SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

సోమవారం రాశి ఫలాలు (13-04-2026)

మేషం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. మిధునం ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తికావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. కర్కాటకం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహం సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి. కన్య జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తుల కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చికం సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మకరం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కుంభం వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీనం ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.  

మన తెలంగాణ 13 Apr 2026 12:20 am

ముంబయిపై గెలిచిన బెంగళూరు

ముంబయి: ఐపిఎల్ లో భాగంగా ముంబయి ఇండియన్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఎంఐపై 18 పరుగుల తేడాతో ఆర్ సిబి గెలుపొందింది. తొలుత ఆర్ సిబి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఎంఐ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబయి బ్యాట్స్ మెన్లు విఫల కావడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. షెర్పన్ రూథర్ పోర్డ్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ముంబయి బ్యాట్స్ మెన్లలో షెర్పన్ రూథర్ పోర్డ్ (71), హార్ధిక్ పాండ్యా(40), రికెల్టన్(37), సూర్యకుమార్ (33) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు విఫలం కావడంతో ముంబయి ఓటమిని చవిచూసింది. రోహిత్ శర్మకు దెబ్బతగలడంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ముంబయి బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా, సలమ్ ధర్, జాకోడ్ డఫీ తలో ఒక వికెట్ తీశారు. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో రజత్ పాటిదర్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రజత్ 20 బంతుల్లోనే 53 పరుగులు, సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు చేసి వీరవిహారం చేశారు. 36 బంతుల్లో 78 పరుగులు చేసిన సాల్ట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

మన తెలంగాణ 12 Apr 2026 11:52 pm

బిసి మహిళ సబ్ కోటాపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి

పూలేకు నివాళులే కాదు.. పూలే ఆశయం కోసం ప్రధాని పాటుపడాలి బిసి మహిళ సబ్ కోటా కై ఈనెల 16న ఢిల్లీలో బిసి మహిళల ధర్నా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల ఐకాన్ మహాత్మ జ్యోతిబా పూలే 200 జయంతి సందర్భంగా మొదటి సారిగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం అభినందనీయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పూలే ఆశయాలు అమలు చేయడానికి ప్రధాని మోడీ పాటుపడాలని ఆయన కోరారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు ఆమోదం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కంటే ముందు జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు మహిళా బిల్లు లక్ష్యం నెరవేరాలంటే బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని ఈ విషయాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మహిళా బిల్లుపై గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరించకుండా బిసి కోటపై తమ రాజకీయ విధానాన్ని ప్రకటించి 16 న జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిసి మహిళల సబ్ కోట కోసం పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బిసి మహిళలకు వాటా కల్పించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగా ఈ నెల 13న అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపడతామని, ఈనెల 16న ఢిల్లీలో బిసి మహిళలచే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

మన తెలంగాణ 12 Apr 2026 11:00 pm

ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల విజయకేతనం

90 శాతం ఉత్తీర్ణతతో సంక్షేమ గురుకుల్లాలో ప్రథమ స్థానం మన తెలంగాణ / హైదరాబాద్ : -ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. 90 శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా సంక్షేమ గురుకులాల్లో బిసి గురుకులాలు ప్రథమ స్థానంలో నిలిచారు. సీనియర్ ఇంటర్‌లో బైపిసి విద్యార్థి శ్రియ (994), బి. హిమానీ(993), రాథోడ్ నందు(993), ఎంపిసిలో బి. మధు(994), శ్రీనిధి(994), సిఇసిలో శ్రీలత (981), ఎంఈసిలో జాహ్నవి (983), హెచ్ ఇసిలో రాజేశ్వరి (980) స్టేట్ ర్యాంకులు సాధించారు. -సీనియర్ ఇంటర్‌లో పది లోపు ర్యాంక్‌లు ఎంపిసిలో 97 మంది, బైపిసిలో 62 మంది విద్యార్థులు సాధించారు. -జూనియర్ ఇంటర్ లో 16మందిఎంపిసి విద్యార్థులు స్టేట్ ర్యాంక్ (468) సాధించగా బైపిసిలో 11మందివిద్యార్థులు 438 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్‌ఫలితాల్లో 33 కాలేజీల్లో 100 శాతం ఉత్తీర్ణత, జూనియర్ ఇంటర్ లో 9 కాలేజీల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సీనియర్ ఇంటర్ లో ఏడు శాతం, జూనియర్ ఇంటర్ లో ఎనిమిది శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు ఉత్తర్ణీత (70.58 శాతం) కాగా బిసి గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సాధించారు. జూనియర్ ఇంటర్‌లో ఎంపిసిలో పి. ప్రవల్లిక (468), కె. వైష్ణవి (468)తో పాటు 15 మంది విద్యార్థులు, బైపిసిలో పి. రాఘవి (438), వి. హేమశ్రీ (438) మార్కులు సాధించారు. మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సొసైటీ లోని 261 కాలేజీల నుండి 2025- 26 విద్యా సంవత్సరానికి జనరల్ కేటగిరీలో సీనియర్ ఇంటర్ - 12,035 మంది పరీక్షకు హాజరుకాగా 10,856 (90 శాతం), జూనియర్ ఇంటర్ లో 14,783 మందికి గాను 12,664 మంది (86 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో ప్రథమ సంవత్సరం 191 కు 183 మంది (96 శాతం) ద్వితీయ సంవత్సరం 176 కు 172 మంది (98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో 98శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.   వందశాతం ఉత్తీర్ణత సాధించిన కాలేజీలు సీనియర్ ఇంటర్‌లో బాలికలు - 17, బాలురు - 16, మొత్తము - 33 కాలేజీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జూనియర్ ఇంటర్ లో బాలికలు - 5, బాలురు - 4, మొత్తము - 9 కాలేజీలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఒకేషనల్ కోర్సులో బాలికలు - 6, బాలురు - 2, మొత్తము - 8 కాలేజీలు వంద శాతం ఫలితాలు సాధించాయి. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 70.60 శాతం కంటే అధిక ఉత్తీర్ణత 90 శాతం సాధించి విజయభేరి మోగించారు. పది లోపు ర్యాంక్ లు ఎంపిసిలో (988/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 97 మంది, బైపిసిలో (985/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 62 మంది ఉన్నారు. సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 12,211 కాగా వీరిలో 11,028 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏ గ్రేడ్ (75 శాతం మార్కులు) సాధించిన విద్యార్థులు 8,490 బి గ్రేడ్ (60శాతం మార్కులు) 2,097. మంది సాధించారు. జూనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 14,974 కాగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 12,847 మంది ఉన్నారు. పది లోపు ర్యాంకులు సాధించినవారు ఎంపిసిలో (460/470) కన్న ఎక్కువ వచ్చిన వారు 727మంది, బైపిసిలో (429/430) కన్న ఎక్కువ వచ్చిన వారు 459 మంది ఉన్నారు. వీరిలో ఏ గ్రేడ్ (75 శాతం మార్కులు) సాధించిన విద్యార్థులు 9,628, బి గ్రేడ్ (60శాతం మార్కులు) 2,360. సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఫలితాలు సాధించిన బోధనా సిబ్బందిని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బి. సైదులు అభినందించారు.

మన తెలంగాణ 12 Apr 2026 10:18 pm

ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం

సీనియర్ ఇంటర్ ఎంపిసిలో స్టేట్ టాప్ మార్క్ 996 శ్రీ చైతన్యదే సీనియర్ ఇంటర్ బైపిసిలో స్టేట్ టాప్ మార్క్ 997 శ్రీచైతన్యదే జూనియర్ ఇంటర్ ఎంపిసిలో స్టేట్ టాప్ మార్క్ 469 శ్రీచైతన్యదే జూనియర్ ఇంటర్ బైపిసిలో స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది మన తెలంగాణ/హైదరాబాద్ : జూనియర్ ఇంటర్ ఎంసిలో 470 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 469తో ఇద్దరు, 468 మార్కులు ఆ పైన 147 మంది, 467 మార్కులు ఆపైన 701 మంది, 466 ఆపైన 1378 మంది, 465 ఆపైన 1988 మంది, 460 ఆపైన 4497 మంది శ్రీ చైత న్య విద్యార్థులే. జూనియర్ ఇంటర్ బైపిసిలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది, 437 ఆపైన 319 మంది, 436 ఆపైన 583 మంది, 435 ఆపైన 837 మంది, 400 మార్కులు ఆపైన 4941 మంది శ్రీచైతన్య విద్యార్థులే. సీనియర్ ఇంటర్‌లో 1000 మార్కులకు గానూ 997 స్టేట్ టాప్ మార్క్‌తో పాటు 996 మార్కులు ఆపైన 3 గురు, 995 మార్కులు ఆపైన 16 మంది, 990 మార్కులు ఆపైన 759 మంది శ్రీచైతన్య విద్యార్థులు విజయం సాధించారు. ఇప్పటికే విడుదలైన జెఇఇ మెయిన్ 2026లో సెషన్ 1 అండ్ 2, ఎన్‌టిఎ ప్రొవిజనల్ కీ ప్రకారం 300కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం. ప్రతీ ఏటా ఐఐటి జెఇఇ, నీట్‌లలో అత్యథిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారని, రేపటి ఐఐటి అడ్వాన్స్‌డ్, నీట్‌లలోనూ నెంబర్ వన్ ర్యాంకులు సాధి స్తారని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘శ్రీచైతన్య సృష్టించిన పటిష్ట మైన ప్రోగ్రామ్‌లు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి అధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతల వల్లే ఇంటర్మీడియేట్లో సబ్జెక్ట్‌పై తమ విద్యార్థులు కాన్సె ప్టువల్‌గా పట్టు సాధించడంతో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో టాపర్స్‌గా నిలుస్తున్నారన్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లనే ఇంటర్మీడియేట్‌లో స్టేట్ టాప్ మార్కులు సాధ్యమయ్యాయని, దీనితో పాటు రాబోయే రిజల్ట్‌లో కూడా అగ్రస్థానం శ్రీచైతన్యదే అనే నమ్మకం తమకు ఉందన్నారు. అతు ్యత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, తమ విద్యా సంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన అభినందించారు.

మన తెలంగాణ 12 Apr 2026 10:10 pm

ఇరాన్‌కు ఆయుధాలు?.. చైనాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అన్న అనిశ్చితి మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైట్ హౌస్ నుంచి మియామీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్, చైనా, ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే, చైనాకు పెద్ద సమస్యలు వస్తాయి అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మరే వివరాలు వెల్లడించలేదు. ఈ హెచ్చరికకు కారణం, అమెరికా గూఢచారి నివేదికల ఆధారంగా వెలువడిన సిఎన్‌ఎన్ కథనం. దాని ప్రకారం, రాబోయే వారాల్లో ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సరఫరాలను ప్రత్యక్షంగా కాకుండా మూడో దేశాల ద్వారా రహస్యంగా పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమెరికాఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయినప్పటికీ, రెండు దేశాలూ భారీ సైనిక బలగాలను కొనసాగిస్తున్నాయి. ఇరాన్ సమీపంలో అమెరికా నౌకాదళం మోహరించగా, ఇటీవలి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న గగన రక్షణ వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఘర్షణలో ఏ పక్షానికీ మేము ఆయుధాలు సరఫరా చేయలేదు అని స్పష్టం చేసింది. అలాగే అమెరికా ఆధారంలేని ఆరోపణలు, అతిశయోక్తులను మానుకోవాలి అని సూచించింది. చైనా ఇరాన్‌కు సైనిక సహాయం అందిస్తే, అది పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే చర్యగా అమెరికా భావించే అవకాశం ఉంది. అంతేకాకుండా, వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగనున్న ట్రంప్ పర్యటనపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. పశ్చిమ దేశాల ఆంక్షల కింద ఉన్న ఇరాన్‌కు, చైనా మరియు రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇవి ఇరాన్‌కు ముఖ్యమైన ఆర్థిక, దౌత్య మద్దతు అందిస్తున్నాయి. సిఎన్‌ఎన్ నివేదిక ప్రకారం, ఇరాన్‌కు చేరే అవకాశం ఉన్న ఆయుధాల్లో మాన్‌పాడ్స్ (భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులు) కూడా ఉండవచ్చు. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణించే అమెరికా విమానాలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడవచ్చు. ఈ నెల ప్రారంభంలో అమెరికా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లపై జరిగిన ఘటనల్లో ఇటువంటి వ్యవస్థలు ఉపయోగించి ఉండవచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇరాన్ ఈ విషయంపై అధికారికంగా వివరాలు వెల్లడించకపోయినా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజా దాడుల్లో కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. ఇదిలా ఉండగా, అమెరికాఇరాన్ మధ్య చర్చలు లోతుగా కొనసాగుతున్నాయి అని ట్రంప్ తెలిపారు. అయితే తుది ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా తమకు ప్రయోజనం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా మేమే గెలుస్తాం అని ట్రంప్ అన్నారు. అదేవిధంగా, ఇరాన్ సముద్ర మార్గాల్లో కొన్ని మైన్లు అమర్చినట్టు భావిస్తున్నామని, వాటిని తొలగించేందుకు అమెరికా మైన్స్‌వీపర్ నౌకలు చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. దీంతో హార్మూజ్ జలసంధిలో నౌకా రవాణా భద్రతను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 9:57 pm

మహిళా రిజర్వేషన్లపై కలిసిరండి.... ఫ్లోర్‌లీడర్స్‌కు ప్రధాని మోడీ లేఖలు

న్యూఢిల్లీ: దేశంలో 2029 నాటికి చట్టసభలలో మహిళా రిజర్వేషన్ కోటా అమలులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కీలక పార్టీలు ఒకేతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కేంద్రంతలపెట్టిన రాజ్యాంగ సవరణలకు, చట్టం రూపకల్పనకు అంతా ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ, లోక్‌సభలలోని పలు పార్టీల సభాపక్ష నేతలకు లేఖలు రాశారు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పొడిగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణల ఆమోదానికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ మూడు రోజుల ప్రత్యేక సిట్టింగ్‌ను ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఉభయ సభల ఫ్లోర్ లీడర్స్‌కు లేఖలు పంపించినట్లు అధికారికంగా వెల్లడైంది. చట్టసభల పరిపూర్ణత దిశలో రిజర్వేషన్ల కోటా అమలుకు సంకల్పించినట్లు ప్రధాని పేర్కొన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలు, అప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికలు మహిళా కోటా అమలు తోనే నిర్వహించాల్సిన అవసరం ఉందని , ఈ విషయాన్ని పార్టీల నేతలంతా గుర్తించాలని, ఈ విషయంలో సభలో ఐక్యత చాటుకోవల్సి ఉందన్నారు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థ మరింత పరిపుష్టం అయి తీరాలి. మహిళలకు పరిపాలనలో మరింత ప్రాతినిధ్యం తలెత్తాలని ఈ లేఖలలో పేర్కొన్నారు నారీ శక్తి వందన్ అధినియం సాకారం కీలక మలుపు అవుతుందన్నారు. రాజ్యాంగ సవరణల మేరకు రూపొందే చట్టంతో లోక్‌సభలో, అసెంబ్లీలో మహిళలకు 33శాతం స్థానాలకు వీలేర్పడుతుంది. 2023లోనే ఈ మేరకు సవరణలు అమలులోకి వచ్చాయి. అయితే 2027 జనగణన ప్రాతిపదికన జరిగే డిలిమిటేషన్ పూర్తి తరువాతనే కోటా అమలులోకి వస్తుంది. అప్పటి చట్టం అమలులో ఉంటే రిజర్వేషన్ల కోటా అమలు 2534కు ముందు అసాధ్యం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని దీనికి ఇప్పుడు సవరణలు చేపట్టారు. ఈ ప్రక్రియతో లోక్‌సభ బలం 816కు చేరుతుంది. ఇందులో కోటా మేరకు మహిళలకు 273 స్థానాలు కల్పించాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలక పరిణామం అవుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. డిలిమిటేషన్ ప్రక్రియలోని అంశాలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నేడు ఢిల్లీలో జాతీయ స్థాయి మహిళా సదస్సుకు ప్రధాని మహిళా రిజర్వేషన్ల కోటా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జాతీయ స్థాయి మహిళా సదస్సు జరుగుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ముందు జరిగే నారీ శక్తి వందన్ సమ్మేళన్‌కు ప్రధాని మోడీ హాజరవుతారు. దేశ భవిష్యత్తు రూపకల్పన, వికసిత భారత్ 2047 లక్ష సాధనలో మహిళలకు ఇతోధిక ప్రాతినిధ్యం, నిర్ణయాథికారాలలో వారికి ప్రాధాన్యత వంటి విషయాలపై విశ్లేషణకు ఈ జాతీయ సదస్సును తలపెట్టారు.

మన తెలంగాణ 12 Apr 2026 9:43 pm

ముంబయి లక్ష్యం 241

ముంబయి:  ఐపిఎల్ లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్-  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ సిబి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఎంఐ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రజత్ పాటిదర్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రజత్ 20 బంతుల్లోనే 53 పరుగులు, సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు చేసి వీరవిహారం చేశారు. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో విరాట్ కోహ్లీ(50), టిమ్ డేవిడ్(34), జితేశ్ శర్మ(10), రోమారియో షెపర్డ్(2) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, శార్థూల్ టాకూర్, మిచెల్ శాంట్నార్, హార్ధిక్ పాండ్యా తలో ఒక వికెట్ తీశారు. 

మన తెలంగాణ 12 Apr 2026 9:32 pm

annabhau |సాఠే విగ్రహావిష్కరణ.. దళిత సాహిత్యానికి దిక్సూచి!

annabhau | సాఠే విగ్రహావిష్కరణ.. దళిత సాహిత్యానికి దిక్సూచి! annabhau | నిజామాబాద్‌లో

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:29 pm

సిఎం పదవికి నితీష్ రాజీనామా?

ముందుగా తుది కేబినెట్ భేటీ . కొత్త సిఎం సామ్రాట్? పాట్నా: తూర్పు మధ్య ప్రాంత కీలక రాష్ట్రం బీహార్ ఉన్నత స్థాయి రాజకీయ మార్పు దశకు చేరుకుంది. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ నెల 14 (మంగళవారం) సిఎం పదవికి రాజీనామా చేస్తారు. అంతకు ముందు అదే రోజు ఆయన తమ సారధ్యపు కేబినెట్ చివరి సమావేశంలో పాల్గొంటారు. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఆదివారం బీహార్ రాజకీయాల్లో కదలిక ఏర్పడింది. తుది కేబినెట్ భేటీ తరువాత జెడియు నేత అయిన నితీష్ ప్రభుత్వ పగ్గాలు వదులుకుంటారు. బిజెపి సారద్య ప్రభుత్వానికి వీలు కల్పిస్తారు. కేబినెట్ సెక్రెటేరియల్ వెలువరించిన నోటిఫికేషన్ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఇందులో నితీష్ తమ సహచరులకు సందేశం వెలువరిస్తారు. తరువాత గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్‌కు రాజీనామా సమర్పిస్తారు. సోమవారం తరువాత రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆరంభం అవుతుందని అంతకు ముందు కుమార్ అత్యంత సన్నిహితులు , జెడియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సంజయ్ కుమార్ ఝా విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఈసారి బిజెపి తరఫున సీనియర్ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో తొలిసారి బిజెపి రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుంది. ఈ అపూర్వ ఘట్టం నెలకొనడానికి ముందు పలు అవరోధాలు, జెడియు నుంచి గణనీయ ప్రతికూలత వెలువడింది. ఇది తరువాత సమసిపోయింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, నూతన మంత్రి మండలి ఏర్పాటు సజావుగా సాగేందుకు ఎన్‌డిఎ జాతీయ స్థాయి నాయకత్వం తగు చర్యలు తీసుకుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీహార్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎన్నిక కార్యక్రమానికి కేంద్ర పరిశీలకులుగా బిజెపి నియమించింది. ఆయన సోమవారం పాట్నాకు చేరుకునే వీలుంది. సింగ్ నియామకం గురించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. బిజెపి సిఫార్సు మేరకు కేంద్రంలోని సీనియర్ నేతల సూచనల క్రమంలోనే లెజిస్లేటర్లు అంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అంతా ప్రజాస్వామిక పద్థతిలో జరుగుతుందని అంతకు ముందు జెడియు సీనియర్ నేత, శాసనసభా వ్యవహారాల మంత్రి విజయ్‌కుమార్ చౌదరి మీడియాకు తెలిపారు. బీహార్‌కు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పిన నితీష్ ఇకపై జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. తరువాతి ముఖ్యమంత్రి ఎవరనేది కేంద్ర నాయకత్వం ఖరారు చేస్తుందని బీహార్ బిజెపి మాజీ అధ్యక్షులు , మంత్రి దిలీప్ జైస్వాల్ తెలిపారు. అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు కీలకమైన హోం శాఖను నిర్వహిస్తోన్న సామ్రాట్ చౌదరి కొత్త ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు తలెత్తాయి. ఇటీవలి కాలంలో ఆయన తరచూ ఢిల్లీ నుంచి పిలుపు మేరకు వెళ్లిరావడం, కేంద్ర నాయకత్వంతో మాట్లాడటం వంటి పరిణామాలతో ఆయనే సిఎం అని భావిస్తున్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 9:16 pm

12apr |మణికొండలో వైభవంగా జరిగిన హిందూ సమ్మేళనం

12apr | మణికొండలో వైభవంగా జరిగిన హిందూ సమ్మేళనం 12apr | సనాతన

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:11 pm

ముందుచూపుతోనే ఆ ప్రతిపాదనలు చేశాం... కానీ విఫలం: ఇరాన్ స్పీకర్ భాఘర్

ఇస్లామాబాద్: పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పాకిస్తాన్‌లో జరిగిన చారిత్రాత్మక అమెరికా ఇరాన్ చర్చల్లో అమెరికా ఇరాన్ విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది అని ఇరాన్ పార్లమెంట్‌ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసిన అనంతరం, ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఘాలిబాఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో చేసిన పలు పోస్టుల్లో ఆయన మాట్లాడుతూ, మా బృందం ముందుచూపుతో కూడిన ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ చర్చల దశలో ప్రత్యర్థి పక్షం మా విశ్వాసాన్ని సంపాదించలేకపోయింది అని పేర్కొన్నారు. చర్చలకు ముందు తాము సత్సంకల్పంతో ముందుకు వచ్చామని, కానీ గత రెండు యుద్ధ అనుభవాల కారణంగా అమెరికాపై విశ్వాసం లేకపోయిందని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. మా సిద్ధాంతాలు, తర్కాన్ని అమెరికా గ్రహించింది. ఇప్పుడు మా విశ్వాసాన్ని పొందగలదా లేదా అన్నది వారి నిర్ణయం అని ఆయన అన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడేందుకు శక్తివంతమైన రాజనీతితో పాటు సైనిక శక్తిని కూడా వినియోగిస్తామని ఘాలిబాఫ్ తెలిపారు రాజనీతితో పాటు సైనిక పోరాటం కూడా ఇరాన్ ప్రజల హక్కుల సాధనలో భాగమే. 40 రోజుల జాతీయ రక్షణ ద్వారా సాధించిన విజయాలను కాపాడేందుకు మా ప్రయత్నాలు ఎప్పటికీ ఆగవు అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలకు వేదిక కల్పించిన పాకిస్తాన్‌కు ఘాలిబాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రజలను వీర ప్రజలుగా అభివర్ణిస్తూ, తమ బృందం చేసిన నిరంతర శ్రమను ప్రశంసించారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించడానికి సిద్ధంగా లేకపోవడమే చర్చల విఫలం కావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మా చివరి, ఉత్తమ ప్రతిపాదనను సమర్పించాం. ఇరాన్ దానిని అంగీకరిస్తుందో లేదో చూడాలి అని ఆయన తెలిపారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యక్ష చర్చలు విఫలమవడంతో రెండు వారాల కాల్పుల విరమణ స్థిరత్వంపై సందేహాలు నెలకొన్నాయి. అలాగే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్థిరీకరణకు కీలకమైన హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఆశలు కూడా మసకబారాయి.

మన తెలంగాణ 12 Apr 2026 8:41 pm

Amaravati’s Quantum Leap and IBM’s Entry Signal Andhra Pradesh’s Tech Push

Andhra Pradesh is positioning itself as a future-ready technology hub with a dual push in quantum computing and IT expansion. Nara Lokesh announced on X, that on April 14, World Quantum Day, Chief Minister Chandrababu Naidu will inaugurate India’s first indigenous open-access quantum computers, Amaravati 1S and 1Q, at SRM University. This marks the launch […] The post Amaravati’s Quantum Leap and IBM’s Entry Signal Andhra Pradesh’s Tech Push appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 8:34 pm

మార్చి నెల@ 2.24 లక్షలు ట్యాంకర్ ట్రిప్పులు... నీటిని పొదుపుగా వాడుకోవాలి

ఈనెల 12 రోజుల్లోనే 95,454 ట్రిప్పులు నీటిని పొదుపుగా వాడుకోవాలి ప్రతి కుటుంబం 20 శాతం నీటిని ఆదాచేయాలి ఎండీ అశోక్‌రెడ్డి మనతెలంగాణ, సిటీబ్యూరో ః ఈ సంవత్సరం మార్చి నెలలో మొత్తం 2,24,421 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెలలో 12వ తేదీ నాటికే 95,454 ట్రిప్పులు సరఫరా చేసినట్టు తెలిపారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ నీటి వినియోగంపై ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. నీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున, నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌పై అశోక్ రెడ్డి జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్‌తో పాటు రీజినల్ ఈడీలు, డైరెక్టర్లలు, సీజీఎంలు, జీఎంలతో జూమ్ మీటింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ ఘననీయంగా పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు. పెరిగిన బుకింగ్స్.. గత ఏడాదికంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్‌పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్‌లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్‌లో నీటిసరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్‌స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్‌ని డెలివరీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి పొదుపుపై ఎండీ విజ్ఞప్తి: ------------------------------------హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు .. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజులలో నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి పౌరుడు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. పౌరులకు ముఖ్య సూచనలు: ----------------------------------విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు, ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు. బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి. స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు. లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి. అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి. జలమండలి ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని ఎండీ తెలిపారు. అయినప్పటికీ, వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. నీరు అమూల్యమైన వనరు. ప్రతి చుక్కను విలువైనదిగా భావించి వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలం అని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి పౌరుడు నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను పాటిస్తూ జలమండలికి సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో లో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, డైరెక్టర్లు ఆపరేషన్స్-1,2,3 వినోద్ భార్గవ, నారాయణ, శీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 8:27 pm

ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా

మోడీ సర్కార్ కు సిపిఐ హెచ్చరిక… విశాలాంధ్ర.. ప్రత్యేక ప్రతినిధి/అనంతపురం బ్యూరో.. నూతన ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన “విబిజీ రాంజీ” చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.అనంతపురం […] The post ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Apr 2026 8:26 pm

Exclusive: Peddi to take up Toxic Date

Ram Charan’s Peddi will not release as per the plan on April 30th. Though the team hasn’t made any official statement yet, the industry insiders, producers and filmmakers are well aware that the film’s release is pushed. For now, the team of Peddi is considering two dates in June. Yash’s Toxic is slated for June […] The post Exclusive: Peddi to take up Toxic Date appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 8:14 pm

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి... సెకన్లలో కారు నంబర్ ప్లేటు మార్పు

స్వాప్ నంబర్ ప్లేట్స్ పట్టుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఫొటొః బిఎం పేరుతో ఉంది... మనతెలంగాణ, సిటిబ్యూరో: ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి కారు యజమాని చేసిన పని చూసి ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బిఎండబ్లూ కారుకు స్వాప్ నంబర్ ప్లేట్ అమర్చి తిరుగుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ వచ్చాడు. అతడికి బ్రీత్ పరీక్ష నిర్వహించగా మద్యం తాగి వాహనం నడిపినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు కారును స్వాధీనం చేసుకునేందుకు పరిశీలిస్తుండగా కారుకు ఉన్న నంబర్ ప్లేట్ మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారుకు చైనీస్ ఫ్లాగ్‌షిప్ నంబర్ ప్లేట్ అమర్చిన కారు యజమాని దానిని రిమోట్ సాయంతో మార్చుతుండడంతో డిఎల్ 6 సిఎం 7097, టిఎస్ 9 ఎఫ్‌క్యూ 9999 నంబర్ ప్లేట్లు మారుతున్నాయి. వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి ఖరీదైన బిఎండబ్లూ కారు నంబర్ ప్లేట్ మార్చడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటివి చూడలేదని, ఇదే మొదటిసారి పోలీసులు తెలిపారు. గతంలో ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌ను డ్యామెజ్ చేయడం, మాస్కువేయడం చేసేవారు. ఇప్పుడు ఏకంగా రిమోట్ సాయంతో నంబర్ ప్లేట్‌ను మార్చుతున్నారు. దీనిని చూసి ఎంతమంది అనుసరిస్తారోనని, ప్రతి కారును ఇక నుంచి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

మన తెలంగాణ 12 Apr 2026 8:12 pm

ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష

ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష ఎన్టీఆర్ జిల్లా

ప్రభ న్యూస్ 12 Apr 2026 8:02 pm

అడ్వకేట్‌పై మంగ్లీ ఫిర్యాదు

రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరాకరించడంతో భూతులు తిట్టారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు ఫొటొః మంగ్లీ పేరుతో ఉంది... మనతెలంగాణ, సిటిబ్యూరో:  డబ్బులు ఇవ్వలేదని అడ్వకేట్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని సింగర్, యాక్టర్ ముదావత్ సత్యవతి అలియాస్ మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదని, తనవి అని చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. గత నెల 22వ తేదీన అడ్వకేట్ సింగపోగు సుబ్బు ఆఫీస్‌కు వెళ్లానని, అక్కడ సుబ్బతోపాటు ముగ్గురు ఉన్నారని పేర్కొన్నారు. అడ్వకేట్ సుబ్బు తనతో అసభ్యంగా మాట్లాడారని, దీంతో తాను అడ్వకేట్‌ను నిలదీశానని తెలిపింది. తనపై యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తొలగించాలని అడ్వకేట్‌ను అడిగితే, రూ.10లక్షలు ఇస్తేను వాటిని తొలగిస్తానని చెప్పాడని తెలిపారు. తాను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అడ్వకేట్ సుబ్బ, అక్కడ ఉన్నవారు అసభ్యంగా తనను తిట్టారని, డబ్బులు ఇవ్వకుంటే వేధిస్తామని, రెప్యుటేషన్ డ్యామెజ్ చేస్తామని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్‌తో సంబంధం లేదు: సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ తెలిపారు. తన పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేశారో తెలియదని తెలిపారు. అడ్వకేట్ సుబ్బుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంగ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుబ్బు భరత నాట్యం డ్యాన్సరని, బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు తన పేరు వాడుకుంటున్నాడని తెలిపారు. తనను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు. ఆరోపణలు అన్నీ నిరాధారమని తెలిపారు. నా పేరు చెప్పి ఎవరూ వసూలు చేశారో నాకు తెలియదని, వారికి తనకు సంబంధం లేదని తెలిపారు. మధుకు తన సోదరుడికి సంబంధంలేదని తెలిపారు.

మన తెలంగాణ 12 Apr 2026 7:57 pm

దమ్మపేట మండల విద్యార్థినిలకు స్టేట్ ర్యాంక్…

దమ్మపేట మండల విద్యార్థినిలకు స్టేట్ ర్యాంక్… దమ్మపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్మీడియట్

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:55 pm

ఇంటర్ ఫలితాల భయంతో…

ఇంటర్ ఫలితాల భయంతో… మూడు రోజుల ముందే విద్యార్థి ఆత్మహత్య..తీరా ఫలితాలలో 347

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:51 pm

కొత్త కార్పొరేషన్‌లకు రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..?

మొదటి కమిటీలో స్పెషలాఫీసర్ ప్రకటన రెండో మీటింగ్‌లో ఊసేలేని నజరానా రాష్ట్ర బడ్జెట్‌లోనూ కనిపించని ప్రస్తావన మనతెలంగాణ, సిటీబ్యూరో ః కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్‌లకు ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రకటించిన రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పడిన కొద్దిరోజుల్లోనే కార్పోరేషన్‌ల అధికారులతో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన స్పెషలాఫీసర్.. నూతనంగా ఆవిర్భవించిన రెండు కార్పోరేషన్‌లకు ఒక్కొక్క కార్పోరేషన్‌కు రూ. 500 కోట్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆ ప్రకటన కాస్త కార్యరూపంలోకి రాకుండా ప్రకటనగానే మిగిలిపోయినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషలాఫీసర్‌గా నియమితులైన మొదటి సమావేశంలోనే ఆయన ఈ ప్రకటనను ఎందుకు చేసినట్టు..? ఎందుకు నిధులు మంజూరు చేయలేకపోతున్నట్టు..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్‌లో ఆసక్తికరమైన చర్చకు కేంద్రబిందువుగా మారింది. ప్రకటనచేసి నెల రోజులకుపైగా గడిచినా.. అనంతరం మరోమారు స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగినా.. ప్రకటించిన రూ. 500 కోట్లకు సంబంధించి కార్పోరేషన్‌ల ప్రత్యేకాధికారి ప్రస్తావించకపోవడంపై పలురకాలుగా వ్యాఖ్యానాలకు కేరాఫ్‌గా మారింది. బడ్జెట్‌లో ప్రస్తావనేది..? సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్‌లకు ఊరటనిచ్చేందుకే రూ. 500 కోట్లను మంజూరు చేయనున్నట్టు ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ ప్రకటించారా..? లేక ప్రభుత్వం నుండి వచ్చిన సంకేతాల మేరకు ప్రకటించారా..? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండానే ఆయన ఈ ప్రకటనను చేశారా..? అనేది ఇప్పుడు ఇటు అధికారులను, అటు పాలకులను తొలుస్తున్న ప్రశ్న. ఇదిలా ఉండగా గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ అంచనాల కేటాయింపుల్లోనూ కొత్తగా ఏర్పడిన కార్పోరేషన్‌లు సైబారాబద్, మల్కాజిగిరిలకు నిధుల కేటాయింపుపై ఊసే లేకపోవడం కూడా అధికారులను, మాజీ పాలకులను ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. కేవలం హెచ్‌సిటీ ప్రాజెక్టులకు మాత్రమే రూ. 2654 కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. మరి ఈ రూ. 500 కోట్ల ప్రస్తావన చేయలేదు. గతంలో జీహెచ్‌ఎంసి వరకు మాత్రమే హెచ్‌సిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జీహెచ్‌ఎంసిలో శివారులోని 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. అదనంగా పెరిగిన ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ధి పథకాలను చేపట్టడం జరగాల్సి ఉంది. మరి వీటిని నిధుల సహాకారం చేయాల్సిన ప్రభుత్వం కాస్త వార్షిక బడ్జెట్ అంచనాలలో కొత్త మున్సిపల్ కార్పోరేషన్‌లకు నిధులను కేటాయించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఆస్తి పన్ను, ప్లానింగ్‌పైనే.. ఎర్లీబర్డ్ స్కీంతో వచ్చే ఆస్తిపన్ను వసూలు, టౌన్‌ప్లానింగ్ విభాగం వసూలు చేసే భవన నిర్మాణాల ఫీజుల నుండి వస్తున్న ఆదాయంపైనే ఈ రెండు కొత్త కార్పోరేషన్‌లు ఆధారపడి ఉన్నాయి. వచ్చే ఆదాయం మేరకు కార్పోరేషన్ ఉద్యోగుల జీతభత్యాలను అందించనున్నది. ఈ రెండు విభాగాల నుండి ఆదాయం వస్తేనే ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు తమతమ బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయని, లేదంటే జాప్యం కావడం ఖాయమనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. గత ఏడాది ఆస్తిపన్ను వసూలు సిఎంసిలో రూ. 1000.36 కోట్లుగా ఉంటే మల్కాజిగిరి కార్పోరేషన్‌కు రూ. 962.62 కోట్లు వసూలైనట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క మార్చినెలకు సైబారాబాద్‌లో ఆస్తిపన్ను రూ. 143.69 కోట్లుగా ఉంటే ఎంఎంసిలో రూ.107.09 కోట్లు వసూలైంది. 202526 టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా సిఎంసికి రూ. 538.09 కోట్లు, ఎంఎంసికి రూ.198.24 కోట్లు ఆదాయంగా వచ్చాయి. ఇప్పుడు ఈనెల(ఏప్రిల్)లో ఎర్లీబర్డ్ స్కీం అమలులో ఉన్నందున ఆస్తిపన్ను కొంతమేర ఖజానాకు చేరే అవకాశాలున్నాయి. అనంతరం ఇక టౌన్‌ప్లానింగ్ నుండి వచ్చే ఆదాయంపైనే ఈరెండు కార్పోరేషన్‌లు ఆధారపడాల్సి ఉంటుందనేది అధికారులు వివరిస్తున్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 7:42 pm

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’విద్యార్థుల ప్రభంజనం..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’ విద్యార్థుల ప్రభంజనం.. భీమారం, ఆంధ్ర ప్రభ : స్థాపించిన

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:40 pm

Guruthundha Magic: Massive 10 Million views & Counting

“Guruthundha” from Chennai Love Story has turned into a massive sensation dominating charts and social media feeds with reels, shorts, and fan recreations. Crossing over 10 million views, it has firmly established itself as one of the most talked-about songs in recent times. The song has become an addiction to everyone. Both Kiran Abbavaram and […] The post Guruthundha Magic: Massive 10 Million views & Counting appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 7:39 pm

ట్రాఫిక్ సీఐని కలసిన టీడీపీ అధ్యక్షుడు రవికుమార్….

ట్రాఫిక్ సీఐని కలసిన టీడీపీ అధ్యక్షుడు రవికుమార్…. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి.

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:38 pm

ఫెయిల్ అయిన మనస్థాపంతో సౌజన్య ఆత్మహత్య

ఫెయిల్ అయిన మనస్థాపంతో సౌజన్య ఆత్మహత్య ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:35 pm

KTR : బీఆర్ఎస్ కాదు.. మళ్లీ టీఆర్ఎస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 12 Apr 2026 7:31 pm

రెండు దశాబ్దాల తర్వాత ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ పర్యటన

రెండు దశాబ్దాల తర్వాత ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ పర్యటన నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:31 pm

ఇంటర్ ఫలితాల్లో బెల్లంపల్లి విద్యార్థిని మెరుపులు..

ఇంటర్ ఫలితాల్లో బెల్లంపల్లి విద్యార్థిని మెరుపులు.. బైపీసీలో స్టేట్ థర్డ్ ర్యాంక్!440కి 436

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:28 pm

ప్రజలకు చేరువగా పోలీసింగ్.. కన్నెపల్లి ఠాణా ప్రారంభం…

ప్రజలకు చేరువగా పోలీసింగ్.. కన్నెపల్లి ఠాణా ప్రారంభం… నూతన భవనాన్ని ప్రారంభించిన డీజీపీ

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:24 pm

వృద్ధులు, నిరాశ్రయుల సేవతో 5వ వార్షికోత్సవం..

వృద్ధులు, నిరాశ్రయుల సేవతో 5వ వార్షికోత్సవం.. విజయవాడ, ఆంధ్రప్రభ : గత ఐదు

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:21 pm

మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలి…

మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలి… కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : సామాన్య

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:16 pm

ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ప్రభుత్వం…

ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ప్రభుత్వం… కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:12 pm

గుజరాత్ దే గెలుపు

ఐపిఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఎల్ఎస్ జిపై జిటి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. శుభమన్ గిల్, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది. గుజరాత్ జట్టు 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్ మన్ గిల్(56), జోస్ బట్లర్(60) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు తీసి లక్నో నడివిరిచాడు. ప్రసిద్ధి కృష్ణకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

మన తెలంగాణ 12 Apr 2026 7:12 pm

పాద‌చారులకు రస్నా పంపిణీ…

పాద‌చారులకు రస్నా పంపిణీ… పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక పైపుల రోడ్డు, సింగ్

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:09 pm

హంద్రీనీవా ద్వారా చెరువుకు నీరు అందించేలా ప్రణాళికలు

హంద్రీనీవా ద్వారా చెరువుకు నీరు అందించేలా ప్రణాళికలు రాప్తాడు, ఆంధ్రప్రభ : గతంలో

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:06 pm

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలం... యుద్ధం కొనసాగుతుందా?

21 గంటల చర్చలు విఫలం పాకిస్తాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కూలిపోయాయి ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో జరిగిన చారిత్రాత్మక 21 గంటల అమెరికాఇరాన్ శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. దీంతో రెండు వారాల సున్నితమైన కాల్పుల విరమణ భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. చర్చలు విఫలమయ్యేందుకు ఒకరినొకరు బాధ్యులుగా రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్ పెట్టిన షరతులను ఇరాన్ అంగీకరించలేదని తెలిపారు. అమెరికా తమది చివరి, ఉత్తమ ప్రతిపాదన అని సమర్పించినప్పటికీ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడంలో ఆసక్తి చూపలేదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికాతో చర్చలు విఫలం కావడానికి ఆ దేశమే కారణమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ, 21 గంటల పాటు జరిగిన చర్చల సందర్భంగా తమ ప్రతినిధి బృందం సానుకూల ప్రతిపాదనలను అందించింది. అయినప్పటికీ.. అమెరికన్లు తమ నమ్మకాన్ని సంపాదించగలదా లేదా అన్నది అమెరికా నిర్ణయించుకోవాల్సిన విషయం అని ఎక్స్ వేదికగా చెప్పారు. “యుద్ధం ముగింపు విషయంలో మాకు సదుద్దేశం, సంకల్పం ఉన్నాయని చర్చలకు ముందే చెప్పాం. కానీ గత రెండు యుద్ధాల అనుభవం కారణంగా మాకు అవతలి పక్షంపై నమ్మకం లేకుండా పోయింది. చర్చల సమయంలో మా ప్రతినిధులు దూరదృష్టితో కూడిన కొన్ని ప్రతిపాదనలు చేశారు. కానీ మా నమ్మకాన్ని పొందండంలో అమెరికా విఫలమైంది. ఇరాన్ అంటే 9 కోట్ల ప్రజల సముదాయం. సుప్రీం లీడర్ పిలుపుకు స్పందించి వారంతా వీధుల్లోకి వచ్చారు. మా ప్రజల హక్కుల సాధనకు సైనిక పోరాటంతో పాటు దౌత్యం కూడా ఒక మార్గమని భావిస్తున్నాం. అదేవిధంగా 40 రోజుల యుద్ధంలో సాధించిన విజయాలను సుస్థిరం చేసుకునే దిశగా మా ప్రయత్నాలను విరమించుకోం అని ఘాలిబఫ్ అన్నారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా అధికమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను పెట్టిందని విమర్శించింది. ఈ చర్చలు విఫలమవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల స్థిరీకరణకు కీలకమైన హార్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై ఆశలు తగ్గిపోయాయి. అమెరికా మళ్లీ ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభిస్తుందా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇరాన్ హామీ ఇవ్వలేదు.. పాకిస్థాన్ వేదికగా ఇరాన్‌అమెరికాల మధ్య నిర్వహించిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జేడీ వాన్స్ మాట్లాడుతూ, 21 గంటలపాటు మేము ఇరానీయులతో గంభీర చర్చలు జరిపాం. ఇది మంచి విషయం. అయితే ఒప్పందం కుదరలేదు. ఇది అమెరికాకంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదనే స్పష్టమైన హామీ అవసరం అని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం ఇరాన్‌కు అణ్వాయుధాలు అందకుండా నిరోధించడమేనని వాన్స్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చర్చలు జరిపినట్టు చెప్పారు. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అణు కార్యక్రమం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ, ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలపై విభేదాలు చర్చల విఫలానికి దారితీశాయి. ఘాలిబాఫ్ సోషల్ మీడియాలో పేర్కొంటూ, ఇరాన్ పక్షం ముందుచూపు కలిగిన ప్రతిపాదనలు చేసినప్పటికీ, ప్రత్యర్థి పక్షం విశ్వాసాన్ని పొందలేకపోయిందని తెలిపారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడటానికి రాజనీతితో పాటు సైనిక పోరాటం కూడా కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. హార్మూజ్‌జలసంధి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ మాట్లాడుతూ, చర్చల విజయవంతం అవ్వడం ప్రత్యర్థి పక్షం నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. అధికమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నివారించాలి అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా రవాణా అంశం కూడా చర్చల్లో అడ్డంకిగా మారిందని తెలిపారు. 40 రోజుల యుద్ధం తర్వాత, అనుమానాలు, అవిశ్వాసం నడుమ ఈ చర్చలు జరిగాయి. ఒకే సమావేశంలో ఒప్పందం సాధ్యమవుతుందని ఆశించలేం. అమెరికా, ఇరాన్ అభిప్రాయాలను దగ్గర చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయి అని బఘాయ్ అన్నారు. ఇక పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ, ఇరాన్‌అమెరికా శాంతి చర్చలకు తమ దేశం మధ్యవర్తిత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను అంగీకరించినందుకు రెండు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా బృందంలో వెస్ట్ ఆసియా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు మరియు వైట్ హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు రోజుల తరువాత ఇవి జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికాఇరాన్ మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష, ఉన్నత స్థాయి చర్చలు ఇవే. ఇరాన్ చర్చల కోసం 10 పాయింట్ల ప్రణాళికను సమర్పించింది. ఇందులో పశ్చిమ ఆసియాలో నుంచి అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ వంటి డిమాండ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో ఈ ఘర్షణ మొదలైంది. దీంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు దెబ్బతిని, అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమైంది. పశ్చిమ ఆసియా భద్రత, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు, అంతర్జాతీయ రాజనీతిపై దీర్ఘకాల ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ఈ చర్చలను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు.

మన తెలంగాణ 12 Apr 2026 7:05 pm

యాదవ సంఘం అభివృద్ధికి కృషి…

యాదవ సంఘం అభివృద్ధికి కృషి… చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:01 pm

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత..

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత.. విజయవాడ, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం

ప్రభ న్యూస్ 12 Apr 2026 6:57 pm

మహానగరంలో మళ్లీ వరుస దొంగతనాలు

తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు మనతెలంగాణ / సిటిబ్యూరోః మహానగరంలో మళ్లీ దొంగలు రెచ్చిపోతున్నారు, తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని వరుసగా దొంగతనాలు చేసుకుంటున్నారు. తాళం వేసిన ఇళ్లను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేసుకుని చోరీ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్, బోడుప్పల్ పరిధిలోని పలు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీ చేస్తున్నారు. ఇళ్లల్లో ఉన్న బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుని వెళ్తున్నారు. గతంలో మాదిరిగానే వేసవి వచ్చిందంటే అంతరాష్ట్ర ముఠాలు నగరంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. వేసవి సెలవుల్లో చాలా మంది ఇంటికి తాళం వేసి గ్రామాలకు వెళ్లడంతో వాటిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. తాళాలు పగులగొట్టి ఇంట్లోని బంగారు ఆభరణాలు,వెండి వస్తువులు, నగదును చోరీ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన తర్వాత అంతరాష్ట్ర ముఠాలు చోరీలు చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లలో నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు. కాలనీలు, కాలేజీలు, గేట్ కమ్యూనిటీలను వదలకుండా దొంగలు చోరీ చేస్తున్నారు. దొంగలు గ్రేటర్ హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఇనుపరాడ్లు, కట్టర్లు, వేటకొడవళ్లు, మారణాయుధాలతో దొంగలు ఎక్కడో ఒక చోట చోరీలు చేస్తున్నారు. దొంగలు మారణాయుధాలతో తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన వాస్తు నిపుణులు విఎల్‌ఎన్ కుటుంబంతోపాటు మధురానగర్‌లో ఉంటున్నారు. ఇంటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకులో ఉన్న నగదు రూ.4కోట్లను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టారు. పనిమీద కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని రూ.4కోట్ల రూపాయలు, బంగారు ఆభరణాలు దొంగలు చోరీ చేశారు. వెంటనే మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాలైన కొంపల్లి, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండమూడి ఎన్‌క్లేవ్‌లో ముసుగు దొంగలు గంట వ్యవధిలోనే ఐదు ఇళ్లల్లో చోరీలు చేశారు. గంట వ్యవధిలోని ఐదు ఇళ్లల్లో చోరీ చేసి కిలో వెండి, నగదును దోచుకుని పోయారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్‌లోని సదాశివ ఎన్‌క్లేవ్, గేట్ కమ్యూనిటీలో చోరీ చేసి మూడు తులాల బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు ఎత్తుకుని వెళ్లారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేసి 43తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. చందానగర్‌లో ఇంటి తాళాలు పగులగొట్టి 17తులాల బంగారు ఆభరణాలు, 60తులాల వెండి వస్తువులు, నగుదును ఎత్తుకుని వెళ్లారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన పోలీసులు రూ.5.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దొంగలు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా చోరీలు చేస్తున్నారు. అంతరాష్ట్ర ముఠాల పనా...? మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా చోరీలు జరుగుతుండడంతో పోలీసులు అంతరాష్ట్ర ముఠాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్కువగా చోరీలు చేసిన వారిలో అంతరాష్ట్ర ముఠాలు ఉన్నాయి. వీరిపై పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో కొంత కాలం నుంచి అంతరాష్ట్ర ముఠాలు గ్రేటర్ హైదరాబాద్ వైపు చోరీలు చేసేందుకు రావడంలేదు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని భావించిన దొంగలు ఇటువైపు వస్తే పట్టుబడతామని కొంత కాలం నుంచి దొంగతనాలకు రాకుండా ఉన్నారు. కానీ మళ్లీ శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతుండడంపై పోలీసులు అంతరాష్ట్ర ముఠాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు సిటీ మధ్యలో కాకుండా శివారు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో చోరీ చేసే సులభంగా ఇక్కడి నుంచి తప్పించుకుని పోవచ్చని అంతరాష్ట్ర ముఠాలు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు చేస్తుంటారు. పెట్రోలింగ్ పెంచాలి.. పోలీసుల నిఘా తగ్గడంతోనే దొంగలు రెచ్చి పోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, కాలనీల్లోకి వచ్చిన వారిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు. దొంగతనాలు జరగడంలేదని పోలీసులు కొంత నిర్లక్షంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. దొంగలపై పోలీసులు మరింత దృష్టి సారించి చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతరాష్ట్ర ముఠాలపై మరింత నిఘా పెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేసవి దొంగలు వచ్చారా... వివిధ రాష్ట్రాలకు చెందిన దొంగలు వేసవి కాలంలో నగరంలో చోరీలు చేసేందుకు వస్తుంటారు. ఎక్కువగా నగరవాసులు వేసవి సెలవులకు గ్రామాలకు వెళ్తారని భావించి చోరీలు చేసేవారు. కానీ ఈసారి మాత్రం ముందుగా దొంగలు నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా చోరీలు జరుగుతుండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 6:55 pm

కేజీబీవీ జూనియర్ కళాశాల బాలికల హవా..

కేజీబీవీ జూనియర్ కళాశాల బాలికల హవా.. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు

ప్రభ న్యూస్ 12 Apr 2026 6:54 pm

పనిభారం తడిసి మోపెడు..!... భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు.

అసహనంలో ఇంజనీర్లు సెలవులపై వేళ్ళేందుకు ప్రయత్నాలు భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు.. కార్యరూపంలోకి వస్తోన్న ప్రాజెక్టులు పెరిగిన జీహెచ్‌ఎంసి చ.కి.మీ.లు.. తగ్గిన అధికారులు మనతెలంగాణ, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసిలో ఇంజనీర్లు పనిభారంతో అసహనానకి లోనవుతున్నారనీ, బదిలీపై ఇక్కడకు వచ్చేందుకు సీనియర్ ఇంజనీర్లు ఆసక్తిని చూపడంలేదనే ఆసక్తికరమన చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇంజనీర్ల కొరతతో ఉన్నవారిపైనే తీవ్రమైన పనిభారం పెరుగుతుంది. ఫలితంగా పలువురు ఇంజనీర్లు సెలవులపై వెళ్ళేందుకు సిద్దమవుతున్నారనేది సమాచారం. ఓవైపు ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకురావాల్సిన పరిస్థితులు... మరోవైపు నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యతలు.. ఇంకోవైపు నెలనెలకు పదవీ విరమణ పొందుతున్న సీనియర్ ఇంజనీర్లు.. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంజనీర్లకు పనిభారం కాస్త తడిసి మోపెడవుతోంది. ఇది తెలిసి కూడా ఖాళీ పోస్టులను భర్తీచేసే దిశగా జీహెచ్‌ఎంసి ప్రయత్నాలు చేయడంలేదనే విమర్శలు అధికారుల్లో వినిపిస్తున్నాయి. కనీసం 400 మంది ఇంజనీర్లు ఉండాల్సిన జీహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ విభాగంలో కేవలం 100 మంది వరకు మాత్రమే ఉన్నారనేది అధికార వర్గాల సమాచారం. ఈ ఎప్రిల్‌తో పాటు మే, జూన్ నెలలోనూ మొత్తం 14 మంది ఇంజనీర్లు పదవీ విరమణ చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ 14 మందికి బదులుగా మరో 14 మంది జీహెచ్‌ఎంసికి వస్తారా..? అంటే.. అదీ లేదు. ఇటీవల రిటైర్‌మెంట్ అయినవారి పోస్టుల్లో ఇతరులు వచ్చి చేరలేదు. దీంతో పదవీ విరమణ చేసిన వారి బాధ్యతలు కూడా ప్రస్తుతమున్న వారే చేపట్టాల్సి వస్తోందని ఆవేదిన చెందుతున్నారు. 426 ఇంజనీర్లు ఇవ్వండి... జీహెచ్‌ఎంసిలో స్టాఫింగ్ పాట్రన్‌పై అధ్యయనంచేసి నివేదిక అందించిన ప్రసాదరావు కమిటీ నివేదిక మాత్రం.. ఇంజనీరింగ్ విభాగానికి అదనంగా కనీసం 426 పోస్టు(ప్రాజెక్ట్169, మేయింటనెన్స్257)లను రెండు దశల్లో మంజూరు చేయాలని స్పష్టంచేసింది. మొదటి దశలో ప్రాజెక్ట్‌కు 144, మేయింటనెన్స్‌కు 257. రెండో దశలో ప్రాజెక్ట్‌కు 25 పోస్టులను సాంక్షన్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు తేది 03.04.2013లో జీఓ. ఎంస్ నెం. 92ను అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం వెలువరించింది. ఈ జీవో నెం. 92 ప్రకార ఇప్పటి వరకు ఏఈఈ పోస్టుల్లోకి119 మంది మాత్రమే జీహెచ్‌ఎంసికి వచ్చినా, నేటికి ఏఈఈ, డిఈఈ, ఈఈ, ఎస్‌ఈ పోస్టులు ఖాళీలతో అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నవి. ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం మూడు కార్పోరేషన్‌లుగా జీహెచ్‌ఎంసి విభజించబడింది. దీంతో ఇంజనీరింగ్ విభాగంలోని ఇంజనీర్లు మూడు కార్పోరేషన్‌లకు వెళ్ళారు. ఒక్కొక్క కార్పోరేషన్‌లో ప్రాజెక్ట్, మేయింటనెన్స్‌లలో ఇంజనీర్ల కొరత తీవ్రత మరింత పెరిగింది. జీహెచ్‌ఎంసి మాత్రం 650 చ.కి.మీ.ల నుండి 689.76 చ.కి.మీ.లకు పెరిగి 6 జోన్‌లు, 30 సర్కిళ్ళు, 150 వార్డులుగా ఆవిర్భవించింది. దీంతో ఉన్న ఇంజనీర్లకు అదనపు భాధ్యతలు పెరిగాయి. ఈఈలు ఎస్‌ఈలుగా, ఎస్‌ఈలు సీఈలుగా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అదనపు బాధ్యతలు ఇటు ఈఈగా.. అటు ఎస్‌ఈగా రెండేసి బాధ్యతలను నిర్వర్తించడమే కష్టమవుతోందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భర్తీచేయడం అవసరం.. ప్రస్తుత అధికార వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ నెలలో ఎస్‌ఈలు4, ఈఈలు 3, మే నెలలో ఎస్‌ఈలు3 మంది ఇలా ప్రతినెల సీనియర్ ఇంజనీర్లు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసిలో సీనియర్ ఇంజనీర్ల కొరత తీవ్రంగామారి ప్రాజెక్టులు, నిర్వహణ పథకాలు తీవ్ర జాప్యానికి కారణమవుతుందనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. ప్రాజెక్ట్‌లో నాలుగు జోన్‌లకు ఎస్‌ఈలు4, ఈఈ 4 డీఈఈ8, ఏఈఈ 8, ఫీల్డ్ లేవల్ స్టాఫ్‌గా డీఈఈలు, ఏఈఈలు, మేయింటనెన్స్‌లో జోన్‌కు ఒక ఎస్‌ఈ, సర్కిల్‌కు ఒక ఈఈ, సర్కిల్‌కు ఇద్దరు డీఈఈలు , ఏఈఈలు 120. క్వాలిటీ కంట్రోల్ సెల్‌లో ఎస్‌ఈ, ఈఈ, డీఈఈలు, డిజైన్ వింగ్‌లో, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లోనూ ఇంజనీర్ల పోస్టులను భర్తీచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ, ఉన్నవారిపై పనిభారం మోపుతోన్న జీహెచ్‌ఎంసి అధికారులు ప్రభుత్వం నుండి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు చేయడంలేదని, తద్వారా తాము పనిచేయడంకన్నా.. సెలవుపై వెళ్ళడమే ఉత్తమమని భావిస్తున్నారు. ప్రాజెక్టులు, మేయింటనెన్స్ విధులు కార్యాలయాల్లో కూర్చుని చేసే పనులు కాదని సాంకేతికంగా పరిశీలించడం, క్షేత్రస్థాయిలో వెళ్ళి తనిఖీలు చేయడం, పర్యవేక్షణ చేపట్టడం వంటి విధులుంటాయని, దానిని గుర్తించి సరిపడా స్టాఫ్‌ను తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యతను విస్మరించడంతో ఇంజనీర్లలో అసహనం వ్యక్తమవుతోంది.

మన తెలంగాణ 12 Apr 2026 6:51 pm

KTR Breaks Silence on Kavitha

K. T. Rama Rao made strong remarks on party affairs and current political debates during his visit to Mancherial. Speaking about Kavitha, he chose a restrained tone. He said there was nothing more to add on the issue. He added that children may not always make their father proud, but they should never cause him […] The post KTR Breaks Silence on Kavitha appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 6:45 pm

ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అటకెక్కించింది: కెటిఆర్

మంచిర్యాల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ‘దాచుకో.. దోచుకో’ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా అదే పని మీద ఉన్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో కెటిఆర్ పర్యటించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన క్యాతనపల్లి పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ.. బిఆర్ఎస్-సిపిఐ కూటమి తరఫున గెలిచి కౌన్సిలర్లు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అటకెక్కించిందని ధ్వజమెత్తారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట.. సింగరేణి సంపదను దోచుకుంటున్నారని కెటిఆర్ ఆరోపించారు.

మన తెలంగాణ 12 Apr 2026 6:28 pm

ఇంటర్ ఫలితాలలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల

ఇంటర్ ఫలితాలలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల ప్రతిభ ఫస్ట్ సెకండ్

ప్రభ న్యూస్ 12 Apr 2026 6:21 pm

టీజీఆర్ ఎస్ కళాశాల విద్యార్థుల హవా…

టీజీఆర్ ఎస్ కళాశాల విద్యార్థుల హవా… మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 12 Apr 2026 6:19 pm

ఇంటర్‌లో కేజీబీవీ బాలికల సత్తా…

ఇంటర్‌లో కేజీబీవీ బాలికల సత్తా… చిట్యాల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో

ప్రభ న్యూస్ 12 Apr 2026 6:14 pm

రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకుతో చిట్యాల విద్యార్థినిలు…

రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకుతో చిట్యాల విద్యార్థినిలు… ​చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా

ప్రభ న్యూస్ 12 Apr 2026 6:00 pm

నందిగామలో ఘనంగా 33వ ఉర్సు మహోత్సవం…

నందిగామలో ఘనంగా 33వ ఉర్సు మహోత్సవం… పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు నందిగామ,

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:54 pm

నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు…

నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు…

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:54 pm

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి..

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి.. విజయవాడ, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ సమ స్యల పరిష్కారం

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:51 pm

అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

పెదబయలు: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు మత్స్యగెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా.. మరొకరు బయటకు వచ్చి సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్య్సకారులు తక్షణమే స్పందించి.. ఒకరిని కాపాడగలిగారు. మిగిలిన ముగ్గురూ మృతి చెందారు. మృతులను హర్షిత్(12), ప్రదీప్(11), పొంగి బబులు(10)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 12 Apr 2026 5:48 pm

Sumanth Prabhas’ Godari Gattupaina gets perfect release date

Sumanth Prabhas, who scored a hit with his previous film Mem Famous, is returning to the screen with a rural love story titled Godari Gattupaina. The makers have officially announced that the film is scheduled to release in theaters worldwide on May 8th. Directed by Subash Chandra and produced by Abhinav Rao, the movie features […] The post Sumanth Prabhas’ Godari Gattupaina gets perfect release date appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 5:45 pm

పోలీస్ స్టేషన్‌కు ప్రభుత్వ వాహనం కరువు….

పోలీస్ స్టేషన్‌కు ప్రభుత్వ వాహనం కరువు…. అత్యవసర సమయాలలో ఇబ్బందులు పడుతున్న స్థానిక

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:44 pm

ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నఅధికారులు..

ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నఅధికారులు.. పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని నూతన

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:28 pm

Auto Driver’s Son Who Studied Abroad Dies in US Accident

Sai Sri Harikrishna, a young man from Piridi village in Bobbili mandal of Vizianagaram district, died in the United States after a drowning accident. Harikrishna had moved to the US two years ago to pursue higher studies. He completed his MSc and recently secured a job as an engineer at Elicent Clean Technologies. On Saturday, […] The post Auto Driver’s Son Who Studied Abroad Dies in US Accident appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 5:24 pm

ముగిసిన లక్నో బ్యాటింగ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..

లక్నో: ఐపిఎల్ 19వ జీజన్‌లో ఏకనా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన లక్నో.. ఆరంభంలో వేగంగా ఇన్నింగ్స్ ఆడినా.. గుజరాత్ బౌలర్లు కట్టడి చేస్తూ వచ్చారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్‌లో మార్క్‌రమ్ 30, పూరన్ 19, పంత్, సమాద్, ముకుల్ తలో 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలింగ్‌లో ప్రసిద్ధ్ 4, అశోక్ 2, రబాడా, సిరాజ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. గుజరాత్ 165 పరుగులు చేయాలి.

మన తెలంగాణ 12 Apr 2026 5:20 pm

బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత‌..

బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత‌.. స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:20 pm

కస్తూర్బా గాంధీ బాలికల హవా..

కస్తూర్బా గాంధీ బాలికల హవా.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:17 pm

మంత్రి పదవి రావాలని రాజశ్యామల యాగం…

మంత్రి పదవి రావాలని రాజశ్యామల యాగం… మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:09 pm

ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన…

ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన… భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:04 pm

చెట్ల మధ్య చిక్కుకున్న సూచిక బోర్డు..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : “నన్ను చెట్ల మధ్యలో ఉంచితే ప్రమాదాలు జరుగుతాయి.. బయటికి

ప్రభ న్యూస్ 12 Apr 2026 5:01 pm

రాష్ట్రంలోని పద్మశాలీలు, చేనేతలు ఏకం కావాలి

రాష్ట్రంలోని పద్మశాలీలు, చేనేతలు ఏకం కావాలి కరీమాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ చేనేత

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:57 pm

గ్రావిటీ కాల్వ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతి

కొడిమ్యాల, ఆంధ్రప్రభ : కొడిమ్యాల మండలంలోని పోతారం చెరువు నుంచి నాచుపెల్లి జేఎన్‌టీయూ

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:53 pm

TG |తానేదార్‌పల్లిలో అభివృద్ధి జోరు..!

TG | తానేదార్‌పల్లిలో అభివృద్ధి జోరు..! -పేదల గూడు కలను నిజం చేస్తున్న

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:35 pm

ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..

ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. చల్లని మజ్జిగ పంపిణీ..చేస్తున్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:25 pm

14న ఫతేగడ్ గురుద్వారా లో బైసఖి పండగ…

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; సిక్కుల నూతన సంవత్సర పండగ ఈనెల 14న

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:23 pm

చలో తర్లువాడ..

చలో తర్లువాడ.. గూగుల్ డేటా సెంటర్ భూ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిఘటనసిపిఎం

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:22 pm

సత్తా చాటిన ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

ఆలేరు,ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరు విద్యార్థులు ఆదివారం

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:17 pm

ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే వ్యక్తి అంబేద్కర్

ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే వ్యక్తి అంబేద్కర్ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:11 pm

గుజరాత్‌తో మ్యాచ్.. రెండు వికెట్లు కోల్పోయిన లక్నో

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏకనా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. లక్నోని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన లక్నోకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. రబాడా బౌలింగ్‌లో వరుసగా సిక్సు, ఫోరు బాదిన మార్ష్(11) ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్(18).. మహ్మద్ సిరాజ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి రాహుత్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే(6 ఓవర్లు) ముగిసేసరికి లక్నో 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజ్‌లో బదోనీ(5), మార్క్‌రమ్(22) ఉన్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 4:03 pm

Notification |ఉద‌యం 11.30గంట‌ల‌కు విడుద‌ల

Notification | ఉద‌యం 11.30గంట‌ల‌కు విడుద‌ల Notification | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 12 Apr 2026 4:02 pm

Reservations |కేంద్రమంత్రి బండిసంజయ్

Reservations | కేంద్రమంత్రి బండిసంజయ్ Reservations | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మహిళా

ప్రభ న్యూస్ 12 Apr 2026 3:59 pm

Papam Prathap Trailer: A Hilarious, Heartfelt Ride

Thiruveer, who is enjoying the success of his last movie The Great Pre-Wedding Show, returns with another content-driven entertainer, Papam Prathap. The film hits theatres on the 17th of this month, and its newly released trailer sets the tone for a hilarious and heartfelt ride. Set against the rustic charm of 1998 Godavari, the story […] The post Papam Prathap Trailer: A Hilarious, Heartfelt Ride appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 3:49 pm

KTR |క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ కుట్ర‌లు..

KTR | క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ కుట్ర‌లు.. KTR | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 12 Apr 2026 3:49 pm

మూడు కాదు.. ముఫ్ఫై నెలలైంది..!

మూడు కాదు.. ముఫ్ఫై నెలలైంది..! మంచిర్యాల ప్రతినిధి – ఆంధ్రప్రభ : ”మేము

ప్రభ న్యూస్ 12 Apr 2026 3:38 pm

ఇంటర్ ఫలితాలలో వీఆర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వీఆర్ జూనియర్ కళాశాల

ప్రభ న్యూస్ 12 Apr 2026 3:28 pm

రాఘవేంద్ర కరిమల కళాశాల ఇంటర్ ఫలితాల ప్రభంజనం

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర

ప్రభ న్యూస్ 12 Apr 2026 3:25 pm

మేరా యువ భారత్ కు తారా విద్యార్థులు

మేరా యువ భారత్ కు తారా విద్యార్థులు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 12 Apr 2026 3:25 pm

ఆర్ధికసాయం అందించిన లోనె శ్రవణ్ కుమార్

ఆర్ధికసాయం అందించిన లోనె శ్రవణ్ కుమార్ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి

ప్రభ న్యూస్ 12 Apr 2026 3:14 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది లక్నో. ఇప్పుడు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో గెలిచిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గత మ్యాచ్‌లోని జట్లనే కొనసాగిస్తుంది. తుది జట్లు : జిటి: సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్, ప్రసిద్ధ్ కృష్ణ. ఎల్‌ఎస్‌జి: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్‌రమ్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), అయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్.

మన తెలంగాణ 12 Apr 2026 3:14 pm

Allu Aravind’s Wish for Mrunal Thakur

Mrunal Thakur is one of the finest performers of Indian cinema and doing Telugu films has been her priority. After Hi Nanna, the actress is seen beside Adivi Sesh in Dacoit. Her performance is winning the hearts of the audience and Dacoit is doing decent all over. During the film’s success meet, ace producer Allu […] The post Allu Aravind’s Wish for Mrunal Thakur appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 3:12 pm

asha bhosle|ఎన్నో అవార్డులు ఆమె సొంతం..

asha bhosle| ఎన్నో అవార్డులు ఆమె సొంతం.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : గాన‌కోకిల‌,

ప్రభ న్యూస్ 12 Apr 2026 3:06 pm

పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందే: బండి

హైదరాబాద్: పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు అని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని, మహిళలు ఆశలు, ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ బిల్లని బండి తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకీయాల్లో..33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని కొనియాడారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్ లో బిల్లుకు మద్దతివ్వాలని, మహిళలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు దశాబ్దాల నాటి కల అని బండి సంజయ్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 12 Apr 2026 3:00 pm