డివిడెండ్ స్టాక్స్ vs గ్రోత్ స్టాక్స్: స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్న వారి కోసం ఒక పూర్తి గైడ్
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయి. అవి డివిడెండ్ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్. డివిడెండ్ స్టాక్స్ అనేవి కంపెనీ లాభాల నుండి పెట్టుబడిదారులకు ‘స్థిరమైన ఆదాయాన్ని’ (Regular Income) అందిస్తాయి. మరోవైపు, గ్రోత్ స్టాక్స్ లాభాలను తిరిగి కంపెనీలో పెట్టుబడి పెట్టి, భవిష్యత్తులో ‘అధిక ధరల పెరుగుదల’ (Capital Appreciation) ద్వారా లాభాలను ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఏది ఎంచుకోవాలో ఈ గైడ్ పూర్తిగా వివరిస్తుంది. 1. […] The post డివిడెండ్ స్టాక్స్ vs గ్రోత్ స్టాక్స్: స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్న వారి కోసం ఒక పూర్తి గైడ్ appeared first on Dear Urban .
TEMPLE |వకుళమాత అమ్మవారి దర్శనం..
TEMPLE | వకుళమాత అమ్మవారి దర్శనం.. TEMPLE | తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ
ST Hostel |విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
ST Hostel | విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ST Hostel | గద్వాల
పార్లమెంట్ మెరుగ్గా పనిచేస్తేనే స్ఫూర్తి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం (1.12.2025) ప్రారంభమయ్యాయి. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరుగుతాయి. కానీ ఈసారి వాటిని 15 రోజులకే కుదించారు. ప్రవేశ పెట్టిన బిల్లులపై ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేందుకు సమగ్రంగా చర్చించడానికి విపక్షాలకు ఇదో అవకాశం. కానీ ఏదో ఒక అంశంపై పట్టుపట్టి పదేపదే సమావేశాలను బహిష్కరించినట్టయితే చర్చించే అవకాశాలను విపక్షాలు కోల్పోతాయి. అంతేకాదు ప్రభుత్వం ముందు ఒక రాజకీయ క్రీడగా మిగిలిపోతారు. గత కొంతకాలంగా పార్లమెంట్ సమావేశాల తీరుతెన్నులు పరిశీలిస్తే అలాగే ఉంటున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చక్కగా ‘ధర్మోపదేశాలు’ వెలువడుతుంటాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని అధికార పక్షంనుంచి అభ్యర్థనలు వస్తుంటాయి. ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరగాలన్న అభిప్రాయాలు వస్తుంటాయి. కానీ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్న విధానం బయటపడుతుంది. ఏదో ఒక అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడం, అధికార పక్షం మొండికెత్తడం, దాంతో విపక్షాలు సమావేశాలను బహిష్కరించడం మళ్లీ చివరి దశ లోనే బహిష్కరణల నుంచి విపక్షాలు వెనక్కి తగ్గి హాజరవుతుండటం పరిపాటి. మొత్తం మీద సమావేశాలు ముగిశాయి అని అటుఇటు సంతృప్తి పడుతుంటారు. సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా అంతరాయం తప్పడం లేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ప్రధాని మళ్లీ విమర్శలకు తెరలేపారు. ప్రతిపక్షాలకు చురకలంటించామన్న ఆత్మసంతృప్తి ప్రధాని ప్రసంగంలో వినిపించింది. క్రియాశీలక చర్చలు జరిగితేనే చట్టసభలకు సార్థకత అని సభ్యులకు హితోపదేశం చేసిన ప్రధాని మోడీ తరువాత తన స్వరం మార్చి సమావేశాల్లో డ్రామాలొద్దు.. కావాలంటే టిప్స్ ఇస్తానని విపక్షాలను కవ్విస్తూ ఎత్తిపొడిచారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. మరి అలాంటప్పుడు అఖిలపక్ష సమావేశాలెందుకు? బుజ్జగింపు మాటలెందుకు? అఖిలపక్ష సమావేశాల వల్ల ఒరిగిందేముంది? విపక్షాలు కూడా ప్రశ్నోత్తరాల గంటపై ఆందోళనకు దిగడంతో కొంతసేపు సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. దీన్ని బట్టి సమావేశాలు అర్థవంతంగా కొనసాగిద్దామన్న స్ఫూర్తి సభ్యుల్లో కొరవడినట్టు విమర్శలు వస్తున్నాయి. ఈసారి సమావేశాల్లో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) నిర్వహిస్తున్న తీరుపై విపక్షాలు గట్టిగా చర్చ జరగాలని పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానం వద్ద కూడా ఎస్ఐఆర్పై అనేక పిటిషన్లు దాఖలై ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో అందరికే తెలిసిందే. కొన్ని సార్లు ఉన్నత న్యాయస్థానం ఎస్ఐఆర్ విషయంలో జోక్యం చేసుకోవడం జరుగుతోంది. అందుకని దీనిపై కూలంకషంగా చర్చ జరగాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రశ్నార్థకం. ప్రజాస్వామ్య సమతూకానికి ఓటర్ల సమగ్ర ప్రక్షాళన అవసరం అన్నవిషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ లోపాలను ఎత్తి చూపినప్పుడు దానిపై చర్చ జరగడం అవసరం. ఈ సమావేశాల్లో 13 బిల్లులు ప్రవేశపెట్టాలని సిద్ధమవుతున్నారు. అలాగే ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద ఆత్మాహుతి కారు బాంబు పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్లుపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా పాలక వర్గాల నుంచి ఎలాంటి హామీ రాలేదు. సాధారణ రుతుపవనాల వర్షాల కన్నా భారీ వర్షాలు కుండపోతగా కురియడంతో పంటలు దెబ్బతిని రైతులు కష్టనష్టాల పాలయ్యారు. దేశరాజధానిని కకావికలం చేస్తున్న వాయు కాలుష్యం, భారత్ అమెరికా సంబంధాలపై మన దేశీయ విధానం, ఇవన్నీ చర్చకు రానున్నాయి. పార్లమెంట్ సభ్యులు చర్చించాల్సిన అవసరాన్ని విశాల దృక్పథంతో గుర్తించడానికి బదులు, స్వల్పకాలిక చర్చకు కూడా పాలకవర్గాలు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి? ఏది చర్చించాలో ముందుగానే నిర్ణయించడం అవి తప్పితే మరేదైనా చర్చకు తీసుకు వస్తే నిరాకరించడం పార్లమెంట్ సమావేశాల విలువలను తగ్గించడమే అవుతుంది. ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలు వెల్లడించడానికి తగినంత సమయం కేటాయించక పోతే, ఆమేరకు ప్రభుత్వ ఆలోచనా విధానాల్లో మార్పు రాకుంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి విచ్ఛిన్నమవుతుంది. దేశసమస్యలపై చర్చించడానికి పార్లమెంట్ తప్పితే మరేదైనా వేదిక ప్రతిపక్షాలకు ఉంటుందా? గత వర్షాకాల సమావేశాలన్నీ నిరంతరం అంతరాయాలతోనే ముగిశాయి. సమావేశాల నుంచి ఫలితాలు అత్యంత అల్పరేటింగ్లో కనిపించాయి. కేటాయించిన సమయం చర్చలతో అర్థవంతంగా వినియోగం కావలసి ఉండగా లోక్సభ కేవలం 29 శాతం, రాజ్యసభ 34 శాతం మాత్రమే పనిచేశాయి. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత ముఖ్యమైన సమయంగా పేర్కొనే ప్రశ్నోత్తరాల సమయం కూడా లోక్సభలో 23 శాతం, రాజ్యసభలో 6 శాతం పరమ అధ్వాన్నంగా వినియోగమయ్యాయి. గత సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశాలే పార్లమెంట్ సమావేశాలను ఎక్కువగా స్తంభింప చేశాయి. ఈసారి ఇతర ముఖ్యాంశాలతోపాటు ఎన్నికల కమిషన్ తీరు మళ్లీ చర్చకు వస్తే పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృథా చేసిన వారవుతారన్న అభిప్రాయం రాజకీయ నిష్ణాతుల్లో కనిపిస్తోంది. స్వేచ్ఛగా, నిష్కర్షగా చర్చించడానికి ఏమాత్రం అవకాశంఇవ్వని పాలకవర్గాల మొండితనం ఒకవైపు, తాము లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా చర్చించాలన్న విపక్షాల డిమాండ్లు, నిరసనలుతో అంతరాయాలు మరోవైపు కొనసాగితే పేరుకే ప్రజాప్రతినిధుల సభ మరేమీ కాదన్న అధోగతికి పార్లమెంట్ సమావేశాలు దిగజారిపోతాయి.
Congress |గ్రామాబివృద్ధే లక్ష్యం
Congress | గ్రామాబివృద్ధే లక్ష్యం కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ బద్దం యాదమ్మ,
GST 2.0 Impact Begins to Show in Andhra Pradesh Revenues
The Union Government’s revised GST 2.0 system came into effect on September 22. All commercial activity in October operated under the new rates, and its impact became visible in the November revenue figures. Andhra Pradesh showed strong GST collections until October, with a 5.8 per cent rise over last year. Once GST 2.0 kicked in, […] The post GST 2.0 Impact Begins to Show in Andhra Pradesh Revenues appeared first on Telugu360 .
Spirit|నాటి పోరాట స్ఫూర్తి ఎక్కడ?
Spirit| రాయపోల్, ఆంధ్రప్రభ : దేశ దాస్య శృంఖలాలు తెంచే పవిత్ర ఉద్యమంలో
Scrub typhus |వ్యాధి భయంతో వణుకుతున్న జిల్లా..
Scrub typhus | వ్యాధి భయంతో వణుకుతున్న జిల్లా.. Scrub typhus, చిత్తూరు,
విమానానికి బాంబు బెదిరింపు.. అలా చేయడంతో అంతా సేఫ్
హైదరాబాద్: కువైట్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పలు జాతీయ మీడియాల కథనం ప్రకారం గత అర్థరాత్రి 1.30 గంటలకు ఇండిగోకి చెందిన 6ఇ1234 విమానం హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. ఈ విమానం ఉదయం 8.10 గంటలకు శంషాబాద్లో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ, విమానంలో మానవబాంబు ఉందని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. ఆ తర్వాత విమానంతో సహా ప్రయాణికులు అందరినీ ఐసోలేషన్కు తరలించారు. అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Siddipeta |ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన నరసింహారెడ్డి
Siddipeta | ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన నరసింహారెడ్డి Siddipeta |
న్యూఢిల్లీని మరోసారి శీతాకాలపు పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో కంటిచూపు తగ్గుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. జనాలకు ఊపిరి సలపడం లేదు. వాయు నాణ్యత సూచిక ప్రమాద స్థాయిలో ఉంది. ఫలితంగా పాఠశాలలు మూసివేయాల్సి వస్తోంది. రాజధాని నివాసితులకు ఏటా శ్వాసకు ఇబ్బంది, ఊపిరాడకపోవడం ఓ భయంకరమైన ఆచారంగా మారింది. రాజధానిలో పిల్లలు ఇప్పుడు స్వచ్ఛమైన గాలి తెలియక పొగమంచును రూచిచూస్తూ పెరుగుతున్నారు.శీతాకాలం అంటే చలి మాత్రమేకాక తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుందని వృద్ధులు అంటున్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం అత్యవసర చర్యల గురించి చర్చిస్తుంది. కానీ, నిర్లక్ష్యం. తాత్కాలిక ఆలోచనే తప్ప, వాయుకాలుష్య నియంత్రణకు కఠినమైన, శాశ్వత చర్యలు తక్కువ. అయితే ఈసారి సమస్య కేవలం ఢిల్లీకే పరిమితం కావడంలేదు. మైదానాలకు దూరంగా -ఈశాన్య ప్రాంతంలో వాయు కాలుష్య భూతం విస్తరించిన వాస్తవాలు కలవరపెడుతున్నాయి. సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సిఆర్ఇఎ) చేసిన కొత్త శాటిలైట్ ఆధారిత ఎంపి 2.5 అంచనా దిగ్భాంతి కలిగించే వాస్తవాన్ని వెల్లడించింది. అసోంలోని 11 జిల్లాలు ఇప్పుడు దేశంలోని 50 అత్యంత కలుషిత జిల్లాలలో ఉన్నాయి. ఈ సంఖ్య ఢిల్లీకి సమానం. మరీ ఆందోళన కలిగించే అంశం అసోం లోని 34 జిల్లాలు 2024లో జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాలను దారుణంగా అధిగమించాయి. కాలుష్యం తీవ్రతే కాదు అది కొనసాగడం విధాన రూపకర్తలను ఇబ్బందిపెడుతోంది. భారతదేశంలో ఎక్కువ భాగం వర్షాకాలంలో వాయు కాలుష్యం ప్రక్షాళన జరుగుతుంది, అసోంలో వర్షాకాలంలో కూడా పిఎం 2.5 నిబంధనలను 21 జిల్లాలు ఉల్లంఘించినట్లు రికార్డయింది. త్రిపురలో కూడా ఆరు జిల్లాలలో కాలుష్యం పెచ్చుపెరిగింది. ఇవి ఎపిసోడిక్ స్పైక్లను కాక, నిర్మాణాత్మక క్షీణతను సూచిస్తున్నాయి. భారతదేశంలో చక్కటి పర్యావరణానికి పెట్టింది పేరైన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దీర్ఘకాలిక వాయు కాలుష్య ఇబ్బందుల జోన్లోకి మారిపోయింది. ఈ మార్పు అభివృద్ధి కారణం గా వచ్చిన అనివార్య పరిణామంగా చెప్పలేం, కానీ ఈ గణాంకాలను తోసిపుచ్చలేం కదా. దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాలు చక్కటి వర్షపాతం, దట్టమైన అటవీ విస్తీర్ణం, తక్కువ పట్టణీకరణ, పరిమితంగా పారిశ్రామికీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలిని అనుభవిస్తూ వచ్చాయి. అయితే నేడు శీతాకాలం, వేసవి, వర్షాకాలం అన్న తేడా లేకుండా దేశంలో ఎక్కువ కాలుష్య ఐదు రాష్ట్రాలలో అసోం, త్రిపుర ఉండడం దురదృష్టకరం. ఇందుకు ప్రధాన కారణం పర్యావరణ రక్షణ చర్యలు లోపించడం, అభివృద్ధి విస్తరణ విషయాలపై నియంత్రణ పేలవంగా ఉండడం, పర్యావరణ సమతుల్యతపట్ల తీవ్ర నిర్లక్ష్యం. చట్టబద్ధమైన ముందస్తు అనుమతుల లేకుండా కార్యకలాపాలు ప్రారంభించే పరిశ్రమలకు ఫోస్ట్ ఫాక్టో పర్యావరణ అనుమతులను అనుమతించడం ద్వారా న్యాయస్థానం తీసుకున్న తిరోగమన చర్యవల్ల ఈ డైనమిక్స్ బయటపడుతున్నాయి. పోస్ట్- ఫాక్టో పర్యావరణ అనుమతులను నిషేధించే 2025 వనశక్తి తీర్పును సుప్రీం కోర్టు ఈ మధ్య ఉపసంహరించుకోవడం భారతదేశ పర్యావరణ న్యాయశాస్త్రానికి ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బ. పెట్టుబడులు రావాల్సిన అవసరం, ఆర్థిక పరిగణన నేపథ్యంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన పరిశ్రమలు తరువాత పర్యావరణ పరమైన అనుమతులు కోరవచ్చునని కోర్టు పేర్కొంది. కానీ, ఇది పర్యావరణ నియంత్రణ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఇందుకు ముందు పరిస్థితి అంచనాలు, ప్రజా సంప్రదింపులు వంటి జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు ఫలితంగా ఉల్లంఘనలు పెరుగుతాయి. పునరాలోచన తర్వాత తీర్పు అక్రమనిర్మాణాలను చట్టబద్ధం చేస్తుంది. వ్యాపార అవసరాలకోసం పర్యావరణానికి హాని జరిగినా ఆమోదించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ తీర్పు ఆర్టికల్ 21 కింద పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం విషయంలో రాజ్యాంగ హక్కును దెబ్బతీస్తుందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో పర్యావరణ దౌర్బల్యం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ, పర్యవేక్షణ తక్కువే. అందువల్ల మరింత శ్రద్ధ అవసరం. ఈ విస్తృత జాతీయ సందర్భంలోనే సిఆర్ ఇఎ నివేదికను అర్థం చేసుకోవాలి. అసోంలో గాలి నాణ్యత క్షీణత కు కారణం స్థానిక పాలనా యంత్రాంగ వైఫల్యమే కాదు. ఇది పర్యావరణ పరంగా విస్తృత కోతకు సంకేతం. బ్రహ్మపుత్ర వ్యాలీలో థర్మల్ పవర్ నుంచి, పెట్రో కెమికల్స్ వరకూ, సిమెంటు ఫ్యాక్టరీల నుంచి చమురు శుద్ధి కర్మాగారాల వరకూ పలు పరిశ్రమలు విస్తరించడం ప్రధాన కారణం. కఠినమైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉద్గారాలు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్నాయి. ఆధునిక జిగ్జాగ్ టెక్నాలజీ, ఉద్గార ఫిల్టర్లు లేకుండా పనిచేసే ఇటుక బట్టీల కారణంగా, మొరిగావ్, నాగావ్, టిన్సుకియా, బొంగైగావ్ వంటి పట్టణాల చుట్టూ దట్టమైన కాలుష్య వలయం ఏర్పడుతోంది. గ్రామీణ జీవనోపాధిలో భాగమైన బయోమాస్కు తోడు ఇప్పుడు పట్టణ చెత్త దగ్ధం, ఏడాది పొడవునా సాగే నిర్మాణ పనుల కారణంగా కాలుష్యం మరీ మితిమీరుతోంది. అసోం పట్టణ ప్రాంతాలలో వాహనాల సంఖ్య గణనీయంగా పరిగింది. రోడ్ల విస్తరణ, హైవేల నిర్మాణం, నదీతీర అభిృవృద్ధితో నియంత్రణ లేని ధూళి పెరిగిపోతోంది. ఈశాన్య ప్రాంతం కాలుష్య కేంద్రంగా మారడానికి ఇవే కారణాలని పూర్తిగా చెప్పలేం. బంగ్లాదేశ్, ఉత్తర బెంగాల్ నుంచి సరిహద్దు ఏరో సోల్స్ అసోం బేసిన్ లాంటి ప్రాంతాలలోకి ఎక్కువగా చొచ్చుకువస్తాయి. ఇక్కడి తేమ, తక్కువ గాలి ప్రసరణ కారణంగా కాలుష్య కారకాలు చిక్కుకుంటాయి. అడవుల నరికివేత, తగులపడుతున్న అడవులు, క్వారీయింగ్, నదీగర్భంలో అక్రమ మైనింగ్ ప్రకృతిని దెబ్బ తీస్తున్నాయి. జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, లీనియర్ మౌలిక సదుపాయాలు, రైల్వే డబ్లింగ్, సరిహద్దురోడ్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ఐదేళ్లుగా విస్తరించాయి. తరచుగా సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనాలను దాటవేస్తున్నాయి. పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇప్పుడు చట్టబద్ధం కావడంతో అనుమతులు పొందాలనే షరతు లేదు. దాంతో ఈశాన్య పర్యావరణానికి ముఖ్యంగా పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగాలనుంచి అన్నివైపులనుంచి ఒత్తిడి తప్పడం లేదు. దారుణం ఏమిటంటే, ఈ ప్రాంతం పర్యావరణ ప్రాముఖ్యత ఈ ప్రాంత నివాసితులకు స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తోంది. ఈశాన్య ప్రాంతం ప్రపంచం లోని గొప్ప జీవవైవిధ్య హాట్స్పాట్ లలో ఒకటి. దాని అడవులు వర్షప్రాంతాన్ని నియంత్రిస్తాయి. నదీ వ్యవస్థలను స్థిరీకరిస్తాయి. మరో చోట లేని అరుదైన జాతులను సంరక్షిస్తాయి. గిరిజనులు, స్వదేశీ సమాజాలు శతాబ్దాలుగా స్థిరమైన భూనిర్వహణ సంరక్షకులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పర్యావరణ ఆస్తుల నష్టం ప్రాంతీయపరమైన నష్టమేకాదు ఇది జాతీయ నష్టం. కలుషితమైన ఈశాన్యం అంటే అస్థిర రుతుపవాలు, అస్థిర వరదలు, మొత్తం భారత ఉప ఖండానికి ఎక్కువ నష్టం కలిగించే పరిస్థితి. బ్రహ్మపుత్ర లోయ ఇబ్బందిపడినప్పుడు దిగువ మైదానాలకు ఇబ్బందులు తప్పవు.భారతదేశ పర్యావరణ భవిష్యత్కు హానికరమే. సంక్షోభాన్ని గుర్తిండమే కాదు, దేశంలో పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన విధానాలను పునర్నిర్వచించడం ఎదుట ఉన్న సవాల్. కాలుష్య నియంత్రణ బోర్డులను స్వతంత్ర శాస్త్రీయ సామర్థ్యంతో బలోపేతం చేయడం, చట్టబద్ధమైన అధికారాలతో ఈశాన్య పర్యావరణ పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేయడం, ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టును ప్రారంభించలేరనే సూత్రాన్ని పునరుద్ధరించడంవంటి చర్యలు ముఖ్యం. జిల్లా స్థాయి క్లీన్ -ఎయిర్ యాక్షన్ ప్లాన్ను తప్పనిసరి చేయాలి. శాటిలైట్ ఆధారిత హాట్స్పాట్ గుర్తింపునకు సంబంధించి మార్గనిర్దేశం చేయాలి. ఇటుక బట్టీలను ఆధునీకరించడమో, మూసివేయడమే చేయాలి. పరిశ్రమలు నిరంతర ఉద్గారాల పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. డేటా అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు స్వచ్ఛమైన ఇంధనం అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మాణ కార్యక్రమాలనూ కఠినంగా నియంత్రించాలి. మున్సిపల్ సంస్కరణల ద్వారా చెత్త తగులపెట్టకుండా నియంత్రించాలి. అడవులు, చిత్తడి నేలలు, గిరిజన భూముల రక్షణ కూడా కీలకం. అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చడం, అటవీ భూమి విషయంలో స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో ఈశాన్య ప్రాంతంలో విస్తారమైన భూభాగాలు రక్షణాత్మక చట్టాల కింద లేకుండాపోయాయి. ప్రభుత్వం నోటీఫై చేసిన అడవుల మాదిరిగానే, కమ్యూనిటీ నిర్వహణ అడవులకు రక్షణ కల్పించే చట్టాలను బలోపేతం చేయాలి. వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతున్నందువల్ల, కఠినమైన పర్యావరణ, అంచనాలు లేకుండా మైనింగ్, నదుల తవ్వకానికి కానీ, రోడ్ల విస్తరణకు కానీ అనుమతించరాదు. ఇందుకోసం అడవులను పణంగా పెట్టకూడదు. కాలుష్య నియంత్రణకు ప్రాంతీయ సహకారం అవసరం, కాలుష్యం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితం కాదు. ఈశాన్యం లోని అసోం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ప్రదేశ్ ఉమ్మడి కాలుష్య నియంత్రణకు గట్టి సమన్వయంతో కృషి చేయాలి. బయోమాస్ దగ్ధం, కార్చిచ్చు, అడవులలో మంటల నియంత్రణ, పొరుగు దేశాలతో సరిహద్దులలో పారిశ్రామిక ఉద్గారాలపై ఉమ్మడి ప్రొటోకాల్ మున్ముందు చాలా అవసరం. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా పొగమంచు సంక్షోభం ఓ హెచ్చరిక. కానీ ఈశాన్య ప్రాంతంలో ఏడాది పొడవునా పెరుగుతున్న కాలుష్యం మరింత తీవ్రమైనదిగా చూడాలి. ఒకప్పుడు రుతుపవన అడవులు, నదీ గాలులతో కూడిన ప్రాంతం విషపూరితంగా తయారైంది.దేశవ్యాప్తంగా పర్యావరణ పతనాన్ని అరికట్టగలమా. కోట్లాది సంవత్సరాలుగా పరిరక్షించుకుంటున్న సహజమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోగలమా అన్నది మనం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందితే, దానికి చెల్లించే మూల్యం గాలి నాణ్యత ఇండెక్స్ లేదా అస్పత్రిలో చేరిన వారి సంఖ్యతో లెక్కించలేం. ఇది భారత వాతావరణ భద్రత, దాని జీవవైవిధ్యం, అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పనకు సంబంధించి రాజ్యాంగం ప్రసాదించిన హామీ అమలుపై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
ప్రపంచ టాప్ 100 ఉత్తమ నగరాలలో హైదరాబాద్ #Hyderabad #GlobalRanking #Resonance #Innovation
Makthal |వైభవంగా అయ్యప్పస్వామి కలశ ఊరేగింపు
Makthal | వైభవంగా అయ్యప్పస్వామి కలశ ఊరేగింపు అయ్యప్ప స్వాముల కలశ ఊరేగింపుMakthal
Telagnana : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఫుల్లు ఖుషీ.. కారణమేంటో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్దిదారులు భారీ ఊరట చెందుతున్నారు
Bengaluru : నాటుకోడి కూరతో సిద్ధరామయ్యకు బ్రేక్ ఫాస్ట్
నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంటికి వెళ్లారు
అధికారం కోసం వేలం పాట వేస్తారా?
తెలంగాణ పల్లెల్లో ఎన్నికల శంఖారావం వినిపించే ప్రతిసారీ చుట్టుపక్కల వ్యాపించే ఒక మాట ఏకగ్రీవం అప్రతిహతంగా రాజకీయ వాతావరణాన్ని చుట్టుముట్టుతుంది. ఏకగ్రీవం అంటే అసలు అర్థంలో ప్రజాస్వామ్య పరంపరలో గొప్ప చిహ్నం. ప్రజలందరూ ఒకే అభిప్రాయంతో, ఒకే సంకల్పంతో, గ్రామ ప్రగతిని మించిన ఆకాంక్ష లేకుండా, నిస్వార్థ సేవా మనస్సు ఉన్న వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం. స్వచ్ఛత, నిర్ణయాత్మకత, వినయం, ప్రజాహితం, ఇవే అసలు ఏకగ్రీవానికి నిలువెత్తు అర్థాలు. కాని కాలగమనంలో ఈ పవిత్రమైన భావన పల్లెల అంచుల వెంట బతుకుతున్న రోజువారీ కుటుంబ జీవితాలు గడుపుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండే నాయకుడు ఉండాలి. కొంతమంది అవినీతిపరులైన రాజకీయ నాయకుల చేతుల్లో పడిపోవడంతో, అది ఇప్పుడు వేలంపాటలకు, బెదిరింపులకు, దురుద్దేశాలకు పూచికత్తిగా మారిపోయింది. ఇదే పరిస్థితికి ఒక ప్రతిబింబంగా గత రెండు దశాబ్దాలుగా గ్రామ ఎన్నికల్లో జరిగే ఏకగ్రీవాల శాతం పెరుగుతూ పల్లె రాజకీయాల్లో అజ్ఞాతంగా వ్యాపిస్తున్న వ్యాధిలా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఏడున్నర శాతం మాత్రమే ఉన్న ఏకగ్రీవ సర్పంచి ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో 2019నాటికి 17 శాతానికి పైగా దూసుకుపోయాయి. ఈ గణాంకాలు గ్రామ ప్రజాస్వామ్యం బలపడిందనే వాదనకు నిదర్శనమా? ఈ కాలంలో ఏకగ్రీవాలు గ్రామాభివృద్ధి ప్రతిబింబం కాదు. అవి గ్రామ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా మింగేస్తున్న ప్రాణాంతకమైన రాజకీయ వ్యాపారం. సేవాభావం లేకుండా, గ్రామం పట్ల బాధ్యతా రాహిత్యంతో, వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పదవులను తమ కబంధహస్తాలలోకి తీసుకోవడం, గ్రామ ప్రజాస్వామ్యానికి అపాయకరం. ఒక గ్రామంలో ప్రజలు అభివృద్ధి కోసం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటే అది శుభసూచక సంకేతం. అయితే, అదే ప్రజల స్వరాన్ని డబ్బుతో ముంచి, వారిని నిర్ణయించనియ్యకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయిస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన, ప్రమాదకరమైనచర్య. ఇలా గ్రామ ప్రజాస్వామ్యాన్ని బంధించిన శక్తులు విస్తరిస్తున్న సమయంలో, మహాత్మాగాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం అనే భావనను ఒక్కసారి తలచుకుంటే పరిస్థితి ఎంత విరుద్ధ దిశలో నడుస్తోందో అర్థమవుతుంది. మహాత్మా గాంధీ ఊహించిన గ్రామం అనేది స్వయం సమృద్ధిని చాటే వ్యవస్థ. రోడ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, శానిటేషన్, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాల్లో గ్రామమే స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామసభ శక్తి కేంద్రంగా ఉండాలి. సర్పంచి ప్రజల సేవకుడిగా ఉండాలి. పంచాయతీ ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత లక్ష్యంగా భావిస్తూ పని చేయాలి. అయితే నేటి గ్రామాల్లో చూస్తున్న దృశ్యం దీనికన్నా భిన్నంగా, కొన్నిసార్లు విరుద్ధంగా కనిపించడం బాధాకరం. పల్లెల్లో ఇప్పటికీ వెలుగులేని వీధులు, గుంతల రోడ్లు, పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల లేమి, మహిళలు, వృద్ధులు ఎదుర్కొనే తీవ్రమైన సమస్యలు, వేసవి కాలంలో తాగునీటి కోసం పడే పోరాటం ఇవన్నీ చూస్తే స్వాతంత్య్ర భారత్లో 78 ఏళ్లు పూర్తయ్యాక కూడా పల్లెల పరిస్థితి ఎంత వెనకబడి ఉందో అర్థమవుతుంది. గ్రామ ప్రజలకు అత్యవసరమైన సమస్యలు పరిష్కారాలు లేకుండా మిగిలిపోతున్నాయి. దీని వెనక కారణం ఏమిటి? పంచాయతీలకు తగిన నిధుల ఉండవు, వచ్చిన నిధుల దుర్వినియోగం, స్వయం ఆదాయ వనరుల కొరత, స్థానిక నాయకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిరాసక్తత, గ్రామ ప్రజల హక్కులపై అవగాహన లేకపోవటం. కొన్నిసార్లు పంచాయతీ కార్యాలయాలకు తాత్కాలికంగా అద్దె భవనాల్లో పని చేయాల్సి వచ్చే దుస్థితి చూస్తే గ్రామపాలన ఎంత బలహీనంగా మారిపోయిందో తెలుస్తోంది. నిధుల విషయంలో కూడా పంచాయతీలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితి వేరే విధంగా లేదు. పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ వేసేందుకు కూడా నిధులు లేవనిపించటం ఏ శకానికి నిదర్శనం? బడ్జెట్ కొరతలతో చదును చేసే రోడ్లు నిలిచిపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడాన్ని లెక్కచేయరాదు అన్నపద్ధతిలో వ్యవహరించడం, కాలువల నిర్మాణం, చెత్త సేకరణ వంటి ప్రాథమిక వ్యవస్థలు తారుమారవడం-ఇవి అన్నీ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న లోతైన సమస్యలను మన ముందుంచుతున్నాయి. ప్రజాస్వామ్యం పునాదిగా నిలిచే గ్రామ పాలన ఇలాగే బలహీనంగా ఉందంటే దేశ అభివృద్ధి ఎలా సాధ్యం? గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని నిజంగా బలపర్చాలంటే ఏకగ్రీవాల పేరుతో జరుగుతున్న రాజకీయ వ్యాపారాన్ని నిలువరించడం అత్యావశ్యం. గ్రామ ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలి. యువత గ్రామాభివృద్ధి కోసం ముందుకు రావాలి. పారదర్శకతను పెంచే విధానాలు పంచాయతీల్లో అమలు చేయాలి. నిధుల వినియోగంపై గ్రామసభకు పూర్తి హక్కు ఇవ్వాలి. ప్రతి రూపాయి ఖర్చుపై ప్రజల ముందే స్పష్టమైన వివరాలు ఉంచాలి. సత్యమైన ప్రజాస్వామ్యం ఎన్నికలతోనే బతుకుతుంది. పోటీ ఉంటేనే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే. ప్రజల అవసరాలు, సమస్యలు, గ్రామ అభివృద్ధి ఇవన్నీ ఒక నాయకుడిని ప్రజలు జవాబుదారీగా ఉంచుతారని తెలిసినప్పుడు మాత్రమే బాధ్యతాయుతంగా పనిచేయమని బలవంతం చేస్తాయి. కానీ ఏకగ్రీవం అయితే బాధ్యత అనే పదం అక్కడే చనిపోతుంది. నాయకుడు పనులు చేయకపోయినా నిలదీయడానికి ఒక వేదిక కూడా మిగలదు. ప్రజల మాట వినాల్సిన అవసరమే ఉండదు.ఇది అభివృద్ధికి అడ్డం, గ్రామప్రగతికి ప్రమాదం. గ్రామ స్వరాజ్యం అంటే ప్రజలు నిర్ణయాలు తీసుకునే స్వయం పాలన. కానీ ఏకగ్రీవాల అనర్ధం వల్ల అది నాయకుల స్వలాభ పాలనగా మారిపోతోంది. నిజమైన అభివృద్ధి జరగాలంటే ప్రజాస్వామ్యం బలపడాలి. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. ప్రజలు అనుమతించిందే జరగాలి. గ్రామంఅంటే నాయకుడు కాదు, గ్రామం అంటే ప్రజల సమష్టి సముదాయం. గ్రామ ప్రజాస్వామ్యం పునర్నిర్మాణం కావాలి అంటే పారదర్శకత, నిష్పక్షపాతం, ప్రజల భాగస్వామ్యం ప్రధానమైన అంశాలు కావాలి. నాయకులు సేవా భావంతో ముందుకు రావాలి. గ్రామసభలు సజీవంగా ఉండాలి. మానవ విలువలు, గ్రామ బంధం, ప్రజల శ్రేయస్సు- ఇవి మాత్రమే పాలనకు ప్రమాణాలుగా ఉండాలి. ధనబలం, అహంకారం, వ్యక్తిగత ప్రతిష్టల కోసం గ్రామాల భవిష్యత్తును కోల్పోయే రోజులు పోవాలి. పల్లెల బాగోగులే పల్లె ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాణం. అన్ని పల్లెల్లో ప్రజాస్వామ్య వసంతాలు పుష్పిస్తేనే తెలంగాణ అభివృద్ధి, ఆర్థిక, రాజకీయ, స్వయం పాలనతో సంపూర్ణమవుతుంది అనేది నగ్న సత్యం. - మన్నారం నాగరాజు, 9550844433
హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.
Ditva Cyclone : దిత్వాతో వానలు దంచేస్తాయట.. ముంపు ఇక్కడేనట
దిత్వా తుపాను బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మూడు రోజులుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది
సంక్లిష్టతలను దాటితేనే సంకల్ప సిద్ధి
తెలంగాణ రాష్ట్రరాజకీయాలలో 2023 ఎన్నికలు ఒక మలుపు, మార్పు, మానసిక వాతావరణంలోని ఓ అల్లకల్లోల క్షణం. పది సంవత్సరాలపాటు సాగిన బిఆర్ఎస్ పాలన తరువాత ప్రజలు కోరుకున్న కొత్త తెలంగాణ, పారదర్శక పాలన, సంక్షేమం -సంస్కరణల కలయిక అనే ఆత్రుత రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. ఆరు హామీల ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల్లో ఆశాభావాన్ని పెంచిన ఈ ప్రభుత్వం మొదటి రోజునుండే నిర్ణయాల వేగాన్ని, పరిపాలనా తీరు మారుస్తామనేదాన్ని ప్రదర్శించింది. అయితే శాసనసభలో గెలుపు ఒకటి, పరిపాలనా గడపలో అడుగుపెట్టిన తరువాత ఎదురయ్యే ఆర్థిక వాస్తవాలు, వ్యవస్థల సంక్లిష్టత, విభాగాల అంతర్గత గందరగోళం, అధికారులు- మంత్రుల మధ్య సమన్వయ లోపం, పెద్ద ఎత్తున పెరిగిన అప్పు భారాలు-వివిధ దిశల్లో ప్రభుత్వాన్ని పరీక్షించిన రెండు సంవత్సరాలు ఇవి. సంకల్పం స్పష్టంగా ఉన్నా, అమలులో ఎదురైన సంక్లిష్టత పాలనకు ప్రత్యేక స్వరూపాన్ని ఇచ్చిన కాలమిది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించడం రాజకీయంగా పెద్దగా ప్రశంసించబడింది. రోజుకు సగటున 25- 28 లక్షల మహిళలు ఈ సేవను వినియోగిస్తున్నారని రవాణా శాఖ వివరాలు చెబుతున్నప్పటికీ, టిఎస్ ఆర్టిసిపై నెలకు రూ. 250- నుంచి రూ. 280 కోట్లు వరకు అదనపు భారం పడుతోంది. అప్పటికే రూ. 7,000 కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న సంస్థకు ఈ పథకం ఆర్థిక రీతిలో తీవ్రమైన ఒత్తిడిని కలిగించింది. సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం ప్రతిబింబించినా, దీర్ఘకాలంలో దీనిని నిలబెట్టే మార్గం, చెల్లింపుల సమయపాలన రాష్ట్ర ఖజానాకు కఠిన పరీక్ష. ఇటువంటి సంక్షేమం వినిపించే శబ్దం ప్రజాపక్ష పాలనను సూచించినప్పటికీ, ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్యం మాత్రం రోజుకు సగం కోట్ల రూపాయల బరువును మోయాల్సి వచ్చింది. ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన నిర్ణయం మరింత ఆదరణ పొందినా, దీనివల్ల రాష్ట్ర ఖర్చులు సంవత్సరానికి అదనంగా రూ. 1,500- 2,000 కోట్లకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు గమనిస్తున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది 30% -40% వరకు ఖాళీలతో పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులే వైద్యంలో ప్రధాన ఆశ్రయం కావడం ప్రభుత్వ బిల్లులను పెంచుతోంది. ప్రజల ప్రయోజనానికి తీసుకున్న నిర్ణయాలు తక్షణ ఉపశమనం ఇస్తున్నప్పటికీ, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు మొత్తం రూ. 32,000 కోట్లకు చేరాయి. మాఫీని దశలవారీగా చేసే ప్రయత్నాలు ప్రారంభమైనా పూర్తి అమలు కాలేకపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో చెల్లింపుల జాప్యం, ఎండలతో పాడైపోయిన పంటలకు పరిహారం ఆలస్యం, మార్కెట్ ధరల్లో మార్పులు రైతుల నిరాశను పెంచాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై ప్రభుత్వం చేసిన విమర్శలు సాంకేతిక పరిశీలనకు దారితీశాయి. పంపింగ్ స్టేషన్లు తరచూ నిలిచిపోవడం, వ్యయ అధికరణలపై వివాదాలు సాగునీటిపరంగా రైతులకు ఇబ్బందులు కలిగించాయి. నీటిపారుదలే తెలంగాణ రైతు ఆత్మ విశ్వాసానికి పునాది అయిన సందర్భంలో ఈ అంశాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు మోపాయి. విద్యా రంగంలో ప్రభుత్వానికి ఎదురైన సంక్షోభం మరింత లోతుగానే ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 800 కోట్లకు పైగా పెరగడంతో ప్రైవేట్ కళాశాలలు నిరసన వ్యక్తం చేస్తూ మూడు రోజుల బంద్కు దిగడం విద్యార్థుల్లో అనిశ్చితిని సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యం, సిబ్బంది కొరత, మధ్యాహ్న భోజనం, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో నెమ్మదిగా సాగినా ప్రగతిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రెండు సంవత్సరాల్లో అత్యంత క్లిష్ట దృశ్యం రాష్ట్ర ఆర్థిక స్థితి. రాష్ట్ర అప్పు మొత్తం రూ. 3.8- రూ. 4 లక్షల కోట్ల మధ్య తిరుగుతూ ఉండగా ఏటా వడ్డీ చెల్లింపులకు మాత్రమే రూ. 25,000 కోట్లకు పైగా ఖర్చవుతోంది. రెవెన్యూ వృద్ధి రేటు 7-9% మధ్య ఉంటే ప్రభుత్వ ఖర్చులు 15% కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. పూర్వప్రభుత్వంలో ప్రారంభమైన భారీప్రాజెక్టుల నిర్వహణ వ్యయం, విద్యుత్ సంస్థల అప్పులు, పెన్షన్ భారం, కేంద్ర నిధులలో వచ్చిన తగ్గుదల-కలగలిపి-రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా, అసమతులంగా మార్చాయి. ఆదాయం పెంచే కొత్త మార్గాల కోసం ప్రభుత్వం మద్యపాన ఆదాయంపై దృష్టి పెట్టినప్పటికీ, సామాజిక దృష్టిలో ఇది పెద్ద విమర్శలకే దారి తీసింది. మరో వైపు ప్రభుత్వం-, అధికార యంత్రాంగం మధ్య సహకారం కొన్నిసార్లు సరిగా పనిచేయలేదు. ముఖ్య శాఖల్లో అధికారులు తరచు బదిలీలు, మంత్రుల ఆదేశాలు అమలులో ఆలస్యం, ఫైళ్ల నిల్వ, ప్రధాన కార్యాలయం- శాఖల మధ్య కమ్యూనికేషన్ లోపాలు పాలన నెమ్మదించే ప్రధాన కారణాలు అయ్యాయి. కొందరు మంత్రులు ప్రజా వేదికలపై అధికారులు తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం, కొందరు అధికారుల నిర్ణయాలు రాజకీయ వివాదాలకు దారితీయడం పాలనా లోపాలను బహిర్గతం చేశాయి. సంక్షేమం, -అభివృద్ధి-, ఆర్థిక నియంత్రణ అనే మూడు అక్షాంశాలలో సమతుల్యత సాధించడంలో ప్రభుత్వం ఇంకా కృషి చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు రాజకీయ మార్పు కోసం ఇచ్చిన ఓటు ఇప్పుడు ఫలితాల రూపంలో కనబడాలని ఆశిస్తున్నారు. మూడవ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే పాలన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. - రామకిష్టయ్య సంగనభట్ల, 9440595494
Telangana : నేడు నామినేషన్ల దాఖలకు చివరి గడువు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది
Tej 2026 |మరో క్రేజీ మూవీకి తేజ్ గ్రీన్ సిగ్నల్..
Tej 2026 |మరో క్రేజీ మూవీకి తేజ్ గ్రీన్ సిగ్నల్.. Tej 2026
OTT Platforms’ New Guidelines for Producers
The Digital Platforms are now dictating rules and they are finalizing the release dates of several Indian films. The producers have no other options and they have surrendered to the OTT platforms as they are able to recover a major budget through the digital deals. With a number of films in making, the digital platforms […] The post OTT Platforms’ New Guidelines for Producers appeared first on Telugu360 .
Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
Reservoir |గ్రామస్తుల ఆందోళన..
Reservoir | గ్రామస్తుల ఆందోళన.. Reservoir, ఏర్పేడు, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా
Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గట్టిగానే షాక్.. ఇక కొనడం కష్టమే
. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగింది
చంద్రబాబుకు మద్యం కేసులో విముక్తి #Chandrababu #ACBCourt #CID #AndhraPradesh #LegalUpdate
నంద్యాలలో యువకుడి హత్య.. మరొకరికి గాయాలు
హైదరాబాద్: నంద్యాల జిల్లా హరిజన పేటలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు కత్తితో యువకుడిని పొడిచి చంపారు. మరో యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతుడు కొమ్ము పెద్దన్న(26)గా గుర్తించారు.
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. నేడు దర్శనం సులువుగానే
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.
ఏలూరు వైద్య కళశాలలో ర్యాగింగ్ కలకలం
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది.
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీ రో, హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ క్రై మ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్. బ్లాక్ బస్ట ర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజ ల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భం గా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమం లో హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ “దర్శకుడు పళని... రాజమౌళి స్టై ల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూ డా బోర్ కొట్టించుకుండా సినిమాను తీశారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాహుబలి పళని, రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్, అపర్ణ మల్లిక్, హీనా సోని, సాగర్ వేలూరు పాల్గొన్నారు.
యూ టర్న్ తీసుకున్న ఎమ్మెల్సీ జకియా ఖానం
వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం తన రాజీనామాను ఉప సంహరించుకునేందుకు సిద్ధమయ్యారు
Exclusive: Dil Raju approaches Trivikram for Pawan Kalyan
Powerstar Pawan Kalyan has taken a break from films and he is focused on AP politics. He will take a bunch of new films from the end of 2026 or during early 2027. He has commitments for producers Ram Talluri and TG Vishwa Prasad for now. He has taken a big advance from KVN Productions. […] The post Exclusive: Dil Raju approaches Trivikram for Pawan Kalyan appeared first on Telugu360 .
Weather Report : మరో మూడు నెలలు చలితీవ్రత మామూలుగా ఉండదట
ఈ ఏడాది మూడు నెలల పాటు దేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ‘90s’ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ “తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల హీరో లండన్ కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది? ప్రేమ కథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో పూర్తిస్థాయిలో రొమాంటిక్ కామెడీ సినిమాలు పెద్దగా రావడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఎపిక్ సినిమా ఉంటుంది”అని అన్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “ఇదొక మధ్యతరగతి యువకుడి ప్రేమ కథ. సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ తమని తాము ఊహించుకుంటారు”అని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అని ఎందుకు పెట్టామంటే.. ఇది మొదటి భాగం. దీనికి కొనసాగింపు కూడా ఉంటుంది. ఒక మంచి సినిమా చేశాము”అని తెలియజేశారు. ఈ వేడుకలో కథానాయిక వైష్ణవి చైతన్య పాల్గొన్నారు.
Cyclone | తుఫాను షెల్టర్లు.. Cyclone, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం పార్లమెంట్
Tamilnadu : తమిళనాడు ఊపేస్తున్న దిత్వా
తమిళనాడులో దిత్వా తుపాను విధ్వంసం సృష్టిస్తోంది
రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే.. #Tollywood #Celebrities #Samantha #CinemaBuzz
నెల్లూరు లేడీ డాన్ పై తిరగబడిన స్థానికులు
నెల్లూరులో లేడీ డాన్ అరవ కామాక్షి నివాసాన్ని స్థానికులు ధ్వంసం చేశారు.
Child Death |తల్లిదండ్రుల ఆవేదన..
Child Death | తల్లిదండ్రుల ఆవేదన.. Child death, గన్నవరం, ఆంధ్రప్రభ :
స్పెయిన్కే అందాలనిట్ట, అద్దిన ఓ పూల బుట్టా..
మాస్ మహారాజా రవితేజ.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో అలరించబోతున్నారు . ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ తర్వాత మేకర్స్ ఇప్పుడు ఫుట్ట్యాపింగ్ ట్రాక్ బెల్లాబెల్లాతో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. మాస్-ను ఆకట్టుకునే చార్ట్బస్టర్లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో, జానపద సంగీతంతో కూడిన ఫుట్ట్యాపింగ్ నంబర్తో ఆకట్టుకున్నారు.‘స్పెయిన్కే అందాలనిట్ట, అద్దిన ఓ పూల బుట్టా... వీధుల్లో పోతుంటే అట్టా వార్తల్లో రాయాలి చిట్టా’ అంటూ సురేష్ గంగుల రాసిన లిరిక్స్లో వైబ్ అదిరిపోయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కట్టిపడేసింది. రవితేజ, ఆషికా రంగనాథ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ రిఫ్రెషింగ్, ఎలక్ట్రిక్గా అనిపిస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి 2026 సంక్రాంతికి విడుదల కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ “చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు బాలమణి. అందరికీ ఈ పాట నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా అద్భుతమైన పాట లు ఉన్నాయి. మాస్ మహారాజా అంటే ఎనర్జీ. అదే ఎనర్జీ సంక్రాంతితో చూడబోతున్నాం”అని అన్నారు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ “మంచి కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. రవితేజ ఎనర్జీ మ్యాచ్ చేయడం అంత సులభం కాదు. ఆయన అద్భుతమైన డ్యాన్సర్”అని తెలిపారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ “భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి”అని పేర్కొన్నారు.
పండుగలా ఎమ్మెల్యే పెన్షన్ పంపిణీ
పండుగలా ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ విశాలాంధ్ర – సీతానగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సోమవారం రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణఆధ్వర్యంలో పలు గ్రామాల్లో స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా బొబ్బిల్లంక, జాలిమూడి, కాటవరం, రఘుదేవపురం, చినకొండేపూడి గ్రామాల్లో కూటమి పార్టీ నాయకులతో కలిసి పౌజ్ నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ […] The post పండుగలా ఎమ్మెల్యే పెన్షన్ పంపిణీ appeared first on Visalaandhra .
ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకుల పై చర్యలు తీసుకోవాలి అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్ విశాలాంధ్ర – సీతానగరం: సీతానగరం, రాజమహేంద్రవరం ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధంగా రోడ్డుబ్లాకుల పై అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ లో వంగలపూడి గ్రామానికి చెందిన అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్ అర్జీ సమర్పించారు. అలాగే మండలంలో మండల ప్రజా పరిషత్, రెవెన్యూ కార్యాలయలలో కూడా అర్జీ సమర్పించారు. ఈ […] The post చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకు appeared first on Visalaandhra .
India Vs South Africa : భారత్ అభిమానులూ బేఫికర్... వచ్చేస్తున్నాడోచ్
ఆల్ రౌండర్ లో జట్టులోకి వస్తున్నాడు. ఇన్నాళ్లూ టీం ఇండియాలో హార్ధిక్ పాండ్యా లేని లోటు కనిపిస్తుంది
Hyderabad : నేడు గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి
నేడు గాంధీ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు
విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కొవ్వూరు పట్టణ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్స్ హెల్త్ ఆశ సిబ్బంది ఏఎన్ఎంలు పట్టణ ప్రజలు ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముందుగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టి అనంతరంప్రభుత్వ ఆసుపత్రి నుండి స్థానిక విజయ విహరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎయిడ్స్ సంక్రమ మార్గాలు నివారణ చర్యలు […] The post ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ appeared first on Visalaandhra .
Ustaad Bhagat Singh |ఉస్తాద్ స్టెప్ అదిరిందిగా..
Ustaad Bhagat Singh | ఉస్తాద్ స్టెప్ అదిరిందిగా.. Ustaad Bhagat Singh,
దుర్గాప్రసాద్ కు జిల్లా అవార్డ్
ల్యాబ్ టెక్నీషియన్ దుర్గాప్రసాద్ కు జిల్లా అవార్డ్ విశాలాంధ్ర – కొవ్వూరు : ఉత్తమ సేవలకు గుర్తింపుగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కు జిల్లా ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా వాజా దుర్గా ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో టీబీ, లెప్పర్స్, ఎయిడ్స్ జిల్లా అధికారి వసుంధర ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేసి దుర్గా ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. దుర్గా ప్రసాద్ […] The post దుర్గాప్రసాద్ కు జిల్లా అవార్డ్ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలో ఎబిఎన్ పిఆర్ ఆర్ కళాశాలలో సోమవారం ఘనంగా గీత జయంతి వేడుకలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవిత తత్వశాస్త్రం, కర్మ, మోక్షం వంటి విషయాలను వివరించి, కర్తవ్య నిర్వహణకు మార్గనిర్దేశం చేసిన రోజు ఈ రోజు అని, ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా […] The post ఘనంగా గీత జయంతి వేడుకలు appeared first on Visalaandhra .
పందులు బాబోయ్ పందులు.. పట్టపగలే పాఠశాలలో దూరుతున్న వైనం..ఇలా ఉంటే పుష్కరాలు నిర్వహణ ఎలా.. విశాలాంధ్ర-కొవ్వూరు : పందుల బాబోయ్ పందులు.. కుక్కల స్వైర విహారం.. ఇటువంటి మాటలు జిల్లాలో చాలా పట్టణాల్లోనూ.. గ్రామాల్లోనూ తరచూ వినిపిస్తున్నాయి. అయితే రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరులో మాత్రం పందులు ఏకంగా పాఠశాలలకు దూరి బెంచీల కింద నివాసాలు ఏర్పరచుకుంటున్నాయి. కొవ్వూరులో చాలా కార్పొరేట్ పాఠశాలలు బహుళ అంతస్తులు భవనాల్లో నడుస్తుండగా పెద్ద సమస్య రావడం లేదు కానీ నేల […] The post పందులు బాబోయ్ పందులు appeared first on Visalaandhra .
Tirumala | నకిలీ సీఐ అరెస్ట్.. Tirumala, తిరుపతి జిల్లా, భాకరాపేట :
చెదురు మదుర జల్లులతో రైతులు ఆందోళన – అన్ని గ్రామాలలో కాలాల్లోనే ధాన్యం విశాలాంధ్ర – సీతానగరం: తుపాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం చెదురు మదుర జల్లుల పడ్డాయి. గత కొన్ని రోజులుగా వరిలో పి ఎల్ రకం కోతలు జోరుగా సాగుతున్నాయని. వీటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించేందుకు రైతులు ధాన్యాన్ని అందుబాటులో ఉన్న కాలీ ప్రదేశాల్లో ఎండబెడుతున్నారు. అయితే దిత్యా తుపాన్ ప్రభావంతో కొన్ని చోట్ల జల్లులు పడుతుండడంతో రైతులు కాలాల్లో […] The post రైతులు ఆందోళన appeared first on Visalaandhra .
AP Rains | ఏపీలో వర్షాలు.. AP Rains, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Epic |డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ..
Epic | డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ.. Epic, ఆంధ్రప్రభ వెబ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి బడా పారిశ్రామికవేత్తలు ఆస్తకి చూపుతున్నా రు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ గ్రూప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్ కంపెనీలు ఈ నెల 8, 9 తేదీల్లో సదస్సుకు హాజరై ప్రభుత్వం తో ఎంఓయూ కుదుర్చుకుంటామని పే ర్కొన్నాయి. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఫ్యూచర్ సి టీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లో బల్ సమ్మిట్లో దేశ, విదేశాల నుంచి పె ట్టుబడుదారులు పాల్గొని రాష్ట్రంలో భారీ గా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించా రు. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ గ్రూప్ తె లంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండగా ఈ సంస్థకు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ నైట్ సఫారీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఫుడ్లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుండగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకోనున్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన రోజునే లోక్సభ సర్పై ప్ర తిపక్షాల ఆందోళన, గందరగోళం నడుమ, నిరసనల హోరు మధ్య వాయిదా పడింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని పావుగా వా డుకొంటోందని విపక్షాలు ఆరోపించాయి. ఇందు లో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్తో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకు గండికొడుతున్నారని విమర్శించారు. సభలో ముందుగా సర్పై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఈ దశలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ లోగానే ఆర్థిక మం త్రి నిర్మలా సీతారామన్ మణిపూర్లో జిఎస్టి చ ట్టం అమలకు సరైన సవరణల బిల్లును విపక్షాల నిరసనల మధ్యనే ప్రవేశపెట్టారు. స్వల్పకాలిక నా మమాత్రపు చర్చ తరువాత బిల్లు ఆమోదం పొం దిందని ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్ జిఎస్టి గురించి ఇంతకు ముందు ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు తీసుకువచ్చారు. మణిపూర్లో సుదీర్ఘ కాలంగా రాష్ట్రపతి పాలన ఉంది. దీనితో తగు శాసనం ఆమోదింపచేసే విస్తృత అధికారాలను కేంద్రం వినియోగించుకుంది. 15 సిట్టింగ్లతో ఖరారు అయిన శీతాకాల సమావేశాల ఆరంభం రోజునే తుపాన్ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో సభ వాయిదాకు ముందే రెండుసార్లు వాయిదా పడింది. ఉదయం క్వశ్చన్ అవర్ సాగలేదు. సభ ప్రారంభం అయిన వెంటనే ప్రతిపక్షాలు సర్పై చర్చకు పట్టుపట్టాయి. ప్రభుత్వం ఇందుకు కుదరదనే రీతిలో వ్యవహరించింది. దీనితో సభ తొలిరోజే ప్రతిష్టంభనల స్థాయిలో మొదలైంది. జీరో అవర్కు సంబంధించిన 12 నిమిషాల వ్యవధిలోనే ఆర్థిక మంత్రి సీతారామన్ మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. నిర్ణీత బిల్లులను గట్టెక్కించుకోవాలనే ఆలోచన ప్రభుత్వం కనబర్చింది. 2025 2006 సంవత్సరానికి బడ్జెట్ నిధుల అనుబంధ పద్దులను కూడా ఆర్థిక మంత్రి ఈ దశలోనే సభలో ప్రవేశపెట్టారు. పొగాకు , పొగాకు ఉత్పత్తులపై లెవి ఎక్సైజ్ సుంకానికి సంబంధించిన రెండు బిల్లులను , పాన్ మసాలాపై నూతన సెస్సుకు సంబంధించిన బిల్లును కూడా తీసుకువచ్చారు. వీటిని సెంట్రల్ ఎక్సైస్ సవరణల బిల్లు 2025, ఆహార భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లు 2025గా తీసుకువచ్చారు. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సర్ ప్రక్రియను ప్రతిపక్షాలు ప్రత్యేకించి డిఎంకె, కాంగ్రెస్, టిఎంసిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రక్రియతో పౌరులలో అభద్రతాభావం నెలకొంటోందని, నిజమైన ఓటరుకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ క్రమంలోనే బిజెపి ఏకంగా ఎన్నికల సంఘం ద్వారానే ఓట్ల చోరీకి పాల్పడిందని ఘాటుగా చెపుతూ వచ్చారు. అయితే అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగానే సర్ ప్రక్రియ జరుగుతోంది. దీని వల్ల నిజానికి సరైన ఓటరుకు జాబితాల్లో స్థానం పదిలం అవుతోందని, అభ్యంతరాలు తెలియచేసుకునేందుకు అవసరం అయిన ఏర్పాట్లు జరిగాయని, వీటిని సద్వినియోగం చేసుకోవల్సిన బాధ్యత పౌరులది, వారి తరఫున పార్టీల ప్రతినిధులది అని ఎన్నికల సంఘం చెపుతోంది.
మన తెలంగాణ/హైదరాబాద్: ‘హిల్ట్’ పాలసీ పే రిట రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ‘తెర’ లేపినందున, వెంటనే ‘హిల్ట్’ను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా బిజెపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్వర్యంలో పార్టీ నా యకులు సోమవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. గతంలో హైదరాబాద్లో పరిశ్రమలకు కేటాయించిన విలువైన భూములను ‘హైదరాబా ద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ (హిల్ట్) పేరిట రియల్ ఎస్టేట్ భూములకు కేటాయించే ప్రయత్నం చేస్తున్నదని రాంచందర రావు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. కాబట్టి దీనిని నిలి పి వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా ఆయన గవర్నర్ను కోరారు. అనంత రం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లోని సుమారు తొమ్మిది వేల ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘హిల్ట్’ పాలసీతో అవినీతికి దారి తీస్తుందని ఆరోపించారు. ఎస్ఆర్వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి భూములను మార్చుకునే విధానం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాసంపదను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ విధానం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, రైతులకూ తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నదని గవర్నర్కు వివరించామని ఆయన తెలిపారు. గతంలో పరిశ్రమలకు ప్రభుత్వం తక్కువ ధరలకు కేటాయించి, ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. కాగా ఇప్పటి మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, సబ్-రిజిస్ట్రార్ (ఎస్ఆర్వో) రేట్లు అసలు మార్కెట్ విలువలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో ఒక సంస్థ ఒక్క ఎకరాన్ని నూటా యభై కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేసిందంటే ఇలా భూములు నిజమైన మార్కెట్ ధరల ఆకాశాన్ని తాకుతున్న సమయంలో హిల్ట్ పాలసీ ప్రకారం పరిశ్రమల భూములను కేవలం ఎస్ఆర్వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి కన్వర్ట్ చేసుకునే అనుమతి ఇవ్వడం అనుమానాలకు దారి తీస్తోందని రాంచందర్ రావు అన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల లో సిసిఐ విధించిన నిబంధనలతో ఏర్పడిన ప్రతిష్టంభనలు ఎట్టకేలకు తొలగాయిని రా ష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కొత్త నిబంధనల కారణంగా కొనుగోళ్లకు అనుమతులు లభించని జి న్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిసిఐతో జరిపిన చర్చలు ఫలించాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నోటిఫై చేసిన మొత్తం 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుండి పత్తి కొనుగోళ్లు చురుగ్గా కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. సిసిఐ కొత్త నిబంధనల కా రణంగా అనుమతులు లభించకపోవడంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ గతంలో సమ్మెకు దిగింది. దీనివల్ల రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి తుమ్మల స్వయంగా చొరవ చూపారు. ఆయన కేం ద్ర మంత్రులతో పాటు సిసిఐ సిఎండితో ప్రత్యేక చొరవ తీసుకుని వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల స్పందన రావడంతో, 330 మిల్లుల్లో కొనుగోళ్లకు అనుమతులు లభించాయి. సమస్య పరిష్కారంలో మంత్రి తుమ్మల చూపిన వేగవంతమైన చర్యలకు, చొరవకు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు, మిల్లుల కార్మికులకు ఉపశమనం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సిసిఐ రాష్ట్రంలో రూ. 3,201 కోట్లతో మొత్తం 4.03 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించిందని మంత్రి తుమ్మల వెల్లడించారు.
‘మహా’నగరం ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల వి లీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్, అర్బన్ డవలప్ మెంట్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. జీహెచ్ఎంసీలో 7 ము న్సిపల్ కార్పొరేషన్లు, 20మున్సిపాలిటీలను వి లీనం చేయాలని ఈ నెల 25న జరిగిన మం త్రివర్గ సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతోపాటు విలీనం అంశాన్ని ఈ నెల 25న జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. కాగా దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభు త్వం నుంచి గవర్నర్కు ఆర్డినెన్స్ను పంపించడంతో ఆయన ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ ఫైల్ లోక్ భవన్ నుంచి న్యాయ శాఖకు వ చ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్కు సం బంధించిన గెజిట్ విడుదల చేయనుంది. విలీ న పక్రియలో భాగంగా 27 మున్సిపాలిటీల ఆ స్తులను హ్యాండ్ ఓవర్, వంటి అంశాలను గు ర్తించి గెజిట్లో ప్రభుత్వం వివరిస్తుందని అధికార వర్గాల సమాచారం.
హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష (16) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. మహబూబ్నగర్ జిల్లా మక్తల్కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురైన వర్ష సోమవారం సాయంత్రం హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు .
మంగళవారం రాశి ఫలాలు (02-12-2025)
మేషం వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గాల వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృషభం స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. మిధునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. కర్కాటకం భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. సింహం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కన్య చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తుల ఆధ్యాత్మక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలను ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వృశ్చికం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ధనస్సు చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను లభిస్తాయి. మకరం ముఖ్యమైన పనులు మందగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. కుంభం ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటా బయట కొందరు మాటలు మానసికంగా కలచి వేస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మీనం ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమవుతాయి.
02 DEC 2025 Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
కొత్తగూడెంలో దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ వర్సిటీ
దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన జిల్లాల బాటలో మంగళవారం సిఎం కొత్తగూడెం జిల్లాకు రానున్నారు. ఖనిజాలకు పుట్టినిల్లు అయిన సింగరేణి ఇలాకాలో కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేసి ప్రారంభించబోతున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, విభాగాల ఏర్పాట్లు, ఆతిథ్య సదుపాయాలు, భద్రత, సభాస్థలి ఏర్పాట్లు, రవాణా నిర్వహణ వంటి అంశాలను శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. తెలంగాణలో తొలి భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని మంగళవారం ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. సిఎం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం ఏరియాను విద్యారంగం అనుసంధానంతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది. సింగరేణి ఇలవేల్పు కొత్తగూడెం లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ ఖ్యాతి మరింతగా పెరగనుంది .జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత సిఎంకి ప్రతిపాదన చేసి పట్టుబట్టి మంజూరు చేయించి అచరణలోకి తీసుకొచ్చారు. తుమ్మల ప్రతిపాదనకు రేవంత్ సానుకూలంగా స్పందించి వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీనికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతూ తెలంగాణ క్యాబినెట్ చారిత్రక నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లయింది. పారిశ్రామిక అభివృద్ధితో విద్యను అనుసంధానం చేయాలనే ఆలోచనతోనే ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ ఆవిర్భవించింది. దేశంలోనే మైనింగ్ ఇంజినీరింగ్ లో రెండో కాలేజ్ గా ఉమ్మడి రాష్ట్రంలో మొదటి మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజ్ గా 1957 లో స్థాపించారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో జియాలజీ, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ., .ఎన్విరాన్ మెంట్ సైన్స్, ఇండస్ట్రియల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రాక్టికల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైన్స్...మినరల్స్ ...ఫారెస్ట్ గోదావరి నది ఉండటంతో పరిశోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో మైన్ ఇంజినీర్లు ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు దేశానికి అందించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని మంత్రి తుమ్మల విశ్వాసంతో ఉన్నారు.
కాజీపేట, ఆంధ్ర ప్రభ : కాజీపేట పట్టణంలోని కడిపికొండ పాత గ్రామ పంచాయతీ
మార్కెట్లోకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11+
న్యూఢిల్లీ : సామ్సంగ్ ఇండియా తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఎ11+ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ట్యాబ్ ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. 11 అంగుళాల డిస్ప్లే, మెటల్ డిజైన్, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు, 8 ఎంపి బ్యాక్ కెమెరా, 5 ఎంపి ఫ్రంట్ కెమెరాతో పనితీరు, వినోదానికి అనువుగా దీనిని రూపొందించారు. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్, సామ్సంగ్ నోట్స్లో సాల్వ్ మ్యాథ్ వంటి ఎఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతిరోజూ జీవనాన్ని మెరుగుపరచే ఆవిష్కరణలు సంస్థ లక్ష్యం అని సామ్సంగ్ ఇండియా ఎంఎక్స్ డైరెక్టర్ సాగ్నిక్ సేన్ అన్నారు.
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన బాబాపూర్ గ్రామ
నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి
హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ చదువుతున్న ఓ యువతిపై కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజిఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా, జఫర్ఘడ్ మండలం అని తెలిసింది. కాజీపేట ఎసిపి, పోలీసులు బాధితురాలితో మాట్లాడి విచారణ చేపట్టారు.
ఢిల్లీ కాలుష్య కేవలం రైతులదే అంటే ఎట్లా ?: సుప్రీంకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి రైతులనే నిందించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంట వ్యర్థాల దగ్ధం వల్లనే ఢిల్లీలో వాయు నాణ్యత దెబ్బ తిందనే వాదనను తోసిపుచ్చింది. వాయు కాలుష్యం అంశాన్ని కేవలం శీతాకాలంలోనే చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది. వాయు కాలుష్యం అనేది తీవ్ర సంక్షోభం దీనిపై నిరంతర పర్యవేక్షణ , జాగ్రత్త చర్యలు అవసరం అని జస్టిస్ జాయ్మాలా బాగ్చీ సహ సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. కాలుష్య సమస్యను రాజకీయం చేయరాదని స్పష్టం చేశారు. పంజాబ్ , హర్యానా సరిహద్దులలో పంట వ్యర్థాల దహనంతోనే దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తోంది. వాయు కాలుష్య సమస్యపై చాలా కాలంగా సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. కాలాన్ని బట్టి ఏర్పడే సమస్యగా వాయు కాలుష్యాన్ని లెక్కలోకి తీసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించారు. రైతులు పంట వ్యర్థాలను ఎందుకు పొలాల కళ్లాల తరువాత తగులబెట్టాల్సి వస్తోంది? వీటిని సకాలంలో సరైన రీతిలో నిర్మూలించేందుకు సరైన యంత్రాలు, ఏర్పాట్లు వారి వద్ద ఉన్నాయా? అనేది విశ్లేషించుకోవల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. వాయు కాలుష్య సమస్య గురించి కనీసం నెలకు రెండు సార్లు అయినా సమీక్ష జరగాలి. స్వల్పకాలిక దీర్ఘకాలిక పరిష్కారాలను ఈ క్రమంలో కనుగొనాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రభుత్వాలు పార్టీల రాజకీయాల కోణంలో, అహంకార ధోరణితో ఈ విషయాన్ని చూడటానికి వీల్లేదని తెలిపారు. కోవిడ్ దశలో ఢిల్లీలో వాయుకాలుష్యం తక్కువగా ఉంది. అప్పుడు కూడా ఈ సమయంలోనే పంట వ్యర్థాల దగ్థం జరిగింది. కానీ అప్పుడు ప్రజలు పొగచూరని , నిర్మలమైన ఆకాశం చూడగలిగారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదని, దీనిని బట్టి చూస్తే వాయుకాలుష్యానికి కారణం వేరే ఉందని తెలుస్తోందని చీప్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. పరోక్షంగా ఆయన ఇదంతా కూడా వాహన కాలుష్యంతో తలెత్తిన విషమ పరీక్ష అని విశ్లేషించారు. ఈ కోర్టులో రైతులను నిందించడం తరచూ జరుగుతోంది. అయితే వారి తరఫున వాదనలు విన్పించడానికి అరుదుగా హాజరీలు ఉంటాయని సిజెఐ వ్యాఖ్యానించారు. తాము కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నామని ఆ లోగా వాయు ప్రమాణాల నిర్వహణ కమిషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇతర సంబంధిత పక్షాలు కాలుష్య నివారణకు తీసుకుని తీరాల్సిన విషయాలను స్పష్టం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసుకు సంబంధించి ప్రభుత్వ సంస్థల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భటి హాజరయ్యారు. పంట వ్యర్థాల దగ్ధం, వాహన కాలుష్యం, భవన నిర్మాణ రంగ ధుమ్మూ ధూళి, రోడ్ల దుమ్ము , సేంద్రీయ వ్యర్థాల దహనం వంటి పలు కారణాలు ఉన్నాయని చెప్పారు. దీనితో ఏకీభవించని ధర్మాసనం ఇదంతా కాదు తమకు ఈ విషయంపై వారంలో తగు నివేదిక అందించాలని ఆదేశించి, విచారణను వాయిదా వేశారు. అశాస్త్రీయ పట్టణ నగర అభివృద్ధి , యాంత్రీకరణలు వంటివి వాయు నాణ్యత క్షీణతకు దారితీస్తున్నాయని ధర్మాసనం తెలిపింది.
ఆంధ్రప్రభ, బాపట్ల కలెక్టరేట్ : దిత్వా తుఫాన్ ప్రభావ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా
కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : రూ.40,000 లంచం తీసుకుంటున్న దేవనకొండ మండలం నల్లచెలిమల
హానీ ట్రాప్లో చిక్కుకున్న యువకుడు
హానీ ట్రాప్ చేసి యువకుడి వద్ద నుంచి సైబర్ నేరస్థులు రూ.1.02లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని యాకత్పురకు చెందిన యువకుడు(20) టెలీగ్రాంలో వచ్చిన మెసేజ్కు స్పందించాడు. మహిళ పేరుతో ఛాటింగ్ చేసిన సైబర్ నేరస్థులు సెక్స్వల్ సర్వీస్ అందిస్తామని చెప్పారు. యువతి ఫొటోతో సైబర్ నేరస్థులు ఛాటింగ్ చేయడంతో నిజమని నమ్మిన యువకుడు వారు చెప్పినట్లు చేశాడు. యువతిని హోటల్కు పంపిస్తామని చెప్పారు. దానికి ముందుగా అడ్వాన్స్ బుకింగ్, సర్వీస్ సెక్యూరిటీ, రూమ్ రిజర్వేషన్ కోసం ముందుగానే డబ్బులు చెల్లించాలని చెప్పారు. దానికి అంగీకరించిన యువకుడు యూపిఐ ద్వారా రూ.1,02,093 ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత బాధితుడు అబిడ్స్లోని హోటల్కు వెళ్లి ఎంక్వైరీ చేయగా ఎవరూ రాలేదు. వెంటనే టెలిగ్రాంలో సంప్రదించగా సైబర్ నేరస్థులు వెంటనే రూ.10వేలు పంపించాలని బ్లాక మెయిల్ చేశారు. దీంతో తాను సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోయానని గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణలంక, ఆంధ్రప్రభ: రాణిగారితోట గుడ్ మార్నింగ్ టీ–స్టాల్ సమీపంలోని జాతీయ రహదారిపై దుర్ఘటన
ఈ నెల 2న చెన్నైలో జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. జర్నలిస్ట్ శోమా చౌదరి ఆధ్వర్యంలో ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ వేదికపై జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.
అన్యమతస్త ఉద్యోగులపై నివేదిక….
తిరుపతి ప్రతినిధి , ఆంధ్రప్రభ : టీటీడీలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు
విరాట్ బ్యాటింగ్ అద్భుతం: కుల్దీప్ యాదవ్
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో చిరస్మరణీయ సెంచరీ సాధించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై అతని సహచరుడు కుల్దీప్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్లో కోహ్లి బ్యాటింగ్ చూసి తామంత ఎంతో ఆనందానికి గురయ్యమన్నాడు. కోహ్లి ఇన్నింగ్స్ను గమనిస్తే అతను గాడిలో పడినట్టేనని పేర్కొన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన బ్యాటింగ్ను కనబరిచేందుకు ఇది దోహదం చేస్తుందన్నాడు. తాను కెరీర్ ఆరంభించినప్పుడూ విరాట్ వరుస సెంచరీలతో చెలరేగి పోయేవాడన్నాడు. రాంచిలో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒకప్పటి విరాట్ను తలపించిందని కుల్దీప్ అభిప్రాయపడ్డాడు. తనలాంటి ఎంతో మంది క్రికెటర్లకు కోహ్లినే స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.
శ్రీరంగనాథుడికి పట్టువస్త్రాల సమర్పణ
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని
ప్రతి స్టార్ట్ఫోన్లో సంచార్ సాథీ యాప్
ప్మార్ట్ ఫోన్లలో సైబర్ నేరాల నియంత్రణ , ఫోన్ల చోరీల ఆటకట్టుకు సంబంధిత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలువరించింది. ఫోన్ల తయారీదార్లు ఇకపై తయారు చేసే ప్రతి ఫోన్లోనూ సైబర్ సెఫ్టీ యాప్ ఏర్పాటు అత్యవసరంగా చేయాలని ఆదేశించారు. ఈ ఏర్పాటును సంచార్ సాథీ అని వ్యవహరిస్తారు. దీని ఏర్పాటుకు సంబంధించి ఫోన్ల తయారీ కంపెనీలకు ఉత్తర్వులు వెలువరించారు. ఫోన్ల వినియోగదార్లు తమ ఫోన్ల నుంచి ఈ యాప్ను ఏ విధంగా కూడా తొలగించడానికి వీల్లేకుండా సరైన అమరిక ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్న దశలో, విద్యావంతులు కూడా ఎంతో నష్టపోతున్న కాలంలో స్మార్ట్ఫోన్లలో ఇటువంటి సైబర్ నేరాల చెక్ ఏర్పాటు అవసరం అని ఆయా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అంతర్గత ఆదేశాలు వెలువడినట్లు ఆయా కంపెనీల ద్వారా వెల్లడైంది. సాధారణంగా ఎక్కువగా సైబర్ నేరాలు సెల్ఫోన్ల సాంకేతికను వాడుకుంటూ నేరగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ దశలో సెల్ఫోన్లలోనే వీటిని నియంత్రించే ఏర్పాటు అవసరం అనే విషయం సాంకేతిక నిపుణుల ద్వారా గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యకు దిగింది. తొలిగించడానికి వీల్లేని , ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ యాప్ ఏర్పాటు విషయంలో ప్రైవేటు కంపెనీలు స్పందన తెలియలేదు. యాపిల్ , శామ్సంగ్ ఇతర కంపెనీలు ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫోన్ల మార్కెట్గా భారతదేశం నిలిచింది. ఇప్పటికే 1.2 బిలియన్ ఫోన్లవాడకం దార్లు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జనవరిలో విడుదల చేసిన ఈ యాప్తో వినియోగదార్లు పోగొట్టుకున్న ఏడు లక్షలకు పైగా ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్లోనే అరలక్ష వరకూ రికవరీ అయ్యాయి.
ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు..
ఆంధ్రప్రభ, తిరుపతి : ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ విశిష్ట సేవలు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో పరిష్కరించి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలోని అగస్తీశ్వరస్వామి ఆలయంలో ఒక విశిష్టమైన
Akhanda Haindavam: Spiritual Anthem
The countdown has begun for the theatrical release of Nata Simham Nandamuri Balakrishna’s highly anticipated flick Akhanda 2. Directed by Boyapati Sreenu, the movie will hit the screens in 4 more days on December 5th. The makers have intensified the promotional activities, and they have released lyrical video of Akhanda Haindavam song. Music director S […] The post Akhanda Haindavam: Spiritual Anthem appeared first on Telugu360 .
Chandrababu | మనమే టాప్ ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలో ఏ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అర్జీదారులు సంతృప్తి పొందేలా ప్రజా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో
ఆంధ్రప్రభ, విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి
Eluru |కిడ్నీ బాధితురాలి ఇంటికి ..
Eluru | కిడ్నీ బాధితురాలి ఇంటికి .. ఏలూరు/ఉంగుటూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో
ఆంధ్రప్రభ, ఆరిలోవ విశాఖపట్నం : విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విశాఖపట్నం
విజయవాడలో మెగా పాస్పోర్ట్ మేళా
ఆంధ్రప్రభ, విజయవాడ : త్వరలో నిర్వహిస్తున్న మెగా పాస్పోర్ట్ మేళను సద్వినియోగం చేసుకోవాలని
బ్లైండ్ క్రికెటర్ కు అపూర్వ స్వాగతం..
ఆంధ్రప్రభ విజయవాడ : కొలంబోలో ఇటీవల జరిగిన తొలి మహిళా ప్రపంచ బ్లైండ్
జాతీయస్థాయిలో ఏడో ఉత్తమ ఠాణా గా శామీర్పేట పిఎస్
దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్ఏ) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తారు. అందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2024=- 25 సంవత్సరానికిగాను నిర్వహించిన పరిశీలనలో భాగంగా ఈ ఎంపిక చేశారు. కేంద్ర బృందం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో శామీర్పేట పోలీస్ స్టేషన్ను సందర్శించి పరిశీలించారు. ఎంహెచ్ఏ బృందం నిర్వహించిన ఈ ఎంపికలో పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సిసిటిఎన్ఎస్ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి, ఎడిసిపి పురుషోత్తం, ఎసిపి బాలగంగిరెడ్డి , ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, సిబ్బందిని అభినందించారు.
కనీస వేతనాలు చెల్లించని సంస్థలపై చర్యలు..
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలు

24 C