21stAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
21stAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 21stAprilCartoon | అమెరికాలో సుంకాల రీఫండ్
Bengal Bjp |హిందుత్వ పార్టీల వైఫల్య కారణాలు
Bengal Bjp | హిందుత్వ పార్టీల వైఫల్య కారణాలు Bengal Bjp |
ప్రజా పాలన పోయి పాపాలభైరవుడు రావాలా?
మన తెలంగాణ/హైదరాబాద్/కాటారం: పాపాల బైరవుడు మళ్లీ రావాలి, ప్రజా పాలన పోవాలి అని ఒక పెద్ద మనిషి అంటున్నారని ఫాంహౌస్లో పడుకునే పాపాల బైరవుడు మళ్లీ ఎందుకు రావాలి, లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని, పాపాల బైరవుడు ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కెసిఆర్ భ్రమల్లో ఉన్నారని, ఆ కుటుంబాన్ని ఎప్పటికీ అధికారంలోకి రానివ్వనని సిఎం రేవంత్రెడ్డి శపథం చేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్కు ఘోరీ కట్టామని, 2029లో కూడా అదే పునరావృతం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ నీ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటానని కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్ అని, 2029లో నువ్వో నేనో తేల్చుకుందామని రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. జగిత్యాలలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా వందమీటర్ల లోతు గోతిలో పాతరేసి పాతిపెడతానని సిఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో నిన్ను ఓడగొట్టినా, 2024లో నీకు గుండుసున్నా చేసినా, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్లో మీక గోరీ కట్టిన, వచ్చేసారి ఈ ఘోరీ మీ మా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ఎగురవేస్తారని జయశంకర భూపాలపల్లి కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. వచ్చేసారి కెసిఆర్కు ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, పార్టీ మారిన జీవన్ రెడ్డిలపై సిఎం రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి బిఆర్స్లో చేరడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఒక మాదిగ బిడ్డ అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకనే జీవన్ రెడ్డి పార్టీ మారారని, కాంగ్రెస్ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, కుట్రపూరితంగా బిఆర్ఎస్లో చేరారని సిఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. జీవన్రెడ్డి చరిత్ర ఆయన వెనుకున్న మచ్చలన్నీ నాకు తెలుసనీ, 40 ఏళ్ల పాటు తన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని, 14 సార్లు కాంగ్రెస్ బి ఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లిపోయారని, ఓడిపోయినా ఎన్నోసార్లు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను గౌరవించిందని ఏడాదిపాటు పదవి లేకపోతే జీవన్రెడ్డి కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేశారని సిఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. వచ్చేసారి కెసిఆర్కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని, అప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో చూస్తానని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కొన్ని నెలల్లోనే కూలేశ్వరం అయ్యిందని, తెలంగాణను పదేళ్లు లూటీ చేసిన కెసిఆర్ను ఉరి తీసినా తప్పులేదని సిఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. భ్రమల్లో కెసిఆర్.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి.శ్రీనివాస్ కలిసి కాంగ్రెస్ను ఎలా అధికారంలోకి తెచ్చారో ఇప్పుడు తాను, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసి రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. పాలకుల తీరుపై కెసిఆర్ చేసిన చిల్లర మాటలు అనే విమర్శకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, వారి తీర్పును గౌరవించకుండా ఇంకా అహంకారంతో మాట్లాడటం కెసిఆర్ భ్రమలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బిఆర్ఎస్ శకం ముగిసిందని, ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్ హవా మాత్రమే కొనసాగుతుందని సిఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయని, అభివృద్ధి పనులే తమను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఏడాదిలోపే చేసి చూపించామని, 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేశామని ఆయన తెలిపారు. గత విడతలో రైతుభరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు వేశామని ఈరోజు రెండోవిడతలో రూ.5,700 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన గతంలో ఎవరికైనా వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. 45 లక్షల 11 వేల 947 మంది రైతుల ఖాతాల్లో అనంతరం రైతు భరోసా రెండో విడత నిధులను సిఎం రేవంత్రెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. రైతు భరోసా రెండో విడత నిధులను రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. గత నెల 23న మొదటి విడత సాయాన్ని పంపిణీ చేసింది. మొదటి విడతలో సుమారు రూ.3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45 లక్షల 11 వేల 947 మంది రైతుల ఖాతాల్లో రూ.5,563 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఇరాన్-అమెరికా మధ్య మరో దఫా చర్చలు ఇప్పటిలో కాకపోవచ్చు. చర్చల్లో అమెరికా, ఇరాన్ మధ్య పురోగతి లభిస్తేనే కానీ ప్రస్తుత ప్రపంచ సంక్షోభం సమసిపోదు. వాషింగ్టన్ నుంచి వైరుధ్యపూరిత చర్యలు ఎదురవుతుండడంతో రెండో దఫా చర్చలపై ఇప్పటివరకు తామెలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘ్రేయి సోమవారం స్పష్టం చేయడం ఈ సందర్భంగా ప్రస్తావించడం ముఖ్య అవసరం. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ అమెరికా కూటమి యుద్ధం ప్రారంభించడం వల్ల ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురవుతున్నాయో అమెరికా, ఇజ్రాయెల్తోపాటు ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ చమురు రవాణా స్తంభించింది. గ్రీక్, లైబీరియాకు చెందిన చమురు ట్యాంకర్లు వెనక్కు మరలాల్సి వచ్చింది. ముడి చమురు ధరలు బ్యారెల్కు 119 డాలర్లకు తాకాయి. ప్రపంచవ్యాప్తగా చమురు సరఫరాకు ముప్పు వాటిల్లుతోంది. ఇంట్రాడేలో క్రూడాయిల్ ధరలు 8% వరకు పెరిగి సుమారు 97.81 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసింది. గత 50 రోజులుగా చమురు, గ్యాస్, గల్ఫ్ నుంచి దొంగచాటుగా హర్మూజ్ ద్వారా బయటకు పంపవలసి వస్తోంది. చమురు, గ్యాస్ ఉత్పత్తులను గల్ఫ్ దేశాలు తగ్గించుకున్నాయి. ఒక అంచనా ప్రకారం 50 బిలియన్ డాలర్ల విలువైన 500 మిలియన్ బ్యారెల్స్ చమురు అమెరికాకు ఒక నెల వరకు సరిపోతుంది. దీనికి తోడు ఎరువులు, అల్యూమినియం, హీలియం, సల్ఫర్ కొరత తీవ్రమైంది. ఫలితంగా దీని ప్రభావం రాగి, నికెల్ ఉత్పత్తిపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ వృద్ధి రేటు 2 శాతం వరకు మాంద్యం ఎదుర్కోక తప్పదు. ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ తరువాత గతవారం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సజావుగా ప్రారంభమై హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవడానికి వీలు కల్పించాయి. అయితే ఇరాన్తో పూర్తిగా ఒప్పందం కుదిరేవరకు అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతుందని, ఇరాన్ నౌకలపై ఆంక్షలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా ఒక్కరోజులోనే హార్ముజ్ జలసంధిని తిరిగి ఇరాన్ మూసివేసింది. ట్రంప్కు అత్యంత అభిమానపాత్రుడైన పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మున్నీర్ కూడా ఇరాన్ రేవులను అమెరికా ముట్టడించడమే రెండో దఫా చర్చలకు ప్రధాన అడ్డంకిగా వ్యాఖ్యానించడం గమనార్హం. దీనికి సాక్షంగా ఇరాన్ను రెచ్చగొట్టేలా ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా నావికాదళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేపట్టింది. ఇరాన్ వద్ద నష్టం కలిగించే గన్బోట్లు చాలా ఉన్నాయి. గత శనివారం నాడు భారత పతాకం కలిగిన రెండు నౌకలపై కూడా ఇరాన్ కాల్పులు జరపడం ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైంది. సైనిక చర్యలు లేదా ఒత్తిళ్ల వల్ల ఇంధన సరఫరా వెంటనే తిరిగి ప్రారంభం కాకపోవచ్చు. మరో నెల లేదా ఆరు నెలల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు. కానీ ఏదేమైనా చర్చల ద్వారానే ఉద్రిక్తతలు సడలి సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని అందరి అభిప్రాయం. కానీ ఇరాన్ బోట్ గన్ దాడులతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బుధవారం నాటికి కాల్పుల విరమణ గడువు ముగిసి చర్చలు పురోగతి సాధిస్తాయని అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి ఆశాభావం వ్యక్తమవుతున్నా అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం. చర్చల్లో ‘ఇరాన్ యురేనియం నిల్వలే’ ప్రధాన అడ్డంకిగా మారింది. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధిచేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ ఆ ప్రకటనను తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితిలోనూ శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్జడేహ్ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద 450 కిలోల 60శాతం సుసంపన్న యురేనియం నిల్వలు ఉండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న సంగతి వాస్తవమే. ఈ నిల్వలను 90 శాతం ఆయుధ స్థాయికి సులభంగా మార్చవచ్చని, తద్వారా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసి ప్రపంచ భద్రతను పణంగా పెట్టగలదనే భయం నెలకొంది. ఇరాన్ వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం ఉందనే అంచనాల నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ అణు కేంద్రాలపై నిఘా ఉంచింది. శుక్రవారం ఇరాన్ వెనక్కి తగ్గితే అమెరికా కీలక పాత్ర వహిస్తుందా? అన్నదే ప్రశ్న. ప్రత్యర్థిని నిరంతరం అవమానించడం ఒప్పందాన్ని ఖరారు చేసే మార్గం ఎంతమాత్రం కాదు. ఇరాన్ యురేనియాన్ని పొందే ప్రయత్నంలో హర్మూజ్ జలసంధి ద్వారా ట్రాఫిక్ సాధారణ స్థితికి రావడం ముఖ్యం అన్న విషయం అమెరికా మరిచిపోకూడదు. అంతవరకు గల్ఫ్ దేశాలు పాత రేట్లకు చమురును ఉత్పత్తి చేయలేవు. అల్యూమినియం, సర్ఫర్, తదితర అవసరాల నిల్వలు సమకూరవు. మే నెల మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కానున్నారు. చైనా నుంచి తనకు ఘనస్వాగతం లభిస్తుందన్న భావనలో ట్రంప్ ఉన్నారు. వీరిద్దరి చర్చల్లో హర్మూజ్ జలసంధి ముట్టడి ప్రధాన అంశం కానున్నది. అలాగే ఇరాన్కు చైనా మిత్రదేశంగా ఉంటోంది. అందువల్ల హర్మూజ్ జలసంధి రవాణా సంక్షోభం పరిష్కారం అవుతుందన్న ఆశలు కనిపిస్తున్నాయి.
21stApril2026 |మంగళవారం నేటి పంచాంగం
21stApril2026 | మంగళవారం నేటి పంచాంగం 21stApril2026 | ఈరోజు తిథి, నక్షత్రం
చరిత్ర సృష్టించాలంటే వేగం మాత్రమే చాలదు
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వేగంగా, ప్రభావవంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. 2016లో నోట్ల రద్దు, 2019లో ఆర్టికల్ 370 రద్దు, ప్రస్తుతం మహిళల రిజర్వేషన్, శాసనసభ స్థానాల విస్తరణ, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రతిపాదనలు.. ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలలో వేగం, విస్తృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఇవి సాధారణ విధాన మార్పులు కాకుండా, దీర్ఘకాలిక నిర్మాణాత్మక సమస్యలకు చారిత్రాత్మక పరిష్కారాలుగా ప్రదర్శిస్తున్న మార్పులు. అయితే, భారతదేశం వంటి విస్తారమైన, విభిన్నమైన, అసమానతలతో కూడిన ప్రజాస్వామ్యంలో ప్రశ్న కేవలం ‘ఏం చేస్తున్నారు?’ అన్నదే కాదు, ‘ఎలా చేస్తున్నారు?’ అన్నదీ కీలకమే. తీర్మానాత్మక పాలనకు ఆకర్షణ ఉండటం సహజమే.. కానీ తరచూ నిష్క్రియగా విమర్శించే వ్యవస్థలో ధైర్యమైన నిర్ణయాలు, ఉద్దేశం, అధికారాన్ని, దిశను సూచిస్తాయి. అయితే ప్రజాస్వామ్యం, వేగానికి అనుకూలంగా పనిచేసే సాధనం కాదు. అది చర్చలు, సర్దుబాట్లు, సమ్మతి నిర్మాణం మీద ఆధారపడిన వ్యవస్థ. సంస్థల నిర్మాణాన్ని, ప్రజా ప్రతినిధిత్వాన్ని(ప్రాతినిధ్యాన్ని) ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తక్కువ కాలవ్యవధిలో, పరిమిత సంప్రదింపులతో తీసుకుంటే, ప్రజాస్వామ్య ప్రక్రియలు అందించే న్యాయ సమ్మతత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇక్కడ ఆందోళన.. సంస్కరణల అవసరంపై కాదు, వాటిని అమలు చేసే విధానంపై ఉంది. త్వరిత నిర్ణయాలు తీసుకోవడం, విస్తృత చర్చల తర్వాత నిర్ణయాలకు రావడం మధ్య ఉన్న ఈ ఉద్రిక్తత భారతదేశానికి ప్రత్యేకమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. సంస్కరణల పేరుతో వేగంగా, కేంద్రీకృతంగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు అనుకోని పరిణామాలను ఎదుర్కొన్నాయి. టర్కీలో అత్యవసరంగా అమలు చేసిన రాజ్యాంగ మార్పులు కార్యనిర్వాహక అధికారాన్ని కేంద్రీకరించినప్పటికీ, సంస్థల మధ్య సమతుల్యతను బలహీనపరిచాయి. హంగేరీలో వేగవంతమైన చట్టపరమైన, ఎన్నికల సంస్కరణలు ప్రతిపక్ష స్వరాలను అణచివేసి, ప్రజాస్వామ్య రక్షణ వ్యవస్థలను క్రమంగా దెబ్బతీశాయి. బ్రెజిల్లో కూడా ఆర్థిక, పరిపాలనా మార్పులు ఆకస్మికంగా అమలు కావడం వల్ల విస్తృత సమ్మతి లేకపోవడంతో సామాజిక అస్థిరతకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఉదాహరణలు ఒక స్పష్టమైన పాఠాన్ని చెబుతున్నాయి.. చర్చల ప్రక్రియలను పక్కన పెట్టిన సంస్కరణలు తక్షణ రాజకీయ ఫలితాలను ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో సంస్థలను బలహీనపరచడం, ప్రజల విశ్వాసాన్ని తగ్గించడం వంటి పరిణామాలకు దారితీస్తాయి. భారతదేశంలో కూడా ఈ ధోరణి క్రమంగా స్పష్టమవుతోంది. నోట్ల రద్దును అకస్మాత్తుగా ప్రకటించడం ద్వారా నల్లధనం, అవినీతిపై కఠిన చర్యగా చూపించారు. అయితే అమలులో, నగదు ఆధారిత అనౌపచారిక ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలహీనతలు బహిర్గతమయ్యాయి. లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి, జీవనోపాధులు కుదేలయ్యాయి. దీర్ఘకాల ప్రయోజనాలపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అలాగే ఆర్టికల్ 370 రద్దును జాతీయ సమగ్రత చర్యగా ప్రదర్శించినప్పటికీ, జమ్మూ-కశ్మీర్లో సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలు నిలిపివేసిన పరిస్థితుల్లో ఇది అమలైంది. స్థానిక ప్రజల భాగస్వామ్యం లేకపోవడం, సమాఖ్య సూత్రాలు, ప్రజాసమ్మతి పాత్రపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ రెండు సందర్భాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి- విస్తృత చర్చల కంటే వేగం, నియంత్రణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని. ప్రస్తుతం ప్రతిపాదిత మార్పులు గత చర్యలకంటే మరింత ముందుకెళ్తున్నాయి. మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా శాసన ప్రాతినిధ్యాన్ని పునఃరూపకల్పన చేయాలనే ప్రయత్నం కేవలం విధాన మార్పు మాత్రమే కాదు; రాజకీయ అధికార నిర్మాణాన్ని మళ్లీ చిత్రీకరించే ప్రక్రియగా మారుతోంది. ఈ మార్పులు అత్యంత ప్రభావవంతమైనవి. ఎందుకంటే ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? నియోజకవర్గాలు ఎలా రూపుదిద్దుకుంటాయి? ప్రాంతాల మధ్య రాజకీయ ప్రభావం ఎలా విభజించబడుతుంది? అనే అంశాలను ఇవే నిర్ణయిస్తాయి. అందువల్ల, ఇలాంటి కీలక మార్పులకు మరింత విస్తృత చర్చ, సమ్మతి అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా జనాభా గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, పాత జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే నిర్ణయం, ప్రతినిధిత్వం, ఖచ్చితత్వం, న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. భవిష్యత్తు ఎన్నికల చక్రాలకు అనుగుణంగా ఈ సంస్కరణల సమయాన్ని నిర్ణయించడం, సంస్థాగత మార్పుల్లో రాజకీయ ప్రయోజనాల పాత్రపై అనుమానాలను పెంచుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసమాజంతో సమగ్ర చర్చలు జరపకపోవడం, ఈ ప్రక్రియ కార్యనిర్వాహక నిర్ణయాల ఆధారంగా ముందుకు సాగుతోందనే భావనను బలపరుస్తోంది. ఇవి సాధారణ విధానపరమైన అభ్యంతరాలు మాత్రమే కావు; ప్రజాస్వామ్య న్యాయబద్ధతకు సంబంధించిన కీలక అంశాలు. ఇలాంటి విధానానికి అనేక పార్శ్వాలలో ప్రమాదాలు ఉన్నాయి. మొదటిగా, ప్రజల విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. పెద్ద స్థాయి మార్పులు ఏకపక్షంగా లేదా రాజకీయ ప్రయోజనాలతో చేపట్టినట్లు భావిస్తే, ప్రజలు, రాజకీయ వర్గాల్లో అనుమానాలు మరింత పెరుగుతాయి. ఒకసారి నమ్మకం కోల్పోతే, దాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. ఇది ప్రజాస్వామ్య సంస్థల పనితీరును కూడా బలహీనపరచగలదు. రెండవది, సమాఖ్య వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమతుల్యతపై భారత రాజ్యాంగ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ప్రతినిధిత్వంలో మార్పులు ఈ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. రాష్ట్రాలపై నిర్ణయాలు రుద్దుతున్నట్లుగా అనిపిస్తే, సహకార సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. మూడవది, కార్యనిర్వాహక అధికార ప్రాబల్యం క్రమంగా సాధారణమవుతుంది. పార్లమెంట్ చర్చల వేదికగా కాకుండా కేవలం నిర్ణయాలను ఆమోదించే స్థాయికి పరిమితమైతే, శాసన పర్యవేక్షణ, కార్యనిర్వాహక అధికారాల మధ్య గీత మసకబారుతుంది. ఈ అంశాలు ప్రాంతీయ ప్రభావం కోణంలో చూస్తే మరింత గంభీరంగా కనిపిస్తాయి. జనాభా నియంత్రణ, విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన ప్రగతి సాధించిన దక్షిణ రాష్ట్రాలు, జనాభా ఆధారిత పునర్విభజనలో వెనుకబడే ప్రమాదం ఉంది. జనాభా వృద్ధిని నియంత్రించిన రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం స్థిరంగా ఉండటం లేదా తగ్గడం చూడవచ్చు. అదే సమయంలో అధిక జనాభా వృద్ధిగల రాష్ట్రాలకు ఎక్కువ రాజకీయ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. దీనివల్ల మంచి పాలనకు తక్కువ ప్రభావం, అధిక జనాభాకు ఎక్కువ ప్రాధాన్యం లభించే విరుద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సమాఖ్య వ్యవస్థలో న్యాయబద్ధత, ప్రోత్సాహక వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇలాంటి పరిణామాలు ఆర్థిక పంపిణీ, రాజకీయ ప్రాతినిధ్యంపై ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచి, దేశంలోని విభిన్న ప్రాంతాల మధ్య అసమతుల్యత భావనను పెంచే ప్రమాదం ఉంది. ఈశాన్య ప్రాంతంలో ఈ మార్పుల ప్రభావం మరింత సున్నితంగా ఉంటుంది. అక్కడి రాజకీయ పరిస్థితులు సంక్లిష్ట జాతి నిర్మాణాలు, చారిత్రక ఒప్పందాలు, నాజూకైన జనాభా సమతుల్యతలపై ఆధారపడి ఉంటాయి. నియోజకవర్గాల పునర్విభజనలాంటి చర్యలు ఈ సమతుల్యతలను మార్చే అవకాశం కలిగిస్తాయి, కొన్ని సందర్భాల్లో ఇవి అనూహ్య పరిణామాలకు దారితీయవచ్చు. గుర్తింపు (ఐడెంటిటీ), ప్రాతినిధ్యం బలంగా అనుసంధానమైన రాష్ట్రాల్లో చిన్నమార్పులు కూడా పెద్ద రాజకీయ ప్రతిస్పందనలకు దారితీస్తాయి. గతంలో పౌరసత్వం, ఓటరు జాబితాల వంటి అంశాలపై జరిగిన అనుభవాలు చూపించినట్లుగా, తగిన సున్నితత్వం, సంప్రదింపులు లేకుండా చేపట్టిన పరిపాలనా చర్యలు ఆందోళనలు, అసంతృప్తిని పెంచుతాయి. ఈ నేపథ్యంలో, సరైన సమన్వయం, ప్రజాభాగస్వామ్యం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశమే ఆందోళనకు కారణమవుతోంది. త్వరిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్న వాదన, సంస్కరణలకు వ్యతిరేకం కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలోని సంస్థలను పునర్వ్యవస్థీకరించడం అవసరం. ముఖ్యంగా శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం అత్యవసరమైన, ఆలస్యమైన లక్ష్యమే. అయితే, ఈ సంస్కరణలను అమలు చేసే విధానం కూడా అంతే ముఖ్యమైనది. ప్రజాస్వామ్యం బలంగా ఉండేది కేవలం తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రమే కాదు; ఆ నిర్ణయాలు ఎలా తీసుకున్నామనే ప్రక్రియ కూడా ముఖ్యమే.. సంప్రదింపులు అనేవి అధిగమించాల్సిన అడ్డంకులు కావు; అవే ప్రజాస్వామ్య న్యాయబద్ధతను నిర్మించే, నిలబెట్టే పునాది. మోడీ ప్రభుత్వం భారీ ఆలోచనలు, ధైర్యమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని ఇప్పటికే చూపించింది. ఇప్పుడు అవసరమైనది అదే స్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల కట్టుబాటు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం, దానితో కొనసాగనున్న చర్చలను నిర్ణయ ప్రక్రియ ముగింపుగా కాకుండా, విస్తృత జాతీయ సంభాషణ ప్రారంభంగా చూడాలి. భారతదేశం వంటి సంక్లిష్ట దేశంలో చరిత్ర సృష్టించడం అంటే కేవలం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు; ఆ నిర్ణయాలకు సమూహ సమ్మతి బలం కల్పించడం కూడా అంతే ముఖ్యమైనది. త్వరితంగా ముందుకు సాగి సంస్థలను పునఃవ్యవస్థీకరించాలనే తపన తక్షణ రాజకీయ లాభాలను ఇవ్వవచ్చు. కానీ ప్రజాస్వామ్యం దీర్ఘకాల దృష్టిని కోరుతుంది. ప్రతినిధిత్వ నిర్మాణాన్ని మార్చే నిర్ణయాలు ప్రభుత్వాల గడువు, ఎన్నికల చక్రాలను మించి కొనసాగుతాయి. అందువల్ల, అవి రాజకీయ, ప్రాంతీయ విభేదాలపై విశ్వాసాన్ని పెంచే విధానాలపై ఆధారపడాలి. చరిత్ర మార్పుల పరిమాణాన్ని గుర్తుంచుకుంటుంది. కానీ ప్రజాస్వామ్య ఆరోగ్యం మాత్రం ఆ మార్పుల సమగ్రత, చర్చ, సమ్మతిపై ఆధారపడి జరిగాయా లేదా వేగం, ఏకపక్ష నిర్ణయాల ఫలితమా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. గీతార్థ పాఠక్
పశ్చిమబెంగాల్ రాజకీయాలు మరోసారి జాతీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఒక రాజకీయ యుద్ధభూమిలా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య జరుగుతున్న ఈ పోరు కేవలం అధికార మార్పిడికే పరిమితం కాదు.. అది ప్రాంతీయ గౌరవం, జాతీయ రాజకీయాల ప్రభావం, సామాజిక సమీకరణాల మధ్య జరుగుతున్న ఒక కీలక సమరంగా మారింది. ఈసారి ఎన్నికలపై ఆసక్తిని పెంచుతున్న అంశాలు అనేకం. మమతా బెనర్జీ ఇప్పటికే వరుస విజయాలతో తన స్థాయిని నిరూపించుకున్నారు. మరోవైపు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి, ఈసారి ఎలాగైనా బెంగాల్లో అధికారాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఈ పోరు కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఇటీవల కృత్రిమ మేధస్సు ఆధారిత అంచనాలు కూడా ఎన్నికల చర్చను మరింత వేడెక్కించాయి. పలు ఎఐ ప్లాట్ ఫార్మ్ తృణమూల్ కాంగ్రెస్కు స్వల్ప ఆధిక్యం చూపుతున్నప్పటికీ, పోటీ మాత్రం హోరాహోరీగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అంచనాలను పూర్తిగా నిజమని భావించడం కంటే, వాటిని ఒక ట్రెండ్ సూచికగా చూడటం సముచితం. ఎందుకంటే బెంగాల్ రాజకీయాల్లో చివరి క్షణం వరకు పరిస్థితులు మారే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కూడా ఆసక్తికరంగా ఉంది. రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, ఉత్తరబెంగాల్ నుంచి దక్షిణబెంగాల్ వరకు ప్రాంతాలవారీగా రాజకీయ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రాంతాల్లో బిజెపి ప్రభావం కొంత బలంగా ఉండగా, దక్షిణ బెంగాల్.. ప్రత్యేకంగా కోల్కతా పరిసరాల్లో తృణమూల్ కాంగ్రెస్కు పట్టు గట్టిగానే ఉంది. బిజెపి ఎదుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి మత, సామాజిక సమీకరణాల్లో వచ్చిన మార్పు. హిందూ ఓటర్లలో, ముఖ్యంగా మటువా కమ్యూనిటీ వంటి వర్గాల్లో బిజెపికి పెరుగుతున్న మద్దతు గమనించదగ్గది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలు ఈ వర్గాలపై ప్రభావం చూపాయి. మరోవైపు ముస్లిం ఓటర్లు అధికంగా తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే, జంగల్ మహల్ ప్రాంతం, ఉత్తర బెంగాల్ జిల్లాల్లో బిజెపి బలం పెంచుకుంది. కానీ గ్రామీణ దక్షిణ బెంగాల్, పట్టణ పేదవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇంకా ప్రభావవంతంగా ఉన్నాయి. మహిళా ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం కూడా టిఎంసికి కీలక బలం. పార్టీల బలహీనతల విషయానికి వస్తే, తృణమూల్ కాంగ్రెస్కు అవినీతి ఆరోపణలు, స్థానిక స్థాయిలో నాయకత్వంపై అసంతృప్తి ప్రతికూలంగా మారుతున్నాయి. బిజెపి విషయంలో స్థానిక నాయకత్వ లోపం, రాష్ట్రస్థాయి కేడర్ బలహీనత వంటి అంశాలు ఇంకా సవాళ్లుగా ఉన్నాయి. అలాగే బెంగాల్ సంస్కృతిని కేంద్రంగా చేసుకుని టిఎంసి చేస్తున్న రాజకీయ ప్రయోగాలు, బిజెపి వైపునుంచి ధీటైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఓటర్ల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకవైపు తృణమూల్ సంక్షేమ పథకాల విస్తరణపై దృష్టి పెట్టగా, మరోవైపు బిజెపి అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి సారిస్తోంది. కానీ చివరకు ఓటర్లు ఎవరిని ఎంచుకుంటారన్నది కేవలం వాగ్దానాలకే పరిమితం కాదు.. స్థానిక సమస్యలు, అభ్యర్థుల ప్రభావం, ప్రాంతీయ భావోద్వేగాలు కీలకంగా మారుతాయి. ఇక మరో ముఖ్య అంశం.. ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న వివాదం. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సంఘం పాత్ర పై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఎన్నికల పారదర్శకతపై చర్చను తెరపైకి తెచ్చాయి. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అంశంగా మారే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఈసారి కేవలం ఓట్ల పోటీ కాదు..ఇది భావజాలాల పోరు, ప్రాంతీయత వర్సెస్ జాతీయత మధ్య సమరం, సంక్షేమం వర్సెస్ అభివృద్ధి మధ్య ఎంపిక. ఎఐ అంచనాలు ఒక వైపు సూచన ఇస్తున్నప్పటికీ, వాస్తవ ఫలితాన్ని నిర్ణయించేది చివరకు ఓటర్లే. బెంగాల్ ఓటరు ఎప్పుడూ అనూహ్య నిర్ణయాలతో రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తాడు. ఈసారి కూడా అదే జరుగుతుందా? లేక ఇప్పటికే ఉన్న ధోరణినే కొనసాగిస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. ఏది జరిగినా ఒక విషయం మాత్రం అనివార్యం.. బెంగాల్ తీర్పు కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే నిర్ణయించదు, అది జాతీయ రాజకీయాల్లో కొత్త సందేశాన్ని పంపిస్తుంది. 2026 ఎన్నికల తర్వాత దేశరాజకీయ చర్చలు ఏ దిశగా తీసుకెళ్తాయో నిర్ణయించే కీలక మలుపుగా ఈ తీర్పు నిలవడం ఖాయం.
హైడ్రా ఎత్తివేతపైనే తొలి సంతకం
మన తెలంగాణ/హైదరాబాద్/కాటారం/జగిత్యా ల ప్రతినిధి: బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హై డ్రాను ఎత్తి అవతల పడేస్తామని బిఆర్ఎస్ పార్టీ అ ధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్రావు ప్రకటించా రు. రాష్ట్రంలో నూటినూరు శాతం మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగా నే తొలి సంతకంతోనే హైడ్రాను తీసి అవతల పారేస్తామని వెల్లడించారు. హైదరాబాద్లో హైడ్రా అని పెట్టి అన్యాయంగా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. పిల్లల పుస్తకాలు తీసుకోవడానికి కూడా అనుమతించకుండా పేదల ఇళ్లు కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో హైడ్రా తరహాలో నిజామాబాద్లో నిడ్రాను తీసుకువస్తామని పిసిసి చీఫ్ ప్రకటించారని అన్నారు. జగిత్యాలలో జిడ్రా నా? అంటూ ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతామని అంటున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ చెయ్యాల్సిందే అని, ఇం డ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని చెప్పారు. మూ సీ పేరుతో 15వేల ఇండ్లు కూలగొడుతున్నారని, అన్ని వేల ఇం డ్లు ఎందుకు కూలగొట్టుడని ప్ర శ్నించారు. జగిత్యాల మాజీ ఎంఎల్ఎ జీవన్రెడ్డి అధినేత కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ జీవన్రెడ్డికి గులాబీ కం డువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సుమారు 40 మంది తన ముఖ్య అనుచరులతో కలిసి ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, కీలక ప్రకటన చేశారు. జీవన్రెడ్డిని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జీవన్రెడ్డి అని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బిఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. తాను, జీవన్రెడ్డి భిన్న రాజకీయ వేదికల వల్ల వేర్వేరుగా పని చేశామని, వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ తాము 40 -45 ఏళ్లుగా మంచి స్నేహితులమని చెప్పారు. జీవన్రెడ్డి, తాను కలిసి ఎంతో పని చేశామని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్లో సభ పెడితే అక్కడికి ప్రజాప్రతినిధిగా జీవన్ రెడ్డి తన వద్దకు వచ్చి బోర్నపల్లి దగ్గర గోదావరిపై బ్రిడ్జి కావాలని అడిగారని గుర్తుచేశారు. అక్కడి నుంచే ఆదేశాలిచ్చి, 70 కోట్లు మంజూరు చేసి బ్రిడ్జి కట్టించానని తెలిపారు. తన నియోజకవర్గం పట్ల జీవన్ రెడ్డికి ఉన్న ప్రేమ అద్భుతమని కొనియాడారు. అందుకే జీవన్ రెడ్డికి మంచి పేరు ఉందని అన్నారు. జీవన్రెడ్డి బిఆర్ఎస్లో చేరితే ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రభావం ఉంటుందని సర్వేలు చెప్పాయని అన్నారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్లో చేరారంటేనే ఒక ఊపు వస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కెసిఆర్ జీవన్రెడ్డిని కోరారు. జీవన్రెడ్డి నిఖార్సయిన నేత అని, ఆయనకు పదవులు కొత్తకాదు అని పేర్కొన్నారు. అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని తాను ఆయనతో చెప్పానని అన్నారు. తాను, జీవన్రెడ్డి కలిసి పనిచేస్తామని చెప్పారు. జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మావంతు అంటూ సభికులకు ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆయన బ్రహ్మాండమైన పదవి వస్తుందని హామీ ఇచ్చారు.జీవన్ రెడ్డికి 75 ఏండ్లు వచ్చాయని, తనకు కూడా 72 ఏళ్లు వచ్చాయని తెలిపారు. ఇక్కడ దరిద్రం పోయేదాకా, టాప్ టు బాటమ్ అన్ని వర్గాల వారు.. ఇది మా తెలంగాణ, మేం గర్వంగా బతుకుతాం.. మేం సంతోషంగా బతుకుతామని తలెత్తుకుని చెప్పేదాకా మనం సేవ చేయాల్సిందేనని జీవన్రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. చివరి శ్వాస దాకా తెలంగాణకు సేవ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 75 ఏళ్లు వచ్చాయంటే నడవడదని జీవన్ రెడ్డిని ఉద్దేశించి కెసిఆర్ అన్నారు. మీకు ఇప్పుడు 50 ఏళ్లే.. ఇప్పుడు మీ వయసు 25 ఏళ్లు తగ్గిపోయిందని చమత్కరించారు. యువకునిలా, అంతటి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోదామని సూచించారు. ఈ ఎదవలు కెసిఆర్ చావాలంటే ఛస్తాడా : రేవంత్ రెడ్డికి కెసిఆర్ కౌంటర్ సిఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే కెసిఆర్ చావాలని అంటున్నారని మండిపడ్డారు. “నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. నా కొడకా ఏం అనుకుంటున్నావో” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎదవలు చావాలంటే కెసిఆర్ ఛస్తాడా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో చేశామని తెలిపారు. చెరువులను బందోబస్తు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని మిషన్ కాకతీయ చేపట్టామని పేర్కొన్నారు. రైతులు కూడా ఒక ఉద్యమంలా ఇందులో పాల్గొన్నారని చెప్పారు. అక్కడి నుంచి మొదలుపెడితే పదేళ్లలో ఎన్నో చేశామని తెలిపారు. వట్టి మాటలు, గఫ్ఫాలు కొట్టుడు కాకుండా ఎన్నో చేశామని తెలిపారు. ఈ ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేసి, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నిలబడం, ఓట్లు అడగమని శాసనసభలో నిలబడి చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారా..? అని అడిగారు. తాను చెప్పి.. ఐదేళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి మారుమూల పల్లెల్లకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఐదేళ్లు మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా వచ్చాయని తెలిపారు. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టిందని ప్రశ్నించారు. నీళ్లు రావాలంటే.. లాగులు పలిగేదాకా సంపాలని సూచించారు. మంచి మాటకు కాకపోతే అంతే చేయాలన్నారు. పొద్దున లేస్తే కెసిఆర్ సావాలని అంటారని మండిపడ్డారరు. ఈ సందర్భంగా కెసిఆర్ ఒక కథ చెప్పారు. “ఇళ్లలో ఉట్టి మీద ఎండిపోయిన చేపలు, రొయ్యలు దాచిపెడతారు...ఆ ఉట్టి పిల్లికి అందదు...అందుకే పిల్లి శాపం పెడతది... తాడు తెగాలి... ఉట్టి పడాలి” అని పిల్లి శాపం పెడుతుందని, పిల్లి శాపానికి ఉట్టి పడతదా..? అని ప్రశ్నించారు. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉండగా.. ఈ ఎదవలు కెసిఆర్ చావాలంటే కెసిఆర్ చస్తాడా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవి ఒకప్పుడు తెలంగాణలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదని కెసిఆర్ అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంఎల్ఎలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేని, మాట్లాడలేని పరిస్థితి ఉండేదని, అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన రోజులు ఉండేవి అని గుర్తు చేసుకున్నారు. మన బతుకు, మన భాష, ఉద్యోగాల మీద దాడి ఉండేదని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తాను తెలంగాణ కోసం పోరాడతానని హెచ్చరించానని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో కరెంట్ చార్జీల పెంపుదల వాపసు తీసుకోవాలని, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరుగదని తాను తెలంగాణ ఉద్యమానికి పోవాల్సి వస్తదని చెప్పానని గుర్తు చేశారు. ఆయన కరెంట్ ఛార్జీల పెంపును వాపస్ తీసుకోలేదని, కొంతమంది రైతులు పోరాటానికి హైదరాబాద్కు వస్తే పట్టపగలు 11.30 గంటలకు విచ్చలవిడిగా కాల్చి చంపేస్తే ముగ్గురు రైతులు అక్కడికక్కడే చనిపోయారని చెప్పారు. ఇక లాభం లేదని భావించి ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎదురు తిరిగితే వీళ్లు కాల్చి చంపారు... జెండా ఎత్తడం తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమానిక శ్రీకారం చుట్టామని తెలిపారు. వెంబడి ఎవరు వచ్చినా రాకున్న ప్రజలు ఉన్నరు.. యువకులు ఉన్నరు అని బయలుదేరానని అన్నారు. తెలంగాణ కోసం తాను బయలుదేరితే అవహేళనలు చేశారని మండిపడ్డారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే.. ఉద్యమ కెరటంగా తయారై తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు.. తెలంగాణలో ఒకప్పుడు రైతాంగం ఆగమాగమైపోయి చెట్టుకొకలు పుట్టుకొకరు అయిపోయారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువ ఉన్నట్వంటి జగిత్యాల, మెట్పల్లి, చొప్పదండి ప్రాంతాల నుంచి కూడా దుబాయికి, బొంబాయికి వలసలు, పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు ఉండేవని అన్నారు. కొన్ని పార్టీలు చేసే పని చూస్తే బాధ కలిగేదని అన్నారు. మహబూబ్ననగర్ జిల్లాలో నూటికి 90 మంది యువకులు వలసపోయేవారని, బతుకాలంటే బతుకపోవాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. అక్కడ ఉన్న ముసలోళ్లకు వలస వెళ్లిన వాళ్లు డబ్బులు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతికే పరిస్థితి ఉండేదని అన్నారు. కొన్ని పార్టీల వాళ్లు తామేదో గొప్పతనం చేసినట్టు గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు అని, అంత అద్వాన్న స్థితికి ఆనాటి పాలకులు తెలంగాణను దిగజార్చారని పేర్కొన్నారు. అది కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వం ఏదైనా తెలంగాణకు మంచినీళ్లు ఇయ్యలె.. కరెంట్ ఇవ్వలేదని చెప్పారు. మన నాయకులు అందరూ ఆ పార్టీలకు కట్టుబానిసలైపోయారని అన్నారు. మూడో విడత రైతుబంధు రావాలంటే మరో సభ పెట్టాలా..? బిఆర్ఎస్ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉండేవాళ్లు అని, కాంగ్రెస్ వచ్చాక రైతులకు అన్నీ బాధలే అని కెసిఆర్ విమర్శించారు. ఇప్పుడు ఎరువులు కావాలంటే యాప్లో చూసుకోవాలని, షాప్లో లేని ఎరువులు యాప్లో ఉంటాయా..? అని ప్రశ్నించారు. రైతుబంధు కోసం రైతులు ఆకాశం వైపు చూడాల్సి వస్తుందని అన్నారు. ఒక్కసారే వేయాల్సిన రైతుబంధు డబ్బులను ఒక్కో ఎకరానికి ఒకసారి వేస్తున్నారని విమర్శించారు. జగిత్యాలలో కెసిఆర్ సభ అనగానే ఈరోజు మళ్లీ రైతుబంధు డబ్బులు విడుదల చేస్తున్నారని, మూడో విడత రైతుబంధు రావాలంటే కెసిఆర్ మరోసారి సభ పెట్టాలా.. ఇది ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే రాష్ట్రంలో ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఒక రకమైన దోపిడి, గుండాగిరి చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తీరు కూల్చివేతలు,కాల్చివేతలు తప్ప ఏమీ లేదని విమర్శించారు. కరెంట్ మోటార్లకు మీటర్ పెట్టమని ఆనాడు మోడీ తన మెడపై కత్తి పెట్టినా, రైతుల కోసం మీటర్ పెట్టనియ్యలేదని అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం ఈ ప్రభుత్వం మీటర్ పెట్టే నిబంధనపై సంతకం పెట్టిందని చెప్పారు. కులవృత్తులు బాగుండాలని తమ హయాంలో కొన్ని పథకాలు ప్రారంభించామని, కానీ, ఈ ప్రభుత్వం యాదవులకు గొర్రె పిల్లలు, ముదిరాజ్లకు చేప పిల్లలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ హయంలో ఎవరు అడగకపోయినా బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చామని తెలిపారు. 6 గ్యారెంటీలు, 420 హామీలుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్ట్లను పండబెట్టిందని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చెయ్యకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే అని అని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జై యాత్ర నుంచే మొదలు కాబోతుందని కెసిఆర్ అన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి హరీశ్రావు హస్తిన పర్యటనకు వెళ్ళడం రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్రెడ్డిని బిఆర్ఎస్లో చేర్చుకోవడం హరీశ్కు ఇష్టంలేకే బిజెపి నేతలతో కలిసి రహస్యంగా హస్తినకు వెళ్ళారని ఇరువురు మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడి చేశారు. ఈ ప్రకటనలు ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఈ ఆరోపణలను, అ నుమానాల వ్యాఖ్యలను బిఆర్ఎస్ అధినాయక త్వం తోసిపుచ్చింది. బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు హరీశ్రా వు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినో ద్ కుమార్ ఢిల్లీ వెళ్ళారని పార్టీ అధినాయకత్వం సో మవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాళేశ్వ రం ప్రాజెక్టుపై కమిషన్ వెలువరించనున్న తీర్పు పై చర్చించేందుకు త్రిసభ్య కమిటీలో భాగంగా హరీశ్రావు వెళ్ళారని పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడు తూ హరీశ్రావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నారన్న విషయాలు బయటకు రావాలన్నారు. బిఆర్ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. బిఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్కరోజే విఐపిః చామల కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి బిఆర్ఎస్లో చేరిన ఒక్క రోజే విఐపిగా ఉంటారన్నారు. బిఆర్ఎస్లో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు. జీవన్ రెడ్డిని హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. కెటిఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదని ఆయన తెలిపారు. రెండవ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కెటిఆర్ హరీష్ రావును బ్రతిమిలాడి జీవన్రెడ్డి ఇంటికి తీసుకెళ్ళారని ఆయన చెప్పారు. కెసిఆర్ నివాసానికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదన్నారు. కెసిఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తుంటే హరీష్ రావు ఢిల్లీకి ఎందుకెళ్ళారని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ఎవరెవరిని కలిసారన్నది త్వరలో బయటకు వస్తుందన్నారు. హరీష్ రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్లో చేరడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని చెప్పే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్లో ముసలం మొదలైందని, అది మునిగిపోయే పడవ అని ఎంపీ చామల అన్నారు. రహస్యంగా ఢిల్లీకి..ః అద్దంకి ఆరోపణ కౌన్సిల్లో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక ఆ పార్టీ చీలికకు దారీ తీస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డిని చేర్చుకోవడాన్ని హరీష్ రావు వ్యతిరేకించారని ఆయన తెలిపారు. ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫాం హౌస్కు జీవన్ రెడ్డి వెళ్ళినప్పుడు హరీష్ రావు అక్కడ లేరని ఆయన చెప్పారు. బిజెపి నేతలతో కలిసి హరీష్ రావు రహస్యంగా ఢిల్లీ వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. హరీష్ రావు అలక వెనుక కారణాలు ఏమిటీ?, పార్టీ చీలికకు హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారా?, అందుకే ఢిల్లీ వెళారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అద్దంకి అన్నారు. హరీష్ రావు పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి జీవన్ రెడ్డి చేరిక వల్ల ఏర్పడిందన్నారు. ఏడాది తర్వాత కెసిఆర్ జగిత్యాల సభకు వెళితే ఆ సభకు హరీష్ రావు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. ఖండించిన బిఆర్ఎస్ నాయకత్వం.. ఇదిలాఉండగా కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను బిఆర్ఎస్ ఖండించింది. తమ పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లిందని ఆ పార్టీ నాయకత్వం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బి. వినోద్కుమార్ ఉన్నారని తెలిపింది. ఈ నెల 22న హైకోర్టులో కాళేశ్వరం కమిషన్పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరు ఢిల్లీ వెళ్లారని వివరించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా చర్చిస్తుందని తెలిపింది. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించనున్నట్లు పేర్కొంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరణ ఇదిలాఉండగా హరీష్ రావుతో వెళ్ళిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మాట్లాడేందుకు వచ్చామన్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పొద్దున కాంగ్రెస్ తరపున మాట్లాడి రాత్రి బిజెపి నేతలతో చర్చలు జరపడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని ఆయన విమర్శించారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు ..కాంగ్రెస్ నేతలకు అందరూ రేవంత్ లాగానే ఉంటారనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు. బిఆర్ఎస్ ఏదో కలకలం జరగాలని కాంగ్రెస్ నేతలు గుంత కాడి నక్కల్లా ఎదురుచూస్తున్నారని, వారి ఆశలు ఎప్పటికీ నెరవేరవని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు మంత్రులు హరీష్ రావుపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. మంత్రి తుమ్మలకు కౌంటర్ ఇదిలాఉండగా అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన ఆరోపణలను ఎంపీ వద్దిరాజు ప్రస్తావిస్తూ అవి నిరాధారమైనవని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తమ పార్టీలో చేరడాన్ని తామంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.చాలా రోజుల తర్వాత కెసిఆర్ సభ పెడుతుండడంతో కాంగ్రెస్ నాయకులు దిక్కుతోచని స్థితిలో భీతిల్లిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరడం వెనుక ఉద్దేశమేమిటో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ రాజకీయ పునర్జన్మ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి మంత్రి మాట్లాడారని, బిఆర్ఎస్, కెటిఆర్, హరీష్ రావులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల తరహాలో డబుల్ గేమ్ ఆడడం, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడం తమకు రాదని, ప్రభుత్వం తీసుకునివచ్చిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూనే కేంద్ర మంత్రి ఇంట్లో జరిగిన విందుకు హాజరు కావడాన్ని ఎంపీ వద్దిరాజు ప్రశ్నించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జెఇఇ మెయిన్ 2026 రెండో విడత ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ), సాయం త్రం పేపర్ -1 పరీక్ష తుది ఫలితాలను ప్రకటించింది. జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాల్లో తె లుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా 26 మందికి 100 పర్సంటైల్ స్కోరు రాగా వీరిలో ఏకంగా 10 మంది తెలు గు విద్యార్థులే ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన డి.భవితేశ్ రెడ్డి, మంథా శివ కామేశ్, సాయి రిత్విక్ రెడ్డి, వివాన్ శరద్ మహిశ్వరి, రిషి ప్రేమ్నాథ్ వంద శాతం పర్సంటైల్ సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి, నరేంద్ర బాబు గారి మ హిత్, తుంగా దుర్గా సుప్రభాత్, పసల మోహి త్, బిజ్జం వెంకట చంద్ర శేఖర్ రెడ్డి 100 శాతం పర్సంటైల్తో సత్తా చాటారు. పరీక్ష రాసిన 10,34,330 మంది విద్యార్థులు జెఇఇ మెయిన్ -2026 తుది విడత పరీక్షను దే శవ్యాప్తంగా 304 నగరాలలో 566 పరీక్షా కేం ద్రాలతోపాటు విదేశాలలోని 14 నగరాలలో నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 8 వరకు జెఇఇ మెయిన్ 2 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం ఎన్టిఎ జెఇఇ మెయిన్ తుది కీ విడుదల చేసి, సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది.ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 11,10,904 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 10,34,330 మంది(93.11 శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 1 (బిఇ/బి.టెక్ కోర్సులు) పరీక్షకు హాజరైన వారిలో 3,26,167 మంది అమ్మాయిలు, 7,08,163 మంది అబ్బాయిలు ఉన్నారు. జెఇఇ మెయిన్ సెషన్ 1, సెషన్ 2 పరీక్షల్లో రెండింటిలో విద్యార్థుల ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు.జెఇఇ మెయిన్ అర్హత సాధించిన వారిలో టాప్ 2.50 లక్షల మంది విద్యార్థులకు జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. మే 17న జరిగే ఈ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 4వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 1.ఆరుష్ సింఘాల్(ఛండీఘర్) 2. జొన్నల రోషన్ మనిదీప్రెడ్డి(ఆంధ్రప్రదేశ్) 3. శ్రీయాస్ మిశ్రా(ఢిల్లీ ఎన్సిటి) 4. మంత శివ కామేష్(తెలంగాణ) 5. సిద్ధార్థ్ శ్రీకాంత్ అథలె(మహారాష్ట్ర) 6. నరేంద్రబాబు బారి మహిత్(ఆంధ్రప్రదేశ్) 7. తుంగ దుర్గా సుప్రభాత్(ఆంధ్రప్రదేశ్) 8. అర్నవ్ గాంధీ(హర్యానా) 9. శుభమ్ కుమార్(బీహార్) 10. ఆదిత్య గుప్త (ఢిల్లీ ఎన్సిటి) 11. తమ్మిన గిరీష్(ఢిల్లీ ఎన్సిటి) 12. కబీర్ ఛిల్లార్(రాజస్థాన్) 13. చిరంజీబ్ కర్(రాజస్థాన్) 14. భావేష్ పాత్ర(ఒడిషా) 15. అనయ్ జైన్(హర్యానా) 16. అతర్వ పంజాబీ(ఢిల్లీ ఎన్సిటి) 17. అర్నవ్ గౌతమ్(రాజస్థాన్) 18. దొరనాల భవితేష్రెడ్డి(తెలంగాణ) 19. పసల మొహిత్(ఆంధ్రప్రదేశ్) 20. మాధవ్ విరాదియా(మహారాష్ట్ర) 21. పురోహిత్ నిమయ్(గుజరాత్) 22. సాయి రిత్విక్రెడ్డి వెంకట్రెడ్ వల్ల(తెలంగాణ) 23. వివన్ శరద్ మహీశ్వరి(తెలంగాణ) 24. బిజ్జమ్ వెంకట చంద్రశేఖర్రెడ్డి(ఆంధ్రప్రదేశ్) 25. యశ్వర్ధన్(రాజస్థాన్) 26. రిషి ప్రేమ్నాథ్(తెలంగాణ)
సిబిఐ భయంతోనే హస్తినకు హరీశ్ పరుగులు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ నుంచి తప్పించుకునేందుకే మాజీ మంత్రి హరీశ్రావు ఢిల్లీకి ప రుగెత్తారని, జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ బహిరం గ సభ పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. సిబిఐ విచారణ ప్రారంభం కాకముం దే బిఆర్ఎస్ నాయకులు న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని ముందే తెలిసి, బిజెపి నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీశ్రావు ఢిల్లీకి వెళ్లారని సిఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. హరీష్రావు ఢిల్లీకి వెళ్లారని మీడియా బయటపెట్టినా బిఆర్ఎస్ నుం చి ఎలాంటి ప్రకటన లేదని, హరీష్రావు రహస్య పర్యటన వెనుక ఉన్న మతలబు ఏమిటో, ఎవరెవరిని కలిశా రో తెలంగాణ ప్రజలకు చెప్పాలని సిఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణను అడ్డుకునేందుకు హరీష్రావు ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపడం ప్రమాదకరమని ఎన్డిఎస్ఏ చెప్పిందని, నిర్మాణంలో ఘోరతప్పిదాలు జరిగాయని పిసి ఘోష్ జ్యూడిషయల్ కమిషన్ కూడా చెప్పిందని సిఎం గుర్తు చేశారు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పి ల్లర్లను పరిశీలించిన అనంతరం సిఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిజెపిని అడ్డుపెట్టుకొని కేసుల నుంచి బయటపడతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊ రుకోదని, కాళేశ్వరం దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిజాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బిఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టు ను ఊరికే వదిలిపెట్టబోమని, దానికి మరమ్మతులు చేసి ప్రజలకు నీరు అందిస్తామని సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి నెల రోజుల క్రితమే అధికారుల తో, సాంకేతిక నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసుకు న్నా మన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాము ఇప్పటికే సాంకేతిక నిపుణులు, మూడు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించామని, శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు మొదలుపెట్టామని సిఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు, ఇరిగేషన్ నిపుణు లు పాల్గొని బ్యారేజీ స్థితిగతులను నిశితంగా పరిశీలించా రు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బిఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా నేడు రాజకీయ సభలు పెట్టుకున్నార ని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుమతులు ఇచ్చిందని సిఎం పేర్కొన్నారు. అవసరమైన ప్రణాళికలతో ముం దుకు వెళతామని, తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు 1975లో అప్పటి సిఎం జలగం వెంగళరావు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని రేవంత్రెడ్డి గు ర్తు చేశారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.38,063 కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రా రంభించి రూ. 11,700 కోట్లు ఖర్చు చేశారన్నారు. అ యితే, ప్రాణహిత-చేవెళ్ల ద్వారా ఆర్థిక, రాజకీయ ప్రయోజనం లేదన్న ఉద్దేశంతోనే కెసిఆర్ రీడిజైనింగ్ పేరుతో దానికి పేరు, ఊరు మార్చేశారని సిఎం రేవంత్రెడ్డి విమర్శించారు. అంచనాలను ఏకంగా రూ.లక్షా 50 వేల కోట్లకు పెంచారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డా రు. 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డను అద్భుతమని భ్రమలు కల్పించి 2018లో రాజకీయ లబ్ధి పొందారని, తీరా 2023లో బ్యారేజీ కుప్పకూలడంతో ఎన్నికల కోసం ఆ నిజాలను దాచిపెట్టాలని చూసినా ప్రకృతి బ యటపెట్టిందని సిఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్, హరీశ్రావులను జైల్లో వేయాలని, సిబిఐకి కేసు అప్పగించాలని ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023 నవంబర్ 1న అప్పటి సిఎం కెసిఆర్ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం దోపిడీపై పిసి ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చిందని, దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపిందని ఆయన తెలిపారు. కెసిఆర్, హరీశ్ రావులను జైల్లో వేయాలని, సిబిఐకి కేసు అప్పగించాలని గతంలో డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పుడు ఎందు కు మౌనంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని సిఎం ప్రశ్నించారు. రాష్ట్రం పదే పదే లేఖలు రాస్తున్నా సిబిఐ స్పందించకపోవడాన్ని సిఎం రేవంత్రెడ్డి తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వా రా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీపాద ఎల్లంపల్లే ప్రాణవాయువు అని, హరీశ్రావు నిక్కర్ వేసుకోకముందే ఆ ప్రాజెక్టు ఉందని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక పంటలు పండించారని స్పష్టం చేశారు.
నేటి అర్ధరాత్రినుంచే ఆర్టిసి కార్మికుల సమ్మె
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్టిసి కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టిసి జెఎసి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తోంది. ఏప్రిల్ 21 అర్ధరాత్రి అంటే 22వ తేదీ మొదటి డ్యూటీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు జెఎసి వెల్లడించింది. దీంతో ఆర్టిసి బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. యాజమాన్యం, చర్చలు జరుపడానికి కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని డిపోల్లో ఆర్టిసి జెఎసి నేతలు కార్మికులను సమ్మెకు సంసిద్దం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారికంగా ఎటువంటి పిలుపు రాకపోవడం ఉత్కంఠను పెంచుతోంది. ఆర్టిసి కార్మికులు కోరుతున్న డిమాండ్లలో ‘ప్రభుత్వంలో ఆర్టిసి విలీనం’, ‘యూనియన్ల పునరుద్ధరణ’ మినహా మిగిలిన అన్నింటిపై సానుకూలత వ్యక్తం చేసినా, జెఎసి నేతలు మాత్రం తమ పట్టు వీడటం లేదని తెలుస్తోంది. సమ్మె ప్రారంభమైతే ప్రజారవాణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. లక్షలాది ప్రయాణికులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అద్దె బస్సులతో పాటు పాఠశాల బస్సులను కూడా వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక సమ్మెను నివారించేందుకు కూడా కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు, ఆర్టిసి జెఎసి నాయకుల మధ్య సమావేశం జరిగే అవకాశముంది. ఈ చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయా? లేక సమ్మె తప్పదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెఎసి వెనుక 40 వేల మంది కార్మికుల బలం ఉందని నేతలు తెలిపారు. . కార్మికులంతా ఏకతాటిపై ఉన్నారని, విభజించు పాలించు అనే ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదని,. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని జెఎసి నేతలు అంటున్నారు.
మంగళవారం రాశి ఫలాలు (21-04-2026)
మేషం రావలసిన బకాయిలు సకాలంలో అందవు. ఖర్చు అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలసిరావు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృషభం స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మిధునం బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది. సింహం ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలు కలుగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకులు తప్పవు. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సంతాన విద్యా, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కన్య విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్ధిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలకు లోటు ఉండదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు పరిష్కారమౌతాయి. తుల పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆర్ధిక పరమైన అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల లాభిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చికం ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధనస్సు ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది. మకరం కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. కుంభం చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. మీనం పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు అందుతాయి. వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.
బసవేశ్వరుడి స్ఫూర్తితో పనిచేస్తాం
బసవేశ్వరుడి స్ఫూర్తితో తా ము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ సామాజిక న్యా యం కోసం పని చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తమ పార్టీ మహిళలకు 33 శాతం టికెట్లు, పార్టీ పదవులు ఇస్తుందని ప్రకటించారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొం దారని వ్యాఖ్యానించారు. బసవేశ్వరుడి 839వ జయంతి సం దర్భంగా సోమవారం తెలంగాణ జాగృతి నాయకులతో క లిసి ట్యాంక్బండ్పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, 839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టిందని అన్నారు. ఆ రోజు బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నామని చెప్పారు. కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వం ఉండాలని బసవేశ్వరుడు చెప్పారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన సమానత్వం, సమాన అవకాశాల కోసం మనం ఈ రోజుకు పాటు పడుతున్నామంటే మ నం వెనుకబడి ఉన్నట్టు లెక్క అని పేర్కొన్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లును పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయని మండిపడ్డారు. బిల్లు పాస్ అయితే బాగుండేదని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే మరో పార్టీ పది సీట్లు ఇచ్చిందని, మొత్తంగా అసెంబ్లీలో ఎనిమిది మంది మహిళా ఎంఎల్ఎలు ఉన్నారని అన్నారు.
అహ్మదాబాద్: ఐపిఎల్లో ముంబై ఇండియన్స్ రెండో విజయం నమోదు చేసింది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో ముంబై 99 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ హీరోచిత శతకంతో జట్టును ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ 45 బంతుల్లోనే ఏడు సిక్స్లు, 8 ఫోర్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ (26) ఒక్కడే కాస్త రాణించాడు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీశాడు.
. భారీ టర్బైన్ల వినియోగం. 960 మెగావాట్ల సామర్థ్యంతో 12 ఉత్పత్తి యూనిట్లు. రోజుకు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. దాదాపు 12 టీఎంసీల నీటి వినియోగం. గోదావరి పుష్కరాలకు పూర్తిచేసే లక్ష్యంతో పనులు ముమ్మరం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్న పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, రాష్ట్రానికి శాశ్వత విద్యుత్ భద్రతను అందించే […] The post వడివడిగా పోలవరం జలవిద్యుత్ appeared first on Visalaandhra .
స్పష్టం చేసిన ఇరాన్ తెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రెండో విడత శాంతి చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకు ప్రతినిధులను పంపడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా`ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ ఇరాన్ ఈ ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటి నుంచి దాన్ని […] The post అమెరికాతో చర్చల్లేవ్ appeared first on Visalaandhra .
ట్రంప్ను పక్కనపెట్టిన అమెరికా సైన్యం!
విమాన పైలెట్ను రక్షించే ఆపరేషన్పై గోప్యతఅధ్యక్షుడికి సమాచారం ఇవ్వని అధికారులు వాషింగ్టన్: ఇరాన్ భూభాగంలో ఇటీవల అమెరికా ఎయిర్మన్ రెస్క్యూ ఆపరేషన్ విషయంలో అమెరికా మిలిటరీ అధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సైతం తెలియ కుండా గోప్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో దేశాధ్యక్షుడు ట్రంప్ నకూ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదని మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ గతంలో వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకొని వారు ఆయనకు పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిసింది. […] The post ట్రంప్ను పక్కనపెట్టిన అమెరికా సైన్యం! appeared first on Visalaandhra .
ప్రజా సమస్యలపై దశలవారీ పోరాటాలు
. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై చర్చావేదికలు. పేదల ఇళ్ల స్థలాలపై రౌండ్టేబుల్ సమావేశాలు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారం దిశగా దశల వారీ పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయించింది. సోమవారం విజయవాడ దాసరి భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళా బిల్లు […] The post ప్రజా సమస్యలపై దశలవారీ పోరాటాలు appeared first on Visalaandhra .
. అప్ప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు: సీఎం చంద్రబాబు. పుట్టినరోజున అన్నక్యాంటిన్లో స్వయంగా వడ్డించిన సీఎం దంపతులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఫలాలు దక్కినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సంద ర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్కు […] The post ఆర్థిక అసమానతలు తగ్గాలి appeared first on Visalaandhra .
వచ్చే 4, 5 రోజులుతీవ్ర వడగాడ్పులు
ఐఎండీ వెల్లడిన్యూదిల్లీ: దేశంలో ఇప్పటికే ఎండలు మండిపోతుండగా… రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 మధ్య వివిధ తేదీల్లో హర్యానా, చండీగఢ్, దిల్లీ, పంజాబ్, తూర్పు రాజస్థాన్, విదర్భ, చత్తీస్గఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గంగానది పరివా హక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని […] The post వచ్చే 4, 5 రోజులుతీవ్ర వడగాడ్పులు appeared first on Visalaandhra .
కొల్లేరు అభయారణ్యం పరిధికుదించండి
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖవిశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20వేల ఎకరాలు తగ్గించేలా 48వ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్బీడబ్ల్యూఎల్) సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది. దీని వల్ల శాంతిభద్రతల సమస్యలు […] The post కొల్లేరు అభయారణ్యం పరిధికుదించండి appeared first on Visalaandhra .
సంస్కృత భాషా ప్రచారానికి ఆర్ఎస్ఎస్ భగవత్ పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో సంస్కృత భాషా ప్రచారానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. సంస్కృతం భాషలిన్నిటినీ కలిపే వారధి అని భారతీయ సంస్కృతికి మూలమని ఆయన అభివర్ణించారు. ఇది ఇతర భాషలను దెబ్బతీయదని, దేశం లోని విభిన్న భాషల మధ్య సంబంధాన్ని బలపరుస్తుందని భగవత్ స్పష్టం చేశారు. సంస్కృత్ భారత్ నూతన కేంద్ర కార్యాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “భారత దేశం కేవలం ఒక భౌగోళిక, లేదా రాజకీయ అస్తిత్వం కాదా. ఇది ఒక సజీవ సంప్రదాయం. ఈ దేశ ఆలోచనా విధానానికి, జీవన సంస్కృతికి సంస్కృతమే మూలం. అందుకే సంస్కృతం కేవలం భాషకాదు” అని వివరించారు. అన్ని భాషలకు సంస్కతం తల్లి వంటిదని, దేశం లోని భాషలన్నిటికీ అనుసంధానమైన వారధి అని, 30 నుంచి 40 శాతం పదాలు సంస్కృతం నుంచి లేదా తద్భావం నుంచి వెలువడ్డాయని పేర్కొన్నారు. సంస్కృత్ భారత్ రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)కు అనుబంధ సంస్థ.
ఎయిర్టెల్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను 4.6 శాతం పెంచింది. ఇప్పటివరకు రూ.859 గా ఉన్న ప్లాన్ ధరను ఇప్పుడు రూ. 899 లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5జిబి డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అంతేకాకుండా, రూ.799 ప్లాన్ను ఎయిర్టెల్ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఇదే తరహా ప్లాన్ను రూ.859 లకే అందిస్తున్నాయి.
ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా?: మంత్రి సీతక్క
ఉచిత బస్ ప్రయాణ పథకంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. ఉచిత బస్ పథకాన్ని పనికిమాలినదిగా అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని మంత్రి సీతక్క సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే, దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం మీకు ఉందా అని కెసిఆర్ను ప్రశ్నించారు. ఈ ఉచిత బస్ పథకం ద్వారా లక్షలాది మహిళలు ప్రతి రోజు ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుంటూ, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు సులభంగా పొందుతున్నారని ఆమె వివరించారు. ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్ల మేర మహిళలకు ప్రయాణ వ్యయ భారం తగ్గిందని తెలిపారు. ఇది కేవలం పథకం మాత్రమే కాదు, మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక స్వేచ్ఛకు దారితీసే కీలక అడుగు అని మంత్రి స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ఈ పథకాన్ని ఓర్వలేక, దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి విమర్శించారు. మహిళలు బయటకు రావడం, తమ పనులు స్వయంగా చేసుకోవడం ఇష్టపడని దొరతనపు ఆలోచనల వల్లే ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని అన్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ...............
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో కొన్ని రోజులుగా వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ఒక వైపు ఎండలు దంచి కొడుతుంటే, మరోవైపు వరుణు కూడా పలు ప్రాంతాల్లో పలుకరించి పోతున్నాడు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, పలు ప్రాంతాల్లో ఇదే స్థాయిలో వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీవ్రమయిన ఈదురు గాలులు వీస్తాయని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, సోమవారం రాష్ట్రంలో మంచిర్యాల, జయశంకర్ భూపాలిపల్లిలో అత్యధికంగా 42.8 డిగ్రీలు నమోదు కాగా, కొమరంభీం ఆసిఫాబాద్లో 42.7, ములుగులో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురుస్తున్నా ఎండల తీవ్రత, గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వర్షాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.
చిప్స్ నుంచి షిప్ల వరకూ కొరియా-భారత్ బంధం
న్యూఢిల్లీ: ప్రపంచస్థాయి తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారత్, దక్షిణ కొరియాలు శాంతి సందేశాన్ని బలీయంగా విన్పిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యం 50 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని సంకల్పించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షులు లీజే మ్యూంగ్తో విస్తృత స్థాయి చర్చల తరువాత ప్రధాని మోడీ సోమవారం లీజేతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. చిప్స్ నుంచి షిప్స్ వరకూ, ట్యాలెంట్ నుంచి టెక్నాలజీ వరకూ, ఎంటర్టైన్మెంట్ నుంచి ఎనర్జీ వరకూ ఇరుదేశాల మధ్య సహకారం విస్తరిస్తుందని ఈ సందర్భంగా ఇరువురు నతలు తెలిపారు. చర్చల ఫలితంగా ఇరుదేశాల మధ్య పలు కీలక రంగాల్లో సహకారానికి 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా పారిశ్రామిక సహకార వ్యవస్థ సంవిధానం ఖరారు , స్టీల్ సప్లయి వ్యవస్థల పటిష్ట ఒప్పందాలు ఉన్నాయి. ఇంధన, కీలక ఖనిజాలు, నౌకానిర్మాణాలు, సెమికండక్లర్ రంగాలలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఇనుమడించనుంది. ఇండియా సౌత్ కోరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం దిశలో ఉమ్యడి కార్యాచరణకు దిగాలని సంకల్పించారు. ఇరుదేశాల మధ్య సంయుక్త సమగ్ర చర్చల ప్రక్రియ ఇంతకు ముందు అమలులో ఉంది. దీనిని మరింతగా బలోపేతం చేయడానికి ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దక్షిణ కొరియా నేత ఆదివారం భారత్లో మూడురోజుల పర్యటనకు వచ్చారు. దక్షిణ కొరియా నేత భారత్ పర్యటన ఉభయదేశాల విజయయాత్రల మరో దశాబ్దానికి ప్రాతిపదిక అయిందని ప్రధాని తెలిపారు.
జమ్మూ-కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
జమ్మూ-కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, 51 మంది గాయపడ్డారు. అధిక సంఖ్యలో ప్రయాణికులతో నిండిన ఒక ప్రైవేట్ బస్సు సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచి కొండ దిగువకు దూసుకెళ్లి, రోడ్డుపై తలకిందులుగా పడింది. పడేటప్పుడు ఒక ఆటో రిక్షాను కూడా ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. రామ్నగర్ ప్రాంతంలోని కాగోర్ట్ గ్రామం సమీపంలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైై్లైండ్ కర్వ్ వద్ద బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్ వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టింది. బస్సులో 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, వీరిలో మహిళలు, విద్యార్థులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది రామ్నగర్ నుంచి ఉదంపూర్కు ప్రతిరోజూ ప్రయాణించేవారు. ప్రమాదం తీవ్రత కారణంగా బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పైభాగం దాదాపు పూర్తిగా చీలిపోవడంతో రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయి. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష, స్వల్ప గాయాలు పొందిన వారికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించినట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు.రామ్నగర్ నుంచి ఉదంపూర్కు వెళ్తున్న బస్సు కొండ ప్రాంతంలో నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయి, కింద రోడ్డుపై తలకిందులుగా పడేటప్పుడు ఒక ఆటోను ఢీకొట్టింది అని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. ప్రమాద స్థలంలోనే 15 మంది మృతిచెందగా, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ఉదంపూర్- రియాసీ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివ్ కుమార్ శర్మ తెలిపారు. అనంతరం తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఉదంపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 21కి చేరింది.మృతుల్లో రామ్నగర్కు చెందిన టిలో రామ్, ప్రేమ్ నాథ్, కర్తార్ చంద్, సోంరాజ్, రామ్ చంద్, గీతా దేవి, రోమల్ సింగ్, శార్దా దేవి, సన్నీ, విశాలి దేవి, పుష్ప్ రాజ్, రామలో రామ్, గులాబో దేవి, జలం సింగ్, కేసర్ సింగ్, కాంతా దేవి, అనితా దేవి ఉన్నారు.రక్షణ చర్యల్లో స్థానికులు విశేష సహకారం అందించినట్లు శర్మ తెలిపారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రామ్నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో బస్సును తీశారు. ఇది అత్యంత విషాదకర ఘటన. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మేము అండగా ఉంటాం అని ఆయన అన్నారు. పరిస్థితిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలిన్ ప్రభాత్, జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ భీమ్ సేన్ టుటి ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని శర్మ తెలిపారు. ఉదంపూర్ నుంచి రామ్నగర్ వైపు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్కు నాయకత్వం వహించిన ఓ సైనికుడు మాట్లాడుతూ, వాహనం సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయింది. వెంటనే ఆ ప్రాంతాన్ని చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాం. కష్టపడి అనేక ప్రాణాలను కాపాడగలిగాం అని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 51 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 43 మంది ఉదంపూర్ జిల్లా ఆసుపత్రిలో, ఆరుగురు రామ్నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రత్యేక వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించినట్లు ప్రధాన కార్యదర్శి అతల్ దుల్లూ తెలిపారు.ఉదంపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాన కార్యదర్శి అతల్ దుల్లూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ప్రమాదం. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నాం అని ఆయన ఉదంపూర్ జిల్లా ఆసుపత్రిలో విలేకరులకు తెలిపారు. రక్షణ చర్యలు సమన్వయంతో, సమర్థవంతంగా జరిగాయని ప్రశంసించిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం మన లక్ష్యం కావాలి అని అన్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినంగా ఉండాలని, వాహనాల్లో అధిక లోడ్ లేకుండా చూడాలని, వాహనాల పరిస్థితి సరిగా ఉండాలని, డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉండటంతో పాటు వారి ఫిట్నెస్ను కూడా నిర్ధారించాలని సూచించారు. జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఉదంపూర్లో జరిగిన ప్రమాదం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా సంతాపం. వారికి దేవుడు ధైర్యం ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ఎక్స్లో పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాన్ని అందించాలంటూ జిల్లా పరిపాలన, పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఆరోగ్య శాఖలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలతో అండగా ఉంటుంది. అవసరమైన సహాయం అందిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్మూ-కాశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా, జమ్మూ-కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ కూడా ఈ ఘటనపై తమ సంతాపం తెలిపారు.
బిజెపికి ఎఐఎడిఎంకె దాసోహం: రాహుల్ ధ్వజం
కన్యాకుమారి (తమిళనాడు): అవినీతి కారణంగా బీజేపీకి ఎఐఎడిఎంకె నాయకత్వం దాసోహమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కన్యాకుమారి ప్రాంతంలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. తమిళభాషను, సంస్కృతిని, చరిత్రను డిఎంకె, కాంగ్రెస్, మిత్రపక్షాలు సంరక్షిస్తున్నాయని , తమిళులు వాటిని సవాలు చేస్తున్నారని వారికి (ఆర్ఎస్ఎస్) తెలుసునని పేర్కొన్నారు. ఫెడరల్ సిద్ధాంతాలను సమర్ధిస్తూ ప్రతిరాష్ట్రానికి తన స్వంత స్వరం, ప్రాతినిధ్యం ఉంటుందని, కానీ బీజేపీ ఈ విధంగా ఆలోచించడం లేదని, ఒకే సంప్రదాయం, ఒకేభాష, ఒకే చరిత్ర ఉండాలని బీజేపీ నమ్ముతోందని విమర్శించారు. తమిళనాడు తన ప్రజలచే పాలింపబడాలని, కానీ రాష్ట్రాలను బలహీనం చేసేందుకు బీజేపి ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శించారు. మణిపూర్ ఘర్షణలను ప్రస్తావిస్తూ “ శాంతియుత రాష్ట్రమైన మణిపూర్కు వాళ్లేం చేసారో చూడండి. దానికి వారు పెట్టిన చిచ్చువల్ల వందలాది మంది చనిపోయారు. సివిల్వార్ కొనసాగుతోంది ” అని ఆరోపించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్,డీ లిమిటేషన్ బిల్లులపై చర్చను గుర్తుకు తెస్తూ బీజేపీ అసలు ఉద్దేశం ఎన్నికల వ్యవస్థను మార్చడమేనని, వారు ఏం చేసినా జాతికి వ్యతిరేకమే అని అందుకని మిల్లును తాము ఓడించామని ఆరోపించారు. దేశంలో ఎవరి ప్రాతినిధ్యం తొలగించే ఏ బిల్లునైనా తాము వ్యతిరేకిస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
Revanth Reddy released the second instalment of Rythu Bharosa funds, marking a major push for farmer welfare in Telangana. The funds were distributed during a public meeting in Bhupalpally district, where ₹5,563 crore was credited to benefit over 45 lakh farmers across the state. Addressing the gathering, Revanth Reddy highlighted the government’s commitment to agriculture […] The post Revanth Reddy Releases ₹5,563 Crore Under Rythu Bharosa, Launches Sharp Attack on Jeevan Reddy and KCR appeared first on Telugu360 .
హర్మూజ్ను దాటిన 10 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి గుండా సుమారు 10 భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించి భారత్ చేరుకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో దౌత్య ప్రయత్నాల ద్వారా భారత జెండా కలిగిన ట్యాంకర్లకు , ముఖ్యంగా పుష్పక్,పరిమళ్ వంటి నౌకలకు ఇరాన్ మినహాయింపు ఇచ్చింది. ఈ నౌకల సురక్షిత ప్రయాణం వల్ల భారత్కు ఇంధన కొరత ఆందోళనలు తగ్గాయి. దేశ్గరిమ, శివాలిక్, నందాదేవి వంటి ఇతర ప్రధాన నౌకలు కూడా హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్తో జరిపిన చర్చలు ఈ సురక్షిత ప్రయాణానికి మార్గం సుగమం చేశాయి. గత శనివారం భారత నౌకలు రెండిటిపై ఇరాన్ కాల్పులు జరిపిన సంఘటనపై ఇరాన్ రాయబారిని పిలిపించి చర్చించామని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు వెల్లడించారు. ఈ నౌకలపై కాల్పులు జరిపింది తమ దళాలేనా అన్న అంశంపై దర్యాప్తు చేపటినట్టు ఇరాన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత పతాక నౌకలకు భారత నౌకాదళం అడ్వైజరీ జారీ చేసిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లారక్ ఐలాండ్కు దూరంగా ఉండాలని, తమ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే హర్మూజ్లో ప్రయాణించాలని నేవీ పేర్కొంది. ఆ జలసంధిని దాటేందుకు వేచి ఉన్న నౌకల భద్రతను నిర్ధారించేందుకే ఈ సూచనలని తెలిపింది. లారక్ ద్వీపం హర్మూజ్కు సమీపంలో ఉంది.
జపాన్లో తీవ్ర భూకంపం.. సునామీ హెచ్చరికలు
7.7 పాయింట్లతో ప్రకంపనలు రికార్డు అణు కేంద్రాల్లో అత్యయిక స్థితిపై సమీక్ష టోక్యో ః జపాన్ ఉత్తర, ఈశాన్య తీర ప్రాంతంలో సోమవారం భారీ భూంకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత అత్యంత తీవ్రస్థాయి 7.7 సూచికగా నమోదైంది. పసిఫిక్ మహాసముద్రంలో పది కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తిచారని జపాన్ వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది. పరిస్థితి తీవ్రత దశలో వెంటనే సునామీ హెచ్చరికలు వెలువరించారు. ఇవాటే, అవమోరి వంటి ప్రాంతాలు, హోకాయిడోలోనూ మూడు నుంచి నాలుగు మీటర్ల మేర ఎతైన సముద్ర అలలు చెలరేగుతాయి. దీని ప్రభావం వల్ల తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తతో ఉండాలని హెచ్చరికలు వెలువరించారు. జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4.45 గంటలకు భూకంపం రికార్డు అయింది. భూకంప తాకిడి ఉన్న తీర ప్రాంతాల వెంబడి ఉన్న నౌకలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. పలు ప్రాంతాలలో సునామీ సంబంధిత తొలిగింపుల ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనితో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. పల్లపు ప్రాంతాలకు భారీ వరదలు వచ్చే ముప్పు తలెత్తింది. భవనాలు కూడా సురక్షితం కాని పరిస్థితి ఏర్పడింది. వేగంగా వరదలు ఉంటాయని, మార్గమధ్యంలో ఉండే వారికి ప్రాణాపాయం తప్పదని అధికారులు హెచ్చరించారు. సునామీతో ఇవాటో వద్ద ఓ చోట దాదాపు 80 సెంటిమీటర్ల మేర అలలు సంభవించాయి. పలు ప్రాంతాలలో వీటి తీవ్రత దాదాపుగా 40 సెంటిమీటర్ల వరకూ ఉంది. జపాన్ అధికారిక వార్తా సంస్థలు వెలువరించిన వీడియోతో పలు రేవుల్లో ఇప్పటికే నౌకల తరలింపును అతి కష్టం మీద చేపట్టాల్సి వచ్చిందని వెల్లడైంది. పరిస్థితి తీవ్రతను సమీక్షించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు వెంటనే అత్యవసర కార్యాచరణ దళాలను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రదాని సానే టకాయిచి ప్రకటించారు. నష్ట తీవ్రతను పరిశీలిస్తున్నట్లు, ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై దృస్టి సారించినట్లు వెల్లడించారు. టోక్యో, అమోరీలలో వెంటనే బుల్లెట్ ట్రైన్ల రాకపోకలను నిలిపివేశారు. జపాన్ భూకంప తీవ్రత సూచికలో ఇప్పటి భూకంప స్థాయి అప్పర్ 5గా రికార్డు అయింది. భూకంప తాకిడి, సునామీ ప్రాంతాలలో ఎటువంటి అణు కేంద్రాలు పనిచేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జపాన్ అత్యధిక స్థాయి భూకంపాల తాకిడి దేశంగా ఉంది.
తిలక్ వర్మ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
అహ్మదాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. మొదట నెమ్మదిగా ఆడిన వర్మ.. చివర్లలో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తిలక్ 45 బంతుల్లో 7 సిక్సులు, 8 ఫోర్లు సాయంతో అజేయంగా 101 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబయికి మరోసారి మంచి ఆరంభం లభించలేదు. టాపార్డర్ బ్యాటర్లు విఫలమవ్వడంతో ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అందరూ అనుకున్నారు. ఈక్రమంలో గేర్లు మార్చిన తిలక్.. బౌండరీలతో చెలరేగిపోయాడు.చివర్లో ధనాధన్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. తిలక్ తోపాటు నమన్ ధీర్ కూడా 45 పరుగులతో రాణించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం.. కెసిఆర్ ఫైర్
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, రైతు బంధు వేయడంలేదని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేద ప్రజలను ఏడిపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ 100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని చెప్పారు. సోమవారం జగిత్యాలలో బిఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో హైడ్రా తెచ్చాం.. నిజామాబాద్లో నిడ్రా తెస్తామంటున్నారు. జగిత్యాలలో జిడ్రా కూడా తెస్తారేమో?. ఇంట్లో సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూల్చి వేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే.. హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం చేస్తా. మూసీ దగ్గర ఉన్న పేదలను కూడా ఏడిపిస్తున్నారు. 15 వేల ఇళ్లు కూలగొడతామని అనడం ధర్మమేనా?. మూసీని మంచిగా చేయడం మంచిదే.. కానీ, 15 వేల ఇళ్లు కూలగొడతారా? అంటూ కెసిఆర్ ఫైరయ్యారు.
TG Vishwa Prasad, an NRI who returned back from USA floated People Media Factory and is producing a number of films. He introduced several talented actors, directors and technicians to Telugu cinema. Mirai was one of the biggest hits for the production house last year. The VFX work done by the home team of PMF […] The post PMF has Big Plans for 2027 appeared first on Telugu360 .
తెలంగాణ పదం పలకడానికే భయపడే రోజులు.. కరెంట్ అడిగితే కాల్చి చంపారు
పొద్దున లేస్తే కెసిఆర్ చావాలని మాట్లాడుతున్నారని.. వాళ్లు వెయ్యి జన్మలు ఎత్తినా తాను చావని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ దళపతి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడే వరకు సేవ చేస్తానని చెప్పారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ అనే పదం పలకడానికే భయపడే రోజులు.. తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు ఉండేవి. మన నీళ్లు, వనరులను దోపిడీ చేశారు. పాలమూరు వంటి జిల్లాలో 90 శాతం వలసలే. కొన్ని పార్టీల తీరుతో ఆవేశం, బాధ కలిగేవి. మూలిగే నక్కపై తాటిపండులా చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలిపితే బషీర్బాగ్లో కాల్చి చంపారు. బషీర్బాగ్ ఘటనతోనే తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమానికి వచ్చా. కెసిఆర్ రాక ముందు రాష్ట్రంలో కరెంట్ సరిగా ఉండేదా?. మేం వచ్చాక 24 గంటల కరెంట్ ఇచ్చాం. మరి ఇప్పుడు ఏమైంది?. ఈ దుర్మార్గులు గెలిస్తే రైతు బంధుకు రాంరాం. దళితబంధుకు జైభీమ్ అంటారని చెప్పా. నేను చెప్పినట్టే జరిగిందా? లేదా?. ఒకేసారి వెయ్యాల్సిన రైతు బంధును ఎకరానికి ఒకసారి వేస్తున్నారు అని మండిపడ్డారు.
భానుడి భగ భగలతో నగరం నిప్పుల కొలమిలా మారుతోంది. దీంతో నగర వాసులు ఉదయం 11 గంటలకు ముందే తమ పనులు చక్క పెట్టు కుంటున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనాల దారులు బయటకు రాక పోవడంతో పూర్తిగా మధ్యాహ్న సమయంలో కర్ఫూ వాతావరణం తలపిస్తొంది.. ఎల్నినో ప్రభావం కారణంగా ఇటువంటి ఇటువంటి పరిస్థితులు ఏర్పాడ్డాయని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికె తెలిపారు. ఇవే పరిస్థితులో మే, జాన్ నెలల్లో కూడా కొనసాగుతాయన్నారు. వీటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులతో పాటు, వైద్యు కూడా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇళ్ళల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఏవైనా పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవాలని, అత్యవసరం అనుకుంటే మాత్రమే తగు జాగ్రత్తలో బయటకు వెళ్ళాలని సూచిస్తున్నారు.అంతే కాకుండా దీని ప్రభావంతో మే నెలాఖరులో వర్షాలు తీసుకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తద్వారా వర్షాలు కురవడంలో కూడా వర్షాలు పడటం కూడా జాప్యం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
హరీష్ రావు గురించి కవిత మొదటి నుంచి చెబుతూనే ఉంది: మంత్రి అడ్లూరి
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దీనిని బట్టి బిఆర్ఎస్ ముసలం మొదలైందని, వర్గ పోరు జరుగుతోందని స్పష్టమవుతున్నదన్నారు. హరీష్ రావు గురించి కవిత మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని ఆయన తెలిపారు. హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నారన్న విషయాలు బయటకు రావాలన్నారు. బిఆర్ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
బిఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్కరోజే విఐపిః ఎంపి చామల
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి బిఆర్ఎస్లో చేరిన ఒక్క రోజే విఐపిగా ఉంటారన్నారు. బిఆర్ఎస్లో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు. జీవన్ రెడ్డిని హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. కెటిఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదని ఆయన తెలిపారు. రెండవ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కెటిఆర్ హరీష్ రావును బ్రతిమిలాడి జీవన్రెడ్డి ఇంటికి తీసుకెళ్ళారని ఆయన చెప్పారు. కెసిఆర్ నివాసానికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదన్నారు. కెసిఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తుంటే హరీష్ రావు ఢిల్లీకి ఎందుకెళ్ళారని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ఎవరెవరిని కలిసారన్నది త్వరలో బయటకు వస్తుందన్నారు. హరీష్ రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్లో చేరడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని చెప్పే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్లో ముసలం మొదలైందని, అది మునిగిపోయే పడవ అని ఎంపీ చామల అన్నారు.
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టిఎఫ్డిఎ) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్తో పది సినిమాల్ని నిర్మించనున్నారు.ఈ మేరకు టీఎఫ్డీఏ సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, కార్యదర్శి సాయి రాజేష్, ఉపాధ్యక్షులు సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ “చదలవాడ శ్రీనివాసరావు వారి బ్యానర్ మీద ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు” అని అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియల్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని తెలిపారు.
ఇస్లామాబాద్లో చర్చలు ముందుకు సాగలేదనే విషయం తెలియగానే అంతర్జాతీయ చమురు మార్కెట్ తిరిగి కుదుపులకు గురైంది. కొద్దిరోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన ధరలు ఇప్పుడు తిరిగి పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్కు 95 డాలర్లకు ఎగబాకింది, యుద్ధం ఆరంభం నుంచి చూస్తే ఇది 30 శాతం పెరుగుదల అయింది, హర్మూజ్ మీదుగా నౌకా రవాణాను మరింత కట్టుదిట్టంగా అడ్డుకుంటామని ఇరాన్ సోమవారం తెలిపింది. దీనితో ఇప్పటికే ఇక్కడ రవాణాకు నిలిచిపోయి ఉన్న వందలాది చమురు నౌకలు మరింత ఆటుపోట్లకు గురయ్యాయి. హర్మూజ్పై ట్రంప్ ప్రకటనలతో ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ అనుమతి ఉన్న భారత్ వంటి కొన్ని దేశాలు కూడా ఈ మార్గం ద్వారా వెంటనే నౌకల రవాణా సురక్షితమేనా అనే సంశయంలో పడ్డాయి.
బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నా: కెసిఆర్
బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డికి పార్టీ అధినేత కెసిఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. జీవన్ రెడ్డి.. జగిత్యాల జిల్లా మాత్రమే కాదు, పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బాధ్యతలు కూడా చూడాలని కెసిఆర్ అన్నారు. ఈ క్షణం నుంచి జీవన్ రెడ్డిని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నానని చెప్పారు. జగిత్యాల బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసమే జీవన్రెడ్డి బిఆర్ఎస్లో చేరారన్నారు. జీవన్రెడ్డి గుండె ధైర్యమున్నోడని.. జీవన్రెడ్డి తన ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పారు. జీవన్రెడ్డితో తకు 40 ఏళ్ల స్నేహం ఉంది. భిన్న రాజకీయాల వల్లే వేర్వేరుగా పనిచేశాం. ఉమ్మడి కరీంనగర్తో పాటు పక్క జిల్లాల్లో కూడా జీవన్రెడ్డికి అభిమానులు ఉన్నారు.. జీవన్రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. వెంటనే ప్రజలు ఎమ్మెల్సీగా గెలిపించారు. జీవన్రెడ్డికి పదవులు కొత్తకాదు. ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లా పనిచేద్దామని జీవన్రెడ్డితో చెప్పా అని కెసిఆర్ అన్నారు.
45 years |జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై కేసీఆర్
45 years | జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై కేసీఆర్ 45 years
చందానగర్లో వైభవ్ జ్యూయలర్స్ను ప్రారంభించిన సినీ నటి మానస వారణాసి
ప్రముఖ సినీ నటి మానస వారణాసి సోమవారం చందానగర్లోని ఇక్రిసాట్ కాలనీలో వైభవ్ జ్యూయలర్స్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైభవ్ జ్యూవెలర్స్ అద్భుత ప్రయాణంలో తాను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.32 సంవత్సరాల నమ్మకం, 30 మిలియన్ల సంతోషకరమైన కస్టమర్లు, 20 స్టోర్లతో అద్భుతమైన డిజైన్ల ఆభరణాలతో చందానగర్ 21వ స్టోర్ను చందానగర్లో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు.అనంతరం సంస్థ వైస్ ప్రసిడెంట్ జె.రఘునాథ్ మాట్లాడుతూ వినియోగదారులకు అద్భుత శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు ప్రారంభోత్సవఆఫర్గా విస్తృత శ్రేనిలో 916 హాల్ మార్క్డ్ బంగారు ఆభర ణాలపై ప్రతి గ్రాముకు రూ.777 వరకు తగ్గింపు ఇస్తున్నామని,డైమండ్ మేకింగ్ చార్జీలపై 100శాతం తగ్గింపు,సాధారణ వెండివస్తువులు, పట్టీలపై తయారీ చార్జీలు లేకుండా చందానగర్ షోరూమ్లో అందిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సేవలను వినియోగదారులు వినియోగించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షురాలు ప్రీతి రెడిఓ్డ,ఐపిఎస్ అధికారి అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Biggest Theatrical Deal for Shah Rukh Khan’s King
After a decent break, Shah Rukh Khan has delivered two back-to-back blockbusters: Jawan and Pathaan. The actor is not in a hurry and he started King directed by Siddharth Anand. King is one of the craziest films made in Bollywood cinema. The film is rumored to be made on a budget of Rs 400 crores […] The post Biggest Theatrical Deal for Shah Rukh Khan’s King appeared first on Telugu360 .
అనసూయపై అసభ్య కామెంట్లు... యువకుడి అరెస్టు
సినీనటి, యాంకర్ అనసూయపై ఇన్స్టాగ్రాంలో అసభ్య కామెంట్లు పెట్టిన యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెట్టడంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు నల్గొండ జిల్లాకు చెందిన చంటిగా గుర్తించారు, అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు, నెటిజన్లకు పలు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఎవరిపై అయినా అసభ్యకరమైన కంటెంట్, దూషణలు లేదా వ్యక్తిగత దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలను వేధించే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పునర్ అభివృద్ధి నిర్మాణ పనులకు, రూ.3.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాళేశ్వరం బస్టాండ్ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్,పార్లమెంట్ సభ్యులు వేం రెడ్డి నరేందర్ రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కాలేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకొని మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శుభానందదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులకు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో ఘనంగా సన్మానించారు. కాళేశ్వరం విచ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
Rs1.50 lakh cr |సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Rs1.50 lakh cr | సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు Rs1.50 lakh
Interesting: Dhanush to direct Mrunal Thakur?
The entire nation is speculating about the relationship between Dhanush and Mrunal Thakur. The speculations never died despite the duo condemning the rumors. The latest buzz making rounds across the Tamil media circles is that Dhanush will soon direct his next film and it is a women-centric attempt featuring Mrunal Thakur playing the lead role. […] The post Interesting: Dhanush to direct Mrunal Thakur? appeared first on Telugu360 .
టివికె చీఫ్ విజయ్కు హైకోర్టు నోటీసులు
టివికె అధినేత విజయ్కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లతో వ్యత్యాసాలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని సోమవారంనాడు విజయ్కు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ఆదాయపన్నుశాక డెరెక్టర్ జనరల్, ఎన్నికల సంఘం, పెరంబూరు, తిరుచ్చి (ఈస్ట్) రిటర్నింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు విజయ్ సమర్పించిన అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని చెన్నైకి చెందిన వి.విఘ్నేశ్ పిటిషన్ వేశారు. పెరంబూర్లో దాఖలు చేసిన అఫిడవిట్ రూ.105కోట్ల ఆస్తులు ప్రకటించగా, తిరుచ్చి ఎన్నికల అఫిడవిట్లో రూ.220 కోట్లుగా పేర్కొన్నారు. రెండు అఫిడవిట్ల మధ్య రూ.105 కోట్ల భారీ వ్యత్యాసంపై ఆదాయం పన్ను శాఖ దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జి అరుళ్ మురుగన్తో కూడిన ధర్మాసనం సోమవారంనాడు విచారణ జరిపింది. ఒక నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా ఆస్తులను వెల్లడించకపోవడం అక్రమమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విజయ్, తదితరులకు నోటీసులు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణలో ఏమి జరుగుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈనెల 23, 29 తేదీల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. విడాకుల కేసు జూన్ 15కు వాయిదా మరోవైపు విజయ్ విడాకుల కేసు చెంగల్పట్టు కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందుకు వాయిదా వేయాలన్న అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం ప్రకటించింది. విజయ్ భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఆ రోజు ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది.
మూడున్నర గంటలు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో
హైదరాబాద్ నుంచి హుబ్లీకి ఆదివారం బయలుదేరిన ఫ్లై 91 విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ అత్యవసర చర్యకు దిగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు. ప్రయాణికులు అంతా భద్రంగా ఉన్నట్లు తెలిపారు. అయితే విమానం దాదాపు మూడున్నర గంటల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. దీనితో విమానంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురి కావల్సి వచ్చింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో ఇటువంటివి మామూలే అని అధికారులు తేలిగ్గా కొట్టిపారేశారు. పైగా సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయని, ఎటువంటి ముప్పు తలెత్తలేదని వివరణ ఇచ్చుకున్నారు. ప్రయాణికులలో కొందరు బిగ్గరగా ఏడుస్తూ, తాము ప్రాణాలతో బయటపడేలా చూడాలని భగవంతుడిని వేడుకుంటూ గడిపారు.విమానం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. 90 నిమిషాల ప్రయాణం తరువాత 4.30కు హుబ్లీ చేరాలి. అయితే బెంగళూరుకు దారి మళ్లించాల్సి వచ్చింది. ఇటువంటివి భద్రతా చర్యలలో తీసుకునే ప్రామాణిక విషయాలు అని కూడా అధికారులు తెలిపారు. 22 మందితో కూడిన ఈ విమానం సాయంత్రం ఆరుగంటల తరువాత బెంగళూరు నుంచి హుబ్లీకి రాత్రి 11 గంటల ప్రాంతంలో చేరింది. అంతా సుఖాంతం అయిందని ఎయిర్లైన్స్ నిర్వాహకులు తెలిపారు. అయితే తమకు హైదరాబాద్ నుంచి హుబ్లీ చేరేలోపు చుక్కలు కన్పించాయని , ప్రాణాలు బిగపట్టుకుని ప్రయాణించాల్సి వచ్చిందని హుబ్లీకి చేరిన తరువాత ప్రయాణికులు స్పందించారు. ఇక ఆదివారమే ముంబై నుంచి కొల్హాపూర్కు బయలుదేరిన విమానాన్ని గోవాకు దారి మళ్లించాల్సి వచ్చింది. విమానంలో ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తలేదు. ప్రతికూల పరిస్థితులతోనే విమానం దారి మళ్లించాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు.
కారు ఢీకొని జంక మృతి… సంఘటన స్థలంలో పోస్టుమార్టమ్ నిర్వహించి ఖననం పెనుగంచిప్రోలు,
ఇసుక, రబ్బిష్ కు అడ్డగా మారిన సి.వి.ఆర్ ఫ్లైఓవర్..
ఇసుక, రబ్బిష్ కు అడ్డగా మారిన సి.వి.ఆర్ ఫ్లైఓవర్.. ఇసుక, రబ్బిష్ లోడ్ల
ఈ నెల 23 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 23 వరకు పొడిగించారు.ఈ మేరకు ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి రోజుకు రెండు సెషన్లలో జరుగనున్నాయి. మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Shock |కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్…
Shock | కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్… Shock | ఆంధ్రప్రభ, వెబ్
బిసి గురుకుల జూనియర్ ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
బిసి గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 22 నుండి మే నెల 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంజెపి బిసి గురుకులాల సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఎంపిసి, బైపిసి, ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి రెగ్యులర్ గ్రూపులతో పాటు అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపిహెచ్డబ్లు), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ అనే 7 వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 146 బాలుర కాలేజీల్లో 12,640 సీట్లు, 144 బాలికల కాలేజీల్లో 12,080 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. బిసి గురుకులాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయనవసరం లేదని, తమ స్కూల్ ప్రిన్సిపాల్కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 040 -23328266 నెంబర్కు సంప్రదించాలని సూచించారు.
H-1B Visa Fraud in US: Two Telugu-Origin Men Plead Guilty in Fake Job Scam
A visa fraud case in the United States has brought two Telugu-origin individuals under the spotlight. Sampath Rajidi and Sridhar Mada pleaded guilty in connection with the H- 1B visa scam, which involved creating and submitting fabricated employment records to secure work visas for foreign applicants. The case was investigated by federal authorities in California. […] The post H-1B Visa Fraud in US: Two Telugu-Origin Men Plead Guilty in Fake Job Scam appeared first on Telugu360 .
అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం – కార్మికుడు మృతి
విశాలాంధ్ర, యాడికి:యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పవన్ కుమార్ రెడ్డి మృతి చెందాడు.ఫ్యాక్టరీ మైన్స్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాడికి సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. The post అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం – కార్మికుడు మృతి appeared first on Visalaandhra .
Police | జంట హత్యల కలకలం Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
మూడు సార్లు మరమ్మ తులు స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కెసిఆర్
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి.. బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు జీవన్రెడ్డి. ఈ సందర్భంగా గులాబి బాస్ కెసిఆర్.. జీవన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన అనుచరులతో పాటు జీవన్రెడ్డి బిఆర్ఎస్లో చేరారు. ఇటీవల జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఓటిటిలోకి ధురంధర్ 2.. రిలీజ్ ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్: ది రివెంజ్' మూవీ విడుదలైన నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మార్చి19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా రెండు భాగాలు.. ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. వెండితెరపై సంచలన విజయం సాధించిన ఈ మూవీని.. ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మొదటి భాగాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన మేకర్స్.. రెండో భాగాన్ని జియో హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే 2026 చివరిలో లేదా జూన్ 2026 ప్రారంభంలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
మంచి మనసుకు ప్రతిరూపం నారా భువనేశ్వరి
మంచి మనసుకు ప్రతిరూపం నారా భువనేశ్వరి రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పేదలు
Revanth Reddy : కాళేశ్వరంలో దోషులను శిక్షిస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు
హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే..!
హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే..! రాప్తాడు, ఆంధ్రప్రభ : హంద్రీనీవాను నాశనం
వేణుగోపాలస్వామికి వెన్నపూస అలంకరణ
వేణుగోపాలస్వామికి వెన్నపూస అలంకరణ గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని
IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
అహ్మదాబాద్: ఐపిఎల్ 2026లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుని.. ముందుగా ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై.. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. క్వింటన్ డికాక్ ఫామ్లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. పంజాబ్తో జరిగిన కిందటి మ్యాచ్లో డికాక్ అజేయ శతకంతో కదంతొక్కిన సంగతి తెలిసిందే. అయితే కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, తిలక్ వర్మ తదితరుల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య తన పాత్రను సమర్థంగా నిర్వర్తించలేక పోతున్నాడు. మరోవైపు, గుజరాత్ ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో గెలిచి జోరు మీదుంది.
హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరు ఖాన్ బజార్ లో జంట హత్యలు కలకలం రేపింది..అదిల్ ఖాన్ అనే వ్యక్తి అతని సోదరుడు అఖ్వీల్ ఖాన్ ,అజ్మీరి బేగం అనే ఇద్దరిని ఇంట్లో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సంఘటన స్థలానికి చేరుకున్న మీర్ చౌక్ పోలీసులు.క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు పై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Cyber Crime |నల్గొండ యువకుడి అరెస్ట్
Cyber Crime | నల్గొండ యువకుడి అరెస్ట్ Cyber Crime | ఆంధ్రప్రభ,
వాహనం నుండి బయటకు దూకి ఖైదీ పరారీ
చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురిని మరో కేసులో పీటీ వారెంట్పై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు విచారణ కోసం తీసుకెళ్లి తిరిగి జైలుకు తీసుకెళ్తుండగా ఒక చోట ట్రాఫిక్ లో వాహనం ఆగిన సమయం చూసి రెప్పపాటులో వాహనం దిగి ఒక ఖైదీ పరారైనాడు. ఖైదీలను పోలీస్ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. చంచలగూడ జైలు సమీపంలోనే వాహనం నుంచి దూకి పరారైనట్లు సమాచారం. పరారైన నిందితుడు నరేష్గా గుర్తింపు. మిగతా ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ నెల 12న ముగ్గురు దొంగలను పోలీసులు రిమాండ్కు పంపారు.పరారైన నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. లేక ఎవరైనా పరారైన ఖైదీకి సహకరించారా..? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
21Libragold|శిల్పా కాలనీలో భారీ చోరీ…
21Libragold| శిల్పా కాలనీలో భారీ చోరీ… 21Libragold | ఇంట్లో పెళ్లి సందడి
వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్.. సర్వీస్ నుంచి డిస్మిస్ ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Video : Music Director Naga Vamshi Exclusive Interview
The post Video : Music Director Naga Vamshi Exclusive Interview appeared first on Telugu360 .
నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇప్పించండి!”
నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇప్పించండి!” ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : తాను బతికే
Telangana : ఇద్దరూ కాళేశ్వరాన్ని ఏరియల్ వ్యూలో చూసి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు మేడిగడ్డ బ్యారేజీని ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించారు
ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు..
టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు గానీ, షూటింగ్ ఇప్పట్లో మొదలు పెట్టకపోవచ్చుననే మాట వినిపించింది. కానీ, సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చాడు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెల్దాం. నిర్మాత దిల్ రాజుకి అత్యంత సన్నిహితుడు దర్శకుడు వంశీ పైడిపల్లి. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఓ సినిమాను […] The post ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు.. appeared first on Telugu Bullet .
నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు..
నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ
మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం…
మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం… ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన
రాష్ట్ర అభివృద్ధిలో అలుపెరుగని ధీరుడు..
రాష్ట్ర అభివృద్ధిలో అలుపెరుగని ధీరుడు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభివృద్ధి పధంలో
చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా
విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా…
విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా… ర్యాంకులు సాధించటం అభినందనీయంస్టేట్ ర్యాంకు సాధించిన అనూష
సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన ఎంఈఓ
గరిడేపల్లి, ఆంధ్రప్రభ ; మండలంలోని గడ్డిపల్లి లో ఉన్న బాలుర ప్రభుత్వ సాంఘిక
తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈనెల 23న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే శ్రీ
ఒకేసారి బరిలోకి రెండు జట్లు.. 30-35 మంది జాబితా సిద్ధం..
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీం ఇండియా పలు ద్వైపాక్షిక సిరీసులు ఆడనుంది. ఇందుకోసం ఆటగాళ్లను ఎంపిక చేయడం ఇప్పుడు బిసిసిఐ ముందు ఉన్న అతి పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడున్న టాప్ ప్లేయర్లతో పాటు ఐపిఎల్తో తమ్ ప్రతిభ కనబర్చిన యువ ప్లేయర్లు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలో ఎవరిని పక్కన పెట్టాలో పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బిసిసిఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టులోకి రావడానికి ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఆధారంగా కనీసం 30-35 మందితో బిసిసిఐ ఓ జాబితాను సిద్ధం చేయనుంది. ఒకేసారి రెండు జట్లు బరిలోకి దిగేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న సిరీస్ల దృష్ట్యా దీనిని వర్కౌట్ చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు ఆసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్లు వేదికలుగా కానున్నాయి. ఇందులో బరిలోకి దిగే జట్లలలో ఒక జట్టుకు శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఇవ్వగా.. మరో జట్టుకు సూర్య కానీ, మరెవరైనా కానీ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది.
ప్రజల వద్దకు పాలన.. తీసుకు వచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేఅభివృద్ధి సంక్షేమ పాలన
విషాదం: కొండను ఢీకొట్టిన విమానం.. పైలట్, కో పైలట్ మృతి
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో విమాన ప్రమాదం జరిగింది. ఓ చార్టర్డ్ విమానం, కొండచరియను ఢికొట్టడంతో.. పైలట్, కోపైలట్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జష్పూర్ జిల్లాలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. వెంటనే సంఘటనాస్థలానికి రెస్క్యూ టీమ్ ను పంపించి సహాయక చర్యలు ప్రారంభించింది. అనంతరం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్లు వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో వీరితోపాటు విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో విమానం కొండపై కూలిపోవడయంతో దట్టమైన పొగ, మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి పరకాల, ఆంధ్రప్రభ :
21 tolas |శిల్పా కాలనీలో భారీ చోరీ…
21 tolas | శిల్పా కాలనీలో భారీ చోరీ… 21 tolas |
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సీఓఈలు,
Breaking : వెంకట్రామిరెడ్డి డిస్మిస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సచివాలయం ఉద్యోగి వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది

28 C