ఇల్లెందు 13వ వార్డులో బీఆర్ ఎస్ విజయం
ఇల్లెందు, ఆంద్రప్రభ : ఇల్లెందు మున్సిపాలిటీ 13వ వార్డు లో బీఆర్ ఎస్
బాన్సువాడ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. 15 వార్డులలో 10 వార్డులు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా మూడు వార్డులలో కాంగ్రెస్, ఒక వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 1వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి 2వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి జక్కుల రమేష్ 3వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి సోమలక్ష్మి 4వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి శకుంతల 5వ వార్డ్ : ఇండిపెండెంట్ వెంకన్న 6వ వార్డ్ : కాంగ్రెస్ కవిత 7వ వార్డ్ : కాంగ్రెస్ బత్తుల శ్రీను 8వ వార్డు : కాంగ్రెస్ చిలక వెన్నెల 9వ వార్డ్ : 10వ వార్డు :బిఆర్ఎస్ అభ్యర్థి యాకూబ్ 11వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి గోవిందమ్మ 12వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి గీత 13వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి జ్యోతి 14వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి రఘునందన్ రెడ్డి 15వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి త్రిశూల్
పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు పేర్ని నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పేర్ని నానిపై నమోదైన కేసులు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని… క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ […] The post పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు appeared first on Visalaandhra .
Bejjanki |మండల ప్రజలకు పులి సంచారంపై హెచ్చరిక
Bejjanki | మండల ప్రజలకు పులి సంచారంపై హెచ్చరిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నిజామాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ పది గెలుచుకోగా రెండింట్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. వార్డు 1. గోనె హన్మవ్వ కాంగ్రెస్ వార్డు 2. చిన్న మారుతి కాంగ్రెస్ వార్డు 3. కార్తీక ధర్పల్ కాంగ్రెస్ వార్డు 4. బొమ్మల అనిత బిఆర్ఎస్ వార్డు 5. శ్యామల బిఆర్ఎస్ వార్డు 6. నౌష నాయక్ కాంగ్రెస్ వార్డు 7. ముజాహిద్ కాంగ్రెస్ వార్డు 8. షేక్ గులాం సందానీ కాంగ్రెస్ వార్డు 9. ధర్పల్ గంగాధర్ కాంగ్రెస్ వార్డు 10. మఠం మానస కాంగ్రెస్ వార్డు 11. భాగ్య లక్ష్మి కాంగ్రెస్ వార్డు 12. సీమ షెట్కర్ కాంగ్రెస్
మన ఆలోచనలను, భావాలను ఒకరితోఒకరు పంచుకోవడానికి భాష చాలా ముఖ్యమైన పాత్రపోషిస్తుంది. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. చాలా దేశాలకు ఒక జాతీయ భాష కూడా ఉంది. అయినా ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇదీ ప్రపంచంలో ఉమ్మడి దేశాల భాషగా, అంతర్జాతీయ భాషగా చలామణి అవుతుంది. దేశాల మధ్య అంతరాన్ని తగ్గించి, అందరికీ విస్తృత అవకాశాలను ఆంగ్ల భాష అందిస్తున్నది. భారత్లో బహుళ ప్రాంతీయ భాషలు ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్ ప్రధాన వనరుగా ఆంగ్ల భాషను స్వీకరించడం వలన ప్రయాణం, పర్యాటకం, విద్య, వ్యాపారం, వినోదం, సైన్స్, టెక్నాలజీ మొదలైన వాటిలో అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆంగ్లం వ్యక్తుల భౌగోళిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచ పరిధిని విస్తరించింది. మొదట జాతీయ భాషగా ఇంగ్లీషు ఉండేది. తరువాత బ్రిటిష్ సామ్రాజ్యవాదం, వలసరాజ్యాల ఫలితంగా ఈ భాష అనేక దేశాలకు పరిచయమైంది. ఇది భారతదేశం, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా మొదలైన వారి కాలనీలలో ప్రాథమిక, ద్వితీయ భాషగా మారింది. బ్రిటిష్ వారి పరిపాలన అంతరించినప్పటికీ వారి భాష ఇప్పటికీ దాదాపు సగానికి పైగా ప్రపంచాన్ని శాసిస్తుంది. అమెరికాలో నిర్వహించే స్పెల్ బీ పోటీల్లో కూడా తెలుగువారు విజేతలుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా నేడు ఆంగ్లంపై, ఆంగ్ల విద్యపై విమర్శలు గుప్పుమంటున్నాయి. బానిసత్వానికి నిదర్శనంగా ఆంగ్లాన్ని చెబుతున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్రం గతేడాది ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే ని ఫిబ్రవరి 13న జరుపుతున్నారు. లార్డ్ మెకాలే ప్రారంభించిన ఆంగ్ల విద్యను అభ్యసించిన సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే జరుగుతుంది. ఆంగ్లంతో అపారమైన జ్ఞానాన్ని పొందిన ఆమె గొప్ప నాయకురాలుగా రాణిస్తే, దేశంలో దీనికి విరుద్ధంగా మెకాలే వలసవాద విద్యను తిరస్కరించాలని చర్చ జరుగుతుంది. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యా విధానం భారత చరిత్రలో ఒక మలుపు. ఇటీవల ఈ విధానంపై విమర్శలు వస్తున్నప్పటికీ మెకాలే ప్రవేశపెట్టిన 200 ఏళ్ల ఆంగ్ల విద్య భారతదేశానికి కేవలం భాషను మాత్రమే ఇవ్వలేదు. అది ఆధునికతకు తలుపులు తెరిచింది. ఇప్పటికీ ఆంగ్ల భాష ద్వారానే భారతదేశం అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. వాణిజ్యం, సాంకేతికత, ఐటి, వైద్య రంగాల్లో భారతీయులు ప్రపంచస్థాయిలో రాణించడానికి ఆంగ్ల భాష ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. నేటి గ్లోబల్ యుగంలో భారత యువతకు ఇది పోటీ శక్తిని అందించింది. ఆంగ్ల విద్య భారతదేశానికి కేవలం ఒక భాషను మాత్రమే అందించలేదు; అది ఒక ఆలోచనా విధానాన్ని, శాస్త్రీయ దృష్టిని, విమర్శనాత్మక బుద్ధిని పరిచయం చేసింది. శతాబ్దాలుగా వర్గ వివక్షలతో, కుల మత బేధాలతో, లింగ అసమానతలతో నలిగిపోయిన సమాజంలో ఆంగ్ల విద్య ఒక కొత్త ద్వారం తెరిచింది. అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమైన జ్ఞానం గోడలు చెదరగొట్టి, పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు విద్య ద్వారా శక్తిమంతులయ్యారు. విద్యే సమానత్వానికి మార్గమని నిరూపించింది. మహిళల విద్యలో ఆంగ్ల భాష పాత్ర అపారమైంది. సరోజినీ నాయుడు వంటి మహనీయులు ఆంగ్లభాషను ఆయుధంగా మలచుకుని భారత స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి నిచ్చారు. ‘ నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన ఆమె ఆంగ్లంలో రచనలు చేసి ప్రపంచాన్ని భారత స్వరంతో మేల్కొలిపారు. ఆమె జయంతి రోజున స్టేట్ ఇంగ్లీష్ డేగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం సాంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సేతగా నిలుస్తుంది. పాఠశాలల్లో ఇంగ్లీష్ ఒక ప్రధాన బోధనా మాధ్యమంగా మారింది. సగటు తల్లిదండ్రులు సైతం ఇంగ్లీష్ మీడియంలో తన పిల్లలు చదివిస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీషులో చదివిన విద్యార్థులకు అవకాశాలు అధికంగా ఉండడమే దీనికి కారణం. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటినుండే కాన్వెంట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ఆంగ్ల బోధన కోసం పట్టణాల్లోకి వెళ్తున్నారు. పేద, మధ్యతరగతి పిల్లలను ఉద్దేశించి ప్రభుత్వాలు సైతం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక దశ నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో మెకాలే విద్యపై విమర్శలు అంటే మన ఆధునికత వైపు వెళ్తున్నామా? ఆదిమ కాలానికి వెళ్తున్నామా? అని ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. - సంపతి రమేష్, 7989579428 - నేడు రాష్ట్ర ఆంగ్ల భాషా దినోత్సవం
జాతీయ జెండాతో పాదరక్షలను తుడుచుకుంటున్న బీజేపీ కార్యకర్తలు
Telangana : ఉత్తమ్, కోమటిరెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ స్పీప్
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా వెళుతుంది
ముగ్గురు మంత్రులకు మున్సిపల్ పరీక్ష
రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకమైన ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తరువాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్ ఎన్నికల తీర్పు నేడు (శుక్రవారం) రాబోతున్నది. రెండు నెలల క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ అవి పార్టీ రహితంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు మెజారిటీ స్థానాల్లో అధికార పక్షం వైపు నిలబడినప్పటికీ తొలిసారిగా పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల ఎటువైపు నిలబడారనేది నేడు తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే పార్లమెంట్ ఎన్నికలు రాగా ఆ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎంపి స్థానాలను కాంగ్రెస్ గెల్చుకుంది. ఆ తరువాత పార్టీ గుర్తులతో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఆయా తీర్పు కేవలం ఆ రెండు సెగ్మెంట్లకే పరిమితం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాల్టీల, ఏడు కార్పొరేషన్ల ఓటర్ల తీర్పు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్గా లేదా శాంపిల్ సర్వేగా లేదా సెమీ ఫైనల్గా భావించే తరుణంలో ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహించే ఖమ్మం జిల్లాలోని పట్టణ ఓటర్ల తీర్పుతోపాటు ఆయా మంత్రులు ఇంచార్జ్లుగా పనిచేసిన జిల్లాలోని మున్సిపల్ ఓటర్లు ఇచ్చే తీర్పు కూడా ఆయా మంత్రులకు ఆగ్నిపరీక్ష లాగా మారింది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన సత్తుపల్లి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి వర్గంతోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలు ఉన్నాయి. ఇక్కడి మున్సిపాల్టీలో మొత్తం 23 వార్డులు ఉండగా పొంగులేటి వర్గానికి అయిదు వార్డులు, తుమ్మల వర్గానికి ఒక్క వార్డును కేటాయించి మిగిలిన వార్డులన్నింటినీ స్థానిక ఎంఎల్ఎ అనుచరులకు టిక్కెట్లు ఇచ్చుకున్నారు. అయితే తుమ్మలకు అతి దగ్గర గా ఉండే ఇద్దరు నాయకులు 2వ వార్డు, 18వ వార్డుల టిక్కెట్లను అడుగగా అందుకు స్థానిక ఎంఎల్ఎ డాక్టర్ రాగమయి సమ్మతించ లేదు. చల్లగుండ్ల నర్సింహ్మరావు సతీమణికి ముందు చైర్మన్ పదవి ఆశ కల్పించి చివరి క్షణంలో నిరాకరించడంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసిన ఆయన నోటిఫికేషన్ వచ్చిన తరువాత నామినేషన్ కూడా వేయలేదు. దీంతో తుమ్మల వర్గీయులతోపాటు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారంతా మిగిలిన వార్డులను పెద్దగా పట్టించుకోకుండా కేవలం 2వ వార్డుపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ పొంగులేటి, తుమ్మల వర్గీయులను స్థానిక ఎంఎల్ఎ కలుపుకొనిపోవడం లేదని టిపిసిసికి ఫిర్యాదు వెళ్ళిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ముందు పొంగులేటి వర్గానికి చెందిన మాజీ డిసిసిబి చైర్మన్, రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ మువ్వా విజయ్బాబు- స్థానిక ఎంఎల్ఎల మధ్య రాజీ కుదిర్చి ఏకం చేశారు. దీంతో ఇరు వర్గాలు ఈ ఎన్నికల్లో కలిసి పని చేసినప్పటికీ కాంగ్రెస్లోని ముఠా కుమ్ములాటల వల్లనే తాము బైటపడుతామనే ధీమాను బిఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 23 వార్డులకుగాను కాంగ్రెస్ 12 నుంచి 13, బిఆర్ఎస్కి 10 నుంచి 11 స్థానాలు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటైన కల్లూరు మున్సిపాల్టీకి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ మున్సిపాల్టీ పరిధిలోని నారాయణపురం గ్రామం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సొంత గ్రామం. అయితే మొదటి నుంచి ఈ పట్టణం వైపు పెద్దగా దృష్టిసారించలేదు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నారాయణపురం గ్రామసర్పంచ్ పదవీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే కల్లూరు మున్సిపాల్టీపై మంత్రి పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం కొరత ఏర్పడింది. దీంతో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ స్థానాలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అదే ప్రభావం ఉంటుందనే ప్రచారం కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం 20 వార్డులకుగాను కాంగ్రెస్కు 9 లేదా10, బిఆర్ఎస్కి 10 లేదా 11 స్థానాలు దక్కే సూచనలు కన్పిస్తున్నప్పటికీ స్థానిక ఎంఎల్ఎ, స్థానిక ఎంపిల ఎక్స్అఫిషీయో ఓట్లతోనైనా బైట పడాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మరోవైపు బిఆర్ఎస్ పార్టీ అప్రమత్తం అయ్యి ఇక్కడ పోటీ చేసిన తమ పార్టీకి చెందిన 20 మంది అభ్యర్థులను ఎన్నికల ఫలితాలకు ముందే రహస్య స్థావరానికి (క్యాంపు) తరలించారు. ఈ మున్సిపాల్టీలో మ్యాజిక్ ఫిగర్కు అనిశ్చిత పరిస్థితి ఏర్పడితే అధికార పార్టీ ప్రలోభాలకు గురవుతారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా శిబిరానికి తరలించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కల్లూరు, సత్తుపల్లిలో బిఆర్ఎస్ పట్టు సాధించినట్లు వస్తున్న వార్తలు అధికార పార్టీ నేతల్లో కలవరం సృష్టిస్తోంది. డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించే మధిర మున్సిపాల్టీలో బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కలిసి పోటీ చేసినప్పటికీ ఇక్కడ మెజారిటీ వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా కాంగ్రెస్కి 15- 17, బిఆర్ఎస్కి 3-5 వార్డులు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక భట్టి సొంత పట్టణమైన వైరా మున్సిపాల్టీలో ఫలితం అటు ఇటుగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. వైరా పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒక్క ప్రక్క మంత్రి పొంగులేటి వర్గం, ఇంకోవైపు మల్లు భట్టి వర్గం. పొంగులేటి వర్గానికి 7 వార్డులు, భట్టి వర్గానికి 12 వార్డులు కేటాయించగా, మాజీ కేంద్ర మంత్రి రేణుకచౌదరి వర్గానికి ఒక్క వార్డును కేటాయించారు. ఇక్కడ చైర్మన్ పదవికి అటు భట్టి వర్గం, ఇటు పొంగులేటి వర్గం ఆశిస్తూ ఇరువర్గాలకు చెందిన చైర్మన్ అభ్యర్థులు బరిలోకి దింపారు. భట్టికి కుడిభుజంగా ఉండే మాజీ డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ రెండు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేసి చివరి నిమిషంలో భట్టి అదేశంతో పోటీనుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ భట్టి వర్గం నుంచి ఇద్దరు చైర్మన్ అభ్యర్ధులు పోటీలో నిలబడ్డారు. పొంగులేటి వర్గంనుంచి గతంలో సర్పంచ్గా పనిచేసిన బొర్ర కుటుంబం నుంచి రాష్ట్ర మార్క్ ఫేడ్ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్ సతీమణి పోటీ చేశారు. మూడు వర్గాల అంతర్గత కుమ్ములాటల మధ్య తాము బైటపడుతామనే ధీమాతో బిఆర్ఎస్ ఉంది. ఇక్కడ మొత్తం 20 వార్డులకు ఇప్పుటివరకు ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్ కు 12, బిఆర్ఎస్ కూటమికి 8 వార్డులు దక్కుతాయనే ఎగ్జిట్ పోల్స్లు చెబుతున్నాయి. భట్టి వర్గం నుంచి మున్సిపల్ చైర్మన్ పదవి రేసులో ఉన్నరాంపూడి రాజ్యలక్ష్మిని ఓడించేందుకు బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలు ఏకమయ్యాయి. ఇదే మున్సిపాల్టీలో మిగిలిన 19 వార్డులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సిపిఐ ఈ ఒక్క వార్డులో మాత్రం బిఆర్ఎస్తో చేతులు కలపడం గమనర్హం. 6వ వార్డు నుంచి కూడా భట్టి వర్గం తరుపున పోటీ చేసిన డాక్టర్ కాపా మురళీ కృష్ణ సతీమణితో పాటు పొంగులేటి వర్గానికి చెందిన బొర్ర రాజశేఖర్ సతీమణి కూడా చైర్మన్ రేసులో ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం భట్టిదే. అయితే ఆ పదవి డాక్టర్ కాపా మురళీ కృష్ణ భార్యకే దక్కుతుంది. జనరల్ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పదవిలో బిసికి అవకాశం ఇవ్వాలని అనుకుంటే మాత్రం బొర్ర రాజశేఖర్ సతీమణి పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇంచార్జ్ మినిస్టర్గా, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్గా పనిచేసిన కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్లో బిజెపి గాలి వీస్తున్నదని ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చిచెప్పడం ఒకింత ఇబ్బందిగా మారింది. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జీరో నుంచి నేడు 20 డివిజన్లను సాధించే దిశగా మంత్రి తుమ్మల కృషి చేశారు. అంతేగాక హుజూరాబాద్, వేములవాడ మున్సిపాల్టీలను కైవసం చేసుకునే విధంగా, సిరిసిల్ల, జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చే విధంగా కృషి చేశారు. మొత్తం మీద ముగ్గురు మంత్రులకు మున్సిపల్ పోల్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినట్లు చెప్పవచ్చు. - వనం వెంకటేశ్వర్లు 98489 97240 (ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)
బాన్సువాడ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బాన్సువాడలో బిజెపి, కాంగ్రెస్ పోటా పోటీగా ఉన్నాయి. 12వ వార్డులో అంజా గౌడ్ (స్వతంత్ర అభ్యర్థి),18వ వార్డు రేష్మ ఎజాజ్ (కాంగ్రెస్), 16వ వార్డు గజ్జల మహేష్ (బిజెపి), 16వ వార్డు గజ్జల మహేష్ (బిజెపి), 11 ఓట్లతో విజయం సాధించారు. 1వ వార్డులో నస్రిన్ బేగం (బిఆర్ఎస్), 14వ వార్డులో నార్ల వసంత నందకిషోర్ (కాంగ్రెస్), 5వ వార్డు కాసుల విజయ బాలరాజ్, 7వ వార్డు సామల మానస (బిజెపి), 10వ వార్డు ఎరుకల నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డు గడుముల లింగం ( కాంగ్రెస్), 2వ వార్డు జంగం రాజశేఖర్ (కాంగ్రెస్) విజయం సాధించారు.
Gudivada |డీఎస్పీ ఆధ్వర్యంలో గుడివాడ పోలీసులకు పరేడ్..
Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ ఆధ్వర్యంలో
Polide raids : ధాబాల్లో దడదడ Andhra Prabha News
Polide raids : ధాబాల్లో దడదడ Andhra Prabha News చిత్తూరు జిల్లా
Bhole Baba Dairy Scam: Crores in Assets Linked to Adulterated Ghee Supply to Tirumala
The alleged supply of adulterated ghee to the sacred Tirumala Laddu has uncovered a shocking financial trail. Owners of Bhole Baba Dairy are accused of amassing massive wealth between 2021 and 2024 through fraudulent dealings connected to Tirumala Tirupati Devasthanams ghee tenders. A forensic audit of account books and bank transactions has reportedly exposed large-scale […] The post Bhole Baba Dairy Scam: Crores in Assets Linked to Adulterated Ghee Supply to Tirumala appeared first on Telugu360 .
చెన్నూరులో కోనసాగుతున్నకాంగ్రెస్ హావ..
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ మొదటి 9 వార్డుల
Telangana : హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది
దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం నందికొండలో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 నల్లగొండ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ, నల్గొండ జిల్లా హాలియా, నందికొండ మున్సిపాలిటీలు 'హస్త'గతమయ్యాయి. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు వెంటనే ధ్రువపత్రాలను అందజేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. ఉదయం 10:30 గంటల వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ 150కి పైగా, బిఆర్ఎస్ వందకు చేరువగా, బిజెపి 20కి పైగా, ఇతరులు 15 వార్డులకు పైగా విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ గెలుపొందింది. గడ్డపోతారంలో మూడింట రెండు వంతులకు పైగా బిఆర్ఎస్ వార్డులు గెలుచుకుంది. మొత్తం 18 వార్డుల్లో ఇప్పటివరకు 14 వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మున్సిపాలిటీల వివరాలు.. నల్గొండ జిల్లా హాలియా, నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియాలో మొత్తం 12 వార్డుల్లో ఇప్పటికే 8 వార్డులలో కాంగ్రెస్ గెలించింది. నందికొండలో మొత్తం 12 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. 22 వార్డుల్లో ఇప్పటికే కాంగ్రెస్ 15 వార్డులు గెలుచుకుంది. ములుగు: ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ములుగు: ఆరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం యాదగిరిగుట్ట: 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న విజయం భువనగిరి: ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి విజయం మజీద్పూర్: 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరసం వనజ విజయం ఇంద్రేశం: 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం మధిర: 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం ఎల్లంపేట: 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత విజయం ఎల్లంపేట: 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ విజయం ఎల్లంపేట: 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సురేశ్రెడ్డి విజయం ఇబ్రహీంపట్నం: 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత విజయం ఇబ్రహీంపట్నం: 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు త్రిలోక్ విజయం అలియాబాద్: 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి దీపిక విజయం అలియాబాద్: 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్ విజయం అలియాబాద్: 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి వనజ విజయం అలియాబాద్: 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
1వ వార్డులో బిజెపి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 1వ వార్డులో
మోత్కూర్ 3వ వార్డు బీఆర్ ఎస్ అభ్యర్థి స్వామి విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 3 వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి
ఇల్లెందు రెండో వార్డులో కాంగ్రెస్ విజయం
ఇల్లెందు, ఆంధ్రప్రభ : ఇల్లెందు మున్సిపాలిటీ రెండో వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది.
Breaking : ఆరు మున్సిపాలిటీల్లో హస్తందే విజయం
116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగిస్తోంది
ఫ్యాక్ట్ చెక్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల 2500 రూపాయలు ఇస్తామని ప్రకటించలేదు
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల 2500 రూపాయలు
కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ఫిబ్రవరి 11 (జనం సాక్షి)మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను …
అలంపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ దే హవా
అలంపూర్: జోగులాంబ గద్వాల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అలంపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మూడో వార్డులో గెలుపొందగా 1, 2 వార్డుల్లో అధిక్యం సాధించింది. అల్లంపూర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఈరమ్మ 405 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా 358 ఓట్లు వచ్చాయి. మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్మాయిల్ 263 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి ఆసిఫ్ ఖాన్ 473 ఓట్లు, బిజెపి నాగమల్లయ్య 22 ఓట్లు పడ్డాయి. మూడో వార్డులో మొత్తం 764 ఓట్లు పోలవగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 210 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
vikarabad 31ward |మల్లికార్జున గౌడ్ విజయం
vikarabad 31ward | మల్లికార్జున గౌడ్ విజయం వికారాబాద్, ఫిబ్రవరి 13 ఆంధ్రప్రభ:
irregularities : అన్నీ తప్పుడు లెక్కలే Andhra prabha News
irregularities : అన్నీ తప్పుడు లెక్కలే Andhra prabha News తినే పిల్లలు
mothkur 4 ward |బిఆర్ఎస్ అభ్యర్థి శోభ సోoమల్లు విజయం
mothkur 4 ward | బిఆర్ఎస్ అభ్యర్థి శోభ సోoమల్లు విజయం మోత్కూర్
mothkur 2 ward |కాంగ్రెస్ అభ్యర్థి ప్రమీల రాములు విజయం
mothkur 2 ward | కాంగ్రెస్ అభ్యర్థి ప్రమీల రాములు విజయం మోత్కూర్,
motkur 1 ward |కాంగ్రెస్ అభ్యర్థి వెంకన్న విజయం
motkur 1 ward | కాంగ్రెస్ అభ్యర్థి వెంకన్న విజయం మోత్కూర్, ఫిబ్రవరి
కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
–సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు విశాలాంధ్ర ధర్మవరం:: కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు ఊడెగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మార్పు తెచ్చుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి వెనువెంటనే కృషి చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు.పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కళాజ్యోతి సర్కిల్ నందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమణ, […] The post కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం appeared first on Visalaandhra .
congress |మక్తల్ లో తొలి ఫలితం విడుదల
13వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి మక్తల్ సరిత గోవిందరావు గెలుపు మక్తల్
సార్వత్రిక సమ్మె సందర్భంగా ధర్మవరంలో భారీ ర్యాలీ
విశాలాంధ్ర ధర్మవరం: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా తీసుకొచ్చిన నాలుగు 4 లేబర్ కోడ్లు, రద్దు చేయాలని. 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని, సిఐటియు ఇతర 12 ప్రజా సంఘాలు కలిపి తలపెట్టిన జాతీయ సమ్మెనుధర్మవరం ప్రాంతంలో సిఐటియు, ఏపీ రైతు సంఘం, ఏపీ చేనేతకార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాల కార్మికులు భారీగా పాల్గొని ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ అయుబ్ ఖాన్,ఏపీ […] The post సార్వత్రిక సమ్మె సందర్భంగా ధర్మవరంలో భారీ ర్యాలీ appeared first on Visalaandhra .
Breaking : గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ దే
హైదరాబాద్ శివారులో ఉన్న గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది
bhupalapally |మొదటి రౌండ్ లెక్కింపు షురూ
bhupalapally | మొదటి రౌండ్ లెక్కింపు షురూ ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి
satya sarada |నర్సంపేటలో ఓట్ల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్
satya sarada | నర్సంపేటలో ఓట్ల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్ నర్సంపేట,క్రైం,ఫిబ్రవరి13,
తెలంగాణలో జరిగిన ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు.. ఫేక్ సర్వేలతో జాగ్రత్త | Telangana Municipal Elections 2026
edapally |కెనాల్లో బైక్తో సహా పడి సెక్యూరిటీ గార్డు మృతి..
edapally | కెనాల్లో బైక్తో సహా పడి సెక్యూరిటీ గార్డు మృతి.. ఎడపల్లి
bheemgal |భీంగల్ మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
bheemgal | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యం భీంగల్ టౌన్, ఫిబ్రవరి
విద్యార్థులు ‘కళ్ల’పట్ల జాగ్రత్తలు వహించాలి
–ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప విశాలాంధ్ర ధర్మవరం: కంటిపట్ల విద్యార్థులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్పీసీఎస్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కంటి పరీక్షలలో 22 మంది పిల్లలకు కంటి దోషం ఉన్నందున, వారందరికీ పాఠశాల హెడ్మాస్టర్ పద్మావతి చేతుల మీదుగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కరుణ, సురేష్, భాస్కర్, వెంకటాచలపతి […] The post విద్యార్థులు ‘కళ్ల’పట్ల జాగ్రత్తలు వహించాలి appeared first on Visalaandhra .
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ విడుదల
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. టీజర్ని లాంచ్ వేడుకకు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ మంచి రూటెడ్ కథతో సినిమా రావడం ఆనందంగా ఉందని తెలియజేశారు. డైరెక్టర్ బాల సతీష్ మా ట్లాడుతూ ధీరజ్ మొగిలినేనికి ఈ సినిమా నచ్చి రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చినప్పుడు మాకు ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకం కలిగిందని తెలిపారు. కార్యక్రమంలో ధీరజ్ మొగిలినేని, శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, రాజేష్ పాల్గొన్నారు.
Revanth Reddy : హైస్పీడ్ రైల్ కారిడార్ పై సీఎం సమీక్ష
హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు
ప్రమాదంలో గాయపడిన ఉద్యోగికి ఆర్థిక సాయం
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ కాలం పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న డి. హజీవలి రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన ఉద్యోగికి ఆర్థిక చేయూతగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ సభ్యులకు 41,111 చెక్కును పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య అందజేశారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యకు ఐక్యత, స్ఫూర్తి భావంతో ఉద్యోగులకు చేయూతనివ్వడం పట్ల […] The post ప్రమాదంలో గాయపడిన ఉద్యోగికి ఆర్థిక సాయం appeared first on Visalaandhra .
HYDలో విషాదం.. శిథిలాల కింద ఐదుగురు #hyderabad #housecollapsed #latestnews #telugupost
Weather Report : సూర్యుడు సెగలు కక్కుతున్నాడుగా.. మే లో మూమాలుగా ఉండదేమో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత మొదలయింది.
ప్రేక్షకులకు నవ్వులు పంచే సినిమా
బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్పై ‘హే భగవాన్’ అనే ఫుల్లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో నాట్ ఏ ట్రైలర్ పేరు తో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ట్రైలర్ను విడుదల చేసి మాట్లాడుతూ..“ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఈ సినిమా ఉంటుంది” అని తెలియజేశారు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ మంచి యూనిక్ పాయింట్ తో రాబోతున్న ఈ చిత్రం అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాస్, సుహాస్, శివానీ నగరం, వంశీ నందిపాటి, వీకే నరేష్, గోపీ అచ్చర పాల్గొన్నారు.
టెక్స్ టైల్ షాప్ కార్మికులకు ‘ఈ శ్రామ్’కార్డులు పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం: కూలీల నుంచి చిన్న వ్యాపార కార్మికుల వరకు అందరికీ రక్షణ ఈషారము కార్డులు పథకం ఎంత కోణం ఉపయోగపడతాయని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని టెక్స్టైల్స్ దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులతో పాటు అసంఘటిత రంగానికి చెందిన వివిధ వృత్తుల్లో శ్రమిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డులను మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు స్వయంగా అందజేశారు. కార్డు ద్వారా కార్మికులకు […] The post టెక్స్ టైల్ షాప్ కార్మికులకు ‘ఈ శ్రామ్’ కార్డులు పంపిణీ appeared first on Visalaandhra .
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలో ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కు సంబంధించిన ఓ ఈవెంట్ను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో లావణ్య త్రిపాఠి కొణిదెల మాట్లాడుతూ “సతీ లీలావతి’ని ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటిం గ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. దేవ్ మోహన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం” అని అన్నారు. దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ మోహన్, సప్తగిరి పాల్గొన్నారు.
రాంగ్ రూట్ ప్రయాణం.. ప్రాణాలకు ముప్పు #telugupost #wrongroute #latestnews #trafficrules
చిత్రలేఖనంలో రామలక్ష్మి కి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం కు చెందిన చిత్రలేఖనంకళాకారిణి రామలక్ష్మి విశ్వనాధంకు గోల్డెన్స్ట్రో క్ అవార్డు లభించింది. హైదరాబాద్లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో క్రియేటివ్ హార్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10న జాతీయ స్థాయి కళాప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో కేరళా సంస్కృతి ఉట్టిపడేలా కేరళీయం అంశంతో రామలక్ష్మి రూపొందించిన చిత్ర లేఖనం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. కేరళా రాష్ట్ర సంప్రదాయ వేషధారణ పండుగలు నృత్యరీతులు తిరుచునాపురం కథకళి మోహినిఅట్టం వంటి రీతులన్నిటినీ ఒకే […] The post చిత్రలేఖనంలో రామలక్ష్మి కి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు appeared first on Visalaandhra .
Serial Crash : అయ్యో.. శవరాత్రి Andhra Prabha Spot News
Serial Crash : అయ్యో.. శవరాత్రి Andhra Prabha Spot News 7గురు
Will Dhurandhar: The Revenge Release in Gulf Countries?
Dhurandhar: The Revenge is the next big Indian film that will release this year. After the super success of the first installment, there are huge expectations on Dhurandhar: The Revenge. The makers are making sure that the film will be released in all the regional languages like Telugu, Tamil, Kannada and Malayalam languages. The makers […] The post Will Dhurandhar: The Revenge Release in Gulf Countries? appeared first on Telugu360 .
… పూర్తయిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పెద్దపల్లి ఆంధ్రప్రభ పురపాలక ఎన్నికల కౌంటింగ్
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ఢీకొని
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
Gold Price Today : గుడ్ న్యూస్.. ఈరోజు కూడా బంగారం ధరలు పెరగలేదండోయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 103 సెంటర్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. మూడు గంటలలోపు మున్సిపాలిటీల ఫలితాలు, రాత్రిలోపు కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగ్గా ఎవరికీ వారే గెలుపు అంచనాలతో క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ అభ్యర్థులెవరూ చేజారకుండా క్యాంపు రాజకీయాలను ప్రారంభించడంతో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీల అభ్యర్థులను వేరే రాష్ట్రాలకు ఆయా పార్టీలు తరలిస్తున్నాయి. నేడు కౌంటింగ్ జరుగనుండగా గెలిచిన అభ్యర్థులు పార్టీలు మారకుండా అన్ని పార్టీలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా గెలిచిన అభ్యర్థులను గోవా, కేరళ, బెంగళూరు, హైదరాబాద్లకు తరలిస్తున్నాయి. ఫలితాలు వెలువడకముందే పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
13thFeb2026 |నేటి పంచాంగం &రాశి ఫలితాలు, కుంభ సంక్రాంతి ప్రత్యేకం
13thFeb2026 | నేటి పంచాంగం & రాశి ఫలితాలు, కుంభ సంక్రాంతి ప్రత్యేకం
వాహ్ సూపర్ క్యాచ్ పట్టిన బుమ్రా... వీడియో వైరల్
ఢిల్లీ: టి20 వరల్డ్ కప్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. నమీబియాపై టీమిండియా 93 పరుగుల తేడాతో గెలుపొందింది. హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హార్ధిక్ పాండ్యా 52 పరుగులు చేయడంతో రెండు వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో నే కాదు ఫీల్డింగ్లో అదరొగొట్టాడు. అక్షర్ పటేల్ వేసిన 12.3 ఓవర్లో నమీబియా బ్యాటర్ మలన్ క్రుగర్ బంతిని పైకి లేపాడు. బుమ్రా అతివేగంగా క్యాచ్ అందుకొని అశ్చర్య పరిచాడు. వాహ్ ఏం క్యాచ్ పట్టావు గురువా? అంటూ అశ్చర్యంగా అక్షర్ పటేల్ చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది.
పది రూపాయలకే కోవా బన్ను అమ్మడమా?... కంటతడి... సమాధానంలేని ప్రశ్నలు
అతని చూపులో అసహాయత, వ్యాపారం పోతుందేమోనని భయం, పదిమంది చుట్టు ముట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటే స్పందించలేని అమాయకత్వం, కళ్ళ గుడ్లలో నీళ్లు బయటికి రాకుండా ఆ బన్ను తింటున్న దృశ్యం నెటిజన్ లను వెంటాడుతుంది. అతను ఏడవకుండానే కళ్ళలో నీళ్లు బయటకు రాకుండానే ఎంతోమంది నెటిజన్ల కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు. ఈ మధ్యకాలంలో ఈ విధంగా సామాన్య ప్రజలు విరుచుకు పడడం మొదటి సారి చూస్తున్నాము. మేడారం జాతరలో పది రూపాయలకే కోవాబన్ ఎలా అమ్ముతున్నావు? లీటర్ పాలు 80 రూపాయలు అయితే అని ప్రశ్న. బజారులో బన్ను కొనుక్కొని ఇంటి దగ్గర కోవా చేసుకుని మేము వ్యాపారం చేసుకుంటాము బ్రతకడానికి ఇక్కడికి వచ్చాము అని అతని సమాధానం. ఎంతోమంది పిల్లలు తింటారు వాళ్ళని చంపడానికే ఇక్కడికి వచ్చావా? మీ పిల్లలకు పెడతావా? అని శరసంధానం. మా పిల్లలకు కూడా పెడతాను మేడం మేము ఇక్కడికి బ్రతకడానికి వచ్చాము. అయితే నీ ఆధార్ కార్డు చూపించు. చెట్టుకు కట్టేయండి. పోలీసులను పిలవండి. అంటూ తలో మాట అనడంతో ఆయన గందరగోళంలో పడిపోయాడు. అనూహ్యమైన పరిమాణానికి భయపడి పోయిన ఓ సాధారణ కోవా బన్ను వ్యాపారి.. ఇంతలో నువ్వు తింటావా ఏమన్నా అని ప్రశ్న? నేను కూడా అప్పుడప్పుడు తింటాను మేడం అని సమాధానం. అప్పుడప్పుడు కాదు అని ఇప్పుడు తిను అని గద్దించారు. వెంటనే దానికి సమాధానంగా ఓ బన్ను తీసుకొని గుడ్లలో నీళ్లు కుక్కుకొని తినడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఎందుకు గాభర పడుతున్నావు అని మరల ప్రశ్నించారు. ఇక దానికి అతను సమాధానం ఇవ్వలేదు అతని కళ్ళే అతని సమాధానం చెబుతున్నాయి, అతని నిర్దోషి అనడానికి అవే రుజువు కాబోలు. ఆ కళ్ళలో సమాజాన్ని ప్రశ్నిస్తున్న అనేక ప్రశ్నలు? రోజుకు కేజీ కోవా బన్ను 50 అమ్మితే అతనికి వచ్చేది 500 అందులో లాభం 100 రూపాయలు.. ఓ 10 కేజీలు అమ్మితే వెయ్యి రూపాయలు పొద్దున నుంచి సాయంత్రం వరకు సంపాదిస్తాడు. అలా పది రోజులు జాతరలో కష్టపడితే ఓ పదివేలు సంపాదించవచ్చు. దానికోసం రేయి పగలు కష్టపడాలి అంతేకాకుండా దానికోసం ఇంటికాడ ఎన్నో సమస్యలతో ఎదురుచూస్తున్న భార్యా పిల్లలు ఉంటారు. ఎలాగోలాగా వ్యాపారం చేస్తూ భవసాగరాన్ని ఈదాల్సిందే కదా? ఆకలి చాలా చెడ్డది ఇలాంటి నిస్సహాయతలోనించే మనుషులలో తెగింపు వస్తుంది. ఇలా కష్ఠపడి కూడా బ్రతకనీయకుంటే తెగిస్తారు. ఆ చిరు వ్యాపారి కళ్ళలో ప్రశ్నించిన ప్రశ్నకు నెటిజనులు భగ్గుమన్నారు. ఇంకా మనుషులలో మానవత్వం ఉంది పేదవాని వైపే ప్రజలు ఉన్నారు అని నిరూపించారు. అతడి కళ్ళలో కన్నీటి చుక్కలు బయటికి రాలేదు కానీ నెటిజన్ల కళ్ళలో ఇంకా కన్నీటి చుక్కలు ఉన్నాయి అవి ఇంకి పోలేదు. అప్పుడప్పుడు బయటికి వస్తాయి అని నిరూపించాయి. ఇంతకు అతను చేసిన తప్పేంటి? పది రూపాయలకే కోవా బన్ను అమ్మడమా? అంతకుమించి అతని పేరు... వలి...అనా? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
మెగా గ్లోబల్ స్టార్ రామ్చరణ్ తన కవల పిల్లల పేర్లను వెల్లడించారు
Telangana : నేడు మద్యం దుకాణాలు బంద్
తెలంగాణలో నేడు పలుచోట్ల మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి
Telagngana : నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి
రాజకీయ మైలేజీ కోసమే తిరుమల లడ్డుపై మాట్లాడుతున్నారు: నారాయణ
అమరావతి: తిరుమల లడ్డూ వివాదంలో నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సిపిఐ నేత నారాయణ సూచించారు. తిరుమలలో నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజకీయ మైలేజీ కోసం లడ్డూ విషయంపై ప్రతిపక్షాలు, పాలకపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం దేవుడిని అడ్డు పెట్టుకోవద్దని సూచించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అధికార, విపక్ష నేతలు మాట్లాడొద్దని సూచించారు. తిరుమల లడ్డూ కేసు విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, సిబిఐ, సిట్ దర్యాప్తు చేస్తుందని, ఫైనల్ గా విచారణ చేసి ఎం జరిగిందేని దర్యాప్తు సంస్థలు చూసుకుంటున్నాయని నారాయణ పేర్కొన్నారు. మీ రాజకీయాల కోసం ప్రతిపక్ష, పాలకపక్ష నేతలు, కార్యకర్తలు కొట్టుకొని చావండి కానీ దేవుడిని అడ్డం పెట్టుకోవద్దని ఘాటుగా విమర్శించారు.
T20 World Cup : పసికూనపై భారత్ ఘన విజయం.. ఇదే దూకుడు కొనసాగిస్తే?
ఢిటీ20 వరల్డ్ కప్ లో నమీబియాపై భారత్ ఘన విజయం సాధించింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
` డీజీపీ బి.శివధర్ రెడి ్డహైదారాబాద్(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు మరియు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ …
` ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశం ` సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు ` రెడీగా సీటీ స్కాన్, ఎంఆరఐ మిషన్లు ` గుండె ఆపరేషన్ల …
జారీ ప్రక్రియపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు గతానికంటే పారదర్శకంగానే ప్రతి జర్నలిస్టుకూ న్యాయం చేస్తాం కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, అవసరం మేరకు మరోసారి మీటింగ్ రాష్ట్ర రెవెన్యూ, …
` నేడే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ` అధికారులకు ఈసీ దిశానిర్దేశం ` ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ ` ఉదయం 8 గంటల …
2018 నిబంధనల ప్రకారమే సింగరేణి టెండర్లు
` తప్పని నిరూపించండి ` కిషన్రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ` కిషన్రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తాం ` ఎన్టీఆర్కు …
నేను ఎవరితోనూ పోల్చుకోను 2029లో జమిలి ఎన్నికలు పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా త్వరలోనే హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తా ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతోంది కెసిఆర్పై కక్ష సాధింపు లేదు ఢిల్లీలో విలేకరులతో సిఎం రేవంత్రెడ్డి చిట్చాట్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రినని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరితోనూ పోల్చుకోనని తనకు ఎవరూ పోటీ కారన్నారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ 2029లో జమిలి ఎన్నికలు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై తన మద్దతు ఉంటుందని, త్వరలోనే హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతోందని, ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని ఆయన అన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. తమకు కెసిఆర్పై కక్ష సాధింపు లేదన్నారు. ఒకవేళ కెసిఆర్ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ, ఈ అంశాన్ని కేంద్రం పెండింగ్లో పెట్టిందని ఆయన తెలిపారు. ఈ అంశంలో సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడని ఆయన పునరుద్ఘాటించారు. కాళేశ్వరంపై 48 గంటల్లో విచారణ చేయిస్తామని కిషన్ రెడ్డి గతంలో ప్రకటించారని ఈ సందర్భంగా సిఎం రేవంత్ గుర్తు చేశారు. కానీ, ఇప్పటివరకు సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదంటూ కిషన్ రెడ్డిని సిఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరంపై తాము నేరుగా సిబిఐ డైరెక్టర్కు లేఖ రాశామని ఆయన వివరించారు. మూడు పిల్లర్లా?.. ముప్పయ్ పిల్లర్లా? అనేది కమిటీ... అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్లో మూడు పిల్లర్లు మాత్రమే కూలాయని చెప్పడం పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ లోపల బాంబు పెడితే పైన పేలుతుందని, కింద కూలదని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మూడు పిల్లర్లా?.. ముప్పయ్ పిల్లర్లా? అనేది కమిటీ నిర్ధారించిన తర్వాత చెబుతామని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నష్టం జరిగిందో అంచనా కోసం కమిటీకి బాధ్యతలు అప్పగించామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై ఆలోచిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం అధ్యయనం చేయాలని, ఆ బాధ్యత ఓ నిపుణుల కమిటీకి అప్పగించామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మూడు గేట్ల మరమ్మతుల తర్వాత ప్రాజెక్టు కూలితే ఆ నింద తమపై వేయాలని బిఆర్ఎస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు ఎన్టీఆర్ జాతీయ నాయకుడని ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని జాతీయ సొత్తు అని సిఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తాను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంతా మూర్ఖులు ఎవరు ఉండరన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని సిఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కవిత పార్టీ గురించి తమకు తెలియదన్నారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాతే ఒక్కొక్కరికీ సిట్ నోటీసులు జడ్జీలు, జర్నలిస్టులు, రాజకీయ నేతల ఫోన్లు సైతం ట్యాప్ చేశారంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలపై సిఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కారకుడు ప్రభాకర్ రావు అని, 20 నెలలపాటు విదేశాలకు పారిపోయారని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్వదేశానికి తీసుకొచ్చామని ఆయన వివరించారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాతే ఒక్కొక్కరికీ సిట్ నోటీసులు జారీ చేస్తోందన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఎస్ఐబీలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము అధికా రంలోకి వచ్చాక ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుందని ఆయన సెటైర్లు వేశారు. ట్యాపింగ్ కాల్స్ వినడం ఓ మానసిక రోగమని, అలా చేస్తే ఆయుష్షు తగ్గుతుందని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కెటిఆర్ను ఈడీ ఎందుకు విచారించదు.. కెసిఆర్, హరీశ్ రావులను కోరినట్లుగా ప్రభుత్వం నడవదని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అక్రమాలు, ఫార్ములా ఈ-రేసుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, కెటిఆర్ను ఎందుకు విచారించడం లేదో చెప్పాలన్నారు. త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతానని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ హయాం నుంచే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉందని ఆయన తెలిపారు. పదేళ్ల పాటు కెసిఆర్ను ఆ విషయం గురించి అడగకుండా కిషన్ రెడ్డి తనను అడుగుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మార్చి 31లోపు హైదరాబాద్ మెట్రో స్వాధీనం మార్చి 31వ తేదీ లోపు హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. జూన్ 2వ తేదీన ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు చర్చ జరిపి అన్ని విషయాలు మాట్లాడతానన్నారు. వాస్తవాలు చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి తాను మాట్లాడినది తప్పని గ్రహించి క్షమాపణ చెప్పాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాలపై తాము అడిగినవన్నీ ఇస్తే ఎపికి సహకరిస్తాం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందో అర్థం కావడం లేదన్నారు. కృష్ణ, గోదావరి బేసిన్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఆ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తన ప్రాజెక్టులు పూర్తి చేస్తే వరద జలాల లెక్కలు తేలుతాయన్నారు. నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పకూడదన్నారు. గోదావరి, కృష్ణా నది బేసిన్లోలో ప్రాజెక్టులు నిర్మించే విషయంలో ఒకే విధానం ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై తాము అడిగినవన్నీ ఇస్తే ఆంధ్రప్రదేశ్కు సైతం సహకరిస్తామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మహబూబ్ నగర్లో ఓ కౌన్సిలర్ కోసం హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని సిఎం అన్నారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే బిజెపి, సిబిఐతో విచారణ జరిపించుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం అధిష్టానంతో జరిగిన సమావేశంలో కేబినెట్ విస్తరణ ప్రస్తావన రాలేదని సిఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాహుల్తో సిఎం రేవంత్ భేటీ గురువారం సాయంత్రం సిఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా సిఎం రేవంత్రెడ్డి కలిశారు. అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కెసి వేణుగోపాల్తో సిఎం రేవంత్రెడ్డి చర్చించారు.
రూ.2,200 కోట్ల విలువైన భూమికి విముక్తి
మన తెలంగాణ/సిటీబ్యూరో: మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు చేరువగా వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న పాపులను హైడ్రా గురువారం తొలగించింది. మొండికుంట ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వే సింది. చెరువుతోపాటు పక్కనే ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమిలోని అక్రమణలు తొలగించి హైడ్రా కాపాడింది. రూ.2200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హై డ్రా రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మం డలం ఖానామెట్ గ్రామంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేసింది. సర్వే నంబరు 53లోని మొండికుంటతో పాటు సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమి ఎకరాల కొద్దీ ఆక్రమణలకు గురి అవుతోందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలమేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది. దాదాపు 11 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐరన్ స్టీల్ షాపు ఇలా పలురకాల షెడ్డులు వేసి వ్యాపారాలు చేస్తున్నట్టు హైడా అధికారులు గుర్తించారు. 30కి పైగా ఉన్న పాపుల ద్వారా నెలకు రూ. లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోకి ఆక్రమణలతో పాటు హై కోర్టు స్టే ఉన్నప్పటికీ షెడ్డుల నిర్మాణం చేశారు. 200 వరకు తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసుకుని అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. 30కి పైగా దుకాణాలను ఏర్పాటుచేసి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం, ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన షెడ్డులు, షాపుల ద్వారా నెలకు రూ. 2 కోట్ల వరకూ అద్దెలు వసూలు చేస్తున్నట్టు హైడ్రా గుర్తించింది. మొండికుంటకు ఆనుకుని నిర్మించిన ఆలయాన్ని మినహాయించి కూల్చివేతలను చేపట్టిన హైడ్రా ఆక్రమణల తొలగింపుతో పాటు ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సమావేశపరిచి... సమాచారం ఇచ్చి మొండికుంటతో పాటు అక్కడున్న ప్రభుత్వ భూమి అక్రమణలపై జనవరి 31న హైడ్రా విచారణ కూడా చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే అక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి కూడా అక్రమణలు జరిగినట్టు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కబ్జాదారులకు తెలిపారు. వారికి కొంత సమయాన్ని ఇచ్చి గురువారం హైడ్రా అక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్డులను పోలీసు బారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. ఈ అక్రమణలు తొలగించిన సందర్భంలో అక్కడ స్థానికులు అధికాశాతం మంది వచ్చి హైడా చర్యలను అభినందించారు. ప్రభుత్వ భూమిలో అక్రమణలు తొలగించిన చోట పార్కులను అభివృద్ధి చేయాలని స్థానికులు ఈ సందర్భంగా హైడ్రా అధికారులను కోరారు. చెరువును కూడా అభివృద్ధి చేసి సుందరీకరించాలని అభ్యర్ధించారు.
ఎన్నికల ఫలితాల వేళ అప్రమత్తమైన అన్ని పార్టీలు ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట మున్సిపల్ పరిధిలో జోరందుకున్న క్యాంపు రాజకీయాలు బిజెపి అభ్యర్థులను ప్రత్యేక బస్సుల్లో తరలించిన ఎంఎల్ఎ పాయల్ శంకర్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫంక్షన్ హాల్లో బస సూర్యాపేటలో బిఆర్ఎస్ అభ్యర్థులను తరలించిన మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డి మన తెలంగాణ/ న్యూస్ నెట్వర్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఫలితాల పైన ప్రధాన పార్టీలు భారీ అంచనాలతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా తమ అంచనాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నేతలు 80 శాతానికి పైగా స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నారు. బీజేపీ కొన్ని కార్పోరేషన్ల పైన నమ్మకం పెట్టుకుంది. అయినా ఫలితాల ముం దే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ పరిణామాలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మున్సి పల్ ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫలితాల అనంతరం తన అభ్యర్థులు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా చూసేందు కు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలను ప్రారంభించాయి. ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు అభ్యర్థులతో ఆయా పార్టీల కీలక నే తలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. వారికి పలు కీల క సూచనలు చేస్తున్నారు. పార్టీల ముఖ్య నేతలు క్యాంపు రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బరిలో ఉన్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నా లు ముమ్మరం చేశారు. సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. శుక్రవారం ఎన్నికల ఫలితాల దృష్ట్యా బీఆర్ఎస్ అప్రమత్తమైంది. గెలిచే అవకాశమున్న అభ్యర్థులను ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్లు, రిసార్టులకు తరలిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మం చిర్యాల నగరపాలిక సహా మరో పది పురపాలికల ఫలితాలు ఎలా ఉండబోతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సొంత బలంతో ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటామనే దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ లెక్కల్లో మునిగిపోయాయి. రాజకీయంగా ఎవరి స్థానం ఏంటో శుక్రవారం తేలిపోనుంది. క్యాంపుల్లోకి అభ్యర్దులు పురపాలక ఎన్నికల్లో బాగా పనిచేశారని నేతలు, శ్రేణులను ఆయన అభినందించారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్ కొన్నిమున్సిపాల్టీలను సొంతంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులతో క్యాంపులను నిర్వహించి నేతలకు కేటీఆర్ పలు కీలక సూచనలు చేశారు. విప్ జారీ సహా అన్ని అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా.. తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థు లు పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు అన్ని రాజకీయపార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. దీంతో, మున్సిపల్ ఫలితాలు వెలువడనున్న వేళ రాజకీయం మరింత ఉత్కంఠ పెంచుతోంది. జోరందుకున్న క్యాంపు రాజకీయాలు ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బరి లో నిల్చున్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ ఎ మ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు కార్యాలయానికి అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని తరలించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యం లో పట్టణ శివారులోని ఫంక్షన్హాల్లో అభ్యర్థులతో స మావేశమయ్యారు. వారిని ఎక్కడికి తరలించాలో సమాలోచన చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ మంత్రి జోగు రామన్నసైతం క్యాంపునకు పంపించే ఆలోచనలో ఉండటంతో శుక్రవారం ఫలితాలు ఆసక్తిని రేపుతున్నా యి. అటు నిర్మల్లో బీజేపీ మహేశ్వర్ రెడ్డి నివాసంలో 42 మంది అభ్యర్థులతో సమావేశం నిర్వహించి వారిని క్యాంపునకు తరలించారు. అప్రమత్తమైన బీఆర్ఎస్ మరోవైపు సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. రేపు ఎన్నికల ఫలితాల దృష్ట్యా బీఆర్ఎస్ అప్రమత్తమైంది. 48 వార్డులకు చెందిన ఆపార్టీ అభ్యర్థులను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంపునకు తరలించారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునే వ్యూహాంలోనే ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచనలు చేసినట్లు సమాచారం. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడుతుందనే అభిప్రాయం రాజకీయ పార్టీల నుంచే వ్యక్తమవుతోంది. 49 వార్డులకు గానూ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రావ టం కష్టమనే అంతర్మథనం ప్రధాన పార్టీలను పట్టిపీడిస్తోంది. మంత్రి వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూర్, క్యాతన్పల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. బీజేపీ మాత్రం బోణి కొడతామనే భావనలో ఉంది. లక్షెట్టిపేట, బెల్లంపల్లిలో సత్తా చాటుతామనే ధీమాలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలిస్తుందనే ఆలోచన బీజేపీ, బీఆర్ఎస్లో కనిపిస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని పార్టీల ధీమా నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పాగా వేస్తామనే వి శ్వాసంతో అధికార పార్టీ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్, బీజేపీ గట్టి పోటీ ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా రు. నిర్మల్లో కాంగ్రెస్ బలం పుంజుకుందనే అభిప్రా యం రాజకీయ ప్రాధాన్యతను రేకెత్తిస్తోంది. ఇక రాష్ట్రంలోనే అత్యంత సున్నిత ప్రాంతమైన భైంసాలో మజ్లిస్ ప్రభావానికి బీజేపీ, బీఆర్ఎస్ కూటిమిగా ఏర్పడతాయా అనే చర్చకు దారితీస్తోంది. కుమురం భీం జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామనే ధీమా గులాబీ పార్టీలో కనిపిస్తోంది. కాగజ్నగర్లో బీజేపీ, ఆసిఫాబాద్లో కాంగ్రెస్ సాధించే కౌన్సిలర్ స్థానాలపైనే బీఆర్ఎస్ ఆధిక్యత ఆధారపడి ఉంది. మేయర్ స్థానాలు మావే అంటున్న కాంగ్రెస్ తొలిసారిగా నగరపాలికగా అవతరించిన మంచిర్యాల ఫలితం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాము మే యర్ స్థానాన్ని కైవసం చేసుకోవటం ఖాయమనే ధీమా కాంగ్రెస్లో కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాతినిథ్యం లేని బీజేపీ బోణీ కొట్టడమే కాకుండా మేయర్ స్థా నం కైవసం చేసుకుంటామనే ఉత్తేజంతో ఉంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పును అంచనా వేయటంలో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించండి గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్కు సిఎం రేవంత్ విజ్ఞప్తి కేంద్ర నిధులతో కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు వినతి అంతర్జాతీయ ప్రమాణాలతో మమూనురు ఎయిర్పోర్టు నిర్మించాలి పౌరవిమానయాన శాఖ మంత్రి రాంమ్మోహన్నాయుడుకు విజ్ఞప్తి ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలను అందచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం, రైల్వే లైన్ల మంజూరు, విమానాశ్రయాల పనులు వేగవంతంగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పౌర విమానయాన శాఖ మంత్రి రాంమ్మోహన్ నాయుడులతో గురువారం ముఖ్యమంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఆయా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, భూ బదలాయింపులు, నిధుల మంజూరును కోరుతూనే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇవ్వనున్న మద్దతు, భూ కేటాయింపుల గురించి కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్రెడ్డి వివరించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర మంత్రితో సౌత్ బ్లాక్లోని ఆయన కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం భేటీ అయ్యారు. శంకుస్థాపన, భూమి పూజకు రండి సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్రమంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహత్మా గాంధీ చితభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు సిఎం తెలియజేశారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభి వృద్ధి, నిరాడంబర జీవనశైలిని అద్దం పట్టేలా గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి సిఎం తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రపంచస్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మక, పర్యావరణ కేంద్రంగా నిలుపుతామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్కు సిఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఈ నెలాఖరులో చేసే శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచే హైస్పీడ్ కారిడార్ను.. హైదరాబాద్ టు -చెన్నై (778 కి.మీ.), హైదరాబాద్ టు -బెంగళూర్ (586 కి.మీ.), హైదరాబాద్- టు పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని సిఎం సూచించారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని సిఎం రేవంత్రెడ్డి కోరారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందని ఆయన వివరించారు. హైదరాబాద్- టు బెంగళూరు, హైదరాబాద్- టు పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని సిఎం రైల్వే మంత్రికి వివరించారు. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేశారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అదనంగా 249.82 ఎకరాల భూమిని అందచేస్తాం వరంగల్ ఎయిర్పోర్ట్ ఉమ్మడి వరంగల్తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని కేంద్ర మంత్రికి సిఎం వివరించారు. మామూనూరు నుంచి సాధ్యమైనంత త్వరగా విమాన రాకపోకలు సాగేలా పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడుకు సిఎం విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాల భూమిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రితో సిఎం తెలియజేశారు. వెంటనే అనుమతుల మంజూరు చేయాలని కోరారు. మామూనూరు ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపిస్తానని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపిలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలి కృష్ణా-, వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తాన్ని తామే భరిస్తామని గతంలో పేర్కొన్న విషయాన్ని సిఎం కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ మార్గంలోని లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సిఎం కేంద్ర మంత్రికి తెలియజేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని కేంద్ర మంత్రితో సిఎం పేర్కొన్నారు. కొడంగల్, టేడంగల్, దౌల్తాబాద్లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సిఎం వివరించారు. మామూనూరు ఎయిర్పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ కు సమీపంలో నిర్మించనున్న మామూనూరు ఎయిర్పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమ్మోహన్ నాయుడుతో పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మామూనూరు ఎయిర్పోర్టుకు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. మామూనూరు ఎయిర్పోర్టు కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్ ఓవర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. జౌళి, ఇతర పరిశ్రమలతో వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, వరంగల్కు దగ్గరలో రెండేళ్లకోకసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర మేడారంలో జరుగుతుందని కేంద్ర మంత్రికి సిఎం తెలియజేశారు.
15 రోజుల్లో సిఎం సమక్షంలో ఇహెచ్ఎస్ స్కీమ్ ప్రారంభం వారం రోజుల్లో విధివిధానాలు ఖరారు సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఇహెచ్ఎస్ ట్రస్ట్ సమావేశంలో కీలక నిర్ణయం ఉద్యోగుల మూల వేతనాల నుంచి 1.5శాతం చెల్లింపు అంతే మొత్తాన్ని చెల్లించనున్న ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యపై గురువారం రాష్ట్ర స చివాలయంలో సిఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఈహెచ్ఎస్ ట్రస్టు సమావేశం జరిగింది. ఈనేపథ్యంలోనే ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం 15 రోజుల్లో సిఎం సమక్షంలో ప్రారంభించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈహెచ్ఎస్ పథకం కింద ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆ రోగ్య పథకానికి చెల్లించేలా నిర్ణయించారు. అలా గే ఉద్యోగులు చెల్లించిన అంతే మొత్తాన్ని ప్రభు త్వం కూడా చెల్లించేలా ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధి, విధానాలు వారం రోజుల్లో సిద్ధం చేయాలని సిఎస్ కె. రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సివి ఆనంద్, మహేశ్ దత్ ఎక్కా, ఆ ర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోగ్తులతో పాటు టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టిజిఓ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, టిజిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్, టిఎన్జీఓ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సే నీ, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డిలు తెలంగాణ సెక్రటేరియేట్ అ సోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్, పిఆర్టియూ దామోదర్రెడ్డి, తెలంగాణ యూటిఎఫ్ చావా రవి, హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఈ నూతన ఉద్యోగుల ఆరో గ్య పథకం వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో లక్షా 44వేల మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 12.84 ల క్షల మంది డిపెండెంట్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఉద్యోగులు, పెన్షనర్లలో నాలుగవ తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, పెన్షనర్లు తమ బేసిక్-పే లో 1.5 శాతం మొత్తాన్ని చెల్లిస్తే సంవత్సరానికి రూ. 528 కోట్లు జమ అవుతాయని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ఈ ట్రస్టు సిఈఓగా నియమిస్తారు. ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన హెల్త్ స్కీమ్ ఒక ముందడుగు అని సిఎస్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ఈ పథకంలో మార్పులు, చేర్పులపై ట్రస్ట్ సమావేశంలో నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.
రూ.3.60 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రక్షణ కొనుగోళ్ల మండలి ఏడాది చివరినాటికి ఒప్పందం న్యూఢిల్లీ: భారతీయ వాయుసేన శక్తి పాటవం మరింత ఇనుమడించనుంది. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల సేకరణకు దిగనున్నారు. ఇందుకు రూ.3.60లక్షల కోట్ల వ్యయం అవుతుం ది. సంబంధిత రక్షణ వ్యూహాత్మక కొనుగోళ్ల ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వశాఖ గురువారం అనుమతిని వెలువరించింది. ఫ్రాన్స్, భారత్ ప్రభుత్వా ల మధ్య ఉన్న రక్షణ ఒప్పందం విధివిధానాల పరిధిలో రఫేల్ ఫైటర్ జెట్స్ సమీకరణ జరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనకు ఆమోదం దక్కిందని అధికారులు తెలిపారు. రక్ష ణ సైనిక ఆయుధ వ్యవస్థ సంబంధిత కొనుగోళ్ల ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారధ్యపు రక్షణ కొనుగోళ్ల లేదా సేకరణల మండలి (డిఎసి) అనుమతిని ఇచ్చింది. త్రివిధ బలగాల పోరాట పటిమను పెంచేందుకు ఈ కొనుగోళ్ల ఒ ప్పందం ఇంతకు ముందే కుదిరింది. ఇప్పుడు దీని ని కార్యరూపంలోకి తీసుకువస్తున్నారు. మరో 4రోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షులు మేక్రాన్ ఎమ్మాన్యుయెల్ భారతదేశ పర్యటనకు రానున్న సందర్భం లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల నిర్ణయం తీ సుకోవడం కీలక పరిణామం అయింది. భారత్ వాయుసేన వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలున్నాయి. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ కార్యాచరణలో ఈ యుద్ధ విమానాల సమర్ధత వెల్లడైం ది. శత్రుదేశాల సవాళ్లను తిప్పికొట్టేందుకు ఇటువంటి ఫైటర్ల అవసరాన్ని గుర్తించి మరిన్ని విమా నాలు కొనుగోలుకు రక్షణ శాఖ సిద్ధమైంది. రఫేల్ యుద్ధ విమానాల తయారీ కంపెనీ డసౌల్ట్తో ఏడాది చివరి నాటికి ఒప్పందం ఖరారవుతుంది.
శుక్రవారం రాశి ఫలాలు (13-02-2026)
మేషం ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమునకు ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు. వృషభం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మిధునం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. కర్కాటకం చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహం కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఋణాలు కొంత వరకు తొలగుతాయి. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. కన్య చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. తుల దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చికం నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధనస్సు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకరం బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. కుంభం వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు. మీనం స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ୧୫ ଦିନରେ ୮୦୦ ବ୍ୟକ୍ତି ନିରୁଦିଷ୍ଟ ହୋଇଥିବା ଦାବିକୁ ଖଣ୍ଡନ କଲା ଦିଲ୍ଲୀ ପୋଲିସ
ସବୁ ବେଳେ ଚର୍ଚ୍ଚାର ବିଷୟ ପାଲଟିଥାଏ ଦେଶର ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀ । କେତେବେଳେ ସରଗରମ ରାଜନୈତିକ ମାହୋଲ ତ କେତେବେଳେ କୌଣସି ଅପରାଧ ଜନିତ ଖବର । ସେହିପରି କିଛିଦିନ ତଳେ ଦିଲ୍ଲୀକୁ ବୋମା ଧମକର ଖବର ସାରା ଦେଶରେ ଚାଞ୍ଚଲ୍ୟ ସୃଷ୍ଟି କରିଥିଲା। ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀରେ ଆତଙ୍କ ଖେଳିଗଲା ଯେତେବେଳେ ସହରର ବିଭିନ୍ନ ଅଞ୍ଚଳର ନଅଟି ପ୍ରମୁଖ ସ୍କୁଲକୁ ବୋମା ଧମକ ଆସିଲା। ଏହି ଧମକପୂର୍ଣ୍ଣ କଲଗୁଡ଼ିକ ସକାଳ ୮ଟା ୩୦ ରୁ ୯ଟା ମଧ୍ୟରେ ଆସିଥିଲା, ଯାହା ଫଳରେ ସ୍କୁଲ ପ୍ରଶାସନ ଏବଂ ସୁରକ୍ଷା ଏଜେନ୍ସିଗୁଡ଼ିକ ତୁରନ୍ତ ସତର୍କ ହୋଇଗଲେ। ସୂଚନା ପାଇବା ପରେ, ସ୍କୁଲଗୁଡ଼ିକ ତୁରନ୍ତ ଦିଲ୍ଲୀ ପୋଲିସକୁ ସୂଚନା ଦେଇଥିଲେ। ପୋଲିସ, ଅଗ୍ନିଶମ ବାହିନୀ ଏବଂ ବମ ସ୍କ୍ବାଡ ଦଳ ଘଟଣାସ୍ଥଳରେ ପହଞ୍ଚି ସ୍କୁଲ ପରିସରରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ତଲାସି ଆରମ୍ଭ କରିଥିଲେ।ଧମକକୁ ଗମ୍ଭୀରତାର ସହ ନେଇ, ଅନେକ ସ୍କୁଲର ଛାତ୍ରୀଛାତ୍ରମାନଙ୍କୁ ଶ୍ରେଣୀଗୃହରୁ ବାହାର କରି ସୁରକ୍ଷିତ ସ୍ଥାନକୁ ନିଆଯାଇଥିଲା। କିଛି ସ୍କୁଲ ଛୁଟି ଘୋଷଣା କରିଥିଲା, ଯେତେବେଳେ ଅଭିଭାବକମାନଙ୍କୁ ମଧ୍ୟ ତୁରନ୍ତ ସୂଚନା ଦିଆଯାଇଥିଲା। ଇତିମଧ୍ୟରେ ଏକ ପୋଷ୍ଟ ସୋସିଆଲ ମିଡିଆରେ ବହୁମାତ୍ରାରେ ସେୟାର ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯେଉଁଥିରେ ଉଲ୍ଲେଖ ରହିଚି, କେବଳ ୨୦୨୬ ମସିହାର ପ୍ରଥମ ୧୫ ଦିନରେ ଜାତୀୟ ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀରେ ୮୦୦ ରୁ ଅଧିକ ଲୋକ, ବିଶେଷକରି ମହିଳା ଏବଂ ଶିଶୁ ନିଖୋଜ ହୋଇଥିବା ଦାବି ସୋସିଆଲ ମିଡିଆ ପ୍ଲାଟଫର୍ମ ରେ ବହୁମାତ୍ରାରେ ସେୟାର ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଦିଲ୍ଲୀରେ ମହିଳା ସୁରକ୍ଷାକୁ ପ୍ରଶ୍ନ କରୁଥିବା ହ୍ୟାସଟ୍ୟାଗ୍ ସହିତ ପ୍ରାୟତଃ ଏହି ପୋଷ୍ଟଗୁଡ଼ିକ ନିଖୋଜ ସଂଖ୍ୟାରେ ହଠାତ୍ ଏବଂ ଅଭୂତପୂର୍ବ ବୃଦ୍ଧିକୁ ସୂଚିତ କରୁଛି, ଯାହା ଏକ ଆତଙ୍କର ମାହୋଲ ସୃଷ୍ଟି କରୁଛି । 800 People Missing in Just 15 Days in Delhi! | Is the Capital Really Safe? #DelhiMissing #DelhiCrime #MissingPersons #DelhiPolice #WomenSafety #PublicSafety #IndiaNews #ViralNews #TruthBehindTheData #AnchorReport pic.twitter.com/GZmPNzLJ3M — Aap Ki Khabar (@aapkikhabarnews) February 6, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଦାବିକୁ ଖଣ୍ଡନ କଲା ଦିଲ୍ଲୀ ପୋଲିସ । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ କିମ୍ବା ସ୍ୱୀକୃତିପ୍ରାପ୍ତ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରଣ କିମ୍ବା ସେୟାର ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସର ୱେବସାଇଟରେ ଏନେଇ କିଛି ତଥ୍ୟ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ମିଳିଥିବା ତଥ୍ୟ ଅନୁଯାୟୀ, ୧ ଜାନୁଆରୀ ୨୦୨୬ ରୁ ୧୫ ଜାନୁଆରୀ ମଧ୍ୟରେ ୮୦୭ ଜଣ ନିଖୋଜ ବ୍ୟକ୍ତିଙ୍କ ରିପୋର୍ଟ ଦାଖଲ କରାଯାଇଥିଲା । ଦୈନିକ ହାରାହାରି ୧୫ ଦିନରେ ୮୦୭ ଟି ମାମଲା ପ୍ରତିଦିନ ପ୍ରାୟ ୫୪ ଜଣ ନିଖୋଜ ବ୍ୟକ୍ତି ଥିବାର ଜଣାଯାଉଛି । ଦର୍ଶାଉଛି । ତେଣୁ ପୂର୍ବ ବର୍ଷ ସହ ତୁଳନା କଲେ ଏହା ହ୍ରାସ ପାଇଥିବାର ଦେଖାଯାଇଛି । ଉଦାହରଣ ସ୍ୱରୂପ, ୨୦୨୫ ମସିହାର ସମ୍ପୂର୍ଣ୍ଣ ବର୍ଷରେ, ମୋଟ ୨୪,୫୦୮ ଜଣ ନିଖୋଜ ହୋଇଥିଲେ, ଯାହା ପ୍ରତିଦିନ ହାରାହାରି ପ୍ରାୟ ୬୭ ଜଣ ଥିଲେ । ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଯୁଗ୍ମ ଆୟୋଗ ଏବଂ ଲୋକସମ୍ପର୍କ ଅଧିକାରୀ ସଞ୍ଜୟ ତ୍ୟାଗୀ ନିଖୋଜ ବ୍ୟକ୍ତିଙ୍କ ସଂଖ୍ୟା ହଠାତ୍ ବୃଦ୍ଧି ପାଇବାର ଦାବିକୁ ଭିତ୍ତିହୀନ ଏବଂ ଗୁଜବ ବୋଲି କହି ଖଣ୍ଡନ କରିଛନ୍ତି । ତ୍ୟାଗୀଙ୍କ ଅନୁଯାୟୀ, ଜାନୁଆରୀ ୨୦୨୬ ରେ ପୂର୍ବ ବର୍ଷଗୁଡ଼ିକର ଜାନୁଆରୀ ତୁଳନାରେ ନିଖୋଜ ମାମଲା ସଂଖ୍ୟା ହ୍ରାସ ପାଇଛି । हम यह स्पष्ट करना चाहते है कि गुमशुदगी, विशेषकर बच्चों के लापता होनें को लेकर फैलायी जा रही अफवाहों से घबराने की कोई आवश्यकता नहीं है। विगत वर्षों की तुलना में गुमशुदगी के मामलों में वृद्धि नहीं हुई है। दिल्ली पुलिस त्वरित जांच व कार्रवाई के साथ नागरिकों की सुरक्षा के लिए… pic.twitter.com/WjV1MCoTEM — Delhi Police (@DelhiPolice) February 5, 2026 ୫ ଫେବୃଆରୀ ୨୦୨୬ରେ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଏନେଇ ଏକ ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଆମେ ସ୍ପଷ୍ଟ କରିବାକୁ ଚାହୁଁଛୁ ଯେ ନିଖୋଜ ବ୍ୟକ୍ତି, ବିଶେଷକରି ପିଲାମାନଙ୍କ ସମ୍ପର୍କରେ ପ୍ରଚାରିତ ଗୁଜବ ଯୋଗୁଁ ଭୟଭୀତ ହେବାର କୌଣସି ଆବଶ୍ୟକତା ନାହିଁ । ପୂର୍ବ ବର୍ଷ ତୁଳନାରେ ଚଳିତ ବର୍ଷ ନିଖୋଜ ମାମଲାରେ କୌଣସି ବୃଦ୍ଧି ହୋଇନାହିଁ । ଦିଲ୍ଲୀ ପୋଲିସ ତୁରନ୍ତ ତଦନ୍ତ ଏବଂ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ମାଧ୍ୟମରେ ନାଗରିକଙ୍କ ସୁରକ୍ଷା ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ। ଦିଲ୍ଲୀ ପୋଲିସର ଯୁଗ୍ମ ପୋଲିସ କମିଶନର / ଜନସମ୍ପର୍କ ଅଧିକାରୀ ଶ୍ରୀ ସଞ୍ଜୟ ତ୍ୟାଗୀଙ୍କ ବାର୍ତ୍ତା । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଉକ୍ତ ଦାବିକୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଖଣ୍ଡନ କରିବା ସହ ଗତବର୍ଷ ତୁଳନାରେ ଚଳିତ ବର୍ଷ ନିଖୋଜ ତାଲିକାରେ ଅଧିକ ମାମଲା ରହିନାହିଁ ।
థియేటర్లలోనే శివాజీ`లయ కొత్త చిత్రం?
హైదరాబాద్: శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్లలోనే విడుదల చేయాలని ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ టీమ్తో కలిసి నిర్మించిన హీరో శివాజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి ఫిబ్రవరి 12న ఈ చిత్రం ఈటీవీ విన్లో నేరుగా స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ అలా జరగలేదు. శివాజీ ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో చివరి నిమిషంలో ఆయన ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయం […] The post థియేటర్లలోనే శివాజీ`లయ కొత్త చిత్రం? appeared first on Visalaandhra .
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ୟୁସିଜି ନିୟମ ସହ ଉକ୍ତ ଭିଡ଼ିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
UGCର ନୂଆ ନିୟମକୁ ନେଇ ବଢୁଛି ବିବାଦ । ଜାନୁଆରୀ ୨୭ରେ ପ୍ରସାରିତ ଏକ ଖବର ଅନୁଯାୟୀ, ଚର୍ଚ୍ଚା ହେଉଛି ନୂଆ ନିୟମ ଯୋଗୁଁ କ୍ୟାମ୍ପସରେ ଭେଦଭାବ ଦୂର ହେବ ନା ବିବାଦ ବଢ଼ିବ? ଜାନୁଆରୀ ୨୦୨୬ରେ ୟୁନିଭରସିଟି ଗ୍ରାଣ୍ଟସ୍ କମିଶନ ଦେଶର କଲେଜ ଏବଂ ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟଗୁଡ଼ିକରେ ଜାତିଗତ ଭେଦଭାବ ରୋକିବା ପାଇଁ ଏକ ନୂଆ ନିୟମାବଳୀ ଆଣିଛନ୍ତି । ଏହାକୁ ନେଇ ଏବେ ସାରା ଦେଶରେ ଚର୍ଚ୍ଚା ଓ ବିବାଦ ଦେଖାଦେଇଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଏକ ମଶାଳ ଯାତ୍ରା ହେଉଥିବରଦେଖିବାକୁ ମିଳିଛି । ଯାତ୍ରାରେ ମୋଦି ଏବଂ ସାହାଙ୍କ ଫଟୋ ଧରି କିଛି ଆନ୍ଦୋଳନକାରୀ ବିକ୍ଷୋଭ ପ୍ରଦର୍ଶନ କରୁଥିବାର ମଧ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି । ତେବେ ଉକ୍ତ ଭିଡିଓଟି ଉକ୍ତ ନୂତନ ୟୁଜିସି ନିୟମକୁ ନେଇ ହୋଇଥିବା ଏକ ଆନ୍ଦୋଳନ ସମୟର ବୋଲି ଦାବି ହୋଇଛି । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଗୋଟିଏ ନୂଆ ନିୟମ ଗୋଟିଏ ଯାତୀର ଏକତାର ମୁହଁ ଭାଙ୍ଗିଦେଲା । ଆହୁରି ମଧ୍ୟ ଧର୍ମକୁ ନେଇ ବିଭାଗ ଆକ୍ଷେପ ମୂଳକ ଲେଖା ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ଅନ୍ୟପଟେ ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଏପର୍ଯ୍ୟନ୍ତ ତ ହିନ୍ଦୁ ଅସୁବିଧାରେ ଥିଲେ ଏବେ ଲାଗୁଚି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଅସୁବିଧାରେ ଅଛନ୍ତି । HINDU UNITY IS A MYTH One UGC law and Brahmins dropped the facade of Hindu Unity in one day. Hindus were never one, they will never be one. The basis of this religion is Caste/Varna and it is fundamentally against Unity. To all those Dalits & OBCs who are roaming as… pic.twitter.com/dePJHrIbp9 — Tarun Gautam (@TARUNspeakss) January 27, 2026 ଯାହାର ଏକ ସ୍କ୍ରିନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ନୂତନ ୟୁଜିସି ନିୟମ ନେଇ ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ଆନ୍ଦୋଳନ ହେଇଚି ସତ । ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ଯାହାକି ଏକ ରାଜନୈତିକ ଆନ୍ଦୋଳନ ସମୟର ଅଟେ । ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳି ବହୁ ଆନ୍ଦୋଳର ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ହେଲେ କୌଣସି ଭିଡିଓରେ ପ୍ରକୃତ ଏଭଳି ଭାଇରାଲ ହେଉଥିବାର ଛବି ଦେଖିବାକୁ ମିଳିନଥିଲା । ଯଦି ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଫେସବୁକରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ସର୍ଵ ଭାରତୀୟ କଂଗ୍ରେସର ସୋସିଆଲ ମିଡିଆ ପେଜରେଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ଥିଲା, ଭାରତୀୟ ଜାତୀୟ କଂଗ୍ରେସର ସର୍ବୋଚ୍ଚ ନେତ୍ରୀ । ଶ୍ରୀମତୀ ସୋନିଆ ଗାନ୍ଧୀ ଓ ସର୍ବମାନ୍ୟ ନେତା ଶ୍ରୀ ରାହୁଲ ଗାନ୍ଧୀଙ୍କ ନାମରେ ନ୍ୟାସନାଲ ହେରାଲଡ଼ ମିଥ୍ୟା ମାମଲାରେ ଫସାଇ ଦୀର୍ଘ ଏକ ଦଶନ୍ଧି ଧରି ବଦନାମ କରିବା ପ୍ରତିବାଦରେ ମଶାଲ ଶୋଭାଯାତ୍ରା । ପିସିସି ସଭାପତି ଶ୍ରୀ ଭକ୍ତଚରଣ ଦାସଙ୍କ ସମେତ ଜିଲ୍ଲା ସଭାପତି ପ୍ରକାଶ ଚନ୍ଦ୍ର ଜେନା, ବରିଷ୍ଠ ନେତା ସୁରେଶ ରାଉତରାୟ, ନବଜ୍ୟୋତି ପଟ୍ଟନାୟକ, ଶୁଭେନ୍ଦୁ ମୋହାନ୍ତି, ଯୁବକଂଗ୍ରେସ ସଭାପତି ରଞ୍ଜିତ ପାତ୍ରଙ୍କ ଆଦି ବହୁ ବିଶିଷ୍ଟ ନେତୃବୃନ୍ଦ ଯୋଗଦେଇଥିଲେ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସଦୃଶ ହୋଇଥିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ସମୟର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ପ୍ରମାଣିତ ହୋଇଥିଲା । ସେହିପରି ବର୍ତ୍ତମାନର ପିସିସି ସଭାପତି ଶ୍ରୀ ଭକ୍ତ ଚରଣ ଦାସ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ୨୦ ଡିସେମ୍ବର ୨୦୨୫ରେ ଅପଲୋଡ଼ କରି ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଦଶନ୍ଧିରୁ ଅଧିକ ସମୟ ଧରି, ମୋଦି-ଶାହାଙ୍କ ନେତୃତ୍ୱାଧୀନ ବିଜେପି ବିରୋଧୀଙ୍କୁ ଚୁପ୍ କରିବା ପାଇଁ କେନ୍ଦ୍ରୀୟ ଏଜେନ୍ସିଗୁଡ଼ିକର ଅପବ୍ୟବହାର କରିଆସିଛି ଏବଂ ମିଥ୍ୟା ମାମଲା ମାଧ୍ୟମରେ ଶ୍ରୀ ରାହୁଲ ଗାନ୍ଧୀ ଏବଂ ଶ୍ରୀମତୀ ସୋନିଆ ଗାନ୍ଧୀଙ୍କୁ ବଦନାମ କରିଛି। କୋର୍ଟ ଦ୍ୱାରା ନିଶ୍ଚିତ କରାଯାଇଥିବା ସତ୍ୟର ଜୟ ହୋଇଛି। ମୁଁ ଏହି ରାଜନୈତିକ ପ୍ରତିଶୋଧର ପ୍ରତିବାଦ ପାଇଁ ଭୁବନେଶ୍ୱର କଂଗ୍ରେସ କମିଟି ଦ୍ୱାରା ଆୟୋଜିତ ମଶାଲ ରାଲିରେ ଯୋଗ ଦେଇଥିଲି। ଏହା ଗଣତନ୍ତ୍ର ଏବଂ ସମ୍ବିଧାନକୁ ସୁରକ୍ଷା ଦେବା ପାଇଁ ଏକ ସ୍ପଷ୍ଟ ଦୃଷ୍ଟିକୋଣ ଥିଲା । କଂଗ୍ରେସ ଭୟ ଆଗରେ ମୁଣ୍ଡ ନୁଆଁଇବ ନାହିଁ ଏବଂ ନ୍ୟାୟ ପାଇଁ ଏହି ଲଢ଼େଇ ଜାରି ରହିବ । For over a decade, the Modi-Shah led BJP has misused central agencies to silence the opposition and malign Shri Rahul Gandhi and Smt Sonia Gandhi through false cases. Truth has prevailed as affirmed by the Court. I joined the torch rally organised by the Bhubaneswar Congress… pic.twitter.com/Yl1zXYcITT — Bhakta Charan Das (@BhaktaCharanDas) December 20, 2025 ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ନୂତନ ୟୁଜିସି ନିୟମ ନେଇ ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ଆନ୍ଦୋଳନ ହେଇଚି ସତ । ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ଯାହାକି ଏକ ରାଜନୈତିକ ଆନ୍ଦୋଳନ ସମୟର ଅଟେ ।
‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్ […] The post ‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్ appeared first on Visalaandhra .
హైదరాబాద్: హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ‘మృత్యుంజయ’ చిత్రం ఈనెల27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… చిత్ర బందం టీజర్ను విడుదల చేసింది ఈ టీజర్ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసి, చిత్ర యూనిట్కు అభినందనలు తెలియజేశారు. ఒక సస్పెన్స్తో కూడిన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ అధికారిగా శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించనుండగా, అందరూ ప్రమాదంగా భావించే ఒక ఘటన వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా వెలికితీశారనే ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమా […] The post ‘మృత్యుంజయ’ టీజర్ విడుదల appeared first on Visalaandhra .
కొలంబో: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్ […] The post లంక చేతిలో ఒమన్ విలవిల appeared first on Visalaandhra .
122 మీటర్ల క్యాచ్… గిన్నిస్ బుక్లో జోస్ బట్లర్?
న్యూదిల్లీ: ఇంగ్లాండ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ అందుకుని వార్తల్లో నిలిచాడు. ఈ రికార్డ్ ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్లో నమోదైంది. సుమారు 122 మీటర్ల ఎత్తులో డ్రోన్ నుంచి క్రికెట్ బంతిని వదిలారు. అంత ఎత్తు నుండి వేగంగా వస్తున్న బంతిని జోస్ బట్లర్ కళ్లప్పగించి గమనిస్తూ అద్భుత టైమింగ్తో క్యాచ్ పట్టాడు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ప్రశంసించాడు. […] The post 122 మీటర్ల క్యాచ్… గిన్నిస్ బుక్లో జోస్ బట్లర్? appeared first on Visalaandhra .
ముంబై: టీ20 ప్రపంచ కప్ లో ఇటలీ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో నేపాల్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ కాగా… ఈ లక్ష్యాన్ని ఇటలీ వికెట్లేమీ కోల్పోకుండా 12.4 ఓవర్లలోనే ఛేదించింది. జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 66 పరుగులు, ఆంథోనీ మోస్కా 32 బంతుల్లో 62 పరుగులతో చెలరేగారు. కాగా ఈ టోర్నీలో నేపాల్కు […] The post నేపాల్పై ఇటలీ ఘన విజయం appeared first on Visalaandhra .
అరేపల్లి సమీపంలో పులి జాడలు.. అటవీ శాఖ అలర్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా అరేపల్లి గ్రామం పరిసరాల్లో పులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. నిన్న పులి కనిపించిన ప్రాంతానికి వాయువ్య దిశగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో తాజా పాదముద్రలు గుర్తించినట్లు హైదరాబాద్లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయం అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేలా వెంటనే ట్రాకింగ్ చర్యలను మరింత ముమ్మరం చేశామని వెల్లడించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పర్యవేక్షణ కోసం థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం, స్థానిక అటవీ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తోందని తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలు జాగ్రత్త సూచనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షిత మార్గం కల్పించేందుకు అటవీ శాఖ సమగ్ర చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
. ఖుల్నాలో ఘర్షణ…బీఎన్పీ నాయకుడి మృతి. గోపాల్గంజ్లో పోలింగ్ కేంద్రంపై బాంబు దాడి.. ముగ్గురికి గాయాలు. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని జమాత్ ఆరోపణ ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు హింసాత్మకంగా మారాయి… గురువారం దేశవ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఖుల్నా జిల్లాలో జరిగిన ఘర్షణలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత మొహిబుజ్జమాన్ కోచీ మతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఖుల్నాలోని అలియా మదరసా పోలింగ్ కేంద్రం వద్ద […] The post బంగ్లా ఎన్నికల్లో హింస appeared first on Visalaandhra .
డిజిటల్ స్కామ్ సెంటర్లపై కంబోడియా దాడులు
కంపోట్: ఆన్లైన్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఇటీవల కంబోడియా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి జరుగుతున్న ఏరివేతల్లో భాగంగా ఇటీవల సుమారు 200 డిజిటల్ స్కామ్ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. ఆన్లైన్ స్కామ్లకు పాల్పడుతూ… డిజిటల్ అరెస్టుల ద్వారా బెదిరిస్తూ… కోట్లు కోట్లు కొల్లకొడుతున్న కొన్ని కేంద్రాలపై ఇటీవల కంబోడియా ఉక్కుపాదం మోపింది. అయితే ఓ సెంటర్లోకి వెళ్లిన స్థానిక పోలీసు అధికారులు… అక్కడ ఉన్న సెటప్ను చూసి షాక్ […] The post డిజిటల్ స్కామ్ సెంటర్లపై కంబోడియా దాడులు appeared first on Visalaandhra .
కొట్టుకున్న అధికార, ప్రతిపక్ష ఎంపీలు అంకారా: టర్కీ పార్లమెంట్ రణరంగంగా మారింది. ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ…తన్నుకుంటూ నానా రభస చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అకిన్ గుర్లెక్ పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతుండగా ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికార-ప్రతిపక్ష ఎంపీలు పరస్పర దాడులకు తెగబడ్డారు. ఒకరినొకరు గుద్దుకుంటూ, తన్నుకుంటూ కనిపించారు. చాలా సేపు ముష్టి యుద్ధం జరిగింది. ఇస్తాంబుల్ చీఫ్ […] The post టర్కీ పార్లమెంటులో రభస appeared first on Visalaandhra .
ప్రజాకంటక ప్రభుత్వాన్నిసాగనంపుదాం: కూనంనేని
కేంద్రంలోని మోదీ పాలనలో దేశ ప్రజలందరికీ … ముఖ్యంగా కార్మికులు, కర్షకులకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజాకంటక ప్రభు త్వాన్ని కూకటివేళ్లతో పీకేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా కార్మిక, కర్షక, ఉద్యోగ, మహిళా, మోటార్, ఆటో, క్యాబ్ వివిధ సంఘాలు సమ్మెల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. చుంచుపల్లి మెయిన్ రోడ్లో నిరసన, ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న […] The post ప్రజాకంటక ప్రభుత్వాన్నిసాగనంపుదాం: కూనంనేని appeared first on Visalaandhra .

26 C