SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై విజయం

ఐపిఎల్ 2026లో ఎట్టకేలకు చెన్నై బోణీకొట్టింది. సంజు శామ్‌సన్ సెంచరీతో చెలరేగగా.. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. దీంతో లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీని .. పరుగులకే కట్టడి చేశారు చెన్నై బౌలర్లు. దీంతో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో పాతుమ్ నిశాంక(41), ట్రిస్టన్ స్టబ్స్(60)లు రాణించినా.. మిగతా బాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దాంతో ఢిల్లీ ఓటమిని మూటగట్టుకుంది. సంజూ సెంచరీ.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (15) త్వరగానే ఔట్ అయ్యా డు. ఈ క్రమంలో సంజు శాంసన్, ఆయుష్ మాత్రేతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. మ్యాచ్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు సంజూ. మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి, రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగగా.. సంజు మాత్రం మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీపూర్తి చేసిన సంజు.. ఈ సీజన్‌లో తొలి శతకం నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐపిఎల్‌లో ఓవరాల్‌గా నాలుగోది కావడం విశేషం. ఇక చివరలో శివమ్ దూబే (20 నాటౌట్) కూడా వేగంగా ఆడడంతో చెన్నై స్కోర్ 200 దాటింది. 

మన తెలంగాణ 12 Apr 2026 12:12 am

కారులో జోరు సాగేనా?

పార్టీ ఫిరాయింపులను దేవుడు ప్రోత్సహించడం ఎంత మాత్రం బాగాలేదు. అదేంటి, పార్టీ ఫిరాయింపుల్ని దేవుడు ఎందుకు ప్రోత్సహిస్తాడు అనుకుంటున్నారా? సీనియర్ రాజకీయ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి శుక్రవారంనాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును చూడగానే భావోద్వేగంతో అన్నా, నీతో కలిసి పని చేయమని దేవుడే నన్ను పంపించాడు అన్నారు. జీవన్‌రెడ్డి ఈ మాటలు అన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలే ఆధారం. పార్టీ ఫిరాయింపులు అనైతికమని 2023లో ఓడిపోయిన దగ్గర నుండి భారత రాష్ట్ర సమితి అనని రోజు లేదు. తమ పార్టీనుంచి పదిమంది శాసనసభ్యులు కాంగ్రెస్‌కు వలసపోవడం అనైతికమని ఇంటాబయటా.. అంటే శాసనసభలోనూ, న్యాయస్థానాల్లోనూ వాదించిన పార్టీ భారత రాష్ట్ర సమితి. ఆ పదిమంది శాసనసభ్యులు తాము ఇంకా భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నామని అభివృద్ధి, సంక్షేమాలు ప్రజలకు అందించడంకోసమే కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు, అది వేరే విషయం. వచ్చే రెండున్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సభలో విప్ జారీ చేసే అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది పదిమంది శాసనసభ్యులు ఏమవుతారు అన్నది. అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డిని కెసిఆర్‌తో కలిసి పనిచేయమని దేవుడే పంపించి ఉంటే ఆ పదిమంది శాసనసభ్యులను కూడా దేవుడే ‘మీరు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలసి ప్రజలకు మంచి చేయండి’ అన్నాడేమో.అయితే ఈ పదిమందికి, సీనియర్ రాజకీయవేత్త జీవన్‌రెడ్డికి పార్టీ ఫిరాయింపు విషయంలో తేడా ఉంది. ఆ పదిమంది భారత రాష్ట్ర సమితి టికెట్ మీద శాసనసభ ఎన్నికయినవారు. జీవన్‌రెడ్డి ప్రస్తుతం ఏ చట్టసభలోనూ లేరు. కాబట్టి ఎవరి రాజకీయాలు సరైనవి, ఎవరితో కలిసి పనిచేయాలి అన్నది ఆయన ఇష్టం. నలభైఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆయనకు కాంగ్రెస్ విధానాలో, వ్యవహార శైలో నచ్చలేదు, పార్టీ మారారు. ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. అయినా పార్టీ ఫిరాయింపుల గురించి సీరియస్‌గా ఆలోచించే రోజులు పోయాయి. 1970వ దశకంలో హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి ప్రాంతానికి సంబంధించిన ఒక భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కొన్ని నెలలపాటు చర్చ జరిగింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, కాంగ్రెస్ విధివిధానాలకు పోలికే లేదు కదా ఎందుకు పార్టీ ఫిరాయించి ఉంటాడు అని. అంత ఛోటా నాయకుడు పార్టీ మారితే కూడా అంత పెద్దయెత్తున చర్చ జరిగింది. అదే పార్టీలో కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత చాలా పెద్ద నాయకుడు, పార్టీలకతీతంగా అత్యంత గౌరవం పొందిన నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకోసం అప్పటి అధికారపక్షం అయిన తెలుగుదేశం పార్టీలో చేరితే దానిమీద పెద్దగా చర్చ జరగలేదు. అంటే, అప్పటికి పార్టీలు మారడం చాలా సాధారణం అయిపోయింది. మిగతా పార్టీలలో ఫిరాయింపుల పరిస్థితి ఎలా ఉన్నా, వామపక్ష పార్టీల్లో చేరేవారు సాధారణంగా కమ్యూనిస్టు సిద్ధాంతానికి నిబద్ధులై ఉంటారని భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు, ఆ సంఘటనలకు అసలు పోలిక లేదు. ఇప్పుడు జరిగే ఫిరాయింపులు అధికారం కోసం లేదా అధికారంలో ఉన్నవారి నుంచి పొందాలనుకున్న ప్రయోజనాల కోసం. అవి ప్రజాప్రయోజనాలు కావచ్చు, వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు. సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డిని కొంచెం భిన్నంగా చూడాలి. తెలంగాణ ప్రాంతంలో ఆయన ముక్కుసూటి మనిషి, నిజాయితీపరుడని పేరు తెచ్చుకున్న నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినవాడు. ఒక్క పర్యాయం మినహాయిస్తే ప్రజాజీవితం అంతా కాంగ్రెస్ పార్టీలోనే గడిచింది. 1983లో అప్పుడప్పుడే ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడుగా ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టిన జీవన్‌రెడ్డి 1984లో నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి తర్వాత కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు ఆరుసార్లు జగిత్యాల నియోజకవర్గంనుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి ఉత్తర తెలంగాణ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంనుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడుసార్లు లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రెండుసార్లు ఆయన కరీంనగర్ లోక్‌సభకు కెసిఆర్ మీదనే పోటీచేసి ఓడిపోయారు. మొదటిసారి దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతే, రెండవమారు అతి స్వల్పంగా కేవలం పదిహేనువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని కొద్దిమాసాలుగా వినిపిస్తూనే ఉన్నది. ఏం కోరి ఆయన కాంగ్రెస్‌ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు? ఏం ఆశించి భారత రాష్ట్ర సమితి ఆయనను తన అక్కున చేర్చుకుంటున్నది? సాధారణంగా పార్టీ ఫిరాయింపులు ప్రతిపక్షంనుండి అధికారపక్షంలోకి జరుగుతుంటాయి. జాతీయ రాజకీయ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ అధికారంలో ఉండగా, భవిష్యత్తు ఇంకా స్పష్టంగా లేని ప్రాంతీయపార్టీలో చేరాలని ఆయన ఎందుకు నిర్ణయించుకున్నారు? ఈ విషయం రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నవారికంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ ఆలోచించాలేమో. అధికారపక్షానికి కనిపించని బిఆర్‌ఎస్ అనుకూల వాతావరణం ఏదైనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ జీవన్‌రెడ్డికి కనిపిస్తున్నదా? జీవన్‌రెడ్డి ప్రస్తుతం పార్టీ వీడి బిఆర్‌ఎస్‌లో చేరడానికి చెబుతున్న కారణాలు ఏవైనా, జగిత్యాలనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కాంగ్రెస్‌కు వలసపోవడమే ప్రధాన కారణమని అందరికీ తెలుసు. తనమీదనే గెలిచిన సంజయ్‌తో కలిసి పనిచేయడం జీవన్‌రెడ్డి వల్ల కాని పని. కాంగ్రెస్ పెద్దలు, ముఖ్య నాయకులు, పిసిసి అధ్యక్షునితో సహా సీనియర్ మంత్రులు కూడా వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంత రాజకీయ జీవితం చూసిన తర్వాత జీవన్‌రెడ్డి ఇంకా ఏం ఆశిస్తున్నట్టు? చాలామందికి రాజకీయాల్లో దక్కనన్ని అవకాశాలు ఆయనకు వచ్చాయి. ఇన్ని దశాబ్దాలుగా తాను పార్టీకి పనిచేస్తూ ఉంటే మధ్యలో వచ్చిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏమిటన్న దుగ్ధ కూడా ఆయనను బాధిస్తూ ఉండవచ్చు. అది మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులలో కూడా ఉండవచ్చు. అయితే అటువంటి ఆలోచన చేస్తున్నవారు ఎవరైనా సరే, జీవన్‌రెడ్డితోసహా, కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఆ ఖాళీ ఎందుకు ఏర్పడింది? రేవంత్‌రెడ్డి వచ్చి ఆ ఖాళీని పూరించి ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన వాతావరణం ఎందుకు ఏర్పడింది? అని కదా ఆలోచించాలి. మొదటినుంచీ కాంగ్రెస్‌తో ఉన్న నాయకులు ఎందుకు రేవంత్‌రెడ్డిలు కాలేకపోయారు? సరే, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం దగ్గర నుండి బిఆర్‌ఎస్‌కు చెందిన సంజయ్ కాంగ్రెస్‌లో చేరడంవరకు ఉన్న పలు కారణాలు జీవన్‌రెడ్డిని భారత రాష్ట్ర సమితిలోకి పంపించి ఉండవచ్చు. ఒక దశలో ఆయన భారతీయ జనతా పార్టీలో కూడా చేరతారని ప్రచారం జరిగింది. అయితే మైనారిటీలను దూరం చేసుకోవాల్సి వస్తుందని ఆయన ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. ఇక భారత రాష్ట్ర సమితి విషయానికొస్తే అధికారంలో లేదు కాబట్టి ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానించడం, అందునా జీవన్‌రెడ్డివంటి బలమైన నాయకుడు రావడం అనుకూల అంశంగానే భావిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిననాటి నుండి కూడా చంద్రశేఖరరావు ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కేంద్రంగానే ఉద్యమంగానీ, రాజకీయంగానీ నడిపించారు. మూడుసార్లు ఆయన కరీంనగర్ లోకసభ స్థానంనుండి పోటీచేసి గెలిచారు (2004, 2006, 2008). తన సొంత జిల్లా మెదక్‌ను కాకుండా కెసిఆర్ కరీంనగర్‌ని ఎంచుకోవడం, ఆయన కుమారుడు కెటి రామారావు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్లనుండే రాజకీయ అరంగేట్రం చేయడం ఇవన్నీ కెసిఆర్, ఆయన పార్టీ కరీంనగర్‌కి ఇచ్చిన ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. పార్టీలో ఉండిన మరో బలమైన నాయకుడు ఈటల రాజేందర్‌ని బయటికి పంపించిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బలమైన నాయకుడి అవసరం ఉందని భావించి కెసిఆర్ జీవన్‌రెడ్డికి ఆహ్వానం పలికారా? జీవన్ రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి బలం వచ్చే ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఈనెల 20వ తేదీన భారీ జనసమీకరణ జరిపి జగిత్యాలలో నిర్వహించే బహిరంగసభలో జీవన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. ఈ బహిరంగసభలో కెసిఆర్ కూడా ప్రసంగిస్తారని వార్తలు వెలువడ్డాయి. పార్టీ రజతోత్సవ సభలో ప్రసంగించిన తర్వాత బహిరంగవేదికల మీదికి కెసిఆర్ రావడం ఇదే మొదలు అవుతుంది. సుదీర్ఘ రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌లో లభించని ప్రాధాన్యత భారత రాష్ట్ర సమితిలో లభిస్తుందని జీవన్‌రెడ్డి భావిస్తున్నారా? అన్నది ఒక ప్రశ్న అయితే మహామహా కాంగ్రెస్ దిగ్గజాల్ని తన పార్టీలో చేర్చుకొని తరువాత మూలన కూర్చోపెట్టగలిగిన కెసిఆర్ జీవన్‌రెడ్డిని ఏం చేస్తారో చూడాలి. జీవన్‌రెడ్డిని పార్టీ వీడకుండా చూసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం నిస్సహాయంగా ఉండిపోయిందనీ, అంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇష్టప్రకారం జరుగుతున్నదనీ ఒక చర్చ జరుగుతున్నది. ఇలా విమర్శించిన నోళ్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం రాష్ట్రాల నాయకులను సామంతరాజుల వలే చూస్తుందనీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గాలి పీల్చి వదలాలన్నా ఢిల్లీ అనుమతికోసం ఎదురుచూస్తూ ఉంటారని విమర్శించడం ఎన్నోసార్లు విన్నాం. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉండిన డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి అధిష్టాన వర్గాన్ని గౌరవిస్తూనే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగారు. అదే పని రేవంత్‌రెడ్డి చేస్తుంటే అభినందించవలసిందిపోయి కాంగ్రెస్ హై కమాండ్ అదుపులో ఏం లేదు అని కాంగ్రెస్ వ్యతిరేకులు బాధపడటం ఎందుకో? ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వస్తున్న సమాచారం నిజమయితే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం. అదే జరిగితే అధిష్టానం దగ్గర రేవంత్‌రెడ్డి పలుకుబడి, పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళ ఎన్నిక మొత్తం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ చేతుల మీదుగానే సాగింది. కేరళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ జరిగిన విషయం తెలిసిందే. ఏదిఏమైనా జీవన్‌రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు ఇంకో మార్గం ఎంచుకోవడం వల్ల ఆయనకు, భారత రాష్ట్ర సమితికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా లేక గతంలో కాంగ్రెస్‌ను వీడిన దిగ్గజాల పరిస్థితి జీవన్‌రెడ్డికీ ఎదురవుతుందా? ఏదిఏమైనా ముక్కుసూటి రాజకీయాలు చేసే జీవన్‌రెడ్డికి ఆల్ ది బెస్ట్.  Delete Edit

మన తెలంగాణ 12 Apr 2026 12:02 am

వార ఫలాలు (12-04-2026 నుంచి 18-04-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. విద్యా ఉద్యోగపరంగా మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఏ కార్యక్రమం మీరు ప్రారంభించిన దానిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. క్రయవిక్రయాలు లాబిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చికాకులు పెరుగుతాయి. ఎంతోకాలంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి కాలభైరవ రూపం మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చి సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా పడిన ప్రేమకు ఫలితం లభిస్తుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు బంగారు వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏదైనా ఒక మంగళవారం రాహు సాయంత్రం పూట రాహుకాల దీపం పెట్టండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించకపోవచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు లైట్ గ్రీన్. అదేరా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గతమార్తం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయానికి ఎక్కువగా స్పందించవద్దు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఓం నమో నారాయణా వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఒక వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. మెడలో దక్షిణామూర్తి రూపు ధరించండి. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. కొద్దికాలం వేచి ఉండండి. ఈ రాజు వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు రాయల్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందుకు వెళ్లాలనే భావనతో ఉంటారు అదేవిధంగా ప్రయత్నం చేస్తే ఫలితం కూడా దక్కుతుంది. మీ నీతి నిజాయితీలే మిమ్మల్ని రక్షిస్తాయి. ఏదైనా సరే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు కాలానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళండి కచ్చితంగా మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. అదేవిధంగా రావలసిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. స్థిరస్తుల విలువ పెరగటం చక్కటి అవకాశాలు రావటం జరిగే అవకాశం లేకపోలేదు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడి ముందుకు వెళ్లాలి. పదిమంది బాగుండాలి పదిమందితో కలిసి మనం కూడా ముందుకు వెళ్లాలి అనే భావనతో ఉంటారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వారికి అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్ కి కాలం అనుకూలంగా ఉంది. గ్రూప్స్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది. ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు గ్రహించి మెలగాలి. అఘోర పాశుపత హోమం చేయించుకోండి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1 కలసవచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులారాశి వారికి వారం చాలు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా బాగా కలిసి వస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు కన్న కలలు నెరవేరుతాయి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలనుకుంటారు ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు వెళతారు. అదేవిధంగా శత్రువుల పైన మీరు విజయం సాధిస్తారు. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎప్పుడో చేసిన సహాయానికి కొంతైనా రుణం తీర్చుకోవాలని ముందుకు వస్తారు. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త గృహం కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సోదరుల మధ్య మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయి. వారి సహకారంతో మరింత ముందుకు వెళ్లే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలుచేస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఏదైనా సరే అందరితో సామరస్య భావంతో ఉండాలనే భావన నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గుతుంది. చదువు మీద శ్రద్ధ వహించి నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం వరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వ్యాపార రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. చిన్న వ్యాపారస్తులకు కూడా ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించి నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజ ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా సమస్యలు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరీ సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. ఎవరైనా శత్రువులు ఉంటే మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఇప్పుడు సరైన సమయం కాదు కాబట్టి కొంతకాలం ఆగి ప్రయత్నించండి. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు ఏదైతే ఒక కోరిక ఉన్నదో అది ఈ వారం నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి ముఖ్యంగా కాంపిటీటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం ఎరుపువతులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం చాలావరకు బాగుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కూడా చాలావరకు సానుకూల పడతాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఒక కార్యక్రమాన్ని తల పెడతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్థాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం ప్రోత్సహిస్తుంది. వచ్చిన ఉద్యోగాన్ని కాదని వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ప్రస్తుతం ఉన్న సమయంలో సద్వినియోగపరుచుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్యరీత్యా చిన్నచిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలావరకు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా చేసే చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ తర్వాత లాభాలు వచ్చే విధంగా కూడా ఉంది. ఎంత లాభం వస్తుందో ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అప్పులకి దూరంగా ఉండటం క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండటం చెప్పదగిన విషయం. ఏదైతే మీరు సంకల్ప సిద్దితో ఒక మంచి కార్యక్రమం తలపెడుతున్నారు అది నెరవేరుతుంది. అన్నదాన సత్రాలకు చాలావరకు అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటున్నారో దాని కోసం కొంతకాలం ఆగి ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం, దుర్గాదేవి స్తోత్రం చదవటం చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం చాలావరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసివచ్చే రంగు ఎల్లో, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. కుంభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా బయట పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు లేదా విదేశీ సంస్థల్లో ఉద్యోగం రావటం కావచ్చు జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాస్త సమయం పడుతుంది ఇప్పటినుంచి ప్రయత్నిస్తే సంవత్సరం చివరిలో వెళ్లే అవకాశం గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ పని ప్రారంభించిన దిగ్విజయంగా పూర్తి అవుతుంది. కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు వారాలు కాస్త చికాకు పెడతాయి. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలకు దూరంగా ఉండటం అలాగే ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాల విషయాలలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొంతవరకే అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రథమార్తం కంటే ద్వితియార్థం చక్కగా ఉంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంత ధర నష్టం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మోటిక్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చులు అయ్యే అవకాశం గోచరిస్తుంది. రూపాయికి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం మంగళవారం శనివారం ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గ్రహ స్థితులపరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తాయి. ఎప్పుడో కొన్న స్థిరస్తుల విలువలు పెరుగుతాయి. మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే వారు చాలావరకు ఉంటారు. కానీ దైవానుగ్రహం వల్ల అలాంటివేమీ జరగకుండా ఉంటాయి. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. పదిమందికి ఆమోదపూర్వకంగా ఉంటుంది. అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు వెళతారు ఈ ఆలోచనలే పదిమందికి నచ్చుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ పదవీ కోసం ఎదురుచూసే వారికి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. ప్రజలలో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఒక పదవి రాకపోవటం అనేది నిరాశకు గురి చేస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చక్కటి అవకాశం. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏదైనా ఒక పనిమీద నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోండి. మీరు ఆలోచించి తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే సఫలీకృతం అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు గాని దైవదర్శనాలు గాని చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మన సంకల్పం బాగుండాలి పదిమంది బాగుండాలి అని ఆలోచనతో ముందుకు వెళతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలావరకు అనుకూలంగా ఉంది. భూ సంబంధిత విష వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విష వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అప్పులు చేయటానికి దూరంగా ఉండటం క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు ఆలస్యంగా చేతికి అందుతాయి కావున ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే మీరు మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లాలి. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. లాభాల రూపంలో కావచ్చు పేరు ప్రఖ్యాతలు రూపంలో కావచ్చు కచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువు పట్ల ఇంకా అధిక శ్రద్ధ వహించాలి. చెడు వ్యసనాలకు సోషల్ మీడియాకు స్నేహితులకు దూరంగా ఉండాలి. ఇతరులకు అంతరంగ విషయాలు చెప్పడం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ పెట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి మీరు కోరుకునే ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా వైద్యవృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మద్యస్థ ఫలితాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన పెట్టుబడులు పెట్టి మోసపోకండి. ఖర్చులో విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం చెప్పుదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, దుర్గా స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  

మన తెలంగాణ 12 Apr 2026 12:00 am

తప్పుగా మాట్లాడితే చెప్పు తెగుద్ది

‘తప్పు డు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది’ అంటూ మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షా లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీతక్క ఆరోపించారు. అవసరమైతే కోర్టులకు వెళ్లి పరువు న ష్టం దావాలు వేస్తామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామని చె ప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెప్తున్నాయన్నారు. మేడారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వచ్చిన విమర్శలను సీతక్క కొట్టిపారేశారు. మేడారం గద్దెల వద్ద జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి సీతక్కపై బురదజల్లితే ఊరుకోం: ఇందిరాశోభన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కపై ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న అసత్యారోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభన్ తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల టెండర్ల వ్యవహారంపై ఆమె గణాంకాలతో సహా శనివారం మీడియాకు వివరించా రు. బీఆర్‌ఎస్ నాయకుడు క్రిశాంక్ గత నెల రో జులుగా పొంతన లేని మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇందిరాశోభన్ ధ్వజమెత్తా రు. గత నెలలో రూ.8 కోట్ల కుంభకోణం అన్న క్రి శాంక్, నిన్నటి ఇంటర్వ్యూలో రూ.30 కోట్లు అన డం, నెల తిరక్క ముందే ఆయన మాటల్లోనే పొం తన లేకపోవడం విడ్డూరమన్నారు. కేంద్ర ప్రభు త్వ పథకమైన ‘పోషణ్ అభియాన్’ కింద మొత్తం 38,130 మొబైల్ ఫోన్ల కొనుగోలుకు 2025 న వంబర్‌లో టెండర్లు పిలిచారని ఇందిరాశోభన్ తెలిపారు. కేంద్రం నిర్దేశించిన ధర రూ.11,800 కాగా, తమ ప్రభుత్వం కేవలం రూ.11,650లకే ఫోన్లను కొనుగోలు చేసిందని వివరించారు. ఇం దులో ఫోన్ మాత్రమే కాకుండా పవర్ అడాప్టర్, యూఎస్బీ కేబుల్, ఇంటర్ఫేస్, డస్ట్ ప్రూఫ్ పౌచ్, మొబైల్ కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్తో సహా రెండేళ్ల పాటు ’మొబైల్ డివైస్ మేనేజ్మెంట్’ అప్లికేషన్ వంటి ఆరు రకాల అదనపు సేవలు ఉన్నాయని తెలిపారు. సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు అంగన్వాడి మొబైల్స్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ మంత్రి సీతక్కను లక్షంగా చేసుకుని బిఆర్‌ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ స్టేషన్లో అంబర్ పేట కాంగ్రెస్ నేత పాండు నాయక్ ఫిర్యాదు చేశారు. పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తూ మంత్రి సీతక్క ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మన తెలంగాణ 11 Apr 2026 11:32 pm

ఈతకెళ్లి ఇద్దరు బాలికల మృతి

గూడూరు  మండలంలోని మట్టేవాడ గ్రామ శివారు నేలవంచ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు శనివారం ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం నేలవంచ గ్రామానికి చెందిన కత్తుల శిరీష(9) ,పేనక చరిత్ర(9) ఇద్దరు స్నేహితురాలు. ఈతకని వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర గిరిధర్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 11 Apr 2026 11:26 pm

టోల్‌ప్లాజాల్లో కేవలం డిజిటల్ చెల్లింపులే

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల టోల్‌ప్లాజాలలో వసూళ్లు ఇకపై కేవలం డిజిటల్ రూపంలోనే జరుగుతాయి. శనివారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఆన్‌లైన్ చెల్లింపులలో షాస్టాగ్ లేదా యుపిఐ ప్రక్రియలతోనే చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని ఉత్తర్వులు వెలువడ్డాయి. టోల్ కలెక్షన్లలో సమర్థత, పారదర్శకత కోసం ఈ చర్యను గణనీయ రీతిలో తీసుకువచ్చారు. అయితే టోల్‌గేట్ వసూళ్లలో మార్పును అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో ఇప్పుడు వర్తింపచేయడం లేదని ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ చెల్లింపుల పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సిందే అని , లేకపోతే ఇబ్బందులు తప్పవని జాతీయ రహదారుల అధీకృత సంస్థ ఎన్‌హెచ్‌ఎఐ తెలిపింది. ఈ నెల 10వ తేదీనే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. 

మన తెలంగాణ 11 Apr 2026 11:16 pm

గుండెపోటుతో ఆసుపత్రిలో ఆశాభోస్లే

ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు రావడంతో స్థానిక బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో హుటాహుటిన చికిత్సకు చేర్పించారు. వేలాది పాటల గాయని ఆశాభోస్లే వయస్సు 92 పంవత్సరాలు. దిగ్గజ గాయని లతామంగేష్కర్‌కు చిన్న సోదరి అయిన ఆమెకు చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. దీనితో శ్వాస కోశ అవలక్షణాలను ఎదుర్కొంటున్నారు. చికిత్సకు ఆమెను ఆసుపత్రికి తరలించిన విషయాన్ని కుటుంబ వర్గాలు, సన్నిహితులు తెలియచేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రకటన వెలువడింది. 

మన తెలంగాణ 11 Apr 2026 10:43 pm

హర్మూజ్ మీదుగా రెండు అమెరికా యుద్ధనౌకలు

ఇరాన్‌తో ఎటువంటి సమన్వయం లేకుండా రెండు అమెరికా యుద్ధ నౌకలు శనివారం కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లాయి. హర్మూజ్‌ను రాకపోకలకు క్లియర్ చేస్తామని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు. ఈ దశలోనే ఈ జలమార్గాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అమెరికా యుద్ద నౌకలు దాటివేయడం కీలక అంశం అయింది. ఇరాన్‌తో యుద్దం ఆరంభం తరువాత ఈ జలసంధిని అమెరికా నౌకలు దాటడం ఇదే తొలిసారి అయింది. అమెరికా నౌకాదళ సారధ్య మిసైల్ విధ్వంసకాలు హర్మూజ్ దాటిన విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ అమెరికా అధికారుల నిర్థారణ మేరకు వెలువరించింది. హర్మూజ్‌లో సీ మైన్స్ తొలిగింపు ప్రక్రియను అమెరికానే స్వయంగా చేపడుతుందనే వార్తలు ఈ నౌకల కదలికలతో బలోపేతం అయ్యాయి.

మన తెలంగాణ 11 Apr 2026 10:40 pm

శతకంతో చెలరేగిన సంజూ.. ఢిల్లీకి భారీ టార్గెట్

ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ కతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి శుభారంభం దక్కింది. సంజూ భారీ షాట్లతో చెలరేగాడు. గత మూడు మ్యాచుల్లో విఫలమైన సంజూ.. ఢిల్లీపై విరుచుకుపడ్డాడు. దీంతో 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సులతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆయూష్ మాత్రే(59) రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగాడు. చివర్లో శివమ్ దూబే(20 నాటౌట్) రాణించాడు.దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు చేసింది.

మన తెలంగాణ 11 Apr 2026 9:55 pm

LIK is a Big Shock for Pradeep Ranganathan

Pradeep Ranganathan has delivered quite impressive films like Love Today, Dragon and Dude. All these films impressed the youth and Pradeep Ranganathan was focused on the script and the writing of these films. Top production house Mythri Movie Makers has offered a remuneration of Rs 50 crores for his next film that will be launched […] The post LIK is a Big Shock for Pradeep Ranganathan appeared first on Telugu360 .

తెలుగు 360 11 Apr 2026 9:49 pm

Legendary Singer Hospitalized

Legendary Indian singer Asha Bhosle who is 92 years old has been rushed to a private hospital in Mumbai after she suffered cardiac arrest. She is undergoing treatment under the supervision of experts in Breach Candy Hospital in Mumbai. Asha Bhosle has been unwell from the past few months and she is away from singing […] The post Legendary Singer Hospitalized appeared first on Telugu360 .

తెలుగు 360 11 Apr 2026 9:48 pm

లాడ్జిపై పోలీసుల దాడులు.. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిన మహిళలు

నారాయణపేట: వ్యభిచారం నిర్వహిస్తూ నలుగురు మహిళలు పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్‌ లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను పట్టుకున్నారు. పట్టుబడిన మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి.. స్టేట్ హోమ్‌కు పంపిస్తున్నట్లు నారాయణపేట సీఐ శివశంకర్ తెలిపారు. అలాగే, లాడ్జ్ యజమాని బుగ్గేశ్వర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పట్టణంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సిఐ స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. 

మన తెలంగాణ 11 Apr 2026 9:37 pm

gudur mandal |బావిలో పడి ఇద్దరు బాలికల మృతి

gudur mandal | బావిలో పడి ఇద్దరు బాలికల మృతి gudur mandal

ప్రభ న్యూస్ 11 Apr 2026 9:15 pm

సుప్రీం కోర్టును ఆశ్రయించిన లాలూ..

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఉద్యోగాలకు భూమి’ అవినీతి ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ శనివారం లాలూ ప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 13న ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. అంతకుముందు, తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్లను కొట్టివేయాలన్న లాలూ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రవీందర్ దత్ దేజా తిరస్కరించారు. ఈ కేసులో దాఖలైన మూడు ఛార్జిషీట్లను కూడా కోర్టు సమర్థించింది. కాగా, 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. జబల్‌పూర్‌లోని ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ జోన్‌లో, బహుమతిగా ఇచ్చిన లేదా బదిలీ చేసిన భూమికి బదులుగా “గ్రూప్ డి” రైల్వే ఉద్యోగాలను కేటాయించారని అధికారులు ఆరోపిస్తున్నారు.  అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సీబీఐ ముందస్తు అనుమతి పొందనందున, ఎఫ్ఐఆర్, దర్యాప్తు, ఛార్జిషీట్లు చట్టపరంగా లోపభూయిష్టంగా ఉన్నాయని, అందువల్ల ఈ విచారణ చెల్లదని లాలూ వాదించారు.

మన తెలంగాణ 11 Apr 2026 8:45 pm

డీజిల్‌ ఎగుమతిపై సుంకాన్ని పెంచిన కేంద్రం..

 న్యూఢిల్లీ:  డీజిల్‌ ఎగుమతిపై సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. డీజిల్ ఎగుమతిపై సుంకాన్ని లీటరుకు రూ.21.5 నుంచి రూ. 55.5కు పెంచినట్లు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, విమాన ఇంధనం (ATF)పై కూడా సుంకాన్ని పెంచింది. ATFపై సుంకాన్ని లీటరుకు రూ.29.5 నుంచి రూ. 42కు పెంచింది. ఈ సుంకాల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే, పెట్రోల్‌ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పు లేదని.. యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. కాగా,  పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 26న డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ. 21.50, ATFపై లీటరుకు రూ. 29.5 చొప్పున ఎగుమతి సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 11 Apr 2026 8:22 pm

రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలో మీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయిని వివరించారు. రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హయత్ నగర్-, ఎల్.బి.నగర్ మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నాట్టు వివరించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని, పైన ఉండే రెండు అండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని పేర్కొన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో పికో టెక్నాలజి వ్యవస్థాపక సిఇఒ జారొడ్ యుస్టర్, పికో ఇండియా సిఇఒ హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 8:21 pm

Driving seat |కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

Driving seat | కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

ప్రభ న్యూస్ 11 Apr 2026 8:20 pm

తనపై ఆరోపణలు.. నార్సింగి పిఎస్‌లో మంగ్లీ ఫిర్యాదు

హైదరాబాద్: తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుభా సింగబోష్‌పై సింగర్ మంగ్లీ నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.150 కోట్ల మేర మోసం చేశారంటూ తనపై అతడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభా సియపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించారని తెలిపారు. ‘‘అతడు అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు. నిరాకరిస్తే అప్రతిష్ట పాలుచేస్తానని బెదిరించారు. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యాలు చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారు. సుభా సింగబోష్ తీరుపై నా కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు’’ అని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

మన తెలంగాణ 11 Apr 2026 8:16 pm

‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మిగా కయాదు లోహర్

నేచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ డ్రామా ’ది ప్యారడైజ్’ పై అంచనాలు ’ఆయా షేర్’ సింగిల్ విడుదల తర్వాత నెక్స్ లెవెల్ కి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ప్రతి పాత్ర పరిచయంతో ఆసక్తిని మరింత పెంచుతోంది. అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా, హీరోయిన్ కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర నిర్మాతలు శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కయాదు లోహర్ ’ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి సుబ్బలక్ష్మి (సుబ్బు)పాత్రలో అడుగుపెట్టింది. సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ, ఆమె పాత్ర ఆ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని పోస్టర్ సూచిస్తోంది. ఇప్పటికే భారీ విజువల్స్, గ్రాండ్ సెట్టింగ్, బలమైన పాత్రలతో ఈ చిత్రం అంచనాలు పెంచుతోంది. మోహన్ బాబు విలన్‌గా, రాఘవ్ జుయాల్ కీలక పాత్రలో, అలాగే సంపూర్ణేష్ బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

మన తెలంగాణ 11 Apr 2026 8:07 pm

కాల్పుల విరమణ తరువాత భారత్‌కు తొలి ఎల్‌పీజీ ట్యాంకర్

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత భారత పతాకం కలిగిన ఎల్‌పిజి ట్యాంకర్ జగ్ విక్రమ్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హర్మూజ్ జలసంధిని దాటి శనివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోకి ప్రవేశించింది. మరి కొద్ది రోజుల్లో భారత్‌కు ఇది చేరుకోనుంది. కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత హర్మూజ్‌ను దాటిన మొట్టమొదటి నౌక ఇదే. మార్చి నెల మొదట్లో హార్ముజ్ జలసంధిని దాటిన తొమ్మిదో నౌక జగ్ విక్రమే అవుతుంది. మరో భారత రిజిస్టర్డ్ నౌకలు పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయని,త్వరలో అవి కూడా ఇదే మార్గం మీదుగా భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 

మన తెలంగాణ 11 Apr 2026 8:02 pm

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వసంత ఆకస్మిక తనిఖీ…

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వసంత ఆకస్మిక తనిఖీ… మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:48 pm

పాక్ ప్రధానితో ఇరాన్, అమెరికా బృందాలు వేర్వేరుగా భేటీ

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బిజీ అయ్యారు. ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు శాంతి చర్చలకు ముందు శనివారంనాడు ఆయనతో వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ భేటీల్లో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కూడా ఉన్నారు. ఇరాన్ స్పీకర్ మహ్మద్ బఘేరి, విదేశాంగ మంత్రి అరాగ్చీ తదితరులు పాక్ ప్రధానితో సమావేశమైన చర్చలకు సంబంధించి షరతులను ఆయన ముందుంచారు. అమెరికా స్తంభింపచేసిన విదేశాల్లోని తమ ఆస్తులను విడుదల చేయడం, లెబనాన్‌పై తక్షణమే దాడులు ఆపాలని, అప్పుడే చర్చలు ముందుకు వెళ్తాయని చెప్పినట్లు సమాచారం. అంతకుముందు జెడి వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందంతో కూడా షరీఫ్ సమావేశమయ్యారు. వాన్స్‌తో పాటు ఈ సమావేశంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్ ఉన్నారు. ఇరు పక్షాలతో చర్చలు ప్రశాంతంగా సాగాలని, ఫలితం దిశగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు షరీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఈ చర్చలతో శాశ్వత శాంతి నెలకొనాలని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారని పాక్ అధికారిక టివి వెల్లడించింది. 

మన తెలంగాణ 11 Apr 2026 7:46 pm

‘కొరియన్ కనకరాజు’ నుంచి తొలి సింగిల్ విడుదల

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌కి విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సింగిల్‌ని విడుదల చేశారు. ఈ పాటని కాసర్ల శ్యామ్ రచించగా.. సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 11 Apr 2026 7:45 pm

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి…

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి… నో ప్రిస్క్రిప్షన్… నో మెడిసిన్..డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:45 pm

బోనకల్ వద్ద గంజాయి పట్టివేత…

బోనకల్ వద్ద గంజాయి పట్టివేత… నిందితుడి అరెస్ట్, 2.4 కిలోల గంజాయి స్వాధీనం…

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:41 pm

రూల్స్ పెడతాం....పాటించం

 ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పే పోలీసులే ఉల్లంఘిస్తే...రూల్స్ నగరవాసులకే తప్ప తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తే...తామేమి చేసినా అడిగేవారు లేనట్లుగా నిబంధనలు ఉల్లంఘించడంపై నగర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూల్ పెడుతాం కానీ పాటించం అన్నట్లుగా పోలీసుల తీరుపై సర్వత్రా గుర్రుమంటున్నారు. హెల్మెట్ లేకున్నా, రాంగ్‌రూట్‌లో వెళ్లినా కొరడా జులిపిస్తున్న పోలీసులు తమవారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ వాహనాలతో రాంగ్ రూట్‌లో వెళ్తు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు సాధారణ ప్రజలకు తప్ప తమకు వర్తించవని భావిస్తున్నట్లు ఉంది వారి వ్యవహారం. బండ్లగూడ జాగీర్, కాళీమందిర్ సమీపంలో టిఎస్ 09 పిఏ 2126 టాటా సుమో వాహనం రాంగ్ రూట్‌లో వెళ్లింది. ఎదురుగా వాహనాలు వారి దారిలో వస్తున్నా కూడా పోలీస్ వాహనం ఎదురుగా రాంగ్ రూట్‌లో వెళ్లింది. యూటర్న్ చాలా దూరం ఉండడంతో అంతదూరం ఎవరు తిరిగి వస్తారని, రాంగ్ రూట్‌లో వెళ్లాడు.

మన తెలంగాణ 11 Apr 2026 7:40 pm

స‌మాజ దిశ‌ను మార్చిన మ‌హాత్మా ఫూలే…

స‌మాజ దిశ‌ను మార్చిన మ‌హాత్మా ఫూలే… సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : మ‌హాత్మా

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:33 pm

పూలే విగ్రహానికి నివాళి

పూలే విగ్రహానికి నివాళి ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:25 pm

ఎలక్ట్రానిక్స్ తయారీలో ‘గ్లోబల్ హబ్’గా తెలంగాణ

ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచ స్థాయి కేంద్రం(గ్లోబల్ హబ్)గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్ మాత్రమే పరిమితం కాకుండా, విడిభాగాల తయారీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అవసరమైన పూర్తిస్థాయి ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం కోటి(10 మిలియన్లు) టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ‘తెలంగాణ’ కీలక పాత్ర పోషించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ దిశగానే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఓవైపు ఎలక్ట్రానిక్స్ తయారీలో టాప్ గ్లోబల్ ప్లేయర్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తూనే..మరోవైపు వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రెడీ టూ వర్క్ ఫోర్స్ తయారీపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి... ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సరళతర వాణిజ్య విధానాలతో పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్ ఛైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్, లీగల్ అండ్ ఐపీఆర్ హెడ్ శుభజిత్ సాహా, అడ్మినిస్ట్రేషన్ హెడ్ నోయెల్ రాబిన్ సన్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 7:20 pm

హైదరాబాద్ పై పంజాబ్ ఘన విజయం

ఐపిఎల్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 220 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభుసిమ్రాన్(51)లు మెరుపు అర్ధ శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69తో పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసి గెలుపొందింది. సన్ రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దూబే ఒక వికెట్ తీశాడు. అంతకుముందు, హైదరాబాద్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్, శశాంక్‌లు చెరి రెండు, బ్రాట్‌లెట్ ఒక వికెట్ తీశారు.

మన తెలంగాణ 11 Apr 2026 7:16 pm

సామాజిక మార్పు దిశగా జ్యోతిరావు ఫూలే ఆలోచనలు…

సామాజిక మార్పు దిశగా జ్యోతిరావు ఫూలే ఆలోచనలు… ఇటుకాలపల్లి గ్రామంలో ఘనంగా జయంతి

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:14 pm

Flash news: పంజాబీ రోటీ.. హైదరాబాద్ బిర్యానీ గొంతులో పడితే ఎంత మజా ఉంటుందో అలా ఉంది గురూ...!

వీకెండ్ మ్యాచ్ అదిరిపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించింది

తెలుగు పోస్ట్ 11 Apr 2026 7:12 pm

వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు

రాష్ట్రంలో విడుదల కానున్న ఇంటర్ ఫలితాలు తెలంగాణ మీసేవా వాట్సాప్ చాట్‌బాట్ వాట్సాప్ ద్వారా నేరుగా తమ పరీక్ష ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీసేవా తెలంగాణ వాట్సాప్ నెంబర్ 8096958096కు ‘Hi’ అని మెసేజ్ పంపించడం ద్వారా మీసేవా చాట్‌బాట్ మొదలవుతుంది. ‘BIE Exam Result’ టైప్ చేసి Open Service ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ / 2వ) స్ట్రీమ్ (జనరల్ / వొకేషనల్) ఎంచుకుని సమర్పిస్తే ఇంటర్ ఫలితం తక్షణమే వాట్సాప్‌లో వస్తుంది.

మన తెలంగాణ 11 Apr 2026 7:11 pm

వధూవరులను ఆశీర్వదించిన యశస్విని ఝాన్సీ రెడ్డిలు…

వధూవరులను ఆశీర్వదించిన యశస్విని ఝాన్సీ రెడ్డిలు… తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు బ్లాక్

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:08 pm

'అలా అంటే.. చెప్పు తెగుతది జాగ్రత్త'.. సీతక్క వార్నింగ్

తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. శనివారం ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై స్కాం అంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్దేశించిన స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారం ఓపెన్ టెండర్ ద్వారా GeM పోర్టల్‌లోనే కొనుగోలు చేశామని తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఫోన్లను ఎక్కువ ధరగా చూపిస్తూ ఊహాజనిత కథనాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు ఇకపై తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 11 Apr 2026 7:05 pm

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తాను…

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తాను… హైకోర్టున్యాయమూర్తి తిరుమలా దేవిజిల్లా

ప్రభ న్యూస్ 11 Apr 2026 7:05 pm

మహిళలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన మహానీయుడు…

మహిళలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన మహానీయుడు… చిట్యాల, ఆంధ్రప్రభ : అణగారిన

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:59 pm

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా భ్రమలే..

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా భ్రమలే.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:55 pm

KKR Kamsahamnida Song: Varun Tej Rocks with his charm

Korean Kanakaraju starring Mega Prince Varun Tej has been one of the most anticipated cross-culture horror comedies in Telugu Cinema. Ritika Nayak is playing the leading lady role in this Merlapaka Gandhi directorial produced by UV Creations. The makers have now released the first single, Kamsahamnida, composed by S Thaman and sung by Sid Sriram. […] The post KKR Kamsahamnida Song: Varun Tej Rocks with his charm appeared first on Telugu360 .

తెలుగు 360 11 Apr 2026 6:53 pm

ఎన్నికల సిద్ధతలో బీఆర్‌ఎస్ దూకుడు

ఎన్నికల సిద్ధతలో బీఆర్‌ఎస్ దూకుడు జఫర్‌గడ్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:50 pm

బాధితుడికి రూ. 2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్సీ….

బాధితుడికి రూ. 2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్సీ…. ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:47 pm

Revanth Reddy : రేవంత్ ను నమ్ముతారా? నిజాలను జనం అంగీకరిస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్భయంగా నిజాలు చెప్పి మరోసారి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 11 Apr 2026 6:46 pm

బిఆర్‌ఎస్ వలలో పడ్డా జీవన్ రెడ్డి: మల్లు రవి

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు ఘాటైన విమర్శలతో ముప్పెట దాడి ప్రారంభించారు.బిఆర్‌ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం, కానీ ప్రస్తుత ప్రభుత్వం పోయి కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని అంటున్నారని ఆయన శనివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కెసిఆర్ మళ్లీ ఎందుకు సిఎం కావాలో జీవన్ రెడ్డి సరైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని హరీష్ రావు, కెటిఆర్ చూడలేకపోతున్నారని, అందుకే ప్రతి రోజూ తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన విమర్శించారు. వారి శాపనార్ధాలే మా ప్రభుత్వానికి దీవెనలని ఆయన తెలిపారు. గతంలో కూడా డి. శ్రీనివాస్ ఇలాగే మోసపోయారని, ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యని ఇలాగే మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ గమనించి మీరు ఎక్కడున్నా మీ వ్యక్తిత్వాన్ని, మీ సిద్ధాంతాలను కాపాడుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా జీవన్ రెడ్డి నిబద్ధతతో పని చేశారని, పెత్తందారి వ్యవస్థకు దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశారని, మీ నాన్న కూడా దొరల గడీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఉన్నారని చెబుతుంటారని ఆయన తెలిపారు. అత్యంత సాధారణంగా మీరు జీవించారని, కాంగ్రెస్ విధానం కూడా సెక్యులరిజం, సోషలిజం, ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్ ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఈ మూల సిద్ధాంతాలకు అనుకూలంగా మీరు ఒక వ్యక్తిగా పెరిగి.. కాంగ్రెస్ పార్టీకి మీకు ఒక గుర్తింపును తీసుకొచ్చారని, అటువంటి మీరు.. ఇటీవల రాజ్యసభకు వెళ్లే అవకాశం రాలేదని కాంగ్రెస్ పార్టీని విడిచి.. రాజకీయ శత్రువైన బిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం బాధగా ఉందని డాక్టర్ మల్లు రవి అన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 6:44 pm

నల్ల బ్యాడ్జీలతో పంజాబ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే..

న్యూ చంఢీగఢ్: శనివారం ఐపిఎల్-2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో ఓ విషయం అందరి దృష్టిని ఆకట్టుకుంది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించారు. అందుకు కారణం ఏంటని చర్చ జరుగుతోుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన పడవ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారికి నివాళిగా టీమ్ నల్ల బ్యాడ్జిలు ధరించినట్లు పంజాబ్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘పడవ ప్రమాదంలో మరణించిన వారి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో అండగా నివాలనుకుంటున్నాం’’ అని పంజాబ్ పేర్కొంది. మథుర సమీపంలో యమునలో పంజాబ్‌కి చెందిన పది మంది భక్తులు పడవ ప్రమాదంలో మరణించారు. స్వల్ప గాయాలైన 18 మందిని రెస్క్యూ బృందం రక్షించింది. మృతులు అందరూ పంజాబ్‌కు చెందిన వారే కావడంతో పంజాబ్ కింగ్స్ ఈ క్రమంలోనే నల్ల బ్యాడ్జిలు ధరించి నివాళులు ఆర్పించారని టీమ్ పేర్కొంది. కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. పంజాబ్‌ విజయానికి ఇంకా 48 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో శ్రేయస్(18), నేహల్(9) ఉన్నారు.

మన తెలంగాణ 11 Apr 2026 6:41 pm

అంజన్న గర్భగుడి పునర్నిర్మానంలో భాగస్వాములు కండి..

అంజన్న గర్భగుడి పునర్నిర్మానంలో భాగస్వాములు కండి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; శ్రీ పడమటి

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:24 pm

చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం

చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల దాహార్తి

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:21 pm

చిట్యాలలో పాఠశాలల్లో ఫూలే జయంతి వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మహాత్మా జ్యోతిరావు

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:20 pm

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సునీత..

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సునీత.. రాప్తాడు, ఆంధ్రప్రభ : పంచాయతీ రాజ్

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:14 pm

ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించిన జన్నారం ఎస్సై

జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం నూతన ఎస్సైగా గుర్రం ఉదయ్ కిరణ్ శనివారం

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:13 pm

నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన మంగ్లీ

సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావుపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు

తెలుగు పోస్ట్ 11 Apr 2026 6:12 pm

క్యాతన్‌పల్లిలో బీజేపీలోకి చేరికలు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కల రమేష్ ఆధ్వర్యంలో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:11 pm

Iran Supreme Leader Alive : జన్బాజ్ బ‌చ్ గ‌యా Andhra Prabha News

Iran Supreme Leader Alive : జన్బాజ్ బ‌చ్ గ‌యా Andhra Prabha

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:11 pm

పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఫూలేకు నివాళులు

పరకాల, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలేకు

ప్రభ న్యూస్ 11 Apr 2026 6:09 pm

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 11 Apr 2026 5:59 pm

Chandrababu : మావిగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

జగన్ మావిగన్ విమర్శలకు చంద్రబాబు సమాధానమిచ్చారు

తెలుగు పోస్ట్ 11 Apr 2026 5:45 pm

ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు

టీడీపీ మండల కన్వీనర్ కుళ్లాయప్ప…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- నార్పల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బండ్లపల్లి కుళ్లాయప్ప మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు. ఆయన జీవితమే సమాజానికి ఆదర్శమని, సమానత్వం కోసం ఆయన […] The post ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:39 pm

కారుపై లారీ బోల్తా... పలువురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం జిల్లాలోని కీసర టోల్‌ప్లాజా దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఓ భారీ ట్యాంకర్ లారీ అదుపుతప్పి.. బిఎండబ్ల్యూ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో లారి కింద కారు చిక్కుకుని నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారుపై పడ్డ ట్యాంకర్‌ను తొలగించేందుకు రెస్క్యూ టీమ్‌, పోలీసులు శ్రమిస్తున్నారు. 

మన తెలంగాణ 11 Apr 2026 5:38 pm

Road Accident : కారుపై ... ట్యాంకర్...ఘోర ప్రమాదం

కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 11 Apr 2026 5:34 pm

సమిష్టి కృషితో బలోపేతం అవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ…

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఉపాధ్యాయుడు రవి కుమార్ విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందుతున్నాయని ఉపాధ్యాయుడు రవి కుమార్ తెలిపారు. విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ఎంపీపీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ […] The post సమిష్టి కృషితో బలోపేతం అవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:29 pm

Toll Plaza |కారుపై సిమెంట్ ట్యాంక‌ర్ బోల్తా

Toll Plaza | కారుపై సిమెంట్ ట్యాంక‌ర్ బోల్తా Toll Plaza |

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:27 pm

జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం : జల ధారతో సంఘాల చెరువుకు నీళ్లు అందేలా చేస్తామని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు చిత్రావతి నాలాను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాలో పూడికతీత పనులు చేపట్టే విధంగా ప్రతిపాదన చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఇలాంటి మేలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం ద్వారా ఈ సారి సంగాల చెరువుకు ఖచ్చితంగా నీరందించేలా చూస్తామని తెలిపారు. పరిజలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత […] The post జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:24 pm

ఫ్రెండ్స్ క్లబ్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్‌లో

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:24 pm

ఆదివాసి సమస్యలపై వినతి పత్రం..

ఆదివాసి సమస్యలపై వినతి పత్రం.. పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:20 pm

పారిశుద్ధ్య కార్మికుల మధ్య జన్మదిన వేడుకలు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్‌లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య తన జన్మదిన

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:20 pm

రాప్తాడు లో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.

రాప్తాడు లో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. రాప్తాడు , ఆంధ్రప్రభ : సూర్యుడు

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:17 pm

బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి..

బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి.. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. పాయకాపురం, ఆంధ్ర

ప్రభ న్యూస్ 11 Apr 2026 5:13 pm

ఉన్నసిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ కు లేదు: కెటిఆర్

హైదరాబాద్: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి అహంకారానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మంత్రి పొంగు లేటి శ్రీనావాస్ రెడ్డి పై కెటిఆర్ ఫైరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోర్త్ సిటీ ఒక డ్రామా..తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్రని, నిషేధిత భూముల జాబితాల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు అని కెటిఆర్ విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని, కోహెడలో 178 ఎకరాల భూమి అమ్ముకునేందుకు ప్రయత్నమని మండిపడ్డారు. ఉన్నసిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ కు లేదని, ఫ్యూచర్ లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ కడతా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, అధికారులు కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడితే వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలని కెటిఆర్ కోరారు. 

మన తెలంగాణ 11 Apr 2026 5:13 pm

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం..

కన్వీనర్ నామా ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను అందజేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సేవా కార్యక్రమానికి ఊరు గుండ్ల రంగనాథం వారు దాతగా సహకరించి విజయవంతం చేసినందుకు వారు సేవాసమితి తరపున […] The post ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 5:04 pm

తన ఆత్మను చంపుకొని కెసిఆర్‌ను కౌగిలించుకున్నాడు..

జీవన్‌రెడ్డి తన ఆత్మను చంపుకొని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కౌగిలించుకున్నాడని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్‌ అన్నారు. కాంగ్రెస్ ను వదలి ఆ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఆయన కెసిఆర్ ను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు.. జీవన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. శనివారం జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. 40 ఏళ్లు అండగా ఉన్న పార్టీని వదిలి కెసిఆర్ విషకౌగిలిలోకి జీవన్‌రెడ్డి వెళ్లారన్నారు. జీవన్‌రెడ్డి.. తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడని, కెసిఆర్ విష కౌగిలిలో చిక్కుకుని బలై ఇప్పుడు కనిపించకుండా పోయిన సీనియర్ నాయకులను జీవన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు. కెసిఆర్ రాక్షస, అవినీతి పాలనపైన 10 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశానని చెప్పుకున్న జీవన్ రెడ్డిని దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడు? అని ప్రశ్నించారు. అవినీతి పరులు, నియంతలతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెపుతాడా? అంటూ సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి పోవాలని, కెసిఆర్ రావాలని ఈ రాష్ట్రంలో ఏ సామాన్యుడైనా అన్నాడా?.. కెసిఆర్ అనే చీడ పురుగును తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారన్నారు.కెసిఆర్‌ రావాలని తెలంగాణ ప్రజలెవరూ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. -

మన తెలంగాణ 11 Apr 2026 5:01 pm

ఘోర రోడ్డు ప్ర‌మాదం…

ఘోర రోడ్డు ప్ర‌మాదం… కంచిక‌చ‌ర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:57 pm

స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..

అధికారులు స్పందించి తొలగించండి.. వాహనదారులు ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కోర్ట్ రోడ్డు వద్ద చాలా ఎత్తుగా స్పీడ్ బ్రేకర్ కొన్ని రోజుల కిందట ఆర్ అండ్ బి విభాగపు అధికారులు వేయడం వలన ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్ కు తెల్లటి ఛాయతో కూడిన రంగు కూడా వేయకపోవడం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం, వృద్ధులకు తీవ్ర గాయాలు అవుతున్నాయని తెలుపుతున్నారు. శుక్రవారం […] The post స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:57 pm

Sai Reddy Chooses a New Path, Moves into Media

Former YSRCP MP V. Vijayasai Reddy has clearly spoken about his future plans. For some time, there were many rumours. Some said he would go back to the YSRCP because of his supportive posts on X. Others said he might join the BJP. Now, he has put an end to all that talk. Sai Reddy […] The post Sai Reddy Chooses a New Path, Moves into Media appeared first on Telugu360 .

తెలుగు 360 11 Apr 2026 4:56 pm

రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు: కెటిఆర్

ఇబ్రహీంపట్నం: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే అని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని ఎంత వరకు అమలు చేసిందని ప్రశ్నించారు. ‘‘సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారో.. ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊరించి.. గద్దెనెక్కి గడిచిన రెండున్నరేళ్లలో 11వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. స్కూటీలు, నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి మహిళలను కూడా మోసం చేశారు. రెండు నెలల పింఛను ఇవ్వకుండా వృద్ధులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. గడిచిన 28 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు’’ అని కెటిఆర్ విమర్శించారు.

మన తెలంగాణ 11 Apr 2026 4:54 pm

దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్‌కు సన్మానం …

దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్‌కు సన్మానం … జైనూర్,

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:52 pm

​నవోదయ కాలనీ సమస్యలు పరిష్కరించాలి….

​నవోదయ కాలనీ సమస్యలు పరిష్కరించాలి…. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి ​మేడ్చల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:49 pm

కార్మికుల ప్రాణాలతో చెలగాటం..

కార్మికుల ప్రాణాలతో చెలగాటం.. రసాయన పరిశ్రమల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం ఎమ్మెల్సీ నెల్లికంటి

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:46 pm

పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు

యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం ;12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం లోని యూటిఎఫ్ […] The post పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:42 pm

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి…

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి… నివాళులర్పించిన టిడిపి కుటుంబ సభ్యులు… భవానిపురం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:29 pm

AP |ప్రేమజంటల వీడియోలతో బ్లాక్‌మెయిల్..

AP | ప్రేమజంటల వీడియోలతో బ్లాక్‌మెయిల్.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:28 pm

ఉచిత కంటి సేవలకు భారీ స్పందన

మూడవ రోజు కూడా విశేష స్పందన మధ్య కొనసాగిన ఉచిత కంటి పరీక్ష శిబిరంవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పోతుకుంట వద్ద గల ప్రభుత్వ ఆసుపత్రిలో మూడవరోజు కూడా ప్రజల నుంచి విశేష స్పందన మధ్య ఉచిత కంటి పరీక్ష శిబిరం జరిగిందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు అక్కడకు చేరుకొని రోగులను ఆప్యాయతతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపికగా కంటి పరీక్షలు నిర్వహించుకొని ఆరోగ్యం […] The post ఉచిత కంటి సేవలకు భారీ స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:26 pm

పవర్‌ప్లేలో అభిషేక్-హెడ్ జోడీ దూకుడు.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

న్యూ చంఢీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో అభిషేక్-హెడ్‌లు కలిసి పంజాబ్ బౌలర్లను వణికించారు. ముఖ్యంగా అభిషేక్ పపర్‌ప్లేలోనే 5 ఫోర్లు 7 సిక్సులతో అర్థ శతకం సాధించాడు. మరోవైపు హెడ్‌ కూడా అభిషేక్‌కి తగిన సహకారం అందించాడు. దీంతో పవర్‌ప్లే లోనే ఎస్‌ఆ‌ర్‌హెచ్ స్కోర్ వంద దాటింది. 8 ఓవర్లలో వీరిద్దరు కలిసి 120 భాగస్వామ్యం జత చేశారు. అయితే శశాంక్ సింగ్ ఈ జోడీకి బ్రేక్ వేశాడు. శశాంక్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి హెడ్(38) ఔట్ అయ్యాడు. అదే ఓవర్‌ మూడో బంతికి అభిషేక్(74) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్(1), క్లాసెన్(1) ఉన్నారు. 

మన తెలంగాణ 11 Apr 2026 4:24 pm

కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన

రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు పురాతన నాణెముల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షాలు ఈ చారిత్రక నాణెములు అని తెలిపారు. తొలి తెలుగు శాసనమును క్రీస్తు శకం 575లో రేనాటి […] The post కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:22 pm

Andhra Prabha Smart Edition|AP|మావిగన్​/గోల్డ్​ స్మగ్లర్స్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 11-04-2026, 4.00PM ap స్కోప్​ లేని మావిగన్​..

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:20 pm

సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ […] The post సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Apr 2026 4:19 pm

మహాత్మా జ్యోతిరావు ఫూలేకు ఘన నివాళులు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : సమాజంలోని అసమానతలను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిరావు

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:19 pm

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ కుమార్

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ కుమార్ క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 11 Apr 2026 4:18 pm