SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

ఆర్‌టిసి బస్సు ఢీకొని బాలిక మృతి

 ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బాలిక మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 5లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బాలిక కీర్తి, సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. ఇద్దరిని బైక్‌పై వారి తండ్రి తీసుకుని వస్తుండగా రోడ్డు నంబర్ 5వద్ద వేగంగా వచ్చి ఆర్‌టిసి బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో బాలిక బస్సు కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్‌టిసి బస్సు డ్రైవర్ నిర్లక్షంగా బస్సును నడపడం వల్లే బాలిక మృతిచెందినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలిక తండ్రి, సోదరుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 4 Apr 2026 7:25 pm

12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష

12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Apr 2026 7:25 pm

గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో తమ గెలుపు ఖాతా తెరవాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్.. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. పాయింట్స్ టేబుల్‌లో నెం.1 స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కి జిటి జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు గాయం కావడంతో రషీద్‌కు తాత్కాలికంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. గిల్ స్థానంలో కుమార్ కుషాగ్రా ఈ మ్యాచ్‌తో ఐపిఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇక రాజస్థఆన్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ స్థానంలో తుషార్, బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబెలను జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ. జిటి: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(కెప్టెన్), కగిసో రబాడా, అశోశ్ శర్మ, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.

మన తెలంగాణ 4 Apr 2026 7:22 pm

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ లో తెలంగాణకు బంగారు పథకం

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నోయిడాలో జాతీయ స్కిల్ డెవలప్మెంట్ -2026 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో మెహ్రునిషా బేగం ప్రతిష్టాత్మక భారత నైపుణ్యాల పోటీ 2026 లో లోజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. బేగంపేట డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని, ప్రస్తుత కార్గోమెన్ లాజిస్టిక్స్ లో పనిచేస్తున్న మెహ్రునిషా బేగం, జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో గెలుపొంది, జాతీయ స్థాయికి చేరుకుని ఈ విజయాన్ని సాధించారు. ఈ ఇండియా స్కిల్స్ పోటీలు ప్రాక్టికల్ నేర్పులను, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను ప్రోత్సహించే జాతీయ వేదికగా నిలుస్తున్నాయి. 22 ఏళ్ల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిస్తారు. దీనిలో విజేతలకు అంతర్జాతీయ స్థాయి వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ లో కూడా పాల్గొందుకు అవకాశం కలుగుతుంది.

మన తెలంగాణ 4 Apr 2026 7:20 pm

ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం..

ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం.. తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల

ప్రభ న్యూస్ 4 Apr 2026 7:20 pm

IPL 2026 : ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విక్టరీ

ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 4 Apr 2026 7:17 pm

బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం…

బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం… ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ చౌటుప్పల్,

ప్రభ న్యూస్ 4 Apr 2026 7:09 pm

కుమ్మేసిన సమీర్ రిజ్వి.. ముంబైపై ఢిల్లీ ఘన విజయం

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ జట్టు ఆరంభంలో కాస్త తడబడింది. 7 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాతుమ్ నిస్సాంకాతో కలిసి సమీర్ రిజ్వి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే 44 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్‌లో నిస్సాంకా ఔట్ అయ్యాడు. అయితే సమీర్ మాత్రం ఏ మాత్రం జోరు తగ్గించలేదు. మైదానంలో పరుగుల వరద పారించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులతో ముంబై బౌలర్లను కుమ్మేశాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్(21) మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో ఢిల్లీ 164 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మన తెలంగాణ 4 Apr 2026 7:07 pm

మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి…

మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి… పిరికిపందల చర్యగా అభివర్ణించిన అమరం

ప్రభ న్యూస్ 4 Apr 2026 7:03 pm

Jeevan Reddy : జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం సిద్ధమయింది

తెలుగు పోస్ట్ 4 Apr 2026 7:02 pm

విజ‌య‌వంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్…

విజ‌య‌వంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్… మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:51 pm

ఆ పాపం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలదే: బండి సంజయ్

హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం జనావాసాలకు దగ్గరగా ఉండటమే కాకుండా వన్యప్రాణులు కూడా ఉండటమే అందుకు కారణమని చెప్పారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళనను అర్ధం చేసుకుని చెత్త డంపింగ్ యార్డ్ స్థలాన్ని జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలనే పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదమేనని బండి మండిపడ్డారు. గత పాలకులు ఇక్కడే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చిందన్నారు. ఆనాడు డంపింగ్ యార్డును హుజూరాబాద్ సమీపంలోనే ఏర్పాటు చేయాలని చెప్పిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులే ఈరోజు అందుకు భిన్నంగా ఆందోళనలు చేయడం సిగ్గు చేటన్నారు. శనివారం మధ్యాహ్నం హుజూరాబాద్ లో పర్యటించిన బండి సంజయ్.. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డితోపాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలోని డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో హుజూరాబాద్ మున్సిపాలిటీ శివారు ప్రాంతమైన సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తుండటంతో హుజూరాబాద్ ప్రజలకు తీవ్రమైన హానీ చేకూరే ప్రమాదముందని ఈ సందర్భంగా స్థానికులు బండి సంజయ్ ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డు ప్రాంతంలోనున్న గుట్టల్లో నెమళ్లు, పక్షులు సహా నిత్యం వన్యప్రాణులు సంచరిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తే వన్యప్రాణులు చచ్చిపోతాయని, దీంతోపాటు మనుషుల ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.... హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నీ బీజేపీ వ్యతిరేకిస్తుంది. హుజూరాబాద్ మున్సిపాలిటీకి సమీపంలో డంపింగ్ యార్డు ఉంది. ఇక్కడ చుట్టు పక్కల గ్రామాలున్నాయి. వీరిపై తీవ్ర ప్రభావం ఉంది. ఒక సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను స్రుష్టించడం సరికాదు. ప్రజల ప్రాణాలతో చెలగాడటం సరికాదు. నిజానికి ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది గత పాలకులు. ఈ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుమ్లాపూర్ సభలో ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే... మొట్టమొదట వ్యతిరేకించింది నేనే. ఆనాడు ఏ ఒక్కరూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అయినా ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఆనాడే డంపింగ్ యార్డు ప్రతిపాదనను వ్యతిరేకించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే పాపానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని పున:పరిశీలించాలి. అవసరమైతే హుజూరాబాద్ ప్రాంతానికి వచ్చి ఒక్కసారి డంపింగ్ యార్డు స్థలాన్ని సందర్శించాలి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా పోరాటాలు చేస్తాం అని హెచ్చరించారు.

మన తెలంగాణ 4 Apr 2026 6:46 pm

فیکٹ چیک: انڈونیشیا کے حالیہ زلزلے کے دعوے کے ساتھ وائرل فوٹیج دراصل فلپائن کا ہے

وائرل ویڈیو جسے انڈونیشیا کے حالیہ زلزلے کا بتایا جارہا ہے، گمراہ کن ہے۔ تلگو پوسٹ کی تحقیق سے پتہ چلا کہ یہ فوٹیج 2025 کے فلپائن کے زلزلے کا ہے جسے گمراہ کن دعوے کے ساتھ پھیلایا جارہا ہے۔

తెలుగు పోస్ట్ 4 Apr 2026 6:45 pm

బుషిహర్ న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా క్షిపణి దాడి

ఇరాన్ లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రం లక్షంగా క్షిపణి దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) తెలియజేసింది. ఇటీవలి కాలంలో ఇది నాలుగో ఘటన అని పేర్కొంది.ఈ క్షిపణి శకలం తగిలి సిబ్బందిలో ఒకరు చనిపోయారని తెలిపింది. ఆ ప్రాంతం లోని భవనం కూడా దెబ్బతిన్నట్టు వివరించింది. ఈ సంఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో రేడియేషన్‌కు దారి తీయలేదని స్పష్టం చేసింది. ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్ ఇదే కావడం గమనార్హం. తాజా పరిణామాలపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ మరియానో గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా భవనాల్లో కీలకమైన పరికరాలు ఉండే అవకాశం ఉందన్నారు. అణు కేంద్రాల సమీప ప్రాంతాలపై ఎన్నడూ దాడి చేయకూడదన్నారు. అణు ప్రమాదం ముప్పును నివారించేందుకు అత్యంత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అణుభద్రత, రక్షణకు కట్టుబడి ఉండటం అత్యంత ప్రాధాన్య అంశమని ఉద్ఘాటించారు. 

మన తెలంగాణ 4 Apr 2026 6:41 pm

Earth Quake : భూకంపంతో కాబూల్ లో ఎనిమిది మంది మృతి

కాబూల్ పరిసర ప్రాంతంలో సంభవించిన 5.8 తీవ్రత భూకంపంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు

తెలుగు పోస్ట్ 4 Apr 2026 6:39 pm

అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి, మండలం లోని గూడెం చెక్ పోస్ట్ వద్ద

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:38 pm

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో నమ్మకం పెరిగింది

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో నమ్మకం పెరిగింది రాష్ట్ర పోలీసు కంప్లైంట్ అథారిటీ బోర్డ్

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:36 pm

పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం

పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం తొర్రూరు, ఆంధ్రప్రభ : జీ

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:33 pm

రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి పనులు..

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్ర‌ద‌ర్శ‌నలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవాల‌య అభివృద్ధి ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి వివ‌రించారు. ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు రూ.225 కోట్ల అవసరమవుతాయని అధికారులు తెలిపారు. మాస్ట‌ర్‌ప్లాన్‌ను ప‌రిశీలించిన సీఎం ప‌లు మార్పులు సూచించారు. సంప్ర‌దాయాలు, శాస్త్రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని భ‌క్తుల విశ్వాసాల‌కు పెద్ద‌పీట వేస్తూ బాస‌ర ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ సూచించారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాలు, భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని విశాల‌మైన రోడ్లు నిర్మించాల‌ని ఆదేశించారు. ఆల‌య ప్రాంగణం భ‌విష్య‌త్‌లో భారీ వృక్షాల‌తో అల‌రారేలా అవ‌స‌ర‌మైన మొక్క‌లు నాటాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆల‌యం స‌మీపంలో హెల్త్ సెంట‌ర్ నిర్మించాల‌ని... పుష్క‌రాలు, ఇత‌ర ఉత్స‌వాల రోజుల్లో అక్క‌డ త‌గిన సంఖ్య‌లో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భ‌క్తుల‌కు సేవ‌లు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఎంత‌టి ప్ర‌ముఖుల వాహ‌నాలైనా ఆల‌య ప్రాంగ‌ణానికి బ‌య‌టే నిలిచిపోవాల‌ని... ఆల‌య ప్రాంగ‌ణంలోకి కేవ‌లం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం సూచించారు. వాహ‌నాల పార్కింగ్ ప్ర‌దేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాల‌న్నారు. అభివృద్ధి ప‌నుల స‌మ‌యంలో ఆల‌య ప‌విత్ర‌త‌కు ఎటువంటి భంగం కల‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అభివృద్ది ప‌నుల నాణ్య‌త‌లో రాజీప‌డితే ఏమాత్రం స‌హించేది లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. 

మన తెలంగాణ 4 Apr 2026 6:29 pm

108లో ప్రసూతి అయిన మహిళ

108లో ప్రసూతి అయిన మహిళ తల్లీ బిడ్డ క్షేమం సిర్పూర్ (యు) /లింగాపూర్,

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:29 pm

War Effect : మెడిసిన్స్ పై భారీ ఎఫెక్ట్.. ఈ మందులు పెరగనున్నాయ్

పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో మెడిసిన్స్ ధరలు పెంచాయి

తెలుగు పోస్ట్ 4 Apr 2026 6:22 pm

1 Dead 5 Injured Us Airstrikes : అమెరికా ప్రతిదాడి Andhra Prabha News

1 Dead 5 Injured Us Airstrikes : అమెరికా ప్రతిదాడి Andhra

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:13 pm

Dacoit: Action Is the Shell, Love Is the Core: Sesh

Adivi Sesh, after delivering a series of blockbusters, is aiming for an even bigger success with his upcoming Pan-India film Dacoit, releasing in theatres on April 10th. In an exclusive interview with us, the actor shared that distributors who watched the movie gave highly positive feedback, even thanking the team for making such a strong […] The post Dacoit: Action Is the Shell, Love Is the Core: Sesh appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 6:12 pm

acoit: Action Is the Shell, Love Is the Core: Sesh

Adivi Sesh, after delivering a series of blockbusters, is aiming for an even bigger success with his upcoming Pan-India film Dacoit, releasing in theatres on April 10th. In an exclusive interview with us, the actor shared that distributors who watched the movie gave highly positive feedback, even thanking the team for making such a strong […] The post acoit: Action Is the Shell, Love Is the Core: Sesh appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 6:12 pm

ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి

ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి పరకాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:10 pm

రోహిత్ అరుదైన రికార్డు.. ధోనీని దాటేశాడు..

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఐపిఎల్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సిక్సు బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మొత్తం 51 సిక్సర్లు కొట్టాడు. అయితే ఐపిఎల్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీ రికార్డును రోహిత్ అధిగమించాడు. ధోనీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 50 సిక్సులు బాదాడు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో సిక్సుతో ధోనీని రోహిత్ దాటేశాడు. ఇక ఈ విభాగంలో రోహిత్, ధోనీ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ సిఎస్‌కెపై 48 సిక్సులు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపిఎల్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్.. పంజాబ్‌పై 61, కెకెఆర్‌పై 54 సిక్సులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాడు.

మన తెలంగాణ 4 Apr 2026 6:10 pm

Sai Dharam Tej rejects Dozen Films

Supreme Star Sai Dharam Tej is extra cautious, not in a hurry and is not in a mood to do regular commercial flicks. After the super success of Virupaksha, Sai Dharam Tej is completely focused on Sambarala Yeti Gattu which is in shoot for over a year. He will soon team up with KA directors […] The post Sai Dharam Tej rejects Dozen Films appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 6:08 pm

ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలి…

ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలి… ఖమ్మం కల్చరల్, ఆంధ్ర ప్రభ : ప్రపంచమంతటా

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:08 pm

Women’s Health |ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి…

Women’s Health | ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి… Women’s Health |

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:01 pm

ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న

ప్రభ న్యూస్ 4 Apr 2026 5:56 pm

ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు,

ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు, చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో

ప్రభ న్యూస్ 4 Apr 2026 5:55 pm

Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో…

Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో… Shivansh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 4 Apr 2026 5:44 pm

అమరావతిపై కూటమిది ప్రచార ఆర్భాటమే

అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు

తెలుగు పోస్ట్ 4 Apr 2026 5:43 pm

కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి ఖండన..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; ఉద్యమ నాయకుడు,తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 4 Apr 2026 5:41 pm

తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం.. కేరళలో భట్టి వక్రమార్క

కేరళలో ఎల్డీఎఫ్ పూర్తిగా విఫలమైందని.. పరిపాలన ప్రమాణాలు, మానవీయ విలువలు దిగజారిపోయాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. నిరుద్యోగం పెరిగిపోవడంతో యువత విదేశాలకు వలస వెళ్తుండగా, రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు సరైన సంక్షేమం అందడం లేదని అన్నారు. కేరళం రాష్ట్రంలోని పతనం తిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళంలో గొప్ప మార్పు, మెరుగైన సంక్షేమం, సుపరిపాలన, సెక్యులర్ విలువలను స్థాపించాలంటే ఈనెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేరళం అంటే సెక్యులరిజం, ఉన్నత విద్య, మానవీయ విలువల ప్రతీకగా భావిస్తాం. కానీ ప్రస్తుతం ఆ విలువలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిజం, మార్క్సిజం పేరుతో వచ్చిన ప్రభుత్వం గుండాయిజం వైపు మళ్లిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన, శాంతి, సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఎవరైనా అనుమానం ఉంటే తెలంగాణకు వచ్చి పరిశీలించాలని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు వేల కోట్ల భారం కుటుంబాలపై తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేదలకు రూ.500 గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ నిర్మాణం చేపట్టామని వివరించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం భారీ మొత్తంలో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, విద్య మరియు వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. కేరళంలో యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడితే కాలేజీకి వెళ్లే మహిళలకు నెలకు రూ.1000 ఆర్థిక సహాయం, యువతకు వడ్డీ లేని రుణాలు, సామాజిక పెన్షన్ పెంపు వంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమెన్ చాందీ పేరుతో వృద్ధుల కోసం ప్రత్యేక బీమా పథకం తీసుకువస్తామని తెలిపారు. అలాగే వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేరళం ప్రజలు మార్పు కోసం యుడిఎఫ్‌కు మద్దతు ఇవ్వాలని భట్టి పిలుపునిచ్చారు.  

మన తెలంగాణ 4 Apr 2026 5:37 pm

నిరాహార దీక్ష విరమింపజేసిన డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ..

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన

ప్రభ న్యూస్ 4 Apr 2026 5:37 pm

రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది…

ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) విశాలాంధ్ర నందిగామ:-ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశీలనకు వచ్చిన ఆయన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంతో హుందాతనంతో రాజధాని విషయంలో మాట్లాడాల్సి ఉందని అటువంటి సమయంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి […] The post రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 5:30 pm

రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్పస్కోర్‌కే పరిమితమైన ముంబై

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ముంబై జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. 3వ ఓవర్‌లోనే ముఖేష్ కుమార్ రికెల్టన్(9), తిలక్ వర్మ(0)లను పెవిలియన్ పంపించాడు. ఈ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యం జత చేశాడు. వీరిద్దరు కలిసి 53 పరుగుల స్కోర్‌ని జోడించారు. అయితే ఈ భాగస్వామ్యానికి అక్షర్ బ్రేక్ వేశాడు. అక్షర్ బౌలింగ్‌లో రోహిత్(35) ఔట్ అయ్యాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నమన్ ధిర్ 28 పరుగులు చేసి ఫర్వాలేదు అనిపించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్‌లో ముఖేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్, విప్రాజ్, నటరాజన్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 4 Apr 2026 5:27 pm

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలని, ఆన్లైన్ పేరుతో పాఠ్యపుస్తకాలు అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లకు ఎర్ర లేపుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అడ్మిషన్లు చేపడుతున్నారని వారు మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల […] The post ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 5:26 pm

స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం..

ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; స్వర్ణ గ్రామం నిర్మాణం ఆం ఆత్మీ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సంద స్థానిక ప్రణాళికల అమలులో పంచాయితీ రాజ్ పాత్ర విశిష్టమైనది అన్నారు,ధర్మవరం నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ గ్రామాల్లో తాగునీరు,రహదారులు, వీధిలైట్లు,డ్రైనేజీ , పరిసరాల పరిశుభ్రత వంటి కనీస సదుపాయాల ఏర్పాటు చేయడం లో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం, ఇంకా గత వైసిపిప్రభుత్వాలు విఫలం అయ్యాయి అన్నారు. ఈ […] The post స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 5:23 pm

రోగులకు చేసే సేవ.. దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు చేసే సేవా దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి -గాంధీనగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను, తదుపరి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్ లను వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ, వెంకటస్వామి వారు నిర్వహించడం […] The post రోగులకు చేసే సేవ.. దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 5:18 pm

ఇంటెన్స్, బోల్డ్‌గా ‘డెకాయిట్’ ట్రైలర్

హైదరాబాద్: విభిన్నమైన విలక్షణమైన సినిమాలు చేయడంలో నటుడు అడివి శేష్ ఎప్పుడు ముందుంటాడు. ఆయన సినిమాలు అంటేనే.. ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుంది. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇంటెన్స్, బోల్డ్‌గా ఉంది. అడివిశేష్, మృణాల్ నటన ఆకట్టుకునేలా ఉంది. హరి, జూలియట్ పాత్రల్లో వారిద్దరూ ఒదిగిపోయారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 4 Apr 2026 5:12 pm

ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలవడం గర్వించదగ్గ విషయం..

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం రూరల్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచులు గా ఉంటూ, ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్లు పార్టీగా అండగా నిలవడం గర్వించదగ్గ విషయము అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సభను వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడిలు భరించి కష్టపడి పని చేశారని మీ నిబృ దత్తత మరువలేమని రాబోయే రోజుల్లో పార్టీలో […] The post ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలవడం గర్వించదగ్గ విషయం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 5:12 pm

Chelli Swapna |సీరియల్ నటి చెల్లి స్వప్న సంచలన వ్యాఖ్యలు..

Chelli Swapna | సీరియల్ నటి చెల్లి స్వప్న సంచలన వ్యాఖ్యలు.. Chelli

ప్రభ న్యూస్ 4 Apr 2026 5:05 pm

అత్యాధునిక ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)’ ప్రారంభం…

అత్యాధునిక ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)’ ప్రారంభం… ​మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రాణాపాయ

ప్రభ న్యూస్ 4 Apr 2026 5:05 pm

చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సర్పంచ్ పదవి ముగీయడంతో సర్పంచు బసమ్మ, ఉప సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు మంజునాథ్, హరిజన మరియమ్మ, తెలుగు రమేష్, చాకలి ఈరమ్మ, మాల శివ, మంగలి నర్సమ్మలను శనివారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు సిద్దప్ప ధని, వీరేష్ గౌడ్ లు ఘనంగా […] The post చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 5:04 pm

Fire Accident | 8 ఆటోలు దగ్ధం

Fire Accident | 8 ఆటోలు దగ్ధం Fire Accident | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 4 Apr 2026 5:01 pm

వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…

విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు […] The post వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 5:00 pm

రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు: సబితా

హైదరాబాద్: వాయిదా పడ్డ మున్సిపాలిటీలలో ప్రజాస్వామ్యం గెలిచిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కోటాలో వేసుకోవాలని విశ్వప్రయత్నం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎవరెన్ని ప్రలోభాలకు పెట్టినా బిఆర్ఎస్ వైపు నిలిచిన కౌన్సిలర్లకు, కాంగ్రెస్ ప్రలోభాలకు ప్రజలు లొంగకుండా బిఆర్ఎస్ ను ఓట్లేసి గెలిపించారని, ఎన్నికల వరకు తీసుకొచ్చిన మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నేటి పరిస్థితులను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోందని సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. 

మన తెలంగాణ 4 Apr 2026 4:55 pm

పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు…

విశాలాంధ్ర నందిగామ : కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తెలుగుదేశం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లేపల్లి మధుబాబు పేర్కొన్నారు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో శనివారం జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కి సంబంధించిన ఈ కేవైసీ కార్యక్రమం మరియు పంపిణీ కార్యక్రమంలో స్థానిక అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు జలక్ ఇచ్చారు స్థానిక వైసీపీ నాయకులు జిల్లేపల్లి రాముతో కలిసి వారు ఈ కార్యక్రమాలను కొనసాగించడం పై […] The post పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 4:51 pm

Young directors picking NBK among Veterans

Nandamuri Balakrishna has delivered decent films post-pandemic. He is also in his best phase in his career. Several young and talented directors are keen to work with NBK. Tollywood was surprised to know that young director Vivek Athreya is directing NBK Soon. Vivek Athreya has delivered unique content and his collaboration with NBK is a […] The post Young directors picking NBK among Veterans appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 4:47 pm

ప్రత్యేక అధికారులుగా నియామకాలు

విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ రెండవ తేదీతో ముగియడంతో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం పూర్తి అయినది. దీంతో ప్రభుత్వ జీవో నెంబర్ 47 ప్రకారం ఏప్రిల్ మూడవ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులకు బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. పంచాయితీ ఎన్నికలు జరిగే వరకూ స్పెషల్ ఆఫీసర్లుగా మీరు కొనసాగిస్తారు. ఇందులో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వర్తిస్తున్న ఎం […] The post ప్రత్యేక అధికారులుగా నియామకాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 4:42 pm

Mega Hero |సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు..

Mega Hero | సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు.. Mega Hero

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:39 pm

ప్రజల చిరకాల కోరిక సాకారం చేసిన ఎమ్మెల్యే…

ప్రజల చిరకాల కోరిక సాకారం చేసిన ఎమ్మెల్యే… గన్నవరం – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:39 pm

Smart phone |లైకులు లక్షల్లో… విలువలు మైనస్‌లో?

Smart phone | లైకులు లక్షల్లో… విలువలు మైనస్‌లో? Smart phone |

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:39 pm

Telangana |సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్

Telangana | సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్ Telangana |

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:36 pm

Tragic Incident |కరెంట్ షాక్‌తో…

Tragic Incident | కరెంట్ షాక్‌తో… Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:33 pm

రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది

యువర్స్ ఫౌండేషన్ ప్రతినిధులువిశాలాంధ్ర -ధర్మవరం; ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది అని యువర్స్ ఫౌండేషన్ సభ్యులు సత్రశాల మల్లికార్జున, గర్రె రమేష్ బాబు, రామచంద్రగుప్త తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 350 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గురువారం దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం […] The post రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 4:25 pm

ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ద్వజస్తంభ ప్రతిష్ఠాపన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:20 pm

నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత చింతా చిన్న కొండన్న

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గాండ్లవీధి కి చెందిన కీ శే చింతా చిన్న కొండన్న ( 36) ఏప్రిల్ 1వ తేదీన రోడ్డు ప్రమాదం లో మరణించగా విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారం మేరకు గురువారం ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు విజయవాడ ఎల్ వి ప్రసాద్, నేత్రాలయ వారి టెక్నీషన్ యు. ప్రసాద్ గారు కంటి […] The post నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత చింతా చిన్న కొండన్న appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 4:17 pm

ప్రశాంత్‌కు యూకే ఎన్నారై కన్వీనర్ పదవి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక కు

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:17 pm

Andhra Prabha Smart Edition |AP|రాజధాని స్పీడ్​/బాదంపాలు కలుషితం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 04-04-2026, 4.00PM ap రాజధాని స్పీడ్​.. పనుల్లో

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:17 pm

క్షేత్రస్థాయిలో గ్రామ సందర్శనతోనే సమస్యలపై పట్టు

ఎంపీడీవో బి. విజయలక్ష్మి విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, నిరంతరం గ్రామాల్లో పర్యటించినప్పుడే క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన, పట్టు వస్తుందని రాప్తాడు ఎంపీడీవో బి. విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు, ప్రత్యేక అధికారులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడే అసలైన సమస్యలు వెలుగులోకి వస్తాయని, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక […] The post క్షేత్రస్థాయిలో గ్రామ సందర్శనతోనే సమస్యలపై పట్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 4:14 pm

శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మండలం పరిధిలో పెద్దకాపర్తి గ్రామంలోని అతి పురాతనమైన

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:14 pm

Andhra Prabha Smart Edition |TS|బంగారు బాబులు/ట్రాఫిక్​ ఆంక్షలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 04-04-2026, 4.00PM ts ఐటీ రాడార్​లో బంగారు

ప్రభ న్యూస్ 4 Apr 2026 4:13 pm

తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం తెలగావీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్‌ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాలని వారు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు […] The post తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 4:09 pm

కంచె దాటుతున్న యవ్వనం..

​ ఆకర్షణకు లోనై ప్రేమ వివాహాలు.. తల్లిదండ్రుల ఆశలు ఆవిరి​ ప్రశ్నార్థకంగా మారుతున్న యువత భవిష్యత్తు ​విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : ​ఓ యువతా… కన్నవారి కన్నీరు కావేరి కాకూడదు. నీ కన్న కలలన్నీ కల్లలు కాకూడదు. క్షణికావేశంలో కలిగే ఆకర్షణను ఃప్రేమః అనుకుని నీ జీవితాన్ని బలితీసుకోకు. నీకంటూ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉందని మర్చిపోకు. సంస్కారం లేని చదువు, బాధ్యత లేని యవ్వనం సమాజానికి ఎప్పుడూ ప్రమాదకరమే. నేడు ఈ ప్రాథమిక […] The post కంచె దాటుతున్న యవ్వనం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 4:05 pm

పిల్లలకు విలువలపై అవగాహన కల్పిస్తున్నాం: లోకేష్

అమరావతి: సమాజంలో విలువలు పడిపోయాయని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. విలువలు పెంచాలనే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కర్ణాటకలోని సింధనూరులో లోకేష్ పర్యటించారు. హోసళ్లి క్యాంప్ వరకు ర్యాలీ నిర్వహించగా.. లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అందుకే చాగంటి కోటేశ్వరరావు కేబినెట్ ర్యాంక్ ఇచ్చామని, పిల్లలకు విలువలపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. తెలుగుభాషలో మహిళలను అవమానించేలా కొన్ని పదాలు ఉన్నాయని, ఏ పని చేసినా తల్లికి చెప్పాలని..తల్లికి చెప్పలేని పని చేయవద్దని సూచించారు. ఏ తప్పు చేయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడును ఆనాడు అరెస్ట్ చేసి..53 రోజులు జైల్లో పెట్టారని, సింధనూరు, రాయ్ చూర్, గంగావతి ప్రజలు ఆ సమయంలో అండగా నిలబడ్డారని తెలియజేశారు. సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూలు నెంబర్ వన్ కావాలని లోకేష్ ఆకాంక్షించారు. 

మన తెలంగాణ 4 Apr 2026 4:04 pm

Revanth Reddy |మాస్టర్‌ ప్లాన్​పై సీఎం సమీక్ష

Revanth Reddy | మాస్టర్‌ ప్లాన్​పై సీఎం సమీక్ష Revanth Reddy |

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:53 pm

టెక్ దిగ్గజ సంస్థ డెల్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్

అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ డెల్‌ను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఈ మేరకు సంచలన ప్రకటన విడుదల చేస్తూ… అమెరికా ఐటీ సంస్థలు ఆ దేశానికి గూఢచారులుగా పనిచేస్తున్నాయని ఆరోపించింది. ఇరాన్ ప్రకటనపై డెల్ వెంటనే స్పందించింది. తమ ఉద్యోగుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ అంతర్గత మెమో జారీ చేసింది. ఉద్యోగులెవరూ ఇరాన్ కు వెళ్లవద్దని, అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. […] The post టెక్ దిగ్గజ సంస్థ డెల్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 3:49 pm

బిజ్వార్ అంబాత్రయ క్షేత్రంలో గోమాత కళ్యాణం

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గోమాత కళ్యాణం తిలకించి పునీతులుకావాలని, భక్తులు అధిక సంఖ్యలో

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:44 pm

Refilling |నలుగురు అక్కడికక్కడే మృతి..

Refilling | నలుగురు అక్కడికక్కడే మృతి.. Refilling | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:42 pm

Tollywood Producers Vs OTT Players: Who will Take the Edge?

After the pandemic, there are drastic changes seen in Indian cinema. There is big demand for the digital rights and top digital players like Netflix, Amazon and others reached out to the regional cinema. They shelled out big money and invested in Indian films. After Bollywood, Telugu cinema is the biggest. Several Telugu films ended […] The post Tollywood Producers Vs OTT Players: Who will Take the Edge? appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 3:40 pm

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా వారు మౌనంగా ఉండటం దారుణం

: అంబటి రాంబాబుటీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ రాష్ట్రంలోని పలు ఆలయాల్లో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా, ఆయనను ఇంకా చైర్మన్ పదవిలో కొనసాగించడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, నెటిజన్లు విమర్శిస్తున్నా సీఎం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్ నాయుడు […] The post మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా వారు మౌనంగా ఉండటం దారుణం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 3:37 pm

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి…

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:28 pm

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ… ఇటిక్యాల, ఆంధ్రప్రభ : సీఎం సహాయ

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:22 pm

Telangana |ఛైర్మన్ ఎన్నిక..

Telangana | ఛైర్మన్ ఎన్నిక.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:22 pm

Sesh’s Dacoit Trailer: Packs Next Level Punch

Adivi Sesh is gearing up to arrive with his much-anticipated love–action drama Dacoit, slated for a grand Pan-India release on April 10th. Six days ahead of its arrival, the makers dropped the theatrical trailer. Hari and Juliet hope to get married and start a joyful life. But everything collapses when Hari is betrayed and sent […] The post Sesh’s Dacoit Trailer: Packs Next Level Punch appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 3:19 pm

Station Tower |సీఎంతో మాట్లాడాలని డిమాండ్

Station Tower | సీఎంతో మాట్లాడాలని డిమాండ్ Station Tower | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:16 pm

నూతన ట్రస్ట్ సభ్యులకు సన్మానం..

నూతన ట్రస్ట్ సభ్యులకు సన్మానం.. ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:12 pm

గోదావరి నీటితో వెంకటాద్రి చెరువు జలమయం…

గోదావరి నీటితో వెంకటాద్రి చెరువు జలమయం… చిలుపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : మండు వేసవిలో

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:09 pm

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి…..

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి….. బీజేపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్……..

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:04 pm

ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసంతో

ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసంతో ఉట్నూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు ఉట్నూర్,

ప్రభ న్యూస్ 4 Apr 2026 3:00 pm

బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన ధురంధర్2.. రానా రియాక్షన్ ఇదే

రణ్‌వీర్ సింగ్ హీరోగా అదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్: ది రివేంజ్’. విడుదలైన రోజు నుంచి ఈ సినిమా ప్రశంసలు అందుకుంటోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాగా ఎన్నో ఏళ్లుగా నార్త్ అమెరికాలో బాహుబలి పేరుతో ఉణ్న రికార్డును తాజాగా ఈ సినిమా బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. దీనిపై బాహుబలిలో భళ్లాలదేవగా విలనిజం పండించిన రానా స్పందించారు. ధురంధర్ సినిమా సాధిస్తున్న రికార్డులు చూసి ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ‘‘ఎన్నో దశాబ్దాలుగా బాహుబలి పేరిట ఉన్న రికార్డను ధురంధర్2 సొంతం చేసుకుంది. బాహుబలి, ధురంధర్ లాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఎన్నో రికార్డులు సొంతం చేసుకోవాలి. ఎన్ని వచ్చినా దేని ప్రత్యేకత దానిదే’’ అని రానా అన్నారు. స్థానిక కథల గురించి ఆయన ప్రస్తావించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు తీయడంలో కొరియా వాళ్లు ముందుంటారు అని రానా తెలిపారు.

మన తెలంగాణ 4 Apr 2026 2:54 pm

భారీ పేలుడు.. ముగ్గురు స్పాట్ డెడ్

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలీలో భారీ పేలుడు సంభవించింది. శనివారం ఉదయం సిల్వాసాలోని డెమ్ని స్కూల్ ఫాలియా ప్రాంతంలో ఉన్న ఓ నైట్రోజన్ గోదాంలో జరిగినపేలుడులో కనీసం ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని మూసివేశారు. గాయపడిని వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఉదయం ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయని స్థానికులు తెలిపారు.ఈ గోదాం రద్దీగా ఉండే రహదారికి సమీపంలో, ఒక పాఠశాలకు కేవలం 30 మీటర్ల దూరంలో ఉండటంతో  భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ గోదాం సరైన అనుమతులతో పనిచేస్తోందా లేదా అనే విషయంపై విచారణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 4 Apr 2026 2:52 pm