SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

20    C
... ...View News by News Source

ప్రేమ కథ, మంచి భావోద్వేగాలున్న సినిమా..

‘జాతిరత్నాలు’తో హాస్య చిత్రాలలో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కె.వి. అనుదీప్, ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ’ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు కె.వి. అనుదీప్ మీడియాతో మాట్లాడుతూ “విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ‘జాతిరత్నాలు’తో పోలిస్తే ’ఫంకీ’ చిత్రం పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించడం జరిగింది. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. ‘ఫంకీ’లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇందులో హాస్యంతో పాటు అందమైన ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయి. ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశాము. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ సినిమా చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇక మూడు నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయాల్సి ఉంది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాస్తున్నాను. అలాగే వెంకటేష్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను” అని అన్నారు.

మన తెలంగాణ 11 Feb 2026 1:02 am

టి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కు రెండో విజయం

కొలంబో: టి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం గ్రూప్‌ఎలో భాగంగా యుఎస్‌ఎతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన యుఎస్‌ఎ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. ఓపెనర్లు జహాంగిర్, అండ్రీస్ గౌస్‌లు యుఎస్‌ఎకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. జహాంగిర్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. గౌస్ రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కీలక ఇన్నింగ్స్ ఆడిన జహాంగిర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. మిలింద్ కుమార్ (29) పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన శుభం రంజానె 30 బంతుల్లోనే 3 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో యుఎస్‌ఎకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఉస్మాన్ మూడు, షాదాబ్ ఖాన్ రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను ఓపెనర్ సాహెబ్‌జాదా ఫర్హాన్ ఆదుకున్నాడు. అమెరికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఫర్హాన్ 41 బంతుల్లోనే 6 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. బాబర్ ఆజమ్ (46) కూడా మెరుగైన ఆటను కనబరిచాడు. 

మన తెలంగాణ 11 Feb 2026 12:52 am

బుధవారం రాశి ఫలాలు (11-02-2026)

మేషం నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృషభం ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది. మిథునం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సింహం: చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. కన్య: వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. తుల: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చికం: ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మకరం: వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది. కుంభం: అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. మీనం:- ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.  

మన తెలంగాణ 11 Feb 2026 12:00 am

టెట్ ఫలితాలు విడుదల

 టిజి టెట్ 2026 (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితా లు విడుదలయ్యాయి. టెట్‌కు మొత్తం 1,95,181మంది అభ్యర్థులు హాజరు కా గా, 1,00,270 మంది(51.37%) ఉత్తీర్ణత సాధించారు. పేపర్1కు 71,198 మంది హాజరుకాగా, 51,266 మంది (72%) ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 2కు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు 69,861 మంది హాజరుకాగా, 29,598మంది (42.37%) ఉత్తీర్ణత సాధించగా, సోషల్ స్టడీస్ సబ్జెక్టు లో 54,122 హాజరుకాగా, 19,406 మం ది (35.86%) ఉత్తీర్ణత సాధించారు. ఈసా రి టెట్‌కు 65,605మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరవగా, 37,893మంది (57.76%) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను https: //schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 

మన తెలంగాణ 10 Feb 2026 11:59 pm

కెసిఆర్‌ను అరెస్టు చేస్తామంటే... ఎవరూ అడ్డుపడకుండా చూస్తా

“బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అరెస్టు చేస్తామంటే, ఎవరూ అడ్డుపడకుండా చూసే బాధ్యత నాదే..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమి చేశారో సవివరంగా చర్చించేందుకు ఎప్పుడైనా, ఎక్కడైనా ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. సచివాలయంలో లేదా ప్రెస్ క్లబ్‌లో లేదా మరెక్కడైనా చర్చకు ‘సై’ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని తాను గానీ కేంద్రం గానీ ఎప్పుడూ చెప్పలేదన్నారు.కెసిఆర్‌కు తాను దత్తపుత్రుణ్ని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఎవరికీ దత్తపుత్రుణ్ని కాదని, కెసిఆర్‌తో మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు తేల్చుకోవాలి తప్ప మధ్యలో నన్ను లాగవద్దని అన్నారు. తమ పార్టీ భుజాలపై తుపాకి పెట్టి కాల్చాలనుకుంటే ఎవరూ హర్షించరని ఆయన తెలిపారు. కెసిఆర్‌ను జైలులో పెడతామని, చిప్ప కూడు తినిపిస్తామని మీరు చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారని అన్నారు. కెసిఆర్‌ను అరెస్టు చేస్తామనంటే ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తనది అని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బిఆర్‌ఎస్‌కుగానీ, కెసిఆర్ కుటుంబానికి గానీ వ్యతిరేకంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. రేవంత్‌రెడ్డి లాగా తాము సిఎం పదవి ఆశ జుపితే పార్టీ ఫిరాయించే వాళ్ళం కాదని అన్నారు. త్రిముఖ కాదు ద్విముఖ పోటీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బి, జెపి-బి, బిఆర్‌ఎస్ మధ్యే త్రిముఖ పోటీ ఉందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నందున అడ్డుకోవాలనే ఉద్దేశంతో త్రిముఖ పోటీ ఉందని అన్నారని ఆయన చెప్పారు. గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లలో బిజెపి గెలుపొందిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉత్తర తెలంగాణలో తమ పార్టీని గెలిపించారని అన్నారు. నా పేరు ఎలా మారుస్తారు.. ? రేవంత్ ఖాన్ అని ముఖ్యమంత్రి గర్వంగా చెప్పుకోవడం పట్ల తనకేమి అభ్యంతరం లేదు కానీ తన తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మజ్లిస్‌తో కాపురం చేసినన్ని రోజులు తాము ఆ కాపురంలో నిప్పులు పోస్తామని, రజాకార్లతో కలిసి తిరిగినన్ని రోజులు తాము ఇబ్బందులు పెడుతూనే ఉంటామని, మజ్లిస్‌తో లోపాయికారీ ఒప్పం దం చేసుకుని, పరస్పర సహకారం అందించుకుంటున్నారని ఆ యన విమర్శించారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు తమ పార్టీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప మృతి చెందడం బాధాకరమని అ న్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఈ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. 15 రోజులుగా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు దేవప్ప భార్య స్పష్టంగా ఫిర్యాదు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఏలను తొలిసారిగా వాయిదాల రూపంలో ఇవ్వడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

మన తెలంగాణ 10 Feb 2026 11:41 pm

ఫ్యాక్ట్ చెక్: ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఇటీవల తిరుమలను సందర్శించారనే వాదనలో ఎలాంటి నిజం లేదు

ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఇటీవల తిరుమలను

తెలుగు పోస్ట్ 10 Feb 2026 11:36 pm

సీపీఐ వైపే ప్రజల మొగ్గు

. కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం మాదే. డబ్బుతో చేసే రాజకీయం శాశ్వతం కాదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కాదని, తాత్కాలిక ప్రయోజనాలు కనిపిస్తాయే తప్ప ప్రజల్లో నిజమైన విశ్వాసాన్ని పొందలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొందరు డబ్బు బలం, అహంకారంతో రాజకీయాలను కలుషితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ […] The post సీపీఐ వైపే ప్రజల మొగ్గు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 11:24 pm

ఏఐ కంటెంట్‌పైకేంద్రం ఆదేశాలు

న్యూదిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందిన కంటెంట్ కొత్త సవాళ్లు విసురుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశించింది. ఏఐ కంటెంట్‌ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి అప్లయ్ చేశాక లేబుల్‌ను గానీ, మెటా డేటాను గానీ తొలగించడానికి లేదా కనబడకుండా చేయడానికి వీల్లేకుండా ఉండాలని స్పష్టంచేసింది. చట్టవిరుద్ధమైన, అసభ్య, మోసపూరిత ఏఐ కంటెంట్‌ను […] The post ఏఐ కంటెంట్‌పైకేంద్రం ఆదేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 11:18 pm

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి

బారాబంకి: అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్ప్పుకొచ్చారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారం జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం, శ్రీ రామార్చా పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ కొందరు అవకాశవాదులు ఉంటారని, వారికి కష్టాలు వచ్చినప్ప్పుడే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమయాల్లో తలవను కూడా తలవరని అన్నారు. అందువల్లే రాముడు కూడా వాళ్లను మరిచిపోతాడని చెప్పారు. ‘రాముని భక్తులపై […] The post బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 11:16 pm

సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: సుప్రీంకోర్టులో వాన్‌పిక్ ప్రాజెక్టుకు చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన అభియోగాలను సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుందని, దానికి గల కారణాలు చెప్పలేదంటూ వాన్‌పిక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో వాన్‌పిక్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ […] The post సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు చుక్కెదురు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 11:15 pm

నేటి నుంచి అసెంబ్లీ

గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దీంతో శాసనసభ నిండుగా కనపడనుంది. కాగా గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన […] The post నేటి నుంచి అసెంబ్లీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 11:13 pm

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

. పోలవరం రెండో దశకు రూ.32వేల కోట్లు అవసరం. ఉత్తర-దక్షిణ భారత్‌లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి. ఏపీలో మఖానా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి. పూర్వోదయ సహా ప్రాయోజిత పథకాలకు నిధులివ్వండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతి. అమిత్‌షా సహా 7గురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు […] The post ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 11:10 pm

విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా

. మొదటి దశలో 46.22 కి.మీ – 43 స్టేషన్లు. రూ.11వేల కోట్ల వ్యయం న్యూదిల్లీ: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలి పింది. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు… కేంద్రమంత్రి మనోహ ర్‌లాల్‌తో భేటీ అయిన సందర్భంగా మనోహర్‌లాల్ స్వయంగా ఈ విషయాన్ని సీఎంకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, విజయవాడ మెట్రోకు ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో విశాఖ మెట్రోకు పచ్చజెండా ఊపినట్లు సీఎంకు కేంద్రమంత్రి తెలిపారు. వేగంగా […] The post విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 11:02 pm

‘కపుల్ ఫ్రెండ్లీ’.. ప్యూర్ లవ్ స్టోరీ

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “కపుల్ ఫ్రెండ్లీ... ఒక ప్యూర్ లవ్ స్టోరీ. చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుకోవచ్చు. ఈ మూవీలో హీరో, హీరోయిన్స్ కు ఒక మంచి ఫ్యామిలీ నేపథ్యం, కుటుంబ సభ్యులు ఉంటారు. వారి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాను ఇబ్బందిపడకుండా చూడొచ్చు”అని అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “మిత్ర, శివ జర్నీ ఈ సినిమా. మిత్ర తనకు పరిచయమయ్యాక శివ లైఫ్ ఎలా మారింది, మిత్ర కోసం శివ ఎంతవరకు వెళ్లాడు అనేది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మానస వారణాసి పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Feb 2026 11:01 pm

భారీస్థాయిలో ‘రఫేల’

రూ.3.25 లక్షల కోట్ల వ్యయంఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందానికి భారత్ సిద్ధం న్యూదిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌పై జరిపిన దాడుల్లో కీలకంగా మారిన రఫేల్ యుద్ధ విమానాలను భారీస్థాయిలో కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఇందుకోసం ఫ్రాన్స్‌తో అతిపెద్ద రక్షణ ఒప్పందం కుదుర్చుకో నుంది. 3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రఫేల్ యుద్ధ విమానాలు సమకూర్చుకోనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానుండటంతో ఈ వారమే ఈ ఒప్పందానికి […] The post భారీస్థాయిలో ‘రఫేల’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 10:59 pm

శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తు న్నారు. సోమవారం ఒక్క రోజే దాదాపు లక్ష మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. వీరిలో దాదాపు 50,000 మంది దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం కూడా ఇదే తరహాలో భక్తులు తరలివచ్చారు. ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 50,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అను మతిస్తున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ భారీగా ఉంది. ఆలయంలో శివ భక్తుల క్యూలు భారీగా ఉన్నాయి. ప్రతి రోజూ దాదాపు లక్ష మంది భక్తులు వస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వసతి సౌకర్యాలు సరిపోకపోవడంతో చాలామంది యాత్రి కులు బహిరంగ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవలసి వస్తోంది. ఫిబ్రవరి 16 వరకు భారీ రద్దీ కొనసాగు తుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. జనసమూహాన్ని నియంత్రించడంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం భక్తులు అదుపు చేయలేక పోవడంతో లాఠీఛార్జ్ జరిగిందని వార్తలొచ్చాయి. అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. భక్తులకు సజావుగా దర్శనం కల్పించడానికి అదనపు పోలీసు బలగాలను మోహరించారు. శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బ్రహ్మో త్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యా లపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డిజిపిలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ చేశారు. అధికారులు, జిల్లా యంత్రాంగం తీసు కున్న చర్యలను, సౌకర్యాలను సమీక్షించారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగ కుండా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని చెప్పారు. దీక్ష లు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని సీఎం ఆదేశించారు. రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకో వాలని పేర్కొన్నారు. అన్ని విభాగా లు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని సిఎస్ విజయానంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మన తెలంగాణ 10 Feb 2026 10:53 pm

మార్కెట్లోకి ఒప్పొ కె14ఎక్స్ 5జి

 ఒప్పొ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్ ఒప్పొ కె14ఎక్స్ 5జిను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో 6500ఎంఎహెచ్ బ్యాటరీ, 45డబ్లు ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెట్జ్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50ఎంపి కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పొ స్టోర్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ప్రారంభ ధర రూ.13,499గా నిర్ణయించారు.  

మన తెలంగాణ 10 Feb 2026 10:31 pm

న్యూజిలాండ్‌కు రెండో విజయం

 టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గ్రూప్‌డిలో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కివీస్ 15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. ఆరంభం నుంచే ఇద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. సిఫర్ట్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సిఫర్ట్ 42 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా బ్యాటింగ్ చేసిన అలెన్ 50 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, మరో 5 ఫోర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కివీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే జయకేతనం ఎగుర వేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యుఎఇని కెప్టెన్ మహ్మద్ వసీం, అలీషాన్ షరఫు ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వసీం 45 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. షరఫు 5 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 55 పరుగులు సాధించాడు. మయాంక్ (21) తనవంతు సహకారం అందించాడు.

మన తెలంగాణ 10 Feb 2026 10:27 pm

కాంగ్రెస్ ఎంపిల ప్రవర్తనపై వీడియో బయటపెట్టిన మంత్రి కిరెణ్ రిజిజు

లోక్‌సభలో ఏదో జరగరాని సంఘటన జరగబోతోందని తనకు విశ్వసనీయ సమాచారం ఉన్నందునే సభకు హాజరుకావద్దని స్వయంగా ప్రధాని మోడీకి తాను తెలియజేసినట్లు ఈ నెల 4న లోక్‌సభలో జరిగిన పరిణామాలపై స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రకటన ఇటీవల చర్చనీయాశమైంది. దానికి మద్దతుగా ఆ రోజు సభలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారల మంత్రి కిరెణ్ రిజిజు బయటపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు బ్యానర్ చేతిలో పట్టుకుని తొలుత వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. కాసేపటికే ప్రధానమంత్రి సీటును చుట్టుముట్టి బ్యానర్ ప్రదర్శిస్తూ నినాదాలు అందుకున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రెజరీ బెంచ్ సభ్యులు, కేంద్రమంత్రులు గిరిరాజ్, అశ్విని వైష్ణవ్ వారిని వారిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తదుపరి కార్యాచరణపై వారు చర్చించుకుంటున్న తీరు కూడా అందులో ఉంది. ఆ రోజు పార్లమెంట్ గౌరవ మర్యాదలను కాపాడేందుకు తమ సభ్యులు సహనం వహించారని రిజిజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపిల ప్రవర్తనను చూసి ఆ పార్టీ నాయకత్వం గర్వపడడం సిగ్గుచేటన్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 10:24 pm

17న భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 17 నుంచి 19వరకు ఆయన ఇక్కడ పర్యటించనున్నారని విదేశాంగ శాఖ మంగళవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారని తెలిపింది. ప్రాంతీయ అంశాలతో ప్రపంచంలోని తాజా పరిస్థితులపై మోడీ, మేక్రాన్ చర్చలు జరుపుతారని పేర్కొంది. అదే విధంగా ఢిల్లీలో జరనున్న ‘కృత్రిమ మేధప్రభావం’ సదస్సులో ఇరువుకు కలిసి పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ముంబయిలో జరగనున్న ‘ఇండియాఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమాన్ని కూడా ఉమ్మడిగా ప్రారంభించనున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది.  

మన తెలంగాణ 10 Feb 2026 10:21 pm

Students |పేద విద్యార్థుల చదువుకు బాబు, లోకేష్ భరోసా..

Students |పేద విద్యార్థుల చదువుకు బాబు, లోకేష్ భరోసా.. రూ.1200 కోట్ల ఫీజు

ప్రభ న్యూస్ 10 Feb 2026 9:55 pm

పిచ్చికుక్క కాటుకుతో చికిత్స పొందుతూ ఐదేళ్ల చిన్నారి మృతి

అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి పిచ్చి కుక్క కాటుకు బలైన సంఘటన షాబాద్ మండలం చర్లగూడ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చర్లగూడ గ్రామానికి చెందిన సిద్దూలూరు కుమార్ దంపతులకు బాబు, కూతురు ఉన్నారు. కూతురు నక్షత్ర (5) గత పది రోజుల క్రితం ఇంటిముందు ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న ఒక పిచ్చికుక్క చిన్నారిని కాటు వేసింది. చేతికి ముఖానికి గాయాలయ్యాయి. అది గమనించిన కుమార్ దంపతులు చిన్నారిని హుటాహుటినా ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా రేబీస్ వ్యాధి ముదిరిందని చికిత్స చేయాలనే డాక్టర్లు తెలుపగా పది రోజులుగా అక్కడే ఉండి చికిత్స చేస్తున్నారు. సోమవారం రోజు రాత్రి పరిస్ధితి విషమించి చిన్నారి మృతి చెందింది. దీంతో ఆ పేద కుటుంబంలో విషాదం మిగిలింది. 

మన తెలంగాణ 10 Feb 2026 9:53 pm

4న లోక్‌సభలో ఏం జరిగింది?.. వీడియో బయటపెట్టిన రిజిజు

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఏదో జరగరాని సంఘటన జరగబోతోందని తనకు విశ్వసనీయ సమాచారం ఉన్నందునే సభకు హాజరుకావద్దని స్వయంగా ప్రధాని మోడీకి తాను తెలియజేసినట్లు ఈ నెల 4న లోక్‌సభలో జరిగిన పరిణామాలపై స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రకటన ఇటీవల చర్చనీయాశమైంది. దానికి మద్దతుగా ఆ రోజు సభలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారల మంత్రి కిరెణ్ రిజిజు బయటపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు బ్యానర్ చేతిలో పట్టుకుని తొలుత వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. కాసేపటికే ప్రధానమంత్రి సీటును చుట్టుముట్టి బ్యానర్ ప్రదర్శిస్తూ నినాదాలు అందుకున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రెజరీ బెంచ్ సభ్యులు, కేంద్రమంత్రులు గిరిరాజ్, అశ్విని వైష్ణవ్ వారిని వారిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తదుపరి కార్యాచరణపై వారు చర్చించుకుంటున్న తీరు కూడా అందులో ఉంది. ఆ రోజు పార్లమెంట్ గౌరవ మర్యాదలను కాపాడేందుకు తమ సభ్యులు సహనం వహించారని రిజిజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపిల ప్రవర్తనను చూసి ఆ పార్టీ నాయకత్వం గర్వపడడం సిగ్గుచేటన్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 9:48 pm

బిఆర్‌ఎస్ ఇప్పటికీ మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తుంది: మంత్రి పొంగులేటి

ఒక ప్రక్క ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతున్నప్పటికి బి ఆర్ ఎస్ పార్టీ నేతలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, వాళ్ళ వద్ద ఇంకా ట్యాపింగ్ పరికరాలు ఉన్నట్లు అనుమానం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని దీనిపై పూర్తి స్దాయిలో విచారణ చేస్తామన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ ఎక్విప్‌మెంట్ (పరికరాలు) అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని, తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. అసలు తాను ఉద్యోగులతో చేసిన సంభాషణకు సంబంధించిన ‘వాయిస్ కాల్ రికార్డ్’ బీఆర్‌ఎస్ నాయకులకు ఎలా లభ్యమైందని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తనకు అనుమానం కలుగుతోందన్నారు. ఏ మామిడితోటల్లో, మరే ఫాం హౌజ్ లలో, ఎవరి ఇళ్లలో ఉండి ఇంకా ఎంత మంది దొంగతనంగా మాటలు వింటున్నారో, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయం తేలాల్సిన అవసరముందన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి స్పష్టం చేశారు. తానో మంత్రినని, మంత్రిగా తనకున్న అవకాశాన్ని బట్టి అధికారులతో ,ఉద్యోగులతో అనేక సమీక్షలు జరుపుతుంటానని ఇందులో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. నా పార్టీకోసం ఓట్లు అడగడం తప్పా? అని కూడా ఆయన అన్నారు. ఉద్యోగులు కూడా ఓటర్లేనని, సామాన్యుడు వినియోగించుకున్న తరహాలోనే ఉద్యోగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారని, వారిని తాను ఓట్లు అడగడంలో తప్పేమిటని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికి కూడా అదే ఓటు ఉంటుందని, ఓటర్లుగా ఉన్నటువంటి ఉద్యోగులను తన పార్టీ కోసం అభ్యర్థించడంలో ‘వాట్ ఈజ్ రాంగ్?’ అని పొంగులేటి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ డబుల్ బెడ్ రూం ఇళ్ళ గురించి పార్టీ కండువ కప్పుకున్న వారికే సంక్షేమ పథకాలు ఇవ్వాలని, డ్రాలు, లిస్టులు లేవని అంటూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన వాయిస్ రికార్డును విలేఖర్లకు విన్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు కాంగ్రెస్‌వే రాష్ట్రంలో బుధవారం జరగనున్న116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం పైగా సీట్లను కైవసం చేసుకోబోతుందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజలకు చేరువయ్యాం. అందుకే ఈ పుర ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విసిరిన రెఫరెండమ్ సవాళ్లను ప్రజలు తిప్పికొట్టారు.. అదే ఫలితం రేపు పునరావృతం కాబోతుందని అన్నారు. మొన్నటి వరకు రెఫరెండమ్, సెమీఫైనల్ అంటూ ప్రగల్భాలు పలికిన నాయకులు ఇప్పడు ఎందుకు సైలెంట్ అయ్యారని ఆయన ప్రశ్నించారు. మున్సిపాల్టీలో అధికార కాంగ్రెస్ పార్టీకి వస్తున్న స్పందనను చూసి, రిఫరెండమనే నాయకులు ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించ లేదన్నారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు సిపిఐతో ప్రెండ్లి కాంటేస్ట్‌తోనే ఉన్నామని సిపిఐ కాంగ్రెస్‌తోనే ఉంటుందన్నారు. తాను సిఎం రేసులో లేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓట్ల కోసం దౌర్జన్యాలకు, దందాలకు , అక్రమాలకు పాల్పడితే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని తాను ఎవ్వరిని బెదిరించలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. నెలకు రూ. 6,300 కోట్లు కేవలం అప్పులకే కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదు. గత దొరల పాలనలో పేదలను విస్మరించారు. 62 వేల డబుల్ బెడ్ రూంలను మొండిగోడలుగా మిగిల్చారు. కానీ మేం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. వరి వేస్తే ఉరి అన్న కాలం పోయి, ఇప్పుడు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం అని వివరించారు. ఆరు గ్యారెంటీలో కొన్ని బాకీ ఉన్న విషయం వాస్తవమేని వాటిని కూడా దశలవారీగా అమలు చేస్తామని ప్రజలకు నచ్చజెప్పుతున్నామని తమ మాటలను ప్రజలు విశ్వసిస్తున్నారు అనేదానికి గ్రామ పంచాయతీ ఎన్నికలో వచ్చిన తీర్పే నిదర్శనమన్నారు. ఇందిరమ్మఇళ్ళ పథకంలో అర్బన్ ప్రాంతాల్లో సొంత జాగా లేని వారికి రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేసి ప్రణాళికను రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. జి+3 విధానంలో మూడంతస్ధుల అపార్టెమెంట్‌ను నిర్మించి సొంత ఇంటి స్ధలం లేని వారికి నిర్మించి అందజేస్తామన్నారు. గత బి ఆర్ ఎస్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 63 వేల డబుల్ బెడ్ రూం గదులను పూర్తి చేసి వాటిని పట్టణాల్లోని అత్యంత పేదలను గుర్తించి వారికి కేటాయిస్తామని ఇప్పటికే 31వేల ఇళ్ళను పూర్తి చేసి సొంత ఇంటి స్ధలం లేని వారికి అందజేశాం, ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే వాటిని కూడా పేదలకు పంపిణి చేస్తామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రజలంతా గడిచిన రెండేళ్ళుగా చెప్పటిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించాలని ఆయన కోరారు.

మన తెలంగాణ 10 Feb 2026 9:46 pm

గోషామహల్‌లో భారీ ఎత్తున పట్టుబడ్డ నగదు

రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చే సి, వారి నుంచి రూ.76, 87, 650 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల క థనం ప్రకారం...గోషామహల్ గ్యాన్‌బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో మంగళవారం ఉదయం ముగ్గురు అనుమాని త వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తచ్చాడుతుండటం గమనించిన గోషామహల్ పోలీసులు వారి ద్విచక్ర వాహనాలను ని లిచి, తనిఖీ చేయగా, వారి వద్ద గల మూడు సంచీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో పాటు సగం చించివేసిన రూ.10 నోటుతో పాటు మ రో రూ.20 నోటు లభించాయి. పట్టుబడిన ముగ్గురు అనుమానితులను పోలీసులు నగదు గురించి ఆరా తీయగా, ముగ్గురూ వ్యక్తులు భయంతో తడ బడటంలో అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద లభించిన రూ.76, 87, 650 స్వాధీనం చేసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో అనుమానిత ముగ్గురు వ్యక్తులు రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన గజరామ్ అధికారి జో టార్మ్, బెహ్రామ్ అధికారి గణపతి రామ్, రాకేష్ దేవాసి అధికారి మసు రారామ్ అధికారి మహేందర్‌లుగా తేలింది. వీరంతా బతుకు తెరువు కోసం న గరానికి వచ్చి ఉస్మాన్‌గంజ్, చాక్నావాడీ, గ్యాన్‌బాగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో వేర్వేరుగా గదులు అద్దెకు తీసుకుని, నివసిస్తున్నారని గోషామ హల్ ఇన్‌స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పకపోగా, పొంతన లేకుండా సమాధానాలు చెబుతున్నారని, వా రి వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేక పోవడంతో నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ కోసం ఇన్‌కమ్ టాక్స్ అధికారుల కు అప్పగించనున్నట్లు తెలిపారు. భారీ మొత్తంలో పట్టుబడిన నగదును ప్రస్తుతానికి హవాలా డబ్బుగానే భావిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ మేర కు కేసు నమోదు చేసి, ఈ డబ్బును ఎవరికి ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి పంపిస్తున్నారు? ఇక్కడ హవాలా రాకెట్ నడుపుతున్న వారు ఎవ రు? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బి శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 10 Feb 2026 9:44 pm

Ghantasala |ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవం…

Ghantasala | ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవం… ఇది తెలుగు జాతికి శ్రీకృష్ణ

ప్రభ న్యూస్ 10 Feb 2026 9:42 pm

డికెకు మద్దతుగా 90మంది ఎంఎల్‌ఎల లేఖ!

శివకుమార్‌కు సిఎంగా ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి వినతి ఎంఎల్‌ఎ ఇక్బాల్ వ్యాఖ్యలతో చర్చనీయాంశమైన కర్నాటక పరిణామాలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: సిద్ధరామయ్య హైకమాండ్‌కు అన్నీ తెలుసు: డికె శివకుమార్ బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో డిప్యూటీ సిఎం శివకుమార్‌ను నియమించాలని కోరుతూ 80 మంది ఎంఎల్‌ఎలు హైకమాండ్‌కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎంఎల్‌ఎ, డికె మద్దతుదారుడు ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఆయన తాజా ప్రకటనలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ‘అవును. నిజమే 80 నుంచి 90 మంది శాసనసభ్యులం డికెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాశాం. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పలుమార్లు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా మేం క్రమశిక్షణగా మెలగాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటించాల్సి ఉంటుంది’ అని ఇక్బాల్ మీడియాతో వ్యాఖ్యానించారు. కర్నాటకలో నాయకత్వ అంశంపై సిఎం సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, వారు ఏ నిర్ణయం వెలువరిస్తే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తాను ఢిల్లీకి వెళ్లబోనని, ఒకవేళ హైకమాండ్‌ను పిలుపు వస్తేనే వెళ్తానని అన్నారు. ఇక దీనిపై అనవసరమైన ప్రశ్నలు అక్కర్లేదని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య అన్నారు. తాను పదేపదే ఢిల్లీకి ఎందుకు వెళ్లాలని, తనకు ఇక్కడ బడ్జెట్ సిద్ధం చేసుకునే పనులతో పాటు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు డికె శివకుమార్ మాట్లాడుతూ... తమ మధ్య ఏం చర్చ జరిగిందనేది మొత్తం పార్టీ పెద్దలకు తెలుసని, అంతా వారిముందే జరిగిందని అన్నారు. అధిష్టానం ముందే సిద్ధరామయ్య మాట్లాడారని, అందులో గందరగోళానికి తావెక్కడిదని ప్రశ్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు. 

మన తెలంగాణ 10 Feb 2026 9:36 pm

6Benefits |అరటి పండు తింటే దూరమయ్యే నీరసం, గుండెకు అద్భుత రక్షణ

6Benefits | అరటి పండు తింటే దూరమయ్యే నీరసం, గుండెకు అద్భుత రక్షణ

ప్రభ న్యూస్ 10 Feb 2026 9:28 pm

praja dharbar |రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్..

praja dharbar | రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్.. praja dharbar

ప్రభ న్యూస్ 10 Feb 2026 9:25 pm

రైజ్‌తో మహిళలకు ఆర్థిక సాధికారత

కలెక్టర్ జి. లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ (రైజ్) కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు విశేషంగా తోడ్పాటు లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు రైజ్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న […] The post రైజ్‌తో మహిళలకు ఆర్థిక సాధికారత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 9:15 pm

విషం తాగి ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య..

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఖప్పర్‌పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంటిలో విషం తాగి మృతి చెంది ఉండడాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. పాలలో విషం కలిపి తాగినట్టు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబం అంతా ఒకే గదిలో ఉండేది. ఉదయం పిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారు వారిని చూడడానికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. ఎటువంటి స్పందన లేకపోవడంతో గది తలుపు పగుల గొట్టి చూశారు. గదిలో ఐదు మృతదేహాలు కనిపించాయని పోలీసులు చెప్పారు. కుటుంబ పెద్ద మనీష్ కుమార్ అనే రైతు (35), అతని భార్య (32), వారి ఇద్దరు కుమార్తెలను,కుమారుడిని పోలీసులు గుర్తించారు. తాము ఆత్మహత్య చేసుకున్నామని గోడపై రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఒక కాగితంపై మరో సూసైడ్ నోట్ దొరికింది. మృతుడి మొబైల్ ఫోన్ నుండి పోలీసులు ఒక వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో మృతుడు తాను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పినట్టు పోలీస్ అధికారి ష్లోక్ కుమార్ తెలియజేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్ పరిశీలించిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. 

మన తెలంగాణ 10 Feb 2026 9:04 pm

Sp |ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు

Sp | ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు అన్ని కోణాల్లో దర్యాప్తువెల్లడించిన

ప్రభ న్యూస్ 10 Feb 2026 9:01 pm

Municipal Results May Set Stage for a Fresh Assembly By Election in Telangana

For all three major parties, Municipal elections have turned into a prestige battle. For Chief Minister Revanth Reddy, the results carry even greater weight. They are being seen as a direct measure of his government’s performance and political grip after coming to power.Strong indications suggest that Telangana may soon head towards another Assembly by-election. Sources […] The post Municipal Results May Set Stage for a Fresh Assembly By Election in Telangana appeared first on Telugu360 .

తెలుగు 360 10 Feb 2026 8:56 pm

Fire |టైల్స్ షోరూమ్ మంటలు ..ఫర్నిచర్ దహనం

Fire | టైల్స్ షోరూమ్ మంటలు ..ఫర్నిచర్ దహనం రూ. 6 లక్షల

ప్రభ న్యూస్ 10 Feb 2026 8:55 pm

Collector |మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

Collector | మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం పోలింగ్ ప్రక్రియను

ప్రభ న్యూస్ 10 Feb 2026 8:49 pm

అర్జున్-సానియా పెళ్లి.. ప్రధాని మోడీకి ఆహ్వానం

న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియాను అర్జున్ వివాహం చేసుకోబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఈక్రమంలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి.. అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించారు. ప్రధాని మోడీతో దిగిన ఫోటోలను సచిన్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఖాతాల్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించడం మాకు గౌరవంగా ఉంది. యువ జంటకు మీ ఆశీర్వాదాలు, ఆలోచనాత్మక సలహాలకు ధన్యవాదాలు అని టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అర్జున్-సానియా చాందోక్‌ ల నిశ్చితార్థ వేడుక జరిగింది. అర్జున్, సానియా మార్చిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.  కాగా, అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. ఆల్ రౌండర్ అయిన అర్జున్, దేశీయ సర్క్యూట్‌లో గోవా తరపున ఆడుతున్నాడు. అర్జున్ 22 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 23 లిస్ట్ A గేమ్‌లు, 29 T20 మ్యాచ్‌లు ఆడాడు. 2020/21 సీజన్‌లో ముంబై తరపున టీ20లో అరంగేట్రం చేశాడు. 2022/23 సీజన్‌లో గోవా తరుపున లిస్ట్ A, FC కెరీర్‌ను ప్రారంభించాడు. సానియా ఎవరు? సానియా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, గ్రావిస్ గ్రూప్‌ అధినేత రవి ఘాయ్ మనవరాలు. పెంపుడు జంతువుల సంరక్షణ సేవలపై దృష్టి సారించిన ముంబై వెంచర్ అయిన Mr Paws Pet Spa & Store LLPలో భాగస్వామి, డైరెక్టర్‌గా సానియా ఉంది.

మన తెలంగాణ 10 Feb 2026 8:47 pm

Ranveer Singh receives threatening WhatsApp Voice Notes

Bollywood Superstar Ranveer Singh has been riding high with the super success of Dhurandhar. The actor today received a threatening Whatsapp Voice Note as per the reports coming from the Bollywood media. The voice note was sent demanding crores of money from the actor. Ranveer Singh has approached the Mumbai police soon after he received […] The post Ranveer Singh receives threatening WhatsApp Voice Notes appeared first on Telugu360 .

తెలుగు 360 10 Feb 2026 8:45 pm

Ration |మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్

Ration | మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్ Ration |

ప్రభ న్యూస్ 10 Feb 2026 8:32 pm

రణ్‌వీర్‌ సింగ్‌కు బెదిరింపులు..

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. 'ధురంధర్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్‌కు ఓ దుండగుడి నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం వాట్సాప్ వాయిస్ నోట్ ద్వారా కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపు వచ్చింది. దీంతో రణ్‌వీర్ సింగ్‌ ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై పోలీసులు బృందం దర్యాప్తు చేస్తోంది. బెదిరింపు వాయిస్ నోట్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు, రణ్‌వీర్ సింగ్‌ ఇంటి వెలుపల భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అతని ఇంటి వెలుపల భద్రతను పెంచారు. ఇదిలావుంటే, జనవరి 31న బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత రోహిత్ శెట్టి జుహు ఇంటి వెలుపల ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ సమయంలో రోహిత్ అక్కడే ఉన్నాడు. అయితే, కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ముంబై పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పూణేలో 5 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

మన తెలంగాణ 10 Feb 2026 8:18 pm

Govt |బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి

Govt | బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి Govt | మోత్కూర్,

ప్రభ న్యూస్ 10 Feb 2026 8:16 pm

కరెంటు షాక్‌తో అత్తను చంపిన అల్లుడు

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట పంచాయతీ మంగళి తండా (బడి తండా)లో సోమవారం రాత్రి అత్యంత పాశవిక ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అల్లుడే కాల యముడిగా మారి, అత్తకు విద్యుత్ షాక్ పెట్టి హత మార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం లేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... భద్రాద్రి కొత్తగుడెం జిల్లా జులూరుపాడుకు చెందిన దారావత్ కౌసల్య (50) తన అల్లుడైన రాజేష్ పిలుపు మేరకు సీతంపేట మంగళి తండా (బడి తండా) వారి ఇంటిలోకి వచ్చారు. అయితే సోమవారం రాత్రి సమయంలో రాజేష్ ఆమెకు కరెంటు షాక్ ఇచ్చి అతి కిరాతకంగా చంపాడు. సొంత భార్య తల్లిదండ్రులు అని కూడ చూడకుండా వారిపై ఈ ఘాతుకానికి పాల్పాడ్డారు. ఇందులో అత్త మరణించగా మామ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆయనను ఆస్పత్రికి తరలించాలని గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 10 Feb 2026 8:00 pm

Spirit l స్పిరిట్ నుంచి బయటపడ్డారా?

Spirit l స్పిరిట్ నుంచి బయటపడ్డారా? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్

ప్రభ న్యూస్ 10 Feb 2026 8:00 pm

ఖైరతాబాద్ లో రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. తరుణ్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన తరుణ్ హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2017 లో హైదరాబాద్ కు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. వీరికి ఒ కూతురు ఉంది. కాగా గత సంవత్సరం కాలంగా తరుణ్ మతిస్థిమితం బాగాలేక చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళలవారం ఉదయం ఇంటి నుండి బయలకు వెళ్లాడు. మధ్యహ్నం సమయంలో ఖైరతాబాద్ రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై తలపెట్టి పడుకున్నా డు. ఆ సమయంలో నాంపల్లి వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తరుణ్ తల,మొండెం వేరయ్యాయి. లైన్ మేన్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న ఫోన్ రింగు అవ్వడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి మృతుని కుటుంబసభ్యుల సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 10 Feb 2026 7:56 pm

Allu Arjun Initiates Legal Action

Icon Star Allu Arjun emerged as the Biggest Star of the country and he is busy with some of the biggest films and is working with top directors. A controversy erupted after brand manager Kaveri Baruah spoke against the actor on Sweekriti Talks podcast and the video went viral in no time. Kaveri Baruah said […] The post Allu Arjun Initiates Legal Action appeared first on Telugu360 .

తెలుగు 360 10 Feb 2026 7:54 pm

Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి

Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి పాకల బీచ్

ప్రభ న్యూస్ 10 Feb 2026 7:42 pm

Training |ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం

Training | ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం Training |

ప్రభ న్యూస్ 10 Feb 2026 7:41 pm

Clean |అడగకుండానే అన్నీ చేస్తున్న సర్పంచ్….

Clean | అడగకుండానే అన్నీ చేస్తున్న సర్పంచ్…. Clean | వేంసూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 10 Feb 2026 7:34 pm

Ballot boxes |ఎన్నికలకు సర్వం సిద్ధం

Ballot boxes | ఎన్నికలకు సర్వం సిద్ధం Ballot boxes | స్టేషన్‌ఘన్‌పూర్,

ప్రభ న్యూస్ 10 Feb 2026 7:31 pm

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్

అతి వేగంతో అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ ఢీకొట్టిన సంఘటన వనస్థలిపురం ఆటో నగర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబులెన్స్ లో ఇద్దరు రోగులను ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

మన తెలంగాణ 10 Feb 2026 7:29 pm

protest |వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద మైనార్టీ నేతలతో నిరసన

protest | వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద మైనార్టీ నేతలతో నిరసన

ప్రభ న్యూస్ 10 Feb 2026 7:29 pm

Adulteration to Hawala Links: ED Enters Tirupati Laddu Case

The Tirupati laddu adulteration case has taken an unexpected turn with the Enforcement Directorate formally launching a money laundering investigation. On Tuesday, February 10, the ED registered an Enforcement Case Information Report under the Prevention of Money Laundering Act, widening the scope of the probe far beyond food safety violations. The central agency stepped in […] The post Adulteration to Hawala Links: ED Enters Tirupati Laddu Case appeared first on Telugu360 .

తెలుగు 360 10 Feb 2026 7:16 pm

Railway |పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష

Railway | పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష Railway |

ప్రభ న్యూస్ 10 Feb 2026 7:16 pm

లంచం తీసుకుంటూఎసిబికి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ..

హైదరాబాద్: అవినీతి నిరోదక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. మంగళవారం నగరంలోని మాదాపూర్ ఎస్ఐ వినయ్‌కుమార్ 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో సిఆర్‌పిసి 41 కింద నోటీసులు ఇచ్చేందుకు ఎస్ఐ వినయ్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎసిబి అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేపట్టిన ఎసిబి అధికారులు.. వినయ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వినయ్ ని ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 10 Feb 2026 7:12 pm

students |మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

students | మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ students | జైనూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 10 Feb 2026 7:02 pm

Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..

Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం.. ఈనెల 16 వరకు

ప్రభ న్యూస్ 10 Feb 2026 7:02 pm

Ballot boxes |నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

Ballot boxes | నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి Ballot boxes |

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:57 pm

paritala |పరిటాల వారి కొబ్బరి తోటలో భారీ దిగుబడులు..

paritala | పరిటాల వారి కొబ్బరి తోటలో భారీ దిగుబడులు.. పరిటాల రవి

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:56 pm

నేను రాను.. సభకు: అవిశ్వాసంపై స్పీకర్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి.ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై తుది నిర్ణయం తీసుకునే వరకు లోక్‌సభ కార్యకలాపాలకు హాజరు కాకూడదని.. స్పీకర్ చైర్ లో కూర్చోకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అధికార ఎన్‌డిఎ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించినప్పటి నుంచి లోక్ సభలో ఇరుపక్షాల మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో సభ సజావుగా సాగడంలేదు. ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ ఓం బిర్లాను ఆయన పదవి నుండి తొలగించాలని కోరుతూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు సమర్పించాయి. ఈ నోటీసుపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌ను తన తొలగింపుకు సంబంధించి ప్రతిపక్షం దాఖలు చేసిన నోటీసును పరిశీలించాలని ఆదేశించారు. నోటీసును క్షుణ్ణంగా సమీక్షించి, అవసరమైన విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సెక్రటరీ జనరల్‌ను కోరినట్లు సమాచారం.

మన తెలంగాణ 10 Feb 2026 6:54 pm

Real estate |కనుమరుగవుతున్న ప్రకృతి సంపద,

Real estate | కనుమరుగవుతున్న ప్రకృతి సంపద, Real estate | చిట్యాల,

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:50 pm

Polling centers |పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన…

Polling centers | పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన… Polling centers

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:44 pm

కాంగ్రెస్ నేతలపై రూ.500కోట్ల పరువనష్టం దావా

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 1200 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం చేసిన హిమంత తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ నేతలు నాపై తప్పుడు, దురుద్దేశపూర్వకంగా, పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారు. జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగొయ్‌ల నుంచి రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేశాను’ అని అస్సాం సీఎం శర్మ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 6:37 pm

మధురలో ఒకే కుటుంబం లోని ఐదుగురు ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఖప్పర్‌పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంటిలో విషం తాగి మృతి చెంది ఉండడాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. పాలలో విషం కలిపి తాగినట్టు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబం అంతా ఒకే గదిలో ఉండేది. ఉదయం పిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారు వారిని చూడడానికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. ఎటువంటి స్పందన లేకపోవడంతో గది తలుపు పగుల గొట్టి చూశారు. గదిలో ఐదు మృతదేహాలు కనిపించాయని పోలీసులు చెప్పారు. కుటుంబ పెద్ద మనీష్ కుమార్ అనే రైతు (35), అతని భార్య (32), వారి ఇద్దరు కుమార్తెలను,కుమారుడిని పోలీసులు గుర్తించారు. తాము ఆత్మహత్య చేసుకున్నామని గోడపై రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఒక కాగితంపై మరో సూసైడ్ నోట్ దొరికింది. మృతుడి మొబైల్ ఫోన్ నుండి పోలీసులు ఒక వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో మృతుడు తాను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పినట్టు పోలీస్ అధికారి ష్లోక్ కుమార్ తెలియజేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్ పరిశీలించిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. 

మన తెలంగాణ 10 Feb 2026 6:28 pm

mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..!

mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..! బడ్జెట్ సమావేశాల్లో విజయవాడ సెంట్రల్ సమస్యలపై

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:26 pm

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో హిందువు హత్యకు గురికావడం సంచలనం కలిగిస్తోంది.మిమెన్‌సింగ్ జిల్లాలో సోమవారం సుసేన్ చంద్రశేఖర్ (62) అనే హిందూ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. సోమవారం రాత్రి చంద్రశేఖర్ తన బియ్యం దుకాణంలోఉండగా,దుండగులు చొరబడి కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాపారి మృతి చెందాడని నిర్ధారించుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దుకాణం షట్టర్ మూసివేసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత దుకాణానికి వచ్చిన చంద్రశేఖర్ కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగు లోకి వచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నికలు జరగనున్న తరుణంలో హిందూ వ్యాపారి హత్యకు గురికావడంతో బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మన తెలంగాణ 10 Feb 2026 6:25 pm

Congress : మీనాక్షి తెలంగాణ ఇన్ ఛార్జిగా ఉన్నారా? లేదా? పెద్ద డౌటే

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవడం లేదనిపిస్తోంది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 6:24 pm

Dandepally |ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు

Dandepally | ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:18 pm

police |ప్రజల భద్రతే లక్ష్యం.

police |ప్రజల భద్రతే లక్ష్యం. కర్నూల్ జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్…సాంకేతికతతో నేరాల కట్టడి.డ్రోన్

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:17 pm

Lok Sabha |స్పీకర్‌ ఓంబిర్లా కీలక నిర్ణయం

Lok Sabha | స్పీకర్‌ ఓంబిర్లా కీలక నిర్ణయం Lok Sabha |

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:14 pm

Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా

Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:11 pm

congress |కూటమితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..

congress | కూటమితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు.. congress | శ్రీకాకుళం బ్యూరో,

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:05 pm

Tollywood Actors working on Web Projects

Apart from films, actors are inking deals with the digital platforms for Originals which is earning them big remunerations. Bollywood actors are balancing their careers between films and web series. Now, several Telugu actors are making their waves and are testing their luck in the digital space. The number of actors signing web films and […] The post Tollywood Actors working on Web Projects appeared first on Telugu360 .

తెలుగు 360 10 Feb 2026 6:00 pm

Mantralayam l శ్రీ రాఘవుడి హుండీ ఆదాయం 3కోట్ల,8లక్షలు

Mantralayam l శ్రీ రాఘవుడి హుండీ ఆదాయం 3కోట్ల,8లక్షలు Mantralayam l మంత్రాలయం,

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:00 pm

10th Ward |నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు…

10th Ward | నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు… 10th Ward |

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:59 pm

Counting |పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి

Counting | పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి Counting | భీమ్‌గల్‌ టౌన్,

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:55 pm

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సభకు రాను

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు పోస్ట్ 10 Feb 2026 5:54 pm

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు

తెలుగు పోస్ట్ 10 Feb 2026 5:42 pm

Nadyala |మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలన…

Nadyala | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలన… శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:25 pm

Media |ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి

Media | ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి Media | మక్తల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:24 pm

minister |ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా కృషి చేస్తాం..

minister | ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ప్రభుత్వపరంగా కృషి చేస్తాం.. minister |

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:19 pm

తెలంగాణకు రేవంత్ శాపంగా మారారు : హరీశ్ రావు

తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు పోస్ట్ 10 Feb 2026 5:18 pm

CrPC 41 |ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ..

CrPC 41 | ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ.. CrPC 41 | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:17 pm

3reasons |బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు

3reasons | బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు 3reasons

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:15 pm

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీశ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

విశాలాంధ్ర ` శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేయు లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు.దేవస్థానం ప్రారంభ ద్వారం నుండి భక్తుల క్యూ లైన్లు, క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన […] The post మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీశ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 5:12 pm

Collector|నడకదారిలో శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా…

Collector|నడకదారిలో శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా… Collector|నంద్యాల బ్యూరో ,ఆంధ్రప్రభ: నంద్యాల

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:09 pm

కుమార్తెపై తల్లి ప్రేమ గొప్పదని చెప్పే సినిమా

హీరోయిన్ కారుణ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఎర్రచీర మూవీ టీమ్ ఘనంగా ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేసింది. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. కారుణ్య చౌదరికి దర్శకుడు సుమన్ బాబు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నెక్స్ మూవీలో కూడా ఓ ముఖ్యమైన పాత్రకు కారుణ్యను అనుకుంటున్నట్లు చెప్పారు. కారుణ్య మాట్లాడుతూ “ఎర్రచీర క్లైమాక్స్ సీన్‌కి ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సుమన్ బాబు వన్ మ్యాన్ షో లాగా అన్నీ తానే అయి ఇంత మంచి సినిమా తీశారు. నేను ఇందులో రెండు క్యారెక్టర్స్ చేశాను. అందులో పార్వతి పాత్రను బాగా ఎంజాయ్ చేశా. భర్త ప్రేమ కంటే కుమార్తెపై తల్లి ప్రేమ గొప్పదని చెప్పే ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే థియేటర్లకు వెళ్లి చూడండి”అని అన్నారు.

మన తెలంగాణ 10 Feb 2026 5:08 pm

Laboratory |ఆ ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం

Laboratory | ఆ ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం Laboratory | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:06 pm

Ravindhar |పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం.. సైకిళ్లతో సాధ్యం

Ravindhar |పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం.. సైకిళ్లతో సాధ్యం బైకులు, కార్ల బదులు సైకిళ్ల

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:02 pm

Heroine Imanvi l క్రేజీ స్టార్‌తో హీరోయిన్ ఇమాన్వి సినిమా?

Heroine Imanvi l క్రేజీ స్టార్‌తో హీరోయిన్ ఇమాన్వి సినిమా? Heroine Imanvi

ప్రభ న్యూస్ 10 Feb 2026 5:00 pm