SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
...

WhatsApp stock Trading Scam: రిటైర్డ్‌ ఇంజినీర్‌ నుంచి ₹1.71 కోట్లు కాజేసిన ముఠా

ఐపీఓలు, బ్లాక్‌ ట్రేడింగ్‌ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌లో మోసగాళ్ల వలడబ్బు తీసుకోవాలంటే ₹65 లక్షల కమిషన్‌ చెల్లించాలని డిమాండ్‌

తెలుగు పోస్ట్ 14 Mar 2026 6:20 am

ఆర్థిక లోటున్నా అపరిమిత ఉచితాలా?

ఎన్నికలు వస్తే చాలు ఉచిత పథకాల జాతర మొదలవుతుంది. పార్టీలు పోటీలు పడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముందూ వెనుకా చూడకుండా అపరిమిత ఉచితాలను ప్రకటిస్తుంటాయి.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 1.30 మిలియన్ జనాభా గలిగిన బీహార్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం అపారమైన సంక్షేమ ప్యాకేజీని ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేయడానికి వెళ్లకముందే 5 కోట్ల మంది మహిళలు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన (ఎంఎంఆర్‌వై) పథకం కింద నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ. 10 వేలు వంతున అందుకోగలిగారు. దీనికి తోడు పెన్షన్ పథకం కూడా కలిపి రూ. 9420 కోట్ల వరకు అదనపు భారం పెరిగి రాష్ట్ర బడ్జెట్ ఆదాయంలో పదోవంతు వ్యయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు తమిళనాడులో రానున్న ఎన్నికల కోసం పార్టీలు అపరిమితంగా ఉచితాలను ప్రకటించడంలో పోటీ పడుతున్నాయి. ప్రతి మహిళకు నెలనెలా ఉచితంగా రూ. 2000 నగదు అందిస్తామని అధికార పార్టీ డిఎంకె ప్రకటించగా, ఎఐఎడిఎంకె కూడా రూ. 2000 ప్రకటించింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టివికె పార్టీ రూ. 2500 ప్రకటించింది. ఇక వన్‌టైమ్ సహాయం కింద నేరుగా రూ. 5000 నెలవారీ పంపిణీ చేస్తామని డిఎంకె వెల్లడించగా, ఎఐఎడిఎంకె రూ. 2000, టివికె రూ. 2500 ప్రకటించాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని డిఎంకె, ఎఐఎడిఎంకె ప్రకటించగా, టివికె ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. విద్యార్థులకు ఉచితంగా లాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని డిఎంకె హామీ ఇవ్వగా, విద్యార్థులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది. విద్యార్థులు చదువు సాగేలా సహాయం చేస్తామని టివికె వెల్లడించింది. మహిళలకు స్కూటర్ల కొనుగోలులో రూ. 25,000 సబ్సిడీ కల్పిస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది. 8 గ్రాముల బంగారం మహిళలకు బహుమతిగా అందిస్తామని టివికె వెల్లడించింది. రైతులకు ప్రస్తుతం సబ్సిడీలు కలిస్తున్నామని డిఎంకె వెల్లడించగా, మత్స కార్మికులకు, గ్రామీణ సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తామని ఎఐఎడిఎంకె వెల్లడించింది. రైతులకు రుణ మాఫీ చేస్తామని టివికె ప్రకటించింది. పొంగల్‌తోపాటు ఇతర పండగలకు నగదు సహాయం చేస్తామని డిఎంకె వెల్లడించగా, రూ. 1000 వంతున పొంగల్ బహుమానం ఇస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది. టివికె మాత్రం ఇంతవరకు దీని గురించి స్పష్టం చేయలేదు. తమిళనాడులో ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతోంది. 202425 బడ్జెట్ అంచనాల ప్రకారం ఉచిత విద్యుత్, మహిళలకు నగదు బదిలీ వంటి పథకాలకు సబ్సిడీల రూపంలో వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. 202425 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన రెవెన్యూ లోటు రూ. 44,097 కోట్లుగా తేలగా, ఈ రెవెన్యూ లోటులో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి విద్యుత్ సంస్థకు ఇచ్చే నష్ట భర్తీ సబ్సిడీ రూ. 17,117 కోట్లుగా ఉంది. కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకం కింద మహిళలకు నెలకు రూ. 1000 వంతున అందించే పథకానికి రూ. 13,720 కోట్లు కేటాయించవలసి వస్తోంది. దీనివల్ల 1.15 కోట్ల మంది లబ్ధి పొందుతారు. సమగ్రంగా చెప్పాలంటే తమిళనాడులో ఉచిత విద్యుత్, నగదు బదిలీ పథకాల వల్ల ఏటా రూ. 30,000 కోట్ల నుండి రూ. 50,000 కోట్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ భారం ప్రభుత్వ ఖజానాపై పడుతోంది. సబ్సిడీలు, గ్రాంట్ల రూపంలో చెల్లించవలసిన మొత్తం 2024 25లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో రూ. 3,48,289 కోట్లుగా తేలింది. 2026 మార్చి 31 నాటికి తమిళనాడు నికర అప్పు రూ. 9,29,959 కోట్లకు చేరిందంటే తమిళనాడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని అపరిమిత ఉచితాలను ప్రకటించడం ఆర్థికంగా ఎంతవరకు నెట్టుకు రాగలదో చెప్పలేం. బడుగు వర్గాలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పనిచేసే మహిళలకు టూవీలర్లు, ఉచితంగా లేదా సబ్సిడీపైన సంవత్సరానికి ఉచితంగా ఆరు వంటగ్యాస్ సిలిండర్లు, పెళ్లిళ్లకు బంగారు కానుకలు, సిల్కు చీరలు, విద్యార్థులకు లాప్‌టాప్, స్కూటర్లు, బేబీ కిట్లు, శానిటరీ ప్యాడ్‌లు ఇవన్నీ ఇస్తామని అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఈ ఉచితాల సంస్కృతిపై సుప్రీం కోర్టు కూడా గట్టిగా హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంపై దాఖలైన వ్యాజ్యం సందర్భంగా సుప్రీం కోర్టు ఉచితాలపై తీవ్రంగా స్పందించింది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత విద్యుత్ పథకం కల్పించేందుకు డిఎంకె ప్రభుత్వం ఆమోదించింది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, సబ్సిడీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు అభివృద్ధికి నిధులు కేటాయించక పోవడంపై తప్పుపట్టింది. ముఖ్యంగా ఆర్థిక స్తోమత ఉన్నవారికి విచక్షణా రహితంగా ఉచిత పథకాలను అందజేయడం వల్ల పనిచేయకుండానే ప్రతిఫలం లభించే సంస్కృతి ఏర్పడిందని హెచ్చరించింది. ఈ పథకాన్ని చివరి నిమిషంలో ఎందుకు ప్రకటించారో వివరించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే ఉచితాలను ఇచ్చే విధానాన్ని పునః సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఉచిత ఆహారం, విద్యుత్‌ను అందించడం కొనసాగిస్తే వాస్తవ అభివృద్ధికి ఎలా నిధులు సమకూర్చుకుంటారో చెప్పాలని నిలదీసింది. ఇలా పంచుకుంటూ పోతే అభివృద్ధికి ఒక్కపైసా కూడా మిగలదని మండిపడింది. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడంలో వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. 

మన తెలంగాణ 14 Mar 2026 6:10 am

Digital Arrest Scam: హైదరాబాద్‌లో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.80 లక్షలు దోపిడీ

ట్రాయ్, సీబీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లువాట్సాప్ వీడియో కాల్‌లో నకిలీ కోర్టు విచారణ

తెలుగు పోస్ట్ 14 Mar 2026 6:08 am

గ్లోబల్ సౌత్ నాయకత్వ ‘సౌందర్యం’

ఈ నెల 12వ తేదీ గురువారం నాడు ఒక వార్త టెలివిజన్ ఛానళ్లలో మారుమోగింది. ఇరాన్ ప్రభుత్వం రెండు ఆయిల్ ట్యాంకర్లను భారతదేశానికి వచ్చేందుకు అనుమతించింది. వాటిలో ఒకటి ఇప్పటికే భారతదేశానికి దాదాపు చేరగా, రెండవది బహుశా ఈ వ్యాసం వెలువడే సమయానికి రాగల అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో, అందువల్ల దేశంలో చమురు, గ్యాస్‌లకు ఏర్పడుతున్న సమస్యలు ఏమిటో చూస్తున్నదే గనుక, ఈ నౌకల రాక తప్పక సంతోషించవలసిన విషయమే. ట్యాంకర్ల రాక కోసం ఇరాన్‌ను ఒప్పించినందుకు భారత ప్రభుత్వ దౌత్య నీతిని అవే ఛానళ్లు వేనోళ్ల కొనియాడాయి. అంతవరకు బాగున్నది. అదే సమయంలో చెప్పుకోవలసింది మరొకటి ఉంది. ట్యాంకర్లను ఇరాన్ అనుమతించటానికి కేవలం ఒక రోజు ముందు, భద్రతా మండలిలో గల్ఫ్ దేశాల కౌన్సిల్, ఇరాన్‌ను ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఆ తీర్మానాన్ని భారతదేశం కేవలం బలపరచటంతో ఆగక ఒక అడుగు ముందుకు వేసి సహ ప్రతిపాదకురాలిగా (కోస్పాన్సరర్) వ్యవహరించింది. ఈ రెండు పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవు. ట్యాంకర్లను అనుమతించవలసిందిగా భారతదేశం ఇరాన్‌ను ఎపుడు కోరింది? అందుకు వారు ఎపుడు అనుమతించారు? ఆ రెండు నౌకలు హార్ముజ్ జలసంధిని ఎపుడు దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి? అన్నవి ఒక విధమైన ప్రశ్నలు. అంతకు ముందు రోజున భద్రతా మండలి తీర్మానానికి భారతదేశం ఎపుడు మద్దతు తెలిపింది? నౌకలను ఇరాన్ అనుమతించి అవి హార్ముజ్‌ను అప్పటికే దాటి బయటకు వచ్చాయా? అన్నవి మరొక విధమైనవి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించినపుడు విషయం మరింత బాగా అర్థమయే మాట నిజమే. కాని ఈ లోపల యథాతధంగా అర్థమవుతున్నవి కూడా చాలానే ఉన్నాయి. భారతదేశం ఒకవైపు ఇరాన్‌ను భద్రతామండలిలో ఖండిస్తూ, మరొకవైపు చమురు ట్యాంకర్లుకు అనుమతి కోరింది. తనను ఖండిస్తున్నట్లు తెలిసి కూడా ఇరాన్ ట్యాంకర్లను అనుమతించింది. మోడీ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే ఇంగ్లీషు ఛానళ్లు, ట్యాంకర్లును సాధించిన మన దౌత్యనీతిని కొనియాడాయి గాని, ఆ ట్యాంకర్లను ఇంత క్లిష్ట స్థితిలోనూ అనుమతించిన ఇరాన్‌ను ప్రశంసించలేక పోయాయి. సమితి తీర్మానంలో ఏమున్నది? గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్‌పై ఖండనలున్నాయి. దాడులు వెంటనే నిలిపివేయాలనే డిమాండ్ ఉంది. హార్ముజ్ జలసంధిని మూసి వేయగలమని ఇరాన్ బెదిరిస్తున్నదంటూ విమర్శలున్నాయి. గల్ఫ్ దేశాల భౌగోలిక సమగ్రతకు, రాజకీయ స్వాతంత్య్రానికి సమర్థనలున్నాయి. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాలకు, అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన ప్రమాదకరమనే హెచ్చరికలున్నాయి. ఆయా దేశాలకు అన్ని విధాలైన బెదిరింపులను, వారిని రెచ్చగొట్టడాన్ని నేరుగా ఇరాన్ గాని, వారి మిత్ర సంస్థలు గాని బేషరతుగా ఆపి వేయాలనే ప్రకటనలున్నాయి. యథాతథంగా పశ్చిమాసియాలో శాంతి సాధనకు ఇవన్నీ అవసరమైన చర్యలే. కనుక ఆ మేరకు గల్ఫ్ దేశాలను గాని, ఆ తీర్మానాన్ని బలపరచిన ఇండియానుగాని, ఆ తీర్మాన సమావేశానికి అధ్యక్షత వహించిన అమెరికాను ప్రశంసించవలసిందే తప్ప ఆక్షేపించదగింది ఏమీ లేదు. కాని కొన్ని సందేహాలు ఆ తర్వాత మొదలవుతాయి. ఇంతకూ ప్రస్తుత సమస్య ఎందుకు తలెత్తింది? ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచానికంతా తెలుసు గనుక ఇక్కడ మళ్లీ చెప్పుకోవలసిని అవసరం నిజానికి లేనేలేదు. అయినా సందర్భం వచ్చింది గనుక చెప్పుకోక తప్పుదు. అమెరికా, ఇజ్రాయెల్‌లు పచ్చిఅబద్ధాలు చెప్తూ ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టినందున సమస్య మొదలైంది. వారు ఆరోపించినట్లు ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయటం లేదు. యురేనియం శుద్ధిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగపడే 60 శాతం వద్దనే ఆపివేసింది తప్ప, అణ్వాయుధాలకు కావలసిన 90 శాతానికి కాదు. ఆ పాటి కేంద్రాలను కూడా నిరుడు జూన్ నాటి దాడులలో అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేసాయి. భవిష్యత్తుకు సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమాన్ వెల్లడించింది. ఇప్పటికే 60 శాతానికి శుద్ధి అయిన యురేనియం స్థాయిని అంతకన్న తక్కువ స్థాయికి తగ్గించగలమని ఇరాన్ చెప్పినట్లు ఒమన్ పేర్కొన్నది. ఇది ఒకటి కాగా, అణ్వస్త్రాలను అమెరికా వరకు 12,000 కి.మీ. మేర తీసుకుపోగల క్లిపణులు కూడా ఇరాన్‌కు లేవు. మరి ట్రంప్ ఆరోపిస్తున్నట్లు తమకు ఇరాన్‌తో ముప్పు ఎక్కడ? ఇక్కడ ఇంతింత చెప్పుకుంటున్నాము గాని వాస్తవానికి ఇవన్నీ, పైన అనుకున్నట్లు పలుమార్లు చెప్పుకున్నవే. ప్రపంచానికే గాక అమెరికా, ఇజ్రాయెల్‌లకు తెలిసినవే. అయినప్పటికీ నిరుడు జూన్‌లో ఇదే ప్రకారం దాడులు జరిపిన వారిద్దరూ ఇపుడు మరొకసారి అదే పని చేస్తున్నారు. ఇరాన్ అధినేత ఖమేనీ తోపాటు దాదాపు 40 మంది నాయకులను బలి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా నిరంతర విధ్వంసం సాగిస్తున్నారు. 175 మంది బడి పిల్లలను చంపారు. కొత్త నాయకునిగా ఎవరిని ఎన్నుకున్నా చంపివేస్తామంటున్నారు. తాము చెప్పిన వారినే ఎన్నుకోవాలంటున్నారు. ఇరాన్ రక్షణకు అవసరమైన క్షిపణి వ్యవస్థలను, క్షిపణులను, రివల్యూషనరీ గార్డ్ దళాలను నాశనం చేస్తామంటున్నారు. రాజకీయ వ్యవస్థను కూలదోసి అధికారం చేజిక్కించుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తామంటున్నారు. అవసరమైతే ఇరాన్ దేశమన్నదే లేకుండా ఛిన్నాభిన్నం చేస్తామంటున్నారు. చమురు నిక్షేపాలన్నీ తమ అధీనంలోకి తెచ్చుకుంటామంటున్నారు. ఇవన్నీ మనం చదువుతున్నవే. అయినప్పటికీ మరొకసారి గుర్తుచేసుకోవటం ఎందుకంటే, ఈ వివరాలను బుధవారం నాటి భద్రతామండలి తీర్మానంలోని అంశాలతో పోల్చి చూడవలసి ఉంది. అదే విధంగా, ఒకవైపు ఇరాన్‌పై జరుగుతున్న దుర్మార్గపు యుద్ధం పట్ల, మరొక వైపు ఇపుడు భద్రతామండలి తీర్మానం విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరించిన వైఖరుల గురించి చర్చించుకోవలసింది. తీర్మానం మరునాడు రెండు ట్యాంకర్లను ఇరాన్ అనుమతించటం అందుకు ముక్తాయింపు అవుతుంది. చివరకు మాట్లాడుకోవలసింది ప్రధానమంత్రి మోడీ ‘విశ్వగురుత్వం’ ఆయన ఆధ్వర్యాన భారతదేశం ‘గ్లోబల్ సౌత్’ అనబడే వర్ధమాన దేశాలకు నాయకత్వం వహించటం, విదేశాంగ విధానంలో ‘వ్యూహాత్మక తటస్థత’ (స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ) గురించి. ఇరాన్‌పై దాడిని, ఆ దేశాధినేత హత్యను, ఆ దేశ భౌగోళిక సమగ్రతకు, స్వాతంత్య్రానికి భంగం కలిగించగలమంటున్న అమెరికా, ఇజ్రాయెల్‌ల బాహాటపు ప్రకటనలను, సాగిస్తున్న విధ్వంసాన్ని మోడీ ప్రభుత్వం ఎన్నడూ మాట మాత్రంగానైనా ఖండించలేదు. పిల్లల హత్యపైనా నోరు విప్పలేదు. ఇంతకుముందు వెనిజులాపై దాడిని ఆ దేశాధినేతను భార్యతోసహా అపహరించటాన్ని కూడా. ఇపుడు సమితి తీర్మానం విషయంలో కనీసం తటస్థతను పాటించటమైనా కాకుండా ఇరాన్‌ను ఖండించారు. హార్ముజ్ జలసంధి మూసివేత గాని, అమెరికన్ స్థావరాలు గల గల్ఫ్ దేశాలపైనే గాక టర్కీ, సైప్రస్ వంటి ఇతర దేశాలపై గాని దాడులు అక్కడి అమెరికన్ స్థావరాలను లక్షంగా చేసుకుంటున్నవే తప్ప ఆయా దేశాలను కాదు. ఆ మాట ఇరాన్ స్పష్టంగా చెప్తున్నది. ఆ మాట వారికి కూడా తెలుసు. అందువల్లనే తమ భూభాగంపై దాడులను ఇరాక్, సైప్రస్‌లోని తమ స్థావరంపై దాడిని బ్రిటన్ నిలువరించటానికే పరిమితమయాయి తప్ప ఇరాన్‌పై ఎదురు దాడులు చేయలేదు. పైగా, దాడులలో సహకరించాలన్న ట్రంప్ మాటకు బ్రిటన్ అంగీకరించలేదు. నిజానికి ఫ్రాన్స్, జర్మనీ తదితర నాటోదేశాలు కూడా విభేదించాయి. ఇరాన్ దాడులు గల్ఫ్‌దేశాల భౌగోళిక సమగ్రతకు, స్వాతంత్య్రానికి ముప్పు చేస్తున్నాయనే మాట కేవలం హాస్యాస్పదమైనది. నిజంగా అటువంటి ముప్పును ఎదుర్కొంటున్న ఇరాన్ సమస్య మోడీ ప్రభుత్వానికి లెక్కలోకి రాలేదు. అదే విధమైనది గల్ఫ్‌పై దాడులు అంతర్జాతీయ చట్టాలకు, అంతర్జాతీయ శాంతిభద్రతలకు భంగకరమైనే మాట. ఇది నిజమే అనుకుందాం. మరి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ నిరుడు చేసిన దాడులు, ఇపుడు సాగిస్తున్న యుద్ధం అటువంటి చట్టాలకు, శాంతి భద్రతల పరిరక్షణకు అనుకూలమైనవా? ఆ విషయమై మోడీ ప్రభుత్వపు మౌనం ఎందువల్ల? ఇపుడు లేని ప్రమాదాన్ని ఊహించి చూస్తూ, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఆత్మరక్షణ దాడులను మాత్రమే ఇంత ఉత్సాహంగా ఖండించటమెందుకు? ఇంతకూ ఆ ప్రాంతాంలో అరడజనుకు పైగా అమెరికన్ స్థావరాలను గల్ఫ్‌దేశాలు ఎందుకు మోస్తున్నట్లు? వాటిని ఉపయోగించుకుని అమెరికన్లు ఇరాన్‌పై దాడులు చేయవచ్చుగాని, ఆ స్థావరాలపై ఇరాన్ ఎదురు దాడులు జరపరాదనడంలోని ఉద్దేశమేమిటి? సమితి తీర్మానంలో హార్ముజ్ జలసంధి మూసివేతనైతే మోడీ ప్రభుత్వం ఇతరులతో కలిసి ఖండించిందిగాని, ఇరాన్ ఆ చర్య తీసుకున్నది ఆత్మరక్షణ కోసమని తెలియదా? లేక వారికి ఆత్మరక్షణ హక్కు లేదని చెప్పదలచుకున్నారా? అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ బలి కావలసిందేదని చెప్పటం ఉద్దేశమా? ఇటువంటి ద్వంద్వ నీతిని, కపట ధోరణులను అనుసరించటం మోడీని ‘విశ్వగురువు’ చేయగలదా? ఇరాన్, వెనిజులా వంటి అనేకానేక వర్ధమాన దేశాలతోకూడిన ‘గ్లోబల్ సౌత్’ తనను నమ్మి నాయకత్వం అప్పగించగలదా? వేర్వేరు పెద్ద శక్తుల మధ్య ఎటూ మొగ్గకుండా ‘వ్యూహాత్మక తటస్థ’ విధానం ద్వారా దేశ ప్రయోజనాలను అన్ని విధాలు కాపాడుకోగలమన్న వారు, ఇటు ఇరాన్, అటు అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడి, ఇపుడు సమితి తీర్మానం విషయంలో అటువంటి తటస్థతను పాటించినట్లేనా?. టంకశాల అశోక్

మన తెలంగాణ 14 Mar 2026 6:00 am

దద్దరిల్లిన టెహ్రాన్

దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత భీకర రూపు దాల్చంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఒకవైపు తీవ్రదాడులు చేస్తున్నసమయంలోనే శుక్రవారం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌అమెరికా ఉమ్మడిద బలగాలు గురిపెట్టాయి. టెహ్రాన్ స్కేర్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. యూనివర్శిటీ దగ్గరిలోని ఇంగెలాబ్ స్ట్రీట్ వద్ద ఉన్న ఫిరదౌసి స్వేర్ లక్షంగా భీకర పేలుళ్లు జరిగాయి. మినాబ్ స్కూల్ చిన్నారులను చంపివేయడాన్ని నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున గుమికూడిన దశలోనే దాడులు జరిగాయి. వార్షిక క్వాడ్స్ దినం సందర్భంగా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపే ప్రదర్శనకు కూడా జనం వేలాది సంఖ్యలో వెల్లువెత్తారు. ఖమేనీ చిత్రపటాలను చేతిలో పట్టుకుని ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో ర్యాలీ జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చావు తప్పదని నినదించారు. ర్యాలీ లక్షంగా పేలుళ్లు జరుగుతున్నప్పటికీ జనం ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. పేలుళ్ల ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరాన్ స్పందించలేదు. తమ పతీకార దాడులు తీవ్రతరం చేస్తామని సుప్రీం లీడర్ మొజ్తాబా చెప్పిన గంటల వ్యవధిలో టెహరాన్ , మరో నగరం ఖజ్విన్‌లోనూ దాడులు తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ముందుగానే ప్రకటించారు. ఇరాన్ సైనిక వ్యవస్థను దెబ్బతీస్తామని వేర్వేరుగా ట్రంప్ , నెతన్యాహు హెచ్చరించారు. బుర్జ్ ఖలీఫా సమీపంలో దాడి.. ఈ క్రమంలోనే ఇరాన్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, అక్కడి ఎయిర్‌పోర్టులను, చమురు క్షేత్రాలను లక్షంగా ఎంచుకుని దాడులు ఉధృతం చేసింది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద కూడా డ్రోన్లు కూలినట్లు తెలుస్తోంది. దాని వైనకవైపు నుంచి నల్లని దట్టమైన పొగలు వెలువడ్డాయి. గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల ధ్వంసానికి ఇరాన్ ప్రయోగించిన దాదాపు 50 డ్రోన్లను సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి. ఒమన్‌లోడ్రోన్ల దాడులలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అక్కడి సోహర్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ల దాడితో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక్కడ నేలకూలినడ్రోన్ల శకలాలు ధాటికి ప్రజలు గాయపడ్డారు. బహరైన్‌లో భారీ స్థాయిలో సైరన్లు మోగాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫెనాన్సియల్ సెంటర్‌లోని అమెరికా స్థావరాలను ఎంచుకుని ఇరాన్ దాడులు జరిగాయి. ఇప్పటి వరకు ఇరాన్‌లో 1444మంది మృతి చెందారు. అమెరికా విమానం కూలి ఆరుగురు మృతి ఇరాక్‌లో అమెరికా సైన్యానికి చెందిన కెసి 135 రిఫ్యూయలింగ్‌విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతి చెందారని అమెరికా సైన్యం తెలిపింది. ఇరాక్ సేనలు పొరపాటున ఈ నౌకను దెబ్బతీశాయా? లేక ఇరాన్ దాడులు సాగించిందా? అనేది నిర్థారణ కాలేదు. తాము ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. శత్రువు లేదా పొరపాటు దాడులు జరిగి ఉంటాయని తాము అనుకోవడం లేదన్నారు. ఇరాన్‌లో 200 ప్రాంతాల్లో దాడులు.. ఇరాన్‌పై శుక్రవారం దాడులను తీవ్రతరం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహరాన్‌తో పాటు 200కు పైగా చోట్ల ఇరాన్ వైమానిక దాడులు సాగాయి. ఇక ఒమన్‌లో శుక్రవారం ఓ డ్రోన్ కూలిన ఘటనలో ఇద్దరు విదేశీయులు మృతి చెందారు. భారతీయ పతాకంతో కూడిన ఓ చమురు రవాణా నౌక శుక్రవారం హర్మూజ్ జలసంధి మీదుగా ఆఫ్రికాకు క్షేమంగా వెళ్లింది. భారతీయ జెండా వల్ల ఇరాన్ దాడుల నుంచి తప్పించుకుంది. ఇప్పటికీ మరో 27 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. 

మన తెలంగాణ 14 Mar 2026 6:00 am

తలవంచిన తుపాకీ గొట్టం

సుమారు అయిదున్నర దశాబ్దాల క్రితం ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అంటూ దేశీయ కమ్యూనిస్టుల్లో సాయుధ పంథాకు చారుమజుందార్ బీజంవేశారు. పశ్చిమ బెంగాల్ లోని నక్సల్ బరి అనే గ్రామంలో మొదలైనందున ఈ బాటలో నడిచినవాళ్లకు నక్సలైట్లు అనే పేరు వచ్చింది. అప్పుడు పశ్చిమబెంగాల్ మార్క్సిస్టు పార్టీ పాలన ఉంది. ఆ ప్రభుత్వ నిర్ణయాలు పేదలకు, రైతులకు ఎలాంటి మేలు చేయకపోగా, భూస్వామ్య, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించినవాళ్లు విడిపోయి సిపిఐ (మార్క్సిస్టు-లెనినిస్టు) అనే కొత్త పార్టీ పెట్టారు. రష్యా, చైనా దేశాల మాదిరిగా ఇండియాలోనూ సాయుధ తిరుగుబాటు ద్వారా పార్లమెంటరీ విధాన పాలనను కూలదోసి కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించవచ్చని ఆ పార్టీ అనుకుంది. ఆ ఆలోచన కాలక్రమంగా దేశంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ముప్పై ఏళ్లపాటు తన ప్రతాపం చూపించి ఇప్పుడు కొనఊపిరికి వచ్చింది. ముప్పైనుంచి నలభైఏళ్ల సుదీర్ఘ జీవితకాలం తుపాకినిని నమ్ముకున్నవాళ్లు.. ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ.. తుపాకుల వల్ల ఏమి సాధించలేమని ప్రకటిస్తున్నారు. పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకొన్న ప్రజలు ఏనాటికైనా ఓడిపోవడమే అనే విషయాన్ని గ్రహించేందుకు ఇంతకాలం పట్టింది. తుపాకి గొట్టం సిద్ధాంతం ఇక మూలన పడ్డట్లే. నిజానికి ఇప్పుడు దేశంలో నక్సలైట్ల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆంధ్ర, ఛత్తీస్‌గడ్, ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తప్ప వారి ఉనికి మరెక్కడా లేదు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసిన విప్లవోద్యమం నేడు కొన్ని మారుమూల గ్రామాలకు పరిమితమైంది. వారి కదలికల వల్ల ప్రభుత్వాలకు వచ్చిన నష్టమేమీ లేదు. అయితే కమ్యూనిజానికి, జాతీయవాదానికి ప్రపంచవ్యాప్తంగా పుట్టు వైరముంది. ఎర్రజెండాను చూస్తే కాషాయం భగ్గుమంటుంది. కుంచించుకుపోయిన వారి స్థాన, సంఖ్యా బలం అంచనా వేసినాకే హోం మంత్రి అమిత్ షా తన లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఉండవచ్చు. పారిశ్రామికవేత్తల, పెట్టుబడుదారుల కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగేందుకు వారికి అన్ని వేళలా తోడ్పడడం బిజెపి ప్రభుత్వవిధానం. వారు దేశంలోని ఏ భూభాగం కావాలన్నా అప్పగించడానికి అది సిద్ధమే. అడవుల్లో ఉన్న అటవీ ఉత్పత్తులు, ఖనిజ సంపద పరిశ్రమలకు ఆవశ్యకం. పారిశ్రామిక ముడిసరుకుతోపాటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే అవకాశానికి ఏమాత్రం ఆటంకం కలగవద్దని గిరిజనాభివృద్ధి పేరిట కేంద్రం అడవుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధపడింది. చత్తీస్‌గఢ్‌లోని కనీస సదుపాయాలు లేని ప్రాంతాల్లోకి రహదారులు, విద్యుత్తు, పాఠశాలలు, దవాఖానాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. ఈ ఏర్పాట్లకు మావోయిస్టులే పరోక్ష కారణంగా చెప్పుకోవాలి. లొంగుబాటు అవకాశం పదేళ్ల ముందే వచ్చి ఉంటే బాగుండేదని ఈ మధ్య లొంగిపోయిన ఓ మావోయిస్టు నేత అన్నారు. 1980 ప్రాంతంలో నక్సలైట్లు గ్రామాల్లోంచి దొరలను తరిమినప్పుడు కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు. పట్టణాల్లో వచ్చి పట్టణ జీవితాన్ని చూసి వారు ఈ నక్సలైట్లు పదేళ్ల ముందొస్తే బాగుండేది కదా అని వాపోయారు. వసతులు లేని పల్లెటూళ్ళ కన్నా పట్టణాల్లో సకల సౌకర్యాలతో సజావుగా సాగే వ్యాపారాలు వీరికెంతో కలిసి వచ్చాయి. కాలం తెచ్చేమార్పులను ముందే ఊహించడం కష్టమే. మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు తన ఆయుధాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హుషారుగా అప్పగించడాన్ని కొందరు విమర్శించారు. పదేళ్లుగా ఆయన ఎదిరిచూస్తున్న సమయం వచ్చిందన్న ఆనందమే ఆయన నవ్వులో ఉంది. 2014 లోనే సాయుధ పోరాటాన్ని విరమిద్దామనే చర్చ పార్టీలో వచ్చిందని, భద్రతా దృష్ట్యా ఒకరికొకరు కలిసే అవకాశాలు లేనందున, ఏకాభిప్రాయ సాధనలో ఎంతో కాలహరణ జరిగింది అని మల్లోజుల ఓ చోట అన్నారు. ఆ తర్వాత కొనసాగిన, కొనసాగుతున్న మావోయిస్టుల లొంగుబాట్లను చూసాక ఆయన తీసుకున్న నిర్ణయంలో, అన్న మాటల్లోని వాస్తవం అర్థమవుతుంది. విశాల ప్రజాస్వామిక దేశాన్ని ఆయుధాలతో పోరాడి, ఓడించి, పాలించడం అసాధ్యమే అని కాలమే తీర్పు చెప్పింది. తమ తర్వాత పోరాటం ఆగదు, కొనసాగుతుంది. తమ త్యాగాలు వృథా కావు అనే నమ్మకం సన్నగిల్లింది. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా తలలు వంచుతున్నారు. నక్సలైటు బతుకంటే సింహంపై స్వారీ, దిగితే తినేస్తుంది. అలాంటి పరిస్థితి నుండి ప్రభుత్వ సహకారంతో లొంగిపోయి బ్యాంక్ చెక్ తీసుకోని ఇంటికి వెళ్లడమంటే కొత్త జన్మ లభించినట్లే. ఓ రకంగా మావోయిస్టులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అమిత్ షా మరణమో, శరణమో తేల్చుకోమన్నారు. జరిగిన ఆలస్యాన్ని, ప్రాణనష్టాన్ని చూస్తుంటే కేంద్రం ఇచ్చిన వెసులుబాటును మావోయిస్టులే సరిగ్గా వాడుకోనట్లనిపిస్తుంది. జనవరి 2024లో మొదలైన ఆపరేషన్ కగార్ భారీ ప్రభుత్వ బలగాలతో ముందుకు సాగింది. ఆయుధాలను వదిలేస్తే ప్రాణభయం ఉండదు అని మైకుల్లో ప్రచారం కూడా జరిగింది. ఆయుధాలు అప్పగించమని, శాంతి చర్చలు జరగాలని మావోయిస్టుల కొంత బెట్టు చేశారు. ఆ తరువాత తమ వైపు నుంచి కాల్పులు ఉండవని ప్రకటించారు. ప్రభుత్వ బలగాలు మాత్రం గుట్టల్ని జల్లెడ పట్టడం ఆపలేదు. లొంగిపోయిన వారిని వదిలేస్తూ తుపాకితో అడవిలో కనబడ్డ వారిని హతమార్చడమే వాటి పనిగా సాగింది. మల్లోజుల నుండి దేవ్ జి వరకు కొనసాగిన పెద్ద తలల లొంగుబాటు మధ్య సుమారు వేయి మంది దాకా ప్రాణాలు ఇలా కాపాడుకున్నట్లే. ప్రభుత్వాలు వీరికి పునరావాసం కల్పించడం గొప్ప ఔదార్యమే. సాయుధ పోరు సాగదని తెలిసి కూడా మరో దారి లేక అడవుల్లో బతుకుతూ ఉన్నవారిని ఆపరేషన్ కగార్ కాపాడినట్లే. అమిత్ షా మావోయిస్టుల భక్షకుడిగానే కాకుండా రక్షకుడిగా కూడా పేరు సంపాదించారు. ఇక మిగిలింది గణపతి. అమిత్ షా డెడ్ లైన్ లోపు ఆయన ప్రభుత్వం ముందుకు వస్తారా లేక మార్చి, 31ని దాటేస్తారా? పార్టీ జెండాను దించకుండా రహస్యంగానే తల ఎత్తుకొని బతుకుతారా? పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయినందున ప్రభుత్వానికి ఆపరేషన్ గణపతి మాత్రం అవసరం పడదు.   బి.నర్సన్, 94401 28169

మన తెలంగాణ 14 Mar 2026 5:50 am

భారత్‌కు రూట్ క్లియర్!

న్యూఢిల్లీ/టెహ్రాన్: ప్రస్తుత గల్ఫ్ పోరు పరిస్థితుల నడుమ ఇరాన్ శుక్రవారం భారతదేశంతో అత్యంత బలీయ మిత్రత్వం ప్రకటించింది. తమ ఆధీన హర్మూజ్ జలసంధి జల మార్గం మీదుగా భారతీయ చమురు నౌకల రాకపోకలకు అనుమతిని నిర్థారించింది. ఈ మేరకు భారతదేశంలోని ఇరాన్ రాయబారి మెహమ్మద్ ఫతాలీ తమ దేశ నిర్ణయాన్ని వె లువరించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారదేశం తమ మిత్రదేశం అ ని, ఇది చిరకాల బంధం అని, భారతీయ నౌ కలకు అనుమతి ఉందని, పర్షియన్ గల్ఫ్ ఉ ద్రిక్తతలతో నిమిత్తం లేకుండా ఈ సాఫీ ప్ర యాణం సాగుతుంది. ఇందులో ఇరాన్ నుం చి ఎటువంటి ఇబ్బందులు భారత్‌కు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భరోసాతో ఇప్పుడు ఇక ఈ జలసంధి ద్వారా నిలిచిపోయిన భారతీయ నౌకలు సు రక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవచ్చునని ప్రకటించారు. ఇప్పుడు అయితే ఈ జలమార్గంలో దాదాపు 77వరకూ భారతీయ నౌక లు ఉన్నాయి. ప్రస్తుతం  ఈ జలమార్గం సంక్షుభిత, ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంది. సురక్షితంగా భారతీయ నౌకలు ప్రయాణించేందుకు అంగీకారం కుదిరింది. కొద్దిరోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రక్రియ, ఏ విధంగా భారతీయ నౌకలను తీసుకువెళ్లాల్సి ఉంటుందనేది ఖరారు చేసుకుంటారని వివరించారు. బారత్ తమకు మిత్రదేశం. రెండు మూడు గంటల్లోనే దీని వల్ల జరిగే సత్ఫలితం ఏ విధంగా ఉంటుందనేది మీరే చూస్తారని ఆయన విలేకరులకు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇండియా, ఇరాన్‌లకు ఉమ్మడి సారూప్య ప్రయోజనకర అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ కోణంలోనే తమ దేశం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. పరస్పర సహకారం , స్నేహం ప్రాతిపదికన ఇరుదేశాల బంధం చిరకాలంగా ఉందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్‌కు భారతదేశం అందించిన మద్దతు తాము మరువజాలమని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా భారతదేశానికి రెండు ఎల్‌పిజి ట్యాంకర్లు బయలుదేరి రానున్నాయి. ఈ మేరకు ఈ భారతీయ నౌకలకు ఇరాన్ అధికారికంగా అనుమతిని వెలువరించింది. ఈ జలసంధి మార్గం గుండా భారతీయ చమురు నౌకల రవాణాకు వీలు కల్పించినట్లు ఇరాన్ రాయబారి మెహమ్మద్ ఫతాలీ శుక్రవారం ప్రకటించారు. భారత్‌కు ఈ భరోసా కల్పించిన కొద్ది గంటల్లోనే ఈ రెండు ఎల్‌పిజి నౌకల కదలికలకు ఇరాన్ నుంచి అనుమతి రావడం కీలక పరిణామం అయింది. దీనితో ఈ మార్గం నుంచి సంబంధిత వంటగ్యాసు ట్యాంకర్ల నౌకలు వెంటనే బయలుదేరనున్నాయి. బారతదేశంలో నెలకొంటున్న వంటగ్యాసు కొరత కొంత మేర తగ్గేందుకు ఈ నౌకల రాక అత్యంత ఉపయుక్తం కానుంది. ఈ మార్గంలో భారత్‌కు ఈ నౌకలు ఎటువంటి చిక్కులు లేకుండా ఇరాన్ తగు చర్యలను చేపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ట్యాంకర్ నౌకలలో ఏ స్థాయిలో సిలిండర్లు ఉన్నాయనేది వెల్లడికాలేదు. 

మన తెలంగాణ 14 Mar 2026 5:30 am

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనతో మోసం… హైదరాబాద్ వ్యక్తికి రూ.1.88 కోట్ల నష్టం

ఏఐ క్రిప్టో ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు విదేశీ నంబర్లతో సంప్రదింపులు…

తెలుగు పోస్ట్ 14 Mar 2026 5:20 am

మూసీ నిర్వాసితులకు ఉపాధి.. వసతి

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీనదీ ప్రక్షాళన తద్వారా అభివృద్ధి బాధ్యతాయుతంగా చేపట్టడానికి ప్రయత్నిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికోసం విదేశాల్లో పలు నదులను అధ్యయనం చేశామని, రెండేళ్లుగా నిపుణులు, అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలించామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్ర పంచంలో అతి పెద్ద నగరాలుగా విలసిల్లుతున్న దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి మహా నగరాలు కూడా నదీ పరీవాహక ప్రాంతం లో అభివృద్ధి చెందినవేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘మూసీ ఇన్‌వైట్స్’ పేరుతో శుక్రవారం సాయంత్రం ఒక హోటల్‌లో పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టినప్పుడు కొందరికి నష్టం కలిగించవచ్చని ఆయ న అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఔటర్ రింగ్‌రోడ్డులు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించినప్పుడు కొందరి భూములు పోలేదా? కొందరు నిరాశ్రయులు కాలేదా? అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అయినప్పటికీ భవిష్యత్ తరాల కోసం కొన్ని కష్టనష్టాలు వచ్చి నా వాటిని సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి పిలుపుని చ్చారు. మూ సీని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయడం వల్ల వ్యక్తిగతంగా తనకేమీ ప్రయోజనం కలిగించదని, భవిష్యత్ తరాల కోసం ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఏ రాజకీయ నా యకుడు కూడా తిరిగి అధికారంలోకి రావాలనే ఆలోచిస్తారని, అలాగే ఏ వర్గాన్ని దూరం చేసుకోవడానికి సాహసించరని ఆయన తెలిపారు. మేమేందుకు పేదవాళ్లను నిరాశ్రయులను చేస్తాం తమకు కూడా తిరిగి అధికారంలోకి రావాలని ఉండదా? మేమేందుకు పేదవాళ్లను నిరాశ్రయులను చేసి శతృత్వం పెంచుకుంటామని ఆయన ప్రశ్నించారు. వారు ఎక్కడైతే ఇళ్లు కోల్పోతారో అక్కడికి సమీపంలోని ప్రభుత్వ భూముల్లోనే అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఇళ్లను కట్టించి ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. ఈ మంచి పని చేస్తే కాంగ్రెస్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని గత పదేళ్లు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కడుపులో విషం పెట్టుకుని అడ్డుకుంటున్నాయన్నారు. తమ సంకల్పాన్ని హర్షిస్తున్న వాళ్లు మౌనంగా ఉంటే, వ్యతిరేకించే వాళ్లు మాత్రం తమపై ద్వేషంతో పేదలను రెచ్చగొడుతున్నారని బిఆర్‌ఎస్, బిజెపిలపై సిఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరాశ్రయులయ్యే ప్రతి కుటుంబానికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని ఇందుకు ఇప్పటికే 10,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశామని ఆయన భరోసా ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా, తాము చేపడుతున్న ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, పాతబస్తీలో మెట్రో, రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగు తున్నాయని, అభివృద్ధి పనుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని సిఎం తెలిపారు. ప్రజలపై ఆధిపత్యం చలాయించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు మూసీ ప్రాజెక్టు కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం చేపట్టిన బృహత్ కార్యాచరణ అని ఆయన స్పష్టం చేశారు. అసంపూర్తి సమాచారంతో లేదా ఉద్దేశపూర్వకంగా అర్థ సత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడే కాపలాదారుగా మాత్రమే ఈ అధికారాన్ని వినియోగిస్తానని, ప్రజలపై ఆధిపత్యం చలాయించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటిం చారు. ప్రపంచ చరిత్రను ఒకసారి గమనిస్తే గొప్ప నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే విలసిల్లాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను స్వయంగా న్యూయార్క్‌లోని హడ్సన్ రివర్, లండన్, సింగపూర్, దుబాయ్ వంటి నగరాలను సంద ర్శించి అక్కడ నదీ తీరాల అభివృద్ధిని గమనించానని ఆయన తెలిపారు. మనం ఇంకా అభివృద్ధి నిరోధకులుగా మౌనంగా ఉంటే.... ఇతర దేశాలు ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంటే, మనం ఇంకా అభివృద్ధి నిరోధకులుగా మౌనంగా ఉంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ఆయన హెచ్చరించారు. గత రెండేళ్ల్లుగా వందల గంటల పాటు నిపుణులు, ఆర్థిక, పర్యావరణ కన్సల్టెంట్లతో క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే ఈ మూసీ ప్రాజెక్టును పట్టాలెక్కించినట్లు సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మేము తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. బుల్‌డోజర్లతో మేము పేదల ఇళ్లను కూల్చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అవి చదువుకున్న వాళ్లు మాట్లాడే మాటలా అని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లు మూడునెలలు అక్కడ నివసిస్తారా అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులను సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమే లక్ష్యంగా ముందుకు.. నగర నిర్మాణంలో నిజాం ప్రభువుల దూరదృష్టిని సిఎం ప్రత్యేకంగా అభినందించారు. నిజాంలు, బ్రిటిషర్లు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారని, ఈసీ, మూసీ వరదల నియంత్రణకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నిర్మించారని సిఎం రేవంత్ అన్నారు. 1908లో వచ్చిన భీకర వరదలకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, నిజాం రాజు చలించిపోయి మోక్షకుండం విశ్వేశ్వరయ్య వంటి గొప్ప ఇంజనీర్ సలహాతో వరద నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు 1921లో నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టులే నేటికి కోట్లాది మంది హైదరాబాద్ వాసుల దాహార్తిని తీరుస్తున్నాయని ఆయన కొనియాడారు. 110 ఏళ్ల క్రితమే నిజాం సర్కార్ అంతటి విజన్‌తో నగరాన్ని నిర్మిస్తే, నేడు మనం ఆధునిక కాలంలో ఆ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, రాజకీయంగా విమర్శలు చేయడం కంటే సూచనలు ఇవ్వడం మేలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 2 కోట్ల 80 లక్షలకు 12 ఏళ్లు కేంద్రంలో, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు తమ మేథో సంపత్తిని ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాకుండా అభివృద్ధికి ఉపయోగించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 2 కోట్ల 80 లక్షలకు చేరుకోబోతోందని, వారికి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. 1994 నుంచి 2024 వరకు గత పాలకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి వంటి వారు చేపట్టిన మంచి విధానాలను తాము కొనసాగిస్తున్నామని, విధానపరమైన అస్పష్టత తమ ప్రభుత్వంలో లేదని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బాపు ఘాట్ కన్యాకుమారి తరహాలో అంతర్జాతీయ గుర్తింపు నగరంలో మూసా ఈసా నదుల సంగమ ప్రాంతమైన బాపు ఘాట్‌ను కన్యాకుమారి తరహాలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తన సంకల్పమని ముఖ్యమంత్రి వెల్లడించారు. కన్యాకుమారి మాదిరిగా బాపూఘాట్ కూడా రెండు నదుల సంగమమని, ఇది ఎంతమందికి తెలుసనీ ఆయన ప్రశ్నించారు. నగరంలోని డ్రైనేజీలు పరిశ్రమల కాలుష్యం వల్ల మూసీ నది కలుషితమై విషంగా మారిందని ఇది హైదరాబాద్ కంటే ఎక్కువగా నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో ఫ్లోరోసిస్ శాపానికి తోడు ఈ కాలుష్యం వల్ల పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో జన్మిస్తున్నారని ఆ ప్రాంత ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని ఆయన వాపోయారు. నల్గొండ ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత మనపై ఉందని వారిని ఈ మురికి కూపం నుంచి కాపాడటమే మూసీ ప్రక్షాళన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. గాంధీ విగ్రహం వంటి నిర్మాణాలకు రూ. 250 కోట్లు... ప్రాజెక్టు వ్యయంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సిఎం ఎండగట్టారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ. 7,000 కోట్ల ఖర్చు అవుతుండగా గాంధీ విగ్రహానికి సుమారుగా 70 కోట్లు ఖర్చు పెడుతున్నామని, మిగతా నిర్మాణాలకు కేవలం రూ. 180 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామని ఇది ప్రాజెక్టు మొత్తంలో 2 శాతం కంటే తక్కువేనని ఆయన వివరించారు. బిఆర్‌ఎస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ విగ్రహానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే తాము వ్యతిరేకించలేదని ఆయన తెలిపారు. గోదావరి జలాలు 20 టిఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు మూసీలో నిరంతరం 2.5 టిఎంసిల గోదావరి జలాలు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామని, మిగతా 17.5 టిఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేయత్నం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం నది అందమే కాకుండా దాని వెంబడి ఎకనామిక్ జోన్లు పర్యాటక క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. భారత సైన్యం కూడా తమ పరిధిలోని 100 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకు రావడం ప్రాజెక్టు ప్రాముఖ్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. లోక కల్యాణం కోసం చేసే ఈ యాగంలో ప్రాజెక్టును అడ్డుకునే వారు దేవతల యజ్ఞాలను భగ్నం చేసే రాక్షసుల్లా వ్యవహారిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక కల్యాణం కోసం చేసే ఈ యాగంలో ప్రతిపక్షాలు రక్తం మాంసాలు పోసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అయినా వెనక్కి తగ్గేది లేదని మేధావులు, నిపుణులు ఇచ్చే ప్రతి సలహాను స్వీకరిస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు అద్భుతమైన నగరాన్ని అందించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించకపోతే రానున్న కాలంలో హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారుతుందని హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవనం ద్వారా భూగర్భ జలాల నాణ్యత పెరుగుతుందని కాలుష్యం తగ్గుతుందని వివరించారు. నగర ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అద్భుతాన్ని ఆవిష్కరిస్తామని ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తోడుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 14 Mar 2026 5:00 am

నిషేధం ఎత్తివేయండి.. లీగల్‌గా పనిచేస్తాం

ఆపరేషన్ కగార్‌లో ఒకరికి 100 మంది చుట్టుముట్టారు నంబాల ఎన్‌కౌంటర్ తర్వాత సోను, సతీష్‌ల కుట్ర పార్టీకి అతిపెద్ద దెబ్బ వాళ్లు శత్రువులతో ములాఖత్ అయ్యారు.. రివార్డు …

జనం సాక్షి 14 Mar 2026 4:19 am

రగులుతున్న పశ్చిమాసియా

అమెరికా యుద్ధనౌక‘అబ్రహం లింకన’పై దాడి.. ` ప్రకటించిన ఇరాన్.. తోసిపుచ్చిన అమెరికా ` కూలిన అమెరికా ఈఫ్యూయలింగ్ విమానం ` ఇరాక్‌లో కూలినట్లు ప్రకటించిన అమెరికా ` …

జనం సాక్షి 14 Mar 2026 4:18 am

నేటినుంచి ‘పది’ పరీక్షలు

` భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ` హాల్ టిక్కెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం ` సకాలంలో సెంటర్‌కు చేరుకోవాలన్న అధికారులు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో పదో …

జనం సాక్షి 14 Mar 2026 4:16 am

అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగొద్దు

` మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం కోసం కమిటీలు ` కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు ` అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఉత్తమ్ ` ఇంధన, …

జనం సాక్షి 14 Mar 2026 4:14 am

నిజాం చేసిన అభివద్ధిలో నాలుగొవంతైనా చేయాలి

` మూసీకి 20 టీఎంసీల గోదావరి జలాలు ` అద్భుత నగరాన్ని కాపాడుకునే బాధ్యత మనది ` మూసీ అభివద్దిని బాధ్యతగా తీసుకున్నాం ` ఎవరు సూచనలు …

జనం సాక్షి 14 Mar 2026 4:13 am

రేవంత్‌రెడ్డి బినామీ దందా

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు దిగజారాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు. సిఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌పై కేసులను ప్ర భుత్వం తారుమారు చేసిందని ఆ రోపించారు. కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ అనే సంస్థ కు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంపై సిబి ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టెరేట్ (ఇడి), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) వంటి కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.2,500 కోట్ల విలువైన సాగునీటి తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ పనులను అప్పగించారని లేఖలో ఆరోపించారు. ముఖ్యమం త్రి తన బినామీ కంపెనీని కాపాడుకునేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలను తారుమా రు చేయిస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి బినామీ వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు.' కెఎల్‌ఎస్‌ఆర్ సంస్థపై కేసులు నమోదు కాగా, విచారణ వేళ ముఖ్యమం త్రి ఆదేశాలతో ప్రభుత్వం సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని ఆరోపించారు. సాక్ష్యాలు పోయా యని చెప్పడం దారుణమన్నారు. అధికారులపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను మాయం చేయించారని మండిపడ్డారు. కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయన్నారు. రాష్ట్రంలో విచారణ సంస్థలు, పోలీసు లను నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కెఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ దివాలా తీసినా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయించడం సరికాదన్నారు. ఈ సంస్థపై విచారణ జరగాలని, అది నిష్పక్ష పాతంగా జర గాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ఏజెన్సీలు విచారణ చేయాలని సుప్రీంకోర్టు సూచించినా రాష్ట్రం పట్టించుకోలేదన్నారు.

మన తెలంగాణ 14 Mar 2026 4:00 am

పాత పద్ధతిలోనే సినిమా టికెట్ల రేట్ల పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ప్రసు ్తానికి టికెట్ ధరల పెంపుపై ఇప్పటివర కు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో మైత్రి మూవీ మేకర్స్ సవాల్ చేశారు. వీరి పిటిషన్‌ను శుక్రవారం విచారించిన జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ చందూర్కర్ ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇ చ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ధరల పెంపుపై గత విధానాన్నే కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలో విడుదల కాబోయే చిత్రాలకు ఊరట లభించింది. ప్రీమియర్స్‌తో పాటు టికెట్ ధరల ను పెంచుకునేందుకు వెసులు బాటు లభిచింది. కాగా, సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి.

మన తెలంగాణ 14 Mar 2026 3:30 am

నెలసరి సెలవులు తప్పనిసరి చేస్తే ఉద్యోగాలు హుళక్కే

న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తం గా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలస రి సెలవు అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన సిజెఐ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారంనాడు దానిని తిరస్కరించింది. సె లవును తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్ ముగుస్తుందన్నారు. వేతనం తో కూడిన నెలసరి సెలవు అంశంలో పలు అభ్యంతరాలు ఉన్నాయ ని సిజెఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు ఇస్తే మ హిళలను ఉద్యోగాల్లో తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం ఉందని అన్నారు. తద్వారా వారి ఉపాధిపై ప్రతికూ ల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. వాలంటరీగా సెలవు లు ఇవ్వడమనేది చెప్పుకోవడానికి బాగుటుంది కానీ చట్టం చేసి తప్పనిసరి చేస్తే వివిధ రంగాల్లోని ఉద్యోగాల భర్తీలో కూడా వాళ్లకు ప్రతికూలతలు ఉంటాయన్నారు. అదే విధంగా పురుషుల కన్నా తాము త క్కువ అనే భయ భావన వారిలో కలిగే అవకాశముందన్నారు. నెలసరి వల్ల ఏదో చెడు జరుగుతోంది అన్న విషయాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదని, అది మహిళలను ఆత్మనూన్యతకు గురిచేసేలా ఉంటుందని సిజెఐ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వాలు స్టేక్‌హోల్డర్లతో చర్చించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

మన తెలంగాణ 14 Mar 2026 3:00 am

శనివారం రాశి ఫలాలు (14-03-2026)

మేషం ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం బాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మిధునం చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. కర్కాటకం చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతోకూడినవిగా ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహం ఆత్మీయులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కన్య పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తుల సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ధన ఆదాయం బాగుంటుంది. వృశ్చికం దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధన వ్యవహారాలు కలసివస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. ధనస్సు చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది. మకరం కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుంభం నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. మీనం గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాజకీయవర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.  

మన తెలంగాణ 14 Mar 2026 12:10 am

రూ.లక్షకోట్లతో ఆర్థిక స్థిరీకరణ నిధి: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడానికి వీలుగా రూ.1 లక్షకోట్లతో ‘ ఆర్థిక స్థిరీకరణ నిధి ’ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అనూహ్య పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆమె వివరించారు. లోక్‌సభలో రెండో విడత అనుబంధ పద్దులపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. రెండో విడత అనుబంధ పద్దులకు సంబంధించిన డిమాండ్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.81 లక్షల కోట్లను ఖర్చుచేయడానికి ప్రభుత్వం లోక్‌సభ అనుమతి కోరిందని, అలాగే అదనంగా మరో రూ.80 వేల కోట్ల వరకు ఈ ఆర్థికసంవత్సరం బడ్జెట్‌లో ఉన్నట్టు చెప్పారు. ఈ నిధి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ లక్షాలు దెబ్బతినకుండా చూస్తుంది. 202526 ఆర్థిక సంవత్సరానికి రూ.2.81 లక్షల కోట్ల అనుబంధ బడ్జెట్‌లో ఈ నిధి భాగం. 

మన తెలంగాణ 13 Mar 2026 11:25 pm

టెహరాన్‌లో వీరోచిత వివాహం

టెహరాన్: ఇరాన్‌లోని టెహరాన్‌లో శుక్రవారం అత్యంత అరుదైన చూడముచ్చటైన పెళ్లి తంతు వేడుక జరిగింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల , భీకర పేలుళ్ల చప్పుళ్ల మధ్య ఓ జంట పెళ్లిచేసుకుంది. ఓ సైనిక స్థావరంలో మందుగుండు సామాగ్రి పెట్టెపై కూర్చుని ఉన్న నవ వధూవరులు చేతుల్లో తమ దేశ సైన్యానికి చెందిన రైఫిల్ష్ పట్టుకున్నారు. వారి పక్కన భారీ మెషిన్ గన్ అమర్చి ఉంచారు. చుట్టూ సాయుధులైన మద్దతుదార్లు నిలచి ఉండగా ఈ ఇద్దరూ పెళ్లినాటి ప్రమాణాలకు దిగారు. యుద్ధాల సమయంలోనూ తమ దేశ ప్రజలు చెక్కుచెదరకుండా ఉంటారని, శత్రువును ధైర్యంగా ఎదుర్కొంటారని, తమ జనజీవితం విచ్ఛిన్నం కాకుండా సాగుతుందని చెప్పడానికి ఈ వినూత్న పెళ్లితంతు అసాధారణ రీతిలో జరిగింది. అమెరికా, మిత్రదేశాల యుద్ధ నేరాలకు ఈ జంట తగు విధంగా సవాలు విసరింది. ఇరానీయన్ల ఉక్కుసంకల్పాన్ని చాటింది. ఈ ఘట్టంలో ఎంతో ధైర్యంగా నిలిచిన పెళ్లి కూతురు నిజంగా వీరనారి అని ఓ ఇరానియన్ తన స్పందన వెలువరించారు. వెనుక విన్పించే బాంబుల మోతల మధ్య తాము వీరిని ఆశీర్వదించామని తెలిపారు. 

మన తెలంగాణ 13 Mar 2026 11:08 pm

హర్మూజ్ మీదుగా బారత్‌కు 2 వంటగ్యాసు ట్యాంకర్ నౌకలు

హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా భారతదేశానికి రెండు ఎల్‌పిజి ట్యాంకర్లు బయలుదేరి రానున్నాయి. ఈ మేరకు ఈ భారతీయ నౌకలకు ఇరాన్ అధికారికంగా అనుమతిని వెలువరించింది. ఈ జలసంధి మార్గం గుండా భారతీయ చమురు నౌకల రవాణాకు వీలు కల్పించినట్లు ఇరాన్ రాయబారి మెహమ్మద్ ఫతాలీ శుక్రవారం ప్రకటించారు. భారత్‌కు ఈ భరోసా కల్పించిన కొద్ది గంటల్లోనే ఈ రెండు ఎల్‌పిజి నౌకల కదలికలకు ఇరాన్ నుంచి అనుమతి రావడం కీలక పరిణామం అయింది. దీనితో ఈ మార్గం నుంచి సంబంధిత వంటగ్యాసు ట్యాంకర్ల నౌకలు వెంటనే బయలుదేరనున్నాయి. బారతదేశంలో నెలకొంటున్న వంటగ్యాసు కొరత కొంత మేర తగ్గేందుకు ఈ నౌకల రాక అత్యంత ఉపయుక్తం కానుంది. ఈ మార్గంలో భారత్‌కు ఈ నౌకలు ఎటువంటి చిక్కులు లేకుండా ఇరాన్ తగు చర్యలను చేపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ట్యాంకర్ నౌకలలో ఏ స్థాయిలో సిలిండర్లు ఉన్నాయనేది వెల్లడికాలేదు. 

మన తెలంగాణ 13 Mar 2026 10:26 pm

திமுக மாநாட்டில் உதயநிதியை புறக்கணித்தாரா அமைச்சர் கே.என்.நேரு?

திமுக மாநாட்டில் உதயநிதி அமைச்சர் கே.என்.நேரு புறக்கணித்ததாக தவறான தகவலுடன் வீடியோ வைரலாகி வருகிறது

తెలుగు పోస్ట్ 13 Mar 2026 10:21 pm

కోల్‌కతా టీమ్‌లోకి జింబాబ్వే ఫాస్ట్ బౌలర్..

కోల్‌కతా: త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానిని జట్టులోకి తీసుకొంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ స్థానంలో మరో స్పీడ్‌స్టర్ ముజరబానికి టీమ్‌లో చోటు కల్పించింది. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో ముజరబాని అసాధారణ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఆరు మ్యాచుల్లోనే 13 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో అతన్ని జట్టులోకి తీసుకనేందుకు కోల్‌కతా ఆసక్తి చూపించింది. ఆ జట్టు క్రికెట్ బోర్డుతో మాట్లాడి ముజరబానిని జట్టులో చోటు కల్పించింది. కొంత కాలంగా ముజరబాని అద్భుత బౌలింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. తన మార్క్ బౌలింగ్‌తో చెలరేగుతూ వికెట్ల పంట పండిస్తున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ జింబాబ్వేకు కీలక బౌలర్‌గా మారాడు. స్వల్ప వ్యవధిలోనే 90కి పైగా అంతర్జాతీయ వికెట్లను పడగొట్టి ఔరా అనిపించాడు. తాజాగా ఐపిఎల్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. ముస్తఫిజుర్ స్థానంలో కోల్‌కతా అతన్ని తీసుకుంది. త్వరలోనే ముజరబాని కోల్‌కతా జట్టులోచేరనున్నాడు. ఈ విషయాన్ని నైట్‌రైడర్స్ యాజమాన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

మన తెలంగాణ 13 Mar 2026 10:07 pm

​మహిళా సాధికారతతోనే సమాజ వికాసం: ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు

విశాలాంధ్ర-​రాప్తాడు : మహిళా సాధికారత, సమానత్వం, గౌరవం ప్రతి మహిళా స్వతంత్రంగా పొందే హక్కు అని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పురుషులపై ఉందని ఆర్డీటీ బుక్కరాయసముద్రం రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం రాప్తాడు ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసులో అనంతసిరి మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల నెట్‌వర్క్ లీడర్లతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంత సిరి మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ […] The post ​మహిళా సాధికారతతోనే సమాజ వికాసం: ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 9:57 pm

నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయండి –నాగబాబు

విశాలాంధ్ర – భోగాపురం : నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శాసనసభ్యులు లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన కృషి […] The post నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయండి – నాగబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 9:50 pm

మహిళా సాదికారతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాదికారతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఊర్కొండ, ఆంధ్రప్రభ : మహిళా

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:48 pm

వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు

విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి […] The post వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 9:46 pm

‘ది ప్యారడైజ్’ కోసం భారీ సెట్లు..

‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ఆయా షేర్ పాట కోసం 2.5 ఎకరాల భారీ సెట్స్‌లో వందల ఇళ్లు,100 ట్యాంకర్లతో మురికివాడ సామ్రాజ్యాన్ని నిర్మించారు ‘ది ప్యారడైజ్’ మేకర్స్. అత్యంత ఆకట్టుకునే సెటప్‌లలో ఒకటి హీరో ఇల్లు (కమాన్ సెట్). ఈ నిర్మాణం వెడల్పు 60 అడుగులు, ఎత్తు 45 అడుగులు, లోతు 25 అడుగులతో నిర్మించబడింది. మొదట ఈ సెట్‌ను 30 అడుగుల వెడల్పుతో నిర్మించగా, తర్వాత ఇరువైపులా 15 అడుగుల చొప్పున విస్తరించి మొత్తం వెడల్పును 60 అడుగులకు పెంచారు. దాదాపు 25 మంది కార్మికులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సెట్ చుట్టుపక్కల వాతావరణంలో సహజంగా కలిసిపోయేలా ప్రత్యేక ఏజింగ్ టెక్నిక్స్ ఉపయోగించి దాన్ని మరింత సహజంగా కనిపించేలా తీర్చిదిద్దారు. ఇక వాటర్ బాడీ విలేజ్ సెట్ మరో హైలెట్. ఇది 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో డమ్మీ నిర్మాణాలు కాకుండా పూర్తిగా నిర్మించిన 60 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి ఈ గ్రామాన్ని నిర్మించారు. ఒకేసారి సుమారు 500 మంది ఉండేలా ఈ గ్రామాన్ని డిజైన్ చేశారు. వాటర్ బాడీ కోసం 100 ట్యాంకర్ల నీటిని తీసుకువచ్చి ఏడు రోజుల పాటు నింపారు. అదనంగా నీటిని నిల్వ ఉంచేందుకు 20 అడుగులు ప్లస్ 20 అడుగుల పరిమాణంతో, 20 అడుగుల లోతు ఉన్న ఒక చెరువును కూడా నిర్మించారు. నిర్మాణంలో భాగంగా మరో భారీ డంప్ యార్డ్ సెట్ కూడా నిర్మించారు. ఇది 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో రూపొందించబడింది. దాదాపు 25 మంది సభ్యులతో కూడిన బృందం 30 రోజుల పాటు శ్రమించి ఈ సెట్‌ను నిర్మించింది. నిజమైన డంప్ యార్డ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సహజమైన, నివసిస్తున్నట్లు అనిపించే లుక్ వచ్చేలా దీనిని డిజైన్ చేశారు.

మన తెలంగాణ 13 Mar 2026 9:46 pm

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు కర్నూల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:43 pm

ఇరాన్ ప్రతీకారం.. అమెరికా మిత్రదేశాలకు ఆర్థిక దిగ్బంధం

జలమార్గంలో ఇరాన్ మరో టెర్రర్ అత్యంత కీలక బాబ్ జలసంధి మూసివేత ఇక గల్ఫ్ దేశ నౌకలు చుట్టు తిరిగి పోవల్సిందే టెహరాన్: పర్షియా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ మరో తీవ్ర చర్యకు దిగింది. మరో అత్యంత కీలకమైన సముద్ర జల నౌకారవాణా మార్గం బాబ్ ఎల్ మందెబ్ జలసంధిని కూడా మూసివేస్తామని ఇరాన్ సంకేతాలు వెలువరించింది. అమెరికా, మిత్రదేశాలపై తమ ప్రతీకార చర్యలలో భాగంగా తాము సాగిస్తున్న సముద్ర జలాల పోరు క్రమంలో ఈ విస్తారిత చర్యకు దిగుతామని ఇరాన్ సీనియర్ సైనికాధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. తమ దేశంపై దాడులతో అమెరికా పెద్ద తప్పు చేసింది. ఇందుకు మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పుడు ఏకకాలంలో రెండు కీలక జలమార్గాలలో నౌకారవాణా నిలిచిపోతుంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఇంధన తీవ్ర సంక్షోభం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిలోని పరిస్థితిని ఇప్పుడు బాబ్ ఎల్ జలసందిలోనూ చూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతం కూడా ఇక ప్రస్తుత యుద్ధం పరిధిలోకి వస్తుంది. ఇరాన్ వద్ద శత్రువును దెబ్బతీసే మరెన్నో ఆయుధాలు ఉండనే ఉన్నాయి. పలు వ్యూహాత్మక చర్యలతో అమెరికా, ఇజ్రాయెల్‌లను దెబ్బతినేలా చేస్తామని ఇరాన్ ప్రతినిధి హెచ్చరించారు. ఇప్పుడు తాము ప్రకటించిన మార్గాలలో అమెరికా లేదా ఇజ్రాయెల్ కొన్ని నిర్ణీత దేశాలు లీటర్ చమురును కూడా తీసుకువెళ్లలేవని ఇరాన్ ప్రతినిధి తెలిపారు. తమ మిత్రదేశాలైన గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాల నౌకలకు కూడా తమ హెచ్చరిక వర్తిస్తుందని ప్రకటించారు. బాబ్ జలసంధి 26 కిలో మీటర్ల వెడల్పు ఉండే జలమార్గం ఎర్రసముద్రానికి దారితీసే ఈ మార్గం యెమెన్ , జిబౌటిలను కలుపుతుంది. గల్ఫ్ చమురు ఉత్పత్తి దేశాలకు ఈ మార్గం అత్యంత ఆయువుపట్టు అయిన మార్గంగా ఉంది. ఇది కూడా ఇరాన్ ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతంలోని హౌతి శక్తులతో కలిసి ఇరాన్ ఇక్కడ తన ఆధిపత్యం చాటుకొంటోంది. ప్రత్యేకించి పర్షియన్ గల్ఫ్ నుంచి యూరప్ దేశాలకు అతి తక్కువ దూరం మార్గం ఈ జలసంధి కావడం, సూయజ్ కెనాల్‌కు కూడా మార్గం ఉండటంతో ఇక్కడ ప్రయాణం నిలిచిపోతే గల్ఫ్, యూరప్ దేశాలకు చిక్కులు ఏర్పడుతాయి. గమ్యం చేరుకోవాలంటే నౌకలు చుట్టుతిరిగి కెప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు రెండు వారాలకు పైగా క్లిష్ట ప్రయాణం దీనితో పాటు ప్రతి ప్రయాణానికి 1 మిలియన్ డాలర్ల వరకూ అదనపు వ్యయ భారం పడుతుంది. 

మన తెలంగాణ 13 Mar 2026 9:42 pm

అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్ల రవాణా..

అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్ల రవాణా.. అక్రమంగా తరలిస్తున్న 15 కమర్షియల్ సిలిండర్లు

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:38 pm

నన్ను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేసి రాష్ట్రపతి విందుకు ఆహ్వానిస్తారా ?: ఎంపి చామల

లోక్‌సభ నుంచి నన్ను సస్పెండ్ చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే అల్పాహార విందుకు ఆహ్వానిస్తారా ? అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విస్మయం చెందారు.ఈ నెల 16న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే అల్పాహార విందుకు రావాల్సిందిగా తనను ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని ఆయన శుక్రవారం మీడియాకు తెలిపారు. తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అయితే తనను సస్పెండ్ చేసి ఎలా ఆహ్వానిస్తున్నారని తాను సదరు వ్యక్తిని సున్నితంగా అడిగానని ఎంపీ చామల చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్యులే తీసుకొచ్చిన తీర్మానం ద్వారా తనను లోక్‌సభ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకుని పంపిన లోక్‌సభలో నుంచి సస్పెండ్ చేసిన తర్వాత రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక అల్పాహార సమావేశానికి తాను ఎలా హాజరుకాగలనని ఆయన తెలిపారు. భువనగిరి ప్రజలు లోక్‌సభలో మాట్లాడేందుకు ఎన్నుకున్నారని, ప్రభుత్వం తనను సభకు దూరంగా ఉంచినప్పుడు బయట జరిగే కార్యక్రమాలకు వెళ్ళేందుకు మనస్కరించదని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 9:36 pm

ఐపిఎల్‌పై గల్ఫ్ యుద్ధం ప్రభావం!

ముంబై: త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 226పై గల్ఫ్ యుద్ధం ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుఎఇతో సహా పశ్చిమాసియాలోని పలు దేశాలపై ఇరాన్ వైమానిక దాడులతో విరుచు పడుతోంది. దీంతో దుబాయితో సహా రియాద్, దోహా, మస్కత్, కువైట్ తదితర నగరాల్లో పరిస్థితులు చేతులు దాటాయి. దీంతో ఈ నగరాలలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసి వేశారు. దీంతో దుబాయి తదితర ఎయిర్ పోర్ట్‌ల నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగోంది. ఇటీవల భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత స్వదేశానికి వెళ్లేందుకు వెస్టిండీస్, సౌతాఫ్రికా, జింబాబ్వే, ఇంగ్లండ్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొక తప్పలేదు. రోజుల తరబడి దుబాయిలోనే ఉండి పోవాల్సి వచ్చింది. కాగా, మరికొన్ని రోజుల్లోనే ఐపిఎల్ ప్రారంభం కావాల్సి ఉన్న సమయంలో గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నిర్వాహకులను కలవరానికి గురి చేస్తున్నాయి. విమానాల రాక పోకలపై అనిశ్చితి వాతావరణం నెలకొన్న సమయంలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు భారత్‌కు రావడం క్లిష్టంగా మారింది. టోర్నీప్రారంభానికి ముందు వీరి భారత్‌కు చేరుకుంటారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. దీనికి తోడు గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఇంధన సమస్య నెలకొంది. పలు నగరాల్లో ఇప్పటికే హోటళ్లు మూత పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఐపిఎల్‌లో పాల్గొనే క్రికెటర్లకు సౌకర్యాలు కల్పించడం నిర్వాహకులకు ఇబ్బందిగామారింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఐపిఎల్ సజావుగా సాగడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. కాగా, భారత క్రికెట్ బోర్డు మాత్రం ఐపిఎల్ ప్రారంభానికి ముందు యుద్ధం ఆగిపోతుందనే నమ్మకంతో ఉంది. త్వరలోనే పరిస్థితులు మాములుగా మారిపోతాయని, మెగా టోర్నీ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే నమ్మకంతో బిసిసిఐ పెద్దలు ఉన్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 9:32 pm

పండగలా అన్నదాత సుఖీభవ

The post పండగలా అన్నదాత సుఖీభవ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 9:30 pm

తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

 తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూ రు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోలేమని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని అంశా లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తాము సిబిఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని కోర్టు ఈ సంద ర్భంగా గుర్తు చేసిం ది. ఏదైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే నేరుగా సిబిఐ అధికారులకే తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది. గతంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై సిబిఐ ఎటువంటి విచారణ జరపలేదని పిటిషనర్ పేర్కొనగా దర్యాప్తు సంస్థ తన పని తాను చేస్తోం దని ధర్మాసనం అభిప్రా యపడింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించాయి. ఈ అంశంపై కొందరు రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఇప్పటికే ఈ లడ్డూ వివాదంపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యా ప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని సిజెఐ ధర్మాసనం వెల్లడించింది. సిట్ విచారణ నివేదిక అంశాల పరిశీలన తరువాత తదుపరి నిర్ణయాలు ఉంటాయని కోర్టు తెలిపింది. ఈ విషయంపై ఎపి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి సిట్ నివేదికతో పాటు లడ్డూ వివాదంపై ప్రభుత్వా నికి సమగ్ర నివేదిక అందిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇలాంటి పిటిషన్లను విచారించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

మన తెలంగాణ 13 Mar 2026 9:30 pm

Flex Banner Sparks Fresh Political Tension in Pithapuram

Political tensions have resurfaced in the Pithapuram constituency of Andhra Pradesh after an incident at a municipal training programme triggered controversy. The issue occurred during a sanitation workers’ training session organised by municipal authorities. TDP leader and constituency in-charge SVSN Varma attended the event but walked out midway after expressing strong displeasure over the flex […] The post Flex Banner Sparks Fresh Political Tension in Pithapuram appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 9:27 pm

ఫుట్‌బాల్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిన 25ఏళ్ల ప్లేయర్..

చండీగఢ్: పంజాబ్‌కు చెందిన యువ ఫుట్‌బాల్ అటగాడు రవీందర్ సింగ్ (25) అకాల మరణం చెందాడు. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఐఎఫ్‌ఎల్)లో నాంధారి క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీందర్ స్థానికంగా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ మైదానంలోనే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గుండె నొప్పి రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. రవీందర్ ను పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని ప్రకటించారు. కాగా, రవీందర్‌కు నివాళులు అర్పించేందుకు ఐఎఫ్‌ఎల్‌లో ఆడే ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లు అతని స్వగ్రామం నవాన్‌షహ్రకు చేరుకున్నారు. కాగా, రవీందర్ మృతితో భారత ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది.

మన తెలంగాణ 13 Mar 2026 9:27 pm

ఇరాన్ ఎంబసీకి 45 ఇరాన్ సైనికుల మృతదేహాల అప్పగింత

కొలంబో: శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై అమెరికా సబ్‌మెరైన్ చేసిన దాడిలో మృతులైన ఇరాన్ సైనికులకు సంబంధించి 45 మృతదేహాలను ఇరాన్ దౌత్య కార్యాలయానికి శ్రీలంక శుక్రవారం అప్పగించింది. గాలే హార్బర్ పోలీస్ అభ్యర్థనపై చీఫ్ మెజిస్ట్రేట్ సమీర డొడన్‌గొడ కరపితీయ లోని నేషనల్ హాస్పిటల్ డైరెక్టర్‌కు మార్చి 11న ఇరాన్ సైనికుల మృతదేహాలను అప్పగించాలని ఆదేశించారు. అమెరికా సబ్‌మెరైన్ దాడితో మునిగిపోయిన ఇరాన్ నౌక నుంచి 84 ఇరాన్ సైనికుల మృతదేహాలను వెలికి తీయడమైందని శ్రీలంక వివరించింది. ఈ మృతదేహాలతోపాటు సజీవంగా ఉన్న 32 మందిని గత గురువారం ఆస్పత్రి నుంచి తీసుకు రావడమైందని శ్రీలంక రక్షణ మంత్రిత్వ కార్యదర్శి సంపత్ దులియకొంత విలేకరులకు వెల్లడించారు.

మన తెలంగాణ 13 Mar 2026 9:17 pm

‘అల్లు సినిమాస్’.. ప్రపంచంలోనే మూడోది

ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్‌ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించినట్లు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ గర్వంగా ప్రకటించింది. హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్’ రికార్డ్ సృష్టించింది. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే అనుభూతి గురించి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. “రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. ‘అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్‌ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసి నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్ కట్టాలని అనిపించింది. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని అనుభూతి పొందాలని అనుకుంటున్నారు. అప్పుడు నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. లార్జ్ ఫార్మాట్, కొత్త అనుభూతి కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్’ మొదలైంది. సింగిల్ స్క్రీన్లలో వస్తున్న అనుభూతి ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కువగా మల్టీ ప్లెక్స్‌లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని అనుభూతి పొందాలని జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ అనుభూతినివ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. డాల్బీలోకి మారిన సినిమా విజువల్ పరంగా, సౌండ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 2024లో మేం డాల్బీని సంప్రాదించాం. డాల్బీ సినిమాస్ ఇండియా ప్రతినిథి రాజ్ మాకు ఎంతో సహకరించారు. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీం వారు ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమాగా నిలిచింది. ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా కాకుండా మిగిలిన మూడు ఆడిటోరియంలలో బార్కో 4కె లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ ఉన్నాయి. డాల్బీ-బ్రాండెడ్ ప్రీమియం స్పీకర్లు, స్టేడియం సీటింగ్ ఉన్నాయి. నాలుగు స్క్రీన్‌లలో రిక్లైనర్లు, లాంజర్‌లు అమర్చబడి ఉన్నాయి. చివరి వరుస రిక్లైనర్‌లతో స్క్రీన్‌లు 2, 3, 4 అంతటా 717 అదనపు సీట్లు, తదుపరి తరం 3డి సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రతీ స్క్రీన్‌లో ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభవం కలిగేలా సాంకేతికతను అమర్చాము” అని అన్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 9:06 pm

West Asia war crisis : దాడి..ప్ర‌తిదాడి Andhra Prabha News

West Asia war crisis : దాడి..ప్ర‌తిదాడి Andhra Prabha News ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:04 pm

ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి

ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : కర్నూలు

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:04 pm

విశ్వ విద్యాలయాలు .. విద్యార్థులకు దిక్సూచి

విశ్వ విద్యాలయాలు .. విద్యార్థులకు దిక్సూచి కర్నూలు, బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వవిద్యాలయాలు

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:59 pm

Media Left Stunned By Biker Teaser’s Dolby Power

The media attending the Dolby Cinema showcase at Allu Cinemas didn’t expect one film to steal the spotlight, but that’s exactly what happened when Charming Star Sharwa’s Biker teaser appeared on-screen. What started as a general technical demonstration suddenly turned into a moment of surprise for journalists as the hall exploded with the deep, powerful […] The post Media Left Stunned By Biker Teaser’s Dolby Power appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 8:54 pm

పశ్చిమాసియాలో భీకర దాడులు.. టెహరాన్ స్వేర్‌లో భారీ పేలుళ్లు

దుబాయ్‌పై ఇరాన్ భీకర దాడులు గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల ధ్వంసం దుబాయ్ ఇంటర్నేషనల్ సెంటర్‌పై దాడి దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత భీకరం అయింది. గల్ఫ్‌లో ఇరాన్ తీవ్రదాడుల సమయంలోనే శుక్రవారం టెహరాన్‌లోని టెహరాన్ స్కేర్‌లో బారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇక్కడ దాడులకు దిగినట్లు వెల్లడైంది. టెహరాన్ యూనివర్శిటీ దగ్గరిలోని ఇంగెలాబ్ స్ట్రీట్ వద్ద ఉన్న టెహరాన్ ఫిరదౌసి స్వేర్ వద్ద వరుసగా భీకర పేలుళ్లు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు,ప్రత్యేకించి చిన్నారులను చంపివేయడాన్ని నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున గుమికూడిన దశలోనే దాడులు జరిగాయి. వార్షిక క్వాడ్స్ దినం సందర్భంగా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపే ప్రదర్శన దశలోనే జనం పెద్ద ఎత్తున గుమికూడారు. పేలుళ్లు జరుగుతున్నప్పటికీ జనం వస్తూనే ఉన్నారని వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చావు తప్పదని నినదించారు. పేలుళ్లు దాడుల ఈ ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని వెల్లడైంది. అయితే ఎందరు చనిపోయి ఉంటారు? ఎందరికి గాయాలు అయ్యాయి ? తరువాతి పరిస్థితి ఏమిటనేది వెంటనే నిర్థారణ కాలేదు. తమ పతీకార దాడులు తీవ్రతరం అని చెప్పిన ఇరాన్ అత్యంత వ్మూహాత్మకంగా పలు ప్రాంతాల్లో జరిపిన దాడులు పలు కీలక అనంతర పరిణామాలకు దారితీశాయి టెహరాన్ , మరో నగరం ఖజ్విన్‌లోనూ దాడులు తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ముందుగానే ప్రకటించారు. ఇరాన్ సైనిక వ్యవస్థను దెబ్బతీస్తామని వేర్వేరుగా ట్రంప్ , నెతన్యాహు హెచ్చరించారు. అయితే ఈ క్రమంలోనే ఇరాన్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, అక్కడి ఎయిర్‌పోర్టులను. చమురు క్షేత్రాలను లక్షంగా ఎంచుకుని దాడులు ఉధృతం చేసింది. ఇరాన్ సుప్రీంనేత మొజ్తబా ఖమేనీ హెచ్చరికల తరువాత ఇరాన్ శుక్రవారం ఉదయం గల్ఫ్‌లోని అరబ్ దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. సౌదీ అరేబియాలో పలు ప్రాంతాల్లో డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దుబాయ్‌లోని పలు భవనాలపై ఇరాన్ దాడులు జరిగాయి. మరో సారి బుర్జ్ ఖలీఫా వద్ద కూడా డ్రోన్లు పడ్డాయి. అయితే ఇవన్ని చిన్న ఘటనలే అని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో తమ దాడుల ఉధృతి అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల ధ్వంసానికి ఇరాన్ ప్రయోగించిన దాదాపు 50 డ్రోన్లను సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి. ఒమన్‌లోడ్రోన్ల దాడులలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అక్కడి సోహర్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ల దాడితో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక్కడ నేలకూలినడ్రోన్ల శకలాలు ధాటికి ప్రజలు గాయపడ్డారు. బహరైన్‌లో భారీ స్థాయిలో సైరన్లు మోగాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫెనాన్సియల్ సెంటర్‌లోని అమెరికా స్థావరాలను ఎంచుకుని ఇరాన్ దాడులు జరిగాయి. ఈ ప్రాంతాన్ని అత్యంత కీలకమైన డిఐఎప్‌సి జోన్‌గా వ్యవహరిస్తారు. ఇక్కడ బ్యాంకులు, వాణిజ్య కేంద్రాలు, షేర్ల వ్యాపార కార్యాలయాలు ఎక్కువగా ఉంటాయి. రెస్టారెంట్లు, సంపన్నుల నైట్‌క్లబ్‌లతో సందడిగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడి దాడులతో కలవరం చెలరేగింది. పశ్చిమ ఇరాక్‌లో అమెరికా సైన్యానికి చెందిన కెసి 135 రిఫ్యూయలింగ్‌విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికా సిబ్బంది మృతి చెందారని అమెరికా సైన్యం తెలిపింది. ఇరాక్ సేనలుపొరపాటున ఈ నౌకను దెబ్బతీశాయా? లేక ఇరాన్ దాడులు సాగించిందా? అనేది నిర్థారణ కాలేదు. తాము ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. శత్రువు లేదా పొరపాటు దాడులు జరిగి ఉంటాయని తాము అనుకోవడం లేదని, ఇది ప్రమాదం అయి ఉంటుందని తెలిపారు. ఇరాన్‌పై శుక్రవారం దాడులను తీవ్రతరం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహరాన్‌తో పాటు 200కు పైగా చోట్ల ఇరాన్ వైమానిక దాడులు సాగాయి. ఇక ఒమన్‌లో శుక్రవారం ఓ డ్రోన్ కూలిన ఘటనలో ఇద్దరు విదేశీయులు మృతి చెందారు. వీరి గుర్తింపు తెలియలేదు. ఇరాన్ జరిపిన దాడులలో అమెరికాకు చెందిన విమానవాహక నౌక అబ్రహాం లింకన్ గల్ఫ్ జలాల్లో ధ్వంసం అయింది. పనిచేయకుండా పోయిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ తెలిపాయి. అయితే ఈ వాదనను అమెరికా ఖండించింది. తమ బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఈ ఈ నౌకను దెబ్బతీశామని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దీనిని యుఎస్ సైన్యం కొట్టిపారేసింది. హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకల కదలికలు భారతీయ పతాకంతో కూడిన ఓ చమురు రవాణా నౌక శుక్రవారం హర్మూజ్ జలసంధి మీదుగా ఆఫ్రికాకు క్షేమంగా వెళ్లింది. భారతీయ జెండా వల్ల ఇరాన్ దాడుల నుంచి తప్పించుకుంది. ఇక ఈ ఉద్రిక్తతల జలాల్లో ఇప్పటికీ మరో 27 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. వీటిలో అంతా కలిపి 700 మంది వరకూ భారతీయ నావికులు ఉన్నారని నిర్థారించారు. ఈ నౌకలను కూడా ఇక్కడి జల మార్గం ద్వారా వెలుపలికి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటివరకూ హర్మూజ్ ప్రాంతంతో జరిగిన దాడులలో ముగ్గురు భారతీయ నావికుల మృతి చెందారు, ఒకరు గల్లంతు అయ్యారు.

మన తెలంగాణ 13 Mar 2026 8:47 pm

తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల బాసర, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:44 pm

Ken Karunaas’ Youth releasing in Telugu on March 26th

Ken Karunaas’ upcoming film Youth has generated good buzz in Tamil, thanks to chartbuster songs composed by GV Prakash and an impressive trailer. Dhanush attended the film’s pre release event today, raising the buzz to next level. The film is now set to release in Telugu on March 26th. The Telugu theatrical release will be […] The post Ken Karunaas’ Youth releasing in Telugu on March 26th appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 8:38 pm

ఇరాన్‌ను తుడిచేస్తాం.. ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: ఇక ఇరాన్‌ను ఏ కోశానా ఉపేక్షించేది లేదు. మరింత జోరుగా దెబ్బతీస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గల్ఫ్ దేశాలపై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర ప్రతీకార దాడులు, చమురు సరఫరా వ్యవస్థలకు ఆటంకాల దశలో ట్రంప్ హెచ్చరిక వెలువడింది. ‘ ఇప్పుడు ఈ నీచులకు, రక్తం మరిగిన రాకాసి నల్లులకు ఏం జరుగుతున్నదో చూడండి. వీరిని ఏరిపారేశాం. పూర్తిగా తుడిచిపెట్టేస్తాం’ అని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇరాన్ నూతన నేత మొజ్తబా ఖమేనీ తొలిసారిగా సందేశం వెలువరించడం,ఇందులో అమెరికాపై ప్రతీకార దాడులు నిలిపేదిలేదని, తమ కక్ష తీర్చుకుంటామని చెప్పిన తరువాత ట్రంప్ స్పందించారు. శుక్రవారం ఇరాన్ తెల్లవారుజాము నుంచే గల్ఫ్ దేశాలపై బహుముఖ దాడులకు దిగింది. ప్రత్యేకించి సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, అక్కడి అమెరికా సైనిక స్థావరాలను లక్షంగా పెట్టుకుంది. దీనికి ప్రతిగానే ట్రంప్ మాట్లాడినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్‌కు ఏమి మిగిలి ఉంది. నాయకత్వం పోయింది. వారి నౌకాదళం కొట్టుకుపోయింది. వారి వాయుసేన బలం దెబ్బతింది. డీలా పడింది. వారి మిస్సైళ్లు, డ్రోన్ల సంఖ్య తగ్గిపోతోంది. అవి పనిచేయకుండా పోతున్నాయి. . సర్వనాశనం అవుతోంది. వారి నాయకులు ఈ భూమి మీద లేకుండా పొయ్యారు. ఇక వారికి మిగిలిందేముంది. ఇక మరింత తీవ్రస్థాయి దాడులతో ఇరాన్‌పై విరుచుకుపడుతామని ట్రంప్ ప్రకటించారు.

మన తెలంగాణ 13 Mar 2026 8:36 pm

డొమెస్టిక్ గ్యాస్ కొరతపై అపోహలు వద్దు

డొమెస్టిక్ గ్యాస్ కొరతపై అపోహలు వద్దు వినియోగదారుల రక్షణ చట్టం అమలుపై అవగాహన

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:33 pm

ఎల్‌పీజీ సంక్షోభం...పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన

న్యూఢిల్లీ : ఎల్‌పిజి సంక్షోభంపై శుక్రవారం విపక్ష ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లలో నిరసన పాటించారు. ఈ సంక్షోభానికి కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్‌పురి, ప్రధాని నరేంద్రమోడీ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పార్లమెంట్ భవనం బయట శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో టిఎంసి ఎంపీలు నిరసన ప్రారంభించారు. “ఎల్‌పిజి సంక్షోభం” అని రాసి ఉన్న పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. “గ్యాస్ సిలిండర్లు ఎక్కడకు వెళ్లాయి ” అని ప్రశ్నిస్తూ పాలకవర్గం బీజేపీని నిలదీశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎంపీలు,ఇండియా కూటమికి చెందిన ఇతర ఎంపీలు కలిశారు. గ్యాస్ సిలిండర్లతోపాటు ప్రధాని మోడీ అదృశ్యమయ్యారని, ఆయన పూర్తిగా లొంగిపోయారని ధ్వజమెత్తారు. “దేశంలో ఎల్‌పిజి సంక్షోభం తీవ్రంగా ఉంది.బెంగాల్‌లో కూడా ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరఫరా వ్యవస్థలకు కుప్పకూలడంతో ప్రజలు చాలా బాధపడుతున్నారు. మాన్యువల్ బుకింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. ” అని టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. “ మీకు కుటుంబాలు ఉన్నాయి. వృద్ధులు, తల్లిదండ్రులు, సిలిండర్లను బుక్ చేసుకోవడానికి క్యూల్లో నిరీక్షిస్తున్నారు. రెండున్నర రోజుల్లో సిలిండర్లు లభ్యమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం ఎక్కడ రెండున్నర రోజుల్లో బుకింగ్‌లో సిలిండర్లు లభ్యమవుతున్నాయో ప్రధానిని ,మంత్రులను వెళ్లి చూడాలని సవాలు చేస్తున్నాను” అని ఆమె సవాలు విసిరారు. “దేశంలో 75 రోజులకు సరిపడా నిల్వలున్నాయని పెట్రోలియం మంత్రి దేశానికి అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు అత్యావసరాల చట్టాన్ని కూడా అమలు లోకి తెచ్చారు. కేవలం 25 రోజుల్లో లభ్యమవుతాయని అంటున్నారు. మనకన్నీ అబద్ధాలే చెప్పారు. ప్రధాని ఎక్కడ ?గత ఐదు రోజులుగా ప్రధాని సభకు రావడం లేదు. ఈ సంక్షోభం లో కూడా ఆయన కేరళలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటున్నారు. ఆయన ప్రధానిలా కాకుండా ఎన్నికల యంత్రంలా తయారవుతున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు ” అని మొయిత్రా విరుచుకుపడ్డారు. కొంతమంది విపక్ష ఎంపీలు గ్యాస్ సిలిండర్ల భారీ కటౌట్లు పట్టుకోగా,మరికొందరు సిలిండర్లు, నినాదాలతో ఉన్న పోస్టర్లు పట్టుకున్నారు. “ మోడీ జీ ఎల్‌పీజీ ” అని నినాదాలు చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇండియా కూటమి ఎంపీలు ప్రయత్నించారు. పశ్చిమాసియా సంక్షోభం, భారత్‌పై దాని ప్రభావంపై పూర్తి చర్చ జరగాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందవద్దని, ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కమర్షియల్ ఎల్‌పిజి సరఫరా దెబ్బతిని హోటల్ రంగం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఎల్‌పీజీ సంక్షోభం పరిష్కారం అవుతుందన్న నమ్మకాన్ని ప్రధాని వెలిబుచ్చారు. 

మన తెలంగాణ 13 Mar 2026 8:31 pm

మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు..

మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు.. మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:28 pm

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజలకు

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:24 pm

విషాదం: ఫుట్‌బాల్ ఆడుతూ ప్రాణాలు విడిచేశాడు..

పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ.. ఓ కుర్రాడు ప్రాణాలు విడిచాడు. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌(ఐఎఫ్ఎల్)లోని నాంధారి ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పాతికేళ్ల రవీందర్ సింగ్ మృతి చెందాడు. స్థానికంగా జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నీలో రవీందర్ సింగ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఫుట్‌బాల్ క్లబ్‌లు అతడి మృతికి సంతాపం తెలిపాయి. ఐఎఫ్ఎల్‌లో జరగబోయే మ్యాచ్‌ల సమయంలో ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్వాహకులు ప్రకటించారు. రవీందర్ సింగ్ స్వగ్రామం నవాన్‌షహ్ర జిల్లాలోని బచౌరి. అక్కడే ఆటగాడి అంత్యక్రియలు జరిగాయి. అతడిని చివరిసారిగా చూసేందుకు సహచర ప్లేయర్లు ఫుట్‌బాల్ అభిమానులు భారీగా తరలివచ్చారు. నాంధారి క్లబ్ రవీందర్‌కు నివాళి అర్పిస్తూ.. సోషల్‌మీడియాలో వీడియోని షేర్ చేసింది. మినెర్వా పంజాబ్, గోకులం కేరళ, బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌లు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.

మన తెలంగాణ 13 Mar 2026 8:20 pm

టిజిఎస్‌ఆర్టీసిలో సమ్మె

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో యాజమాన్యానికి, కార్మిక శాఖ కమిషనర్‌కు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. టిజిఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయడంతో పాటు 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని కార్మిక జెఏసి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లపై గత కొన్ని నెలలుగా కార్మిక సంఘాల జేఏసి యజమానపైనా, ప్రభుత్వంపైనా ఒత్తిడి తెస్తున్నా లెక్క చేయకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సమ్మె తేదీపై 14 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేషీలో నోటీసులు ఇచ్చారు. లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ నోటీసులు అందజేసినట్లు జేఏసి వర్గాలు తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని జేఏసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఈవీ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని సమ్మె నోటీసు ఇచ్చే ముందు బస్ భవన్ వద్ద జేఏసి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

మన తెలంగాణ 13 Mar 2026 8:10 pm

హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకల కదలికలు

భారతీయ పతాకంతో కూడిన ఓ చమురు రవాణా నౌక శుక్రవారం హర్మూజ్ జలసంధి మీదుగా ఆఫ్రికాకు క్షేమంగా వెళ్లింది. భారతీయ జెండా వల్ల ఇరాన్ దాడుల నుంచి తప్పించుకుంది. ఇక ఈ ఉద్రిక్తతల జలాల్లో ఇప్పటికీ మరో 27 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. వీటిలో అంతా కలిపి 700 మంది వరకూ భారతీయ నావికులు ఉన్నారని నిర్థారించారు. ఈ నౌకలను కూడా ఇక్కడి జల మార్గం ద్వారా వెలుపలికి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటివరకూ హర్మూజ్ ప్రాంతంతో జరిగిన దాడులలో ముగ్గురు భారతీయ నావికుల మృతి చెందారు, ఒకరు గల్లంతు అయ్యారు. శుక్రవారం 

మన తెలంగాణ 13 Mar 2026 7:58 pm

తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ […] The post తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 7:57 pm

సినీనటి అనసూయపై అసభ్య కామెంట్లు..ఇద్దరి అరెస్టు

 సినీనటి అనసూయపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని కడప జిల్లా, పులివెందుల మండలం, పెద్ద జూటూర్ గ్రామానికి చెందిన జనార్దన్ హైదరాబాద్‌లోని ఇందిరా నగర్‌లో ఉంటున్నాడు. సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఆటో డ్రైవర్ కొండాపురం అరుణ్ కుమార్. ఇద్దరు సోషల్ మీడియాలో సినీనటి అనసూయ భరద్వాజ్‌పై గత కొంత కాలం నుంచి అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్రీ టైంలో ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆమె క్యారెక్టర్‌ను దిగార్చే విధంగా కామెంట్ చేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అనసూయపై అసభ్య కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. అనసూయ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:54 pm

పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఏ,ఆర్ పల్లిలో, నాగదేవత విగ్రహం ప్రతిష్టాపన

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:51 pm

భారీ జిఎస్‌టి స్కామ్.. నిందితుడి అరెస్ట్

భారీ జిఎస్‌టి కుంభకోణాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ బట్టబయల్జేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన మోసపూరిత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను పొంది, దానిని బదిలీ చేశాడనే ఆరోపణలపై వాణిజ్య పన్నుల శాఖ ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్‌కెజి ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్ కుమార్ గోయెల్ కార్యకలాపాలపై విశ్వసనీయ నిఘా, వివరణాత్మక డేటా విశ్లేషణ ఆధారంగా అధికారులు దర్యాప్తు నిర్వహించారు. వస్తువుల వాస్తవ సరఫరా లేకుండా జారీ చేసిన ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి అతను ఐటిసిని పొంది, దానిని బదిలీ చేశాడని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) పొందినట్లు గుర్తించారు. సందీప్ కుమార్ గోయె ల్ హెచ్ ఎఫ్‌సి స్టీల్ ట్యూబ్స్ అండ్ వాల్వ్ యజమాని, విజయ్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఎల్‌ఎల్‌పిలో భాగస్వామి అని అధికారులు వెల్లడించారు, ఇక్కడ వస్తువులు, సేవలను వాస్తవంగా స్వీకరించకుండానే ఇలాంటి మోసపూరిత ఐటిసి క్లెయిమ్‌లు కనుగొన్నారు.ఈ క్రమంలో వాటి రిజిస్ట్రేష న్లు అధికారులు రద్దు చేశారు. జిఎస్‌టి చట్టం, 2017 నిబంధనల ప్రకారం సందీప్ కుమార్ గోయల్‌ను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నకిలీ ఇన్‌వాయిస్‌లు, మోసపూరిత ఐటిసి క్లెయిమ్‌లు, ఇతర జిఎస్‌టి చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలంగాణ వాణిజ్య పన్నుల కమిషనర్ వెల్లడించారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:47 pm

పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం…

పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం… కౌకుంట్ల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:45 pm

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు

–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు The post జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 7:43 pm

16నుండి పది పరీక్షలు

ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు -27,360 మంది విద్యార్థులకు 149 సెంటర్లు -పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు... కలెక్టర్ జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, డీఈవో […] The post 16నుండి పది పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Mar 2026 7:37 pm

ఐదు లీటర్ల గుడుంబా పట్టివేత.. విక్రయదారుడు అరెస్ట్

ఐదు లీటర్ల గుడుంబా పట్టివేత.. విక్రయదారుడు అరెస్ట్ చిట్యాల, ఆంధ్రప్రభ :మండలంలోనీ తిరుమలాపురంలో

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:34 pm

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 7:31 pm

ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు

ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:31 pm

రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిలుపూర్, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:25 pm

నెలసరి సెలవు తప్పనిసరి చేస్తే.. మహిళల కెరీర్‌కు ముగింపే

ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం కొలువుల భర్తీలోనూ ప్రతికూలతలు ఎదురవుతాయి సిజెఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన సిజెఐ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారంనాడు దానిని తిరస్కరించింది. సెలవును తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్ ముగుస్తుందన్నారు. వేతనంతో కూడిన నెలసరి సెలవు అంశంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని సిజెఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు ఇస్తే మహిళలను ఉద్యోగాల్లో తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం ఉందని అన్నారు. తద్వారా వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదని పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. వాలంటరీగా సెలవులు ఇవ్వడమనేది చెప్పుకోవడానికి బాగుటుంది కానీ చట్టం చేసి తప్పనిసరి చేస్తే వివిధ రంగాల్లోని ఉద్యోగాల భర్తీలో కూడా వాళ్లకు ప్రతికూలతలు ఉంటాయన్నారు. అదే విధంగా పురుషుల కన్నా తాము తక్కువ అనే భయ భావన వారిలో కలిగే అవకాశముందనారు. నెలసరి వల్ల ఏదో చెడు జరుగుతోంది అన్న విషయాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదని, అది మహిళలను ఆత్మనూన్యతకు గురిచేసేలా ఉంటుందని సిజెఐ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వాలు స్టేక్‌హోల్డర్లతో చర్చించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేరళ రాష్ట్రంలోని స్కూళ్లలో ఆడపిల్లలకు నెలసరి సెలవు ద్వారా వారికి ఊరటనిస్తున్నారని, కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాలంటరీగా అమలు చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా కూడా తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది షంషద్ వాదనలు వినిపిస్తూ.. 2013లో ప్రభుత్వ విశ్వవిద్యాలాయాల్లో నెలసరి సెలవురు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ప్రైవేటు కంపెనీలు అదే బాటలో పయనిస్తే బాగుంటుందన్నారు. ఈ సమయంలో సిజెఐ కలుగుజేసుకొని.. ఆ సమయంలో వారు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాలనీ, చట్టం చేయాలన్న డిమాండ్ విషయానికి వస్తే అది మహిళ కెరీర్ ముగింపునకు దారులు వేయడమేని అన్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:24 pm

పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘ఉస్తాద్’ బెనిఫిట్ ఫోలకు అనుమతి

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్‌ సినిమాపై ఎంతో క్రేజ్‌ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. ఎపిలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. మార్చి 19న తెల్లవారుజామున 4-5 గంటల మధ్య బెనిఫిట్‌ షోకి అనుమతి ఇవ్వగా.. దీని టికెట్ ధరను రూ.500 (ట్యాక్సులు కలిపి)గా నిర్ణయించారు. అలాగే పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.125 పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్ వచ్చింది. ఇక మూవీ రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా నిర్ణయించారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:24 pm

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ నాయకుల వినతి

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:13 pm

ICRAS సాధనాన్ని ప్రారంభించిన అబోట్

టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (T2DM) తో జీవించే వ్యక్తుల గుండె మరియు మూత్రపిండాల ప్రమాదాలను గుర్తించడంలో భారతదేశంలోని వైద్యులకు సహాయపడేందుకు, ఇంటర్నేషనల్ కార్డియో-రెనల్ రిస్క్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటిఫికేషన్ (ICRAS) అనే వినూత్న వెబ్ ఆధారిత సాధనాన్ని ప్రారంభించినట్లు గ్లోబల్ హెల్త్‌కే ర్ లీడర్ అబోట్ ప్రకటించారు. ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడిన ICRAS సాధనం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (T2DM) తో నివసించే వ్యక్తులలో కార్డియో-మూత్రపిండాల ప్రమాదాన్ని ప్రారంభంలోనే అంచనా వేయడానికి భారత వైద్యులకు సహాయపడుతుంది. ఈ బృందంలో డాక్టర్ సంజయ్ కల్రా, డాక్టర్ వి. మోహన్, డాక్టర్ అతుల్ ధింగ్రా, డాక్టర్ దీప్ దత్తా, డాక్టర్ దినేష్ ఖుల్లార్, డాక్టర్ జ్యోతిదేవ్ కేశవదేవ్, డాక్టర్ కెడి మోడీ, డాక్టర్ మనాష్ పి. బరువా, డాక్టర్ నితిన్ కపూర్, డాక్టర్ ప్రమీలా కల్రా, డాక్టర్ షెహ్లా షేక్ మరియు డాక్టర్ చిన్న నాయర్ ఉన్నారు. ICRAS సాధనం ముందస్తు రిస్క్ స్ట్రాటిఫికేషన్ ద్వారా, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం మరియు T2DM సంబంధిత సమస్యలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 101 మిలియన్ల మంది డయాబెటిస్¹తో జీవిస్తున్న భారతదేశాన్ని తరచుగా “ప్రపంచ డయాబెటిస్ రాజధాని”గా పేర్కొంటారు. టైప్ 2 డయాబెటిస్‌తో² సంబంధం ఉన్న గుండె మరియు మూత్రపిండాల సమస్యలు అత్యంత సాధారణ మరియు తీవ్రమైన సమస్యలలో ఉన్నాయి. ఈ పరిస్థితులు, ముందస్తు ప్రమాద అంచనాను మరింత కీలకంగా చేస్తాయి. డాక్టర్ కార్తీక్ పీతాంబరన్, మెడికల్ డైరెక్టర్, అబోట్ ఇండియా ఇలా అన్నారు, “మొత్తం ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలో డయాబెటిస్ కేర్ డెలివరీని మార్చడానికి అబోట్ కట్టుబడి ఉంది. ఈ దిశలో, తగిన రోగి పరీక్షలకు మద్దతు ఇవ్వడం మరియు క్లినికల్ ఫలితాలను మెరుగుపరచడం కోసం, అబోట్ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో భాగస్వామ్యం కొనసాగిస్తోంది. ICRAS సాధనం డయాబెటిక్ రోగుల్లో, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ (DKD), కోరోనరీ హార్ట్ డిసీజ్ (CHD), మేజర్ అడ్వర్స్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ (MACE)³ అభివృద్ధి చెందే సంభావ్యతను వైద్యులు అంచనా వేయడానికి రూపొందించబడింది. సకాలంలో క్లినికల్ నిర్ణయం తీసుకోవడం, సాక్ష్యం ఆధారిత అభ్యాసానికి మద్దతు ఇవ్వడం మరియు మొత్తం రోగి అంచనాను బలోపేతం చేయగల సామర్థ్యం ఈ సాధనాన్ని ప్రత్యేకంగా ప్రభావవంతంగా చేస్తుంది.” ICRAS సాధనం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, మరియు ప్రధాన గుండె సంబంధిత సంఘటనలకు ప్రత్యేక ప్రమాద స్కోర్లు రూపొందించడానికి, కీలక వైద్య పరీక్ష ఫలితాలు మరియు జీవనశైలి కారకాలు వంటి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను ఒకచోట సమీకరించింది. ఇది లింగ-నిర్దిష్ట వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి డయాబెటిక్ రోగికి గుండె మరియు మూత్రపిండాల సమస్యల అభివృద్ధి ప్రమాదాన్ని స్పష్టంగా, వ్యక్తిగతీకరించిన సారాంశంగా అందిస్తుంది. గోప్యతను కాపాడుతూ, వెబ్ ఆధారిత ఈ సాధనం ఎటువంటి వ్యక్తిగత రోగి లేదా వైద్య సమాచారాన్ని సంగ్రహించదు, అన్ని అంచనాలు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. క్టర్ కె డి మోడీ, ఎండోక్రినాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్, “అధిక రక్త చక్కెర, అధిక బరువు, ఇతర ఆరోగ్య పరిస్థితులు మరియు రోజువారీ జీవనశైలి అలవాట్ల కలయిక కారణంగా, డయాబెటిస్ సమస్యలు తరచుగా అభివృద్ధి చెందుతాయి. కాలక్రమేణా, ఈ కారకాలు గుండె మరియు మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తాయి — ఇవి టైప్ 2 డయాబెటిస్‌లో² ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవాలు. T2DM ఉన్నవారిలో దాదాపు మూడింట ఒకవంతు గుండె జబ్బులు² ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) 40% T2DM రోగులను⁴ ప్రభావితం చేస్తుంది. సవాలు ఏమిటంటే, ఈ సమస్యలు ప్రారంభ దశలో ఎక్కువగా లక్షణాలు చూపించవు, అందువల్ల రోగులు ఎక్కువగా ఆరోగ్యంగా అనుభూతి చెందుతారు. ముందస్తు ప్రమాద అంచనాలు వైద్యులను సమస్యలను త్వరగా గుర్తించడానికి, మరియు అవి తీవ్రమైన దశకు చేరే ముందు సకాలంలో చర్య తీసుకోవడానికి సహాయపడతాయి.” అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించడం వైద్యులకు అర్ధవంతమైన, వ్యక్తిగతీకరించిన సంరక్షణ వ్యూహాలను రూపొందించడానికి అవకాశం కల్పిస్తుంది. సకాలంలో, లక్ష్యంగా చేసుకున్న చికిత్సలు తీవ్రమైన గుండె మరియు మూత్రపిండ సమస్యలను తగ్గించవచ్చు లేదా నిరోధించవచ్చు, తద్వారా డయాబెటిస్‌తో నివసించే వ్యక్తులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడతాయి.

మన తెలంగాణ 13 Mar 2026 7:10 pm

ఇరాన్ సుప్రీం లీడర్‌ తీవ్రంగా గాయపడ్డారు.. కానీ బ్రతికేఉన్నారు?

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ ఉదృతమవుతోంది. ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా.. మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే మోజ్తబా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకారం తీర్పుకుంటామని ఆయన అన్నారు. అయితే తాజాగా జరిగిన ఓ దాడిలో మోజ్తబా తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన కాలు కూడా తీసేశారని.. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని తెలియవస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ గాయపడ్డారని.. గుర్తుపట్టలేనంతగా మారిపోయారని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మన తెలంగాణ 13 Mar 2026 7:09 pm

శశికల ఈజ్ బ్యాక్.. తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికల కొత్త పార్టీని ప్రకటించారు. ఈ పార్టీకి 'అఖిల భారత పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం'గా నామకరణం చేశారు. పార్టీ జెండాతోపాటు చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. జయలలిత స్మారకార్థం రామనాథపురంలో జరిగిన బహిరంగ సభలో శశికల మాట్లాడుతూ.. మాజీ సిఎం, ఐఏడీఎంకే(అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) వ్యవస్థాపకుడు ఎంజిఆర్ స్మరించుకున్నారు. ప్రజలకు సేవ చేయడానికి, ద్రవిడ మున్నేట్ర కజగం(DMK) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా MGR పార్టీని స్థాపించారని చెప్పారు. ముఖ్యంగా పేదల పక్షాన నిలబడాలనే సంకల్పంతోనే ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఎంజిఆర్ తర్వాత జయలలిత ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ప్రజలకు సేవ చేశారన్నారు. ఆమె చనిపోయిన అనంతరం AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. ఆయన నాయకత్వంలో పార్టీ పతనావస్థకు చేరుకుందని శశికల విమర్శించారు. కాగా, జయలలిత మరణం తర్వాత శశికల, AIADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు.

మన తెలంగాణ 13 Mar 2026 7:08 pm

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:07 pm

ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా

ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా మూకమామిడి గ్రామ పంచాయతీ ప్రారంభించిన

ప్రభ న్యూస్ 13 Mar 2026 7:03 pm

అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల

అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:57 pm

చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం

చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం మురుగునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలిదోమల

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:52 pm

UBS Release: GO issued in Andhra Pradesh

Telugu360 was the first to break the news that the special premieres permission will be granted for Ustaad Bhagat Singh on March 19th and there would be no premieres on March 18th evening. The GO has been issued by the AP government today and one premiere show permission has been granted on March 19th between […] The post UBS Release: GO issued in Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:48 pm

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి హంద్రిక శ్రీ జగద్గురు లింగప్ప తాత

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:48 pm

Is Allu Cinemas a Threat for AMB Cinemas?

Allu Cinemas will open for film lovers and regular patrons starting from tomorrow. The four-screen multiplex is located in Gandipet, one of the costliest and most developing places of Hyderabad. From the past couple of years, most of the celebrities, rich crowds and others residing near to the ORR are rushing to AMB Cinemas for […] The post Is Allu Cinemas a Threat for AMB Cinemas? appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:46 pm

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ దంపతుల మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ దంపతుల మృతి రెండు కుటుంబాల్లో విషాదం ఆదోని, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:43 pm

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై మరింత దృష్టి సారించిన సిగ్మా

హైదరాబాద్: సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ 'ఎక్స్‌ట్రోవిస్ ఏజీ' లో ఉన్న తన పూర్తి 36.52% ఈక్విటీ వాటా విక్రయాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ లావాదేవీ ద్వారా కంపెనీకి $15 మిలియన్లు (సుమారు ₹137.61 కోట్లు) సమకూరాయి. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ వ్యాపార విస్తరణను వేగవంతం చేస్తున్న తరుణంలో ఈ నిధులు కంపెనీకి అదనపు ఆర్థిక వెసులుబాటును అందిస్తాయి. సిగ్మా యొక్క కొనసాగుతున్న పోర్ట్‌ఫోలియో హేతుబద్ధీకరణ వ్యూహంలో ఈ వాటా విక్రయం ఒక భాగం. తద్వారా కంపెనీ పూర్తిగా ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ప్లాట్‌ఫారమ్‌గా రూపాంతరం చెందింది. తమ ప్రధాన వ్యాపారేతర ఫార్మాస్యూటికల్ పెట్టుబడి నుండి నిష్క్రమించడం ద్వారా సిగ్మా మూలధనాన్ని సమీకరించుకుంది. ఈ నిధులను ఇప్పుడు తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, వ్యూహాత్మక కొనుగోళ్లను కొనసాగించడానికి మరియు ప్రపంచ స్థాయి రక్షణ & ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థలలో తన ఉనికిని విస్తరించడానికి ఉపయోగించనుంది. దీనిపై సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ (CEO) సునీల్ కాలిదిండి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ తయారీ సంస్థగా సిగ్మా దృష్టిని మరింత బలోపేతం చేయడంలో 'ఎక్స్‌ట్రోవిస్ AG' లో మా వాటా విక్రయం ఒక వ్యూహాత్మక అడుగు. నాస్మిత్ (Nasmyth) మరియు ఏఎస్ స్ట్రాటజిక్ (AS Strategic) కొనుగోళ్ల తర్వాత మేము మా సామర్థ్యాలను పెంచుకుంటూ, అంతర్జాతీయ డిఫెన్స్ ఎకోసిస్టమ్స్‌లో మా ఉనికిని విస్తరిస్తున్నాము. ఈ దశలో మా పెట్టుబడులు, వ్యూహాత్మక ప్రాధాన్యతలు అదే దిశలో కొనసాగడం చాలా ముఖ్యం. ఈ లావాదేవీ మా బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడమే కాకుండా.. కొత్త సామర్థ్యాలపై పెట్టుబడి పెట్టడానికి, సరైన అవకాశాలను దక్కించుకోవడానికి, మరియు సిగ్మా యొక్క తదుపరి దశ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి మాకు ఎక్కువ వెసులుబాటును ఇస్తుంది, అని అన్నారు. సిగ్మా ఒక విస్తృతమైన అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మిస్తున్న క్రమంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల, కంపెనీ ఢిల్లీకి చెందిన ఏఎస్ స్ట్రాటజిక్‌ (AS Strategic) ను కొనుగోలు చేసింది. ఇది యూరప్‌లో లోతైన మూలాలను కలిగి ఉండి, రక్షణ మరియు అంతరిక్ష రంగాలపై దృష్టి సారించిన సంస్థ. ఐరోపా మరియు అంతర్జాతీయ డిఫెన్స్ OEMలతో (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్) దీర్ఘకాలిక జాయింట్ వెంచర్లు మరియు ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ పార్టనర్‌షిప్‌ల ద్వారా ఏఎస్ స్ట్రాటజిక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సిగ్మా గతంలో యునైటెడ్ కింగ్‌డమ్ (UK) కు చెందిన 'నాస్మిత్ గ్రూప్‌'ను (Nasmyth Group) కొనుగోలు చేసింది, దానికి కొనసాగింపుగానే తాజా కొనుగోలు జరిగింది. నాస్మిత్ కొనుగోలు ఐరోపా మరియు UK అంతటా బలమైన తయారీ మరియు పారిశ్రామిక ఉనికిని స్థాపించింది. నాస్మిత్ సిగ్మా యొక్క ఖచ్చితమైన తయారీ సామర్థ్యాలను, ప్రత్యేక ప్రక్రియలను మరియు టైర్-1 సప్లై చైన్ ఇంటిగ్రేషన్‌ను బలోపేతం చేయగా.. ఏఎస్ స్ట్రాటజిక్ ఐరోపా డిఫెన్స్ ఎకోసిస్టమ్స్‌లో ప్రోగ్రామ్ యాక్సెస్, కస్టమర్ సంబంధాలు మరియు సిస్టమ్-లెవల్ భాగస్వామ్యం వంటి ఫ్రంట్-ఎండ్ లేయర్‌ను జోడిస్తుంది. నాస్మిత్ మరియు ఏఎస్ స్ట్రాటజిక్ రెండూ కలిసి సిగ్మాను అంతర్జాతీయంగా ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీగా బలంగా నిలబెడుతున్నాయి. ఇవి భారతదేశంలో తయారీ, ప్రతిభ మరియు విలువ సృష్టిని స్థిరంగా ఉంచుతూనే సంక్లిష్టమైన, బహుళ-సంవత్సరాల అంతర్జాతీయ ప్రోగ్రామ్‌లను అమలు చేయగల సామర్థ్యాన్ని కల్పిస్తున్నాయి. తన కొనుగోళ్ల వ్యూహంతో పాటుగా, సిగ్మా తన ఆర్డర్ బుక్‌ను కూడా విస్తరిస్తూనే ఉంది. గత నెలలో, ఈ కంపెనీ భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ మరియు అనుబంధ డిఫెన్స్ PSUల (ప్రభుత్వ రంగ సంస్థలు) నుండి సుమారు ₹100 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లను సొంతం చేసుకుంది. అర్హత చక్రాలు సుదీర్ఘంగా ఉండే మరియు నాణ్యతా ప్రమాణాలు అత్యంత కఠినంగా ఉండే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఇతర మిషన్-క్రిటికల్ సిస్టమ్‌ల కోసం కస్టమర్లు సిగ్మాపై ఉంచుతున్న నిరంతర నమ్మకానికి ఇది నిదర్శనం. సహజసిద్ధమైన వృద్ధితో పాటు వ్యూహాత్మక కొనుగోళ్ల కలయిక ద్వారా సంస్థ వృద్ధిని కొనసాగిస్తుందని, దీని కోసం ప్రస్తుతం బహుళ అవకాశాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ మరింత వివరించింది.

మన తెలంగాణ 13 Mar 2026 6:40 pm

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సర్వ సిద్ధం..

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సర్వ సిద్ధం.. పదవ తరగతి పరీక్షల

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:36 pm

Bangaru Bomma: SP Charan, Chithra’s Classic Charm

Sumanth Prabhas who impressed with his debut flick Mem Famous is coming up with a rural love and family saga Godari Gattupaina, directed by first-timer Subash Chandra, and produced by Red Puppet Productions, with Nidhi Pradeep essaying the heroine. As part of musical promotions, the makers today released third single- Bangaru Bomma. It’s classically-infused romantic […] The post Bangaru Bomma: SP Charan, Chithra’s Classic Charm appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:26 pm

Is Anushka Shetty Getting Married?

Top actress Anushka Shetty hasn’t been seen across the film circles for the past few months. She played the lead role in Ghaati last year and the film ended up as a disappointment. The latest rumors making rounds is that Anushka Shetty is all set to get married very soon. It is an arranged marriage […] The post Is Anushka Shetty Getting Married? appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:21 pm

సమ్మె నోటీసులు ఇచ్చిన టిజిఎస్‌ఆర్‌టిసి జెఎసి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టిసి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టిసి యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ‘‘మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఆర్టిసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి. అన్ని కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులపై ఆధిక పని భారం తగ్గించాలి’’ అని జెఎసి నేతలు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 13 Mar 2026 6:18 pm

పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జడ్పి హెచ్ఎస్

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:17 pm

Breaking : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 6:16 pm

Video : Actress Raashii Khanna Exclusive Interview

The post Video : Actress Raashii Khanna Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 13 Mar 2026 6:15 pm