SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

కోల్‌కతాపై ముంబై ఘన విజయం

 ఐపిఎల్ సీజన్ 2026లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం కోల్‌తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మలు అద్భుత బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 38 బంతుల్లోనే ఆరు సిక్సర్‌లు, మరో 6 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. చెలరేగి బ్యాటింగ్ చేసిన రికెల్టన్ 8 సిక్స్‌లు, 4 బౌండరీలతో 43 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. దీంతో ముంబై అలవోక విజయం అందుకుంది. శుభారంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు అజింక్య రహానె, ఫిన్ అలెన్‌లు శుభారంభం అందించారు. అలెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రహానె కూడా మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. ఇటు రహానె అటు అలెన్‌లు జోరుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ముంబై బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అలెన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. అయితే 17 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 18 పరుగులు చేసిన అతన్ని శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. దీంతో 69 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వేలం పాట కింగ్ కామెరూన్ గ్రీన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 40 బంతుల్లో ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అంగ్‌క్రిస్ రఘువంశీ 29 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. రింకు సింగ్ 4 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మన తెలంగాణ 29 Mar 2026 11:27 pm

రెడ్‌మి 15ఎ 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్

 షియోమి ఇండియా అధునాతన ఫీచర్లతో రెడ్‌మి 15ఎ 5జి ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో 6300 ఎంఎహెచ్ సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు పనిచేస్తుంది. దీని 6.9 అంగుళాల స్క్రీన్, 120 హెరట్జ్ వేగం వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తాయి. దీని ప్రారంభ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో లభిస్తుంది. ఏప్రిల్ 3 నుండి ఆన్‌లైన్, ఇతర స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

మన తెలంగాణ 29 Mar 2026 10:59 pm

IPL 2026..పొలార్డ్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన నరైన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ నయా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా ప్లేయర్ సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.  2012లో లీగ్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుండి నరైన్ నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2012లో కేకేఆర్‌లో చేరిన అతను, తన మిస్టరీ స్పిన్‌తో తక్షణమే తనదైన ముద్ర వేశాడు. 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పొదుపైన బౌలింగ్, విధ్వంసకర బ్యాటింగ్ తో రాణిస్తూ కెకెఆర్ కు కీలకంగా మారాడు. ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ అతనికి 190వ మ్యాచ్. దీంతో ఐపిఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. పొలార్డ్ 189 మ్యాచ్ లు ఆడి ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్(184), డేవిడ్ వార్నర్(184), డీజే బ్రావో(161)లు ఉన్నారు.

మన తెలంగాణ 29 Mar 2026 10:58 pm

హీరో విజయ్ అసెంబ్లీకి రెండు చోట్ల పోటి

 పినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో విజయ్ ఆదివారం తమ తమిళగ వెట్రికజగం (టివికె) పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎప్రిల్ 23వ తేదీన జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. సొంతంగా ఆయన పార్టీ మొత్తం 234 అసెంబ్లీ స్థానాల నుంచి పోటికి దిగుతుంది. కాగా తాను ఇప్పటి తమిళనాడు రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిని అవుతానని చెప్పిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటికి దిగుతారు. ఎన్నికల రంగంలో తొలిసారి రంగ ప్రవేశం చేసే విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి, చెన్నైలోని పెరంబూర్ నుంచి బరిలో నిలుస్తారు. ఈ రెండు స్థానాలలో డిఎంకె తమ బలీయమైన అభ్యర్థులు ఆర్‌డి శేఖర్, ఇనిగో ఇరతయరాజ్‌ను ఇప్పటికే నిలిపింది. చెన్నైలోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ తమ పార్టీ జాబితాను విడుదల చేశారు. రెండు స్థానాల నుంచి సి జోసెఫ్ విజయ్ నిలుస్తున్నారని అభిమానులు , పార్టీ నేతల చప్పట్ల మధ్య ప్రకటించారు. ఈ సందర్బంగానే పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. ఇందులో తన అత్యంత ప్రధాన విశ్వసనీయ వ్యక్తుల బృందంలోని వారు కూడా ఉన్నారు. ఇటీవల అన్నాడిఎంకె నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి కు ప కృష్ణన్‌కు లాల్గూడి సీటు కేటాయించారు. అదే విధంగా డిఎంకె ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు దక్కాయి. ఇప్పుడు తాము ప్రకటిస్తున్నది అభ్యర్థులను కాదని, ప్రజా పరిరక్షకులను అని తెలిపారు. యువతరం కదలాల్సి ఉందని, జన్ జడ్‌తోనే సరికొత్త విజిల్ వెలువడుతుందని తమ పార్టీ గుర్తును ప్రదర్శించారు. యువతకు ప్రత్యేకంగా అజెండాను వెలువరించారు. గ్యారంటీగా ప్రకటించారు. తమిళనాడును డ్రగ్స్ రహితం చేస్తామని, సరళరీతిలో రుణాలు ఇస్తామని విద్యావకాశాల కోసం ఇంటర్ నుంచి పిహెచ్‌డి వరకూ రూ 20 లక్షల వరకూ రుణాలు అందిస్తామని వివరించారు. 

మన తెలంగాణ 29 Mar 2026 10:50 pm

గుజరాత్‌లో దళితులపై కక్ష: రాహుల్ గాంధీ

 గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వ హయాంలో దళితుల అణచివేత ఎక్కువ అయిందని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి సంకుచితవాదంతో విద్వేషకర వాతావరణం నెలకొంది. దళితులు, ఆదివాసీ వర్గాలపై దాడులు , వారిపట్ల వివక్ష పెరుగుతోందని అన్నారు. గుజరాత్‌కు చెందిన దళితులు, ఆదివాసీలతో తాను ఇటీవల మాట్లాడినప్పుడు , వారి సాధకబాధకాలు తెలిసివచ్చాయని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. వారి సాధకబాధకాలను తెలియచేయాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. 2016 ఉన్నా దారుణ ఉదంతం బాధితుల పట్ల తాము పూర్తిగా సంఘీభావం వ్యక్తం చేస్తున్నామని, వారికి పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తనను కలిసిన బాధితులలో ఉన్న దళితులు కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్ దళితులతో తాను మాట్లాడినప్పుడు వారి కష్టాలు నష్టాల గురించి ఎంతో అవగావహన కల్గింది. వారి బాధలు ఆందోళన కల్గించాయని రాహుల్ తెలిపారు. వారికి న్యాయం కోసం మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని గుర్తించానని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 29 Mar 2026 10:30 pm

సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణిదాడులు

సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్‌బేస్‌ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్‌ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు. 

మన తెలంగాణ 29 Mar 2026 10:18 pm

కేరళలో కాంగ్రెస్ కూటమిదే విజయం: మంత్రి పొంగులేటి

కేరళలో కాంగ్రెస్ కూటమి (యూడిఎఫ్) విజయం ఖాయమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడిఎఫ్) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పతనంతిట్ట జిల్లా లోని అడూర్ అసెంబ్లీ నియోజకవర్గం యూడిఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి శాంతకుమార్ (కాంగ్రెస్ పార్టీ) మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి పట్ల ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి సాధించిన విజయాలు దీనికి నిదర్శనమన్నారు. గత దశాబ్దంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, ప్రజలకు అందిన ఫలితాలు తక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. పదేళ్ల పాలన తర్వాత కూడా నిరుద్యోగం పెరుగుతుంటే, ప్రజలపై ఆర్థిక భారాలు అధికమవుతుంటే - అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సెక్యులర్ విలువలను కాపాడే శక్తి కాంగ్రెస్‌కే ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్ కూటమికి విజయం అందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 10:13 pm

గోదావరి పుష్కరాలు సిఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు పలు సూచనలు

తెలంగాణలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపాల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2027 జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనుండటంతో పూర్తి చేయాల్సిన పనులపై.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ క్రమంలో అధికారులకు సిఎం రేవంత్ పలు సూచనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలని చెప్పారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని సూచించారు.కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తరువాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సిఎం చెప్పారు. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు.

మన తెలంగాణ 29 Mar 2026 9:51 pm

IPL 2026: చెలరేగిన కోల్ కతా బ్యాటర్లు.. ముంబైకి భారీ టార్గెట్

ఐపిఎల్ 2026లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్ 221 పరుగుల భారీ లక్ష్క్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

మన తెలంగాణ 29 Mar 2026 9:24 pm

స్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ ప్రారంభం

 తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీఐటీఏ) నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్‌ శనివారం నుంచి రెండ్రోజులు పాటు జరగనుంది. టీఐటీఏ అధ్యక్షుడు మక్తాల సందీప్‌ కుమార్‌ మాట్లాడుతూ బాస్కెట్‌బాల్‌, ఫెన్సింగ్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, పవర్‌లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌తో పాటు మొత్తం 24 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఫిట్‌నెస్‌, శారీరక, సాంకేతిక సమస్యలను విశ్లేషిస్తూ వాటికి టెక్నాలజీ ఎలాంటి పరిష్కారం చూపించగలదో తెలియజేసేందుకు ఈ స్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు రెండు వేల మందికి పైగా నమోదు చేసుకున్నారని, ధరఖాస్తులను మదింపు చేసిన అనంతరం 20 మంది ఆవిష్కర్తల కాన్సెప్ట్స్‌ను ఒక నిమిషం పాటు జ్యూరీ ముందు ప్రదర్శించేందుకు ఎంపిక చేశామని చెప్పారు. స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపాలనేది తమ లక్ష్యమని తెలిపారు.

మన తెలంగాణ 29 Mar 2026 8:57 pm

మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం ?: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

రిజర్వాయర్లకోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 8:45 pm

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్రారం గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. ఆదివారం ఉదయం ధర్మారం గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు మూడుకే లక్ష్మిరాజం (58), కుమ్మం మొండయ్య (50)లు గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువులోకి తీసుకువెళ్లారు. చెరువులోపలికి వెళ్లిన మూడు గొర్రెలను బయటకు తీయడానికి వెళ్లిన కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేశాలను వెలికి తీశారు. ఈ మేరకు కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు గొర్రెల కాపరుల ఆకస్మిక మృతితో ధర్మారంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాల రోదనలు పలువురికి కన్నీళ్లు తెప్పించాయి.

మన తెలంగాణ 29 Mar 2026 8:40 pm

డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆదివారం డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమ పథకాల విస్తరణతో పాటు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ మేనిఫెస్టోలో పలు కీలక హామీలను ప్రకటించారు. రాష్ట్రం ప్రస్తుత అభివృద్ధి మార్గంలోనే కొనసాగాలని స్టాలిన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు, తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను మరింత విస్తరిస్తామని తెలిపారు.మేనిఫెస్టోలోని ముఖ్య ప్రకటనల్లో భాగంగా కుటుంబ మహిళాధిపతులకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా 1.37 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. వృద్ధాప్య పెన్షన్‌ను కూడా రూ.2,000కు పెంచనున్నారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అమల్లో ఉన్న విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకాన్ని రూ.1 లక్ష వరకు పెంచనున్నారు. ఈ ఆరోగ్య బీమా పథకానికి అర్హత పొందే వారి వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచి, బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తదుపరి ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ సదుపాయాలను రెట్టింపు చేయనున్నారు. 20 లక్షలకుపైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించడంతో పాటు, మీటర్‌లేని పంపుసెట్లను అందించనున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 35 లక్షల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యాన్ని స్టాలిన్ వెల్లడించారు. 120 బిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యోగావకాశాల విస్తరణ కోసం ‘నియో టైడల్ పార్క్‌లు’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం ఎన్నికల హామీలను మాత్రమే కాకుండా అదనపు పథకాలను కూడా అమలు చేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా కమిటీకి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధి సహా పార్టీ నాయకులకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజలు అభివృద్ధి, స్థిర పాలన కోసం డీఎంకేకు మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 8:30 pm

మొగుళ్ళపల్లి మండలంలో దొంగల హల్చల్

మొగుళ్ళపల్లి మండలంలో దొంగల హల్చల్ ఒక బైక్. 15 వేల రూపాయల నగదుకరెంటు

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:20 pm

మణికొండలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిద్దీస్ గ్రాండియర్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లోని వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఫ్లాట్‌లోని వాషింగ్ మెషీన్‌కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన యజమాని తన భార్య, ఇద్దరు పిల్లల్ని వెంటనే బయటకు తీసుకెళ్లడంతో వారికి ప్రమాదం తప్పింది.

మన తెలంగాణ 29 Mar 2026 8:20 pm

సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

గేదెల మేపేందుకు వెళ్లి ఈత కోసం నీటి గుంటలో దిగి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఒంటిపూడి దేవా (12) సంవత్సరాలు స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామానికి చెందిన వంగూరి నాగబాబు (12) తన అమ్మమ్మ ఎన్టీఆర్ నగర్లో ఉండగా వారి ఇంటి దగ్గర ఉంటూ ఆదివారం కావడంతో సత్తుపల్లి మున్సిపాలిటీ సమీపంలోని గేదలు మేపేందుకు వెళ్లి సరదాగా నీటి గుంటలో దిగి ఇద్దరి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటినా రంగంలోకి దిగిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి నీటి గుంటలో పడి మృతి చెందిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 4 గంటలకు పైగా గాలింపు చేపట్టాగ ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవ పంచనామా పరీక్ష కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఓకే కాలనీకి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందటంతో ఎన్టీఆర్ నగర్లో విషాదఛాయలు అలుపుకున్నాయి.

మన తెలంగాణ 29 Mar 2026 8:12 pm

ఇంద్రకీలాద్రి పై ధ్వజారోహణం

ఇంద్రకీలాద్రి పై ధ్వజారోహణం.. చైత్ర బ్రహ్మోత్సవాలకు వైభవ ప్రారంభంశ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వేదఘోషల

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:12 pm

రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్…

రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:06 pm

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు పురవీధులు గుండా బహిరంగ ప్రదర్శనలుఆర్సిఎం విచారణ పాదర్లు

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:04 pm

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు..

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు.. పురవీధుల గుండా బహిరంగ ప్రదర్శనలుఆర్సిఎం విచారణ పాదర్లు

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:02 pm

అసెంబ్లీలో గర్జించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

అసెంబ్లీలో గర్జించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:00 pm

లోవోల్టేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్…

లోవోల్టేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్… కుభీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:58 pm

రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం

రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం అలైవ్ అరైవ్ కార్యక్రమంలో కుభీర్ ఎస్సై

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:57 pm

కర్నూలులో విహెచ్‌పీ అవగాహన సదస్సు…

కర్నూలులో విహెచ్‌పీ అవగాహన సదస్సు… ముసాయిదా చట్టంపై విస్తృత చర్చలుహిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:54 pm

కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక

కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలో చేరిక

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:50 pm

జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి….

జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి…. వినియోగదారులు సంయమనం పాటించాలి…ఓటిపి మరొకరితో పంచుకోకండి..కంట్రోల్ రూమ్

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:29 pm

ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం…

ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం… ప్రజల కోసం పోరాటమే మా లక్ష్యంఎన్టీఆర్ ఆశయాల సాధనలో

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:25 pm

Breaking: Peddi Postponed: Announcement Coming

The makers of Ram Charan’s Peddi are working round the clock to complete the shoot of the film on time and release the film on April 30th as per the plan. But the deadlines are tough and there is a big rush to complete the post-production work. A crucial meeting took place today and the […] The post Breaking: Peddi Postponed: Announcement Coming appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 7:23 pm

Number 304 |ఆత్మహత్యాయత్నం

Number 304 | ఆత్మహత్యాయత్నం Number 304 | నరసరావుపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:20 pm

AR Murugadoss Lands into Trouble

Tamil director AR Murugadoss who has delivered some of the biggest super hits has been struggling to deliver a decent product. His last film was Madharaasi featuring Sivakarthikeyan and the film ended up as a debacle. The producers of the film have filed a complaint against AR Murugadoss. The complaint said that the director promised […] The post AR Murugadoss Lands into Trouble appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 7:19 pm

Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years

At a time when political messaging often gets diluted, N. Chandrababu Naidu chose clarity. Addressing party leaders and cadres at the 44th foundation day celebrations of the Telugu Desam Party, he sent out a firm message. Leaders who ignore grassroots workers have no place in the party. Recognition and responsibility will go only to those […] The post Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 7:16 pm

అమెరికాపై ఉత్తరకొరియా శక్తివంతమైన క్షిపణి ఇంజిన్ పరీక్ష

ప్రస్తుత ప్రపంచ స్థాయి పరస్పర ఘర్షణల దశలో ఉత్తర కొరియా ఆదివారం అత్యంత శక్తివంతమైన ‘ ఘన ఇంధన క్షిపణి ఇంజిన్‌ను ’పరీక్షించింది.అమెరికా టార్గెట్‌గా ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఛోదక శక్తిగా ఈ ఇంజిన్ నిలుస్తుంది. గుర్తు తెలియని ప్రదేశం నుంచి జరిగిన క్షిపణి ఇంజిన్ పరీక్షను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ వీక్షించారు. దేశ అత్యంత కీలకమైన సైనిక సామర్థం , శత్రు లక్షాల ఛేదనకు వీలుగా ఉండే ఈ ఇంజిన్ తయారు అయిందని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అమెరికా, అమెరికా మిత్రదేశాలను లక్షంగా ఎంచుకుని మరిన్ని శక్తివంతమైన సుదూర దాడి సమర్థవంతపు ఆయుధ వ్యవస్థ నిర్మాణానికి కిమ్ వెలువరించిన ఆదేశాల మేరకు ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు కీలక పరీక్షలకు దిగుతోంది. ఇప్పుడు పరీక్షించిన ఇంజిన్ శక్తి గరిష్టంగా 2500 కిలోటన్నులవరకూ ఉంటుంది. దీనిని పూర్తి స్థాయి కాంపోజిట్ కార్బన్ ఫైబర్ తో నిర్మించారు. ఉత్తరకొరియా క్షిపణుల వార్‌హెడ్ ను వేగంగా నిర్థిష్టంగా తీసుకువెళ్లగలిగే థ్రస్ట్‌ను ఈ ఇంజిన్ సంతరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా చర్యల క్రమంలో దేశానికి అత్యంత కీలకమైన సైనిక చర్యల నిరోధక శక్తి అవసరం అని కిమ్ భావిస్తూ వస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు శక్తివంతమైన క్షిపణుల పరీక్షలు జరుగుతున్నాయి. ఐదేండ్ల ఆయుధ వ్యవస్థ బలోపేత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ఇంజిన్ సమర్థతను పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) తెలిపింది. ఇప్పటి ఇంజిన్ పరీక్ష దేశ అత్యంత వ్యూహాత్మక సైనిక బలోపేతానికి ఆయువుపట్టు అని కిమ్ స్పందించినట్లు ఈ వార్తా సంస్థ తెలిపింది. పరీక్ష ఎప్పుడు? ఎక్కడ జరిగిందనేది అధికారికంగా వెల్లడికాలేదు. 

మన తెలంగాణ 29 Mar 2026 7:16 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్ ముంబైకి 300వ టి-20 మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌ను విజయంతో ఆరంభించాలని ముంబై భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా కూడా ముంబైని చిత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తుది జట్లు: కెకెఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్బానీ. ఎంఐ: రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్(కీపర్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధిర్, షార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్ఖండే, ఎఎం గజాన్ఫర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

మన తెలంగాణ 29 Mar 2026 7:16 pm

కెటిఆర్ సిఎం రేవంత్ మధ్య కుదిరిన ‘డీల్’: బండి సంజయ్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుమ్కక్కు ఆయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే కెటిఆర్‌పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదని అన్నారు. కెటిఆర్‌కు, కవితకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. కేవలం హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయపటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణను పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కెటిఆర్‌కు సీఎం సలహా ఇస్తున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరంపై హరీష్‌పై ఉన్నంత పగ కెటిఆర్‌పై ముఖ్యమంత్రికి లేదన్నారు. భవిష్యత్తులో బిఆర్‌ఎస్ తో కలిసి పోటీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వంద శాతం కెటిఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటేనని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 29 Mar 2026 7:09 pm

Devotees Turn to Free Meals in Tirumala as Gas Shortage Hits Hotels

The sacred town of Tirumala is witnessing a clear shift in how devotees are meeting their food needs. With private hotels struggling due to a sudden shortage of commercial gas, more pilgrims are now turning towards the free meal services provided by Tirumala Tirupati Devasthanams. The crisis began after gas supplies dropped sharply due to […] The post Devotees Turn to Free Meals in Tirumala as Gas Shortage Hits Hotels appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 7:08 pm

చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు…

చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు… 3 కొత్త అసెంబ్లీలు, మరో లోక్‌సభ

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:04 pm

టి-20 వరల్డ్ కప్‌ కేసులో ముంబై క్రికెటర్ అరెస్ట్

ఈ ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్‌కి భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. ఈ మెగా ట్రోర్నీలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి భారత్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ టి-20 వరల్డ్ కప్‌కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ముంబై అండర్ 19 మాజీ ఆటగాడు బల్వంత్ సింగ్‌ సర్వూప్ సింగ్ సోధాను టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోకి వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతను సాధారణ టికెట్ ధరను ఏకంగా రూ.25వేలకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. సోధా మొబైల్ స్వాధీనం చేసుకుని, కాల్ డేటా రికార్డులను పరిశీలించగా.. విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. అతనికి బెయిల్ మంజూరు అయింది. 

మన తెలంగాణ 29 Mar 2026 7:04 pm

వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు …

వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు … ఊరేగింపులో దుర్గామల్లేశ్వరుల దర్శన భాగ్యం..భక్తుల

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:01 pm

సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న ఆనవాళ్లు బైటపడ్డాయని అటవీ ప్రాంతానికి ఆనుకొని వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుంటూ జాగ్రత్త చర్యలు పాటించాలని ఆర్మూర్ సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి భవాణి శంకర్ కోరారు. ఆదివారం ఆయన సిరికొండ, కమ్మర్‌పల్లీ రెంజ్ అధికారులు నర్సింగ్‌రావు,రవీంధర్‌లు సిబ్బందితో కలిసి జినిగ్యాల అటవీ ప్రాంతంలో పర్యటించారు. పెద్దపులి సంచారంపై అనావాళ్ల గురించి క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. జినిగ్యాల ఫారెస్టు కంపార్టుమెంటులో పులి అడుగులు కనబడ్డాయి. అవి పెద్దపులి అడుగులాగా నిర్ధారించుకున్నారు. అనంతం ఎస్‌డిఎఫ్‌ఒ భవాణి శంకర్ సిబ్బందితో సమావేశమయ్యారు. పులి సంచారం నిర్ధారణ అయిన దృష్టా అటవీ సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.పొద్దుకుంగిన తర్వాత,తెల్లవారు జామున, రాత్రి సమయంలో అటవిలోకి వెల్ల వద్దని సూచించారు.అడవులకు ఆనుకొని వున్న పంటపోలాల వద్ద విద్యత్ తీగలు అమర్చవద్దని,అడవి జంతువుత వల్ల ఏవైనా జీవాలకు ప్రాణ నష్టం జరిగితే అటవీ శాఖ అధికారుల దృష్టికి తేవాలని అలా చేస్తే నష్టపరిహారం పొందవచ్చుచనిని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దపులి ప్రాణానికి నష్టం చేసే చర్యలకు పూనుకోవద్దని ప్రజలకు తెలిపారు. ఆయన వెంట సిరికొండ డిఆర్‌ఓ గంగారాం,సెక్షన్ అధికారులు,బీట్ అఫీసర్లు వున్నారు.

మన తెలంగాణ 29 Mar 2026 6:57 pm

అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే…

అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే… ఎన్టీఆర్‌ సర్కిల్‌లో తెలగుదేశం పార్టీ

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:55 pm

Handri-Neeva |ఒకే కుటుంబంలో ఇద్దరు…

Handri-Neeva | ఒకే కుటుంబంలో ఇద్దరు… Handri-Neeva | సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:51 pm

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

కామరెడ్డి జిల్లాలోని గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలోని భావన రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లాల్తూ ర్ ముఖియా (21), రాహుల్ (21), జావీద్ అంసారి (22) అనే ముగ్గురు కార్మికులు ద్విచక్ర వాహనంపై గాంధారి వైపు వస్తుండగా రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలో బైక్  అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించగా అప్పటికే ముగ్గురు యువకులు మృతి చెందారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్టలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం బాన్స్ వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 29 Mar 2026 6:48 pm

హోటల్ గదిలో విగతజీవులుగా..

హోటల్ గదిలో విగతజీవులుగా.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా నరసరావుపేటలో తీవ్ర

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:40 pm

విచారణకు సిద్ధమా.. సిఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. తన తమ్ముడు, బావమరిదిపై సిఎం ఆరోపణలు చేశారని.. సిఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని హరీశ్ అన్నారు. తన తమ్ముడు, బావమరిదిపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని.. సిఎం తమ్ముడు, బావమరిదిపై విచారణకు రేవంత్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. హౌసింగ్ కమిటీ కాదు.. సిబిసిఐడి కాదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని.. సిఎం సిద్ధంగా ఉన్నారా.. అని అడిగారు. ‘‘మంత్రి పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి రేవంత్ దొరికిపోయారు. ఏ పని కోసం నేనెప్పుడు పొంగులేటికి ఫోన్ చేయలేదు. పొంగులేటి కంపెనీ అవినీతి పాల్పడిందని అందరికీ అర్థమైంది. తప్పు జరిగిందని సిఎం, మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. సిఎం, పొంగులేటి మధ్య లావాదేవీలు ఉంటాయి. వాళ్లు భూములను చెరిసగం పంచుకుంటారు. సభా సంఘం వేస్తే అన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చి బేరం కుదిరితే తొలగిస్తున్నారు’’ అని హరీశ్ రావు ఆరోపించారు.

మన తెలంగాణ 29 Mar 2026 6:40 pm

ஸ்டாலினுக்கு ஓ.பன்னீர்செல்வம் குனிந்து வணக்கம் வைத்தாரா? - வைரல் புகைப்படத்தின் உண்மை இதுதான்

முதல்வர் ஸ்டாலினுக்கு ஓ.பன்னீர்செல்வம் குனிந்து வணக்கம் வைத்ததாக பரவும் புகைப்படம் எடிட் செய்யப்பட்டது

తెలుగు పోస్ట్ 29 Mar 2026 6:33 pm

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ…

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ… జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి…

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:14 pm

టెలాపూర్‌లో టెనా కార్నివల్‌కు భారీ స్పందన

70 గేటెడ్ కమ్యూనిటీల నుంచి భారీగా పాల్గొనడంసామాజిక సేవల్లో టెనా ముందంజ అని ప్రశంసలు

తెలుగు పోస్ట్ 29 Mar 2026 6:06 pm

అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది: హరీష్ రావు

రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో తప్పు జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగ దొరికిపోయిందని.. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పది తప్పులు చేస్తోందని విమర్శించారు.  రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక దోపిడీ, అక్రమాలు చేస్తుందని ప్రతిపక్షం కాదు ప్రభుత్వమే కనుక్కుందని అందుకే వారికి నోటీసులు ఇచ్చామని సిఎం రేవంత్ చెప్పారని.. డైవర్షన్‌ కోసమే రేవంత్‌ రెడ్డి ఎదురుదాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి అవినీతికి పాల్పడితే.. సీబీసీఐడీ విచారణ సరిపోతుందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు అసెంబ్లీ నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 6:02 pm

ఎంపీజే సమావేశానికి తరలివెళ్లిన నాయకులు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లో నిర్వహించిన ఎంపీజే సమావేశానికి నారాయణపేట జిల్లా

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:59 pm

‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

హైదరాబాద్: ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చాం’’ అని సభలో తెలిపారు. ‘‘వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చింది. కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరం. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్ిని సామాజికంగా బహిష్కరించాలి. తల్లిదండ్రులను చూసుకోలేనివాడు సమాజంలో బతకడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులకు కూడా చట్టం వర్తిస్తుంది’’ అని సిఎం అన్నారు.

మన తెలంగాణ 29 Mar 2026 5:59 pm

చరిత్రను తిరగరాసిన విశాఖపట్నం పోర్ట్

చరిత్రను తిరగరాసిన విశాఖపట్నం పోర్ట్ విశాఖపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : 92 ఏళ్ల ఘన

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:54 pm

జైనూర్‌లో ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలు విజయవంతం

జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు జైనూర్

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:51 pm

Iran Warning : అడుగుపెడితే.. అగ్గిపెట్టేస్తాం !Andhra Prabha Latest News

Iran Warning : అడుగుపెడితే.. అగ్గిపెట్టేస్తాం !Andhra Prabha Latest News (

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:51 pm

ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:50 pm

తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా….

తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా…. ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతే టీడీపీ

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:48 pm

Sharwa’s Ripped & Ruthless Rise For Biker

It came as a big surprise when the first look of Biker was released. Charming Star Sharwa underwent a complete transformation to play the role of a biker. The glimpse, teaser, and trailer clearly showcased the immense effort he poured into the film. Now, the makers have released a transformation video, highlighting Sharwa’s inspiring journey […] The post Sharwa’s Ripped & Ruthless Rise For Biker appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 5:37 pm

లయోలా కళాశాలలో జాతీయ సదస్సు…

లయోలా కళాశాలలో జాతీయ సదస్సు… వాణిజ్య,నిర్వహణ విద్యలో నూతన ధోరణులపై సదస్సు ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:26 pm

అప్పుడు ‘లెజెండ్’ సినిమాతో హీరోగా.. ఇప్పుడు ‘లీడర్’గా మరోసారి..

చెన్నై: ప్రముఖ వస్త్రదుకాణం శరవణన్ స్టోర్స్ యజమాని లెజెండ్ శరవణన్.. నాలుగేళ్ల క్రితం తన పేరుతోనే తీసిన చిత్రం ‘లెజెండ్’. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలోనే ఘోరంగా ట్రోలింగ్‌కి గురైంది. ఇక థియేటర్లలో వచ్చిన తర్వాత సినిమాపై విమర్శలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత శరవణనన్ మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సారి ఆయన ‘లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీకి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. ఆండ్రియా, శ్యామ్, లాల్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఆదివారం ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా యాక్షన్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఈ ట్రైలర్‌లో భారీ తనం కనిపిస్తుంది. మరి ఈ మూవీ అయినా శరవణన్‌కి సక్సెస్ ఇస్తుందో.. లేదో చూడాలి..

మన తెలంగాణ 29 Mar 2026 5:24 pm

అమ్మవారిని దర్శించుకున్న బాల బ్రహ్మానంద సరస్వతి….

అమ్మవారిని దర్శించుకున్న బాల బ్రహ్మానంద సరస్వతి…. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:24 pm

నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:21 pm

వరి పంటల్లో పాముల సంచారం..

వరి పంటల్లో పాముల సంచారం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:17 pm

పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు..

పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు.. విజయవాడ నగర పాలక సంస్థ

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:16 pm

ఉల్లాస్ పథకంలో భాగంగా నిరక్షరాసులకు పరీక్షలు..

ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ తండా నిరక్షరాస్యులైన వయోజన మహిళలకు

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:03 pm

నిజామాబాద్ కళాశాలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:00 pm

MI vs KKR.. సాయంత్రం వాంఖేడే స్టేడియంలో హోరాహోరీ పోరు..

IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026లో రెండవ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు, మూడుసార్లు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. ఇవాళ సాయంత్రం (మార్చి 29, ఆదివారం) ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి.  టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించాలనే ఇరు జట్లు భావిస్తున్నాయి. ఐపిఎల్ లో అత్యుత్తమ జట్లలో ఒకటి ముంబై ఇండియన్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉండటంతో ఈసారి టైటిల్ గెలుపే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ (MI) బరిలోకి దిగనుంది. మరోవైపు, అంగక్రిష్ రఘువంశీ, అజింక్య రహానే, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లతో KKR కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. MIకి గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాంఖేడే పిచ్ ఎలా ఉంటుందంటే.. ముంబైలోని వాంఖేడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై మొదట బౌలింగ్ ఎంచుకుని, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం సులభంగా ఉంటుంది. జట్ల వివరాలు: ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ర్యాన్ రికిల్టన్, రాబిన్ మింజ్, రాజ్ బావా, రఘు శర్మ, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అల్లా గఫాంజర్, అశ్వనీ కుమార్, దీపక్ షెదర్ విల్, దీపక్ చహర్, విల్, దీపక్ చహర్, మే మార్కండే, శార్దూల్ ఠాకూర్, క్వింటన్ డి కాక్, డానిష్ మలేవార్, మహ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్ కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి, కామెరూన్, గ్రీన్, ఫిన్ పతీర్ అల్లెన్, టీజా అలెన్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ ముజారబానీ.

మన తెలంగాణ 29 Mar 2026 4:59 pm

కాంట్రాక్టర్ల సమస్యలపై గళమెత్తిన కాంట్రాక్టర్లు…

కాంట్రాక్టర్ల సమస్యలపై గళమెత్తిన కాంట్రాక్టర్లు… పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు డెడ్‌లైన్ విధించాలిప్యాకేజీ టెండర్లకు

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:59 pm

తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును..

తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును.. ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:56 pm

ఆరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న ముంబై ఇండియన్స్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఉన్న క్రేజ్ వేరు. ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న ఈ జట్టు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన రికార్డును ముంబై తమ ఖాతాలో వేసుకోనుంది. ఈరోజు జరిగే మ్యాచ్ ముంబైకి 300 టి-20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా అత్యధిక (300 మ్యాచులు) టి-20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఐపిఎల్ ఫ్రాంచైజీగా ముంబై రికార్డు సృష్టించనుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్‌లలో 162 విజయాలు సాధించింది. ఓవరాల్‌గా అత్యధిక టి-20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ఈ లీస్ట్‌లో మొదటి ప్లేస్‌లో పాకిస్థాన్(303) ఉండగా, రెండో స్థానంలో సోమర్‌సెట్(303) ఉంది. 

మన తెలంగాణ 29 Mar 2026 4:38 pm

నిందితులు రిమాండ్..

నిందితులు రిమాండ్.. మైనర్ బాలికకు సంబంధించిన ఘటనలో మద్దూర్, ఆంధ్రప్రభ : మద్దూరు

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:29 pm

సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు

సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మట్టల

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:20 pm

‘ఉల్లాస్’నవభారత సాక్షరత కార్యక్రమం

‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తాండూర్ మండలంలోని బోయపల్లి

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:18 pm

సుక్మాలో ఎన్కౌంటర్…

సుక్మాలో ఎన్కౌంటర్… చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:15 pm

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. .ఘనంగా ఎన్టీఆర్‌కు నివాళులు….కార్యకర్తలే పార్టీ బలం అని

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:13 pm

ఆడపడుచుల చదువు అవనికి వెలుగు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఆడపడుచుల చదువు అవనికి వెలుగని ప్రతి మహిళ చదువుకొని

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:06 pm

611 Doctors Postings : ఏపీ డాక్టర్లకు గుడ్ న్యూస్ Andhra Prabha News

611 Doctors Postings : ఏపీ డాక్టర్లకు గుడ్ న్యూస్ Andhra Prabha

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:04 pm

చెరువులో పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి..

కోనరావుపేట, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో

ప్రభ న్యూస్ 29 Mar 2026 4:02 pm

Corruption |రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు…

Corruption | రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు… Corruption | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 29 Mar 2026 3:58 pm

బిఆర్ఎస్- బిజెపి పొత్తు ఎప్పటికీ జరగదు: బండి

హైదరాబాద్: ఫార్ములా ఈ- రేసు కేసు సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక్కటే అని అన్నారు. ఈ సందర్భంగా బండిసంజయ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైనది కాదు అని.. ఎథిక్స్ కమిటీ లేదని..అసెంబ్లీ కమిటీ లేవు అని విమర్శించారు. లేని కమిటీకి కౌశిక్ రెడ్డి అంశం రికమాండ్ చేయడం ఏంటీ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండు అని కెటిఆర్ కు రేవంత్ సూచన చేశారు అని.. కెటిఆర్, రేవంత్ మధ్య డీల్ కుదిరింది అని అన్నారు. కాళేశ్వరం అంశంలో తమపై తుపాకీ పెట్టి రేవంత్ కాలుస్తాం అంటే ఊరుకోం అని హెచ్చరించారు. బిఆర్ఎస్- బిజెపి పొత్తు ఎప్పటికీ జరగదు అని..వారసత్వ, కుటుంబ రాజకీయాలకు బిజెపి వ్యతిరేకం అని తెలియజేశారు. సిఎం డిప్రెషన్ లో ఉండి డీలిమేషన్ పై మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ లకు బిజెపి దూరం అని బండి సంజయ్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 29 Mar 2026 3:54 pm

దారుణం: కూతురుతో సహా భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం

పల్నాడు: పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. స్థానిక లాడ్జ్‌లో మూడేళ్ల కూతురితో కలిసి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు తల్లి శంకరకుమారి (30), చిన్నారి మౌనిక (3) మృతి చెందగా.. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉంది. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతుల స్వస్థతలం నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు. గోపి భోపాల్ ఎయిమ్స్‌లో పని చేస్తుండగా.. శంకర కుమారి కూడా అదే ఆస్పత్రిలో నర్సుగా పనిని చేస్స్తున్నారు. శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చిన కుటుంబం ఈ దారణానికి పాల్పడింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మత్తు ఇంజక్షన్ చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.

మన తెలంగాణ 29 Mar 2026 3:42 pm

‘బాహుబలి-2’ రికార్డు బద్దలు కొట్టిన 'ధురందర్ 2'

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' రికార్డులు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన ఈ మూవీ తాజాగా మరో అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బాహుబలి 2 రికార్డును ధురందర్ 2 మూవీ బద్దలు కొట్టింది. ప్రభాస్, ఎస్.ఎస్. రాజమౌళి వచ్చిన 'బాహుబలి 2: ది కంక్లూజన్' పేరిట ఉన్న చిరకాల రికార్డును బద్దలు కొట్టి.. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కేవలం 9 రోజుల్లోనే $20.80 మిలియన్ల మార్కును దాటి, ఉత్తర అమెరికా మార్కెట్‌లో 'బాహుబలి 2' జీవితకాల వసూళ్ల రికార్డును అధిగమించింది.  2017లో విడుదలైన బాహుబలి 2, ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో $20.80 మిలియన్ల వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ధురందర్ 2 మూవీ $21 మిలియన్స్ మార్క్ ను చేరుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,226 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

మన తెలంగాణ 29 Mar 2026 3:36 pm

ఘనంగా మట్టల ఆదివారం

ఘనంగా మట్టల ఆదివారం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్

ప్రభ న్యూస్ 29 Mar 2026 3:22 pm

కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసుల మెరుపు దాడులు

కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసుల మెరుపు దాడులు వంద మందికి పైగా జూదగాళ్లను అదుపులోకి

ప్రభ న్యూస్ 29 Mar 2026 3:21 pm

చిన్నారిని చిదిమేసిన లారి..

నస్పూర్, ఆంధ్రప్రభ ; అభం శుభం తెలియని తొమ్మిది నెలల పసిపాపని బూడిదలారి

ప్రభ న్యూస్ 29 Mar 2026 3:18 pm

జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి.. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్…

జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి.. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్… మొదటి పూట

ప్రభ న్యూస్ 29 Mar 2026 3:17 pm

CM Revanth Reddy |మీరు సూచనలు అప్పుడే ఇవ్వండి…

CM Revanth Reddy | మీరు సూచనలు అప్పుడే ఇవ్వండి… CM Revanth

ప్రభ న్యూస్ 29 Mar 2026 3:12 pm

కడియం శ్రీహరి.. మచ్చలేని నాయకుడు: సిఎం రేవంత్

ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీతి, నిబద్ధతను దేశంలో ఎవరు ప్రశ్నించలేరని.. ఆయన మచ్చలేని నాయకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సిఎం కెసిఆర్‌కు సమానంగా కడియం శ్రీహరి ప్రజా జీవితం నుంచి వచ్చారన్నారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్‌తో కాల్చి పడేస్తానంటూ సైగలు చేయడంతో ఏ పార్టీలో ఉన్నావని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ సభ్యుడి ప్రవర్తన సమర్థనీయమా? అని కెటిఆర్, హరీష్ రావును అడుగుతున్నా. అసభ్యకరంగా, అసహ్యంగా ప్రవర్తిస్తే సమర్థిస్తారా?. ఇది మీ పార్టీ విధానమా?. కెసిఆర్‌ను అవమానిస్తే మీరు ఊరుకుంటారా?. కడియంకు జరిగిన అవమానమే కెసిఆర్‌కు ఎదురైతే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించిన సిఎం రేవంత్.. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 3:11 pm

letter for cm|లెక్క‌కు మించి అక్ర‌మాలు, అవినీతి

letter for cm|లెక్క‌కు మించి అక్ర‌మాలు, అవినీతి అక్ర‌మార్కుల‌పై విచార‌ణ జ‌ర‌పాలిసీఎంకు బీఆర్ఎస్

ప్రభ న్యూస్ 29 Mar 2026 3:10 pm

పశ్చిమలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

పశ్చిమలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ

ప్రభ న్యూస్ 29 Mar 2026 3:08 pm

ఉల్లాస్ పరీక్షలు రాసిన 72 సంవత్సరాలు వృద్ధురాలు

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలో

ప్రభ న్యూస్ 29 Mar 2026 2:54 pm