SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

18aprilchintana |ధర్మం ఎందుకు క్షీణిస్తోంది?

18aprilchintana | ధర్మం ఎందుకు క్షీణిస్తోంది? 18aprilchintana | కలియుగ లక్షణాలు మరియు

ప్రభ న్యూస్ 18 Apr 2026 8:29 am

Revanth Reddy : బిల్లుల వీగిపోవడంపై రేవంత్ ఏమన్నారంటే?

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వీగిపోయిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్‌ చేశారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:28 am

Exclusive: Ajay Bhupathi to work with Koratala Siva

Ram Gopal Varma’s protege Ajay Bhupathi made an impressive debut with RX 100. His second film Maha Samudram was a disaster and he bounced back with Mangalavaaram. The film’s technical aspects were well appreciated and he is currently busy with Srinivasa Mangapuram which introduces Ghattamaneni youngster Jaya Krishna to Telugu cinema. The film releases in […] The post Exclusive: Ajay Bhupathi to work with Koratala Siva appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 8:26 am

Union Cabinet : నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం

నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:02 am

IPL 2026 : కోల్ కతా కు సుడి లేదు... గుజరాత్ ను లక్కు వదలలేదు

గుజరాత్ టైటాన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 7:52 am

అత్త పక్కనే పడుకున్న చిరుత.... కాపాడిన కోడలు

బెంగళూరు: చిరుత పులి బారి నుంచి అత్తను కోడలు కాపాడిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు నగరంలో జరిగింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... రాచనగరి మైసూరు నగరంలోని సిద్ధార్థనగర్‌లో సుజాత అనే మహిళ తన భర్త, అత్త శైలజతో కలిసి ఉంటుంది. అత్త పడుకున్న రూమ్‌లో కోడలు వెళ్లింది. మంచం కింద చిరుత పులిని గమనించి అత్తను చాకచక్యంగా బయటకు తీసుకొచ్చింది. అనంతరం ఆ రూమ్ గడియ వేసి పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. సుజాత సమయస్ఫూర్తిని స్థానికులు, అటవీ శాఖ అధికారులు ప్రశంసించారు. చిరుత పులి చూసిన కూడా ప్రాణ భయం లేకుండా అత్తను కాపాడిన కోడలు ధైర్య సహసాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.   

మన తెలంగాణ 18 Apr 2026 7:50 am

Strait of Hormuz : ఆంక్షలు కొనసాగితే.. మళ్లీ హోర్ముజ్ జలసంధి మూసేస్తామన్న ఇరాన్

హోర్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకలకు పూర్తిగా తిరిగి తెరిచినట్టు ఇరాన్ ప్రకటించింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 7:33 am

కూతురి అశ్లీల వీడియోలు క్రియేట్ చేసి తండ్రికి పంపిన సైబర్ నేరగాళ్లు

 హైదరాబాద్‌: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరగాళ్ల వికృత చేష్టలకు పాల్పడ్డారు. కూతురు పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె తండ్రికి సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియోలు పంపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచవానిసింగారం ప్రాంతంలో నివాసం ఉండే వ్యక్తి(50)కి తన కూతురి పేరిట నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించి సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియోలు పంపారు. ఆ వీడియోలను బంధువులకు కూడా పంపిస్తామని బెదిరిస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 18 Apr 2026 7:32 am

Strait of Hormuz : హార్ముజ్ జలసంధి తెరుచుకున్నా… పెట్రోల్ ధరలు వెంటనే తగ్గవట

హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోవడతో చమురు ధరలు తగ్గాయి

తెలుగు పోస్ట్ 18 Apr 2026 7:16 am

బిల్లు అడ్డుకుని సంబరాలా?

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్, అలా గే ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయ ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. నియోజకవర్గాల పు నర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ వల్ల ప్రతి నియోజకవర్గంలో ఓ టర్ల సంఖ్యను సమతుల్యం చేయవచ్చని, ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో సుమారు 40 లక్షల వరకు ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నా రు. మహిళా కోటా చట్ట సవరణకు సంబంధించిన మూడు బిల్లులు, అలాగే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అంశంపై లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలను డీలిమిటేషన్ నుండి దూరం పెట్టిందని, ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ చర్చను ఎవరైనా జాగ్రత్తగా వింటే, మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఎవరూ ప్రత్యక్షంగా మాట్లాడలేదని అర్థమవుతుంది. అందరూ ‘మేము స్వాగతిస్తున్నాం’ అని చెప్పారు. కానీ ఇండి యా కూటమికి చెందిన సభ్యులంతా వాస్తవానికి మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిలిచారు అని అమిత్ షా అన్నారు. ఈ చర్చలో రెండు రోజులపాటు సుమారు 130 మంది ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం నిర్దిష్ట వ్యవధుల్లో డీలిమిటేషన్ నిర్వహించాల్సి న బాధ్యత ఉందని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్యను పెంచే నిబంధనలు కూడా అందులో భాగమని ఆయన వివరించారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకించేవారు, వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపును కూడా వ్యతిరేకిస్తున్నట్టే అంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ వెనుక దాగి ఉన్న ఉద్దేశాలపై ప్రతిపక్షం చేసి న ఆరోపణలకు అమిత్ షా ఘాటుగా ప్రతిస్పందించారు.డీలిమిటేషన్ ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించడంపై సభలో పలువురు సభ్యు లు సందేహాలు వ్యక్తం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపా రు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం 2026 తర్వాత జరగనున్న జనగణన అనంతరం జరిగే డీలిమిటేషన్‌లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు. 1971లో ఇందిరా గాంధీ ప్రభు త్వం సీట్ల సంఖ్యను నిలిపివేసింది (ఫ్రీజ్ చేసింది). ఆ ఫ్రీజ్‌ను ఎత్తివేస్తేనే ‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలులోకి వస్తుంది. అందుకే మేము ఈ చర్యలు చేపట్టాం అని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న 127 నియోజకవర్గాలు ఉ న్నాయని, ఇది ‘ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ’ అనే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధమని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో 45 లక్షల మంది ఓటర్లకు ఒకే ప్రతినిధి ఉంటే, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానం గా ఉండడం లేదు అని వివరించారు. మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా కుల గణనను ఆలస్యం చేయాలనే ఉద్దేశం ఉందన్న ప్రతిపక్ష ఆరోపణలను అమిత్ షా ఖండించారు. 2025లో కేంద్ర కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కుల గణన నిర్వహించాలనే నిర్ణ యం తీసుకున్నారు. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తే, లోక్‌సభ సీట్లను రాష్ట్రాల వారీగా 50 శాతం పెంచే అధికారిక సవరణను తీసుకువస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ప్రతిపక్షం మద్ద తు లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందదు. కానీ దేశ మహిళలు ఎవరు అడ్డంకిగా నిలుస్తున్నారో గమనిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చర్చలో ఉన్న మూడు బిల్లులు.. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో ఉన్న సభ్యులలో రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుత బలం ప్రకారం, ఎన్డీయేకు ఈ బిల్లును ఆమోదింపజేసేందుకు తగిన సంఖ్య లేదు.

మన తెలంగాణ 18 Apr 2026 6:40 am

దేశ రాజకీయ ముఖచిత్రం మార్చే కుట్ర

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ముఖచిత్రాన్ని మా ర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాల కిందికే వస్తుంద ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోటా చట్టానికి ప్రతిపాదిత సవరణలపై చర్చలో శుక్రవారం రాహుల్ గాంధీ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు , మహిళ కోటాకు లింక్ పెట్టడం కేవలం బి జెపి ప్రభుత్వం రాజకీయ లబ్థికి దిగడమే అని రా హుల్ తెలిపారు. ఎన్నికల ముఖచిత్రం మార్చడం ద్వారా రాజకీయ స్వరూపం తమ చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోవడమే ఈ ప్రభుత్వ ఆలోచన అని విమర్శించారు. కేంద్రం అత్యంత దుర్మార్గంగా డి లిమిటేషన్ ద్వారా దక్షిణాది, ఈశాన్య, చిన్న రా ష్ట్రాల సభా ప్రాతినిధ్యాలను దెబ్బతీస్తోంది. ఇది పూ ర్తి స్థాయిలో జరుగుతున్న దేశ వ్యతిరేక చర్య అని తెలిపారు. దేశంలోని మహిళల కొంగుచాటున సా గుతూ దేశ ఎన్నికల ముఖచిత్రం మార్చేందుకు ఈ మాయోపాయానికి దిగిందని విమర్శించారు. ఇ ప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చింది మహిళా బిల్లు కాదని, ఇందులో మహిళా సాధికారికత విషయం ఏదీ లేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆమోదం పొంది ఉన్న 2023 మహిళా చట్టం అమలులోకి తీసుకురావచ్చు. ఇందుకు ప్రతిపక్షాలు అన్ని సహకరిస్తా యి. కాలాయాపన కూడా ఉండదన్నారు. ఈ ప్ర భుత్వానికి వెనుకబడిన వర్గాలకు , ఆదివాసీలకు ఇతర అణగారిన వర్గాలకు అధికారంలో సరైన ప్రా తినిధ్యం కల్పించే ఆలోచన లేదని, ఇందుకు ఈ విధమైన నానా దారులు వెతుక్కుంటోందని విమర్శించారు. కులగణనను నామమాత్రం చేస్తున్నా రు. వచ్చే 15 సంవత్సరాల వరకూ దీని వల్ల ఎటువంటి ప్రాతినిధ్యానికి వీలు ఉండదని తెలిపారు. ప్రధాని మోడీ పెద్ద జాదూగర్: రాహుల్ బిజెపి నిరసనలు ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు అని, బాలాకోట్ , పెద్ద నోట్ల రద్దు, తరువాత ఆపరేషన్ సిందూర్ ఇ వన్నీ ఆయన తంత్రాలని లోక్‌సభలో మహిళా బి ల్లు చర్చ సందర్భంగా రాహుల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బిజెపి సభ్యులు అడ్డుతగిలారు. ప్రధా ని మోడీపై రాహుల్ అనుచిత పదజాలాలకు దిగారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజి జూ మండిపడ్డారు. పైగా రాహుల్ మరోసారి దేశ సైనిక బలగాలను కించపర్చే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయాలని రక్షణ మంత్రి రాజ్‌నా థ్ సింగ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశా రు. దీనితో స్పీకర్ రాహుల్‌ను ఉద్ధేశించి సరిగ్గా మా ట్లాడాలని, విషయానికి పరిమితం కావల్సి ఉందని స్పష్టం చేశారు. తప్పుడు పదజాలాలను అనుమతించేది లేదన్నారు. ప్రధాని మోడీ, నేను భార్య బాదరబందీ లేనోళ్లమే రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు భార్య బాదరబందీ లేదన్నారు. అం దరికీ జీవితంలో మహిళల నుంచి ఏదో ఒక పాఠం అబ్బుతుంది. తనకు సోద రి తల్లి నుంచి ఆత్మీయత దక్కుతుంది. ఇదే విధం గా ప్రధాని మోడీకి కూడా ఇదే స్పందన ఉంది. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మం త్రి కిరెణ్ రిజిజూ సభలో మాట్లాడుతూ కేంద్ర న్యా యశాఖ మంత్రి అర్జున్ రామ్ తన భార్య గురించి కవిత చెప్పారని, అప్పటి నుంచి రాహుల్‌కు ఇంట్లో తిట్లు పడి ఉంటాయని నవ్వుతూ వ్యాఖ్యానించా రు. దీనిపై రాహుల్ స్పందిస్తూ అవును తనకు మోడీజి మాదిరిగానే ఈ అనుభూతి లేదు ఏం చేద్దామని చమత్కరించారు.

మన తెలంగాణ 18 Apr 2026 6:20 am

నారీ.. మరో సారీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రత్యేక సమావేశాలలో అత్యంత కీలకమైన మహిళా బిల్లుకు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీనితో చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోటా అమలు మరోసారి తీరని కల, కల్ల అయింది. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్య ఎన్‌డిఎ ప్రభుత్వ కీలక విధాన నిర్ణయానికి చట్టసభలో ఎదురుదెబ్బ కలకలానికి దారితీసింది. 2029 నుంచి మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా , ప్రత్యేక సమావేశాల ద్వారా తీసుకువచ్చిన సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిం ది. బిల్లుపై ఓటింగ్ జరగగా అనుకూలంగా 298 మం ది ఓటు వేశారు. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడ ంతో మూడింట రెండొంతుల మెజార్టీని ఎన్‌డిఎ సాధించలేకపోయింది. మొత్తం 528 మంది ఎంపిలు పాల్గొన గా, మెజార్టీ సంఖ్య 352 మద్దతును ప్రభుత్వం కూడగట్టుకులేకపోయింది. ఓటింగ్‌లో సవరణల బిల్లు నెగ్గలేదని, ఓడిపోయిందని స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ తరువాత ప్రకటించారు. ఓటింగ్ సమయంలో సభలో ప్ర ధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూ డా ఉన్నారు. ఈ కీలక బిల్లు వీగిపోవడంతో దీనికి అ నుబంధంగా వచ్చిన డిలిమిటేషన్ బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణల బిల్లు 2026ను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్య వహారాల మంత్రి కిరణ్ రిజిజూ ప్రకటించారు. ఈబిల్లులను వెనకకు తీసుకుంటున్న విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు తెలియచేశా రు. దీనితో మూడు రోజుల పాటు సాగాల్సిన అంతకు ముందటి ఆర్బాటపు ప్రకటనల ప్రత్యేక సెషన్ రెండోరోజే ముగింపు దశకు చేరింది. చట్టసభలలో మహిళల కు 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే 33 శాతం కో టా అమలును 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన చే పట్టేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చారు. ఇదే క్రమంలో ఈ కోటా అమలుకు వీలుగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ఇప్పుడున్న 543 నుంచి 850కు పెంచేందుకు, తద్వారా మహిళల కోటాను ఈ క్రమం లో 272కు పెంచేందుకు ఉద్ధేశించారు. ఇదే క్రమంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలో కూడా 33శాతం కోటాకు చర్యలు తీసుకోవాలని సంకల్పించారు. అయితే ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గకపోవడంతో ఇవన్నీ ప్రస్తుతానికి అటకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి అయింది. బిల్లు వీగిపోయిన ప్రకటన తరువాత స్పీకర్ ఓం బిర్లా సభను శనివారానికి వాయి దా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అత్యంత దుర్దినం, నారీ శక్తి వెలుగుకు చీకటి అమామాస్య అంటూ లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోయిన తరువాత అధికార ఎన్‌డిఎ ఎంపిలు నిరసన వ్యక్తం చేశారు. మహిళా శక్తి బలోపేతం కావడం ఇష్టం లేని ప్రతిపక్షాలు ఇప్పుడు చారిత్రక ద్రోహానికి పాల్పడ్డాయని బిజెపి, మిత్రపక్షాలకు చెందిన మహిళా ఎంపిలు పార్లమెంట్ ఆవరణలో నినాదాలతో ప్రదర్శనగా సాగారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలకు దిగారు. ఏండ్ల తరబడి మహిళా సాధికారికత ప్రత్యేకించి చట్టసభలలో ఎండమావి అవుతూ వచ్చింది. ఈ అడ్డంకులను అధిగమించేందుకు మోడీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన రాజ్యాంగ కట్టుబాట్లకు దిగిందని ప్రతిపక్ష ఎంపిలు మీడియాతో చెప్పారు. ప్రతిపక్షాలకు దేశంలో మహిళా రాజకీయ సాధికారికత ఇష్టం లేదని, వారు ఎప్పుడూ వెనుకబడే ఉండాలని కోరుకుంటారని , ఇప్పుడు కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదంటూనే ఈ బిల్లు ఓడేలా చేశారని విమర్శించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే వెన్నుపోటు, అంతకు మించిన మహిళా ద్రోహం అయిందని మండిపడ్డారు. తమ నిరసనలు ఇక దేశవ్యాప్తంగా సాగుతాయని, ప్రతిపక్షాల మహిళా విద్వేషకర ధోరణిని ఎండగడుతామని ప్రకటించారు. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ మాట్లాడుతూ ప్రతిపక్షాలు దేశ మహిళలను గౌరవించే చారిత్రక అవకాశం పోగొట్టుకున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మహిళల హక్కులు పొందేందుకు నిరంతర పోరు సాగిస్తుందని ప్రకటించారు. చట్టసబలలో మహిళలకు రిజర్వేషన్ల కోటా అమలు వరకూ తాము విశ్రాంతి తీసుకునేది లేదన్నారు. మహిళా కోటా ఇప్పుడు అమలు చేసినా మద్దతిస్తాం: రాహుల్ గాంధీ చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల పేరిట తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఒక రకంగా రాజ్యాంగపై దాడి అని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆ బిల్లును ఓడించామన్నారు. మహిళలకు కోటా కల్పించడం దీని లక్షం కాదని, వారి పేరు మీద దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే కుట్ర అని మండిపడ్డారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీకి మళ్లీ చెబుతున్నా...2023 మహిళా బిల్లును అమలు చేయండి. మేం తప్పకుండా సహకరిస్తాం. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహి బిల్లు కాదు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఏకపక్షంగా మార్చే కుట్ర. అందుకే అడ్డుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఆమోదించిన మహిళ రిజర్వేషన్ బిల్లును ఈ రోజు నుంచి అమలు చేసినా తాము సంపూర్ణంగా మద్దతు పలుకుతామన్నారు. అందుకు యావత్ ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉందన్నారు. బిల్లు వీగిపోయిన తరువాత హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, సమాజ్‌వాది పార్టీలు ప్రదర్శించిన మొండివైఖరితోనే ఈ బిల్లు నెగ్గలేదని స్పందించారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎంపిలు బయటకు వెళ్లి విజయోత్సవ సభలు చేసుకుంటున్నారని,ఇ ది గర్హనీయం అన్నారు. కాంగ్రెస్, మిత్రపక్షాలు ఇంతకు ముందు కూడా ఈ విధంగా తమ సంకుచిత బుద్థి ప్రదర్శించాయి. వారి వైఖరి ఎప్పుడూ మహిళా ప్రయోజనాల కోణంలో కానీ దేశ హితం పరిధిలో కాని లేదని ఆగ్రహించారు. ఇకపై ప్రతిపక్షాలు 2029లోనే కాకుండా ప్రతి ఎన్నికల్లోనూ మహిళా ఆగ్రహానికి గురి అయ్యి తీరుతారని అమిత్ షా వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 6:00 am

18thApril2026 |శనివారం నేటి పంచాంగం

18thApril2026 | శనివారం నేటి పంచాంగం 18thApril2026 | ఈరోజు పంచాంగం ముఖ్య

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:00 am

నల్ల బిల్లులకు రెడ్‌ఫ్లాగ్

మనతెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన నల్ల బిల్లును ఇండియా కూ టమి చిత్తుగా ఓడించిందని వ్యాఖ్యనించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం పన్నిన డీలిమిటేషన్ కుట్రను ప్రజాస్వామ్య శక్తులు సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక బిల్లు వీగిపోవడం కాదు, సమాఖ్య స్ఫూర్తికి దక్కిన విజయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణల పేరుతో దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీసేందుకు ఏ శక్తులు ప్రయత్నించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వాటిని తిప్పికొడుతుందని ఈ ఓటింగ్ నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 18 Apr 2026 5:30 am

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుకు స్టీరింగ్ కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత ప రిష్కార మార్గాలను అన్వేషించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పనుల స మన్వయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉ న్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీల క నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడు, రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మెంబర్‌లుగా కె.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ (టెక్నికల్), ఎంఎస్‌ఎన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, సిడిఓ, సెల్వ బాలన్, అడిషనల్ డైరెక్టర్, సిడబ్లూపిఆర్‌ఎస్, సాయికృష్ణ, ఎండి, ఎంఎస్ ఆఫ్రి ఇండియా లిమిటెడ్, ఎస్.సురేష్‌కుమార్, జనరల్ మేనేజర్, ఎల్ అండ్ టి, మల్లికార్జున రావు, వైస్ ప్రెసిడెంట్, ఆఫ్రాన్స్, మాధవ్, ప్రాజెక్టు మేనేజర్, నవయుగ, టి.శ్రీనివాసరావు గుప్తా, సీఈ, రామగుండం (మెంబర్ కన్వీనర్‌గా) వ్యవహారించనున్నారు. ఈ కమిటీ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేయడంతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురానుంది. వారానికి రెండుసార్లు సమావేశమై పనుల పురోగతిని ఈ కమిటీ సమీక్షిస్తుంది. ప్రతిరోజూ జరిగే పనులపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 30వ తేదీ లోపు కసరత్తు పూర్తి.. వర్షాకాలం ప్రారంభం కాకముందే కీలకమైన పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. బ్యారేజీల పునాదుల పటిష్టతను తెలుసుకోవడానికి మే 30వ తేదీ లోపు జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, అనుమతుల మేరకు మాత్రమే ఈ మరమ్మతు పనులు సాగనున్నాయి. ముందుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, మేడిగడ్డను పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మెమో నెంబర్ 8141/ప్రాజెక్ట్ IV/A1/2023, తేదీ 13.04.2026 ఇరిగేషన్ సెక్రటరీ ఈ.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మన తెలంగాణ 18 Apr 2026 4:30 am

30లక్షల ఎంటిల బాయిల్డ్ రైస్ సేకరించాలి

మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి పం టకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్ష ల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని వారు కేంద్ర మం త్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్‌లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి జోషిని ఆయన నివాసంలో సిఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బా యిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో  ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటి ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్‌రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటి బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటి రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను.. 201415 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని.. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసిడిఎస్‌ల పరిధిలో పంపిణీ చేసేవారని ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునః ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, సెక్రటరీ కో ఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు

మన తెలంగాణ 18 Apr 2026 4:00 am

స్తంభించిన రిజిస్ట్రేషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. శుక్రవారం ఉద యం నుంచి సెంట్రల్ సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చిన ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వర కు తరబడి వేచిచూశారు. 2002లో ఏర్పా టు చేసిన సర్వర్‌లో కొన్ని రోజులుగా సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతుండడంతో రెం డు, మూడు గంటల పాటు రిజిస్ట్రేషన్‌లకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం శుక్రవా రం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తడంతో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. టెక్నికల్ టీంతో సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి సాయంత్ర 7 గం టల వరకు కృషి చేశారు. ఈ టీంలతో పాటు సబ్ రిజిస్ట్రార్‌లతో ఎప్పటికప్పుడు ఆ శాఖ డిఐజీ సుభాషిణి నిరంతరం సంప్రదింపులు జరిపారు. మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే, 2002లో ఏర్పాటు చేసిన సర్వర్ స్థానంలో కొత్త సర్వర్‌ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో ఆ శాఖ ఉన్నతాధికారులు టెండర్‌లను సైతం పిలిచారు. నాలుగైదు నెలల్లో కొత్త సర్వర్ అనుసంధానం పూర్తయితే మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఈ మధ్యన స్లాట్ బుకింగ్, ఈ సిగ్నచర్‌లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా అమల్లోకి తీసుకురావడంతో సర్వర్‌పై అదనపు భారం పడి అది మొరాయిస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం సర్వర్ కొనుగోలు కోసం సుమారుగా రూ.12 కోట్ల నిధులను సైతం కేటాయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు పూర్తయితే రిజిస్ట్రేషన్‌లకు ఆటంకం ఏర్పడదని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. సర్వర్ మొరాయించడంతో శుక్రవారం బుక్ అయిన స్లాట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను శనివారం చేస్తామని, వీటితో పాటు శనివారం బుక్ చేసుకున్న స్లాట్‌లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లను కూడా ఇదే రోజు పూర్తి చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

మన తెలంగాణ 18 Apr 2026 3:30 am

డిమాండ్ల సాధనకు ఉద్యోగుల ఉద్యమబాట

మనతెలంగాణ/హైదరాబాద్: సమస్యల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కారు. పీఆర్సీతోపాటు పెండింగ్ బకాయిలను, ఈహెచ్‌ఎస్ కార్డులు, సిపిఎస్ రద్దుతోపాటు 60పైచిలుకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మం డల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని అన్ని హెచ్‌ఓడి కార్యాలయాలు, సెక్రటేరియేట్ లలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు నల్లబ్యాడ్జిలు ధరించి ఈ నిరసన కార్యక్ర మం చేపట్టారు. టిజిఈజేఏసీ ఉద్యోగ సంఘా ల చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీ, కో-చైర్మన్స్‌లు చావా రవి, వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్‌కుమార్, ఎం.బి కృష్ణయాదవ్, శ్రీకాంత్, జి.నిర్మల, రమేష్ పాక, గండూరి వెంకట్‌లతో పాటు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్‌లు, సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బకాయిలను విడుదల చేయాలి: జగదీశ్వర్, ఏలూరి 2వ పిఆర్‌సి కమిటీని వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదికను సమర్పించలేదని, పీఆర్సీ నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో జూన్ 2వ తేదీలోపు 2వ పిఆర్‌సిని అమలు చేయాలని టిజిఈజేఏసీ ఉద్యోగ సంఘాల చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 13,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలి: లచ్చిరెడ్డి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని అనంతరం ఉద్యోగులు జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. సిపిఎస్‌ను రద్దు చేయాలి: స్థితప్రజ్ఞ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్‌లు డిమాం డ్ చేశారు. ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,316 మంది సిపిఎస్ ఉద్యోగులు పదవీ విరమణ పొందారని, వారికి కనీస సామాజిక భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందిన సిపీఎస్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ద్వారా నగ దు రహిత వైద్య సౌకర్యాల ను ఎలా వర్తింపజేస్తుందో త క్షణమే స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఆరో గ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద ని వారు గుర్తు చేశారు. 

మన తెలంగాణ 18 Apr 2026 3:00 am

కెపిహెచ్ బీ లో తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు

కెపిహెచ్ బీ పోలీస్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబర్ 734 దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జెఎన్టీయూ నుంచి కూకట్ పల్లి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లో మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో బస్సు పూర్తిగా తగలపడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 18 Apr 2026 12:25 am

శనివారం రాశి ఫలాలు (18-04-2026)

మేషం నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిధునం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటకం వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. కన్య ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి , ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తుల కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ధనస్సు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. మకరం వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. కుంభం ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.  

మన తెలంగాణ 18 Apr 2026 12:10 am

గుజరాత్ ఉత్కంఠ విజయం

 ఐపిఎల్‌లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. కోల్‌కతాకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్ 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేసి గుజరాత్‌ను గెలిపించాడు.

మన తెలంగాణ 17 Apr 2026 11:57 pm

కెటిఆర్ పాదయాత్ర ఇప్పుడెందుకు?

పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను కలవని వారికి ఇప్పు డు ఒక్కసారిగా జ్ఞానోదయమై పాదయాత్రలు గుర్తొచ్చాయా..? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉం డి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు. హరీష్‌రావుది అంతా కుట్ర రాజకీయం అని, ఆయనను తాను ఎప్పటికీ నమ్మను అని పేర్కొన్నారు. పార్టీ లో గ్రూప్ రాజకీయాలు పెంచి పోషించిందే హరీష్‌రావు అని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, కొం దరు మాజీ ఎంఎల్‌ఎలు తనను కలిసి లోగుట్టు విప్పారని చెప్పారు. జాగృతి కార్యాలయంలో శుక్రవారం సిపియుఎస్‌ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రా ష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు కవితను కలిసి తమ మద్దతు తెలిపారు. అనంతరం కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు అధికారం దక్కాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ కనీసం గ్రామ వార్డు పదవి కూడా పొందని కులా లు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భౌగోళిక తె లంగాణ సాధించుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ మాత్రం తెచ్చుకోలేకపోయామని అన్నారు. ఉద్యమ సమయంలోనే ఈ అంశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ప్రస్తావించిన విషయాన్ని కవిత గుర్తు చేసుకున్నారు. భారత్‌కు స్వాతంత్రం వచ్చిన సమయంలో నూ గాంధీ, అంబేడ్కర్ ముందు కూడా ఇదే సమస్య వ చ్చిందని. భారత కుల వ్యవస్థలో ఈ అంశం నిరంత రం మన ముందుంటుందని జయశంకర్ సార్ అన్నారని చెప్పారు. ముందు మనం భౌగోళిక తెలంగాణ సా ధించుకొని ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ ఎన్నో కులాలు అధికారానికి దూరంగా ఉ న్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు అధికారం కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. కులాలు బలంగా ఉన్నప్పుడే వారికి రా జకీయ అధికారం దక్కుతుందని బలంగా నమ్మిన వ్య క్తి మారోజు వీరన్న అని కవిత చెప్పారు. రాష్ట్రంలో కు ల సంఘాలకు కర్త, కర్మ, క్రియ ఆయనే అని గుర్తు చే శారు. కులాల అస్తిత్వాన్ని, విప్లవ ఉద్యమాలకు జత చే సి సామాజిక న్యాయం కోసం వీరన్న కృషి చేశారని పే ర్కొన్నారు. ఆయన మన ముందు పెట్టిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మోసం ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచిస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో కి వచ్చిన ఆరు నెలల్లో పిఆర్‌సి అమలు చేస్తామని న మ్మబలికి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని మండిపడ్డా రు. ఎన్నికల హామీలైన సిపిఎస్ రద్దు, పాత పెన్షన్‌స్కీం పునరుద్ధరణను గాలికి వదిలేసి కాంగ్రెస్ తన నైజాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. మధ్యాహ్న భోజ న సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నిరసనకు జాగృతి తరఫున మద్దతు ప్రకటించారు. 

మన తెలంగాణ 17 Apr 2026 11:17 pm

రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ మళ్లీ ఏకగ్రీవ ఎన్నిక

నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ శుక్రవారం రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి తరఫున సభా నాయకుడు జె.పీ. నడ్డా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఎస్. ఫాంగ్నోన్ కొన్యాక్ మద్దతు ఇవ్వగా, వాయిస్ ఓట్ ద్వారా అది ఆమోదం పొందింది. హరివంశ్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మొత్తం ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం, హరివంశ్ గారు రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రకటిస్తున్నాను అని సభాపతి సి.పి. రాధాకృష్ణన్ వెల్లడించారు. తదుపరి, సభా నాయకుడు నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే హరివంశ్‌ను ఉపాధ్యక్షుని స్థానానికి తీసుకెళ్లాలని సభాపతి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో వారు ఆయనను ప్రతిపక్ష నాయకుడి పక్కన ఉన్న ఉపాధ్యక్షుని సీటుకు తీసుకెళ్లారు. హరివంశ్ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియడంతో రాజ్యసభ ఉపాధ్యక్షుని పదవి ఖాళీగా మారింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను మళ్లీ రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. హరివంశ్ ఎన్నికపై ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఇది అనుభవానికి ఇచ్చిన గౌరవం, ఆయన సహజమైన పని విధానానికి గుర్తింపు అని మోదీ పేర్కొన్నారు. హరివంశ్ గారి నాయకత్వంలో సభ కార్యకలాపాల సామర్థ్యం పెరిగిన విధాన్ని మనందరం గమనించాం. ఆయన కేవలం సభను నడిపించడం మాత్రమే కాకుండా, తన జీవిత అనుభవాలను ఉపయోగించి సభను మరింత సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నారు అని ప్రధాని అన్నారు. మూడోసారి ఈ పదవికి ఎన్నిక కావడం ద్వారా సభకు ఆయనపై ఉన్న నమ్మకం, ఆయన అనుభవం ఎంత గొప్పదో స్పష్టమవుతుందని మోదీ పేర్కొన్నారు. నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఒక నామినేటెడ్ సభ్యుడు ఈ పదవికి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. హరివంశ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ఉపాధ్యక్షుడు ప్రతిపక్షానికి తగిన సమయం కేటాయించి వారి అభిప్రాయాలను వినేలా చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన మూడో పదవీకాలంలో హరివంశ్ ప్రతిపక్షానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. లోక్‌సభలో ఉప సభాపతి పదవి 2019 నుంచి ఖాళీగా ఉండటం రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమని ఖర్గే వ్యాఖ్యానిస్తూ ఆ విషయం తనను బాధించిందన్నారు. ఇక హరివంశ్ ఎన్నిక సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలు నిరసనగా వాక్‌అవుట్ చేశాయి. హరివంశ్‌కు మద్దతుగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ మద్దతు తెలిపారు. మరో తీర్మానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా, బీజేపీ ఎంపీ సురేంద్ర సింగ్ నగర్ మద్దతు ఇచ్చారు. జేడీయూ ఎంపీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా ప్రవేశపెట్టిన మరో తీర్మానానికి ఆర్‌ఎల్‌ఎం ఎంపీ ఉపేంద్ర కుశ్వాహా మద్దతు తెలిపారు. అలాగే ఆర్‌ఎల్‌డీ ఎంపీ, కేంద్ర మంత్రి జయంత్ చౌధరి ఇచ్చిన నోటీసుకు శివసేన ఎంపీ మిలింద్ ముర్లీ దేవోరా మద్దతు తెలుపుతూ హరివంశ్ ఎన్నికకు మద్దతు ప్రకటించారు.

మన తెలంగాణ 17 Apr 2026 10:30 pm

ఆసియా కుబేరుడిగా గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం, అదానీ నికర ఆస్తి విలువ 92.6 బిలియన్ డాలర్లు (రూ.8.59 లక్షల కోట్లు) గా నమోదైంది. గతంలో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రస్తుతం 90.8 బిలియన్ డాలర్ల (రూ.8.42 లక్షల కోట్లు) నికర విలువతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. అదానీ గ్రూప్ షేర్ల విలువ పెరగడంతో గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది 8.1 బిలియన్ డాలర్లు (రూ.75,110 కోట్లు) పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే ఆయన ఆస్తి రూ.33,010 కోట్లు పెరిగింది. మరోవైపు, రిలయన్స్ షేర్ల విలువ తగ్గడం వల్ల అంబానీ సంపద ఈ ఏడాది రూ. 1.57 లక్షల కోట్ల మేరకు క్షీణించింది. అంతర్జాతీయంగా చూస్తే 656 బిలియన్ డాలర్ల ఆస్తితో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 

మన తెలంగాణ 17 Apr 2026 10:04 pm

మహిళా కోటా ఇప్పుడు అమలు చేసినా మద్దతిస్తాం: రాహుల్ గాంధీ

 చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల పేరిట తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఒక రకంగా రాజ్యాంగపై దాడి అని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆ బిల్లును ఓడించామన్నారు. మహిళలకు కోటా కల్పించడం దీని లక్షం కాదని, వారి పేరు మీద దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే కుట్ర అని మండిపడ్డారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీకి మళ్లీ చెబుతున్నా...2023 మహిళా బిల్లును అమలు చేయండి. మేం తప్పకుండా సహకరిస్తాం. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహి బిల్లు కాదు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఏకపక్షంగా మార్చే కుట్ర. అందుకే అడ్డుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఆమోదించిన మహిళ రిజర్వేషన్ బిల్లును ఈ రోజు నుంచి అమలు చేసినా తాము సంపూర్ణంగా మద్దతు పలుకుతామన్నారు. అందుకు యావత్ ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉందన్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 9:57 pm

గుజరాత్ టైటాన్స్‌ టార్గెట్ 181

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో180 పరుగులకు ఆలౌటైంది. కామోరూన్ గ్రీన్ 79: (55 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్స్ లు ) కష్టాల్లో పడిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అర్ధ శతకంతో ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కగిసో రభడ 3, సిరాజ్ 2, అశోక్ శర్మ 2, రషీద్ ఖాన్,ప్రసిద్ధ్ క్రిష్ణ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 17 Apr 2026 9:53 pm

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. శుక్రవారంనాడు హజారీబాగ్ జిల్లాలోని బటుకా ప్రాంతంలోని కెరెదారి పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, పోలీసులకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం కూంబింగ్‌కు వెళ్లిన మావోయిస్టులు తారసపడడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మృతి చెందిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు నేత సహదేవ్ మహతో, రంజిత్ గంజూ, బుదన్ కర్మాలి, ఉన్నారు.  

మన తెలంగాణ 17 Apr 2026 9:30 pm

లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి

లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పదిరోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. దీనితో ఇంతకాలం పరస్పర దాడులతో సాగుతూ వచ్చిన నరమేథం నుంచి బీరూట్ ఇతర ప్రాంతాలు విముక్తం అయ్యాయి. ప్రజలు తమ స్వస్థలాలకు, నివాసాలకు తిరిగి వెళ్లుతున్నారు. కాగా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ సేనలకు, ఇరాన్ బలగాలకు మధ్య కూడా కాల్పుల విరమణ, తద్వారా హర్మూజ్ పునరుద్ధరణ, ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి శాంతికి అనువైన వాతావరణంపై ఆశలు తలెత్తాయి. లెబనాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన తాత్కాలిక సంధి ప్రక్రియలో హెజ్‌బోల్లా మిలిటెంట్లను కూడా చేర్చేంచేందుకు దౌత్యం సాగుతోంది. ఇప్పుడు ప్రత్యేకించి హర్మూజ్ మార్గంలో శాంతి స్థాపన, నౌకారవాణా సజావుగా సాగే దిశలో యూరప్ దేశాల నేతలు చర్చలకు సిద్ధం అవుతున్నారు. కాగా ఇంతకు ముందు నిలిచిపోయిన చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి స్థాపనకు పాకిస్థాన్ తిరిగి తన దౌత్య యత్నాలు ముమ్మరం చేసింది. 

మన తెలంగాణ 17 Apr 2026 9:20 pm

Unanimous Rejection for Ustaad Bhagat Singh on OTT

Ustaad Bhagat Singh is one of the biggest debacles of Telugu cinema in this year and it is the biggest flop in Pawan Kalyan’s career. Apart from criticism, the entire team was badly trolled and the makers lost big money. Ustaad Bhagat Singh is now streaming on Netflix since yesterday. Usually after the release of […] The post Unanimous Rejection for Ustaad Bhagat Singh on OTT appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 9:17 pm

రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9మంది మృతి

కర్నాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. శుక్రవారంనాడు సుర్పూర్ తాలుకాలోని శాంతపుర క్రాస్ వద్ద దుర్ఘటన జరిగింది. కారు, ఓ ప్రైవేటు బస్సు పరస్పరం ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కృష్ణనాయక్(52) ఆయన భార్య అనంతకళ(45)తో పాటు కుమారుడు, కోడలు, మనవలు, మనవరాళ్లు మొత్తం 9మంది మృత్యువాతపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. దుర్ఘటన నుంచి 10 సంవత్సరాల బాలుడు విరాట్ గాయాలతో బయటపడ్డాడు. కారు రన్నింగ్‌లో ఉండగా టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుర్ఘటన సమయంలో కారులో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. 

మన తెలంగాణ 17 Apr 2026 9:10 pm

Major Setback for Centre as Women’s Reservation-Linked Delimitation Bill Fails in Lok Sabha

In a significant political development, the Central government faced a major setback in Parliament today. A crucial Constitutional Amendment Bill linked to women’s reservation and Lok Sabha delimitation failed to secure approval in the Lok Sabha. The bill required a two-thirds majority to pass. However, the NDA government fell short during voting. The proposal could […] The post Major Setback for Centre as Women’s Reservation-Linked Delimitation Bill Fails in Lok Sabha appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 9:02 pm

సోనియా గాంధీని బలిదేవత అనలేదా ?: బండి సంజయ్

ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ చేసిన వల్లే తెలంగాణలో వెయ్యి మంది బలయ్యారని, ఆమె బలిదేవత అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లోగడ విమర్శించలేదా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడలేదా? అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మీరు మంత్రులుగా ఎలా కొనసాగుతున్నారని ఆయన బిజెపిని విమర్శిస్తున్న రాష్ట్ర మంత్రులనుద్ధేశించి ప్రశ్నించారు. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి యూ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులుగా పోల్చుతూ బిజెపి ఎంపీ తేజస్వీ దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే వివాదం చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల తప్పిదాలవల్లే లక్షల మంది చనిపోయింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 2009లో తెలంగాణ ప్రకటించి కాంగ్రెస్ యూ-టర్న్ తీసుకోవడం వల్లే 1400 మంది యువకులు బలిదానమైంది నిజం కాదా? అని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంతో తమ పార్టీకి క్రెడిట్ వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ డ్రామాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు.కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు ఫోన్లో మాట్లాడుకునే ఈ కుట్రలకు తెరదీశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలెవరూ మోసపోవద్దని కోరుతున్నానని, రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటి నుండి చిత్తశుద్ధితో పని చేసింది తమ పార్టీయేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడితే బిఆర్‌ఎస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు చత్తీష్‌ఘడ్, జార్ఝండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింద్న వాస్తవాలను ప్రజలకు చెబితే మీకు ఎందుకు అక్కసు అని ఆయన ప్రశ్నించారు.

మన తెలంగాణ 17 Apr 2026 9:00 pm

Satya’s Jetlee Locks Its Release Date

Satya has teamed up once again with director Ritesh Rana, reviving their successful collaboration for Jetlee, a film that leans heavily into offbeat humor and action-packed storytelling. Known for their distinctive style from the Mathu Vadalara series, the duo appears ready to deliver another entertaining ride filled with quirky moments and unexpected twists. Promotions for […] The post Satya’s Jetlee Locks Its Release Date appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 8:57 pm

రాహుల్‌పై కేసు నమోదు చేయండి: అలహాబాద్ హైకోర్టు

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారంనాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.రాహుల్ గాంధీ భారత్‌తో పాటు బ్రిటీష్ పౌరసత్వం కూడా కలిగి ఉన్నారని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన ఎస్.విఘ్నేష్ శిశిర్ అనే బిజెపి కార్యకర్త అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. లోతైన విచారణ అవసరమని పేర్కొంటూ రాయ్‌బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సుభాశ్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పౌరసత్వానికి సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు తీర్పునిస్తూ ఈ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా విచారణ చేపట్టాలని లేదా కేంద్ర సంస్థకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మన తెలంగాణ 17 Apr 2026 8:45 pm

ఈనెల 20న కాళేశ్వరానికి సిఎం రేవంత్‌రెడ్డి

ఈనెల 20వ తేదీన కాళేశ్వరం బ్యారేజీలను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలిస్తారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్డీఎస్‌ఏ అధికారులతో కాశేశ్వరం గురించి చర్చించామని ఆయన చెప్పారు. కాళేశ్వరం మరమ్మతులో అంతర్జాతీయ సంస్థ ఆఫ్రీ భాగస్వామ్యం ఉందన్నారు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. కాళేశ్వరం బిఆర్‌ఎస్ కట్టిందని వారి హయాంలోనే కూలిపోయిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వానికి దురుద్దేశం లేదన్నారు. ఎన్డీఎస్‌ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తామని ఉత్తమ్ చెప్పారు.

మన తెలంగాణ 17 Apr 2026 8:40 pm

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరయ్ ఘాట్ రోడ్డులో దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వేగంగా వెళ్లి లోయలో పడిపోయింది. పైనుంచి కిందపడడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. వ్యానులో ఉన్న పది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  

మన తెలంగాణ 17 Apr 2026 8:32 pm

పేద విద్యార్థినులకు లాప్‌టాప్‌ల పంపిణీ చేసిన కెటిఆర్

పేద విద్యార్థినుల విద్యా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న ‘టచ్ ఏ లైఫ్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేద విద్యార్థులకు లాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. శుక్రవారం నందినగర్‌లోని నివాసంలో మాజీ కార్పొరేటర్ సామల హేమ సారధ్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా విద్యార్థినులతో కలిసి కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. స్వయం సమృద్ధి సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని సూచించారు. ఈ సందర్బంగా కెటిఆర్ పంపిణీ చేసిన లాప్‌టాప్‌లను అందుకున్న నామాల రేష్మ, సలికంటి శ్రీవాణి, చింతగుట్ట వేదశ్రీ, ధుళ్ల రాజేశ్వరి, అతికా బారి, సనా సుల్తానా, కర్రె ఆర్తి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫౌండేషన్ చేస్తున్న కృషిని కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా మాట్లాడుతూ, తెలంగాణవ్యాప్తంగా బస్తీలు, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులను గుర్తించి, వారికి స్కాలర్‌షిప్‌లు, మెంటార్‌షిప్, నిరంతర మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే తమ లక్ష్యమని వివరించారు.

మన తెలంగాణ 17 Apr 2026 8:30 pm

మహిళా రిజర్వేషన్ల అంశంలో బహిర్గతమైన బీజేపీ కపట నీతి : మంత్రి సీతక్క

‘లక్ష్యం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలు కూడా మంచివే కావాలని’ మహాత్మా గాంధీజీ చెప్పిన ఆలోచన ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మార్గదర్శకం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం జరిగిన పరిణామాలు బీజేపీ కపట నీతిని బహిర్గతం చేశాయని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళల సాధికారతపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, సింపుల్ మెజారిటీతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కావాలని డీ లిమిటేషన్ అంశాన్ని జోడించి బిల్లును సంక్లిష్టం చేశారని ఆరోపించారు. ఇది మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాదని, రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల దృష్టి కోణంతోనే ఈ బిల్లును ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం మీలో కనిపిస్తోందని మంత్రి విమర్శించారు. బిజెపి భావజాలమే మహిళా వ్యతిరేకమైనదని ఆమె విమర్శిస్తూ లోక్‌సభ సాక్షిగా బీజేపీకి మహిళా రిజర్వేషన్లపై నిజమైన నిబద్ధత లేదనే విషయం నిరూపితమైందని వెల్లడించారు. ఇది ప్రజాస్వామ్యానికి, మహిళల హక్కులకు మద్దతుగా నిలిచిన విజయంగా మంత్రి అభివర్ణించారు. ఈ దేశానికి మహిళా ప్రధానిని, మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్యా ఉపాధి అవకాశాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. మహిళల సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా, తక్షణమే అమలు చేయాలని తాము మరోసారి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

మన తెలంగాణ 17 Apr 2026 8:20 pm

లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యంగ సవరణ బిల్లు

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డిఎ సర్కార్‌కి షాక్ తగిలింది. సర్కార్ ప్రవేశపెట్టిన 131వ రాజ్యంగ సవరణ బిల్లు కూడా మెజారిటీ సాధించలేకపోయింది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. అయితే ఎన్డిఎ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. మొత్తం 489 మంది సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. బిల్లు ఆమోదానికి 326 కావాల్సి ఉంది. అయితే బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓవర్లు వచ్చాయి. దీంతో బిల్లు వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై 528 సభ్యులు ఓటు వేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయినందున మిగితా రెండు బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అనంతరం లోక్‌సభ వాయిదా పడింది.

మన తెలంగాణ 17 Apr 2026 7:56 pm

ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు: రాహుల్ గాంధీ

ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు అని, బాలాకోట్ , పెద్ద నోట్ల రద్దు, తరువాత ఆపరేషన్ సిందూర్ ఇవన్నీ ఆయన తంత్రాలని లోక్‌సభలో మహిళా బిల్లు చర్చ సందర్భంగా రాహుల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బిజెపి సభ్యులు అడ్డుతగిలారు. ప్రధాని మోడీపై రాహుల్ అనుచిత పదజాలాలకు దిగారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ మండిపడ్డారు. పైగా రాహుల్ మరోసారి దేశ సైనిక బలగాలను కించపర్చే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. దీనితో స్పీకర్ రాహుల్‌ను ఉద్ధేశించి సరిగ్గా మాట్లాడాలని, విషయానికి పరిమితం కావల్సి ఉందని స్పష్టం చేశారు. తప్పుడు పదజాలాలను అనుమతించేది లేదన్నారు. దీని తరువాత రాహుల్ గాంధీ తాను వాడిని ఇంద్రజాలికుడు పదం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన దేశంలోని సైనిక దళాలను తాను కించపర్చడం లేదని, బిజపి వారే ఈ విధంగా చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా రాహుల్ పదేపదే అంతా 16 అంకెలో దాగి ఉందని వ్యాఖ్యానించారు. గురువారం ప్రధాని మోడీ తమ ప్రసంగం దశలో నీరసంగా కన్పించారు. ఎందుకు అని ఆరాతీశానని , వెంటనే 16వతేదీ గుర్తుకు వచ్చింది. 16 కిటుకు వేరే కూడా ఉందని రాహుల్ తెలిపారు.ఈ దశలో ఆయన ఈ ప్రభుత్వం 16 మంది టిడిపి ఎంపిల మద్దతుపై ఆదారపడి పనిచేస్తున్న విషయం పరోక్షంగా ప్రస్తావించినట్లు వెల్లడైంది. రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు భార్య బాదరబందీ లేదన్నారు. అందరికీ జీవితంలో మహిళల నుంచి ఏదో ఒక పాఠం అబ్బుతుంది. తనకు సోదరి తల్లి నుంచి ఆత్మీయత దక్కుతుంది. ఇదే విధంగా ప్రధాని మోడీకి కూడా ఇదే స్పందన ఉంది. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ సభలో మాట్లాడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ తన భార్య గురించి కవిత చెప్పారని, అప్పటి నుంచి రాహుల్‌కు ఇంట్లో తిట్లు పడి ఉంటాయని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ అవును తనకు మోడీజి మాదిరిగానే ఈ అనుభూతి లేదు ఏం చేద్దామని చమత్కరించారు. 

మన తెలంగాణ 17 Apr 2026 7:56 pm

Nagabandham’s Sura Promo: Visually Stunning

The Secret Treasure, directed by Abhishek Nama and starring Virat Karrna, is shaping up as a grand blend of mythology and action mounted on an impressive scale. The makers have now unveiled the promo of the film’s second single, Sura Sura, which is set for release on the 19th of this month. Going by the […] The post Nagabandham’s Sura Promo: Visually Stunning appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 7:52 pm

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని నిందితులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6.09 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...మురళీ అనే వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి కొండాపూర్, మాదవహిల్ స్ట్రీట్ ప్రాంతంలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేస్తున్న వికాస్, భరత్ చౌదరి డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇద్దరు నిందితులను గతకొంత కాలం నుంచి ఇంటీరియర్ డిజైన్ పేరుతో లగ్జరీ కార్లలో తిరుగుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. నిందితులపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది వికాస్ ,భరత్ చౌదరి డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్ గ్రాముకు రూ.5,000 చొప్పున విక్రయిస్తున్నారు. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మురళీ, మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం ముగ్గురిని కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. సిఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది నిందితులను పట్టుకున్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 7:50 pm

Jai Bhim Combo Back on Cards

Jai Bhim has been a memorable film in the career of Suriya. The film had a direct digital release on OTT due to the ongoing coronavirus pandemic. The latest news is that Jai Bhim combo is back on cards. TJ Gnanavel will soon direct Suriya in one more film and it is said to be […] The post Jai Bhim Combo Back on Cards appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 7:49 pm

Big Breaking : ఎన్డీఏకు షాక్.. వీగిపోయిన బిల్లులు

లోక్ సభలో చారిత్రాత్మిక బిల్లులపై ఓటింగ్ జరిగింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 7:36 pm

ఎంఎల్ఎ మల్‌రెడ్డి రంగారెడ్డి పారిపోయాడు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

బహిరంగ చర్చకు రాకుండా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పారిపోయాడని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం యాచారం మండలంలోని మేడిపల్లిలో ఉదయం 10 గంటలకు పార్మాసిటీ భూములపై అవకతవకలు జరిగాయని చెప్పిన మల్‌రెడ్డి రంగారెడ్డి దమ్ము, ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడని మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం రోజు క్రితం మేడిపల్లిలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం 9 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలోనే పోలీసులతో హౌస్ అరెస్టు చేసి బంధించారని గుర్తుచేశారు. పార్టీ కార్యాలయంలో మల్‌రెడ్డి రంగారెడ్డిపై వ్యతిరేకంగా నినాదాలు, సాగర్ రోడ్డుపై బైటాయింపు, మల్‌రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్మాసిటీపై ఇప్పటికైనా తప్పు తనదేనని ఒప్పుకోవాలని సవాల్ చేశారు. తప్పుడు మాటలు చెప్తూ ఎమ్మెల్యే కాలం వెళ్లదీస్తునారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండున్నరేండ్లలో కేవలం రూ.220 కోట్లు నిధులు తీసుకరావడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అనంతరం క్యామ మల్లేష్, ఎస్‌వీ రమణారెడ్డిలు మాట్లాడుతూ.. గతంలో మూడు సార్లు కిషన్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలైన మల్‌రెడ్డి రంగారెడ్డి తప్పుడు మాటలు మానుకొని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దండెం రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రవీణ్, గూడూరి యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, జెర్కోని రాజు, నిట్టు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 7:33 pm

100%grant |మంత్రి లోకేష్‌కు నర్సెస్ అసోసియేషన్ వినతి

100%grant | మంత్రి లోకేష్‌కు నర్సెస్ అసోసియేషన్ వినతి 100%grant | సమస్యల

ప్రభ న్యూస్ 17 Apr 2026 7:23 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెకెఆర్

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో కెకెఆర్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో అయినా నెగ్గి గెలుపు ఖాతా తెరవాలని కెకెఆర్ ఆశపడుతోంది. మరోవైపు గుజరాత్ గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి మంచి జోష్‌ మీద ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ ఇక మార్పు చేసింది. అలెన్ స్థానంలో సైఫర్ట్‌ని జట్టులోకి తీసుకుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తోంది. తుది జట్లు: కెకెఆర్: టిమ్ సైఫర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానె(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ(కీపర్), రోవ్‌మెన్ పొవెల్, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి. జిటి: శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.

మన తెలంగాణ 17 Apr 2026 7:13 pm

grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి

grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి రాప్తాడు ఏప్రిల్ 17 ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 17 Apr 2026 7:13 pm

7500people |రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో….

7500people | రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో…. 7500people | రోడ్డు

ప్రభ న్యూస్ 17 Apr 2026 7:06 pm

భారతదేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్: సిఎం రేవంత్

భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి ఉప రాష్ట్రపతిగా సేవలందించారని సిఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపిలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డిలు పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 6:59 pm

డీలిమిటేషన్‌తో సభ్యులకు, ప్రజలకు మేలు: అమిత్ షా

న్యూఢిల్లీ: ఈ సభలో 56 మంది మహిళలు ఉండటం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, యూటీ చట్టాల సవరణ బిల్లులపై అమిత్ షా సమాధానం ఇచ్చారు. నియమాలు, నిబంధనలకు అనుగుణంగా సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఇండి కూటమి సభ్యుల్లో చాలా మంది మాట్లాడారని.. మహిళ రిజర్వేషన్ బిల్లును ఇండి కూటమి సభ్యులు వ్యతిరేకించారని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఇండి కూటమి వ్యతిరేకం అని మండిపడ్డారు. మహిళలకు మేలు చేసే బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని.. మహిళ సాధికారత దిశగా చేసే పనులకు ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా ముందుకెళ్తున్నాం అని అమిత్ షా అన్నారు. ‘‘ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభలో తీవ్ర వ్యత్యాసం ఉంది. ఒక చోట 39 లక్షల ఓటర్లు ఉంటే.. మరో చోట 60 వేల ఓటర్లు ఉన్నారు. ఒక ఎంపి లక్షల మంది ప్రజల సమస్యలను ఎలా ఆలకించగలరు? ఎస్సి, ఎస్టి సీట్ల పెంపుదలను కూడా వ్యతిరేకిస్తున్నారు’’ అని షా అన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే అదృష్ణం తమకు దక్కిందని అమిషా హర్షం వ్యక్తం చేశారు. ‘‘నియోజకవర్గాల ఓటర్లలో సమతూకం సాధనకు ప్రయత్నిస్తున్నాం. ఎంపి తన విధులు సమర్థంగా నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుంది. అందుకే ఈ రాజ్యాంగ సవరణకు పూనుకున్నాం. ఢిల్లీ, బెంగళూరు, ఘాజియాబాద్‌లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మల్కాజ్‌గిరిలో దాదాపు 30 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. డీలిమిటేషన్ తర్వాత ఆయా చోట్ల రెండు సీట్లు వస్తాయి. డీలిమిటేషన్ వల్ల సభ్యులకు, అటు ప్రజలకు ప్రయోజనం’’ అని స్ఫష్టం చేశారు. 1972లో ఇందిరా ప్రభుత్వం లోక్‌సభ సీట్లను 545కు పెంచింది అని అమిత్ షా తెలిపారు. ‘‘ డీలిమిటేషన్ తర్వాత 50 శాతం స్థానాలు పెరుగుతాయి. ఇన్నాళ్లపాటు సీట్ల సంఖ్య పెంచకుండా అడ్డుకున్న ఘనత వారిదే. దేశంలో 50 శాతం ఉన్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కుతున్నాయి. కాలానికి అనుగుణంగా సీట్ల సంఖ్యలోనూ మార్పు రావాలి. మహిళా బిల్లును వ్యతిరేకిస్తూ సమయం వృథా చేయకండి. 2021లో కరోనా వల్ల జనగణన చేయలేకపోయాం. దేశంలోని కులాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల జనాభాకు స్పష్టం చేస్తున్నాం.. ఈ ఏడాది జనగణన పూర్తవుతుంది. ఇప్పటికే జనగణన ప్రారంభమైంది. ఉత్తరాదికి ఎంత అధికారం వస్తుందో.. దక్షిణాదికి అంతే వస్తుంది’’ అని షా పేర్కొన్నారు.  

మన తెలంగాణ 17 Apr 2026 6:55 pm

Breaking : గుడ్ న్యూస్.. పెట్రోలు ధరలు ఇక పెరగవ్

ప్రపంచ దేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 17 Apr 2026 6:50 pm

M3Media&MahaMovies |జేడీ చక్రవర్తి లీడ్‌గా…

M3Media&MahaMovies | జేడీ చక్రవర్తి లీడ్‌గా… M3Media&MahaMovies | రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా

ప్రభ న్యూస్ 17 Apr 2026 6:37 pm

ఎసిబి వలలో చిక్కిన మరో అవినీతి అధికారి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం కల్లు దుకాణం నిర్వాహకుడి వద్ద బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కల్లు దుకాణం ఒకచోట నుంచి మరో చోటకు మార్చేందుకు సదరు ఎక్సైజ్ సీఐ రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పన్నిన వలలో ఎక్సైజ్ సీఐ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షలతో పాటు ఎక్సైజ్ సీఐ బ్యాగులో దొరికిన రూ.45,760 లను స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్‌లోని ఎక్సైజ్ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించగా రూ.12 లక్షలు దొరికాయని, వాటిని కూడా సీజ్ చేశామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి శనివారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఎక్సైజ్ సీఐ ఆస్తులు, తదితర విషయాలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

మన తెలంగాణ 17 Apr 2026 6:07 pm

సురక్ష పీపుల్స్ హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

సురక్ష పీపుల్స్ హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోగికి

ప్రభ న్యూస్ 17 Apr 2026 6:04 pm

Hyderabad : ఎంఐఎం కోట బద్దలు కానుందా? ఒవైసీకి షాక్ ఇవ్వనున్నారా?

అసదుద్దీన్ ఒవైసీకి ఇదే ఆఖరి ఛాన్స్ కానుందా? అంటే అవుననే అంటున్నారు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 6:02 pm

టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం…

టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం… కార్యకర్త అధినేత..పొలిట్ బ్యూరో గా గ్రామస్థాయి నుంచి

ప్రభ న్యూస్ 17 Apr 2026 6:01 pm

ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనలో జిల్లా ముందంజలో ఉండాలి.

ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనలో జిల్లా ముందంజలో ఉండాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.గణిత

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:59 pm

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి తొర్రూరు,ఏప్రిల్17(ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:55 pm

మున్సిపల్ కో-ఆప్షన్ స‌భ్యులు ఎంపిక

మున్సిపల్ కో-ఆప్షన్ స‌భ్యులు ఎంపిక సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్ర‌ప్ర‌భ‌): సంగారెడ్డి

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:53 pm

కృత్యాల‌తో చిదివితే చిన్నారులు మ‌ర్చిపోలేరు

కృత్యాల‌తో చిదివితే చిన్నారులు మ‌ర్చిపోలేరు సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్ర‌ప్ర‌భ‌): గ‌తేడాది

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:52 pm

రోగులకు అందించే సేవల్లో రాజీ ప్ర‌స‌క్తే లేదు

రోగులకు అందించే సేవల్లో రాజీ ప్ర‌స‌క్తే లేదు ఆసుప‌త్రి సేవల‌పై పూర్తిస్థాయిలో సంతృప్తి

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:48 pm

సిగాచి బాధితులకు న్యాయం చేయాలి

సిగాచి బాధితులకు న్యాయం చేయాలి సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్ర‌ప్ర‌భ‌): సిగాచి

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:45 pm

కలెక్టర్, ఎస్పి ల నేతృత్వంలో 4 వేల కిలోల గంజాయి ధ్వంసం

కలెక్టర్, ఎస్పి ల నేతృత్వంలో 4 వేల కిలోల గంజాయి ధ్వంసం తిరుపతి

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:41 pm

మిర్చి ట్రాక్టర్ బోల్తా… మహిళ మృతి

మిర్చి ట్రాక్టర్ బోల్తా… మహిళ మృతి మిర్చి కూలీలతో వెళ్తుండగా ప్రమాదంఇద్దరికి తీవ్ర

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:32 pm

బాధిత కుటుంబాలకు అండగా ఎస్‌ఆర్ ఆర్ ఫౌండేషన్

బాధిత కుటుంబాలకు అండగా ఎస్‌ఆర్ ఆర్ ఫౌండేషన్ రాయపర్తి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ):

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:28 pm

Social Media |‘చిరుత’భామ గ్లామర్ షోకి ఫ్యాన్స్ ఫిదా!

Social Media | ‘చిరుత’ భామ గ్లామర్ షోకి ఫ్యాన్స్ ఫిదా! Social

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:26 pm

కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి

రాయలసీమలో మొట్ట మొదటిది The post కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 5:23 pm

పంగిడీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా

పంగిడీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా సిర్పూర్ (యు) ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ)

ప్రభ న్యూస్ 17 Apr 2026 5:11 pm

మెరుగైన సేవలు అందించాలి

మెరుగైన సేవలు అందించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గోదావరిఖని,

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:59 pm

Big Twist in Jacqueline Fernandez’s Case

Sri Lankan beauty Jacqueline Fernandez has established her career in Bollywood and she has done ample number of Indian films. She has been facing allegations in a money-laundering case along with conman Sukesh Chandrasekhar. The investigation has been going on for years and Sukesh posted frequent updates about their relationship. Jacqueline Fernandez told a Delhi […] The post Big Twist in Jacqueline Fernandez’s Case appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 4:57 pm

ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు….

ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు…. ఎల్కతుర్తి ఆంధ్రప్రభ : అవినీతి,

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:53 pm

ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం పై అవగాహన

ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం పై అవగాహన బోధన్ ఏప్రిల్ 17(ఆంధ్రప్రభ)

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:48 pm

ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కు 4½ ఏళ్లకే ట్యూషన్ ఫీజు

ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కు 4 ఏళ్లకే ట్యూషన్ ఫీజు టీ టీ డి

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:44 pm

అదానీ నెంబర్ వన్.. ముకేశ్‌ అంబానీ వెనక్కి

గౌతమ్ అదానీ ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 4:43 pm

రేషన్ బియ్యం…పట్టుపడుతున్న ఆగని అక్రమ రవాణా

రేషన్ బియ్యం…పట్టుపడుతున్న ఆగని అక్రమ రవాణా మద్దూర్, ఆంధ్రప్రభ : ప్రతీ పేదవాళ్లు

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:41 pm

Pic Talk: Ram Charan Exudes Style

Global Star Ram Charan is almost done with the shoot of Peddi and the film is due for release. From a recent photo shoot, the actor looked stylish in a fit look like an athlete. A click from the photo shoot is going viral. With long hair and thick beard, Charan’s muscular look is winning […] The post Pic Talk: Ram Charan Exudes Style appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 4:36 pm

Telangana : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 4:30 pm

చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర సస్పెన్షన్

చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర సస్పెన్షన్ బెట్టింగ్ మామూళ్ల ఆరోపణలతో సస్పెన్షన్ చిత్తూరు,

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:30 pm

ఈ మ్యాచ్‌లో వరుణ్ పుంజుకుంటాడు.. కెకెఆర్ పేసర్ ఆశాభావం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 19వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఆడిన 5 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఆ జట్టుకు ఒక పాయింట్ కలిసి వచ్చి.. టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది. అయితే కెకెఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సీజన్‌లో బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు. వికెట్లు తీయడం పక్కన పెడితే.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయితే శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి తిరిగి పుంజుకుంటాడని ఆ జట్టు యువ పేసర్ కార్తీక్ త్యాగీ అశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ప్రతి క్రికెటర్‌కూ ఇలాంటి దశ ఎదురవుతూనే ఉంటుంది. ఒక్కోసారి ప్రదర్శన మెరుగ్గా ఉన్నా.. పిచ్ పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఇలాంటి వాటి నుంచి నేర్చుకొనేందుకు అవకాశాలు లభిస్తాయి. మెరుగ్గా రాణించి అత్యుత్తమ బౌలర్‌గా మారేందుకు ఛాన్స్ ఉంది. వరుణ్ భాయ్ కూడా ప్రస్తుతం అదే దశలో ఉన్నాడనుకుంటున్నా. తప్పకుండా బలంగా పుంజుకొని వస్తాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఇది జరుగుతుందని అనుకుంటున్నా. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రాకపోవచ్చు. జట్టుగా మేం మరోసారి ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. విజయం సాధించేందుకు మా ప్రణాళికలను అమలు చేస్తాం’’ అని కార్తీక్ మీడియా సమావేశంలో అన్నాడు.

మన తెలంగాణ 17 Apr 2026 4:27 pm

Andhra Prabha Smart Edition |TS|కాంగ్రెస్​ కోటలో /టెన్షన్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 17-04-2026, 4.00PM ts బిల్లుల టెన్షన్​.. ఐదింటికి

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:27 pm

డిమాండ్ల సాధనకు నల్లబెల్లిలో నిరసన జ్వాల

డిమాండ్ల సాధనకు నల్లబెల్లిలో నిరసన జ్వాల పీఆర్‌సీ సహా సమస్యల పరిష్కారానికి నల్ల

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:25 pm

రాంపూర్‌లో చలివేంద్రం ఏర్పాటు..

రాంపూర్‌లో చలివేంద్రం ఏర్పాటు.. నల్లబెల్లి,(ఆంధ్రప్రభ) వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:23 pm

Andhra Prabha Smart Edition |AP|ఐదింటికి ఓటింగ్​/పవర్​ బూస్టింగ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 17-04-2026, 4.00PM ap బిల్లుల టెన్షన్​.. ఐదింటికి

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:23 pm

లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం

21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలునెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరికవయనాడ్ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతో పార్లమెంటును ఆకట్టుకున్నారు. శుక్రవారం 21 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రసంగంలో వాగ్ధాటి, వ్యంగ్యం, రాజకీయ చతురత కలగలిసి కనిపించాయి. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా చమత్కారాలు విసురుతూనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం నవ్వించి తనదైన ముద్ర కనబరిచారు. మహిళా రిజర్వేషన్లపై […] The post లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 4:21 pm

Rahul Gandhi : మోదీ ఒక మెజీషియన్... మోదీ రహస్యాలన్నీ ట్రంప్ వద్దే

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 4:21 pm

Telangana | 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

Telangana | 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:18 pm

SIR |ఓటరు జాబితాపై కేటీఆర్ హెచ్చరిక

SIR | ఓటరు జాబితాపై కేటీఆర్ హెచ్చరిక SIR | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 17 Apr 2026 4:06 pm