శుక్రవారం రాశి ఫలాలు (06-02-2026)
మేషం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృషభం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమన వివాదాలు సర్దుమణుగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. మిధునం గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు. సింహం చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. కన్య సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల ప్రయాణాలు వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వృశ్చికం స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనస్సు దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మకరం బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీనం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.
బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం
. పదేళ్లలో బీఆరఎస్… పన్నెండేళ్లల్లో మోదీ ఏం చేశారో చర్చిద్దాం రండి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలవనీయం. కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఖాయం: రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్: బీజేపీ, బీఆరఎస్ది ఫెవికాల్ బంధమని, అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బీఆరఎస్ అవయవ దానం చేసి బీజేపీని ఎనిమిది స్థానాల్లో గెలిపించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. ఇది జరిగి […] The post బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం appeared first on Visalaandhra .
కొత్తగూడెం కార్పొరేషన్పై ఎర్రజెండా ఎగరాలి
. సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాల కూటమిని గెలిపించండి. పూటకో పార్టీ మారేవారి మాటలు నమ్మకండి. కమ్యూనిస్టుల ప్రాతినిధ్యంతోనే అభివృద్ధి వేగవంతం: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా ఎగురవేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన సీపీఐ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక్కడి ప్రజలతో తనకున్న సుదీర్ఘకాల పరిచయా లతో […] The post కొత్తగూడెం కార్పొరేషన్పై ఎర్రజెండా ఎగరాలి appeared first on Visalaandhra .
విశాఖలో ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎపిలోని విశాఖలో ఇటీవలే పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ ఎస్ఇ శ్రీనివాసరావును ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. సాలూరు, విశాఖ, హైదరాబాద్ సహా ఐదు చోట్ల జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబం ధించిన కీలక ఆధారాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు డాక్యుమెంట్లతో పాటు మూడు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, రెండు ప్లా ట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని, రూ.61.87 లక్షల నగదు, దాదాపు రెండున్నర కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, కారు, ద్విచక్రవాహనంతో పాటు విలువైన గృహోపకరణాలు గుర్తించినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు. కాగా, సోదాల్లో ఐదు బ్యాంకు లాకర్లు లభిం చాయంటూ శుక్రవారం లాకర్లు తెరువనున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. కాగా, పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్(ఎఇ)గా 1990 లో చేరిన శ్రీనివాసరావు, ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. అనంతరం పదోన్నతిపై సూపరింటెండెంట్ ఇంజి నీర్ ర్యాంకు పొంది 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు.
ఢిల్లీకి మళ్లీ నిరాశే.. రెండోసారి డబ్ల్యూపిఎల్ విజేతగా ఆర్సీబి
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబి ఆరు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. కెప్టెన్ స్మృతి మంధాన (87), వోల్ (79)లు భారీ అర్ధ శతకాలతో రాణించారు. దీంతో ఆర్సీబి వరుసగా రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 203 పరుగుల చేసింది. ఓపెనర్లు లీ(37, 30 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు), షఫాలీ వర్మ(20, 13 బంతుల్లో మూడు ఫోర్లు)లతో రాణించగా.. కెప్టెన్ జెమీమా(57) అర్ధ శతకంతో అలరించింది. ఇక, చివర్లో వోల్వార్ట్(44, 25 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులు), హెన్రీ(35, 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు) ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగారు. దీంతో ఢిల్లీ, ఆర్సీబి జట్టుకు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరుకే దిగుతుంది. మొత్తం 294 స్థానాలకు అభ్యర్థులను దింపుతుంది. పశ్చిమ బెంగాల్ పిసిసి కీలక నేతలతో సంప్రదింపుల సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి రాహుల్, కేసి వేణుగోపాల్, బెంగాల్కు పార్టీ ఇన్చార్జీ గు లాం అహ్మద్ మీర్ , బెంగాల్ పిసిసి అధ్యక్షులు శుభాకంర్ సర్కార్ , ఎంపి ఇషా ఖాన్ చౌదరి ఇతర నేతలు హాజరయ్యారు. తరువాత మీర్ వి లేకరులతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏ్ర పిల్ లేదా మే నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిజెపి తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి యత్నిస్తోంది. తమకు ఇంతకాలం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు వామపక్షాలు తమ జెండా ఎగురవేసుకునే దిశలో కలిసికట్టుగా ప్రయత్నించలేకపోతున్నాయి.
. లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిషన్. ప్రజల దృష్టి మరల్చేందుకే మాపై దుష్ప్రచారం. దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు. తిరుమలకు పూర్వ వైభవం తెస్తాం: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర – సచివాలయం: ప్రజల మనోభావాలతో ఆడుకున్న నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ వ్యవహారంపై గురువారం ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీయే కూటమి నేతల భేటీ జరిగింది. […] The post ‘కల్తీ’కోరులను వదిలిపెట్టం appeared first on Visalaandhra .
రైతాంగాన్ని అగాధంలోకి నెట్టొద్దు
. సార్వభౌమత్వానికి ముప్ప్పు తలపెట్టొద్దు. ఒతిళ్లకు తలొగ్గి రాయితీలిచ్చి జీవనోపాధి దెబ్బతీయొద్దు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సీపీఐ ఆగ్రహం న్యూదిల్లీ: అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం దేశ సార్వభౌమత్వానికి, రైతాంగానికి ముప్ప్పు కలిగిస్తుందని సీపీఐ హెచ్చరించింది. పారదర్శకత`సమానత్వం లేకుండా సర్దుకుపోవాలనేలా భారతీయ సాగుదారులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ… అమెరికాకు ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కల్పించేలా ఈ ఒప్పందమున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. మార్కెట్ విస్తరణ ప్రగల్భాల వెనుక దేశ వాణిజ్య, […] The post రైతాంగాన్ని అగాధంలోకి నెట్టొద్దు appeared first on Visalaandhra .
. ప్రజా సమస్యలు పట్టని వైనం. కల్తీ నెయ్యితో కూటమి, వైసీపీ రాజకీయం. ఎన్నికల హామీల విస్మరణ. జనసేనలో అసంతప్తి లొల్లి. బొలిశెట్టి, రజని దూరం! విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్రంలో ఏ సమస్యలూ లేనట్లుగా అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీలు కల్తీ నెయ్యి అంశంతో పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. అటు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకుండా, ఇటు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను వైసీపీ పోషించకుండా కేవలం తమ రాజకీయం […] The post పక్కదారి రాజకీయాలు! appeared first on Visalaandhra .
భర్తను ప్రియుడితో చంపించిన భార్య
రాజస్థాన్లో భర్తను మార్నింగ్ వాక్కు తీసుకువెళ్లి చంపించింది ఓ భార్య. ఇంతకు ముందు మేఘాలయాలో జరిగిన హానిమూన్ హత్యను ఈ ఘటన తలపించింది. రాజస్థాన్ శ్రీ గంగాపూర్కు చెందిన ఆశిషు, అంజూలకు ఇటీవలే పెళ్లయింది. గత వారం భర్తను తీసుకుని భార్య మార్నింగ్ వాకింగ్కు వెళ్లింది. అత్యంత తెలివిగా తన భర్తను హత్య చేయించిన అంజూ తమను ఓ కారు వేగంగా వచ్చి ఢికొందని , తాను స్పృహ తప్పిపడిపోయానని తెలిపింది. తన భర్తకు ఏమైందో తెలియదని పోలీసులకు తరువాత వివరించింది. అయితే భర్త చనిపోయాడు. తమను ఎవరో వాహనంతో ఢీకొట్టారని, తన వంటిపై నగలు తీసుకని ఉడాయించారని యువతి తెలిపింది. పోలీసులు ఈ కేసును ఇంతకు ముందు మేఘాలయాలో జరిగిన హానీమూన్ హత్యోదంతం ఆధారంగా విచారించారు. దీనితో ఈ యువతి తన ప్రియుడు సంజూ ఇతరులు ఇద్దరితో కలిసి చంపించి, తెలివిగా ప్రమాదంగా నమ్మచూపిందని విచారణలో తేలింది. తనకు ఆశిషు అంటే ఇష్టం లేదని, ఆయనను వదిలించుకోవడానికి ఈ విధంగా తన పాత ప్రియుడితో య ప్లాన్ చేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఈ కేసు హానీమూన్ హత్య 2.0గా ప్రచారంలోకి వచ్చింది.
వాస్తవాల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే…
. సమాధానం చెప్పకుండా మోదీ పారిపోయారు. స్పీకర్ను అడ్డుపెట్టుకుని ముఖం చాటేశారు. ప్రతిపక్షాల ఆగ్రహం. ప్రధాని ప్రసంగించకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం. లోక్సభలో అనూహ్య పరిణామం – రాజ్యసభలోనూ దుమారం న్యూదిల్లీ: ప్రధాని మోదీకి నిజాలంటే భయం…అబద్ధాలే శరణ్యంగా భావిస్తారని ప్రతిపక్షాలు చురకలు అంటించాయి. వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే లోక్సభ నుంచి ముఖం చాటేశారని విమర్శించాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేదు. ఆయన ప్రసంగం లేకుండానే ఈ తీర్మానాన్ని లోక్సభ […] The post వాస్తవాల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే… appeared first on Visalaandhra .
. ఎన్టీఏ పాలనలో దేశం పురోగమిస్తోంది. బెంగాల్లో అక్రమ వలసదారులకు రక్షణ. రాజ్యసభలో ప్రధాని మోదీ న్యూదిల్లీ: కాంగ్రెస్పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి దేశ భవిష్యత్తుపై దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. తనతోపాటు ఓ వర్గంపైనా ద్వేషాన్ని పెంచుకుంటోందన్నారు. ఇటీవల లోక్సభలో చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. దీనిపై లోక్సభలో చర్చ జరగకపోవడం అత్యున్నత పదవికే […] The post కాంగ్రెస్కు ముందుచూపు లేదు appeared first on Visalaandhra .
ఏఐ సైంటిఫిక్ ప్యానెల్కు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ నియామకం
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై ఏర్పాటు చేసిన స్వతంత్ర శాస్త్రీయ ప్యానెల్కు సభ్యునిగా ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ బాలరామన్ రవీంద్రన్ నియమితులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి ఎంపిక చేసిన 40 మంది నిపుణులతో ఈ ప్యానెల్ ఏర్పాటైంది. ఇందులో భారత్ తరఫున రవీంద్రన్ ఉన్నారు. ఎఐ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు అంచనా వేయడం, ఎఐ విధానాలపై ఐక్యరాజ్యసమితికి సలహాలు అందించడం ఈ ప్యానెల్ బాధ్యత. బాలరామన్ ఐఐటీ మద్రాస్ లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటాసైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి పిహెచ్డి పొందారు. బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు.
టెట్ మినహాయింపుఉద్యోగాల క్రమబద్ధీకరణ . ప్రైమరీ టీచర్లకు ‘ఎమ్మెల్సీ’ ఓటు హక్కు. కనీస వేతనాలు పాత పింఛన్ పథకం అమలు. ఏపీ జాక్టో డిమాండ్ దిల్లీలో భారీ ధర్నా. మొదటిసారి ఏకతాటిపైకి టీచర్ల సంఘాలు. మద్దతిచ్చిన వామపక్ష నాయకులు న్యూదిల్లీ: విద్యా హక్కు (ఆర్టీఈ) చట్టాన్ని సవరించి సర్వీసులో ఉన్న టీచర్లకు రక్షణ కల్పించే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అఖిల భారత టీచర్ల సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏపీ జాక్టో) స్పష్టం చేసింది. సుప్రీం […] The post ఆర్టీఈ సవరణ… ఎనఈపీ ఉపసంహరణ appeared first on Visalaandhra .
Jana Sena’s Move in Telangana Adds a New Twist to the Municipal Battle
The political waves created by the Jana Sena Party in Andhra Pradesh are now reaching Telangana. Even before its leader has fully stepped into the campaign, the party’s presence has already triggered sharp reactions from rivals, showing that it is being taken seriously in the municipal elections. As Telangana prepares for the civic polls, the […] The post Jana Sena’s Move in Telangana Adds a New Twist to the Municipal Battle appeared first on Telugu360 .
ఒప్పొ ఇండియా రెనో15 సిరీస్లో కొత్తగా రెనో15సిని విడుదల చేసింది. ఈ ఫోన్ ఈ నెల 5 నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిటైల్ స్టోర్లలో లభ్యమవుతుంది. 7000ఎంఎహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 6 జెన్1 ప్రాసెసర్తో వస్తుంది. ధర రూ.34,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణికులు, కంటెంట్ క్రియేటర్లకు ఇది సరైన ఫోన్ అని ఒప్పొ తెలిపింది.
టెట్ మినహాయింపు కోసం ఢిల్లీలో ఉపాధ్యాయుల ధర్నా
ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యా హక్కు చట్టం 2010 లోని సెక్షన్ 23 సవరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ ధర్నాలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్టీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ టియస్ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల గౌరవాన్ని అన్యాయంగా తగ్గించే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం టెట్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. టెట్ అర్హత దేశంలో సుమారు 25 లక్షల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు గుదిబండగా మారిందని అన్నారు. ఉపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ధర్నాకు ఆల్ ఇండియా జాక్తో స్టీరింగ్ కమిటీ సభ్యులు సిఎన్ భార్తి, చావ రవి, కత్తి నరసింహారెడ్డి, సదానంద గౌడ్లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ ధర్నా శిబిరానికి కేరళ రాష్ట్రానికి చెందినపార్లమెంట్ సభ్యులు జాన్ బ్రిటీష్, శివ దాసన్, తమిళనాడు నుండి సెల్వరాజ్, కర్ణాటక నుండి కుమార్నాయక్, బీహర్ నుండి రాజారామ్ సింగ్, సిపిఐ నాయకులు నారాయణ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి. వెంకట్, ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు అమియకుమార్, వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.
భారత్తో సంబంధాలు ఇప్పటికి ఇంతే: బంగ్లాదేశ్
ఢాకా: భారత్తో సంబంంధాలు పూర్తిగా దెబ్బతినడంపై బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారుడు తౌహీద్ హోస్సెన్ గురువారం స్పందించారు. తమ దేశ ప్రస్తుత పాలకుడు ముహమ్మద్ యూనస్ హయాంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అంగీకరించారు. ప్రస్తుతానికి ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇదే విధంగా ఉంటాయి. వచ్చే వారం ఎన్నికల తరువాత ఎన్నికైన ప్రభుత్వం వస్తే, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్నారు. భారత్ సంబంధాలు క్షీణించాయని.. అయితే రెండు దేశాలకూ కూడా సరైన సంబంధాలు అత్యవసరం అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ దౌత్యవేత్త, గతంలో భారత్లో ఉప ఉన్నత దౌత్యాధికారిగా పనిచేసిన అనుభవం హోస్సేన్కు ఉంది. ఇరుదేశాల మధ్య సజావైన సంబంధాలు ఉంటేనే బాగుంటుందని, త్వరలో ఉంటాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
మేడారం సమ్మక్క- సారక్క హుండీ లెక్కింపు
టిటిడి కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క-సారక్క వనదేవతల హుండీ లెక్కింపు ప్రక్రియను మంత్రి కొండా సురేఖ అధికారికంగా ప్రారంభించారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ, మేడారం జాతరకు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకలను పూర్తిస్థాయి భద్రతా చర్యలు, పారదర్శక విధానాలతో లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో, సంబంధిత అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు.భక్తుల విశ్వాసానికి ఎలాంటి లోటు లేకుండా, ప్రతి రూపాయి జాగ్రత్తగా లెక్కించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మేడారం సమ్మక్క-సారక్క వనదేవతల ఆశీస్సులతో జాతరను విజయవంతంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
WPL 2026 FInal: ఆర్సీబికి భారీ టార్గెట్
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) 2026 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 203 పరుగుల చేసింది. ఓపెనర్లు లీ(37, 30 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు), షఫాలీ వర్మ(20, 13 బంతుల్లో మూడు ఫోర్లు)లతో రాణించగా.. కెప్టెన్ జెమీమా(57) అర్ధ శతకంతో అలరించింది. ఇక, చివర్లో వోల్వార్ట్(44, 25 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులు), హెన్రీ(35, 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు) ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగారు. దీంతో ఢిల్లీ, ఆర్సీబి జట్టుకు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
భారత్తో మ్యాచ్ బాయ్కాట్ సరైనదే: పాక్ ప్రధాని
కరాచీ : టి 20 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలో భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించడాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమర్థించారు. బంగ్లాదేశ్కు మద్దతుగా తమ క్రికెట్ టీం ఈ నిర్ణయం తీసుకుందని , ఇది సముచిత నిర్ణయం అని షరీఫ్ ఇక్కడ ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం తరువాత తెలిపారు. ఈ నెల 15వ తేదీన కొలంబోలో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ ఆటనుంచి వైదొలగాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు షరీఫ్ ప్రభుత్వం తెలిపింది. క్రీడల్లో రాజకీయాలకు తావు ఉండరాదని, ఇండియాతో గేమ్ ఆడకూడదని నిర్ణయించుకున్నామని చెప్పిన షరీఫ్ తాము బంగ్లాదేశ్కు అనుకూలంగా ఉంటామని తేల్చిచెప్పారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం పట్ల ఐసిసి మండిపడింది. అత్యంత కీలకమైన మ్యాచ్. స్పాన్సర్స్కు , ప్రకటనకర్తలకు, ప్రసారకర్తలకు డబ్బులు తెచ్చిపెట్టే ఈ మ్యాచ్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు పునరాలోచించాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పిసిబి సరియైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
5 తేజస్ మార్క్1ఏ యుద్ధ విమానాలు రెడీ
న్యూఢిల్లీ: భారతీయ వైమానికదళం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ఐదు తేజస్మార్క్ 1ఏ ఫైటర్ విమానాలను సిద్దం చేసింది. మరో 9 విమానాలు అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ ఇంజిన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. భారతీయ వైమానిక దళంకోసం హెచ్ఎఎల్ సంస్థ 180 యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఇవి మార్చి 2024 నాటికే డెలివరీకి సిద్ధం కావలసి ఉండగా, ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్ల తయారీలో జాప్యం జరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వశాఖ 83 తేజస్ జెట్ విమానాల కోసం హెచ్ఎఎల్తో రూ.48,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జిఇ ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్ల డెలివరీ ఆలస్యమవుతోంది .
ఖానాపూర్ ఫిబ్రవరి 5 ఆంధ్రప్రభ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా
TTD EO |తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్ర
TTD EO | తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్ర TTD EO |
WPL 2026 ఫైనల్.. ఢిల్లీ ఓపెనర్లు ఔట్
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఓపెనర్లు లీ(37, 30 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు), షఫాలీ వర్మ(20, 13 బంతుల్లో మూడు ఫోర్లు)లు మొదట తడబడినా.. తర్వాత పుంజుకుని మంచి ఆరంభాన్ని అందించారు. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో ఇద్దరు ఓపెనర్లు పెవిలయన్ కు చేరారు. ముఖ్యమంగా లీ భారీ షాట్లతో ఆర్సీబి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. దీంతో 7.3 ఓవర్లలో ఢిల్లీ 72 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు 9 ఓవర్లలో 83 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో జెమీమా(8), వోల్వార్ట్(11)లు ఉన్నారు.
బీజపూర్ జిల్లాలో 12 మంది నక్సల్స్ లొంగుబాటు
సామూహికంగా రూ.46 లక్షల రివార్డు ఉన్న మొత్తం 12 మంది మావోయిస్టులు బీజపూర్ జిల్లా పోలీస్ అధికారుల ముందు లొంగిపోయారని ఎస్పి జితేంద్ర కుమార్ యాదవ్ గురువారం వెల్లడించారు. సౌత్ సబ్ జోనల్ బ్యూరో మావోయిస్టులకు చెందిన వీరిలో ఎనిమది మంది మహిళలు ఉన్నారు. బస్తర్ పోలీసులు అమలు చేస్తున్న “పునరావాసం, సామాజిక జీవన అనుసంధానం” విధానానికి ఆకర్షితులై వారు స్వచ్ఛందంగా లొంగిపోయారని చెప్పారు. వీరు తమ వద్ద ఉన్న ఎకె47 రైఫిల్, రెండు సెల్ఫ్లోడింగ్ రైఫిళ్లు, 250 జిలటిన్ స్టిక్స్, 400 డిటొనేటర్స్, గన్పౌడర్తో నిండి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్, కార్డెక్స్ వైర్, అప్పగించారని పోలీసు అధికారులు వివరించారు. లొంగిపోయిన వీరందరికీ రూ.50 వేలు వంతున తక్షణ సాయం అందిస్తామని, తదుపరి పునరావాసం కల్పిస్తామన్నారు. 2024 జనవరి 1 నుంచి బీజపూర్లో 888 మంది హింసామార్గం విడిచిపెట్టి జనజీవన స్రవంతి లోకి చేరారు.
delhi l ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
delhi l ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. కరీమాబాద్, ఆంధ్రప్రభ; ఆల్ ఇండియా
Is Prabhas repeating the Same Mistakes?
Pan-Indian Star Prabhas has several films lined up and he is working on multiple films. From the past few years, Prabhas kept announcing several movies and he kept juggling between them. None of them were completed on time and the delays added a huge financial stress for the producers. Raja Saab, the recent film of […] The post Is Prabhas repeating the Same Mistakes? appeared first on Telugu360 .
సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఈ రోజుల్లో ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. కడప జిల్లాలో రీల్స్ చేస్తూ ఒక యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సాధారణంగా ఇలాంటి ఘటనలు రైలు పట్టాల దగ్గర, ఎత్తైన భవనాల పైన లేదా ప్రమాదకరమైన నీటి కుంటల వద్ద స్టంట్లు చేసేటప్పుడు జరుగుతుంటాయి. ఈ ఘటనలో కూడా కేవలం కొన్ని లైకులు, వ్యూస్ కోసం చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాలలోకి వెళితే.. కడపకు చెందిన ముబారక్ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి ముబారక్ తన స్నేహితుడితో కలిసి బైక్ పై రీల్స్ చేస్తూ మూడు కిలోమీటర్ల మేరకు బైక్ ను లేపుతూ విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి ఇద్దరూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముబారక్ ఘటనాస్థలిలోనే మృతి చెందగా, తన స్నేహితునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
7వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి
బిఆర్ఎస్ నాయకులు చిట్యాల జుబేర్ పాషా మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)
Sree Vishnu’s MRITHYUNJAY hitting big screens on Feb 27th
Sree Vishnu, known for choosing a diverse range of scripts is currently working on an investigative thriller “Mrithyunjay” directed by Hussain Sha Kiran, is produced by Sandeep Gunnam and Vinay Chilakapati under the banners of Lightbox Media and Picture Perfect Entertainment. Ramya Gunnam presenting the film. The title teaser released earlier received an overwhelmingly positive […] The post Sree Vishnu’s MRITHYUNJAY hitting big screens on Feb 27th appeared first on Telugu360 .
ఇద్దరూ ఇద్దరే.. రాహుల్, బిట్టూపై శిరోమణి ధ్వజం
చండీగఢ్ : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూపై శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) తీవ్ర స్థాయిలో మండిపడింది. వీరి ప్రకటనలు, వీరి వైఖరి వీరి చవకబారు ధోరణిని తెలియచేస్తున్నాయని ఎస్ఎడి అధ్యక్షులు సుఖ్బీర్ సింగ్ బాదల్ గురువారం విమర్శించారు. ఈ రాజకీయ నాయకుల పరిపకత్వ ఈ విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద బుధవారం రాహుల్ గాంధీ అందరి ముందే కేంద్ర మంత్రి బిట్టూను ద్రోహి అని తిట్టారు. దీనికి ప్రతిగా బిట్టూ రాజీవ్ గాంధీని దేశ్ కీ దుష్మన్ అని దూషించారు. స్పీకర్ ఓం బిర్లా కలుగచేసుకోవాలని, రాహుల్ గాంధీ మొత్తం సిక్కు వర్గాన్ని అవమానించారని, వెంటనే చర్య తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. ఇద్దరి వ్యవహార శైలిపై ఎస్ఎడి నేత స్పందిస్తూ ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకున్న మాటలలో నూటికి నూరుశాతం నిజం ఉందన్నారు. రాహుల్ , బిట్టూ మధ్య జరిగింది చూస్తూ ఉంటే దేశంలో రాజకీయం ఏ మేరకు దిగజారిందనేది తెలియవస్తోందని శిరోమణి అకాలీదళ్ నేత దల్జీత్ సింగ్ చీమా స్పందించారు. కేంద్ర మంత్రి బిట్టూకు కాంగ్రెస్కు మధ్య పాత అనుబంధం ఉంది. పంజాబ్ మాజీ మంత్రి సిక్కుల ప్రముఖ నేత బియాంత్ సింగ్ మునిమనవడు అయిన బిట్టూ ముందు కాంగ్రెస్లోనే ఉన్నాడు. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ మారి బిజెపిలో చేరాడు. రాజ్యసభ సభ్యులైన బిట్టూకు కేంద్రంలో మంత్రి పదవి లభించింది.
ration shop l నర్సింగాపురం గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ధర్నా
ration shop l నర్సింగాపురం గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ధర్నా నర్సంపేట,ఆంధ్రప్రభ;
రేవంత్ రెడ్డి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదు: కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వెలమజాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ బేధ భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేశారని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు మాటిచ్చారని చెప్పారు. కానీ, అవన్నీ మరిచి పోయి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదని హితవు పలికారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సిఎం ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. జగిత్యాల ఎంఎల్ఎ సంజయ్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారని, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఆయన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు హాజరవుతున్నారని, జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ బి.ఫాంలు కూడా ఇచ్చారని, అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం సరికాదని వ్యాఖ్యానించారు. సంజయ్కి నీతి, నిజాయితీ ఉంటే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కటం...భవిష్యత్ తరాలకు మంచిది కాదని అన్నారు. వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
పార్టీల ఉచితాలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం..
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల ఎన్నికల ఉచిత హామీలపై ప్రజా వ్యాజ్యం (పిల్) పై మార్చిలో విచారణ నిర్వహిస్తామని అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలిపింది. సరైన తేదీతో విచారణను లిస్ట్లో చేరుస్తారు. ఎన్నికల సమయంలో ఉచితానుచితాలు మర్చి, విపరీత స్థాయిలో ఉచిత హామీలకు దిగుతున్నారు. ఇటువంటి రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులను స్తంభించాలి. లేదా వాటి గుర్తింపును రద్దు చేయాలని ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పిల్పై 2022 లోనే ఎన్నికల సంఘానికి, కేంద్రానికి నోటీసులు వెలువరించారని లాయరు వెల్లడించారు. ఈ పిల్ విషయం ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జాయ్మాలా బాగ్జీ ధర్మాసనం ముందుకు వచ్చింది. వెంటనే తన పిల్పై విచారణ జరిపించాలని పిటిషనర్ పెట్టుకున్న దరఖాస్తునకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. మార్చిలో లిస్ట్లో చేరుస్తారని వెల్లడించారు. ఈ రోజుల్లో పార్టీలు తమ గెలుపు కోసం చంద్రుడు సూర్యుడు వదిలిపెట్టి అన్ని ఇచ్చేస్తామని హామీలకు దిగుతున్నారని, ఇది అవినీతికర పద్దతులకు దారితీస్తోందని తెలిపారు. దీనితో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి ఇది కీలకమైన విషయం అని, తమకు దీనిపై ఈ నెలాఖరులో మరోసారి గుర్తు చేయాలని, వచ్చే నెలలో విచారణ ఉండేలా చేస్తామని సిజెఐ తెలిపారు. హామీల ఆర్థిక విలువలు మితిమీరుతున్నాయి. వీటి విలువ చివరికి బడ్జెట్ స్థాయిని మించిపోతున్నాయని సిజెఐ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో ఉచితాలపై జరిగే విచారణ అత్యంత కీలకం కానుంది.
గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: సిఎం రేవంత్రెడ్డి
గ్రూప్-1 నియామక ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో నిరుద్యోగుల కలసాకారం అయ్యిందని, ఇది గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. గ్రూప్-1 నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు మొదటి నుంచి అనేక కుట్రలు పన్నాయని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా చివరకు న్యాయ పోరాటంలో నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వం విజయం సాధించామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ఇక గ్రూప్-1కు ఎంపికైన 563 మంది అభ్యర్థులకు సిఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని, భవిష్యత్లో రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు కావాలని సిఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు.
11వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి అస్గర్ అలీని గెలిపించండి
11వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి అస్గర్ అలీని గెలిపించండి మక్తల్
గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థులకు భారీ ఊరట
గ్రూప్ 1 పరీక్షలపై గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు హైకోర్టు ఎట్టకేలకు తెరదించింది. ఎంపికయిన అభ్యర్థులకు ఊరట కలిగించేలా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ పరీక్షలపై ఇచ్చిన స్టే ను కొట్టివేస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 పరీక్షలపై దాఖలయిన పిటిషన్లను తుది తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ ధర్మాసనం వెల్లడించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల వాదలను విన్న ధర్మానం కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. పరీక్షలు పారదర్శకంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. గ్రూప్ 1 పరీక్షల ఫలితాల అనంతరం పరీక్షల మూల్యాంకనాల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం మెరిట్ జాబితా రద్దు, పునఃమూల్యాంకనం, కుదరకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలువురు గ్రూప్ 1కు ఎంపికయిన అభ్యర్థులతో పాటు టిజిపిఎస్సి హై కోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. దీంతో వేగం పెంచిన ప్రభుత్వం గ్రూప్1కు ఎంపికయిన 563 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేసింది. అప్పీల్ పిటిషన్ల విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం గత నెల 22న తీర్పు వెలువరించాల్సి ఉన్నా, సిద్దం కాకపోవడంతో తుది తీర్పును వాయిదా వేశారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పు వెల్లడించడంతో 563 మంది గ్రూప్ 1 నియామక పత్రాలు పొందిన అభ్యర్థులకు భారీ ఊరట కలిగింది.
నెహ్రూను విమర్శించడమంటే ఆకాశంపై ఉమ్మేయడమే!
ప్రొఫెసర్ దేవరాజు మహారాజు జవహర్లాల్ నెహ్రూ దేశ రాజకీయాలకూ, భారతీయ సమాజానికీ ఎప్పటికప్ప్పుడు దిశా నిర్దేశం చేసేవారు, గొప్ప స్ఫూర్తినందిస్తుండేవారు. సర్ వాల్టర్ క్రూకర్ నెహ్రూ గురించి ఏం చెప్పారంటే- “ నెహ్రూజీ ఒక అసాధారణమైన వ్యక్తి ! అలాంటి మేధావులు అరుదుగా ఉంటారు. ఆయన చొరవ లేని, ఆయన ప్రభావం లేని వ్యవస్థలేవీ దేశంలో లేవు. అందుకే ప్రతి అంశంలో ప్రతి విభాగంలో ఆయన భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది”అని ! నెహ్రూజీ జీవిత చరిత్ర రాసిన […] The post నెహ్రూను విమర్శించడమంటే ఆకాశంపై ఉమ్మేయడమే! appeared first on Visalaandhra .
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికో అనుమానాస్పద మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : విధినిర్వహణలో ఉన్న ఓ మెడికో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమానాస్పద రీతిలో మరణించింది. విధుల్లో ఉండగానే కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ గదిలో విద్యార్థిని మరణించినట్లు గుర్తించిన సహచరులు వెంటనే పోలీసులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాకు చెందిన దీపిక ఎంబిబిఎస్ పూర్తిచేసి అనస్తీషియా విభాగంలో పిజి చేస్తోంది. విజయవాడ వైద్య కళాశాలలో చదువుతున్న దీపిక విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఆమె డ్యూటీ చేయాల్సి ఉంది. అయితే, బుధవారం సాయంత్రం డ్యూటీకి వచ్చిన కాసేపటికే కడుపునొప్పిగా ఉందని తోటి వైద్య విద్యార్థులకు తెలిపింది. దీంతో ఓ విద్యార్థిని ఆమెకు ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత విధుల్లో నిమగ్నమైన దీపిక రాత్రి 11.30 గంటల సమయంలో ఆపరేషన్ గదిలో బల్లపై ఒరిగిపోయింది. వెంటనే ఆమెను పరీక్షించిన సహచరులు పిక అప్పటికే మరణించిందని గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్తో కలిసి సిసి కెమెరాల పరిశీలనాంతరం దీపిక ఆత్మహత్యకు పాల్పడిందా?లేక మరేదైనా కారణమా? అనేది వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీపికది అనుమానాస్పద మరణంగా భావిస్తున్నామని, అనంతపురం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చాక వారి ఫిర్యాదుతో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. వైద్య విద్యార్థిని దీపిక మరణంపై మంత్రి సత్యకుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఉత్పత్తి కులాల ఊపిరి తీసిన బడ్జెట్
డా. ముచ్చుకోట సురేష్బాబు వికసిత్ భారత్ బడ్జెట్ అంటూ ప్రచారం చేసిన ఈ బడ్జెట్లో ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎలాంటి స్థానం కల్పించలేదు. రైతులు, కార్మికులు, చిన్నవ్యాపారులు, చిరువ్యాపారుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఉత్పత్తి కులాల ఊపిరి తీసే బడ్జెట్ ఇది. చరిత్రలో అత్యంత దారుణమైన బడ్జెట్లలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇది ధనవంతుల కోసం, సంపన్నుల కోసం, భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం రూపొందించిన బడ్జెట్. ఉపాధి సృష్టిని ప్రభుత్వం […] The post ఉత్పత్తి కులాల ఊపిరి తీసిన బడ్జెట్ appeared first on Visalaandhra .
ప్రజా ప్రభుత్వం తోనే పట్టణాభివృద్ధి
ప్రజా ప్రభుత్వం తోనే పట్టణాభివృద్ధి భీంగల్ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ)
మనిషి ఈనాడు వింతైన సంక్షోభంలో ఉన్నాడు. అది ఆర్థికమైనది కాదు. మానసికమైనది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బతికేయొచ్చేమో కానీ, మనసు అదుపులో లేకపోతే మనిషికి దిక్కు తోచదు. మనం ఒక వింతైన ‘మానసిక అప్పు’ లో బతికేస్తున్నాం. మన ఆలోచనల మీద మనకే అధికారం లేని అప్ప్పు ఇది. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా, లోపల ఏదో అస్పష్టమైన భయం. తీరని అసంతృప్తి మనల్ని ఒత్తిడి రూపంలో వెంటాడుతోంది. శరీరం అలసినప్ప్పుడు నిద్రపోతే సరిపోతుంది. అదే మనసు […] The post మానసిక అప్పు appeared first on Visalaandhra .
నైజీరియాలో మిలిటెంట్ల మారణహోమం.. 168 మంది నరికివేత
సోకోటో ః నైజీరియాలో సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు మారణహోమానికి దిగారు. రెండు గ్రామాలపై విరుచుకుపడ్డారు. వీరి అరాచక దాడిలో మొత్తం 162 మంది వరకూ చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గ్రామాలలో శ్మశాన వాతావరణం నెలకొంది. పశ్చిమ నైజిరియాలోని క్వారా రాష్ట్రంలో వోరో, నూకూ గ్రామాలను ఎంచుకుని తీవ్రవాదులు స్వైర విహారానికి దిగారు. లకూరవా మిలిటెంట్ల సంస్థ దాడికి దిగిందని. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధంగా ఉన్న ఈ సంస్థ ఈ దారుణానికి దిగిందని ఈ ప్రాంత ఎంపి మెహమ్మద్ ఒమర్ బియో తెలిపారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటికైతే ఏ సంస్థ ప్రకటన వెలువరించలేదు. ఈ రెండు గ్రామాల్లో వీధుల్లో జనం చేతులు కట్టివేసి, వారిని నరికివేసిన అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల ఇండ్లు తగులబడి పోతూ కన్పించాయి. ఉగ్రవాద మూకల అత్యంత పైశాచిక చర్యకు ఇది పరాకాష్ట అని ఇక్కడి గవర్నరు అబ్దుల్ రెహ్మన్ అబ్దుల్ రజాక్ ఈ ఘటనలను ఖండించారు.
ప్రచార పర్వంలో ముందంజ…దూసుకుపోతున్న శైలజ నర్సయ్య గౌడ్
ప్రచార పర్వంలో ముందంజ…దూసుకుపోతున్న శైలజ నర్సయ్య గౌడ్ మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)మోత్కూర్
వార్డు సమస్యలు పరిష్కారం చేస్తాను
వార్డు సమస్యలు పరిష్కారం చేస్తాను భీమ్గల్ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ
బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఒంటరిపోరు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకే దిగుతుంది. మొత్తం 294 స్థానాలకు అభ్యర్థులను దింపుతుంది. పశ్చిమ బెంగాల్ పిసిసి కీలక నేతలతో సంప్రదింపుల సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, బెంగాల్కు పార్టీ ఇన్చార్జీ గులాం అహ్మద్ మీర్, బెంగాల్ పిసిసి అధ్యక్షులు శుభాకంర్ సర్కార్ , ఎంపి ఇషా ఖాన్ చౌదరి ఇతర నేతలు హాజరయ్యారు. తరువాత మీర్ విలేకరులతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు. మమత బెనర్జీ నాయకత్వపు టిఎంసి అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిజెపి తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి యత్నిస్తోంది. కంచుకోటగా తమకు ఇంతకాలం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు వామపక్షాలు తమ జెండా ఎగురవేసుకునే దిశలో కలిసికట్టుగా ప్రయత్నించలేకపోతున్నాయి. ఈ దిశలో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఒంటరి పోరు నిర్ణయం జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భవితవ్యంపై ఏ విధంగా ఉంటందనేది కీలక ప్రశ్న కానుంది. రాష్ట్రంలో పార్టీ కూటమి ద్వారా ఎన్నికలకు వెళ్లి దెబ్బతిందని, తిరిగి ఈ ప్రయోగం చేయదల్చుకోలేదని మీర్ వెల్లడించారు. ఒంటరి పోరు నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు 294 స్థానాల్లో పోటీకి సన్నాహాలకు దిగుతామని వెల్లడించారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లెఫ్ట్ ప్రంట్తో ఎన్నికలకు జట్టు కట్టింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ ఒక్క సీటూ కాంగ్రెస్కు రాలేదు. ఇది షాక్ నిచ్చింది.
బృందావన్ కాల్వ మరమ్మతులు చేయిస్తా
బృందావన్ కాల్వ మరమ్మతులు చేయిస్తా మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మోత్కూర్ మున్సిపాలిటీ
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణస్వీకారం చేసిన కోడిగుడ్లు ఏసేపు
విశాలాంధ్ర – పెద్దకడబూరు : తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన కోడిగుడ్ల ఏసేపును గురువారం పెద్దకడుబూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లికార్జున, సీనియర్ నాయకులు హనుమంత రెడ్డి, మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ లు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైనఏసేపు అనుభవం, అంకితభావం, పార్టీపై నిబద్ధత జిల్లాలో పార్టీ బలోపేతానికి దోహదపడుతాయని విశ్వాసం […] The post టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణస్వీకారం చేసిన కోడిగుడ్లు ఏసేపు appeared first on Visalaandhra .
Teja Sajja’s Mirai Creates History In TRP
Teja Sajja continues his remarkable rise with Mirai, a film that has now proven its dominance across every major platform. After its blockbuster theatrical run and stellar streaming performance on Hotstar, the fantasy adventure has achieved a sensational milestone with its World Television Premiere on Star Maa. Mirai registered an extraordinary 9.1+ TRP, soaring to […] The post Teja Sajja’s Mirai Creates History In TRP appeared first on Telugu360 .
deer l దుప్పిిని అటవీ అధికారులకు అప్పగించిన ఎంఈఓ గడ్డి శ్రీనివాస్
deer l దుప్పిిని అటవీ అధికారులకు అప్పగించిన ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ deer
పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించండి
రైతు సంఘం జిల్లా నాయకులువిశాలాంధ్ర – ధర్మవరం;; పాత ఉపాధి హామీ చట్టాన్ని మాత్రమే కొనసాగించాలని కోరుతూ రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుచేసి ఆ స్థానంలో జి రాంజీ పేరుతో తెచ్చిన చట్టాన్ని వెంటనే రద్దుచేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం […] The post పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించండి appeared first on Visalaandhra .
When will the shoot of Varanasi Conclude?
SS Rajamouli has confidently announced that his upcoming film Varanasi is all set for April 7th, 2027 release in theatres across the globe. Rajamouli who is a perfectionist at work will not compromise on the quality of his films. With the delays in post-production, most of his biggies have missed the deadlines and they got […] The post When will the shoot of Varanasi Conclude? appeared first on Telugu360 .
ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా
ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మునిసిపల్
కాంగ్రెస్ సంక్షేమ పథకాలే….కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్థాయి..!
కాంగ్రెస్ సంక్షేమ పథకాలే….కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్థాయి..! మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)కాంగ్రెస్ ప్రభుత్వ
బిజెపి అభ్యర్థులను గెలిపించండి
బిజెపి అభ్యర్థులను గెలిపించండి నిర్మల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో
విశాలాంధ్ర – రాజాం : రాజాం టీడీపీ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షులు నంది సూర్యప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ టంకాల కన్నం నాయుడు, టౌన్ క్లస్టర్ ఇన్చార్జ్ మరిపి జగన్మోహన్, టౌన్ యూత్ అధ్యక్షుడు కొంపల్లి రవికుమార్, వార్డు ఇన్చార్జులు గంధి గోపి, కాటం […] The post సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ appeared first on Visalaandhra .
మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం ఖాయం
మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం ఖాయం మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మోత్కూర్
గ్రామీణ ఉపాధి హామీపై దాడిని ఖండించాలి
. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు విశాలాంధ్ర – రాజాం : గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న దాడిని ఖండించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు పిలుపునిచ్చారు. గురువారం రాజాం మండలం కంచరం గ్రామంలో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.800 […] The post గ్రామీణ ఉపాధి హామీపై దాడిని ఖండించాలి appeared first on Visalaandhra .
ప్రభుత్వ సంక్షేమ పథకాలే బెల్లంపల్లి,ఫిబ్రవరి5(ఆంధ్రప్రభ): రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు అమలు
మీ బిడ్డగా ఆదరించండి వార్డు అభివృద్ధి నా బాధ్యత
1వ వార్డు బిజెపి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి మక్తల్ , ఫిబ్రవరి 5
Revanth Reddy : పదేళ్లలో ఏం చేశారో చెప్పండి
తెలంగాణలో పదేళ్లు ఏం చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్న సంయుక్త
తన అందం, నటనతో ఆకట్టుకునే స్టార్ హీరోయిన్ సంయుక్త ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి మారిపోయింది. ఆమె తన ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నారు. ఈ స్టంట్స్ లో అవుతున్న గాయాలను పట్టించుకోకుండా షూటింగ్ చేస్తున్నారు సంయుక్త. ఈ మూవీలో ఆమె చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్లు హైలైట్ గా నిలవనున్నాయి. సంయుక్త కెరీర్ లో ’ది బ్లాక్ గోల్డ్’ ఒక స్పెషల్ మూవీగా నిలవనుంది. పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా ’ది బ్లాక్ గోల్డ్’ చిత్రాన్ని యోగేష్ కెఎంసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ’ది బ్లాక్ గోల్డ్’ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ప్రత్యేక స్మారక తపాలా స్టాంపును విడుదల చేసిన నెస్లే ఇండియా
భారతదేశంలో మ్యాగీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఒక ప్రత్యేక స్మారక తపాలా స్టాంపును విడుదల చేయడం పట్ల నెస్లే ఇండియా ఎంతో సంతోషిస్తోంది. ఈ స్టాంపును నెస్లే ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ, భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్తో కలిసి ఆవిష్కరించారు. ఈ స్టాంపు మ్యాగీ యొక్క పరిణామానికి, ఎప్పటికప్పుడు కొత్త పోకడలను అందిపుచ్చుకుంటూ, ఎంతో ఆదరణ పొందిన ఒక ఉత్పత్తి వర్గానికి పర్యాయపదంగా మారిన దానికి నివాళి. ఇన్ని తరాలుగా, ప్రతి ఒక్క పంచుకునే క్షణం ద్వారా ప్రజలను ఏకం చేస్తూ వస్తున్న మ్యాగీకి ఇది ఒక గౌరవం. గత ఐదు దశాబ్దాలుగా, MAGGI భారతీయ ఇళ్లలోకి అనేక రుచికరమైన రూపాల్లో ప్రవేశించింది - నూడుల్స్ మరియు మసాలాల నుండి సాస్లు, సూప్లు మరియు రెడీ-టు-కుక్ ఇష్టమైనవి. త్వరిత సోలో ఫిక్స్ల నుండి కుటుంబాన్ని ఒకచోట చేర్చే భోజనాల వరకు మరియు హాస్టల్ కిచెన్ల నుండి పెద్ద సమావేశాల వరకు, MAGGI దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని ఆహార క్షణాలలో భాగంగా ఉంది. 50 సంవత్సరాల కలిసికట్టుగా స్టాంప్ ఈ భాగస్వామ్య అనుభవాలకు నివాళి, MAGGI భారతదేశం అంతటా టేబుల్లకు తీసుకువస్తున్న వెచ్చదనం, సౌకర్యం మరియు సంబంధాలను సంగ్రహిస్తుంది. భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ, భారతదేశంలో శుద్ధి చేసిన ఆహార రంగం దశాబ్దాలుగా గృహాల విశ్వాసాన్ని చూరగొనడంలో చాలా దూరం ప్రయాణించింది. మార్గదర్శక బ్రాండ్లు కొత్త విభాగాలను సృష్టించి, మన ఆహార పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయి. ఈ అద్భుతమైన ప్రయాణంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నేను మ్యాగీకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ స్టాంపును విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ, నెస్లే ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ ఇలా అన్నారు, “భారతదేశంలో మ్యాగీకి ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన మైలురాయి. మన దేశంలాంటి ఉత్సాహభరితమైన మరియు విభిన్నమైన దేశంలో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకోవడం, లక్షలాది మంది ఈ బ్రాండ్పై చూపిన నమ్మకం, ఆప్యాయత మరియు నిత్య ప్రేమకు నిదర్శనం. ఇది పంచుకున్న మధుర క్షణాలు, మారుతున్న అభిరుచులు మరియు ఏటా, తరతరాలుగా మరింత బలపడిన బంధంతో రూపుదిద్దుకున్న ఒక ప్రయాణానికి వేడుక.” ఈ అనుబంధాన్ని బలోపేతం చేయడానికి మరియు దేశవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో వెచ్చదనం, సౌకర్యం, ఐక్యతను తీసుకువచ్చే రోజువారీ క్షణాలకు తోడ్పడటానికి నెస్లే ఇండియా కట్టుబడి ఉంది.
WPL 2026 ఫైనల్ పోరు.. ఢిల్లీపై బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబి
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో ఫైనల్ పోరుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్ధమయ్యాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబి కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. కాగా, లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సిబి నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఢిల్లీ మాత్రం ఎలిమినేటర్ పోరులో గుజరాత్ జెయింట్స్ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమానంగా ఉన్న ఇరుజట్లు తలపడుతుండటంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెట్టాలి: కెటిఆర్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెట్టాలని, కాంగ్రెస్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని, మరోసారి కెసిఆర్ను సిఎం చేస్తేనే అభివృధ్ధి సాధ్యపడుతుందని బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్ఏ కెటిఆర్ అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 22 వార్డుల్లో ప్రచారం చేసిన కెటిఆర్ బివైనగర్, వెంకంపేట, రాజీవ్నగర్,న్యూ బస్స్టాండ్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో కెటిఆర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల తరువాత రైతు బంధు వేస్తానని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని, ఇప్పటికి ఎన్ని పంట కాలాలు అయిపోయాయి, ఎన్ని సార్లు రైతు బంధు వేసిండో చెప్పాలన్నారు. ఇప్పటికి ఎన్ని పంటకాలాలు గడిచిపోయాయి, అప్పుడెందుకు రైతు బంధు వేయలేదని కెటిఆర్ నిలదీశారు. మున్సిపల్ ఎన్నికలు రైతుబంధు నేతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి ఏమి అడ్డుగా ఉందో చెప్పాలన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు రైతులకు ఆశచూపి మరోసారి మోసం చేయాలని రేవంత్రెడ్డి చూస్తున్నాడన్నారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అడ్డగోలు హమీలు అమలు చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేలా కాంగ్రెస్కు ఓటు వేయకుండా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెట్టాలని, కాంగ్రెస్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని లేదంటే కాంగ్రెస్ తన మోసాలను కొనసాగిస్తూనే ఉంటుందని కెటిఆర్ అన్నారు.
మేఘాలయ బొగ్గుగనిలో పేలుడు.. 10 మంది మృతి
షిల్లాంగ్: మేఘాలయలోని బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలో ఓ గ్రామంలోని అక్రమ బొగ్గు గనిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత బొగ్గుగనిలో చాలా మంది కార్మికులు చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ బొగ్గుగనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు ఘటనపై పోలీసు సూపరింటెండెంట్ వికాశ్ కుమార్ మాట్లాడుతూ.. థాంగ్స్కు ప్రాంతంలో ఉదయం ఈ సంఘటన జరిగిందని మా బృందం ధృవీకరించింది. గనిలో ఎంతమంది ఉన్నారో ఇంకా నిర్ధారించబడలేదు” అని చెప్పారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడని.. మెరుగైన చికిత్స కోసం అతన్ని షిల్లాంగ్కు తరలించినట్లు వికాశ్ కుమార్ చెప్పారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా.. కల్వకుర్తి, ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను వార్డు
బీజేపీ అభ్యర్థి బందెల సుభాష్ ప్రచారం…
బీజేపీ అభ్యర్థి బందెల సుభాష్ ప్రచారం… ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
50వేల అమ్మకాల మైలురాయిని అందుకున్న Škoda Kylaq
ముంబై Škoda Auto India, 2025లో అత్యంత విజయవంతమైన విక్రయాలను నమోదు చేసి, కొత్త Kushaqను ప్రవేశపెట్టిన తర్వాత, తన పెరుగుతున్న ప్రోడక్ట్ పోర్ట్ఫోలియాతో అదే జోరును కొనసాగిస్తోంది. తన అత్యధికంగా అమ్ముడవుతున్న కారు, Kylaq వేరియంట్ను విస్తరించడం ద్వారా మరియు కస్టమర్లకు మరిన్ని వేరియంట్లు, మెరుగైన ఎంపిక మరియు అధిక విలువను అందించడం ద్వారా, భారతీయ రోడ్లపై యూరోపియన్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే తన వ్యూహాన్ని ఈ బ్రాండ్ మరింత ముందుకు తీసుకెళ్లింది. భారతదేశంలో Škoda Auto వృద్ధి పథంలో Kylaq ఒక బలమైన మూలస్తంభంగా నిలిచింది. లాంచ్ అయినప్పటి నుండి 50,000 యూనిట్లకు పైగా విక్రయించబడటంతో, Škoda Auto India దేశంలో 25వ సంవత్సరంలో ఉన్న తరుణంలో, ఆ బ్రాండ్ సాధించిన అత్యుత్తమ విక్రయాల ప్రదర్శనలో Kylaq ప్రధాన పాత్ర పోషించింది. Kylaq అందించే భద్రత, డ్రైవింగ్ డైనమిక్స్, టెక్నాలజీ మరియు విలువ కలయిక కస్టమర్లను బలంగా ఆకట్టుకుంది, తద్వారా సబ్-4m SUV సెగ్మెంట్లో ఇది ఒక కీలకమైన పోటీదారుగా స్థిరపడింది. Škoda Auto India బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా, Kylaq మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నారు. భారతదేశం పట్ల మాకున్న దీర్ఘకాలిక నిబద్ధతకు Kylaq ఒక బలమైన నిదర్శనం. దీని ద్వారా మేము మార్కెట్లోని అత్యంత పోటీతత్వ విభాగంలోకి ప్రవేశించాము. 50,000 విక్రయాల మైలురాయిని అధిగమించడం మాకు ఎంతో గర్వకారణం, ఇది Škoda బ్రాండ్ పై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ జోరును కొనసాగించేందుకు, కస్టమర్ల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ Kylaq లైనప్ను విస్తరిస్తున్నాము. అలాగే, తన విభాగంలో 'రియల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్' కలిగిన అత్యంత సరసమైన వాహనంగా Kylaqను తీర్చిదిద్దుతున్నాము. ఈ అప్గ్రేడ్స్ ద్వారా నేటి కస్టమర్లకు అత్యంత ముఖ్యమైన ఫీచర్లను అన్ని వేరియంట్లలోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నాము. మరింత నిర్మాణాత్మకమైన శ్రేణితో మరియు ఈ ఏడాది చివర్లో ప్లాన్ చేసిన మరిన్ని ఉత్తేజకరమైన చేర్పులతో, Kylaq భారతీయ రోడ్లపై యూరోపియన్ టెక్నాలజీని, బలమైన విలువను మరియు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించే మా నిబద్ధతను కొనసాగిస్తుంది. వేరియంట్ వైవిధ్యం గతంలో నాలుగు వేరియంట్లు మరియు ఏడు ధర పాయింట్లతో ఉన్న Kylaq శ్రేణి, 2026 నాటికి ఆరు వేరియంట్లు మరియు 11 ధర పాయింట్లకు విస్తరించింది. ఎంట్రీ-లెవల్ Classic మరియు Signature ట్రిమ్స్ మధ్యలో Classic+ అనే కొత్త వేరియంట్ను బ్రాండ్ ప్రవేశపెట్టింది. అలాగే, ఇప్పుడు Kylaq లైనప్లో టాప్ ఎండ్లో Prestige+ వేరియంట్ వచ్చి చేరింది. ఈ విస్తరణ మరియు కొత్త చేరికల ద్వారా, Škoda Auto India తన కస్టమర్ల కోసం వివిధ ధరల వద్ద మెరుగైన ఎంపికలను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రారంభం నుండే అందరికీ అందుబాటులోకి.. ఈ అప్డేట్తో, కస్టమర్లకు యూరోపియన్ టెక్నాలజీని మరింత చేరువ చేయాలనే Škoda Auto India వ్యూహాన్ని Kylaq మరింత ముందుకు తీసుకెళ్తోంది. బేస్ వేరియంట్ అయిన Classic పైన ఇప్పుడు Kylaq Classic+ వచ్చి చేరింది. ఈ వేరియంట్లో ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఎలక్ట్రిక్ IRVM, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, LED హెడ్లైట్లు మరియు టెయిల్ లైట్లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు లభిస్తాయి. వీటన్నింటికీ మించి, ఈ సెగ్మెంట్లో పూర్తిస్థాయి ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ కలిగిన అత్యంత సరసమైన కారుగా నిలుస్తూ, Kylaq Classic+ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రమాణాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. లైనప్లో అన్ని ఫీచర్లు.. అందరికీ అందుబాటులోకి! కస్టమర్ల విపరీతమైన డిమాండ్ మేరకు Signature మరియు Signature+ వంటి ట్రిమ్స్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఆటోమేటిక్ కోసం ప్యాడిల్-షిఫ్టర్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, రియర్ వైపర్ మరియు వాషర్, LED రీడింగ్ ల్యాంప్లు వంటి మరిన్ని ఫీచర్లను చేర్చారు. అదనంగా, Škoda Auto India తన టాప్-ఎండ్ Prestige శ్రేణిని Prestige మరియు Prestige+ అని రెండుగా విభజించింది. దీనివల్ల పూర్తిస్థాయి ఫీచర్లు కలిగిన వేరియంట్లను ఎంచుకునేటప్పుడు, కస్టమర్లకు మెరుగైన ఎంపిక మరియు అధిక విలువ లభిస్తాయి. అత్యుత్తమ రక్షణ. తిరుగులేని ప్రశాంతత భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో అత్యున్నత రక్షణ రేటింగ్లను సాధించడం ద్వారా, ఈ సెగ్మెంట్లో అత్యంత సురక్షితమైన ICE కారుగా Škoda Kylaq తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దీనితో పాటు, ప్రతి వేరియంట్లో ఆరు ఎయిర్బ్యాగ్లు మరియు 25కు పైగా రక్షణ ఫీచర్లు ప్రామాణికంగా వస్తాయి. హై-ఎండ్ వేరియంట్లలో అయితే 40కి పైగా ప్రామాణిక రక్షణ ఫీచర్లు లభిస్తాయి. వినియోగదారుల కోసం Kylaq తన విభాగంలోనే అత్యుత్తమమైన 4 ఏళ్ల ప్రామాణిక వారంటీని అందిస్తోంది. అలాగే, 4 ఏళ్ల పాటు రోడ్సైడ్ అసిస్టెన్స్ మరియు 4 లేబర్-ఫ్రీ సర్వీస్లు కూడా ప్రామాణికంగా లభిస్తాయి. ఇందులో 15,000 కి.మీ మరియు 30,000 కి.మీ వద్ద చేసే పీరియాడిక్ నిర్వహణ సర్వీస్లతో పాటు, కొత్తగా ప్రవేశపెట్టిన 1,000 కి.మీ మరియు 7,500 కి.మీ వద్ద Škoda చెక్-ఇన్ సర్వీస్లు కూడా ఉన్నాయి. ఈ సౌకర్యాలు మరియు ప్యాకేజీలు పారదర్శకతను పెంచడం మరియు కారు యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడతాయి. Kylaq విజయవంతమైన మొదటి వార్షికోత్సవ వేడుకలు ఈ బ్రాండ్ Kylaqకు చెందిన ఎంపిక చేసిన వేరియంట్లపై పరిమిత కాలం పాటు యానివర్సరీ ఆఫర్లను ప్రకటించింది, వీటి ద్వారా ₹50,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా, Kylaq కోసం అందించే ఒక-ఏడాది Škoda నిర్వహణ ప్యాకేజీపై 50% తగ్గింపు లభిస్తుంది. అదనంగా, ఏ ట్రిమ్లో Kylaqను కొనుగోలు చేసినా ప్రతి కస్టమర్కు ఒక ఖచ్చితమైన బహుమతి ఉంటుంది. ఈ ఆఫర్లు 28 ఫిబ్రవరి 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
23వ వానకడే విశ్వనాథం రాఘవేందర్ ని గెలిపించండి…
23వ వానకడే విశ్వనాథం రాఘవేందర్ ని గెలిపించండి… వికారాబాద్, ఆంధ్రప్రభ : 23వ
కౌన్సిలర్ గా గెలిపించండిఅభివృద్ధి కి తోడ్పడండి
11వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి న్యాయవాది రాపర్తి రవిందర్ ఆసిఫాబాద్ రూరల్ ఫిబ్రవరి
bus l మహాశివరాత్రికి.. స్పెషల్ బస్సులు
bus l మహాశివరాత్రికి.. స్పెషల్ బస్సులు bus l నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ:
24 గంటలు అందుబాటులో ఉంటా ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : నిజాయితీ,సమస్యలు పరిష్కరించాలనే
Telangana : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొందరపడిందా?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి
అభివృద్ది చూసి అభ్యర్థులను ఎంచుకోండి…
అభివృద్ది చూసి అభ్యర్థులను ఎంచుకోండి… మంథని, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వహాయాంలో మంథని
31వ వార్డులో గడప గడపకు కారు వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో రైతు వినూత్న నిరసన #FarmerProtest #Nirmal #Khanapur #ForestDepartment
అమరావతిలో పనుల పురోగతిపై నారాయణ పరిశీలన
రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్ట్ ల నిర్మాణాలు మంత్రి నారాయణ పరిశీలించారు
Tomato price |టమాట ధర పడిపోయింది.. కేజీ ఎంతో తెలుసా…?
Tomato price | టమాట ధర పడిపోయింది.. కేజీ ఎంతో తెలుసా…? Tomato
Record Quotes for Peddi Theatrical Rights
Ram Charan’s Peddi has generated the much needed hype and the buzz with the first single ‘Chikiri Chikiri’. The makers have announced that the film will release on April 30th covering the May Day weekend. The film is expected to open on a super strong note and the expectations are big. The makers are now […] The post Record Quotes for Peddi Theatrical Rights appeared first on Telugu360 .
Andhra Pradesh : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దాం…
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దాం… జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ పట్టణ
CM Revanth Reddy |రాష్ట్రానికి బీజేపీ గాడిదగుడ్డు ఇచ్చింది
CM Revanth Reddy | రాష్ట్రానికి బీజేపీ గాడిదగుడ్డు ఇచ్చింది CM Revanth
Chandrababu Naidu Orders Committee to Reexamine SIT Report on Tirumala Ghee Controversy
Chief Minister Chandrababu Naidu has announced the formation of a one-man committee to closely examine the report submitted by the SIT appointed by the Supreme Court in the Tirumala ghee adulteration case. The decision was taken after a detailed meeting with NDA alliance leaders. The Chief Minister made it clear that all reports related to […] The post Chandrababu Naidu Orders Committee to Reexamine SIT Report on Tirumala Ghee Controversy appeared first on Telugu360 .
High school |ఐపీఎస్ ఆదేశాల మేరకు…
High school | ఐపీఎస్ ఆదేశాల మేరకు… High school | గుడివాడ–ఆంధ్రప్రభ
29 వ వార్డులో కాంగ్రెస్ జోరూ పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి
Collector |బార్లను లాటరీ విధానంతో…
Collector | బార్లను లాటరీ విధానంతో… Collector | మచిలీపట్నం – ఆంధ్రప్రభ
అభివృద్ధి చేస్తా.. అవకాశం ఇవ్వండి
అభివృద్ధి చేస్తా.. అవకాశం ఇవ్వండి మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను
భూసార పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
విశాలాంధ్ర – నిడదవోలు (తూర్పుగోదావరి జిల్లా) : నిడదవోలు మండలం స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పాఠశాలలో గ్రీన్ స్కూల్ అనే అంశం లో భాగంగా భూసారాన్ని పరిరక్షించి, హరిత వనాలను కాపాడే విధానం పై బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిడదవోలు బయలాజికల్ కంట్రోల్ ల్యాబ్, సహాయ వ్యవసాయ సంచాలకులు పి.చంద్రశేఖర్, నిడదవోలు మండల వ్యవసాయ అధికారి జి సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు నేలను పరిరక్షించే పద్ధతులు, […] The post భూసార పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం appeared first on Visalaandhra .

19 C