రూ.లక్షకోట్లతో ఆర్థిక స్థిరీకరణ నిధి: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడానికి వీలుగా రూ.1 లక్షకోట్లతో ‘ ఆర్థిక స్థిరీకరణ నిధి ’ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అనూహ్య పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆమె వివరించారు. లోక్సభలో రెండో విడత అనుబంధ పద్దులపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. రెండో విడత అనుబంధ పద్దులకు సంబంధించిన డిమాండ్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.81 లక్షల కోట్లను ఖర్చుచేయడానికి ప్రభుత్వం లోక్సభ అనుమతి కోరిందని, అలాగే అదనంగా మరో రూ.80 వేల కోట్ల వరకు ఈ ఆర్థికసంవత్సరం బడ్జెట్లో ఉన్నట్టు చెప్పారు. ఈ నిధి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ లక్షాలు దెబ్బతినకుండా చూస్తుంది. 202526 ఆర్థిక సంవత్సరానికి రూ.2.81 లక్షల కోట్ల అనుబంధ బడ్జెట్లో ఈ నిధి భాగం.
టెహరాన్: ఇరాన్లోని టెహరాన్లో శుక్రవారం అత్యంత అరుదైన చూడముచ్చటైన పెళ్లి తంతు వేడుక జరిగింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల , భీకర పేలుళ్ల చప్పుళ్ల మధ్య ఓ జంట పెళ్లిచేసుకుంది. ఓ సైనిక స్థావరంలో మందుగుండు సామాగ్రి పెట్టెపై కూర్చుని ఉన్న నవ వధూవరులు చేతుల్లో తమ దేశ సైన్యానికి చెందిన రైఫిల్ష్ పట్టుకున్నారు. వారి పక్కన భారీ మెషిన్ గన్ అమర్చి ఉంచారు. చుట్టూ సాయుధులైన మద్దతుదార్లు నిలచి ఉండగా ఈ ఇద్దరూ పెళ్లినాటి ప్రమాణాలకు దిగారు. యుద్ధాల సమయంలోనూ తమ దేశ ప్రజలు చెక్కుచెదరకుండా ఉంటారని, శత్రువును ధైర్యంగా ఎదుర్కొంటారని, తమ జనజీవితం విచ్ఛిన్నం కాకుండా సాగుతుందని చెప్పడానికి ఈ వినూత్న పెళ్లితంతు అసాధారణ రీతిలో జరిగింది. అమెరికా, మిత్రదేశాల యుద్ధ నేరాలకు ఈ జంట తగు విధంగా సవాలు విసరింది. ఇరానీయన్ల ఉక్కుసంకల్పాన్ని చాటింది. ఈ ఘట్టంలో ఎంతో ధైర్యంగా నిలిచిన పెళ్లి కూతురు నిజంగా వీరనారి అని ఓ ఇరానియన్ తన స్పందన వెలువరించారు. వెనుక విన్పించే బాంబుల మోతల మధ్య తాము వీరిని ఆశీర్వదించామని తెలిపారు.
హర్మూజ్ మీదుగా బారత్కు 2 వంటగ్యాసు ట్యాంకర్ నౌకలు
హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా భారతదేశానికి రెండు ఎల్పిజి ట్యాంకర్లు బయలుదేరి రానున్నాయి. ఈ మేరకు ఈ భారతీయ నౌకలకు ఇరాన్ అధికారికంగా అనుమతిని వెలువరించింది. ఈ జలసంధి మార్గం గుండా భారతీయ చమురు నౌకల రవాణాకు వీలు కల్పించినట్లు ఇరాన్ రాయబారి మెహమ్మద్ ఫతాలీ శుక్రవారం ప్రకటించారు. భారత్కు ఈ భరోసా కల్పించిన కొద్ది గంటల్లోనే ఈ రెండు ఎల్పిజి నౌకల కదలికలకు ఇరాన్ నుంచి అనుమతి రావడం కీలక పరిణామం అయింది. దీనితో ఈ మార్గం నుంచి సంబంధిత వంటగ్యాసు ట్యాంకర్ల నౌకలు వెంటనే బయలుదేరనున్నాయి. బారతదేశంలో నెలకొంటున్న వంటగ్యాసు కొరత కొంత మేర తగ్గేందుకు ఈ నౌకల రాక అత్యంత ఉపయుక్తం కానుంది. ఈ మార్గంలో భారత్కు ఈ నౌకలు ఎటువంటి చిక్కులు లేకుండా ఇరాన్ తగు చర్యలను చేపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ట్యాంకర్ నౌకలలో ఏ స్థాయిలో సిలిండర్లు ఉన్నాయనేది వెల్లడికాలేదు.
திமுக மாநாட்டில் உதயநிதியை புறக்கணித்தாரா அமைச்சர் கே.என்.நேரு?
திமுக மாநாட்டில் உதயநிதி அமைச்சர் கே.என்.நேரு புறக்கணித்ததாக தவறான தகவலுடன் வீடியோ வைரலாகி வருகிறது
ఒమన్ లో డ్రోన్ దాడి..ఇద్దరు భారతీయులు మృతి
పశ్చిమాసియాలో ఇరాన్ - అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ఒమన్లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.సోహార్ నగరంలోని అల్-అవాహి పారిశ్రామిక ప్రాంతం. మస్కట్ నుండి ఇది సుమారు 200 కి.మీ దూరంలో ఉంది.మరణించిన ఇద్దరూ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ కార్మికులు.ఈ దాడిలో మొత్తం 11 మంది గాయపడగా వారిలో 10 మంది భారతీయులే.ఒమన్ రక్షణ వ్యవస్థలు రెండు డ్రోన్లను కూల్చివేసినప్పటికీ ఒక డ్రోన్ శిథిలాలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
కోల్కతా టీమ్లోకి జింబాబ్వే ఫాస్ట్ బౌలర్..
కోల్కతా: త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2026 కోసం కోల్కతా నైట్రైడర్స్ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానిని జట్టులోకి తీసుకొంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ స్థానంలో మరో స్పీడ్స్టర్ ముజరబానికి టీమ్లో చోటు కల్పించింది. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్లో ముజరబాని అసాధారణ బౌలింగ్తో అదరగొట్టాడు. ఆరు మ్యాచుల్లోనే 13 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో అతన్ని జట్టులోకి తీసుకనేందుకు కోల్కతా ఆసక్తి చూపించింది. ఆ జట్టు క్రికెట్ బోర్డుతో మాట్లాడి ముజరబానిని జట్టులో చోటు కల్పించింది. కొంత కాలంగా ముజరబాని అద్భుత బౌలింగ్తో అంతర్జాతీయ క్రికెట్లో పెను ప్రకంపనలు సృష్టించింది. తన మార్క్ బౌలింగ్తో చెలరేగుతూ వికెట్ల పంట పండిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ జింబాబ్వేకు కీలక బౌలర్గా మారాడు. స్వల్ప వ్యవధిలోనే 90కి పైగా అంతర్జాతీయ వికెట్లను పడగొట్టి ఔరా అనిపించాడు. తాజాగా ఐపిఎల్లోనూ చోటు దక్కించుకున్నాడు. ముస్తఫిజుర్ స్థానంలో కోల్కతా అతన్ని తీసుకుంది. త్వరలోనే ముజరబాని కోల్కతా జట్టులోచేరనున్నాడు. ఈ విషయాన్ని నైట్రైడర్స్ యాజమాన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయండి –నాగబాబు
విశాలాంధ్ర – భోగాపురం : నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శాసనసభ్యులు లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన కృషి […] The post నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయండి – నాగబాబు appeared first on Visalaandhra .
మహిళా సాదికారతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మహిళా సాదికారతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఊర్కొండ, ఆంధ్రప్రభ : మహిళా
వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు
విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి […] The post వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు appeared first on Visalaandhra .
‘ది ప్యారడైజ్’ కోసం భారీ సెట్లు..
‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ఆయా షేర్ పాట కోసం 2.5 ఎకరాల భారీ సెట్స్లో వందల ఇళ్లు,100 ట్యాంకర్లతో మురికివాడ సామ్రాజ్యాన్ని నిర్మించారు ‘ది ప్యారడైజ్’ మేకర్స్. అత్యంత ఆకట్టుకునే సెటప్లలో ఒకటి హీరో ఇల్లు (కమాన్ సెట్). ఈ నిర్మాణం వెడల్పు 60 అడుగులు, ఎత్తు 45 అడుగులు, లోతు 25 అడుగులతో నిర్మించబడింది. మొదట ఈ సెట్ను 30 అడుగుల వెడల్పుతో నిర్మించగా, తర్వాత ఇరువైపులా 15 అడుగుల చొప్పున విస్తరించి మొత్తం వెడల్పును 60 అడుగులకు పెంచారు. దాదాపు 25 మంది కార్మికులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సెట్ చుట్టుపక్కల వాతావరణంలో సహజంగా కలిసిపోయేలా ప్రత్యేక ఏజింగ్ టెక్నిక్స్ ఉపయోగించి దాన్ని మరింత సహజంగా కనిపించేలా తీర్చిదిద్దారు. ఇక వాటర్ బాడీ విలేజ్ సెట్ మరో హైలెట్. ఇది 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో డమ్మీ నిర్మాణాలు కాకుండా పూర్తిగా నిర్మించిన 60 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి ఈ గ్రామాన్ని నిర్మించారు. ఒకేసారి సుమారు 500 మంది ఉండేలా ఈ గ్రామాన్ని డిజైన్ చేశారు. వాటర్ బాడీ కోసం 100 ట్యాంకర్ల నీటిని తీసుకువచ్చి ఏడు రోజుల పాటు నింపారు. అదనంగా నీటిని నిల్వ ఉంచేందుకు 20 అడుగులు ప్లస్ 20 అడుగుల పరిమాణంతో, 20 అడుగుల లోతు ఉన్న ఒక చెరువును కూడా నిర్మించారు. నిర్మాణంలో భాగంగా మరో భారీ డంప్ యార్డ్ సెట్ కూడా నిర్మించారు. ఇది 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో రూపొందించబడింది. దాదాపు 25 మంది సభ్యులతో కూడిన బృందం 30 రోజుల పాటు శ్రమించి ఈ సెట్ను నిర్మించింది. నిజమైన డంప్ యార్డ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సహజమైన, నివసిస్తున్నట్లు అనిపించే లుక్ వచ్చేలా దీనిని డిజైన్ చేశారు.
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు కర్నూల్, ఆంధ్రప్రభ :
ఇరాన్ ప్రతీకారం.. అమెరికా మిత్రదేశాలకు ఆర్థిక దిగ్బంధం
జలమార్గంలో ఇరాన్ మరో టెర్రర్ అత్యంత కీలక బాబ్ జలసంధి మూసివేత ఇక గల్ఫ్ దేశ నౌకలు చుట్టు తిరిగి పోవల్సిందే టెహరాన్: పర్షియా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ మరో తీవ్ర చర్యకు దిగింది. మరో అత్యంత కీలకమైన సముద్ర జల నౌకారవాణా మార్గం బాబ్ ఎల్ మందెబ్ జలసంధిని కూడా మూసివేస్తామని ఇరాన్ సంకేతాలు వెలువరించింది. అమెరికా, మిత్రదేశాలపై తమ ప్రతీకార చర్యలలో భాగంగా తాము సాగిస్తున్న సముద్ర జలాల పోరు క్రమంలో ఈ విస్తారిత చర్యకు దిగుతామని ఇరాన్ సీనియర్ సైనికాధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. తమ దేశంపై దాడులతో అమెరికా పెద్ద తప్పు చేసింది. ఇందుకు మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పుడు ఏకకాలంలో రెండు కీలక జలమార్గాలలో నౌకారవాణా నిలిచిపోతుంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఇంధన తీవ్ర సంక్షోభం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిలోని పరిస్థితిని ఇప్పుడు బాబ్ ఎల్ జలసందిలోనూ చూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతం కూడా ఇక ప్రస్తుత యుద్ధం పరిధిలోకి వస్తుంది. ఇరాన్ వద్ద శత్రువును దెబ్బతీసే మరెన్నో ఆయుధాలు ఉండనే ఉన్నాయి. పలు వ్యూహాత్మక చర్యలతో అమెరికా, ఇజ్రాయెల్లను దెబ్బతినేలా చేస్తామని ఇరాన్ ప్రతినిధి హెచ్చరించారు. ఇప్పుడు తాము ప్రకటించిన మార్గాలలో అమెరికా లేదా ఇజ్రాయెల్ కొన్ని నిర్ణీత దేశాలు లీటర్ చమురును కూడా తీసుకువెళ్లలేవని ఇరాన్ ప్రతినిధి తెలిపారు. తమ మిత్రదేశాలైన గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాల నౌకలకు కూడా తమ హెచ్చరిక వర్తిస్తుందని ప్రకటించారు. బాబ్ జలసంధి 26 కిలో మీటర్ల వెడల్పు ఉండే జలమార్గం ఎర్రసముద్రానికి దారితీసే ఈ మార్గం యెమెన్ , జిబౌటిలను కలుపుతుంది. గల్ఫ్ చమురు ఉత్పత్తి దేశాలకు ఈ మార్గం అత్యంత ఆయువుపట్టు అయిన మార్గంగా ఉంది. ఇది కూడా ఇరాన్ ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతంలోని హౌతి శక్తులతో కలిసి ఇరాన్ ఇక్కడ తన ఆధిపత్యం చాటుకొంటోంది. ప్రత్యేకించి పర్షియన్ గల్ఫ్ నుంచి యూరప్ దేశాలకు అతి తక్కువ దూరం మార్గం ఈ జలసంధి కావడం, సూయజ్ కెనాల్కు కూడా మార్గం ఉండటంతో ఇక్కడ ప్రయాణం నిలిచిపోతే గల్ఫ్, యూరప్ దేశాలకు చిక్కులు ఏర్పడుతాయి. గమ్యం చేరుకోవాలంటే నౌకలు చుట్టుతిరిగి కెప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు రెండు వారాలకు పైగా క్లిష్ట ప్రయాణం దీనితో పాటు ప్రతి ప్రయాణానికి 1 మిలియన్ డాలర్ల వరకూ అదనపు వ్యయ భారం పడుతుంది.
కల్తీ అల్లంవెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై దాడి
కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 1800 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు కిలోల గమ్ పౌడర్, రెండు కిలోల టైటానియం డై ఆక్సైడ్, సింథటిక్ ఫుడ్ కలర్ (లెమన్ ఎల్లో), ఏడు ప్యాకింగ్ మెషీన్లు, మూడు గ్రైండింగ్ మెషీన్లు, రెండు వెయింగ్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...బహదూర్పురాకు చెందిన అబ్దుల్ అలీం శాస్త్రిపురంలోని బాబా కాంటాలో స్టాండర్డ్ ఫుడ్ ప్రొడక్ట్, అబిడ్స్కు చెందిన జసాని దిల్దార్ అలీ ఉడంగడ్డ రైల్వే ట్రాక్ సమీపంలో అల్లంవెల్లుల్లి తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా నాసిరకం అల్లం, వెల్లుల్లిని సేకరించి, వాటికి ఉప్పు, టైటానియం డై ఆక్సైడ్ వంటి రసాయనాలు, గమ్ పౌడర్ను కలిపి అల్లంవెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారు. పేస్టు చిక్కగా ఉండటానికి, రంగు కోసం ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారు. దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు. మరో కేసులో పాడైపోయిన డ్రైఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు, ఫుడ్ అడాల్టరేషన్ టీం, బహదూర్పుర పోలీసులు అరెస్టు చేశారు. 30 కార్టన్ బాక్స్ల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్కు చెందిన అసవా మనీష్ హైదరాబాద్లోని చార్మినార్, చేలాపురా ప్రాంతంలో ‘జెమ్ ఫుడ్స్ పేరుతో ఒక గోడౌన్ను నిర్వహిస్తున్నాడు. నిందితుడు కావాలనే పాడైపోయిన, బూజు పట్టిన, దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్ను సేకరించి, వాటిని తినడానికి యోగ్యమైన నాణ్యమైన డ్రై ఫ్రూట్స్గా చెప్పి విక్రయిస్తున్నాడు. ఇన్స్స్పెక్టర్ డి. బిక్షపతి, స్పెషల్ క్రైం టీమ్ సిబ్బంది, ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్పురా పోలీసులు దాడి చేశారు.
అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్ల రవాణా..
అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్ల రవాణా.. అక్రమంగా తరలిస్తున్న 15 కమర్షియల్ సిలిండర్లు
ఐపిఎల్పై గల్ఫ్ యుద్ధం ప్రభావం!
ముంబై: త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 226పై గల్ఫ్ యుద్ధం ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గల్ఫ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుఎఇతో సహా పశ్చిమాసియాలోని పలు దేశాలపై ఇరాన్ వైమానిక దాడులతో విరుచు పడుతోంది. దీంతో దుబాయితో సహా రియాద్, దోహా, మస్కత్, కువైట్ తదితర నగరాల్లో పరిస్థితులు చేతులు దాటాయి. దీంతో ఈ నగరాలలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసి వేశారు. దీంతో దుబాయి తదితర ఎయిర్ పోర్ట్ల నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగోంది. ఇటీవల భారత్లో జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత స్వదేశానికి వెళ్లేందుకు వెస్టిండీస్, సౌతాఫ్రికా, జింబాబ్వే, ఇంగ్లండ్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొక తప్పలేదు. రోజుల తరబడి దుబాయిలోనే ఉండి పోవాల్సి వచ్చింది. కాగా, మరికొన్ని రోజుల్లోనే ఐపిఎల్ ప్రారంభం కావాల్సి ఉన్న సమయంలో గల్ఫ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నిర్వాహకులను కలవరానికి గురి చేస్తున్నాయి. విమానాల రాక పోకలపై అనిశ్చితి వాతావరణం నెలకొన్న సమయంలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు భారత్కు రావడం క్లిష్టంగా మారింది. టోర్నీప్రారంభానికి ముందు వీరి భారత్కు చేరుకుంటారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. దీనికి తోడు గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భారత్లో తీవ్ర ఇంధన సమస్య నెలకొంది. పలు నగరాల్లో ఇప్పటికే హోటళ్లు మూత పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఐపిఎల్లో పాల్గొనే క్రికెటర్లకు సౌకర్యాలు కల్పించడం నిర్వాహకులకు ఇబ్బందిగామారింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఐపిఎల్ సజావుగా సాగడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. కాగా, భారత క్రికెట్ బోర్డు మాత్రం ఐపిఎల్ ప్రారంభానికి ముందు యుద్ధం ఆగిపోతుందనే నమ్మకంతో ఉంది. త్వరలోనే పరిస్థితులు మాములుగా మారిపోతాయని, మెగా టోర్నీ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే నమ్మకంతో బిసిసిఐ పెద్దలు ఉన్నారు.
The post పండగలా అన్నదాత సుఖీభవ appeared first on Visalaandhra .
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూ రు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోలేమని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని అంశా లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తాము సిబిఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని కోర్టు ఈ సంద ర్భంగా గుర్తు చేసిం ది. ఏదైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే నేరుగా సిబిఐ అధికారులకే తెలియజేయాలని పిటిషనర్కు సూచించింది. గతంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై సిబిఐ ఎటువంటి విచారణ జరపలేదని పిటిషనర్ పేర్కొనగా దర్యాప్తు సంస్థ తన పని తాను చేస్తోం దని ధర్మాసనం అభిప్రా యపడింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించాయి. ఈ అంశంపై కొందరు రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఇప్పటికే ఈ లడ్డూ వివాదంపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యా ప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని సిజెఐ ధర్మాసనం వెల్లడించింది. సిట్ విచారణ నివేదిక అంశాల పరిశీలన తరువాత తదుపరి నిర్ణయాలు ఉంటాయని కోర్టు తెలిపింది. ఈ విషయంపై ఎపి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి సిట్ నివేదికతో పాటు లడ్డూ వివాదంపై ప్రభుత్వా నికి సమగ్ర నివేదిక అందిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇలాంటి పిటిషన్లను విచారించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
Flex Banner Sparks Fresh Political Tension in Pithapuram
Political tensions have resurfaced in the Pithapuram constituency of Andhra Pradesh after an incident at a municipal training programme triggered controversy. The issue occurred during a sanitation workers’ training session organised by municipal authorities. TDP leader and constituency in-charge SVSN Varma attended the event but walked out midway after expressing strong displeasure over the flex […] The post Flex Banner Sparks Fresh Political Tension in Pithapuram appeared first on Telugu360 .
ఫుట్బాల్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిన 25ఏళ్ల ప్లేయర్..
చండీగఢ్: పంజాబ్కు చెందిన యువ ఫుట్బాల్ అటగాడు రవీందర్ సింగ్ (25) అకాల మరణం చెందాడు. ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్)లో నాంధారి క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీందర్ స్థానికంగా ఓ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ మైదానంలోనే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గుండె నొప్పి రావడంతో గ్రౌండ్లోనే కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. రవీందర్ ను పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని ప్రకటించారు. కాగా, రవీందర్కు నివాళులు అర్పించేందుకు ఐఎఫ్ఎల్లో ఆడే ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లు అతని స్వగ్రామం నవాన్షహ్రకు చేరుకున్నారు. కాగా, రవీందర్ మృతితో భారత ఫుట్బాల్లో విషాదం నెలకొంది.
ఇరాన్ ఎంబసీకి 45 ఇరాన్ సైనికుల మృతదేహాల అప్పగింత
కొలంబో: శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై అమెరికా సబ్మెరైన్ చేసిన దాడిలో మృతులైన ఇరాన్ సైనికులకు సంబంధించి 45 మృతదేహాలను ఇరాన్ దౌత్య కార్యాలయానికి శ్రీలంక శుక్రవారం అప్పగించింది. గాలే హార్బర్ పోలీస్ అభ్యర్థనపై చీఫ్ మెజిస్ట్రేట్ సమీర డొడన్గొడ కరపితీయ లోని నేషనల్ హాస్పిటల్ డైరెక్టర్కు మార్చి 11న ఇరాన్ సైనికుల మృతదేహాలను అప్పగించాలని ఆదేశించారు. అమెరికా సబ్మెరైన్ దాడితో మునిగిపోయిన ఇరాన్ నౌక నుంచి 84 ఇరాన్ సైనికుల మృతదేహాలను వెలికి తీయడమైందని శ్రీలంక వివరించింది. ఈ మృతదేహాలతోపాటు సజీవంగా ఉన్న 32 మందిని గత గురువారం ఆస్పత్రి నుంచి తీసుకు రావడమైందని శ్రీలంక రక్షణ మంత్రిత్వ కార్యదర్శి సంపత్ దులియకొంత విలేకరులకు వెల్లడించారు.
బాసర్ లో అంతఃప్రజ్ఞ 2K-26కు ఘనంగా ప్రారంభం
బాసర్ లో అంతఃప్రజ్ఞ 2K-26కు ఘనంగా ప్రారంభం బాసర , ఆంధ్రప్రభ :
‘అల్లు సినిమాస్’.. ప్రపంచంలోనే మూడోది
ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్లో ఉన్న నాలుగు స్క్రీన్ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ను ప్రారంభించినట్లు అల్లు ఎంటర్టైన్మెంట్ గర్వంగా ప్రకటించింది. హైదరాబాద్లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్’ రికార్డ్ సృష్టించింది. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే అనుభూతి గురించి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. “రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. ‘అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసి నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్ కట్టాలని అనిపించింది. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని అనుభూతి పొందాలని అనుకుంటున్నారు. అప్పుడు నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. లార్జ్ ఫార్మాట్, కొత్త అనుభూతి కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్’ మొదలైంది. సింగిల్ స్క్రీన్లలో వస్తున్న అనుభూతి ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కువగా మల్టీ ప్లెక్స్లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని అనుభూతి పొందాలని జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ అనుభూతినివ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. డాల్బీలోకి మారిన సినిమా విజువల్ పరంగా, సౌండ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 2024లో మేం డాల్బీని సంప్రాదించాం. డాల్బీ సినిమాస్ ఇండియా ప్రతినిథి రాజ్ మాకు ఎంతో సహకరించారు. ఈ స్క్రీన్లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీం వారు ఈ స్క్రీన్ను చూసి ఆశ్చర్యపోయారు. 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమాగా నిలిచింది. ఫ్లాగ్షిప్ డాల్బీ సినిమా కాకుండా మిగిలిన మూడు ఆడిటోరియంలలో బార్కో 4కె లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ ఉన్నాయి. డాల్బీ-బ్రాండెడ్ ప్రీమియం స్పీకర్లు, స్టేడియం సీటింగ్ ఉన్నాయి. నాలుగు స్క్రీన్లలో రిక్లైనర్లు, లాంజర్లు అమర్చబడి ఉన్నాయి. చివరి వరుస రిక్లైనర్లతో స్క్రీన్లు 2, 3, 4 అంతటా 717 అదనపు సీట్లు, తదుపరి తరం 3డి సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రతీ స్క్రీన్లో ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభవం కలిగేలా సాంకేతికతను అమర్చాము” అని అన్నారు.
ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి
ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : కర్నూలు
విశ్వ విద్యాలయాలు .. విద్యార్థులకు దిక్సూచి
విశ్వ విద్యాలయాలు .. విద్యార్థులకు దిక్సూచి కర్నూలు, బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వవిద్యాలయాలు
Media Left Stunned By Biker Teaser’s Dolby Power
The media attending the Dolby Cinema showcase at Allu Cinemas didn’t expect one film to steal the spotlight, but that’s exactly what happened when Charming Star Sharwa’s Biker teaser appeared on-screen. What started as a general technical demonstration suddenly turned into a moment of surprise for journalists as the hall exploded with the deep, powerful […] The post Media Left Stunned By Biker Teaser’s Dolby Power appeared first on Telugu360 .
హైదరాబాద్కు మరో భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్ #Hyderabad#Telangana#ReserveForest#UrbanForestPark
పశ్చిమాసియాలో భీకర దాడులు.. టెహరాన్ స్వేర్లో భారీ పేలుళ్లు
దుబాయ్పై ఇరాన్ భీకర దాడులు గల్ఫ్లోని చమురు క్షేత్రాల ధ్వంసం దుబాయ్ ఇంటర్నేషనల్ సెంటర్పై దాడి దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత భీకరం అయింది. గల్ఫ్లో ఇరాన్ తీవ్రదాడుల సమయంలోనే శుక్రవారం టెహరాన్లోని టెహరాన్ స్కేర్లో బారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇక్కడ దాడులకు దిగినట్లు వెల్లడైంది. టెహరాన్ యూనివర్శిటీ దగ్గరిలోని ఇంగెలాబ్ స్ట్రీట్ వద్ద ఉన్న టెహరాన్ ఫిరదౌసి స్వేర్ వద్ద వరుసగా భీకర పేలుళ్లు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు,ప్రత్యేకించి చిన్నారులను చంపివేయడాన్ని నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున గుమికూడిన దశలోనే దాడులు జరిగాయి. వార్షిక క్వాడ్స్ దినం సందర్భంగా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపే ప్రదర్శన దశలోనే జనం పెద్ద ఎత్తున గుమికూడారు. పేలుళ్లు జరుగుతున్నప్పటికీ జనం వస్తూనే ఉన్నారని వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్లకు చావు తప్పదని నినదించారు. పేలుళ్లు దాడుల ఈ ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని వెల్లడైంది. అయితే ఎందరు చనిపోయి ఉంటారు? ఎందరికి గాయాలు అయ్యాయి ? తరువాతి పరిస్థితి ఏమిటనేది వెంటనే నిర్థారణ కాలేదు. తమ పతీకార దాడులు తీవ్రతరం అని చెప్పిన ఇరాన్ అత్యంత వ్మూహాత్మకంగా పలు ప్రాంతాల్లో జరిపిన దాడులు పలు కీలక అనంతర పరిణామాలకు దారితీశాయి టెహరాన్ , మరో నగరం ఖజ్విన్లోనూ దాడులు తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ముందుగానే ప్రకటించారు. ఇరాన్ సైనిక వ్యవస్థను దెబ్బతీస్తామని వేర్వేరుగా ట్రంప్ , నెతన్యాహు హెచ్చరించారు. అయితే ఈ క్రమంలోనే ఇరాన్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, అక్కడి ఎయిర్పోర్టులను. చమురు క్షేత్రాలను లక్షంగా ఎంచుకుని దాడులు ఉధృతం చేసింది. ఇరాన్ సుప్రీంనేత మొజ్తబా ఖమేనీ హెచ్చరికల తరువాత ఇరాన్ శుక్రవారం ఉదయం గల్ఫ్లోని అరబ్ దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. సౌదీ అరేబియాలో పలు ప్రాంతాల్లో డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దుబాయ్లోని పలు భవనాలపై ఇరాన్ దాడులు జరిగాయి. మరో సారి బుర్జ్ ఖలీఫా వద్ద కూడా డ్రోన్లు పడ్డాయి. అయితే ఇవన్ని చిన్న ఘటనలే అని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో తమ దాడుల ఉధృతి అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. గల్ఫ్లోని చమురు క్షేత్రాల ధ్వంసానికి ఇరాన్ ప్రయోగించిన దాదాపు 50 డ్రోన్లను సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి. ఒమన్లోడ్రోన్ల దాడులలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అక్కడి సోహర్లోని పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ల దాడితో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక్కడ నేలకూలినడ్రోన్ల శకలాలు ధాటికి ప్రజలు గాయపడ్డారు. బహరైన్లో భారీ స్థాయిలో సైరన్లు మోగాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫెనాన్సియల్ సెంటర్లోని అమెరికా స్థావరాలను ఎంచుకుని ఇరాన్ దాడులు జరిగాయి. ఈ ప్రాంతాన్ని అత్యంత కీలకమైన డిఐఎప్సి జోన్గా వ్యవహరిస్తారు. ఇక్కడ బ్యాంకులు, వాణిజ్య కేంద్రాలు, షేర్ల వ్యాపార కార్యాలయాలు ఎక్కువగా ఉంటాయి. రెస్టారెంట్లు, సంపన్నుల నైట్క్లబ్లతో సందడిగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడి దాడులతో కలవరం చెలరేగింది. పశ్చిమ ఇరాక్లో అమెరికా సైన్యానికి చెందిన కెసి 135 రిఫ్యూయలింగ్విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికా సిబ్బంది మృతి చెందారని అమెరికా సైన్యం తెలిపింది. ఇరాక్ సేనలుపొరపాటున ఈ నౌకను దెబ్బతీశాయా? లేక ఇరాన్ దాడులు సాగించిందా? అనేది నిర్థారణ కాలేదు. తాము ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. శత్రువు లేదా పొరపాటు దాడులు జరిగి ఉంటాయని తాము అనుకోవడం లేదని, ఇది ప్రమాదం అయి ఉంటుందని తెలిపారు. ఇరాన్పై శుక్రవారం దాడులను తీవ్రతరం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు 200కు పైగా చోట్ల ఇరాన్ వైమానిక దాడులు సాగాయి. ఇక ఒమన్లో శుక్రవారం ఓ డ్రోన్ కూలిన ఘటనలో ఇద్దరు విదేశీయులు మృతి చెందారు. వీరి గుర్తింపు తెలియలేదు. ఇరాన్ జరిపిన దాడులలో అమెరికాకు చెందిన విమానవాహక నౌక అబ్రహాం లింకన్ గల్ఫ్ జలాల్లో ధ్వంసం అయింది. పనిచేయకుండా పోయిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ తెలిపాయి. అయితే ఈ వాదనను అమెరికా ఖండించింది. తమ బాలిస్టిక్ మిస్సైల్స్తో ఈ ఈ నౌకను దెబ్బతీశామని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దీనిని యుఎస్ సైన్యం కొట్టిపారేసింది. హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకల కదలికలు భారతీయ పతాకంతో కూడిన ఓ చమురు రవాణా నౌక శుక్రవారం హర్మూజ్ జలసంధి మీదుగా ఆఫ్రికాకు క్షేమంగా వెళ్లింది. భారతీయ జెండా వల్ల ఇరాన్ దాడుల నుంచి తప్పించుకుంది. ఇక ఈ ఉద్రిక్తతల జలాల్లో ఇప్పటికీ మరో 27 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. వీటిలో అంతా కలిపి 700 మంది వరకూ భారతీయ నావికులు ఉన్నారని నిర్థారించారు. ఈ నౌకలను కూడా ఇక్కడి జల మార్గం ద్వారా వెలుపలికి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటివరకూ హర్మూజ్ ప్రాంతంతో జరిగిన దాడులలో ముగ్గురు భారతీయ నావికుల మృతి చెందారు, ఒకరు గల్లంతు అయ్యారు.
తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల బాసర, ఆంధ్ర ప్రభ
మత్తులో వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లు విసిరిన యువకుడు #VandeBharatExpress #TrainAttack
Ken Karunaas’ Youth releasing in Telugu on March 26th
Ken Karunaas’ upcoming film Youth has generated good buzz in Tamil, thanks to chartbuster songs composed by GV Prakash and an impressive trailer. Dhanush attended the film’s pre release event today, raising the buzz to next level. The film is now set to release in Telugu on March 26th. The Telugu theatrical release will be […] The post Ken Karunaas’ Youth releasing in Telugu on March 26th appeared first on Telugu360 .
డొమెస్టిక్ గ్యాస్ కొరతపై అపోహలు వద్దు
డొమెస్టిక్ గ్యాస్ కొరతపై అపోహలు వద్దు వినియోగదారుల రక్షణ చట్టం అమలుపై అవగాహన
ఎల్పీజీ సంక్షోభం...పార్లమెంట్ కాంప్లెక్స్లో నిరసన
న్యూఢిల్లీ : ఎల్పిజి సంక్షోభంపై శుక్రవారం విపక్ష ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్లలో నిరసన పాటించారు. ఈ సంక్షోభానికి కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్పురి, ప్రధాని నరేంద్రమోడీ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పార్లమెంట్ భవనం బయట శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో టిఎంసి ఎంపీలు నిరసన ప్రారంభించారు. “ఎల్పిజి సంక్షోభం” అని రాసి ఉన్న పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. “గ్యాస్ సిలిండర్లు ఎక్కడకు వెళ్లాయి ” అని ప్రశ్నిస్తూ పాలకవర్గం బీజేపీని నిలదీశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎంపీలు,ఇండియా కూటమికి చెందిన ఇతర ఎంపీలు కలిశారు. గ్యాస్ సిలిండర్లతోపాటు ప్రధాని మోడీ అదృశ్యమయ్యారని, ఆయన పూర్తిగా లొంగిపోయారని ధ్వజమెత్తారు. “దేశంలో ఎల్పిజి సంక్షోభం తీవ్రంగా ఉంది.బెంగాల్లో కూడా ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరఫరా వ్యవస్థలకు కుప్పకూలడంతో ప్రజలు చాలా బాధపడుతున్నారు. మాన్యువల్ బుకింగ్ను ఆశ్రయిస్తున్నారు. ” అని టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. “ మీకు కుటుంబాలు ఉన్నాయి. వృద్ధులు, తల్లిదండ్రులు, సిలిండర్లను బుక్ చేసుకోవడానికి క్యూల్లో నిరీక్షిస్తున్నారు. రెండున్నర రోజుల్లో సిలిండర్లు లభ్యమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం ఎక్కడ రెండున్నర రోజుల్లో బుకింగ్లో సిలిండర్లు లభ్యమవుతున్నాయో ప్రధానిని ,మంత్రులను వెళ్లి చూడాలని సవాలు చేస్తున్నాను” అని ఆమె సవాలు విసిరారు. “దేశంలో 75 రోజులకు సరిపడా నిల్వలున్నాయని పెట్రోలియం మంత్రి దేశానికి అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు అత్యావసరాల చట్టాన్ని కూడా అమలు లోకి తెచ్చారు. కేవలం 25 రోజుల్లో లభ్యమవుతాయని అంటున్నారు. మనకన్నీ అబద్ధాలే చెప్పారు. ప్రధాని ఎక్కడ ?గత ఐదు రోజులుగా ప్రధాని సభకు రావడం లేదు. ఈ సంక్షోభం లో కూడా ఆయన కేరళలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటున్నారు. ఆయన ప్రధానిలా కాకుండా ఎన్నికల యంత్రంలా తయారవుతున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు ” అని మొయిత్రా విరుచుకుపడ్డారు. కొంతమంది విపక్ష ఎంపీలు గ్యాస్ సిలిండర్ల భారీ కటౌట్లు పట్టుకోగా,మరికొందరు సిలిండర్లు, నినాదాలతో ఉన్న పోస్టర్లు పట్టుకున్నారు. “ మోడీ జీ ఎల్పీజీ ” అని నినాదాలు చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇండియా కూటమి ఎంపీలు ప్రయత్నించారు. పశ్చిమాసియా సంక్షోభం, భారత్పై దాని ప్రభావంపై పూర్తి చర్చ జరగాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందవద్దని, ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కమర్షియల్ ఎల్పిజి సరఫరా దెబ్బతిని హోటల్ రంగం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఎల్పీజీ సంక్షోభం పరిష్కారం అవుతుందన్న నమ్మకాన్ని ప్రధాని వెలిబుచ్చారు.
మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు..
మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు.. మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజలకు
హైదరాబాద్లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ విక్రయం… వ్యక్తి అరెస్ట్ #Hyderabad#DryFruitsCase
విషాదం: ఫుట్బాల్ ఆడుతూ ప్రాణాలు విడిచేశాడు..
పంజాబ్లో విషాదం చోటు చేసుకుంది. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ.. ఓ కుర్రాడు ప్రాణాలు విడిచాడు. ఇండియన్ ఫుట్బాల్ లీగ్(ఐఎఫ్ఎల్)లోని నాంధారి ఫుట్బాల్ క్లబ్కు చెందిన పాతికేళ్ల రవీందర్ సింగ్ మృతి చెందాడు. స్థానికంగా జరుగుతున్న ఫుట్బాల్ టోర్నీలో రవీందర్ సింగ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఫుట్బాల్ క్లబ్లు అతడి మృతికి సంతాపం తెలిపాయి. ఐఎఫ్ఎల్లో జరగబోయే మ్యాచ్ల సమయంలో ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్వాహకులు ప్రకటించారు. రవీందర్ సింగ్ స్వగ్రామం నవాన్షహ్ర జిల్లాలోని బచౌరి. అక్కడే ఆటగాడి అంత్యక్రియలు జరిగాయి. అతడిని చివరిసారిగా చూసేందుకు సహచర ప్లేయర్లు ఫుట్బాల్ అభిమానులు భారీగా తరలివచ్చారు. నాంధారి క్లబ్ రవీందర్కు నివాళి అర్పిస్తూ.. సోషల్మీడియాలో వీడియోని షేర్ చేసింది. మినెర్వా పంజాబ్, గోకులం కేరళ, బెంగళూరు ఫుట్బాల్ క్లబ్లు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.
Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha News
Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో యాజమాన్యానికి, కార్మిక శాఖ కమిషనర్కు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. టిజిఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయడంతో పాటు 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని కార్మిక జెఏసి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లపై గత కొన్ని నెలలుగా కార్మిక సంఘాల జేఏసి యజమానపైనా, ప్రభుత్వంపైనా ఒత్తిడి తెస్తున్నా లెక్క చేయకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సమ్మె తేదీపై 14 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేషీలో నోటీసులు ఇచ్చారు. లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ నోటీసులు అందజేసినట్లు జేఏసి వర్గాలు తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని జేఏసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఈవీ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని సమ్మె నోటీసు ఇచ్చే ముందు బస్ భవన్ వద్ద జేఏసి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు
డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ […] The post తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు appeared first on Visalaandhra .
సినీనటి అనసూయపై అసభ్య కామెంట్లు..ఇద్దరి అరెస్టు
సినీనటి అనసూయపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని కడప జిల్లా, పులివెందుల మండలం, పెద్ద జూటూర్ గ్రామానికి చెందిన జనార్దన్ హైదరాబాద్లోని ఇందిరా నగర్లో ఉంటున్నాడు. సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్పల్లికి చెందిన ఆటో డ్రైవర్ కొండాపురం అరుణ్ కుమార్. ఇద్దరు సోషల్ మీడియాలో సినీనటి అనసూయ భరద్వాజ్పై గత కొంత కాలం నుంచి అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్రీ టైంలో ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆమె క్యారెక్టర్ను దిగార్చే విధంగా కామెంట్ చేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అనసూయపై అసభ్య కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. అనసూయ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.
పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఏ,ఆర్ పల్లిలో, నాగదేవత విగ్రహం ప్రతిష్టాపన
భారీ జిఎస్టి స్కామ్.. నిందితుడి అరెస్ట్
భారీ జిఎస్టి కుంభకోణాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ బట్టబయల్జేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన మోసపూరిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను పొంది, దానిని బదిలీ చేశాడనే ఆరోపణలపై వాణిజ్య పన్నుల శాఖ ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్కెజి ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్ కుమార్ గోయెల్ కార్యకలాపాలపై విశ్వసనీయ నిఘా, వివరణాత్మక డేటా విశ్లేషణ ఆధారంగా అధికారులు దర్యాప్తు నిర్వహించారు. వస్తువుల వాస్తవ సరఫరా లేకుండా జారీ చేసిన ఇన్వాయిస్లను ఉపయోగించి అతను ఐటిసిని పొంది, దానిని బదిలీ చేశాడని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) పొందినట్లు గుర్తించారు. సందీప్ కుమార్ గోయె ల్ హెచ్ ఎఫ్సి స్టీల్ ట్యూబ్స్ అండ్ వాల్వ్ యజమాని, విజయ్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఎల్ఎల్పిలో భాగస్వామి అని అధికారులు వెల్లడించారు, ఇక్కడ వస్తువులు, సేవలను వాస్తవంగా స్వీకరించకుండానే ఇలాంటి మోసపూరిత ఐటిసి క్లెయిమ్లు కనుగొన్నారు.ఈ క్రమంలో వాటి రిజిస్ట్రేష న్లు అధికారులు రద్దు చేశారు. జిఎస్టి చట్టం, 2017 నిబంధనల ప్రకారం సందీప్ కుమార్ గోయల్ను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. నకిలీ ఇన్వాయిస్లు, మోసపూరిత ఐటిసి క్లెయిమ్లు, ఇతర జిఎస్టి చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలంగాణ వాణిజ్య పన్నుల కమిషనర్ వెల్లడించారు.
పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం…
పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం… కౌకుంట్ల, ఆంధ్రప్రభ :
–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు The post జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు appeared first on Visalaandhra .
దొంగతనం జరిగి రెండేళ్లయిన న్యాయం జరగలేదు
దొంగతనం జరిగి రెండేళ్లయిన న్యాయం జరగలేదు ఉట్నూర్, ఆంధ్రప్రభ : తాను అద్దెకు
ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు -27,360 మంది విద్యార్థులకు 149 సెంటర్లు -పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు... కలెక్టర్ జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, డీఈవో […] The post 16నుండి పది పరీక్షలు appeared first on Visalaandhra .
ఐదు లీటర్ల గుడుంబా పట్టివేత.. విక్రయదారుడు అరెస్ట్
ఐదు లీటర్ల గుడుంబా పట్టివేత.. విక్రయదారుడు అరెస్ట్ చిట్యాల, ఆంధ్రప్రభ :మండలంలోనీ తిరుమలాపురంలో
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు
ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిలుపూర్, ఆంధ్ర ప్రభ :
నెలసరి సెలవు తప్పనిసరి చేస్తే.. మహిళల కెరీర్కు ముగింపే
ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం కొలువుల భర్తీలోనూ ప్రతికూలతలు ఎదురవుతాయి సిజెఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన సిజెఐ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారంనాడు దానిని తిరస్కరించింది. సెలవును తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్ ముగుస్తుందన్నారు. వేతనంతో కూడిన నెలసరి సెలవు అంశంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని సిజెఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు ఇస్తే మహిళలను ఉద్యోగాల్లో తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం ఉందని అన్నారు. తద్వారా వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదని పిటిషనర్ను ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. వాలంటరీగా సెలవులు ఇవ్వడమనేది చెప్పుకోవడానికి బాగుటుంది కానీ చట్టం చేసి తప్పనిసరి చేస్తే వివిధ రంగాల్లోని ఉద్యోగాల భర్తీలో కూడా వాళ్లకు ప్రతికూలతలు ఉంటాయన్నారు. అదే విధంగా పురుషుల కన్నా తాము తక్కువ అనే భయ భావన వారిలో కలిగే అవకాశముందనారు. నెలసరి వల్ల ఏదో చెడు జరుగుతోంది అన్న విషయాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదని, అది మహిళలను ఆత్మనూన్యతకు గురిచేసేలా ఉంటుందని సిజెఐ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వాలు స్టేక్హోల్డర్లతో చర్చించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కేరళ రాష్ట్రంలోని స్కూళ్లలో ఆడపిల్లలకు నెలసరి సెలవు ద్వారా వారికి ఊరటనిస్తున్నారని, కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాలంటరీగా అమలు చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా కూడా తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది షంషద్ వాదనలు వినిపిస్తూ.. 2013లో ప్రభుత్వ విశ్వవిద్యాలాయాల్లో నెలసరి సెలవురు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ప్రైవేటు కంపెనీలు అదే బాటలో పయనిస్తే బాగుంటుందన్నారు. ఈ సమయంలో సిజెఐ కలుగుజేసుకొని.. ఆ సమయంలో వారు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాలనీ, చట్టం చేయాలన్న డిమాండ్ విషయానికి వస్తే అది మహిళ కెరీర్ ముగింపునకు దారులు వేయడమేని అన్నారు.
పవన్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ‘ఉస్తాద్’ బెనిఫిట్ ఫోలకు అనుమతి
పవర్స్టార్ పవన్కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమాపై ఎంతో క్రేజ్ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. ఎపిలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. మార్చి 19న తెల్లవారుజామున 4-5 గంటల మధ్య బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వగా.. దీని టికెట్ ధరను రూ.500 (ట్యాక్సులు కలిపి)గా నిర్ణయించారు. అలాగే పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్స్లో రూ.125 పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్ వచ్చింది. ఇక మూవీ రన్టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా నిర్ణయించారు.
వంటగ్యాస్కు కొరత లేనే లేదు.. అనవసర బుకింగ్లు వద్దు
ప్రాధాన్య రంగాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ‘ప్యానిక్ బుకింగ్’ అవసరం లేదని కోరింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రులు, హాస్టళ్లకు ఎల్పీజీ సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మార్చి 2026తో పోల్చుకుంటే దేశంలో ఎల్పీజీ ఉత్పత్తి 40 శాతం పెరిగిందని, అదనంగా రాష్ట్రాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్ పంపిణీ చేశామని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లకు బొగ్గు సరఫరా చేయాలని కోల్ ఇండియాను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముందు సాధారణంగా 55.7 లక్షల బుకింగ్లు ఉంటే మార్చి 12 నాటికి అది 75.7 లక్షలకు పెరిగిందనారు. ఎదో జరుగబోతోందన్న భయాల కారణంగానే బుకింగ్లు అనూహ్యంగా పెరిగాయని సుజాతా శర్మ తెలిపారు. ఎల్పీజీపై ఒత్తిడి తగ్గేందుకు పీఎన్జీ కనెక్షన్లకు మళ్లాలని ప్రజలను కోరారు. క్రూడాయిల్కు సంబంధించి 258 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ కెపాసిటీ ఉందని, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని కలిగి ఉన్నామని వివరించారు. ప్రధానమైన అర్బన్ సిటీలు, కేంద్రాల్లో కమర్షియల్ వినియోగదారుల ఆందోళన, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ నాయకుల వినతి
శశికల ఈజ్ బ్యాక్.. తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికల కొత్త పార్టీని ప్రకటించారు. ఈ పార్టీకి 'అఖిల భారత పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం'గా నామకరణం చేశారు. పార్టీ జెండాతోపాటు చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. జయలలిత స్మారకార్థం రామనాథపురంలో జరిగిన బహిరంగ సభలో శశికల మాట్లాడుతూ.. మాజీ సిఎం, ఐఏడీఎంకే(అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) వ్యవస్థాపకుడు ఎంజిఆర్ స్మరించుకున్నారు. ప్రజలకు సేవ చేయడానికి, ద్రవిడ మున్నేట్ర కజగం(DMK) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా MGR పార్టీని స్థాపించారని చెప్పారు. ముఖ్యంగా పేదల పక్షాన నిలబడాలనే సంకల్పంతోనే ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఎంజిఆర్ తర్వాత జయలలిత ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ప్రజలకు సేవ చేశారన్నారు. ఆమె చనిపోయిన అనంతరం AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. ఆయన నాయకత్వంలో పార్టీ పతనావస్థకు చేరుకుందని శశికల విమర్శించారు. కాగా, జయలలిత మరణం తర్వాత శశికల, AIADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు.
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ
ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా మూకమామిడి గ్రామ పంచాయతీ ప్రారంభించిన
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం
చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం మురుగునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలిదోమల
UBS Release: GO issued in Andhra Pradesh
Telugu360 was the first to break the news that the special premieres permission will be granted for Ustaad Bhagat Singh on March 19th and there would be no premieres on March 18th evening. The GO has been issued by the AP government today and one premiere show permission has been granted on March 19th between […] The post UBS Release: GO issued in Andhra Pradesh appeared first on Telugu360 .
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి హంద్రిక శ్రీ జగద్గురు లింగప్ప తాత
Is Allu Cinemas a Threat for AMB Cinemas?
Allu Cinemas will open for film lovers and regular patrons starting from tomorrow. The four-screen multiplex is located in Gandipet, one of the costliest and most developing places of Hyderabad. From the past couple of years, most of the celebrities, rich crowds and others residing near to the ORR are rushing to AMB Cinemas for […] The post Is Allu Cinemas a Threat for AMB Cinemas? appeared first on Telugu360 .
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సర్వ సిద్ధం..
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సర్వ సిద్ధం.. పదవ తరగతి పరీక్షల
Bangaru Bomma: SP Charan, Chithra’s Classic Charm
Sumanth Prabhas who impressed with his debut flick Mem Famous is coming up with a rural love and family saga Godari Gattupaina, directed by first-timer Subash Chandra, and produced by Red Puppet Productions, with Nidhi Pradeep essaying the heroine. As part of musical promotions, the makers today released third single- Bangaru Bomma. It’s classically-infused romantic […] The post Bangaru Bomma: SP Charan, Chithra’s Classic Charm appeared first on Telugu360 .
Is Anushka Shetty Getting Married?
Top actress Anushka Shetty hasn’t been seen across the film circles for the past few months. She played the lead role in Ghaati last year and the film ended up as a disappointment. The latest rumors making rounds is that Anushka Shetty is all set to get married very soon. It is an arranged marriage […] The post Is Anushka Shetty Getting Married? appeared first on Telugu360 .
సమ్మె నోటీసులు ఇచ్చిన టిజిఎస్ఆర్టిసి జెఎసి
హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టిసి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టిసి యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ‘‘మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఆర్టిసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి. అన్ని కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులపై ఆధిక పని భారం తగ్గించాలి’’ అని జెఎసి నేతలు డిమాండ్ చేశారు.
పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జడ్పి హెచ్ఎస్
Breaking : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది
Video : Actress Raashii Khanna Exclusive Interview
The post Video : Actress Raashii Khanna Exclusive Interview appeared first on Telugu360 .
నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే
నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి, ఆంధ్రప్రభ :
LPG Cylinder : గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటున్నా... చేతివాటంతో చుక్కలు కనిపిస్తున్నాయ్ గా
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో ఎల్.పి.జి కొరత ఏర్పడింది
మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించం: బిజెపి రాంచందర్ రావు
మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు. మూసీ ప్రాజెక్ట్పై తమ పార్టీకి వ్యతిరేకత లేదనీ, అయితే పేదల ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం అని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మూసీపై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. మూసీ నది పునరుజ్జీవనం గానీ, మూసీ ప్రాజెక్టును గానీ తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని, అందులో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలని, ఆ నీరు రైతులకు సాగునీటిగా ఉపయోగపడాలని తమ పార్టీ కోరుకుంటోందని తెలిపారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు తమ పార్టీ రకరకాల వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మూసీ నది తప్పకుండా పునరుజ్జీవనం కావాలని ఇప్పటికీ చెబుతున్నామని, కానీ ‘గాంధీ సరోవర్’ పేరుతో అక్కడ నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడం భావ్యం కాదన్నారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని, ఆ ఇళ్లను కూల్చకుండా కూడా మూసీని శుద్ధి చేయవచ్చని ఆయన తెలిపారు. సబర్మతి నదిని ఉదాహరణగా చెబుతూ మాట్లాడేవారు అసలు అక్కడ ప్రాజెక్టు ఎలా జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. ఒకప్పుడు సబర్మతి కూడా మూసీలా కాలుష్యంతో, దుర్వాసనతో ఉండేదని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా నది నుంచి నీటిని సబర్మతికి మళ్లించి, నదుల అనుసంధానం చేసి, ముందుగా నది శుభ్రపరిచారని చెప్పారు. గాంధీ సరోవర్ కోసం భూమి అవసరమైతే ప్రాజెక్టును రీ-అలైన్ చేసి ఒక్క ఇల్లు కూడా దెబ్బతినకుండా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. గాంధీ విగ్రహం నిర్మించాలనుకుంటే వెయ్యి అడుగులైనా, రెండువేల అడుగులైనా ఆకాశాన్ని తాకేలా నిర్మించొచ్చని, దానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. దేశంలో గ్యాస్, ఆయిల్, డీజిల్, పెట్రోల్ దొరకవని ప్రజల్లో భయం సృష్టించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని అన్నారు. రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పారు. జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత దేశాల నాయకులతో మాట్లాడి, భారతదేశానికి రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరాలు హోర్ముజ్ జల సంధి ద్వారా అంతరాయం లేకుండా దేశానికి చేరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మన దేశం ఒకే ప్రాంతంపై ఆధారపడదని, దాదాపు 40 శాతం ముడి చమురు ఇతర దేశాల నుంచీ వస్తోందని చెప్పారు. అందువల్ల దేశంలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని రాంచందర్ రావు చెప్పారు.
ఖమ్మంలో పెన్షనర్ల ఆందోళన యుద్ధ నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన
RTC | సమ్మె నోటీసు విలీన ప్రక్రియ చేపట్టాలి RTC | ఆంధ్రప్రభ,
అన్నదాన పథకానికి రూ.2.01 లక్షల విరాళం..
అన్నదాన పథకానికి రూ.2.01 లక్షల విరాళం.. ఆంధ్రప్రభ, ఇంద్రకిలాద్రి : విజయవాడలోని శ్రీ
మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అనేక మంది విద్యార్థులకు కడుపు నిండుతుంది. ఈ నేపథ్యంలోనే వారికి పౌష్టికాహారాన్ని కూడా అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చేపల వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించవచ్చని, ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని చేపల చెరువుల నుంచి ఉత్పత్తి అయ్యే చేపలను విద్యార్థులకు మధ్యాహ్నా భోజనంలో అందిస్తే అటు మత్యకారులకు ఇటు విద్యార్థులకు మేలు జరుగుతుందని మత్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆలోచనగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సిఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఇప్పటికే విద్యార్థుల మధ్యాహ్నా భోజన పథకంపై సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు కడుపునిండా పౌష్టికాహారం తినేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. అయితే, విద్యార్థులకు చికెన్ స్థానంలో చేపలు పెడితే మరింత పోషకాహారం లభిస్తుందని ఈ నేపథ్యంలోనే వారానికోసారి చికెన్ స్థానంలో ఫిష్ అందించాలని సిఎం రేవంత్రెడ్డి కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది.
నిత్య ఉచిత ప్రసాద వితరణకు విరాళం ..
నిత్య ఉచిత ప్రసాద వితరణకు విరాళం .. ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని
ఆ వేలంతో మాకేమీ సంబంధం లేదు: బిసిసిఐ
‘ది హండ్రెడ్ లీగ్’ కోసం నిర్వహించిన వేలంలో సన్రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ సిఇవొ కావ్యా మారన్ స్వయంగా ఈ వేలంలో పాల్గొని పాక్ ఆటగాడిని కొనుగోలు చేసింది. సన్ గ్రూప్కు చెందిన సన్రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థానీ ఆటగాడిని కొనుగోలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎక్స్లో కూడా సన్రైజర్స్ లీడ్స్ జట్టు అధికారిక ఖాతాను తొలగించారు. తాజాగా ఈ విషయంపై బిసిసిఐ స్పందించింది. ఆ వేలంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ‘‘ఆ కొనుగోలు వ్యవహారంలో ఐపిఎల్లో జరగలేదు. సన్రైజర్స్ యాజమాన్యం విదేశీ లీగ్ వేలం బిడ్డింగ్లో పాల్గొని పాక్ క్రికెటర్ని తీసుకుంది. అది వారి నిర్ణయం. అందులో మేం చేసేదేమీ లేదు. వేరే లీగుల్లో ఏం జరిగినా మాకు సంబంధం లేదు. భారత్ వెలుపల ఆయా ఫ్రాంచైజీల బిడ్డింగ్ల్లో మాకు ఏం సంబంధం ఉంటుంది?’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే
గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే మంథని, ఆంధప్రభ : ప్రపంచంలో
పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు
రాష్ట్రంలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్పిజి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు. తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్ల్లీంచడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకమారు ఎల్పిజి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని, ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అన్నదాత సుఖీభవ పధకంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీమంత్రి కన్నబాబు అన్నారు
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చలివేంద్రం..
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చలివేంద్రం.. కలెక్టరేట్లో కాకాని ఆశయ సాధన సమితి చలివేంద్రం..సమితి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ డీజీపీగా పనిచేసిన హెచ్.జె దొర మృతి చెందారు.
అభివృద్ధి పనుల నాణ్యత లో రాజీ పడొద్దు..
అభివృద్ధి పనుల నాణ్యత లో రాజీ పడొద్దు.. పనులు జాప్యం చేస్తే కఠిన
శానిటేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు
పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం చేయద్దు..
పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం చేయద్దు.. పారిశుధ్య పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి..అధికారులతో
నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ..
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా
పశువైద్యశాల ఆకస్మిక తనిఖీ… నిర్వహణ, మౌళిక వసతులు గురించి వివరాలు.సేకరణ…వసతులు కల్పించాలని ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది
బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం..
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; పట్టణంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇటీవల

27 C