SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
...

వాగులో పడి విద్యార్థులు మృతి..

వాగులో పడి విద్యార్థులు మృతి.. చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం నష్కల్

ప్రభ న్యూస్ 3 Apr 2026 7:24 am

గ్రామసభ బహిష్కరించిన కోల్కొంద సర్పంచ్..

గ్రామసభ బహిష్కరించిన కోల్కొంద సర్పంచ్.. వికారాబాద్, ఆంధ్రప్రభ : గత రెండు విడుతలుగా

ప్రభ న్యూస్ 3 Apr 2026 7:16 am

Obesity |కొత్త అధ్యయనం ఏమి చెబుతోంది..?

Obesity | కొత్త అధ్యయనం ఏమి చెబుతోంది..? Obesity | ప్రపంచంలో ఊబకాయం

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:43 am

Andhra Prabha SPL Story |భారత్‌కు సంక్షోభం ఒక అవకాశమా.?

Andhra Prabha SPL Story | భారత్‌కు సంక్షోభం ఒక అవకాశమా.? Andhra

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:32 am

3rdAprilchintana |గుడ్‌ ఫ్రైడే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..

3rdAprilchintana | గుడ్‌ ఫ్రైడే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత.. 3rdAprilchintana |యూద మత చరిత్ర

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:15 am

పశ్చిమ బెంగాల్ విఫల రాష్ట్రం

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గ పడుతున్న వేళ ‘సర్’ విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులను నిర్భందించడం తీవ్ర వివాదస్పదమైంది. పశ్చిమ బెంగాల్‌ను ‘దేశంలో అత్యంత ధ్రువీకృత రాష్ట్రం’గా పేర్కొంటూ, మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) సమయంలో ఏడుగురు న్యాయాధికారులపై జరిగిన ఘెరావ్ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర పరిపాలన ‘పూర్తిగా విఫలమైందని’ విమర్శిస్తూ, ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో స్వతంత్ర దర్యాప్తు జరపాలని, ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సర్వే పేరుతో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాల్దా జిల్లాలో బుధవారం ఆందోళనలు జరిగాయి. ఇక్కడ సర్ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆందోళనకారులు నిర్బంధించారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత అక్కడికి చేరుకుని జ్యుడీషియల్ అధికారులను రక్షించారు. అడ్డుకున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిర్బంధానికి గురైన వారిలో ముగ్గురు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఈ పరిణామాలపై సుప్రీంకోర్టు గురువారం స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను అడ్డుకునేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యేనని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహించారు. “ఇది సాధారణ ఘటన కాదని, ప్రణాళికతోనే జ్యుడీషియల్ అధికారులను మానసికంగా దెబ్బతీయడానికి, సర్ ప్రక్రియను ఆపేందుకు కుట్రపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆందోళనకారుల ఘెరావ్ గురించి మధ్యాహ్నమే సమాచారం అందినా.. రాష్ట్ర అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాయం కోసం స్వయంగా కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్, హోం సెక్రటరీ, డీజీపీకి ఫోన్ చేయాల్సి వచ్చింది. వారి ఆదేశాలు అందినా జిల్లా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి రాలేదు. రాత్రి 11 గంటల వరకూ వారికి ఎలాంటి సహాయం అందలేదు. ఈ ఘటనలో రాష్ట్ర అధికారుల ప్రవర్తన అత్యంత విచారకరం. ఇది కోర్టు అధికారాన్ని సవాల్ చేసినట్లే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి మేం ఎన్నటికీ అనుమతించబోం అని సుప్రీంకోర్టు కోప్పడింది. ఇది రాజకీయేతర నిరసన అయితే, రాజకీయ నాయకులు అక్కడ ఏమి చేస్తున్నారు? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంటే వారు జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత లేదేంటి? తప్పు ఎవరు చేస్తున్నారో మాకు తెలియదనుకుంటున్నారా? ఈ ఘటనను నేను తెల్లవారుజామున రెండు గంటల వరకు పర్యవేక్షిస్తూనే ఉన్నా.. ఇది చాలా దురదృష్టకరం అని సీజేఐ వ్యాఖ్యానించారు. సాయంత్రం 5 గంటలకు ఘేరావ్ మొదలై రాత్రి 11 గంటల వరకు జిల్లా కలెక్టర్ అక్కడికి రాకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల కమిషన్‌కు, న్యాయాధికారులు అభ్యంతరాలపై విచారణ జరిపే అన్ని కేంద్రాల్లో తగిన కేంద్ర బలగాలను మోహరించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపి, ప్రాథమిక నివేదికను నేరుగా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది న్యాయాధికారులు, ఓటరు జాబితాల నుంచి తొలగించబడిన వారి 60 లక్షలకుపైగా అభ్యంతరాలపై విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన లేఖను సుప్రీంకోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుంది. అందులో ముగ్గురు మహిళా న్యాయాధికారులు, ఐదేళ్ల చిన్నారితో సహా పలువురు అధికారులు ఆహారం, నీరు లేకుండా తొమ్మిది గంటలకు పైగా గుంపుల చేతిలో బందీగా ఉండాల్సి వచ్చినట్లు వివరించారు. చివరకు అర్ధరాత్రి తరువాత న్యాయాధికారులను విడుదల చేసినప్పటికీ, వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడులు జరిగినట్లు సీజేఐ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు న్యాయాధికారులపై భయానక ప్రభావం చూపుతాయి అని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మాల్దా జిల్లా కలెక్టర్, ఎస్పీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోర్టు షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. వీరందరూ ఏప్రిల్ 6న జరిగే తదుపరి విచారణకు ఆన్‌లైన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. ఇకపై న్యాయాధికారుల విధుల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, వారి ప్రాణ, ఆస్తి, కుటుంబ భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. న్యాయాధికారులు పని చేసే ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

మన తెలంగాణ 3 Apr 2026 6:00 am

గ్రూప్-1 ఫలితాలపై జోక్యానికి సుప్రీం నో

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీ వివాదానికి శుభం కార్డు పడింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రూప్1కు సంబంధించిన 563 పో స్టుల నియామకాలపై దాఖలయిన పిటిషన్లను గురువారం కొట్టేసింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారించడానికి మెరిట్స్ లేవని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం పేర్కొంది. దీంతో గ్రూప్ 1 పోస్టుల నియామక వివాదానికి తెరపడినట్లయ్యింది. కాగా, గ్రూప్ 1 పోస్ట్‌ల భర్తీ కి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చే స్తూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. నియామకాల్లో అవకతవలు జరిగాయిని, మూల్యాంకనంలో త ప్పులున్నాయని, నోటిఫికేషన్‌ను రద్దు చే యాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ల ను విచారించిన హైకోర్టు గ్రూప్ 1 నియామాల్లో అవతవకలు కనిపించడంలేదని పేర్కొంటూ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పును పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. వాదనల సందర్భంగా హైకోర్టు తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్లు సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో టిజిపిఎస్‌సి తరపు న్యాయవాదులు జోక్యం చేసుకుని నియామక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. అవకతవకల జరిగాయని చెప్తున్న అంశాలు అభ్యర్థుల అపోహలు మాత్రమేనని, మూడు సార్లు పరీక్షా పత్రాలు మూల్యాంకనం చేసినట్లు కోర్టుకు వివరించారు. దీంతో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1కు చెందిన 563 పోస్ట్‌ల భర్తీని ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని పక్కనబెట్టడానికి తగిన ఆధారాలు పిటిషన్‌లో లేవని పేర్కొంది. హైకోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని పరిశీలించి, తదుపరి ఆదేశాలను జారీ చేసిందని, అందులో తాము జోక్యం చేసుకోదలుచుకోలేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

మన తెలంగాణ 3 Apr 2026 5:30 am

గ్యారంటీల అమలు చూడడానికి తెలంగాణకు రండి

మనతెలంగాణ/హైదరాబాద్: యూడిఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి తమ ట్రాక్ రికార్డు పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. కేరళం ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే తాము గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా  చూపుతామని సిఎం తెలిపారు. కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి యూడిఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో గురువారం సిఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరాయి విజయన్ హయాంలో ముగిసిందని, ఇక యూడిఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు. మోడీ బ్రదర్స్... పినరాయి.. కెసిఆర్‌ల మధ్య పోలికలు.. ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశాన్ని, కేరళంను మోడీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోడీ విజయన్‌ను ఉద్దేశించి సిఎం వ్యాఖ్యానించారు. దేవుడి సొంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికి రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సిఎం లేవనెత్తారు. కేరళంలో గత పదేళ్లుగా పినరాయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతోందని, అలాగే, 2014 నుంచి సుమారు పదేళ్ల పాటు కెసిఆర్ తెలంగాణను పాలించారన్నారు. పినరాయి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరాయి విజయన్, కెసిఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 2023లో తెలంగాణలో మాదిరి మార్పే ఈసారి కేరళంలో చోటుచేసుకుంటుందని సిఎం అన్నారు. పినరాయి విజయ్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. యూడిఎఫ్ కార్మికుల కూటమి పో మోనే విజయా వ్యాఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అని, మోడీలా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, విమర్శించకుండా ఉండటం తన స్వభావం కాదని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రానికి రావలసిన నిధుల సాధన తమ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరుణ కాదని అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని సిఎం తెలిపారు. యూడిఎఫ్ కార్మికుల కూటమి అని, కూటమిలో నిజాయితీగల నాయకులు ఉన్నారని సిఎం వ్యాఖ్యానించారు. ఆర్టీసిని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చాం కేరళంలో యూడిఎఫ్ గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని సిఎం తెలిపారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో పాటు ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని సిఎం వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసిని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని సిఎం తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలను బస్సుల యజమా నులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలం గాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుపనున్నామని సిఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కెపిసిసి ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కేరళ సిఎల్పీ నేత వి.డి.సతీషన్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీప్‌దాస్ మున్షీ, యూడిఎఫ్ కన్వీనర్ ఆదూర్ ప్రకాష్, ఐయూఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.కె.కున్హాలికుట్టి తదితరులు పాల్గొన్నారు. కేరళంలో ఇందిరా గ్యారంటీలు ఇలా... ‘కేరళ గెలుస్తుంది - యూడిఎఫ్ నడిపిస్తుంది’ అనే నినాదంతో ‘ఇందిర గ్యారంటీ’ పేరుతో పలు ఆకర్షణీయమైన పథకాలను తమ ఎన్నికల హామీలుగా యూడిఎఫ్ ప్రకటించింది. 1.కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలోని ఇందిరా ఐదు గ్యారంటీలు 2.కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 3.కాలేజీ చదువుతున్న బాలికలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు 4.మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా 5.యువతకు స్వయం ఉపాధి కోసం ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 6.ఐదు గ్యారంటీలతో పాటు సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి ఐదు డ్రీమ్ ప్రాజెక్టులు, వయనాడ్‌లో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు తదితర వాగ్దానాలు ఉన్నాయి.

మన తెలంగాణ 3 Apr 2026 5:00 am

మూసీ ప్రాజెక్టుకు భారీ ఊరట

మనతెలంగాణ/హైదరాబాద్: మూసీనది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బిఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది. దీంతో మూసీ ప్రక్షాళన ప నులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అ డ్డంకి తొలగిపోయినట్లయింది. అయితే, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రా జెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పను లు జరుగుతున్నాయని కార్తీక్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రాజకీ య దురుద్ధేశ్యంతోనే కార్తీక్‌రెడ్డి పిటిషన్ వే శారని ప్రభుత్వం వాదించింది. దీంతో పి టిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ పిటిషన ర్ తన వాదనలకు సంబంధించి ఎటువం టి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమ ని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యునల్ అభిప్రాపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తాజాగా నేషల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూ సీలో మురుగునీరు కలవకుండా ఎస్టీపి ల నిర్మాణం, నది పరీవాహక ప్రాంతాల్లో రి టైనింగ్ వాల్స్, చెక్‌డ్యామ్‌ల ఏర్పాటు వం టి పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 4:30 am

కెసిఆర్ సమ్మతితోనే 7మండలాల విలీనం

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కుటుంబానికి ఏటిఏంలాగా మారిందని కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కెసిఆర్ సొంత డబ్బుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా..? లేక ప్రజల సొమ్ముతో కట్టారా..? అని ప్రశ్నించారు. రాజ్యసభలో గురువారం నాడు అమరావతి బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర జలశక్తి మం త్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ ఎంపి సురేష్‌రెడ్డి తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టుపై అనేక ఆరోపణలతో కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని నివేదికలు వచ్చాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగాయని ఆరోపించారు. కాళేశ్వరం వల్ల ఉగయోగం లేదని నివేదికలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు కట్టేందుకు రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కిషన్‌రెడ్డి నిలదీశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. భద్రాచలంలో ఉన్న గ్రామాలు ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చినప్పుడు కెసిఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ కుటుంబంతో సహా వెళ్లి సోనియా గాంధీ ఇంటికి వెళ్లలేదా, అప్పుడు గుర్తుకు రాలేదా ఏడు మండలాలు అంటూ ఎంపి సురేష్‌రెడ్డిపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి కెసిఆర్‌ను జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. దీంతో ఎంపి సురేష్‌రెడ్డికి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మధ్య తీవ్ర మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పిల్లర్లు కొట్టుకుపోతే మొత్తం ప్రాజెక్టు వృధానా..?: ఎంపి సురేష్‌రెడ్డి కాళేశ్వరం ఒక డ్యాం మాత్రమేనని రెండు పిల్లర్లు కొట్టుకుపోతే మొత్తం ప్రాజెక్టు వృథా అన్నట్లు మాట్లాడడం సరికాదని రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే ప్రాజెక్టు పనికి రాదంటున్నారని సురేశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు సిఆర్ పాటిల్, కిషన్‌రెడ్డిలతో జరిగిన వాగ్వాదంలో సురేష్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం గురించి కేంద్రమంత్రి ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు నదిలో కొట్టుకుపోయాయని చేసిన ఆరోపణపై సురేష్‌రెడ్డి స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు వృథా అన్నట్లుగా మాట్లాడారని అన్నారు. తెలంగాణతో పాటు ఏపీ కూడా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని సురేష్‌రెడ్డి తెలిపారు. విభజన తీరుపై బీజేపీ తరచుగా విమర్శలు చేస్తోందని సురేశ్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తల్లిని చంపి బిడ్డను తీశారంటూ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. రాష్ట్రాలు వేరైనప్పటికీ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉందామని కేసీఆర్ సైతం చెప్పారని సురేశ్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో ఏపీ రాజధాని అమరావతికి కేసీఆర్ తన మద్దతు తెలిపారని చెప్పారు. దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలబెట్టారని అన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కనీసం చర్చ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేయకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపించామని సురేశ్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై కేంద్రమంత్రి పాటిల్ వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు. రెండు రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని సురేశ్ రెడ్డి సూచించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాళేశ్వరం కట్టాము: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరమని అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు రుణాలతో కాలేశ్వరం కట్టామని వివరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాలేశ్వరం నిర్మించామని చెప్పుకొచ్చారు. కాలేళ్వరంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని రవిచంద్ర విమర్శించారు. వికసిత ఆంధ్రప్రదేశ్‌కి వికసిత రాజధాని అవసరం: ఎంపీ కె.లక్ష్మణ్ వికసిత ఆంధ్రప్రదేశ్ కి వికసిత రాజధాని అవసరమని బిజెపి రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ అన్నారు. రాజ్యసభలో గురువారం అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రజలు రాజధాని సాకారం కోసం కలలు కన్నారని, ప్రధాని మోడీ సంకల్పంతో సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు రాజధాని కోసం సుధీర్ఘంగా పోరాడారని, ఆ పోరాటల ఫలితం నేడు ఆవిష్కృతమైందని అన్నారు. అమరావతి బిల్లు ఆమోదానికి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందన్న ఎంపి లక్ష్మణ్ దూరదృష్టి ఉన్న నేత చంద్రబాబు కృషి చేశారని అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందని, అయితే వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోన్‌రెడ్డి మూడు ముక్కలాట ఆడి రైతులు, మహిళలను ఇబ్బందులకు గురి చేశారని లక్ష్మణ్ విమర్శించారు.

మన తెలంగాణ 3 Apr 2026 4:20 am

భూభారతితో రైతుకు భద్రత

మన తెలంగాణ/ఆమనగల్లు: రాష్ట్రంలో భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స మీకృత భూభారతి పోర్టల్‌ను గురువారం 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం స మీకృత భూ భారతి కింద ఎంపికైందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ని విఠాయిపల్లిలో కల్వకుర్తి  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డిలతో కలిసి సమీకృత భూ భారతి పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందాలనే లక్షంతో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆధార్ నెంబర్ వలె భూమి కల్గిన ప్రతి రైతుకు సర్వే నెంబర్‌కు భూదార్ కేటాయిస్తామన్నారు. భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే ఆ సర్వే నెంబర్‌కు సంబంధించిన సరిహద్దులుంటాయన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్షంతో సీఎం రేవంత్ ఆలోచనల మేరకు ప్రభుత్వం రెవెన్యూ శాఖ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టులో వచ్చే ఫలితాల ఆధారంగా మార్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి ఆధునిక రోవర్ సాంకేతికతను వినియోగించి, వేగవంతమైన, కచ్చితమైన సర్వేలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించండి. కల్వకుర్తి నియోజకవర్గానికి మరో 3500ల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకుగాను మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సుశిందర్‌రావు. డీఎంహెచ్‌ఓ లలితదేవి, డీఏఓ ఉష, ఆర్డీ జగదీశ్వర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ యాట గీత నర్సింహా, మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్యనాయక్, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్, తహశీల్దార్ మహ్మద్ ఫయూమ్ ఖాద్రీ, పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, బాలాజి సింగ్, భట్టు కిషన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 4:00 am

యుద్ధ విరమణ ఇప్పట్లో లేనట్లేనా?

వాషింగ్టన్ ః అమెరికా సేనలు నిర్ణీత లక్షాన్ని పూర్తి చేస్తాయని , ఈ క్రమంలో ఇప్పటి యుద్ధంలో సత్వర, నిర్ణయాత్మక , అత్యద్భుత విజయాలు సాధిస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో యుద్ధం , నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దశలో అమెరికన్లను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. తమ ఆపరేషన్‌కు సంబందించి అత్యంత కీలక ఘట్టాలు దాదాపుగా సంపూర్తి దశకు చేరాయని తమ అత్యంత ప్రాధాన్యతాక్రమపు (ప్రైమ్‌టైమ్) ప్రసంగంలో తెలిపారు. ఇరాన్‌తో యుద్ధంలో లక్షాలను ఛేదించడం జరిగింది. ఈ విషయంలో గణనీయ ప్రగతి సాధించామని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌కు చెందిన క్షిపణి ఉత్పత్తి సామర్థం దెబ్బతీశామని, నౌకదళాన్ని దిగ్బంధం చేశామని వివరించారు. ఇకపై ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం సంతరించుకోబోదనే నమ్మకం తమకు కుదిరిందన్నారు. ఇరాన్ పరోక్ష సాయుధ శక్తులు ఇకపై ఆయా ప్రాంతాలలో అస్థిరతలకు పాల్పడే అవకాశం లేదన్నారు. మధ్యప్రాచ్యం చమురు మనకు అవసరం లేదు. వారి వద్ద ఉన్నవి ఏవీ కూడాఅమెరికాకు అవసరం లేదు. నిజానికి మిడిలిస్టు వ్యవహారాలకు అమెరికాకు సంబంధం లేదు. అయితే ఈ ప్రాంతానికి సహకరించేందుకు అమెరికా ముందు నిలుస్తుందని ట్రంప్ చెప్పారు. అమెరికాలో ఇంధన కొరత ఛాన్సే లేదు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆదిపత్యం, నౌకలకు బ్రేక్‌తో అమెరికాలో చమురు , గ్యాస్ ధరలు పెరుగుతాయనే భయాందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికన్లకు దండిగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. సొంతంగా ఎటువంటి పరిస్థితిని అయినా తట్టుకునే సామర్థం ఉందని తెలిపారు. తాము చేపట్టిన డ్రిల్ బేబీ డ్రిల్ చర్యలతో దేశీయ చమురు ఉత్వత్తి గణనీయంగా పెరిగిందని, చమురు వెలికితీతను ప్రస్తావించారు.సౌదీ, రష్యాల కోటా కలిపితే ఎంత ఉత్పత్తి అవుతుందో అంతకు మించి అమెరికా చమురు దిగుబడి ఉందని అమెరికన్లకు భరోసా ధోరణితో తెలిపారు. మనకు హర్మూజ్ దారి అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మార్గం కోరుకునే వారు దీనిని లాక్కోవల్సి ఉంటుంది. దీనిని విలసిల్లేలా చేయాలని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లోని క్రాస్‌హాల్ నుంచి ట్రంప్ ప్రసంగం సాగింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత టీవీ, మీడియా సంస్థలు వెలువరించాయి. దేశ నాయకులు అంతమొందారని తెలిపారు. ఇరాన్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతోందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికన్లు ఓపిక పట్టాలి ఇరాన్ అమెరికా మధ్య చిరకాల ఉద్రిక్తతలు ఉన్నాయని, ఇప్పటి ఘట్టం కొంతలో కొంత మార్పుతో పాతదే అన్నారు. మిడ్‌టర్మ్ ఎన్నికల దశలో అమెరికా ఓటర్లు మరికొంత ఓపిక పట్టాలని ట్రంప్ పరోక్షంగా కోరారు. ఇంతకు ముందటి ఘర్షణల గురించి ప్రస్తావించారు.. మొదటి ప్రపంచ యుద్ధం ఏడాదిపై ఏడు నెలల ఐదురోజులు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం ఏకంగా మూడు సంవత్సరాల ఎనిమిది నెలల పాతిక రోజులు సాగింది. కొరియా, వియత్నాం, ఇరాక్ వార్‌ల గురించి తెలిసిందే. వియత్నాం యుద్ధంలో అమెరికా దాదాపుగా 20 సంవత్సరాలు కట్టుబాటుతో మగ్గాల్సి వచ్చింది. 

మన తెలంగాణ 3 Apr 2026 3:40 am

కఠినంగా కెమిస్ట్రీ.. మధ్యస్తంగా మ్యాథ్

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్ర వేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ ప్రశ్నలు మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్న ట్లు నిపుణులు పేర్కొన్నారు. జెఇఇ మెయిన్ తు ది విడత పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈనెల 8వ తేదీ వరకు జరగను న్న ఈ పరీక్షలను దేశ వ్యాప్తంగా దాదాపు 11.23 లక్షల మంది రాయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలిపింది. గురువారం జరిగిన పరీక్షలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ప్రశ్నలు కొంత సులువుగా రాగా, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా,మ్యాథ్స్ మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా ఉన్నట్లు పలువురు విద్యార్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఫిజిక్స్‌లో ముఖ్యమైన చాప్టర్ల నుంచే ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. ఎలక్ట్రోమాగ్నెటిజమ్ చాప్టర్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. ఆప్టిక్స్, వేవ్స్ నుంచి కొన్ని ప్రశ్నలు అడిగారని, మెకానిక్స్ విభాగం నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రశ్నలకు ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ.. పేపర్ మధ్యస్థంగానే ఉందని తెలిపారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ ప్రశ్నలు కొంత కఠినంగానే ఉందని, ఆర్గానిక్, ఇనార్గానిక్ మధ్య దాదాపు సమానంగా ప్రశ్నలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నలకు కాలిక్యులేషన్స్ చేయాల్సి రావడం, అందుకు ఎక్కువ సమయం పట్టడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్‌పై కొంత ప్రభావం పడిందని చెబుతున్నారు. మ్యాథ్స్ మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా, ఎక్కువ సమయం తీసుకొనేలా ఉందని తెలిపారు. ఈ విభాగంలో జాగ్రత్తగా కాలిక్యులేషన్స్ చేయాల్సినవి, టైం మేనేజ్‌మెంట్ అత్యంత కీలకంగా మారిందని తెలిపారు.

మన తెలంగాణ 3 Apr 2026 3:30 am

బడంగ్‌పేటలో బడా అవినీతి

మన తెలంగాణ/ సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బడంగ్‌పేట్ మున్సిపల్ సర్కిల్‌లో ఓ కాంట్రాక్టర్‌కు చెందిన 6 ఏజెన్సీల పేరిట డిప్యూటీ కమిషనర్‌తో పాటు మరో 9 మంది అధికారులు జరిపిన అవినీతి విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. ఒకే కాంట్రాక్టర్‌కు చెందిన ఏజెన్సీల ద్వారా సుమారు రూ.122 కోట్ల వరకు అవినీతికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బడంగ్‌పేట్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు మరో 9 మంది ఇతర అధికారులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ సస్పెండ్ చేశారు. ఒక బడంగ్‌పేట్ మున్సిపల్ సర్కిల్‌లోనే సుమారు రూ.122 కోట్ల మేర నియమాలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపులు జరిగితే, ఇక శివారులోని మిగతా మున్సిపల్ సర్కిల్‌లో అవినీతి పరిస్థితి ఏ మేరకు ఉంటుందోనని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. నిధుల కోసమే పనులు.. న్యూస్ పేపర్ బిల్లు, టీస్నాక్స్, వాటర్ బాటిల్స్, డ్రైఫ్రూట్స్, గ్రామసభల ఏర్పాట్లు, క్లీనింగ్, మొక్కలకు రంగులు వేయడం, కంప్యూటర్‌లు, ప్రింటర్‌ల వంటి సుమారు 234 పనులను చేపట్టి కోట్లాది రూపాయలను స్వాహా చేశారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. 2024, 2025, 2026లలో శానిటేషన్ పనుల పేరిటనే కాకుండా టెండర్ నిబంధనల అడ్డును తొలగించేందుకు పనులను విభజించి నామినేషన్ కేటగిరిలోకి పనులను తీసుకొచ్చి పనులు చేయించడం, మున్సిపల్ జనరల్ ఫండ్స్‌ను మళ్లించేందుకు నకిలీ ఫైళ్ళను సృష్టించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అవినీతి కోసమే మళ్లీ అక్కడికి.. 2022 నుంచి బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగం జరుగుతూ వస్తోందనేది అధికారులు గుర్తించారు. బడంగ్‌పేట్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో మున్సిపల్ సర్కిల్16గా ఉన్నది. బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న రఘు, అనంతరం కమిషనర్‌గా వచ్చిన ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ సరస్వతి ఇతర అధికారులతో కలిసి సుమారు రూ.122 కోట్ల వరకు అవినీతికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీలో బడంగ్‌పేట్ కార్పొరేషన్ విలీనమైనప్పుడు కమిషనర్‌గా ఉన్న సరస్వతి.. జీహెచ్‌ఎంసీలో అడ్మిన్ జాయింట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అనంతరం మళ్లీ బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. కుమ్మక్కు.. బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న సరస్వతికి ఒక కాంట్రాక్టర్ తోడై.. ప్రభుత్వ నిధులను స్వాహా చేసేందుకు టెండర్ పిలవకుండా పనులను కేటాయించే విధానానికి తెరలేపారనేది ప్రధాన ఆరోపణ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పనులను విభజించినట్టు అధికారులు గుర్తించారు. నామినేషన్ వర్క్‌ల పేరిట, మరో అడుగు ముందుకేసి టెండర్ పిలిచిన పనికంటే.. అదనంగా పని జరిగిందంటూ బిల్లులు పెడుతూ.. వాటికి చెల్లింపులు జరుపుతూ కమిషనర్‌లు సరస్వతి, రఘు, జ్యోతిరెడ్డి, వెంకన్న, యాదయ్య, వినీల్ కుమార్ గౌడ్, యాదగిరి, శ్రీధర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, వెంకట్‌లు కలిసి ఏకంగా రూ.122 కోట్ల మేర నిధుల దుర్వినియోగం చేశారనేది విచారణలో తేలినట్టు అధికారులు పేర్కొంటున్నారు. తెరవెనుక ఉన్నతాధికారులు..? బడంగ్‌పేట్ అవినీతి బాగోతం వెనుక ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారనేది చర్చకు తెరలేచింది. అధికారుల అండదండలతోనే భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ అవినీతి తంతు జరిగినా కేవలం ఆ సర్కిల్ అధికారులపైనే చర్యలు తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మన తెలంగాణ 3 Apr 2026 3:00 am

Shukra Dosha |శుక్రగ్రహ దోష లక్షణాలు, ఆరోగ్య సమస్యలు మరియు ప్రభావవంతమైన పరిహారాలు

Shukra Dosha |రాశి చక్రంలో శుక్రగ్రహ దోష కారణాలు, ప్రభావాలు, నివారణ మార్గాలు

ప్రభ న్యూస్ 3 Apr 2026 12:04 am

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం

ఐపిఎల్ సీజన్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో కేవలం 161 పరుగులకే కుప్పకూలింది. రఘువంశీ 29 బంతుల్లోనే 52 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఫిన్ అలెన్ 7 బంతుల్లోనే 28 పరుగులు సాధించాడు. కెప్టెన్ రింకు సింగ్ (35) తప్ప మిగతా వారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కట్ మూడు, నితీశ్, మలింగ రెండేసి వికెట్లను పడగొట్టారు. మెరుపు ఆరంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు తొలి బంతి నుంచే చెలరేగి పోయారు. భారీ షాట్లతో కోల్‌కతా బౌలర్లను హడలెత్తించారు. వీరిని కట్టడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు హెడ్ అటు అభిషేక్‌లు తమ మార్క్ షాట్లతో అలరించారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో స్కోరు సునామీల పరిగెత్తింది. చెలరేగి ఆడిన హెడ్ 21 బంతుల్లోనే ఆరు బౌండరీలు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 82 పరుగులు జోడించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 3 ఫోర్లతో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడిన అభిషేక్ 21 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన హెన్రిచ్ క్లాసెన్ (52) పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి (39) పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ స్కోరు నమోదు చేసింది.

మన తెలంగాణ 2 Apr 2026 11:17 pm

హర్మూజ్‌పై ఇరాన్ పట్టు.. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లు

ఇప్పటి వరకూ ఇరాన్ బలగాలు హర్మూజ్ జలసంధిలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు బలప్రదర్శనకు దిగుతూ వస్తున్నాయి. దాదాపు పాతిక వరకూ సరుకు నౌకలపై దాడికి దిగారు. ఇక పలు దేశాలు కలిసికట్టుగా హర్మూజ్ నుంచి రాకపోకల ప్రారంభానికి ఒత్తిడి తీసుకువస్తామని చెపుతున్నప్పటికీ ఇప్పటి యుద్ధ పరిస్థితిలో ఈ విషయంలో అడుగు ముందుకు పడలేదు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఇరాన్ సానుకూల చర్య ద్వారా హర్మూజ్ మార్గం పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ దౌద్య మార్గాలను, రాజకీయ చర్యలను ,చేపడుతామని తెలిపారు.ఈ క్రమంలో ఆయన ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పుడు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 108 డాలర్లు స్థాయికి చేరింది. యుద్ధం ఆరంభం అయిన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే ఇప్పుడు ఇది 50 శాతం పెరుగదలను చవిచూసింది. భారత్ సహా కొన్ని అత్యంత సన్నిహిత మిత్రదేశాలకు తప్పితే మిగిలిన దేశాల చమురు నౌకలకు ప్రవేశం లేదని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది. అయితే భారత్ చమురు నౌకల రాకపోకలు కూడా ఈ ప్రాంతం నుంచి చాలా జాప్యం అవుతున్నాయి. ఇరాన్‌లో ఇప్పటివరకూ జరిగిన దాడుల ఘటనలలో మృతుల సంఖ్య 1900 దాటింది, ఇజ్రాయెల్‌లో 20 మంది వరకూ చనిపోగా, గల్ఫ్‌లో దాడులలో పాతిక మందికి పైగా చనిపోయారు. వీరిలో భారతీయులు, పాకిస్థానీయులు కూడా ఉన్నారు. ఇప్పటి దాడుల క్రమంలో అమెరికా సైనికులు 13 మంది హతులయ్యారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:50 pm

ఈ నెల 18న మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డుకు పోలింగ్

మక్తల్‌లో బిజెపి అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప మరణం వల్ల వాయిదా పడిన మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 20వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2 నుంచి 6 వరకు బిజెపి అభ్యర్థి నామినేషన్ స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని తెలిపారు. ఈనెల 7న నామినేషన్ పరిశీలన, 8న అప్పీల్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 20వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా కారణాలతో రీ పోలింగ్ అవసరమైతే మరుసటి రోజు అంటే ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:36 pm

ఈ నెల 5న ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నెల 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో టాటా ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ మల్కాజ్‌గిరి ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నాం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. నాగోల్ నుంచి హబ్సీగూడ వయా ఉప్పల్ జంక్షన్ మీదుగా వెళ్లే వారు, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ వయా ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. ప్రయాణికులు ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైలును ఉపయోగించుకోవాలి. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను హెచ్‌ఎండిఏ ఉప్పల్ భగాయత్ ఎంట్రెన్స్ వద్ద నుంచి మెహిఫిల్ హోటల్ మీదుగా నాగోల్, ఎల్‌బి నగర్ వైపు వెళ్లాలి. ఎల్‌బి నగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు నాగోల్ మెట్రో వద్ద యూటర్న్ తీసుకుని నాగోల్ , హెచ్‌ఎండిఏ భగాయత్, టయోటా యూటర్న్, బోడుప్పల్, చెంగిచెర్ల, ఐఓసిఎల్, చెర్లపల్లి ఫ్లైఓవర్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సీగూడ ఎక్స్ రోడ్డు మీదుగా నాచారం, ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చెర్లపల్లి, ఘట్ కేసర్ వైపు వెళ్లాలి. రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు స్ట్రీట్ నంబర్ 8 మీదుగా హబ్సీగూడ ఎక్స్ రోడ్డు, నాచారం,ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి. వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ మీదుగా అబ్దుల్లార్‌మెట్, ఎల్‌బి నగర్, దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఎల్‌బి నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలి.

మన తెలంగాణ 2 Apr 2026 10:31 pm

కోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గెట్ 227

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కోల్‌కతా నైట్‌రైడర్స్  బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (46), అభిషేక్ శర్మ(48) చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరద పారించారు. ఫలితంగా పవర్‌ప్లేలో హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెస్ హఫ్ సెంచరీతో రాణించారు. నితీష్ రెడ్డి(39)  కూడా పర్వాలేదని పించారు. కోల్‌కతా బౌలర్లలో ముజరబాని 4, వైభవ్ 2, త్యాగి, అనుకుల్ తలో వికె్ తీశారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:20 pm

రహానె అరుదైన ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె అరుదైన రికార్డును సాధించాడు. గురువారం కోల్‌కతా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానె కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఐపిఎల్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన దిగ్గజాల సరసన రహానె నిలిచాడు. ఇప్పటి వరకు రహానె తన కెరీర్‌లో 200 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు రహానెతో కలుపుకుని ఐపిఎల్‌లో 11 మంది మాత్రమే 200 మ్యాచ్‌లను ఆడారు. మహేంద్ర సింగ్ ధోని (278) మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (273), విరాట్ కోహ్లి (28) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:08 pm

Sharwa’s Biker USA Premieres Today

Charming star Sharwa’s sports-family drama Biker is all set to hit theatres worldwide tomorrow, with premieres taking place today in the USA and Telugu states. Shloka Entertainments is bringing this highly anticipated film to overseas audiences. Touted as India’s first motocross-centric film, Biker transcends language barriers, combining high-octane racing sequences with heartfelt family emotions. At […] The post Sharwa’s Biker USA Premieres Today appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 10:02 pm

రవివర్మ చిత్రానికి రూ.167 కోట్లు

 ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ కుంచె నుంచి జాలు వారిన చిత్రం రికార్డుల్లోకి ఎక్కింది. యశోద చిన్ని కృష్ణుడితో కలిసి పాలు పితుకుతున్న ఆయిల్ పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లు దక్కించుకుంది. దీంతో అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా తొలిస్థానం దక్కించుకుంది. 1890లలో గీసిన ఈ చిత్రాన్ని తాజాగా ముంబయిలో ప్రత్యక్ష వేలం నిర్వహించారు. సీరం ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రం రూ.118 కోట్ల అత్యధిక ధరతో రికార్డుల్లో ఉండేది.. తాజాగా అది చెరిగిపోయింది. 

మన తెలంగాణ 2 Apr 2026 9:39 pm

రవాణా శాఖ ఆదాయం 7097.38 కోట్లు

ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా శాఖకు ఆదాయం రూ.7097.38 కోట్లు సమకూరిందని రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. దీనిలో భాగంగా జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.4714.63 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.961.02 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ.78.35 కోట్లు ఫీజులు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.820.09 కోట్లు, తనిఖీల ద్వారా రూ.212.49 కోట్లు, చలాన్ల ద్వారా రూ.310.80 కోట్లు సమకూరిందని రవాణా శాఖ స్పష్టం చేసింది. 2025-.26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా 7097.38 కోట్ల తో 83.16 శాతం సాధించామని రవాణా శాఖ తెలిపింది. 2024-.25 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 2.70 శాతం వృద్ధి రేటు సాధించామని రవాణా శాఖ వెల్లడించింది. 2025-.26 సంవత్సరంలో 91,637 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రూ.769.81 కోట్ల జీవిత కాలపు పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపింది.

మన తెలంగాణ 2 Apr 2026 9:31 pm

లెక్కలు చూపని రూ.60 వేల కోట్లు ఎటు పోయాయి..?: పోరెడ్డి కిషోర్

రాష్ట్ర కాగ్ నివేదిక ప్రకారం రూ.3 లక్షల కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.2.40 లక్షల కోట్లకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చూపించిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ తెలిపారు. అంటే దాదాపు రూ.60 వేల కోట్లకు ఎలాంటి లెక్కలు చూపించబడలేదని, ఇది సుమారు 20 శాతమని తెలిపారు. అయితే ఈ రూ.60 వేల కోట్లు ఎటు వెళాయనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోరెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఈ నిధులు ఆయా మంత్రిత్వ శాఖలకు పూర్తిగా పంపించబడ్డాయా? లేక పంపించిన తర్వాత పక్కకు మళ్లించబడ్డాయా? లేదా ఆర్థిక శాఖ నుంచే పూర్తిగా విడుదల కాలేదా? లేదా బడ్జెట్ విడుదల కాగానే 20 శాతం ముందుగానే పక్కకు పెట్టబడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ నిధులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం మళ్లించిందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయని కిషోర్ పేర్కొన్నారు. మొత్తానికి ఈ డబ్బులు కొందరి జేబుల్లోకి వెళ్లాయా? లేదా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించబడ్డాయా? అనే చర్చ జరుగుతోందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలు అయిపోగానే, ఈ బడ్జెట్లో మొదటి వాటా లేదా హక్కు తెలంగాణకు కాకుండా కేరళం కోసమే అన్న చందంగా అనిపిస్తోందని తెలిపారు. అందుకు నిదర్శనంగా ఈ బడ్జెట్ అయిపోగానే రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. మొదటి వాటా మాత్రం కేరళలోని కాంగ్రెస్ పార్టీకే అన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 9:28 pm

పవర్‌ప్లేలో అదరగొట్టారు.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కెకెఆర్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరదపారించారు. వైభవ్ వేసిన రెండో ఓవర్‌లో హెడ్ 20 పరుగులు రాబట్టగా.. వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో అభిషేక్ 25 పరుగులు స్కోర్ చేశాడు. అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్(46) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఫలితంగా పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత అభిషేక్ దూకుడుగానే ఆడాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో కలిసి మంచి పరుగులు రాబట్టాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 1 వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ(47), ఇషాన్ కిషన్(14) ఉన్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 8:16 pm

క్రైస్తవ సోదరులకు సిఎం రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ రాష్ట్ర ముఖ్య్మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు త్యాగం, ధైర్యంను సిఎం గుర్తు చేసుకున్నారు. ఏసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమతత్వం బోధించిన దయామయుడు, సిలువపై ఏసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్ ఫ్రైడే’ సందేశం సందర్భంగా సిఎం వెల్లడించారు. యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

మన తెలంగాణ 2 Apr 2026 8:00 pm

రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం..

రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం.. ఎమ్మెల్యే చొరవతో రూ.5 లక్షల సాయం..సీఎంఆర్‌ఎఫ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:58 pm

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత…

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత… వింత పేర్లతో విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి…భావితరాల

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:51 pm

eiffel tower |విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం

eiffel tower | విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం eiffel tower |

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:47 pm

బొగ్గు స్మగ్లింగ్ కేసు..ఐప్యాక్ కార్యాలయాలపై ఇడి దాడులు

పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ (ఐప్యాక్) కార్యాల యాలపై దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరులో, కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలోనే ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసులో ఇడి అధి కారుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐప్యాక్ వ్యవస్థాపకులు రిషిరాజ్ సింగ్, ప్రతీక్ శర్మ, వినీష్ చందాకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఇడి అధికారులు సోదాలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థ ఇడి ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయాలపై దాడి చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో, సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిలో సోదాలు నిర్వహించా రు. ఐప్యాక్ వంటి వృత్తిపరమైన సంస్థకు ఇది ఒక కష్టమైన, దురదృష్టకరమైన రోజు అని ఈ దాడిపై ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా వుంటే, ఐపాక్ (ఐప్యాక్) సంస్థ, బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బిఆర్‌ఎస్), జనతా దళ్ (యునైటెడ్), శివసేన వంటి అనేక రాజకీయ పార్టీలకు వృత్తిపరమైన, సిద్ధాంతపరమైన సలహాదారుగా పని చేసింది. ఐప్యాక్‌పై ఇడి దాడులు రాజకీయ దుమారాన్ని రేకెత్తించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడులలో జోక్యం చేసుకున్నారని, పోలీసుల సహాయంతో డిజిటల్ పరికరాలు, ముఖ్యమైన పత్రాలను తొలగించి, ఏమీ స్వాధీనం చేసుకోకుం డానే సోదాలను నిలిపివేయమని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆరోపించింది. తాజాగా బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సుమారు రూ. 20 కోట్ల హవా లా నిధులను ఐప్యాక్‌కు పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డేటాను తారుమా రు చేయకుండా రక్షణ కల్పించ డం, తమ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ నుండి ఉపశమనం కల్పించడంతో సహా పలు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది.

మన తెలంగాణ 2 Apr 2026 7:41 pm

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:39 pm

తగ్గుముఖం పట్టిన ధురంధర్‌-2 కలెక్షన్లు.. ఇలాగైతే కష్టమే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారంలోనే రూ.వెయ్యి కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ మూవీ విడుదలై రెండు వారాలు దాటింది. 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ధురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ.. రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్‌ను హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ.. వసూళ్ల పరంగా కాస్త జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల పరంగా అయితే.. ఈ సినిమా రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం సులభమే. కానీ, వసూళ్లు ఇలాగే కొనసాగితే.. పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీని ప్రభావం దురంధర్‌పై పడే అవకాశాలు ఉన్నాయి. సినిమాపై ఎంత క్రేజ్ ఉన్నా.. రెండో వారానికి సంబంధించి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. మరి ధురంధర్ ఫున్ రన్‌లో ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

మన తెలంగాణ 2 Apr 2026 7:39 pm

ఓటరు పేర్ల తొలగింపు వివాదం.. బెంగాల్‌లో గంటల పాటు ఘెరావ్

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిరసనకారులు ఏడుగురు న్యాయాధికారులను గంటల పాటు ఘెరావ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భద్రతా బలగాలు జోక్యం చేసుకుని అర్ధరాత్రి సమయంలో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పాల్గొంటున్న ఈ న్యాయాధికారులు, ముగ్గురు మహిళలు సహా, బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కాలియాచక్- 2 బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో ఉండగా నిరసనకారులు అక్కడికి చేరుకుని ఘెరావ్ చేశారు. ఓటర్ల పేర్లను భారీ స్థాయిలో తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు కోల్‌కతా -సిలిగురి నేషనల్ హైవే-12ను కూడా బ్లాక్ చేశారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కోరిన నిరసనకారులు, అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి తరువాత పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు చేరుకుని, లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టాయి. అనంతరం న్యాయాధికారులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో నిరసనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి కూడా యత్నించారు. న్యాయాధికారులను తీసుకెళ్తున్న వాహనాలను ఆపడానికి, వాటిని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నించారు. సురక్షితంగా వారిని తరలించేందుకు మా సిబ్బంది స్వల్ప బల ప్రయోగం చేయాల్సి వచ్చింది, అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో కొందరు నిరసనకారులు వాహనాలు ఢీకొనడంతో గాయపడ్డారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఫిబ్రవరి 28న విడుదలైన ఓటరు జాబితాల్లో ‘పరిశీలన’గా గుర్తించిన పేర్లపై న్యాయాధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల పేర్లు కొనసాగించాలా లేదా తొలగించాలా అన్నది వారు నిర్ణయిస్తున్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 7:37 pm

నిషేధిత గడ్డి మందును వాడొద్దు

నిషేధిత గడ్డి మందును వాడొద్దు ఎంఏఓ అంజిత్ కుమార్ జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:34 pm

Dacoit Censor: Will Sesh Continue Blockbuster Streak?

Adivi Sesh’s upcoming action drama Dacoit has wrapped up all censorship formalities, securing a U/A certificate in both Telugu and Hindi versions. With this, the path is clear for the film’s grand Pan-India release on the 10th of this month. The new poster features Adivi Sesh in an intense avatar, while the backdrop showcases him […] The post Dacoit Censor: Will Sesh Continue Blockbuster Streak? appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 7:32 pm

డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తా: ఎంపి మల్లు రవి

డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తానని నాగర్‌కర్నూల్ ఎంపి మల్లు రవి ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపి మల్లు రవి గురువారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్ వెనకబడ్డ ప్రాంతమని, రైల్వే నెట్‌వర్క్ ఎంతో అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కల్వకుర్తి నుంచి -మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగంగా ఉంటుందని ఆయన వివరించారు. కల్వకుర్తి అసెంబ్లీలో ఉన్న మొదటి గ్రామం ఇరువీన్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో పాదయాత్ర చేస్తానని ఆయన తెలియజేశారు. రైల్వే లైన్‌ను వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తేవడానికే పాదయాత్ర చేయబోతున్నుట్లు ప్రకటించారు. మూడోసారి ఎంపి అయిన తర్వాత డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ గురించి ప్రతి పార్లమెంట్ సెషన్‌లో మాట్లాడి, రైల్వే మంత్రికి విజ్ఞప్తులు చేశానని, సిఎం ద్వారా రైల్వే మంత్రికి లేఖ రాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల రైల్వే మంత్రిని కలిసి డోర్నకల్ నుంచి -గద్వాల్ రైల్వే లైన్ గురించి గుర్తుచేశానని, ఈ లైన్ నాగర్ కర్నూలు జిల్లాకి లైఫ్ లైన్ లాంటిదని వివరించినట్లు చెప్పారు. ఈ రైల్వే లైన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లోని కల్వకుర్తికి వచ్చి తరువాత వనపర్తి జిల్లా నుంచి గద్వాల్‌కి కనెక్ట్ అవుతుందని వివరించారు. జనరల్ రాయల్ ప్లాన్ కింద లైన్ నిర్ణయం తీసుకుంటే రెవెన్యూ రిటరన్స్ లేవనే ఇబ్బందులు తలెత్తుతాయని, దీన్ని బ్యాక్‌వర్డ్ ఏరియా డెవలప్‌మెంట్ రాయల్ ప్లాంట్ కింద తీసుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల వరకు లైన్ ఏర్పాటు చేయాలని కోరామని, ఇది రెండు రాష్ట్రాలను కలుపుతుందని చెప్పారు. ఈ లైన్‌ను కూడా త్వరలో మంజూరు చేసి, బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ రెండు లైన్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారని, రైల్వే లైన్ల సాధనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.

మన తెలంగాణ 2 Apr 2026 7:31 pm

ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి.

ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి. ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:30 pm

లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్

లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్ చాట్రాయి, తోట్లవల్లూరు, కాటూరు బ్రాంచ్‌లలో 100% వసూళ్లురైతు

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:24 pm

ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి..

ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి.. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:19 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెకెఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు ఓటమిపాలయ్యాయి. ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్‌సిబి చేతిలో ఓడిపోగా.. కెకెఆర్‌ని.. ముంబై ఇండియన్స్ జట్టు ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో గెలుపు ఖాతా తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతుండగా.. ఎస్‌ఆర్‌హెచ్ ఒక మార్పు చేసింది. శివాంగ్‌ని జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, బ్లెస్సింగ్ ముజర్బాని. ఎస్ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, డేవిడ్ పైన్.

మన తెలంగాణ 2 Apr 2026 7:17 pm

రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..?

రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..? టివిఏఈ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:14 pm

SameRates |అర్థమైందా రాజా…

SameRates | అర్థమైందా రాజా… SameRates | ఎవర్ని కదిలించినా యుద్ధం గురించే…!ఆ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:09 pm

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి చేరాలి

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి చేరాలి దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:07 pm

ఆ రోజు ప్రభాస్ చాలా బాధపడ్డాడు: వి.వి. వినాయక్

టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాహుబలి మొదటి భాగం విడదలైన తర్వాత చిత్ర బృందం ఓ పార్టీ ఏర్పాటు చేశారని, అందులో డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ డల్ గా కనిపించారన్నారు. అలా డల్ గా ఉండటానికి గల కారణం బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి నెగిటివ్ టాక్ రావడమే. దాంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన మొదటి రెండు, మూడు రోజులు నెగిటివ్ టాక్ రావడంతో ఎంతో బాధపడ్డారని, కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ కావడంతో చాలాఆపందపడ్డారని వినాయక్ తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 6:56 pm

ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు

ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:54 pm

ఇకనుంచి మన రాజధాని అమరావతి..

ఇకనుంచి మన రాజధాని అమరావతి.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం చారిత్రాత్మకం

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:41 pm

తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం..

తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదంఈ విజయం

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:36 pm

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తాం: పొంగులేటి

హైదరాబాద్: భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రూపొందించిన ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌ను రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం విఠాయిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా ప్రభుత్వమిది అని అన్నారు. ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.

మన తెలంగాణ 2 Apr 2026 6:35 pm

విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : పోటీ ప్రపంచంలో విద్యార్థినీ, విద్యార్థులు సెల్ ఫోన్ కు

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:26 pm

ఘనంగా బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి శఖటోత్సవం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:22 pm

కొలనుపాకలో వైభవంగా జైన మహావీరుని రథోత్సవం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లోని

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:18 pm

హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడి..

కాజీపేట, ఆంధ్రప్రభ : కాజీపేట పట్టణం 100 ఫీట్ల రోడ్డు ఉన్న హనుమకొండ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:14 pm

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?

రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను […] The post పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 6:11 pm

హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…

హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే… జన్నారం, ఆంధ్రప్రభ : హనుమాన్

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:04 pm

ఉప్లూర్ లో ప్రజాపాలన ప్రగతి –ప్రణాళిక గ్రామ సభ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో తెలంగాణ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:00 pm

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ద్యేయం..!

మాక్లూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ద్యేయమని, అందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:57 pm

తాత అంత్యక్రియలకు వెళ్తూ…

తాత అంత్యక్రియలకు వెళ్తూ… మనుమని మృతి..గుండెపోటుకు గురైన యువకుడు.. జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:56 pm

Congress : అనిరుధ్ రెడ్డి లక్ష్యం ఏంటి? ప్రచారం కోసమా? మరి?

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 5:56 pm

Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha SPL Story

Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:50 pm

6నుంచి ‘పది’ మూల్యాంకనం

*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మూల్యాంకనంలో […] The post 6నుంచి ‘పది’ మూల్యాంకనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 5:43 pm

‘జన నాయగన్’ విడుదల కాకుండా కుట్రలు..నాకు న్యాయం కావాలి విజయ్

చెన్నై:  సినీ నటుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళగ వెట్రి కళగం(టివికె) పార్టీని స్థాపించిన ఆయన త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌ రెండు నియోజకవర్గాల నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా రకరకాల కారణాల వల్ల విడుదల కాలేకపోయింది. అయితే తన సినిమా విడుదల కాకుండా కుట్రలు జరుగుతున్నాయని విజయ్ ఆరోపించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ‘‘కరూర్ ఘటన ఒక ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారు. మీకు న్యాయం కోసం నేను ఎలా అయితే కోరుతున్నానో.. నాకు కూడా న్యాయం కావాలని కోరుతున్నా’’ అని విజయ్ అన్నారు. ఎల్పిజి సిలిండర్ల కొరతపై స్పందించిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘తన కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర సిఎం స్టాలిన్ వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారు. ఎల్పిజి సిలిండర్ల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన దేశ రాజధానికి వెళ్లరా?’’ అని విజయ్ ప్రశ్నించారు.

మన తెలంగాణ 2 Apr 2026 5:35 pm

కేరళంలో ముగిసిన రేవంత్ పర్యటన

కేరళంలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు

తెలుగు పోస్ట్ 2 Apr 2026 5:31 pm

పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు

పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఉరవకొండ

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:29 pm

ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం…

ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం… ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:25 pm

Social Media |కట్న వేధింపుల ఆరోపణలు.. భర్తపై కేసు

Social Media | కట్న వేధింపుల ఆరోపణలు.. భర్తపై కేసు Social Media

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:21 pm

సంక్షేమ పథకాలపై అవగాహన

ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో ‘ప్రజా పాలన

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:16 pm

14 Dead |లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్

14 Dead | లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్ 14

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:07 pm

న్యాయవాదుల్లో సామాజిక స్పృహ, చైతన్యం ఎక్కువే: హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారని, ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో అగ్రభాగాన ఉన్నది కూడా న్యాయవాదులేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సమాజానికి సేవ చేయాలని వాళ్లలో ఉన్న ఆలోచనే ఈ వృత్తిని ఎన్నుకునేందుకు దోహదపడిందని అన్నారు. యూనివర్శిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉస్మానియా ఠాగూర్ ఆడిటోరియంలో డుకిమస్ వి లీడ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షకులుగా కొత్త జీవితాన్ని లా స్టూడెంట్స్ ప్రారంభించబోతున్నారని, లాయర్ ప్రొఫెషనల్ ను ఎంచుకోవడమే సంథింగ్ అని కొనియాడారు. న్యాయవాదుల్లో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ ఎక్కువని, న్యాయవాదులు ఉంటే ఉద్యమం గమ్యాన్ని ముద్దాడుతుందని హరీష్ రావు తెలియజేశారు. ఏ లక్ష్యంలో ఈ వృత్తిని ఎంచుకున్నారో చివరి వరకు అదే కొనసాగించాలని సూచించారు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, జైల్లో ఉండేవారు అత్యంత పేదవారని, న్యాయాన్నిపొందలేనివారు ఉన్నారని.. అలాంటి వారి కోసం న్యాయవాదులు పోరాడాలని, అండగా నిలబడాలని, పేదలకు గొంతుకగా నిలబడాలని.. కోరుకుంటున్నానని అన్నారు. ఉద్యమాలకు అణచివేయాలని ప్రభుత్వాలు చూస్తుంటాయని తెలియజేశారు. అసెంబ్లీలో హేట్ స్పీచ్ వచ్చిందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై దాడి కోసమే హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారని అన్నారు. రాజ్యంగం మనకిచ్చిన స్వేఛ్చను హరించేందుకు హేట్ స్పీచ్ బిల్లు అని విమర్శించారు. లాయర్లు స్వేచ్ఛను కాపాడగలిగితేనే జడ్జిమెంట్ లు న్యాయంగా వస్తాయని, రాజ్యాంగాన్ని లోబడే చట్టాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్ బిల్లుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు.. తప్పిదాన్ని నిలదీస్తే జైలు అని హరీష్ రావు దుయ్యబట్టారు.     

మన తెలంగాణ 2 Apr 2026 5:05 pm

అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత

అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత పార్లమెంటు ఆమోదం హర్షనీయంవిజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:02 pm

College |మనస్తాపానికి గురై…

College | మనస్తాపానికి గురై… College | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:57 pm

అమరావతి బిల్లుకు రాజ్యసభలో ఆమోద ముద్ర

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపి రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. కాగా, ఇప్పటికే అమరావతి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 2 Apr 2026 4:51 pm

Hyderabad Single Screens shifts to Percentage Model

The exhibitors of Telangana single screens have been trying hard to shift to a percentage basis model. With fewer single screens left, the survival of them is the need of the hour. A total number of 23 single screens located in and around Hyderabad will be working on Percentage basis model starting from tomorrow. All […] The post Hyderabad Single Screens shifts to Percentage Model appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:51 pm

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:48 pm

Mega158 all set for Launch

Megastar Chiranjeevi is committed to work with Bobby Kolli once again after the super success of Waltair Veerayya. The pre-production work has reached the final stages and the film is tentatively titled Mega158. The film will have its launch in a grand manner on April 11th in Hyderabad with a pooja ceremony and the shoot […] The post Mega158 all set for Launch appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:48 pm

పేరూరులో ప్రజాపాలన ప్రగతి గ్రామసభ…

కౌకుంట్ల, ఆంధ్రప్రభ : కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో 99 రోజుల ప్రజా

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:46 pm

ఉట్నూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని సర్వజినిక్ హనుమాన్ మందిర్

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:27 pm

JetLee First Single Video: Satya stuns with his Dance Moves

Jet Lee starring Comedian Satya, Rhea Singha in leading roles is gearing up to tickle funny bones of audiences. The movie produced by Mythri Movie Makers and Clap Entertainment has been latest hilarious offering from Mathu Vadalara director Ritesh Rana and Satya combination. The movie first single, Satya is not Jet Lee, is released today […] The post JetLee First Single Video: Satya stuns with his Dance Moves appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:26 pm

బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం

బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం విజయవాడ ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:20 pm

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: శాసనమండలి చైర్మన్

చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:19 pm

Andhra Prabha Smart Edition |TS|టాప్​ లెవల్​/కాంగ్రెస్​ దగా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 02-04-2026, 4.00PM ts టాప్​ లెవల్​ గ్రీనరీ..

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:18 pm

బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో […] The post బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:17 pm

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల […] The post చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:12 pm

రాజా రవివర్మ పెయింటింగ్.. వేలంలో రికార్డు ధరకు అమ్మకం..

ముంబై: భారతీయ చిత్రకారుల్లో రాజా రవివర్మకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన పెయింటింగ్స్ అంటే ఎంతో మందికి ఇష్టం. తాజాగా రవివర్మ పెయింటింగ్ ఒకటి రికార్డు ధరకు అమ్ముడు పోయింది. యశోద, కృష్ణులు ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్ ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడు పోయింది. ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్‌ ఆక్షన్‌ను నిర్వహించారు. ఈ వేలంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని దక్కించుకొనేందుకు అనేక మంది పోటీ పడ్డారు. కానీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్‌ని దక్కించుకున్నారు. 1890లలో గీసిన దీన్ని రూ.167 కోట్లకు కొనుగోలు చేశారు. గతేడాది ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అత్యంత ఖరీదైన కళాకృతిగా ఇది రికార్డు సాధించింది. తాజాగా ఈ రికార్డును రవివర్మ పెయింటింగ్ బద్దలుకొట్టింది. ఈ పెయింటింగ్ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని.. ఇది తన కర్తవ్యం అని సైరస్ మీడియాతో అన్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 4:12 pm

ఉట్నూర్ ను మోడల్ గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీని మోడల్ గా

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:09 pm

2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు

సంక్షేమ పథకం ప్రతి అర్హుడికి చేరాలి :జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : 20047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి …

జనం సాక్షి 2 Apr 2026 4:09 pm