చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. శనివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష చేదనకు దిగిన గుజరాత్ బ్యాటర్లను అద్భుతమైన బౌలింగ్తో కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు జట్టుకు రెండో విజయాన్ని అందించారు. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(73), జోష్ బట్లర్(26), కగిసో రబాడా(24), రషీద్ ఖాన్(23)లు తప్ప మరెవరూ రాణించక పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 204 పరుగులు చేసింది గుజరాత్.రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టి గుజరాత్ నడ్డీ విరచగా.. తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్, బర్గర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(55), ధ్రువ్ జురెల్(75) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. వైభవ్ సూర్యవంశీ(31) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(2/42) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసుకునే చర్యలు గత వారం ఒక కొలిక్కి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఐదు గంటలకు పైగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించడం, అక్కడ లోకసభలో, రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందడం, ఇక రేపోమాపో రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే చట్టం అయిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ తీర్మానం మీద శాసనసభలో చర్చ జరిగిందనడంకంటే అమరావతి అవసరాన్ని గురించి మాట్లాడుకున్నారని, ఆ మాట్లాడుకున్న విషయాన్ని పార్లమెంటుకు పంపించారని చెప్పుకోవచ్చు. సాంకేతికంగా అమరావతి మీద శాసనసభ ఒక్కటే తీర్మానం చేసినా చెల్లుతుంది. కానీ శాసనమండలికి ఆ తీర్మానాన్ని పంపించి అక్కడ కూడా ఆమోదం పొందకపోవడం పెద్దల సభను అవమానించడమే. బహుశా అక్కడ ప్రతిపక్ష సభ్యులు ఎక్కువమంది ఉన్నారు కాబట్టి అభ్యంతరాలు వస్తాయని, చర్చ జరుగుతుందని అధికారపక్షం ఈ ఆలోచన చేసి ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో సంభాషణ, మరీ ముఖ్యంగా భిన్నాభిప్రాయాల మధ్య సంఘర్షణ చాలా ఆరోగ్యకరమైనది. కానీ అటువంటి ఆరోగ్యకరమైన సంప్రదాయాల్ని రోజురోజుకీ ప్రభుత్వాలు వదిలేస్తున్న విషయం తెలిసిందే. ఏదైతేనేం, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని నిర్ధారించి త్వరలోనే ఆ ప్రాంతానికి కేంద్ర తపాలా శాఖ ఒక పిన్ కోడ్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు రాగానే కూటమి సంబరాలు మిన్నంటాయి. సహజంగానే దేశానికి ఒక రాజధాని ఉన్నట్టే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అప్పుడెప్పుడో విడిపోయిన రాష్ట్రాల విషయం ఏమో కానీ రెండు దశాబ్దాల క్రితం విడిపోయిన మూడు రాష్ట్రాల విషయం తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గఢ్ విడిపోయినప్పుడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎటువంటి వివాదం కానీ, కేంద్ర జోక్యం కానీ అవసరం లేకపోయింది. డెహ్రాడూన్, రాంచి, రాయపూర్ నగరాలను రాజధానులుగా చేసుకుని ఆయా ప్రభుత్వాలు వాటి పనుల్లో పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విడిపోయిన రాష్ట్రం తెలంగాణ కాకుండా మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. రాజధాని ఏర్పాటు కోసం కొన్ని నగరాలు ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిననాటి నుండి, మళ్లీ మాట్లాడితే రాష్ట్రం ఏర్పాటుకు ముందునుండి వేరు తెలంగాణనే కోరుతూ ఇన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా విభజన ముమ్మాటికీ జరగదన్న ధీమాతో హైదరాబాద్ వైపు చూస్తూ ఉండిపోయిన కారణంగానే ఆంధ్రప్రదేశ్ కు ఈ తప్పనిసరి ఇబ్బంది ఎదురైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకునే ప్రాంతాన్ని రాజధాని అంటారు. దానితోపాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేయగలిగిన అనుకూల ప్రాంతం అయితే మరీ మంచిది. పరిపాలన సౌలభ్యం అంటే శాసనసభ సముదాయం, హైకోర్టు, రాజభవన్, సచివాలయం, మంత్రులు, అధికారులు, సిబ్బంది నివాస గృహ సముదాయాలు వంటివి సమకూర్చుకోగలిగితే ఆ సముదాయాల చుట్టూ నగరం విస్తరించడం సహజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన అమరావతి బృహత్ కార్యక్రమం ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నారు? ఒక రాజధాని కావాలా లేక ప్రపంచమంతా కన్నార్పకుండా చూసే ఒక మహానగరం కావాలా? మొదటిది అయితే ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఏర్పడి ఉన్నది. ఇక రెండవది అయితే ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఆయన తరచూ చెప్పే విజన్ 20 47 నాటికి కూడా సాధ్యపడుతుందని చెప్పలేం. మరి దేనికోసం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబునాయుడు, ఆయన కూటమి పార్టీలు ఖర్చు చేయదలుచుకున్నాయి? రాష్ట్రం విడిపోయిన 12 సంవత్సరాలకు ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించుకోవాలన్న ఆలోచన అక్కడి కూటమి ప్రభుత్వానికి రావడానికి కారణాలేమిటి? 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక 29 గ్రామాల రైతుల నుండి సేకరించిన 30 వేల పైచిలుకు ఎకరాల భూమితోబాటు దాదాపు 20వేల ఎకరాల ప్రభుత్వభూమి కలిపి 50 వేల ఎకరాల్లో లక్ష కోట్లో రెండు లక్షల కోట్లో ఖర్చుపెట్టి ఒక మహా నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన.. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అమలుకు నోచుకోకుండా పోయింది. లోటుబడ్జెట్ తో విడిపోయిన రాష్ట్రం, అప్పులతో సతమతమవుతున్న రాష్ట్రం రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు వ్యయం చేయడం తప్పు అన్నది వైఎస్సార్సీపీ వాదన. ఆ పార్టీ అధికారంలో ఉండగా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. చట్టపరమైన సమస్యలు, ఇతర సమస్యల కారణంగా అది అమల్లోకి రాకముందే ఆ పార్టీ పరాజయం పాలైంది. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మూడు పార్టీల కూటమి ఎజెండాలో మళ్లీ అమరావతి రాజధాని చేరింది. విజన్ 2047 అని చంద్రబాబు, మరో 15 ఏళ్లు బాబే ముఖ్యమంత్రి అని కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటించుకోవడం చూశాం. అంత విశ్వాసం ఉన్నప్పుడు మామూలుగా రాజధానిని అభివృద్ధి చేసుకోవచ్చు కదా. చట్టబద్ధత ఎందుకు అవసరం అయింది? మళ్లీ అధికారంలోకి రామేమోనన్న భయం కూటమికి పట్టుకున్నందువల్లనే అమరావతిని మళ్లీ ఎవరొచ్చినా మార్చకుండా ఉండేందుకు ఈ చర్య అన్న చర్చ జరుగుతున్నది. భారత రాజ్యాంగాన్ని మించినది మన దేశానికి ఇంకోటి లేదుకదా. దానినే కొన్ని వందలసార్లు ఈ దేశ అవసరాలకు అనుగుణంగా సవరించుకున్నాం. రేపు ఒకవేళ కూటమి ఆందోళన చెందుతున్నట్టుగానే, 2029లో వైయస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ శాసనసభలో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి పార్లమెంట్ చేత దాన్ని చట్టం చేయించుకోవడం సాధ్యం కాని పని ఏమీ కాదు కదా. అప్పటికి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో? ఒకవేళ బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏనే తిరిగి అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ అవసరం దానికి కలగకుండా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకోవడం, సాధ్యాసాధ్యాల మీద సమాజంలోని భిన్నవర్గాల ముందు చర్చ పెట్టడం, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావడం అనే ప్రజాస్వామిక పద్ధతి అమరావతి విషయంలో కనిపించదు. అమరావతి విషయంలో ఎవరు కొంచెం విమర్శనాత్మకంగా వ్యవహరించినా వాళ్లను ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా చిత్రించేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. ఇదే కూటమిలోని జనసేన, బిజెపి గతంలో అమరావతి రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 50 వేల ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోబోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇంచుమించు ఇదేతరహాలో బిజెపి నాయకురాలు పురందేశ్వరి గతంలో విమర్శించారు. ఎవరు ఏమనుకున్నా అమరావతిలో రాజధానిని శాశ్వతం చేయాలన్న చంద్రబాబునాయుడు కోరిక ప్రస్తుతానికైతే తీరింది. అయితే ప్రతిపక్షాలు.. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తున్న అభ్యంతరాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడుకో, పార్టీగా తెలుగుదేశానికో లేకపోయినా ప్రభుత్వంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గం తప్పనిసరిగా ఈ అభ్యంతరాల పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకపక్క కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే కేంద్రం నుండి నిధులు, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థలనుంచి నిధులు అప్పుగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అప్పులభారంతో కుంగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదనంగా అమరావతి అప్పును ఎలా భరించాలి? అక్కడ నిర్మాణాలకోసం చేస్తున్న వ్యయంలో తీవ్రమైన అవినీతి జరుగుతున్నదనే ఆరోపణకు వివరణ ఏది? దాదాపు పదేళ్లు గడిచిపోయినా ఇప్పటికింకా స్వచ్ఛందంగా లేదా తప్పనిసరి అయి భూములు ఇచ్చిన రైతులకు లబ్ధి చేకూరేది ఎప్పుడు? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రజానీకాన్ని సమాధాన పరచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబునాయుడు మీద తప్పనిసరిగా ఉంటుంది. ఢిల్లీలో నూతన పార్లమెంట్ సెంట్రల్ విస్తా నిర్మాణవ్యయం ఒక చదరపు అడుగు ఐదునుండి పదివేల రూపాయలలోపే ఉండగా అమరావతిలో నిర్మాణాలకు చదరపు అడుగుకు 14 వేల రూపాయల చొప్పున ఖర్చు చేయడాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లకు సమాధానం చెప్పాలి కదా. రాజధాని ప్రాంతాన్ని నిర్ధారించే ముందు దాని చుట్టుపక్కల భూములు రైతులనుండి ఏలినవారికి దగ్గరివాళ్ళు తక్కువ ధరలకు కొనుగోలు చేశారని, దీన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారని లోకసభ సాక్షిగా గత వారం చర్చలో వైఎస్ఆర్ సీపీ పక్షనేత మిథున్ రెడ్డి మరోసారి చేసిన ఆరోపణ మీద నిగ్గు తేల్చాలి కదా. ఇవన్నీ ఎలా ఉన్నా కూటమి నేతలు చెపుతున్నట్టు ఐదుకోట్ల మంది ఆంధ్రులు హారతులు పడుతూ ఉంటే, దేశమంతా జేజేలు పలుకుతుంటే అమరావతి నిర్మాణానికి చట్టబద్ధత కోసం ఎక్కడా లేని విధంగా ఇంత ప్రయాస ఎందుకు? పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్న ప్రశ్నలు మాత్రం పెద్దయెత్తున చర్చలోకి వచ్చాయి. సరే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నట్టుగా అమరావతి హైదరాబాద్ ప్లస్ అవుతుందో, భవిష్య నగరంగా (ఫ్యూచర్ సిటీ) భాసిల్లుతుందో ముందు ముందు తెలుస్తుంది.ప్రఖ్యాత ఉర్దూ సాహిత్యకారుడు సాహిర్ లుధియాన్వి ఒక సినిమా కోసం రాసిన ప్రేమ గీతంలోని ఒక చరణం ‘తసవ్వుర్ మే కోయి బస్తా నహి హమ్ క్యా కరే‘ అని ఉంటుంది. అంటే, ‘ఊహల్లో ఎవరూ నివసించలేరు, ఏం చేస్తాం’ అని అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి జరుగుతున్న వ్యవహారమంతా ఈ చరణాన్ని గుర్తు చేస్తున్నది. పార్లమెంటులో నిర్ణయం జరిగిపోయిందన్న ఆనందంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ‘తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్’ అన్నారు. బ్రెయిన్ చైల్ అంటే ఆయన ఆలోచనలోంచి పుట్టిందని అర్థం. తెలంగాణ ఆయన ఆలోచనల నుంచి ఎలా పుట్టిందో ఆయనే వివరించాలి. అది దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల చరిత్ర అని ఆయనకు తెలియదు. చరిత్ర చదివే అలవాటేలేని రాజకీయవేత్త చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చరిత్ర చదవడం శుద్ధదండగ అన్న మహానుభావుడు. 1978కి ముందువరకు ఆయనకు హైదరాబాద్ అంటే తెలిసి ఉండదు. ఆయన ఎంతసేపూ హైదరాబాద్ నగరం 1982లో తన మామగారు తెలుగుదేశం పార్టీ పెట్టాకనే పుట్టిందని అనుకుంటారు. అంతేకాదు, 2010 హైదరాబాద్ మహానాడులో తెలంగాణవాళ్ళు అర్ధరాత్రి దాటేవరకు తాగి గానాబజానాల్లో తేలుతుంటే, ఎన్టీఆర్ పార్టీ పెట్టి వీళ్లకు క్రమశిక్షణ నేర్పించారని తెలంగాణ సంస్కృతిని ఎద్దేవా చేసిన నాయకుడు బాబు. అమరావతి రాజధానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ బ్రెయిన్ చైల్ వ్యాఖ్యకు కొనసాగింపుగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పుట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాదులో పుట్టింది కాబట్టి అది చంద్రబాబునాయుడు బ్రెయిన్ చైల్ ఎలా అయిందో ఆయనే వివరించాలి. నిజానికి ఆ పార్టీ పుట్టిన నాటికి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. ఆ పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు. తరవాత కాలంలో ఆయననుంచి పార్టీ లాక్కున్నవాడు చంద్రబాబునాయుడు. అయినా చాలావాటిని సొంతం చేసుకున్నట్టు తెలంగాణను కూడా ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. సెల్ ఫోన్లు తనే కనుగొన్నానని, సాఫ్ట్ వేర్ ను తనే కనిపెట్టానని, కరోనా వ్యాక్సిన్ ను తనే తయారు చేశానని, చివరికి వంట గ్యాస్ వాడటం కూడా ప్రజలకు తానే నేర్పించానని ఆయన నమ్ముతూ ఉంటారు. అందరూ అది నమ్మాలని పదేపదే చెప్తూ ఉంటారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజం అవుతుందన్నది గోబెల్స్ సిద్ధాంతం. చేసిన పనులు చెప్పుకోవడానికే చాలామంది తటపటాయిస్తారు. చంద్రబాబుకు తాను చేయనివి కూడా సొంత ఖాతాలో వేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచానికి హైదరాబాద్ బిర్యానీ పరిచయం చేసింది తానేనని ఆయన చెప్పుకుంటే ఆయన శిష్యుడు ఒకరు, సినిమారంగానికి చెందినవాడు, ఈ మధ్య ఒక సినిమాలో ‘హైదరాబాద్ కో క్లింటన్ ఆయా, చంద్రబాబునే పాయా మంగాయా, క్లింటన్ పాయ ఖాయా, ఔర్ హైదరాబాద్ కు సాఫ్ట్ వేర్ ఆయా‘ అంటూ పాడాడు. అంటే, క్లింటన్ కు పాయా తినిపించి చంద్రబాబునాయుడు హైదరాబాద్ కు సాఫ్ట్ వేర్ తీసుకొచ్చాడని చెప్పదలుచుకున్నాడు ఆ వీర బాబు భక్తుడు. ఇలా ఉంటుంది చంద్రబాబును అభిమానించేవాళ్ళు చేసే ప్రచారం. ఫలానా రాజకీయ నాయకుడు స్టేట్స్ మాన్ అని, విజనరీ అని ప్రపంచం మెచ్చుకుంటుంది. చంద్రబాబునాయుడు గారు ప్రపంచం మెచ్చుకునే దాకా ఆగరు. ‘నేను పుస్తకాలు చదవను .. ఎందుకంటే నేను విజనరీ, నేను స్టేట్స్ మన్’ అని పలు సందర్భాలలో చెప్పుకున్న విషయం వీడియోలలో ఉన్నది. హైదరాబాదీలు అత్యంత ఇష్టపడే వంటకం పాయా. ఇంకా నయం, మొగలాయిల నుండి వచ్చిన ఈ వంటకాన్ని కూడా బాబే ప్రపంచానికి పరిచయం చేశాడని చెప్పలేదు. ఇక సాఫ్ట్ వేర్ విషయానికొస్తే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దేశంలో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించారు. అప్పుడు ఆ విషయాలలో ప్రధానమంత్రి సలహాదారుగా ఉండిన సామ్ పిట్రోడాను మర్చిపోవడానికి వీల్లేదు. ఆ సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండిన నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ఒక ఐటీ భవనానికి శంకుస్థాపన చేస్తే తాను ముఖ్యమంత్రి అయ్యాక దానిని ప్రారంభించి ఆ ప్రాంతానికి హైటెక్ సిటీ అనే పేరు పెట్టి చంద్రబాబు నాయుడు తాను ఒక నగరాన్ని నిర్మించానని చెప్పుకుంటుంటారు. అక్కడి పరిస్థితులను బట్టి, అప్పటి అవసరాలను బట్టి, ఆ ప్రాంతాలకు ఉండే సౌకర్యాన్ని బట్టి నగరాలు విస్తరిస్తూ ఉంటాయని, అభివృద్ధి జరుగుతుందని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఆయన అంగీకరించరు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు అదనంగా సైబరాబాద్ అనే మూడో నగరాన్ని తానే నిర్మించానని ఆయన అందరిని నమ్మమంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు 1995 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రధానమైన పరిణామాలు జరిగాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు ఆర్థిక సంస్కరణలు. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రాజీవ్ గాంధీ విత్తనం నాటితే ఆర్థిక సంస్కరణలకు అధ్యులు పీవీ నరసింహారావు, ఆయన వద్ద ఆర్ధికమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్. అటువంటి కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన హయాంలో ఎంతో కొంత ఈ రంగాలకు సంబంధించిన మార్పులు జరిగి ఉంటాయి. వాటిని చంద్రబాబునాయుడు తన ఖాతాలో వేసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అనే ఒక అబ్సెషన్ (తెలుగులో మనోవ్యాధి లేదా యావ అంటారు) వదిలించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆయన తలపెట్టిన అమరావతి రాజధానికి ఏమైనా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే దాదాపు 450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం ఇంకొంత కాలంపోతే అభివృద్ధిలో మరిన్ని అంగలు వేయడం తప్పనిసరి. అమరావతి ఇంకా ఉయ్యాలలో బిడ్డే. అందుకే పోలికలు అనవసరం. పోటీ వ్యర్థం. ఆయన చెప్పేవన్నీ, తాను చేశానని చెప్పుకునేవన్నీ సమకాలికులు ఎవరూ నమ్మరు. బహుశా జెన్ జీ, జెన్ ఆల్ఫా కాలంలో జన్మించిన వాళ్ల కోసం ఇలా చేయని పనులు చేసినట్టు పదేపదే చెప్పుకుంటారేమో. 1997 - 2012 మధ్య, 2010 - 2024 మధ్య పుట్టిన వాళ్లు ఈ జెన్ జీ, జెన్ ఆల్ఫా కోవలోకి వొస్తారు. అయితే అసలేం జరిగిందో చరిత్రకారులు చెప్తారు. చంద్రబాబునాయుడు చెప్పింది వేదం అనుకునే తరాలు కావవి. చరిత్ర చదివి సత్యాసత్యాలను పట్టేస్తాయి.ఇక చివరగా చంద్రబాబునాయుడుకు అత్యంత ప్రియమయిన ఒక అంశం గురించి చెప్పాలి, అదే మీడియా. గత శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అనే తీర్మానాన్ని హర్ష ధ్వానాల మధ్య ఆమోదింపచేసుకున్న ఉత్సాహం వెంట రాగా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ జాతీయ మహాసభలు ప్రారంభించడానికి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ మీడియాగురించి మాట్లాడిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సభల్లో చంద్రబాబు కొన్ని జర్నలిజం పాఠాలు చెప్పారు. ఇవాళ్టి పరిస్థితుల్లో జర్నలిజాన్ని రెండుగా విభజించాలని, ఒకటి వృత్తి నిబద్ధత కలిగిన జర్నలిజం అయితే ఇంకొకటి రాజకీయ ప్రేరేపిత జర్నలిజం అని అన్నారు. ఇదమిత్ధంగా ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే తనను, తన రాజకీయాలను సమర్ధించే మీడియా వృత్తి నిబద్దత కలిగిన మీడియా అని, తన లోపాలను, తన రాజకీయాల్లో, పరిపాలనలో జరిగే తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపే మీడియా రాజకీయ మీడియా అని. తనను విమర్శించే మీడియామీద ముద్రలు వేయడం, వాటి మైండ్ సెట్ మారాలని బహిరంగంగానే బెదిరించడం 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గరనుండే ఆయన మొదలుపెట్టారు. ఆ కాలంలో జర్నలిజం వృత్తిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రిపోర్టర్లు ఎవరిని అడిగినా చెప్తారు.. ఆయన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో జరిగే తప్పులను ఎత్తిచూపి వార్తలు రాసిన విలేకరులు ఎప్పుడో ఒకసారి అయినా ‘మీ మైండ్ సెట్ మారాలి’ అన్న హెచ్చరిక చంద్రబాబునుంచి వినడం గాని లేదా ఆయన యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు ఊడగొట్టుకోవడం కానీ అనుభవం లోకి వచ్చాయో లేదో. Delete Edit
వార ఫలాలు (05-04-2026 నుంచి 11-04-2026 వరకూ)
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈవారం కొన్ని విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ ప్రకారం గా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలు సాగుతాయి. నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి వ్యవహరించండి. సంతాన సంబంధమైన విషయాలలో విద్యా సంబంధమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది. ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం చదవండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. దానివల్ల నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు ఎక్కువగా తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన ఫీజులు లైసెన్సులు కాంట్రాక్టులు లభిస్తాయి. ఈ రాశి వారు దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి. స్టిరాస్తికి సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఈ రాశి వారు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహ రాశి వారికి ఈ ఈవారం చాలా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. గృహ అలంకరణ వస్తువుల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి స్వామి వారికి బుధవారం రోజున గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. రాహుకాల సమయంలో ఎరుపు వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 4 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుండో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. మీరు తీసుకునే స్వంత నిర్ణయాలు లభిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం చాలావరకు లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి అలాగే దుర్గాదేవి స్తోత్రం తప్పనిసరిగా చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సొంతంగా చేసే వ్యాపారాలలో చిన్నపాటి నష్టాలు వస్తాయి. సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. రాశి వారికి కలిసివచ్చి సంఖ్య రెండు. ఏదైనా పని మీద పెట్టబలేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి, కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సినీ కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోతిరిస్తుంది జాగ్రత్త వహించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది అయినప్పటికీ శని బలంగా ఉన్నారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార పరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. ఆరోగ్యపరంగా కూడా చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సమయానికి తగిన నిద్ర ఆహారం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సేవింగ్స్ కి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. దైవ చింతన పెరుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తులను ఏర్పరచుకోగలుగుతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం సంతాన ప్రాప్తి కలుగుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. దూర ప్రాంత వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఫస్ట్ నైట్ రోజే అమ్మాయికి మత్తు మందు ఇచ్చి నలుగురు అత్యాచారం
హైద్రాబాద్ కి చెందిన ఓ హిందు అమ్మాయి వద్దకు షాప్ అద్దెకు కావాలని నవాజ్ అనే వ్యక్తి వచ్చాడు. షాప్ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం హిందు అమ్మాయిని ట్రాప్ చేసి నవ దుర్గా గా పేరు మార్చుకొని హిందువుగా మతంలో కి మారినట్లు చిత్రీకరించి 2025 జూన్ లో వివాహం చేసుకున్నాడు. కూకట్ పల్లి నుంచి పంజాగుట్టకు మకాం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేసాడు. అతని సోదరులు, స్నేహితులైన మున్నవార్, షారుక్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్ లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. అమ్మాయికి కూడా మత్తు మందు ఇచ్చి అందరూ అత్యాచారం చేసారు. పెళ్లి అనంతరం అమ్మాయి కి సంబంధించిన ప్లాట్, బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద లోన్ లు తీయించాడు. ఈ ఘటనపై బాధితురాలు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడని ఫిర్యాదు లో తెలిపింది. దింతో కూకట్ పల్లి పోలీసులు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం, హవాలా డబ్బులు వ్యాపారం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం పై జీరో ఎఫ్ఐఆర్ చేసి పంజాగుట్టకు పంపిస్తున్నట్లు సమాచారం.
మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో డ్రోన్ కలకలం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో ఒక డ్రోన్ కనబడడం సంచలనమైంది. మాల్దా లోని మాలతీపూర్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని గజోల్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కబోతుండగా సమీపం నుంచి ఒక డ్రోన్ అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించింది. దీంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యాయి. తక్షణం దర్యాప్తు ప్రారంభించి ముగ్గురిని అరెస్టు చేశారు. మమత హెలికాప్టర్కు దగ్గర్లో డ్రోన్ కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి ముందు మాల్దాలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రకారం సాగించారు.
4Mn Iran Women Fighters : వీళ్లే వీర వనితలు Andhra Prabha TOP Story
4Mn Iran Women Fighters : వీళ్లే వీర వనితలు Andhra Prabha
ఐపిఎల్ లో అరుదైన రికార్డు.. సెహ్వాగ్, గంభీర్ రికార్డు బ్రేక్
అహ్మదాబాద్: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశ్వీ జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. శనివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న పోరులో వీరిద్దరు రాజస్తాన్ కు శుభారంభాన్ని అందించారు. పవర్ప్లేలో సూర్యవంశీ, వైభవ్ తొలి ఆరు ఓవర్లలో 69 పరుగులు సాధించారు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 500 భాగస్వామ్య పరుగులు (బంతుల వారీగా) సాధించిన భారత జోడీగా వైభవ్ సూర్యవంశీ, యశ్వీ జైస్వాల్ కొత్త రికార్డు సృష్టించారు. ఈ జోడీ కేవలం 248 బంతుల్లోనే ఈ ఘనతను సాధించి, గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ నెలకొల్పిన 309 బంతుల రికార్డును బ్రేక్ చేసింది. ఈ జాబితాలో సూర్యవంశీ, జైస్వాల్ మూడో స్థానంలో ఉన్నారు. అత్యంత వేగంగా 500 భాగస్వామ్య పరుగులు సాధించిన రికార్డు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల పేరిట ఉండగా, 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఓపెనర్లుగా ఆడిన ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్లు రెండో స్థానంలో ఉన్నారు.
దక్షిణాది సీట్లు తగ్గుదాయనడం అసత్యం: ప్రధాని మోడీ
జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో సీట్లు కోల్పోతాయని వస్తున్న వాదనలలో వాస్తవం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. శనివారం కేరళలోని పథనంథిట్ట తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని స్పష్టం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతామనన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. పశ్చిమాసియా అంశంపై భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకురాగలదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారాలకు కొత్త ఊపు ఇస్తుందని చెప్పారు. యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తుందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు.
బాచుపల్లి పోలీసు స్టేషన్ లో పేకాటరాయుళ్లపై కేసు నమోదు
బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ, బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ప్రగతినగర్ లోని ప్లాట్ నెంబర్ 614, ఫ్లాట్ నెంబర్ 302 లో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పేకాట ఆడుతున్న సి. సందీప్ రెడ్డి, ఎం, ప్రశాంత్ రెడ్డి, ఎం. నారాయణరెడ్డి, డి. మహేష్ కుమార్, జి, ఆదిరెడ్డి, జి. మురళిక్రిష్ణలను పట్టుకుని స్టేషన్ కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ. 30, 350 నగదు, ఆరు సెల్ ఫోన్ల సీజ్ చేసి, ఆరుగురు వ్యక్తులపై సెక్షన్ 3, 4 టీఎస్ జీఏ యాక్టు కింద కేసు నమోదు చేసి, ఎస్సై ఎం. సాయి విఘ్నేష్ దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన పేకాటరాయులు రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులని తెలిసింది.
Prabhas’ Fauzi team Issues Strict Warning
Prabhas’ upcoming release will be Fauzi and the shoot of the film is currently in the final stages. Hanu Raghavapudi is the director and Prabhas has ten days of shoot left to complete his portions for Fauzi. A couple of pictures featuring Prabhas are leaked from the sets and they are being circulated on social […] The post Prabhas’ Fauzi team Issues Strict Warning appeared first on Telugu360 .
LIK Trailer: A 2040 Love story
Tamil young actor Pradeep Ranganathan is racing ahead with back-to-back hits. His upcoming film is titled Love Insurance Kompany (LIK). Vignesh Shivan is the director and Nayanthara is the producer. The trailer of the film is out and LIK is a love story set in 2040. The film is a satire on how humans depend […] The post LIK Trailer: A 2040 Love story appeared first on Telugu360 .
Amaravati vs MAVIGUN: Confusion Is Sold as Vision
On the day Parliament cleared Amaravati as the capital of Andhra Pradesh, Y. S. Jagan Mohan Reddy decided it was the perfect moment to introduce a brand new idea. Not with a detailed blueprint, but with a sarcastic smile, a fresh concept with MA-VI-GUN was bought in front of the media. According to him, linking […] The post Amaravati vs MAVIGUN: Confusion Is Sold as Vision appeared first on Telugu360 .
ఎల్డిఎఫ్-బిజెపి-ఆర్ఎస్ఎస్లు ఒక్కటయ్యాయి: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ను అధికారంలోకి రాకుండా చేయాలని.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)తో చేతులు కలిపిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్డీఎఫ్ ఇకపై వామపక్ష కూటమి కాదని..మత హింసను ప్రేరేపించే వారితో జత కట్టిందని రాహుల్ విమర్శించారు. కేరళలోని ఎర్నాకుళంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్ బీజేపీకి ఎప్పటికీ ముప్పు కాలేదని.. కాషాయ పార్టీకి, ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ మాత్రమే సవాలు విసరగలదని అన్నారు. ఈ ఎన్నికలు ఎల్డిఎఫ్, యుడిఎఫ్ల మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో బిజెపి, ఆర్ఎస్ఎస్, ఎల్డిఎఫ్ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని.. ఇది అందరికీ స్పష్టంగా తెలుసు అని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్లు.. మైనారిటీలను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, తనపై 36 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను 55 గంటల పాటు విచారించిందన్నారు.ఇక, శబరిమల ఆలయంలోని బంగారం వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్డిఎఫ్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆలయంలోని బంగారాన్ని ఎల్డిఎఫ్ నాయకులు దొంగిలించారని, దీనిపై మోడీ మౌనం వహించారని ఆయన ఆరోపించారు.
కుప్పకూలిన నాలుగు అంతస్తుల హోటల్.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోట్మా పట్టణంలో శనివారం సాయంత్రం ఓ నాలుగు అంతస్తుల హోటల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు వ్యక్తి మరణించగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హోటల్ ఉన్న స్థలానికి ఆనుకునే నిర్మాణ పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని చెప్పారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట..
విజేతలను అభినందించిన కలెక్టర్…
విజేతలను అభినందించిన కలెక్టర్… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : సీఎం కప్ క్రీడలను
తిర్యాని పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ…
తిర్యాని పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ… అసాంఘిక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించాలిపోలీస్
మైనర్ బాలికపై వేధింపులు… చిట్యాల, ఆంధ్రప్రభ : ఓ మైనర్ బాలికను ప్రేమ
సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్..
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం కారణంగా ఈ సీజన్లోని తొలి రెండు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాడనుకున్న కమిన్స్ ఎంట్రీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే అతను లేకపోవడంతో హైదరాబాద్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కమిన్స్ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. కమిన్స్, గాయం కారణంగా.. యాషెస్ సిరీస్లోని మూడో టెస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్కు కూడా దూరమయ్యాడు. గాయం ఉన్నప్పటికీ, ఐపీఎల్ ప్రారంభానికి ముందు కమిన్స్, హైదరాబాద్ శిబిరంలో చేరి నెట్స్లో చురుకుగా బౌలింగ్ చేశాడు. అయితే, అతను తిరిగి మైదానంలోకి దిగేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీంతో తుది అనుమతి కోసం కమిన్స్ ఇప్పుడు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. సీఏ పర్యవేక్షణలో త్వరలో స్కానింగ్ జరగనుందని.. ఈక్రమంలో ఏప్రిల్ 17 నాటికి హైదరాబాద్ జట్టులో తిరిగి చేరనున్నట్లు సమాచారం. దీంతో కమిన్స్ మరో మూడు మ్యాచ్లకు దూరమవ్వనున్నాడు. అదీ కూడా అతని స్కానింగ్ రిజల్ట్ పై ఆధార పడి ఉంది. కాగా.. ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మూడో మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోర పరాజయం పాలైన హైదరాబాద్, రెండో మ్యాచ్లో పుంజుకుని కోల్కతా నైట్ రైడర్స్పై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కాటమయ్య పండుగకు ముందస్తు ఏర్పాట్లు…
కాటమయ్య పండుగకు ముందస్తు ఏర్పాట్లు… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
అడవి పంది – బైక్ ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు ఉట్నూర్ /జైనూర్,
తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..
తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.. తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణాన్ని అన్ని
సింగరేణిలో సహజ మరణానికి పది లక్షల ఉచిత బీమా పథకం అమలు
సింగరేణి సంస్థలో కార్మికుల సహజ మరణానికి పది లక్షల ఉచిత బీమా పథకం అమలు చేస్తున్నట్లు సంస్థ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండి బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్స్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. 2024 లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు చేసింది.ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా పది లక్షల రూపాయల బీమాను వర్తింపజేసేందుకు నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలలో పది లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే నెలకు కనీసం ఐదు వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవతో ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంకు సహజ మరణానికి పది లక్షల బీమా పథకాన్ని అమలు చేయడంతో దీనిపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. కాగా, సింగరేణి సంస్థలో కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింప జేసే విధంగా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.
కంచెలు తెంచి.. హద్దులు చెరిపి రాయపర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని 52
విద్యార్థులు, సైబర్, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి…
విద్యార్థులు, సైబర్, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి… చిట్యాల, ఆంధ్రప్రభ :
Mahesh and NTR like Adivi Sesh’s Dacoit Trailer
Adivi Sesh, Mrunal Thakur starrer Dacoit has been one of the most anticipated films in recent Indian Cinema. The trailer of the film has been unveiled and it is receiving high praises all around. Superstar Mahesh and Man of Masses Jr. NTR also praised the trailer wishing the team. Mahesh Babu wrote, “From Major to […] The post Mahesh and NTR like Adivi Sesh’s Dacoit Trailer appeared first on Telugu360 .
మల్కాజ్గిరిలో 13మంది సైబర్ నేరస్థుల అరెస్టు
మల్కాజ్గిరి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 13మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేశారు. నిందితులు పెట్టుబడులు, డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని బెదిరించడంతో మల్కాజ్గిరి సైబర్ క్రైం పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. వారి కోసం ప్రత్యేంగా ఏర్పాటు చేసిన టీంలు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ఆపరేషన్లో ఆరు కేసుల్లో 13మందిని అరెస్టు చేశారు. పెట్టుబడుల నేరాలు ఐదు, డిజిటల్ అరెస్టు ఒక కేసులో 13మంది నిందితులుగా ఉన్నారు. సైబర్ క్రైం బాధితులకు మల్కాజ్గిరి పోలీసులు రూ.15,61, 728 రీఫండ్ చేశారు. ప్లస్ గ్లోబల్ పేరుతో నిందితులు బాధితుడితో రూ.2,50,000 పెట్టుబడిపెట్టించి మోసం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఖమ్మం జిల్లాకు చెందిన ఎకే అక్బర్ను అరెస్టు చేశారు. నకిలీ ట్రేడింగ్యాప్తో అధిక లాభాలు వస్తాయని చెప్పి బాధితుడి వద్ద నుంచి రూ.61,90,000 కోట్టేశారు. రూ.9,85,24,793 లాభాలు వచ్చాయని చూపించిన నిందితులు వాటిని విత్డ్రా చేసుకునేందుకు మరింత పెట్టుబడిపెట్టాలని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు మల్కాజ్గిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు మాన్ సింగ్ను అరెస్టు చేశారు. ఇలా వివిధ కేసుల్లో 13మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఆర్టిసి బస్సు ఢీకొని బాలిక మృతి
ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బాలిక మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 5లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బాలిక కీర్తి, సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. ఇద్దరిని బైక్పై వారి తండ్రి తీసుకుని వస్తుండగా రోడ్డు నంబర్ 5వద్ద వేగంగా వచ్చి ఆర్టిసి బస్సు బైక్ను ఢీకొట్టడంతో బాలిక బస్సు కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టిసి బస్సు డ్రైవర్ నిర్లక్షంగా బస్సును నడపడం వల్లే బాలిక మృతిచెందినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలిక తండ్రి, సోదరుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష
12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ :
గుజరాత్తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అహ్మదాబాద్లోన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సీజన్లో తమ గెలుపు ఖాతా తెరవాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్.. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిస్తే.. పాయింట్స్ టేబుల్లో నెం.1 స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కి జిటి జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మాన్ గిల్కు గాయం కావడంతో రషీద్కు తాత్కాలికంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. గిల్ స్థానంలో కుమార్ కుషాగ్రా ఈ మ్యాచ్తో ఐపిఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇక రాజస్థఆన్ ఈ మ్యాచ్లో రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ స్థానంలో తుషార్, బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబెలను జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ. జిటి: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(కెప్టెన్), కగిసో రబాడా, అశోశ్ శర్మ, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.
ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం..
ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం.. తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల
IPL 2026 : ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విక్టరీ
ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విజయం సాధించింది
కుష్టు వ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి
కుష్టు వ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : కుష్టు
బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం…
బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం… ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ చౌటుప్పల్,
కుమ్మేసిన సమీర్ రిజ్వి.. ముంబైపై ఢిల్లీ ఘన విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ జట్టు ఆరంభంలో కాస్త తడబడింది. 7 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాతుమ్ నిస్సాంకాతో కలిసి సమీర్ రిజ్వి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే 44 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్లో నిస్సాంకా ఔట్ అయ్యాడు. అయితే సమీర్ మాత్రం ఏ మాత్రం జోరు తగ్గించలేదు. మైదానంలో పరుగుల వరద పారించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులతో ముంబై బౌలర్లను కుమ్మేశాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్(21) మ్యాచ్ని ఫినిష్ చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో ఢిల్లీ 164 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి…
మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి… పిరికిపందల చర్యగా అభివర్ణించిన అమరం
Jeevan Reddy : జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం సిద్ధమయింది
విజయవంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్…
విజయవంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్… మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని
فیکٹ چیک: انڈونیشیا کے حالیہ زلزلے کے دعوے کے ساتھ وائرل فوٹیج دراصل فلپائن کا ہے
وائرل ویڈیو جسے انڈونیشیا کے حالیہ زلزلے کا بتایا جارہا ہے، گمراہ کن ہے۔ تلگو پوسٹ کی تحقیق سے پتہ چلا کہ یہ فوٹیج 2025 کے فلپائن کے زلزلے کا ہے جسے گمراہ کن دعوے کے ساتھ پھیلایا جارہا ہے۔
బుషిహర్ న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా క్షిపణి దాడి
ఇరాన్ లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రం లక్షంగా క్షిపణి దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) తెలియజేసింది. ఇటీవలి కాలంలో ఇది నాలుగో ఘటన అని పేర్కొంది.ఈ క్షిపణి శకలం తగిలి సిబ్బందిలో ఒకరు చనిపోయారని తెలిపింది. ఆ ప్రాంతం లోని భవనం కూడా దెబ్బతిన్నట్టు వివరించింది. ఈ సంఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రేడియేషన్కు దారి తీయలేదని స్పష్టం చేసింది. ఇరాన్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్ ఇదే కావడం గమనార్హం. తాజా పరిణామాలపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ మరియానో గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా భవనాల్లో కీలకమైన పరికరాలు ఉండే అవకాశం ఉందన్నారు. అణు కేంద్రాల సమీప ప్రాంతాలపై ఎన్నడూ దాడి చేయకూడదన్నారు. అణు ప్రమాదం ముప్పును నివారించేందుకు అత్యంత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అణుభద్రత, రక్షణకు కట్టుబడి ఉండటం అత్యంత ప్రాధాన్య అంశమని ఉద్ఘాటించారు.
తాటి చెట్టు పై నుండి పడి గీతకార్మికునికి గాయాలు
తాటి చెట్టు పై నుండి పడి గీతకార్మికునికి గాయాలు మోత్కూర్, ఆంధ్రప్రభ :
Earth Quake : భూకంపంతో కాబూల్ లో ఎనిమిది మంది మృతి
కాబూల్ పరిసర ప్రాంతంలో సంభవించిన 5.8 తీవ్రత భూకంపంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి, మండలం లోని గూడెం చెక్ పోస్ట్ వద్ద
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో నమ్మకం పెరిగింది
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో నమ్మకం పెరిగింది రాష్ట్ర పోలీసు కంప్లైంట్ అథారిటీ బోర్డ్
పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం
పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం తొర్రూరు, ఆంధ్రప్రభ : జీ
రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి పనులు..
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల అవసరమవుతాయని అధికారులు తెలిపారు. మాస్టర్ప్లాన్ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని... పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని... ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
War Effect : మెడిసిన్స్ పై భారీ ఎఫెక్ట్.. ఈ మందులు పెరగనున్నాయ్
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో మెడిసిన్స్ ధరలు పెంచాయి
1 Dead 5 Injured Us Airstrikes : అమెరికా ప్రతిదాడి Andhra Prabha News
1 Dead 5 Injured Us Airstrikes : అమెరికా ప్రతిదాడి Andhra
Breaking : గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకుల గల్లంతు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలోకి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు
Dacoit: Action Is the Shell, Love Is the Core: Sesh
Adivi Sesh, after delivering a series of blockbusters, is aiming for an even bigger success with his upcoming Pan-India film Dacoit, releasing in theatres on April 10th. In an exclusive interview with us, the actor shared that distributors who watched the movie gave highly positive feedback, even thanking the team for making such a strong […] The post Dacoit: Action Is the Shell, Love Is the Core: Sesh appeared first on Telugu360 .
acoit: Action Is the Shell, Love Is the Core: Sesh
Adivi Sesh, after delivering a series of blockbusters, is aiming for an even bigger success with his upcoming Pan-India film Dacoit, releasing in theatres on April 10th. In an exclusive interview with us, the actor shared that distributors who watched the movie gave highly positive feedback, even thanking the team for making such a strong […] The post acoit: Action Is the Shell, Love Is the Core: Sesh appeared first on Telugu360 .
ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి
ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి పరకాల, ఆంధ్రప్రభ :
రోహిత్ అరుదైన రికార్డు.. ధోనీని దాటేశాడు..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో ఓ సిక్సు బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్పై మొత్తం 51 సిక్సర్లు కొట్టాడు. అయితే ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీ రికార్డును రోహిత్ అధిగమించాడు. ధోనీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 50 సిక్సులు బాదాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో సిక్సుతో ధోనీని రోహిత్ దాటేశాడు. ఇక ఈ విభాగంలో రోహిత్, ధోనీ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ సిఎస్కెపై 48 సిక్సులు కొట్టాడు. ఓవరాల్గా ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్.. పంజాబ్పై 61, కెకెఆర్పై 54 సిక్సులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాడు.
Sai Dharam Tej rejects Dozen Films
Supreme Star Sai Dharam Tej is extra cautious, not in a hurry and is not in a mood to do regular commercial flicks. After the super success of Virupaksha, Sai Dharam Tej is completely focused on Sambarala Yeti Gattu which is in shoot for over a year. He will soon team up with KA directors […] The post Sai Dharam Tej rejects Dozen Films appeared first on Telugu360 .
Women’s Health |ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి…
Women’s Health | ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి… Women’s Health |
జైలర్ 2 సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు వచ్చింది #rajnikanth #jailer2 #telugupost #viralvideo
Hyderabad : రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు.. ఈ మార్గాన వస్తే చిక్కుకుంటారంతే
ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి
ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న
ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు,
ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు, చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో
పూతలపట్టు-చిత్తూరు నేషనల్ హైవేపై అగ్నిప్రమాదం #latestnews #telugupost #fireaccident #apnews
Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో…
Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో… Shivansh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అమరావతిపై కూటమిది ప్రచార ఆర్భాటమే
అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు
తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం.. కేరళలో భట్టి వక్రమార్క
కేరళలో ఎల్డీఎఫ్ పూర్తిగా విఫలమైందని.. పరిపాలన ప్రమాణాలు, మానవీయ విలువలు దిగజారిపోయాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. నిరుద్యోగం పెరిగిపోవడంతో యువత విదేశాలకు వలస వెళ్తుండగా, రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు సరైన సంక్షేమం అందడం లేదని అన్నారు. కేరళం రాష్ట్రంలోని పతనం తిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళంలో గొప్ప మార్పు, మెరుగైన సంక్షేమం, సుపరిపాలన, సెక్యులర్ విలువలను స్థాపించాలంటే ఈనెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేరళం అంటే సెక్యులరిజం, ఉన్నత విద్య, మానవీయ విలువల ప్రతీకగా భావిస్తాం. కానీ ప్రస్తుతం ఆ విలువలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిజం, మార్క్సిజం పేరుతో వచ్చిన ప్రభుత్వం గుండాయిజం వైపు మళ్లిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన, శాంతి, సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఎవరైనా అనుమానం ఉంటే తెలంగాణకు వచ్చి పరిశీలించాలని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు వేల కోట్ల భారం కుటుంబాలపై తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేదలకు రూ.500 గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ నిర్మాణం చేపట్టామని వివరించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం భారీ మొత్తంలో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, విద్య మరియు వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. కేరళంలో యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడితే కాలేజీకి వెళ్లే మహిళలకు నెలకు రూ.1000 ఆర్థిక సహాయం, యువతకు వడ్డీ లేని రుణాలు, సామాజిక పెన్షన్ పెంపు వంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమెన్ చాందీ పేరుతో వృద్ధుల కోసం ప్రత్యేక బీమా పథకం తీసుకువస్తామని తెలిపారు. అలాగే వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేరళం ప్రజలు మార్పు కోసం యుడిఎఫ్కు మద్దతు ఇవ్వాలని భట్టి పిలుపునిచ్చారు.
నిరాహార దీక్ష విరమింపజేసిన డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ..
నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి….
సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం;; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర ప్రజా సంఘ నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ధర్మవరం […] The post మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి…. appeared first on Visalaandhra .
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కూల్చివేతలపై ఉద్రిక్తత #telugupost #secunderabad #mondamarket
రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది…
ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) విశాలాంధ్ర నందిగామ:-ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశీలనకు వచ్చిన ఆయన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంతో హుందాతనంతో రాజధాని విషయంలో మాట్లాడాల్సి ఉందని అటువంటి సమయంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి […] The post రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది… appeared first on Visalaandhra .
రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్పస్కోర్కే పరిమితమైన ముంబై
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన ముంబై జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. 3వ ఓవర్లోనే ముఖేష్ కుమార్ రికెల్టన్(9), తిలక్ వర్మ(0)లను పెవిలియన్ పంపించాడు. ఈ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్తో కలిసి రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యం జత చేశాడు. వీరిద్దరు కలిసి 53 పరుగుల స్కోర్ని జోడించారు. అయితే ఈ భాగస్వామ్యానికి అక్షర్ బ్రేక్ వేశాడు. అక్షర్ బౌలింగ్లో రోహిత్(35) ఔట్ అయ్యాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నమన్ ధిర్ 28 పరుగులు చేసి ఫర్వాలేదు అనిపించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్లో ముఖేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్, విప్రాజ్, నటరాజన్ తలో వికెట్ తీశారు.
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలని, ఆన్లైన్ పేరుతో పాఠ్యపుస్తకాలు అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లకు ఎర్ర లేపుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అడ్మిషన్లు చేపడుతున్నారని వారు మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల […] The post ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి appeared first on Visalaandhra .
స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం..
ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; స్వర్ణ గ్రామం నిర్మాణం ఆం ఆత్మీ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సంద స్థానిక ప్రణాళికల అమలులో పంచాయితీ రాజ్ పాత్ర విశిష్టమైనది అన్నారు,ధర్మవరం నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ గ్రామాల్లో తాగునీరు,రహదారులు, వీధిలైట్లు,డ్రైనేజీ , పరిసరాల పరిశుభ్రత వంటి కనీస సదుపాయాల ఏర్పాటు చేయడం లో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం, ఇంకా గత వైసిపిప్రభుత్వాలు విఫలం అయ్యాయి అన్నారు. ఈ […] The post స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం.. appeared first on Visalaandhra .
ఇంటెన్స్, బోల్డ్గా ‘డెకాయిట్’ ట్రైలర్
హైదరాబాద్: విభిన్నమైన విలక్షణమైన సినిమాలు చేయడంలో నటుడు అడివి శేష్ ఎప్పుడు ముందుంటాడు. ఆయన సినిమాలు అంటేనే.. ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుంది. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇంటెన్స్, బోల్డ్గా ఉంది. అడివిశేష్, మృణాల్ నటన ఆకట్టుకునేలా ఉంది. హరి, జూలియట్ పాత్రల్లో వారిద్దరూ ఒదిగిపోయారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలవడం గర్వించదగ్గ విషయం..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం రూరల్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచులు గా ఉంటూ, ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్లు పార్టీగా అండగా నిలవడం గర్వించదగ్గ విషయము అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సభను వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడిలు భరించి కష్టపడి పని చేశారని మీ నిబృ దత్తత మరువలేమని రాబోయే రోజుల్లో పార్టీలో […] The post ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలవడం గర్వించదగ్గ విషయం.. appeared first on Visalaandhra .
భౌతిక శాస్త్ర విభాగంలో విద్యార్థులకు అవగాహన
భౌతిక శాస్త్ర విభాగంలో విద్యార్థులకు అవగాహన పరకాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ డిగ్రీ
Chelli Swapna |సీరియల్ నటి చెల్లి స్వప్న సంచలన వ్యాఖ్యలు..
Chelli Swapna | సీరియల్ నటి చెల్లి స్వప్న సంచలన వ్యాఖ్యలు.. Chelli
అత్యాధునిక ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)’ ప్రారంభం…
అత్యాధునిక ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)’ ప్రారంభం… మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రాణాపాయ
చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సర్పంచ్ పదవి ముగీయడంతో సర్పంచు బసమ్మ, ఉప సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు మంజునాథ్, హరిజన మరియమ్మ, తెలుగు రమేష్, చాకలి ఈరమ్మ, మాల శివ, మంగలి నర్సమ్మలను శనివారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు సిద్దప్ప ధని, వీరేష్ గౌడ్ లు ఘనంగా […] The post చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం appeared first on Visalaandhra .
Fire Accident | 8 ఆటోలు దగ్ధం Fire Accident | ఆంధ్రప్రభ,
వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…
విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు […] The post వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి… appeared first on Visalaandhra .
పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు…
విశాలాంధ్ర నందిగామ : కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తెలుగుదేశం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లేపల్లి మధుబాబు పేర్కొన్నారు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో శనివారం జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కి సంబంధించిన ఈ కేవైసీ కార్యక్రమం మరియు పంపిణీ కార్యక్రమంలో స్థానిక అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు జలక్ ఇచ్చారు స్థానిక వైసీపీ నాయకులు జిల్లేపల్లి రాముతో కలిసి వారు ఈ కార్యక్రమాలను కొనసాగించడం పై […] The post పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు… appeared first on Visalaandhra .
Young directors picking NBK among Veterans
Nandamuri Balakrishna has delivered decent films post-pandemic. He is also in his best phase in his career. Several young and talented directors are keen to work with NBK. Tollywood was surprised to know that young director Vivek Athreya is directing NBK Soon. Vivek Athreya has delivered unique content and his collaboration with NBK is a […] The post Young directors picking NBK among Veterans appeared first on Telugu360 .
కళాశాల పని వేళల పునరుద్ధరణకు అధ్యాపకులు డిఐఈఓ కు వినతి పత్రం
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్సు కలిసి డి ఐ ఈ ఓ కు కళాశాల పనివేళ పునరుద్ధనకు సంబంధించినటువంటి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కళాశాల యొక్క సమయం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పని వేళలు పెట్టడం వలన విద్యార్థులు మరియు సిబ్బందికి అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయని వారు […] The post కళాశాల పని వేళల పునరుద్ధరణకు అధ్యాపకులు డిఐఈఓ కు వినతి పత్రం appeared first on Visalaandhra .
ప్రత్యేక అధికారులుగా నియామకాలు
విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ రెండవ తేదీతో ముగియడంతో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం పూర్తి అయినది. దీంతో ప్రభుత్వ జీవో నెంబర్ 47 ప్రకారం ఏప్రిల్ మూడవ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులకు బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. పంచాయితీ ఎన్నికలు జరిగే వరకూ స్పెషల్ ఆఫీసర్లుగా మీరు కొనసాగిస్తారు. ఇందులో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వర్తిస్తున్న ఎం […] The post ప్రత్యేక అధికారులుగా నియామకాలు appeared first on Visalaandhra .
Mega Hero |సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు..
Mega Hero | సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు.. Mega Hero
ప్రజల చిరకాల కోరిక సాకారం చేసిన ఎమ్మెల్యే…
ప్రజల చిరకాల కోరిక సాకారం చేసిన ఎమ్మెల్యే… గన్నవరం – ఆంధ్రప్రభ :
Smart phone |లైకులు లక్షల్లో… విలువలు మైనస్లో?
Smart phone | లైకులు లక్షల్లో… విలువలు మైనస్లో? Smart phone |
Telangana |సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్
Telangana | సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్ Telangana |
Tragic Incident |కరెంట్ షాక్తో…
Tragic Incident | కరెంట్ షాక్తో… Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్
రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది
యువర్స్ ఫౌండేషన్ ప్రతినిధులువిశాలాంధ్ర -ధర్మవరం; ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది అని యువర్స్ ఫౌండేషన్ సభ్యులు సత్రశాల మల్లికార్జున, గర్రె రమేష్ బాబు, రామచంద్రగుప్త తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 350 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గురువారం దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం […] The post రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది appeared first on Visalaandhra .
ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ద్వజస్తంభ ప్రతిష్ఠాపన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర
ISI | నలుగురి అరెస్ట్ ISI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

27 C