మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ హైకోర్టు దాఖలు అయిన పిటిషన్పై బు ధవారం కీలక తీర్పు వెలువడనున్నది. ఈ కమిషన్కున్న అర్హతలను సవాల్ చే స్తూ ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయంతెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం వెలువడే తీర్పు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష రాజకీయ వర్గాలలో ప్రాధా న్యం సంతరించుకుంది. ఈ కేసులో కోర్టు వెలువరించే తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కుంగిన బ్యారేజీలు, ప్రాజెక్టు నిర్మాణం జరిగిన అవకతవకలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14, 2024న నియమించింది. కమిషన్ నియామకం, దానికున్న అర్హతలను సవాలు చేస్తూ కెసిఆర్, హరీశ్రావుతో పాటు ఐఎఎస్ అధికారులు స్మితా సభర్వాల్, మాజీ ఐఎఎస్ ఎస్.కె. జోషి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ల బెంచ్ విచారణను తొలుత ఈ నెల 8కి , అనంతరం ఈ నెల 22కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా పిటిషన్దారుల తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలోని చట్టబద్ధమైన ఉల్లంఘనలు ఉన్నాయని తన వాదనలను గట్టిగా వినిపించారు. అలాగే సహజ న్యాయసూత్రాలను కమిషన్ పాటించలేదని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు కేసు’ విచారణ సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు’ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్రంలోని ఎసిబి కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివే స్తూ జీఓ 31లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీల ప్రక్రియ మే 1వ తేదీ నుంచి మే 31, 2026 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 1, 2026 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థికశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. 1 జనవరి 2026 నాటికి ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులుగా పేర్కొంది. అయితే, నా లుగేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు వెలువడిన మూడు రోజుల్లోపు ఉద్యోగులు విధుల నుంచి రిలీ వ్ కావాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హె చ్చరించింది. సెన్సస్ (జనగణన) విధుల్లో ఉన్న ఉ ద్యోగులకు బదిలీల మార్గదర్శకాలు వర్తించవని ఆ ర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఈ జీఓలో పేర్కొన్నారు. అదేవిధంగా 31-.12-.2025 నాటికి ఒకే చోట నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించిన ఉద్యోగులను అక్కడ కొనసాగించరాదు. అంటే నాలుగు సంవత్సరాలకుపైగా ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే, రిటైర్మెంట్కు సమీపంలో ఉన్న ఉద్యోగులకు కొంత ఉపశమనం కల్పించారు. 31-.05-.2027 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పటికీ, వారు స్వయంగా బదిలీ కోరితే తప్ప వారిని బదిలీ చేయరాదు. మే 31, 2027 లోపు పదవీ విరమణ చేయనున్న ఉ ద్యోగులు కోరుకుంటేనే బదిలీ చేయాలని ఈ జీఓ లో పేర్కొన్నారు. జీవిత భాగస్వామి (స్పౌస్) కేసు ఆధారంగా కోరుకునే బదిలీలకు మూడేళ్ల నిబంధన వర్తించదని ఈ జీఓలో స్పష్టం చేశారు. ఏ ఒక్క కేడర్లో 40 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని ఆర్థికశాఖ సూచించింది. బదిలీల ప్రక్రియ మొత్తం కౌన్సెలింగ్ పద్ధతిలో సాధ్యమైనంత వరకు ఆన్లైన్/వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. భార్యాభర్తల కేటగిరీలో మూడేళ్ల నిబంధన వర్తించదని ప్రభుత్వం ఈ జీఓలో పేర్కొంది. అలాగే బదిలీల సమయంలో భార్యాభర్తలు (ఒకరికి మాత్రమే), పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాంగులైన పిల్లలున్న తల్లిదండ్రులు, వితంతువులు, క్యాన్సర్, కిడ్నీ, లివర్ మార్పిడి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ జీఓలో ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ప్రక్రియను పర్యవేక్షించడానికి కేడర్ వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఈ జీఓలో స్పష్టం చేసింది. స్టేట్, మల్టీ-జోనల్/జోనల్, జిల్లా స్థాయిల్లో అధికారుల నేతృత్వంలో ఈ కమిటీలు పని చేయనున్నాయి. విద్యాశాఖ, పోలీస్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీశాఖలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. బదిలీ షెడ్యూల్ వివరాలు ఇలా.. మే 1 వ తేదీ నుంచి- 7వ తేదీ వరకు: ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడిస్తారు. దీంతోపాటు బదిలీల విధి, విధానాల ఖరారు చేయడంతో పాటు ఖాళీ పోస్టులు, తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేసి దానిని ప్రచురించాలి. మే 8-వ తేదీ నుంచి 15వ తేదీ వరకు: ఉద్యోగులు తమకు కావలసిన బదిలీ ప్రాంతాల కోసం ఆప్షన్లను సమర్పించాల్సి ఉంటుంది. మే 16-వ తేదీ నుంచి 24వ తేదీ వరకు: దరఖాస్తులను పరిశీలించి బదిలీ విధానం ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలి. అనంతరం మాస్టర్ జాబితాను సిద్ధం చేయాలి. మే 25-వ తేదీ నుంచి 31వ తేదీ వరకు: బదిలీ ఉత్తర్వులను జారీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి టిజిఈజేఏసీ నాయకుల కృతజ్ఞతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల జిఓను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి టిజిఈజేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓతో సహనంతో ఎదురుచూస్తున్న వేలాది ఉద్యోగులకు ఎంతో ఉపశమనం సంతృప్తిని కలిగించిందని టిజిఈజేఏసీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఈ జీఓతో ప్రభుత్వ పాలన పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, సంబంధిత అధికారులకు ఉద్యోగుల అసలు సమస్యలను అర్థం చేసుకుని సముచిత నిర్ణయం తీసుకున్నందుకు తాము రుణపడి ఉంటామని వారు తెలిపారు.
బిఆర్ఎస్ ఉత్తి కథలు..కాంగ్రెస్ పిట్టకథలు
మన తెలంగాణ/హైదరాబాద్: వెయ్యేండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.ఓటమిపై బిఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని.. ప్రజలే తప్పు చేశారని ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల కురువృద్ధుడిని చే ర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయాయి, నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిట ని ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువ నా యకత్వాన్ని ప్రోత్సహిస్తామని.. యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని విమర్శించారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగా ణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తున్నారంటే వెయ్యేండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు అని తేల్చిచెప్పారు. మేధావులు, విద్యావేత్తలు బిఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి జీవన్రెడ్డి అని, ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారని గుర్తు చేశారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఏమీ అనకపోవడంలో ఆంతర్యం ఏమిటి..? జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని కవిత ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటమికి ప్రజలకే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలి రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి తూ కిత్నా అంటే.. అంటే మై కిత్నా అంటూ బలప్రదర్శనకు దిగుతున్నాయి తప్పితే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్ పార్టీ పిట్టకథలు చెప్పిందని విమర్శించారు. పార్టీల కేంద్రంగా కాకుండా ప్రజల కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలని, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈనెల 25న వస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య ఉంటే దానిని పరిష్కరించే వరకు పోరాడేందుకు తాము రాజకీయాల్లోకి వస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సిఎం మాట్లాడుతున్నారు “గుంట నక్క ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అంటున్నారని.. ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి బిఆర్ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా” అని కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సిఎం మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సిఎం మాట్లాడారని పేర్కొన్నారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కానీ ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. “ఢిల్లీలో గుంటనక్క ఎవరిని కలిశారో చెప్పాలా” అంటూ ఆయనతో సిఎం డీల్ మాట్లాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో నిర్ణయం చేయాల్సింది ప్రజలు కదా..? ప్రశ్నించారు. పదేళ్లు తానే సిఎంగా ఉంటానని ఎలా చెబుతారని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు రెండోసారి ఓట్లేస్తారని అడిగారు. సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సగం మందికి రైతుభరోసా ఇవ్వలేదని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని, కుమ్మెర జాతరలో రెండు నెలల పాప చనిపోయినా మాట్లాడలేదని మండిపడ్డారు. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని రేవంత్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా..? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రజల విషయంలో ఏ లెక్కలేని తనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేని తనం కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అన్నారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఆర్టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతిలో ఫార్వర్డ్ బ్లాక్ సీనియర్ నేత ప్రసాద్ చేరిక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఆర్ వి ఆర్ ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.అలాగే టిడిపి మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.
అక్రమ కేసులు ఎదుర్కొనేందుకే హస్తినకు వెళ్లాం
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పా ర్టీ అధినేత కెసిఆర్ సూచన మేరకే ఢిల్లీ వెళ్లి లాయర్లను కలిసినట్లు మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు తెలిపారు. కానీ, తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎంఒ నుంచి లీకులు ఇచ్చారని, మీడియా వాళ్లతో అర్థం లేని బ్రేకింగ్లు పెట్టించారని ఆరోపించారు. విషయం ఉన్న వారు ఎవరైనా ఇలాంటి పనులు చేయరని, విషయం లేనివారే ఇలా చేస్తారని విమర్శించారు. సిఎం పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే అక్కడి లాయర్లతో మాట్లాడినట్లు చె ప్పారు. కాళేశ్వరం కేసులపై సీనియర్ లాయర్లతో చర్చించేందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే మే 6వ తేదీన హైకోర్టులో రాబోతున్న ఎంఎల్ఎల ఫిరాయింపుల కేసుల విచార ణపై సీనియర్ లాయర్లతో చర్చించామని అ న్నారు. కాంగ్రెస్ బి.ఫామ్పై గెలిచి తాను ఇం కా బిఆర్ఎస్లోనే ఉన్నానని ఒక ఎంఎల్ఎ అనడం, దానిని స్పీకర్ ధృవీకరించడం అ త్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు.ఓటుకు నోటు కేసు కూడా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టులో విచారణకు రానుందని, ఆ కేసు గురించి కూడా న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. పట్టపగ లు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పుడు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి కంప్లైంట్ కూ డా ఆయనే అని పేర్కొన్నారు. ఈ ఓటుకు నో టు కేసులో బిఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మ హమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారని చెప్పారు. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్ల ను పెట్టి, సిఎం రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నారని విమర్శించారు. ఆనాడు సమాఖ్య వాదులతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు. నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయిందంటే.. ముఖ్యమంత్రి సీటు ఊడటం,జైలుకు వెళ్లడం ఖాయం అని చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. తమ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని, అందులో దాచిపెట్టేదేమీ లేదని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనపై కూడా చిల్లర ప్రచారం చేశారని మండిపడ్డారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్షిప్లో కనీసం 10 శాతం కూడా రేవంత్కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారిక లైవ్లో బిఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా దానిని ఆపలేరు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. సోమవారం జగిత్యాల సభలో కెసిఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని చెప్పారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? అని ప్రశ్నించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది, పంట చేతికి వచ్చాక వేశారని తెలిపారు. కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాత్రి రాహుల్ గాంధీతో, ఉదయం బిజెపి వాళ్లతో తిరిగారని హరీష్ రావు వివర్శించారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఇన్నాళ్లు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ, రెండు పిల్లర్లు కుంగిపోయాయని, మరమ్మతులు చేస్తామని చెప్పారని సిఎం తాజాగా చెప్పారని పేర్కొన్నారు. మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని సిఎం ఒప్పుకున్నారని, రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లా..? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఎల్నినో రానుందని తెలియడంతో మేడిగడ్డ అవసరం తెలిసిందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని, కాళేశ్వరం వృథా అయితే మూసీలోకి గోదావరి నీళ్లు ఎలా ఎత్తిపోస్తావని ప్రశ్నించారు. కెసిఆర్ ఎంతో గొప్పగా ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని చెప్పారు. వరద ఉంటే మిడ్ మానేరు నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారని తెలిపారు. రేవంత్ శంకుస్థాపన చేసిన గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి రైతుబంధు, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకు రేవంత్రెడ్డికి ప్రజలు ఓట్లు వేయాలా..? అని హరీష్రావు ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించినందుకా, తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి ఢిల్లీకి, కుప్పానికి కడుతున్నందుకా..2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకా..నెలకు రూ. 2500 ఇస్తామని మహిళలను దగా చేసినందుకా..స్కీములు లేవు కానీ రాష్ట్రాన్ని స్కాములతో నింపినందుకా..సింగరేణిని దోచుకున్నందుకు రేవంత్రెడ్డి ప్రజలు ఓట్లు వేయాలా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టినందుకా... ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇండ్లు కూల్చినందుకా...కలుషిత ఆహారంతో 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టన పెట్టుకున్నందుకా.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా లక్షలాది విద్యార్థులను అంధకారంలో నెట్టినందుకా.. ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, అంగన్వాడీలను రోడ్డున పడేసినందుకా..ఫార్మా కంపెనీల కోసం లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసినందుకా..కులవృత్తులను ధ్వంసం చేసినందుకు ప్రజలు ఆయనకు ఓట్లు వేయాలా..? అని నిలదీశారు. ఎన్ని డ్రామాలు ఆడినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి అని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని అన్నారు.
ఇస్లామాబాద్: కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియనున్న నేపథ్యంలో, అమెరికా ఇరాన్ మధ్య మలివిడత చర్చలు జరగనున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్లో సమావేశమయ్యే అవకాశముందని ఆ యా వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అ యితే, చర్చల సమయంపై అమెరికా లేదా ఇ రాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకారం, ఇ ప్పటివరకు తమ అధికార ప్రతినిధులు ఎవరూ పాకిస్తాన్ రాజధానికి చేరుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్ మధ్యవర్తుల సమాచారం మేరకు, అ మెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఖాలిబాఫ్ బుధవారం ఉదయం ఇస్లామాబాద్కు చేరుకు ని చర్చలకు నేతృత్వం వహించే అవకాశం ఉం దని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, గో ప్యతా నిబంధనల నేపథ్యంలో పేర్లు వెల్లడించకుండా ఉంచినట్లు సమాచారం. ఏప్రిల్ 8న ప్రారంభమైన కాల్పుల విరమణ ఒప్పందం బు ధవారం ముగియనుంది. ఇరు దేశాలు మాటల యుద్ధంలో మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. ఒప్పందం కుదరకపోతే భారీ బాంబు ల దాడులు మొదలవుతాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ చర్చల ప్రధాన ప్రతినిధి ఇంకా బయటపెట్టని కొత్త వ్యూహాలు తమ వద్ద ఉన్నాయి అని పేర్కొన్నారు. అయితే చర్చలు పునఃప్రారంభమైతే కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా తరఫున జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా ఇరాన్, అమెరికా బృందాల రాకను నిర్ధారించింది. ఇరు దేశాలు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. బుధవారంనాడు ఉదయానికల్లా రెండు దేశాల ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్ చేరుకుంటాయన్నారు. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలో ఒక బృందం, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ నాయకత్వంలో బృందం వస్తున్నాయని ప్రకటించింది. ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మలి విడత చర్చలకు దారులు పడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు మరోదారి లేదని, ఒప్పందానికి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాల్పుల విరమణను మరోసారి పొడిగించే ఉద్దేశం లేదన్నారు. ఒప్పదం చేసుకుంటేనే ఇరాన్ పరిస్థితి బాగుంటుందన్నారు. లేకపోతే మా సేనలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయని సిఎన్బిసితో మాట్లాడుతూ హెచ్చరించారు. ఈ సారి భీకరమైన దాడులు తప్పవని స్పష్టం చేశారు. బెదిరింపుల నీడలో చర్చలా? బెదిరింపుల నీడలో జరిగే చర్చలను మేము అంగీకరించము అని ఇరాన్ ప్రతినిధి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చర్చలు పునఃప్రారంభమవుతాయన్న ఆశాభావాన్ని పాకిస్థాన్ వ్యక్తం చేసింది. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్కు చేరుకునే అవకాశముందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. తద్వారా చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ అబ్దెలాత్తీతో తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సమయంలో, ఇరాన్కు ముఖ్య వాణిజ్య భాగస్వామి అయిన చైనా రాయబారితో కూడా సమావేశమయ్యారు. బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుత పరిస్థితి యుద్ధం నుంచి శాంతి వైపు మారుతున్న కీలక దశలో ఉందని పేర్కొంది. ఈ సందర్భంలో అన్ని పక్షాలు నిజాయితీగా వ్యవహరించి, రాజకీయ పరిష్కారానికి కట్టుబడి ఉండాలని, కాల్పుల విరమణ, చర్చల వేగాన్ని కొనసాగించాలని మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ సూచించారు. ఇక ఇస్లామాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది భద్రతా సిబ్బందిని మోహరించి, విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో పర్యవేక్షణను పెంచారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చల కంటే ఈసారి ఏర్పాట్లు మరింత కఠినంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చర్చలు ముందుకు సాగితే, అమెరికాఇరాన్ అగ్రనేతలు పాకిస్థాన్ను సందర్శించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్లామాబాద్కు చెందిన భద్రతా విశ్లేషకుడు సయ్యద్ మహ్మద్ అలీ అభిప్రాయపడ్డారు. ఒప్పంద దశకు చర్చలు చేరితే, అగ్రనేతల పర్యటనకు అవకాశం ఉండొచ్చు అన్న భావనతో పాకిస్థాన్ సిద్ధమవుతోంది అని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.
Fact Check: No Evidence That Lemon, Garlic, Turmeric and Honey Can Cure
Social media has become one of the biggest platforms for sharing knowledge today. People can easily find a wide range of information, including many health-related tips, within seconds. Many users depend on these platforms to learn about fitness, diet, and general well-being. Sometimes, such information is shared by qualified doctors and health experts, making it useful and reliable. However, a large portion of content is also posted by creators who may not have proper medical knowledge or training. Without consulting experts, they often share many tips that can be misleading or incorrect. These posts often gain high reach because they are simple and attractive. As a result, along with useful information, wrong messages are also spread widely, especially in the case of health-related advice shared without proper knowledge. Amid this, a health tip is widely spread on social media. In an Instagram reel, a creator claims that lemon, garlic, turmeric, and honey can cure fatty liver in 8 days. In a reel posted by a user, it is claimed that fatty liver can be reversed within just 8 days using a simple home remedy. The creator says that even people already dealing with liver problems, infections, or toxin buildup can see their liver become completely clean in this short period. According to the video, the remedy is easy to prepare using common household ingredients. A glass of water is taken, and the juice of one full lemon is added to it. A small pinch of turmeric is mixed in, followed by two crushed garlic cloves. Half a teaspoon of honey is then added to complete the mixture. The preparation should be left aside for about an hour, then strained before consumption. The creator advises drinking this mixture every morning on an empty stomach. It is further claimed that regular use for 8 days will cleanse the liver, remove toxins from the body through urine, and may also help with several other health issues. The claim can be found here . Fact Check: The claim is False, There is no scientific proof or medical agreement that fatty liver disease can be cured in just 8 days by taking lemon, garlic, turmeric, and honey. While these ingredients may be good for overall health, they are not a substitute for proper treatment or long-term lifestyle changes. During a conversation with dietician Bishnupriya Gadanayak, she explained the condition of fatty liver in a very clear way. She said that fatty liver disease develops in four stages, and each stage shows a higher level of damage to the liver. In the first stage (Type 1), fat builds up in the liver but there is no inflammation, so it is usually not harmful. In the second stage (Type 2), fat is present along with inflammation, which shows that the liver is under stress. In the third stage (Type 3), there is fat accumulation along with damage to liver cells. The fourth stage (Type 4) is the most serious, where there is severe damage along with fibrosis, and it may lead to cirrhosis. She added that the early stages can be reversed with proper diet and regular exercise, but the later stages may cause permanent damage. However, with proper treatment and lifestyle control, the disease can be managed and its progression can be slowed. She also spoke about the ingredients mentioned in the viral remedy. Lemon is low in calories and rich in vitamin C, which is good for overall health. Garlic contains natural compounds that may help reduce inflammation and support heart and liver health. Turmeric, known for its active compound curcumin, has anti-inflammatory and healing properties and has been used in traditional medicine for many conditions. Honey is a natural product with antioxidant and antibacterial qualities and has been used for both food and health purposes for a long time. However, she clearly stated that there is no scientific proof that lemon, garlic, turmeric, and honey can cure fatty liver in just 8 days. While these ingredients may support general health and may have some benefits for the liver, they cannot act as a quick cure for fatty liver disease. Proper medical care, a balanced diet, exercise, and long-term lifestyle changes are necessary to manage and improve the condition. During a conversation with Dr. Swasti Tirta Prayag, He clearly explained that lemon, garlic, turmeric, and honey cannot cure fatty liver, especially not within a few days. He said that although these ingredients have some health benefits like antioxidant and anti-inflammatory properties, there is no medical evidence to show that they can reverse fatty liver in such a short time. He explained that lemon contains vitamin C, which may help reduce inflammation, but it does not treat liver disease. Garlic is known to support heart health and has some protective effects, but there is no strong proof that it can treat fatty liver. Turmeric also has useful properties and may support general health, but it does not remove fat from the liver. Honey, she added, contains natural sugars, and taking too much of it could actually make fatty liver worse instead of improving it. Dr. Prayag emphasized that while these ingredients can be part of a healthy diet, they should not be seen as a cure. The best way to manage fatty liver is through long-term lifestyle changes, including a balanced diet and regular exercise. He also advised regular health check-ups and screening for other factors such as alcohol use or infections like hepatitis B and C, which can worsen the condition. He concluded that fatty liver requires proper care over time, not quick remedies. He added that while some changes may be seen over the long term, improvement within eight days is impossible. As per expert opinion, the claim that fatty liver can be cured within a few days using lemon, garlic, turmeric, and honey is False. These ingredients may support general health but cannot treat or reverse the condition. Proper medical care, along with long-term lifestyle changes, remains the most effective approach.
హైదరాబాద్: అభిమానులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ చిత్ర బందం కొన్ని ఫొటోలు పంచుకుంది. మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘జైలర’ చిత్రానికి కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రహీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. […] The post ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి appeared first on Visalaandhra .
. తాజాగా జట్టుకు దూరమైన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే. ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఐపీఎల్ 2026లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే ఎడమ కాలి గాయం (హామ్స్ట్రింగ్) కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇవాళ సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న సన్రైజర్స్ హైదరాబాద్తో […] The post సీఎస్కేను వెంటాడుతున్న గాయాలు appeared first on Visalaandhra .
కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్కు జహీర్ఖాన్ సూచన
న్యూదిల్లీ: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, జట్టులో కీలక బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్కు మాజీ పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ గురించి ఆలోచించొద్దని, బ్యాటర్గా రాణిస్తూ టీ20 జట్టులో పునరాగమనంపై దృష్టిసారించాలని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ 600కు పైగా పరుగులు చేయడంతోపాటు జట్టును […] The post కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్కు జహీర్ఖాన్ సూచన appeared first on Visalaandhra .
కెనడా క్రికెట్లో బిష్ణోయ్ గ్యాంగ్!బజ్వాను కెప్టెన్గా నియమించడం వెనుక హస్తం
న్యూదిల్లీ: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్కు సంబంధించి కెనడా క్రికెట్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడటంతో ఐసీసీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా ప్రమేయంపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ జరుపుతోంది. కాగా ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) ఓ కథనం ప్రచురించింది. న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో దిల్ప్రీత్ బజ్వా అసాధారణంగా, ఖరీదైన […] The post కెనడా క్రికెట్లో బిష్ణోయ్ గ్యాంగ్!బజ్వాను కెప్టెన్గా నియమించడం వెనుక హస్తం appeared first on Visalaandhra .
ఢిల్లీపై ఘన విజయం.. SRH హ్యాట్రిక్ విజయం
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్ హెచ్ నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో నితీష్ రాణా(57) అర్ధ శతకంతో చెలరేగాడు. సమీర్ రిజ్వీ(41), కెఎల్ రాహుల్(37), స్టబ్స్(27)లు భారీ స్కోరు చేయలేకపోయారు. దీంతో ఢిల్లీపై హైదరాబాద్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో టాస్ 3 స్థానానికి దూసుకెళ్లింది. అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. మరోసారి ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.
విశాలాంధ్ర-జేఎన్టీయూ: ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి ఈ విషయం వెల్లడించారు. జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సుదర్శన్రావు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని చెప్పారు. పరీక్ష కేంద్రాలలోకి గంట ముందే అనుమతిస్తామని తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ అధ్వర్యంలో నిర్వహించే […] The post రేపు ఏపీఈసెట్ పరీక్ష appeared first on Visalaandhra .
రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్కు రెండు రోజుల ముందు నుంచి అంటే మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి […] The post రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ appeared first on Visalaandhra .
కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి
తిరువనంతపురం: కేరళలోని త్రిసూర్ జిల్లాలోని బాణసంచా గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూరం వేడుక కోసం నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రాల్లో ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. స్థానికంగా పంటపొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు గాయపడిన వారిని […] The post కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి appeared first on Visalaandhra .
తమిళనాడులో రేపు పోలింగ్బెంగాల్లో మొదటిదశకు కూడా… చెన్నై/కోల్కతా: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్కు ముందు తప్పనిసరి 48 గంటల నిశ్శబ్ద కాలం అమలులోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలు లేదా ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా, […] The post ఎన్నికల ప్రచారానికి తెర appeared first on Visalaandhra .
కొసెళ్లేదాక ఉంటవో.. ఊడుతవో తెలియదు
రాష్ట్రానికి రేవంత్రెడ్డి శని పట్టిందని, ఆ శని పీడ విరగడ కావాలంటే రేవంత్రెడ్డి పోవాలి... కేసీఆర్ రావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా జగిత్యాలలో కేసీఆర్ సభ జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కేసిఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పుణ్యంతోనే నీవు సీఎం అయ్యావని, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే నీవు సీఎం అయ్యేవాడివా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభ సక్సెస్ కాకూడదనే నీవు మేడిగడ్డ వద్ద సభ పెట్టావు.. 30 మాసాలుగా అక్కడికి ఎందుకు పోలేదు? నిద్ర పోయావా అని రేవంత్ను ప్రశ్నించారు. మేడిగడ్డ మరమ్మతు పనులకు కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, మరమ్మతులు చేయకుండా కేసీఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నేను పదవుల కోసం లొంగేవాడిని కాదని, నేనెవరిని తొక్కుకుంటూ రాలేదన్నారు. నాదేండ్లను ఎన్టీఆర్ మంత్రి వర్గంలో తొలగించడంతో నా మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. 1984లో పార్టీ ఫిరాయింపు చట్టమే లేదని, అయినా నా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరానన్నారు. నేను ఇంకా పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ విర్రవీగి మాట్లాడుతున్నాడని, ఈ రెండేండ్లు పూర్తిగా ఉంటాడో, ఊడతాడో కూడా తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలుండగా తన సొంత కుంపటి కోసమే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్లో చేరికతో నా ప్రజా జీవితానికి నూతన అధ్యయం ఏర్పడిందని, తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్ సీఎంలా వ్యవహరించకుండా వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నాడన్నారు. నోరు తెరిస్తే బండ బూతులు మాట్లాడటం సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డికి తగదన్నారు. చావుకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకా కేసీఆర్ను ఊరి తీసేదని ప్రశ్నించారు? ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? రైతన్నలకు అండగా నిలిచినందుకా, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడినందుకా? ఎందుకు కేసీఆర్ను ఉరి తీయాలని ఈశ్వర్ రేవంత్రెడ్డిని నిలదీశారు.
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. తాజాగా ప్రభుత్వం మరో రూ.4,600 కోట్ల అప్పు చేసినట్లు సమాచారం. ఇది రాష్ట్ర ఖజానాపై మరింత భారాన్ని పెంచనుంది. గణాంకాలను పరిశీలిస్తే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 60 నెలల్లో దాదాపు రూ. 3,32,000 కోట్ల అప్పులు చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 23 నెలల స్వల్ప కాలంలోనే రూ.3,56,655 కోట్ల భారీ రుణాలను సమీకరించింది. అంటే గత ప్రభుత్వ ఐదేళ్ల […] The post మరో రూ.4,600 కోట్ల అప్ప్పు appeared first on Visalaandhra .
. పనికావాలంటే పైసలివ్వాల్సిందే. 22-ఏ పేరుతో అక్రమ దందా. తారుమారవుతున్న భూ రికార్డులు. రాజకీయ నాయకులతో అధికారుల కుమ్మక్కు విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు అక్రమాలకు అక్షయపాత్రలా తయారయ్యాయి. సామాన్యుడి పట్టా భూమిని రాత్రికి రాత్రే పరాధీనం చేసే మాయా లోకాన్ని తలపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయంలోకి అడుగు పెట్టాలంటే జేబులో నోట్ల కట్టలు ఉండాలి. లేదంటే రాజకీయ అండ ఉండాలి. అక్కడ చట్టం కంటే రాజకీయ నాయకుడి మాటే శాసనం. నిబంధనల కంటే నోట్ల కట్టలకే విలువ […] The post అవినీతి ఊబిలో రెవెన్యూ appeared first on Visalaandhra .
మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు బీజేపీ కుట్ర
. ఎన్నికల్లో లబ్ధికే నాటకాలు. రాష్ట్రాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు. అమరావతిలో మూడో విడత భూ సమీకరణకు వ్యతిరేకం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర-ఒంగోలు: మూడేళ్ల క్రితం పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లును ఎన్డీయే ప్రభుత్వం తిరిగి ఎలా ప్రవేశపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సూటిగా ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఈశ్వరయ్య విమర్శించారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో […] The post మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు బీజేపీ కుట్ర appeared first on Visalaandhra .
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం భారీ బైక్ ర్యాలీలు
విశాలాంధ్ర`తిరుపతి: ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికవర్గం మంగళవారం బైక్ ర్యాలీలు నిర్వహిం చింది. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ర్యాలీలు జరిగాయి. తిరుపతి, వినుకొండ, ఇతర ప్రాంతాల్లో భారీ బైక్ ర్యాలీలు కొనసాగాయి. కార్మికులు ఉత్సాహంగా బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ రాష్ట ఉపాధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి మంగళవారం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. బైక్ […] The post ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం భారీ బైక్ ర్యాలీలు appeared first on Visalaandhra .
కెసిఆర్ చెప్పినవన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవే: ఎంపి ధర్మపురి
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల బహిరంగ సభలో చెప్పిన పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినవేనని బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. 72 ఏళ్ళ వయసులో కెసిఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టారని ఆయన విమర్శించారు. పౌరసరఫరాల విభాగంలో అవినీతి, అక్రమాలు గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆ అవినీతిని ప్రస్తుత మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తమ్కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న బిఆర్ఎస్కు కోవర్ట్ అని విమర్శించారు. రైతుల వద్ద నుంచి కరెంట్ బిల్లులు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఎంపీ అర్వింద్ చెప్పారు. ఆదివాసీల పోడు భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. దీనిని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో రైతులను ఆదుకోని కెసిఆర్ పంజాబ్కు వెళ్ళి రైతులకు చెక్కుల పంపిణీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తన పోరాటం ఆగదని, పసుపు రైతులకు క్వింటాల్కు రూ. ౩౦ వేలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూముల ధరలకు దేశ వ్యాప్తంగా రెక్కలు వచ్చాయని ఎంపీ అర్వింద్ తెలిపారు. తుపాకి రామునిలా.. ఎంపీ రఘునందన్ రావు జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, భూపాల్పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో తుపాకి రామునిలా డైలాగులు కొట్టారని బిజెపి ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పరస్పరం కాపాడుకుంటున్నాయని, నామమాత్రంగా విమర్శలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..?: హరీష్రావు
కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్షిప్లో కనీసం 10 శాతం కూడా రేవంత్కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారిక లైవ్లో బిఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా దానిని ఆపలేరు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. సోమవారం జగిత్యాల సభలో కెసిఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని చెప్పారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? అని ప్రశ్నించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది, పంట చేతికి వచ్చాక వేశారని తెలిపారు.
ఆర్మీ ట్యాంకుల కొనుగోలుకు రూ.975 కోట్లతో ఒప్పందం
న్యూఢిల్లీ: మందుపాతరలు అమర్చిన క్షేత్రాలను ధ్వంసం చేసే అత్యంత సామర్థం కలిగిన కీలకమైన ఆర్మీ ట్యాంకుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ రూ. 975 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎంఎల్) , ఎలెక్ట్రోన్యూమాటిక్స్ , హైడ్రాలిక్స్ (ఇండియా) ప్రైవేట్ సంస్థలతో ఈ ఒప్పందం కుదిరిందని ప్రకటన వెలువడింది. ఈమేరకు టి 72,/టి90 ట్యాంకులు లభిస్తాయి.
థాయ్లాండ్లో ‘ఈఎన్ఈ రిపీట్’.. ఆకట్టుకుంటున్న ఫోటో
’ఈ నగరానికి ఏమైంది’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ని కొనసాగిస్తూ సినిమా సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా చేరారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యానర్పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నెల పాటు కొనసాగుతుంది. సెట్ నుంచి వచ్చిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ‘టీమ్ కన్యారాసి‘ గ్యాంగ్కు చెందిన ఆ నలుగురు అబ్బాయిలు వింటేజ్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు.
జర్మనీ గురుద్వారా దగ్గర ఘర్షణ... నలుగురికి గాయాలు
లండన్: జర్మనీ లోని గురుద్వారాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఆయుధాలు, కత్తుల దాడి వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు జర్మనీ లోని మోయిర్స్ సిటీ గురుద్వారాలో ఈ సంఘటన జరిగింది. సిక్కు సమాజం లోని రెండు వర్గాల మధ్య మొదలైన చిన్నగొడవ చివరకు ఆయుధాలు, కత్తుల దాడికి దారి తీసిందని అధికారులు చెప్పారు. అయితే ఘర్షణకు కారణాలేమిటో ఇంకా తెలియడం లేదని పోలీసులు చెప్పారు.
ఒప్పందం లేకపోతే ఇరాన్పై దాడులు: ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణ గడువులోపు ఒప్పందం కుదరకపోతే, ఇరాన్పై బాంబు దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు. నేను అలా చేయాలని అనుకోవడం లేదు అని సీఎన్బీసీ ‘స్క్వాక్ బాక్స్’ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు. శాంతి చర్చలు కొనసాగేందుకు కాల్పుల విరమణను పొడిగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, వారు చర్చలకు రావాల్సిందే. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ బలమైన దేశంగా ఎదగగలదు అని పేర్కొన్నారు. అయితే ఒప్పందం లేకుండా కాల్పుల విరమణ ముగిస్తే, దాడులు మళ్లీ ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి దృక్పథంతో ముందుకు వెళ్లడం మంచిదని నేను భావిస్తున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్, మంచి ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నాను. వారికి వేరే మార్గం లేదు అని అన్నారు. మేము వారి నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని దెబ్బతీశాం. వారి నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేశాం అని పేర్కొన్నారు. అయితే, నాయకత్వ మార్పు పరోక్షంగా జరిగిందని ట్రంప్ సూచిస్తూ, ఇది నేరుగా చెప్పిన ‘రెజీమ్ ఛేంజ్’ కాకపోయినా పరోక్షంగా జరిగిందే అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత అమెరికాఇరాన్ చర్చలు ఫలితం లేకుండానే ముగియగా, రెండో విడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.
మెక్సికో పిరమిడ్ దగ్గర కాల్పులు.. ఒకరు మృతి
మెక్సికో సిటీ: మెక్సికో లోని చారిత్రక టియోటిహుకాన్ పిరమిడ్ల వద్ద ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడడంతో ఓ కెనడా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తరువాత నిందితుడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు పర్యాటకులు భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట జరిగి అనేక మంది గాయపడ్డారు. వారందరినీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి తుపాకీ, కత్తి, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చర్చలు విఫలం. అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్సులు బంద్
తెలంగాణలో ఆర్టీసి సమ్మె బాట పట్టనుంది. మంగళవారం ప్రభుత్వంతో టీజిఎస్ ఆర్టీసీ జేఏసీ చర్చలు జరిపింది. సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఆర్ అధికారుల కమిటీతో దాదాపు 4 గంటలకుపైగా ఆర్టీసీ సంఘాలు చర్చలు జరిపాయి. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో ఈ అర్ధరాత్రి నుంచే టీజిఎస్ ఆర్టీసి సమ్మెకు వెళ్లనుంది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈక్రమంలో ప్రజా రవాణా స్తంభించే అవకాశం ఉంది.
అభిషేక్ ఊచకోత.. ఢిల్లీకి భారీ టార్గెట్
మన తెలంగాణ/హైదరాబాద్: మరోసారి ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఐపిఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో అభిషేక్ తన బ్యాటింగ్ తో వీరవిహారం చేశాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.
లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ సిఐ, ఎస్ఐ
లంచం తీసుకుంటూ సిఐ, ఎస్ఐ ఎసిబికి దొరికిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. మంగళవారం రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరుకు చెందిన ఓ వ్యక్తి, అతని కుటుంబసభ్యులపై వికారాబాద్ మహిళ పోలీస్స్టేషన్లో సెక్షన్ 498 ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసులో బాధితుడికి, అతని తల్లి, ఆడ పడుచులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు మహిళా పోలీస్స్టేషన్ సిఐ సరోజ, ఎస్ఐ రాణి ఒక్కొక్కరికి లంచం డిమాండ్ చేశారు. రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో రూ.20 వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బులు తన వద్ద లేకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టాం. ఈ విచారణలో సాక్ష్యాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే బాధితుడి వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా సీఐ, ఎస్ఐలను పట్టుకున్నామని డీఎస్పీ ఆనందర్కుమార్ తెలిపారు. మొదటి విడత డబ్బులు రూ.20 వేలు సీఐ సరోజ సమక్షంలో ఎస్సై తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్సైపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వికారాబాద్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ సరోజ స్టేషన్కు వచ్చిన బాధితుల రక్తం తాగేదని బాధితుడు, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షద్ ఆరోపించారు. ఫిబ్రవరి 20న నా భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేదు. కానీ డబ్బుల కోసం నాపై, నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, తమ్మునిపై కేసులు నమోదు చేశారు. నాకు, నా భార్యకు చిన్న గొడవ జరిగింది. నా భార్య ఇచ్చిన ఫిర్యాదుపై అదే రోజు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మా అమ్మనాన్న ఇద్దరు వృద్ధులు. వారు నాతో దూరంగా ఉంటారు. మా సిస్టర్లు ఇద్దరు, మా తమ్ముడు నాతో పాటు ఉండరు. కానీ వారిపైనా కేసు నమోదు చేశారు. కేసును లోక్ అదాలత్లో కొట్టేసేవిధంగా చేస్తానని, అందుకోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పునా మొత్తం రూ.60 వేలు కావాలని డిమాండ్ చేశారు. రూ. 40 వేలకు సెటిల్చేసి ముందుగా రూ. 20 వేలు తీసుకున్నదన్నారు. వీరిద్దరు నెలకు రూ.50 నుంచి 60 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. మా వాళ్ల తప్పుల్లేకపోయినా వారిని డబ్బుల కోసం సీఐ, ఎస్సై ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ ఇద్దరు అధికారులు బాధితులకు న్యాయం చేయకపోగా లంచాలు తీసకుంటున్నారన్నారు. వీళ్ల భాగోతం గురించి జిల్లాలో ఎవరినడిగినా తెలుస్తుందన్నారు. అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు పునఃప్రారంభం
ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్ లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.ఇదే సమయంలో లెబనాన్లో 10 రోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్పై ప్రారంభమైన రెండో రోజునే, ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లెబనాన్లో జరిగిన పోరాటాల్లో ఇప్పటివరకు 2,290 మందికి పైగా మరణించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో కనీసం 3,375 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదనంగా ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ అరబ్ దేశాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాంతవ్యాప్తంగా 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించినట్లు సమాచారం.
చెన్నైకి బిగ్ షాక్.. ఐపిఎల్ నుంచి స్టార్ బ్యాటర్ ఔట్
చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్ తగిలింది. గాయంతో యువ ఆటగాడు ఆయుష్ మాత్రె ఐపిఎల్కు దూరమయ్యాడు. ఈ సీజన్లో చెన్నై అంతంత మాత్రంగానే రాణిస్తోంది. ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇలాంటి స్థితిలో ప్రతిభావంతుడైన బ్యాటర్గా పేరున్న ఆయుష్ దూరం కావడం సిఎస్కెకు పెద్ద ఎదురు దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయుష్ గాయానికి గురయ్యాడు. తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ఆయుష్ ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని సిఎస్కె యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
పొన్నాల గతే జీవన్ రెడ్డికీ పడుతుంది: ఎంపి చామల
గతంలో కాంగ్రెస్ను వీడి బిఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ పడుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కెసిఆర్ వెంటనే ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారని, నిజానికి తమ పార్టీ అధినేతగా చేయాలనుకున్నామని ఎంపీ చామల మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జీవన్ రెడ్డి ఆలోచన లేని పని చేశారని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహు, కేతు గ్రహం అని ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ విమర్శించడాన్ని ఎంపీ చామల తీవ్రంగా ఖండించారు. అసలు బండి సంజయ్ ఏ గ్రహం అని ఆయన అన్నారు. నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర మంత్రి బండి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మెట్రో పేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో మీ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భువనగిరి లోక్సభ పరిధి కోసం నిధులు తీసుకుని వచ్చేందుకు బహిరంగ సభను కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి. కిషన్ రెడ్డి కలిసి పెట్టాలని, అందుకు పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకుని వచ్చే బాధ్యత తనదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేపిస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు. సిబిఐ విచారణకు ఆదేశించడం కేంద్ర హోం శాఖ మంత్రి పరిథిలోకే వస్తుందని, అయినా బండి సంజయ్ మాట్లాడడం లేదన్నారు. కాళేశ్వరం బిఆర్ఎస్కు ఏటీఎంగా మారిందన్న బిజెపి ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు.
అమెరికా సీజ్ చేసిన నౌకలో.. చైనా నుంచి ఇరాన్కు క్షిపణి రసాయనాలు
వాషింగ్టన్: హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ మాజీ రాయబారి , రిపబ్లికన్ నేత హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిని బట్టి ఇరాన్కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని కొట్టి పారేయలేమని ఆరోపించారు. ఈ తొస్కా నౌక అనేక సార్లు చైనాకు వెళ్లిందని, ఇరాన్ క్షిపణుల తయారీకి కావలసిన రసాయనాలను తీసుకొచ్చిందని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. గత ఆరు వారాల్లో ఈ నౌక చైనాకు రెండు సార్లు వెళ్లిందని పేర్కొంది. మరోవైపు తౌస్కా నౌకను, అందులోని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఇది వెంటనే జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాను హెచ్చరించింది. ఇరాన్ నౌకతో మా సంబంధం లేదు: చైనా అమెరికా సీజ్ చేసిన ఇరాన్ తౌస్కా వాణిజ్య నౌకలో క్షిపణుల తయారీకి కావలసిన చైనా రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. “నాకు తెలిసినంతవరకు , ఇది విదేశీ పతాకం కలిగిన నౌక. దాంతో తమ దేశానికి సంబంధం ఉందన్న దుష్ప్రచారాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం ” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి గుయో జియా కున్ పత్రికా విలేకరులకు చెప్పారు. అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఉద్రిక్తతలకు దారితీసిన హిజాబ్ బిందీ వివాదం
కళ్లజోడు విక్రయ సంస్థ లెన్స్కార్ట్ షోరూమ్లో హిజాబ్ బిందీ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యోగులు హిందూత్వాన్ని ప్రతిబింబించే బింది, బొట్టు పెట్టుకోవడం వంటివి చేయకూడదు అని చెబుతూ, హిజాబ్కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చా నేతల ఆధ్వర్యంలో కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు స్టోర్లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు బీజేపీ మైనారిటీ మోర్చా నేత నాజియా ఎలాహీ నాయకత్వం వహించారు. కార్యకర్తలు స్టోర్లోకి ప్రవేశించి సిబ్బందికి బొట్టు పెట్టడంతో పాటు చేతులకు పవిత్ర దారాలను కట్టారు. అలాగే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాజియా ఎలాహీ స్టోర్ ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్ను ప్రశ్నిస్తూ, హిందూ మతంలోని కొన్ని సంప్రదాయాల ఆంక్షలపై వస్తున్న ఆరోపణలకు వివరణ కోరారు. మీరు మొహ్సిన్ ఖాన్ కాబట్టే బొట్టు పెట్టుకోవడాన్ని ఆపారా? అని ఆమె వీడియోలో ప్రశ్నించినట్లు వినిపించింది. నాజియా ఎలాహీ మాట్లాడుతూ స్టోర్నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ మరొక మతాన్ని అణగదొక్కుతున్నారు. ఇది హిందూ దేశం. సంస్థ యజమాని క్షమాపణ చెప్పకపోతే లెన్స్కార్ట్ను బహిష్కరిస్తాం లేదా అన్ని ఔట్లెట్లనూ మూసివేయాల్సిందే అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్ తో పాటు హిందూ ఉద్యోగులను ముందుకు పిలిచి వారి నుదుటిపై బొట్టు పెట్టారు. మతపరమైన గుర్తింపును వ్యక్తపరచడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు అని పేర్కొన్నారు. అయితే, ఈ సమయంలో ఉద్యోగులు అసౌకర్యంగా కనిపించినప్పటికీ ప్రతిఘటించలేదు. ఇదిలా ఉండగా, షోరూమ్లోని ఒక ఉద్యోగి, సంస్థ శిక్షణా సమయంలో బొట్టు పెట్టుకోవడం, చేతికి పవిత్ర దారం కట్టుకోవడం నిషేధమని చెప్పినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, వివాహిత మహిళలు కూడా మంగళసూత్రం ధరించకూడదని సూచించారని ఆయన తెలిపారు. ఈ ఆరోపణలు అక్కడున్న వారిలో ఆగ్రహానికి దారితీశాయి. షోరూమ్ మేనేజర్ నుంచి వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల కార్యకర్తలు ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పేర్కొంటూ, పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు ఔట్లెట్ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. హిజాబ్కు అనుమతి ఇస్తూ, బిందీ, బొట్టు పెట్టుకోవడం వంటి హిందూ మత సంప్రదాయాలపై పరిమితులు విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో లెన్స్కార్ట్ వివాదాల్లో చిక్కుకుంది. వివాదం ముదురుతున్న నేపథ్యంలో సంస్థ క్షమాపణలు తెలియజేసింది. సంస్థ సీఈఓ పీయుష్ బన్సల్ వివరణ ఇస్తూ, ఆ విధాన పత్రం తప్పుదోవ పట్టించేలా ఉంది అని, అది సంస్థ ప్రస్తుత మార్గదర్శకాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. వైరల్ అయిన ఆ పాత విధాన పత్రం పాత శిక్షణ గమనిక మాత్రమేనని, సంస్థ హెచ్ఆర్ విధానంలో భాగం కాదని తెలిపారు. బిందీ, బొట్టుకు సంబంధించిన సూచనలు తరువాత తొలగించేశామని కూడా పేర్కొన్నారు. తరువాత సంస్థ విడుదల చేసిన సమగ్ర ‘ఇన్-స్టోర్ స్టైల్ గైడ్’లో బిందీ, బొట్టు నుంచి హిజాబ్, తలపాగా (తుర్బాన్) వరకు అన్ని మత, సాంసృ్కతిక గుర్తులను తమ అన్ని ఔట్లెట్లలో అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.
27న తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ కీలక సమావేశం
భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు తప్పనిసరిగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంఎల్ఎలు, మాజీ ఎంఎల్సిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి..
మనతెలంగాణ, సిటిబ్యూరోః రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన నాచారం, మల్లాపూర్లో వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం వీడియో తీస్తు బిల్డింగ్పై నుంచి కిందపడడంతో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రానికి చెందిన బాలుడు మితున్(14) తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం నాచారం, మల్లాపూర్కు వచ్చి పనిచేస్తున్నారు. మల్లాపూర్, గాంధీ బొమ్మ దగ్గర ఉన్న బస్తీలో ఉంటున్నారు. బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు, బాలుడు తరచూ ఇన్స్ట్రాగ్రాం, యూట్యూబ్లో రీల్స్ చూసేవాడు. తాను కూడా రీల్స్ చేసి ఫేమస్ కావాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీన తాను ఉంటున్న భవనం బాల్కనీ రేయిలింగ్ పిట్ట గొడపై ఫీట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు.
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి...లిక్కర్ దందా
బెంగళూరు, హర్యానా డిఫెన్స్ మద్యం విక్రయం రూ.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం మనతెలంగాణ, సిటిబ్యూరోః నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసిన ఇంటిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 361 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి హస్తినాపురంలో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి సురేష్ బెంగళూరు, హర్యానా రాష్ట్రాల్లోని ఆర్మీ క్యాంటీన్ల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లను హస్తినాపురానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది శ్రీరమణ కాలనీ, ఫేజ్2లోని ఇంట్లో దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దాడి చేస్తున్నట్లు తెలుసుకున్న సురేష్ రెడ్డి ఇంటి నుంచి పారిపోయాడు. కేసు దర్యాప్తు కోసం మద్యం బాటిళ్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
మామ పరీక్ష… అల్లుడు అరెస్ట్#Warangal#OpenInterExam#ExamFraud#PoliceArrest#EducationNews#Telangana
సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊస్ట్.. ఇంటిపైనే గంజాయి మొక్కలు పెంచుతూ..
మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి అలవాటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న యువకుడు... ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చేతికి చిక్కాడు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం... నాచారం, ఈస్ట్ గాంధీనగర్కు చెందిన సిహెచ్.శశిధర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వచ్చే జీతమంతా గంజాయి కొనుగోలుకే వెచ్చించడంతో చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. దీంతో యువకుడు తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. దాని నుంచి వచ్చే గంజాయిని తాను వినియోగించుకుంటున్నాడు. ఈ విషయం రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి తెలియడంతో సిఐ బాలరాజు, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఇంటిపై పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు మూడు మీటర్లు పెరిగి, పూతకు వచ్చాయి. ఈ మొక్కలు నుంచి 10కిలోల గంజాయి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు బండి అరుణ్ కుమార్, బి.ఆషిష్ను అరెస్టు చేసి ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
తెలంగాణలో హీట్ అలర్ట్! #Adilabad#Heatwave#Telangana#SummerHeat#IMD#WeatherUpdate#GlobalHeat
Writer-turned-director Koratala Siva has been idle since the release of Devara. He is ready with the script of Devara 2 but NTR is occupied with other projects. Koratala Siva has been keen to work with Nandamuri Balakrishna. The discussion took place recently and Balayya has given his nod for Koratala Siva’s script. The shoot of […] The post Koratala Siva to Direct NBK appeared first on Telugu360 .
టిసిఎస్ కేసు.. బలవంతపు మత మార్పిడిలో నిదాఖాన్ పాత్ర
నాసిక్ : టిసిఎస్ నాసిక్ కేసులో టిసిఎస్ ఉద్యోగిని నిదాఖాన్ అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ పొందడంలో విఫలమైన తరువాత ఆమె గురించి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం వివరించారు. నాసిక్ కంపెనీలో బలవంతపు మత మార్పిడిలో ఆమె కీలక పాత్ర వహించారని, ప్రస్తుతం ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాసిక్ లోని ఐటీ మేజర్ యూనిట్లో లైంగిక వేధింపుల కేసులపై చర్చించారు. ఇంతవరకు ఎనిమిది మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ )కమిటీ వీడియో కాన్షరెన్సులపై ఆధారపడకుండా తరచుగా వ్యక్తిగతంగా స్థానిక సభ్యులను కలుసుకుని వివరాలు సేకరించాలన్నారు. ఈ కేసులో తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, అందులో ఒకదానిలో నిదాఖాన్, మరో నలుగురు నిందితులుగా ఆరోపించబడింది. లైంగిక వేధింపులే కాదు, బలవంతంగా మతం మార్పిడి చేయించడం లోనూ ఆమె పాత్ర ఉన్నట్టు తేలింది. ఈ కేసు వెలుగు లోకి వచ్చిన దగ్గరి నుంచి ఆమె పరారీలో ఉంది. సోమవారం సెషన్స్ కోర్టు ఆమెకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈమేరకు ఆమె యాంటిసిపేటరీ బెయిల్పై విచారణ ఏప్రిల్ 27కు వాయిదా పడింది. నాసిక్ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈ కేసుల దర్యాప్తు చేపట్టింది. ఆమెను పట్టుకోడానికి మూడు టీమ్లను ఏర్పాటు చేశారు.
శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అనుసరణీయం..
శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అనుసరణీయం.. అలరించిన గుంటుపల్లి మోహనకృష్ణ ఆధ్యాత్మిక ప్రవచనం.. ఇంద్రకీలాద్రి,
వైభవంగా శంకరాచార్య జయంతి ఉత్సవాలు..
వైభవంగా శంకరాచార్య జయంతి ఉత్సవాలు.. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా నిర్వహణశాస్త్రోక్తంగా శంకరాచార్య
భక్తుల సంతృప్తియే ముఖ్యం.. దేవాలయాల్లో సౌకర్యాల మెరుగుదల చేయండి..దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం..
దమ్మపేట ఎస్సై కి ఎస్పీ ప్రశంస…
దమ్మపేట ఎస్సై కి ఎస్పీ ప్రశంస… దమ్మపేట, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ
చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణాపై సిపిఐ ఆందోళన..
తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా – టీడీపీ నేతల మద్దతు విశాలాంధ్ర – గోరంట్ల: గోరంట్ల మండల పరిధిలోని చిత్రావతి నదిలో రోజురోజుకీ ఇసుక అక్రమ రవాణా పెరుగుతోందని, దీంతో పరివాహక ప్రాంత రైతుల ఫిల్టర్ బోర్లు ఎండిపోతున్నాయని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య ముఖ్య అతిథిగా […] The post చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణాపై సిపిఐ ఆందోళన.. appeared first on Visalaandhra .
ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు
ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉచిత
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే…
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే… రాప్తాడు, ఆంధ్రప్రభ : ఎన్నికల ముందు ఇచ్చిన
విద్యకు వయసు, పదవులు అడ్డంకి కాదు..
విద్యకు వయసు, పదవులు అడ్డంకి కాదు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసిన చైర్
విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థికసహాయం..
విశాలాంధ్ర – లేపాక్షి: లేపాక్షిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీవిబి)లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన సుభానీ భీ కుమార్తె ఉన్నత చదువుల కోసం విద్యాలయ సిబ్బంది మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు.విద్యాలయంలో పనిచేస్తున్న బోధన, భోధనేతర సిబ్బంది కలిసి రూ.51 వేల మొత్తాన్ని మృతురాలి కుమార్తెకు అందించారు. ఈనెల 17వ తేదీన హిందూపురం నుంచి లేపాక్షిలోని విద్యాలయానికి విధులకు వెళ్తుండగా, టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదానికి గురై […] The post విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థికసహాయం.. appeared first on Visalaandhra .
తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు: మంత్రి జూపల్లి
నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్, చారిత్రక గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి కట్టడాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని వివరించారు. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా ప్రకృతి ఒడిలో విరాజిల్లే కుంటాల, బొగత జలపాతాలు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వంటి సాంస్కృతిక వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వంటి సంప్రదాయ కళలు పర్యాటక రంగాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలను తిలకించేందుకు దేశ విదేశీ పర్యాటకులు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనను మరింత బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణ పర్యాటక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్త్తోందని మంత్రి జూపల్లి పునరుద్ఘాటించారు.
జగద్గురు ఆదిశంకరాచార్య నగరోత్సవం..
జగద్గురు ఆదిశంకరాచార్య నగరోత్సవం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్బంగా
తమిళనాడులో డిఎంకే కూటమిదే విజయం: భట్టి విక్రమార్క
తమిళనాడులో డిఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి పరిశీలకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాణిపేట జిల్లా షోలింగర్ నియోజకవర్గంలో నీకారిక్కల్ , వీరనట్టుర్, అరియూర్, అయిపేడు ప్రాంతాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించి, కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తమిళ ప్రజలు అభివృద్ధి, లోకికవాదానికే పట్టం కడతారని చెప్పారు. ఆత్మగౌరవానికి తమిళ ప్రజల మద్దతు చెబుతారని ఆకాంక్షించారు. ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని భట్టి విక్రమార్క చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోనీ ప్రజా ప్రభుత్వం ఎన్నికలవేళ ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. అనుమానం ఉంటే ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చని తెలిపారు. రైతు భరోసా కింద రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు వివరించారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు అంటే ఒక సిద్ధాంతం తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అదొక గొప్ప సిద్ధాంతమని పేర్కొన్నారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి వంటి మహనీయులు ఇక్కడ సామాజిక న్యాయానికి బలమైన పునాదులు వేశారని ఆయన పేర్కొన్నారు. లౌకికవాదాన్ని కాపాడటంలో తమిళ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని ఆయన ప్రశంసించారు. ఢిల్లీ పీఠంపై ఉన్న పాలకులు తమిళ సంస్కృతిని, భాషను, హక్కులను అణచివేయాలని చూస్తున్నారని భట్టి విమర్శించారు. ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే సెక్యులర్ శక్తుల ఐక్యత అనివార్యమని, అందుకే స్టాలిన్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ అందిస్తున్న ప్రేమ సందేశం, స్టాలిన్ చేపట్టిన అభివృద్ధి నినాదం ఒక్కటయ్యాయని భట్టి పేర్కొన్నారు. తమిళ ప్రజలు వేసే ఓటు కేవలం ఒక గుర్తుపై వేసే ముద్ర కాదని, అది విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వినిపించే ప్రజాస్వామ్య గొంతుక అని వ్యాఖ్యానించారు. నియంతృత్వాన్ని ఓడించి, విద్వేషం లేని సమాజాన్ని నిర్మించుకోవాలని, ఇక్కడ కేవలం ప్రేమకు, సమధర్మానికి మాత్రమే చోటు ఉందని నిరూపించాలని ఆయన కోరారు. తాము మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని, అదే స్ఫూర్తితో తమిళనాడులో కూడా అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే డీఎంకే-కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.
తుమ్మలని విమర్శించే అర్హత పువ్వాడకు లేదు…
తుమ్మలని విమర్శించే అర్హత పువ్వాడకు లేదు… ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : వ్యవసాయ
తాడిపత్రి లో జోరుగా మట్కా దందా …
పేదల నివాస ప్రాంతాలే లక్ష్యంగా మట్కా నిర్వహణ… మట్కా మహమ్మారి కాటులో తాడిపత్రి పేదలు ఆన్లైన్, వాట్సాప్లలో మట్కా నిర్వహణ. విశాలాంధ్ర – తాడిపత్రి: పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి మనిషి ఆశాజీవి. అయితే ఆ ఆశనే ఆయుధంగా చేసుకుని మట్కా నిర్వాహకులు పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక్క రూపాయికి 90 రూపాయలు” అనే ఆశ చూపిస్తూ తాడిపత్రి పట్టణంలోని పేద ప్రాంతాల్లో మట్కా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. రోజంతా కష్టపడి […] The post తాడిపత్రి లో జోరుగా మట్కా దందా … appeared first on Visalaandhra .
ప్రశ్నిస్తే తొలగిస్తారా? చంద్రబాబు సర్కారుపై జగన్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: కల్వకుంట్ల కవిత
ఆర్టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
చైన్ స్నాచింగ్ కేసులో మలుపు… ఇద్దరిలో ఒకరి అరెస్ట్పల్సర్ బైక్ స్వాధీనం..అంతర్రాష్ట్ర భవారియా
IPL 2026: ఢిల్లీపై టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్..
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని.. హైదరాబాద్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఢిల్లీని కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి. మరోవైపు, హైదరాబాద్ ను ఓడించి తమ సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది.
భారత విమానాలపై పాక్ గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగింపు
భారత విమానాలపై గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గాంపై ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి రెండు దేశాల మధ్య గగనతల దిగ్బంధనం కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ 30 నుంచి పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి లేదు. పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ నోటమ్ ప్రకారం ఈ ఏడాది మే 24 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీనివల్ల పశ్చిమదేశాలకు , ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశాలకు ఢిల్లీ, అమృత్సర్, జైపూర్ నుండి వెళ్లే సుమారు 800 వారపు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది.
విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సు కిట్లు పంపిణీ…
విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సు కిట్లు పంపిణీ… పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వము
మోదీపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపాటు శ్రీ సత్యసాయి బ్యూరో,
Ys Jagan : ఎక్స్ లో చంద్రబాబు పై జగన్ ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు
రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మోదీ: మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించారు. ఆయన ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చెన్నైలో జరిగిన పత్రికా సమావేశంలో ఏఐసీసీ సాధారణ కార్యదర్శి (సంస్థ) కె.సి. వేణుగోపాల్తో కలిసి మాట్లాడిన ఖర్గే, ఏఐఏడీఎంకేబీజేపీ కూటమిపై విమర్శలు చేస్తూ తొలుత ప్రధాన మంత్రిని టెర్రరిస్ట్గా పేర్కొన్నారు. అయితే, తన వ్యాఖ్యలపై పాత్రికేయులు వివరణ కోరడంతో, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను భయపెడుతున్నారనే ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేశానని స్పష్టం చేశారు.ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నేను ఆయనను నిజంగా టెర్రరిస్ట్ అన్నానా? లేదా? ఎందుకు అన్నాను? అన్నది కాదు ముఖ్యం. ఆయన తన అధికారాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడి చేస్తున్నారు అని ఖర్గే అన్నారు. ఇక భారత ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయ విస్తరణగా మారిపోయిందని ఆరోపించిన ఆయన, ఎన్నికల ప్రచారం చివరి దశలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ప్రధాన మంత్రిపై విమర్శలు గుప్పించారు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలను రాజకీయ కార్యకర్తలను బెదిరించే సాధనాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.అదే సందర్భంలో, మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు లోక్సభ స్థానాలను పెంచడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో అనుసంధానం చేసే రాజ్యాంగ సవరణ బిల్లుపై కూడా మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళల రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షం అడ్డుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన అన్నారు. 2023లో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడిందని గుర్తుచేశారు.నిజంగా అమలు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే, ప్రస్తుత 543 లోక్సభ స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చు. అయితే ఎందుకు ఇవ్వడం లేదు? అని ఖర్గే ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం ఉంది. వారి పురోగతికి శిక్ష విధించాలని మోదీ, షా భావిస్తున్నారు అని విమర్శించారు.డీఎంకేకాంగ్రెస్ కూటమి బలాన్ని పునరుద్ఘాటించిన ఖర్గే, కె.సి. వేణుగోపాల్తో కలిసి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ మధ్య విభేదాలున్నాయన్న వార్తలను కొట్టిపారేశారు. ఇద్దరూ అన్నదమ్ముల్లాంటి వారు అని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కూటమి హామీలను కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మహిళలు, వృద్ధులకు నెలకు రూ.2,000 సహాయం, కుటుంబాలకు ఆహార భద్రత కోసం నెలకు రూ.2,500, అలాగే 300 రోజుల్లో ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, భారత ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయ విస్తరణలా వ్యవహరిస్తోంది అని ఖర్గే విమర్శించారు.
ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. భూమాతను కాపాడండి.. పర్యావరణాన్ని రక్షించండి…భూమాత క్షోభ ను బాదంపప్పు
కెసిఆర్ వద్ద జీవన్ రెడ్డికీ భంగం తప్పదు: ఎంపీ మల్లు రవి
భంగపడినట్లు ఇప్పుడు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చేతిలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ తప్పదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం కాంగ్రెస్పై కెసిఆర్, టి. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ మల్లు రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెసిఆర్కు నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తెలిపారు. కెసిఆర్తో ఏమి ఉపయోగం లేదని ఎన్నికల్లో రుజువైందని అన్నారు. కెసిఆర్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజా ప్రభుత్వానికి ఏమి కాదని, ప్రజలకు తమ వైపు ఉన్నారని ఆయన తెలిపారు. త్రేతాయుగంలో రావణుడి చేతిలో విభీషణుడు భంగపడినట్లు కలియుగంలో కెసిఆర్ చేతిలో జీవన్ రెడ్డికి భంగపాటు తప్పదని ఆయన అన్నారు. 42 ఏళ్ళు జీవన్ రెడ్డి కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శించడం భావ్యం కాదని ఆయన విమర్శించారు. తాను చెప్పినట్లు కాంగ్రెస్ వినలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడి పోవడంతో 42 ఏండ్ల వ్యక్తి గత ప్రతిష్టను దిగజార్చుకున్నారని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు రేవంత్ రెడ్డి కులగణన నిర్వహించారని మల్లు రవి చెప్పారు.
తెలంగాణ వైపు నార్వే చూపు.. సచివాలయంలో కీలక భేటీ! ఆంధ్రఫ్రభ, వెబ్ డెస్క్
అమెజాన్ డెలివరీలో భారీ మోసం.. ఢిల్లీ పోలీసుల వేటలో దొరికిన కేటుగాళ్లు! ఆంధ్రప్రభ,
బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి
త్రిస్సూర్: కేరళలో భారీ పేలుడు జరిగింది. త్రిస్సూర్లో బాణసంచా నిల్వ, తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. త్రిస్సూర్ పూరం ఉత్సవాల్లో భాగంగా జరిగే తిరువంబడి కోసం బాణసంచా సామగ్రిని సిద్ధం చేస్తున్న కేంద్రంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, సహాయక బృందాలు, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని త్రిస్సూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. భారీ పేలుడుతో..దాని శబ్దం చాలా కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దీంతో సమీపంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం సంభవించినట్లు అనుకుని భయపడినట్లు స్థానికులు తెలిపారు. దట్టమైన పొగ, మంటలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం
సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాబోయే
బీఆర్ఎస్ కీలక సమావేశం.. కేసీఆర్ అధ్యక్షతన రజతోత్సవ ముగింపు వేడుకలు ఆంధ్రప్రభ, వెబ్
బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహం..
మునుగోడు, ఆంధ్రప్రభ : పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ప్రధాని మోడీ 'టెర్రరిస్టు'.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆయన.. ప్రధాని మోడీని టెర్రరిస్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సమానత్వాన్ని విశ్వసించని వ్యక్తి(ప్రధాని మోడీ)తో AIADMK చేతులు కలపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. మోడీతోపాటు ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. అలాంటి వారితో వీరు చేతులు కలపడం అంటే, వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం అని పేర్కొన్నారు. ప్రధాని మోడీని ఉగ్రవాది అనడంతో ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను, ముఖ్యంగా ఎన్నికల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారు సిబిఐ, ఈడీ, ఐటి వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను కూడా లక్ష్యంగా చేసుకోగల శక్తివంతమైనది తమ ప్రభుత్వమేనని ప్రజలు భావించేలా, వారిలో భయాన్ని సృష్టిస్తున్నారు. ఆ సందర్భంలోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఆయన (మోడీ) స్వయంగా ఒక ఉగ్రవాది అని నేను ఎప్పుడూ అనలేదు. ఈ సంస్థలను ఉపయోగించుకుని ఆయన, ఆయన ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే నేను చెప్పాను. నా ఉద్దేశం అదే అని ఖర్గే అన్నారు.
ధర్మ యోగ బిరుదు పొందిన దాత్రిక రమేష్
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నగరానికి చెందిన గోరక్ష ప్రముక్ దాత్రిక రమేష్
రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..
రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రభ, వెబ్
అందుకే ఢిల్లీకి వెళ్లా.. సీఎం రేవంత్ కు హరీష్ వార్నింగ్ ఆంధ్రప్రభ, వెబ్
నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే ఆ పదిమందిని చేర్చుకున్నావు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని..రేవంత్ రెడ్డి.. ఆ పీడ విరగడ కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఆలోచన లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి తగిన మెజార్టీ సభ్యులు ఉన్నా.. నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు అని ఆరోపించారు. రాష్ట్రంలో తిరోగమన పాలన సాగుతోంది. కెసిఆర్ ను ఉరి తీస్తావా.. నీవేమి ముఖ్యమంత్రివి?. నీవు సీఎం కావడం కెసిఆర్ పుణ్యమే. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం చేస్తానన్నావు ఏమైంది. మేడిగడ్డ మరమ్మతుకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. 30 మాసాలుగా నిద్రపోయి ఇప్పుడు మేడిగడ్డ గుర్తొచ్చి వెళ్లారా?. మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించి డిజైన్ కే ఏడాది పడితే, ఎప్పుడు మరమ్మత్తులు చేస్తారు, ఎప్పుడు నీరందిస్తారు.ఈ రెండేళ్లు ప్రకృతి సహకరించింది.. రేపు ప్రకృతి సహకరించకుంటే పరిస్థితి ఏంటి? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4..
నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4.. పి.4.మార్గదర్శి బొండా సిద్ధార్థ పాయకాపురం, ఆంధ్రప్రభ :
మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం
మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ
హిమాచల్ప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం.. జీతాల్లో కోత
హిమాచల్ప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు
నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఆర్డీఓ..
నారాయణపేటం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంపై మంగళవారం ఎసిబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ రామచందర్ నాయక్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏకకాలంలో ఆర్డీఓ నివాసం, కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిని ఆర్డీఓను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే, వికారాబాద్ జిల్లా కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ లోనూ ఎసిబి అధికారులు దాడులు చేశారు. సీఐ, ఎస్ఐ.. బాధితుల నుంచి ఆన్ లైన్ లో డబ్బులు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
నేటితో ముగియనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారం
మరికాసేపట్లో తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగియనుంది
Ram Charan’s Peddi Shoot Update
Mega Powerstar Ram Charan’s highly awaited Pan-India project Peddi is steadily marching towards the finish line. Electrifying fans across social media, Ram Charan shared a couple of striking behind-the-scenes selfies with director Buchi Babu Sana, officially confirming that the film is only six days away from wrapping up its principal photography. The pictures offer a […] The post Ram Charan’s Peddi Shoot Update appeared first on Telugu360 .
బిజెపి నిజంగానే పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిందా….
– మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్ పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మహిళా బిల్లెనా అని, 2023 లో పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళ బిల్లును తిరిగి ఎలా ప్రవేశపెడతారని, కేవలం ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజానాట్యమండలి కోస్తా జిల్లాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఒంగోలులో ప్రారంభమవుతున్న నేపథ్యంలో, […] The post బిజెపి నిజంగానే పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిందా…. appeared first on Visalaandhra .
Telangana : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు.. ఆ రెండు మినహా
ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యాయి
ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..
పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద గల రూపా రాజా పిసిఎన్ఆర్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ గ్రాజియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరములు విద్యార్థులు చేసిన ప్రయాణాన్ని కు గుర్తుగా, ఆనందంగా, ఉత్సాహభరితంగా, జ్ఞాపకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రతిభగర పరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. […] The post ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.. appeared first on Visalaandhra .
ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు
ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు టేకుమట్ల, ఆంధ్రప్రభ : ముఖ

29 C