సత్తా ఎవరిదో.. చెత్త ఎవరిదో తేల్చుకుందాం
మన తెలంగాణ/హైదరాబాద్: దమ్ముంటే సిఎం రేవంత్రెడ్డి గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లు అడగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి తా ము సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్లో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చ కు రావాలన్నారు. చర్చించడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్లేస్, టైమ్ వాళ్లు చెప్పినా సరే..తమను చెప్పమన్నా స రే అని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటరైనా.. గాంధీభవన్ అయినా, అసెంబ్లీలో చర్చ పెట్టినా తాము ఈ విషయాలపై చర్చించడానికి రెడీగా ఉ న్నామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి నివేదికను విడుదల చే శారు. తెలంగాణ భవన్ లో నివేదికను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూ బ్లీహిల్స్లో ఓడిపోతామనే రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశా రు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అ ర్థమైయేటట్లు చెప్పే సత్తా తమకు ఉందని అన్నా రు. కానీ రేవంత్రెడ్డి మమ్మల్ని తిట్టినా తాము మాత్రం గౌరవంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన ఆయన దీంతో చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేలి పోతుందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేసిన అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్లో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మించామని, తమ హయాంలో స్టార్ట్ చేసిన వాటికే కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసిందని వివరించారు. అవి కాకుండా కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్త రోడ్ల సంగతి తర్వాత, కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అని నిలదీశారు. నగర ప్రజలకు మళ్లీ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు : హైదరాబాద్లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ కూడా సీఎంగా ఒక ఏరియాను ఎంచుకొని అక్కడ శానిటేషన్ పనులు పర్యవేక్షించారని గుర్తు చేశారు. స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ్ ఆటోలను ప్రవేశపెట్టామని అన్నారు. ఇప్పుడు కనీసం ఒక్క ఆటోనైనా ప్రవేశపెట్టారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతి రోజు 7.5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించామని వెల్లడించారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్లో 34 అవార్డులు సాధించామని తెలిపారు. బెస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్కు అవార్డు వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్ఎన్డిపిని కూడా స్టార్ట్ చేసినట్లు తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ హైదరాబాద్ను క్లీన్ సిటీగా మారిస్తే ఇప్పుడు దానిని కాంగ్రెస్ ప్రభుత్వం మురికికూపంగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు : పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిదని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కట్టకపోగా వేలాది ఇళ్లను హైడ్రా పేరుతో ప్రభుత్వం కూలగొట్టిందని ఫైరయ్యారు. హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమేనని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మెట్రో సీఎఫ్వో, ఎల్ అండ్ టీ సీఎఫ్వోలను బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బాధ తట్టుకోలేక, వాళ్ల బెదిరింపులకు తాళలేక ఎంత మంది పారిశ్రామికవేత్తలు పారిపోయారో చర్చకు సిద్ధమా అని నిలదీశారు. కరెంటు విషయంలోనూ కాంగ్రెస్ తీరును కేటీఆర్ ఎండగట్టారు. కాంగ్రెస్ హయాంలో వారానికి రెండు, మూడు రోజులు పవర్ హాలిడేస్ ఉంటే తాము అధికారం చేపట్టిన తర్వాత 24 గంటలు కరెంటు ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్ఈడీ బల్బులతో తెలంగాణను దేదీప్యమానంగా చేశామని, రెండేళ్లలో రేవంత్ సర్కార్ ఒక్క ఎల్ఈడీ అయినా పెట్టిందా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగాయో, ఎవరి హయాంలో విద్యుత్ కోతలతో ఇబ్బంది పడ్డారో చర్చిద్దామా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఉన్న చెట్లను నరికేశారు : కాంక్రీట్ జంగిల్లో కొత్తగా లంగ్ స్పేస్లు ఏర్పాటు చేసిన ఘనత తమదే అని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి 16వేల నర్సరీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క నర్సరీ కూడా పెట్టకపోగా ఉన్న చెట్లను నరికేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రూ.10వేల కోట్లకు కక్కుర్తిపడి హెచ్సియులో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాలను కూడా మూడు లక్షల నుంచి 9 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలోనూ కాంగ్రెస్ పనితీరు ఏంటో కేటీఆర్ బయటపెట్టారు. బీఆర్ఎస్ హయాంలో సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్ హైదరాబాద్లో శాంతి భద్రతలు పెంపొందిస్తే ఇప్పుడు సైబరాబాద్లో 41 శాతం, హైదరాబాద్లో 60 శాతం క్రైమ్ రేటు పెరిగిందని, డే లైట్ మర్డర్లు పెరిగాయన్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు హైదరాబాద్లోని చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా అని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, మోదీ మధ్య ఫెవికాల్ బంధం : సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మంచి ఫెవికాల్ బంధం ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్- బీజేపీ జాయింట్ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాహుల్ గాంధీ విమర్శిస్తే అదే సంస్థలను రేవంత్ నమ్ముతారని వెల్లడించారు. ఇక మైనార్టీలను అవమానించినందుకు గాను రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కెటిఆర్ హెచ్చరించారు. అటు ఫార్ములా ఈ కేసులోనూ గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చినా, చార్జ్షీట్లో విషయం లేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని తేల్చిచెప్పారు. తనపై చేసిన ఆరోపణల విషయంలో దమ్ముంటే ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా తాను లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమే అని..రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. దీంతో ఎవరు దొంగనో తేలిపోతుంది కదా అని చెప్పారు. ప్రతి విషయంలోనూ పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం సరే..మీ హామీల మాటేమిటి?
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్పార్టీల మధ్య మాటల తూ టాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిలదీతలతో బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మా టల దాడి చేసుకుంటున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇత ర రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్రావులను సీబీఐ అరెస్ట్ చేయడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11లోగా వీరిద్దరిని సీబీఐతో అరెస్ట్ చేయించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కిషన్రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా 'ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇందుకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి బుధవారం తన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ముందు మీడియాతో మాట్లాడుతూ అంతే ధీటుగా రేవంత్రెడ్డికి సమాధానం ఇచ్చారు. బిజెపి ఎన్నికలకు ముం దు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎటువంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డే కేసీఆర్, హరీశ్లను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వారిని అరెస్టు చేయలేదని కిషన్రెడ్డి నిలదీశారు. తమకు సంబంధం లేని విషయాలను ఆపాదించడం సరికాదని అన్నారు. అరెస్టులు సం గతి పక్కన పెట్టి రేవంత్రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభు త్వం దృష్టిసారించాలని కిషన్రెడ్డి హితవు పలికారు. అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదు తెలంగాణలో కెసిఆర్ పోయి, రేవంత్రెడ్డి వచ్చినా అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. అడుగడుగునా రాష్ట్రం లో అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలను రేవంత్రెడ్డి ప్రభుత్వం మో సం చేసిందని ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డికి మద్దతుగా బుధవారం సా యంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కిషన్రెడ్డి గత కెసిఆర్ ప్రభుత్వం, ఇప్పటి రేవంత్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం పదవిలోకి కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చినా అవినీతి తగ్గలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. మైనార్టీ ఓట్లతో కాంగ్రెస్ ఈ ఎన్నికలో విజ యం సాధించాలని చూస్తోందని విమర్శించారు. పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగితే మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు గురించి మాట్లాడి దాట వేత వైఖరిని అవలంభిస్తున్నారని అన్నారు. జాబ్క్యాలెండర్, బంగారం కానుకలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. వెంకటగిరి, యూ సుఫ్ గూడా డివిజన్లలో బిజెపి కార్యకర్తలతో కలి సి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సాయంత్రం బోరబండ డివిజన్, ఎర్రగడ్డ డివిజపలో బిజెపి అభ్యర్థి దీపక్రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
గురువారం రాశి ఫలాలు (06-11-2025)
మేషం: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూసంభందిత క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. వృషభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీకోలేరు. మిధునం: ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకుపరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం: బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబసభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సింహం: కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. కన్య: దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తుల: ఋణదాతలనుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారా, ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృశ్చికం: చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ధనస్సు: ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటాయి. మకరం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. శుభవార్తలుఅందుతాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభం: చేపట్టిన పనులు నత్తనడక సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి. మీనం: అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యవిషయాలు పట్ల సంతృప్తికరంగా సాగుతాయి.
రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి, అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. రశ్మిక ఈ సినిమాలో జీవించేసింది”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని తెలియజేశారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా నా కెరీర్ లో ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. అల్లు అరవింద్ ఓకే చెప్పకుంటే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. ఈ సినిమాలో రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి, హేషమ్ అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు.
. నేపాల్లో ఏకీకృత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం. సమన్వయకర్తలుగా ప్రచండ, నేపాల్ ఏకగ్రీవం ఖాట్మండు: నేపాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 వామపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. సీపీఎన్ (మావోయిస్టు సెంటర్), సీపీఎన్ (ఏకీకృత సోషలిస్టు), నేపాల్ సోషలిస్ట్ పార్టీ, సీపీఎన్ (సోషలిస్ట్), జన సమాజ్వాదీ పార్టీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్`సోషలిస్ట్), సీపీఎన్ (సమాజ్వాదీ)తో పాటు వామపక్ష పార్టీలన్నీ కలిసి ఐక్య పార్టీ ఏర్పాటునకు అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించి 18 అంశాల ఒప్పందంపై సంతకాలు చేశాయి. […] The post ఒక్కటైన 10 వామపక్షాలు appeared first on Visalaandhra .
. న్యూయార్క్ మేయర్గా సోషలిస్టు జొహ్రాన్ మమ్దానీ. స్థానిక పోరులో డెమొక్రాట్ల ప్రభంజనం. వర్జీనియాలో భారత సంతతి ముస్లిం ఎన్నిక. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, సిన్సినాటిలోనూ రిపబ్లికన్లు చిత్తు న్యూయార్క్: ట్రంప్ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తిగిలింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ఘోర పరాభవాన్ని చవిచూశారు. 2024 ఎన్నికలప్పుడు ట్రంప్ హవాలో కొట్టుకుపోయిన డెమొక్రాట్ పార్టీకి ఈ ఎన్నికలతో కొత్త ఊపిరి లభించింది. ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయాలతో చరిత్ర సృష్టించారు. […] The post ట్రంప్ పాలనకు ఛీత్కారం appeared first on Visalaandhra .
అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతే
పన్డీఏ విధానాలపై రామకృష్ణ, వెంకటరెడ్డి . ప్రైవేటీకరణ, అప్పులు, అవినీతితో అరాచకం. తీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళ విధానం స్ఫూర్తిదాయకం. బీహార్ పన్నికల్లో పన్డీఏకు పరాభవం తప్పదు. డిసెంబరు 26న ‘చలో ఖమ్మం’. 18న సామాజిక న్యాయం కోసం ఆందోళనలు. ఉద్యమాలు ఉధృతం చేస్తాం: జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర- విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనతో ప్రజల జీవన పరిస్థితులు దయనీయంగా మారిపోయాయని, బలమైన ఉద్యమాలు నిర్మించడం ద్వారా ఈ అధ్వాన పాలనకు చరమగీతం పలకాల్సిన […] The post అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతే appeared first on Visalaandhra .
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు
కీలక దస్త్రాల స్వాధీనంపరారైన డాక్యుమెంట్ రైటర్లు! విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మెరుపు దాడులు నిర్వహించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు… అనుమానాస్పదంగా ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులతో ఒక్కసారిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ […] The post సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు appeared first on Visalaandhra .
భారత మహిళల జట్టుకు ప్రధాని మోడీ ఆతిథ్యం..
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత క్రికెట్ జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసింది. ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ టీమిండియా సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి జట్టు సభ్యులు ప్రధానీతో భేటి అయ్యారు. ఈ క్రమంలో క్రికెటర్లు వరల్డ్కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని అభినందనలు తెలిపారు. కాగా, 47ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ తొలిసారి భారత జట్టు వన్డే ప్రపంచకప్ సాధించింది. నవీ ముంబై వేదిగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ లో భారత్ 52 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. టీమిండియాపై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన 4వ జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఏడు సార్లు, ఇంగ్లండ్ నాలుగు సార్లు, న్యూజిలాండ్ ఒక్కసారి ప్రపంచకప్ ను గెలుచుకున్నాయి.
కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులు
తాము వద్దన్నా వినకుండా ప్రేమ పేరుతో కులాంతర వివాహాం చేసుకున్న కుమార్తెను అత్తవారింటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కన్న తల్లిదండ్రులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా. ఎండపల్లి మండలం, రాజారాంపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, పాలకురి మండలం, బసంత్నగర్కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం, రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేశ్ గత ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తమ బిడ్డను ప్రేమించిన రాకేశ్ దళితుడు కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు ఆ పెళ్లికి అడ్డు చెప్పారు. అయితే రాకేశ్నే పెళ్లి చేసుకుని అతడితోనే జీవిస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రియాంక జూలై 27న అతనిని కులాంతర వివాహం చేసుకుంది. తాము వద్దన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లిదండ్రులు వారిద్దరినీ విడదీసేందుకు అప్పటి నుంచి విఫల ప్రయత్నాలు చేశారు.రాకేశ్తోనే తన జీవితమంటూ ప్రియాంక అతడి వైపు గట్టిగా నిలబడటంతో ఏమీ చేయలేకపోయారు. ప్రియాంక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న ఆమె తల్లి బిడ్డతో ఫోన్లో మాట్లాడటం ప్రారంభించింది. వైద్య పరీక్షల కోసం తన అత్తతో కలిసి బుధవారం జగిత్యాలలోని ఆస్పత్రికి వస్తున్నట్లు తెలుసుకున్న ప్రియాంక తల్లి జగిత్యాల ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి రాజక్కపల్లి వెళ్లేందుకు వెల్గటూర్ బస్సు కోసం బస్టాండ్కు చేరుకోగా అప్పటికే బస్సు వెళ్లిపోవడంతో ధర్మారం వెళ్లే బస్సు ఎక్కి రాజారాంపల్లిలో వారు దిగారు. అయితే జగిత్యాల ఆస్పత్రిలో ఉన్నప్పుడే ప్రియాంక తల్లి తన భర్తకు ఫోన్ చేసి బిడ్డను బలవంతంగా తీసుకెళ్లేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు భర్తకు సమాచారం అందించింది.రాజారాంపల్లిలో దిగగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన బిడ్డ వెంట ఉన్న అత్తను మూత్ర విసర్జనకు వెళదామని చెప్పి వెంట తీసుకెళ్లగా, అప్పటికే ప్రియాంక తండ్రి వెంకటేశ్, అన అక్క భర్త గుంజ కుమార్ కారులో రాజారాంపల్లికి వేచిచూస్తున్నారు. ప్రియాంక రోడ్డుపై ఒంటరిగా ఉండటాన్ని గమనించిన వారు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. తనను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రియాంక కేకలు వేస్తూ స్థానికుల సహాయంతో వారి బారి నుంచి తప్పించుకుంది. పోలీస్స్టేషన్కు చేరుకుని తన తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని, చంపుతానని బెదిరించారంటూ వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన భర్త రాకేశ్కు తండ్రితో పాటు బావతో ప్రాణ భయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన అమ్మే తనను నమ్మించి మోసం చేసిందని కన్నీళ్ల పర్యంతమైంది.
భారత్ వాంటెడ్ జకీర్ నాయక్కు బంగ్లాదేశ్ షాక్
ఢాకా : ఇస్లాం మత ప్రచారకుడు, భారత్ వాంటెడ్ జాకీర్ నాయక్ కు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఆయనను తమ దేశంలోకి రానిచ్చేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు జాకీర్ నాయక్కు అనుమతి లభించినట్టు మొదట అక్టోబర్ చివర్లో మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారం రోజుల్లోనే ఆ పర్యటన పూర్తిగా రద్దు అయినట్టుగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. 2016లో ఢాకా హోలీ ఆర్టిజన్కేఫ్పై జరిగిన దాడిలో 29 మంది మరణించగా, జాకీర్ నాయక్ ప్రసంగాలతోనే ఉగ్రవాదులు ప్రేరణ పొంది దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్.. జాకీర్ నాయక్పై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించింది.
ఎన్డిఏ కోటి వరాల హామీలు బూటకం: మంత్రి పొంగులేటి
రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బీహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని బీహార్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లా చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తో కలిసి మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్డిఏ కూటమికి ఓటమి భయం పట్టుకుందని, అందువల్లనే అలవికాని హామీలను ఇస్తోందని విమర్శించారు. వారి ఎన్నికల ప్రణాళికలో కోటి వరాలు ప్రకటించడి, యువతకు కోటి ఉద్యోగాలు, కోటి మంది లక్పతి దీదీలు హామీలు ఇచ్చారని, అధికారంలో ఉన్న ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారోచ ఎంతమంది దీదీలను లక్పతులుగా చేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు వీటిని ఎందుకు అమలు చేయలేదని పొంగులేటి ప్రశ్నించారు. బీహార్ ప్రజలను కొత్త హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా ఘట్ బంధన్ను గెలిపిస్తే తెలంగాణ మోడల్ పాలనను బీహార్లో అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయిలకే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన పేదలందరికీ ఇందిర్మమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలు అమలు చేస్తున్నామని వివరించారు. బహిరంగ సభలో బీహార్ రాష్ట్ర ఇంచార్జ్ కృష్ణ అల్వర్, మహా ఘట్ బంధన్ అభ్యర్థి అభిషేక్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా.. బిగ్ మూవీ
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం బ్యానర్ పై భారత సినీ రంగంలో మైలు రాయిగా నిలిచే మహత్తరమైన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇద్దరు మహానటుల మధ్య ఐదు దశాబ్దాల స్నేహం, సహోదర బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే బిగ్ సినిమాటిక్ ఈవెంట్. రజనీకాంత్, కమల్ హాసన్ల అనుబంధం తరతరాల కళాకారులకు, ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తుంది. రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ 44 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని రూపొందుతున్న ‘తలైవర్ 173’ సూపర్స్టార్ రజనీకాంత్ మాగ్నటిక్ స్క్రీన్ పవర్, సుందర్ సి డైరెక్షన్ కలిపి ప్రేక్షకులకు విశేషమైన అనుభూతిని అందించబోతుంది. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా పొంగల్ 2027 సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
Photos : Aaryan Movie Press Meet
The post Photos : Aaryan Movie Press Meet appeared first on Telugu360 .
నెలలో 7సార్లు పాము కాటు #SnakeBite #Jagtial #Wildlife #Telangana #ViralNews #viralvideo #telugupost
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: బాల్క సుమన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,చాడ కిషన్ రెడ్డి ,ఆజo అలీ ,ముఖీబ్ చాందా ,ముసిముల్లా ఖాన్ తదితర నేతలతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైనే సిఎం,మంత్రులు దృష్టి పెట్టా రని, కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ కార్య కర్త రియాజ్ ఇళ్ళు కూలగొట్టి దాడి చేశారని విమర్శించారు. నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే వారిపై దాడి చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వున్నారని తెలిపారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఎన్నికల సంఘం ఎట్లా అనుమతి ఇచ్చింది? అని ప్రశ్నించారు. అధికారులు,పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్న దీమాను బాల్క సుమన్ వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు... ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల కమిషన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల కోడ్ ను రేవంత్ రెడ్డి ఉల్లఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ ఆఫీస్లో రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఒక.మతాన్ని ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారని, మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే 3 రోజుల నిషేధం ఉంటుందని, చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు “వరల్డ్ లీడర్ ఫర్ పీస్” అవార్డు
బోస్టన్ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్కు బోస్టన్ గ్లోబల్ ఫోరం 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు లభించింది. ప్రపంచ శాంతి,సయోధ్య, మానవతానాయకత్వంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. బోస్టన్ గ్లోబల్ ఫోరం, ఎఐ వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికా లోని బోస్టన్లో ఆయనను ఘనంగా సన్మానించారు. వరల్డ్ లీడర్ ఫర్పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు పదో వార్షికోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గాను గురుదేవ్ ఎంపికయ్యారు. గతంలో ఈ పురస్కారం అందుకున్న వారిలో జపాన్ మాజీ ప్రధాని షింజోఅబె, జర్మనీ అప్పటి ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ,ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్ తదితరులు ఉన్నారు.
కన్నుల పండువగా గంగా హారతి బాసర, ఆంధ్ర ప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం
'చికిరి చికిరి'.. అదిరిపోయిన 'పెద్ది' ఫస్ట్ సింగిల్ ప్రోమో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ’పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇక మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ ప్రారంభమవుతుంది. కొండల మధ్య నివసించే హీరో, ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఉప్పొంగే భావోద్వేగం సంగీతంగా, సంబరంగా వెలువడుతుందని సందర్భాన్ని వివరించారు. హీరో అమ్మాయిని ‘చికిరి’ అని పిలుచుకోవడం ఈ పాటకు ప్రాణం అయింది. రెహమాన్ సృష్టించిన హై వోల్టేజ్ బీట్లకు అనుగుణంగా రామ్ చరణ్ తన సిగ్నేచర్ మాస్ డాన్స్ స్టైల్, ఎనర్జీ తో అదరగొట్టారు. నవంబర్ 7న విడుదల కాబోతున్న ‘చికిరి చికిరి’ లిరికల్ వీడియో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, చరణ్ ప్రేమికురాలు‘చికిరి’గా కనిపించనుంది. పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
Mega fans waiting for Vaisshnav Tej
Mega hero Vaisshnav Tej made an impressive debut with Uppena. The actor has tested his luck with films like Konda Polam, Ranga Ranga Vaibhavanga and Aadikeshava. His last film Aadikeshava released in 2023 and the actor hasn’t announced any new film for two years. There are speculations that Vaisshnav Tej is quite selective and he […] The post Mega fans waiting for Vaisshnav Tej appeared first on Telugu360 .
మెరసిన ఇంద్రకీలాద్రి ..వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..
మెరసిన ఇంద్రకీలాద్రి ..వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. విజయవాడ, ఆంధ్రప్రభ : కార్తీక
Crucial Weekend for Many in Telugu Cinema
November 7th will witness several releases in Tollywood. Rashmika’s The Girlfriend, Sudheer Babu’s Jatadhara, Thiruveer’s The Great Pre Wedding Show and others are hitting the screens. This weekend is crucial for many in Telugu cinema. Rashmika: The actress has delivered some of the biggest hit films like Pushpa and Chhaava. For the first time, she […] The post Crucial Weekend for Many in Telugu Cinema appeared first on Telugu360 .
కరాటే పోటీలో గోల్డ్ మెడల్స్ సాధించిన సాబా మొహీంని అభినందించిన కెటిఆర్
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో 18 కరాటే కాంపిటీషన్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించిన ఓల్డ్ సిటీ కిషన్బాగ్కు చెందిన12 యేండ్ల సాబా మొహీంని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అభినందించారు. భవిష్యత్తులో ఒలంపిక్స్ లో ఆడాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సాబా మొహీంకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. వచ్చే డిసెంబర్ నెలలో దుబాయ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. కెటిఆర్తోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పోర్ట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. కెటిఆర్ని కలవడం గర్వంగా ఉందని, తెలంగాణ తరుపున గోల్డ్ మెడల్ సాధించిన తనను కెటిఆర్ అభినందించడం సంతోషంగా ఉందని కరాటే క్రీడాకారిణి సాబా మొహీం అన్నారు.
‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ను నెలకొల్పిన సింటెక్స్
దేశంలో నీటి నిర్వహణ పరిష్కారాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయ సంస్థ అయిన సింటెక్స్, తమ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బాధ్యతాయుతమైన రీతిలో నీటి వినియోగాన్ని చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసేందుకు 24 గంటల్లో 31,000 మందికి పైగా ప్రజలను సమీకరించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సంపాదించింది. దేశంలోని అత్యంత కీలకమైన సవాళ్లలో ఒకటైన స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని పొందడం మరియు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం గురించి అవగాహన పెంచడం ఈ దేశవ్యాప్త కార్యక్రమ లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలు, భాగస్వాములు, ఉద్యోగులు డిజిటల్ ప్లాట్ఫామ్పై కలిసి ప్రతిజ్ఞ చేశారు. నీరు మరియు ఆరోగ్యాన్ని కాపాడటానికి సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటించారు. వెల్స్పన్ బిఏపిఎల్ లిమిటెడ్, ఎండి & సింటెక్స్ –డైరెక్టర్ యశోవర్ధన్ అగర్వాల్ మాట్లాడుతూ “నీటి నిల్వ ట్యాంకులలో 50 సంవత్సరాల వారసత్వం , నాయకత్వం కలిగిన సింటెక్స్కు ఇది ఒక ప్రతిష్టాత్మక క్షణం. నీటి కాలుష్యం , తగిన రీతిలో నీటిని నిల్వ చేయకపోవటం వంటివి భారతదేశంలో తీవ్రమైన ప్రజారోగ్య ప్రమాదాలను కలిగిస్తూనే ఉన్నాయి, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి గణనీయంగా దోహదం చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా, నీటి నిల్వ యూనిట్లను క్రమం తప్పకుండా శుభ్రపరచడం ద్వారా తాగునీరు మరియు వాడుకోవడానికి వినియోగించే నీటిని పరిశుభ్రంగా నిల్వ చేయడం, తద్వారా కాలుష్యాన్ని నివారించడం , తమ కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడటం అనే సరళమైనప్పటికీ శక్తివంతమైన నిబద్ధతను కలిగి ఉండటానికి మేము వ్యక్తులను ప్రేరేపిస్తున్నాము. సేకరించిన ప్రతి ప్రతిజ్ఞ మరియు చేరుకునే ప్రతి వ్యక్తి మరింత బాధ్యతాయుతమైన, శుభ్రమైన నీటి స్పృహ కలిగిన భారతదేశం దిశగా వేసే ఒక అడుగు. ఈ రికార్డు సృష్టించిన విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతుంది !అని అన్నారు. సురక్షితం కాని నీటి కారణంగా గణనీయమైన ఆరోగ్య భారాన్ని భారతదేశం మోస్తోంది. ఇప్పటికీ, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో దాదాపు 13% మరణాలకు కారణమైన అతిసారం (డయేరియా) మూడవ అత్యంత సాధారణ కారణంగా నిలుస్తోంది . సింటెక్స్ యొక్క కార్యక్రమం, కార్పొరేట్ ప్రయోజనం, ఆవిష్కరణ , ప్రజల శక్తి , నిజమైన మార్పును ఎలా తీసుకురావచ్చో వెలుగులోకి తెస్తుంది. ప్రత్యేక మైక్రోసైట్లో నిర్వహించిన ప్రతిజ్ఞ, ఆసక్తి కలిగిన వారిని లాగిన్ చేసి ధృవీకరించమని ఆహ్వానించింది: “నీరు కలుషితం కాకుండా నిరోధించడానికి మరియు నా కుటుంబ భద్రతను నిర్ధారించడానికి నీటి నిల్వ యూనిట్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా నేను వాడకానికి మాత్రమే వినియోగించే & త్రాగడానికి వినియోగించే నీటిని పరిశుభ్రమైన స్థితిలో నిల్వ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.. ఐదు దశాబ్దాలకు పైగా, భారతదేశ నీటి నిర్వహణ పరిశ్రమలో ఆవిష్కరణ, విశ్వసనీయత మరియు నాణ్యతకు పర్యాయపదంగా సింటెక్స్ నిలిచింది. నిల్వకు మించి, ఈ కంపెనీ నేడు ట్రాన్స్మిషన్ (పైపులు), నిల్వ (ట్యాంకులు) మరియు శుద్ధి (పారిశుధ్యం)లను కవర్ చేసే సమగ్ర నీటి నిర్వహణ పరిష్కారాలను అందిస్తుంది. సింటెక్స్లోని అన్ని ఉత్పత్తులు 100% ఫుడ్-గ్రేడ్ వర్జిన్ ప్లాస్టిక్తో తయారు చేయబడ్డాయి, ఇవి శుభ్రమైన, సురక్షితమైన నీటిని నిర్ధారిస్తాయి మరియు బీపీఏ , థాలేట్లు మరియు ఫార్మాల్డిహైడ్ వంటి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్లలో కనిపించే టాక్సిన్ల నుండి కుటుంబాలను రక్షిస్తాయి.
వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు –మంత్రి కొల్లు
వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు – మంత్రి కొల్లు మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ
కెసిఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం:మంత్రి జూపల్లి
ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కోనసాగిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కోనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన జూపల్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో బోరబండలోని సాయిబాబా నగర్లో బుధవారం నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వృద్దులను, మహిళలను అప్యాయంగా పలుకరిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబమని మంత్రి జూపల్లి మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే పునీతులా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉంటే రౌడీ షీటర్లు అంటారా అని నిలదీశారు. జూబ్లీహిల్స్లో గెలుస్తామని బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని బాకీ కార్డు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ద్వజమెత్తారు. దోచుకున్న డబ్బుతో విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. ప్రజా వ్యతిరేఖ బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని కోరారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు..
మెక్సికోసిటీ : మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్కు బహిరంగంగా నడిరోడ్డుపైనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హిస్టారిక్ డౌన్టౌన్లో మంగళవారం ఆమె ప్రజలతో బహిరంగంగా మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె వెనుక నుంచి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనకు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని పక్కకు నెట్టివేశారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడ్డారు. అతడు చేతిని పక్కకు నెట్టేశారు. ఈ సంఘటన దృశాలు వైరల్ అవుతున్నాయి. దేశాధ్యక్షురాలికే భద్రత లేదా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి అధ్యక్షురాలి వద్దకు వచ్చేవరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులోఉన్నాడని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అధ్యక్ష కార్యాలయం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
హిందూపురంలో వైసీపీ దూకుడు హిందూపురం, ఆంధ్రప్రభ : వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన కోటి
అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ
అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ ఇబ్రహీంపట్నం
కలినరీ ఎక్స్పీరియెన్సెస్ ను ప్రారంభించిన డిస్ట్రిక్ట్ బై జొమాటో
కోటక్ మహీంద్రా బ్యాంక్ భాగస్వామ్యంతో డిస్ట్రిక్ట్ బై జొమాటో అనే గో-అవుట్ ప్లాట్ ఫామ్, లగ్జరీ డైనింగ్లో కొత్త అధ్యాయాన్ని పరిచయం చేస్తోంది. ఇది భారతదేశంలోని అత్యంత వివేకవంత మైన పోషకుల కోసం రూపొందించబడింది. కోటక్ సాలిటైర్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పాక నిపుణులచే నిర్వహించబడిన, ప్రఖ్యాత డైనింగ్ గమ్యస్థానాలలో నిర్వహించబడిన ఈ అరుదైన, రిఫైన్డ్, ప్రగాఢ వ్యక్తిగత అనుభవాలు విశేష అతిథులు ఆహారం, సంస్కృతితో నిమగ్నమయ్యే విధానాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయి. మిషెలిన్ స్టార్ రేటింగ్ పొందిన రెస్టారెంట్స్ లెజెండ్లతో కూడిన ఇంటిమేట్ షెఫ్ టేబుల్స్ నుండి గ్లోబల్ మిక్సాలజీ ఐకాన్లచే నిర్వహించబడిన లీనమయ్యే సాయంత్రాల వరకు, కోటక్ సాలిటైర్ క్రెడిట్ కార్డ్ అసాధారణమైన పసందైన విందు క్షణాలకు విశేష ప్రాప్యతను అందిస్తుంది. ప్రారంభ కార్యక్రమం ‘‘నార్ x దేవాకన్’’, అలాగే ది భోగ్ టేబుల్ బై షెఫ్ ఆరోని & బెంగళూరు ఊటా కంపెనీ ఈ ప్లాట్ఫామ్పై అద్భుతమైన స్పందనను పొందాయి. ఈ క్యూరేటెడ్ ఈవెంట్లకు ముందస్తు యాక్సెస్తో పాటు, కోటక్ సాలిటైర్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఈ క్రింది ప్రత్యేక హక్కులను పొందుతారు: ● డిస్ట్రిక్ట్ ద్వారా డైనింగ్ పై 20% ఆదా (బిల్లుకు ₹5,000 వరకు, నెలకు రెండుసార్లు) ● భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న రెస్టారెంట్లలో ప్రయారిటీ టేబుల్ యాక్సెస్ ● రూ. 1 కి ఎలివేటెడ్ డైనింగ్ ప్రివిలేజెస్ కోసం జొమాటో గోల్డ్ సభ్యత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - అఫ్లుయెంట్ అండ్ శాలరీడ్ ప్రొపోజిషన్స్ హెడ్ జ్యోతి సమాజ్పతి మాట్లాడుతూ, కోటక్ సాలిటైర్లో, నిజమైన లగ్జరీ అనేది వ్యక్తిగత మరియు సులభమైన అనుభవాలలో ఉందని మేం నమ్ముతాం. మా క్లయింట్లకు, భోజనం అనేది కేవ లం భోజనం మాత్రమే కాదు, రుచి, సంస్కృతి, గుర్తింపు యొక్క వేడుక. డిస్ట్రిక్ట్తో ఈ భాగస్వామ్యం అనేది అరు దైన మరియు చిరస్మరణీయమైన క్షణా లను రూపొందించడం గురించి’’ అని అన్నారు. డిస్ట్రిక్ట్ బై జొమాటో ప్రతినిధి మాట్లాడుతూ, డిస్ట్రిక్ట్లో, భోజనం అనేది రుచుల వేడుక మరియు ప్రజలను ఒకచోట చేర్చే సార్వత్రిక అనుభవం అని మేం నమ్ముతున్నాం. కోటక్తో మా భాగస్వామ్యం ద్వారా, మేము నార్ x మిషె లిన్ సిరీస్ వంటి ప్రత్యేకమైన ఈవెంట్లను సృష్టించడం మాత్రమే కాదు, భారతదేశం యొక్క చక్కటి భోజన సంస్కృతిని పునర్నిర్వచించడానికి, ఈ అసాధారణమైన కలినరీ భాగస్వామ్యాలను మా వినియోగదారులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి మేము ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం’’ అని అన్నారు. గతంలో వ్యక్తిగత సంబంధాలు లేదా పరిశ్రమ నెట్వర్క్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే ఈ తరహా క్యూరే టెడ్ అనుభవాలను ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇది సౌలభ్యం ద్వారా అసాధారణమైన భోజనాన్ని కనుగొనే కొత్త యుగాన్ని సూచిస్తుంది. స్థానిక ఆహారం, ప్రపంచ కళాత్మకత, వినూత్న సాంకేతికతలో పాతుకుపోయిన అసాధారణ మెనూలను అతిథులు చవిచూస్తారు. ప్రతి ఈవెంట్ నిజంగా పునరావృతం కాని భోజన క్షణాలను సృష్టిస్తుంది. కోటక్ సాలిటైర్ అనేది కోటక్తో లోతైన, బహుముఖ సంబంధాలు కలిగిన వ్యక్తులు, కుటుంబాల కోసం ప్రత్యేకిం చబడిన ఒక మార్గదర్శక బ్యాంకింగ్ ప్రతిపాదన. ఇది ఆహ్వానం ద్వారా మాత్రమే. ఇది ఈ క్రింది వాటిని అందిస్తుంది*: ● రుణాలు మరియు కార్డులలో ₹8 కోట్ల వరకు ముందస్తు అనుమతి పొందిన క్రెడిట్ లైన్లు** ● సంపద నిర్వహణ సేవలు ● సంపన్న కస్టమర్ల జీవనశైలికి అనుగుణంగా రూపొందించబడిన ఆహ్వానితులకు మాత్రమే అందుబాటు లో ఉన్న సాలిటైర్ క్రెడిట్ కార్డ్ యాక్సెస్, వేగవంతమైన ఎయిర్ మైల్స్, జీరో ఫారెక్స్ మార్క్-అప్, అపరి మిత లాంజ్ యాక్సెస్, ప్రీమియం ప్రాపర్టీలలో బస ప్రయోజనాలు, ప్రత్యేకమైన ఈవెంట్లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను* అందిస్తుంది. ● ఫారెక్స్ సొల్యూషన్స్ ● షేర్డ్ ప్రివిలేజెస్ తో కుటుంబ-కేంద్రీకృత బ్యాంకింగ్** ప్రపంచ అధునాతనత మరియు సాంస్కృతిక గొప్పతనం జీవనశైలిలో ఆర్థిక పరిష్కారాలు సజావుగా మిళితమైన అనుభవపూర్వక బ్యాంకింగ్ను అందించడంలో కోటక్ నిబద్ధతకు నిదర్శనం ఈ కార్యక్రమం.
మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దైవదర్శనానికి కారులో వెళ్లి, మొక్కులు తీర్చుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు రూపంలో వచ్చిన బొలెరో వాహనం షిఫ్ట్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హలిఖేడ్ టోల్గేట్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అప్పటికే ముగ్గురు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ ప్రాంతవాసులు. మృతుల్లో నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) ఉన్నారు. మరొకరు మనూర్ మండలంలోని ఎల్గోయి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హలిఖేడ్ పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిరాదర్ ప్రతాప్ అనే వ్యక్తిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బంధువులే కావడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న ఖేడ్ ఎంఎల్ఎ సోదరుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బిరాదర్ ప్రతాప్ను పరామర్శించారు.
ముగ్గురి ప్రాణాల మీదికి తెచ్చిన వివాహేతర సంబంధం
నాగర్కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని సంజాపూర్లో వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గామానికి చెందిన గుర్రం మల్లేష్కు వెల్దండ మండలం, చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. మల్లేష్ మున్సిపాలిటీ పరిధిలోని సిలార్పల్లికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు . ఈ విషయమై మల్లేష్, అతని భార్య శిరీషకు గతంలో గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల పెద్దమనుషులు గతంలో భార్యాభర్తలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మల్లేష్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ భార్య శిరీషను, కుమార్తెను పట్టించుకోవడం మానేశాడు.ఈ క్రమంలో శిరీష బంధువులు చెరుకూరు గ్రామానికి చెందిన శివ ప్రశాంతు, రామకృష్ణ, వెంకటేష్, సుభాష్, నరేష్ బుధవారం మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం పెరగడంతో వారు మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేల, తమ్ముడు పరమేష్పై విచక్షణారహితంగా ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘర్షణలో జంగయ్య అలివేల, పరమేష్ పరిస్థితి విషమంగా మారింది. వీరిలో జంగయ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. సిఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం
హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం తిరుపతి క్రైమ్ , ఆంధ్రప్రభ : మైనర్
తడిచిన ధాన్యం కొంటాం.. సివిల్ సప్లై ఎండి హామీ
తడిచిన ధాన్యం కొంటాం.. సివిల్ సప్లై ఎండి హామీ విజయవాడ, ఆంధ్రప్రభ :
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్ ఉమ్మడి
కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం..
కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీపీసీసీ ఆదేశాల మేరకు కొమరం
వైభవంగా గోదావరి మహా హారతి మంథని, ఆంధ్రప్రభ : మంథని గోదావరి మహా
పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందే మోతె, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం
పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని…
పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని… ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా )
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు.. బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా ..రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య
టీపీఎల్ క్రికెట్ పోటీలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి క్రీడల్లో రాణించాలని కోరిన మంత్రి శ్రీహరి జూపర్ ఎల్ఈడీ సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 టీమ్లతో లీగ్ టోర్నీ ప్రైజ్ మనీ రూ.80 లక్షలు హైదరాబాద్: తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ పోటీల పోస్టర్ను తెలంగాణ క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. మంత్రిని ఆయన కార్యాలయంలో టీపీఎల్ను నిర్వహిస్తున్న జూపర్ ఎల్ఈడీ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, లీగ్ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారుడిగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్తో పాటు ఏదొక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్ఈడీ డైరెక్టర్ ఒ.రమేష్ మాట్లాడుతూ.. తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లీగ్ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేదికల్లో 600 టీమ్లతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. నాకౌట్ పోటీలకు తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4 జట్లు ఎంపిక చేస్తామని అన్నారు. గ్రామీణ క్రికెటర్లకు పెద్ద వేదికలపై క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనేది కూడా తమ ఆలోచన అని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.80 లక్షలు.
తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం..!
తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం..! తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా
భారత్పై ట్రంప్ ఘాటు దెబ్బ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేత
న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి భారత్, రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేస్తుంది. నేరుగా రష్యా క్రూడాయిల్ రాక మనకు ఆగిపోతుంది. రష్యా ప్రముఖ చమరు కంపెనీలు రోస్నెఫ్ట్, లూకాయిల్పై అమెరికా భారీ స్థాయి ఆంక్షలు విధించిన తరువాత దీని ప్రభావం భారత్పై పడింది. అనివార్యంగా ఈ కంపెనీల నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేయాల్సిన చక్రబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి నుంచి రష్యా ముడిచమురు దిగుమతిని తగ్గించుకుంటూ వచ్చే నెల నాటికి పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా చమురును భారత్ పూర్తి స్థాయిలో నిలిపివేస్తుందని ట్రంప్ పదేపదే చెపుతూ వచ్చారు. రష్యా కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు ఈ నెల 21 నుంచి అమలులోకి వస్తాయి. దీనితో ఆయా కంపెనీలపై ఆధారపడే పలు దేశాలు ఇకపై వేరే మార్గాలను వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో చమురు సరఫరా గొలుసుకట్టు వ్యవస్థకు కుదేలు కానుంది. ఉక్రెయిన్తో యుద్ధం తరువాత రష్యాపై ఆంక్షల దశ నుంచి భారతదేశం రష్యా నుంచి అతి ఎక్కువ మోతాదులో ముడిచమురు నేరుగా దిగుమతి చేసుకొంటోంది. ప్రత్యేకించి ట్రంప్ ఆంక్షలకు గురైన ప్రధాన కంపెనీల నుంచి రిలయన్స్ పెట్రో సంస్థ అత్యధిక వాటాలో చమురు తెప్పించుకొంటోంది. ఇప్పుడు రష్యా క్రూడాయిల్ దిగుమతి ఆగిపోనుండటంతో రిలయన్స్ ఇతర భారతీయ కంపెనీలకు పిడుగు పాటు కానుంది. భారతీయ రిఫైనరీలు తమ దిగుమతులలో సగం వరకూ రష్యా నుంచే తెప్పించుకుంటున్నాయి. రిఫైనరీల ద్వారానే మార్కెట్కు అవసరం అయిన పెట్రోలు, డీజిల్ అందుతుంది. ఇప్పుడు రష్యా ఆంక్షలతో క్రమేపీ భారతీయ చమురు కంపెనీలు, రిఫైనరీలు ఈ లోటును ఇతరత్రా మార్గాల ద్వారా భర్తీ చేసుకోవల్సి ఉంటుంది. మారిటైం ఇంటలిజెన్స్ విశ్లేషణ సంస్థ కెప్లెర్ ఇప్పటి పరిస్థితి గురించి స్పందించింది. డిసెంబర్లో రష్యా నుంచి భారీ స్థాయిలో క్రూడాయిల్ రాక తగ్గుతుంది. డిసెంబర్లో ఈ క్షీణత ప్రభావం మన మార్కెట్పై తీవ్రంగానే పడుతుంది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో క్రమేపీ ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు. కానీ క్రూడాయిల్ రప్పించుకునేందుకు సంబంధిత మధ్యవర్తులు లేదా దళారులు , ప్రత్యామ్నాయ మార్గాలను తక్షణ రీతిలో ఇప్పటి నుంచే వెతుక్కోవల్సి ఉంటుందని విశ్లేషణ సంస్థ తెలిపింది.
స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్…
స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్… శ్రీశైలం, ఆంధ్రప్రభ
ఎక్కడ దొరికారంటే…. ధర్మపురి ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణంలోని పేకాట ఆడుతున్న స్థావరంపై
అభిరథ్ ధాటికి హైదరాబాద్ గెలుపు #RanjiTrophy #HyderabadCricket #AbhirathReddy #BCCI #SportsNews
నకిలీ ‘IEXS ట్రేడింగ్’ యాప్ ద్వారా చీటింగ్విత్డ్రా పేరుతో మళ్లీ మళ్లీ డబ్బు అడిగిన మోసగాళ్లు
కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
ఛండీగఢ్: పంజాబ్ లోని లుథియానా జిల్లాలో సమ్రాలా బ్లాక్లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్ను ఆగంతకులు కాల్చి చంపారు. ఈ హత్యకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ పేరున సోషల్ మీడియాలో పోస్ట్ వెలువడింది. గుర్వీందర్ సింగ్ను తమ గ్యాంగ్ కు చెందిన కరణ్, తేజ్ చక్ హత్యచేశారని వెల్లడించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక, అక్టోబర్ 31న లుథియానాకు చెందిన తేజ్పాల్ సింగ్ అనే 26 ఏళ్ల కబడ్డీ ఆటగాడు కూడా హత్యకు గురయ్యాడు. తేజ్పాల్ స్నేహితులే అతన్ని హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరు కబడ్డీ ఆటగాళ్లు హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం మారింది.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
అచ్చంపేట : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అక్కమ దేవి ఘాట్ రోడ్డులోని కఠిన మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా తిరిగిపోయింది.వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నుండి శ్రీశైలం దిశగా బయలుదేరిన బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో అక్కమ దేవి మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు రోడ్డుపై అడ్డంగా తిరిగిపోవడంతో ఘాట్ రహదారిపై రెండు గంటలకు పైగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనా చివరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం .. డిప్యూటీ సీఎం అంగీకారం
త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం .. డిప్యూటీ సీఎం అంగీకారం
TVK పార్టీ సిఎం అభ్యర్థిగా విజయ్
చెన్నై: తమిళిగ నెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం మహాబలిపురం లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన పార్టీ ప్రత్యేక సాధారణ కౌన్సిల్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు, కోయంబత్తూరులోని మహిళపై లైంగిక దాడి, ఓటర్ల జాబితాల సర్వే, తదితర 12 కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. కరూర్ ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడంపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. విజయ్, టివికె పార్టీ నిర్వహించే సమావేశాలకు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
కుక్కను తప్పించబోయి కారు పల్టీ.. భార్య మృతి.. భర్త, పిల్లలకు గాయాలు
మన తెలంగాణ/మోతె: సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ మరణించగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న పలువురు వ్యక్తులు సూర్యాపేట ఖమ్మం 365 బిబి నేషనల్ హైవే 1033 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి, టోల్గేట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. వెంటనే 1033 పెట్రోలింగ్ సిబ్బంది, 1033 అంబులెన్స్ సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, పోచవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి కారులో తెల్లవారుజామున బయల్దేరారు. సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి చెట్లపొదల్లోకి కారు దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాణి (38) అనే గృహిణి మృతి చెందగా, ఆమె భర్త శ్రీరామ్ (52)కు స్వల్ప గాయాలయ్యాయి. వారి కుమార్తె జాహ్నవి (11), కుమారుడు లోకేష్ (10) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతురాలి భర్త శ్రీరామ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి. అజయ్కుమార్ కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్ట్టు తెలిపారు. కాగా, 1033 వాహనానికి సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించిన సిబ్బందిని పలువురు అభినందించారు.
సదరన్ డిస్కమ్ సరికొత్త ప్రయోగం
సదరన్ డిస్కమ్ సరికొత్త ప్రయోగం తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ప్రీ
భారతదేశ పౌరులు అవినీతిని నేరుగా నివేదించడానికి నంబర్ ను ప్రకటించలేదు#TeluguPost #telugu #post #news
We are releasing Aaryan with a new climax – Vishnu Vishal
Vishnu Vishal delivered hits like Ratsasan, Matti Kushti, FIR and now, he is starring in a crime thriller, Aaryan. Praveen K has directed the film and Vishnu Vishal produced it. Nithiin’s Shrestha Movies is releasing the movie in Telugu. Now, the makers have conducted a pre-release press meet interacting with Telugu Media. Speaking at the […] The post We are releasing Aaryan with a new climax – Vishnu Vishal appeared first on Telugu360 .
రహదారి భద్రతకు సాఫ్ట్వేర్ ఉద్యోగి సేవ #Hyderabad #TrafficAwareness #TelanganaPolice #Volunteer
ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు…
ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు… గద్వాల, ఆంధ్రప్రభ : గద్వాల జిల్లా
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ(బీసీసీఐ) టీమిండియా జట్టును ప్రకటించింది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని15 మంది సభ్యుల జట్టును బుధవారం ఎంపిక చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో గాయపడిన రిషబ్ పంత్ కోలుకుని మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా Aతో జరిగిన మొదటి అనధికారిక మ్యాచ్లో ఇండియా ఎకి విజయాన్ని అందించిన పంత్.. తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. పంత్ తోపాటు ఆకాష్ దీప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా, భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. నవంబర్ 22 నుండి గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టేడియం మొదటిసారి టెస్ట్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు: శుబ్మాన్ గిల్ (సి), రిషబ్ పంత్ (WK) (VC), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లోని చునార్ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలుఢీకొనడంతో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సవిత(28), సాధన ( 16 ) .శివకుమారి ’( 12) అంజుదేవి (20). సుశీలాదేవి (60),కళావతి (50) గా గుర్తించారు. ఈ సంఘటన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగింది. చునార్ స్టేషన్ నాలుగో ప్లాట్ఫారం వద్దకు చోపన్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చి ఆగగానే ప్రయాణికులు దిగి ఫుట్ఓవర్బ్రిడ్జి కాకుండా పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. అదే సమయంలో హౌరా కల్కాజీ నుంచి ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్ప్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రయాణికులు కార్తీక్ పూర్ణిమ స్నానాల కోసం మీర్జాపూర్ వచ్చారని ఎన్సిఆర్ ప్రయాగ్రాజ్ డివిజన్ పిఆర్ఒ అమిత్ సింగ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి , స్థానిక ఎంపీ అనుప్రియ పటేల్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రమాద స్థలానికి జాతీయ, రాష్ట్ర వైపరీత్యాల స్పందన బృందాలను వెళ్లాలని ఆదేశించారు.
హర్యానాలో ఓట్ల చోరీ వల్లనే కాంగ్రెస్ ఓటమి:రాహుల్ గాంధీ
బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో హర్యానాలో ఓట్ల చోరీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం అంచులనుంచి ఓటమి పాలైందని ఆయన అన్నారు. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లలో 25 లక్షలమంది నకిలీ ఓటర్లేనని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ విమర్శించారు. బోగస్ ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో 12 శాతం మేరకు ఉందని. ఇందుకు సంబంధించి తమ వద్ద 100 శాతం రుజువులు ఉన్నాయని ఆయన తెలిపారు. తమ బృందం 5.21 లక్షల నకిలీ ఓటర్ల ఎంట్రీలను కనుగొన్నట్లు తెలిపారు. అంటే హర్యానాలో ప్రతి8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటో గ్రాఫ్ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధి పేర్లతో ఓటర్లజాబితాలో అనేకసార్లు కన్పించిందని, ఆమె 22 సార్లు ఓటు వేసిందనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఓటర్ల జాబితాలోని తేడాలను చూపే స్లయిడ్ లను రాహుల్ ప్రదర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని రాహుల్ ఆరోపించారు. హర్యానా చరిత్రలోనే తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదని చెబుతూ, కాంగ్రెస్ అఖండవిజయాన్ని ఓటమిగా మార్చేందుకు కుట్ర అమలయిందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత వచ్చిన వీడియోను చూపుతూ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీపై కూడా విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన రెండు రోజులతర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అందరూ చెబుతున్న సమయంలో నైనీ నవ్వుతున్న ఫోటో ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా రెండింటిలోనూ వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్ పాల్వాల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇంటి నెంబర్ .150లోని బీజేపీ నాయకుడి చిరునామాలో 66 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. ఒక వ్యక్తి ఇంట్లో ఏకంగా 500 మంది ఓటర్లు నమోదయ్యారని ఆయన ఆరోపించారు. తాను ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదని, తన ఆరోపణలను ధ్రువీకరించే డేటా ఉందని రాహుల్ స్పష్టం చేశారు. ఈసీని మాత్రమే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియనే ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికల కమిషన్ నకిలీ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు. అలా చేస్తే, న్యాయంగా ఎన్నికలు జరుగుతాయికదా. అన్నారు రాహుల్. ఈసీ. న్యాయమైన ఎన్నికలను కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రకు, ఈసీ వత్తాసు ఉందనడానికి ఇదే రుజువు అని దుయ్యబట్టారు.
KTR : రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాదు .. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆగ్రహం
టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాదు .. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆగ్రహం
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
విశాలాంధ్ర శింగనమల.. శింగనమల నియోజకవర్గం పుట్లూరులో స్కూలు పిల్లలతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది, బుధవారం సాయంకాలం స్కూలు పూర్తవగానే పుట్లూరు మోడల్, జడ్పీ స్కూళ్లకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సు మడ్డిపల్లికి బయల్దేరింది, చింతకుంట వద్దకు బస్సు రాగానే స్టీరింగ్ స్ట్రక్ కావడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు బస్ ఎక్కడం వల్ల అధిక లోడుతో వెళుతూ ప్రమాదం జరిగిందని పలువురు భావిస్తున్నారు. ఈ […] The post అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. appeared first on Visalaandhra .
Fact Check: CM Revanth Reddy did not insult Congress Minister Mohammad Azharuddin
Viral social media posts claiming that Telangana CM Revanth Reddy insulted Minister Mohammad Azharuddin are false.
అండగా ఉంటాం.. ఎల్ఓసీ అందజేత…
అండగా ఉంటాం.. ఎల్ఓసీ అందజేత… మక్తల్, ఆంధ్రప్రభ : నర్వ మండలం పాతర్చేడు
తెలుగు రాష్ట్రాలలో ఆగని బస్సు ప్రమాదాలు #Accident #Putlur #RTC #AndhraPradesh #PublicSafety
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..
విశాలాంధ్ర: చిలమత్తూరు.. శ్రీ సత్య సాయి జిల్లా .చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించారు, ప్రభుత్వ కార్యాలయ అధికారుల పై చాలా కాలం నుండి అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నాయి,ఈనేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం తనిఖీలు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయ లోపలికి వెళ్లి ఇంటి స్థలాలు. సాగు భూములు క్రయవిక్రయాలకు వచ్చిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అయితే అందుకు భిన్నంగా […] The post సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. appeared first on Visalaandhra .
కదిలిస్తే కఠిన చర్యలే!! జన్నారం, ఆంధ్రప్రభ : అడవుల్లోని విలువైన టేకు చెట్లను
నవీన్ యాదవ్కే ఓటు వేయాలి.. మంత్రి అడ్లూరి
నవీన్ యాదవ్కే ఓటు వేయాలి.. మంత్రి అడ్లూరి జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే అలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పలువులు భక్తులు నదుల్లో వద్ద పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమి పర్వదినాన్ని భక్తులు పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాలన్నీ భక్త జన సందోహంతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపం వెలిగించడం వల్ల పుణ్యం వస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలను వెలిగించి, 365 వత్తులతో కూడిన దీపాలను సమర్పించారు. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి పూజలు చేశారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : హైదరాబాద్లోని శేరిలింగంపల్లి, మదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని ప్రధాన శివాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తులందరికీ సకాలంలో దర్శనం లభించేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు, భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. కీసరగుట్టలో పౌర్ణమి వేడుకలు : సుప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్టలో భక్తుల సందడి నెలకొంది. శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. దర్శన అనంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివ లింగాలకు పంచామృత అభిషేకాలు చేశారు. అలాగే ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. సత్యనారాయణ స్వామి వత్రాలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో కార్తిక శోభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఆలయంలోని వ్రత మండపంలో భక్తులు సత్యదేవుడికి పూజలు నిర్వహించారు. కార్తీక దీపారాధన మండపంలో దీపాలు వెలిగించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాఢ వీధులు కార్తిక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. కార్తీక పూజలు జరిపించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపా రాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి.
అండగా… ఏపీ సర్కారు మృతుడి కుటుంబానికి పెడన ఎమ్యెల్యే రూ.5లక్షల పరిహారం అందజేత
విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది…
విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది… హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశంలో నీటి
నవీన్ యాదవ్ ను గెలిపించాలి… కడియం కావ్య
నవీన్ యాదవ్ ను గెలిపించాలి… కడియం కావ్య జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప
నవీన్ యాదవ్కి మద్దతుగా… మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్
Pawan Kalyan’s Flamingo Plan at Pulicat Lake Sparks Bhumana’s Witty Reaction
Andhra Pradesh Deputy Chief Minister and Environment Minister Pawan Kalyan has directed officials to take steps to create a permanent habitat for flamingos at Pulicat Lake. The scenic lake, known for attracting migratory birds from Siberia every winter, is set to be developed as a major ecotourism destination. Pawan Kalyan emphasised that the flamingos, which […] The post Pawan Kalyan’s Flamingo Plan at Pulicat Lake Sparks Bhumana’s Witty Reaction appeared first on Telugu360 .
వినూత్నంగా నిరసన దీక్ష.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : అధిక వర్షాల కారణంగా పత్తి
డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు.. #TeluguPost #telugu #post #news
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక
జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం: రాష్ట్ర స్థాయిలో నవంబర్ 7వ తేదీ నుండి 10 తేదీ వరకు విశాఖపట్నం నగరంలో జరిగే 11 వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ జిల్లాపోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో ధర్మవరం పట్టణానికి బి.నీఖ్యశ్రీ , యం.యశస్విని, వైష్ణవి, అలేఖ్య, నలుగురు బాలికలు, అలాగే బాలుర విభాగంలో సంజయ్ కుమార్ ఏకంగా ధర్మవరం పట్టణానికి చెందిన 05 మంది […] The post రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక appeared first on Visalaandhra .
Bandla Ganesh Clarifies Remarks After K Ramp Success Meet Controversy
Actor and producer Bandla Ganesh has issued a clarification following the controversy surrounding his speech at the K Ramp movie success meet. His remarks during the event had reportedly upset a few people in the film industry, with many speculating that his comments were aimed at Vijay Deverakonda. Taking X, Bandla Ganesh expressed regret, saying […] The post Bandla Ganesh Clarifies Remarks After K Ramp Success Meet Controversy appeared first on Telugu360 .
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కదిరి రైల్వే గేట్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి (20-30 సంవత్సరాలు వయసు) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకొని కదిరి గేట్ సమీపంలో గల గుజిరి షాపులో వేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఇదే తీరిలో రైల్వే పట్టాల పక్కన ఓ చెట్టు కింద కూర్చొని, రైలు వస్తుండగా క్షణాల్లో రైలుకు అడ్డం […] The post రైలు కిందపడి వ్యక్తి మృతి appeared first on Visalaandhra .
Breaking News |భారీ ఎన్ కౌంటర్
ఛత్తీస్ ఘడ్ – తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు-
“అందరికీ సమాన న్యాయం” నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : న్యాయ సేవాధికార సంస్థ
బేల కేంద్రంలో విషాదం..! అదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : బేల మండల కేంద్రంలో
తిరువణ్ణామలై జిల్లాలో మట్టికుండలో బంగారు నాణేలు
తిరువణ్ణామలై జిల్లాలో ఓ పురాతన శివాలయంలో 103 బంగారు నాణేలు బయటపడ్డాయి.
Jubilee Hills Bye Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ ధీమా అదేనట
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది
ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి వుండాలి..
మండల విద్యాధికారులు విశాలాంధ్ర ధర్మవరం; ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించి , ప్రతీ అంశాన్ని పరిశీలనాత్మకంగా , హేతుబద్దంగా చూడాలని మండల విద్యాధికారులు రాజేశ్వరేదేవి , గోపాల్ నాయక్ లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్సు సంబరాల్లో ముఖ్య అతిథితులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, ప్రకృతి నుంచి నేర్చుకోవాలన్నారు. చెకుముకి సైన్సు సంబరాల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.సైన్సు లేనిదే ఈ […] The post ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి వుండాలి.. appeared first on Visalaandhra .
పోటెత్తిన భక్తులు.. కరీంనగర్, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కరీంనగర్ లోని
ఏసీబీ దాడుల్లో విస్తుపోయే నిజాలివే
ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
ముఖ్యమంత్రిని కలిసిన సీడీసీ చైర్మన్
ముఖ్యమంత్రిని కలిసిన సీడీసీ చైర్మన్ సదాశివనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
రూ.60 లక్షలతో నిర్మాణం.. మహిళలకు రక్షణ పునరావాసం (నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) :

23 C