SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
...

జర్మనీ గురుద్వారా దగ్గర ఘర్షణ... నలుగురికి గాయాలు

లండన్: జర్మనీ లోని గురుద్వారాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఆయుధాలు, కత్తుల దాడి వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు జర్మనీ లోని మోయిర్స్ సిటీ గురుద్వారాలో ఈ సంఘటన జరిగింది. సిక్కు సమాజం లోని రెండు వర్గాల మధ్య మొదలైన చిన్నగొడవ చివరకు ఆయుధాలు, కత్తుల దాడికి దారి తీసిందని అధికారులు చెప్పారు. అయితే ఘర్షణకు కారణాలేమిటో ఇంకా తెలియడం లేదని పోలీసులు చెప్పారు. 

మన తెలంగాణ 21 Apr 2026 10:24 pm

ఒప్పందం లేకపోతే ఇరాన్‌పై దాడులు: ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణ గడువులోపు ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు. నేను అలా చేయాలని అనుకోవడం లేదు అని సీఎన్‌బీసీ ‘స్క్వాక్ బాక్స్’ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు. శాంతి చర్చలు కొనసాగేందుకు కాల్పుల విరమణను పొడిగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, వారు చర్చలకు రావాల్సిందే. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ బలమైన దేశంగా ఎదగగలదు అని పేర్కొన్నారు. అయితే ఒప్పందం లేకుండా కాల్పుల విరమణ ముగిస్తే, దాడులు మళ్లీ ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి దృక్పథంతో ముందుకు వెళ్లడం మంచిదని నేను భావిస్తున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్, మంచి ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నాను. వారికి వేరే మార్గం లేదు అని అన్నారు. మేము వారి నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని దెబ్బతీశాం. వారి నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేశాం అని పేర్కొన్నారు. అయితే, నాయకత్వ మార్పు పరోక్షంగా జరిగిందని ట్రంప్ సూచిస్తూ, ఇది నేరుగా చెప్పిన ‘రెజీమ్ ఛేంజ్’ కాకపోయినా పరోక్షంగా జరిగిందే అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత అమెరికాఇరాన్ చర్చలు ఫలితం లేకుండానే ముగియగా, రెండో విడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.

మన తెలంగాణ 21 Apr 2026 9:56 pm

మెక్సికో పిరమిడ్ దగ్గర కాల్పులు.. ఒకరు మృతి

మెక్సికో సిటీ: మెక్సికో లోని చారిత్రక టియోటిహుకాన్ పిరమిడ్ల వద్ద ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడడంతో ఓ కెనడా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తరువాత నిందితుడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు పర్యాటకులు భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట జరిగి అనేక మంది గాయపడ్డారు. వారందరినీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి తుపాకీ, కత్తి, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మన తెలంగాణ 21 Apr 2026 9:41 pm

చర్చలు విఫలం. అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్సులు బంద్

తెలంగాణలో ఆర్టీసి సమ్మె బాట పట్టనుంది. మంగళవారం ప్రభుత్వంతో టీజిఎస్ ఆర్టీసీ జేఏసీ చర్చలు జరిపింది. సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఆర్‌ అధికారుల కమిటీతో దాదాపు 4 గంటలకుపైగా ఆర్టీసీ సంఘాలు చర్చలు జరిపాయి. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో ఈ అర్ధరాత్రి నుంచే టీజిఎస్ ఆర్టీసి సమ్మెకు వెళ్లనుంది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈక్రమంలో ప్రజా రవాణా స్తంభించే అవకాశం ఉంది. 

మన తెలంగాణ 21 Apr 2026 9:37 pm

అభిషేక్ ఊచకోత.. ఢిల్లీకి భారీ టార్గెట్

మన తెలంగాణ/హైదరాబాద్: మరోసారి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఐపిఎల్‌ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో అభిషేక్ తన బ్యాటింగ్ తో వీరవిహారం చేశాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్  చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.

మన తెలంగాణ 21 Apr 2026 9:25 pm

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ సిఐ, ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ సిఐ, ఎస్‌ఐ ఎసిబికి దొరికిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. మంగళవారం రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరుకు చెందిన ఓ వ్యక్తి, అతని కుటుంబసభ్యులపై వికారాబాద్ మహిళ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 498 ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసులో బాధితుడికి, అతని తల్లి, ఆడ పడుచులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు మహిళా పోలీస్‌స్టేషన్ సిఐ సరోజ, ఎస్‌ఐ రాణి ఒక్కొక్కరికి లంచం డిమాండ్ చేశారు. రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో రూ.20 వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బులు తన వద్ద లేకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టాం. ఈ విచారణలో సాక్ష్యాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే బాధితుడి వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా సీఐ, ఎస్‌ఐలను పట్టుకున్నామని డీఎస్పీ ఆనందర్‌కుమార్ తెలిపారు. మొదటి విడత డబ్బులు రూ.20 వేలు సీఐ సరోజ సమక్షంలో ఎస్సై తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్సైపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సరోజ స్టేషన్‌కు వచ్చిన బాధితుల రక్తం తాగేదని బాధితుడు, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షద్ ఆరోపించారు. ఫిబ్రవరి 20న నా భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేదు. కానీ డబ్బుల కోసం నాపై, నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, తమ్మునిపై కేసులు నమోదు చేశారు. నాకు, నా భార్యకు చిన్న గొడవ జరిగింది. నా భార్య ఇచ్చిన ఫిర్యాదుపై అదే రోజు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మా అమ్మనాన్న ఇద్దరు వృద్ధులు. వారు నాతో దూరంగా ఉంటారు. మా సిస్టర్లు ఇద్దరు, మా తమ్ముడు నాతో పాటు ఉండరు. కానీ వారిపైనా కేసు నమోదు చేశారు. కేసును లోక్ అదాలత్‌లో కొట్టేసేవిధంగా చేస్తానని, అందుకోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పునా మొత్తం రూ.60 వేలు కావాలని డిమాండ్ చేశారు. రూ. 40 వేలకు సెటిల్‌చేసి ముందుగా రూ. 20 వేలు తీసుకున్నదన్నారు. వీరిద్దరు నెలకు రూ.50 నుంచి 60 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. మా వాళ్ల తప్పుల్లేకపోయినా వారిని డబ్బుల కోసం సీఐ, ఎస్సై ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ ఇద్దరు అధికారులు బాధితులకు న్యాయం చేయకపోగా లంచాలు తీసకుంటున్నారన్నారు. వీళ్ల భాగోతం గురించి జిల్లాలో ఎవరినడిగినా తెలుస్తుందన్నారు. అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 21 Apr 2026 9:14 pm

ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు పునఃప్రారంభం

ఇజ్రాయెల్‌ లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్ లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.ఇదే సమయంలో లెబనాన్‌లో 10 రోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌పై ప్రారంభమైన రెండో రోజునే, ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లెబనాన్‌లో జరిగిన పోరాటాల్లో ఇప్పటివరకు 2,290 మందికి పైగా మరణించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో కనీసం 3,375 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదనంగా ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ అరబ్ దేశాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాంతవ్యాప్తంగా 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించినట్లు సమాచారం.

మన తెలంగాణ 21 Apr 2026 9:06 pm

చెన్నైకి బిగ్ షాక్.. ఐపిఎల్ నుంచి స్టార్ బ్యాటర్ ఔట్

చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలింది. గాయంతో యువ ఆటగాడు ఆయుష్ మాత్రె ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో చెన్నై అంతంత మాత్రంగానే రాణిస్తోంది. ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇలాంటి స్థితిలో ప్రతిభావంతుడైన బ్యాటర్‌గా పేరున్న ఆయుష్ దూరం కావడం సిఎస్‌కెకు పెద్ద ఎదురు దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయుష్ గాయానికి గురయ్యాడు. తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ఆయుష్ ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని సిఎస్‌కె యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

మన తెలంగాణ 21 Apr 2026 8:59 pm

పొన్నాల గతే జీవన్ రెడ్డికీ పడుతుంది: ఎంపి చామల

గతంలో కాంగ్రెస్‌ను వీడి బిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ పడుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కెసిఆర్ వెంటనే ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారని, నిజానికి తమ పార్టీ అధినేతగా చేయాలనుకున్నామని ఎంపీ చామల మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జీవన్ రెడ్డి ఆలోచన లేని పని చేశారని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహు, కేతు గ్రహం అని ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ విమర్శించడాన్ని ఎంపీ చామల తీవ్రంగా ఖండించారు. అసలు బండి సంజయ్ ఏ గ్రహం అని ఆయన అన్నారు. నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర మంత్రి బండి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మెట్రో పేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో మీ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భువనగిరి లోక్‌సభ పరిధి కోసం నిధులు తీసుకుని వచ్చేందుకు బహిరంగ సభను కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి. కిషన్ రెడ్డి కలిసి పెట్టాలని, అందుకు పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకుని వచ్చే బాధ్యత తనదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేపిస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు. సిబిఐ విచారణకు ఆదేశించడం కేంద్ర హోం శాఖ మంత్రి పరిథిలోకే వస్తుందని, అయినా బండి సంజయ్ మాట్లాడడం లేదన్నారు. కాళేశ్వరం బిఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారిందన్న బిజెపి ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:50 pm

అమెరికా సీజ్ చేసిన నౌకలో.. చైనా నుంచి ఇరాన్‌కు క్షిపణి రసాయనాలు

వాషింగ్టన్: హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ మాజీ రాయబారి , రిపబ్లికన్ నేత హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిని బట్టి ఇరాన్‌కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని కొట్టి పారేయలేమని ఆరోపించారు. ఈ తొస్కా నౌక అనేక సార్లు చైనాకు వెళ్లిందని, ఇరాన్ క్షిపణుల తయారీకి కావలసిన రసాయనాలను తీసుకొచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. గత ఆరు వారాల్లో ఈ నౌక చైనాకు రెండు సార్లు వెళ్లిందని పేర్కొంది. మరోవైపు తౌస్కా నౌకను, అందులోని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఇది వెంటనే జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాను హెచ్చరించింది. ఇరాన్ నౌకతో మా సంబంధం లేదు: చైనా అమెరికా సీజ్ చేసిన ఇరాన్ తౌస్కా వాణిజ్య నౌకలో క్షిపణుల తయారీకి కావలసిన చైనా రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. “నాకు తెలిసినంతవరకు , ఇది విదేశీ పతాకం కలిగిన నౌక. దాంతో తమ దేశానికి సంబంధం ఉందన్న దుష్ప్రచారాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం ” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి గుయో జియా కున్ పత్రికా విలేకరులకు చెప్పారు. అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:49 pm

ఉద్రిక్తతలకు దారితీసిన హిజాబ్‌ బిందీ వివాదం

కళ్లజోడు విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్  షోరూమ్‌లో హిజాబ్‌ బిందీ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యోగులు హిందూత్వాన్ని ప్రతిబింబించే బింది, బొట్టు పెట్టుకోవడం వంటివి చేయకూడదు అని చెబుతూ, హిజాబ్‌కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చా నేతల ఆధ్వర్యంలో కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు స్టోర్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు బీజేపీ మైనారిటీ మోర్చా నేత నాజియా ఎలాహీ నాయకత్వం వహించారు. కార్యకర్తలు స్టోర్‌లోకి ప్రవేశించి సిబ్బందికి బొట్టు పెట్టడంతో పాటు చేతులకు పవిత్ర దారాలను కట్టారు. అలాగే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాజియా ఎలాహీ స్టోర్ ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్‌ను ప్రశ్నిస్తూ, హిందూ మతంలోని కొన్ని సంప్రదాయాల ఆంక్షలపై వస్తున్న ఆరోపణలకు వివరణ కోరారు. మీరు మొహ్సిన్ ఖాన్ కాబట్టే బొట్టు పెట్టుకోవడాన్ని ఆపారా? అని ఆమె వీడియోలో ప్రశ్నించినట్లు వినిపించింది. నాజియా ఎలాహీ మాట్లాడుతూ స్టోర్‌నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ మరొక మతాన్ని అణగదొక్కుతున్నారు. ఇది హిందూ దేశం. సంస్థ యజమాని క్షమాపణ చెప్పకపోతే లెన్స్కార్ట్‌ను బహిష్కరిస్తాం లేదా అన్ని ఔట్‌లెట్లనూ మూసివేయాల్సిందే అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్ తో పాటు హిందూ ఉద్యోగులను ముందుకు పిలిచి వారి నుదుటిపై బొట్టు పెట్టారు. మతపరమైన గుర్తింపును వ్యక్తపరచడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు అని పేర్కొన్నారు. అయితే, ఈ సమయంలో ఉద్యోగులు అసౌకర్యంగా కనిపించినప్పటికీ ప్రతిఘటించలేదు. ఇదిలా ఉండగా, షోరూమ్‌లోని ఒక ఉద్యోగి, సంస్థ శిక్షణా సమయంలో బొట్టు పెట్టుకోవడం, చేతికి పవిత్ర దారం కట్టుకోవడం నిషేధమని చెప్పినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, వివాహిత మహిళలు కూడా మంగళసూత్రం ధరించకూడదని సూచించారని ఆయన తెలిపారు. ఈ ఆరోపణలు అక్కడున్న వారిలో ఆగ్రహానికి దారితీశాయి. షోరూమ్ మేనేజర్ నుంచి వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల కార్యకర్తలు ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పేర్కొంటూ, పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు ఔట్‌లెట్‌ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. హిజాబ్‌కు అనుమతి ఇస్తూ, బిందీ, బొట్టు పెట్టుకోవడం వంటి హిందూ మత సంప్రదాయాలపై పరిమితులు విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో లెన్స్కార్ట్ వివాదాల్లో చిక్కుకుంది. వివాదం ముదురుతున్న నేపథ్యంలో సంస్థ క్షమాపణలు తెలియజేసింది. సంస్థ సీఈఓ పీయుష్ బన్సల్ వివరణ ఇస్తూ, ఆ విధాన పత్రం తప్పుదోవ పట్టించేలా ఉంది అని, అది సంస్థ ప్రస్తుత మార్గదర్శకాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. వైరల్ అయిన ఆ పాత విధాన పత్రం పాత శిక్షణ గమనిక మాత్రమేనని, సంస్థ హెచ్‌ఆర్ విధానంలో భాగం కాదని తెలిపారు. బిందీ, బొట్టుకు సంబంధించిన సూచనలు తరువాత తొలగించేశామని కూడా పేర్కొన్నారు. తరువాత సంస్థ విడుదల చేసిన సమగ్ర ‘ఇన్-స్టోర్ స్టైల్ గైడ్’లో బిందీ, బొట్టు నుంచి హిజాబ్, తలపాగా (తుర్బాన్) వరకు అన్ని మత, సాంసృ్కతిక గుర్తులను తమ అన్ని ఔట్‌లెట్లలో అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.

మన తెలంగాణ 21 Apr 2026 8:45 pm

27న తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ కీలక సమావేశం

భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తప్పనిసరిగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌సిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:38 pm

బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి..

మనతెలంగాణ, సిటిబ్యూరోః రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన నాచారం, మల్లాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం వీడియో తీస్తు బిల్డింగ్‌పై నుంచి కిందపడడంతో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రానికి చెందిన బాలుడు మితున్(14) తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం నాచారం, మల్లాపూర్‌కు వచ్చి పనిచేస్తున్నారు. మల్లాపూర్, గాంధీ బొమ్మ దగ్గర ఉన్న బస్తీలో ఉంటున్నారు. బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు, బాలుడు తరచూ ఇన్‌స్ట్రాగ్రాం, యూట్యూబ్‌లో రీల్స్ చూసేవాడు. తాను కూడా రీల్స్ చేసి ఫేమస్ కావాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీన తాను ఉంటున్న భవనం బాల్కనీ రేయిలింగ్ పిట్ట గొడపై ఫీట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు.

మన తెలంగాణ 21 Apr 2026 8:35 pm

రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి...లిక్కర్ దందా

బెంగళూరు, హర్యానా డిఫెన్స్ మద్యం విక్రయం రూ.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం మనతెలంగాణ, సిటిబ్యూరోః నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసిన ఇంటిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 361 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి హస్తినాపురంలో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి సురేష్ బెంగళూరు, హర్యానా రాష్ట్రాల్లోని ఆర్మీ క్యాంటీన్ల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లను హస్తినాపురానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శ్రీరమణ కాలనీ, ఫేజ్2లోని ఇంట్లో దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దాడి చేస్తున్నట్లు తెలుసుకున్న సురేష్ రెడ్డి ఇంటి నుంచి పారిపోయాడు. కేసు దర్యాప్తు కోసం మద్యం బాటిళ్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:24 pm

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊస్ట్.. ఇంటిపైనే గంజాయి మొక్కలు పెంచుతూ..

మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి అలవాటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న యువకుడు... ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతూ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చేతికి చిక్కాడు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం... నాచారం, ఈస్ట్ గాంధీనగర్‌కు చెందిన సిహెచ్.శశిధర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వచ్చే జీతమంతా గంజాయి కొనుగోలుకే వెచ్చించడంతో చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. దీంతో యువకుడు తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. దాని నుంచి వచ్చే గంజాయిని తాను వినియోగించుకుంటున్నాడు. ఈ విషయం రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి తెలియడంతో సిఐ బాలరాజు, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఇంటిపై పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు మూడు మీటర్లు పెరిగి, పూతకు వచ్చాయి. ఈ మొక్కలు నుంచి 10కిలోల గంజాయి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు బండి అరుణ్ కుమార్, బి.ఆషిష్‌ను అరెస్టు చేసి ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:13 pm

Koratala Siva to Direct NBK

Writer-turned-director Koratala Siva has been idle since the release of Devara. He is ready with the script of Devara 2 but NTR is occupied with other projects. Koratala Siva has been keen to work with Nandamuri Balakrishna. The discussion took place recently and Balayya has given his nod for Koratala Siva’s script. The shoot of […] The post Koratala Siva to Direct NBK appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 8:03 pm

టిసిఎస్ కేసు.. బలవంతపు మత మార్పిడిలో నిదాఖాన్ పాత్ర

నాసిక్ : టిసిఎస్ నాసిక్ కేసులో టిసిఎస్ ఉద్యోగిని నిదాఖాన్ అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ పొందడంలో విఫలమైన తరువాత ఆమె గురించి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం వివరించారు. నాసిక్ కంపెనీలో బలవంతపు మత మార్పిడిలో ఆమె కీలక పాత్ర వహించారని, ప్రస్తుతం ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాసిక్ లోని ఐటీ మేజర్ యూనిట్‌లో లైంగిక వేధింపుల కేసులపై చర్చించారు. ఇంతవరకు ఎనిమిది మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్ )కమిటీ వీడియో కాన్షరెన్సులపై ఆధారపడకుండా తరచుగా వ్యక్తిగతంగా స్థానిక సభ్యులను కలుసుకుని వివరాలు సేకరించాలన్నారు. ఈ కేసులో తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, అందులో ఒకదానిలో నిదాఖాన్, మరో నలుగురు నిందితులుగా ఆరోపించబడింది. లైంగిక వేధింపులే కాదు, బలవంతంగా మతం మార్పిడి చేయించడం లోనూ ఆమె పాత్ర ఉన్నట్టు తేలింది. ఈ కేసు వెలుగు లోకి వచ్చిన దగ్గరి నుంచి ఆమె పరారీలో ఉంది. సోమవారం సెషన్స్ కోర్టు ఆమెకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈమేరకు ఆమె యాంటిసిపేటరీ బెయిల్‌పై విచారణ ఏప్రిల్ 27కు వాయిదా పడింది. నాసిక్ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈ కేసుల దర్యాప్తు చేపట్టింది. ఆమెను పట్టుకోడానికి మూడు టీమ్‌లను ఏర్పాటు చేశారు. 

మన తెలంగాణ 21 Apr 2026 8:02 pm

శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అనుసరణీయం..

శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అనుసరణీయం.. అలరించిన గుంటుపల్లి మోహనకృష్ణ ఆధ్యాత్మిక ప్రవచనం.. ఇంద్రకీలాద్రి,

ప్రభ న్యూస్ 21 Apr 2026 8:01 pm

వైభవంగా శంకరాచార్య జయంతి ఉత్సవాలు..

వైభవంగా శంకరాచార్య జయంతి ఉత్సవాలు.. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా నిర్వహణశాస్త్రోక్తంగా శంకరాచార్య

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:57 pm

భక్తుల సంతృప్తియే ముఖ్యం..

భక్తుల సంతృప్తియే ముఖ్యం.. దేవాలయాల్లో సౌకర్యాల మెరుగుదల చేయండి..దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం..

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:53 pm

దమ్మపేట ఎస్సై కి ఎస్పీ ప్రశంస…

దమ్మపేట ఎస్సై కి ఎస్పీ ప్రశంస… దమ్మపేట, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:42 pm

చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణాపై సిపిఐ ఆందోళన..

తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా – టీడీపీ నేతల మద్దతు విశాలాంధ్ర – గోరంట్ల: గోరంట్ల మండల పరిధిలోని చిత్రావతి నదిలో రోజురోజుకీ ఇసుక అక్రమ రవాణా పెరుగుతోందని, దీంతో పరివాహక ప్రాంత రైతుల ఫిల్టర్ బోర్లు ఎండిపోతున్నాయని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య ముఖ్య అతిథిగా […] The post చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణాపై సిపిఐ ఆందోళన.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 7:39 pm

ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు

ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉచిత

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:39 pm

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే… రాప్తాడు, ఆంధ్రప్రభ : ఎన్నికల ముందు ఇచ్చిన

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:36 pm

విద్యకు వయసు, పదవులు అడ్డంకి కాదు..

విద్యకు వయసు, పదవులు అడ్డంకి కాదు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసిన చైర్

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:31 pm

విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థికసహాయం..

విశాలాంధ్ర – లేపాక్షి: లేపాక్షిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీవిబి)లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన సుభానీ భీ కుమార్తె ఉన్నత చదువుల కోసం విద్యాలయ సిబ్బంది మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు.విద్యాలయంలో పనిచేస్తున్న బోధన, భోధనేతర సిబ్బంది కలిసి రూ.51 వేల మొత్తాన్ని మృతురాలి కుమార్తెకు అందించారు. ఈనెల 17వ తేదీన హిందూపురం నుంచి లేపాక్షిలోని విద్యాలయానికి విధులకు వెళ్తుండగా, టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదానికి గురై […] The post విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థికసహాయం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 7:30 pm

తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు: మంత్రి జూపల్లి

నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, చారిత్రక గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి కట్టడాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని వివరించారు. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా ప్రకృతి ఒడిలో విరాజిల్లే కుంటాల, బొగత జలపాతాలు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వంటి సాంస్కృతిక వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వంటి సంప్రదాయ కళలు పర్యాటక రంగాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలను తిలకించేందుకు దేశ విదేశీ పర్యాటకులు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనను మరింత బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణ పర్యాటక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్త్తోందని మంత్రి జూపల్లి పునరుద్ఘాటించారు.

మన తెలంగాణ 21 Apr 2026 7:28 pm

జగద్గురు ఆదిశంకరాచార్య నగరోత్సవం..

జగద్గురు ఆదిశంకరాచార్య నగరోత్సవం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్బంగా

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:25 pm

తమిళనాడులో డిఎంకే కూటమిదే విజయం: భట్టి విక్రమార్క

 తమిళనాడులో డిఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి పరిశీలకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాణిపేట జిల్లా షోలింగర్ నియోజకవర్గంలో నీకారిక్కల్ , వీరనట్టుర్, అరియూర్, అయిపేడు ప్రాంతాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించి, కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తమిళ ప్రజలు అభివృద్ధి, లోకికవాదానికే పట్టం కడతారని చెప్పారు. ఆత్మగౌరవానికి తమిళ ప్రజల మద్దతు చెబుతారని ఆకాంక్షించారు. ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని భట్టి విక్రమార్క చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోనీ ప్రజా ప్రభుత్వం ఎన్నికలవేళ ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. అనుమానం ఉంటే ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చని తెలిపారు. రైతు భరోసా కింద రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు వివరించారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు అంటే ఒక సిద్ధాంతం తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అదొక గొప్ప సిద్ధాంతమని పేర్కొన్నారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి వంటి మహనీయులు ఇక్కడ సామాజిక న్యాయానికి బలమైన పునాదులు వేశారని ఆయన పేర్కొన్నారు. లౌకికవాదాన్ని కాపాడటంలో తమిళ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని ఆయన ప్రశంసించారు. ఢిల్లీ పీఠంపై ఉన్న పాలకులు తమిళ సంస్కృతిని, భాషను, హక్కులను అణచివేయాలని చూస్తున్నారని భట్టి విమర్శించారు. ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే సెక్యులర్ శక్తుల ఐక్యత అనివార్యమని, అందుకే స్టాలిన్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ అందిస్తున్న ప్రేమ సందేశం, స్టాలిన్ చేపట్టిన అభివృద్ధి నినాదం ఒక్కటయ్యాయని భట్టి పేర్కొన్నారు. తమిళ ప్రజలు వేసే ఓటు కేవలం ఒక గుర్తుపై వేసే ముద్ర కాదని, అది విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వినిపించే ప్రజాస్వామ్య గొంతుక అని వ్యాఖ్యానించారు. నియంతృత్వాన్ని ఓడించి, విద్వేషం లేని సమాజాన్ని నిర్మించుకోవాలని, ఇక్కడ కేవలం ప్రేమకు, సమధర్మానికి మాత్రమే చోటు ఉందని నిరూపించాలని ఆయన కోరారు. తాము మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని, అదే స్ఫూర్తితో తమిళనాడులో కూడా అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే డీఎంకే-కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.

మన తెలంగాణ 21 Apr 2026 7:20 pm

తుమ్మలని విమర్శించే అర్హత పువ్వాడకు లేదు…

తుమ్మలని విమర్శించే అర్హత పువ్వాడకు లేదు… ఖమ్మం బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : వ్యవసాయ

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:18 pm

తాడిపత్రి లో జోరుగా మట్కా దందా …

పేదల నివాస ప్రాంతాలే లక్ష్యంగా మట్కా నిర్వహణ… మట్కా మహమ్మారి కాటులో తాడిపత్రి పేదలు ఆన్లైన్, వాట్సాప్లలో మట్కా నిర్వహణ. విశాలాంధ్ర – తాడిపత్రి: పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి మనిషి ఆశాజీవి. అయితే ఆ ఆశనే ఆయుధంగా చేసుకుని మట్కా నిర్వాహకులు పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక్క రూపాయికి 90 రూపాయలు” అనే ఆశ చూపిస్తూ తాడిపత్రి పట్టణంలోని పేద ప్రాంతాల్లో మట్కా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. రోజంతా కష్టపడి […] The post తాడిపత్రి లో జోరుగా మట్కా దందా … appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 7:14 pm

ప్రశ్నిస్తే తొలగిస్తారా?

ప్రశ్నిస్తే తొలగిస్తారా? చంద్రబాబు సర్కారుపై జగన్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:13 pm

ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: కల్వకుంట్ల కవిత

ఆర్‌టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్‌టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్‌టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 21 Apr 2026 7:10 pm

చైన్ స్నాచింగ్ కేసులో మలుపు…

చైన్ స్నాచింగ్ కేసులో మలుపు… ఇద్దరిలో ఒకరి అరెస్ట్పల్సర్ బైక్ స్వాధీనం..అంతర్రాష్ట్ర భవారియా

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:10 pm

IPL 2026: ఢిల్లీపై టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్..

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని.. హైదరాబాద్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఢిల్లీని కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి. మరోవైపు, హైదరాబాద్ ను ఓడించి తమ సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది.

మన తెలంగాణ 21 Apr 2026 7:08 pm

భారత విమానాలపై పాక్ గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగింపు

 భారత విమానాలపై గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గాంపై ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి రెండు దేశాల మధ్య గగనతల దిగ్బంధనం కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ 30 నుంచి పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి లేదు. పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ నోటమ్ ప్రకారం ఈ ఏడాది మే 24 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీనివల్ల పశ్చిమదేశాలకు , ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశాలకు ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్ నుండి వెళ్లే సుమారు 800 వారపు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది. 

మన తెలంగాణ 21 Apr 2026 7:06 pm

విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సు కిట్లు పంపిణీ…

విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సు కిట్లు పంపిణీ… పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వము

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:58 pm

మోదీపై వ్యాఖ్యలు..

మోదీపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపాటు శ్రీ సత్యసాయి బ్యూరో,

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:54 pm

Ys Jagan : ఎక్స్ లో చంద్రబాబు పై జగన్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 6:52 pm

రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మోదీ: మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించారు. ఆయన ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చెన్నైలో జరిగిన పత్రికా సమావేశంలో ఏఐసీసీ సాధారణ కార్యదర్శి (సంస్థ) కె.సి. వేణుగోపాల్‌తో కలిసి మాట్లాడిన ఖర్గే, ఏఐఏడీఎంకేబీజేపీ కూటమిపై విమర్శలు చేస్తూ తొలుత ప్రధాన మంత్రిని టెర్రరిస్ట్‌గా పేర్కొన్నారు. అయితే, తన వ్యాఖ్యలపై పాత్రికేయులు వివరణ కోరడంతో, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను భయపెడుతున్నారనే ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేశానని స్పష్టం చేశారు.ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నేను ఆయనను నిజంగా టెర్రరిస్ట్ అన్నానా? లేదా? ఎందుకు అన్నాను? అన్నది కాదు ముఖ్యం. ఆయన తన అధికారాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడి చేస్తున్నారు అని ఖర్గే అన్నారు. ఇక భారత ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయ విస్తరణగా మారిపోయిందని ఆరోపించిన ఆయన, ఎన్నికల ప్రచారం చివరి దశలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ప్రధాన మంత్రిపై విమర్శలు గుప్పించారు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలను రాజకీయ కార్యకర్తలను బెదిరించే సాధనాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.అదే సందర్భంలో, మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు లోక్‌సభ స్థానాలను పెంచడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో అనుసంధానం చేసే రాజ్యాంగ సవరణ బిల్లుపై కూడా మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళల రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షం అడ్డుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన అన్నారు. 2023లో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడిందని గుర్తుచేశారు.నిజంగా అమలు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే, ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చు. అయితే ఎందుకు ఇవ్వడం లేదు? అని ఖర్గే ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం ఉంది. వారి పురోగతికి శిక్ష విధించాలని మోదీ, షా భావిస్తున్నారు అని విమర్శించారు.డీఎంకేకాంగ్రెస్ కూటమి బలాన్ని పునరుద్ఘాటించిన ఖర్గే, కె.సి. వేణుగోపాల్‌తో కలిసి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ మధ్య విభేదాలున్నాయన్న వార్తలను కొట్టిపారేశారు. ఇద్దరూ అన్నదమ్ముల్లాంటి వారు అని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కూటమి హామీలను కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మహిళలు, వృద్ధులకు నెలకు రూ.2,000 సహాయం, కుటుంబాలకు ఆహార భద్రత కోసం నెలకు రూ.2,500, అలాగే 300 రోజుల్లో ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, భారత ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయ విస్తరణలా వ్యవహరిస్తోంది అని ఖర్గే విమర్శించారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:50 pm

ప్రపంచ ధరిత్రి దినోత్సవం..

ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. భూమాతను కాపాడండి.. పర్యావరణాన్ని రక్షించండి…భూమాత క్షోభ ను బాదంపప్పు

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:47 pm

కెసిఆర్ వద్ద జీవన్ రెడ్డికీ భంగం తప్పదు: ఎంపీ మల్లు రవి

 భంగపడినట్లు ఇప్పుడు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేతిలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ తప్పదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం కాంగ్రెస్‌పై కెసిఆర్, టి. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ మల్లు రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెసిఆర్‌కు నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తెలిపారు. కెసిఆర్‌తో ఏమి ఉపయోగం లేదని ఎన్నికల్లో రుజువైందని అన్నారు. కెసిఆర్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజా ప్రభుత్వానికి ఏమి కాదని, ప్రజలకు తమ వైపు ఉన్నారని ఆయన తెలిపారు. త్రేతాయుగంలో రావణుడి చేతిలో విభీషణుడు భంగపడినట్లు కలియుగంలో కెసిఆర్ చేతిలో జీవన్ రెడ్డికి భంగపాటు తప్పదని ఆయన అన్నారు. 42 ఏళ్ళు జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించడం భావ్యం కాదని ఆయన విమర్శించారు. తాను చెప్పినట్లు కాంగ్రెస్ వినలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి పోవడంతో 42 ఏండ్ల వ్యక్తి గత ప్రతిష్టను దిగజార్చుకున్నారని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు రేవంత్ రెడ్డి కులగణన నిర్వహించారని మల్లు రవి చెప్పారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:43 pm

తెలంగాణ వైపు నార్వే చూపు..

తెలంగాణ వైపు నార్వే చూపు.. సచివాలయంలో కీలక భేటీ! ఆంధ్రఫ్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:42 pm

అమెజాన్ డెలివరీలో భారీ మోసం..

అమెజాన్ డెలివరీలో భారీ మోసం.. ఢిల్లీ పోలీసుల వేటలో దొరికిన కేటుగాళ్లు! ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:39 pm

బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

త్రిస్సూర్: కేరళలో భారీ పేలుడు జరిగింది. త్రిస్సూర్‌లో బాణసంచా నిల్వ, తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. త్రిస్సూర్ పూరం ఉత్సవాల్లో భాగంగా జరిగే తిరువంబడి కోసం బాణసంచా సామగ్రిని సిద్ధం చేస్తున్న కేంద్రంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న  వెంటనే పోలీసులు, అగ్నిమాపక, సహాయక బృందాలు, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని త్రిస్సూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. భారీ పేలుడుతో..దాని శబ్దం చాలా కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దీంతో సమీపంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం సంభవించినట్లు అనుకుని భయపడినట్లు స్థానికులు తెలిపారు. దట్టమైన పొగ, మంటలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:34 pm

సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం

సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాబోయే

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:28 pm

బీఆర్ఎస్ కీలక సమావేశం..

బీఆర్ఎస్ కీలక సమావేశం.. కేసీఆర్ అధ్యక్షతన రజతోత్సవ ముగింపు వేడుకలు ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:27 pm

బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:24 pm

పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహం..

మునుగోడు, ఆంధ్రప్రభ : పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:23 pm

ప్రధాని మోడీ 'టెర్రరిస్టు'.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆయన.. ప్రధాని మోడీని టెర్రరిస్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సమానత్వాన్ని విశ్వసించని వ్యక్తి(ప్రధాని మోడీ)తో AIADMK చేతులు కలపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. మోడీతోపాటు ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. అలాంటి వారితో వీరు చేతులు కలపడం అంటే, వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం అని పేర్కొన్నారు. ప్రధాని మోడీని ఉగ్రవాది అనడంతో ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను, ముఖ్యంగా ఎన్నికల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారు సిబిఐ, ఈడీ, ఐటి వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను కూడా లక్ష్యంగా చేసుకోగల శక్తివంతమైనది తమ ప్రభుత్వమేనని ప్రజలు భావించేలా, వారిలో భయాన్ని సృష్టిస్తున్నారు. ఆ సందర్భంలోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఆయన (మోడీ) స్వయంగా ఒక ఉగ్రవాది అని నేను ఎప్పుడూ అనలేదు. ఈ సంస్థలను ఉపయోగించుకుని ఆయన, ఆయన ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే నేను చెప్పాను. నా ఉద్దేశం అదే అని ఖర్గే అన్నారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:23 pm

ధర్మ యోగ బిరుదు పొందిన దాత్రిక రమేష్

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నగరానికి చెందిన గోరక్ష ప్రముక్ దాత్రిక రమేష్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:21 pm

రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..

రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:20 pm

అందుకే ఢిల్లీకి వెళ్లా..

అందుకే ఢిల్లీకి వెళ్లా.. సీఎం రేవంత్ కు హరీష్ వార్నింగ్ ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:10 pm

నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే ఆ పదిమందిని చేర్చుకున్నావు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని..రేవంత్ రెడ్డి.. ఆ పీడ విరగడ కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఆలోచన లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి తగిన మెజార్టీ సభ్యులు ఉన్నా.. నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు అని ఆరోపించారు. రాష్ట్రంలో తిరోగమన పాలన సాగుతోంది. కెసిఆర్ ను ఉరి తీస్తావా.. నీవేమి ముఖ్యమంత్రివి?. నీవు సీఎం కావడం కెసిఆర్ పుణ్యమే. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం చేస్తానన్నావు ఏమైంది. మేడిగడ్డ మరమ్మతుకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. 30 మాసాలుగా నిద్రపోయి ఇప్పుడు మేడిగడ్డ గుర్తొచ్చి వెళ్లారా?. మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించి డిజైన్ కే ఏడాది పడితే, ఎప్పుడు మరమ్మత్తులు చేస్తారు, ఎప్పుడు నీరందిస్తారు.ఈ రెండేళ్లు ప్రకృతి సహకరించింది.. రేపు ప్రకృతి సహకరించకుంటే పరిస్థితి ఏంటి? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:08 pm

నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4..

నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4.. పి.4.మార్గదర్శి బొండా సిద్ధార్థ పాయకాపురం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:07 pm

మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం తొర్రూరు టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:01 pm

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం.. జీతాల్లో కోత

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:58 pm

నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఆర్డీఓ..

నారాయణపేటం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంపై మంగళవారం ఎసిబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ రామచందర్ నాయక్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏకకాలంలో ఆర్డీఓ నివాసం, కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిని ఆర్డీఓను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే, వికారాబాద్ జిల్లా కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ లోనూ ఎసిబి అధికారులు దాడులు చేశారు. సీఐ, ఎస్ఐ.. బాధితుల నుంచి ఆన్ లైన్ లో డబ్బులు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

మన తెలంగాణ 21 Apr 2026 5:57 pm

నేటితో ముగియనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారం

మరికాసేపట్లో తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగియనుంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:47 pm

Ram Charan’s Peddi Shoot Update

Mega Powerstar Ram Charan’s highly awaited Pan-India project Peddi is steadily marching towards the finish line. Electrifying fans across social media, Ram Charan shared a couple of striking behind-the-scenes selfies with director Buchi Babu Sana, officially confirming that the film is only six days away from wrapping up its principal photography. The pictures offer a […] The post Ram Charan’s Peddi Shoot Update appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 5:42 pm

Telangana : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు.. ఆ రెండు మినహా

ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యాయి

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:33 pm

ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద గల రూపా రాజా పిసిఎన్ఆర్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ గ్రాజియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరములు విద్యార్థులు చేసిన ప్రయాణాన్ని కు గుర్తుగా, ఆనందంగా, ఉత్సాహభరితంగా, జ్ఞాపకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రతిభగర పరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. […] The post ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 5:31 pm

ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు

ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు టేకుమట్ల, ఆంధ్రప్రభ : ముఖ

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:29 pm

మృతుని ఆచూకీ తెలపండి : సిఐ శ్రీ హర్ష

మృతుని ఆచూకీ తెలపండి : సిఐ శ్రీ హర్ష రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:27 pm

రైతు భరోసా సభ విజయవంతం…

రైతు భరోసా సభ విజయవంతం… ప్రజలకు మంత్రి శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు… కాటారం రూరల్,

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:22 pm

Kerala : కేరళలో త్రిసూర్ లో భారీ పేలుడు.. ఆరుగురి మృతి

కేరళలో త్రిసూర్ లో భారీ పేలుడు సంభవించింది. ఆరుగురు మరణించారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:19 pm

TG |సమ్మెపై సర్కార్ క్లారిటీ..

TG | సమ్మెపై సర్కార్ క్లారిటీ.. ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన! TG

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:08 pm

22-carat |బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..

22-carat | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. 22-carat | వెండి ధరల

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:04 pm

ఫ్యాక్ట్ చెక్: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో సన్నిధి గొల్లకు అవమానం జరిగిందనే వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపిన టీటీడీ

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో సన్నిధి గొల్లకు అవమానం జరిగిందనే వాదన

తెలుగు పోస్ట్ 21 Apr 2026 4:56 pm

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీ, సాయి కృష్ణ వెంచర్ సమీపాన గల రైల్వే ట్రాక్ పక్కన కంప చెట్లలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం పడి ఉన్నట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, శరీరంపై ఉన్న ఆనవాళ్ల ప్రకారం ఎదపై కుడి ప్రక్కన పుష్ప అనే పేరుతో పాటు తేలు మార్కు ట్యాటూ ఉందని తెలిపారు. మృతుడు […] The post గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:54 pm

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… జన్నారం, ఆంధ్రప్రభ : మార్క్ పేడ్,

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:50 pm

డిజిటల్ విప్లవంతో మహిళా సంఘాలకు మహర్దశ: ఎమ్మెల్యే పరిటాల సునీత

​విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : డిజిటల్ విప్లవంతో మహిళా సంఘాలకు మహర్దశ రానుందని, స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించే సేవల్లో వేగం, పారదర్శకత పెంచేందుకే యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. నియోజకవర్గంలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల యానిమేటర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను పంగల్ రోడ్డు సమీపంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 120 మందికి ఈ ఫోన్లను ఆమె పంపిణీ చేశారు. […] The post డిజిటల్ విప్లవంతో మహిళా సంఘాలకు మహర్దశ: ఎమ్మెల్యే పరిటాల సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:50 pm

తెలంగాణ జాగృతిలో చేరిన సబ్బని కృష్ణ..

తెలంగాణ జాగృతిలో చేరిన సబ్బని కృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:47 pm

Ormax Media |బాలీవుడ్ స్టార్ ని వెనక్కి నెట్టి..!

Ormax Media | బాలీవుడ్ స్టార్ ని వెనక్కి నెట్టి..! Ormax Media

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:40 pm

ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదు: హరీష్ రావు

హైదరాబాద్: జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ సభ జరిగే సమయానికే సిఎం రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పులిని చూసి నక్క వాలు పెట్టుకున్నట్లు చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ స్థాయి ఏందో..రేవంత్ రెడ్డి స్థాయి ఏందో ప్రజలకు అర్థమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కడుపుమంటతో మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కెసిఆర్ హుందాగా మాట్లాడారని కొనియాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం.. దాన్ని ఆపడం రేవంత్ రెడ్డి తరం కాదని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని హరీష్ రావు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు అయినా దక్కుతాయని, తమ ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. తమ ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదని, కాళేశ్వరం కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ముందు రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారని, ఆ తర్వాత రోజు ఆర్ఎస్ఎస్ కు చెందిన కేంద్ర మంత్రిని కలిశారని అన్నారు. రెండు రైతు భరోసాలు ఎగ్గొట్టారని హరీష్ రావు మండిపడడ్డారు.

మన తెలంగాణ 21 Apr 2026 4:39 pm

మైలారం చక్రు తండాలో ఘనంగా దుర్గమ్మ పండుగ

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలం లోని మైలారం గ్రామం చక్రు తండాలో దుర్గమ్మ

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:39 pm

Video : Music Director Raghu Kunche Exclusive Interview Part 1

The post Video : Music Director Raghu Kunche Exclusive Interview Part 1 appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 4:33 pm

రక్తహీనత భయపెడుతోంది

*ఆకలి తీరని పేదరికం*అందని పౌష్టికాహారం ఒకవైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పాలకులు గంభీర ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పేదవాడి పరిస్థితి మాత్రం ‘అడియాస’గానే మారుతోంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, పసిపిల్లలను రక్తహీనత భూతం నీడలా వెంటాడుతోంది. పౌష్టికాహార లోపం, పేదరికం తోడై పేదల జీవితాలను చిదిమేస్తోంది. ఇటీవల వెలువడిన 2025-26 గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. గణాంకాలు చెబుతున్న చేదు నిజాలివీ… జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన […] The post రక్తహీనత భయపెడుతోంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:31 pm

కేంద్ర సినిమా బోర్డు సభ్యుడిగా దెబ్బాది శ్రీనివాస్

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; సినీ రంగానికి సంబంధించిన ప్రముఖ సంస్థలో కీలక బాధ్యత

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:29 pm

అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అనంత పాలదాణాను ప్రారంభించి, రైతులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, నార్పల, అనంతపురం, కూడేరు, కుందుర్పి మండలాల్లోని పిఎసిఎస్ గోడౌన్లలో అనంత పాలదాణాను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. […] The post అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:26 pm

కడెం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:25 pm

జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపికకు ట్రయిల్స్ ..

జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపికకు ట్రయిల్స్ .. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:21 pm

Personality Rights Protection: Allu Arjun gets Court Order

After top actors like Chiranjeevi, Nagarjuna, NTR and others, the Delhi High Court has granted an interim injunction for Icon Star Allu Arjun from the unauthorized use and commercial exploitation of his personality rights. The actor approached the Delhi High Court last week and the decision came in his favour. Allu Arjun’s name, image, voice […] The post Personality Rights Protection: Allu Arjun gets Court Order appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 4:20 pm

Andhra Prabha Smart Edition |TS|మెట్రో సర్వీసులు/సన్రైజర్స్ కన్ను

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 21‍-౦4-2026, 4.00PM ts ఇక నుంచి ఉదయం

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:19 pm

మహిళా రిజర్వేషన్‌లో సామాజిక న్యాయం పాటించాలి..

మహిళా రిజర్వేషన్‌లో సామాజిక న్యాయం పాటించాలి.. దళిత క్రైస్తవుల తీర్పును పునర్ సమీక్షించాలివారి

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:17 pm

Andhra Prabha Smart Edition |AP|మరో ఎయిర్పోర్ట్../చంద్రబాబు ఫైర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 21-04-2026, 4.00PM ap ఏపీలో మరో ఎయిర్పోర్ట్..

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:15 pm

అనాథ బాలికలకు ఉచిత పాలిటెక్నిక్ అవకాశం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:14 pm

రైతు భరోసా సమావేశం బాధ్యత పెంచింది

రైతు భరోసా సమావేశం బాధ్యత పెంచింది సమావేశాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:09 pm