గురువారం రాశి ఫలాలు (05-03-2026)
మేషం కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపార కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్వల్ప ధనలాభం సూచనలు ఉన్నవి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. వృషభం ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. మిధునం నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. పాత ఋణాల తీర్చగలుగుతారు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నూతన భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహం ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాల అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యవిషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. కన్య నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు అనుకూల ఫలితాన్నిస్తాయి. స్థిరాస్థి క్రయవిక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. తుల చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణప్రయత్నాలు కలసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. వృశ్చికం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమకు అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామ్య సలహాలు కొన్ని విషయాలలో కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ధనస్సు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు. మకరం భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతారు. క్రయవిక్రయాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ సంబంధిత చర్చలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. కుంభం ధన పరమైన ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి. కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. చాలా కాలంగా వేచిచూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. మీనం చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి
. టెక్నికల్ కమిటీని నియమించండి. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు డీపీఆర్లు. అధికారులకు మంత్రుల ఆదేశం విశాలాంధ్ర – హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పై మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ శాఖ […] The post ‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి appeared first on Visalaandhra .
ఐఏఎస్, ఐపీఎస్లను మారిస్తే ఫలితాలు రావు
. కీలకశాఖల అధికారుల మార్పుతో రాష్ట్రానికి నష్టం. రేవంత్ మేనల్లుడి మనుషులు అక్రమ మైనింగ్. దందా నడుపుతున్న మంత్రి పొంగులేటి సంస్థ. నేడు మైనింగ్ ప్రాంతాలకు నిజనిర్ధారణ కమిటీ: హరీశ్ రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్లను తరచూ మార్చడం వల్ల ఫలితాలు రావని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయన్నారు. మీడియాతో బుధవారం ఆయన ఇష్టాగోష్ఠిగా […] The post ఐఏఎస్, ఐపీఎస్లను మారిస్తే ఫలితాలు రావు appeared first on Visalaandhra .
ఎస్హెచ్జీ మహిళల ఆరోగ్య వివరాల సేకరణ
. 46 లక్షల మందికి 30 రకాల పరీక్షలు. ఈ నెల 8 నుంచి ప్రారంభం. 4 దశల్లో ఆరోగ్యశాఖ కార్యక్రమాలు విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాక సంఘాల మహిళల ఆరోగ్య వివరాలు (హెల్త్ ప్రొఫైల్) నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్లో మంత్రి […] The post ఎస్హెచ్జీ మహిళల ఆరోగ్య వివరాల సేకరణ appeared first on Visalaandhra .
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు […] The post సీఎం నితీశ్ రాజీనామా? appeared first on Visalaandhra .
జిమ్ లో వర్కౌట్ చేస్తూ వ్యక్తి మృతి
జిమ్ లో వర్కౌట్ చేస్తూ వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వ్యాయామం చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇరాన్ ప్రతిదాడులు తీవ్రతరం . గల్ఫ్ లక్ష్యాలపైకి క్షిపణులు, డ్రోన్లు. లెబనాన్లో ఐడీఎఫ్ భూతల దాడులు. ఐదు రోజుల్లో 1,045 మంది మృతి. వారంలోగా ఇరాన్ గగనతలం స్వాధీనం: అమెరికా. ఒకట్రెండు వారాల్లో లక్ష్యాలన్నీ ధ్వంసం: ఇజ్రాయిల్ తెహ్రాన్: క్షిపణలు, బాంబులతో పశ్చిమాసియా మండుతోంది.అటు అమెరికాఇజ్రాయిల్, ఇటు ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరస్పర దాడులతో భీతావహం సష్టిస్తున్నాయి. అమెరికాఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం […] The post పోరు…హోరు appeared first on Visalaandhra .
తెహ్రాన్: అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఇప్ప్పుడు పాలనా పగ్గాలను ఖామేనీ కుమారుడు ముజ్తబా హుస్సేనీ ఖామేనీకి అప్పగించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ పదవి నిర్వహించిన అనుభవమేదీ లేని ముజ్తబా… త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఖామేనీ రెండో కుమారుడే ముజ్తబా. 1969లో ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ముజ్తబా పదేళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రెజా […] The post ముజ్తబాకు పగ్గాలు! appeared first on Visalaandhra .
. లడ్డూ అంశంపై మాటల యుద్ధం. ఆవేశంతో ఊగిపోయిన అధికార, ప్రతిపక్ష సభ్యులు. జగన్పై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు వైసీపీ నిరసన. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశంపై శాసన మండలి దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కల్తీ నెయ్యి పాపం మీదంటే మీదే నంటూ పరస్పర ఆరోపణలతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక దశలో చైర్మనం […] The post మండలి ఉద్రిక్తం appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసన మండలి చైర్మన్పై అవిశ్వాస అస్త్రానికి కూటమి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అదీ వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలతోనే వ్యూహాత్మకంగా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు లీక్లు వస్తున్నాయి. తాజాగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ పత్రికలోను ఈ విషయం వెల్లడి కావడంతో ఆ ప్రచారానికి కాస్త బలం చేకూరుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీతకు ఆ పార్టీ […] The post మండలి చైర్మన్పైఅవిశ్వాసం? appeared first on Visalaandhra .
20 నెలలు… 6.28 లక్షల ఉద్యోగాలు
. ప్రపంచంలో పేరున్న పరిశ్రమలన్నీ తీసుకొస్తున్నాం. పీపీపీ విధానంలో నిర్మిస్తే అది ప్రైవేట్పరం కాదు. ముమ్మాటికీ అది ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తి. వైసీపీ పాలనలో అతిపెద్ద మద్యం కుంభకోణం. అన్ని ప్రాంతాల సమగ్రాభివద్ధే లక్ష్యం. శాసనసభలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివద్దే లక్ష్యంగా గత 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఎంఎసఎంఈలో 2.48 లక్షలు, నైపుణ్యాభివద్ధి ద్వారా 1.46 లక్షలు, […] The post 20 నెలలు… 6.28 లక్షల ఉద్యోగాలు appeared first on Visalaandhra .
స్పీకర్ నుంచి నోటీసు రాలేదు: ఎంఎల్ఎ దానం
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నుంచి తనకు ఎటువంటి నోటీసు రాలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బుధవారం పీపుల్స్ ప్లాజాలో జరిగిన హోళి వేడుకల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హుషారుగా నృత్యం చేశారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అనర్హత పిటిషన్కు సంబంధించి గురువారం (5)న హాజరుకావాల్సిందిగా స్పీకర్ నుంచి నోటీసు ఏదీ రాలేదన్నారు. గురువారం దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇరుపక్షాల (పిటిషనర్, రెస్పాడెంట్ల) వాదనలు విననున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే దానం తనకు నోటీసు రాలేదని చెప్పారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ నెల 10వ తేదీలోగా పెండింగ్లో ఉన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వనున్నారన్న ప్రచారం జరుగుతున్నది. స్పీకర్పై దాఖలైన ధిక్కరణ పిటిషన్పై సుప్రీం కోర్టు ఈ నెల 12న సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు విచారణకు రానున్నది. ధిక్కరణ పిటిషన్పై విచారణకు ముందే స్పీకర్ తీర్పు వెలువరించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
ఎవరి భయంతోనో తప్ప్పును సమర్థించం: పెడ్రో శాంచెజ్ మాడ్రిడ్: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై దాడులకు దిగడాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్రంగా ఖండించారు. లక్షల మంది జీవితాలు పణంగా ‘రష్యన్ రోలెట’ (ప్రమాదకర ఆట)ను ఇజ్రాయిల్, అమెరికా ఆడుతోందని విమర్శించారు. యుద్ధానికి మద్దతు ఇవ్వలేదన్న కారణంగా స్పెయిన్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడాన్ని పెడ్రో బుధవారం ఆక్షేపించారు. యుద్ధం వద్దు అంటూ మరోసారి స్పష్టంచేశారు. యుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకమని, ఎవరో […] The post యుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకం appeared first on Visalaandhra .
నేపాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
. బరిలో 67 పార్టీలు… 3,405 మంది అభ్యర్థులు. ఝాపా 5, సర్లాహి 4, రుకుం 1లో రసవత్తర పోటీ. నిర్భయంగా ఓటేయండి: ప్రధాని ఖార్కి ఖాట్మండు: నేపాల్ ఎన్నికలకు సర్వసన్నద్ధమైంది. బుధవారం పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. జెన్ జీ ఆందోళనలు రాజకీయంగా ప్రకంకనల నేపథ్యంలో తాజా ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 2006లో పౌర యుద్ధం ముగిసిన తర్వాత జరగబోయే కీలక ఎన్నికలుగా ఇవి నిలిచాయి. 2025 సెప్టెంబరులో జెన్ జీ ఆందోళనల్లో […] The post నేపాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం appeared first on Visalaandhra .
100 మందికిపైగా గల్లంతు?శ్రీలంక తీరంలో ఘటనకొలంబో: పశ్చిమాసియా అట్టుడికిపోతున్న వేళ శ్రీలంక తీరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించినట్లు శ్రీలంక తెలిపింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురికి అత్యవసర చికిత్స అవసరమైనట్లు వెల్లడించింది. ‘గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ‘ఐఆరఐఎస్ దేనా’ అనే ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందింది. సహాయక చర్యల […] The post ఇరాన్ యుద్ధ నౌక మునక appeared first on Visalaandhra .
పాక్ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర
ఇజ్రాయిల్, అఫ్గాన్, ఇరాన్, భారత్పై ఖాజా ఆసిఫ్ ఆరోపణలుఇస్లామాబాద్: పాకిస్థాన్ సరిహద్దుల వరకు తమ పట్టు పెంచుకునేలా ఇజ్రాయిల్ కుట్రచేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఆరోపించారు. ఇరాన్పై యుద్ధం వెనుక ఉద్దేశం ఇదేనన్నారు. తమ దేశాన్ని సామంత రాజ్యంగా మార్చే ఇజ్రాయిల్ కుట్రలో అఫ్గాన్, ఇరాన్, భారత్ భాగస్వామ్యం ఉన్నట్లు ఆయన ఎక్స్ మాధ్యమంగా ఆరోపణలు చేశారు. ఒక్కటిగా ఉండాలని… రాజకీయ, మతపరమైన విభేదాలను విడనాడి, విదేశీ శుత్రువుల కుట్రలను తిప్పికొట్టాలని పాకిస్థానీయులకు ఖాజా […] The post పాక్ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర appeared first on Visalaandhra .
అలెన్ విధ్వంసం.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో విధ్యంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సులతో వంద పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలెన్ తోపాటు మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కూడా మెరుపులు మెరిపించాడు. అతను 33 బంతులు ఎదుర్కొని 58 పరుగులతో రాణించాడు. దీంతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. దీంతో కివీస్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ అర్ద శతకంతో చెలరేగాడు. 30 బంతుల్లోనే 5 భారీ సిక్సులు, 2 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రెవిస్ 34 పరుగులు, స్టబ్స్ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్కాంచి, హెన్రీ తలో రెండు వికెట్లు తీయగా.. నీషమ్, ఫెర్గూసన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీలంక
బీజీఎం బాధ్యత తమనుహైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) అందించే బాధ్యత నుండి చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోగా, ఆ స్థానంలోఎస్.ఎస్.తమన్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామం పవన్ అభిమానులను, సినీ ప్రియులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో అల్లు అర్జున్ నటించిన […] The post ఉగాదికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’? appeared first on Visalaandhra .
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా భారత కరెన్సీ రూపాయి విలువ భారీగా క్షీణించింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ట స్థాయి 92.30 పడిపోయింది. తొలిసారిగా 92 మార్క్కు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో పెరుగుతున్న ఆందోళనలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు బ్యారెల్కు 85 డాలర్లకు చేరడం వల్ల భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 92 కు పడిపోయింది. గతంలో జనవరిలో కనిష్ట స్థాయి 91.98 గా ఉంది. ఈ సంవత్సరం రూపాయి విలువ ఇప్పటికే 2 శాతానికి పైగా క్షీణించింది. యుద్ధ పరిస్థితులు కొనసాగితే రూపాయి ఒత్తిడిలోనే ఉంటుందని నిపుణులు తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గుచూపడంతో రూపాయి బలహీనపడింది. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. గత నెలలో అమెరికా, -భారత్ వాణిజ్య ఒప్పందం తర్వాత వచ్చిన ఊరట తాత్కాలికంగా ముగిసింది. విదేశాలకు చదువు, ప్రయాణ ఖర్చులు పెరగవచ్చు. దిగుమతి ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదయ్యే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఆర్బిఐ (భారతీ రిజర్వ్ బ్యాంక్) జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
చెన్నై: తమిళ నటుడు విజయ్ రాజకీయపార్టీని స్థాపించి సినిమాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. తన ఆఖరి చిత్రం జన నాయకుడు విడుదలకు ఇంకా నోచుకోలేదు కానీ ఈ వ్యవధిలో మాత్రం విజయ్ కి ఊహించని సమస్యలు వచ్చాయి. తన భార్య సంగీత… విజయ్ విడాకులు కావాలని కోరుతూ కోర్టు మెట్లుఎక్కడం షాకింగ్ గా మారింది. అయితే ఈ సమస్యపై మరో షాకింగ్ రూమర్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. తమ సమస్యని విజయ్ […] The post సంగీతతో రాజీకి విజయ్ సిద్ధం ? appeared first on Visalaandhra .
Photos: Virosh Wedding Reception
The post Photos: Virosh Wedding Reception appeared first on Telugu360 .
తెలంగాణ విశ్వవిద్యాలయంలో మద్యం మత్తులో జూనియర్ పై సీనియర్స్ దాడి
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గల తెలంగాణ విశ్వవిద్యాలయం లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ కు ఘర్షణ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం హోలీ సంబరాల్లో భాగంగా జూనియర్స్ వర్సెస్ సీనియర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. సీనియర్ లు మధ్యం తాగి వచ్చి ఓ జూనియర్ పై దాడికి దిగారు. దీంతో రెండు రోజులుగా కళాశాలలో సీనియర్ వర్సెస్ జూనియర్లుగా విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. హిస్టరీ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థి విక్కీ, హిస్టరీ విభాగంకు చెందిన జూనియర్ రాజును వాటర్ జగ్గు తో దాడి చేశారు. దింతో గాయాల పాలైన రాజు ను చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టగా వసతి గృహం వద్దకు చేరుకున్న ఎస్ఐ ఆంజనేయులు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసిle వినలేదు. ఈ విషయమై దాడికి ప్రయత్నం చేసిన 8 మంది విద్యార్ధులను ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తాత్కాలిక సస్పెండ్ చేశారు.
ఆల్టైమ్ రికార్డ్ సృష్టించిన ‘పెద్ది’ పాట
హైదరాబాద్ : రామ్చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ద’ విడుదల కాకముందే సోషల్ మీడియాలో రికార్డుల వేట మొదలు పెట్టింది. ఆస్కార్ విజేతఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మోటివేషనల్ సాంగ్ ‘రై రై రా రా’ సౌత్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లోనేఅత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియో సాంగ్గా నిలిచింది. కేవలం తెలుగు వెర్షన్లోనే ఈ పాట 29.22 మిలియన్ల వ్యూస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది.ఈ క్రమంలో […] The post ఆల్టైమ్ రికార్డ్ సృష్టించిన ‘పెద్ది’ పాట appeared first on Visalaandhra .
లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేములవాడ పట్టణంలో ఓ లాడ్జ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. జాతర గ్రౌండ్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఇది హత్యనా..? లేక ఆత్మహత్యనా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు ఎవరు...? ఎక్కడి నుండి వచ్చాడు.. అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇరాన్ సుప్రీంగా ఆయతుల్లా కుమారుడు?
దుబాయ్ : ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా, పరిపాలకునిగా ఆయన కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీని పరిగణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో తన తండ్రి మృతి చెందక ముందు, యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఆయన ప్రభుత్వ పదవికి ఎంపిక కాలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్లో రహస్యమైన వ్యక్తిగా ఉన్న మొజ్తాబా శనివారం నుంచి బయటకు కనిపించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ వైమానిక దాడి సుప్రీం లీడర్ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని 86 ఏళ్ల తన తండ్రిని హత్య చేసింది. అంతేకాదు యువ ఖమైనీ భార్య జహ్రా హడ్డాద్అడెల్ను కూడా హత్య చేసింది. మొజ్తాబా ఖమేనీ సజీవంగానే ఉన్నట్టు నమ్ముతున్నారు. అమెరికాఇజ్రాయెల్ దాడుల కారణంగా అజ్ఞాతంలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఆయన ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేయలేదు. దైవ పరిపాలనగా ఇరాన్ పూర్వ వంశపారంపర్య రాజరికంపై విమర్శలు ఉన్నప్పటికీ మొజ్తాబా ఖమేనీ పేరు ప్రచారంలో కొనసాగుతోంది. మొజ్తాబా తండ్రి ఆయతుల్లా ఖమేనీ, భార్య జహ్రా హడ్దాద్ను అమరవీరులుగా ఇరాన్లో ప్రస్తుతిస్తున్నారు. 88 సీట్ల ఇరాన్ అసెంబ్లీలో వృధ్ధాప్య మతాధికారుల సంఖ్య పెరగడంతో ఖమేనీ వంశస్థుల సంఖ్య కూడా పెరిగింది. తదుపరి నాయకుడిని ఈ అసెంబ్లీయే ఎన్నుకుంటుంది. ఎవరైతే ఇరాన్ సుప్రీం అవుతారో వారు ఇప్పుడు యుద్దంలో ఇరాన్ మిలిటరీపై నియంత్రణ కలిగి ఉండటమే కాక, అణ్వాయుధ నిర్మాణానికి కావలసిన యురేనియం నిల్వలను కూడా పర్యవేక్షించవలసి ఉంటుంది. మొజ్తాబా 1969లో ఇరాన్ లోని మషాద్లో జన్మించారు. ఆయన పదేళ్ల వయసులో ఇరాన్లో 1979 లో ఇస్లామిక్ రివల్యూషన్ సాగింది. ఇరాన్లో షా మొహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా తన తండి ఆయతుల్లా ఖమేనీ ఉద్యమం సాగించారు. అలాంటి పరిస్థితుల్లో మొజ్తాబా పెరిగారు. షా సీక్రెట్ పోలీస్ “ఎస్ఎవిఎకె ” తమ ఇంటిపై దాడి చేసిన సమయంలో మొజ్తాబా,మిగతా కుటుంబీకులు తమ తండ్రి ఇంటిని విడిచి ఎక్కడికో వెళ్లారని సీక్రెట్ పోలీసులకు చెప్పారు. షా ప్రభుత్వం పతనమైన తరువాత ఖమేనీ కుటుంబం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకుంది. 1989 లో ఆయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయిన తరువాత తండ్రితో పాటు మొజ్తాబా అధికారిక కార్యకలాపాల్లోనే కాకుండా వాణిజ్యపరమైన ఆస్తులను విస్తరింప చేశారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా సైనికులకు అండగా ఉండి తీవ్రవాదుల మధ్య విశ్వసనీయతను పొందారు. చాలా కాలంగా పాలనలో శక్తివంతమైన వ్యక్తిగా, మతాధికారులు, రివల్యూషనరీ గార్డ్కమాండర్ల నెట్వర్క్ నిర్వహించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019లో అమెరికా ట్రజరీ మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. అతను ప్రభుత్వంలో ఎన్నుకోబడక పోయినా, అధికారిక హోదాలో తన తండ్రి తరఫున అధికారం చెలాయించాడని ఆరోపించింది. ఖమేనీ కుటుంబీకులు అనేక మంది హత్యకు గురైన సంఘర్షణ కాలంలో నిలబడిన నాయకునిగా మొజ్తాబా ఇమేజ్ దృఢ పడింది.
ఆశ చూపాడు,అందినకాడికి దోచాడు దమ్మపేట, ఆంధ్రప్రభ: గతంలో చిట్ ఫండ్ కంపెనీలో సభ్యులుగా
ఇంగ్లాండ్తో సెమీస్ పోరుకు టీమిండియా సిద్ధం
. టీ20 ప్రపంచకప్లో వరుసగా మూడోసారి సెమీస్ లో తలపడనున్న ఇరు జట్లు. నేడు వాంఖడే వేదికగా జరగనున్న మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి ముంబై : టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లాండ్ తలపడనుంది. క్రికెట్ని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్సె మీఫైనల్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ […] The post ఇంగ్లాండ్తో సెమీస్ పోరుకు టీమిండియా సిద్ధం appeared first on Visalaandhra .
Breaking : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు
వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్లో 1040 మంది మృతి
దుబాయ్ ః అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా సాగిస్తున్న దాడులలో ఇరాన్లో మృతుల సంఖ్య బుధవారం కనీసం 1045 కు చేరుకుంది. పలు చోట్ల శిథిలాలు, రక్తసిక్త వీధులు కన్పిస్తున్నాయి. మృతుల సంఖ్యను ఇరాన్ ప్రభుత్వ పరిధిలోని అధికారిక సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది. రెండు దేశాల సైన్యం నివాసిత ప్రాంతాలపైనే నేరుగా దాడులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇరాన్కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ మార్టియర్స్, అండ్ వెటర్న్ సంస్థ ఎప్పటికప్పుడు బాధితులు, మృతుల సంఖ్య ఇతర వివరాలను అంతర్జాతీయ మీడియాకు వెలువరిస్తోంది. పలు చోట్ల సామూహిక ఖననాలకు ఏర్పాట్లు చేశారు. ఇక ఇరాన్ జరిపిన దాడులలో ఇప్పటివరకూ ఇజ్రాయెల్లో 11 మంది చనిపోయారు. కోన్ని ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగింది. కువైట్లో బుధవారం ఇరాన్ దాడుల శకలాలు తగిలి 11 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఇంతకు ముందు ఇక్కడ ఒక్కరు చనిపోయారు. యుఎఇలో ముగ్గురు, బహరైన్లో ఒక్కరు ఇరాన్ దాడులలో మృతి చెందారు. ఇక కువైట్లో ఇరాన్ దాడులలో ఇప్పటికే ఆరుగురు అమెరికా ఆర్మీ రిజర్వ్ సైనికులు చనిపోయారు.
ఢిల్లీలో లొంగిపోనున్న మావోయిస్ట్ అగ్రనేత
ఢిల్లీలో లొంగిపోనున్న మావోయిస్ట్ అగ్రనేత ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల
రంజాన్లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం, సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యంచేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోసెహ్రీలో బుద్ధిపూర్వక, పోషకమైన ఎంపికలు చేసుకోవడం వల్ల ఉపవాస అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, శక్తివంతంగా మార్చుకోవచ్చు. రోజంతా నిరంతర శక్తి కోసంచేర్చవలసిన ఐదు ఆహారాలు ఇక్కడ ఉన్నాయి : 1. కాలిఫోర్నియా బాదం: బాదంలో […] The post రంజాన్లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు appeared first on Visalaandhra .
క్రోమ్-అమర్చిన యెజ్డ్ రోడ్లర్ రెడ్ ఉల్ఫ్ విడుదల
ముంబయి : మార్చి 3, 2026న, చంద్ర గ్రహణం రోజున, జావా యెజ్డ్ మోటార్ సైకిల్స్ కొత్త యెడ్డీ రోడ్ స్టర్ రెడ్ ఉల్ఫ్ ను విడుదల చేస్తుంది. ‘బోర్న్ అవుట్ ఆఫ్ లైన్ ‘ రోడ్స్ట ర్ ఆధిపత్య స్ఫూర్తితో తయారు చేయబడిన రెడ్ ఉల్ఫ్ ప్రపంచంలోనే భారతదేశంలో తయారైన ఏకైక క్లాసిక్ మోటార్ సైకిల్ బ్యాడ్జీ నుండి ధైర్యంగా వచ్చిన రెట్రో లాంగ్-హౌల్రో డ్ స్టర్. యెజ్డ్ రోడ్ స్టర్ తాజా వ్యాఖ్యానం తిరగబడే […] The post క్రోమ్-అమర్చిన యెజ్డ్ రోడ్లర్ రెడ్ ఉల్ఫ్ విడుదల appeared first on Visalaandhra .
Rupee92Dollor |ఓ వైపు యుద్ధం.. మరోవైపు ఆర్థిక సంక్షోభం..
Rupee92Dollor | ఓ వైపు యుద్ధం.. మరోవైపు ఆర్థిక సంక్షోభం.. Rupee92Dollor |
VIROSH Reception: Megastar Attends
Tollywood actors Vijay Deverakonda and Rashmika Mandanna got married in a grand wedding in Udaipur on February 26th. A grand wedding reception is hosted by the couple for Tollywood celebrities. Megastar Chiranjeevi who skipped the pre-wedding bash of Allu Sirish on March 2nd in Allu Studios attended the wedding reception of VIROSH. Chiranjeevi dressed in […] The post VIROSH Reception: Megastar Attends appeared first on Telugu360 .
చెలరేగిన యాన్సెన్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మొదటి సెమిఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు, న్యూజిలాండ్ కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ అర్ద శతకంతో చెలరేగాడు. 77 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన యాన్సెస్.. సౌతాఫ్రికాను ఆదుకున్నాడు. భారీ సిక్సులతో న్యూజిలాండ్ బౌలర్లలపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే 5 భారీ సిక్సులు, 2 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రెవిస్ 34 పరుగులు, స్టబ్స్ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్కాంచి, హెన్రీ తలో రెండు వికెట్లు తీయగా.. నీషమ్, ఫెర్గూసన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.
రెండు స్పా సెంటర్లపై దాడులు.. 20 మంది అరెస్ట్
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించామని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించి నందుకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. దాడి సందర్భంగా మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పేకాట స్థావరం పై దాడి.. ఐదుగురి అరెస్ట్
కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు ఆదిత్యనగర్ అడ్డగుట్టలోని ఒక ప్రైవేట్ లగ్జరీ స్టే ఇన్ గదిపై దాడి చేశారు. గదిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. దేవలరాజు వెంకట శేష చలం (48), పార్వతనేని వీరభద్రరావు (47), పెడ్డినేని పవన్ కుమార్ (36), ఓబిలినేని గణేష్ (36), పార్వతనేని రాంబాబు (45) పట్టుబడిన వారిలో ఉన్నారు.వారి వద్ద నుంచి రూ.39,010 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆరు సెట్ల పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.89,010/- గా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు
’సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నవ్వులతో అలరిస్తుంది
మిస్సమ్మ, అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. లిటిల్ హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్గా వస్తున్న ’సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో హాస్య బ్రహ్మా బ్రహ్మానందం, బండ్లగణేష్ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ “పండగ వాతావరణంలో ఉన్న ఈ సినిమా అందరినీ నవ్వులతో అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, నిర్మాతగా శివాజీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. కథానాయకుడు శివాజీ మాట్లాడుతూ “సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఈటీవీ విన్ వారు థియేటర్లో ఈ సినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్లో కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్ కార్న్ను, మల్టీప్లెక్స్ థియేటర్స్లో 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్ పాప్కార్న్ను ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్రెండ్స్ ఇలా అందరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ను ప్రకటించారు. ఇందువల్ల సినిమా మరింత మందికి దగ్గరవుతుంది” అని తెలిపారు. ఈ వేడుకలో లయ, సాయికృష్ణ, వంశీ నందిపాటి, నితిన్ చక్రవర్తి, అలీ, సుదీర్ శ్రీరామ్, మిథిల్, రిత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యురోపియన్ దేశం, నాటో మిత్రదేశం స్పెయిన్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు కోపం వచ్చింది. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో స్పెయిన్ తన స్థావరాలను ఉపయోగించుకోవడానికి అమెరికా సైనిక దళాలను అనుమతించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే, స్పెయిన్ తో అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని, వాణిజ్య పరమైన ఆంక్షలు విధిస్తామని బుధవారం నాడు హెచ్చరించారు.స్పెయిన్ వైఖరి చాలా దారుణంగా ఉందని ట్రంప్ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. స్పెయిన్ తో అన్ని లావాదేవీలు నిలిపివేయాలని అమెరికా ఆర్థిక శాఖమంత్రి స్కాట్ బెసెంట్ తో చెప్పినట్లు ఆయన తెలిపారు. స్పెయిన్ తో అన్ని సంబంధాలను తాము తెగతెంపులు చేసుకుంటామని ప్రెసిడెంట్ అన్నారు.స్పెయిన్ లోని సోషలిస్ట్ నాయకత్వం ఇరాన్ పై దాడికి ఉపయోగించే విమానాలను రీఫిల్లింగ్ ట్యాంకర్ లు తాము అనుమతించబోమని ప్రకటించడంతో దక్షిణ స్పెయిన్ లోని రోటా,మోరాన్ మిలిటరీ స్థావరాలనుంచి అమెరికా తమ 15 ఎయిర్ క్రాఫ్ట్ లను, రీఫిల్లింగ్ ట్యాంకర్ లను వేరే ప్రాంతానికి తరలించవలసి వచ్చింది. నాటో సభ్యదేశాలన్నీ తమ జీడీపీలో 5 శాతం రక్షణ కోసం ఖర్చు చేయాలన్న అమెరికా పిలుపును స్పెయిన్ పట్టించుకోక పోవడం కూడా ట్రంప్ కోపానికి కారణమైంది. అందువల్ల ఇక స్పెయిన్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై స్పెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.ట్రంప్ తో సమావేశం అనంతరం జర్మన్ ఛాన్స్ లర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ గత సంవత్సరం అమెరికా -యురోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి స్పెయిన్ ను ప్రత్యేకంగా మినహాయించలేదని తాను ట్రంప్ తో ప్రత్యేకంగా చెప్పినట్లు పేర్కొనడం విశేషం.
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికలలో చైర్మెన్ ఎన్నిక విషయంలో నెలకొన్న దాడుల నేపద్యంలో జైలుకు వెళ్లిన పెద్దపల్లి మాజీ ఎంపి, చెన్నూర్ మాజీ ఎంఎల్ఎ మాజీ విఫ్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, చెన్నూర్ నాయకులు మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ లు 14 రోజుల రిమాండ్ తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి వారు విడుదల అయ్యారు. బాల్క సుమన్ కు బెయిల్ వచ్చిన నేపధ్యంలో మంచిర్యాల జిల్లా నుండి బిఆర్ఎస్ శ్రేణులు బుదవారం ఉదయమే ఆదిలాబాద్కు తరలివెళ్లారు. జిల్లా జైలు నుండి విడుదలైన వారిని బిఆర్ఎస్ శ్రేణులు శాలువలతో సత్కరించి, గజమాలలు వేసి జైలు గేటు వద్ద నుండి బుజాలపై ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకుని ఊరేగించారు. రాజీకీయలలో ప్రతిపక్ష ప్రత్యర్థులుగా చూశామే కానీ వ్యక్తిగత శత్రువులుగా చూడలేదని మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ అన్నారు. జైలు నుండి విడుదలైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి, చెన్నూర్ ఎంఎల్ఎ, మంత్రి గడ్డం వివేకానంద కండ్లు చల్లబడ్డాయా, కక్ష తీరాందా అని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను విస్మరించి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ క్యాతన్పల్లి లో తమపై రాళ్లదాడి చేసిందని, పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, తిరిగి సూమారు 25 మంది పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తనను జైలులో పెట్టించివా వారికి కక్ష తీరినట్లు లేదని, మళ్లీ జైలుకు పంపించాలని కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ మొదలు, మందమర్రి తహాసిల్దార్, డిసిపి, రామకృష్ణాపూర్ ఎస్ఐ లు కూడా ప్రభుత్వ శాఖలో పని చేయడం లేదని, మంత్రి విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా వ్యవహరిస్తున్నారన్నారు. తాము ఎప్పుడు రాజకీయంగానే ఎదుర్కొన్నామని, కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని.పదేళ్లు అధికారంలో ఉన్నా ఎవరిని జైలుకు పంపలేదన్నారు. మంత్రి వివేకానంద కోల్బెల్టును రావణకాష్టం చేస్తున్నారని విమర్శించారు. తాను 2014 లో పెద్దపల్లి ఎంపిగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా గడ్డం వివేకానంద పోటీ చేసి ఓడిపోయారని, ఆయనను బిఆర్ఎస్లో చేర్చుకుని ప్రభుత్వంలో సలహాదారుడిగా నియమించారన్నారు. తాను 2018 లో చెన్నూర్ ఎంఎల్ఎ గా పోటీ చేయగా తనపై కాంగ్రెస్ ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీ చేసిన బొర్లకుంట వెంకటేష్ నేత ఓడిపోతే, ఆయనను అక్కు న చేర్చుకుని 2019 లో టిఆర్ఎస్ పెద్దపల్లి ఎంపిగా నిలబెట్టి గెలిపించుకున్నామని అన్నారు. తాము కలుపుకు పోయే పనులు చేశామే తప్ప కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. నేడు ముఖ్యమంత్రి రేవెంత్రెడ్డి, మంత్రి వివేకానంద కక్ష కట్టి తనను జైలుకు పంపించడంతో పాటు బెయిల్ రాకుండా కుతాంత్రాలు చేశారని విమర్శించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటి విషయంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికైనా గౌరవించాలని ఆయన సూచించారు. ఆయన వెంట మాజీ మంత్రి జోగురామన్న, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్.. కష్టాల్లో సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడుతున్నారు. 77 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది సఫారీ జట్టు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు రెండో ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఈ ఓవర్ లో వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులతో చెలరేగడంతో సఫారీ బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. సగం ఓవర్లకే కీలక బ్యాటర్లు ఔట్ కావడంతో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. దీంతో సపారీ జట్టు 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్(13), యాన్సెన్(21)లు ఉన్నారు. ఇక, కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్కాంచి చెరో రెండు వికెట్లు తీయగా.. నీషమ్ ఒక వికెట్ పడగొట్టాడు
పెరిగినవ విద్యుత్ డిమాండ్.. ఒక్క రోజే 4421 మెగావాట్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం (మార్చి 3) రోజున గరిష్ట విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకుంది.ఇప్పటి వరకు నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇదే. గత ఏడాది మే 6న అత్యధికంగా 4,352 మెగావాట్ల రికార్డును ఈసారి మార్చి నెలలోనే అధిగమించడం విశేషం.సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ప్రధానంగా ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వినియోగం పెరుగుతుండటంతో డిమాండ్ భారీగా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా నిరంతర సరఫరా అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)జితేష్ వి పాటిల్, ఐఏఎస్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, 33 కేవీ/11 కేవీ ఫీడర్ల పై, సబ్ స్టేషన్ల లోని పవర్ ట్రాన్స్ ఫార్మర్ల లోడ్ ను పర్యవేక్షించాలని ఇప్పటికే క్షేత్ర స్థాయి అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
ఐదు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సౌతాఫ్రికా
కోల్కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సఫారీలను బ్యాటింగ్కి అహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన సౌతాఫ్రికా 12 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 55 పరుగుల వద్ద కెప్టెన్ మార్క్రమ్(18) ఔట్ అయ్యాడు. ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం డేవిడ్ మిల్లర్(6) స్వల్పస్కోర్కే పెవిలియన్ చేరాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజ్లో స్టబ్స్(7), జెన్సన్ (17) ఉన్నారు.
తెలంగాణలో ఆంధ్ర ఇసుక మాఫియా దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇసుక మాఫియా,
ఇరాన్ పై దాడులు.. క్షిపణి నిల్వలపై ట్రంప్ కు పెంటగాన్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు నాలుగో రోజుకు చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో మరో పది రోజుల పాటు దాడులు కొనసాగితే అమెరికాలోని క్షిపణి నిల్వలు పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుందని పెంటగాన్ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ఆయుధ, క్షిపణి నిల్వలను తిరిగి పెంచుకోవడానికి అత్యధికంగా వ్యయం చేయవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పెంటగాన్ తెలియజేసినట్టు నివేదికలు వెల్లడించాయి. ఈ కొరత వల్ల ఇరాన్ దాడులను తిప్పి కొట్టడం అసాధ్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరించాయి. ముఖ్యంగా ఇంటర్సెప్టర్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల నిల్వలు బాగా తగ్గినట్టు తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి మిత్రదేశాలకు సైనిక సహాయం అందిస్తుండడంతో అమెరికా వద్ద క్షిపణి నిల్వలు తగ్గినట్టు నివేదికలు తెలిపాయి.
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని మూడు ప్రముఖ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తు లు బెదిరింపులు పంపడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కపిలతీర్థం దగ్గర రాజ్ పార్క్ హోటల్, పాయ్ వైస్రాయ్, ఉప్పరపల్లిలోని ఎస్ ఆర్బి హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తు తెలియన వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటల్లోనే తిరుపతిలో హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. హోటళ్ల సిబ్బంది సమాచారంతో అప్రమత్తం అయిన పోలీసులు తనీఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంలతో హోటల్ గదులు, పార్కింగ్ ఏరియా, లాబీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా హోటళ్లను ఖాళీ చేయించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి బాంబు సంబంధించిన వస్తువులు లభించలేదు. ప్రముఖులు విడిది చేసే ఇలాంటి హోటళ్లకు బెందిరింపులు రావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమెయిల్స్ ఎక్క డినుంచి వచ్చాయి? ఎవరూ పంపించా రు? అనే అంశాలతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీం ఈ-మెయిల్ ఐడిలను ట్రాక్ చేస్తోంది.
నాన్ టీచింగ్ స్టాఫ్ పై విద్యార్థి దాడి…
నాన్ టీచింగ్ స్టాఫ్ పై విద్యార్థి దాడి… గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా
ఇరాన్ సుప్రీం ఎవరైనా టార్గెట్ చేస్తాం : ఇజ్రాయెల్ హెచ్చరిక
జెరూసలెం: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ వారసులుగా ఎవరు వచ్చినా వారిని లక్షంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం హెచ్చరించారు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనుకునే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. 1979 ఇస్లామిక్ రివల్యూషన్ దగ్గర నుంచి రెండోసారి ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికైన వారు ఎవరైనా, లేదా ఎక్కడ దాగున్నా ఇజ్రాయెల్ ప్రధాని, తాను ఆపరేషన్ “లయన్స్ రోర్ ”లో భాగంగా మట్టుబెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఐడిఎఫ్ను ఆదేశించామని చెప్పారు. ఇదిలా ఉండగా టెహ్రాన్పై బుధవారం ఉదయం పదోసారి దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. టెహ్రాన్లో ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వ మౌలిక సౌకర్యాలను లక్షంగా చేసుకుని భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించినట్టు పేర్కొంది. అమెరికా భాగస్వామ్యంతో పూర్తి బలగాలతో దాడులు కొనసాగుతాయని వివరించింది.
వైయస్సార్ కాలనీలో అర్థరాత్రి బైకులు దగ్ధం..
వైయస్సార్ కాలనీలో అర్థరాత్రి బైకులు దగ్ధం.. చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్
యువత ఉపాధి వారసత్వ పరిరక్షణే లక్ష్యం…
యువత ఉపాధి వారసత్వ పరిరక్షణే లక్ష్యం… చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర పర్యాటక
అబూధాబిపై ఇరాన్ దాడి.. తెలంగాణ వ్యక్తికి గాయాలు
అబూధాబి ఎయిర్పోర్టులో ఘటన సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె వాసి కొడుకు కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు కరీంనగర్: గల్ఫ్ యుద్ధం ప్రభావం ఓ తెలంగాణ కుటుంబంపై పడింది. అబూధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల దశలో అక్కడున్నన తెలంగాణ ప్రాంతపు వ్యక్తి ఒకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు బుధవారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోతిరెడ్డి పల్లెకు చెందిన ఎన్ రాజేశ్వర రావు అనే వ్యక్తి చాలా కాలంగా అబూధాబి ఎయిర్పోర్టులో హౌస్ కీపింగ్ విభాగంలో ఉద్యోగిగా ఉన్నాడు. మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్రతరం అయిన దశలో అబూధాబిపై ఇరాన్ సేనలు దాడులకు దిగుతున్నాయి. ఈ దాడుల్లో తాను మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు రాజేశ్వర రావు ఫోన్లో తల్లిదండ్రులకు తెలిపారు. దీనితో ఊరిలో ఆయన కుటుంబంలో కలవరం చెలరేగింది. తమ కుమారుడికి ఏమైందో తెలియడం లేదని, ఏడాది నుంచి అక్కడ పనిచేస్తున్నాడని, గాయపడ్డట్లు తెలిసిందని , వీడియో కాల్ చేసి మాట్లాడాడని తండ్రి ప్రభాకర రావు వార్తా సంస్థలకు తెలిపారు. కొడుకు తిరిగి మన దేశం రావాలని కోరుకుంటున్నానని వాడు క్షేమంగా ఇంటికి చేరేలా ప్రభుత్వం చూడాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. తాను బాగానే ఉన్నానని చెపుతున్నాడని, అయితే తమకు వాడి పరిస్థితి గురించి దిగులు పట్టుకుందని, తిరిగి వచ్చేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించారు. గల్ఫ్ ప్రాంతంలో దాడులతో అక్కడి పరిస్థితి దిగజారుతోంది. ఈ ప్రాంతంలోని పలు దేశాల నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు అతికొది విమానాల రాకపోకలు ఆరంభం అయ్యాయి. బుధవారం కొందరు ప్రయాణికులు జెడ్డా, సౌదీ నుంచి బిక్కుబిక్కుమనుకుంటూ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమకు పెద్దగా ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదని తెలిపారు. దాడుల సమయంలో అబూధాబిలో తమకు సరైన ఏర్పాట్లు, సౌకర్యాలు ఉన్నాయని మదీనాకు వెళ్లి వచ్చిన అక్కడి నుంచివచ్చిన వారు తెలిపారు. మహ్మద్ అబ్దుల్ రజాక్ పలుసార్లు విమానాల రద్దు తరువాత క్షేమంగా హైదరాబాద్ చేరాడు. ట్రావెల్ ఏజెన్సీ వారు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని సంతోషం వ్యక్తం చేశారు.
HDFC Bank |బ్యాంకు ముందు పార్కు చేసిన బైక్ చోరి..
HDFC Bank | బ్యాంకు ముందు పార్కు చేసిన బైక్ చోరి.. పోలీసులను
ఎపిఎస్ఆర్టిసి కీలక నిర్ణయం.. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
అమరావతి: ‘ఇంధ్ర ధనస్సులో భాగంగా దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎపిఎస్ఆర్టిసి తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 18న సిఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్టిసి ఎండి ప్రకటించారు. 40 శాతం పైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. సిటి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దీన్ని అమలు చేస్తామని అన్నారు. దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఉంటుందని వివరించారు.
కలెక్టర్ అనురాగ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
కలెక్టర్ అనురాగ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి
జైల్లో నరకం చూపించారు.. క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ
4th day |ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం
4th day | ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం 4th day
కల్తీ పాల ఘటన.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు విడిచింది. కల్తీపాలు తాగి తీవ్ర అనారోగ్యానికి గురి కాగా.. కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో ఈ కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి గర్బిణీని తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్లో మహిళ ప్రసవించినట్లు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వారిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఈఎంటీ లక్ష్మణ్ తెలిపారు. వివరాలలోకి వెళితే.. లింగంపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన శైలజకు డెలివరీ కోసం మాత శిశు సంరక్షణ ఆస్పత్రి బాన్సువాడకు తీసుకుని వస్తుండగా తగిన పరీక్షలని నిర్వహించారు. ఈ క్రమంలో మహిళకు బిపి పెరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాన్సువాడ నుంచి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్లో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ లక్ష్మణ్ డెలివరీ చేశాడు. ఆడ బిడ్డకు జన్మనివ్వగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు ఈఎంటీ లక్ష్మణ్తో పాటు పైలట్ రాముకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి చికిత్స కోసం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగింది.
Congress Hits Back at Bandi Sanjay Over Rahul Gandhi Remarks
Hyderabad: A political war of words erupted between the BJP and Congress in Telangana after Union Minister Bandi Sanjay Kumar targeted Rahul Gandhi and Chief Minister Revanth Reddy over remarks made during a Congress training programme. Bandi Sanjay alleged that Rahul Gandhi signalling willingness to become Prime Minister showed a “dynastic mindset.” He said the […] The post Congress Hits Back at Bandi Sanjay Over Rahul Gandhi Remarks appeared first on Telugu360 .
subsidy |ఆన్ లైన్ మోసాలు అరికట్టండి…
subsidy | ఆన్ లైన్ మోసాలు అరికట్టండి… బ్యాంకు అధికారులను ఆదేశించిన ఎంపీ
దైవదర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు
తిరుమల వెంకన్నను దర్శించుకోవాలన్న ఆ కుటుంబ ఆశలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. పుణ్యక్షేత్రానికి వెళ్తున్న ప్రయాణం మృత్యులోకానికి తీసుకెళ్లింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం పలమనేరు జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని ఓ కారు వెనుక వైపు నుంచి అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన లో ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించా రు. ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో వృద్ధులతోపాటు యువతులు కూడా ఉన్నా రు. మోహన్దాస్, నాగరాజారా వు, కుసుమ, జయంతి, పూజ మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలోని, బంధువర్గంలోని ఐదుగురు వ్యక్తులు మరణించడంతో రాజాజీనగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలమనేరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రాథమిక దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం కారు డ్రైవర్ అతి వేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్ర మాదం జరిగినట్టు తెలుస్తోంది. వేగం ఎక్కువగా ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న లారీని గమనించ లేక ఢీ కొట్టి నట్టు పోలీసులు భావిస్తున్నారు.
Two-wheeler |ద్విచక్ర వాహనంపై వెళ్తూ…
Two-wheeler | ద్విచక్ర వాహనంపై వెళ్తూ… యువకుడు మృతి Two-wheeler | రొంపిచర్ల,
కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళన…
కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళన… ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే జూలకంటి మాచర్ల,
పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల
పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో పదో
సెమీ ఫైనల్ 1: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
కోల్కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్లు ఒక ఎత్తైతే.. ఇకపై జరిగే మ్యాచ్లో మరింత ఉత్కంఠగా ఉండనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్కు దూసుకుపోతుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పు చేసింది. రబాడా, మార్కో జెన్సన్, కేశవ్ మహరాజ్లను జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మ్యాచ్ హెర్నీ, నీశమ్లను జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: సౌతాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి. న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.
18th Division |సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం…
18th Division | సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం… 18th
నగరంలో మరో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు రట్టు
నగరంలో మరో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు బట్టబయలయ్యింది. కమిషనర్స్ టాస్క్ఫోర్స్(గోల్కొండ టీమ్),మాసబ్ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బంజారాహిల్స్ పరిధి భోలానగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న ‘ప్రైడ్ డెయిరీ’ కల్తీ నెయ్యి తయారీ కేంద్రం వెలుగుచూసింది. సుమారు రూ.18.26 లక్షల విలువజేసే కల్తీ నెయ్యి మరియు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకుని తయారీకేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. భోలానగర్కు చెందిన జునైద్ హుస్సేన్ తన ప్రైడ్ డెయిరీ యూనిట్లో లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ ఈ కల్తీ నెయ్యి కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తక్కువ నాణ్యత కలిగిన పామాయిల్,వనస్పతి(డాల్డా), ఇతర హానికరమైన పదార్థాలను ఆవు,గేదె మీగడలో కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తుండటంతో సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని అసలైన నెయ్యిగా నమ్మిస్తూ ప్రజలకు,హోటళ్లకు,శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. పోలీసులు తనిఖీల్లో రూ.18.26 లక్షల విలువజేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 460 కేజీల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యితో పాటు భారీస్థాయిలో కల్తీకి ఉపయోగించే 2090 కేజీల ఆవు మీగడ,1170కేజీల గేదె మీగడ స్వాధీనం చేసుకున్నారు. నగర అడిషనల్ డిసిపి(టాస్క్ఫోర్స్) అందె శ్రీనివాస్రావు పర్యవేక్షణలో గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్ వెంకటేశ్,మాసబ్ట్యాంక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్,ఎస్ఐలు విజయానంద్,చందన తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇరాన్ యుద్ధనౌకపై దాడి..100 మందికి పైగా గల్లంతు
శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరిగింది. ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా యుద్ధనౌకపై సబ్మెరైన్తో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతైనట్లు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మరో 78 మంది గాయపడినట్లు చెప్పారు. దాడి జరిగిన తర్వాత సమాచారం అందుకున్న శ్రీలంక నావికాదళం వెంటనే అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టింది. మునిగిపోతున్న ఇరాన్ యుద్ధనౌక నుంచి 32 మందిని రక్షించి ఆసుపత్రిలో చేర్చామని శ్రీలంక నేవీ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో యుద్ధనౌకలో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ
రేషన్కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ (మూడు నెలలకు) సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కోటికి పైగా ఉన్నాయి. ఒకేసారి మూడు నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో ఒకేసారి మూడునెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా మూడు నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమ యంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండటంతో పాటు డీలర్లు, హమాలీ కూలీ కలిసొచ్చే అవకాశముంది. కానీ, ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో డీలర్లకు సమస్యగా మారింది. ఇక మూడు నెలలకు సంబంధించి ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వస్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 1,5-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యల గురించి అధికారులు ఆలోచిస్తున్నారు.
Frequent IAS Transfers Have Turned Governance Into a Joke: Harish Rao
Hyderabad: Former minister and BRS Legislature Party deputy leader T. Harish Rao on Wednesday alleged that governance in Telangana has suffered due to frequent transfers of senior officials under the Congress government led by Chief Minister Revanth Reddy. Speaking to reporters, Harish Rao said nearly 140 IAS officers have been transferred since the new government […] The post Frequent IAS Transfers Have Turned Governance Into a Joke: Harish Rao appeared first on Telugu360 .
సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు .. అక్కచెల్లెళ్లకు సన్మానం
సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు .. అక్కచెల్లెళ్లకు సన్మానం జన్నారం, ఆంధ్రప్రభ : సెంట్రల్
2sides |భార్య-తల్లి మధ్య గొడవ… మగవాడు ఎటువైపు?
2sides | భార్య-తల్లి మధ్య గొడవ… మగవాడు ఎటువైపు? 2sides | మగవాడి
. గంగవరంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఐదుగురు మృతి. మృతులు బెంగుళూరు వాసులు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.. అతివేగమే ప్రమాడానికి కారణం విశాలాంధ్ర – గంగవరం : మండలంలోని వై ఎస్ ఆర్ కూడలి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు కు చెందిన ఓ కుటుంబం బుధవారం ఉదయం తిరుమలకు వెళ్ళుతుండగా మార్గమద్యంలో ప్రమాదం జరిగింది. రోడ్డు పై వెళుతున్న లారిని వెనక భాగంలో కారు దీకోంది. దీనితో […] The post అంతా రెప్పపాటులో జరిగిపోయింది appeared first on Visalaandhra .
Collector |మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి…
Collector | మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి… Collector | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ
Achennaidu : తాను క్షమాపణ చెప్పినా వైసీపీ సభ్యులు అడ్డుకోవడమేంటి?
శ్వాసాలపై వైసీపీ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Education Department Paid for CM Revanth Reddy’s Harvard Program Visit: RTI
Hyderabad: An RTI reply from the Telangana government has revealed that the expenditure for Chief Minister A. Revanth Reddy’s visit to the United States to attend a program at Harvard Kennedy School was borne by the state’s Education Department. The information came in response to an RTI application filed by Hyderabad resident Kareem Ansari seeking […] The post Education Department Paid for CM Revanth Reddy’s Harvard Program Visit: RTI appeared first on Telugu360 .
ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్న కిరాతక దాడి విషయంలో ప్రధానమంత్రి మోదీ ఎటు వైపు ఉన్నారో తేలిపోయింది. ఇరాన్ మీద దాడిని మోదీ ఇప్పటివరకు ఖండించ లేదు. ఇరాన్ అధినేత అలీ ఖామేనీని హతమార్చిన తరవాత మోదీ కనీసం సంతాపం అయినా తెలియజేయలేదు. అంటే ఆయననిర్మొహమాటంగా ఇజ్రాయెల్, అమెరికా మొదలుపెట్టిన యుద్ధాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నట్టే. యుద్ధంలో బాధకు గురవుతున్న ఇరాన్ మీద మోదీకి ఏ మాత్రం చింతలేదు. తరతరాలుగా ఇరాన్తో మనకున్న మైత్రీ బంధం […] The post మోదీ తలుపు చాటు దౌత్యం appeared first on Visalaandhra .
Registrar |రిజిస్ట్రార్ తొలగింపునకు విద్యార్థి సంఘాల ముట్టడి….
Registrar | రిజిస్ట్రార్ తొలగింపునకు విద్యార్థి సంఘాల ముట్టడి…. కోట్ల రూపాయల అవినీతి
అమెరికాతో అంటకాగినందుకు పశ్చాత్తాపం!
కన్వల్ సిబల్యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాల్లోని సైనిక స్థావరాలు, ఇతర ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా తమనుకాపాడుతుందని భావించిన ఈ దేశాలకు, ఇప్పుడు తాము అమెరికా రక్షణలో లేమనే చేదు నిజం అర్థమవుతోంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీనిఅమెరికా అత్యంత దారుణంగా చంపేసింది. ఈ రాజకీయ హత్య మధ్యప్రాచ్యంలో ఒక తీవ్రమైన పరిణామం. ఇరాన్ అమెరికాపై ఎటువంటి దాడి చేయలేదు, అయినప్పటికీ దాని అగ్రనేతను, జనరల్స్ను భౌతికంగా తొలగించారు. […] The post అమెరికాతో అంటకాగినందుకు పశ్చాత్తాపం! appeared first on Visalaandhra .
మనిషికి అంతులేని ఆశలు సహజసిద్ధం. వయస్సు పెరిగే కొద్దీ కొన్ని ఆశలు చచ్చిపోతాయి, కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. సంపాదన యావలో పడి యుక్తవయస్సులో అనుభవించలేని కోర్కెలను, వ్యవహారాలను వయస్సు మళ్లిన తర్వాత తీర్చుకోవాలని తపనపడతారు. ఇందుకోసం ఒక తరహా మానసిక యుద్ధమే చేస్తూ ఉంటారు.ఈ విషయంలో ఎదుటవారి హక్కులకు భంగం వాటిల్లినా, ‘తగ్గేదేలే దంటూ దూసుకుపోతూ ఉంటారు. ఇటీవల అత్యంత ప్రమాదకరమైన, నీచమైన, నికృష్టమైన ధోరణి ఒకటి ప్రబలింది. పైగా దీనికి ‘న్యూ ట్రెండ్’ అని పిలుస్తూ […] The post భాగస్వామి హక్కుకు భంగమా? appeared first on Visalaandhra .
చిత్తూరు జిల్లాలో దారుణం.. నాటు తుపాకీతో కాల్చి యువకుడి హత్య
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తుమ్మదపాలెంలో కాల్పుల కలకలం రేగింది. సాయి కుమార్ అనే యువకుడిని మరో యువకుడు ఢిల్లీ నాటు తుపాకీతో కాల్చాడు. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఢిల్లీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా సిసిటివి ఫుటేజులను పరిశీలిస్తున్నారు. మృతుడు, నిందితుడి మధ్య ఉన్న గత పరిచయాలపై ఆరా తీస్తున్నారు. త్వరగా కేసును చేధస్తామని పోలీసులు తెలిపారు.
లిక్విడ్ ట్యాంకర్ ఢీకొని మహిళ మృతి..
లిక్విడ్ ట్యాంకర్ ఢీకొని మహిళ మృతి.. ముండ్లమూరు, ఆంధ్రప్రభ : మండలంలోని పోలవరం
Hyderabad : యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోలు బంకుల వద్ద పెరిగిన రద్దీ
హైదరాబాద్ లో పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది
బాల్క సుమన్ కు స్వాగతం.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా జైల్
వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి..
వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి.. బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ
Structures |రూ.240 లక్షల నిధులు మంజూరు…
Structures | రూ.240 లక్షల నిధులు మంజూరు… ఎంపీ విజ్ఙాపనకు స్పందించిన రాష్ర్ట
Telangana : తెలంగాణలో రికార్డుస్థాయికి చేరుకున్న విద్యుత్తు వినియోగం...ఎంతంటే?
తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది
2.40 lakhs |సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…
2.40 lakhs | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ… 2.40 lakhs
ఒటిటిలోకి వస్తున్న కార్తీ లేటెస్ట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే,,
తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ. కార్తీ నటించిన రీసెంట్ చిత్రం ‘వా వాతియర్’. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్తో ఈ సినిమాను విడుదల చేశారు. నలన కుమారస్వామి దర్శకతంలో తెరకెక్కిన ఈ సినిమాను కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్ ఒటిటిలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్లోమార్చి 6వ తేదీ నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ప్రైమ్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఇందులో కార్తి స్వయంగా తన సినిమా విశేషాలను పంచుకున్నారు.‘‘ అన్నగారి ఆగమనం. ‘అన్నగారు వస్తారు’మార్చి 6 నుంచి నుంచి ప్రైమ్ వీడియోలో’’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను విడుదల చేశారు.

22 C