SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
...

వేసవి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ప్రణాళిక

` ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్ ` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి): మంగళవారం ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం …

జనం సాక్షి 4 Mar 2026 2:29 am

మూడు వారాల్లోగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక

రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర …

జనం సాక్షి 4 Mar 2026 2:28 am

ప్రజలకు పనికొస్తేనే మీ ఉద్యోగానికి సార్ధకత

` పదిరోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించండి ` ప్రజాపాలన ప్రగతిపై మార్చ్‌ఫాస్ట్ ` మార్చి 6 నుంచి 12 వరకు ` ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్‌ప్లాన్ …

జనం సాక్షి 4 Mar 2026 2:27 am

ఇరాన్ నాయకత్వ నివాసాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’

` ఆయుధ నిల్వలపై దాడి ` సుప్రీం లీడర్ ప్రతి కదలికను ట్రాక్ చేసి.. ` పక్కా సమాచారంతోనే అటాక్ ప్లాన్ ` కొన్ని నెలలుగా ట్రాఫిక్ …

జనం సాక్షి 4 Mar 2026 2:26 am

ఇరాన్‌పై పోరు.. ఇరుగుపొరుగు బేజారు

అమెరికా, సౌదీ, ఇజ్రాయెల్  ఈ మూడు దేశాల చిరకాల ప్రత్యర్థి ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడం ప్రపంచ అస్తిత్వాన్నే ప్రశ్నించే విధంగా అమెరికా మారుతున్నదనే సంకేతాలు ఇస్తున్నది. గత కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని అమెరికా దెబ్బతీయటం నేడు ఓ రివాజుగా మారిపోయింది. వెనెజువెలా అధ్యక్షుడిని, ఆయన భార్యను తమ దేశానికి ఎత్తుకుపోయారు, ఇరాన్ సుప్రీంను ఆయన నివాసంలోనే హతమార్చారు. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత ప్రతిభావంతమైన సమాచార సేకరణ సంస్థ మొసాద్, సౌదీ ఇంటెలిజెన్స్ సంస్థ అందించిన సమాచారంతో ఖమేనీని, ఇరాన్ రక్షణ శాఖామంత్రితో కీలకమైన 40 మందికి పైగా నేతలను హతమార్చారు. జూన్ 2025లో 12 రోజుల సంఘర్షణకు ముందు జరిగిన సంఘటనల మాదిరిగానే, ఈసారి కూడా టెహ్రాన్, వాషింగ్టన్‌ల మధ్య పరోక్షంగా చురుకైన చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా దాడులు జరిగాయి. కానీ ముఖ్యమైన తేడా ఏమిటంటే ప్రస్తుత యుద్ధం చర్చలలో పురోగతి కారణంగానే జరిగింది. సాంప్రదాయకంగా తీవ్రమైన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్-బుసైది అమెరికా -ఇరాన్ చర్చల వివరాలను బహిరంగపరిచారు. ఇరాన్ అణు పదార్థాల సున్నా నిల్వకు అంగీకరించడం, దానిలో ఉన్న 60 శాతం సుసంపన్నమైన నిల్వను తిరిగి పొందలేని ఇంధనానికి తగ్గించడం, అమెరికా ఇన్‌స్పెక్టర్లకు ఇరాన్ అణు ప్రదేశాలను యాక్సెస్ చేయడానికి అనుమతించడం వంటి ఇతర చర్యలు వెంటనే అమలు చేయగలవని ఆయన నొక్కి చెప్పారు. అమెరికా విధించే అనేక కఠినమైన షరతులకు ఇరాన్ దిగివచ్చిందని కూడా ఆయన మాటలు వెల్లడించాయి. అంతర్జాతీయ అణుఇంధన సంస్థ (ఐఎఇఎ)ద్వారా సుసంపన్నమైన యురేనియం, ఇరాన్ అణు సౌకర్యాల తనిఖీలపై సమాంతర సాంకేతిక చర్చల వైపు వెళ్లడానికి రెండు దేశాలు సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు ప్రారంభమయ్యాయి. గతంలో ఇరాక్‌లో రసాయన ఆయుధాల నెపంతో దాడిచేసి, అక్కడ సద్దాం హుస్సేన్ పాలనను అంతం చేసిన విధంగా, ఇరాన్‌లో కూడా తమ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు కోసమే అమెరికా, ఇజ్రాయెల్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి గాని, అణ్వయుధాల వివాదం కాదని ఈ సందర్భంగా స్పష్టం అవుతుంది. దౌత్యపరమైన పురోగతి కనిపించినప్పటికీ, వైట్ హౌస్ నిబద్ధత ఉచ్చులో ఉన్నట్లుగా పనిచేస్తుందని ప్రతిబింబిస్తూ, ఇరాన్‌పై దాడి చేయాలనే వాషింగ్టన్ ప్రణాళికగురించి మస్కట్‌కు తెలుసు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. తొలి నుండి ‘పాలన మార్పు’ అంటున్న ట్రంప్ ఏకంగా ఖమేనీని హత మార్చడంతో యుద్ధం ప్రారంభించారు. తన సీనియర్ గార్డులను శిరచ్ఛేదం చేసినప్పటికీ, ఇరాన్ గల్ఫ్‌లోని ప్రతి దేశంలోనూ, ఇరాక్, ఇజ్రాయెల్‌లోనూ ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులతో ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ జూన్ 2025లో మాదిరిగా పరిమితంగా కాకుండా దుబాయ్, బహ్రెయిన్, రియాద్, కువైట్‌లపై దాడులు, సైనిక, పౌర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఈ ఘర్షణల పరిధి విస్తరిస్తుంది. ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా వెళుతున్న చమురు ట్యాంకర్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం చమురు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ పాలన సుప్రీం లీడర్ ‘బలిదానానికి ప్రతీకారం తీర్చుకుంటామని’ ప్రతిజ్ఞ చేసింది. పరస్పరం దాడులను తీవ్రతరం చేస్తున్న సమయంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ ఎర్రటి గీతను దాటాయా? ఇప్పటికే అస్థిరంగా ఉన్న మధ్యప్రాచ్యంలో సుదీర్ఘమైన, అస్థిరపరిచే యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారా? కేవలం ఇరాన్‌లో పాలన మార్పు లక్ష్యంగానే అమెరికా, ఇజ్రాయెల్ రెండూ దాడులు ప్రారంభించాయి అనడంలో సందేహం లేదు. ఇరాన్ ప్రజలను పశ్చిమదేశాలతో మరింత అనుసంధానించే ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పర్చడమే వారి లక్ష్యం. కానీ 30,000 అడుగుల ఎత్తు నుండి క్షిపణులను ప్రయోగించి అగ్రనాయకత్వాన్ని హతం చేసినంత తేలికగా, వీధులలో ప్రజలను సమీకరించి, ప్రభుత్వంలో మార్పు తీసుకురావడం అమెరికాకు అంత సులభం కాదని గ్రహించాలి. ఇస్లామిక్ రిపబ్లిక్ కొనసాగింపును నిర్ధారించడానికి త్వరగా కదిలిందని పరిణామాలు సూచిస్తున్నాయి. సత్వరమే కొత్త సుప్రీం లీడర్‌ను నియమించే రాజ్యాంగ ప్రక్రియను ఇరాన్ ప్రారంభించింది. రాజ్యాంగం ఆదేశించిన విధంగా, తాత్కాలికంగా, ఎక్స్‌పెడియెన్సీ డిస్సర్న్‌మెంట్ కౌన్సిల్ ద్వారా ఎంపిక చేసిన అధ్యక్షుడు, న్యాయవ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్ నుండి ఒక న్యాయనిపుణుడితో కూడిన కౌన్సిల్ సుప్రీం లీడర్ విధులను స్వీకరించింది. 12 రోజుల యుద్ధం సమయం నుండే ఇరాన్ పాలన వారసత్వ ప్రణాళిక గురించి మాట్లాడుతోంది. ఈ సన్నాహాలు ఇప్పుడు అమలులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. అక్కడి పాలనను బలహీనపరిచే బదులు, ఈ హత్యలు ఇటీవలి వరకు ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అణచివేతపై గణనీయమైన వీధి నిరసనలలో నిమగ్నమై ఉన్న జనాభాను ఏకం చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత పాలనా కూలిపోయినా అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడాలి అంటే ఇరాన్ సైన్యం, ఐఆర్‌జిసి, బాసిజ్‌లను అధిగమించడానికి వారికి ప్రజలలో లాజిస్టికల్ మద్దతు అవసరం. అంటే ఆయుధాలు, లాజిస్టిక్‌ల భారీ సరఫరాను ఏర్పాటు చేయడం. క్షేత్రస్థాయిలో సాయుధులను మోహరించడం. ప్రస్తుత పరిస్థితులలో అందుకు ఏమేరకు అవకాశం ఉందన్నది సందేహాస్పదమే. ఇప్పటివరకు, ఇరాన్ పాలన గణనీయమైన స్థిరత్వాన్ని ప్రదర్శించింది. అగ్ర కమాండర్ల నష్టాన్ని తట్టుకుంటూనే, సముద్ర ప్రాంతంతో సహా బహుళ థియేటర్లలో గణనీయమైన ప్రతిఘటనను కొనసాగిస్తోంది. గత సెప్టెంబర్‌లో దోహాలో హమాస్‌తో సంబంధం ఉన్న లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత, అమెరికా రక్షణపై నమ్మకం మునుపటిలా బలంగా ఉండకపోవచ్చు. ఇరాన్ గల్ఫ్ దేశాలపై అమెరికా- ఇజ్రాయెల్ మధ్య మరింత ఉద్రిక్తతను నిరోధించడానికి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణాకు అంతరాయం కలిగించడంతోపాటు ఎర్రసముద్రం, ఆవల దాడులను విస్తరించడం ద్వారా టెహ్రాన్ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఇరాకీ ప్రతిఘటన గ్రూపులు ఇప్పటికే అమెరికా లక్ష్యాలపై దాడులకు పాల్పడ్డాయని ప్రకటించాయి. అయితే అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లకు వ్యతిరేకంగా ప్రజాప్రదర్శనలు ఈ ప్రాంతం అంతటా మరో అమెరికన్ వ్యతిరేక భావాన్ని సృష్టించవచ్చు. రాబోయే రోజుల్లో, అమెరికా, ఇజ్రాయెల్ దీర్ఘకాలిక సంఘర్షణకు సిద్ధంగా ఉన్నారా? లేదా ఉద్రిక్తతను తగ్గించడానికి ఆఫ్- ర్యాంప్‌ను కోరుకుంటారా? అని నిర్ణయించుకోవాలి. ఈ పరిస్థితి దక్షిణాసియాకు కూడా గణనీయమైన ప్రభావాలను చూపుతుంది. మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తత ఇరాన్‌పై కొత్త ఆంక్షలకు దారితీయవచ్చు. కీలకమైన వాణిజ్య, ఇంధన సరఫరా మార్గాలను దెబ్బతీయవచ్చు. ఇప్పటివరకు, అమెరికన్ సైనిక పరికరాలు, సిబ్బందికి స్థలం ఇచ్చిన ప్రాంతీయ భాగస్వాములను బెదిరించడానికి ఇరాన్ సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలను జాగ్రత్తగా లక్ష్యంగా చేసుకుంటున్నది. యుద్ధాన్ని వారాలపాటు సాగదీయడం ద్వారా ప్రాంతీయ ఆటగాళ్ళు కాల్పుల విరమణ కోసం కలిసి వస్తారని ఇరాన్ ఆశిస్తున్నట్లు కనిపిస్తున్నది. టెహ్రాన్ దాడుల కారణంగా ప్రాంతీయ ప్రత్యర్థులు తమ సొంత జనాభా భద్రతను ప్రమాదంలో పడేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా భారతదేశం చాలా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. గల్ఫ్‌లోని పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు ఎదురుకాల్పుల్లో చిక్కుకోవచ్చు. చాలా మంది తక్కువ సమయంలోనే అక్కడి నుండి వెళ్లిపోవాల్సి రావచ్చు. ఒక ముఖ్యమైన ప్రాంతీయ భాగస్వామి అయిన ఇరాన్ స్థిరత్వం, శ్రేయస్సుపై భారతదేశం ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయని మరచిపోలేము. అంతేకాకుండా, ఇరాన్‌లోని మిగిలిన అణుకేంద్రాలను నిర్లక్ష్యంగా లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతటా రేడియోధార్మిక కాలుష్యం వచ్చే ప్రమాదం ఉంది. ఇది భారతదేశంతో సహా పొరుగు దేశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాల గురించి వారి ఆందోళనలతో సంబంధం లేకుండా, బాధ్యతాయుతమైన దేశాలు దౌత్య ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక, విస్తరిస్తున్న సంఘర్షణ ఈ ప్రాంతం దాటి దుష్ప్రమాణాలు చూపే అవకాశం ఉంది. చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 4 Mar 2026 1:10 am

భారత్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదు.. సునీల్ గవాస్కర్

ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్ టీమిండియాకు సవాల్ వంటిదేనని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఇంగ్లండ్‌కు ఉందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు చాలా బలంగా ఉందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లతో పాటు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారన్నాడు. దీంతో భారత్ ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గవాస్కర్ హెచ్చరించాడు.

మన తెలంగాణ 4 Mar 2026 12:44 am

మూసీ రివర్‌ఫ్రంట్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

మూసీ సుం దరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీరివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో (ఎన్‌హెచ్‌ఆర్‌సి)లో కేసు నమోదు అయ్యింది. మూసీ ప్రా జెక్టు పేరుతో ఈ నది తీర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని దీనిని అడ్డకోవాలని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఎన్‌హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు. ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండా లంగర్‌హౌస్, నా ర్సింగి, రాందేవ్‌గూడ ప్రాంతాల్లో శతాబ్దాల నాటి వేలాది చెట్లను నరికివేస్తున్నారని ఈ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావం, సామాజిక ప్రభావంపై ఎటువంటి సోషల్ ఇంపాక్ట్ స్టడీ నిర్వహించకుం డా పనులు ప్రారంభించారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రజల జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపే విధంగా మూసీ తీరాలను ధ్వంసం చేస్తున్నారని ఆ యన స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

మన తెలంగాణ 3 Mar 2026 11:56 pm

ఖమేనీ మృతి.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సోనియా గాంధీ ఫైర్

న్యూఢిల్లీ : ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి సంఘటనలో మోడీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆక్షేపించారు. ఇరాన్ అంశంలో భారత్ ప్రదర్శించిన మౌనం తటస్థంగా ఉండటం కాదని, అది పరిత్యాగం చేసినట్టుగా ఉందని సోనియా ఆరోపించారు.భారతీయ విదేశాంగ విధానంపై విశ్వాసం కోల్పోయినట్టుగా ఉందని ఆమె అన్నారు. విదేశీ విధానం అంశంలో భారత్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా ఆమె చెప్పారు. అయితే రెండోదఫా బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ప్రారంభమైనప్పుడు , భారత్ తీసుకున్న తన నిర్ణయం పట్ల చర్చచేపట్టాలని సోనియా డిమాండ్ చేశారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సోనియా తన వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసంలో ఆమె ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖమైనీ మృతి చెందినట్టు మార్చి ఒకటో తేదీన ఇరాన్ ధ్రువీకరించిందని, వైమానిక దాడుల్లో ఖమైనీ ప్రాణాలు కోల్పోయారని, ఒకవైపు చర్చలు నిర్వహిస్తూనే మరోవైపు దేశ అధినేతను చంపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని విమర్శించారు. ఇలాంటి షాకింగ్ సంఘటన జరిగినప్పుడు భారత్ వ్యవహరించిన తీరు మరింత షాకింగ్‌గా ఉందన్నారు. ఖమేనీ హత్యగురించి కానీ, ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంశం గురించి కానీ భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా ఖండించారు. 

మన తెలంగాణ 3 Mar 2026 11:35 pm

మత సామరస్యం చాటుదాం

ప్రజల మధ్య ఐక్యత… శాంతి, ప్రగతికి చిహ్నంఇస్లాం ధర్మం చెప్పేది సమసమాజస్థాపనే: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: మతసామరస్యాన్ని చాటుతూ దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అందుకు ధార్మిక పండుగలు దోహదపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యత ఉన్నప్ప్పుడే శాంతి ప్రగతి సాధ్యమన్నారు. కొన్ని శక్తులు రాజకీయ , ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన […] The post మత సామరస్యం చాటుదాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:17 pm

99 రోజుల కార్యక్రమాల్లో ‘స్థానిక’ పాలకులను భాగస్వాముల్ని చేయండి

u శిక్షణలో విధులు, బాధ్యతలపై అవగాహన. సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం. ప్రజలకు వైద్య కళాశాలల సేవలు. పంటల మార్పిడి ప్రయోజనాన్ని రైతన్నకు వివరించండి. కలెక్టర్ల సదస్సులో రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యక్రమాల్లో పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వీరందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు […] The post 99 రోజుల కార్యక్రమాల్లో ‘స్థానిక’ పాలకులను భాగస్వాముల్ని చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:14 pm

18,139 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఓ చరిత్ర

ఇప్పటి వరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ ఇదేజాతీయ స్థాయిలో అప్రతిహత ప్రగతిభవిష్యత్ అవసరాలకు ప్రణాళికలతో సిద్ధం: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్ : మరోసారి తన అప్రతిహత ప్రగతిని రాష్ట్రం చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి, ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […] The post 18,139 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఓ చరిత్ర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:13 pm

రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలు

కాంగ్రెస్ పెద్దల అక్రమాలు కనబడడం లేదా? హరీశ్‌రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : పేదల ఇళ్లను కూల్చిన రేవంత్ సర్కార్‌కు కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున కొండలను పిండి చేస్తుంటే కనిపిండం లేదా అని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాల పై ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి […] The post రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:10 pm

ప్రపంచ శాంతికి ముప్ప్పు

న్యూదిల్లీ: అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్‌పై అమెరికా సామ్రాజ్యవాద, జియోనిస్ట్ ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) దిల్లీ రాష్ట్ర సమితి సహా ఇతర వామపక్ష పార్టీలు మంగళవారం దిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వహించడంపై ఆగ్రహం వెలిబుచ్చాయి. ప్రపంచశాంతికి విఘాతం కలుగుతున్న ఈ తరుణంలో మౌనం, తటస్థ వైఖరి ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన, […] The post ప్రపంచ శాంతికి ముప్ప్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:07 pm

ఇరాన్ అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం

తెహ్రాన్:ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని అధ్యక్ష భవనంపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. రాజధానిలో అత్యంత పటిష్ట భద్రత ఉండే నాయకత్వ సముదాయంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) విరుచుకుపడ్డాయి. ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు. కచ్చితమైన సమాచా రంతో సుమారు 100 ఫైటర్ జెట్‌లను ఉపయోగించి 250కి పైగా బాంబులను జారవిడిచినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ రాజకీయ, సైనిక నిర్ణయాలు తీసుకునే కీలక […] The post ఇరాన్ అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 11:02 pm

ఇరాన్‌కుచైనా మద్దతు

బీజింగ్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధంపై చైనా స్పందించింది. ఇరాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులను నిలిపివేయాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడానికి, దాని చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు ఇస్తుందని వాంగ్ యి తెలిపారు. అమెరికా, […] The post ఇరాన్‌కుచైనా మద్దతు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:58 pm

అమెరికా`ఇజ్రాయిల్ విధ్వంసకాండకు భీకర ప్రతిఘటన

డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరమవుతున్నాయి. గంట గంటకూ పరిస్థితి మారిపోతోంది. యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ను నియంత్రించేందుకు ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలైన ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, విలాసవంతమైన రెస్టారెంట్లు లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడులు చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున బహ్రెయిన్‌లోని […] The post అమెరికా`ఇజ్రాయిల్ విధ్వంసకాండకు భీకర ప్రతిఘటన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:56 pm

సీఎం, డిప్యూటీ సీఎంకీలక భేటీ

నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ అభ్యర్థులు,శాఖాపరమైన అంశాలపై చర్చ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మధ్యాహ్న సమయంలో వచ్చిన పవన్ కల్యాణ్ సీఎంతో ఏకాంతంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వివిధ అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. అధికారికంగా ఉప ముఖ్యమంత్రి నిర్వహించే శాఖలకు సంబంధించి నిధులు, ఇతర అంశాలు చర్చించినట్లు మీడియాకు తెలియజేసినప్పటికీ నామినేటెడ్ పోస్టులు, […] The post సీఎం, డిప్యూటీ సీఎంకీలక భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:53 pm

దాడి చేయకుంటే ఇరాన్ అణుశక్తివంతం అయ్యేది: నెతన్యాహు

పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే కారణం ఇప్పుడు దాడి వల్ల ఇరాన్‌లో ప్రస్తుత తరం మార్పుకు దోహదం పొరుగుదేశాలతో శాంతి ఒప్పందాలకు అవకాశం ఫాక్స్‌న్యూస్ ఇంటర్వూలో నెతన్యాహు వెల్లడి జెరూసలెం : ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించిందని, కొన్ని నెలల్లోనే శక్తివంతం అయ్యేదని అందుకనే ఇజ్రాయెల్, అమెరికా కలిసి అత్యవసరంగా దాడి చేయక తప్పలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం “ ఫాక్స్ న్యూస్‌” ఇంటర్వూలో వెల్లడించారు. దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇరాన్ కొత్తగా బాలిస్టిక్ క్షిపణుల తయారీ కోసం భూగర్భంలో అణు కార్యక్రమాల క్షేత్రాలను, బంకర్లను, నిర్మించడం ప్రారంభించిందని ,ఇప్పుడు దాన్ని నివారించకుంటే భవిష్యత్తులో ఏ చర్య తీసుకోలేమని నెతన్యాహు పేర్కొన్నారు. గత ఏడాది జూన్‌లో 12 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ అణు క్షేత్రాలను, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ధ్వంసం చేశామని, అయినా ఇరాన్ మళ్లీ ప్రారంభించిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు గత ఏడాది నెతన్యాహు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయి. గత ఏడాది ఇరాన్‌పై ఇజ్రాయెల్ చారిత్రక విజయం సాధించిందని నెతన్యాహు వెల్లడించగా, ఇరాన్ అణుకార్యక్రమం పూర్తిగా తుడిచిపెట్టడమైందని ట్రంప్ వెల్లడించారు. ఇప్పుడు దీనికి విరుద్ధంగా నెతన్యాహు ఇంటర్వూలో వెల్లడిస్తున్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అంతులేని యుద్ధం సాగిస్తామన్న ప్రకటనను కొట్టిపారేశారు. ఇరాన్‌లో ప్రస్తుత ఉగ్రవాద తరం బలహీనంగా ఉందన్నారు. అమెరికా, తాము సంయుక్తంగా చేపట్టిన దాడుల వల్ల ఇరాన్‌లో తరం మారడానికి దోహదపడుతుందన్నారు. పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే ప్రధాన కారణమని, ఆ పాలన అంతమొందితే పశ్చిమాసియాలో శాంతి లభిస్తుందని, ఇజ్రాయెల్, పొరుగున ఉన్న అరబ్, ముస్లిం దేశాలతో శాంతి ఒప్పందాలు కుదురుతాయని వెల్లడించారు. ఇజ్రాయెల్ యుద్ధం లోకి అమెరికాను లాగుతోందన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని కొట్టి పారేశారు.

మన తెలంగాణ 3 Mar 2026 10:45 pm

గ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో చెలరేగిన మంటలు

గ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో మంటలు చెలరేగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్ లో చోటుచేసుకుంది. గోదాం నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. లోపల ఉన్న కూలర్లు, విడిభాగాలు ప్లాస్టిక్ మరియు గడ్డితో తయారైనవి కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న సుమారు వందలాది కూలర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనివల్ల యజమానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు, మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ పని చేసే సిబ్బంది వంట కోసం తీసుకొచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు తెలిపారు. 

మన తెలంగాణ 3 Mar 2026 10:35 pm

షూటింగ్ ఆపేద్దామన్నా రామ్‌చరణ్ వినలేదు

‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబుహైదరాబాద్: ‘పెద్ది’ సినిమాలో తొలి పాట ‘చికిరి చికిరి’కి రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. అందులోని హుక్‌స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సోమవారం రాత్రి విడుదలైన రెండో పాట ‘రయ్ రయ్ రారా’ కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నెటిజన్లు ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్‌తో సందడి చేస్తున్నారు. కేవలం తెలుగు లిరికల్ వీడియోకే యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ 17 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ విజయం వెనుక దాగిన […] The post షూటింగ్ ఆపేద్దామన్నా రామ్‌చరణ్ వినలేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:30 pm

రాం చరణ్ డ్యాన్స్ కు ఫిదా అయిన సమంత

పెద్ది చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘రైరై రారా’లో చరణ్ డ్యాన్స్ చూసి కేవలం అభిమానులు మాత్రమే కాదు హీరోయిన్ సమంత కూడా ఫిదా అయ్యారు. చరణ్ మాస్ స్టెప్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. రామ్ చరణ్ ఒకే ఒక్కడు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్, - సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించారు. అప్పటి నుంచి సామ్.. చరణ్ యాక్టింగ్ కి, డ్యాన్స్ కి పెద్ద ఫ్యాన్. 

మన తెలంగాణ 3 Mar 2026 10:24 pm

తుది అంకానికి టీ20 ప్రపంచకప్

. ఇక సెమీస్ పోరు. నేడు దక్షిణాఫ్రికా I న్యూజిలాండ్. రేపు భారత్ I ఇంగ్లాండ్. వరుణ్ స్థానంలో కుల్దీప్? ముంబై: టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు […] The post తుది అంకానికి టీ20 ప్రపంచకప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:04 pm

‘నీకు వసీం అక్రం, షేర్ వార్న్‌ను ఇచ్చినా వేస్ట’

పాక్ కెప్టెన్‌పై రషీద్ లతీఫ్ ఆగ్రహం ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి పాకిస్థాన్ ఘోరంగా నిష్క్రమించడం ఆ దేశంలో మాజీల ఆగ్రహానికి కారణమైంది. పాక్ క్రికెట్ అభిమానులు కూడా పాకిస్థాన్ ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై విమర్శలు దాడి ఎక్కువైంది. తాజాగా ఆ దేశ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, నెట్ రన్ రేట్ కారణంగా పాకిస్థాన్ సెమీఫైనల్స్ కు వెళ్లకుండా […] The post ‘నీకు వసీం అక్రం, షేర్ వార్న్‌ను ఇచ్చినా వేస్ట’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 10:02 pm

ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో అంతర్జాతీయ విమానసర్వీసుల ఆపరేషన్‌కు అవాంతరాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దయ్యాయి. 36 సర్వీసులు బయల్దేరవలసినవి కాగా, 44 సర్వీసులు రావలసినవని అధికారులు వెల్లడించారు. ఈలోగా ఎమిరేట్స్ ఫ్లైట్ ఇకె 513 దుబాయ్‌కు వెళ్లవలసి ఉన్నప్పటికీ ఎయిర్‌స్పేస్ అవాంతరాల వల్ల తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. పశ్చిమదేశాలకు వెళ్ల వలసిన అనేక అంతర్జాతీయ విమానాలు ఆలస్యం కావడం కానీ లేదా షెడ్యూల్ సర్దుబాట్లు కానీ జరుగుతున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో రోజూ 1300 విమానసర్వీసులు నడుస్తుంటాయి. గత మూడు రోజులుగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ 1117 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మంగళవారం దుబాయ్ నుంచి డిల్లీకి 149 మంది ప్రయాణికులను ఎయిర్ ఇండియా సర్వీస్ తీసుకొచ్చింది.

మన తెలంగాణ 3 Mar 2026 10:01 pm

అబుదాబి నుంచి క్షేమంగా చేరుకున్న భారతీయులు

బెంగళూరు: పశ్చిమాసియా సంఘర్షణలతో అబుదాబిలో చిక్కుకుని ఎంతో ఉద్రిక్తతకు గురైన భారతీయులకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరగానే ఊరట లభించింది. సోమవారం రాత్రి చేరగానే వీరంతా గల్ఫ్ దేశంలో క్షిపణి దాడులు జరిగినప్పుడు ఎంత ఉద్రిక్తత అనుభవించారో గుర్తు చేసుకున్నారు. స్వదేశం చేరుకునేందుకు వీలుగా ప్రయాణ సౌకర్యం కల్పించిన ఇటిహాద్ ఎయిర్‌వేస్ కు, అబుధాబి ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. అబుధాబిలో ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్న మంగళూరుకు చెందిన సౌరభ్ సెట్టి అబుధాబిలో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని వాపోయారు. “ఫిబ్రవరి 28న విమానం చేరుకోడానికి వచ్చినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు కనిపించింది. అకస్మాత్తుగా చెక్ చేసే సమయంలో తామంతా కింద కూర్చోవాలన్న హెచ్చరిక వచ్చింది.క్షిపణి దాడి భయంతో కిటికీలకు దగ్గరగా కూర్చోరాదన్నారు. ” అని ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు. తమ కళ్ల ముందే క్షిపణుల దాడులను చూసి భయం చెందామని, ఏ ఒక్క క్షిపణి తమపై దాడి చేసినా తామెవరం ఉండమని చాలా మంది తమ భయానక పరిస్థితిని వివరించారు. బోస్టన్ నుంచి వచ్చిన మహేష్, బెంగళూరుకు చెందిన రమ్య, కోయంబత్తూరుకు చెందిన నిరుబన్, బెంగలూరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ప్రసాద్, గిరిమలప్పకెరూర్,వీరంతా క్షిపణి దాడుల నుంచి తామెలా బయటపడ్డామో వివరించారు. ఇటిహాద్ ఎయిర్‌వేస్ కల్పించిన సౌకర్యాలను ప్రశంసించారు.

మన తెలంగాణ 3 Mar 2026 9:59 pm

ఆరూధ ఎఎఫ్ ఆరూధ ఈక్విటీ లాంగ్-షార్ట్ ఫండ్ ప్రారంభం

హైదరాబాద్: బంధన్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఆరూధ ఎఫ్, ప్రత్యేక పెట్టుబడి నిధుల (ఎఫ్) ఫ్రేమ్వర్క్ కింద ఓపెన్-ఎండ్ ఈక్విటీ పెట్టుబడి వ్యూహం అయినఆరూధ ఈక్విటీ లాంగ్-షార్ట్ ఫండ్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఎ) గురువారం, 5 మార్చి 2026న ప్రారంభమై, బుధవారం, 18 మార్చి2026న ముగుస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులు, మారుతున్న నాయకత్వం, పెరిగిన అస్థిరత ద్వారా వర్గీకరించబడిన వాతావరణంలో మరింత అనుకూల పోర్ట్ఫోలియోనుకోరుకునే పెట్టుబడిదారులకు ఈ పెట్టుబడి వ్యూహం అనుకూలంగా ఉంటుంది. […] The post ఆరూధ ఎఎఫ్ ఆరూధ ఈక్విటీ లాంగ్-షార్ట్ ఫండ్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 9:53 pm

ఎస్కార్ట్స్ కుబోటా కొత్త ‘సౌత్ స్పెషల్’వరి ట్రాక్టర్ సిరీస్ ప్రారంభం

న్యూదిల్లీ: వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్, పవర్ ట్రాక్ శౌర్య పేరుతో కొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్సిరీస్ ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ సిరీస్లో 39 హెచ్పి నుండి 52 హెచ్పీ విభాగాలలో ఐదు వేర్వేరు రకాలను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలోని వరి సాగు ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి వరి, మాగాణి ప్రత్యేక సిరీస్ […] The post ఎస్కార్ట్స్ కుబోటా కొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్ సిరీస్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 9:50 pm

రామ్ చరణ్ డ్యాన్స్ పై సమంత ప్రశంసలు

పెద్ది చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘రైరై రారా’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ చూసి కేవలం అభిమానులు మాత్రమే కాదు హీరోయిన్ సమంత కూడా ఫిదా అయ్యారు. చరణ్ మాస్ స్టెప్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. రామ్ చరణ్ ఒకే ఒక్కడు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్, - సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించారు. అప్పటి నుంచి సామ్.. చరణ్ యాక్టింగ్ కి, డ్యాన్స్ కి పెద్ద ఫ్యాన్. 

మన తెలంగాణ 3 Mar 2026 9:48 pm

బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ‘ద వన్ అండ్ వోనీ ఆవిష్కరణ

ముంబయిః సాంస్కృతిక దిగ్గజం బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, తమ కొత్త కాంపైన్ ‘ద వన్ అండ్ ఓన్లీ’ని ఆవిష్కరించింది. నేటి ప్రపంచంలో, విజయం కోసం పోటీయుత రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో బ్రాండ్ శాశ్వతమైన నిజాన్ని పునరుద్ఘాటించింది. అందుకే కొత్త కాంపైన్ ఈ స్ఫూర్తిని గ్రహించింది. ముగ్గురు నాయకులు అవంతి నాగ్ రథ్, కిరణ్ దీప్ చహల్, మహికా శర్మలతొ ఈ ప్రచారం రూపొందింది. ప్రతి ఒక్కరు బ్రాండ్ భిన్నమైన రూపాన్ని ప్రదర్శిస్తారు. ప్రస్తుతం […] The post బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ‘ద వన్ అండ్ వోనీ ఆవిష్కరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 9:47 pm

Nani’s Aaya Sher shatters 1 Million likes in record time

Natural Star Nani has once again proven his mass appeal as the first single from his ambitious project The Paradise creates history online. Titled Aaya Sher, the song has successfully crossed the 1 million likes threshold on YouTube in record-breaking time. The track’s rapid ascent to this milestone is a testament to the combined star […] The post Nani’s Aaya Sher shatters 1 Million likes in record time appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 9:39 pm

99 రోజుల ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గద్వాల, ఆంధ్రప్రభ: జిల్లాలో

ప్రభ న్యూస్ 3 Mar 2026 9:28 pm

చెట్టుకు ఉరివేసుకొని ప్రమ జంట ఆత్మహత్య

చెట్టుకు ఉరివేసుకొని ప్రమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటనా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రాపూర్ ఘాట్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) కు సోషల్ మీడియాలో చిట్టమూరుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. మంగళవారం రావూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బా గుర్తించారు. అయితే ఆ మహిళకు ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 3 Mar 2026 9:19 pm

బాలుడికి తలసేమియా.. దీన స్థితిలో తల్లిదండ్రులు

బాలుడికి తలసేమియా.. దీన స్థితిలో తల్లిదండ్రులు విస్సన్నపేట,ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు

ప్రభ న్యూస్ 3 Mar 2026 9:13 pm

దుబాయ్ నుంచి సురక్షితంగా వచ్చేశా: పీవీ సింధు

బెంగళూరు: ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దుబాయ్ నుంచి మంగళవారం సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఎయిర్‌స్పేస్‌ను మూసి వేయడంతో దుబాయ్ విమానాశ్రయంలో సింధు చిక్కుకున్న విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వెళ్లిన సింధు, ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయింది. అయితే బెంగళూరు లోని తన ఇంటికి సురక్షితంగా చేరుకున్నట్టు తన ఎక్స్ అకౌంట్‌లో వెల్లడించింది. కష్ట సమయంలో చాలా కేర్ తీసుకున్న దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. దుబాయ్‌పై ఇరాన్ దాడి గురించి ప్రస్తావిస్తూ తాను ఉండే చోట పేలుళ్లు జరగడంపై స్పందిస్తూ “ఇలాంటి క్షణాలు సాధారణ జీవితం నిజంగా ఎంత దుర్బలమైనదో మీకు గుర్తు చేస్తాయి.” అని ఆమె తన అనుభవాన్ని వివరించారు. ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకుని మళ్లీ ఉత్తేజాన్ని పొందిన తరువాత తదుపరి అడుగులు వేయాల్సి ఉందని తన అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చింది.

మన తెలంగాణ 3 Mar 2026 9:12 pm

జిల్లాఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్యకార్యాచరణసమితి ఏర్పాటు

విశాలాంధ్ర – పార్వతీపురం : జిల్లాలోని అన్ని విభాగాలనుండి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్య కార్యాచరణసమితిను మంగళవారంనాడు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్.ఎస్. కిషోర్, కార్యదర్శి రంగాచారిలు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సంఘాన్ని మరింత పటిష్టంగా నిర్మించాల్సిన బాధ్యత, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల బాధ్యత ఇతరఅంశాలపై కూలంకషంగా […] The post జిల్లాఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్యకార్యాచరణసమితి ఏర్పాటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 9:09 pm

భారతీయుల భద్రతపై ఒమన్, కువాయిట్ అధినేతలతో మోడీ చర్చలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్‌అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతపై ప్రధాని మోడీ ఆయా దేశాధినేతలతో గత రెండు రోజులుగా చర్చించి వారి క్షేమసమాచారం తెలుసుకుంటున్నారు. మంగళవారం ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్, కువాయిట్ రాజు షేక్ సబాహ్ అల్ ఖలేద్ అల్ హమాద్ అల్ ముబారక్ అల్ సబాహ్‌లతో అక్కడి భారతీయుల భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెలిఫోన్ ద్వారా సాగిన సంభాషణల్లో అక్కడ నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రత గురించి తెలుసుకున్నారు. అంతకుముందు బహ్రెయిన్ రాజు, సౌదీ అరేబియా రాజులతో చర్చించారు. ఆయా దేశాలపై ఇటీవల జరిగిన దాడులపై మాట్లాడుతూ ఈ క్లిష్టసమయంలో ప్రజల సాధికారతకు భారత్ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా తో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో కూడా మోడీ చర్చించారు. 

మన తెలంగాణ 3 Mar 2026 9:08 pm

అంగన్వాడీల అరెస్టులు ఖండన

ఎస్ఎఫ్ఐ నాయకులు విశాలాంధ్ర – ధర్మవరం : అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఎస్ఎఫ్ఐ శ్రీ సత్య సాయి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వంను అమలు చేయండని అడిగినందుకు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం దుర్మార్గం అని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా రోడ్డులో వారు బయటాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.మా ప్రభుత్వంలో ఎటువంటి […] The post అంగన్వాడీల అరెస్టులు ఖండన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 9:05 pm

ఒమన్ ఓడరేవు పై ఇరాన్ డ్రోన్ దాడి

గతవారం అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడులలో సుప్రీ లీడర్ ఖమేని హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడులలో భాగంగా మంగళవారం ఉదయం ఒమన్ లోని రాస్ అల్ -జైమా ఓడరేవుపై ఇరానియన్ డ్రోన్ దాడి చేసింది. దాడులలో మంటలు ఎగసి పడ్డాయి. డ్రోన్ మంటల్లో దూసుకుపోతూ, కెమెరాకు చిక్కింది. ఓడరేవు అంతటా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే గల్ఫ్ లోని దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులు, ఓడరేవులు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఇరానియన్ షాహెద్ సూసైడ్ డ్రోన్లు జరిపిన ఇలాంటిదాడిలోనే సౌదీ అరేబియా లోని తనూరా శుద్ధి కర్మాగారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలకు అంతరాయం కలుగకుండా తక్షణం మూసివేశారు. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్మూలించే లక్ష్యంతోనే అమెరికా - ఇజ్రాయెల్ ఫిబ్రవరి 20 నుంచి ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించాయి. బాంబులు, వైమానికదాడులతో విరుచుకుపడుతుంటే, ఇరాన్ అమెరికా స్థావరాలు ఉన్న ఇతర గల్ఫ్ దేశాలపై ప్రతీకారదాడులు చేస్తోంది. మరో పక్క ప్రపంచంలో పలు దేశాలకు చమురు సరఫరాలు జరిగే సముద్రమార్గం అయినహోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరా ప్రకటించింది. దాని గుండా వెళ్లే ఏ నౌకనైనా ధ్వంసం చేసే ప్రమాదం ఉండడంతో చమురు ట్యాంకర్లు, ఇతర నౌకలు జలసంధికి ఇరువైపులా నిలిచి పోయాయి.

మన తెలంగాణ 3 Mar 2026 8:58 pm

ఉద్రిక్తంగానే పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు బహ్రెయిన్‌లో ఎయిర్‌బేస్ ధ్వంసం ఇంధన ట్యాంకులకు మంటలు ఒమన్ పోర్టుపై డ్రోన్ దాడులు ఖతార్‌లో ఇంధన కేంద్రంపై దాడి కువైట్‌లో అమెరికా రాయబార కార్యాలయం లక్షం, మూసివేత ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం మిలిటరీ శిక్షణ కార్యాలయంతో పాటు ప్రధాన ఆఫీసులు ధ్వంసం టెహ్రాన్ విమానాశ్రయంపై ఉమ్మడి సేనల దాడి లెబనాన్‌పైనా దాడులు, 40 మంది మృతి నతాంజ్ అణు కేంద్రంపై దాడి నిర్ధారించిన ఐఎఈఏ టెహ్రాన్/దుబాయి/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నాలుగో రోజూ యుద్ధం ఉధృతంగానే సాగింది. ఇరాన్, అమెరికాఇజ్రాయెల్ పరస్పర దాడులకు పాల్పడ్డాయి. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ తదితర దేశాల్లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో రెచ్చిపోయింది. అమెరికా స్థావరాలను లక్షంగా చేసుకుంది. బహ్రెయిన్ షేక్ ఇసాలోని అమెరికా ఎయిర్‌బేస్‌ను క్షిపణులు, డ్రోన్లతో ధ్వంస చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కాప్స్ ప్రకటించుకుంది. ఇంధన నిల్వ ట్యాంకులకు మంటలు అంటుకున్నాయని, ఉవ్వెత్తున పొగలు ఎగిసినట్లు తెలిపింది. లక్ష్యాన్ని పక్కాగా ఢీకొట్టినట్లు వెల్లడించింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడిలో అమెరికా ప్రధాన హెడ్‌క్వార్టర్ ధ్వంసమైందని, ప్రధాన కార్యాలయంతో పాటు ఉద్యోగుల క్వార్టర్లు సల్వంగా దెబ్బతిన్నాయని తెలుపుతూ సంబంధిత చిత్రాలను ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇక రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను సౌదీ అరేబియా విజయవంతంగా కూల్చివేసింది. మరోవైపు ఒమన్‌లోని ‘రస్ అల్ జైమా’ పోర్టుపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో ఆ ప్రాంతమంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంబంధిత వీడియో కూడా వైరల్ అయ్యింది. ఖతార్‌లోని ఇంధన కేంద్రంపై కూడా జరిగినట్లు తెలుస్తోంది. కువైట్‌లో రాయబార కార్యాలయంపైనా ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడడంతో దాన్ని మూసివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇదిలావుండగా నాలుగు రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది చనిపోయారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ మంగళవారంనాడు ‘ఎక్స్’లో వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ గురి... ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తాజాగా ఆ దేశ అధ్యక్షుడిపై గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. మంగళవారంనాడు టెహ్రాన్‌లో అధ్యక్ష కార్యాలయమే లక్షంగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మిలిటరీ శిక్షణ ప్రధాన కార్యాలయంపైనా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దానితో పాటు ఇతర ప్రధాన కార్యాలయాను కూడా టార్గెట్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్‌లో అత్యంత సీనియర్ అధికారుల కాంపౌండ్‌లను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ ఇరాన్‌లోని అమెరికాఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 13 మంది ఇరాన్ సైనికులు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. టెహ్రాన్‌కు 500 మైళ్ల దూరంలోని కెరామిన్ ఎయిర్‌బేస్ లక్షంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఇదిలావుండగా టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ మేరకు టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హకీమే ఏరియాలో కూడా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలే లక్షంగా ఉమ్మడి సేనలు విధ్వంసానికి తెగబడినట్లు వెల్లడైంది. లెబనాన్‌లో 40 మంది మృతి.. మరిన్ని బలగాలు పయనం మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లాల టీవీ, రేడియో స్టేషన్లకు నష్టం వాటిల్లింది. దక్షిణ లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ తరలిస్తోంది. హెజ్‌బొల్లాలు స్థావరాల చుట్టూ ఉన్న 80 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. 200మందికిపైగా గాయపడ్డారు. బీరూట్‌లోని దహియేలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది. నతాంజ్‌పై దాడిని నిర్ధారించిన ఐఎఈఏ ఇదిలావుండగా ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు నిజమేనని ఐఎఈఏ నిర్ధారించింది. కేంద్రానికి స్వల్పంగా నష్టం జరిగిందని, అయితే అణు ధార్మికత ప్రమాదం ఇప్పటికేమీ లేదని వెల్లడించింది. అణుకేంద్రంలోకి ప్రవేశించే క్రమంలో భూగర్భ ప్రవేశ ద్వారాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుర్తించామని తెలిపింది. ఖాళీ చేసి రండి.. ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాలను లక్షంగా చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఆ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. బహ్రెయిన్, జోర్డాన్‌లలోని అత్యవసర సేవల సిబ్బంది మినహా మిగతా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, లేకపోతే స్వదేశానికి విచ్చేయాలని సూచించింది. భద్రతా పరమైన రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించింది. 

మన తెలంగాణ 3 Mar 2026 8:53 pm

రాజ్యసభ రేసులో 16 మంది

రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీలేర్పడనున్న రెండు స్థానాలకు తమ పార్టీలో 16 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందులో నలుగురు బిసి ముఖ్య నేతలు ఉన్నారని ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.సోమవారం వికారాబాద్‌కు వచ్చిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో తాను, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొంత సేపు చర్చించామని ఆయన చెప్పారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీకి పిలుస్తామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అన్నారని ఆయన చెప్పారు. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి ఢిల్లీకి పిలుస్తారా? లేక ఫోన్లో చర్చిస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుల ఆశావాహుల జాబితా ఇవ్వాల్సిందిగా రాహుల్, కెసి వేణుగోపాల్ అడగడంతో సామాజిక వర్గాల వారిగా 16 మంది పేర్ల జాబితా ఇచ్చామని ఆయన వివరించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఏ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జస్టిస్ పి. సుదర్శన్ రెడ్డికి నష్టపరిహారంగా ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నదా? అని ప్రశ్నించగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు తనకు రాజ్యసభ పదవి కావాలని అడగలేదని ఆయన స్పష్టం చేశారు.

మన తెలంగాణ 3 Mar 2026 8:50 pm

Buzz: Manchu Manoj in talks for NBK 111

NBK 111 is all set to roll from March 5th in Hyderabad in a grand manner. Nandamuri Balakrishna is preparing himself for the role while Gopichand Malineni has completed the entire pre-production work. Venkata Satish Kilaru, the producer of Ram Charan’s Peddi is the producer of this mass entertainer. As per the latest speculation, the […] The post Buzz: Manchu Manoj in talks for NBK 111 appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 8:47 pm

దుబాయ్‌లో చిక్కుకున్న 2 వేల మంది హైదరాబాదీయులు

 ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నగర వాసులను భయాందోళనల్లో నెట్టేస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయిన వారిలో సుమారు 2వేల మంది హైదరాబాదీయులే ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటు న్నాయి. దీంతో ఇక్కడ ఉంటున్న వారి కుటుంబీకులు ఆందోళన అంతా ఇంతా కాదు. అయితే, సోమవారం రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టును పునరుద్ధరించారు. భారత్‌కు వెళ్లే చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై విమానాలు టేకాఫ్ అయ్యాయి. హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పాసులు ఇచ్చినా ఫ్లైట్‌ను రద్దు చేసింది. ప్రయాణికులను తిరిగి హోటల్‌కు తరలిస్తున్నట్లు ఓ ప్రయాణికుడు వెల్లడించారు. దుబాయి పర్యాటకం ప్రత్యేక అనుభూతిని కల్పించనుండటంతో నగరానికి చెందిన చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి కన బరుస్తారు. గతేడాది శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 5,23,107 మంది ప్రయాణించినట్లు సమాచారం. ఇందులో 50--60శాతం మంది టూరి స్టులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతీ రోజు 5-6 విమానాలు నేరుగా వెళుతుండగా, 15 వరకు కనె క్టింగ్ విమానాలున్నాయి. రోజుకు సగటున 1400--1500 మంది వెళ్తుంటారు. నగరంలో దాదాపు 1801 ట్రావెల్ ఏజెన్సీలున్నాయి. ఇందు లో 123 పేరొందిన సంస్థలే ఉన్నాయి. గల్ఫ్‌లో యుద్ధం జరుగుతుండడంతో దుబాయికి వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. దుబాయితో పాటు ఇతర దేశాల ప్రయాణాలకు కూడా ఎవరూ ఇష్టపడడంలేదని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహ కులు చెబుతున్న మాటగా ఉంది. మార్చిలో ప్రయాణించేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న నగరవాసులు ఆందోళనకు లోనవు తున్నారు. యుద్ధ భయంతో అక్కడికి వెళ్లలేమని చెబుతూ డబ్బులు రీఫండ్ చేయాలని ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగాడుతున్నారు. దీంతో నిర్వాహకులు కొందరికి సర్దిచెబుతూ, వారు కోరిన విధంగా ఇతర తేదీల్లో ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. మరికొందరికి డబ్బులను రీఫండ్ చేస్తున్నారు. కాగా, డబ్బులు ఇవ్వలేని సంస్థలు వారికి మరికొన్ని ఇతర ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దేశాలు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పర్యాటకాన్ని సంద ర్శించేందుకు వీలు కల్పిస్తున్నారు. మొత్తంగా ఇరాన్--ఇజ్రాయెల్ నడుమ జరుగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జా తీయ పర్యాటకంపై భారీగా పడిందని పలువురు ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.

మన తెలంగాణ 3 Mar 2026 8:45 pm

విడాకులు ఇవ్వడంలేదని భార్యపై భర్త దాడి

భార్య తనకు విడాకులు ఇవ్వడంలేదనే కోపంతో కత్తితో దాడి చేసిన భర్తను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 14లోని నందినగర్‌లో నివాసం ఉంటున్న వడ్డెమాన్ నిర్మల, వడ్డెమాన్ అడివన్నకు 2009లో వివాహం అయింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అడివన్న, ఈ సంబంధాన్ని మూడేళ్ల నుంచి కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య విడాకులు ఇస్తే ఆ మహిళను వివాహం చేసుకుంటానని నిర్మలతో పలుమార్లు గొడవపడ్డాడు. గత నెల 18వ తేదీన నిర్మలతో గొడవపడిన అడివన్న ఆమెను విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో గాయపడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించడంతో ఆరోగ్యం బాగుపడి, ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. పెద్దలు సర్ది చెప్పడంతో నిర్మల, అడివన్న పై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనిని అలుసుగా తీసుకున్న అడివన్న రెండు రోజుల క్రితం మరోసారి మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిర్మలను దూషించడంతో పాటు కడుపులో తన్నాడు. అంతటితో ఆగకుండా కత్తితో బెదిరిస్తూ నిర్మలతో పాటు పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకుల కోసం తన భర్త తనపై కత్తితో దాడి చేశాడని, అతడివల్ల తనకు, తనపిల్లలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై అడివన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మన తెలంగాణ 3 Mar 2026 8:35 pm

కాలువలలో గుర్రపు డెక్క ఆకు తొలగింపు

కాలువలలో గుర్రపు డెక్క ఆకు తొలగింపు విజయవాడ,ఆంధ్ర ప్రభ: విజయవాడ నగరం లో

ప్రభ న్యూస్ 3 Mar 2026 8:33 pm

అస్తమించిన ప్రజాసూర్యుడు

గిడ్డకింద మాణిక్యం చరిత్రలో కొందరు తమ కాలానికి సాక్ష్యంగా మాత్రమే కాదు కాలాన్ని అధిగమించి ఒక విలువగా నిలుస్తారు. వారు ఉద్యమానికి నాయకులు మాత్రమే కాదు ఒక నిశ్శబ్ద తరాన్ని తట్టిలేపే దండోర. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు కామ్రేడ్ ఆర్.నల్లకన్ను. ఆయన జీవితం ఒక రాజకీయ ప్రస్థానమే కాదు. ఒక సిద్ధాంతం శరీరాన్ని ధరించి సామాజిక సమస్యల పై నడిచిన యాత్ర. స్వాతంత్రోద్యమ నాయకుడిగా, రైతు సమస్యలు, వివక్ష, అంటరానితనం వంటి సామాజిక అసమానతల పై […] The post అస్తమించిన ప్రజాసూర్యుడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 8:25 pm

సంపద సృష్టి నినాదమేనా…విధానంలోకి దిగుతారా?కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

నేటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే జనంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక వాక్యం వెల్లడిస్తుంటారు. “సంపద సృష్ష్టించడం నాకు తెలుసు, సంపద సృష్టిస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తాను” అని. అది ఒక నినాదంగా ఆయన వెల్లడిస్తుంటారు. ఆ నినాదాన్ని అమలుజరిపే విధానం మాత్రం వెల్లడించడం మరుస్తున్నారేమో అనిపిస్తూంది. రాష్ట్రాభివృద్ధిని కలలు గనే తపస్సులో ఫలసిద్ధి యింకా సూత్ర-బద్దమై ఆయనకు సానుకూల పడలేదేమోనన్న అనుమానము జనంలో తలెత్తుతూంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అప్పుల ఊబిలో తలమునకలై […] The post సంపద సృష్టి నినాదమేనా…విధానంలోకి దిగుతారా?కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 8:24 pm

రాష్ట్రంలో కల్తీ ప్రభుత్వం.. అరాచక, కల్తీ పాలన

రాష్ట్రంలో కల్తీ ప్రభుత్వం.. అరాచక, కల్తీ పాలన ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో

ప్రభ న్యూస్ 3 Mar 2026 8:24 pm

నడి వేసవి రాత్రులు

చింతపట్ల సుదర్శన్ దారికి అడ్డంగా మనుషుల గుంపు కనిపించింది. అది పెళ్లి ఊరేగింపో, చావు సాగనంపో, రోడ్డు షోనో, రాస్తారోకోనో అర్థం కాలేదు. ఏదో ఓ కారణంగా రోడ్లకి జనం అడ్డం పడటం మామూలే కదా! అంటూ మెయిన్ రోడ్డు వదిలి పక్కదారి పట్టింది డాంకీ. అలా ఓ సందులో నుంచి మరో దాన్లోకి, ఓ వీధిలోంచి మరో వీధిలోకి మర్లుతూ, తిర్గుతూ దారి తప్పింది. తను ఎన్నడూ చూడని చోట్లని వింతగా చూస్తూ నడుస్తున్న డాంకీ […] The post నడి వేసవి రాత్రులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Mar 2026 8:22 pm

Buchi Babu’s next Target is Prabhas

Uppena marked the directorial debut of Buchi Babu and the super success of the film made him bag an opportunity to direct Ram Charan in his second. The film titled Peddi is high on expectations and the film is doing record pre-release business. Peddi is slated for summer release and it is in the final […] The post Buchi Babu’s next Target is Prabhas appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 8:22 pm

నెమలి వేణుగోపాలస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా..

నెమలి వేణుగోపాలస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా.. గంపలగూడెం, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన

ప్రభ న్యూస్ 3 Mar 2026 8:12 pm

ఊట్కూర్ లో హోలీ వేళ ఆకతాయిల అల్లరి చేష్టలు

ఊట్కూర్ లో హోలీ వేళ ఆకతాయిల అల్లరి చేష్టలు డ్రైనేజీ నీరు బస్సులో

ప్రభ న్యూస్ 3 Mar 2026 8:06 pm

రాజముద్రతోనే సమస్యలకు చరమగీతం…

రాజముద్రతోనే సమస్యలకు చరమగీతం… పాస్ బుక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేపట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:52 pm

పశ్చిమాసియాలో డేటా సెంటర్లపై దాడి

అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య మొదలైన యుద్ధంలో డ్రోన్ దాడుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లోని రెండు అమెజాన్ డేటా సెంటర్లు, బహ్రెయిన్ లోని ఒక సెంటర్ లో కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. పశ్చిమాసియా అంతటా బ్యాంకింగ్ వంటి రంగాలలో క్లౌడ్ సేవలు, కంప్యూటింగ్ సౌకర్యాలకు అంతరాయం కలిగినట్లు టెక్నాలజీ, ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఆదివారంనాడుయూఏఇ లోని రెండు డేటా కేంద్రాలను డ్రోన్ లు ఢీ కొట్టాయని అమెజాన్ తెలిపింది. బహ్రెయిన్ లోని డేటా సెంటర్ సమీపంలో భారీ దాడి వల్ల దాని మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం జరిగింది. తక్షణమే మరమ్మతులు చేపట్టినా, నష్టం తీవ్రంగా ఉండడంతో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. డేటా సెంటర్ లే లక్ష్యమా? సాంకేతిక పరమైన అంతరాయాల వల్ల సోమవారం, మంగళవారం యుఏఇ స్టాక్ మార్కెట్ మూతపడింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేదా ఏడబ్ల్యూ ఎస్ అంతరాయల వల్ల విమాన సేవలపైనా, ప్రయాణికులపైన ప్రభావితం చూపాయి. దుబాయ్ , కువైట్ లోని విమానాశ్రయాలలో దాదాపు పదివేల మంది చిక్కుకుపోవడం ఈ స్థాయిని తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుతం కమ్యూనికేషన్లు, లాజిస్టిక్స్, సైనిక దళాల రవాణా, విస్తరణ, నిఘా సమాచారం సేకరణ, ఆయుధాల టార్గెట్, కాల్పుల వంటి కీలకమైన సైనిక చర్యలలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, లేదా ఇరానియన్ లలో ఏ డ్రోన్ లు విరుచుకుపడ్డా పూర్తిగా ఇంటర్ నెట్ పై ఆధారపడిన ప్రపంచంలో మౌలిక సదుపాయాలకు కీలకమైన కేంద్రాలు యుద్ధ వ్యూహాలలో భాగం అవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది.కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయంగా జరిగే యుద్ధాలలో సైనిక శిబిరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేవారు. ఆహారం, నీటి సరఫరా కేంద్రాలు, ఇంధన వనరులను తర్వాతి కాలంలో లక్ష్యంగా చేసుకునేవారు.పశ్చిమాసియాలో సాంకేతిక సంస్థలు, డేటా సెంటర్ల ను లక్ష్యంగా చేసుకోవడం భవిష్యత్ లో జరిగే యుద్ధాలకు సంకేతమా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మన తెలంగాణ 3 Mar 2026 7:38 pm

బ్లడ్‌మూన్‌ను చూశారా..

బ్లడ్‌మూన్‌ను చూశారా..

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:37 pm

కెసిఆర్ దూరదుష్టిలో తెలంగాణలో తెల్లకోటు విప్లవం: హరీష్ రావు

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరదుష్టితో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో వైట్ కోట్ విప్లవం సాకారమైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. దీని ద్వారా వైద్య విద్య అవకాశాలు విస్తరించి, ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు. ఉప్పల్ ఎంఎల్‌ఎ బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హరీష్ రావు నివాసంలో ఏడుగురు ఎంబిబిఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, బిఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు చెక్కులు అందజేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఇది కేవలం దానంగా కాకుండా, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని చెప్పారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తూ, విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి ,ప్రభుదాస్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 3 Mar 2026 7:32 pm

కోడిపందాల నిర్వాహకులు అరెస్టు

కోడిపందాల నిర్వాహకులు అరెస్టు తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: మండలంలోని గుంటూరు గ్రామ శివారులో

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:31 pm

మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన సినీనటి మంచు లక్ష్మి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మంత్రి సీతక్కను మంచు లక్ష్మి ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంత్రికి ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం తమ సంస్థ చేయూతగా నిలుస్తోందని మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. అనంతరం మంచు లక్ష్మిని మంత్రి సీతక్క అభినందించారు.

మన తెలంగాణ 3 Mar 2026 7:29 pm

Pawan|జంతు సంర‌క్ష‌ణ‌కు శ్రీ‌కారం

Pawan| జంతు సంర‌క్ష‌ణ‌కు శ్రీ‌కారం ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:25 pm

ఘనంగా వెంటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

ఘనంగా వెంటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ: హన్మకొండ… కరీంనగర్ ప్రదాన

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:22 pm

హోళీతో కొత్త ఆశలు నింపుకుందాం..

హోళీతో కొత్త ఆశలు నింపుకుందాం.. నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:17 pm

3mar2026 |షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం

3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం 3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం ఇరాన్ అణు

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:12 pm

అక్రమ ఇసుక తవ్వకాల ప్రచారం అవాస్తవం..

అక్రమ ఇసుక తవ్వకాల ప్రచారం అవాస్తవం.. మహాదేవపూర్,ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:11 pm

చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధి పంతులు చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.హోళీ పండగ అనంతరం స్నానం కోసం స్నేహితులతో కలిసి చెరువులోకి ఇద్దరు యువకులు దిగారు.లోతులోకి వెళ్లిన తర్వాత ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందారు. తోటి స్నేహితుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు వివరాలు అడగి తెలుసుకున్నారు. మృతులు సాగర్(17),అభిషేక్(17)పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకునిమృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మన తెలంగాణ 3 Mar 2026 7:11 pm

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:03 pm

Football|వార్ ఎఫెక్ట్‌..

Football| వార్ ఎఫెక్ట్‌.. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడులుఅమెరికాలో ఫిఫా ప్రపంచకప్‌-2026

ప్రభ న్యూస్ 3 Mar 2026 7:01 pm

హోర్ముజ్ జలసంధి వద్ద స్థంభించిన 706 ట్యాంకర్లు

పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధికి రెండు వైపుల దాదాపు 700 చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో చమురు ట్యాంకర్ల రాకపోకలు స్థంభించడం,చమురు రవాణా 86 శాతం నిలిచిపోవడంతో వివిధ దేశాలలో క్లిష్టపరిస్థితులు ఎదురవుతున్నాయి.హోర్ముజ్ వద్ద జలమార్గాన్ని అధికారికంగా మూసివేయలేదు కానీ, మూసివేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి యుద్ధవాతావరణం నెలకొనడంతో మార్చి 1న కేవలం మూడు ట్యాంకర్లు మాత్రమే హోర్ముజ్ ను దాటాయి. అంటే 2.8 మిలియన్ బారెల్స్ చమురు మాత్రమే సరఫరా చరిగింది. జలసంధివద్ద రోజువారీ సగటు చమురు రవాణా 19.8 మిలియన్ బ్యారెల్స్. కాగా దాదాపు 86 శాతం తగ్గిపోయింది. మార్చి 2న ప్రారంభంలో ఒ చిన్న ట్యాంకర్, ఓ చిన్న కార్గో షిప్ మాత్రమే ఈ ప్రధాన మార్గం నుంచి వెళ్లాయి. హోర్ముజ్ జలసంధి కి ఇరువైపులా దాదాపు 706 ట్యాంకర్లు కదలికలు లేక స్తంభించిపోయాయి. వాటిలో ఇరానియన్ ట్యాంకర్లు ఏవీ లేవు. జలసంధివద్ద 334 క్రూడ్ ఆయిల్ రవాణా వాహనాలు, 109 ఇతర ఉత్పత్తుల ట్యాంకర్లు, 263 శుభ్రమైన ఉత్పత్తులతో కూడిన నౌకలు, ఉన్నాయి. మరో 26 ట్యాంకర్లు గమ్యస్థానాలు ఏవో తెలియకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో కొట్టుమిట్లాడుతున్నాయి. మరో వంద నౌకలు గల్ఫ్ వద్ద పడిఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తప్పని నిరీక్షణ చమురు రవాణా స్థంభించడంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. బ్రెంట్ ముడి చమురు దాదాపు 10శాతం పెరిగి బ్యారెల్ కు 80 డాలర్లకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని తనూరా చమురు శుద్ధి కర్మాగారం, ఖతార్ లోని ఎల్‌ఎన్జి ప్లాంట్ పై దాడుల అనంతరం యురోపియన్ గ్యాస్ 40 శాతం కంటే ఎక్కువ పెరిగింది. దాడుల కారణంగా ప్లాంట్ల మూసివేతలు మొదలయ్యాయి. యుద్ధం మరి కొన్నాళ్లు కొనసాగితే, ట్యాంకర్ క్యూలు పెరుగుతాయి. చమురు రవాణా షెడ్యూల్ దెబ్బతింటుంది. గల్ఫ్ జలాల ద్వారా సాగే ట్యాంకర్ లకు యుద్ధ -ప్రమాద బీమా ఇప్పటికే మరింత కఠినతరం అయింది. హోర్ముజ్ ను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్న ఓడలకు సరుకు రవాణా చార్జీలు , ప్రీమియంలు పెరుగుతున్నాయి. ఈ ఖర్చు పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత హెచ్చే ప్రమాదం ఉంది. యుద్ధం మొదలై నాలుగు రోజులు కాలేదు. ఇక ఇది కొన్ని వారాలు సాగితే , పరిస్థితి మరీ దిగజారుతుంది. ఆసియా, యూరప్ లోని చమురు శుద్ధి కర్మాగారాలు, అమెరికా గల్ఫ్, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా నుంచి ప్రత్యామ్నాయంగా చమురు సరఫరా కోసం యత్నిస్తున్నాయి. అత్యవసరచర్యలు పరిశీలిస్తున్న భారత్ గల్ఫ్ నుంచి సరఫరా అయ్యే చమురుపై ఎక్కువ ఆధారపడిన భారతదేశం, చైనా తక్షణ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో చమురు రేషన్ మొదలవుతుందా అని ఆందోళన చెందుతున్నారు. భారతదేశం లోని అధికారులు అత్యవసర చర్యలను పరిశీలిస్తున్నారు. దేశం లో అవసరాలను తీర్చేందుకు గల మార్గాలు, పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నియంత్రణ, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకునే అంశం తో పాటు, క్లిష్టపరిస్థితి కొనసాగితే ఎల్ పిజి రేషన్ వంటి చర్యలు చేపట్టవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నదని, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతతో పాటు, తీసుకోవల్సిన అత్యవసర చర్యలను తీసుకుంటామని ఇంధన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. భారతదేశంలో శుద్ధి అయిన ఇంధనాలలో ఎక్కువ శాతాన్ని ఎగుమతి చేస్తుంది. పెట్రోల్ లో మూడో వంతు, డీజిల్ ఉత్పత్తిలో 25 శాతం ఎగుమతి చేస్తుంది. ఎల్ పీజి పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంది. భారతదేశం ఎల్ పిజి అవసరాలలో 80-85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఎక్కువ గల్ఫ్ ఉత్పత్తి దారుల నుంచి హోర్ముజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. అక్కడి నుంచి సరఫరా ఆగిపోతే, ప్రస్తుతం ఉన్న నిల్వలు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కవర్ చేయడం కష్టమే నని సూచిస్తున్నాయి.

మన తెలంగాణ 3 Mar 2026 6:57 pm

మాజీ ‘మావో’లు మా పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తాం: మహేష్ కుమార్ గౌడ్

“మాజీ ‘మావోయిస్టులు’ మా పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తాం..” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పది రోజుల పాటు వికారాబాద్‌లో జరిగిన తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంతో బిజి-బిజీగా గడిపిన మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ శిక్షణా శిబిరం సంతృప్తికరంగా జరిగిందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతాం అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఈ విషయంలో తాము ఎవరినీ అడగలేదని, వారూ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారని ఆయన చెప్పారు. ప్రజల కోసం పోరాడిన వారిపై తమకు గౌరవం ఉందన్నారు. తామైనా, మావోయిస్టులైనా పేద ప్రజల అభ్యున్నతి కోసమే పోరాటం చేస్తున్నామని ఆయన వివరించారు.ఆపరేషన్ కగార్‌ను తాము వ్యతిరేకించామని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ మావోయిస్టులతో చర్చలకు ఎందుకు అంగీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌పై మండిపాటు రాజ్యసభ స్థానాల ఎంపిక గురించి ప్రశ్నించగా, బుధవారం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌కు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీ కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించిందే తప్ప తెలంగాణ కోసం పని చేసిన వారిలో ఒక్కరికైనా రాజ్యసభ అవకాశం ఇచ్చిందా? అని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నించారు. త్వరలో కొన్ని నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించామని ఆయన చెప్పారు. పలు కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా, వెలుగుమట్ల గ్రామ ప్రజల విషయంలో పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెబుతారని ఆయన చెప్పారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 3 Mar 2026 6:53 pm

బీహార్ నుంచి రాజ్యసభకు బిజెపి అధ్యక్షుడు..

న్యూఢిల్లీ/పాట్నా: ఈనెల16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు బిజెపి తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను మంగళవారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పోటీ చేయనున్నారు. అదే రాష్ట్రం నుంచి శివేష్ కుమార్, -అస్సాం నుంచి తారేష్ గోవాలా, జోగెన్ మోహన్, -ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీవర్మ, -హర్యానా నుంచి సంజయ్ భాటియా, -ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్‌మోహన్ సామల్, సుజీత్ కుమార్, త్వరలో ఎన్నికలు జరగనున్న -పశ్చిమబెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను అభ్యర్థులుగా ప్రకటించారు. సంజయ్ భాటియా 2019 నుంచి 2024 వరకూ కర్నాల్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాల్ నుంచి రికార్డు స్థాయిలో 6,56,142 ఓట్ల అధిక్యంతో గెలిచారు. జోగెన్ మోహన్ ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో రవాణా సహా పలు శాఖలు నిర్వహిస్తున్నారు. తారేష్ గోవాలా అసోంలోని దిబ్రూగఢ్ జిల్లా దులియాజన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. శివేష్ కుమార్ ఇంతకుముందు బీహార్‌లోని అజియోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. రాహుల్ సిన్హా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం మాజీ అధ్యక్షుడుగా ఉన్నారు. లక్ష్మీ వర్మ ఛత్తీస్‌గఢ్ బీజేపీలో సీనియర్ మహిళా నేతగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. సుజీత్ కుమార్ గతంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) సభ్యుడిగా ఉండేవారు. అయితే 2024లో ఆ పార్టీకి, రాజ్యసభ సీటుకు ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో అదే స్థానానికి ఆయన పోటీ చేసి తిరిగి ఎన్నికకావడం విశేషం. 

మన తెలంగాణ 3 Mar 2026 6:50 pm

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి..

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి.. విజయవాడ, ఆంధ్రప్రభ : వీరులపాడు మండలం,

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:43 pm

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ లో 160 మంది స్కూలు పిల్లల మృతి

టెహ్రాన్ : దక్షిణ ఇరాన్ లో మినాబ్ నగరంలోని భూమి 165 చిన్నారుల సమాధుల తవ్వకాలకు సిద్ధమవుతోంది. ఇందులో 160 కి పైగా విద్యార్థినుల మృతదేహాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో వేగంగా యుద్ధం విస్తరిస్తున్న సమయంలో శనివారం అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రాథమిక పాఠశాల బలైపోవడం తీరని విషాదం. ఈ సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌అరాగ్చీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాంబు దాడులకు చిన్నారుల మృతదేహాలు ముక్కలుముక్కలుగా చిందరవందరయ్యాయన్నారు. ప్రజలకు భద్రత కల్పిస్తానని, అందర్నీ రక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన “వాగ్దానం” అసలు స్వరూపం ఇదని అనాగ్చీ ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు. గాజా నుంచి మినాబ్ వరకు అమాయకుల రక్తాన్ని ట్రంప్ కళ్లారా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలపై ఆస్పత్రులపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం యుద్ధనేరమని భగ్గుమన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఈ సామూహిక ఖననం మంగళవారం నిర్వహించినప్పుడు మరోవైపు టెలివిజన్ దృశ్యాల్లో వేలాది మంది విషాదంతో “ ఇది అమెరికాకే మరణం ” అని నినదించడం గమనార్హం. మృతుల్లో ఎటేనా అనే బాలిక తల్లి అక్కడి జనం ముందు నిల్చొని ముద్రించిన మృతుల చిత్రాలను పట్టుకుని భావోద్వేగం చెందింది. మృతుల ముఖాలు “అమెరికా నేరాలకు సాక్షంగా కనిపించే ఒక డాక్యుమెంట్‌” అని గట్టిగా అరిచారు. “ఈ చిన్నారులు భగవంతుని మార్గంలో చనిపోయారు.” అని బాధను వ్యక్తం చేశారు. అక్కడి జనం అంతా “ఇది అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు” “ లొంగేది లేదు ” అని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, ఈ విషాద సంఘటనకు అమెరికా అధికారులు తమంత తాము వేగంగా దూరమయ్యారు. అమెరికా రక్షణ మంత్రి మార్కో రుబియో విలేకరులతో మాట్లాడుతూ డిపార్టుమెంట్ ఆప్ వార్ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తోందని, ఉద్దేశపూర్వకంగా ఒక పాఠశాలను అమెరికా టార్గెట్ చేసుకోలేదని చెప్పుకొచ్చారు. దీనికి ఇజ్రాయెల్ అధికారులు విరుద్ధ సమాధానాలు చెప్పారు. మీనాబ్‌పై దాడుల గురించి అంతగా తెలియదని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి మొదట్లో చెప్పినప్పటికీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్( ఐఆర్‌జిసి ) ఈ దాడికి బాధ్యులై ఉండవచ్చని ఇజ్రాయెల్ పేర్కొంది. 

మన తెలంగాణ 3 Mar 2026 6:34 pm

జగన్ ను కలిసిన మల్లు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు

తెలుగు పోస్ట్ 3 Mar 2026 6:32 pm

కర్నూలు నగరంలో అగ్నిప్రమాదం

కర్నూలు నగరంలో అగ్నిప్రమాదం కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు నగర శివారులోని భారీ

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:32 pm

Chandrababu : ఈ నెల 9న నంద్యాల జిల్లాకు చంద్రబాబు

ఈ నెల 9న నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదశే్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 3 Mar 2026 6:26 pm

భారత్-కెనడా మధ్య యురేనియం ఒప్పందం

న్యూఢిల్లీ : భారత్‌-కెనడా మధ్య సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది. ఈమేరకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి నిరంతర సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లపై కలిసి పనిచేయనున్నామని మోడీ తెలిపారు. అలాగే 2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొలిక్కి రావాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్టు కార్నీ వెల్లడించారు. స్వామి వివేకానంద సూక్తి ప్రస్తావన 1893లో స్వామి వివేకానంద కెనడాలో పర్యటించిన విషయాన్ని మార్క్ కార్నీ గుర్తు చేసుకున్నారు. “లేవండి, మేల్కొనండి.. లక్షం చేరేవరకు ఆగకండి”’ అని వివేకానంద సూక్తిని ప్రస్తావించారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు. 

మన తెలంగాణ 3 Mar 2026 6:25 pm

Photos : Manchu Manoj & Bhuma Mounika Reddy Celebrate 3 Years of Togetherness

The post Photos : Manchu Manoj & Bhuma Mounika Reddy Celebrate 3 Years of Togetherness appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 6:14 pm

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం.. సీఎంకి ఆహ్వానం

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం.. సీఎంకి ఆహ్వానం ఇంద్రకీలాద్రి ,ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:12 pm

విజయవాడ ప్రజల దౌర్భాగ్యం..

విజయవాడ ప్రజల దౌర్భాగ్యం.. నెమలి వేణు గోపాల్ స్వామి ఉత్సవాల్లో కేశినేని శివనాథ్

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:06 pm

Power Star |ఉస్తాద్ కథ వెనకున్న అసలు నిజం ఇదే..

Power Star | ఉస్తాద్ కథ వెనకున్న అసలు నిజం ఇదే.. Power

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:05 pm

అక్రమ నిల్వలపై దాడి..

అక్రమ నిల్వలపై దాడి.. సుమారు 15 టన్నుల బియ్యం స్వాధీనం..ఎన్టీఆర్ జిల్లా జాయింట్

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:03 pm

vijay, rashmika|హైద‌రాబాద్‌లో విరోష్ రిసెప్ష‌న్‌

vijay, rashmika| హైద‌రాబాద్‌లో విరోష్ రిసెప్ష‌న్‌ మార్చి 4న తాజ్ కృష్ణా హోటల్‌లో

ప్రభ న్యూస్ 3 Mar 2026 6:00 pm

హోలీ పండగ వేళ విషాదం

నరసరావుపేట మండలం బసికాపురంలో హొలీ వేడుకల్లో విషాదం నెలకొంది.

తెలుగు పోస్ట్ 3 Mar 2026 5:59 pm

Iran |నిన్న‌నే బాధ్య‌త‌లు చేప‌ట్టారు..

Iran | నిన్న‌నే బాధ్య‌త‌లు చేప‌ట్టారు.. Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 3 Mar 2026 5:56 pm

Boyapati |తెలుగు హీరోతోనే మూవీ చేస్తున్నాడా..?

Boyapati | తెలుగు హీరోతోనే మూవీ చేస్తున్నాడా..? బోయపాటి నెక్ట్స్ మూవీ ఎవరిలో?పాన్

ప్రభ న్యూస్ 3 Mar 2026 5:51 pm

Varanasi: First Indian Film to be Shot in Antarctica

Mahesh Babu’s Varanasi is set to achieve a historic milestone as the film prepares for its next schedule in Antarctica. The lead actress of the movie Priyanka Chopra, revealed the update during a recent interaction with Mahesh Babu, confirming that the team has chosen real locations over visual effects. Directed by SS Rajamouli, the project […] The post Varanasi: First Indian Film to be Shot in Antarctica appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 5:50 pm

తిరుపతి లడ్డూ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మాతలు వారే!

తిరుపతి లడ్డూ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మాతలు వారే! కూటమి

ప్రభ న్యూస్ 3 Mar 2026 5:49 pm

Peddi on Track for April 30 Release

Rumours are all around about the runtime of Peddi. The team confirm that the final runtime has not yet been locked. The first half of the film is complete, while the second half is currently being shot and edited at a brisk pace. Music director A. R. Rahman is said to be wrapping up the […] The post Peddi on Track for April 30 Release appeared first on Telugu360 .

తెలుగు 360 3 Mar 2026 5:49 pm