విరాట్, రోహిత్ వివాదంపై గంభీర్ కీలక వ్యాఖ్యలుకోల్కతా: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్… భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని … వారి మధ్య ఏదో జరుగుతోందని గత కొంతకాలంగా అనేక పుకార్లు షికార్లు చేసిన సంగతి విదితమే. కొన్ని సార్లు అది బహిర్గతం కూడా అయ్యింది. అయితే, విరాట్, రోహిత్తో తన సంబంధాలపై గంభీర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంలో తాను కూడా కొన్ని తప్పులు […] The post నేనూ తప్ప్పులు చేశానేమో… appeared first on Visalaandhra .
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించుకోవడానికి అనుమతించింది. గత సంవత్స రం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హోమ్ […] The post చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి appeared first on Visalaandhra .
మనం ఐసీసీ ట్రోఫీలుదొంగతనం చేయాల్సిందేనా?
పాక్ వరుస ఓటములపై మాజీ క్రికెటర్ కమ్రాన్ ఫైర్ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకూ పతనం అవుతోంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరడంలో విఫలమైన పాక్, తాజాగా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ను కోల్పోయింది. దీంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సిరీస్ ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సొంత జట్టుపైనే తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. పాకిస్థాన్ క్రికెట్ పూర్తిగా పతనం అవుతుందని, ఇది ఇలాగే కొనసాగితే నెదర్లాండ్స్పైనా ఓటమి ఎదుర్కోవాల్సిన […] The post మనం ఐసీసీ ట్రోఫీలుదొంగతనం చేయాల్సిందేనా? appeared first on Visalaandhra .
విద్యార్థినిపై అటెండర్ లైంగిక దాడి
రేగోడ్ మండలంలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తి జూన్ 2019లో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడు సారా జైపాల్ (25) పాఠశాలలో అటెండర్గా పనిచేస్తూ అక్కడ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణ అనంతరం కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసును విచారించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ చట్టం 2012 కింద విచారణ జరిగింది. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. బాలయ్య కేసును సమర్థవంతంగా వాదించి నిందితుడికి శిక్ష పడేలా కీలక పాత్ర పోషించారు. భరోసా లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ కె. శ్వేత బాధితురాలికి, సాక్షులకు న్యాయ సహాయం అందించారు. రేగోడ్ ఎస్ఐ ఎం. కాశినాథ్ కేసు నమోదు చేయగా, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కె. రవీందర్ రెడ్డి, ఎం. జార్జ్ దర్యాప్తు నిర్వహించారు. కోర్టు విచారణలో కోర్ట్ లైసోనింగ్ ఆఫీసర్ ఎస్ఐ విఠల్, పీసీ జి. కృష్ణ, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎ. వినోద్ సహకారం అందించారు. పిల్లలపై లైంగిక దాడి అత్యంత ఘోర నేరమని, ముఖ్యంగా పాఠశాలల వంటి సురక్షిత ప్రదేశాల్లో పిల్లలపై నేరాలకు పాల్పడే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
బుక్ చేసిన రెండోరోజే డెలివరీ . సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు అధిక ప్రాధాన్యత. గ్యాస్ నిల్వలు, సరఫరాపై చంద్రబాబు సమీక్ష. ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని సూచన విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్పై యుద్ధ ప్రభావం ఏమాత్రం పడకుండా… సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధికారు లను ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది […] The post నిరంతర గ్యాస్ సరఫరా appeared first on Visalaandhra .
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎసిబి దాడులు
కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ చేపట్టిన సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 10 గంటలకు మొదలైన సోదాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ముఖ్యంగా శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలపై వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. పట్టణంలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం జరిగిందన్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు న్నాయి. ఎప్పటి నుంచో వస్తున్న అధికారుల్లో చలనం కనిపించలేదని, పైగా అక్రమ నిర్మాణాల్లో కమీషన్లు తీసుకుని అనుమతులిచ్చారన్న ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. 2025-26 సంవత్సరంలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చిన నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకోలేదని ఏసీబీ తనిఖీల్లో తేలింది. పట్టణంలోని కమర్షియల్ షాపుల లైసెన్సులపై ఆరోపణలున్నాయి. 400కు పైగా వాణిజ్య షాపుల ట్రేడ్ లైసెన్స్, రెన్యువల్స్ పెండింగ్లో ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం: అధికారుల తీరుతో ప్రభుత్వానికి సుమారు రూ. కోటి బకాయిలు ఏర్పడ్డాయని ఏసీబీ పేర్కొంది. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లలో తేడాలు గుర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మున్సిపల్ అధికారుల ఫ్యుయెల్ ఛార్జీలలో చేతివాటం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. నెలకు రూ.12.40 లక్షలు కేటాయించిన, సరైన రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గైర్హాజరుగా మార్క్ చేసిన పూర్తి నెల జీతం చెల్లించారు. పూర్తి జీతం చెల్లింపుల విషయంలో కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు గతంలో వినిపించిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. భవన నిర్మాణాల అనుమతులలో జాప్యం ఉందని ఏసీబీ తనిఖీల్లో బట్టబయలయ్యాయి. డిసెంబర్ 2025 నుండి 169 బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తుల్లో 18 ఆలస్యంగా ప్రాసెస్ అయ్యాయని తేలింది. తనిఖీల రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు.
రంగంలోకి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’
ఇరాన్ దాడులు తీవ్రతరం . అమెరికా, ఇజ్రాయిల్కు దడ. ఇంధన ట్యాంక్పై డ్రోన్ దాడి. దుబాయ్ విమానాశ్రయం మూసివేత. తెలఅవీవ్ను తాకిన క్షిపణులు… విధ్వంసం. తెహ్రాన్పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్. కీలక విమానం, సైనిక స్థావరాలు నేలమట్టం తెహ్రాన్/టెలఅవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో బాంబులు మోతలు, మిసైళ్ల వర్షం కొనసాగుతున్నాయి. యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. యుద్ధం మొదలై పదిహేడు రోజులవుతున్నా… ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ.. అటు ఇరాన్ గానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకు పడుతున్నాయి. […] The post రంగంలోకి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ appeared first on Visalaandhra .
పార్సల్ పంపాలా… రైల్వేవాళ్లు ఇంటికే వస్తారు #IndianRailways#RailParcel#DoorDelivery#TeluguStates
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సోమవారం భారత రూపాయి 10 పైసలు పడిపోయి డాలర్కు 92.40 వద్ద ముగిసింది. రూపాయి చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయి ఇదే. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 92.44 వద్ద ప్రారంభమై రోజులో 92.47 వరకు పడిపోయింది. గత సెషన్లో 92.30 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడజం వల్ల ఒత్తిడి పెరిగిందని నిపుణులు తెలిపారు. దేశీయ షేర్ మార్కెట్లు కోలుకోవడం వల్ల మరింత పతనం కొంతవరకు తగ్గిందని ట్రేడర్లు తెలిపారు.
గ్రూప్ ఫోటో దిగుతూ మృత్యు ఒడిలోకి
ఖమ్మం నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఒక మహిళ బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతుండగా ఒకేసారి గుండెపోటుకు గురై అక్కడికక్కడే కూప్పకూలిన సంఘటన పుట్టకోటలో చోటుచేసుకుంది. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత (43) అనే మహిళ ఖమ్మం నగరంలోని పుట్టకోట ప్రాంతంలో గల తన బంధువుల ఇంట్లో సోమవారం ఉదయం జరిగిన గ్రహ ప్రవేశం శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా బంధువులతో కలిసి గ్రూఫ్ ఫొటో దిగుతుండగా అకస్మాత్తుగా సుస్మిత కుప్పకూలింది. అప్రమత్తమైన బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండాపోయింది.గుండెపోటుకు గురైన సుస్మిత అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు .అప్పటి వరకు కళ్ళ ముందు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఫోటో దిగుతు విగత జీవిగా మారిన సుస్మిత ప్రేమ వివాహం చేసుకుంది.ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త వ్యాపారం నిర్వహిస్తుంటగా ఆమె తండ్రి పత్రికయాడ్ ఏజెన్సీ నిర్వహించేవారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు
. ఉద్యోగులు, కార్మికుల తొలగింపులతో కుట్ర. మొండిగా ముందుకెళుతున్న కేంద్రం. తిప్పకొడతామన్న పోరాట కమిటీ విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులు, కార్మికుల తొలగింపు లతో ఈ కుట్రను అమలు చేస్తోంది. స్టీల్ప్లాంట్ను నూరు శాతం అమ్మాలని 2021 జనవరి 21 న నిర్ణయించింది. కానీ ఐదేళ్ల నుంచి నిరవధికంగా జరుగుతున్న పోరాట ఫలితంగానే నేటికీ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్క శాతం కూడా […] The post విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు appeared first on Visalaandhra .
‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నా కల నెరవేరింది: రాశి ఖన్నా
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీలీల కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన ’ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఈ చిత్రానికి ఓకే చెప్పేశాను. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నా కల నెరవేరింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్లోక. తను చాలా మోడరన్ అమ్మాయి. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. నా పాత్రకు కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. ఇక పవన్కళ్యాణ్ నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది. హరీష్ శంకర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో సెట్లోనే పంచ్ డైలాగ్స్ రాసి ఇస్తుంటారు. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను. సినిమాలో శ్రీలీలతో కలిసి సన్నివేశాలు లేవు. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. నా పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి. ‘గబ్బర్ సింగ్’ లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ కలిసి థియేటర్లో చూడొచ్చు. ఉగాది పండుగ సమయంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వింటేజ్ పవన్ కళ్యాణ్ని ఈ సినిమాలో చూస్తారు. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్తో ఒక సినిమా, ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్ సిరీస్లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. తమిళ్లో ‘రౌడీ అండ్ కో’ చేస్తున్నాను”అని అన్నారు.
శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం
ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును వెనుక నుంచి అశోక్ లేలాండ్ లారీ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విదారకమైన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్పేట సీఐ శ్రీనాథ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ ( 51), షేక్ పేటకు చెందిన మొహమ్మద్ హుస్సేన్ ( 48), లు టీఎస్ 09 ఈడీ 3303 నంబర్ గల ఆడి కారులో ఈసీఐఎల్ నుండి తూప్రాన్ వైపు ఓ ఆర్ ఆర్ మార్గం ద్వారా వెళ్తున్నారు. మార్గమధ్యంలో శామీర్ పేట ఎగ్జిట్ 7 దిగ చొట కారును రోడ్డు పక్కన నిలిపి భోజనం భోజనం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్ఎచ్ 12 పి క్యు 2337 నంబర్ గల అశోక్ లేలాండ్ లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న శామీర్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ ( డిడి ) పరీక్ష నిర్వహించగా అతను మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలింది. ఈ ఘటనపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ పోరు కీలక మలుపు తిరిగింది. ట్రంప్ , నెతన్యాహులు ఇప్పుడు ఇరాన్ అత్యంత కీలకమైన చమురు వనరులపై పట్టుకు సైనిక వ్యూహాలకు దిగుతున్నారు. ఇరాన్కు చమురు వ్యాపారం, ఉత్పత్తి కేంద్రం అయిన ఖర్గ్ దీవిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా స్వాధీనం చేసుకునేలా సైనిక వ్యూహాలు సిద్ధం చేయాలని తమ సైనిక సలహాదారులకు ట్రంప్ సూచించారు. ఇటీవల ఖర్గ్ దీవిపై అమెరికా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడుల సమయంలో అక్కడి వైమానిక, సైనిక స్థావరాలను లక్షంగా చేసుకున్న అమెరికా చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు. అయితే ఈ చమురు దీవి ఇరాన్కు ప్రముఖమైన వ్యాపార కేంద్రం అనే విషయాన్ని గుర్తించిన ట్రంప్ ఇప్పుడు వచ్చే కొద్దిరోజుల్లోనే ఈ దీవిని ఇక్కడి చమురు క్షేత్రాలతో పాటు స్వాదీనం చేసుకుని, తద్వారా ఇరాన్కు ఆర్థిక నష్టం కల్గించాలని సంకల్పించారు. ఇదే సమయంలో ఇరాన్ ప్రపంచ స్థాయిలో ఇంధన మార్కెట్ను నిశ్చేష్టపరుస్తూ హర్మూజ్ జలసంధి మీదుగా చమురు నౌకల కదలికలను అడ్డుకుంది. దీనితో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధరలు వంద డాలర్లు మించి పోయాయి. పలు దేశాలలో ఎల్పిజి, పెట్రోలు డీజిల్, ప్రత్యేకించి కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు దెబ్బతోనే ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచవ్యాప్త తీవ్ర నిరసనలు వెలువడేలా చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు మిత్రదేశాలని పేర్కొంటూ భారత్ వంటి అతి కొద్ది దేశాలకు చమురు రవాణాకు మార్గం కల్పించింది. మరో వైపు గల్ఫ్ దేశాలు అమెరికాకు సైనిక స్థావరాలు కావడంతోనే తమ దేశానికి కీడు జరిగిందని, ప్రత్యేకించి అరబ్ దేశాలలోని యుఎస్ సైనిక కేంద్రాల బలంతోనే అమెరికా అధ్యక్షుడు రెచ్చిపోయాడని గ్రహించింది. దీనితో గత కొద్దిరోజులుగా ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్పై తన వద్ద ఉన్న అత్యంత అధునాతన క్షిపణులను ప్రయోగిస్తోంది. మరోవైపు గల్ఫ్లోని అమెరికా స్థాదరాలతో పాటు కొన్ని దేశాల ఇతరత్రా వ్యాపార వాణిజ్య కేంద్రాలను కూడా లక్షంగా ఎంచుకుని దాడులకు దిగింది.
పశ్చిమాసియాలో అమెరికాఇజ్రాయెల్ సంయుక్త బలగాలు, ఇరాన్ నడుమ సోమవారంనాడు పరస్పర దాడులు కొనసాగాయి. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.దక్షిణ లెబనాన్లోని ఓ గ్రామంపై జరిపిన దాడిలో ముగ్గురుమృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు పారామెడిక్ సిబ్బంది ఉన్నారు. తాజా దాడుల ద్వారా లెబనాన్లో క్షేత్రస్థాయి దాడులకు ఇజ్రాయెల్ తెరతీసింది. ఇప్పటి వరకు ఇరాన్కు చెదిన 70శాతం మిలిటరీ లాంఛర్లను దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అబుదాబి లక్షంగా ఇరాన్ జరిపిన దాడిలో పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. మరోవైపు ఇరాన్ జరిపిన దాడులలో సోమవారం దుబాయ్ దద్దరిల్లింది. ఇరాన్ డ్రోన్ ధాటికి ఓ ఇంధన ట్యాంకర్ దెబ్బతింది. దీనితో అక్కడికి సమీపంలోని దుబాయ్ ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఇరాన్ క్షిపణి దాడులతో దుబాయ్ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ నుంచి ఎటువంటి క్షిపణి లేదా డ్రోన్ల దాడులు తలెత్తకుండా దెబ్బకు దెబ్బతీస్తామని యుఎఇ రక్షణ శాఖ తెలిపింది. తూర్పు ప్రాంతంలో 35 వరకూ ఇరాన్ డ్రోన్లను దెబ్బతీశామని సౌదీ అరేబియా తెలిపింది. సౌదీకి చెందిన అత్యంత కీలకమైన ఫుజైరా చమురు క్షేత్ర ప్రాంతంపై ఇరాన్ సోమవారం దాడికి దిగింది. ఈ డ్రోన్ల దాడిలో ఇక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అబూధాబిలో ఇరాన్ దాడిలో ఓ పాలస్తీనియన్ మృతి చెందారు. ఇక బహ్రెయిన్ కూడా తమ దేశంపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయితే దానిని తమ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుందని తెలిపింది. మరోవైపు తమపై దాడులకు ఎర్రసముంద్రం నుంచి తన వంతు పాత్ర పోషిస్తున్న అమెరికా నౌక జెరాల్డ్ ఫోర్డ్కు సాయం అందిస్తున్న వ్యవస్థలను లక్షంగా ఎంచుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు తమ అధికారిక వార్త సంస్థ ప్రెస్ టివిలో ప్రకటన చేసింది.
వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్కు ప్రాధాన్యం
వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్కు ప్రాధాన్యం దేవాలయాల్లో అమలు చేయాల్సిందే50 శాతం టికెట్లు
200 children killed : యద్ధం ఆగదు Andhra Prabha News
200 children killed : యద్ధం ఆగదు Andhra Prabha News (
వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,685 తగ్గి రూ.1.56 లక్షలకు చేరింది. మార్చి 13న ఇదే బంగారం ధర రూ.1.58 లక్షలుగా ఉంది. ఒక కిలో వెండి ధర కూడా రూ.11,777 తగ్గి రూ.2.48 లక్షలకు చేరింది. శుక్రవారం ఇది రూ.2.60 లక్షలుగా ఉండింది. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో రెండు రోజుల్లో బంగారం రూ.4,589, వెండి రూ.19,590 తగ్గాయి. మార్చి 12న బంగారం రూ.1.60 లక్షలు, వెండి రూ.2.68 లక్షలుగా ఉన్నాయి.
ప్రత్యూష మృతి కేసు.. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
సుప్రీంకోర్టు తీర్పుననుసరించి టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థరెడ్డి నాంపల్లి కోర్టులో సోమ వారం లొంగిపోయాడు. సిద్ధార్థరెడ్డి అమెరికా నుంచి వచ్చి న్యాయస్థానంలో లొంగిపోయాడు. 2022 ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి చెందారు. కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకుని ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి తాగారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెంద గా, సిద్ధార్థరెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థరెడ్డి ప్రేరేపించాడని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ప్రత్యూ ష మృతి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యాయ స్థానం పేర్కొంది. బెయిల్ కోసం సిద్ధార్థరెడ్డి వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో సిద్ధార్థరెడ్డికి విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. సిబిఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద చార్జిషీట్ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సిద్ధార్థరెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో కాస్త ఊరట దక్కింది. సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది. తన కుమార్తె నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సరోజినీ దేవి స్పందిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని పేర్కొన్న సంగతి విదితమే. ఘటన జరిగిందిలా..! 1993వ సంవత్సరంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఓ కాలేజీలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిలు ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఇంటర్ పూర్తయిన తర్వాత సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్కు వెళ్లగా, ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లారు. ఇద్దరి వివాహానికి ప్రత్యూష తల్లి తొలుత వ్యతిరేకించినా తర్వాత అంగీకరించారు. సిద్ధార్థరెడ్డి తల్లి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం వారి వివాహానికి అడ్డంకిగా మారింది. ఆ విషయాన్ని సిద్ధార్థరెడ్డి 2002 ఫిబ్రవరి 23న ఫోన్ ద్వారా ప్రత్యూషకు చెప్పాడు. సాయంత్రం 5 గంటల సమయంలో పంజాగుట్టలో బ్యూటీపార్లర్లో ఉన్న ప్రత్యూషను వెంటబెట్టుకుని కారులో బయటికి వెళ్లాడు. రాత్రి 7.308 గంటల సమయంలో ఇద్దరూ ప్రాణాపాయస్థితిలో బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి వచ్చి చేరారు. ప్రత్యూష 24వ తేదీన కన్నుమూశారు. సిద్ధార్థరెడ్డి మార్చి 9న డిశ్చార్జి అయ్యారు.
ఘోర రోడ్డు ప్రమాదం –మూడేళ్ళ బాలిక మృతి
ఘోర రోడ్డు ప్రమాదం – మూడేళ్ళ బాలిక మృతి బాపులపాడు, ఆంధ్రప్రభ :
ఇక, ట్రాన్స్జెండర్లకూ ఫ్రీ బస్సు..
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్లకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల మాదిరిగానే ఆర్టీసి బస్సుల్లో ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ఢిల్లీలో నివసిస్తున్న అర్హత కలిగిన ట్రాన్స్జెండర్ లు కూడా మహిళల లాగానే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ సందర్బంగా సిఎం రేఖ గుప్తా మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు గౌరవంగా, సమానత్వంతో ప్రజా సేవలను పొందాలి. సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె అన్నారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్జెండర్లు ఆర్థిక పరిమితులు లేకుండా నగరం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం త్వరలో అమలు కానుందని, మహిళలకు ప్రస్తుతం ఉన్న ఉచిత బస్సు ప్రయాణ వ్యవస్థ మాదిరిగానే విధానాలను అనుసరిస్తుందని, లబ్ధిదారులకు సజావుగా అమలు జరుగుతుందని అధికారులు తెలిపారు.
ప్రైవేట్ కంపెనీల కుట్రలను తిప్పికొడతాం
ప్రైవేట్ కంపెనీల కుట్రలను తిప్పికొడతాం ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర
నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా
నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా హితాన్ని బోధించే పండుగ రంజాన్11వ వార్డులో, నిరుపేద
రైలు నిర్వహణలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత
రైలు నిర్వహణలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 27వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని మంత్రి తుమ్మల ఆదేశించడంతో దానికి తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ పనులకు శంకుస్థాపన.. భద్రాచలం ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే తొలి విడతలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి ప్రాకారం నిర్మాణ పనులకు సిఎం రేవంత్ రెడ్డి ఈనెల 27వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్లు,సెంటర్ లైటింగ్, పూల మొక్కలు సుందరీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు ముమ్మరంగా చేపట్టాలన్నారు.
17thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
17thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 17thMarchCartoon | హర్మూజ్ వద్ద ట్రంప్
నిజాంసాగర్ కెనాల్ లో పడి వృద్ధుడు మృతి
నిజాంసాగర్ కెనాల్ లో పడి వృద్ధుడు మృతి ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ: ఎంఎల్ఎ మల్లారెడ్డి
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని, మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా..? మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నా..అది మునిగిపోయే పడవనే అని పేర్కొన్నారు. గ్రౌండ్లో ఎవరు బలంగా ఉన్నారో అందరికి తెలుసు అని చెప్పారు. అసెంబ్లీ లాబీలో సోమవారం ఎంఎల్ఎ మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మల్లారెడ్డి ఖండించారు. తన వయసు ప్రస్తుతం 73 ఏళ్లు అని, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తనకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. ఇటీవల తన పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకే రేవంత్ సిఎం రెడ్డిని కలిశానని తెలిపారు.
తెలంగాణ భవన్లో ఘనంగా ఇఫ్తార్ విందు..హాజరైన కెటిఆర్
బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సోమవారం ఘనంగా దావత్ -ఎ -ఇఫ్తార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొని మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా కెటిఆర్ విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్ను అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ మైనారిటీలను ఏ విధంగా వంచించిందో శాసనసభ సమావేశాల్లో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతామని చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న ప్రతి హామీ పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం కుల మతాలకు అతీతంగా, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతితో అద్భుతంగా ముందుకు సాగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ మత సామరస్యానికి పెద్దపీట వేసిందని తెలిపారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆశయాలను పక్కన పెట్టడం బాధాకరమని అన్నారు. ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సామెల్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే సామెల్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలి మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ
పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి ప్రతిష్టమైన పోలీసు బందోబస్తురామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
రేపు 2వ నేషనల్ మొబిలిటీ సమ్మిట్
రాష్ట్ర రవాణా శాఖ, ఎలెట్స్ టెక్నోమీడియా సంస్థ భాగస్వామ్యంతో, హైదరాబాద్ మెట్రో రైల్ సహ భాగస్వామ్యంతో ఈ నెల 17 మంగళవారం నోవోటెల్, హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ‘2వ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ -2026’ నిర్వహించనుంది. ‘యాక్సిలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ అనే థీమ్తో నిర్వహించనున్న ఈ సమ్మిట్లో విధాన నిర్ణేతలు, రవాణా అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, స్టార్టప్లను, సాంకేతిక సంస్థలు పాల్గొని దేశంలో స్థిరమైన సమగ్ర మొబిలిటీ భవిష్యత్తుపై చర్చించనున్నారు. సమ్మిట్ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా కమిషనర్ డా. కె. ఇళంబరితి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొననున్నారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్ కిట్స్ పంపిణీ
రాష్ట్రంలోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు సచివాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఫార్మర్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ సంచాలకు గోపి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,125 మంది రైతులను 489 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్ కు 125 మంది చొప్పున జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో ఎంపిక చేస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయం పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా కృషి సఖిలను క్లస్టర్ కు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణను ఇచ్చి వారి ద్వారా క్లస్టర్లో 125 మంది రైతులకు సేంద్రీయ సాగు పద్ధతులపై నిరంతరం అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకు సర్టిఫికేషన్, ప్రోత్సాహం అందించడం, జీవ ద్రావణాలు తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్కు 125 మంది చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, గుర్తింపు కోసం ఈ కిట్లో క్లాత్ బ్యాగ్, క్షేత్ర దర్శిని డైరీ, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను, చిన్న ప్యాకెట్ డైరీ వంటి వస్తువులు ఉంటాయని వివరించారు. సచివాలయంలో మంత్రి ప్రారంభించిన అనంతరం, ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఈ కిట్లను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
45crore Release : అన్ని మతాలను గౌరవిస్తా Andhra Prabha News
45crore Release : అన్ని మతాలను గౌరవిస్తా Andhra Prabha News (
విశారదన్ అరెస్ట్ ను కండిస్తూ జేఏసీ ఆందోళన
విశారదన్ అరెస్ట్ ను కండిస్తూ జేఏసీ ఆందోళన నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ :
మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే జన్నారం,ఆంధ్రప్రభ : ఖానాపూర్
శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం
శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే
కడియం మహిళపై సామాహిక అత్యాచారం..నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష
ఎపిలో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారాయత్నానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు 2024 అక్టోబర్లో చోటు చేసుకుని ఎపి వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి నిందితులపై ఉన్న ఆధారాలు, పోలీసుల దర్యాప్తు నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ సంచలన తీర్పును ప్రకటించారు. నిందితులు అందరూ 19 ఏళ్ల నుంచి 26 సంవత్సరాల మధ్య యువకులని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం బుర్రిలంక గ్రామ పరిధిలోని ఓ నర్సరీలో చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న 43 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మహిళ ప్రతిరోజు మాది రిగానే నర్సరీ పనులకు వెళ్లిన సమయంలో నిందితులు ఆమెపై దాడి చేసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. అనంతరం తమ నేరాన్ని దాచేందుకు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై కూడా పెద్ద చర్చ జరిగింది.
మహిళ దారణ హత్య.. కేసు ఛేదించిన పోలీసులు
మహిళ దారణ హత్య.. కేసు ఛేదించిన పోలీసులు ప్రియుడే నిందితుడని తేల్చిన మేడ్చల్
ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బిజెపి సోమవాంనాడు 144 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసింది. సీనియర్ నేత సువేంధు అధికారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్నారు. మరోసారి సిఎం మమతా బెనర్జీతో ఎన్నికల గోదాలో తలపడుతున్నారు. కోల్కతాలోని భబనిపూర్ నియోజకవర్గం నుంచి సువేంధును బిజెపి బరిలోకి దింపుతోంది. మమత ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నందిగ్రామ్ నుంచి కూడా సువేంధుకు మరోసారి బిజెపి టికెట్ కేటాయించింది. ఇక ఖరగ్పూర్ సదర్ నుంచి దిలీప్ ఘోష్, మరో సీనియర్ నాయకుడు బిమన్ మహతోను సల్బోని, పశ్చిమ మేదినీపూర్ల నుంచి బరిలోకి దింపుతున్నారు. దక్షిణ కోల్కతాలోని రాస్బిహారీ నుంచి స్వపన్దాస్ గుప్తా, కాంతి ఉత్తర్ నుంచి సుమితా సిన్హా, హుగ్లీ జిల్లాలోని పుర్సురాహ్ నుంచి బిమన్ ఘోష్ పోటీ చేస్తున్నారు.గత ఎన్నికల్లో నందిగ్రామ్లో సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలైన తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో భబనిపూర్ నుంచి మమత పోటీ చేసి గెలిచారు. 294మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న కౌంటింగ్ నిర్వహిస్తారు. 192 మందితో లెఫ్ట్ ఫ్రంట్ తొలి జాబితా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు వామపక్షాలు సోమవారం నాడు 192 మందితో తొలి జాబితా విడుదల చేశాయి. రాజ్యసభ సభ్యుడు రంజన్ భట్టాచార్యను జాదవ్పూర్ నుంచి బరిలోకి దింపుతుండగా, మీనాక్షి ముఖర్జీ ఉత్తరపార నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మీనాక్షి నందిగ్రామ్ నుంచి బరిలో దిగి సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇంకా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో సబినా యాస్మిన్(కాళీగంజ్) ఉన్నారు. మిగతా స్థానాలకు రెండు మూడు రోజుల్లో తుది జాబితా విడుదల చేస్తామని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్ వెల్లడించారు.
సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన అవసరం తొర్రూరు,ఆంధ్రప్రభ : సమాజంలో జరుగుతున్న
Big Surprise: Sharwa’s Biker Has 8 Songs
Charming Star Sharwa’s upcoming sports and family drama Biker, directed by Abhilash Reddy under UV Creations, is set for release on April 3rd. Music director Ghibran, who composed the soundtrack, shared some interesting insights about the film. He revealed how he came on board. “After Saaho, I was waiting for a strong comeback film. That’s […] The post Big Surprise: Sharwa’s Biker Has 8 Songs appeared first on Telugu360 .
గాలికుంటు నివారణ టీకాలు మోత్కూర్,ఆంధ్రప్రభ : ఆవులు,గేదెలు, ఎద్దులకు సీజనల్ వ్యాధులలో బాగంగా
8మంది ఎంపిలపై రేపు సస్పెన్షన్ ఎత్తివేత
లోక్సభ నుంచి సస్పెండయిన 8 మంది విపక్ష ఎంపిలపై మంగళవాం నాడు సస్పెన్షన్ ఎత్తివేయనున్నారు. స్పీకర్ ఓంబిర్లా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సస్పెండయిన వారిలో ఏడుగురు కాంగ్రెస్ ఎంపిలు, ఒక సిపిఎం సభ్యుడు ఉన్నారు. బడ్జెట్ తొలి దఫా సమావేశాల్లో సభలో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై తెలంగాణ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మందిపై ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఏప్రిల్ 2వరకు సభాపతి సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజులుగా వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను విపక్షాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ లో చిట్యాల
తిరుమల జూన్ నెల దర్శన కోటా విడుదల వివరాలు..
తిరుమల: 2026 జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి దర్శన కోటా విడుదల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా… వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
International |ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
International | ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు International | అల్వాల్,
ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న ఈత సరదా
సరదాగా ఈత కొడదామని వెళ్ళిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన గండిపేట మండలం పరిధిలో తీవ్ర కలకలం రేపింది. యువకులు ఈతకు దిగి గల్లంతై చివరకు మృత్యువాత పడిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన గోవర్ధన్ (26) గోవర్ధన్ తమ్ముడు కార్తీక్ (19), బంధువు వెంకటేష్ (19) ఆదివారం గండిపేట్ జలాశయం బ్యాక్ వాటర్లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ముగ్గురిలో ఒకరు నీట మునిగి పోతుంటే కాపాడే క్రమంలో ముగ్గురు మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు రెస్కూ టీమ్, ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికుల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇబ్రహీంబాగ్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గోవర్ధన్ ప్రసాద్ భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విరాట్ ఆల్టైమ్ ఫేవరేట్ ఆర్సిబి XI ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీలగ్-2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. గత సీజన్లో అద్భుతంగా రాణించి తొలిసారిగా ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఈ ఏడాది కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబద్తో తలడేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఇన్ని సీజన్లుగా ఆర్సిబిలోనే కొనసాగుతూ వచ్చిన విరాట్ కోహ్లీ.. ఆర్సిబిలో తన ఆల్టైమ్ ఫేవరేట్ ప్లేయింగ్ లెవన్ ఏంటనే విషయాన్ని వెల్లడించాడు. ఆర్సిబి పోస్ట్ చేసిన వీడియోలో విరాట్ మాట్లాడుతూ.. ‘‘క్రిస్ గేల్తో కలిసి నేను ఓపెనింగ్ చేస్తా. ఇన్నింగ్స్ను విధ్వంసకర రీతిలో ఆరంభించాలని కోరుకుంటా. విదేశీ క్రికెటర్లను ఆడించే వెసులుబాటు ఉంది. ఎబిడి, క్రిస్ గేల్తో పాటు మిచెల్ స్టార్క్ను తీసుకుంటా. గతంలో అతడు మా జట్టులో ఆడిన ప్లేయరే. ఇక నాలుగో ఓవర్సీస్ ఆటగాడిగా డేయిల్ స్టెయిన్ని తీసుకుంటా. అతడి బౌలింగ్ బాగుంటుంది. పదునైన పేస్ బౌలింగ్ ఉండాలి. అందుకే, ఈ ఇద్దరు సీమర్లకు అవకాశం ఇస్తా. మిడిలార్డర్లో ముఖ్యమైన నాలుగో స్థానం కెఎల్ రాహుల్దే. ఈ ప్లేస్లో ఆర్సిబి తరఫున కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. రజత్ పాటిదర్ను ఐదో స్థానంలో ఆడిస్తా. స్పిన్ను మెరుగ్గా ఆడగలడు. ఆరో ప్లేస్లో దినేశ్ కార్తీక్ ఫినిషర్. స్పిన్నర్లుగా చాహల్, కుంబ్లేను తీసుకుంటా. మూడో పేసర్ కమ్ బ్యాటర్గా హర్షల్ పటేల్కు అవకాశం ఇస్తా’’ అని అన్నాడు.
గుర్తింపు కోసం రాహుల్పై కెటిఆర్ విమర్శలు: మంత్రి సీతక్క
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గుర్తింపు కోసం ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కెటిఆర్ గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారని, తనను ఎవరూ గుర్తించడం లేదన్న బాధతో గుర్తింపు కోసం రాహుల్ను నిందించడం అలవాటు గా మార్చుకున్నారని ఆమె సోమవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడర్ అవుతానని కెటిఆర్ భావిస్తున్నారని ఆమె విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తేనే ఓర్వలేకపోతున్నారని ఆమె విమర్శించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడాలంటే కెటిఆర్ వణికిపోతారని ఆమె అన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకాన్ని సమర్దవంతంగా అమలు చేస్తున్నదని ఆమె వివరించారు. పథకాల చట్టబద్ధత గురించి కెటిఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.బిఆర్ఎస్ నాయకుల డ్రగ్స్ దందా గురించి తొలుత కెటిఆర్ మాట్లాడితే బాగుంటుందన్నారు. మీ వారసత్వాన్ని మీ నాయకులు ఫౌం హౌస్లలో కొనసాగిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ నేత పై చర్యలు తీసుకోకపోవడంతోనే మీరు డ్రగ్స్ ను ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థం అవుతున్నదని మంత్రి సీతక్క తెలిపారు.
విరోష్ హల్దీ వేడుక.. ఫోటోలను పంచుకున్న రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి సంబంధించిన ఫోటోలు మరోసారి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26, గురువారం రాజస్థాన్లోని ఉదయపూర్ లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 25, బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. ఈ వేడుకలో ప్రత్యేకంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహించారు. సోమవారం ఈ హల్దీ వేడుక ఫోటోలను రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హల్దీ వేడుక.. హల్ది + హోలీ లాగా అనిపించిందిని పేర్కొంది. విజయ్-రష్మిక హల్దీ వేడుక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
పోక్సో కేసులో 20ఏళ్ల జైలు శిక్ష
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.42వేల జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్, జల్పల్లి గ్రామానికి చెందిన మేత్రి అజయ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన సంరక్షణలో ఉన్న బాలికపై నిందితుడు 2024లో అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సాక్షాలను సేకరించిన పోలీసులు ఫాస్ట్ట్రాక్ కోర్టులో సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా, బాధితురాలికి రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పొట్టిశ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక […] The post అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం appeared first on Visalaandhra .
విద్యుత్ ఘాతు కానికి పశువుల మృతి
విద్యుత్ ఘాతు కానికి పశువుల మృతి సిర్పూర్ (యు ),ఆంధ్రప్రభ: కొమరం భీమ్
అటవీ, అభయారణ్య ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై నివేదిక సమర్పించండి
జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి విశాలాంధ్ర ఏలూరు: జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవసరమైన త్రాగునీరు బోర్లు,పైపులైన్లు, ,రోడ్లు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు అవకాశాలను పరిశీలించి నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనపై జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ […] The post అటవీ, అభయారణ్య ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై నివేదిక సమర్పించండి appeared first on Visalaandhra .
Convention |ఇఫ్తార్ విందుకు హాజరైన ముఖ్యమంత్రి
Convention | ఇఫ్తార్ విందుకు హాజరైన ముఖ్యమంత్రి అపూర్వ స్వాగతం పలికిన ఎంపీ
రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలి…
రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలి… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల
హస్త కళాకారులకు మెరుగైన అవకాశాలు
హస్త కళాకారులకు మెరుగైన అవకాశాలు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి హస్త కళాకారులకు
తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి: కెసిఆర్
తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసి తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిద్ధారెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం ’కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025 ’ ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిద్ధారెడ్డికి దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నందిని సిద్ధారెడ్డిని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి ‘అనిమేష’ కు ఈ పురస్కారం రావడం గొప్ప విషయమని కేసీఆర్ ప్రశంసించారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ, ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని కేసీఆర్ కొనియాడారు.
ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలం: ఏలేటి మహేశ్వర్రెడ్డి
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, ప్రస్తుతం బిజెపియే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని బిజెపి శాసనపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో రైతుల సమస్యలు, రైతు భరోసా ఎగ్గొట్టిన అంశం, ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏలేటి వెల్లడించారు. గుజరాత్లో సబర్మతి నది అభివృద్ధికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తే తెలంగాణలో మూసీ పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని ఏలేటి ఆరోపించారు. శాసనసభలో రేవంత్ ప్రభుత్వంపై పోరాటంలో బిఆర్ఎస్ వెనుకబడిందని, బిజెపియే ప్రజల పక్షాన నిలబడుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఫోటో దిగుతండగా.. గుండెపోటు.. మహిళ మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ శుభకార్యానికి వెళ్లిన మహిళ.. గుండెపోటుతో మృతి చెందింది. ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన సుస్మిత.. తన బంధువుల గృహప్రవేశ వేడుకకు హాజరైంది. ఫోటో దిగే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సంతోషంగా ఉండాల్సిన చోట విషాద ఛాయలు అలుముకొన్నాయి.
సుజనా చౌదరి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి..
సుజనా చౌదరి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి.. భవానిపురం, ఆంధ్రప్రభ : భవానీ
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ భవానిపురం, ఆంధ్రప్రభ :
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం ఎమ్మెల్యే కందికుంట
విశాలాంధ్ర,కదిరి..అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక టవర్ క్లాక్ వద్దనున్న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం 58 రోజుల దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత అన్నారు. భవిష్యత్తులో మహనీయుల చరిత్రను దేశమంతా స్మరించుకునేలా పెద్ద ఎత్తున సేవా […] The post అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం ఎమ్మెల్యే కందికుంట appeared first on Visalaandhra .
లాభసాటి వ్యవసాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
లాభసాటి వ్యవసాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గొల్లపూడిలో ‘రైతన్నా మీకోసం’ పాల్గొన్న మంత్రి
మున్సిపాలిటీలో శిలాపలకం వివాదం…!!
మున్సిపాలిటీలో శిలాపలకం వివాదం…!! ప్రారంభోత్సవానికి ముందే తొలగింపు…!! రసాభాసగా కొనసాగిన మున్సిపల్ కౌన్సిలింగ్
ఎల్ పి జి గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు..
ఎల్ పి జి గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు.. ప్రజలు అపోహలు
18వ తేదీన ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ ఇఫ్తార్ విందు ఏర్పాటు…
18వ తేదీన ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ ఇఫ్తార్ విందు ఏర్పాటు… కృష్ణలంక
ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములుజయంతి వేడుకలు
ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములుజయంతి వేడుకలు కృష్ణలంక విజయవాడ తూర్పు, ఆంధ్రప్రభ :
పురమిత్ర యాప్ ను రద్దు చేయాలి..
పురమిత్ర యాప్ ను రద్దు చేయాలి.. విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ
Burrilanka gang rape case : నలుగురికి జీవిత ఖైదు
Burrilanka gang rape case : నలుగురికి జీవిత ఖైదు ( ఆంధ్రప్రభ,
Fresh Trouble For Avinash Reddy in Vivekananda Reddy Case?
The murder case of former minister Y. S. Vivekananda Reddy has once again entered public debate after fresh remarks by MP Y. S. Avinash Reddy, one of the accused in the case. Avinash Reddy spoke about complainant Sunitha Reddy and claimed that several allegations made against him during the investigation were not related to the […] The post Fresh Trouble For Avinash Reddy in Vivekananda Reddy Case? appeared first on Telugu360 .
రైతు పండించిన పంట 30% మాత్రమే కొనుగోలు……
రైతు పండించిన పంట 30% మాత్రమే కొనుగోలు…… మిగిలిన పంట బయట మార్కెట్
అమరజీవి త్యాగం చిరస్మరణీయం : స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్
విశాలాంధ్ర – రాప్తాడు : తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. 58 రోజుల పాటు సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, తెలుగు […] The post అమరజీవి త్యాగం చిరస్మరణీయం : స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ appeared first on Visalaandhra .
UBS Team waiting for Telangana GO
The team of Ustaad Bhagat Singh is waiting for the official Government Order in Telangana to kick-start the advance sales. The advance bookings are opened in AP after the government issued the GO. Rumors say that the GO in Telangana will arrive today and the advance sales will open tomorrow morning. If there is no […] The post UBS Team waiting for Telangana GO appeared first on Telugu360 .
నేషనల్ ఇమ్యునైజేషన్ డే అవగాహన కార్యక్రమం…
నేషనల్ ఇమ్యునైజేషన్ డే అవగాహన కార్యక్రమం… టీకాలతో పిల్లలను ప్రాణాంతక వ్యాధుల నుంచి
ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్ పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు పోలీస్
ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపండి..
ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపండి.. గడువులోపు సమస్య పరిష్కారానికి కృషిచేయాలి..జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు
ఢిల్లీ పర్యటనలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బిజీగా గడుపుతున్నారు
జీవన్రెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా?
జగిత్యాల: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి తన అనుచరులతో తెలిపారు. ఈ నెల 25న ఆయన బిఆర్ఎస్లో చేరుతున్నట్లు సమాచారం. గత 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. అయితే రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్తో ఆయనకు పొసగడం లేదు. సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్లో ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడుతున్నట్లు సమాచారం. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం…
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం… ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ
తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారా?
తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు
Middile East War Effect : హోర్మోజ్ జలసంధిలో రవాణా దెబ్బ… చమురు ధరలు మరింతగా పెరిగి
మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రంగా కొనసాగుతుండటంతో ప్రపంచ ఇంధన సంక్షోభంపై ఆందోళనలు పెరుగుతున్నాయి
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో అక్రమంగా
Telangana : కాంగ్రెస్ లో అసంతృప్తి బయటపడే అవకాశాలు ఎంత?
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి అనేది బయటపడకుండా ఉం
ఫరూక్నగర్లో అగ్ని ప్రమాదం.. పక్కనే గ్యాస్ గోదాం
హైదరాబాద్: ఫలక్నుమా పరిధిలోని ఫరూక్నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బస్ డిపో పక్కన ఉన్న దుకాణంలోప ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనున్న ఫర్నీచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే పక్కనే ఇండేన్ గ్యాస్ గోదాం ఉండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలి..
ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర
Farmer Hopes evaporate : కంపెనీల కిరికిరి Andhra Prabha SPL Story
Farmer Hopes evaporate : కంపెనీల కిరికిరి Andhra Prabha SPL Story
Telangana | ఓఆర్ఆర్ పై…. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
వర్నిలో కల్తీ కల్లు జోరు.. వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలోని

26 C