బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. బడ్జెట్ ముందు సామాన్యులకు పండగే పండగ..
ఫిబ్రవరి 1 ఆదివారం నిర్వహించిన ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్లో భారత బులియన్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. బడ్జెట్ 2026కు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామంలో MCX బంగారం, వెండి ఫ్యూచర్స్ రెండూ 9 శాతం కంటే ఎక్కువగా పతనమయ్యాయి. ఈ పతనంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.40 లక్షల కీలక స్థాయికి దిగువకు జారింది.
Budget 2026: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. నిర్మలమ్మ ప్రసంగంలో భారీ మార్పు!
సాధారణంగా యూనియన్ బడ్జెట్ ప్రసంగం అంటే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ (Part A)లో ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వివరాలు ఉంటాయి. పార్ట్-బి (Part B) లో కేవలం పన్నులకు (Tax) సంబంధించిన ప్రకటనలు మాత్రమే ఉంటాయి. కానీ, ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2026) లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దశాబ్దాలుగా వస్తున్న
బడ్జెట్ ప్రసంగంలో కీలక మలుపు.. Part Bలో దేశ ఆర్థిక భవిష్యత్ కథనం
కేంద్ర బడ్జెట్ 2026లో ఈసారి Part B కి ప్రాధాన్యం దక్కనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో Part Aలోనే ప్రభుత్వ విధానాలు, ఖర్చుల ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక అంచనాలు ఉంటాయి. Part B ను ఎక్కువగా పన్ను సవరణలు, సాంకేతిక మార్పులు, చట్టపరమైన అంశాలకు మాత్రమే పరిమితం చేసే సంప్రదాయం ఇప్పటివరకు
Trump: బడ్జెట్ ముందే ట్రంప్ సంచలనం: భారత్ ఆ దేశం నుండే చమురు కొనాలి.. లేదంటే?
భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడానికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒక భారీ ప్రకటన చేశారు. భారత్ ఇకపై ఇరాన్ నుండి చమురు కొనడానికి బదులుగా వెనిజులా నుండి కొనుగోలు చేయబోతోందని ఆయన ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లోరిడా వెళ్లే క్రమంలో
సిగరెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: ఫిబ్రవరి 1 నుండి భారీగా పెరగనున్న ధరలు!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వేళ సామాన్యుడి ఆరోగ్యంతో పాటు ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఫిబ్రవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు , పాన్ మసాలా ధరలను పెంచబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) నిర్మాణాన్ని అమల్లోకి తెచ్చింది. సమాజానికి హాని కలిగించే 'సిన్ గుడ్స్' (Sin
Gold: ఇంట్లో బంగారం ఉన్నవారికి కేంద్రం షాకింగ్ న్యూస్.. బడ్జెట్లో ఆ రూల్ మారబోతుందా?
భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, బలమైన పెట్టుబడి. ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో బంగారం ధరలు (Gold rates) చుక్కలను తాకిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో సామాన్యుడికి
బంగారం, వెండి ధరలు మెగా క్రాష్.. ర్యాలీ కథ కంచికి.. కొనుగోలుపై కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు..
జనవరి 31, 2026 నాటికి ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో ఒక్కసారిగా మెగా క్రాష్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడైన బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. దేశీయ మార్కెట్ MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,849కి తగ్గగా,.. వెండి ధర కిలోకు
దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కేంద్ర బడ్జెట్ 2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ధరల ఒత్తిళ్ల మధ్య ఈ బడ్జెట్ రూపొందించారు. ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణను కాపాడుతూ, మరోవైపు సామాన్యుడికి ఊరటనివ్వడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.ఈ బడ్జెట్లో ఉద్యోగాల సృష్టి,
Budget 2026: భారత్ చేతిలో అద్భుత నిధి.. కానీ తాళం చైనా దగ్గర! అందుకే బడ్జెట్లో మాస్టర్ ప్లాన్!
భారతదేశం ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ పటంలో ఒక వెలుగు వెలుగుతోంది. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు , ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మనం అగ్రస్థానానికి చేరుకోవాలంటే కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యం సరిపోదు. వీటికి వెన్నెముకగా నిలిచే 'రేర్ ఎర్త్ ఎలిమెంట్స్' (Rare Earth Elements - REE) విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. అందుకే
Budget 2026: దేశమంతా ఒకే రూల్.. ఒకే పరీక్ష! విద్యార్థుల తలరాతను మార్చబోతున్న ప్లాన్ ఇదే!
భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల తీరు మారబోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) లో విద్యా రంగానికి సంబంధించి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా వన్ నేషన్, వన్ ఎగ్జామ్ అనే నినాదం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. కేవలం సీట్ల సంఖ్యను పెంచడం మాత్రమే
ప్యాకేజీ ఏమో కొండంత.. చేతికి వచ్చేది గోరంత! ఆఫర్ లెటర్లలో కంపెనీలు దాచే అసలు రహస్యాలివే!
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు అయితే.. చేతికి వచ్చే జీతం ఎంత అని అర్థం చేసుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా కొత్తగా కెరీర్ ప్రారంభించే యువతకు (Freshers) కంపెనీలు ఇచ్చే భారీ ఆఫర్ లెటర్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కానీ, పేపర్ మీద కనిపించే ఆకర్షణీయమైన ఫిగర్కు, మీ బ్యాంకు
Budget 2026: ఒకప్పుడు జేబులను ఖాళీ చేసి, ఆపై నోట్ల వర్షం కురిపించిన ఆ బడ్జెట్ గురించి తెలుసా?
భారతదేశ ఆర్థిక చరిత్రలో బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు, అది దేశ గమనాన్ని మార్చిన ఒక దిక్సూచి. కొన్ని బడ్జెట్లు సామాన్యులకు ఊరటనిస్తే.. మరికొన్ని కఠిన నిర్ణయాలతో మనల్ని ఆలోచింపజేశాయి. అయితే మొత్తం భారతదేశ చరిత్రలో ముఖ్యంగా రెండు బడ్జెట్లు మాత్రం దేశ గమనాన్నే మార్చాయి. ఒకటి సంక్షోభంలో పుట్టిన 'బ్లాక్ బడ్జెట్',
బడ్జెట్ 2026 : 5 రాష్ట్రాల పైనే మోదీ సర్కారు ఫోకస్.. ఆ రెండు రాష్ట్రాలకు మాత్రం భారీగా నిధులు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో వరుసగా తన తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులు, వ్యయ ప్రాధాన్యతలు మాత్రమే కాకుండా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశం ఏ దిశగా ప్రయాణించబోతోందన్న దానిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ ఏడాది
Budget 2026: ఈ బడ్జెట్ ఇన్వెస్టర్ల కొంప ముంచుతుందా.. కాపాడుతుందా? కీలక విశ్లేషణ!
భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఒక రకమైన డైలమాలో ఉన్నారు. ఒకవైపు బడ్జెట్ (Budget 2026) మరికొద్ది గంటల్లో రాబోతుండగా.. మరోవైపు జనవరి నెలలో మార్కెట్ చూపించిన పతనం అందరినీ కలవరపెడుతోంది. గడచిన నెల రోజుల్లోనే నిఫ్టీ దాదాపు 1,000 పాయింట్ల మేర నష్టపోవడంతో.. ఈసారి బడ్జెట్ మార్కెట్ కు మళ్లీ ప్రాణం పోస్తుందా? లేదా?
Khaby Lame: నోరు మెదపకుండానే రూ. 8,000 కోట్లు! ఖాబీ లేమ్ సంచలన డీల్.. అసలు విషయం ఇదీ!
ఇంటర్నెట్ ప్రపంచంలో ఖాబీ లేమ్ (Khaby Lame) పేరు తెలియని వారు ఉండరు. ఎటువంటి డైలాగులు లేకుండా.. కేవలం తన ముఖ కవళికలు , చేతి సైగలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ టిక్ టాక్ స్టార్.. ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో ఒక భారీ సంచలనానికి తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో తనకంటూ ఒక 'డిజిటల్ ట్విన్'
బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనుగోలు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధరలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అందరి మదిలో ఓ ప్రశ్న ఉదయిస్తోంది. అదేంటంటే.. బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు. మార్కెట్లు, కేంద్ర బ్యాంకులు, వ్యాపారుల పాత్ర ఏమైనా ఉందా.. ఈ స్థాయిలో పెరుగుదల వెనుక ఉన్న మతలబు ఏంటి
Gold rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. కొనడానికి ఇదే మంచి సమయమా?
గడచిన కొన్ని రోజులుగా రాకెట్లా దూసుకుపోయిన బంగారం ధరలు (gold rates) ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. పసిడి ప్రేమికులకు, ఇన్వెస్టర్లకు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. శుక్రవారం జరిగిన ట్రేడింగ్ లో బంగారం , వెండి ధరలు అత్యంత వేగంగా పతనమయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర వేలల్లో తగ్గడం చూస్తుంటే.. మార్కెట్లో ఏదో
New rules: ఫిబ్రవరి 1 నుంచి ఈ 5 పనులు చేయకపోతే మీ జేబుకు చిల్లే.. వెంటనే చెక్ చేసుకోండి!
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ, ఈసారి రాబోయే ఫిబ్రవరి 1 చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ (Budget 2026) ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే మరికొన్ని
Budget 2026: అద్దె కట్టే వారికి వరంలా మారనున్న కేంద్ర బడ్జెట్.. ఇక లోన్లు రావడం కూడా ఈజీ!
మన దేశంలో సొంత ఇల్లు కొనడం అనేది ఒక కల. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరో నగరానికి మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు అందరి చూపు 'రెంటల్ హౌసింగ్' (అద్దె ఇళ్లు) పై పడింది. మరికొద్ది రోజుల్లో రాబోతున్న బడ్జెట్ (Budget 2026) పై సామాన్యుల నుండి
కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు తగ్గుదల చూస్తే ఎగిరి గంతేయాల్సిందే.. జనవరి 31, శనివారం ధరలు ఇవే..
బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు నేడు కూడా అదే స్థాయిలో పతనమయ్యాయి. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు అంతర్జాతీయంగా బంగారం, వెండి మార్కెట్లను కుదిపేశాయి. మార్కెట్లలో తీవ్ర స్థాయిలో లాభాల బుకింగ్ ప్రారంభం కావడంతో విలువైన లోహాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరలు ఒక్కసారిగా నేల చూపులు
గత కొద్ది రోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బంగారం-వెండి ధరలకు భారీ షాక్ తగిలింది. సామాన్యులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే..చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు ప్రపంచ కమోడిటీ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ పరిణామంతో శుక్రవారం బంగారం,
పన్ను చెల్లింపుదారులకు మరో గిఫ్ట్.. బడ్జెట్ 2026 ఆసక్తికర అంచనాలు ఎలా ఉన్నాయంటే..
గత ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాలు భారతీయ మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటనిచ్చాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానం కింద ఆదాయపు పన్ను స్లాబ్లలో చేసిన మార్పులు, రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయడం వంటి నిర్ణయాలు లక్షలాది మందికి ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలో,
బడ్జెట్ ముందు శుభవార్త.. భారత్ ఫారెక్స్ నిల్వల్లో రికార్డు పెరుగుదల..రూపాయికి బలం
జనవరి 23తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఆ వారం నిల్వలు 8.053 బిలియన్ డాలర్లు పెరగడంతో.. మొత్తం విదేశీ మారక నిల్వలు 709.413 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం విడుదల చేసిన తాజా డేటా వెల్లడించింది. ఇది భారత్ ఆర్థిక
బంగారం ధరల పెరుగుదలపై అంతర్జాతీయ బ్యాంక్ JPMorgan కీలక హెచ్చరిక.. పసిడి ర్యాలీపై షాకింగ్ న్యూస్..
ప్రపంచ బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక అసాధారణ దశలోకి ప్రవేశించింది. సాధారణంగా నెలలు లేదా సంవత్సరాలు పట్టే ధరల పెరుగుదల, ఈసారి కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే దాదాపు 10 శాతం ఎగసింది. ఫలితంగా బంగారం ఔన్సు ధర సుమారు 5,600 డాలర్ల స్థాయికి చేరింది. ఈ అకస్మాత్తు ర్యాలీ అంతర్జాతీయ మార్కెట్లను ఆశ్చర్యానికి గురి చేయడంతో
ICICI క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి ఆ ఆఫర్లు కట్!
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ICICI బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1, 2026 నుండి తమ క్రెడిట్ కార్డ్ (ICICI credit card) నిబంధనలలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ఇప్పటివరకు వినియోగదారులు పొందుతున్న ఉచిత ప్రయోజనాలు తగ్గిపోవడమే కాకుండా.. కొన్ని రకాల లావాదేవీలపై అదనపు
Budget 2026: పెన్షన్ రూల్స్ మారబోతున్నాయా? రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీ ఆదాయం వచ్చేలా ప్లాన్?
భారతదేశంలో ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మెరుగుపరిచే దిశగా బడ్జెట్ (Budget 2026) లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) తన 'ప్రిల్యూడ్ టు యూనియన్ బడ్జెట్ 2026-27' నివేదికలో పెన్షన్ రంగానికి సంబంధించి సంచలన సిఫార్సులను చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చిన యూనిఫైడ్
Redmi Note 15 Pro: శాంసంగ్, వివోలకు చెక్ పెడుతూ.. షావోమి కొత్త సిరీస్! ఫోన్ హైలైట్స్ ఇవే!
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 'నోట్' సిరీస్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను మరో స్థాయికి తీసుకెళ్తూ, షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన సరికొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్ ను దించింది. రెడ్ మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) , ప్రో ప్లస్ మోడళ్లను జనవరి
Budget 2026: క్రిప్టో ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్? 30% భారీ పన్ను భారం తగ్గబోతోందా!
భారతదేశంలో క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) పట్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న కఠినమైన పన్ను నిబంధనలు ఇన్వెస్టర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2026) పై దేశీయ క్రిప్టో ఎకో సిస్టమ్ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 30 శాతం
రూ. 16 వేల కోట్లతో రాయ్పూర్–విశాఖపట్నం కారిడార్.. పూర్తిగా మారిపోనున్న వైజాగ్ రూపురేఖలు..
భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాయ్పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్ దేశ మౌలిక సదుపాయాల రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 464 కిలోమీటర్ల పొడవుతో రూపొందుతున్న ఈ కారిడార్లో 125 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది ఛత్తీస్గఢ్లో నిర్మించబడుతున్న మొట్టమొదటి 6-లేన్ల యాక్సెస్-నియంత్రిత ఆర్థిక కారిడార్
Gold ETF: ఒక్కరోజే 14% పతనం.. గోల్డ్, సిల్వర్ ఇన్వెస్టర్లకు షాక్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా?
అంతర్జాతీయ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. జనవరి 30న మార్కెట్లలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అప్పటివరకు రికార్డు గరిష్టాలను తాకుతూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన గోల్డ్ ఈటీఎఫ్ లు (Gold ETF), సిల్వర్ ఈటీఎఫ్లు (Silver ETF) ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని ఈటీఎఫ్లు
Budget 2026: మీ మొబైల్లోనే బడ్జెట్ రిపోర్ట్.. ఒక్క క్లిక్తో పూర్తి వివరాలు పొందే మార్గం ఇదే!
భారతదేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ (Budget 2026) కు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఒక దశాబ్దం తర్వాత ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ కు ఇది
భవిష్యత్ బంగారంగా రాగి.. రికార్డు స్థాయిలో పెరిగిన కాపర్ ధరలు..పెట్టుబడిపై నిపుణులు కీలక అప్డేట్..
ఇటీవల ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలను తాకుతున్న వేళ ఇప్పుడు వాటి సరసన రాగి (Copper) కూడా చేరింది. ఒకప్పుడు పెట్టుబడిదారులు పెద్దగా పట్టించుకోని ఈ లోహం.. నేడు భవిష్యత్ బంగారంగా పిలుస్తున్నారు. రాబోయే దశాబ్దాల్లో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారనున్న
Budget 2026: కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ రెడీ!
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది. అయితే ఈ అభివృద్ధికి విద్యుత్ అనేది ప్రధాన ఇంధనంగా ఉండబోతోంది. అందుకే పర్యావరణ మార్పుల నేపథ్యంలో మనం బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించి, సౌర (Solar), పవన (Wind) ఇంధనాల వైపు మళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్
సిల్వర్ పతనం స్టార్ట్.. భారీ ర్యాలీ తర్వాత నేలకు దిగొస్తున్న ధరలు.. నిపుణులు కీలక సూచన ఏంటంటే..
ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో వెండి ధరలు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. శుక్రవారం భారత మార్కెట్లో స్పాట్ సిల్వర్ గ్రాముకు రూ. 15 తగ్గి రూ. 415 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల వెండి ధర రూ. 4, 15,000 గా నమోదైంది. జనవరి ప్రారంభంలో 100 గ్రాములు రూ. 2, 56,000గా ఉన్న వెండి
gold: యాదగిరిగుట్ట ఖజానాలో గోల్డ్ గోల్మాల్.. స్వామివారి బంగారు నాణేలు ఏమాయ్యాయి?
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకుంది. భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన బంగారం (gold) తో తయారు చేసిన నాణేలు ఆలయ ఖజానా నుంచి మాయమయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమాలు తాజాగా జరిగిన
డాలర్ సామ్రాజ్యానికి చెక్.. భారత్ చేతుల్లోకి బ్రిక్స్ పగ్గాలు! సరికొత్త డిజిటల్ విప్లవం మొదలైందా?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ హవా నడుస్తోంది. కానీ, ఇప్పుడు BRICS (బ్రిక్స్) దేశాలు ఈ గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్న బ్రిక్స్ సమ్మిట్లో 'డిజిటల్ పేమెంట్ సిస్టమ్' ఒక సంచలనంగా మారబోతోంది.
Trump: వడ్డీ రేట్లపై భారీ బాంబు పేల్చనున్న ట్రంప్.. ఆ కొత్త వ్యక్తి ఎంట్రీతో మార్కెట్లలో ప్రకంపనలు!
అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే చర్చ.. తర్వాతి 'ఫెడ్ రిజర్వ్' బాస్ ఎవరు? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనదైన శైలిలో సస్పెన్స్ ను పెంచుతూ, కొత్త ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పేరును ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, మాజీ ఫెడ్ గవర్నర్ కేవిన్ వార్ష్ (Kevin Warsh) పేరు దాదాపు ఖరారైనట్లు
అమెరికాలో ప్రధాన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ పతనం చోటు చేసుకోవడం అని చెప్పవచ్చు. వాల్ స్ట్రీట్స్ మార్కెట్లో ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో బంగారం, వెండి మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బంగారం ధరలు ఒక్కసారిగా దాదాపు 8 శాతం వరకు పడిపోవడం మార్కెట్లను
Bengaluru: బెంగళూరులో పాత అపార్ట్మెంట్ల కథ ముగిసిందా? కొత్త చట్టంతో భారీ మార్పులు!
బెంగళూరు.. దేశంలోనే బెస్ట్ మెట్రో పాలిటర్ సిటీల్లో ఒకటి. గత ఎన్నో ఏళ్లుగా ఈ నగరం అపార్ట్మెంట్ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటోంది. అయితే గార్డెన్ సిటీలో ప్రస్తుతం ఒక కొత్త సమస్య తలెత్తుతోంది. నగరంలోని 'సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్' (CBD) , మల్లేశ్వరం వంటి ప్రాంతాల్లో 30 నుండి 40 ఏళ్ల నాటి పాత
బిజినెస్లో సక్సెస్ కావాలా? అయితే జెఫ్ బెజోస్ చెప్పిన ఈ చేదు నిజం తెలుసుకోండి!
ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న జెఫ్ బెజోస్ (Jeff Bezos).. ఇటీవల జరిగిన 'న్యూయార్క్ టైమ్స్ డీల్బుక్ సమ్మిట్' లో తన దైనందిన జీవితం, పని పట్ల తనకున్న దృక్పథం గురించి మనసు విప్పి మాట్లాడారు. చాలామంది యువత కాలేజీ పూర్తికాగానే తమకు వచ్చే ఉద్యోగం 100 శాతం వినోదంగా, ఎంజాయ్మెంట్ తో
Budget 2026: మధ్యంతర vs పూర్తి స్థాయి బడ్జెట్! అసలు తేడా ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో బడ్జె్ట్ (Budget 2026) ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా శని, ఆదివారాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అరుదు. గతంలో 2000వ సంవత్సరంలో ఇలా జరగ్గా.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆదివారం నాడు బడ్జెట్ రాబోతోంది. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు ఈ బడ్జెట్
బంగారం కొనుగోలుకు సామాన్యులు గుడ్ బై.. షాకింగ్ నివేదిక విడుదల చేసిన ప్రపంచ బంగారు మండలి
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు పసిడి ధరలను అమాంతం పెంచేశాయి. తాజాగా బంగారం డిమాండ్ మీద ప్రపంచ బంగారు మండలి (WGC) సరికొత్త నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశంలో బంగారం డిమాండ్ 2026లో తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఆభరణాల అమ్మకంలో తగ్గుదల
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. బడ్జెట్ 2026లో రైల్వే టికెట్పై రాయితీలు ఉండే అవకాశం..
ఫిబ్రవరి 1, 2026న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానుంది. సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ ఛార్జీలలో భారీ ఉపశమనం లభించే అవకాశంపై అంచనాలు పెరుగుతున్నాయి. శతాబ్ది, రాజధాని, మెయిల్/ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన వర్గాలపై సీనియర్ సిటిజన్లకు 40 శాతం నుండి 50 శాతం వరకు రాయితీలను పునరుద్ధరించాలని పరిశీలిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చర్య COVID-19
Hybrid ATM: చిల్లర కష్టాలకు చెక్.. ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!
ప్రతిరోజూ ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుండి ఆఫీసుకి వెళ్లే ఆటో వరకు మనల్ని వేధించే ప్రధాన సమస్య 'చిల్లర'. జేబులో రూ. 500 నోటు ఉన్నా పది రూపాయల టీ తాగడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (RBI) కలిసి ఒక అద్భుతమైన
పన్ను స్లాబ్లు.. పాత పన్ను vs కొత్త పన్ను విధానంలో ఏది బెస్ట్.. బడ్జెట్ 2026లో ఏమి ఆశించవచ్చు..
కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానం (New Tax Regime) ప్రవేశపెట్టినప్పటి నుంచి.. పన్ను చెల్లింపుదారులకు కొన్ని ప్రశ్నలు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) కొనసాగించాలా లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? అనే దానిపై ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. నిర్ణయం తీసుకోవడంలొ ప్రధానంగా ఆదాయం, దానిపై
gold rates: బంగారం ధరల జోరు వెనుక అసలు గుట్టు ఇదే.. ఎకనామిక్ సర్వేలో షాకింగ్ నిజాలు!
కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే 2026.. ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరల (gold rates) పై కీలక విశ్లేషణను అందించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరతకు బంగారం ధరలే నిదర్శనమని సర్వే పేర్కొంది. అలాగే ధరల పెరుగుదలకు గల కారణాలకు కూడా వివరించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Economic survey: ఎకనామిక్ సర్వే 2026: ప్రభుత్వం దేనిపై ఫోకస్ చేస్తోంది?
ప్రతి ఏటా బడ్జెట్కు ముందు వచ్చే ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లో ఏ పదాలను ఎక్కువసార్లు ఉపయోగించారో గమనిస్తే, రాబోయే రోజుల్లో దేశ economy ఎటువైపు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. 2026-27 ఆర్థిక సర్వేలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భారీ నివేదికలో 'వృద్ధి' (Growth) అనే పదం ఏకంగా
అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిపుణులు అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. గ్లోబల్ కారణాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికల చుట్టూనే ఈ విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే భారతదేశంలో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే ఒక అత్యంత కీలక అంశం ఎప్పుడూ చర్చకు
Economic survey: ఆర్థిక సర్వే విడుదల.. ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్న భారత్! హైలైట్స్ ఇవే..!
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జనవరి 29) పార్లమెంటులో ఎకనామిక్ సర్వే(Economic survey)ను విడుదల చేశారు. దీని ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) భారతదేశపు ఎకానమీ 6.8 శాతం నుండి 7.2 శాతం మధ్య వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక
Gold: నగలు కొంటే నోటీసులు వస్తాయా? బడ్జెట్ 2026 లో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఇదేనా?
ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు లేదా శుభకార్యాల సమయంలో బంగారం (gold) కొనడం ఒక సంప్రదాయం. అయితే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే.. తప్పనిసరిగా పాన్ (PAN) లేదా ఆధార్ కార్డు వివరాలను జ్యువెలరీ షాపులో ఇవ్వాల్సి ఉంటుంది. 2016 జనవరి నుంచి
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం
దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం Employees Provident Fund Organisation (EPFO) కింద అమల్లో ఉన్న వేతన పరిమితిని నెలకు రూ. 15వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుపుతోంది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటివరకు EPFO పరిధి
ajit pawar: అజిత్ పవార్ అంతిమ యాత్ర.. బారామతిలో భారీ భద్రత, రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు!
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నేత, ఎన్సీపీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (ajit pawar) భౌతిక కాయానికి నేడు (గురువారం) ఆయన సొంత నియోజకవర్గం బారామతిలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం
సముద్రం మధ్యలో భారీ విమానాశ్రయం.. ఇండియాలో మొట్టమొదటి సారిగా అద్భుతం!
భారతదేశం మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధమైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తీరంలో ఉన్న వధవన్ వద్ద దేశంలోనే మొట్టమొదటి ఆఫ్ షోర్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భూమి మీద కాకుండా అరబిక్ సముద్రంలో కృత్రిమంగా సృష్టించిన ద్వీపంలో
బంగారం ధరలు సామాన్యుల గూబ గుయ్ మనిపిస్తున్నాయి. ధరలు పెరుగుతున్న విధానం పసిడి ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఏడాది ఆరంభంనుంచి బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. అమెరికా ఫెడ్ వడ్డి రేట్లు స్థిరంగా ఉంచడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను డాలర్ నుంచి విలువైన లోహాలకు మళ్లించారు.
వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన యూఎస్ ఫెడ్.. ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు నో ఛాన్స్..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) తన ప్రధాన వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పు చేయలేదు. 2026 జనవరి 28న జరిగిన కీలక విధాన సమావేశంలో.. ప్రస్తుతం అమల్లో ఉన్న 3.5 శాతం నుంచి 3.75 శాతం మధ్యనున్న వడ్డీ శ్రేణిని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇది 2026 సంవత్సరంలో జరిగిన తొలి FOMC (ఫెడరల్ ఓపెన్ మార్కెట్
బంగారం ధరల పెరుగుదల వెనుక స్విట్జర్లాండ్ భారీ స్కెచ్.. టన్నుల కొద్ది పసిడి బంకర్లలో నిల్వ..
బంగారం ధరలు రాకెట్ కన్నా వేగంతో దూసుకుపోతున్నాయి. ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరిగాయి. అమెరికా డాలర్ క్రమంగా బలహీనపడటం, సావరిన్ బాండ్లపై నమ్మకం తగ్గడం, అలాగే ప్రధాన కరెన్సీల నుంచి పెట్టుబడిదారులు బయటకు రావడం వంటి కారణాలతో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 5,500
అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారా? సింకింగ్ ఫండ్ టెక్నిక్తో కష్టాలకు చెక్ పెట్టండి!
ప్రతి నెలా జీతం రాగానే అద్దెలు, ఈఎంఐలు(EMI), సరుకులు అంటూ ఒక లెక్క వేసుకుంటాం. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో.. అకస్మాత్తుగా కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సి రావడం, పిల్లల స్కూల్ ఫీజులు లేదా ఇంటి రిపేర్లు వంటివి వచ్చి పడతాయి. అప్పుడు ఏం చేస్తాం? వెంటనే క్రెడిట్ కార్డు తీయడమో లేదా స్నేహితుల దగ్గర అప్పు
Ajit pawar: పైలట్కు మంచి అనుభవం.. విజిబిలిటీ క్లియర్! మరి తప్పు ఎక్కడ జరిగింది?
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి దారితీసిన విమాన ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వాతావరణం అనుకూలంగా ఉన్నా, పైలట్కు అపారమైన అనుభవం ఉన్నా.. అసలు ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది? విమానం ఎందుకు అదుపుతప్పి నిప్పుల కొలిమిలా మారింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.బారామతి
gold: బంగారం కొనాలనుకుంటున్నారా? ఆకాశాన్నంటుతున్న ధరలు.. నేడు తులం బంగారం ఎంతంటే?
నేడు బుధవారం, జనవరి 28, 2026న భారతీయ బులియన్ మార్కెట్ లో బంగారం (gold), వెండి (silver) ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయంగా బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నేటి
Ajit pawar: ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా రికార్డు.. కానీ, తీరని ఆ ఒక్క కోరిక!
మహారాష్ట్ర రాజకీయాల్లో 'దాదా' గా పిలవబడే అజిత్ పవార్ (Ajit Pawar) ప్రస్థానం ఒక ప్రభంజనం. కానీ, ఆ ప్రభంజనం ఒక అసంపూర్ణ కలగానే మిగిలిపోవడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన మరణించడంతో, దశాబ్దాల కాలంగా ఆయన కంటున్న 'ముఖ్యమంత్రి' కల నెరవేరకుండానే ముగిసిపోయింది. మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఒక
Ajit Pawar: మృత్యువు ముందుగానే హెచ్చరించిందా? విమాన సంస్థ గురించిన సంచలన నిజాలు!
మహారాష్ట్ర రాజకీయాల్లోని ఒక ధ్రువతార నేలకొరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతి వద్ద కుప్పకూలడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొన్ని చేదు నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గురైన విమానం యొక్క
రోడ్లపైకి రాకుండానే మెట్రో నుంచి MMTS కు.. హైదరాబాద్లో రాబోతున్న కొత్త స్కైవాక్లు ఇవే!
భాగ్యనగర వాసుల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలో ఒక చోట నుండి మరో చోటికి వెళ్లేటప్పుడు ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించి, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎంఎంటీఎస్ (MMTS), మెట్రో రైలు , ఆర్టీసీ
ఏపీలో సోషల్ మీడియా బ్యాన్! షాకింగ్ నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం!
ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందే అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. అయితే దీన్ని నివారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోనుంది. దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాపై బ్యాన్ విధించనుంది. పదహారేళ్ల వయసు లోపు
Budget 2026: పార్లమెంట్లో బడ్జెట్ వార్.. మోదీ సర్కార్ను ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాల స్కెచ్!
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ కీలక సమావేశాలు ఆరంభం నుంచే వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం తన అజెండాతో సిద్ధంగా ఉండగా.. ఇటు ప్రతిపక్షాలు వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ (Budget 2026) నేపథ్యంలో ఉపాధి హామీ పథకం,
ajit pawar: మహారాష్ట్రలో పెను విషాదం: విమాన ప్రమాదంలో కీలక నేత మృతి!
మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం నెలకొంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అజిత్ పవార్ (Ajit Pawar)అ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వార్త తెలియగానే యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది.మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగలిగే శక్తి ఉన్న అజిత్
Aadhaar Update: మారనున్న ఆధార్ సేవలు..! ఇకపై మొబైల్ నంబర్ కూడా చిటికెలో మార్చేయొచ్చు!
ఆధార్ కార్డు అనేది నేడు మన జీవితంలో ఒక భాగమైపోయింది. సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఈ 12 అంకెల సంఖ్య తప్పనిసరి. అయితే, చాలామంది తమ ఆధార్ కార్డు పోగొట్టుకోవడం లేదా అందులోని మొబైల్ నంబర్ పాతది అయిపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్
బంగారం ధరలు ఈ నెల ఆరంభం నుంచి పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి రోజూ భారీగా పెరుగుతూ పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తుంటే సామాన్యులు మాత్రం లబోదిబోమనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే Gold ధరలు 5 వేల డాలర్ల స్థాయిని దాటి కొత్త దశలోకి ఎంటర్ అయ్యాయి. అంతర్జాతీయంగా
ఇడ్లీ అమ్మితే రూ. 150 కోట్లా? బెంగళూరులో ఈ ఆంధ్ర స్టార్టప్ సృష్టిస్తున్న సంచలనం ఇదే!
ఆంధ్ర స్టైల్ నెయ్యి ఇడ్లీ, కారం దోశల రుచికి బెంగళూరు ఫిదా అయిపోయింది. మన తెలుగింటి రుచులను అందిస్తున్న క్యూఎస్ఆర్ (QSR) బ్రాండ్ బాబాయ్ టిఫిన్స్ (Babai Tiffins) తాజాగా రూ. 15.5 కోట్ల భారీ నిధులను సేకరించింది. ఇందులో విశేషం ఏంటంటే.. ప్రముఖ నటుడు సునీల్ శెట్టి హోస్ట్ చేసిన 'భారత్ కే సూపర్ ఫౌండర్స్'
ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగక్కర్లేదు! ఇకపై మీ ఫోన్లోనే మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు! ప్రాసెస్ ఇదిగో..
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే ఇప్పటివరకు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బయోమెట్రిక్ వేయాలని, గంటల తరబడి క్యూలో నిలబడాలని ఇబ్బందులు పడేవాళ్లం. కానీ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సామాన్యులకు ఒక అద్భుతమైన వార్త చెప్పింది. జనవరి 28, 2026 నుండి మీ స్మార్ట్ఫోన్ ద్వారానే ఎక్కడైనా, ఎప్పుడైనా ఆధార్
PM Awas Yojana 2026: సొంత ఇంటి కోసం కేంద్రం నుంచి రూ. 2.5 లక్షలు! ఈ ఒక్క సర్టిఫికేట్ ఉంటే చాలు!
ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేది అతిపెద్ద కల. కానీ రోజురోజుకూ పెరుగుతున్న ధరలు, స్థలం ఖర్చుల వల్ల సామాన్యుడికి ఇది భారంగా మారుతోంది. ఈ కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం PM Awas Yojana (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) పథకాన్ని అమలు చేస్తోంది. పట్టణాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు
ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్.. భారీగా పెరగనున్న వెండి ధరలు.. కారణం ఏంటంటే..
గత కొద్ది కాలం నుంచి పసిడి ధరలు నింగిని తాకాయి. రాకెట్ కన్నా వేగంగా సిల్వర్ ధరలు దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు చూసి సామాన్యులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇక పెట్టుబడిదారుల సంగతి చెప్పనవసరం లేదు. ఈ పెరుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. మధ్యమధ్యలో లాభాలు అందుకుంటున్నప్పటికీ వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న సందేహం వారిలో నెలకొంది.
Budget 2026: మధ్యతరగతి జేబులు నిండబోతున్నాయా? పన్ను మినహాయింపులపై భారీ ఆశలు!
మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఎదురుచూసే బడ్జెట్ (Budget 2026) సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా సామాన్యుడు ఆశించేది ఒక్కటే.. తన చేతిలో నాలుగు రాళ్లు ఎక్కువ మిగలాలని. పెరిగిన ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో, ఈ సారి ప్రభుత్వం పన్ను స్లాబుల్లో మార్పులు చేసి సామాన్యుడికి భారీ ఊరటనిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదాయపు
వెండి ధరల వ్యత్యాసంపై షాకింగ్ న్యూస్.. చైనా కన్నా భారత్లోనే Silver ధరలు చాలా తక్కువ..కారణమిదే..
అంతర్జాతీయంగా వెండి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. ధరలు ఒక్కసారిగా పెరగడం వెంటనే కుప్పకూలడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో వివిధ దేశాల్లో ధరల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్, చైనాలో వెండి ధరల మధ్య చాలా తేడా ఉందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఈరోజు 3
Trade Deal: కార్లు, వైన్, మెడిసిన్స్.. ఇకపై అన్నీ చౌకే! భారత్-ఈయూ మెగా ట్రేడ్ డీల్ రహస్యాలివే!
భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trade Deal) మన దేశ వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు కొత్త తలుపులు తెరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు. దీనివల్ల 90 శాతానికి పైగా భారతీయ వస్తువులపై సుంకాలు తొలగిపోనున్నాయి.
India EU Trade Deal: యూరప్తో చారిత్రాత్మక ఒప్పందం! 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'తో భారత్కు భారీ లాభం!
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా భారత్ ఒక భారీ అడుగు వేసింది. దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trade Deal) కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ (Mother of all deals)' అని అభివర్ణించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణం 4 గంటలే.. ఆరు లేన్ల రహదారిగా నేషనల్ హైవే-44.. ఇంకో గుడ్ న్యూస్..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రస్తుతం 8 నుంచి 9 గంటలు పడుతున్న ఈ ప్రయాణం త్వరలోనే దాదాపు 5 గంటలకు తగ్గే అవకాశం ఉంది.తాజాగా జాతీయ రహదారి-44 (NH-44) కు ఆధునీకరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్రాష్ట్ర మార్గాల్లోఈ రహదారి ప్రధానంగా ఉంది.
దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్లో వినిపించే వరకు అత్యంత రహస్యంగా ఉంటుంది. కానీ, భారత స్వతంత్ర చరిత్రలో ఒకే ఒక్కసారి ఈ రహస్యం ముందే పొక్కిపోయింది. బడ్జెట్ (Budget 2026) కోసం యావత్ భారత్ సిద్ధమవుతున్న వేళ, 1950లో జరిగిన ఆ ఆసక్తికరమైన సంఘటన గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఒక్క చిన్న
Budget 2026: హల్వా వేడుక అంటే ఏంటి? ఈ తియ్యని సంప్రదాయం వెనుక ఉన్న రహస్యాలేంటి?
భారతదేశంలో ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు 'నోరు తీపి' చేసుకోవడం మన ఆచారం. మరి దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ లాంటి కీలక ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నప్పుడు తీపి ఉండాల్సిందే కదా! అందుకే ప్రతి ఏటా ఆర్థిక శాఖ Budget 2026 కి ముందు 'హల్వా వేడుక'ను నిర్వహిస్తుంది. మంగళవారం నాడు ఆర్థిక
Budget 2026: బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? గడిచిన పదేళ్ల రికార్డులు ఇవే..
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 1 అంటే ఒక పండగ లాంటిది. కానీ, గత కొన్ని ఏళ్లుగా ఆ పండగ ఉత్సాహం మార్కెట్ లో కనిపించడం లేదు. బడ్జెట్ (Budget 2026) దగ్గరపడుతున్న వేళ ఇన్వెస్టర్లంతా ఈసారైనా మార్కెట్ పరుగులు పెడుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే గడిచిన పదేళ్ల గణాంకాలు చూస్తే ఒక చేదు నిజం
నిర్మలమ్మ బడ్జెట్ ప్రయాణం.. గత ఐదేళ్లలో పన్నుల్లో వచ్చిన భారీ మార్పులివే!
ఫిబ్రవరి 1వ తేదీ వచ్చిందంటే చాలు.. దేశమంతా టీవీల ముందు అతుక్కుపోతుంది. మన జేబుపై పడే భారం ఎంత? వచ్చే ఆదాయంలో మిగిలేది ఎంత? అని ప్రతి సామాన్యుడు ఆత్రుతగా ఎదురుచూసే సమయం వచ్చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న తన తొమ్మిదో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, Budget 2026 కు
Hyderabad: రద్దీ పెరుగుతోంది! పొల్యూషన్ తగ్గుతోంది! గ్రేటర్ సిటీలో మొదలైన సైలెంట్ విప్లవం!
మన హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెగా మెట్రో సిటీ కూడా. సిటీ ఎంత వేగంగా పెరుగుతుందో, ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. తద్వారా సిటీలో పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అయితే, ఆశ్చర్యకరంగా హైదరాబాద్ పొల్యూషన్ తగ్గుతుందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. నగరాన్ని
రేపు తేలనున్న అమెరికా ఆర్థిక భవిష్యత్తు.. ఫెడరల్ రిజర్వ్ పాలసీ కమిటీ సమావేశం పైనే అందరి కన్ను..
Next Fed Meeting in January: ఫెడరల్ రిజర్వ్ పాలసీ కమిటీ (FOMC) బుధవారం సమావేశమవుతోంది. ఇటీవలి నెలల్లో వరుసగా వడ్డీ రేట్ల కోతలు చేసిన తర్వాత.. ఈ సమావేశంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును స్థిరంగా ఉంచుతుందని మార్కెట్లు విస్తృతంగా అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఫెడరల్ నిధుల రేటు 3.5 శాతం నుంచి
శాంతించిన బంగారం ధరలు.. భారీ ర్యాలీకి ఒక్కసారిగా బ్రేక్.. జనవరి 27, మంగళవారం ధరలు ఇవే..
గత కొన్ని వారాలుగా బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత ఈ రోజు కాస్త విరామం తీసుకున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు ఈ రోజు కదలకుండా ఉండిపోయాయి. ఈ ఏడాది బంగారం వరుసగా రికార్డులను బద్దలు కొట్టడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొనుగోళ్లు చేయకుండా వెనకడుగు వేశారు. జనవరి 2026 నెలలోనే బంగారం ధరలు
భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం..నేడు ప్రధాని మోదీ నేతృత్వంలో శిఖరాగ్ర సమావేశం.. అమెరికా కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ యూరోపియన్ యూనియన్-భారత్ (EU-India) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కీలక సమావేశంలో యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ పాల్గొననున్నారు. భారత్-EU మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే
అమెజాన్ లేఆప్స్.. 16 వేల మంది ఉద్యోగులు బయటకు.. 2026 చివరి నాటికి 30 వేల మంది ఉద్యోగులు టార్గెట్..
గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఈ వారంలో మరో పెద్ద రౌండ్ భారీ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. జనవరి 27న కంపెనీ కొత్త రౌండ్ లేఆఫ్స్ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చర్య
బంగారం ధరల పెరుగుదలపై మరో బాంబు పేల్చిన కియోసాకి.. రూ.10 గ్రాములు ధర రూ.8.68 లక్షలకు..
అంతర్జాతీయ బంగారం మార్కెట్లో జనవరి 26న పసిడి ధరలు భగ్గుమన్నాయి. తొలిసారిగా స్పాట్ బంగారం ధర ఔన్సుకు 5 వేల డాలర్ల మైలురాయిని దాటింది. ఇది బంగారం ధరల చరిత్రలో ఒక కీలక మలుపుగా ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ స్థాయిలో చూసినట్లయితే.. భారతీయ మార్కెట్లో 10 గ్రాముల Gold ధర రూ.1.60 లక్షలకుపైగా చేరినట్టేనని చెప్పవచ్చు.
ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరి 27, 2026 (మంగళవారం) న భారతదేశం అంతటా అనేక బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)పిలుపునిచ్చింది. ఇది తొమ్మిది ప్రధాన బ్యాంకు
బంగారం ధర కుప్పకూలాల్సిన సమయం ఎందుకు మిస్ అయింది.. ఇంత అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది.. కారణాలు ఇవే..
బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత కాస్త విరామం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలు ఔన్స్కు 5 వేల డాలర్ల స్థాయికి రాకెట్ వేగంతో చేరుకున్నాయి. భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర గత వారం రూ. 1,50,000ను దాటింది. ఇది కేవలం ప్రపంచ మార్కెట్ల ప్రభావమే కాకుండా, దేశీయ కరెన్సీ పరిస్థితులు కూడా బలంగా
రూ. 24 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. లబోదిబోమంటున్న పసిడి ప్రియులు.. జనవరి 26, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పసిడి ధరలు నింగిని తాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పసిడి ప్రియుల పాలిట శాపంలా మారాయి. తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయని చెప్పవచ్చు. జనవరి 26, సోమవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ. 245 పెరిగి
బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలుకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు.. జనవరి 26, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలో దేశంలో మునుపెన్నడూ లేని స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఆసియా మార్కెట్లలో ఈ రోజు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితితో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. టారిఫ్ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

24 C