SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

పంజాబ్ ఉత్కంఠ గెలుపు

 ఐపిఎల్ సీజన్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కూపర్ కొనొలి అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కూపర్ 44 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (37) తనవంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 ఫోర్లతో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ (38), గ్లెన్ ఫిలిప్స్ (25) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ మూడు, చాహల్ రెండు వికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 1 Apr 2026 12:11 am

బుధవారం రాశి ఫలాలు (01-04-2026)

మేషం వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృషభం సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. మిధునం దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. కర్కాటకం దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. సింహం చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కన్య దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తుల అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. వృశ్చికం ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ధనస్సు ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మకరం చుట్టుపక్కలవారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున స్థిరత్వం కలుగుతుంది. కుంభం ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి. మీనం సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

మన తెలంగాణ 1 Apr 2026 12:10 am

అమెరికాకు ఇటలీ షాక్

అమెరికాకు మరోదేశం షాక్ ఇచ్చింది. స్పెయిన్ బాటలోనే ఇటలీ నడిచింది. ఇరాన్‌పై దాడులకు దిగుతున్న అగ్రదేశం విమానాలకు తమ గగనతలం మీదుగా అనుమతి లేదని తాజాగా ఇటలీ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడయ్యాయి. బాంబర్ విమానాలు నిలపడం, అక్కడి నుంచి ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి సిసిలీలోని వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుంటామని అమెరికా ఇటీవల ఇటలీకి చేసిన విజ్ఞప్తిని ఆ దేశం ప్రభుత్వం తిరస్కరించిందని మీడియా తెలిపింది. ఇప్పటికే మిత్రదేశాలు ఇరాన్‌పై యుద్ధంలో కలిసి రావడం లేదని ఆరోపణలు చేస్తున్న ట్రంప్‌కు తాజాగా ఇటలీ తీసుకున్న నిర్ణయం ఎదురుదెబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులను ఐరోపా యూనియన్ దేశాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటలీ తాజా నిర్ణయం వెలువడడం విశేషం. 

మన తెలంగాణ 31 Mar 2026 11:19 pm

రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

మన తెలంగాణ 31 Mar 2026 10:56 pm

వర్స్ ఇన్నోవేషన్ బోర్డులో పి.ఆర్. రమేష్ నియామకం ఆడిట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగింత

పాలన బలోపేతంపై దృష్టితదుపరి వృద్ధి దశకు సంస్థ సిద్ధం

తెలుగు పోస్ట్ 31 Mar 2026 10:28 pm

srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News

srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:17 pm

China Pakistan Call : కాల్పులు ఆపండి Andhra prabha News

China Pakistan Call : కాల్పులు ఆపండి Andhra prabha News (

ప్రభ న్యూస్ 31 Mar 2026 9:41 pm

మేడ్చల్ లో శ్రీరామ బేకరీలో కాలం చెల్లిన కేకులు

మేడ్చల్ లో శ్రీరామ బేకరీలో కాలం చెల్లిన కేకులు మేడ్చల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 31 Mar 2026 9:39 pm

పంజాబ్ కింగ్స్ విజయ లక్ష్యం 163

మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి.తొలుత పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. జయ్‌కుమార్ వైశాక్ (3/34) పంజాబ్‌కు ప్రధాన వికెట్లు తీయగా, గుజరాత్ తరపున శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ కింగ్స్ గెలవడానికి 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.   పంజాబ్  

మన తెలంగాణ 31 Mar 2026 9:39 pm

ఉడుంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఉడుంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారు బైక్ ఢీ ఒకరు మృతి

ప్రభ న్యూస్ 31 Mar 2026 9:34 pm

ఈద్ గిఫ్ట్ విషయంలో గొడవ.. భార్య, పిల్లలను చంపి..

ముజఫర్‌నగర్: ఓ గిఫ్ట్ విషయంలో గొడవపడి.. తన భార్య, పిల్లలను హత్య చేసిన ఓ వ్యక్తి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్‌నగర్‌లోని సరవత్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితులను ఇర్షాద్ (32), అతని భార్య నోరీన్ (30), వారి రెండేళ్ల కుమారుడు అహిల్, రెండు నెలల కుమార్తె అక్షగా గుర్తించారు. నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ తెలిపారు. ఇర్షాద్ సోదరి షాహీన్ కోసం ఉద్దేశించిన ఒక ఈద్ బహుమతి విషయంలో ఆ దంపతుల మధ్య గొడవ జరిగిందని బంధువులు అధికారులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 31 Mar 2026 9:25 pm

బిజెపిలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్..

టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో మంగళవారం చేరారు. కేంద్ర మంత్రులు రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లియాండర్ పేస్ పోటీ చేసే అవకాశం ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో ఏప్రిల్ 23,29 తేదీల్లో జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి. పార్టీలో చేరే అవకాశం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, తదితర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది టికెట్ వ్యవహారం కాదని, ఇదో బాధ్యతని చెప్పారు. ‘ ఖేలో ఇండియా’తో దేశానికి, యువతకు సేవ చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. యువతకు ప్రధాన మంత్రి ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని అదే అంకిత భావంతో యువతపై తాను దృష్టిసారిస్తానని చెప్పారు. లియాండర్ పేస్‌కు కోల్‌కతా వంటి అర్బన్ ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉండటంతో ఆయనను పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. పేస్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌తో ఎగువ మధ్య తరగతి ఓటర్లు, పట్టణ ప్రాంత నియోజక వర్గాలు, క్రీడాభిమానులను మరింతగా ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది. దేశం లోని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన లియండర్‌పేస్, టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. బెంగాల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు. కోల్‌కతాలో పుట్టిన పేస్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్ వైపు నడిచారు. తన కెరీర్‌లో ఏకంగా 18 గ్రాండ్‌స్కామ్ టైటిళ్లు గెలిచారు. అందులో 10 మిక్స్‌డ్ డబుల్స్‌లో 8 పురుషుల డబుల్స్‌లో నెగ్గారు. రాకెట్ వదిలి, 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. 

మన తెలంగాణ 31 Mar 2026 9:20 pm

దివంగత సిఎం జయలలిత భవనంను సీజ్ చేసిన జిహెచ్ఎంసి

ఆస్తిపన్ను చెల్లింపులో బకాయిపడిన తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవనాన్ని జీహెచ్‌ఎంసి అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని జయలలిత అపార్ట్‌మెంట్ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులు బకాయిపడుతున్నట్టు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు పన్ను చెల్లించనందుకుగానూ ఆ భవనాన్ని సీజ్ చేశారు. ఈ విషయం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఆసక్తికరమైన చర్చకు కేంద్రబిందువైంది. ఇక అధికారులు ఇటీవల ఆస్తిపన్ను చెల్లింపులు పెండింగ్ పడినందున కమర్షియల్ భవనాలను సీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడక్కడ పన్ను బకాయిపడిన వారికి చెందిన ఆస్తులను సీజ్ చేయడం ద్వారా పన్ను వసూళ్ళను రాబడుతున్నారు. ఇదిలా ఉండగా జయలలిత ఇల్లు అని కూడా తెలియదని అధికారులు చెప్పడం గమనార్హం. మొదట కమర్షియల్ ప్రాపర్టీగా గుర్తించిన అధికారులు సీజ్ చేసిన ఈ భవనాన్ని, తరువాత రెసిడెన్షియల్ భవన నిబంధనల ప్రకారం సీజ్ తొలగించారు. సీజ్ చేయడం... ఈ భవనంపై మొత్తం రూ.1.59 కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉంది. ముందుగా భవనాన్ని సీజ్ చేయడంతో పన్ను వసూలుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రూ.78 లక్షలు అసలు పన్ను కాగా రూ.81 లక్షలు వడ్డీగా ఉంది. ఈ బకాయిలు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పేరుకుపోయి ఉన్నాయి. ఈ భవనం వాస్తవానికి రెసిడెన్షియల్ ప్రాపర్టీ కేటగిరీలోకి వస్తుందని తర్వాత అధికారులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం నివాస గృహాలను సీజ్ చేయకూడదనే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సీజ్‌ను తొలగించినట్టు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా భవనం ఖాళీగా ఉండటం వల్ల పన్ను చెల్లింపులు జరగలేదనేది సమాచారం. సంబంధిత భవన హక్కుదారులు జీహెచ్‌ఎంసీ అధికా రులను సంప్రదించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీనిచ్చారు. ఈ హామీతో పాటు, నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీలపై సీజ్ విధించడం తగదనే కారణంతో అధికారులు సీజ్‌ను ఎత్తివేశారు. పన్ను బకాయిల వసూళ్లపై జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టంగా చర్యలు కొనసాగి స్తోందని తెలిపారు.

మన తెలంగాణ 31 Mar 2026 9:10 pm

బెంగాలీలను వేధిస్తున్నారు.. బిజెపిపై విరుచుకుపడిన మమత

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో రాజకీయం వేడెక్కుతోంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి)పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమ మేదినీపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సిఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బిజెపిపై మాటల దాడి చేశారు. బిజెపి ఒక అనాగరిక పార్టీ అంటూ ధ్వజమెత్తారు. బిజెపి.. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వలసదారులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో బెంగాల్ నుండి వలస వచ్చిన వారిని వేధిస్తున్నారని, వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత అభ్యర్థులను పక్కనపెట్టి, తన నాయకత్వానికి మద్దతుగా నిలవాలని బెనర్జీ ప్రజలను కోరారు. మొత్తం 294 నియోజకవర్గాలలో నన్ను మీ అభ్యర్థిగా భావించండి అని దీదీ అన్నారు.కాగా, ఏప్రిల్ 23, 29 తేదీలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సిఎం మమతపై మరోసారి బిజెపి నాయకుడు సువేందు అధికారి పోటీ చేస్తున్నాడు. 202 1లో నందిగ్రామ్, భవానిపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన సువేందు.. మమతను ఓడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మమతపై సువేందు పోటీ చేస్తున్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 9:04 pm

Trump Warns Allies : మీ చమురు మీరే తెచ్చుకోండి Andhra Prabha News

Trump Warns Allies : మీ చమురు మీరే తెచ్చుకోండి Andhra Prabha

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:53 pm

బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఆరు లేన్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఎయిమ్స్ బీబీనగర్ వద్ద ఆరులైన్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ట్రాఫిక్ జామ్‌తో అత్యంత క్లిష్టంగా ఉన్న ఈ ప్రాంతంలో భారీ ఆరు లైన్ల ఎలివేటెడ్ ఫ్లై ఓర్లు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు అవకాశం కలిగింది. ఈ ప్రాజెక్టు వల్ల వరంగల్ హైవేపై ట్రాఫిక్ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని అంచనా. జాతీయ రహదారి 163పై ట్రాఫిక్ భద్రత, సౌకర్యాల మెరుగుదల లక్ష్యం చేపడుతున్న ఈ ప్రాజెక్టును రూ.98.26 కోట్ల వ్యయంతో 23 స్పాన్లతో 690 మీటర్లు పొడవైన ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఎయిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేట్, ఎమర్జెన్సీ గేట్లకు రాకపోకలకు సులభంగా ఉండేవిధంగా 1.70 కిమీ పరిధిలో పనులు చేపడతారు. హైవే రెండు వైపులా 1.48 కి.మీ సర్వీస్ రోడ్లు నిర్మాణంతో పాటు హైస్పీడ్ ట్రాఫిక్, ఆసుపత్రికి వచ్చే వాహనాల రాకపోకలు వేరు చేసేలా ప్రణాళికను రూపొందించారు. దీనికి తోడు ఆధునిక లైటింగ్, బస్ షెల్టర్లు, ట్రాఫిక్ సైన్లు, సేఫ్టీ మార్కింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు కల్వర్టుల పునర్నిర్మాణం కూడా చేపడతారు. ప్రమాదాల నివారణతో పాటు భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఫ్లై ఓవర్ రూపకల్పన జరుగుతోందని హైవే అథారిటీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా హైదరాబాద్- నుంచి యాదాద్రి ఎన్‌హెచ్163 పై బీబీనగర్ ఎయిమ్స్ వద్ద తరచుగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2019.-21 మధ్యకాలంలో జాతీయ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రదేశంగా గుర్తించి, ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉందని కేంద్రానికి నివేదించింది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశంగా గుర్తించి నివారణ కోసం ఇక్కడ ఫ్లై ్లఓవర్ నిర్మాణం చేపట్టాలని సూచించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎన్‌హెచ్‌ఐ ఈ ఆరు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

మన తెలంగాణ 31 Mar 2026 8:50 pm

జాతీయ రహదారిపై రుధిరధారలు

జాతీయ రహదారిపై రుధిరధారలు వెలికట్ట శివారులో రోడ్డు మరమ్మతు పూర్తికాక ప్రమాదాలుద్విచక్ర వాహనాలు

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:45 pm

అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి...

 పౌల్ట్రీ రంగాన్ని ఒక అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా చనిపో వడం ఇప్పు డు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పెద్దకొత్తపల్లికి చెందిన రైతు వెంకటస్వామి పౌల్ట్రీ ఫాంలో గత మూడు రోజులుగా కోళ్లు వింతగా ప్రవర్తిస్తూ ప్రాణాలు వదులుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 5,000 కోళ్లు మృతి చెందాయి. దీనివల్ల సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మందులు వాడినా ఫలితం ఉండటం లేదని, రోజురోజుకూ చనిపోయే కోళ్ల సంఖ్య పెరుగుతోందని ఆయన వాపోతున్నారు. ఈ వార్త బయటకు రావడంతో స్థానికంగా ఇది బర్డ్ ఫ్లూ కావచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీంతో పెద్దకొత్తపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లోని నాన్-వెజ్ ప్రియులు చికెన్ కొనాలంటేనే భయపడుతున్నారు. చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. అయితే, ఇది బర్డ్ ఫ్లూనా లేక మరేదైనా కొత్త వైరస్సా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కోళ్ల మరణాల వార్త తెలుసు కున్న పశువైద్య శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి పోస్ట్‌మార్టం నిమిత్తం ల్యాబ్ కు పంపారు. వైరస్ మరింత వ్యాపించకుండా చనిపోయిన కోళ్లను లోతైన గుంతలు తీసి పూడ్చివేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ల్యాబ్ నివే దిక వస్తుందని, అప్పటి వరకు రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పెట్టుబడి పెట్టిన సొమ్ము కూడా తిరిగి రాకపోవడంతో పౌల్ట్రీ రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైరస్‌ను గుర్తించాలని, నష్టపోయిన తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరు తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా లక్షలాది కోళ్లు ఇలాగే చనిపోతున్నాయని వస్తున్న వార్తలు పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్నాయి.

మన తెలంగాణ 31 Mar 2026 8:40 pm

సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు

సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:37 pm

ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల విడుదలు రెండో వారంలో విడుదల కానున్నాయి. ముందుగా ఏప్రిల్ 6వ తేదీనే ఫలితాలు విడుదల చేయాలని భావించినా, బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాల వల్ల రెండో వారానికి వాయిదా వేశారు. ఫలితాల ప్రకటనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి సమాధాన పత్రాల రీ వెరిఫికేషన్ చేయించనున్నారు. సింగిల్ సబ్జెక్టు ఫెయిలైన వారితోపాటు ఒక్కో సబ్జెక్టులో కొన్ని జవాబుపత్రాలను ర్యాండమ్‌గా వెరిఫికేషన్ చేయించనున్నారు. ఆ తర్వాత సిజిజిలో ట్రయల్స్ నిర్వహించి అంతా సవ్యంగా ఉంటేనే ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్ ఫలితాలు విడుదలైన వారం పది రోజుల తర్వాత డిగ్రీ ప్రవేశాల కోసం ఇచ్చే దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మన తెలంగాణ 31 Mar 2026 8:36 pm

Hectic Prabhas heads for a Holiday

Pan-Indian star Prabhas delivered his career’s biggest debacle Raja Saab this year. The actor is juggling between the sets of Fauzi directed by Hanu Raghavapudi and Spirit directed by Sandeep Reddy Vanga. He is yet to join the sets of Kalki 2898 AD sequel directed by Nag Ashwin. The shoot commenced recently and Prabhas will […] The post Hectic Prabhas heads for a Holiday appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 8:35 pm

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఎర్ర జాన్సన్

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఎర్ర జాన్సన్ ఆలేరు, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమంలో

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:34 pm

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లి ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. డయల్ 100 ద్వారా కూకట్‌పల్లి పోలీసులు సంఘటన తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలిపిన వివరాల ప్రకారం చెన్నారావు పేట మండల్ మాణిక్యం తాండా విలేజ్‌కు చెందిన బోడ ప్రవీణ్ (31) అదే ప్రాంతానికి చెందిన స్రవంతి(27) తో పదమూడేళ్ల క్రింతం వివాహం జరిగింది. అప్పటి నుంచి వారు కూకట్‌పల్లి కైతలాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్నారు. కొన్నాళ్లు వారి కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు పిల్లలు బి.కార్తిక్ (12), బి.కౌశిక (10) ఉన్నారు. అయితే ప్రవీణ్ మరో అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవడంతో భార్య స్రవంతికి తెలిసింది. అప్పటి నుంచి కుటుంబంలో కలహాలు మొదలై పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం ఉంది. అయితే మనోవేధన అనుభవిస్తున్న స్రవంతి భర్తతో నాలుగు రోజుల క్రింత గొడవ జరిగి తన స్వగ్రామంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అయితే ఊరి పెద్దలు సోమవారం ప్రవీణ్‌ను పలిపించి వారి సమక్షంలో నచ్చచెప్పడంతో స్రవంతి ప్రవీణ్‌లు ఇద్దరు కలిసి తిరిగి కూకట్‌పల్లిలోని వారి ఇంటికి వచ్చారు. ప్రవీణ్ రోజులాగే మంగళవారం ఉదయం తన పని మీద వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే తలుపులు తెరవక పోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి వారి సాయంతో తలుపులను బద్దలు కొట్టి చుడగా ఇద్దరు పిల్లలతో సహా స్రవంతి విగతిజీవులుగా పడి ఉన్నారు. ప్రవీణ్ తక్షణమే డయల్ 100కు ఫోన్ చేయడంతో కూకట్‌పల్లి పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. పంచనామా నిమిత్తం మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే సోమవారం సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నాక ఏదైనా గొడవ జరిగిందా అన్న విషయంపై ఆరాతీసున్నారు. కుటుంబ కలహంతో స్రవంతి, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 8:30 pm

ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగిన వరి పంటలు

ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగిన వరి పంటలు ఎడపల్లి,ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:28 pm

మైనర్ బాలున్ని డీ డిక్షన్ తరలింపు

మైనర్ బాలున్ని డీ డిక్షన్ తరలింపు చెన్నూర్ ఆంధ్రప్రభ : గంజాయి కి

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:24 pm

Longford |బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి

Longford | బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి Longford | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:24 pm

మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : అకాల వర్షాలు, ఈదురుగాలులకు

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:18 pm

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల వద్ద 24.45 కిలోల హైడ్రోపోనిక్ ( గాంజా) ను డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఎయిరోపోర్టు అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించిన డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుల లగేజీ బ్యాగేజ్ లో ఆకుపచ్చిని రంగులో ప్యాకెట్లు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్ష చేయగా హైడ్రోపోనిక్ (గంజా) గా తేలింది . హైడ్రోపోనిక్ (గాంజా) స్వాధీనం చేసుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ విలువ 8.9 కోట్లు ఉంటుందని డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆధికారులు అంచనా వేశారు.

మన తెలంగాణ 31 Mar 2026 8:14 pm

చత్తీస్‌గఢ్ ఇక నక్సల్స్ రహిత రాష్ట్రం: సిఎం విష్ణుదేవ్ సహాయ్

చత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సల్స్ రహిత రాష్ట్రమని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సహాయ్ ప్రకటించారు. కేంద్రం విధించిన గడువు మార్చి 31కి అనుగుణంగా చర్యలు చేపట్టామని, తద్వారా లక్షంగా చేరుకున్నామనారు. మంగళవారంనాడు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో విష్ణుదేవ్ మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రత్మక రోజని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ నక్సల్స్‌తో వేదిక పంచుకున్నారని, ఇప్పుడు ఆయన పార్టీ తమపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్ష తీవ్రవాదంపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు 3కోట్ల మంది ఈ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. అభివృద్ధికి తీవ్రవాదం ఇన్నాళ్లూ ఆటకంగా మారిందని అన్నారు. మావోయిస్టలకు గత 40 సంవత్సరాలుగా పెట్టనికోటగా మారిన బస్తర్ ఇప్పుడు పూర్తిగా బయటి ప్రపంచంతో మమేకం కాబోతోందని, తద్వారా పురోభివృద్ధికి బాటలు పడతాయని విష్ణుదేవ్ అభిప్రాయపడ్డారు

మన తెలంగాణ 31 Mar 2026 8:10 pm

Top Actors in Salman Khan’s Next

Bollywood Superstar will soon work with Telugu director Vamshi Paidipally who has directed class films in the past. The combination is surprising and it raised curiosity across Telugu cinema and Hindi cinema. South Indian top beauty Nayanthara is finalized as the leading lady in this untitled film. This project also has several top-rated actors playing […] The post Top Actors in Salman Khan’s Next appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 8:09 pm

భార్య, కొడుకును హతమార్చిన భర్త

 రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సీతారాంనగర్ తాండా గ్రామపంచాయితీ పరిధిలోని పులిగోనిపల్లి తాండాలో మంగళవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త భార్య, కుమారుడు, కూతురును రోకలితో హతమార్చగా భార్య, కుమారుడు సంఘటన స్థలంలోనే మృతిచెందగా, కోన ప్రాణాలతో కూతురు ఉస్మానియా ఆసుపత్రిలో కోట్టుమిట్టాడుతుంది. ఆమనగల్లు ఇన్స్‌పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) సందా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు ఆమనగల్లు మండలం పులిగోనిపల్లి తాండాకు చెందిన బాణావత్ రాందాస్‌నాయక్ ఆమనగల్లు పట్టణ సమీపంలోని కాటన్‌మిల్లులో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూ తాండాలో భార్య కవిత, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు. రాందాస్‌నాయక్ మద్యానికి బానిసై భార్యత కవితతో తరచు గోడవ పడేవాడని, ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భార్య కవిత (28), కూతురు ప్రణీత (9), కుమారుడు హర్షిత్ (7)లను రోకలితో తీవ్రంగా దాడి చేసి హతమార్చాడు. ప్రణీత తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ ఉస్మానియాకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు. రెండవ కూతురు పవిత్ర తన నానమ్మ ఇంట్లో ఉన్నట్లు, మొదటి కూతురు పావని ఆమనగల్లు ప్రభుత్వ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి చుట్టు పక్కన ఉన్నవారు చూసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోని వివరాలను సేకరించినట్లు తెలిపారు. మృతురాలి సోదరి కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లి, కుమారుడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పుత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, గంగాధర్, జానకిరాంరెడ్డిలు సందర్శించారు. క్లూస్ టీం వివరాలను సేకరించింది.

మన తెలంగాణ 31 Mar 2026 8:04 pm

దుర్గమ్మ భక్తులకు పార్కింగ్ టోల్ తాత్కాలిక మినహాయింపు

దుర్గమ్మ భక్తులకు పార్కింగ్ టోల్ తాత్కాలిక మినహాయింపు కొత్త టెండర్ దారుడు బాధ్యతలు

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:03 pm

ఎంత సంపాదించామన్నది కాదు..

ఎంత సంపాదించామన్నది కాదు.. ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:59 pm

అద్భుతమైన విజువల్స్.. అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పలకరించిన హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతోంది. అనుష్క, జయసూర్య కలిసి నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’. మంగళవారం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, శాండీ మాస్టర్‌, వినీత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

మన తెలంగాణ 31 Mar 2026 7:57 pm

పార్కింగ్ టోల్ టెండర్‌ తో భారీ ఆదాయం.

పార్కింగ్ టోల్ టెండర్‌ తో భారీ ఆదాయం. ఇంద్రకీలాద్రి పార్కింగ్ టోల్ టెండర్

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:54 pm

ఇరాన్ అణు కేంద్రం ఉన్న నగరంపై అమెరికా దాడులు..

ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రాలు ఉన్న నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా మంగళవారం భారీ వైమానిక దాడులు జరిపింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్‌లతో దాడి చేసింది. ఈ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అదే సమయంలో పెర్షియన్ గల్ఫ్‌లో పూర్తిగా చమురు లోడ్‌తో వెళ్తున్న కువైట్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలతో అమెరికా -ఇజ్రాయెల్ మొదటి దాడులు ప్రారంభమైన దాదాపు నెల తర్వాత కూడా యుద్ధం తీవ్రత తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 3,000 మందికి పైగా మరణించగా, ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్‌కు 4 డాలర్లను దాటడం కూడా ఈ యుద్ధ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు మార్కెట్లలో కలకలం పెర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ చమురులో ఐదవ వంతు రవాణా జరిగే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం, అలాగే ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం వల్ల గ్లోబల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 106 డాలర్ల వద్ద ఉండగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 45 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ త్వరలో ఆపకపోతే, హార్మూజ్ మార్గం తెరవకపోతే దాడులను మరింత విస్తరించనున్నట్లు హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించాయి. రాజధాని తెహ్రాన్‌తో పాటు ఇస్ఫహాన్ ప్రాంతం లక్ష్యంగా భారీ దాడులు జరిగినట్లు సమాచారం. ఇస్ఫహాన్ ప్రాంతంలో భారీ స్థాయిలో యురేనియం నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఈ ప్రాంతం లక్ష్యంగా మారింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, శుద్ధి చేసిన అధిక యురేనియాన్ని ట్రక్కుల ద్వారా భూగర్భ సొరంగాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ తీరానికి సమీపంలో కువైట్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ట్యాంకర్‌లో మంటలు చెలరేగినా, తరువాత అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దాడిలో చమురు లీకేజీ జరగలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ మిగులు భాగాలు నివాస ప్రాంతంలో పడటంతో నలుగురు గాయపడ్డారు. బహ్రెయిన్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగగా, సౌదీ అరేబియా తన రాజధాని వైపు దూసుకొచ్చిన మూడు క్షిపణులను అడ్డుకుంది. ఇజ్రాయెల్‌లో కూడా భారీ పేలుళ్లు వినిపించాయి. లెబనాన్‌లో శాంతి బలగాలు మృతి ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం కొనసాగుతున్న లెబనాన్‌లో, 24 గంటల్లో ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్‌లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్‌లో కూడా మరణాలు నమోదయ్యాయి. లెబనాన్‌లో 1,200 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరల పెరుగుదలతో పాటు, భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి.

మన తెలంగాణ 31 Mar 2026 7:51 pm

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం రాప్తాడు, ఆంధ్రప్రభ : ఒక కార్యకర్త

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:51 pm

వారం రోజుల అమెరికా పర్యటనకు కెటిఆర్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వారం రోజుల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో కెటిఆర్ ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూహాలపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గతంలో కెటిఆర్ సాధించిన విజయాలు, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకుని ఈ ఆహ్వానం అందింది. వ్యాపార సదస్సుతో పాటు, ఈ పర్యటనలో కెటిఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలవనున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, కొంత సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుమారు వారం రోజుల పాటు అమెరికాలో ఉండనున్న కెటిఆర్, తిరిగి వచ్చాక తన రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 7:45 pm

అటవీశాఖ ఆధ్వర్యంలో నూతన బోరు పంపు

అటవీశాఖ ఆధ్వర్యంలో నూతన బోరు పంపు బోర్ పంపు వేయిస్తున్న దృశ్యం లింగాపురం,

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:26 pm

నేలకొరిగిన మొక్కజొన్న జొన్న పంట…..

నేలకొరిగిన మొక్కజొన్న జొన్న పంట….. రైతన్న కష్టం నేలపాలు.. కుబీర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:22 pm

Sharwa’s Biker Gets A Power Boost From Prabhas

Charming Star Sharwa’s sports and family drama Biker is already racing ahead with strong buzz, and the makers have now added more fuel to the excitement with a special promotional video featuring Prabhas. The video cleverly begins with Prabhas’ social media post praising the trailer, before shifting to a stylish sequence featuring a rider walking […] The post Sharwa’s Biker Gets A Power Boost From Prabhas appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 7:18 pm

రాజకీయ మార్పుల దిశగా అడుగులు

రాజకీయ మార్పుల దిశగా అడుగులు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి శ్రీ సత్యసాయి

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:17 pm

గుజరాత్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..

ఐపిఎల్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపటకలో పంజాప్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీని విజయంతో ప్రారంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.దీంతో గెలుపే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. జట్ల వివరాలు: గుజరాత్ టైటాన్స్ జట్టు: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(డబ్ల్యూ), గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, ఎం షారుఖ్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, డబ్ల్యూ జయంత్ శర్మ, డబ్ల్యూ జయంత్ హెచ్‌వోల్డర్, డబ్ల్యు. బాంటన్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్, మానవ్ సుతార్, కుమార్ కుషాగ్రా, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, నిశాంత్ సింధు, అశోక్ శర్మ పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), శ్రేయాస్ అయ్యర్(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, బెన్ ద్వార్షుయిస్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైషక్, లాకీ వైషక్, ప్రవీవీ విష్ణు, లాక్‌సీ బార్ట్‌లెట్, యశ్ ఠాకూర్, నెహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్, విశాల్ నిషాద్

మన తెలంగాణ 31 Mar 2026 7:14 pm

గాలివాన బీభత్సవం.. రైతులకు అపార నష్టం

గాలివాన బీభత్సవం.. రైతులకు అపార నష్టం నేలకొరిగిన మొక్కజొన్న, జొన్నపంటలు నేలకొరగడంతో దిగులు

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:13 pm

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరారెడ్డి, బిక్షంగౌడ్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరారెడ్డి, బిక్షంగౌడ్ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారతీయ

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:59 pm

సొంతింటి కలను సకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సొంతింటి కలను సకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్వపూర్ సర్పంచ్ రమణ సురేష్

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:55 pm

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలోని విద్యుత్

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:51 pm

Centre Moves to Grant Amaravati Permanent Capital Status, Bill Set for Parliament Introduction

In a major development for Andhra Pradesh, the Union government is set to introduce an amendment bill in Parliament to grant Amaravati permanent legal status as the state’s sole capital. The move is expected to bring an end to years of uncertainty surrounding the capital issue. The Andhra Pradesh Reorganisation Amendment Bill 2026 is likely […] The post Centre Moves to Grant Amaravati Permanent Capital Status, Bill Set for Parliament Introduction appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 6:42 pm

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:34 pm

పొందూరులో టీబీ ముక్త భారత్ అభియాన్

పొందూరులో టీబీ ముక్త భారత్ అభియాన్ క్యాన్సర్ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీపాల్గొన్న

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:30 pm

లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయధాలు స్వాధీనం

బస్తర్ (ఛత్తీస్‌గఢ్): గత కొన్ని నెలలుగా మావోయిస్టులు గుంపులు గుంపులుగా పోలీసు అధికారుల ముందువ లొంగిపోతున్నారు. తాజాగా మరికొంతమంది మావోలు సరెండర్ అయ్యారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని (LWE) నిర్మూలించడానికి కేంద్రం విధించిన గడువుకు కొన్ని గంటల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నలుగురు మహిళలతో సహా ఏడుగురు మావోయిస్టులు మంగళవారం తమ ఆయుధాలతో లొంగిపోయారు. బస్తర్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఏడుగురు మావోలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన ఐదుగురు కేడర్లు దంతేవాడలోని పోలీస్ లైన్స్‌లో సీనియర్ పోలీసు, CRPF అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వ్యక్తులపై సమిష్టిగా రూ. 9 లక్షల రివార్డు ఉంది. వీరిలో భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు, 42 ఏళ్ల సోమ్ కడ్తిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. మరో నలుగురు.. లఖ్మా ఓయం (19), సరితా పోద్యం (21), జోగి కల్ము (20), మోతీ ఓయం (19)ల తల మీద ఒక్కొక్కరికీ లక్ష రూపాయల రివార్డు ఉంది. భారీగా ఆయుధాలు స్వాధీనం పునరావాస పథకం కింద లొంగిపోవాలని ఈ బృందం నిర్ణయించుకుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేడర్లు అందించిన సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు ఆ ప్రాంతంలోని మావోయిస్టుల రహస్య స్థావరాల నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, ఒక కార్బైన్, ఒక .303 రైఫిల్, అనేక బీజీఎల్ లాంచర్లతో సహా 40 ఆయుధాలు ఉన్నాయి. అలాగే, కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో, శంకర్, హిద్మా దోడి అనే మరో ఇద్దరు మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వారిలో ఒకరు అధికారులకు ఏకే-47 రైఫిల్‌ను అప్పగించారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:30 pm

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం బండారాన్ని బయటపెట్టిన ఏసీబీరూ. 20 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:25 pm

చదువుకు నైపుణ్యం తోడైతే ఉత్తమ ఫలితాలు :

చదువుకు నైపుణ్యం తోడైతే ఉత్తమ ఫలితాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.రెండు

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:21 pm

america |ట్రంప్ పాలనపై నిరసన జ్వాలలు.

america | ట్రంప్ పాలనపై నిరసన జ్వాలలు. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:18 pm

ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కస్తూర్బా గాంధీ

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:15 pm

గ్రామీణ పర్యాటక అభివృద్ధిలో ఎదురుమొండి మార్గదర్శి

గ్రామీణ పర్యాటక అభివృద్ధిలో ఎదురుమొండి మార్గదర్శి ఎదురుమొండిలో రివర్ వ్యూ ఎకో పార్క్,

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:09 pm

పౌర హక్కులకు భంగం కలిగించోద్దు…

పౌర హక్కులకు భంగం కలిగించోద్దు… టేకుమట్ల, ఆంధ్రప్రభ : సమాజంలో ఎవరి హక్కులకూ

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:05 pm

Congress : మంత్రి పదవులు రాకనే ఈ ఫ్రస్టేషన్... ఇద్దరూ ఓపెన్ అయ్యారుగా?

కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారారు

తెలుగు పోస్ట్ 31 Mar 2026 6:05 pm

శ్రీ సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం

శ్రీ సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం పరకాల, ఆంధ్రప్రభ): పరకాల

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:03 pm

108 సేవలు అద్భుతం…

108 సేవలు అద్భుతం… పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఇంటి దగ్గరే 108

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:00 pm

కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాపితంగా నిషేధించాలి..

కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాపితంగా నిషేధించాలి.. గడ్డి మందు నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానించడం

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:59 pm

రేవంత్ పై ప్రవీణ్ సంచలన కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 31 Mar 2026 5:46 pm

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు, ఎంపి సోనియా గాంధీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జ్వరంతోపాటు స్వల్ప అనారోగ్యం కారణంగా మార్చి 24న రాత్రి 10 గంటల సమయంలో సోనియా గాంధీ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు.  డాక్టర్ డి.ఎస్. రాణా, డాక్టర్ ఎస్. నంది, డాక్టర్ అరూప్ బసుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కోసం యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించగా, ఆమె చికిత్సకు బాగా స్పందించారని సర్ గంగా రామ్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. చికిత్స అనంతరం ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చారని చెప్పారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, సోనియా తన నివాసంలో కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 5:30 pm

యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసరాల సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి కు వినతి పత్రాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ ముసుగు మధు ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ పట్టణం నందు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు యుద్ధం పేరు చెప్పుకొని విపరీతంగా పెంచడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, నిత్యావసర సరుకులు […] The post యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 5:28 pm

Murder Case |చేపల వేట వివాదంలో…

Murder Case | చేపల వేట వివాదంలో… Murder Case | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:24 pm

1,500 tarpaulins |ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

1,500 tarpaulins | ఇబ్బంది పెడితే కఠిన చర్యలు 1,500 tarpaulins |

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:24 pm

పత్రికారంగంలో ఏఐ ప్రభావం...భూటాన్ ఏఐ సదస్సులో ఉడుముల

భూటాన్ లో కృత్రిమ మేధస్సు, మీడియా సదస్సు జరిగింది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 5:20 pm

ఎల్‌ఎన్ గార్డెన్‌లో కీలక సమావేశం..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:19 pm

పేదింటి పెళ్లికి అండగా నిలిచిన సామాజికవేత్త కోడం శివకృష్ణ

కరీమాబాద్, ఆంధ్రప్రభ: పేదింటి ఆడబిడ్డ వివాహానికి సామాజికవేత్త కోడం శివకృష్ణ సహాయం అందించారు.

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:13 pm

ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం..

ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్‌డీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 4 వినతిపత్రాలను సమర్పించారు అని తెలిపారు. అందులో 2 వినతిపత్రాలు మున్సిపాలిటీకి సంబంధించినవిగా, మిగతా 2 వినతిపత్రాలు రెవెన్యూ […] The post ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 5:10 pm

గతంలో అమరావతికి జగన్ మద్దతు తెలిపారు : లావు శ్రీకృష్ణదేవరాయులు

అమరావతి: బుధవారం ఎపి పార్లమెంటుకు అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశ పెడతామని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. బిల్లు ద్వారా రైతులకు మరింత భరోసా అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చారని, ఎపి పరిస్థితులను కేంద్రం అర్థం చేసుకుందని తెలియజేశారు. గతంలో అమరావతికి మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారని, అధికారం వచ్చాక జగన్ మాటలు మార్చారని శ్రీకృష్ణదేవరాయులు విమర్శించారు. రాజధాని అమరావతిని అడ్డుకోవాలని చూశారని, జగన్ అసెంబ్లీకి రాకపోయినా ప్రజలు పట్టించుకోరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతే శాశ్వత రాజధానని లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 31 Mar 2026 5:08 pm

సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఒడితల రైతు వేదికలో మంగళవారం నేషనల్ మిషన్

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:05 pm

నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు

పది లీటర్లు నాటు సారాయి స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ చంద్రమణివిశాలాంధ్ర ధర్మవరం అనంతపురం : డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో నాటు సారాయి తయారీదారులు అమ్మకపుదారులపై దాడులు నిర్వహించారు. అనంతరం సిఐ చంద్రమణి మాట్లాడుతూ ఈ దాడుల్లో మండల పరిధిలోని నేలకోట తండా గ్రామములోని మారెమ్మ గుడి వద్ద నేలకోట తండా గ్రామానికి చెందిన వి ఆంజనేయులు నాయకులు అరెస్టు చేసి అతని వద్ద 10 […] The post నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 5:04 pm

ఉప్లూర్ లో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:01 pm

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో పశుసంవర్ధక

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:56 pm

భాదిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఖమ్మం మల్లయ్య(63) అనారోగ్యంతో మృతి

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:50 pm

రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు

విశాలాంధ్ర ధర్మవరం; హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మోక్షిత కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ సాధించింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ“మోక్షిత కృషి, నిబద్ధత ప్రశంసనీయం” అని అన్నారు. ప్రిన్సిపాల్ గోపీనాథ్ మాట్లాడుతూ, “రిషి విద్యాలయ విద్యార్థులకు చదువుతో పాటు వారి ప్రతిభను, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది అని తెలిపారు. మోక్షిత […] The post రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:46 pm

బాసరలో దేవాదాయశాఖ కమిషనర్ పర్యటన..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో రాష్ట్ర

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:43 pm

Shocker: DSP unfollows Harish Shankar

The entire Tollywood is aware of the great bond between director Harish Shankar and music composer Devi Sri Prasad. Taking social media platform Twitter, the duo exchanged messages complementing each other several times. They also worked together for films like Gabbar Singh, Duvvada Jagannadham and Ustaad Bhagat Singh. For their recent combo Ustaad Bhagat Singh, […] The post Shocker: DSP unfollows Harish Shankar appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 4:38 pm

వేసవి కాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతివిశాలాంధ్ర ధర్మవరం:: వేసవికాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో పసిపిల్లల తల్లిదండ్రులకు వయోవృద్ధులకు ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న పిల్లలు, గర్భవతులు, వయోవృద్ధులు ఎండ సమయంలో మధ్యాహ్నం వేల అనవసరంగా బయట తిరగరాదని, రోడ్డుపై తినుబండారాలను తినరాదని, ద్రవపదార్థాలను ,నీళ్ల, మజ్జిగ, టెంకాయ నీళ్లు, […] The post వేసవి కాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:36 pm

ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన వెంకీ (12) అను బాలుడు తన తోటి స్నేహితులతో అదే గ్రామంలో గల బావిలోకి ఈతకు వెళ్లి, ఈత సరిగా రాక వెంకీ అనే విద్యార్థి బావిలోనే మునిగి మృతి చెందాడు. వెంకీ అనే విద్యార్థి ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని తెలిపారు. మృతుని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారని తెలిపారు. తదుపరి రూరల్ పోలీసులు కేసు […] The post ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:31 pm

తిరుమలలో భక్తుల రద్దీ.. 20 కంపార్టుమెంట్లు ఫుల్

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,241 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.08 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. 

మన తెలంగాణ 31 Mar 2026 4:30 pm

అభివద్ది సంక్షేమం పై దష్టి వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను జనరల్ వార్డులోకి2019 2024 వరకు ఆర్థిక విద్వంసం నేడు సంపద సష్టించు కుంటూ రాష్ట్ర అభివద్ది… ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు ,మంత్రి టీజీ భరత్ గుప్తా

:విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కూటమి ప్రభుత్వం అభివద్ది సంక్షేమం రెండు కళ్ళవలే చూస్తూ సంపదను సష్టించుకుంటూ అభివద్ది చేస్తుందని,,2019 `2024 5సంవత్సరాలల్లో వైసీపీ రాష్ట్రంలో ఆర్థిక విద్వంసం చేసిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్‌గుప్తా, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌లతో కలసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా పాలన […] The post అభివద్ది సంక్షేమం పై దష్టి వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను జనరల్ వార్డులోకి2019 2024 వరకు ఆర్థిక విద్వంసం నేడు సంపద సష్టించు కుంటూ రాష్ట్ర అభివద్ది… ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు ,మంత్రి టీజీ భరత్ గుప్తా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:29 pm

రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులువిశాలాంధ్ర- ధర్మవరం; రైలు నుంచి జారిపడి విగ్నేష్ (15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి వేసవి సెలవులు నిమిత్తం గుల్బర్గా జిల్లా గానుగాపూర్ కు రైల్లో ప్రయాణిస్తున్నాడు. మూత్రం పోయడానికి బాత్రూం దగ్గరకు వెళ్ళగా జారిపడి, మృతి చెందడం జరిగిందన్నారు. తల చిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ […] The post రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:26 pm

నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు

నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపికవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు […] The post నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:21 pm

చెత్త తరలింపు వాహనాల పంపిణీ

విశాలాంద్ర- వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : స్వర్ణఆంద్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయంవద్ద మంగళవారం చెత్తతరలింపు వాహనాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మండలంలోని శాఖవరం, వలేటివారిపాలెం, పోకూరు పంచాయతీలకు ట్రాక్టర్ ట్రక్కులు, 13 పంచాయతీలకు 14 ఆటోరిక్షాలను అందజేశారు. అలాగే చెత్తకు బదులుగా చిల్లర సరుకులు అందించే స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బంది వాహనాలను సక్రమంగా వినియోగిస్తూ… ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే […] The post చెత్త తరలింపు వాహనాల పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:08 pm

VerSe Innovation: ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్ రమేష్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ 'VerSe Innovation' తన వ్యూహాత్మక వృద్ధిలో భాగంగా కీలక అడుగు వేసింది. దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్ అడ్వైజర్లలో ఒకరైన పి.ఆర్. రమేష్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది. ఆయన బోర్డులో సభ్యుడిగానే కాకుండా, ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఎవరీ పి.ఆర్. రమేష్? చార్టర్డ్ అకౌంటెంట్‌గా 40 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న పి.ఆర్. రమేష్.. గతంలో డెలాయిట్ ఇండియా (Deloitte India) ఛైర్మన్‌గా పనిచేశారు. డెలాయిట్ గ్లోబల్ బోర్డులో కూడా సభ్యుడిగా సేవలందించారు. బోర్డు అనుభవం: ప్రస్తుతం పి.ఆర్. రమేష్‌ ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల బోర్డుల్లో కొనసాగుతున్నారు. అవార్డులు: 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుండి బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. విధాన నిర్ణేత: సెబీ (SEBI), ఆర్బీఐ (RBI), ఐఆర్డీఏ (IRDA) వంటి నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో సభ్యుడిగా ఉండి, దేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. సంస్థ బలోపేతం దిశగా.. VerSe సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ, ఒక సంస్థ కాలపరీక్షను తట్టుకొని నిలబడాలంటే బలమైన ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత అవసరం. రమేష్ గారి అనుభవం మా గవర్నెన్స్ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. VerSe Innovation ప్రస్థానం టెక్నాలజీ సాయంతో డిజిటల్ అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రారంభమైన VerSe Innovation, నేడు వందల మిలియన్ల మందికి స్థానిక భాషల్లో కంటెంట్‌ను అందిస్తోంది. ప్రధాన యాప్స్: డైలీహంట్ (Dailyhunt), జోష్ (Josh), మ్యాగ్జ్‌టర్ (Magzter), నెక్స్ వర్స్ (NexVerse.ai). పెట్టుబడిదారులు: గూగుల్, మైక్రోసాఫ్ట్, సెకోయా కాపిటల్, గోల్డ్ మాన్ సాక్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. వరుసగా కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న VerSe Innovation, పి.ఆర్. రమేష్ వంటి దిగ్గజం బోర్డులోకి రావడం ద్వారా తన సంస్థాగత విశ్వసనీయతను మరింత పెంచుకుంది. పారదర్శకమైన ఆర్థిక విధానాలతో సుస్థిర వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు స్పష్టమవుతోంది.

మన తెలంగాణ 31 Mar 2026 4:06 pm

Video : Hero Sangeeth Sobhan Exclusive Interview

The post Video : Hero Sangeeth Sobhan Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 4:06 pm

closeness2crime |పెరుగుతున్న నేరాల వెనుక నిజాలు

closeness2crime | పెరుగుతున్న నేరాల వెనుక నిజాలు closeness2crime | పరిచయస్తుల మధ్యే

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:05 pm

HYD |ఇద్దరు పిల్లలను చంపి.. తల్లికూడా…

HYD | ఇద్దరు పిల్లలను చంపి.. తల్లికూడా… HYD | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:05 pm