SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
...

వార ఫలాలు (22-02-2026 నుండి 28-02-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ధనాన్ని సాధ్యమైనంత వరకు పొదుపు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి .వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గృహారంభం చేయగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ముందుకు వెళ్తారు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. డాక్యుమెంట్ రైటర్స్ కి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిధున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా కొంత చికాకు ఏర్పడుతుంది. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి . వృత్తి వ్యాపారములలో నష్టాలు వచ్చే సూచనలున్నవి. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచడం వలన లాభపడతారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తను వింటారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని ఒడిదొడుకులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం లేదు అనే భావన కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి . పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అస్తమ శని నడుస్తుంది. రాబడి బాగుంటుంది. సహోదరీ సహోదరుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది జాగ్రత్త వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. కొద్దికాలం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఏదో ఒక శనివారం శనికి డైలాగు శకం చేయించండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయండి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెడు అలవాట్లకు స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది చదువుపై శ్రద్ధ వహించండి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధిత విష వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయ. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి కష్టపడి చదవాలి. చదువుపై శ్రద్ధ వహించండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవండి. ఋణాలు తీర్చగలుగుతారు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం రోజున ఎరుపు వత్తులతో సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులా రాశి వారికి ఈ వార మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యక్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా వస్తుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారి పోతాయి. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. క్రెడిట్ కార్డులకి పర్సనల్ లోన్లకి దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మంచి లాభాలు అందుకుంటారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నలుగురిలో మీ ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి దుర్ వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి లాగే వారు ఎక్కువగా ఉంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. మంగళవారం శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు._ప్రతి విషయంలో కూడా గోప్యత అవసరం. వ్యాపారంలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టపడతారు. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. భూ వివాదాలు తీరుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభం రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రతి విషయంలో క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. పునర్ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తోంది. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి హోటల్ వ్యాపారస్తులకు మంచినీటి వ్యాపారం చేసేవారికి అంచు లాభాలు ఉంటాయి. ఆర్ధిక విషయంలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. అహంకారపూరితమైన ధోరణి అవలంబించవద్దు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనయోగం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. శనికి తైలాభిషేకం చేయించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  

మన తెలంగాణ 22 Feb 2026 12:20 am

జాగృతీ.. జర జాగ్రత్త!

తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టమైపోయింది. ఆమె ఒక పార్టీ పెట్టబోతున్నారన్నమాట కొంతకాలం క్రితమే ఖాయమైనా ఎప్పుడు పెడతారనే విషయం మాత్రం గురువారంనాడు స్పష్టమైంది. మే నెలలో రాజకీయ పార్టీ ప్రారంభానికి ముహూర్తం పెట్టుకున్నానని తానే పత్రికల వారితో చెప్పారు. ఇది ఎవరికీ ఆశ్చర్యం కలిగించే విషయం కానీ, దిగ్భ్రాంతి గొలిపే విషయం కానీ కాదు. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న భారత రాష్ట్ర సమితి నుండి సస్పెండ్ అయిననాడే ఆ ఛాయలు గోచరించాయి.వచ్చే మే మాసంలో కవిత ప్రారంభించబోయే రాజకీయ పార్టీ పేరు బహుశా తెలంగాణ జాగృతి పార్టీ అయి ఉంటుంది. ఆమె తన పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందన్నారు కాబట్టి, జాగృతి పేరిట చేసిన కార్యక్రమాలతో ఆమె తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఎంతో గుర్తింపు పొంది ఉన్నారు కాబట్టి తెలంగాణ, జాగృతి.. ఈ రెండు పదాలు పార్టీ పేరులో ఉండేట్టు చూసుకుంటారని అర్థం అవుతున్నది. ప్రస్తుతానికి ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరు తెలంగాణ జాగృతి పార్టీ (టీజేపీ) అనుకుందాం. భారత పౌరురాలిగా రాజకీయ పార్టీని పెట్టుకునే హక్కు, స్వేచ్ఛ కవితకు పూర్తిగా ఉన్నాయి. ఆమె మొన్నటి పత్రికాగోష్ఠిలో ఒక మాట అన్నారు. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అని. పార్టీ ఇంకా ప్రారంభించక ముందే పాస్, ఫెయిల్ లెక్కలు ఎందుకు గాని, మగ అయినా ఆడ అయినా ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంటే చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని బజారుకు వెళ్లి వచ్చినంత సులభమే కావచ్చు, కానీ, వాటిని నిలబెట్టడం, అంతిమ లక్ష్యమైన అధికారానికి చేరుకోవడం అన్నది అందరి వల్ల అయ్యే పని కాదు.దేశమంతటా ఎందుకు, మనం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయినా, విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా కనీసం వేళ్ళ మీద లెక్కబెట్ట గలిగినంతమంది పార్టీలు పెట్టారు కదా, ఏమయ్యారు వాళ్లంతా? ఒక నాయకుడి మీద కోపంతోనో, ఒక రాజకీయ పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదన్న దుగ్ధతోనో లేదా గ్లామర్ ను ఉపయోగించుకుని అప్పనంగా అధికారంలోకి వచ్చేద్దామనుకునో పార్టీలు పెట్టినంత మాత్రాన అవి నిలబడవు. మన రాష్ట్రంలో, దేశంలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, వాటి మనుగడ, కొనసాగింపు గురించి త్వరలో మరో ప్రాంతీయ పార్టీకి ప్రాణం పోయనున్న కవిత అధ్యయనం చేసే ఉండాలి. లేదా అటువంటి విషయాలలో సంపూర్ణ అవగాహన కలిగినవారితో సంప్రదింపులు, చర్చలు జరిపి ఉండాలి. రాజకీయాల్లో మగవాళ్ళ ఫెయిల్యూర్ గురించిన ప్రస్తావన ఆమె ఎందుకు తీసుకొచ్చారంటే బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ పెట్టి ఫెయిల్ అయినందున ఆమెతో తనను పోల్చుతున్నారనే ఆలోచనతో ఆ మాట అంటూ ఉండవచ్చు. ఇందులో లింగ వివక్ష ఏమీ ఉండదు. పార్టీలు పెట్టేవాళ్ళు ఆడ అయినా, మగ అయినా అవి దీర్ఘకాలం మనుగడ సాగిస్తాయా, పుబ్బలో పుట్టి మఖలో మాడిపోతాయా అన్నది ఆనాటి రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.1982 లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేనాటికి ఆయనకు రాజకీయాల్లో ఏబిసిడిలు తెలియవు. కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ మైదానంలో ఫుట్బాల్ ఉందిగానీ ఆడేవాళ్లే లేరు. గ్రౌండ్ అంతా ఆయనదే. అంతకుముందు జాతీయస్థాయిలో శ్రీమతి ఇందిరాగాంధీ చారిత్రక కాంగ్రెస్ పార్టీని చీల్చి కొత్త పార్టీ పెట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి. ఆ పార్టీ చేసిన తప్పుల వల్ల ఐదేళ్లలోనే మైదానం ఖాళీ అయింది ఎన్టీఆర్ కు అవకాశం వచ్చింది. ఆ తర్వాతి కాలంలో నాదెండ్ల భాస్కరరావు, లక్ష్మీపార్వతి, మధ్యలో జానారెడ్డి , వసంత నాగేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తిత్రయం, తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పార్టీని చీల్చి పార్టీలు పెట్టుకున్నారు. ఈ జాబితాలో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప అందరూ ఫెయిల్ అయిన మగవాళ్లే, ఒక్క లక్ష్మి పార్వతిని మినహాయిస్తే. తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకుని గాని, ఉన్న రాజకీయ పార్టీల్లోనే పనిచేస్తూ గానీ పెద్దగా రాణించిన మహిళలు తక్కువ. ఇప్పుడు తానంత తీవ్రంగా విమర్శిస్తున్న తన మాజీ పార్టీలో కూడా ఒక మంత్రివర్గంలో కేసీఆర్ మహిళలకు స్థానం కల్పించకపోగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారోత్సవ సమయంలో విలేకరులు ఒక మగ మంత్రిని ‘మీ మంత్రివర్గంలో మహిళలు కనిపించడం లేదేమిటి?’ అనడిగితే ఇంట్లో ఉన్నారని చెప్పి తీవ్ర విమర్శలకు గురయిన విషయం తెలిసిందే. కవిత అప్పటికి ఆపార్టీలోనే ముఖ్య నాయకురాలుగా ఉన్నారు.మహాపర్వతాల్లాంటి రాజకీయ పార్టీలను ఢీకొట్టి నిలిచి గెలిచిన మహిళలు మనకు కనిపిస్తారు. ఇందిరాగాంధీ, ఆమె పార్టీలోనే రాజకీయాలు నేర్చుకున్న మమతా బెనర్జీ, పొరుగున తమిళనాడులో జయలలిత, ఉత్తరాదిన మాయావతి వంటి వాళ్ళు ఈ దేశ రాజకీయాల్లో కచ్చితంగా తమదైన, బలమైన ముద్ర వేశారు. కాబట్టి కవిత మహిళ కాబట్టి ఆమె రాజకీయాల్లో ఫెయిల్ అవుతారని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. షర్మిల కూడా మహిళ కాబట్టి ఫెయిల్ కాలేదు. ఆమె రాజకీయాలకోసం ఎంచుకున్న ప్రాంతం కానీ సమయం కానీ ఆ వైఫల్యానికి కారణం. పత్రికల వాళ్ళు రాసేవన్నీ నిజమే అనుకుని కూడా రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి షర్మిల పెద్ద ఉదాహరణ. షర్మిల ఫెయిల్యూర్ లీడరేం కాదు, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అని కవిత సర్టిఫికెట్ ఇచ్చినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి అధ్యక్షురాలిగా షర్మిలను నియమించాలన్న పనికిమాలిన ఆలోచన ఎవరిదైనా అదెంత వృథాప్రయాసో ఆరాష్ట్ర రాజకీయాల్ని పరిశీలిస్తున్న వాళ్ళందరికీ అర్థం అవుతున్నది. ఇక పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవాళ్ళని గురించి కూడా చాలా మాట్లాడుకోవచ్చు. ఇప్పటి తరానికి గుర్తుందో లేదో కానీ, ఇలాంటివన్నీ గుర్తుండాలంటే చరిత్ర చదవాలి. రాజకీయాల గత చరిత్రను తెలుసుకునే అంత ఆసక్తి ప్రస్తుత తరానికి ఉందో లేదో తెలియదు కానీ, ఏవీఎస్ రెడ్డి అని ఒక అత్యంత సమర్థవంతుడైన ఐఏఎస్ అధికారి ఉండేవారు. ఆయనకు ఎందుకు వచ్చిందో ఆలోచన హఠాత్తుగా సర్వీస్ కి రాజీనామా చేసి ‘భారతదేశం’ పేరిట రాజకీయ పార్టీ ప్రారంభించారు. అది అడ్రస్ లేకుండా పోయింది. అదృష్టం కొద్దీ ఆయనకు తన ఉద్యోగం మళ్ళీ లభించింది. 2009 కి ముందు ప్రముఖ సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అధికారంలోకి రావడానికి అది సరైన సమయం కాకపోయినా ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజికవర్గం రా జకీయంగా ప్రాధాన్యత లభించడం లేదన్న అ సంతృప్తితో రగిలిపోతున్న కాలం కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 స్థానాల్లో ఓ 18 స్థానాలు గెలుచుకోగలిగారు. ఓర్పు చాలా అవసరం. రాజకీయాల్లో కోరిక అనే గుర్రం ఎక్కాలని అందరికీ ఉంటుంది. ఎక్కుతారు కూడా. కానీ ఆ గుర్రం మన అదుపులో ఉందో లేదో చూసుకోవాలి. గుర్రాన్ని అదుపులో పెట్టే యుక్తి, ఓపిక చిరంజీవికి లేకపోయింది. చాలా కొద్దికాలం ఓపిగ్గా పార్టీ నడిపి ఉంటే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగి వచ్చే అవకాశం ఉండేది. అంటే, ఆ తర్వాత జనసేన పేరిట ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టలేదా, నూటికి నూరు శాతం గెలిచి 2024లో 21 స్థానాలు సంపాదించలేదా అనొచ్చు ఎవరైనా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ముక్కు పచ్చలారని పసిపిల్లలను అడిగినా చెప్తారు పవన్ కళ్యాణ్ కానీ, ఆయన పార్టీ గానీ అక్కడ ఏ స్థితిలో ఉందో. అలాగే మరికొందరు మగధీరులు కత్తులు పట్టుకొని, గుర్రాలు ఎక్కి రాజకీయరంగంలోకి దూకి తాము పట్టినవి కత్తులు కావు అట్టముక్కలని అర్థం అయ్యాక తోకముడిచిన విషయం తెలిసిందే. ఏవీఎస్ రెడ్డి బాటలోనే మరికొందరు ప్రముఖ సివిల్ సర్వీస్ అధికారులు తెలుగునాట రాజకీయాల్లోకి వచ్చారు. వారంతా అరవింద్ కేజరీవాల్, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ లాగా విజయం పొందలేదు. డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ముగ్గురూ ఏమయ్యారు? డాక్టర్ జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మంచిపేరు తెచ్చుకొని, దాన్ని రాజకీయ పార్టీగా మార్చాక ఒకేఒక్కసారి కూకట్ పల్లి నుంచి శాసనసభకు తాను ఒక్కడే ఎన్నికై ఆ తర్వాత కాలంలో ఆ పార్టీని ఏం చేశారో అందరికీ తెలుసు. జెడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారి. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో ఆరోపణలు వస్తే విచారించి జైల్లో పెట్టినందుకు వచ్చిన పలుకుబడి, ప్రచారం తనను రాజకీయాల్లో ఎక్కడికో తీసుకుపోతుందనుకున్నారు, ఎక్కడికీ తీసుకు పోలేదు. ఆయనను చివరికి మేఘ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేర్చింది. కవిత ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఈ వరుసలో ఇంకా చాలామంది ఉన్నారు. ఆమె వదిలి వచ్చిన భారత రాష్ట్ర సమితి మీద ఇప్పుడు ఈగ కూడా వాలనివ్వని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో ప్రజాదరణ పొందిన ఐఏఎస్ అధికారి. ప్రాంతీయ పార్టీ పెడితే పప్పులు ఉడకవన్న విషయం అర్థమై మాయావతి పార్టీ బహుజన సమాజ్ లో చేరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉచ్చరించలేని భాషలో నిందించి, ఇది మనవల్ల అయ్యే పని కాదని అదే పార్టీ పంచన చేరారు. కవిత చెప్పినట్టుగా ఇంకా కొంతమంది మగ రాజకీయ నాయకులు రాజకీయ గుర్రాల మీద స్వారీ చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్న మాట నిజమే. అందులో రెండు మూడుసార్లు పార్టీలు అటు ఇటు మార్చిన, మంత్రి పదవి రానందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు కావచ్చు. పురుషులైనా స్త్రీలైనా రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీలు పెట్టుకున్న వాళ్ళందరూ విఫలమవుతారని ఏం లేదు. రాజకీయాల్లో అద్భుతంగా రాణించిన పురుషులు కూడా ఉన్నారు. అందరికన్నా పెద్ద ఉదాహరణ కెసిఆర్. ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించి, అందునా ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ కాలం ఉద్యమం నడిపి, విజయం సాధించి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటికింకా తెలంగాణ రాజకీయాల మీద, భారత రాష్ట్ర సమితి మీద ఎవరు కాదన్నా ఆయనది చెరగని ముద్ర. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వంటి ఒక మహా పర్వతాన్ని ఢీకొట్టి , సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టుకొని , కేసులపాలై జైలుకు వెళ్లి కూడా విజయం సాధించిన యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మహారాష్ట్రలో శరద్ పవర్ కాంగ్రెస్ ను ఎదిరించి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన, అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ జనతాదళ్ చీలిక పార్టీ బిజెడిని సమర్థవంతంగా కొన్ని దశాబ్దాలపాటు నడిపించిన చరిత్ర మన కళ్ళ ముందుంది.ఇక ప్రస్తుతానికి వస్తే కవిత ప్రారంభించబోయే కొత్త రాజకీయ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపు మూడు సంవత్సరాలు సమయం ఉన్నది. ఆనాటికి పరిస్థితులు ఎలా మారతాయన్న విషయం ఇప్పుడే జోస్యం చె ప్పడం సరైనది కాదు. కానీ రాజకీయ పరిశీలకులు ఎవరై నా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసి, ఆయా రాజకీయపక్షాల బలాబలాలను అంచనా వేసి ఎన్నికలలో ఏం జరగవచ్చో ఊహాగానం చేస్తూ ఉంటారు, అంచనాలకు వ స్తూ ఉంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మై దానం కవిత ఫుట్బాల్ ఆడుకోవడానికి ఖాళీగా ఉన్నదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. పదేళ్లు ప్రభుత్వం మాదేనన్న ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో చెక్కుచెదరటం లేదు. ఇంకో పక్కన పైకి ఏం చెబుతున్నా బిఆర్‌ఎస్‌ను మింగేసి, సాధ్యపడకుంటే లొంగదీసి తెలంగాణలో అధికారం ఛేజిక్కించుకో చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ.. వీటి మధ్య కవిత అయినా ఇంకెవరయినా పెట్టే కొత్త పార్టీకి వచ్చే ఎన్నికలనాటికి చోటు ఏర్పడుతుందా? కన్నతండ్రితో సహా కుటుంబంలో అందరినీ కాదనుకుని చేయబోయే రాజకీయంలో కవిత గెలుస్తారా? మహిళలు రాజకీయాల్లో నిలిచి గెలవాలనే కోరుకుందాం.  Delete Edit

మన తెలంగాణ 22 Feb 2026 12:11 am

బిజెపి ఎంఎల్‌ఎ లంచావతారం

గడగ్: కర్నాటకలో బిజెపి ఎమ్మెల్యే చంద్రూ లమాని రూ 5 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. గడగ్ లోకాయుక్త పోలీసులు వలపన్ని ఈ బిజెపి ఎమ్మెల్యే ఆటకట్టించారు. ఓ కాంట్రాక్టరు ఇచ్చిన ఫిర్యా దు మేరకు లోకాయుక్త రంగంలోకి దిగింది. చించాలికి చెందిన క్లాస్ 1 కాంట్రాక్టరు విజయ్ పూజర్ ఈ ఎమ్మెల్యే లంచావతారాన్ని వెలుగులోకి తీసకువచ్చారు. నీటి పారుదల శాఖ లో పనికి అనుమతి కోసం షిరహతి అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే రూ 11 లక్షల లంచం అడిగినట్లు ఫిర్యాదీ లోకాయుక్తకు తెలిపారు. లోకాయుక్త వ్యూహం ప్ర కారం ముందుగా రూ 5లక్షలతో కాంట్రాక్టరు ఎమ్మెల్యే వద్దకు వచ్చి, డబ్బు అందజేస్తుండగా లోకాయుక్త పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యేను పట్టుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో సంచలనానికి దారితీసింది. ఎమ్మె ల్యే వెంట ఆయన పిఎలు మంజునాథ వాల్మీకి, గురు నాయక్ కూడా ఉన్నారని వెల్లడైంది. ఎమ్మెల్యే వ్యవహారంపై లోకాయుక్త దర్యాప్తు సాగుతోంది. 

మన తెలంగాణ 21 Feb 2026 11:53 pm

డిఎంకె కూటమిలోకి పన్నీర్‌సెల్వం చేరిక?

బహిష్కరణకు గురై న ఎఐఎడిఎంకె నాయకుడు ఒ పన్నీర్ సెల్వం డిఎంకె కూటమి లో చేరతారని ఎండిఎంకె చీఫ్ వై కో సంకేతాలిచ్చారు. చెన్నైలో ఫిబ్రవరి 20న సిఎం ఎంకె స్టాలిన్‌తో సెల్వం సమావేశం కావ డం ఈ ఊహాగానాలను బలపరుస్తోందని వైకో చెప్పారు. నిన్న నే ఆయన చేరారని వైకో తెలిపారు. స్టాలిన్‌తో సమావేశమైన తరువాత ప న్నీర్‌సెల్వం మాట్లాడుతూ రాను న్న అసెంబ్లీ ఎన్నిక ల్లో డిఎంకె వచ్చే అవకాశం ఉం దని, రెండోసారి కూడా స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రజ లు సాధారణంగా అనుకుంటున్నారని వైకో పేర్కొన్నారు. తమిళనాడులో కూటమి ప్రభుత్వంవచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ద్రవిడియన్ నాయకులే స్వయంగా అసాధారణ మెజార్టీతో తిరిగి అధికారం లోకి వస్తారని చెప్పారు. రానున్న అసెం బ్లీ ఎన్నికలు డిఎంకెకు పెద్ద బలపరీక్షేమీ కాదని, చాలా సీట్లు డిఎం కె గెల్చుకుంటుందని వైకో చెప్పా రు. కూటమి ప్రభుత్వం మాత్రం ముమ్మాటికీ రాదని నిర్ధారిస్తున్నానని తెలిపారు. 

మన తెలంగాణ 21 Feb 2026 11:30 pm

మార్చి 31లోగా దేశంలో నక్సలిజం నిర్మూలన: అమిత్‌షా

ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31 లోగా దేశంలో నక్సలిజం పూర్తిగా నిర్మూలించబడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రంలో మొట్టమొదటిసారి నిర్వహించిన 87 వ సిఆర్‌పిఎఫ్ డే పెరేడ్‌ను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు. దేశంలో 12 రాష్ట్రాల్లో, లెక్కలేనన్ని జిల్లా ల్లో విస్తరించిన నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీఆర్‌పిఎఫ్, కో బ్రా ఫోర్స్ అధికారులు తమ సామర్థంతో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని ప్రశంసించారు. ఇంతభారీ, సంక్లిష్ట, కష్టతరమైన టాస్క్ కేవలం మూడేళ్ల లోనే పూర్తి చేయడమైందన్నారు. సీఆర్‌పిఎఫ్ దళాల సామర్థం వల్ల నే మార్చి 31 నాటికి దేశం మొత్తం నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందగలదని చెప్పగలుగుతున్నామని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దు లోని కర్రెగుట్ట కొండల్లో 2025 ఏప్రిల్‌- మే మధ్యకాలంలో అసాధారణ భౌగోళిక పరిస్థితులు, భరించలేని ఉష్ణోగ్రతల్లో కూడా 21 రోజుల పాటు సిఆర్‌పిఎఫ్ నిర్వహించిన ఆపరేషన్‌లో 31 మంది నక్సల్స్ హతమయ్యారని గుర్తు చేశారు. ‘ఎర్ర ఉగ్రవాదం’ నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో సీఆర్‌పిఎఫ్, కోబ్రా దళాలు చెప్పుకోతగిన కార్యక్రమాలు చేపట్టారని ఉదహరించారు.14 సిఆర్‌పిఎఫ్ జవాన్లు శౌర్యసాహసాల అవార్డులు సాధించగా, వీరిలో ఐదుగురు విశిష్ట సేవ చేసినందుకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ గ్రహించారని, మరోఐదు బెటాలియన్లు అత్యుత్తమ పనితీరుకు అవార్డులు పొందినట్టు అమిత్‌షా చెప్పారు. దేశం సురక్షితంగా ఉండేందుకు మొత్తం 2270 సీఆర్‌పిఎఫ్ జవాన్లు తమ జీవితాలను త్యాగం చేశారని, వారికి యావత్తు దేశం కృతజ్ఞలతో నివాళి అర్పించుకుంటుందని అమిత్‌షా తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ,సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జిపి సింగ్ ,ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన తెలంగాణ 21 Feb 2026 11:21 pm

హీలింగ్ క్యాపిటల్‌గా హైదరాబాద్

 ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను హీలింగ్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్‌ను... డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. లండన్ కే.ంద్రంగా పనిచేసే (పిహెచ్‌యుఎస్‌ఇ(ఫుస్) ఆధ్వర్యంలో పిహెచ్‌యుఎస్‌ఇ ఎపిఎసి కనెక్ట్ 2026 పేరిట శనివారం హెచ్‌ఐసిసిలో నిర్వహించిన సదస్సులో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు మేధోమథనం చేశారు. ఈ కాన్ఫరెన్స్ ముగింపు వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెల్త్ కేర్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్లినికల్ సైన్స్, ఎఐ, రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా క్లినికల్ రీసెర్చ్‌లో విప్లవాత్మక మార్పులొస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే తెలంగాణలో అభివృద్ధి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే... ఎఐ సిటీ, యంగ్ ఇండియన్ స్కిల్స్ వర్సిటీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, డేటా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైలింగ్, మెడికల్ టూరిజం పాలసీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్‌కు శ్రీకారం చుట్టామన్నారు. సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. అందుకోసం... పరిశోధకులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరిశోధకులను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో పిహెచ్‌యుఎస్‌ఇ బోర్డు ఛైర్మన్ స్టీఫెన్ బాఫోర్డ్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేష్ సింగ్, ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మన తెలంగాణ 21 Feb 2026 11:18 pm

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం1,537 కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, క్రమశిక్షణతో కూడిన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది […] The post రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:12 pm

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది ంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు […] The post నేడు జీడీఎస్మహా సమ్మేళనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:10 pm

జహీరాబాద్‌లో వివాహిత అదృశ్యం

 జహీరాబాద్ పట్టణంలోని కాంత రెడ్డి కాలనీకి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి జహీరాబాద్ టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కాంత రెడ్డి కాలనీలో నివసించే మొహమ్మద్ ముస్తఫా (26), స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆసియా (19) గురువారం (ఫిబ్రవరి 20) రాత్రి అదృశ్యమయ్యారు.ఆ రోజు రాత్రి 10:00 గంటలకు దంపతులిద్దరూ నిద్రపోయారు. అయితే, అర్ధరాత్రి 12:00 గంటల సమయంలో ముస్తఫా నిద్రలేచి చూడగా, భార్య ఇంట్లో కనిపించలేదు. వెంటనే కంగారుపడిన ఆయన బంధువులు, స్నేహితులు మరియు తెలిసిన వారి వద్ద అన్ని చోట్లా వెతికినప్పటికీ ఆసియా ఆచూకీ లభించలేదు. దీంతో ముస్తఫా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ కె. వినయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మరో ఘటనలో... కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా తన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.. కోహిర్ మండల్ సజ్జపూర్ గ్రామానికి చెందిన మేతర సామెల్ కుమారుడైన మేతర రాజు (35) అనే వ్యక్తి తన భార్య రాణమ్మతో గత కొంతకాలంగా కుటుంబం విషయంలో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 05/02/2026 తేదీన భార్యతో మరోసారి గొడవపడి, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. రాజు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు తెలిసిన వారందరి వద్ద గాలించారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో, శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాజు ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోహిర్ ఎస్ ఐ నరేష్ కోరారు.

మన తెలంగాణ 21 Feb 2026 11:10 pm

లంచం తీసుకుంటూబీజేపీ ఎమ్మెల్యే అరెస్టు

బెంగళూరు: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రూ లమానీ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలనూ అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ నిర్మాణ పనుల కేటాయింపు కోసం ఎమ్మెల్యే… క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్‌పూజార్ నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీశ్వర పట్టణంలో మొదటి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా ధార్వాడ్ పరారయ్యారు. […] The post లంచం తీసుకుంటూబీజేపీ ఎమ్మెల్యే అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:09 pm

అమరావతి ‘జరీబు’వివాదానికి తెర

5 గ్రామాలపై ప్రత్యేక దృష్టిఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ విశాలాంధ్ర-సచివాలయం :అమరావతి రాజధాని ప్రాంతంలో కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న జరీబు, మెట్ట భూముల వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కమిటీని నియమించడమే కాకుండా, పక్కాగా నివేదిక సమర్పించాల్సిన సమయ పరిమితిని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన […] The post అమరావతి ‘జరీబు’వివాదానికి తెర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:06 pm

ఉగ్రముప్ప్పు –అప్రమత్తం

హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో కుట్రదేశవ్యాప్త దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికనిఘా వర్గాల హెచ్చరిక ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. న్యూదిల్లీ/హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు […] The post ఉగ్రముప్ప్పు – అప్రమత్తం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:03 pm

థాయ్‌లాండ్‌లో వైరస్ సోకి 72 పులులు మృతి

 థాయ్‌లాండ్ లోని చియాంగ్ మాయ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్‌యానిమల్ పార్కులో72 పులులు అంతుచిక్కని వైరస్ కారణంగా మరణించాయి. ఫిలైన్ పార్వోవైరస్ , బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వల్ల శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతిని ఈ మరణాలు సంభవించినట్టు అధికారులు 20 తేదీన ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో సంచలనం కలిగించింది. ఈ వైరస్ ప్రభావం అడవి జంతువుల సంరక్షణపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావాన్ని ఆలస్యంగా గుర్తించడంతో ఈ ముప్పు సంభవించిందని చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చనిపోయిన పులులకు మరిన్ని పరీక్షలు చేస్తున్నారు. 

మన తెలంగాణ 21 Feb 2026 10:55 pm

వామపక్ష సాహిత్యంప్రపంచానికి అవసరం

. సామ్రాజ్యవాదం అభివృద్ధి నిరోధకం. కమ్యూనిస్టులు లేరనే వారికి భవిష్యత్తే సమాధానం. రెడ్‌బుక్ డే సభలో వక్తలు విశాలాంధ్ర-విజయవాడ:సామ్రాజ్యవాద దోపిడీదారుల నియంతత్వ పోకడలను అడ్డుకునేందుకు వామపక్ష సాహిత్యం ప్రపంచానికి అత్యవసరమని వక్తలు స్పష్టంచేశారు. విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్త అధ్వర్యంలో రెడ్‌బుక్ డే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు వీక్షకులను ఆలోచింపజేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, […] The post వామపక్ష సాహిత్యంప్రపంచానికి అవసరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:55 pm

ఆదాయం పెంచి ఆనందం పంచుతాం

. పేదలకు సంక్షేమంలో దేశంలో ఏపీయే టాప్. మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు. వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర`వినుకొండ : పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో […] The post ఆదాయం పెంచి ఆనందం పంచుతాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:49 pm

فیکٹ چیک: دیوریہ کی معصوم لڑکی کے ساتھ زیادتی و قتل کا اصل ملزم ودیا ساگر ہے، محمد اکرم نہیں

وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ محمد اکرم نے اپنی بھتیجی کو ریپ کے بعد قتل کیا۔ تحقیق سے واضح ہوا کہ اصل ملزم ودیا ساگر ہے۔

తెలుగు పోస్ట్ 21 Feb 2026 10:48 pm

బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా?

అసెంబ్లీ సమావేశాలపై రామకృష్ణ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ […] The post బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:39 pm

ప్రభాస్ సినిమాలపై గందరగోళానికి తెర

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన షూటింగ్ షెడ్యూల్స్‌పై నెలకొన్న సందిగ్ధతకు శనివారం ఒక స్పష్టత వచ్చింది.కల్కి 2: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సీక్వెల్ షూటింగ్ శంకర్‌పల్లిలో ప్రారంభమైంది. అయితే ఈరోజు కేవలం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ సీన్స్‌ను మాత్రమే చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ త్వరలోనే ఇందులో పాల్గొంటారు.ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాకు ప్రభాస్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని […] The post ప్రభాస్ సినిమాలపై గందరగోళానికి తెర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:27 pm

ఆకట్టుకున్న ‘సరస్వతి’ ట్రైలర్

నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సరస్వతి’ ట్రైలర్ విడుదలై… విశేష స్పందన పొందుతోంది. తన కూతురు స్కూల్ నుంచి కనిపించకుండా పోవడంతో ఒక తల్లి (వరలక్ష్మి) చేసే పోరాటమే కథాంశం. వ్యవస్థపై ఆమె ఎలా తిరగబడింది అనేదే అసలు కథ. నటీనటుల విషయానికి వస్తే… ప్రకాష్ రాజ్ అడ్వకేట్ రామానుజంగా నటిస్తుండగా, ప్రియమణి, కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘ప్రతి ఆడదీ సరస్వతి కాదు… అవసరమైతే కాళికాదేవిగా మారుతుంది’ అనే డైలాగ్ […] The post ఆకట్టుకున్న ‘సరస్వతి’ ట్రైలర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:24 pm

జూన్ తర్వాతే అల్లు అర్జున్, లోకేశ్ సినిమా

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఏఏ23’ గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ రీల్స్ మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం జూన్ 2026 తర్వాత పట్టాలెక్కనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అట్లీ, లోకేష్ కనగరాజ్ ఇద్దరూ తమిళ డైరెక్టర్లే. అట్లీ మూవీ కూడా వరల్డ్‌వైడ్‌గా మంచి బిజినెస్ చేసినట్లు సమాచారం. లోకేష్ […] The post జూన్ తర్వాతే అల్లు అర్జున్, లోకేశ్ సినిమా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:22 pm

ఓటీటీలో రాబోయే కొత్త సినిమాలివే

అక్యూజ్డ్: కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రత్న నటించిన ఈ హిందీ వెబ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది ఒక లెస్బియన్ కపుల్ చుట్టూ తిరిగే కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.కార్తీక దీపం 2: బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ సీరియల్ నేటితో 600 ఎపిసోడ్‌ల మైలురాయి చేరుకుంది. ఈరోజు ఎపిసోడ్‌లో ‘దీప’ తన సొంత కూతురే అని దశరథకు తెలిసే ఎమోషనల్ సీన్ హైలైట్‌గా నిలిచింది.అర్జున్ అంబటి: బిగ్ బాస్ ఫేమ్ […] The post ఓటీటీలో రాబోయే కొత్త సినిమాలివే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:21 pm

ఆంథ్రోపిక్ ఒక్క పోస్ట్.. స్టాక్ మార్కెట్ ఢమాల్

 కృత్రిమ మేధ స్టార్టప్ ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్‌లు అందించే కంపెనీలకు షాకిచ్చింది. కొన్ని గంటల క్రితం ఆంథ్రోపిక్ చేసిన ఒక్క పోస్ట్ పది బిలియన్ డాలర్ల నష్టాన్ని మోసుకొచ్చింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్‌లో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ తీసుకొస్తున్నట్టు ఆంథ్రోపిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేయడమే కాకుండా అందులోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దే పరిష్కారాలను సిఫారసు చేస్తుంది. దాంతో కోడింగ్ సమయంలోనే డెవలపర్లు భదత్రా పరమైన లోపాలను గుర్తించి పరిష్కరించుకోవచ్చు. సాంప్రదాయబద్దంగా గుర్తించలేని లోపాలను కూడా ఈ టూల్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో అమెరికా స్టాక్ మార్కెట్‌లోని సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. క్రౌడ్‌స్ట్రైక్, క్లాడ్‌ఫ్లేర్, స్కేలార్, సెయిల్ పాయింట్, ఓక్టా తదితర సంస్థల షేర్లు 5 నుంచి పది శాతం మేర పడిపోయాయి. సైబర్ సెక్యూరిటీతో సంబంధం ఉన్న ఐటీ షేర్లు కూడా పడిపోయాయి. అలాగే గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ 5 శాతం నష్టపోయింది.  

మన తెలంగాణ 21 Feb 2026 10:20 pm

ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నాడు బుర్జ్ ఖలీఫాపై ఆయన చిత్రాన్ని డిస్ప్లే చేయలేదు

పాత వీడియో. 2021 అక్టోబర్ నెలలో చిత్రీకరించిన వీడియో

తెలుగు పోస్ట్ 21 Feb 2026 10:16 pm

ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్ టీమిండియా ఇదే

ముంబై: ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్ గ్రూప్ సీలో ఉన్న భారత్ మార్చి 4న పెర్త్ రెక్టాంగులర్ స్టేడియంలో వియత్నాంతో తన తొలి మ్యాచ్‌ను ఆడబోతున్నది. ఆ తర్వాత మార్చి 7న అదే వేదికలో జపాన్‌తో తలపడుతుంది. చివరి గ్రూప్ దశ మ్యాచ్ మార్చి 10న వెస్ట్రన్ సిడ్నీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు చైనీస్ తైపీతో జరుగుతుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు, అలాగే ఉత్తమ మూడవ స్థానంలో నిలిచిన రెండు జట్లు […] The post ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్ టీమిండియా ఇదే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:16 pm

గోవింద ధ్వనుల మధ్య జంటనగరాలని పరవశింపచేసిన గరుడసేవ..!

గోవింద ధ్వనుల మధ్య జంటనగరాలని పరవశింపచేసిన గరుడసేవ..! పాల్గొన్న సుచిత్రా ఎల్లా, ఆకట్టుకున్న

ప్రభ న్యూస్ 21 Feb 2026 10:08 pm

పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్

2014 నాటి పరువు నష్టం దావాలో కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ శనివారం భివాండి మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ పందర్భంగా తనకు కొత్త గ్యారంటీర్‌గా కాంగ్రెస్ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు హర్షసప్కాల్‌ను సిఫార్సు చేశారు. థానే జిల్లా కోర్టుకు వెళ్లుతున్నప్పుడు మార్గమధ్యలోములుండ్ టోల్ ప్లాజా వద్ద రాహుల్‌కు బిజెపి కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఏఐ సమ్మిట్‌లో యువజనకాంగ్రెస్ కార్యకర్తలు షర్టులు తీసేసి, నిరసనకు దిగడం, దేశ ప్రతిష్టను మంటగలిపే చర్య అని, ఇందుకు కారణం రాహుల్ గాంధీ ఆలోచనలే అని పేర్కొంటూ బిజెపి వర్గాలు ఆందోళనకు దిగాయి. వీరిని దాటుకుని రాహుల్ వాహనం కోర్టుకు చేరుకుంది. ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పిఎం కోల్సే రాహుల్ పై పరువునష్టం దావా విచారణ ఆరంభించి, కొత్త ష్యూరిటీ ప్రక్రియను పూర్తి చేశారు. తరువాత కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 4వతేదీకి వాయిదా వేశారు. మహాత్మా గాంధీ హత్యకు వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార దశలో రాహుల్ గాంధీ సోనాలే గ్రామంలో ఆరోపించడం వివాదాస్పదం అయింది. ఈ వ్యవహారంపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుడు రాజేష్ కుంటే పరువు నష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణ వాయిదాలకు దారితీస్తోంది.ఈ కేసులో రాహుల్‌ను వ్యక్తిగత హాజరీ నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చింది. అయితే ఇంతకు ముందటి ష్యూరిటీ వ్యక్తి మృతితో కొత్త ష్యూరిటీ అవసరం ఏర్పడింది. ఇందు కోసం రాహుల్ న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరుకావల్సి వచ్చింది.

మన తెలంగాణ 21 Feb 2026 10:07 pm

అవసరం లేకపోయినా అప్ప్పులు ఎందుకు తీసుకుంటున్నారు?

హైదరాబాద్: భారతదేశంలో వ్యక్తిగత రుణాలు పాత ‘కష్టంమాత్రమే’ అనే అవగాహన నుండి క్రమంగా దూరమవుతున్నాయి. ఈ మార్పు ముఖ్యంగా స్థిరమైన ఉద్యోగాలు, స్థిరమైన జీతాలు కలిగిన కస్టమర్లలో కనిపిస్తుంది. సంవత్సరాలుగా ఆర్థికంగా క్రమశిక్షణతో, దీర్ఘకాలిక పొదుపులు. పెట్టుబడులను స్థిరత్వంతో నిర్మించే వ్యక్తులు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత మారినది వారి పెట్టుబడి సామర్థ్యం కాదు కానీ ‘పెట్టుబడి’ అంటే ఏమిటో వారి నిర్వచనం. చాలా మంది తమ ఆర్థిక భవిష్యత్తు కోసం సరైన పనులు చేస్తున్నప్ప్పుడు, వారు అనుకోకుండా […] The post అవసరం లేకపోయినా అప్ప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:07 pm

హైడ్రా కాపాడిన 7 ఎకరాలు.. భూమి విలువ రూ. 1400 కోట్లు

హైదరాబాద్ మహానగర శివారులోని కొండాపూర్‌లో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు సుమారు 7 ఎకరాలను హైడ్రా శనివారం కాపాడింది. వీటి విలువ సుమారు రూ. 1400ల కోట్ల వరకూ ఉంటుందని అధికారుల అంచనా. రంగారెడ్డి జిల్లా పేర లింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్ లోని సర్వే నంబరు 78 నుంచి 93 వరకున్న రాజరాజేశ్వర నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లను 1993లో గ్రామపంచాయితీ లే ఔట్ వేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు కేటాయించారు. పాఠశాలకు దాదాపు ఎకరా స్థలం, పార్కుల కోసం ఎకరాకు పైగా కేటాయించారు. పాఠశాలకు కేటాయించిన స్థలంలో 1000 చ.గజాల మేర అపార్టుమెంటును నిర్మించేశారు. కమ్యూనిటీ హాల్ కోసం 2181 చ.గజాలను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురౌతున్నాయని వెంటనే కాపాడి రాజరాజేశ్వరి నగర్ నివాసం ఉంటున్న 5 వేల కుటుంబాలకు ఉపయోగపడేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో కాలనీ సంక్షేమ సంఘం కోరింది. ఈ భూముల అక్రమణల వెనుక బడాబాబులున్నారని పిర్యాదు చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ ఎలా అయ్యాయి..! పలు రకాల షోరూంలతో పాటు.. కిరాణా జనరల్ స్టోర్లు ఆభూముల్లోకి వచ్చాయని, రహదారులు కూడా అక్రమణలకు గురవుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదులో పేర్కొంది. యూఎల్సీ భూములలోని లే ఔట్‌లో ప్లాట్లు ఎల్‌ఆర్‌ఎస్ అయ్యాయి. పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే అక్రమణదారులకు ఎలా సొంతం అవుతాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అవి పార్కులని, ప్రజావసరాల స్థలాలుగానే ఉపయోగపడాలని కోరారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా పరిశీలించింది. లే ఔట్ ప్రకారం పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా నిర్ధారించుకుంది. పార్కు స్థలంలో ఇప్పటికే వెయ్యి గజాల మేర అపార్టుమెంట్ వచ్చిందనీ... కమ్యూనిటీ స్థలంలో ప్రైవేటు పాపులు, పిడ్డులు వేసినట్టు గుర్తించింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు.. అక్కడి నివాసితులకే చెందాలనే ఉద్దేశంతో ఆక్రమణలు తొలగించి సెన్సింగ్ వేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో రాజరాజేశ్వరి నగర్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రాతో పరిష్కారమయ్యిందని స్థానికులు దన్యవాదాలు తెలిపారు.

మన తెలంగాణ 21 Feb 2026 10:04 pm

20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా

న్యూదిల్లీ: గ్లోబల్ లీడర్ సన్ లైఫ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ అయిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ (bస్bల్‌జీbస్) ఇండియా కార్యాలయం దేశంలో పరివర్తన కలిగించే 20 సంవత్సరాల మైలురాయిని సూచిస్తుంది. 2006లో కార్యకలాపాలు, అప్లికేషన్ నిర్వహణపై దష్టి సారించే డెలివరీ సెంటర్‌గా ప్రారంభమైనది. డిజిటల్ పరివర్తన, ప్రాసెస్ ఇన్నోవేషన్, bక్సలెన్స్, స్కేల్డ్ ఆపరేషన్‌లు, స్థిరమైన వద్ధిని ప్రారంభించే సమగ్ర ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అభివద్ధి చెందింది. గత రెండు దశాబ్దాలుగా, bస్bల్‌జీbస్ సన్ లైఫ్ గ్లోబల్ […] The post 20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:04 pm

సక్రా వరల్డ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ప్రారంభం

బెంగళూరు: భారతదేశంలో మొట్టమొదటి 100% bఫ్‌డీఐ నిధులతో కూడిన తతీయ సంరక్షణ ఆసుపత్రి అయిన సక్రా వరల్డ్ హాస్పిటల్, శనివారం తన ఇంటిగ్రేటెడ్, అధునాతన ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ బ్లడ్ డిజార్డర్స్‌ను ప్రారంభించింది. ఇది ఖచ్చితత్వంతో నడిచే, సాంకేతికతఆధారిత, రోగికేంద్రీకత క్యాన్సర్, హెమటాలజీ సంరక్షణను ఒకే పైకప్ప్పు క్రింద అందించే లక్ష్యంతో ఉన్న ఒక ప్రత్యేక కేంద్రం. ‘శరీరానికి సహాయం చేయడంఆత్మను నయం చేయడం’ అనే తత్వశాస్త్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఈ సంస్థ, […] The post సక్రా వరల్డ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:02 pm

చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..

చిన్నారి మృతదేహంతో రాస్తారోకో.. రెండు నెలల పసికందు మృతికి కారణమైన నిందితులను వెంటనే

ప్రభ న్యూస్ 21 Feb 2026 9:42 pm

ఆర్చరీలో దమ్మపేట మండల యువతికి గోల్డ్ మెడల్

ఆర్చరీలో దమ్మపేట మండల యువతికి గోల్డ్ మెడల్ దమ్మపేట ,ఆంధ్రప్రభః ఖమ్మం సర్దార్

ప్రభ న్యూస్ 21 Feb 2026 9:15 pm

cbn affection : వావ్​.. ప్యూచర్​ మీదే  Andhra Prabha News

cbn affection : వావ్​.. ప్యూచర్​ మీదే Andhra Prabha News నవ.జాత

ప్రభ న్యూస్ 21 Feb 2026 9:14 pm

AP Liquor Scam: Arrest of A2 Vasudeva Reddy

In a significant development in the alleged Andhra Pradesh liquor scam linked to the previous YSRCP regime, the CID has arrested Vasudeva Reddy, former Managing Director of AP Beverages Corporation and named A2 in the case. A1 in the case is Raj Kesireddy. Investigators believe Vasudeva Reddy played a central role in the policy design […] The post AP Liquor Scam: Arrest of A2 Vasudeva Reddy appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 9:06 pm

అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెనుక భారతీయ సంతతికి చెందిన న్యాయవాది

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు తీర్పులో ప్రధాన పాత్ర పోషించిన భారతీయ సంతతికి చెందిన న్యాయవాది కీలక వాదనలు విన్పించారు. సుంకాల చట్ట విరుద్ధత గురించి అమెరికా అత్యున్నత న్యాయస్థానం ముందు గట్టిగా వాదించారు. భారతీయ వలసదారుల కుమారుడు, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా హయాంలో అమెరికా మాజీ యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ అయిన నీల్ కత్యాల్, చిన్న వ్యాపారుల తరుపున సుంకాల ప్రభావం ఏమేరకు ఉంటుంది.ఎవరు ఎంత నష్టపోతున్నారో వివరిస్తూ, స్పష్టమైన వాదనలు వివరించి, సుంకాల కేసును వాదించి గెలిచారు.అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వచ్చిన కొద్దిసేపటికే, విజయం అన్న శీర్షికతో కత్యాల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. కత్యాల్ ఒ ఇంటర్ వ్యూలో సుప్రీంకోర్టు తీర్పు అమెరికా వ్యవస్థలో జరిగిన గొప్ప ఘటనలలో ఒకటిగా పేర్కొన్నారు. తాను కోర్టులో అమెరికన్ చిన్న వ్యాపారుల తరుపును గట్టివాదనలు విన్పించినట్లు తెలిపారు. ప్రెసిడెంట్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తాను వాదించినట్లు తెలిపారు. జడ్జీలు వేసిన కఠినమైనప్రశ్నలకు దీటుగా జవాబు ఇచ్చానని, తన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో తాము గెలిచామని నీల్ కత్యాల్ తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తి కావచ్చు. కానీ, ఎప్పటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేరు అని ఆయన పేర్కొన్నారు.నీల్ కత్యాల్ 1970లో చికాగోలో జన్మించారు. అతడి తల్లిదండ్రులు ఇద్దరూ భారతదేశం నుంచి వలస వచ్చిన వారే. తల్లి శిశువైద్యురాలు కాగా, తండ్రి ఇంజనీర్ గా పనిచేశారు. కత్యాల్ వాషింగ్టన్ డిసిలోని మిల్ బ్యాంక్ ఎల్‌ఎల్ పి కార్యాలయంలో బాగస్వామి, సంస్థ లిటిగేషన్, అర్బిట్రేషన్ గ్రూప్ సభ్యుడు.250 సంవత్సరాలుగా అమెరికా ప్రభుత్వానికి పునాదిగా నిలిచిన సుప్రీంకోర్టు అత్యంత ప్రాథమిక విలువులను కాపాడడం పట్ల కత్యాల్ సంతోషం వ్యక్తం చేశారు. కత్యాల్ లిటిగేషన్, అప్పిలేట్ వ్యాజ్యాలపై ఎక్కువ దృష్టి పెడతాడు. సుప్రీంకోర్టులో గతంలో 54 కేసులను వాదించాడు. ఆయన 1998-1999లో జస్టిస్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ అటార్ని జనరల్ కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారుగా డిప్యూటీ అటార్ని జనరల్ సహాయకుడిగా పనిచేశారు. అమెరికా న్యాయశాఖ నుంచి అత్యున్నత పురస్కారం ఎడ్మండ్ రాండోల్ఫ్ అవార్డును అందుకున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నీల్ కత్యాల్ ను 2011, 2014లో ఫెడరల్ అప్పిలేట్ నియామకాలకు సంబంధించిన సలహా కమిటీకి నియమించారు. .

మన తెలంగాణ 21 Feb 2026 9:00 pm

అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ ఆస్తులు 50 కోట్లు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్ కుమార్ ఇల్లు, మరో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు వెలుగు చూశాయి. కిరణ్ కుమార్ సొంతూరు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంతో పాటు సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు జరిపి వివరాలు సేక రించారు. అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ కు 100 ఎకరాల వ్యవసాయ భూమి, పది విలువైన ప్లాట్లు, ఐదు ఫోర్ వీలర్ వాహనా లు, ఐదు ట్రాక్టర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 15 కోట్లు అని చెబుతున్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు : సూర్యాపేట జిల్లాలో గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన సుందరి కిరణ్ కుమార్ ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లోని పొనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు ఉదయం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పి బాలకృష్ణ తెలిపారు. కిరణ్ కుమార్ ఇంటితోపాటు ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయనకు పార్ట్నర్ షిప్ ఉన్న నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామ శివారులోని అవని రైస్ మిల్లులో కూడా అధికారులు దాడులు నిర్వహించారు. పొనుగోడు, నేరేడుచర్ల తో పాటు కల్వకుర్తిలో ఆయన పనిచేస్తున్న ఆఫీస్ తో పాటు గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలోని ఆయన అత్తగారింట్లో, అనంతగిరి మండలంలోని అమీనాబాద్, అలాగే సూర్యాపేటలోని ఆయన నివాసం ఉంటున్న కిరాయి ఇంట్లో, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని కిరాయి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీలు చేస్తోన్న సమయంలో కిరణ్ కుమార్ పోనుగోడులోనే ఉన్నారు. దర్యాప్తు కోసం ఏసీబీ అధికారులు ఏడిఏ కిరణ్ కుమార్‌ను వెంట తీసుకువెళ్లారు. దర్యాప్తు పూర్తి అయ్యాక వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.

మన తెలంగాణ 21 Feb 2026 8:50 pm

Ex mp |బుట్టా కుటుంబంపై ఆర్థిక ఉక్కుపాదం..

Ex mp | బుట్టా కుటుంబంపై ఆర్థిక ఉక్కుపాదం.. రూ. 782 కోట్ల

ప్రభ న్యూస్ 21 Feb 2026 8:44 pm

విద్యార్థుల మొబైల్ నంబర్‌కు ఇంటర్ హాల్‌టికెట్లు

రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా పొందే సదుపాయాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. ఈ మేరకు విద్యార్థుల మొబైల్ నెంబర్లకు ఇంటర్ బోర్డు లింక్ పంపించింది.అలాగే వెబ్‌సైట్‌లో అందుబాటులో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు కాలేజీ లాగిన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండగా, తాజాగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థులు నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్‌ను పంపించినట్లు బోర్డు తెలిపింది. బోర్డు వెబ్‌సైట్ లేదా బోర్డు పంపించిన లింకు ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నట్టు గుర్తిస్తే... వెంటనే ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకొచ్చి, తప్పులను సరిదిద్దుకోవాలని అధికారులు తెలిపారు. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజవుతున్నట్టు పేర్కొంది. ఫిబ్రవరి 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న మొదటి సంవత్సరం, 26వ తేదీన రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల టైం టేబుల్ ఇంటర్ బోర్డు ఇదివరకే విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లు తీసుకురావాలని అదికారులు తెలిపారు.

మన తెలంగాణ 21 Feb 2026 8:42 pm

Vishwak Sen gifts expensive Rolex watch to Ravi Basrur

Mass ka Das Vishwak Sen has showcased his multifaceted talents as an actor, writer and director. Post delivering cult films like Falknuma Das and Das ka Dhamki as a director, he is now back as a director with #CULT. The movie is produced by Sandeep Kakarala and teaser has been released today with a huge […] The post Vishwak Sen gifts expensive Rolex watch to Ravi Basrur appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 8:21 pm

Bhimgal |మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం

Bhimgal | మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం Bhimgal | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 8:15 pm

Rs.1180 cr |ఎన్‌జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం…

Rs.1180 cr | ఎన్‌జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం… Rs.1180 cr |

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:54 pm

అదరగొట్టిన అమ్మాయిలు.. ఆసీస్ గడ్డపై టి-20 సిరీస్ కైవసం

అడిలైడ్: భారత మహిళ జట్టు మరో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన.. అతిథ్య జట్టును చిత్తు చేసి టి-20 సిరీస్‌ని కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని 2-1 తేడాతో దక్కించుకుంది. మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో స్మృతి 82, జెమీమా 59, రిచా 18 పరుగులు చేశారు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఆసీస్‌ను భారత బౌలర్లు 159 పరుగులకే కట్టడి చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 159 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్‌లో ఆష్లే గార్డ్‌నర్ 57, లిచ్‌ఫీల్డ్ 26 పరుగులు చేయగా.. మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. భారత బౌలింగ్‌లో శ్రేయాంక, శ్రీ చరణి చెరి మూడు, అరుంధతి 2, రేణుక 1 వికెట్ తీశారు. బ్యాట్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 21 Feb 2026 7:52 pm

ఎన్నికల నిబంధన ప్రకారం ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టండి…

ఎన్నికల నిబంధన ప్రకారం ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టండి… ఊట్కూర్, ఆంధ్రప్రభః ఎన్నికల కమిషన్

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:48 pm

Photos : Cult Movie Teaser Launch Event

The post Photos : Cult Movie Teaser Launch Event appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 7:46 pm

General |మెరుగైన వైద్య సేవ‌లు…

General | మెరుగైన వైద్య సేవ‌లు… General | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ :

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:43 pm

Fact check: Viral video claiming Shashi Tharoor praised Pakistan Cricket Board is fake

The original footage shows Tharoor advocating for keeping politics separate from sports, not endorsing any cricket board.

తెలుగు పోస్ట్ 21 Feb 2026 7:42 pm

సమిష్టి కృషి వల్లే పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది: సిఎం రేవంత్

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్నెళ్ల తర్వాత జరిగిన ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 12 శాతమని తెలిపారు. కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకం వల్లే కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుటుంబంలో 3 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సొంత ఇళ్లు కూడా లేదని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాహుల్ గాంధీ కుటుంబంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని కుట్ర జరుగుతోందని అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడు అయ్యే నాటికి పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని.. పార్టీలోనూ కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని సిఎం రేవంత్ అన్నారు. నేతలందరినీ కలిసి తన ఆలోచనలు చెప్పి.. అందరినీ ఒప్పించానని తెలిపారు. సమిష్ట కృషితో పార్టీ ఓటింగ్ 2.5 శాతం నుంచి 40 శాతానికి చేరిందని అన్నారు. డిసిసి అధ్యక్షులుగా బాగా పని చేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే టికెట్లు పొందలేని వారికి ఎమ్మెల్సీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందిని కార్పొరేషన్ ఛైర్మన్లుగా చేశామని అన్నారు. పార్టీలో అందరి పని తీరు మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. మెరిట్‌లో ఉన్న వారికి పార్టీలో కచ్చితంగా న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 21 Feb 2026 7:34 pm

ప్రమాదాల నివారణకు చర్యలు..

ప్రమాదాల నివారణకు చర్యలు.. రోడ్డుకి ఇరువైపుల పారిశుద్ధ్య పనులు.. పిచ్చి మొక్కలు తొలగింపు

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:33 pm

మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు..

మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు.. చెన్నూర్ ఆంధ్రప్రభ : గత

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:29 pm

ఎంపీ ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్ట్

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను శనివారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో, ఆయన్ను పరామర్శించేందుకు ఈటల రాజేందర్ కామారెడ్డికి బయల్దేరారు. అయితే, ఆయన వెళ్తే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగాఆయన్ను మేడ్చల్‌లోని తన నివాసంలోనే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు ఈటల నివాసానికి చేరుకుని ఆయన్ను బయటకు రాకుండా నిలిపివేశారు. ఈ హౌస్ అరెస్ట్‌ను ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని, పోలీసులను అడ్డం పెట్టుకుని గుండాయిజం చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

మన తెలంగాణ 21 Feb 2026 7:27 pm

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు..

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు.. ఊట్కూర్, ఆంధ్రప్రభః ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:17 pm

ఢిల్లీలో హైఅలర్ట్..

ఢిల్లీలో ఎర్రకోటతోపాటు దేశ వ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూక దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబు దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 6న పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఎల్‌ఈటీ ఈ దాడులను ప్లాన్ చేస్తోంది. ఇస్లామాబాద్ దాడిలో 31 మంది మరణించగా, 160 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. గత ఏడాది నవంబర్ 10 న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇంతకు రెండింతల మంది గాయాలపాలయ్యారు. అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలుడు పదార్ధాలున్న కారుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా అతడిని గుర్తించారు. అంతకు ముందు పోలీస్‌లు హర్యానా లోని ఫరీదాబాద్‌లో ఏకంగా 2900 కేజీల పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకుని భారీ ఉగ్ర కుట్రను ఆదిలోనే భగ్నం చేశారు. దీంతో తమ ప్లాన్ గురించి పోలీసులకు తెలిసిందన్న కంగారులో ఉమర్ మొహమ్మద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదిల్ రాథర్‌తోపాటు మరికొందరిని అదుపు లోకి తీసుకున్నారు. 

మన తెలంగాణ 21 Feb 2026 7:16 pm

అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీష్‌రావు

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటు దేశంలోని రైతులు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అమెరికాలో సాగవుతున్న జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశంలోకి ఎలాంటి టాక్స్ లేకుండా అనుమతించడం వల్ల మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రమాదంలో పడతారని తెలిపారు. మన దేశంలో కూడా అన్నదాతలు మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పత్తి పంటలని ఎక్కువగా పండిస్తూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. అమెరికా దేశం నుంచి ఈ పంటలను దిగుమతి చేసుకోవడం వల్ల తెలంగాణలో ఉన్న రైతులంతా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఎన్‌టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బడి అగ్రి షో కార్యక్రమానికి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న యాంత్రిక పరికరాలను ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో రైతు భరోసా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం 12 గంటల పాటే విద్యుత్ సరఫరా ఇస్తున్నారని, ఎరువులు సకాలంలో అందడం లేదని చెప్పారు.

మన తెలంగాణ 21 Feb 2026 7:08 pm

చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటన : కెటిఆర్

రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటన అని కెటిఆర్ విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావు అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 21 Feb 2026 7:01 pm

మేం అతడికి మద్దతుగా నిలుస్తాం.. వారి గురించే నా ఆందోళన: సూర్య

టీం ఇండియా టి-20 ప్రపంచకప్‌ సూపర్-8లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ భారత్‌కు ఎంతో కీలకం. అయితే భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. దీంతో సూపర్‌-8లోనూ అభిషేక్ తిరిగి ఫామ్‌లోకి రాకపోతే.. భారత్‌క పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. కానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం అభిషేక్‌కి పూర్తి మద్దతు ఇచ్చాడు. మ్యాచ్‌కి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతడి ఫామ్ గురించి ఆందోళనపడేవారి గురించే నా ఆందోళన. ఈ గేమ్‌లో ఒక్కోసారి ఎలాంటి బ్యాటర్‌కైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. గతేడాది అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మమ్మల్ని కవర్ చేశాడు. ఇప్పుడు మేం అతడికి మద్దతుగా నిలుస్తున్నాం. అభిషేక్ ఒక్కసారి కుదురుకుంటే ఎంత భారీ ఇన్నింగ్స్‌ ఆడుతాడో అందరికీ తెలుసు. ఇక్కడ నా ఆందోళన అంతా ప్రత్యర్థుల గురించే. అభిషేక్ ఇప్పటివరకూ పరుగుల ఖాతా తెరవలేదు. రన్స్ రాబట్టడం మొదలు పెడితే.. మాత్రం ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. అతడిని ఎలా ఎదుర్కొవాలనేది వారి ఆందోళన. సంజూ శాంసన్ రావాలని మీరు (మీడియాను ఉద్ధేశిస్తూ) కోరుకుంటున్నారా? అభిషేక్ లేదా తిలక్ వర్మ స్థానంలో ఆడాలని భావిస్తున్నారా? ప్రతీ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయాలని అనుకుంటున్నాం. అందుకు సన్నద్దమవుతున్నాం. తుది జట్టు పైనా కసరత్తు చేస్తాం’’ అనిఅ అన్నాడు.

మన తెలంగాణ 21 Feb 2026 6:56 pm

the poet |ప్రపంచ తెలుగు కవుల మహాసభలో రవీందర్

the poet | ప్రపంచ తెలుగు కవుల మహాసభలో రవీందర్ the poet

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:47 pm

ఫ్యాక్ట్ చెక్: చంచల్‌గూడ జైలు ములాఖత్ నుంచి ఉగ్రకుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్న పోలీసు శాఖ

చంచల్‌గూడ జైలు ములాఖత్ నుంచి ఉగ్రకుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంలో

తెలుగు పోస్ట్ 21 Feb 2026 6:45 pm

సీఎం కప్ జిల్లా స్థాయిలో మెరిసిన సిరికొండ యువకులు

సీఎం కప్ జిల్లా స్థాయిలో మెరిసిన సిరికొండ యువకులు సిరికొండ, ఆంధ్రప్రభ: జిల్లా

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:43 pm

Training |ముగిసిన సర్పంచుల శిక్షణ

Training | ముగిసిన సర్పంచుల శిక్షణ Training | మునుగోడు, ఆంధ్రప్రభ: ఐదు

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:34 pm

Illegally |అక్రమంగా ఇసుక తరలింపు..

Illegally | అక్రమంగా ఇసుక తరలింపు.. ఫేక్ బిల్లులతో ఇసుక తరలిస్తున్న టిప్పర్

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:29 pm

Distribution |విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ

Distribution | విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ Distribution

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:22 pm

ఇండియాలోనే తొలిసారిగా.. రచ్చ సినిమాతో వస్తున్న విశ్వక్‌సేన్

ఇటీవలే కెవి అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో విశ్వక్‌సేన్. అయితే ఈ సినిమాకి ఆశించినంత సక్సెస్ రాలేదు. అయితే విశ్వక్ ఏ మాత్రం నిరాశ చెందకుండా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సినిమా పేరే ‘కల్ట్’. ఈ సినిమాలో విశ్వక్ నటించడమే కాక.. స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘స్వ్కిడ్ గేమ్స్’ సిరీస్‌ని పొలి ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్లాషర్ కాన్సెప్ట్‌తో ఇండియాలో వస్తున్న తొలి చిత్రం ఇది అని చిత్ర యూనిట్ పేర్కొంది. గోవాకు వెళ్లిన ముగ్గురు కుర్రాళ్లు.. పబ‌్‌లో ప్రవేశం దొరకకపోతే.. ‘కల్ట్’ అనే చోటు వెళ్తారు. అక్కడ వాళ్లు ఎదురుకున్న పరిస్థితులు ఏంటీ. అసలు ఇందులో విశ్వక్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే.. ట్రైలర్ లేదా సినిమా వచ్చే వరకూ ఎదురుచూడాలి. 

మన తెలంగాణ 21 Feb 2026 6:16 pm

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి

కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి మండలంలోని మండలంలోని ఓలా గ్రామంలో ఆదివారం రోజు

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:09 pm

Kurnool |అసత్య ఆరోపణలు చేస్తున్నారు…

Kurnool | అసత్య ఆరోపణలు చేస్తున్నారు… Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:06 pm

రిజర్వ్ అటవీ భూమిలో అక్రమ సాగు యత్నం

రిజర్వ్ అటవీ భూమిలో అక్రమ సాగు యత్నం తిర్యాణి, ఆంధ్రప్రభ ; మండలంలోని

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:05 pm

25న పట్టుకున్న ఇసుక వేలం..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆషిఫాబాద్ జిల్లా జైనుర్ మండల కేంద్రంలో

ప్రభ న్యూస్ 21 Feb 2026 6:02 pm

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ…

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి శ్రీ సాయి

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:59 pm

కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 5:57 pm

ధ్రువపత్రాల అందజేత…

కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్ర కీలకమని

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:57 pm

34 years |ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ సదస్సు

34 years | ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ సదస్సు 34 years |

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:56 pm

చెడును ఎదరించడానికి ప్రజలు కూడా ముందుకు రావాలి : చంద్రబాబు

గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 5:35 pm

Photos : Saraswathi Movie Trailer Launch

The post Photos : Saraswathi Movie Trailer Launch appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 5:31 pm

CM Revanth |శిక్షణను శిక్షగా భావించొద్దు..

CM Revanth| శిక్షణను శిక్షగా భావించొద్దు.. CM Revanth | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:27 pm

KCR : కేసీఆర్ మౌనమే ఆయనకు ఓట్లు తెచ్చేపెట్టేటట్లుందిగా?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనమే ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టేటట్లు కనిపిస్తుంది.

తెలుగు పోస్ట్ 21 Feb 2026 5:22 pm

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కుంటాల, ఆంధ్రప్రభ : పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వరం

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:17 pm

Corporation |ఫోటోల ప్రదర్శనపై నిరసన…

Corporation | ఫోటోల ప్రదర్శనపై నిరసన… Corporation | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:16 pm

రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలి: హరీశ్ రావు

హైదరాబాద్: నగరంలోని ఎన్టిఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబడి అగ్రిషోని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. రైతులకు ఈ అగ్రి షో ఎన్నో రకాలుగా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేయాలని కోరారు. రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని అన్నారు. సాగు పనిముట్లకు రాయితీపై రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టం చేశారు. అగ్రిషో వంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 21 Feb 2026 5:16 pm

రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చిన మూడు రోజుల సెలవుల్లో రిషి విద్యాలయ పూర్వ శిశు నుండి 7 వ తరగతి వరకు విద్యార్థులకు ‘నో ఫోన్ ఛాలెంజ్’ నిర్వహించబడింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మూడు రోజుల పాటు మొబైల్ వినియోగం చేయకుండా స్వీయ నియంత్రణతో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.సెలవులను సద్వినియోగం చేసుకుని సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విజేతలను ప్రశంసించి బహుమతులు అందజేశారు.ప్రిన్సిపాల్ కరణ్ […] The post రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 5:11 pm

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో డిసిసి అధ్యక్షులే కీలకం : రేవంత్

హైదరాబాద్: పార్టీలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆలోచన చేయాలని అన్నారు. 11రోజుల పాటు డిసిసి అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో డిసిసి అధ్యక్షులే కీలకం అని అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ త్యాగాల చరిత్ర ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 150 రోజులు పాదయాత్ర చేశారని, మిమ్మల్ని పార్టీ అధ్యక్షుల్ని చేసిందని తెలియజేశారు. మాదే సామ్రాజ్యం అనుకుంటే, ఇక్కడి నుంచే ఫెయిల్యూర్ మొదలవుతుందని, తాను పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఏం జరిగిందో చూశారని అన్నారు. ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లానని, నచ్చ చెప్పానని, ఆ తర్వాత నేతల ఆలోచనలో మార్పు వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. అందరం కలిసి పని చేస్తే సరిగ్గా రెండున్నర ఏళ్లలో అధికారంలోకి వచ్చామని, ఎవరికి వారసత్వంగా హోదా రాలేదని చెప్పారు. 140 ఏళ్ల క్రితం ప్రారంభమైన పార్టీ, 140 కోట్ల మందికి స్ఫూర్తి నింపుతోందని, అలాంటి బిజెపి వారసతవం ఉన్నవాళ్లు బుల్లెట్ వర్షం కురిపించారని విమర్శించారు. బ్రిటీషర్ల జాతిపిత మహాత్మ గాంధీపై లాఠీ ఎత్తడానికి భయపడ్డారని, మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయని, ఒక కోటాలో మీరంతా డిసిసి అయ్యారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 60 రోజుల్లో 40 లక్షల సభ్యత్వ నమోదు చేశారని అన్నారు. డిసిసి అధ్యక్ష పదవి విలువైందని, దాన్ని ప్రజల కోసం వాడుకోండని, లేదంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని రేవంత్ రెడ్డి సూచించారు. 

మన తెలంగాణ 21 Feb 2026 5:08 pm

40 percent |నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

40 percent | నష్టపరిహారం వెంటనే చెల్లించాలి 40 percent | కర్నూలు

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:08 pm

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ

విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 5:07 pm

యువశక్తి మారితేనే రాజకీయాల దిశ మలుపు

యువశక్తి మారితేనే రాజకీయాల దిశ మలుపు చిట్యాల, ఆంధ్రప్రభ : యువశక్తి, మారితేనే

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:06 pm

Cleanly |స్వచ్ఛ రథం ప్రారంభం

Cleanly | స్వచ్ఛ రథం ప్రారంభం Cleanly | వినుకొండ , ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:06 pm

ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు

ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్యవిశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యము కానీ నాటు సారాగాని అక్రమంగా విక్రయించరాదని అలా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అనంతరంధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో […] The post ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 5:03 pm

భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు పూర్తి..

భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు పూర్తి.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు

ప్రభ న్యూస్ 21 Feb 2026 5:01 pm

గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఒక వరం..

గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఒక వరం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ;

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:58 pm

Govt |అంగరంగ వైభవంగా వార్షికోత్సవం…

Govt | అంగరంగ వైభవంగా వార్షికోత్సవం… Govt | గన్నవరం – ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:55 pm

నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం

ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఎస్ఈ ఈసీఈ విద్యార్థుల కోసం నూతన సాంకేతిక పరి జ్ఞానము పెంపొందించె ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని (మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారి చే ఏర్పాటు చేయించామని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అధ్యాపకులు జి .బి. రేణుక, డాక్టర్ జి […] The post నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 4:44 pm

ఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ

విశాలాంధ్ర ధర్మవరం; సేవా కార్యక్రమ రూపం అనేది భగవంతుని సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 రోగులు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ప్రభుత్వ వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని […] The post ఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 4:41 pm

ప్రేమ వ్యవహారం.. ప్రియురాలు మృతి.. భయంతో ప్రియుడు ఆత్మహత్య

విశాఖపట్నం: అతడి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో భయపడి ప్రియుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన భీమిలీలో చోటు చేసుకుంది. ఓ హోటల్ రూంలో శ్యాం కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం ప్రియురాలికి శ్యాంకుమార్‌కి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆ అమ్మాయి బంధువులు శ్యాం కుమార్‌పై హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన శ్యాంకుమార్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యంలో విషం కలుపుకొని తాగాడు. హోటల్ సిబ్బంది గదిలోని వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో అదనపు తాళంతో తలుపు తెరిచి చూడగా.. శ్యాం కుమార్ విగతజీవిగా పడి ఉండటం చూశారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ప్రియురాలి స్వస్థలం అనకాపల్లి కాగా.. ప్రియుడు శ్యాం కుమార్ హైదరాబాద్‌కు చెందిన వాడిగా పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 21 Feb 2026 4:41 pm