సీఎం పేషీ కోసం.. రుషికొండపై వేగంగా కొనసాగుతున్న పనులు..!
విశాఖపట్నంలోని రుషికొండపై వేగంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పర్యాటకశాఖ రిసార్టులో పేరుతో ఈ భవనాలకు రూ.200 కోట్లు నిధులను ఖర్చు చేశారు. అయితే ఆ భవనాలను సీఎం కార్యాలయాల కోసమే అని చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం వాటిని పర్యాటక శాఖ కోసమే నిర్మిస్తున్నారని, నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రభుత్వం ఆ భవనాలను ఏ రకంగానైన వినియోగించుకోవచ్చని వైసీపీ నాయకులు పలు సందర్భాల్లో మీడియాతో గతంలోనే చెప్పారు. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడి అరెస్టు కాగా.. అక్టోబర్ 23, 24వ తేదీల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నానికి వస్తున్నారని, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడి నుంచే సాగుతుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాట్లు కొలిక్కి రావడాన్ని బట్టి సీఎంవో ఆఫీసుకు పూజ ముహూర్తం ఫిక్స్ చేస్తారని చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా.. రుషికొండలో పర్యావరణల అనుమతుల నేపథ్యంలో పర్మినెంట్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు వీలు కాకపోవడంతో.. కంటైనర్ మోడల్ లో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆఫీసర్లు చెప్పారని ‘ఈనాడు’ కథనం పేర్కొంది. సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ? దీని ఏర్పాటు అనంతరం భూగర్భ కేబుల్ తో అనుసంధానం చేస్తామని ఆఫీసర్లు పేర్కొన్నారు. రూ.7 కోట్ల వ్యయంతో కంటైనర్ సబ్ స్టేషన్ కోసం రెండు నెలల కిందట పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ పనులు చివరి దశకు వచ్చేశాయి. ఇదిలా ఉండగా.. రుషికొండపై ఇప్పటికే రెండు బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఇంటరీయర్, ఫర్నీచర్ పనులు కొనసాగుతున్నాయి. మెయిన్ రోడ్డు నుంచి రుషికొండ వరకు రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. జాక్ పాట్ అంటే ఇదే.. రూ.100తో లాటరీ టికెట్ కొని.. రూ.కోటిన్నర గెలుచుకున్న స్నేహితులు.. (వీడియో) అలాగే రుషికొండ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు, గ్రీనరీ పెంపొందించేందుకు పర్యాటక శాఖ టెండర్లను ఇప్పటికే ఆహ్వానించింది. రుషికొండ దగ్గరలో ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొంత కాలం కిందట సీఎంవో ఆఫీసు సెక్యూరిటీ టీం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. కాగా.. గతంలోనే జీ-20 సన్నాహక సదస్సు పేరుతో రుషికొండ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఇప్పుడు మిగిలిన పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు.
ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన మరో హాట్ యాంకర్.. ఎంత ముద్దుగా ఉందో తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్లు ట్రెండింగ్లో ఉన్నారు.
హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి: అమిత్ షాతో భేటీకి అవకాశం
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారంనాడు న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారంనాడు రాత్రి ఢిల్లీ నుండి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టుగా సమాచారం.ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటు, ములుగులో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది.ఈ విషయమై కిషన్ రెడ్డిని న్యూఢిల్లీకి రావాలని కోరినట్టుగా సమాచారం. దీంతో కిషన్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం తర్వాతకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారని సమాచారం.ఈ నెల 2వ తేదీన కూడ కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 3న నిజామాబాద్ లో జరిగిన ఇందూరు ప్రజా గర్జన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై బాంబు పేల్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరుతానని తనతో చెప్పారని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.ఈ విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ప్రధాని మోడీ తన స్థాయిని మరిచిపోయి అబద్దాలు చెప్పారని కేటీఆర్ విమర్శించారు.
మరో ఏడుగురు.. 48 గంటల్లో 31 మంది మృతి
గత 48 గంటల్లోనే 31మంది మృతి చెందారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది..
పాకిస్తాన్ కు పవిత్ర జలం, గీత, జపమాలలను పంపుతున్న ఉత్తరాఖండ్ సూఫీ మందిరం.. !
Uttarakhand Sufi shrine: మతాల ఐక్యతను, మత సహనాన్ని నొక్కిచెప్పే ఒక ప్రత్యేకమైన ఘటనకు సాక్షంగా నిలుస్తోంది ఉత్తరాఖండ్ లోని సూఫీ పుణ్యక్షేత్రం. సబీర్ మఖ్దూం షా దర్గా ను సందర్శించే పాకిస్థానీయులకు గంగానది పవిత్ర జలం, భగవత్ గీత ప్రతిని, సహజ రుద్రాక్ష పూసల జపమాలను బహూకరించింది. సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ప్రేమ సందేశాన్ని అందించడం, మత సహనానికి, మత సామరస్యానికి ఆదర్శంగా నిలవడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ముస్లిం యాత్రికులు ఈ బహుమతులను తమ హిందూ సహచరులకు అందజేయాలనీ, హిందువుల ఉపయోగం కోసం దేవాలయాల్లో డిపాజిట్ చేయాలని కోరారు. పాకిస్తాన్ లోని హిందువులు గంగానది పవిత్ర జలం కోసం, వారి వస్త్రాల కోసం, వైద్యం చేసే శక్తులతో కూడిన పవిత్ర పూసల కోసం ఆరాటపడుతుంటారు. వసుధైవ కుటుంబకం సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షంస్ తెలిపారు. మన సంస్కృతిలో ప్రతి ఒక్కరినీ ప్రియమైన దేశంలో భాగంగా భావిస్తారు. పాకిస్థాన్ నుంచి వచ్చే పర్యాటకులకు ప్రేమ సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. వారికి గంగాజలం, గీతను కానుకగా ఇచ్చామని, తద్వారా వారు తమ దేవాలయాలకు పంపుతారని, తద్వారా భారతదేశం పట్ల ప్రేమ సందేశం అక్కడి దేవాలయాలకు చేరుతుందని అన్నారు. తాము ఇచ్చిన కానుకలను పాకిస్థాన్ లోని ఆలయాలకు అందజేస్తామని పాక్ యాత్రికులు హామీ ఇచ్చారని షాదాబ్ షంస్ తెలిపారు. దేవాలయాలకు లేదా వ్యక్తులకు కానుకలు అందజేసే వీడియోలను రూపొందిస్తామని యాత్రికులు హామీ ఇచ్చారు. వీటన్నింటినీ స్మారక చిహ్నాలుగా తీసుకెళ్లి తమ హిందూ సోదరులకు అప్పగిస్తామని పాక్ యాత్రికులు షాదాబ్ కు చెప్పారు. ఇది తమ ప్రేమ, సోదరభావ సందేశాన్ని పెంపొందిస్తుందన్నారు. పాకిస్తాన్ ప్రజలు అక్కడి దేవాలయాలతో అనుసంధానం కావాలనీ, అక్కడి సనాతన సంస్కృతిని ప్రోత్సహించాలని తాము కోరుకుంటున్నామని షాదాబ్ షంస్ అన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. 107 మంది పాకిస్తానీ యాత్రికులకు గీత, గంగా జలాలను బహుమతిగా ఇచ్చామని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలిపారు. ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుండి లక్షలాది మంది భక్తులు సూఫీ పీర్ వార్షిక ఉర్సులో పాల్గొనడానికి వస్తారు. యాత్రికులు ఐదు రోజులుగా దర్గాకు చేరుకుంటున్నారు. భారతీయులు, పాకిస్థానీలు ఒకరి మత విశ్వాసాలు, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవాలని షాదాబ్ అన్నారు. ఉత్తరాఖండ్ లో ఐదవ ధామ్ గా ప్రసిద్ధి చెందిన సబీర్ మఖ్దూం షా దర్గా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలోని కలియార్ లో ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని హార్ట్ లో 755 రబీ అల్-అవ్వాల్ 19 హిజ్రీలో జన్మించిన సూఫీకి చెందిన 592 సంవత్సరాల పురాతన దర్గా. అతని అసలు పేరు సయ్యద్ అలీ అహ్మద్. ఆయన అల్లావుద్దీన్ సబీర్ సిల్సైల్ ను స్థాపించారు. దీనిని అలియా చిష్తియా సబారియా అని పిలుస్తారు. (ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..)
పిట్లంలో ఎమ్మెల్యే షిండే సుడిగాలి పర్యటన
పిట్లంలో ఎమ్మెల్యే షిండే సుడిగాలి పర్యటన
క్రీడారంగ అభివృద్ధికి సర్కార్ కృషి : కోవ లక్ష్మి
క్రీడారంగ అభివృద్ధికి సర్కార్ కృషి : కోవ లక్ష్మి
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటించాలి: జీవన్ రెడ్డి
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటించాలి: జీవన్ రెడ్డి
మోదీ కామెంట్స్.. కేసీఆర్కే కాదట.. ఇటు చంద్రబాబుకూ
నిజామాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ హాట్ టాపిక్గా మారాయి
5 నెలల కనిష్టానికి ..మాన్యుఫాక్చరింగ్ రంగం
5 నెలల కనిష్టానికి ..మాన్యుఫాక్చరింగ్ రంగం
ఖానాపూర్ బీఎస్పీ అభ్యర్థిగా బన్సీలాల్ రాథోడ్
ఖానాపూర్ బీఎస్పీ అభ్యర్థిగా బన్సీలాల్ రాథోడ్
ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో –రాజకీయ దోపిడీ- యదేచ్చగా !
ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకోబడుతున్న భారతదేశంలో రాజకీయ దోపిడీ, అవినీతి అక్రమాలు యదేచ్చగా కొనసాగుతున్న పట్టించుకున్న పాపాన పోయిన ఏ రాజకీయ నాయకుడు లేడు! వేదికలపై …
పరువాలకు అడ్డుగా ఉన్న పైట తీసేసి శ్రియ అరాచకం... దారుణమైన పోజుల్లో చెమటలు పట్టించిన బ్యూటీ!
వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుందిశ్రియ శరన్. జీరో సైజ్ భామ గ్లామరస్ లుక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా డిజైనర్ శారీలోసెగలు పుట్టించింది. స్టార్ లేడీ శ్రియ శరన్ మరోసారి రెచ్చిపోయింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, డిజైనర్ శారీలో మైండ్ బ్లాక్ చేసింది. శ్రియ ఎద అందాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ స్కూల్ చిత్రంతోశ్రియ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు పాపారావు బియ్యాల ప్రయోగాత్మకంగా మ్యూజిక్ స్కూల్ చిత్రం తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ పలు భాషల్లో ఈ చిత్రం విడుదల చేశారు.శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు. ఇక నలబై ఏళ్ల శ్రియ కెరీర్ ఎక్కడా నెమ్మదించలేదు. స్టార్ హీరోయిన్ హోదా పోయినప్పటికీ ఆఫర్స్ తగ్గలేదు. అడపాదడపా చిత్రాల్లో ఆమె నటిస్తూనే ఉన్నారు. 2022లోఆర్ ఆర్ ఆర్, తడ్కా, దృశ్యం 2 చిత్రాల్లోశ్రియ శరన్ నటించారు. 2023 ప్రారంభంలో కబ్జ చిత్రంలో మెయిన్ హీరోయిన్ రోల్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కబ్జనిరాశపరిచింది. ఉపేంద్ర హీరోగా కబ్జతెలిసిందే. ప్లాప్ అయినప్పటికీ కబ్జ చిత్ర సీక్వెల్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె జర్నీ సాగుతుంది. వెండితెరపై ఎలాంటి విరామం సత్తా చాటుతుంది. శ్రియ పారిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. శ్రియ తోటి హీరోయిన్స్ ఎప్పుడో ఫేడ్ అవుట్ అయ్యారు. 2001లో విడుదలైన ఇష్టం మూవీతో శ్రియ వెండితెరకు పరిచయమైంది. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే... వంటి వరుస హిట్స్ తో ఆమె స్టార్ అయ్యారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టారు. కెరీర్ నెమ్మదించాకరష్యన్ ప్రియుడు ఆండ్రూనిశ్రియ వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది.బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఇక పిల్లల్ని కూడా ఆమె రహస్యంగానే కన్నారు.లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకుజన్మనిచ్చింది.
అథ్లెటిక్స్లో సిక్సర్.. పారుల్ చౌదరి, అన్ను రాణికి గోల్డ్ మెడల్స్
Asian Games –టీమ్ ఇండియా కు ఆర్చరీ లో స్వర్ణం .. 35 కిలో మీటర్ల మిక్సెడ్ వాక్ లో కాంస్యం
ఆసియా క్రీడల్లో భారత్కు గోల్డ్ రష్ కొనసాగుతోంది. బంగారు పతకాలను భారత్ ఈజీగా గెలిచేస్తోంది. ఇవాళ ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చింది. జ్యోతి, ఓజాస్ టీమ్ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించారు. దీంతో ఇండియా మెడల్స్ సంఖ్య 71కి చేరుకున్నది. ఈ క్రీడల్లో భారత్కు ఇది 16వ స్వర్ణం కావడం విశేషం. జ్యోతి సురేఖా వెన్నం, ఓజాస్ దియోతలే.. చరిత్రాత్మక ఆట తీరను కనబరిచారు. మిక్స్డ్ ఆర్చరీ ఈవెంట్లో ఫెవరేట్గా ఉన్న దక్షిణకొరియా ఆటగాళ్లను […]
యంగ్ హీరోయిన్ నేహా శెట్టి స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అందాల రచ్చ చేసింది. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. నయా లుక్ తో కట్టిపడేసింది. ‘డీజే టిల్లు’ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రచ్చ చేస్తోంది. టాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. రీసెంట్ గానే ‘బెదురులంక2012’తో మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం నేహా శెట్టి ‘రూల్స్ రంజన్’ (Raules Ranjann) చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం సరసన నేహా నటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో (అక్టోబర్ 6న) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేసుకుంటోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. నయా లుక్స్ లో మెరుస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సరికొత్త ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. అప్పటికే ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధ వహించే ఈ ముద్దుగుమ్మ నాజుకూ అందాలతో మంత్రముగ్ధులను చేసింది. టైట్ డ్రెస్ లో టెంప్టింగ్ ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నేహా కిల్లింగ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వైట్ హెవీ ఎంబ్రాయిండింగ్ ఫ్యాషన్ వేర్ లో నేహా దర్శనమిచ్చింది. ఫుల్ స్లీవ్ టాప్, బాడీకాన్ లాంటి లెహంగాలో మతులు పోయేలా ఫొటోషూట్ చేసింది. అన్ని యాంగిల్లో అదిరే స్టిల్స్ తో పరువాల ప్రదర్శన చేసింది. ఫిట్ నెస్ చూపిస్తూనే గ్లామర్ మెరుపులతో కట్టిపడేసింది. ఇటీవల నేహా శెట్టి గ్లామర్ విందుతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనలోని ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపించేలా ఫొటోషూట్లు చేస్తోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ ఫోజులిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ గా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్,, కామెంట్లు పెడుతూ వైరల్ గా మారుస్తున్నారు. పొగడ్తలతోనూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా నేహా శెట్టి యూత్ ను తనవైపు తిప్పుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇక నేహా శెట్టి ‘మెహబూబా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు చిత్రాలతో మెరిసింది. ‘డీజే టిల్లు’తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం రూల్స్ రంజన్ తో అలరించబోతోంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో నటిస్తోంది.
విద్యార్థులకు 13రోజులుదసరా సెలవులు
ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు ఈ నెల 13 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు హైదరాబాద్: బతుకమ్మ, దసరా పం …
‘ఉపా’ కింద కేసు.. న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్..
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ ప్రబీర్ పుర్కాయస్థను ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం న్యూస్క్లిక్ కార్యాలయం, దానితో అనుసంధానించబడిన దాదాపు 40 మంది జర్నలిస్టులు, ఇతర సిబ్బంది నివాసాలపై ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యూస్క్లిక్ పోర్టల్ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.న్యూస్క్లిక్సంస్థ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ)ని ఉల్లంఘించి న్యూస్క్లిక్ విదేశీ నిధులు పొందిందని ఆరోపణలు ఉన్నాయి. చైనీస్ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్వర్క్లో న్యూస్క్లిక్ అవుట్లెట్ భాగమని న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా ఆరోపించింది. ఇక, న్యూస్క్లిక్పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున న్యూస్క్లిక్తో సంబంధం ఉన్న జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు నిర్వహించారు. ఢిల్లీతో పాటు ముంబైలోని పలు ప్రదేశాలలో సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా కొందరి నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం.. ప్రబీర్ పుర్కాయస్థతో పాటు న్యూస్క్లిక్ పోర్టల్ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ‘‘మొత్తం 37 మంది మగ అనుమానితులను ప్రశ్నించడం జరిగింది. 9 మంది మహిళా అనుమానితులను వారి సంబంధిత ప్రదేశాలలో ప్రశ్నించడం జరిగింది. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు మొదలైనవాటిని స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష కోసం వాటిని సేకరించారు. విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు నిందితులు.. ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు’’అని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, చైనాతో లింకులు ఉన్నాయని ఆరోపించిన సంస్థల నుంచి న్యూస్క్లిక్కి దాదాపు రూ. 38 కోట్లు అందాయని.. ఆ నిధులను వెబ్సైట్లోని చైనా అనుకూల కంటెంట్ను ప్రభావితం చేయడానికి ఉపయోగించారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఎగుమతి సేవలకు రుసుముగా రూ. 29 కోట్లు, షేర్ల ధరలను పెంచడం ద్వారా రూ. 9 కోట్లు ఎఫ్డిఐగా స్వీకరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిధులను కార్యకర్తలు తీస్తా సెతల్వాద్, గౌతమ్ నవ్లాఖాతో కూడా పంచుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సోదాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొంతమంది దీనిని పత్రికా స్వేచ్ఛపై అణిచివేత అని పేర్కొన్నారు. ఇక, ఈ సోదాలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. సరైన ప్రక్రియను అనుసరించాలని.. ప్రెస్ బెదిరింపులకు సాధనాలుగా క్రూరమైన క్రిమినల్ చట్టాలను రూపొందించవద్దని కేంద్రాన్ని కోరింది. ఈ దాడులు మీడియాను మభ్యపెట్టే మరో ప్రయత్నం అని ఆందోళన వ్యక్తం చేసింది.
నిర్మల్ జిల్లాకు కేటీఆర్.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి
నిర్మల్ జిల్లాకు కేటీఆర్.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి
సినిమాలకు స్క్రిప్ట్ లు రాసుకొండి.. మోడీ లాంటి మోసగాడితో కేసీఆర్ సహవాసం చేయరు : కేటీఆర్
KTR hits out at PM Modi: ఎన్డీయేలో కేసీఆర్ చేరాలనుకున్నారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పీఎం ఇలా అవాస్తవాలను ప్రచారం చేయడం సిగ్గుచేటని, ఖండించదగ్గ విషయమంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పోరాట యోధుడనీ, మోడీ లాంటి మోసగాడితో ఎప్పటికీ సహవాసం చేయరని తెలిపారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. ముఖ్యమంత్రిని మార్చడానికి మోడీ నుంచి ఎన్ వోసీ అవసరం లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారనీ, తాము ఢిల్లీ, గుజరాత్ లకు బానిసలం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన అరుపులు మమ్మల్ని కదిలిస్తాయనీ, లేదా మమ్మల్ని భయపెడతాయని మోడీ అనుకుంటే పొరపాటే అంటూ విమర్శలకు పదును పెంచారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణకు కాషాయ పార్టీ ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. గత దశాబ్దంలో తెలంగాణ కోసం మీరు ఏం సాధించారు, ఇక్కడి ప్రజలు మీకు, మీ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీలకు ఓటమి తప్పదని పేర్కొంటూ.. బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. “గాంధీ భవన్లో కూరుకుపోయిన దేవుడా నువ్వు! రాజకీయ వ్యభిచారానికి బ్రాండ్ అంబాసిడర్ నీవే! కెమెరాకు చిక్కిన దొంగ నువ్వు! అబద్ధంలో పడి లాగితే అది నువ్వే! 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి హుజూరాబాద్, నాగార్జున సాగర్, మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీలు అపవిత్ర పొత్తు పెట్టుకున్నాయి! మీ మిలాఖత్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు మరోసారి సమాధి కడతారు!’’ అని అందులో పేర్కొన్నారు. మోడీని మోసగాడు అని పేర్కొంటూ.. బీఆర్ఎస్- సీఎం కేసీఆర్ ఎప్పటికీ మోసగాడితో పొత్తు పెట్టుకోరని కేటీఆర్ అన్నారు. ఫేక్ న్యూస్ యూనివర్శిటీకి మోడీ నేతృత్వం వహిస్తున్నారనీ, ఝూత్, జుమ్లా ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకుంటున్నారని మోడీ చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇవి పచ్చి అబద్ధాలని అన్నారు. మతిస్థిమితం కోల్పోయి ఎన్డీయేలో చేరేందుకు మమ్మల్ని పిచ్చికుక్క కాటు వేయలేదు. ఎన్డీయే మునిగిపోతున్న ఓడ.. ఒక ప్రధాని ఇలాంటి తీరును ప్రదర్శించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పోరాట యోధుడనీ, మోడీ లాంటి మోసగాడితో ఎప్పటికీ సహవాసం చేయరని కేటీఆర్ అన్నారు. మోడీ సెలెక్టివ్ మతిమరుపుతో బాధపడుతున్నారని విమర్శించారు.
రైల్వే న్యూ టైం టేబుల్ రిలీజ్..
భారతీయ రైల్వే మంగళవారం అక్టోబర్ 1 నుంచి ‘ట్రైన్స్ ఎట్ గ్లాన్స్(టీఏజీ)’ పేరుతో కొత్త టైమ్ టేబుల్ని విడుదల చేసింది.
మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు
మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు
మెట్రో నగరాల్లో పెరిగిన ఆఫీస్ లీజింగ్
మెట్రో నగరాల్లో పెరిగిన ఆఫీస్ లీజింగ్
ఎన్టీపీసీ 800 మెగావాట్ల ప్లాంట్ జాతికి అంకితం.. రామగుండంలో తిలకించిన ప్రముఖులు
ఎన్టీపీసీ 800 మెగావాట్ల ప్లాంట్ జాతికి అంకితం.. రామగుండంలో తిలకించిన ప్రముఖులు
వెజ్ ఓన్లీ పాలసీపై చర్యలు.. నిరసన తెలిపిన విద్యార్థులపై రూ.10వేల ఫైన్
వెజ్ ఓన్లీ పాలసీపై చర్యలు.. నిరసన తెలిపిన విద్యార్థులపై రూ.10వేల ఫైన్
జావెలిన్ త్రో తో భారత్ ఖాతాలో స్వర్ణం
న్యూ ఢిల్లీ : భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది. ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను 62.92 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకుంది. అన్ను రాణి తన నాలుగో ప్రయత్నంలో ఈ సూపర్ […] The post జావెలిన్ త్రో తో భారత్ ఖాతాలో స్వర్ణం appeared first on Aadab Hyderabad .
వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు: సైఫ్ పై సస్పెన్షన్ తాత్కాలికంగా ఎత్తివేత
వరంగల్: వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ సైఫ్ పై సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేశారు.ఈ ఏడాది ఫిబ్రవరి 22న మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైద్రాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రీతి ఫిబ్రవరి 26న మృతి చెందింది. ప్రీతి మృతికి ఆమె సీనియర్ సైఫ్ వేధింపులు కారణమని వరంగల్ పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీతి మృతి కేసు విషయాన్ని కాలేజీ సీరియస్ గా తీసుకుంది. ఏడాది పాటు సైఫ్ పై సస్పెన్షన్ వేటేసింది. తనపై కాలేజీ సస్పెన్షన్ వేటేయడంపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించారు. తన వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని సైఫ్ పేర్కొన్నారు. అయితే సైఫ్ వివరణ తీసుకోవాలని కేఎంసీ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. గత నెల 29న యాంటీ ర్యాగింగ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యం సైఫ్ ను ఆదేశించింది. అయితే సైఫ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తాత్కాలికంగా సైఫ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల తర్వాత వివరణ తీసుకోవాలని ఆదేశించింది.
పంపకాల పంచాయితీ!.. అంగీకరించని దళితులు
పంపకాల పంచాయితీ!.. అంగీకరించని దళితులు
సిక్కింలో భారీ వరదలు… 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు…
గ్యాంగ్టక్: సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు కురవడంతో తీస్తా నదిలో ప్రమాద స్థాయి దాటి వరదలు ముంచెత్తడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. చుంగతంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం 10 అడుగుల నుంచి 20 అడుగుల వరకు చేరుకుంది. బర్దాంగ్లోని సింగ్టమ్ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు వరద నీటిలో గల్లంతయ్యాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలు కురవడంతో లోనాక్ లేక్ ఉధృతంగా అలుగు పోస్తుంది. తీస్తా నది […]
రూ.1.30లక్షల విలువైన చిలుక తప్పిపోతే.. వెతికి తెచ్చిన పోలీసులు..!
మనలో చాలా మంది జంతువులను పెంచుకుంటూ ఉంటారు. కొందరు కుక్కలు, పిల్లులు పెంచుకుంటే, కొందరు పక్షులు పెంచుకుంటూ ఉంటారు. నగరానికి చెందిన ఓ వ్యాపారి కూడా ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే, సడెన్ గా ఆ చిలుక కనిపించకుండా పోయింది. వెంటనే, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఫిర్యాదు ప్రకారం, వెంటనే యాక్షన్ లోకి దిగిన పోలీసులు ఆ చిలుకను వెతికి తీసుకువచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే, నరేంద్రచారి మైరు అనే వ్యాపారి జూబ్లిహిల్స్ రోడ్ నెం.44లో నివసిస్తున్నాడు. ఆయనకు బిస్ట్రో కాఫీ షాపు ఉంది. దానిని ఆయన నిర్వహిస్తున్నారు. కొంత కాలం క్రితం ఆయన ఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే చిలుకను కొనుగోలు చేశాడు. దాని వయసు 4 నెలలు కాగా, దాని ఖరీదు రూ.1.30లక్షలు కావడం గమనార్హం. అంత ఖరీదైన చిలుకను ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకునేవాడు. సడెన్ గా అంటే సెప్టెంబర్ 22వ తేదీనన చిలుకకు ఆహారం పెట్టేందుకు పంజరం తలుపు తెరవగా, అది ఒక్కసారిగా ఎగిరిపోయింది. దాని కోసం చాలా సేపు గాలించాడు. అయినా, జాడ దొరకలేదు. దీంతో, సెప్టెబర్ 24వ తేదీన పోలీసులు ఫిర్యాదు చేశాడు. చిలుక ఫోటోని కూడా వారికి చూపించాడు. దీంతో, ఖరీదైన చిలుక కావడంతో పోలీసులు కూడా వెంటనే దానిని వెతికే పనిలో పడ్డారు. చిలుకలు, ముఖ్యంగా జంతువులు అమ్మేవారి పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఈ చిలుకను వాట్సాప్ లో అమ్మకానికి పెట్టాడు. ఈ విషయం తెలియడంతో, పోలీసులు వారి నుంచి చిలుకను స్వాధీన పరుచుకున్నారు. అప్పటికే, ఈ చిలుక ఇద్దరి చేతులు మారిందట. మూడోమారు ముజీబ్ అనే వ్యక్తి రూ.70 వేలకు చిలుకను అమ్మకానికి పెట్టినప్పుడు, విషయం పోలీసులకు తెలిసింది. కేవలం ఫిర్యాదు చేసిన ఒక్కరోజులో చిలుక ఆచూకీ కనుగొని, యజమానికి అప్పగించారు.
అరుణ ధూళిపాళ కవిత : మేలుకోవాలి ఇక!
ఎక్కడా అంతం లేని ఆరంభం ఒకటి నిశ్శబ్ద పరదాలను నిలువున చీల్చుకొని ఎన్నో ప్రమాణాల ఆదర్శంగా శబ్ద ప్రపంచపు చైతన్య వాహినిగా సాగింది ఉరకల ఒరవడితో... ఎక్కడ మొదలయిందో..? మనుషులకే తెలియని మనో రహస్య కుహరాలు తెరిచి జ్ఞాన నాడులను కదిలించి రంగరించి పోసింది విజ్ఞాన గుళికల్ని వేరు పడతోసింది మనిషిని జీవులనుండి... కానీ.... మాయా లోకపు కనికట్టు మోహంలో స్వార్థాన్ని ఒంటినిండా తొడుక్కుని హద్దులు లేని అహంకారాన్ని నరాల్లో కెక్కించుకొని నీకు దూరంగా జరిగిపోతున్న సమయాన్ని మరచి, చేస్తున్న అస్థిమిత జీవన యానం.. మనసులకు నడుమ మనిషిగా అస్తిత్వాన్ని కోల్పోతే రెండోసారి అలుముకున్న నిశ్శబ్దం వెక్కిరిస్తుంది నిన్ను.. శూన్యమైన ప్రపంచాన్ని చూసి బిగ్గరగా రోదించే కాలం రాకమునుపే మనిషివై మేలుకో...!!
ఆ జర్నలిస్టు కు సిద్ధార్థ్ వార్నింగ్
సురేష్ కొండేటి అనే ఫిలిం జర్నలిస్టు పేరు సోషల్ మీడియాలో బాగా నానుతున్న సంగతి తెలిసిందే. అతను కొన్ని డబ్బింగ్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సోషల్ మీడియా ఊపందుకున్నాక సినిమా ప్రెస్ మీట్లు, ప్రమోషనల్ ఈవెంట్లు, అలాగే ఇంటర్వ్యూలలో అతను స్పైసీ ప్రశ్నలు అడుగుతూ పాపురల్ అయ్యాడు. ఐతే ప్రశ్నలు కొంచెం స్పైసీగా ఉంటే ఓకే కానీ.. మరీ హద్దులు దాటిపోవడం, వ్యక్తిగత విషయాల గురించి చిల్లర ప్రశ్నలు అడగడంతో ఈ జర్నలిస్టు మీద తీవ్ర […] The post ఆ జర్నలిస్టు కు సిద్ధార్థ్ వార్నింగ్ first appeared on namasteandhra .
జాక్పాట్ కొట్టారు .. రూ.100 పెట్టి కొంటే కోటిన్నర తగిలింది
జాక్పాట్ కొట్టారు .. రూ.100 పెట్టి కొంటే కోటిన్నర తగిలింది
Italy –బ్రిడ్జ్పై నుంచి కింద పడిన బస్సు – 21 మంది టూరిస్ట్ లు మృతి
ఇటలీ లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్పై నుంచి కింద పడిపోయింది. వెనిస్ లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులంతా వెనీస్లోని చారిత్రక ప్రాంతాల్ని సందర్శించి తిరిగి వారి క్యాంపింగ్ సైట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, […]
ఎస్సారెస్పీ కెనాల్ భూమిని కబ్జా చేసిన ”రావుస్ లాబొరేటరీస్ ఫార్మా “..
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ దశాబ్ది ఉత్సవాల పేరుతో గ్రామాలలో పచ్చదనం పెంపొందించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీలలో “సంపద వనాలు” ఏర్పాటు చేసి, లక్షకు పైగా మొక్కలు నాటాలనే సంకల్పంతో ఎస్.ఆర్.ఎస్.పి. కెనాల్ వెంట ఉన్న స్థలాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించింది. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా పరిధిలోని తిరుమల గిరి, నాగారం, జాజి రెడ్డి గూడెం, తిమ్మాపురం, సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు (ఎస్), పెన్ […] The post ఎస్సారెస్పీ కెనాల్ భూమిని కబ్జా చేసిన ” రావుస్ లాబొరేటరీస్ ఫార్మా “.. appeared first on Aadab Hyderabad .
స్పీడు పెంచిన ఈడీ.. అధికార పార్టీ ఎంపీ ఇంట్లో సోదాలు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీలోని నార్త్ అవెన్యూలోని సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.
కియా ఇండియా కొత్త వెర్షన్.. కారెన్స్ ఎక్స్లైన్
కియా ఇండియా కొత్త వెర్షన్.. కారెన్స్ ఎక్స్లైన్
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. భర్త ప్రవర్తనకి కారణం తెలుసుకొని కన్నీరు పెట్టుకుంటున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటికి వచ్చిన కనకం దంపతులు కావ్యని చూసి ఆనంద పడుతూ ఉంటారు. ఏంటి ఈరోజు కనకం మొహం వెలిగిపోతుంది అప్పులు తీరిపోతున్నందుకా అని వెటకారంగా అడుగుతుంది రుద్రాణి. కాదు అందరితో కలిసి పండగ చేసుకుంటున్నందుకు అంటాడు కృష్ణమూర్తి. అల్లుడు దగ్గరికి వెళ్లి మేము ఈరోజు ఇలా ఇక్కడికి వచ్చామంటే అందుకు కారణం మీరే అని చెప్పి రాజ్ కి కృతజ్ఞతలు చెప్తాడు కృష్ణమూర్తి. ఇందులో ఏముంది, కావ్యకి తల్లిదండ్రులైతే నాకు కూడా తల్లిదండ్రులే కదా అంటాడు రాజ్. ఆ మాటలకి ఆనందపడిన కృష్ణమూర్తి సీతారామయ్య దగ్గరికి వెళ్లి ఒక రాజు పుట్టుకతోనే రాజు కాలేడు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నప్పుడే రాజు అవుతాడు. ఇప్పుడు మీ మనవడు అదే పని చేస్తున్నాడు అంటూ ఆనందంగా చెప్తాడు. ఇంతలో అనామిక వాళ్ళు రావడం గమనించిన కళ్యాణ్ కావ్యకి సైగ చేస్తాడు. ఆమె వాళ్ళని వెళ్లి రిసీవ్ చేసుకుంటుంది. సీతారామయ్య వాళ్లకి అనామిక పేరెంట్స్ ని పరిచయం చేసి మీతో మాట్లాడటానికి వచ్చారు అని చెప్తుంది. రండి అని చెప్పి అందరూ హాల్లో కూర్చుంటారు. మౌనంగా ఉన్న కళ్యాణ్, అనామికలని చూసి ఎవరో ఒకరు మాట్లాడండి అంటాడు సుభాష్. ఈ ప్లాన్ నాది కాదు తనదే తనే మాట్లాడుతుంది అంటాడు కళ్యాణ్. మీరు కూడా మెచ్చుకున్నారు కదా మీరే మాట్లాడండి అంటుంది అనామిక. మా తమ్ముడు ఏవో పిచ్చి కవితలు రాస్తున్నాడు అనుకున్నాం. కానీ ఆ కవితలలోనే ప్రేమను పండించి ఇంటి వరకు తీసుకు వస్తాడు అనుకోలేదు అని తమ్ముడుని ఆటపట్టిస్తాడు రాజ్. కళ్యాణ్ మాటలు విన్న అనామిక తండ్రి వాళ్ళు ఏం మాట్లాడతారు కానీ నేను చెప్తాను అని ఇలా అంటాడు. మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను అంటాడు. అప్పుడు రుద్రాణి కలగజేసుకొని ప్రేమ దేముంది వయసు వచ్చిన ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రేమిస్తున్నారు. మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలంటే మీకున్న అర్హతలు ఏమిటి అని అడుగుతుంది. ఏమి లేని ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకున్నారని విన్నాము. ఆ ధైర్యంతోనే ఇంతవరకు వచ్చాము. అయినా మీ అంత కాదు గాని మేము కూడా బాగానే సంపాదించాము అంటుంది అనామిక తల్లి. అవును మీరు విన్నది నిజమే ఆ వియ్యంకులు వాళ్లే అని కృష్ణమూర్తి వాళ్ళని చూపిస్తుంది రుద్రాణి. వాళ్ళు మట్టి బొమ్మను చేసి రంగులు వేసుకుంటారు అని వెటకారంగా మాట్లాడుతుంది. నిజమే వాళ్లే మా వియ్యంకులు బొమ్మలు చేసుకుని రంగులు వేసుకుంటారు కానీ ముఖానికి రంగు వేసుకుని మనసులో ఒకలా బయట ఒకలాగా మాట్లాడరు అని వాళ్ళని వెనకేసుకొస్తాడు సుభాష్. మా సంబంధం రుద్రాణి గారికి నచ్చలేదేమో అంటుంది అనామిక తల్లి. అలాంటిదేమీ లేదు మా రుద్రాణి ఎప్పుడూ ప్రాక్టికల్స్ జోక్స్ వేస్తుంది. అయినా ఇంట్లో నిర్ణయం తీసుకోవాల్సింది మా తల్లిదండ్రులు అని సీతారామయ్య వైపు చూస్తాడు సుభాష్. మేం పెద్దవాళ్ల మీద అయినా కన్న తల్లిదండ్రులుగా నిర్ణయం తీసుకోవాల్సింది ధాన్యలక్ష్మి వాళ్ళు అనడంతో వాళ్లు కళ్యాణ్ ఇష్టమే మా ఇష్టం అనటంతో అందరూ ఆనందపడతారు. సరే పెళ్లి ఖాయం అయిపోయింది కదా ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం అంటాడు సీతారామయ్య. మేం రెడీ అని సుభాష్ వాళ్ళు అంటారు. మేము ఊరుకోము పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తే పూజ మాత్రం మీరు చేస్తారా పూజ కూడా మా ఆడవాళ్ళే చేయాలి అని రెవల్యూషన్ తీసుకువస్తుంది అనామిక. ఆమెకి ఇంట్లో ఆడవాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మేము ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులం, మేము మాత్రం తక్కువా మేమే పూజ చేస్తాం అంటారు మగవాళ్ళు. అయితే ఒక పోటీ పెడతాను ఎవరు గెలిస్తే వాళ్ళే పూజ చేద్దురుగాని అని చెప్పి అందర్నీ బయటకు తీసుకువెళ్తాడు సీతారామయ్య. ఇదంతా చూస్తున్న రుద్రాణి ఇంట్లోకి రాకముందే ఇంత రెవల్యూషన్ తీసుకువచ్చింది, ఇక ఇంట్లోకి వస్తే ఇంకెన్ని గొడవలు వస్తాయో అని కొడుకుతో చెప్తుంది రుద్రాణి. కళ్యాణ్ కి నోట్లో నాలుక లేదు, అనామికకి అసలు సహనమే లేదు భలే కుదిరారు ఇద్దరూ అంటాడు రాహుల్. అందరూ బయటకు వెళ్లిన తర్వాత కావ్య భర్త చీటీ తీయాలని ప్రయత్నిస్తుంది కానీ కనకం వచ్చి అలా చేయడం తప్పు నీ భర్త కోరిక నెరవేరదు అని చెప్పి అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీతారామయ్య టగ్ ఆఫ్ వార్ పెడతాడు. అందులో మగవాళ్ళు గెలుస్తారు. ఈ గేమ్ మేము ఒప్పుకోము మగవాళ్ళకి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లే గెలుస్తారు అంటారు ఆడవాళ్లు. ఆడవాళ్ళ గొప్పా,మగవాళ్ళు గొప్పా అనే సమస్య కి ఆనాటి నుంచి సమాధానం దొరకలేదు అంటాడు సీతారామయ్య. మరి దీనికి పరిష్కారం లేదా అంటాడు సుభాష్. ఆడ మగ కలిస్తేనే జీవితానికి పరిపూర్ణత అందుకే జంటలుగా విడిపోయి పోటీ చేయండి ఏ జంట గెలిస్తే ఆ జంట పూజ చేయొచ్చు అని చెప్తుంది చిట్టి. అప్పుడు ఆర్చరీ గేమ్ ఏర్పాటు చేస్తారు. తరువాయి భాగంలో భర్త మనసులో ఏముందో చీటీ ద్వారా తెలుసుకొని కన్నీరు పెట్టుకుంటుంది కావ్య.
సిట్టింగుల్లో టెన్షన్.. మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
సిట్టింగుల్లో టెన్షన్.. మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
ఒకే బాడీ.. రెండు తలలు, రెండు గుండెలతో జీవిస్తున్న చిన్నారి (వీడియో)
మనిషిని పోలిన మనుషులు ఈ భూమి మీద ఏడుగురు ఉన్నారని చెబుతుంటారు.
Tirumala News : తిరుమల సమాచారం..
కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది.
5 శాతం ఐఆర్తో ఉద్యోగులను సర్కారు అవమానించింది: కోమటిరెడ్డి
5 శాతం ఐఆర్తో ఉద్యోగులను సర్కారు అవమానించింది: కోమటిరెడ్డి
డెంగ్యూ రోగికి పారాసెటమాల్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
భారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, నొప్పి నివారణ మందులకు బదులుగా పారాసెటమాల్ వాడాలని ఆరోగ్య..
సిక్కిం –ఆకస్మిక వరదలతో 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి.ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లో కాల్పులు.. ముగ్గురి మృతి
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లో కాల్పులు.. ముగ్గురి మృతి
పసుపుబోర్డు, ట్రైబల్ వర్సిటీతో.. కేటీఆర్, కవిత ఆగమైతున్నరు: బండి సంజయ్
పసుపుబోర్డు, ట్రైబల్ వర్సిటీతో.. కేటీఆర్, కవిత ఆగమైతున్నరు: బండి సంజయ్
టీచర్లకు ప్రమోషన్లు లేవ్ బదిలీలే .. కోర్టు కేసుల నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం
టీచర్లకు ప్రమోషన్లు లేవ్ బదిలీలే .. కోర్టు కేసుల నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం
క్లౌడ్ బరస్ట్తో ఒక్కసారిగా ముంచెత్తిన వరద.. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు..
సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిని మంగళవారం రాత్రి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఆ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఈ వరద ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో తీస్తా నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైనదిగా మారింది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. ఈ క్రమంలోనే సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, ఆకస్మిక వరద లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలకు కూడా నష్టం కలిగించింది. పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్ను సిక్కింను కలిపే జాతీయ రహదారి 10లోని పలు భాగాలు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితి నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తీస్తా నదికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లా అధికారులు.. ముందుజాగ్రత్త చర్యగా తీస్తా నది దిగువ పరివాహక ప్రాంతం నుంచి ప్రజలను తరలించడం ప్రారంభించారు.
హైదరాబాద్: బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు రూ.600 బంగారం ధర తగ్గింది. వంద బిస్కెట్ బంగారం ధర ఆరు వేల రూపాయలకు తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,380గా ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52600గా ఉంది. కిలో వెండి ధర దాదాపుగా రెండు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.73,500గా ఉంది. Also Read:చిన్న షాప్కు కోటి రూపాయల […]
కోర్టు చెబితేగాని పోసానిపై కేసు పెట్టరా?
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పలు సందర్భాల్లో సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో పోసానిపై లోకేష్ పరువు నష్టం దావా కూడా వేశారు. ఇక, దానికి బదులుగా తనకు ప్రాణహాని ఉందంటూ పోసాని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా పోసానిపై జనసేన నాయకుల ఫిర్యాదు ప్రకారం రాజమండ్రి పోలీసులు […] The post కోర్టు చెబితేగాని పోసానిపై కేసు పెట్టరా? first appeared on namasteandhra .
బీజేపీ MP లక్ష్మణ్ ప్రకటనను గుర్తుచేసిన కేటీఆర్.. పేపర్ క్లిప్స్ పోస్ట్!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమతో పొత్తుకు ఎన్నో పార్టీల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
انفوگرافک میں تمل ناڈو کے وزیر اعلی ایم کے اسٹالن کی تصویر ہے اور یہ دعویٰ کیا جارہا ہے کہ سی آئی اے اسٹالن کے خلاف جنسی بدانتظامی کی شکایت کی تحقیقات کر رہی ہے۔
ఇందూరు జనగర్జన సక్సెస్.. మోదీ సభకు గా భారీగా తరలొచ్చిన రైతులు
ఇందూరు జనగర్జన సక్సెస్.. మోదీ సభకు గా భారీగా తరలొచ్చిన రైతులు
ఈ ప్రపంచానికి నీలాంటి మగాడు కావాలి.. అనసూయ హాట్ కామెంట్స్
రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ.
ఘోర రోడ్డు ప్రమాదం.. 21మంది మృతి
బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి పడిన ప్రమాదంలో 21మంది అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇటలీలోని వెనిస్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
నా కెరీర్లోనే బెస్ట్ సినిమా చిన్నా : సిద్ధార్థ్
నా కెరీర్లోనే బెస్ట్ సినిమా చిన్నా : సిద్ధార్థ్
తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీని చంపేస్తాం..: మాజీ సిఆర్ఫీఎఫ్ జవాన్ బెదిరింపు
నిజామాబాద్ : తెలంగాణ పర్యటన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపుతామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి మోదీపై బాంబులతో దాడి చేయనున్నట్లు హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పీఎంవో ప్రధాని సెక్యూరిటీతో పాటు తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసాయి. అయితే ఇది కేవలం బెదిరింపు కాల్ మాత్రమేనని... ఎలాంటి బాంబ్ దాడి చేసే అవకాశాలు లేవని తెలిసి ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందురోజు(సోమవారం) రాత్రి గద్వాల జిల్లా ఆలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి చెందిన రిటైర్డ్ సిఆర్పీఎఫ్ ఉద్యోగి సాయన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసాడు. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని బాంబులతో దాడిచేసి చంపేస్తామంటూ బెదిరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పిఎంవో అధికారులు తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసారు. ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించింది సాయన్నగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా మతిస్థిమితం సరిగ్గా లేనందున న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసారు.
ప్లాట్ సర్వే, రిజిస్ట్రేషన్ కు .. రూ.10 లక్షలు లంచం
ప్లాట్ సర్వే, రిజిస్ట్రేషన్ కు .. రూ.10 లక్షలు లంచం
భూవివాదం… 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్ తో తొక్కించి….
లక్నో: భూవివాదం నేపథ్యంలో 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నర్ఖి ప్రాంతం ఫతేపూర్కు చెందిన జగదీష్ అనే వ్యక్తి వేలంలో 2003లో భూమిని కొన్నాడు. గత కొన్ని రోజుల నుంచి నేత్రపాల్, ఇంద్రవీర్తో జగదీష్కు భూతగాదాలు జరుగుతున్నాయి. తహసీల్దార్ సదార్ పుష్కర్ సింగ్కు జగదీష్ మొర పెట్టుకోవడంతో వివాదం పరిష్కరించాలని పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. నేత్రపాల్, ఇంద్రీవీర్ అక్కడికి […]
స్టూడెంట్స్ ను భయపెట్టొదు ..హేమంత్ మృతి బాధాకరం: గవర్నర్
స్టూడెంట్స్ ను భయపెట్టొదు..హేమంత్ మృతి బాధాకరం: గవర్నర్
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
కాంగ్రెస్ పార్టీ కప్పల తక్కెడ.. బీజేపీ మతతత్వ పార్టీ
కాంగ్రెస్ పార్టీ కప్పల తక్కెడ.. బీజేపీ మతతత్వ పార్టీ
సుప్రీంకోర్టులో నేడు ఓటుకు నోటు కేసు
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్ పై విచారణ జరగనుంది.
ఏషియన్ గేమ్స్ 2023: గోల్డ్ నెం.16! ఆర్చరీలో స్వర్ణం ... 71 మెడల్స్తో భారత్ సరికొత్త రికార్డు...
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్కి పతకాల పంట పడుతోంది. తాజాగా ఆర్చరీలో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఫైనల్ చేరిన భారత ఆర్చరీ అథ్లెట్లు జ్యోతిసురేఖా వెన్నం- ఓజాస్ డియోటెల్, స్వర్ణం సాధించారు. సౌత్ కొరియాతో జరిగిన ఫైనల్లో 159-158 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది భారత్. ఏషియన్ గేమ్స్లో భారత్కి ఇది 16వ స్వర్ణం... ! Asia's #1 ranked Jyothi Surekha and World Champion Ojas Deotale have defeated Korea in the Final to secure the win. ✅ Tomorrow, both of them will vie for Women's & Men's team medals. ✅ Aiming for Gold once… pic.twitter.com/YB81guIkxX — Team India at the Asian Games (@sportwalkmedia) October 4, 2023 కజకిస్తాన్ జోడితో జరిగిన సెమీస్లో 159-154 తేడాతో గెలిచి, ఫైనల్ చేరిన జ్యోతి వెన్నం- ఓజాస్ డియోటెల్... ఫైనల్లోనూ గెలిచి ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఆర్చరీకి రెండో స్వర్ణం అందించారు. ఈ పతకంతో ఏషియన్ గేమ్స్లో భారత పతకాల సంఖ్య 71కి చేరింది. ఇంతకుముందు 2018 ఏషియన్ గేమ్స్లో భారత్ 70 పతకాలు గెలవడమే ఆసియా క్రీడల్లో భారత్కి అత్యుత్తమ ప్రదర్శన.
అలోవెరా జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే..
ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన అలోవెరా శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలచే ఉపయోగించబడుతోంది. అలాగే చర్మ సంరక్షణ..
Latest updates on Guntur Kaaram Shoot
Keeping an end to all the speculations, producer Naga Vamsi announced that Superstar Mahesh Babu’s upcoming film Guntur Kaaram will hit the screens as per the plan on January 12th, 2024. He also said that the talkie part of the film will be completed by the end of October and the pending four songs will […] The post Latest updates on Guntur Kaaram Shoot appeared first on Telugu360.com .
జాక్ పాట్ అంటే ఇదే.. రూ.100తో లాటరీ టికెట్ కొని.. రూ.కోటిన్నర గెలుచుకున్న స్నేహితులు.. (వీడియో)
ఇద్దరు స్నేహితులు జాక్ పాట్ కొట్టారు. రూ.100తో ఇద్దరూ కలిసి లాటరీ టిక్కెట్ కొన్నారు. ఆ టికెట్ కు రూ.కోటిన్నర ప్రైజ్ మనీ దక్కింది. దీంతో వారిద్దరూ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఒకే రోజు కోటీశ్వరులైపోయిన రమేశ్, కుకీ అనే స్నేహితులిద్దరిది పంజాబ్ లోని ఫాజిల్కా జిల్లాలోని అబోహర్ పట్టణం. వీరి మధ్య చాలా ఏళ్ల నుంచి స్నేహం కొనసాగుతోంది. Two friends from Abohar #Punjab won a lottery of 1.5 crore rupees. Both of them have been purchasing lottery tickets for the last 14 years. Finally, they won a cash prize of 1.5 cr. pic.twitter.com/TGujVOWKuu — Akashdeep Thind (@thind_akashdeep) October 2, 2023 ఈ ఇద్దరు స్నేహితులు కలిసి గత కొన్నేళ్లుగా అనేక సార్లు లాటరీ టిక్కెట్లు కొన్నారు. వీరిద్దరికీ ఆయా లాటరీల్లో చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు కూడా వచ్చేవి. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఇటీవల రూ.100తో ఓ లాటరీ టికెట్ ను కొన్నారు. ఆ లాటరీకి సంబంధించిన ఫలితాలు ఆదివారం రాత్రి విడుదల అయ్యాయి. అందులో వీరు కొన్న టిటెక్ కు రూ.కోటిన్నర ప్రైజ్ మనీ వచ్చినట్టు తెలిసింది. సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ? దీంతో రమేశ్, కుకీ ఎంతో సంతోషించారు. సోమవారం రోజు లాటరీ టికెట్ అమ్మిన ప్రాంతానికి వారిద్దరూ బ్యాండుమేళం తీసుకొని, డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. అందరికీ స్వీట్లు తినిపించారు. ఆ లాటరీ టికెట్ ను కలర్ జిరాక్స్ చేయించి, దానిని అందరికీ చూపించారు. అయితే ప్రైజ్ మనీ ద్వారా వచ్చిన డబ్బును తమ పిల్లలకు ఇస్తామని ఇద్దరు స్నేహితులు వెల్లడించారు. మరి కొంత డబ్బును అధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఆనందంతో చెప్పారు
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం నాడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుండి న్యూఢిల్లీని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈడీ అధికారులు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం ఆప్ ఎంపీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి ఇళ్లలో కూడ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో సంజయ్ సింగ్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు తమ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తండ్రి మీడియాకు చెప్పారు. ఈడీ సోదాలకు సహకరిస్తున్నామన్నారు. సంజయ్ సింగ్ కు క్లియరెన్స్ కోసం వేచి చేస్తున్నట్టుగా తెలిపారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. బీజేపీకి ఈడీ, ఐటీ, సీబీఐలు అత్యంత విశ్వసనీయమైన మిత్రపక్షాలుగా ఆరోపించారు.గతంలో ఏం దొరకలేదు.. నిన్న కొందరు జర్నలిస్టుల నివాసాల్లో కూడ దాడులు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ ఆరోరా గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో సంజయ్ సింగ్ సమక్షంలో కలిశారు. సంజయ్ సింగ్ ను దినేష్ ఆరోరా ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్ ను కలిశారని, ఆ తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో టచ్ లో ఉన్నట్టుగా ఈడీ ఆరోపించింది.
ఇందిరాపార్క్ ధర్నాకు వెళ్లకుండా..అంగన్వాడీల ముందస్తు అరెస్టులు
ఇందిరాపార్క్ ధర్నాకు వెళ్లకుండా..అంగన్వాడీల ముందస్తు అరెస్టులు
వజ్రాల వేట.. పుష్పగిరికి క్యూ కట్టిన జనం
వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి ఆలయం పరిసర ప్రాంతాల్లోని భూములు, తిప్పల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు.
తిరుమలలో ఈరోజు రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుంది
స్కిల్స్ పెంపుదలకు మనోళ్ల సొంత పైసలే.. ఏటా రూ. 2 లక్షల కోట్లు ఖర్చు
స్కిల్స్ పెంపుదలకు మనోళ్ల సొంత పైసలే.. ఏటా రూ. 2 లక్షల కోట్లు ఖర్చు
ప్రియుడు లేడని ప్రియురాలు ఆత్మహత్య
హైదరాబాద్: ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు… పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతడు లేని జీవితం వృధా అనుకొని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పంజాబ్కు చెందిన నేహా(19) అనే యువతి నానక్రాంగూడలోని ఓ బేకరీలో సేల్స్ గర్ల్గా పని చేస్తూ గోపన్పల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో హాస్టల్లో ఉంటుంది. బాలాపూర్కు చెందిన సల్మాన్ అనే యువకుడు […]
ఎలిమినేషన్పై మొదటిసారి స్పందించిన రతిక.. వాళ్లు అన్యాయం చేశారని సీరియస్
నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్బాస్ సీజన్-7లో పాల్గొన్న కంటెస్టెంట్లలో రతిక ఒకరు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
వరస సెలవులు.. స్కూళ్లకు సెలవులే సెలవులు
వరస పండగలతో విద్యార్థులకు సెలవులు ఎక్కువగా వస్తున్నాయి, దసరా, క్రిస్మస్ సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూమరాలజీ: అపరిచితులను నమ్మవద్దు..!
న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి ఈ రోజుఎక్కువ సమయం కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి వెచ్చిస్తాను. ఏదైనా రాజకీయ కర్తవ్యం ఆగిపోతే ఈరోజే పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19 , 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఈసారి మీరు రాజకీయ నాయకుడి సహాయంతో ఇరుక్కున్న వ్యక్తిగత పనిని పరిష్కరించుకోవచ్చు. మీ ఫిట్నెస్ కోసం మీరు పడే శ్రమ ఫలిస్తుంది. సొసైటీకి సంబంధించిన ఏ విషయంలోనైనా మీ ప్రతిపాదన కీలకం అవుతుంది. మీ పనిలో చాలా ఆటంకాలకు మీ నిర్లక్ష్యం, సోమరితనం కారణం అవుతుంది. మీరు ఈ దుర్గుణాలను ఆపినట్లయితే, మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. తప్పుడు వాదనలకు దూరంగా ఉండటం మంచిది. కార్యాలయంలో మీ ఉనికి , ఏకాగ్రత అవసరం. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 , 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఇంట్లో దగ్గరి బంధువు ఉండటం వల్ల వినోదం , ఉత్సాహం వాతావరణం ఏర్పడుతుంది. ఏదైనా మతపరమైన ప్రణాళికను కూడా పూర్తి చేయవచ్చు. యువత తమ ప్రతిభను గుర్తిస్తారు. పూర్తి శక్తితో మీ భవిష్యత్తు పనులపై దృష్టి పెట్టండి. అపరిచితులను నమ్మవద్దు. మీ సాధారణ స్వభావాన్ని కొంతమంది వ్యక్తులు ఉపయోగించుకోగలరని కూడా గుర్తుంచుకోండి. తదుపరి చర్చ కోసం మీరు మంచి అవకాశాన్ని కోల్పోవచ్చు. కార్యాలయంలో ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ సమస్యలను పరిష్కరించడంలో మీ జీవిత భాగస్వామి, కుటుంబం పూర్తిగా పాల్గొంటారు. వేడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఈరోజు ఎక్కువ సమయం కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి వెచ్చిస్తాను. ఏదైనా రాజకీయ కర్తవ్యం ఆగిపోతే ఈరోజే పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. సమయం అనుకూలంగా ఉంది. పిల్లలతో కొంత సమయం గడపడం వల్ల వారిలో మనోధైర్యం పెరుగుతుంది. కొన్ని ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఖండించగలరు. చింతించకండి, మీకు హాని జరగదు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మరింత జాగ్రత్త అవసరం. వ్యాపార వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంట్లో ఏదో ఒక విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 , 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు) తొందరపడకుండా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. ఇతరుల తప్పులను క్షమించండి. సంబంధాన్ని మధురంగా ఉంచడానికి మీరు ప్రత్యేక ప్రయత్నం చేస్తారు. తొందరపాటు , అజాగ్రత్త మీ చర్యలను మరింత దిగజార్చవచ్చు. సహనం , శాంతిని కాపాడుకోండి. పిల్లలను విపరీతంగా రాకింగ్ చేయడం వల్ల ఇంటి పరిస్థితి మరింత దిగజారుతుంది. వారితో స్నేహంగా ఉండండి. ఆస్తి క్రయ, విక్రయాలకు సంబంధించిన ముఖ్యమైన లావాదేవీలపై ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య శృంగార సంబంధాలు ఏర్పడతాయి. గ్యాస్ , మలబద్ధకం నుండి ఉపశమనానికి మీ ఆహారాన్ని నిర్వహించండి. సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఆధ్యాత్మికతకు సంబంధించిన అద్భుతమైన సమాచారం అందుతుందని, అది మీ వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రభావవంతమైన వ్యక్తులను సందర్శించడానికి, సామాజిక క్రియాశీలతను పెంచడానికి తగిన సమయం కూడా ఖర్చు చేయబడుతుంది. ఎప్పటికప్పుడు ప్రవర్తన మార్చుకోవడం అవసరం. వ్యక్తిగత సమస్య కారణంగా యువకులు కెరీర్ పనులలో ఇబ్బందులు పడవచ్చు. ఈసారి వ్యాపారం వృద్ధి చెందడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సౌకర్యంగా ఉంటుంది. వివాహం మధురంగా ఉంటుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఈరోజు కొంత ఉపశమనం పొందవచ్చు. సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 , 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు) రోజు బాగా ప్రారంభమవుతుంది. లక్ష్యాన్ని సాధించడంలో దగ్గరి బంధువు కూడా పాల్గొనవచ్చు. మీ కర్మ ప్రధానం మాత్రమే మీ విధిని రూపొందిస్తుంది. విద్యార్థులకు సైన్స్ రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిగత పనుల్లో చాలా బిజీగా ఉండడం వల్ల కుటుంబంపై దృష్టి పెట్టలేరు. పిల్లల సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలి. ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త హడావిడిగా ఉంటాయి. వ్యాపార రంగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కుటుంబ జీవితంలో ఎలాంటి అపార్థాలు రానివ్వకండి. గొంతు ఇన్ఫెక్షన్లు , దగ్గు సమస్య కావచ్చు. సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16 , 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు) రోజు సాధారణంగా ఉంటుంది. సమయాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవడానికి కొంచెం శ్రమ పడుతుంది. మీ ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించండి. తోటలు , ప్రకృతిలో కొంత సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో వాతావరణం ఏదో ఒక కారణంగా చెడ్డది కావచ్చు. ఇంట్లో పెద్దల పట్ల సరైన గౌరవం ఉంచండి. యువత తమ లక్ష్యాలను సాధించేందుకు తమ వంతు కృషి చేయగలరు. ఈరోజు వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్య శృంగార సంబంధాలు ఏర్పడతాయి. శారీరక , మానసిక అలసట ప్రబలవచ్చు. సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17 , 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు) బిజీబిజీగా మారిన దినచర్యలో కొంత మెరుగుదల ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో మీ హృదయానికి బదులుగా మీ మనస్సాక్షిని వినండి. మీ పనులు , ప్రయత్నాలు మీకు ప్రతి పనిలో విజయాన్ని అందిస్తాయి. సోదరులతో అనుబంధం మధురంగా ఉంటుంది. ఈ సమయంలో దూరం కాస్త పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. విశ్రాంతి కోసం కుటుంబం , పిల్లలతో కొంత సమయం గడపండి. ఈరోజు ఎలాంటి ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని కాపాడుతూ ఈరోజు మార్కెటింగ్ కార్యకలాపాలలో ఎక్కువ సమయం వెచ్చించండి. హార్మోన్ సంబంధిత సమస్యలు పెరగవచ్చు. సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18 , 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు) కొంత సమయం మీరు సంతోషంగా ఉంటారు ఇది ఒక ఆవిష్కరణ, అది ఈరోజు సాధించవచ్చు. ఆత్మపరిశీలన ద్వారా మీరు మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. అవసరమైనప్పుడు మీరు మీ శ్రేయోభిలాషుల నుండి సరైన సహాయం పొందవచ్చు. రోజు ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ తొందరపాటు , భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. నెరవేరని కల నిరాశ కలిగిస్తుంది. ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల చెడిపోవడం కూడా అధిక ఖర్చులకు దారి తీస్తుంది. వ్యాపార కార్యకలాపాలలో స్వల్ప మందగమనం ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య సమన్వయం లోపిస్తుంది. స్త్రీలు కీళ్ల నొప్పుల గురించి ఫిర్యాదు చేయవచ్చు.
ఐఆర్ ఇంత దారుణమా? ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ఇదేనా : భట్టి విక్రమార్క
ఐఆర్ ఇంత దారుణమా? ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ఇదేనా : భట్టి విక్రమార్క
షెడ్యూల్కు ముందు రోజుకో జీవో ఇస్తున్నరు.. ఈసీ అధికారుల భేటీ
షెడ్యూల్కు ముందు రోజుకో జీవో ఇస్తున్నరు.. ఈసీ అధికారుల భేటీ
ఫ్యాన్స్ కు ‘సలార్’డబుల్ ట్రీట్ ?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్ రిలీజ్ డేట్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్ఫైర్’ డిసెంబర్ 22 వ తేదీకి ఫోస్ట్ ఫోన్ అయ్యింది. ఈ విషయం ప్రకటించిన దగ్గర నుంచి ఈ చిత్రం ప్రమోషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టి మరలింది. సలార్ ట్రైలర్ కోసం వాళ్లు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గమనించిన చిత్ర టీమ్ ... అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నుంచి రెండు ట్రైలర్స్ విడుదల చేయటానికి టీమ్ రెడీ అయ్యింది. అందులో మొదటి ట్రైలర్ ని అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా వదలనున్నారు. అలాగే సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ డేట్ కు దగ్గరలో వదలుతారు. ఈ రెండు ట్రైలర్స్ తో సినిమా క్రేజ్ పీక్స్ కు చేరుతుందని భావిస్తున్నారు. సలార్ ని నిర్మిస్తున్న ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్ KGF, కాంతర లాంటి క్వాలిటీ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది. ప్రమోషన్స్ విషయంలో మొదటి నుంచి చాలా ప్లానింగ్ గా వెళ్తుంది ఈ ప్రొడక్షన్ హౌస్. ఏదైమైనా ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రభాస్ పెద్ద డిజాస్టర్ అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్బుతమైన అవుట్ ఫుట్ తో కేజీఎఫ్ ని మించిన హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీయఫ్ ఫేమ్ యశ్ నటించారట. సినిమా క్లైమాక్స్లో హీరో యశ్తో పాటు ఎన్టీఆర్ సర్ప్రైజ్ చేయనున్నారట. ప్రశాంత్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్తో చేస్తున్నాడు. దేవర షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేస్తాడు. అలాగే యశ్తో కేజీయఫ్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ఈ నేపథ్యంలో వీరిద్దరు సలార్లో గెస్ట్ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఎమ్మెల్సీలే విలన్లు.. వారే వీళ్లకు అడ్డంకి
శాసనసభ వేరు.. శాసనమండలి ప్రత్యేకం. రెండూ చట్ట సభలే. కానీ ఒకటి ప్రజల నేరుగా ఎన్నుకునే సభ మరొకటిది పరోక్షంగా ఎంపిక చేసే సభ
టీడీపీ–జనసేన పొత్తు.. ఆ పార్టీలతోనూ కలిస్తే ఇక తిరుగుండదా?
శ్రీ ఆత్మ సాక్షి సర్వేలో వెల్లడైన అంశాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తుల్లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేస్తే టీడీపీ 86, వైసీపీ 68, జనసేన 6 స్థానాలు గెల్చుకుంటాయి. 15 స్థానాల్లో నువ్వా నేనా అనే పోటీ ఉంటుంది.
ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆప్ ఎంపీ ఇంటిపై దాడులు
ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆప్ ఎంపీ ఇంటిపై దాడులు
ఓఎంఆర్ షీట్ల లెక్క తప్పుతున్నది! .. గ్రూప్ 1లో 258, గ్రూప్ 4లో 963 పెరిగినయ్
ఓఎంఆర్ షీట్ల లెక్క తప్పుతున్నది! .. గ్రూప్ 1లో 258, గ్రూప్ 4లో 963 పెరిగినయ్
నాగ చైతన్య వద్ద సమంత పెట్ డాగ్... కొత్త అనుమానాలకు దారితీసిన వీడియో!
2018లో గ్రాండ్ గా గోవాలో వివాహం చేసుకున్న నాగ చైతన్య-సమంతల వివాహ బంధం నాలుగేళ్లు సవ్యంగా సాగింది. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 2021 అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. అప్పటి నుండి ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతున్నారు. కాగా సమంత వద్ద రెండు పెట్ డాగ్స్ ఉన్నాయి. వాటిలో హ్యాష్ ఒకటి. ఇది నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పటినుండి ఉంది. ఈ క్రమంలో హ్యాష్ తో నాగ చైతన్యకు కూడా అనుబంధ ఉంది. విడిపోయాక హ్యాష్ సమంత వద్దే ఉంటుంది. సమంత ఇంట్లో ఉంటే హ్యాష్ తోనే గడుపుతుంది. అనూహ్యంగా హ్యాష్ నాగ చైతన్య వద్ద ప్రత్యక్షమైంది. దీంతో ఇదేంట్విస్ట్ అని జనాలు అవాక్కయ్యారు. తాజాగా నాగ చైతన్యకుసంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నాగ చైతన్య తన స్టాఫ్ మెంబర్కొన్న కొత్త బైక్ పై ఆటోగ్రాఫ్ చేశాడు. స్టాఫ్ మెంబర్ కోరిక మేరకు ఫస్ట్ రైడ్ కూడా చేశాడు. ఈ వీడియోలో హ్యాష్ కూడా ఉంది. సమంత పెట్ డాగ్ నాగ చైతన్య వద్ద కనిపించడం చర్చకు దారి తీసింది. విడిపోయినప్పటికీ ఇద్దరూ కలుస్తున్నారా? సంబంధాలు కొనసాగుతున్నాయా? అనే సందేహాలు మొదలయ్యాయి. భార్యాభర్తలు విడిపోతే వారికి పిల్లలు ఉంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారు. అయితే ఇంకొకరికి కూడా పిల్లల్ని కలిసే హక్కు కోర్ట్ కల్పిస్తుంది. అలాగే నాగ చైతన్య తమ పెట్ డాగ్ ని అప్పుడప్పుడు కలుస్తున్నాడేమో అనే సందేహం కలుగుతుంది. సమంత అయితే నాగ చైతన్యనుకలవడం, మాట్లాడటం చేయదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె చైతు మీద చాలా కోపంగా ఉంది. పలు సందర్భాల్లో చైతన్య పై తనకున్న ఆవేశాన్ని బయటపెట్టింది. కాబట్టి హ్యాష్ నాగ చైతన్యతో ఉన్నంతమాత్రానాసమంతతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పలేం అంటున్నారు. Pure soul !❤️✨ #NagaChaitanya pic.twitter.com/NU6LK4ui3e — Anchor_Karthik (@Karthikk_7) October 2, 2023
తాజాగా బంగారం, వెండి ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి
తగ్గిన డీజిల్ సేల్స్..పెరిగిన పెట్రోల్ వాడకం
తగ్గిన డీజిల్ సేల్స్..పెరిగిన పెట్రోల్ వాడకం