లి నియోజక వర్గంలోని ఐడిఎల్ సమీపంలోని కాలనీలో కార్మికుల నివాసాల కోసం తాను గతంలో కోటి రూపాయలను మంజూరు చేశామని గుర్తు చేశారు. ఆయా కాలనీలోని నివాసితుల కోసం స్ధానిక ఎమ్మెల్యే నిధులను కేటాయించాలని విజ్ఞపి చేశారని, త్వరలోనే మంజూరు చేస్తానన్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే వారికి సరైన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ముఖ్యంగా నాలాలు, చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే విజ్ఞప్తులను పరిశీలించి నిధులను కేటాయిస్తామని అన్నారు. కర్యక్రమంలో ఎమ్మెల్యేలు కృష్ణారావు, గాంధీ, ఎమ్మెల్సీ నవీన్కుమార్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాధ్ పాల్గొన్నారు.
డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. వైద్యురాలు దీపిక ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అమర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతపురం మెడికల్ కాలేజీలో చదువుతూ విజయవాడ జిజిహెచ్లో వైద్యురాలిగా దీపిక విధులు నిర్వహిస్తున్నారు. నందిగామలో ప్రభుత్వ డాక్టర్ గా అమర్ విధులు నిర్వహిస్తున్నారు. దీపికతో ప్రేమయాణం నడిపించి చివరలో పెళ్లి చేసుకోనని అమర్ చెప్పడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు విచారణలో తేలింది. గత నెల 5న ప్రమాదకర ఇంజెక్షన్ చేసుకుని దీపిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు అమర్తో డాక్టర్ దీపిక మాట్లాడినట్టు కాల్ హిస్టరీలో తెలిసింది. అమర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకి అమర్ ను తరలించారు.
పోలీసుల ఆధ్వర్యంలో జాగృతి కళా ప్రదర్శన..
పోలీసుల ఆధ్వర్యంలో జాగృతి కళా ప్రదర్శన.. పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని
వార్ ఎఫెక్ట్తో 100డాలర్లు దాటిన ముడిచమురు ధర కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 12లక్షల కోట్ల సంపద ఆవిరి చికాగో : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్కు వంద డాలర్లు దాటిపోయింది. యుద్ధ ముడి చమురుధర పెరగడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఒక్కరోజే రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. ముడి చమురు రవాణాకు కీలక ప్రాంతమైన హా ర్మూజ్ జలమార్గం మూసివేయడంతో ధరలు రె ట్టింపు అయ్యాయి. సోమవారం ఉదయం అంతర్జాతీయ ధరల ప్రకారం బ్రెంట్ చమురు ధర ఒక బ్యారెల్ 119.50 డాలర్ల వరకు చేరి, తర్వాత 106 డాలర్లకు తగ్గింది. అమెరికాలో ఉత్పత్తి అ య్యే వెస్ట్ టెక్సాస్ చమురు ధర కూడా 119 డాలర్లకు పైగా వెళ్లి తర్వాత 103 డాలర్లకు పడిపోయింది. బహ్రెయిన్ తమ దేశంలో కీలకమైన తాగునీటి శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ దాడితో బహ్రెయిన్ చమురు శుద్ధి కేం ద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో సరఫరా నిలిచిపోయింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లోని చ మురు నిల్వ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. రెండో వారం యుద్ధం కొనసాగడంతో చమురు ధరలు పెరగ్గా, దేశాలకు కష్టాలు మొదలయ్యాయి. పర్షియన్ గల్భ్ నుంచి ప్రపంచానికి చమురు, గ్యాస్ సరఫరా ఎంతో కీలకమైం ది. హార్ముజ్ సముద్ర మార్గం ద్వారా రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అ వుతుంది. అయితే క్షిపణి, డ్రోన్ దాడుల భయం తో అనేక ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణం నిలిపివేశాయి. దీంతో ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. శుక్రవారం యుఎ స్ఎస్ అండ్ పి 1.3 శాతం, నాస్డాక్ కంపోజిట్ 1.6 శాతం పడిపోయాయి. భారత మార్కెట్లు కూడా భారీగా నష్టాలను చూస్తున్నాయి. రూ.12 లక్షల కోట్లు ఆవిరి ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు భారీగా పెరడం గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్మార్కెట్లను కుదిపేసింది. సెన్సెక్స్ ఓ దశలో 2000 పాయింట్లకు పైగా పడిపోగా, ఆ తర్వాత కోలుకుని 1,353 పాయింట్లు (1.71 శాతం) తగ్గి 77,566 వద్ద ముగిసింది. నిఫ్టీ 422 పాయింట్లు (1.73 శాతం) పడిపోయి 24,028 పాయింట్లకు చేరింది. బ్యాంకింగ్, ఆటో, లోహ, ఇంధన, వినియోగ వస్తువుల రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. సోమవారం ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.12 లక్షల కోట్లు ఆవిరైంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఫిబ్రవరి ఫలితంగా పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.22 లక్షల కోట్లు తగ్గింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఫిబ్రవరి 27న రూ.463 లక్షల కోట్లు ఉండగా, మార్చి 9 నాటికి అది రూ.441 లక్షల కోట్లకు తగ్గింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లో చమురు ధరలు 60 శాతం పెరి గి ఒక బ్యారెల్కు 105 డాలర్ల వరకు చేరాయి. నిపుణులు ఈ ధరలు 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 92కి పడిపోయిన రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 46 పైసలు తగ్గి 92.33 వద్ద ముగిసింది. ఇదే ఇప్పటివరకు కనిష్ట స్థాయి, చమురు ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.1.60 లక్షలకు చేరింది. ఒక కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2.63 లక్షలుగా నమోదైంది. ఆసియా, అమెరికా మార్కెట్లలో కూడా పతనం కనిపించడం ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలను పెంచుతోంది.
ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగవేత పదవి కాపాడుకోవడానికి గాంధీ కుటుంబానికి ఏటా వెయ్యికోట్ల కప్పం ఆరు కాంగ్రెస్ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ బిల్లును అసెంబ్లీలో పెడతాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: కాంగ్రెస్ హ మీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రతిపాదిస్తున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్ఏ కెటిఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో వివిధ పార్టీల నాయకు లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు బిఆర్ఎస్లో చేరిన సందర్భంగా కెటిఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలన్నారు. కెసిఆర్ పాలనలో రైతులకు డిసెంబర్లో రైతుబంధు పడేదని, ఇప్పుడు మార్చి 9 వ తేదీ వచ్చిన మరో 15 రోజుల్లో పంటలు కోతకు వచ్చిన రైతు బంధు వేయలేదని, ఇప్పటికి మూడు సార్లు రైతు బంధు ఎగవేశారని, సిఎం రేవంత్ రెడ్డి రైతుబంధును ఎత్తే సి కొత్తగా రైతుబంధు బదులుగా రాహుల్ బంధు ప్రారంభించాడని కెటిఆర్ ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్రెడ్డితన పదవిని కాపాడుకోవడానికి ఏటా వెయ్యికోట్లు గాంధీ కుటుంబానికి కప్పం కడుతున్నాడని కెటిఆర్ ఆరోపించారు. రైతులకు బోనస్ లేదు, కాంగ్రెస్కు, రేవంత్కి సిగ్గు లేదని కెటిఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇండ్లు కూల్చడమా అని నిలదీశారు.ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో శత్రుదేశాలమీదకు యుద్ధానికి పోయినట్లు 3000 మంది పోలీసులతో వెళ్లి 1000 ఇండ్లు బుల్డోజర్లతో కూల్చేశారని, మహబూబ్ నగర్లో దివ్యాంగులు కట్టుకున్న150 నుండి 200 ఇండ్లు కూల్చేశారన్నారు. బఫర్జోన్లో కట్టిన ఇండ్లను కూలుస్తానని చెపుతున్న సిఎం రేవంత్రెడ్డి స్వయంగా కొడంగల్ సమీపంలోని కోస్గిలో రెడ్డికుంటలో తన ఇంటిని పూర్తిగా చెరువులోనే కట్టాడని దాన్నెందుకు కూల్చరని నిలదీశారు. సిఎం అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కట్టాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డా. వివేక్, పట్నం మహేందర్ రెడ్డి చెరువులో ఇండ్లు కడితే వాటినెందుకు కూల్చడం లేదని అన్నారు. గరీబోళ్ల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యామా అని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసగించి మరి కొద్ది రోజుల్లో వెయ్యి రోజులకు చేరుతున్నా ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్దత కల్పిస్తామని హమీ ఇచ్చిమర్చిపోయాడన్నారు. బిఆర్ఎస్ మాత్రం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ఈ నెల 16నుండి ప్రారంభమయేశాసనసభ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని పోరాడుతామన్నారు.ఆడవారికి ఫ్రీ బస్ అని మగవాళ్ల దగ్గర డబుల్ టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. తాము ఫ్రీ బస్ విధానానికి వ్యతిరేకం కాదన్నారు. కళ్యాణలక్ష్మి పథకంక్రింద కెసిఆర్ లక్ష రూపాయలిస్తే కాంగ్రెస్ వారు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీశారు. సిఎం ఆర్ధిక కష్టాలున్నాయంటున్నాడని మరి అలాంటప్పుడు లక్షన్నర కోట్లతో మూసి సుందరీకరణ ఎందుకని నిలదీశారు. ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలిస్తామన్న రాహుల్ గాంధీ పత్తాలేకుండా పో యాడన్నారు. ఇవన్నీ చూస్తూ ప్రజలు అన్నా కేసిఆర్ ఎక్కడున్నారు అని అంటున్నారని, మళ్లీ కేసిఆర్ సిఎం కావాలని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారన్నారు. ఫిబ్రవరి 9న రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు కాగానే రూ.లు 9 వేల కోట్లు రైతు బంధు వేస్తానని హమీ ఇచ్చారని అవి ఎటు పోయాయన్నారు.బిసిలకు బడ్జెట్లో లక్ష కోట్లు అన్నారు. ఇప్పటి వరకు మూడు బడ్జెట్లో పో యాయి ఇంతవరకు దిక్కులేదన్నారు. మార్చి 16 నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో బిసిలకు రూ.20వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాలన్నారు. అంబేద్కర్ అభయ హస్తం క్రింద రూ.12 లక్షలు ఇస్తామని మోసగించారన్నా రు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు పెన్షన్లు పెంచాడని,తెలంగాణలో కూడా ప్రజలు పెన్షన్ల పెంపుకోసం ఎదిరి చూస్తున్నారన్నారు. యువతకు ఏటా రెండు లక్షలు ఉద్యోగాలని ఇప్పటి వరకు కనీసం పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందన్నారు.తెలంగాణలో దుర్మార్గ, అప్రజాస్వామ్య, రాబంధు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊపిరి సల్పనివ్వకుండా బిఆర్ఎస్ చేయనున్న ఉద్యమాలకు ప్రజలందరూ కలిసి రావాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్లు
ముంబై/బెంగళూరు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరిపడా గ్యాస్ ఉత్పత్తి, సరఫరా మందగించడంతో వివిధ రంగాలపై ఆ ప్రభావం పడుతోంది. గ్యాస్ కంపెనీలు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో ముంబై, బెంగళూరులో హోటళ్లను రెండు మూడు రోజుల్లో మూసివేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు హోటళ్ల అ సోసియేషన్లు లేఖలు కూడా విడుదల చేస్తున్నాయి. వంట గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో హోటళ్లు మూసివేయాల్సి ఉంటుందని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ శెట్టి ప్రకటించారు.
కొహెడ నిర్మాణాలకు అనుమతివ్వండి
ముఖ్యమంత్రికి తుమ్మల విజ్ఞప్తి మినుము, వేరుశనగ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన తుమ్మల మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్రెడ్డి తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై మం త్రి తుమ్మల సిఎంతో చర్చించారు. సిద్ధిపేట జిల్లాలోని నర్మెట్ట ఆయిల్ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. కొ హెడ మార్కెట్ పనులు చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వాలని సిఎం రేవంత్కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. మినుము, వేరుశెనగ కొనుగోలు కేం ద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని సిఎం రేవంత్రెడ్డికి తుమ్మల విన్నవించా రు. తుమ్మల ప్రతిపాదనలకు సానుకూలంగా సి ఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు.
కల్తీ నూనె, గోధుమ పిండి ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై ఎస్ఓటి పోలీసుల దాడి భారీగా పట్టుబడ్డ కల్తీ నూనె, గోధుమ పిండి గడువు ముగిసిన నూనె, గోధుమ పిండి సేకరించి కొత్త ప్యాకెట్లతో మార్కెట్లో విక్రయాలు మన తెలంగాణ/గచ్చిబౌలి: కల్తీ ఆహర పదార్థాలపై ఎస్ఓటి పోలీసులు చేస్తున్న దాడుల్లో రోజుకో కొత్త రకం కల్తీ పదార్ధాలు బయటపడుతున్నాయి. కల్తీ అల్లం పేస్ట్ కేసును మరవకముందే తాజాగా కల్తీ నూనె, గోధుమ పిండి పదార్థాలు పోలీసుల దాడుల్లో బయటపడ్డాయి. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో కల్తీ నూనె, గోధుమ పిండి తయారీ కేంద్రంపై సోవమవారం మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో భారీ మొత్తం లో 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, 5,192 కిలో ల గోధుమ పిండి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల ప్రకారం గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న జస్నాత్ ట్రేడర్స్ దుకాణం పై మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. రాజస్థాన్కు చెందిన దుకాణ యజమాని భన్వ ర్ రామ్ జాట్ (46), అతని కుమారు డు అశోక్ కుమార్ (22) జస్నాత్ ట్రేడర్స్ను నడుపుతున్నా రు. ఇద్దరూ గడువు ముగిసిన వివిధ కంపెనీల వం ట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనె తో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పా పాయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూ జా అయిల్ వంటి పేర్లతో మళ్లీ కొత్తగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో నూనెను విక్రయిస్తున్నా రు. అలాగే పలు కంపెనీలకు చెందిన గడువు ము గిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాత్ గోల్డ్ చ క్కి ఆట పేరుతో తిరిగి ప్యాక్ చేసి మార్కెట్ లో అ మ్ముతున్నారు. కాగా తండ్రి కొడుకులు కల్తీ నూనె, గోధుమ పిండి తయారు చేసి విక్రయిస్తున్నట్లు ప క్కా సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు దుకాణంపై దాడి చేశారు. దాడిలో సుమారు 10,55,460 లక్షల విలువ చేసే 5,026 లీటర్ల క ల్తీ నూనె, 3,11,520 లక్షల విలువ చేసే 5,192 కల్తీ గోధుమ పిండి, ఒక వెయింగ్ మిషన్, ఒక ఆ యిల్ ఫిల్టర్ మిషన్, ఒక గోధుమ ఫిల్టర్ మిషన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు, టిఎస్07యుఎల్2884 నెంబర్ గల ఒక టెంపో ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ క్వారీతో నాకు ఎలాంటి సంబంధం లేదు:పొంగులేటి
నాపై మొరిగే కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో నాకు తెలుసు ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో నిజమైన లబ్ధిదారులు 410 మంది మాత్రమే 330 మంది బోగస్ లబ్ధిదారులే నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కెసిఆర్తో సహా బిఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలి ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి హాజరై అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాం విలేకరులతో చిట్చాట్లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్రోడ్డు) పక్కన రాజేంద్రనగర్లో ఉన్న క్రషర్తో, క్వారీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. తనపై మొరిగే కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో తనకు తెలుసన్నారు. ఆ క్వారీ నాదని కొందరు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని, నాకు క్రషర్ నడిపే ఓపిక లేదని, అది నా క్రషర్ కాదని, బిఆర్ఎస్ నేతలు చెబుతున్నానని ఆయన తెలిపారు. తిరుమల క్రషర్కు వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ ఉందని, ఆ క్రషర్ కంపెనీకి మా కంటైనర్ను తీసుకువెళ్లిందని దానిపై ఉన్న పేరును తొలగించినట్లు ఉన్నారని, దానిని ఆధారంగా కొందరు పిచ్చికూతలు కూస్తున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో 410 మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారని అందులో 330మంది బోగస్ అని తేలిందని, నిజమైన 410 మంది లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని, తనపై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెబుతానని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వెలుగుపట్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుందని మరోమారు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన చాంబర్లో చిట్చాట్ చేశారు. బిఆర్ఎస్ శాసనసభ్యులు సభకు వచ్చి తమ వాదనలు వినిపించాలి ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కెసిఆర్తో సహా బిఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ హాజరై అడిగే ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బిఆర్ఎస్ శాసనసభ్యులు సభకు వచ్చి తమ వాదనలు వినిపిస్తే, ప్రతి విషయానికి సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ, ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వారి సొంత ఎజెండాతో సభకు వస్తున్నారన్నారు.
కొత్త వాటి పరిష్కారం పోలీసులకు సవాల్ సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పౌరులకు మెరుగైన సేవలు శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్లో సిఎం మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్- 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత బాగా పనిచేసినా ఈ వ్యవస్థలో మొదటగా బద్నాం అయ్యేది పోలీసులే అని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు ముందుగా సమస్యలను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. సమస్య అర్థమైతే సగం సమస్యను పరిష్కారం లభించినట్లేనని ఆయన తెలిపారు. దేశంలోని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారిందని, ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు నగరంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయని, అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక కోల్కత్తా గురించి చెప్పే అవసరమే లేదని, వాటితో పోలీస్తే మనం చాలా బెటర్ ప్లేస్లో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఛాలెంజ్లు రెండు రకాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని, మనం ఎక్కడున్నామో తెలుసుకోగలిగితే మనం ఎక్కడికి చేరుకోవాలో తెలుస్తుందని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. అందుకే ఈ రిట్రీట్ కార్యక్రమం ద్వారా సమస్యలు, పరిష్కారాల గురించి విశ్లేషించుకున్నామన్నారు. ఛాలెంజ్లు రెండు రకాలని, ఒకటి టెక్నికల్ ఛాలెంజ్, రెండోది అడాప్టివ్ ఛాలెంజ్ రిసోర్సెస్ అని ఆయన తెలిపారు. సమయాన్ని కేటాయిస్తే టెక్నికల్ ఛాలెంజ్ ను అధిగమించ వచ్చని, కానీ, అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో ఎదురైన సమస్య లోతును అర్థంచేసుకోవాలని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండకూడదనే ‘తెలంగాణ రైజింగ్ 2047’ పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించుకున్నామని ఆయన తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్గా పరిగణించుకుంటున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశా రు. సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టంను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్న సిబ్బంది, అధికారులను అప్గ్రేడ్ చేసుకోకపోతే నేరాలను నిరోధించలేమన్నారు. పనితీరు ఆధారంగానే పోస్టింగ్లు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటోమోడ్ కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరమన్నారు. పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాల్సిందేనని, అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ తెలిపారు. మీ పనితీరు ఆధారంగానే పోస్టింగ్లు ఉంటాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్- 2026 కార్యక్రమంలో భాగంగా విభాగాల వారీగా వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు సిఎంకు వివరించారు. భవిష్యత్ లో పోలీసింగ్ లో తీసుకురావాల్సిన మార్పులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులకు సిఎం రేవంత్రెడ్డి పలు సూచనలు చేశారు. సాంకేతిక పెరుగుతుండడంతో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సిఎం సూచించారు.
10th March 2026 |మంగళవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
10th March 2026 | మంగళవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు
రామగుండం థర్మల్ విద్యుత్ను కొనుగోలు చేయండి బొగ్గు సమీకరణకు ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి సిఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్టిపిసి రెండో దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న (3X800) మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పిపిఏ) చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సూచించారు. ఇంకా 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడానికి ఎన్టిపిసికి తగిన స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుతూ సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రామగుండంలో ఎన్టిపిసి ఏర్పాటు చేసిన మొదటి దశకు దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 2X800=1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడి 2023 లో ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అనంతరం సెకండ్ ఫేజ్ లో భాగంగా 3X800=2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టిపిసి చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. మొదటి దశ తరహాలో రెండవ దశలో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85% విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 3 న మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని ఆయన తెలిపారు. రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుంది కాబట్టి రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ రంగం మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్లో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సి ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో ఎన్టిపిసికి దేశంలోనే విశేషమైన అనుభవం ఉందని ఆయన తెలిపారు. గతంలో విద్యుత్ రంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇతర థర్మల్ పవర్ ప్రాజెక్టులతో పోలుస్తూ, మొదటి దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టు గురించి స్వయంగా మీరు ప్రశంసించారని ఆయన ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. రెండో దశ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడానికి ఎన్టిపిసికి స్వేచ్ఛను ఇస్తే, థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఎన్టిపిసి సిద్ధంగా ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి, ఈ విషయంలో మీరు చొరవ తీసుకుని,విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఎన్టిపిసి రెండో దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పిపిఏ) చేసుకునేలా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వానికి, ప్రజలకు మేలు చేకూర్చే రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
ఇరాన్కు రష్యా పూర్తి అండగా ఉంటుంది
మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయిల్, అమెరికాలతో సాగు తున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరా న్కు మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖామేనీకి పుతిన్ అభినందనలు తెలుపుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని సమర్థ వంతంగా నడిపించగలరని ఆశాభా వం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ […] The post ఇరాన్కు రష్యా పూర్తి అండగా ఉంటుంది appeared first on Visalaandhra .
నిందితులకుసుప్రీంలో చుక్కెదురు
రెవెన్యూ దస్త్రాల దహనం కేసు… న్యూదిల్లీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న మునిరత్నానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి పెద్దిరెడ్డి మాజీ పీఏ కాగా, మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. The post నిందితులకుసుప్రీంలో చుక్కెదురు appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్నాయక్కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు […] The post ఐపీఎస్ సునీల్కు చుక్కెదురు appeared first on Visalaandhra .
. ఖామేనీ రెండో కుమారుడి ఎన్నిక. దేశవ్యాప్తంగా సంబరాలు. తెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ప్ర తి దాడులు తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖామేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స’ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు […] The post ఇరాన్ అధినేత ముజ్తబా appeared first on Visalaandhra .
పట్టుపట్టిన విపక్షాలుఅవకాశం లేదంటూ మొండికేసిన ప్రభుత్వం పార్లమెంటు ఆవరణలో నిరసన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పార్లమెంటును కుదిపేశాయి. అధి కార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పశ్చిమాసి యా పరిణామాలపై తక్షణమే చర్చిం చాలని ప్రతిపక్ష సభ్యులు లోక్సభలో డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు. స్పీకర్ అవిశ్వాసంపై చర్చ చేపడదామని ప్రభుత్వం వాదించింది. పశ్చిమాసియా రగులుతోందని, అక్కడ కోట్లమంది భారతీయులు చిక్కుకున్నారని, వారి భద్రత అత్యంత అవసరమని ప్రతిపక్షాలు స్పష్టంచేశాయి. యుద్ధం […] The post పశ్చిమాసియాపై చర్చించాల్సిందే appeared first on Visalaandhra .
భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్
. వచ్చే డిసెంబరుకు భూ వివాదాలన్నీ పరిష్కారం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. గత పాలనలో భూ అక్రమాలకు పాల్పడింది మంత్రుల ముఠాలే. నేడు అభివృద్ధి-సంక్షేమం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు […] The post భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ appeared first on Visalaandhra .
. ముందుకు కదలని 66 పథకాలు. ఖాతాల్లో మూలుగుతున్న వేల కోట్ల కేంద్ర నిధులు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. అధికారుల అసమర్థతతో కుంటుపడుతున్న ప్రగతి విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు లేవంటూ సీఎం సైతం అనేక సభల్లో బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు… కానీ నిర్ణీత వ్యవధిలోగా కేంద్ర నిధులు వినియోగించుకోవాలన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి తట్టకపోవడం బాధాకరం. రాష్ట్ర వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసినట్లయితే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద […] The post నిధులున్నా పనులు సున్నా! appeared first on Visalaandhra .
తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
సారా ఆరోగ్యానికి హానికరం కాదు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో క్లారిటీ రావాల్సి ఉంది త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తా సచివాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిట్చాట్ మనతెలంగాణ/హైదరాబాద్: గతంలో సారా తాగిన వారు 115 సంవత్సరాల పాటు బ్రతికారని, ఇప్పుడు మద్యం తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని అందువల్ల తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తానని ఆయన తెలిపారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడానికి సచివాలయానికి వచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైంటిఫిక్గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని, అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో క్లారిటీ రావాల్సి ఉందన్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు. ఇటీవల కొన్ని రాష్టాలు సారా దుకాణాలు ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలు నడుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్తో యుద్ధం ముగింపుపైసరైన సమయంలో నిర్ణయం
. ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇరాన్ కొత్త నాయకత్వంపై స్పందించేందుకు నిరాకరణ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ముగింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై జరుగుతున్న సైనిక చర్యలను ఎప్పుడు నిలిపివేయాలన్న నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా తనదే అయినప్పటికీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో చర్చించి పరస్పర అవగాహనతో తుది నిర్ణయం తీసుకుంటా మని స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రా […] The post ఇరాన్తో యుద్ధం ముగింపుపైసరైన సమయంలో నిర్ణయం appeared first on Visalaandhra .
లెబనాన్పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం
అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంబీరుట్: ఇరాన్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్పై కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య కూడా దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. వారం రోజుల నుంచి ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా లెబనాన్ ప్రజలు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్పై కూడా దాడి చేసింది. ప్రజల నివాసాలపై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు […] The post లెబనాన్పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం appeared first on Visalaandhra .
కొండాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ సుమధుర అపార్ట్మెంట్లో మనుశ్రీ (32) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. కర్ణాటకకు చెందిన ఆమె ఐటి ఉద్యోగం చేస్తూ నగరంలో నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి నుంచి మనుశ్రీ తన ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె పక్క గదిలో ఉండే ఆమె ఫ్రెండ్కు ఫోన్ చేశారు. సోమవారం ఉదయం ఆమె వెళ్లి చూడగా గది తలుపులు లోపల నుంచి వేసి ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టి చూడగా మనుశ్రీ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. పని ఒత్తిడి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.
. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో రష్యా తీవ్ర ఆందోళన. తక్షణం భద్రతా మండలి భేటీకి పిలుపు మాస్కో: ఇరాన్పై అమెరికా` ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో దాడులు కొనసాగించడంపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు (పి-5) తక్షణమే భేటీ కావాలని పిలుపునిచ్చింది. ప్రపంచ భద్రత, సుస్థిరతపై చర్చించేందుకు పి-5లోని రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ భేటీ కావాలని తమ అధ్యక్షుడు […] The post అంతర్జాతీయ న్యాయం నశించింది appeared first on Visalaandhra .
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଯୁଦ୍ଧକୁ ପେଟ୍ରୋଲ ଡିଜେଲ ସଙ୍କଟ ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା
ଇରାନ ଯୁଦ୍ଧ ପରେ ସୃଷ୍ଟି ହୋଇଥିବା ଆର୍ଥିକ ସଙ୍କଟ ମଧ୍ୟରେ ପାକିସ୍ତାନ ସରକାର ପେଟ୍ରୋଲ ଓ ଡିଜେଲର ଲିଟର ପିଛା ଦାମ ରେକର୍ଡ ପରିମାଣର ବୃଦ୍ଧି କରିଛନ୍ତି। ପେଟ୍ରୋଲ ଓ ହାଇସ୍ପିଡ ଡିଜେଲ ଦାମକୁ ରେକର୍ଡ ପିକେଆର ୫୫ ବା ଭାରତୀୟ ମୁଦ୍ରା ୧୮.୧୦ ଟଙ୍କା ବୃଦ୍ଧି କରିଛନ୍ତି। ସୂଚନା ଥାଉକି ପୂର୍ବରୁ ପାକିସ୍ତାନରେ ଗୋଟିଏ ଲିଟର ପେଟ୍ରୋଲର ଦାମ ୨୬୬.୧୬ ପିକେଆର ରହିଥିଲା। ଏବେ ଏହା ୩୨୧.୧୭ ପିକେଆରରେ ପହଞ୍ଚିଛି। ଇତିମଧ୍ୟରେ ପେଟ୍ରୋଲ ଡିଜେଲ ସଙ୍କଟ ନେଇ ସୋସିଆଲ ମିଡିଆରେ ଗୁଜବ ଦେଖିବାକୁ ମିଳିଛି । ଓଡ଼ିଶାର ମାଲକାନଗିରି ଜିଲ୍ଲାରେ ଲୋକଙ୍କ ଭିଡ଼ ଦେଖିବାକୁ ମିଳିଛି । ରାତିରୁ ପେଟ୍ରୋଲ ପମ୍ପ ଆଗରେ ଲାଗିଛି ଲମ୍ବା ଲାଇନ୍ ଲାଗିଛି । ବାଇକ୍ ପିଛା ୨ଶହ ଏବଂ କାର୍ ପିଛା ମାତ୍ର ୫ଶହ ଟଙ୍କାରେ ଦିଆଯାଉଛି ଡିଜେଲ । ମଧ୍ୟପ୍ରାଚ୍ୟ ଯୁଦ୍ଧ ଯୋଗୁଁ ତେଲ ମିଳୁନଥିବା ଗୁଜବ ନେଇ ଏଭଳି ଅବସ୍ଥା ଘଟିଛି ବୋଲି ଚର୍ଚ୍ଚାର ବିଷୟ ପାଲଟିଛି । ଉକ୍ତ ଗୁଜବର ଖବର କିଛି ଗାନ ମାଧ୍ୟମରେ ମଧ୍ୟ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି I ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିକୁ ଖଣ୍ଡନ କରିଛନ୍ତି ମନ୍ତ୍ରୀ, ରାଜ୍ୟରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଓ ଅତ୍ୟାବଶ୍ୟକ ସାମଗ୍ରୀ ମହଜୁଦ ଅଛି ବୋଲି ଯୋଗାଣ ମନ୍ତ୍ରୀ ଦେଇଛନ୍ତି ସୂଚନା । ଦାବିର ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଆବଶ୍ୟକିୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ସର୍ଚ୍ଚରୁ ଗ୍ରାଉନ୍ଡ ସ୍ଥରରେ ଏଭଳି କୌଣସି ଘଟଣା ଦେଖିବାକୁ ପାଇନଥିଲୁ । କେବଳ ମାଲକାନଗିରିରେ ଗୋଟିଏ ଦିନ ପାଇଁ ନାହିଁନଥିବା ଭିଡ଼ ଦେଖୁବାକୁ ପାଇଥିଲୁ । ଏନେଇ ଜଣେ ସ୍ଥାନୀୟ ବାସିନ୍ଦାଙ୍କୁ ଯୋଗାଯୋଗ କରିଥିଲୁ । ତାଙ୍କ କହିବା ଅନୁଯାୟୀ, ମାଲକାନଗିରି ଜିଲ୍ଲାରେ ଯୁଦ୍ଧକୁ ନେଇ ତେଲ ସଙ୍କଟ ଏକ ଗୁଜବ ବ୍ୟାପିଯାଇଲା । ଆବଶ୍ୟକ ଠାରୁ ଅଧିକ ଗ୍ରାହକଙ୍କ ଭିଡ଼ ଜମିବାରୁ ଟାଙ୍କିରେ ନାହିଁ ନଥିବା ଭିଡ଼ ଜମିଥିଲା । ଭିଡ଼ ନିୟନ୍ତ୍ରଣ କରିବାକୁ ଯାଇ, ୨ ଚକିଆକୁ ୨୦୦ ୪ ଚକିଆକୁ ୫୦୦ ଟଙ୍କାର ତେଲ ବିକ୍ରି କରିଥିଲେ । ଉକ୍ତ ଗୁଜବ ନେଇ ଏକ ସ୍ପଷ୍ଟୀକରଣ ଲେଖିଛି ଇଣ୍ଡିଆନ ଅଏଲ, ସୋସିଆଲ ମିଡିଆରେ ପେଟ୍ରୋଲ ଏବଂ ଡିଜେଲର ଅଭାବ ସମ୍ପର୍କରେ ରିପୋର୍ଟ ଭିତ୍ତିହୀନ। ଭାରତରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ଇନ୍ଧନ ଷ୍ଟକ୍ ଅଛି, ଏବଂ ଯୋଗାଣ ଏବଂ ବଣ୍ଟନ ନେଟୱାର୍କଗୁଡ଼ିକ ସ୍ୱାଭାବିକ ଭାବରେ କାର୍ଯ୍ୟ କରୁଛି । ଇଣ୍ଡିଆନଅଏଲ ସାରା ଦେଶରେ ନିରବଚ୍ଛିନ୍ନ ଇନ୍ଧନ ଯୋଗାଣ ବଜାୟ ରଖିବା ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ। ନାଗରିକମାନଙ୍କୁ ଆତଙ୍କିତ ନ ହେବାକୁ କିମ୍ବା ଇନ୍ଧନ ଷ୍ଟେସନଗୁଡ଼ିକରେ ଭିଡ଼ ନ କରିବାକୁ ଏବଂ ସଠିକ୍ ସୂଚନା ପାଇଁ କେବଳ ସରକାରୀ ଉତ୍ସ ଉପରେ ନିର୍ଭର କରିବାକୁ ଅନୁରୋଧ କରାଯାଇଛି । सोशल मीडिया पर पेट्रोल और डीज़ल की कमी को लेकर फैल रही खबरें पूरी तरह निराधार हैं। भारत में ईंधन का पर्याप्त भंडार उपलब्ध है और आपूर्ति व वितरण नेटवर्क सामान्य रूप से कार्य कर रहे हैं। इंडियनऑइल निर्बाध ईंधन आपूर्ति बनाए रखने के लिए पूरी तरह प्रतिबद्ध है। नागरिकों को आश्वस्त… — Indian Oil Corp Ltd (@IndianOilcl) March 6, 2026 ହିନ୍ଦୁସ୍ତାନ ପେଟ୍ରୋଲିୟମ ଉଲ୍ଲେଖ କରିଛି, ଭାରତରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ଅଶୋଧିତ ତୈଳ ଏବଂ ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଏବଂ ATF ସମେତ ସମସ୍ତ ପ୍ରମୁଖ ପେଟ୍ରୋଲିୟମ ଉତ୍ପାଦ ମହଜୁଦ ଅଛି। ସାରା ଦେଶରେ ଇନ୍ଧନ ଯୋଗାଣ ସ୍ୱାଭାବିକ ଭାବରେ ଚାଲିଛି । ସମସ୍ତ ତୈଳ ବିପଣନ କମ୍ପାନୀ ସେମାନଙ୍କର ବ୍ୟାପକ ଖୁଚୁରା ନେଟୱାର୍କ ମାଧ୍ୟମରେ ନିରବଚ୍ଛିନ୍ନ ଇନ୍ଧନ ଯୋଗାଣ ସୁନିଶ୍ଚିତ କରୁଛନ୍ତି। ନାଗରିକମାନଙ୍କୁ ଅନୁରୋଧ କରାଯାଉଛି ଯେ ସେମାନେ ଏପରି ଗୁଜବରେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ ନାହିଁ ଏବଂ ଆତଙ୍କିତ ହେବା ଏବଂ ପେଟ୍ରୋଲ ପମ୍ପରେ ଅଯଥା ଭିଡ଼ କରିବାରୁ ରକ୍ଷା ପାଆନ୍ତୁ। ସେହିପରି ଭାରତ ପେଟ୍ରୋଲିୟମ ଏନେଇ ଉଲ୍ଲେଖ କରିଛି, ହର୍ମୁଜ୍ ପ୍ରଣାଳୀ ଯୋଗୁଁ ପେଟ୍ରୋଲ ଏବଂ ଡିଜେଲ ଯୋଗାଣରେ ବାଧା ସୃଷ୍ଟି ହେବା ସମ୍ପର୍କରେ ଗୁଜବ ଭ୍ରାମକ। ଭାରତରେ କ୍ଷଣିକକାଳୀନ ବିଶ୍ୱ ବ୍ୟାଘାତ ପରିଚାଳନା ପାଇଁ ପର୍ଯ୍ୟାପ୍ତ ଇନ୍ଧନ ସଂରକ୍ଷଣ ଏବଂ ବିକଳ୍ପ ଯୋଗାଣ ଉତ୍ସ ଅଛି, ଏବଂ ବିପିସିଏଲ ସୁଗମ ଇନ୍ଧନ ଉପଲବ୍ଧତା ସୁନିଶ୍ଚିତ କରିଚାଲିଛି । ସେହିପରି ଗଣମାଧ୍ୟମକୁ ସୂଚନା ଦେଇ ଖାଦ୍ୟ ଯୋଗାଣ ଓ ଖାଉଟି କଲ୍ୟାଣ ମନ୍ତ୍ରୀ ଶ୍ରୀଯୁକ୍ତ କୃଷ୍ଣଚନ୍ଦ୍ର ପାତ୍ର ସୂଚନା ଦେଇଛନ୍ତି ଯେ, ରାଜ୍ୟରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଓ ଅତ୍ୟାବଶ୍ୟକ ସାମଗ୍ରୀ ମହଜୁଦ ଅଛି । କିଛି ଗଣମାଧ୍ୟମରେ ତୈଳ ସଙ୍କଟ ନେଇ ବିଭ୍ରାନ୍ତିକର ଖବର ପ୍ରଚାରିତ ହେଉଛି ବୋଲି କହିଛନ୍ତି ଖାଦ୍ୟ ଯୋଗାଣ ଓ ଖାଉଟି କଲ୍ୟାଣ ମନ୍ତ୍ରୀ । ⛽️ରାଜ୍ୟରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଓ ଅତ୍ୟାବଶ୍ୟକ ସାମଗ୍ରୀ ମହଜୁଦ ଅଛି ⛽️କିଛି ଗଣମାଧ୍ୟମରେ ତୈଳ ସଙ୍କଟ ନେଇ ବିଭ୍ରାନ୍ତିକର ଖବର ପ୍ରଚାରିତ ହେଉଛି ବୋଲି କହିଛନ୍ତି ଖାଦ୍ୟ ଯୋଗାଣ ଓ ଖାଉଟି କଲ୍ୟାଣ ମନ୍ତ୍ରୀ @_KrushnaChPatra #FuelAvailability #FuelUpdate pic.twitter.com/gQulonvDMA — DD News Odia (@DDNewsOdia) March 7, 2026 ତେବେ ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଯୁଦ୍ଧକୁ ନେଇ ବର୍ତ୍ତମାନ ସମୟରେ ପେଟ୍ରୋଲ ଡିଜେଲ ସଙ୍କଟ ଦାବିଟି ଭୁଲ୍ ଅଟେ । ଉକ୍ତ ଦାବିକୁ ଖଣ୍ଡନ କରିଛନ୍ତି ଯୋଗାଣ ମନ୍ତ୍ରୀ, ରାଜ୍ୟରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଓ ଅତ୍ୟାବଶ୍ୟକ ସାମଗ୍ରୀ ମହଜୁଦ ଅଛି ବୋଲି ମନ୍ତ୍ରୀ କୃଷ୍ଣଚନ୍ଦ୍ର ପାତ୍ର ସୂଚନା ଦେଇଛନ୍ତି ।
కాట్మండు: నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్పీ)’ అఖండ విజయం సాధిం చింది. ఆ పార్టీకి చెందిన జెన్ జీ నేత బాలేంద్ర షా (బాలెన్) నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకా శాలు కనిపిస్తున్నాయి. నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలుండగా… వాటిలో 165 సీట్లకు సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. మిగతా 110 స్థానా లను దామాషా విధానంలో భర్తీ చేస్తారు. ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. […] The post నేపాల్ ప్రధానిగా బాలేంద్ర? appeared first on Visalaandhra .
నాంపల్లి కోర్టు కీలక తీర్పు.. కెసిఆర్, కెటిఆర్లకు భారీ ఊరట
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకాలం నాటి పాత కేసు నుంచి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సహా కీలక నేతలకు ఊరట లభించింది. 2011లో నిర్వహించిన సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పుతో సుమారు 15 ఏళ్ల నాటి వివాదానికి తెరపడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో జెఎసి పిలుపునిచ్చిన సకల జనుల సమ్మెలో కెసిఆర్, కెటిఆర్, పద్మారావు గౌడ్, శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రైలు రోకోలు, రహదా రుల దిగ్బంధం వంటి నిరసనలు చేపట్టారు. దీనిపై అప్పట్లో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నింది తులపై సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతూ కేసును కొట్టేసింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే పలుమార్లు నేతలు కోర్టుకు హాజ రయ్యారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులుగా వారు వాదనలు వినిపించారు. తాజాగా వెలువడిన తీర్పుపై బిఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తు న్నాయి.
అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్
హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్ […] The post అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్ appeared first on Visalaandhra .
‘కరుప్పు’ విడుదల ఆలస్యం వెనుక కారణం?
చెన్నై: హీరో సూర్య నటిస్తున్న 45వ చిత్రం ‘కరుప్పు’. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో ఈ సినిమా విడుదల చర్చనీయాంశమైంది. ఆసక్తికర యాక్షన్-ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తయినా విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘డ్రీమ్ వారి యర్ పిక్చర్స’ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మిస్తు న్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా… సాయి అభ్యంకర్ […] The post ‘కరుప్పు’ విడుదల ఆలస్యం వెనుక కారణం? appeared first on Visalaandhra .
విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
చెన్నై: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా హీరోయిన్ పూజా హెగ్డే, మమితా బైజు కలయికలో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన సినిమా జన నాయగన్. ఇదే విజయ్ కి ఆఖరి సినిమా కాగా తెలుగులో జన నాయకుడు పేరిట విడుదలకి సిద్ధం చేస్తున్నారు.అయితే ఈ సినిమా ఎపుడో జనవరి లోనే విడుదల కావాల్సి ఉంది కాని సెన్సార్ సమస్యలు ఈ సినిమా విడుదల ఆపేశాయి. చివరిగా ఇప్పుడు సెన్సార్ కావాల్సి ఉండగా మళ్లీ దెబ్బ […] The post విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ! appeared first on Visalaandhra .
సచిన్ సలహాలే నన్ను నిలబెట్టాయి: సంజూ
అహ్మదాబాద్: ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్లో జట్టును గెలిపిస్తేనే అది గొప్ప విషయం. అలాంటిది ఏకంగా సూపర్ 8, సెమీ ఫైనల్, ఫైనల్లోనూ విధ్వంసక అర్ధ శతకాలతో టీమిండియా విజయాల్లో సంజూ శాంసన్ కీలకమయ్యాడు. సన్నాహక సిరీస్లో న్యూజిలాండ్పై ఘోరంగా విఫలమైన సంజూ… నాకౌట్ మ్యాచ్లో టీమిండియాకు పెద్ద దిక్కులా మారడానికి కారణం ఎవరో తెలుసా? సచిన్ టెండూల్కర్. ఈ విషయాన్ని ఫైనల్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రదానం సమయంలో సంజూనే చెప్పాడు. […] The post సచిన్ సలహాలే నన్ను నిలబెట్టాయి: సంజూ appeared first on Visalaandhra .
దూబే బ్యాట్తో అదరగొట్టా : అభిషేక్
అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్` 2026 ఫైనల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హీరోగా నిలిచాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి భారత్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తన విధ్వంసకర ఇన్నింగ్స్కు సహచర ఆటగాడు శివమ్ దూబే బ్యాటే కారణమని చెప్పాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఈ ఇన్నింగ్స్కు క్రెడిట్ శివమ్ దూబేకి దక్కుతుంది. నేను […] The post దూబే బ్యాట్తో అదరగొట్టా : అభిషేక్ appeared first on Visalaandhra .
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
మూడు ప్రాంతాలే లక్షంగా వైమానిక దళాల బీభత్సం లెబనాన్ గ్రామాలపై వైట్ ఫాస్పరస్ బాంబుల ప్రయోగం టర్కీ, దోహాపైకి ఇరాన్ క్షిపణులు, అడ్డుకున్న టర్కీ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తే ఇరాన్కు తగిన శాస్తి తప్పదు: యుఎఇ టెల్అవీవ్/దుబాయి : ఇరాన్, లెబనాన్లపై ఇజ్రాయెల్ సోమవారంనాడు భారీ ఎత్తున దాడులకు పూనుకుంది. టెహ్రాన్, ఇస్ఫహాన్, దక్షిణ ఇరాన్లపై వైమానిక దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఇరాన్లోని మూడు కీలక ప్రాంతాల్లో దాడులు జరుపుతున్నాం అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడిఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్కు చెందిన కమాండ్ సెంటర్తో పాటు ఇస్ఫహాన్లోని దాని వలంటరీ బసిజ్ ఫోర్స్ను లక్షంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. లెబనాన్లోని దక్షిణ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. బీరుట్ మీదుగా నింగిలో పెద్ద ఎత్తున నల్లని పొగలు వెలువడ్డాయి. అంతకుముందు ఇజ్రాయెల్ ఆర్మీ ఒక ప్రకటన చేసింది. హెజ్బొల్లాల ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా దాడులు జరపబోతున్నట్లు ప్రకటించింది. బీరుట్ దక్షిణాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. లెబనాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ వైట్ పాస్ఫరస్తో కూడిన బాంబులు జారవిడిచినట్లు మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. గ్రామాలపై చట్ట విరుద్ధంగా ఇలాంటి దాడులకు పాల్పడడమేంటని ప్రశ్నించింది. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడిలో తమ పౌరుడు ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 11కు చేరినట్లు వెల్లడించింది. ఇరాన్కు చెందని ఓ క్షిపణిని నేలకూల్చినట్లు టర్కీ ప్రకటించింది. దోహాలోనూ పేలుళ్ల శబ్దాలు వెలువడినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే ఊహించనంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. భారతీయుడికి గాయాలు.. ఇజ్రాయెల్ లక్షంగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షిపణి శకలాలు మీద పడడంతో అతడి మెడపై గాయాలయ్యాయని, టెల్ అవీవ్లోని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. భారతీయుడికి శస్త్ర చికిత్స అవసరం పడడంతో వైద్యులు దానిని విజయవంతంగా పూర్తి చేశారని, ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. టెల్ అవీవ్లోని భారత ఎంబసీ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. సౌదీలో భారతీయుడు మరణించలేదు.. సౌదీ అరేబియాలో ఆర్మీ ప్రొజెక్టైల్ పడిపోయిన ఘటనలో ఓ భారతీయుడు మరణించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి భారత ఎంబసీ స్పందించింది. దానిపై పూర్తి విచారణ జరిపిన అనంతరం అవన్నీ ఊహాగానాలేనని ప్రకటించింది. ఈ ఘటనలో భారతీయులెవరూ చనిపోలేదని వెల్లడించింది. అల్ఖర్జ్లోని నివాస ప్రాంతాల్లో ప్రొజెక్టైల్ కుప్పకూలింది.
ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తబా.. చైనా, రష్యా మద్దతు
టెహ్రాన్ : ఇరాన్లో రాజకీయాల్లో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ పీఠంపై వారసుడు కొలువుదీరారు. ఇరాన్ అత్యున్నత నేతగా 54 ఏళ్ల మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటన చేసింది. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఆయన నియామకం పట్ల ఇరాన్లోని కొన్ని మతపరమైన వర్గాల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కరుడుగట్టిన సిద్ధాంతకర్త అవసరమని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ భావించిందని సమాచారం. అందుకే మొజ్తబాను ఇరాన్ సుప్రీంగా నియమించినట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. 88 మంది సభ్యులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్’ వర్చువల్ సమావేశంలో మొజ్తాబాను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. మొజ్తబా ఖమేనీ గతంలో ఏ ప్రభుత్వ పదవి చేపట్టకపోయినప్పటికీ తెర వెనుక నుంచే ఇరాన్ అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నారనే ప్రచారం ఉంది. 2019లోనే ఆయనపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఆయన మధ్యస్థ స్థాయి మతాధికారి మాత్రమే అయినప్పటికీ ఐఆర్జీసీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలపై పూర్తి స్థాయిలో పట్టుంది. 1989లో అయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టాక 37 ఏళ్ల తర్వాత ఇరాన్ నాయకత్వంలో జరిగిన రెండో మార్పు ఇది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడానికి భద్రతా వ్యవస్థలతో సన్నిహిత సంబంధాలున్న మొజ్తబాయే సరైన వ్యక్తని ఐఆర్జీసీ బలంగా నమ్ముతోంది. వాస్తవానికి గతంలో ఇరాన్ నాయకత్వం వారసత్వ పాలనను తీవ్రంగా వ్యతిరేకించేది. కానీ అసాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాత సిద్ధాంతాలను పక్కనపెట్టి ఖమేనీ కుమారుడికే పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. మొజ్తబాను సుప్రీం లీడర్గా ఎన్నుకున్నట్లు ప్రకటన వెలువడగానే ఆయన మద్దతుదారులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆయనకు విధేయత ప్రకటిస్తూ నినాదాలు చేశారు. మా సంపూర్ణ మద్దతు మీకే: పుతిన్ ఇరాన్ కొత్త సుప్రీం నేతగా నియమితులైన మొజ్తాబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ వెల్లడించింది. మొజ్తాబా తన తండ్రి అలీ ఖమేనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశాన్ని ముందుకు నడిపించాలని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త నేత ప్రస్తుత సంక్లిష్ట దశలో దేశానికి దిశానిర్దేశం చేస్తూ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి: చైనా ఇరాన్ సుప్రీం నేతగా ఎవరిని ఎన్నుకున్నా తమ తదుపరి టార్గెట్ ఆయనే అవుతాడని ఇజ్రాయెల్ మిటలరీ ఇటీవల చేసిన హెచ్చరికలపై చైనా ఘాటుగా స్పందించింది. నాయకత్వ మార్పిడి అనేది ఆదేశ అంతర్గత వ్యవహారమని, ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాంతీయ సమగ్రతను తప్పనిసరిగా గౌరవించాలని బీజింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
స్మాల్ క్యాప్ ఫండ్ను ఆవిష్కరించిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్
ముంబైః పాంటోమత్ గ్రూప్ కంపెనీ అయిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ తన స్మాల్ క్యాప్ ఫండ్ — న్యూ ఫండ్ ఆఫరింగ్ (ఎనఎఫఓ)ను ప్రారంభించినట్లు నేడిక్కడ ప్రకటించింది. ఇది స్మాల్-క్యాప్ ప్రపంచంలో అధిక-వృద్ధి చెందుతున్న వ్యాపార సంస్థలను గుర్తించి వాటిలో పెట్టుబడి పెట్టడానికి రూపొందించ బడింది. వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి, శాస్త్రీయ శ్రద్ధ, డిస్ట్రిబ్యూటర్ -ఫస్ట్ పర్యావరణ వ్యవస్థను విశ్వసిస్తుంది. వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సంస్థాగత-నాణ్యత పరిశోధన, పీఈ […] The post స్మాల్ క్యాప్ ఫండ్ను ఆవిష్కరించిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ appeared first on Visalaandhra .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్టి
అమరావతి : యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, పర్యావరణ అనుకూల జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా, భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బివైఎస్ టి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ మరియు నానో వ్యాపార సంస్థలను విస్తరింప చేయటానికి, వాటిని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వాటికి అవసరమైన కౌన్సెలింగ్, శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక లభ్యత, చేయూత అందించటం ద్వారా బివైఎస్ టి మద్దతును అందిస్తుంది. 2026 అంతర్జాతీయ […] The post ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్టి appeared first on Visalaandhra .
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తొలి డీ ప్లస్ ‘ఎంజి మేజెస్టర’ కోసం ప్రత్యేక ప్రోగ్రామ్
ముంబయి: జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన ప్రత్యేక 5-5-5 యాజమాన్య కార్యక్రమం ద్వారా భారతదేశపు తొలి డీ ప్లస్ ఎస్యూవీ ఎంజీ మేజెస్టర్ కోసం దీర్ఘకాలిక భరోసాను వినియోగదారులకు అందిస్తోంది. పనితీరు, విస్తారమైన పరిమాణం, అత్యాధునిక సాంకేతికతలో గణనీయమైన పెట్టుబడులు పెట్టే ఈ విభాగంలో, 5-5-5 కార్యక్రమం ప్రారంభ దశ నుంచే నిర్వహణ ఖర్చులు, నిరంతర సేవలు మరియు దేశవ్యాప్తంగా మద్దతును సమగ్రంగా కవర్ చేస్తూ, ఇబ్బంది లేని యాజమాన్య అనుభవం, దీర్ఘకాలిక వ్యయ అంచనాను […] The post జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తొలి డీ ప్లస్ ‘ఎంజి మేజెస్టర’ కోసం ప్రత్యేక ప్రోగ్రామ్ appeared first on Visalaandhra .
ఏఐ, ఆటోమేషన్పై దృష్టి సారించండి: ప్రధాని మోడీ
ప్రపంచ వాస్తవ ఆర్థిక వ్యవస్థతో దేశ విద్యారంగాన్ని అనుసంధానించాలి వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ సహాయకులకు డిమాండ్ ప్రత్యేక వెబినార్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ విద్యా రంగాన్ని వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సోమవారంనాడు ఓ వెబినార్లో ప్రసంగించిన ఆయన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి వంటి అందుకు ఒక మాధ్యమంగా పనిచేస్తాయని అన్నారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అనేది కేవలం ఒక అంశం మాత్రమే కాదు, ఇది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మరియు తీర్మానం’ అన్నారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రైవేట్ రంగాల నిపుణులు పాల్గొన్న వెబినార్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో విద్యను ఉపాధి సంబంధిత సంస్థలతో అనుసంధానించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి రంగాలలో మార్కెట్ డిమాండ్లు, వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉండాల్సిన పాఠ్యాంశాలకు పునాదిని అందిస్తుందన్నారు. మన విద్యా వ్యవస్థను వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. మరో ముఖ్యమైన రంగం స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ అని ప్రధాని అన్నారు. దేశ పౌరులకు స్టెమ్ సైన్స్ పట్ల అత్యంత ఆసక్తి ఉండటం ఆనందంగా ఉందన్నారు. నూతన ఆవిష్కరణలపై పనిచేయడానికి యువ పరిశోధకులకు తగినంత అవకాశాలు లభించే పరిశోధనా పర్యావరణ వ్యవస్థను మనం సృష్టించాలి అని ఆయన అన్నారు. ఆరోగ్య రంగం బలోపేతం అయిందని, ఆయుష్మాన్ భారత్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింతగా వ్యాప్తి చేయడానికి దారితీశాయని ఆయన అన్నారు. శిక్షణ పొందిన సంరక్షకులు సీనియర్ సిటిజన్లకు సహాయపడే ‘కేర్ ఎకానమీ’ గురించి ప్రస్తావిస్తూ వృద్ధుల జనాభా పెరిగే కొద్దీ సంరక్షకుల డిమాండ్ కూడా పెరుగుతుందని మోడీ అన్నారు. కొత్త శిక్షణా నమూనాలను అభివృద్ధి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.

29 C