SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
...

శుక్రవారం రాశి ఫలాలు (20-02-2026)

మేషం ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృషభం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి. మిధునం ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు. కర్కాటకం రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సింహం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కన్య ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. తుల గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు. వృశ్చికం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ధనస్సు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. మకరం ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుంభం కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. మీనం దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.  

మన తెలంగాణ 20 Feb 2026 12:20 am

దుండిగల్ మున్సిపల్‌లో అక్రమాలు.. లంచంపై ఆధారాలు లభ్యం

లంచంపై ఆధారాలు లభ్యం ప్రకటనలో పేర్కొన్న ఎసిబి అధికారులు మనతెలంగాణ, సిటిబ్యూరోః దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎసిబి దాడులపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గండిమైసమ్మ వద్ద ఉన్న దుండిగల్ మున్సిపల్ కార్యాలయంపై ఎసిబి అధికారులు బుధవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, కార్యాలయ పనితీరును తనిఖీ చేశారు. కింద అక్రమాలు జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ వాట్సాప్ చాట్‌లలో లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. సూపర్‌వైజర్ భర్తకు చెందిన సంస్థకు అనధికారికంగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించి, వారి ఖాతాల్లోకి వచ్చిన నిధుల మూలాలను, అక్రమాలతో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు ఎసిబి అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కార్యాలయ రికార్డులు, డిజిటల్ డేటా, ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ సమగ్ర నివేదిక పంపనునట్లు పేర్కొన్నారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఐదుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. శానిటరీ ఫీల్ అసిస్టెంట్ల ద్వారా పారిశుధ్య కార్మికుల హాజరు రికార్డులను తారుమారు చేసినట్లు తేలింది. 49 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 12 దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉన్నా, 21 రోజుల గడువు దాటిపోయినా పెండింగ్‌లోనే ఉంచారు. 32 అనధికారిక నిర్మాణ కేసులలో, 28 కేసులకు సంబంధించి రెండో నోటీసు జారీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జి+3 (మూడు అంతస్తులు) అనుమతి ఉన్న చోట, అక్రమంగా నిర్మించిన జి+5 (ఐదు అంతస్తులు) భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించారు.

మన తెలంగాణ 19 Feb 2026 11:37 pm

రూ.70వేల లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ విద్యాశాఖ సూపరింటెండెంట్

నగరంలోని సైఫాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో పనిచేస్తున్న సూపరింటెండెట్ ఫణిరాజ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌లు రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఎసిబి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన స్కూల్ కు సంబంధించి సిబిఎస్‌ఇ ఎన్‌ఒసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైల్ ను ప్రాసెస్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రూ.70 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను సూపరింటెండెంట్‌తో మాట్లాడి ఎన్‌ఒసీ ఇప్పిస్తానన్నాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. గురువారం డిమాండ్ చేసిన రూ.70 వేలు సూపరింటెండెంట్ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ తీసుకున్న సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు.

మన తెలంగాణ 19 Feb 2026 11:08 pm

భారత మహిళల ఓటమి

ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో టి20లో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్ 19 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు షఫాలీ వర్మ (29), స్మృతి మంధాన (31) శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. జెమీమా రోడ్రిగ్స్ (4) పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 5 ఫోర్లతో 36 పరుగులు సాధించింది. రిచా ఘోష్ (19) పరుగులు చేసింది. అయితే ఆతిథ్య జట్టు బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. గార్డ్‌నర్ మూడు, కిమ్ గార్థ్, సదర్లాండ్, సోఫి తలో రెండేసి వికెట్లను పడగొట్టి భారత్‌ను కట్టడి చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఓపెనర్లు జార్జియా వోల్, బెథ్ మూనీ ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 4 ఫోర్లతో 46 పరుగులు చేసింది. చెలరేగి ఆడిన జార్జియా 57 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 88 పరుగులు సాధించింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేక పోయారు. దీంతో ఆసీస్ ఆశించిన స్కోరును సాధించలేక పోయింది. కానీ బౌలర్లు అద్భుత ప్రతిభతో తక్కువ స్కోరును కాపాడుకుని జట్టుకు గెలుపు సాధించి పెట్టారు.

మన తెలంగాణ 19 Feb 2026 11:00 pm

పట్టువీడని వైసీపీ

. ముందుకు రాని ప్రభుత్వం. పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు. ఈలలు, నినాదాలతో గందరగోళం. టీడీపీ సభ్యుల నిరసనలు. ఇందాపూర్ నెయ్యిపై ఆగని రగడ. వాయిదాలతో నడిచిన మండలి. అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: తిరుపతి లడ్డూ తయారీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై శాసనమండలిలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చర్చకు ప్రతిపక్ష వైసీపీ పట్టుబడుతుండగా… అధికార పక్షం మాత్రం ససేమిరా అంటున్నది. ఈ వివాదంపై మాటలయుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో శాసనమండలి దద్దరిల్లింది. శాసనమండలి సమావేశాలు గురువారం […] The post పట్టువీడని వైసీపీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 10:51 pm

అన్నీ ఉచితాలంటే ఎలా?

సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూదిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ […] The post అన్నీ ఉచితాలంటే ఎలా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 10:49 pm

ఐక్యతతోనే సామ్రాజ్యవాద ఓటమి

ఇస్కఫ్ జాతీయ మహాసభలో వక్తలు (విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)ప్రజల ఐక్యతతోనే సామ్రాజ్యవాదాన్ని, మతతత్త్వాన్ని ఓడించగలమని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా అన్నారు. శాంతి, స్నేహం, సాంస్కృతిక ఐక్యతకు అంకితమైన 85 ఏళ్ల చరిత్ర గల భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్) 24 వ జాతీయ మహాసభలు గురువారం చెన్నై నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, శాంతి ఉద్యమ నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద […] The post ఐక్యతతోనే సామ్రాజ్యవాద ఓటమి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 10:39 pm

ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో దాడి

సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ ఉన్మాది దారుణానికి తెగబడ్డాడు.గత కొంతకాలంగా ప్రేమించి దూరం పెడుతుందని యువతిపై తన ప్రియుడు సుత్తితో దాడి చేసిన సంఘటన గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్ లో చోటు చేసుకుంది.  తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరిస్తోందని ప్రియురాలిపై సుత్తితో దాడి చేశాడు.యువతిపై దాడి చేయడంతో యువతి కేకలు విని స్థానికులు వచ్చి నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేశ్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలో నుతనకల్ మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన రావడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో కూర్చిపెట్టి మాట్లాడారు. అప్పటి నుంచి యువతి సూర్యాపేటలోని బంధువులు ఇంట్లో ఉంటుంది. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్ లో ఉన్న యువతిపై ప్రియుడు దాడి చేశాడు.  సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి స్పందన పై లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిన్ల మహేష్ దాడికి పాల్పడినట్లు తెలిపారు. స్పందన స్నేహ నగర్ లో నివాసం ఉంటున్న తన అక్క బావ ఇంటికి గత రెండు రోజుల క్రితం వచ్చింది. గురువారం ఉదయం 09.15 గంటల సమయములో స్పందన ఒక్కతే ఇంటిలో ఉండడం చూసి పథకం ప్రకారం దాడి చేసినట్లు తెలిపారు. మహేష్ స్పందన పై పథకం ప్రకారం షాపు యందు ఇనుప సుత్తె కనుగోలు చేసి ఆమె దగ్గరికి వెళ్ళి వారి ప్రేమ విషయమై అమెతో గొడవ పడి తన వద్ద యున్న సుత్తె తో తలపై కొట్టి గాయపర్చనట్లు పోలీసులు పేర్కొన్నారు. స్పందన కేకలు విని చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను కాపాడారని, స్పందనను చికిత్స నిమిత్తం సూర్యపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యందు చేర్పించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్ కు వెళ్ళి స్పందన బావ పూల బాబురావు నుండి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు డి.ఎస్.పి ప్రసన్న కుమార్ తెలిపారు. సంఘటన వద్ద సూర్యాపేట రూరల్ జి. రాజశేఖర్ , చివ్వెంల యస్.ఐ వి. మహేశ్వర్, క్లూస్ టీం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 19 Feb 2026 10:30 pm

గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

బాలికకు గంజాయి తాగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం బాలిక తన అమ్మమ్మతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం పాఠశాలకు వెళ్తున్నట్లు ఆ బాలిక ఇంట్లో చెప్పి బయటికి వెళ్లింది. సాయంత్రం అయినా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక అమ్మమ్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలోని విద్యార్థులను ఆరా తీశారు. వారు చెప్పిన ఆధారాలతో సీసీ కెమెరాలను పరిశీలించారు. స్థానికంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఆ బాలికకు గంజాయి, మద్యం తాగించి ముగ్గురు నిందితులు అత్యాచారం చేసినట్లు గుర్తించారు. నిందితులు కూడా మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను వెంటనే పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు, రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో ఒక యువకుడు స్థానిక భవానీ నగర్‌లో రౌడీ షీటర్ పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మన తెలంగాణ 19 Feb 2026 10:20 pm

ఇరాన్‌పై సైనిక దాడికి అమెరికా సిద్ధం

ఇరాన్‌పై ఏ క్షణంలో అయినా భీకర దాడికి అమెరికా సర్వంసమాయత్తం అయింది. ఇరాన్ అణు చర్చలు విఫలం అయితే తాము దాడికి దిగడమే తరువాయి అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తరచూ చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మిడిలిస్టు ప్రాంతానికి అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఎఫ్ 35, ఎఫ్ 22 జెట్ యుద్ధ విమానాలు, అనుబందంగా పలు ఫైటర్ విమానాలను రంగంలోకి దింపారని, ట్రంప్ అనుమతిని ఇస్తే వెంటనే దాడులు తప్పవని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. వచ్చే శనివారం లేదా ఆదివారం అమెరికా దాడులు జరగవచ్చునని , దీనిపై ట్రంప్ వైట్‌హౌజ్‌లో తన సలహదారులతో కీలక చర్చలకు దిగారని వెల్లడైంది. మెరికా సైనిక కదలికలను ఇరాన్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఎలక్ట్రానిక్ ఆయుధ వ్యవస్థతో కూడిన పలు యుద్ధ విమానాలను రెండో దఫాగా ఇరాన్ సమీపంలోకి తీసుకువచ్చి ఉంచారు. భారీ స్థాయి దాడులకు ఈ విమానాలు అత్యవసరంగా అమెరికా భావిస్తోంది. ఇరాన్‌పై పూర్తి స్థాయి దాడులకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నరీ లేనిది వెల్లడికాలేదు. అయితే దాడి జరిపితే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే విధంగా నిర్ణీత లక్షం ఎంచుకుంటారని వెల్లడైంది. ముందుగా ఇరాన్ క్షిపణి వ్యవస్థను దెబ్బతీయడం ,ఈ లోగా తమ మాట వినకుండా వ్యవహరిస్తోన్న ఖమేనీ పాలనను అంతమొందించడం కోసం ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అణు చర్చలు ఫలవంతం అయ్యేలా చూడాలనే షరతుతో జెనీవాలో ట్రంప్ ఆదేశిత చర్చలు జరిగాయి.ఈ రెండో దఫా చర్చల్లోనూ ఎటువంటి ఫలితం వెలువడలేదు ఈ దశలో ఇక ఇరాన్ నేత ఖమేనీని టార్గెట్ చేసుకుని ట్రంప్ సైనిక దాడులకు వ్యూహాత్మక ప్లానింగ్‌కు దిగారని వెల్లడైంది. ఇరాన్‌పై దాడులకు ఎఫ్ 22 రాప్టోర్స్, ఎఫ్ 35 లైట్నింగ్స్ సిద్ధం చేశారు. ఎక్కువగా గగనతల దాడులతోనే ఇరాన్ పాలకులను దెబ్బతీయాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. 2003 తరువాత ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికా సైనిక పాటవం మొహరించుకుని ఉంది. పరిస్థితిని ఇరాన్ సమీక్షించుకొంటోంది. తనకున్న క్షిపణి బలగాలను మరింత అప్రమత్తం చేసుకుంది. ముందుగా అమెరికా స్థావరాలలను దెబ్బతీయడం ద్వారా వ్యూహాత్మకంగా ట్రంప్ ఆధిపత్యానికి సవాలు విసిరేందుకు రంగం సిద్ధం చేసుకంది. చమురు ట్యాంకర్ల రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు కూడా ఇరాన్ బలగాలు యత్నించే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ పరిణామాల్లో తీవ్రతకు దారితీస్తుంది. ఇక అమెరికాను అనూహ్య రీతిలో దెబ్బతీసే పాటవం తమకు ఉందని, ఇది అత్యంత కీలకమైన పరిణామం అవుతుందని ఇరాన్ ఉన్నత స్థాయి వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. 

మన తెలంగాణ 19 Feb 2026 10:11 pm

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపిన దివిసీమ విద్యార్థి డొక్కా జ్ఞానేశ్వర్

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపిన దివిసీమ విద్యార్థి డొక్కా జ్ఞానేశ్వర్ డొక్కా జ్ఞానేశ్వర్

ప్రభ న్యూస్ 19 Feb 2026 10:09 pm

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రూ.5.80 కోట్లకు అనుమతి

రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా సమీకృత భవన సముదాయ ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.5.80 కోట్లను విడుదల చేసేందుకు పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో తెలుగు తల్లివిగ్రహాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను గత ఏడాది ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయి ఆర్థిక మంజూరు అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఈ ఏడాది పనులు పూర్తి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది.

మన తెలంగాణ 19 Feb 2026 10:07 pm

విశాఖలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

 ఎపిలోని విశాఖపట్నంలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నగరం లోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు యోగి క్యాటరింగ్ పని చేస్తుంటాడు. బాధితురాలి కుటుంబంతో అతనికి కొంతకాలంగా పరి చయం ఉంది. ఈ పరిచయాన్ని అడ్డుగా చేసుకుని, నిన్న సమీపంలోని దుకాణానికి వెళ్తున్న రెండేళ్ల చిన్నారిని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్ప డినట్లు తెలుస్తోంది.

మన తెలంగాణ 19 Feb 2026 10:04 pm

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆలేరు విద్యార్థులు..

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆలేరు విద్యార్థులు.. ఆలేరు,ఆంధ్రప్రభ: ఆలేరు పట్టణంలోని బాలుర, బాలికల

ప్రభ న్యూస్ 19 Feb 2026 9:54 pm

మైనర్ బాలికను వంచించిన యువకుడిపై కేసు నమోదు

మైనర్ బాలికను వంచించిన యువకుడిపై కేసు నమోదు చిట్టినగర్,ఆంధ్రప్రభః విజయవాడ సాయిరాం థియేటర్

ప్రభ న్యూస్ 19 Feb 2026 9:39 pm

Ram to take up Multiple Tasks in his Next

Energetic Star Ram is shattered with the debacle of Andhra King Taluka. The actor was super confident in the film but it failed to generate decent revenues despite receiving positive word of mouth. Ram is on a break and he has shelved his next film that was to be produced by Arka Media Works, the […] The post Ram to take up Multiple Tasks in his Next appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 9:30 pm

Minister |స్థానిక పాలనలో… బీసీ లకు పెద్ద పీట

Minister | స్థానిక పాలనలో… బీసీ లకు పెద్ద పీట 34 శాతం

ప్రభ న్యూస్ 19 Feb 2026 9:30 pm

Big Runtime for Dhurandhar: The Revenge

Several analysts and filmmakers were left surprised with the runtime of Dhurandhar. The final runtime of the film was 3 hours and 35 minutes with the first half of the film lasting for over two hours. The film was watched multiple times by the audience and they enjoyed the film despite a lengthy runtime. The […] The post Big Runtime for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 9:29 pm

Nawab Cafe USA Premieres TODAY

Harshika Productions’ upcoming Telugu film Nawab Cafe is all set for its USA theatrical release. Nawab Cafe is a heartfelt Telugu drama that blends emotion, relationships, and a story rooted in warmth and legacy. The film is scheduled for a worldwide theatrical release on February 20. Earlier announced under the title ChaiWala, […] The post Nawab Cafe USA Premieres TODAY appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 9:27 pm

తాడిగడప శ్రీ కృష్ణవేణి కళాశాలలో జాబ్ మేళా

తాడిగడప శ్రీ కృష్ణవేణి కళాశాలలో జాబ్ మేళా ఈనెల 21న తాడిగడప లోని

ప్రభ న్యూస్ 19 Feb 2026 9:20 pm

గుండెపోటుతో సర్మిడి దేవురావు మృతి

గుండెపోటుతో సర్మిడి దేవురావు మృతి జైనూర్,ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జై

ప్రభ న్యూస్ 19 Feb 2026 9:11 pm

జూబ్లీహిల్స్ లో చైన్‌స్నాచింగ్ జంట అరెస్టు

బైక్‌పై తిరుగుతూ చైన్‌స్నాచింగ్ చేస్తున్న జంటను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి బంగారు గొలుసు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లిహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి కథనం ప్రకారం...ఎపిలోని కాకినాడకు చెందిన చెశెట్టి రేవతి (33), గుంటూరు జిల్లాకు చెందిన గిద్దల నరేంద్ర అలియాస్ నాని (23) సనత్ నగర్‌లోని హిందూ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉంటున్నారు. నరేంద్ర రాపిడో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి చైన్‌స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీ ఉదయం 9.30 నిమిషాల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 39లో కడపాల మానస అనే యువతి తన కార్యాలయానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. యువతిని బైక్‌పై వెంబడించిన నిందితులు రోడ్ నంబర్ 44 వద్దకు చేరుకోగానే బైక్ వెనుక కూర్చున్న రేవతి బాధితురాలి మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్పాయ్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. జుబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎం. సత్యనారాయణ, సబ్ ఇన్‌స్పెక్టర్ జె. సతీష్ కేసు దర్యాప్తు చేశారు.

మన తెలంగాణ 19 Feb 2026 8:58 pm

పాలన గాలికొదిలేసిన రేవంత్‌రెడ్డి: బిజెపి రాంచంద్రరావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు, చిట్ చాట్‌లతో పబ్బం గడుపుతు పరిపాలన గాలికి వదిలేశారని రాంచంద్రరావు ధ్వజమెత్తారు. తెలంగాణలో విద్యావ్యవస్థను భ్రష్టపట్టించారని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖను చూస్తున్న ఎలాంటి మార్పు లేదన్న ఆయన గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ డ్రామాలు ఆడుతూ విద్య వ్యవస్థను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఎన్నికలు రాగానే హామీలిచ్చి రేవంత్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని అన్నారు. ఉద్యోగుల సంఘం నేతలు మొన్ననే నాతో మాట్లాడడం జరిగిందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక గత రెండేళ్లుగా 60 మందికి పైగా చనిపోయారని ఉద్యోగల సంఘం ఆవేదన వ్యక్తo చేసింది. ఫీజు రియంబర్స్‌మెంట్, రిటర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదో రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసిందో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తూ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్ట పట్టిస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యవస్థను నీరుగార్చడం అంటే తెలంగాణ పిల్లలు విద్యార్థుల భవిష్యత్తును, తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 19 Feb 2026 8:53 pm

తిమ్మారెడ్డిపల్లి తండాలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన

తిమ్మారెడ్డిపల్లి తండాలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన ఊట్కూర్, ఆంధ్రప్రభః నారాయణపేట జిల్లాఊట్కూర్

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:51 pm

ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్

రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం కాలేజీ లాగిన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల నుంచి హాల్ టికెట్లు తీసుకుని అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే తెలియజేయాలని ఇంటర్ బోర్డు తెలిపింది.మొత్తం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజవుతున్నట్టు పేర్కొంది. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా హాల్ టికెట్లను పొందే సదుపాయాన్ని కల్పించారు. బోర్డు వద్ద విద్యార్థులు నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్‌ను శుక్రవారం పంపిస్తున్నట్టు బోర్డు తెలిపింది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నట్టు గుర్తిస్తే... వెంటనే ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకొచ్చి, తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పారు. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న మొదటి సంవత్సరం, 26వ తేదీన రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల టైం టేబుల్ ఇంటర్ బోర్డు ఇదివరకే విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు.

మన తెలంగాణ 19 Feb 2026 8:48 pm

అక్రమంగా పశువులు తరలింపు..

అక్రమంగా పశువులు తరలింపు.. జైనూర్, ఆంధ్రప్రభః పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:46 pm

మండల అధికారులు పాఠశాలలను తనిఖీ చేయాలి..

మండల అధికారులు పాఠశాలలను తనిఖీ చేయాలి.. బాల్కొండ, ఆంధ్రప్రభః రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:38 pm

చిట్యాలలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

చిట్యాలలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు చిట్యాల, ఆంధ్రప్రభ: చత్రపతి శివాజీ ని

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:32 pm

రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపిక కమ్మర్‌ పల్లి, ఆంధ్ర

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:27 pm

హైదరాబాద్‌లో 13 వేల కోట్ల జిఎస్‌టి మోసం

హైదరాబాద్‌లో 13 వేల కోట్ల జిఎస్‌టి మోసం బట్టబయలైంది. కేసులో గేమింగ్ సంస్థ యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ సంస్థ డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను జిఎస్‌టి నిఘా విభాగం అరెస్టు చేసింది. మోసాన్ని హైదరాబాద్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ బహిర్గతం చేసింది. షెల్ కంపెనీలకు నకిలీ కెవైసి వెరిఫికేషన్లు ఇచ్చినట్లు గేమింగ్ సంస్థపై ఆరోపణలున్నాయి. పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకింగ్ యాజ్ పేమెంట్ అగ్రిగేటర్ వ్యవస్థలతో ఈ సంస్థకు లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లతో కూడిన పిన్‌టెక్ కంపెనీల సహాయంతో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్ సైట్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సిండికేట్‌లో పంకజ్ కుమార్‌ను కీలక సూత్రధారుల్లో ఒకరిగా గుర్తించారు. ఆన్‌లైన్ గేమింగ్ నుంచి వచ్చే నగదు ప్రవాహానికి అవసరమైన యూపిఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ కంపెనీలను చేర్చుకోవడంలో అతడు సహాయపడినట్లు జిఎస్‌టి నిఘా విభాగం గుర్తించింది. ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్దిదారుల్లో ఈయన కూడా ఒక రు. ఈ క్రమంలోనే హైద రాబాద్ ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్లపై డిజిజిఐ అణిచివేత చర్యలను షురూ చేసింది. సంస్థకు చెందిన రూ.100 కోట్ల నగ దు ఉన్న బ్యాంకు ఖాతాల ను అధికారులు ఫ్రీజ్ చేశారు. 

మన తెలంగాణ 19 Feb 2026 8:20 pm

ఎంపీ చామలకి కృతజ్ఞతలు తెల్పిన వైస్ చైర్మన్ వెంకన్న

ఎంపీ చామలకి కృతజ్ఞతలు తెల్పిన వైస్ చైర్మన్ వెంకన్న మోత్కూర్, ఆంధ్రప్రభః మోత్కూర్

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:20 pm

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు..

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు.. మోత్కూర్, ఆంధ్రప్రభః ఛత్రపతి శివాజీ జయంతి ని

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:10 pm

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన స్వర్ణకారుల సంఘం

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన స్వర్ణకారుల సంఘం మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:05 pm

Heritage, Indapur, Bolebaba and IndiaMART Claims: A Political Diversion?

Former Andhra Pradesh Chief Minister Y. S. Jagan Mohan Reddy has launched a fresh attack targeting Heritage Foods and indirectly linking it to alleged irregularities. His latest press meet focused on claims involving Heritage, Indapur, Bolebaba Dairy and listings on IndiaMART. The larger narrative appears aimed at drawing parallels and shifting public attention. However, a […] The post Heritage, Indapur, Bolebaba and IndiaMART Claims: A Political Diversion? appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 8:00 pm

కోతకు గురైన బీటీ రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

కోతకు గురైన బీటీ రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ తక్షణమే మరమ్మతులు చేయాలని

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:00 pm

7,408 homes |మున్సిపల్ పాలకవర్గానికి పెద్ద సవాల్…!

7,408 homes | మున్సిపల్ పాలకవర్గానికి పెద్ద సవాల్…! 7,408 homes |

ప్రభ న్యూస్ 19 Feb 2026 7:56 pm

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష

దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఆమె తిరుపతికి రావడం చాలా అరుదు. తాజాగా త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. గురువారం సాయంత్రం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో శ్రీవానీ విఐపి బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుంది.ఈనేపథ్యంలో ఆలయ అధికారులు త్రిషకు స్వాగతం పలికి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయానికి వచ్చినప్పుడు ఆమె సంప్రదాయ దుస్తుల్లో చాలా సింపుల్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.త్రిష గతంలో (మే 2022లో) మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమె తన స్నేహితురాలు మంచు లక్ష్మితో కలిసి తిరుమల వచ్చారు.

మన తెలంగాణ 19 Feb 2026 7:56 pm

Nandikotkur |శుభ‌కార్య‌క్ర‌మం రోజునే..

Nandikotkur | శుభ‌కార్య‌క్ర‌మం రోజునే.. Nandikotkur | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు

ప్రభ న్యూస్ 19 Feb 2026 7:47 pm

హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్

అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్ బండ్ దిగువన ఉన్న ఎన్‌టిఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల్లో లక్ష మంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500 కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వస్తాయన్నారు. మూడు రోజుల్లో పలు అంశాల పై సదస్సులు సైతం జరుగుతాయని వివరించారు. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని, అలా చేసుకోలేని వాళ్లు నేరుగా రావచ్చని తెలిపారు.

మన తెలంగాణ 19 Feb 2026 7:45 pm

కర్రెగుట్టల్లో తక్షణమే కూబింగ్ నిలిపివేయాలి: కూనంనేని డిమాండ్

కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేందుకు మార్గం సుగమం చేయాలని ఒక పత్రికా ప్రకటనలో ఆయన కోరారు. మావోయిస్టులు సైతం జనజీవనస్రవంతిలోకి వచ్చి, మార్కిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా ఎత్తుగడలను మార్చుకోవాలని సూచించారు. అడవుల్లోని లక్షల కోట్ల ఖనిజ సంపద కోసం మహారాష్ట్ర, చత్తీస్ గడ్ జార్ఖండ్ లో లక్షలాది చెట్లు నరికివేయడాన్ని నిలిపివేయాలన్నారు. ఒకదగ్గర చెట్టును తొలగించాలంటే, మరో ప్రాంతంలో కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్న గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఆసరాగా ఈ చర్యలకు పాల్పడడం సమంజసం కాదని, అడవిలో ప్రకృతి సహజంగా పెరిగిన చెట్లను కొట్టేసి, ఇతర ప్రాంతంలో అన్ని చెట్లు పెంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. కార్పొరేట్ ఖనిజ సంపదను అప్పగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని కూనంనేని విమర్శించారు. నక్సల్స్ పేరు చెప్పి మానవ హననానికి పాల్పడడం మానవత్వానికే మచ్చ అని అన్నారు. విశాల దృక్పథంతో ఆలోచించి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి ప్రభుత్వం తరపున కూడా కృషి చేయాలని సాంబశివరావు కోరారు.

మన తెలంగాణ 19 Feb 2026 7:38 pm

సంచలనం సృష్టించిన జింబాబ్వే.. శ్రీలంక చిత్తు

కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్‌-2026లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్టు జింబాబ్వే. లీగ్ దశలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. లీగ్ దశలో ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్-8కి చేరి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి దాన్ని చేధించింది. జింబాబ్వే బ్యాటింగ్‌లో ఓపెనర్ బ్రియన్ బెన్నెట్ 63 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కెప్టెన్ సికందర్ రజా 45 పరుగులు చేసి సత్తా చాటాడు. మరో ఓపెనర్ తడివానాషే మరుమాని 34 పరుగులు, రియాన్ బర్ల్ 23 పరుగులతో జట్టు విజయంలో తమ వంతు సాయం అందించారు. దీంతో జింబాబ్వే తమ కెరీర్‌లో టి-20ల్లో రెండో అత్యధిక టార్గెట్‌ను చేధించి రికార్డు సృష్టించింది. ఇక సూపర్‌-8లో జింబాబ్వే తన తొలి మ్యాచ్ వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది.

మన తెలంగాణ 19 Feb 2026 7:35 pm

తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడు ?: కడియం శ్రీహరి

కెసిఆర్ జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని ఆయనే మహాత్మాగాంధీ అని తెలంగాణకు కెసిఆర్ ఎలా జాతిపిత అయ్యారని ఆయన ప్రశ్నించారు. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఎన్నో స్కాంలో ఇరుక్కున్న నేతను జాతిపిత అని ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని ఎమ్మెల్యే వివేకానంద ఫిర్యాదు నేపథ్యంలో స్పీకర్ ఎదుట హాజరై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన వాదనలు వినిపించారు. స్పీకర్ సమక్షంలో కెపి వివేకానంద అడ్వకేట్లు కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దీంతోపాటు కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కెపి వివేకానంద ఈనెల 01వ తేదీన స్పీకర్‌కు మరిన్ని ఆధారాలు అందచేశారు. నేడు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తుది తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. తెలంగాణ మీ అయ్యా సొత్తా? విచారణ అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ అధికారం కుటుంబ హక్కుగా బిఆర్‌ఎస్ నేతలు వ్యవహారిస్తున్నారని కల్వకుంట్ల కుటుంబంలో అందరూ కేసుల్లో ఉన్నారని వారిపై కేసులు పెడితే తెలంగాణను అవమానించినట్టా? తెలంగాణ మీ అయ్యా సొత్తా? అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ అధికారం పోయినా అహంకారం, మాట తీరులో మార్పు రాలేదన్నారు. అందుకే ప్రజలు బిఆర్‌ఎస్ ఓటు వేయలేదని ఆయన విమర్శించారు. కెసిఆర్ కూలిపోయే కాళేశ్వరం కట్టడమే కాకుండా రాష్ట్రాన్ని దివాలా తీశారని ఆయన విమర్శించారు. అవినీతితో వేల కోట్ల ఆస్తులు సంపాదించికున్నారని, 2014 ముందు మీ కుటుంబం ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటారని ఆయన మండిపడ్డారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి రూపాయి ఆశించకుండా పనిచేయాలన్నారు. మనమందరం కలిసి అవినీతిరహిత, అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

మన తెలంగాణ 19 Feb 2026 7:33 pm

Guntur |ఒక్క‌సారిగా నియంత్ర‌ణ కోల్పోయి…

Guntur | ఒక్క‌సారిగా నియంత్ర‌ణ కోల్పోయి… Guntur | యడ్లపాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Feb 2026 7:28 pm

Traffic |ట్రాఫిక్ మిర్రర్లు…

Traffic | ట్రాఫిక్ మిర్రర్లు… Traffic | చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Feb 2026 7:15 pm

ఎదుగుతున్న దేశాలకు ఏఐతో మేలు ః సుందర్ పిచాయ్

కృత్రిమ మేధ ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియను ఆర్థికంగా ముందుకు సాగుతున్న దేశాలు సద్వినియోగం చేసుకోవచ్చునని గుగూల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ఏఐ హైపర్ ప్రోగ్రెస్‌ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలననేది మన చేతుల్లోనే ఉందన్నారు. డిజిటల్ డివైడ్, ఏఐ డివైడ్‌లతో ప్రపంచ సార్వత్రిక ప్రగతి కుంటుపడుతుందన్నారు. ఏఐ రాకతో అనివార్యంగా వర్క్‌ఫోర్స్ మార్పులు జరుగుతాయి. కొన్ని బాధ్యతలు యాంత్రికం అవుతాయి. పలు రంగాలలో వినూత్న కేరీర్‌లకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కలిసికట్టుగా వ్యవహరిస్తేనే ఏఐ సాంకేతికత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ దిశలో ప్రభుత్వాల పాత్ర కీలకమైనది అన్నారు. అవసరం అయిన నిబంధనలు, లక్షాలు నిర్ధేశించుకోవడం కీలకం అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఏఐకి అత్యధిక బడ్జెట్ కేటాయింపుల్లో తప్పేమీ లేదన్నారు. కొన్ని కంపెనీలకు ముప్పు : సామ్ ఆల్టన్ ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్ రంగంలో పలు మార్పులు వస్తాయని , ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ రంగంలోని కొన్ని కంపెనీలు దెబ్బతింటాయని ఓపెన్ ఏఐ సిఇఒ సామ్ ఆల్టన్ చెప్పారు. కొన్నింటికి మంచి జరుగుతుంది. కొన్ని దెబ్బతింటాయి. ఏఐతో కోడింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. తేలిక కూడా కానుంది. దీనితో ఇప్పటివరకూ ఈ దిశలో వాడుకునే సాంకేతికతకు ముప్పు ఉండనే ఉంటుందని తెలిపారు. 

మన తెలంగాణ 19 Feb 2026 7:15 pm

S.Ilakkiya |సేంద్రియ మేళాకు ప‌టిష్ట ఏర్పాట్లు

S.Ilakkiya | సేంద్రియ మేళాకు ప‌టిష్ట ఏర్పాట్లు S.Ilakkiya | ఎ.కొండూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:59 pm

Awareness |పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి..

Awareness | పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి.. Awareness | కొడిమ్యాల

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:56 pm

temple |దేవస్థానంలో చీరలు వేలం పాట

temple | దేవస్థానంలో చీరలు వేలం పాట temple | చిట్టినగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:52 pm

ఏపీ సర్కార్ కు ఉద్యోగుల అల్టిమేటం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు

తెలుగు పోస్ట్ 19 Feb 2026 6:51 pm

అవినీతి తిమింగలాలు.. ఎనిమిది మంది ఇంజినీర్లు సస్పెండ్

హైదరాబాద్: టిజిఎస్పిడిసిఎల్‌లో అవినీతి ఇంజినీర్లపై వేటు పడింది. ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎడిఇలు. ఎఇలు, సబ్ ఇంజినీర్లు ఉన్నారు. యాంటీ బ్రైబరీ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు వంటి వాటికి విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెల్లడైంది. ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా లంచాలు స్వీకరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

మన తెలంగాణ 19 Feb 2026 6:49 pm

Home |రేపో మాపో రైతు భరోసా..!

Home | రేపో మాపో రైతు భరోసా..! ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:43 pm

Rs1.39lakh cr |ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి..

Rs1.39lakh cr | ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి.. విద్యపై ఖర్చు

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:37 pm

ఆర్టీసీ బస్సు బోల్తా...

ఆర్టీసీ బస్సు బోల్తా పడి 19 మందికి గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి అనంతపూర్ కి బయలుదేరింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు స్టేజి సమీపంలో 44 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. స్నేహలత, అరుణ, జయ రాములు, శివ లకు తీవ్ర గాయాలు కాగా మరో 15 మంది కి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 19 Feb 2026 6:37 pm

ఏఐ, పన్ను ఎగవేతపై జాతీయ చర్చకు దారితీసిన సుధాకర్ రెడ్డి ఉదుముల దర్యాప్తు కథనం

సుధాకర్ రెడ్డి ఉడుముల నేతృత్వంలో వచ్చిన డేటా దర్యాప్తు కథనం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది

తెలుగు పోస్ట్ 19 Feb 2026 6:34 pm

Before 2014 |జాతిపిత అని చేప్పుకోవడానికి సిగ్గు ఉండాలి

Before 2014 | జాతిపిత అని చేప్పుకోవడానికి సిగ్గు ఉండాలి జాతిపిత ఒక్కరే

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:32 pm

Total 500 |దర్శిలో మెగా జాబ్ మేళా

Total 500 | దర్శిలో మెగా జాబ్ మేళా Total 500 |

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:29 pm

Treasury Department |ప‌దోన్న‌తుల క‌ల్ప‌న‌కు కృషి..

Treasury Department | ప‌దోన్న‌తుల క‌ల్ప‌న‌కు కృషి.. Treasury Department | విజయవాడ,

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:25 pm

Video : Exclusive Interview With Hero Suhas

The post Video : Exclusive Interview With Hero Suhas appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 6:18 pm

Ram charan |సుక్కు మూవీ కథ ఏంటి..?

Ram charan | సుక్కు మూవీ కథ ఏంటి..? Ram charan |

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:18 pm

కేసీఆర్ పై కడియం సంచలన కామెంట్స్

మాజీ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు.

తెలుగు పోస్ట్ 19 Feb 2026 6:17 pm

Vijayawada |నూతన కౌలుచట్టం తీసుకురావాలి

Vijayawada | నూతన కౌలుచట్టం తీసుకురావాలి Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:17 pm

MLA |రాధాతో నాదెండ్ల బ్రహ్మం భేటీ

MLA | రాధాతో నాదెండ్ల బ్రహ్మం భేటీ MLA | విజయవాడ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:07 pm

21st |అవనిగడ్డకు చాగంటి రాక

21st | అవనిగడ్డకు చాగంటి రాక 21st | అవనిగడ్డ – ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:02 pm

Ambati Rambabu |ఆటో కార్మికుల‌కు చేయూత‌…

Ambati Rambabu | ఆటో కార్మికుల‌కు చేయూత‌… Ambati Rambabu | భవానిపురం,

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:59 pm

Dhurandar 2 |పోస్ట్ పోన్ నిజమేనా…?

Dhurandar 2 | పోస్ట్ పోన్ నిజమేనా…? Dhurandar 2 | 1300

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:58 pm

51.47Bags |అందరికి అందుబాటులో…

51.47Bags | అందరికి అందుబాటులో… 51.47Bags | ఎరువుల బుకింగ్‌ మొబైల్‌ యాప్‌లోనేరాష్ట్రమంతా

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:55 pm

Narendra Modi : ఏఐ భారతకు చిరునామాగా మారనుంది : ప్రధాని మోదీ

భారత్‌ ప్రపంచ కృత్రిమ మేధస్సు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు

తెలుగు పోస్ట్ 19 Feb 2026 5:52 pm

Karnataka |పాపం వృద్ధ దంప‌తులు…

Karnataka | పాపం వృద్ధ దంప‌తులు… Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:48 pm

రెండో టి20: టీం ఇండియాపై ఆసీస్ ఘన విజయం

కాన్‌బెర్రా: మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా మనుకా ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరిగిన రెండో టి-20లో భారత మహిళ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళలు.. 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి.. 163 పరుగులు చేశారు. జార్జీయా వాల్(88) అర్థ శతకంతో రాణించగా.. బీత్ మూనీ 46 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగితా వారెవ్వరూ భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే బ్యాటింగ్‌లో భారత జట్టు విఫలమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36, స్మృతి మంధన 31, షెఫాలీ వర్మ 29 మినిహా మిగితా వారు స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 144 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఈ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని 1-1 తేడాతో సమం చేసింది. బ్యాటింగ్‌లో అర్థశతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జార్జియ వాల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 19 Feb 2026 5:30 pm

రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం

జిల్లా కోఆర్డినేటర్ రమేష్విశాలాంధ్ర ధర్మవరం;;ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్‌ను రిషివిద్యాలయలో ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ బి. రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్ రిజిస్ట్రేషన్‌ను డీన్ భాస్కర్ రెడ్డి , సీఏఓ రవీంద్ర పూర్తి చేయడం జరిగిందన్నారు.“నేను సేవ చేస్తాను” అనే నినాదంతో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆరోగ్యం, సేవాతత్పరత, స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో రెడ్ క్రాస్ […] The post రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 5:29 pm

Hall tickets |ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

Hall tickets | ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం Hall tickets |

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:28 pm

May20 |అప్పుడే టైటిల్ అనౌన్స్ చేస్తారా?

May20 | అప్పుడే టైటిల్ అనౌన్స్ చేస్తారా? May20 | ఎన్టీఆర్ –

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:27 pm

అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు

విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కార్మికులకి పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము నేరుగా చేనేత కార్మికుల దగ్గర నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులు ఎంతగానో తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో, ప్రభుత్వంలో కొలువైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో, అమరావతి లోని అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల తయారుచేయున వస్త్రాలను అమ్మకముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి […] The post అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 5:25 pm

54 people |పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షా శిబిరం

54 people | పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షా శిబిరం 54

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:24 pm

Organic |సేంద్రియ మేళాకు త‌ర‌లిరండి..

Organic | సేంద్రియ మేళాకు త‌ర‌లిరండి.. Organic | ఏ కొండూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:21 pm

Pawan |మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం..

Pawan | మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం.. ఉప్పాడ మత్స్యకారుల

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:19 pm

Andhra Prabha Smart Edition|TS|26 నుంచి బడ్జెట్ సమావేశాలు/ కవిత పార్టీకి

*ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 19-02-2026, 4.00PM ts* * 26 నుంచి బడ్జెట్

ప్రభ న్యూస్ 19 Feb 2026 5:06 pm

ధర్మవరంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం

– ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందన.. మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం తప్పక ఉంటుందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బలిజ కళ్యాణ మండపం వీధి పరిధిలో డ్రైనేజీ కాలువల్లో మట్టి పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తొగటవీర సంఘం అధ్యక్షులు గుద్దేటి రాము, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య […] The post ధర్మవరంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 5:05 pm

Dil Raju bets huge on Sharwa’s Biker

Charming Star Sharwanand has recently delivered a huge Sankranti blockbuster, Nari Nari Naduma Murari. The audiences are eagerly waiting for his excting adventure film, Biker. The movie is directed by Abhilash Reddy Kankara and prodcued by UV Creations. Now, growing excitement for the project, Dil Raju has bagged theatrical rights for record price. Apparently, Dil […] The post Dil Raju bets huge on Sharwa’s Biker appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 5:03 pm

ఆ డైరెక్టర్‌తోనే హీరోగా ఎంట్రీ ఇవ్వాలి.. కానీ: దేవిశ్రీ ప్రసాద్

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా త్వరలో వెండితెరకు పరిచయం కానున్నారనే విషయం తెలిసిందే. ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కంటే ముందే మరో డైరెక్టర్‌తో సినిమా చేయాల్సి ఉంది.. కానీ, అది జరగలేదట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. సుకుమార్. సుకుమార్, దేవిశ్రీల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. సుకుమార్ ప్రతీ సినిమాకి డిఎస్‌పినే సంగీత దర్శకుడు. ఈ నేపథ్యంలో దేవిని హీరోగా పరిచయం చేయాలని సుకుమార్ భావించారట. కానీ, అదే సమయానికి దేవి తండ్రి చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని దేవిశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ‘బలగం’ సినిమాతో సూపర్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి డైరెక్షన్‌లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు. కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దైవిక అంశాలతో ముడిపడిన ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో దేవిశ్రీ ఓ డప్పు కళాకారుడిగా కనిపించనున్నారు. అయితే నటన విషయంలో తనను దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజు తదితరులు ప్రోత్సాహించారని దేవి శ్రీ వెల్లడించారు. ‘ఎల్లమ్మ’ కోసం నిర్మాత దిల్ రాజు తనను సంప్రదించినప్పుడు ‘‘ఈ సినిమా కోసం నువ్వు పది రోజులు కేటాయిస్తే చాలు. ఆ మేరకు మేం షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. మిగిలిన సమయంలో మళ్లీ నువ్వు సంగీతాన్ని కొనసాగించుకోవచ్చు’’ అని చెప్పారని అన్నారు. సంగీత దర్శకుడిగా తాను పని చేసిన మొదటి సినిమా ‘దేవి’ అని.. ఇప్పుడు హీరోగా కూడా ఓ దేవత చిత్రానికి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇక ఎల్లమ్మకు దేవీనే సంగీతం అందిస్తుడటం మరో విశేషం.

మన తెలంగాణ 19 Feb 2026 5:01 pm

ధర్మవరం ఏరియా ఆసుపత్రికు రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు..

మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;!ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ చొరవతో రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికు అందించబడినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ వైద్య పరికరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం హరీష్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […] The post ధర్మవరం ఏరియా ఆసుపత్రికు రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 5:01 pm

10వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన..

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను

ప్రభ న్యూస్ 19 Feb 2026 4:58 pm

Indrakeeladri |ప్రసాదాల తయారీలో నూతన ఒరవడి

Indrakeeladri | ప్రసాదాల తయారీలో నూతన ఒరవడి Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Feb 2026 4:55 pm

ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు

విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. అనంతరం మంత్రి ఒక ప్రకటనలో మాట్లాడుతూ పవిత్రత, సహనం, దానం, సేవాభావం, ఆత్మశుద్ధి వంటి మహత్తర విలువలను ప్రపంచానికి చాటిచెప్పే ఈ రంజాన్ మాసం ప్రతి ఇంటికి శాంతి, ఆనందం, ఐశ్వర్యం నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించుకోవడమే కాకుండా […] The post ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 4:54 pm

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 జయంతి

చిట్యాల, ఆంధ్రప్రభ : భారతీయ పరాక్రమానికి ధైర్య సాహసాలకు నిలువుటద్దాం స్వరాజ్య -స్థాపకుడు

ప్రభ న్యూస్ 19 Feb 2026 4:52 pm

PSPK UBS Aura Single Promo: A Perfect Celebration

Power Star Pawan Kalyan is known exhibiting unrelenting charm, magnetic screen presence on the big screens. His Aura is unmatched and the kind of craze he has among audiences is unimaginable. Hence, the makers of his upcoming film, Ustaad Bhagat Singh, have dedicated a single, AURA, to celebrate him on big screen. Harish Shankar, who […] The post PSPK UBS Aura Single Promo: A Perfect Celebration appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 4:47 pm

జిల్లా క్రికెట్ జట్టుకు కలెక్టర్ అభినందనలు

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయిలో టీచర్స్ గవర్నమెంట్ విజయం సాధించిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా క్రికెట్ జట్టుకు జిల్లా కలెక్టర్ రాంప్రసాద్ తన కార్యాలయం నందు అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ టీచర్ల లీప్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి టీచర్ల టోర్నమెంట్ శ్రీ సత్యసాయి జిల్లా జట్టు విజయం సాధించినందుకు ప్రతి ఒక్క క్రీడాకారుని శాలువాతో, […] The post జిల్లా క్రికెట్ జట్టుకు కలెక్టర్ అభినందనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 4:45 pm