ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..
అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో.. రెండు భారతీయ LPG వాహక నౌకలు సురక్షితంగా ఈ మార్గాన్ని దాటడం విశేషంగా చెప్పుకోవచ్చు. అమెరికా-ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరమవ్వడం.. ఇరాన్ తన భూభాగంలోని ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ షిప్పులు జలసంధి దాటడం
తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తూ జాతీయ రహదారి-565 పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి వెళ్లే భక్తులకు అత్యంత సౌకర్యవంతమైన మార్గాన్ని అందిస్తూ జాతీయ రహదారి-565 (NH-565) ఇప్పుడు పూర్తిస్థాయిలో లైవ్ లోకి వచ్చింది. నకిరేకల్ నుండి ఏర్పేడు వరకు సాగే ఈ రహదారి కేవలం
చమురు సంక్షోభం వేళ గుడ్ న్యూస్: మంగళూరు తీరానికి చేరుకున్న రష్యన్ క్రూడ్ ట్యాంకర్..
అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో.. రష్యాకు చెందిన ఒక భారీ ముడి చమురు ట్యాంకర్ కర్ణాటకలోని మంగళూరు ఓడరేవు తీరానికి చేరుకుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. రష్యా నుండి అందుతున్న ఈ సరఫరా భారతదేశానికి అత్యంత కీలకంగా
కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన
భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. గత ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు, ఒక్కసారిగా నేలచూపులు చూడటం అటు కొనుగోలుదారులను, ఇటు మదుపర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మార్చి 16 నుండి 22, 2026 మధ్య కాలంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలను గమనిస్తే, ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక
భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం
భారత్లో బంగారం, వెండి ధరలు మార్చి 23న ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా నాలుగో వారం కూడా పసిడి, వెండి నష్టాల బాట పట్టడమే దీనికి కారణం. సోమవారం ఉదయం స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 3-4% పతనమై $4,400 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ ధర కూడా 3-4% తగ్గి,
బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు శాంతించాయి. ఇరాన్ యుద్ద ప్రభావం బంగారం ధరలపై అంతగా ప్రభావం చూపడం లేదు. పశ్చిమాసియాను కమ్మేసిన యుద్ధ మేఘాలు మొదట్లో పెట్టబడిదారులను భయపెట్టినప్పటికీ పరిస్థితులు మాత్రం సానుకూలంగానే ఉన్నాయి. బులియన్ మార్కెట్ అంతగా ప్రభావితం కాలేదు. అయితే చమురు, గ్యాస్ ధరలు మాత్రం తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. దేశీయంగా చూసినట్లయితే పసిడి ధరలు కాస్త
No More Talks: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు నాలుగో వారంలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన దారులు పూర్తిగా మూసుకుపోవడమే కాకుండా.. కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటామనే బెదిరింపులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తాజాగా విడుదల చేసిన వీడియో
ఇరాన్ యుద్ధం.. హార్ముజ్ జలసంధిపై టెహ్రాన్ కీలక ప్రకటన.. ట్రంప్కు గట్టి వార్నింగ్
ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ట్ వంటి హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) కేంద్రంగా ఇరాన్, అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. ఇజ్రాయెల్, అమెరికాతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ఇరాన్ తన వ్యూహాత్మక బలాన్ని చాటుకోవడానికి ఈ జలమార్గాన్ని ఒక ఆయుధంగా మలచుకుంది. ఈ క్రమంలో, జలసంధి
ప్రపంచ దేశాలు యుద్ధ మేఘాలు.. క్షిపణి దాడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న వేళ, చైనా మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా, నిశ్శబ్దంగా తన ఆర్థిక పునాదులను పటిష్టం చేసుకుంటోంది. దీనికోసం ఆ దేశం ఎంచుకున్న ప్రధాన మార్గం 'బంగారం'. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) వరుసగా 16 నెలల పాటు విరామం లేకుండా బంగారు నిల్వలను
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోవడంతో చిన్నారి మృతి.. కంపెనీకి రూ. 210.51 కోట్ల పెనాల్టీ విధించిన కోర్టు
ఒహియోలోని హామిల్టన్ కౌంటీలో వెలువడిన ఓ తీర్పు కార్పొరేట్ ప్రపంచంలో మానవతా దృక్పథం ఎంత ముఖ్యమో చాటిచెబుతోంది. ఈ విషాదకర ఘటన 2021 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పట్లో టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) సంస్థలో పనిచేస్తున్న చెల్సియా వాల్ష్ అనే మహిళా ఉద్యోగిని తన గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమెకు ఉన్న అధిక
కేవలం SIP ఉంటే సరిపోదు.. మీ సంపదను కాపాడే 'మినిమాక్స్' సూత్రం మీకు తెలుసా?
చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఒకే మాట చెబుతుంటారు.. నెలకు 10 వేల రూపాయల SIP చేయండి, దానిని ప్రతి ఏటా 15 శాతం పెంచుకుంటూ వెళ్లండి, 15 ఏళ్లలో మీరు కోటీశ్వరులు అయిపోతారు. అయితే ఇది ప్రాక్టికల్ గా కుదరకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కోటి రూపాయల లక్ష్యం కోసం కొన్ని ప్రాక్టికల్ కాలిక్యులేషన్స్ ఉండాలంటున్నారు అవేంటంటే..
Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక క్లిష్టమైన దశలో ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వేత్తలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుండి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వరకు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు (Interest rates Hike)
Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?
దశాబ్దాలుగా భారతదేశపు సిలికాన్ వ్యాలీగా వెలుగొందుతున్న ఒకే ఒక్క నగరం బెంగళూరు (Bengaluru). ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలకు, స్టార్టప్లకు ఈ నగరం ఒక కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో ఒక ఆందోళనకరమైన ట్రెండ్ కనిపిస్తోంది. భారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజాలు , విదేశీ కంపెనీలు బెంగళూరును వదిలి ఇతర నగరాల వైపు
Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?
భారతీయ జ్యువెలరీ రంగంలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం మహిళలకే పరిమితమైన ఆభరణాల మార్కెట్.. ఇప్పుడు పురుషులు, పిల్లల వైపు మొగ్గు చూపుతోంది. ప్రముఖ ఆభరణాల సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ కొత్త విభాగాలను (Categories) ఎంచుకుంటున్నాయి. బంగారం ధరలు (Gold Prices) ఆకాశాన్ని తాకుతున్నా, వినియోగదారుల కొనుగోలు శక్తిని
Gold prices: వెండితో పోలిస్తే బంగారం సేఫేనా? ఈ రిపోర్ట్ చూస్తే మీ పెట్టుబడి ప్లాన్ మార్చుకుంటారు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు , అనిశ్చితి వల్ల బంగారం ధరలు (Gold prices) ఒక్కసారిగా పుంజుకున్నాయి. 2024 ప్రారంభం నుండి బంగారం అద్భుతమైన రిటర్న్స్ను ఇస్తోంది. అయితే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు మాత్రం ఒక విషయాన్ని గట్టిగా గుర్తు చేస్తున్నారు. బంగారం ధరలు పెరిగినంత వేగంగానే ఒక్కోసారి నిరాశపరుస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 2026
Amaravati: ఒకే ఒక్క ప్రాజెక్ట్.. లక్షన్నర కోట్ల పెట్టుబడి! ఏపీ తలరాత మారబోతోందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మలుపు తిప్పే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద 'ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా' (AMNS India) రాబోతోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద భారీ స్టీల్ ప్లాంట్
Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!
కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) పై ఒత్తిడి పెరుగుతుండటంతో.. వచ్చే ఐదు నెలల్లో కొత్త ఎయిర్పోర్ట్ లొకేషన్ను ఖరారు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్
Trending: అప్పట్లో బుల్లెట్ ధర ఇంతేనా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1986 నాటి బిల్లు!
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అంటే యూత్ కి ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లెట్ బండిని సొంతం చేసుకోవాలనేది చాలామంది యువతకు ఒక కల. ఈ బైక్ కొనాలంటే ఇప్పుడు కనీసం 2.30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే సరిగ్గా 39 ఏళ్ల క్రితం ఈ బైక్ ధర ఒక చిన్న
New Rules: పాన్ కార్డ్ వాడుతున్నారా? ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
మీకు పాన్ కార్డ్ (PAN Card) ఉందా? లేదా కొత్తగా అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1, 2026 నుండి పాన్ కార్డ్ జారీ చేసే విధానంలో, దరఖాస్తు ప్రక్రియలో ఆదాయపు పన్ను శాఖ కొన్ని కొత్త రూల్స్ (New Rules) ను తీసుకువస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలపై
పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక విపణిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం, వెండి, ముడి చమురు ధరలు అన్నీ కలిసి పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తోంది. ఒకవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుతుండగా.. మరోవైపు గత రెండేళ్లుగా దూసుకుపోయిన
క్రెడిట్ కార్డులు వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక సంచలన, ఆలోచింపజేసే సంఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. పదేళ్ల క్రితమే మూసివేసిన క్రెడిట్ కార్డుకు సంబంధించి, ఒక బ్యాంకు ఏకంగా ₹33.83 లక్షల బకాయి చెల్లించాలని నోటీసు పంపడం, ఆపై వినియోగదారుల కోర్టు సదరు బ్యాంకుకు భారీ జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.మైసూరుకు చెందిన వెంకటేష్ అనే
ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..
పశ్చిమాసియాలో ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశాలైన 'నాటో' (NATO) కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు.. ఇరాన్పై సైనిక చర్యలో తమతో కలిసి రావాలని ట్రంప్ ఇచ్చిన పిలుపునకు నాటో దేశాలు స్పందించకపోవడం ఈ ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. తన సోషల్ మీడియా
డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఇక మందులకు చెక్.. సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ వచ్చేసింది..
భారతీయ ఫార్మా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (Dr. Reddy's Laboratories).. టైప్-2 డయాబెటిస్ చికిత్స కోసం భారతదేశంలోనే మొట్టమొదటి డీసీజీఐ (DCGI) ఆమోదిత సెమాగ్లుటైడ్ (Semaglutide) ఇంజెక్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయంగా అత్యంత ఆదరణ పొందిన ఈ మందు పేటెంట్ గడువు ముగియడంతో, సామాన్య
ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇరాన్ కు ఆర్థిక వెన్నెముకగా భావించే ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) ఆక్రమించుకోవడానికి లేదా పూర్తిగా దిగ్బంధించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని
బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..
పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుధ్దం పతాక స్థాయికి చేరింది. ఈ యుద్ద జ్వాలలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి బులియన్ మార్కెట్ దాకా తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ముడి చమురు ధరలు అయితే ఏకంగా నింగిని తాకుతున్నాయి. గ్యాస్ దొరక్క రెస్టారెంట్లు, హోటల్లు మూతపడుతున్నాయి.
ఇరాన్ యుద్దం.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. ఇప్పుడు ఎంతకు చేరిందంటే..
పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావంతో భారత్లో ఇండస్ట్రియల్ (బల్క్) డీజిల్ ధర లీటరుకు సుమారు రూ. 22 మేర పెరిగింది. పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా ప్రపంచ
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. కాల్పుల విరమణపై ఏమన్నారంటే..
పశ్చిమాసియాలో గత కొంతకాలంగా రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్తో కొనసాగుతున్న పోరును ముగించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా స్పందించిన ట్రంప్.. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యను క్రమంగా తగ్గించే
హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50% హెచ్ఆర్ఏ మినహాయింపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన పాత పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదాయపు పన్ను చట్టం-2025 భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫై చేసిన ఆదాయపు పన్ను నిబంధనలు-2026, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ
బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు
అమెరికా - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా బంగారం ధరలపై కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మార్కెట్ తీవ్రమైన అస్థిరతకు లోనవుతోందని ఎల్కేపీ సెక్యూరిటీస్ విశ్లేషకులు జతీన్ త్రివేది పేర్కొన్నారు. ఇటీవల ఎంసీఎక్స్ (MCX) Gold ఫ్యూచర్స్
Telangana budget: తెలంగాణ అప్పు అన్ని కోట్లా? బడ్జెట్ లెక్కలు చెబుతున్న చేదు నిజం!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ (Telangana Budget 2026-27) డాక్యుమెంట్ల ప్రకారం, రాష్ట్ర పబ్లిక్ డెట్ (Public Debt) క్రమంగా రూ. 6 లక్షల కోట్ల మార్కుకు చేరువవుతోంది. అభివృద్ధి పనులు , సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం కొత్తగా భారీ రుణాలను సేకరించాలని
కుప్పకూలిన రూపాయి విలువ.. మరీ ఇంత దారుణమా.. భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్..
మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ వంటి కీలక ఇంధన వనరులలో పూర్తిగా విదేశీ ఆధారపడే భారత్, ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా లో అంతరాయంతో భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నేటి ట్రేడింగ్ సెషన్లో భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే కొత్త
Petrol prices: పెట్రోల్ బంకుల్లో కొత్త ధరలు? మీ జేబుకు ఎంత చిల్లు పడుతుందో చూడండి!
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి సామాన్యుడి బడ్జెట్పై ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటడం, రూపాయి విలువ క్షీణించడం వంటి పరిణామాలు దేశీయ ఇంధన ధరల సవరణకు దారితీశాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు పెంచిన పెట్రోల్ ధరలు (Petrol prices) నేరుగా
సివిల్స్ అభ్యర్థులకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్! పూర్తి వివరాలివే..
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు , పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త బడ్జెట్ (Telangana Budget 2026) ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజీవ్ సివిల్స్ అభయహస్తం (Rajiv Civils Abhayahastam Scheme) అనే సరికొత్త పథకాన్ని ప్రకటించారు. దేశంలోనే అత్యున్నతమైన సివిల్
Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..
తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. 2026-27 వార్షిక బడ్జెట్ లో భాగంగా సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future city)' ని నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు
తెలంగాణ బడ్జెట్.. ప్రాధాన్యతనిచ్చిన 5 కీలక రంగాలు ఇవే.. ప్రజా క్షేమం - సామాజిక న్యాయం లక్ష్యంగా..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ప్రజా క్షేమం - సామాజిక న్యాయం అనే నినాదంతో ముందుకు వచ్చింది. ఈ బడ్జెట్లో సంక్షేమం, మౌలిక సదుపాయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయం, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత తదితర రంగాలకు భారీ నిధులు కేటాయించడం
తెలంగాణ బడ్జెట్ 2026: ఆరు గ్యారెంటీలకు రూ. 50,713 కోట్లు కేటాయింపు.. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే..
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 3,24,234 కోట్ల అంచనాతో రూపొందించబడింది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం, ఆరు గ్యారెంటీలపై ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఆరు గ్యారెంటీల
Life insurance: తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా? కొత్త పథకం వివరాలు ఇవే!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత రంగంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో భాగంగా ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ (Indiramma Family Life Insurance Scheme) పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అందిచాలని ప్రభుత్వం నిర్ణయం
Hyderabad: హైదరాబాద్ ఇక మూడు ముక్కలు? గ్రేటర్ సిటీని విభజిస్తూ బడ్జెట్లో సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధిపై బడ్జెట్ (Telangana Budget 2026-27) లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. నగర పాలనను మరింత చేరువ చేసేందుకు , మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Telangana Budget: బడ్జెట్లో హైలైట్ చేసిన.. CURE, PURE, RARE అంటే ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్నమైన రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Telangana Budget 2026) లో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి మ్యాప్ ను మూడు విభాగాలుగా విభజించి వాటికి క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్(RARE) అని పేర్లు పెట్టారు. వీటి గురించి
Water Bottle Prices: ఇరాన్ ఎఫెక్ట్.. భారత్లో వాటర్ బాటిల్ ధరలు పెరగనున్నాయా?
భారతదేశంలో సామాన్యుడి జేబుకు మరో చిల్లు పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ఇప్పుడు మంచినీటి ధరల భారం పడబోతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా భారత్లో వాటర్ బాటిల్ ధరలు (water bottle prices) ఒక్కసారిగా 11% మేర పెరిగాయి. దీనివల్ల గతంలో కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గింపు ద్వారా అందించిన
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2026: సామాన్యుడికి ఊరట కలిగేనా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు శుక్రవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Telangana Budget 2026) పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. గత ఏడాది సుమారు రూ. 3 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ ఉండగా.. ఈసారి ఆ అంకె మరింత
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు శుభవార్తను మోసుకువచ్చిన ధరలు మళ్లీ పైకి ఎగబాకడం స్టార్ట్ చేశాయి.. గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలను నేడు ర్యాలీ చేశాయి.అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్దం బులియన్ మార్కెట్ మీద తీవ్ర
Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!
ప్రస్తుతం మెట్రో నగరాల్లో ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి ఐటీ హబ్లలో పనిచేస్తున్న నిపుణులను ఒక ప్రశ్న తీవ్రంగా కలవరపెడుతోంది: ఈ కాలంలో కేవలం ఒక్క జీతం (Single Salary) సరిపోతుందా? బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ , ఎడ్యుకేటర్ మీనల్ గోయల్ ఇటీవల లింక్డ్ఇన్ (LinkedIn) లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఈ సారి బడ్జెట్లో కొత్త పథకాలు.. అవేంటంటే..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఈ రోజు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లూ భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం మధ్యాహ్నం 12.00 గంటలకు ఉభయ సభలతో ప్రారంభం కానుంది. ఈ బడ్జెట్ను అభిజిత్ ముహూర్తంలో సభలో మల్లు ప్రవేశపెట్టనున్నారు. దీని కన్నా ముందు ఉదయం
గుడ్ న్యూస్: ఇకపై రెండు నెలల అద్దె మాత్రమే డిపాజిట్.. కొత్త రూల్స్ తెలుసుకోండి!
ఇటీవల లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫారమ్లలో 2026 నుండి భారతదేశంలో కొత్త అద్దె చట్టాలు అమల్లోకి వస్తున్నాయనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఉన్న అంశాలు పూర్తిగా కొత్తవి కావు. ఇవన్నీ 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మోడల్ టెనెన్సీ యాక్ట్' (MTA) ఆధారంగా రూపొందించబడినవి.ఈ చట్టం అద్దె మార్కెట్ను క్రమబద్ధీకరించడానికి,
తెలంగాణ బడ్జెట్..ఈ రంగాలకే అధిక కేటాయింపులు.. రైతుల కోసం ఎంతంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించేలా రూపుదిద్దుకుంటోంది. మొత్తం బడ్జెట్ సుమారు రూ.3.30 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. గత బడ్జెట్లో రూ.3,04,965 కోట్ల వ్యయం ప్రతిపాదించగా, ఈసారి దానిపై 8-10 శాతం పెంపుతో భారీ బడ్జెట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. శాసనసభలో ఉప
బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..
ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్టాక్ మార్కెట్ అయితే రక్త పాతమే చూస్తోంది. విలువైన లోహాల ధరలు అమాంతం పడిపోయాయి. అయితే ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య గ్యాస్ ధరలు అమాంతం ఎగబాకాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రపంచ వస్తు మార్కెట్లు అయితే
ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!
ఈ రోజుల్లో కేవలం డబ్బును పొదుపు చేయడమే కాదు, ఆ డబ్బు ద్వారా తిరిగి ఆదాయాన్ని పొందడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా రిటైర్ అయిన వారు లేదా రిస్క్ లేకుండా నెలకు కొంత స్థిరమైన ఆదాయం రావాలని కోరుకునే వారు సురక్షితమైన మార్గాల కోసం వెతుకుతుంటారు. అటువంటి వారి కోసం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ
భారత పొరుగుదేశం చైనా..అగ్రరాజ్యం అమెరికాకు ధీటైన వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచానికి చైనా ముప్పు అనే ప్రచారాన్ని అమెరికా వెంటనే మానుకోవాలని చైనా తెలిపింది. తైవాన్పై వచ్చే ఏడాదిలో చైనా దాడి చేసే ప్రణాళిక ఏదీ లేదంటూ మార్చి 19, 2026 గురువారం చైనా.. అమెరికాకు స్పష్టమైన వార్నింగ్ను పంపింది. ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు అమెరికా జాగ్రత్తగా
Layoffs: ఇంట్లో రివర్స్ రోల్స్.. సంపాదించే పిల్లలు.. ఆధారపడే తల్లిదండ్రులు! భారత్లో కొత్త ట్రెండ్!
భారతీయ కార్పొరేట్ రంగంలో ప్రస్తుతం ఒక వింతైన, ఆందోళనకరమైన మార్పు కనిపిస్తోంది. 50 ఏళ్ల వయసులో ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ లేఆఫ్స్ (layoffs) బారిన పడుతుంటే.. వారి స్థానంలో అప్పుడే కెరీర్ మొదలుపెట్టిన వారి పిల్లలు ఇంటి ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. నిన్నటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి, నేడు తన మొదటి
ఇందిరమ్మ ఇళ్లుపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏప్రిల్లో రెండో విడత కార్యక్రమం..
తెలంగాణలో పేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ఇందిరమ్మ గృహాల పథకం తదుపరి దశకు సిద్ధమవుతోంది. గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండో విడతను ఏప్రిల్, మే నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు.గతంలో మంజూరైన లేదా నిర్మాణంలో నిలిచిపోయిన గృహాలను పూర్తి చేయడానికి వచ్చే ఏడాదికోసం ఆర్థిక సహాయం
టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి కూడా ఇళ్లు పొందలేక నిరీక్షిస్తున్న వేలాది దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తాజా సమీక్ష సమావేశంలో.. ఇళ్ల కేటాయింపులు పొందని వారికి చెల్లించిన దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం..
Telangana Budget: గతేడాది బడ్జెట్ రివ్యూ.. ఎన్ని హామీలు నెరవేరాయి? పథకాలకు నిధులు అందాయా?
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ఆర్థిక సంవత్సరానికి సిద్ధమవుతున్న వేళ.. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతవరకు లక్ష్యాలను చేరుకుందనే అంశంపై చర్చ జరుగుతోంది. 2025-26 బడ్జెట్లో ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలుకు పెద్దపీట వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త బడ్జెట్ (Telangana budget 2026) ద్వారా మరింత ముందుకు వెళ్లాలని చూస్తోంది. గత ఏడాది
ఖతార్ LNG ప్లాంట్పై ఇరాన్ క్షిపణి దాడి.. ట్రంప్ ఆందోళన.. గ్లోబల్ ఇంధన సంక్షోభం..
ఇరాన్ ఖతార్లోని ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్ అయిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలను లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. మార్చి 19, 2026 గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన.. ఇప్పటికే ఉద్రిక్తతలలో ఉన్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణకు మరింత నాటకీయ మలుపు ఇచ్చింది. ఖతార్ ఎనర్జీ ప్రకటన ప్రకారం.. పెర్ల్ GTL సదుపాయానికి తీవ్ర నష్టం,
LPG ATM : దేశంలోనే తొలి గ్యాస్ ఏటీఎం వచ్చేసింది.. నిముషంలో నిండు సిలిండర్ మీ సొంతం!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సరఫరాలో కొన్ని చోట్ల అనిశ్చితి కనిపిస్తున్న తరుణంలో సామాన్యులకు ఊరటనిచ్చే ఒక అద్భుత వార్త వెలుగులోకి వచ్చింది. మనం ఏటీఎం మెషీన్ నుండి డబ్బులు డ్రా చేసినట్లే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ను కూడా తీసుకోవచ్చు. భారతదేశపు మొట్టమొదటి 24*7 ఎల్పీజీ (LPG) ఏటీఎం ఇటీవల ప్రారంభమైంది. వినియోగదారులకు నిమిషాల వ్యవధిలోనే వంట
8th Pay Commission అప్లికేషన్ గడువు పొడిగింపు! ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే మీ జీతాలు పెరిగే ఛాన్స్?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) పనుల్లో వేగం పెరిగింది. వేతన సంఘం ముందు తమ అభ్యర్థనలను, అభిప్రాయాలను సమర్పించే గడువును ఇప్పుడు మార్చి 31, 2026 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ గడువు మార్చి 16 వరకు మాత్రమే
Atanu Chakraborty: అటాను చక్రవర్తి ఎవరు? HDFC బ్యాంక్ నుంచి ఆయన ఎందుకు తప్పుకున్నారు?
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ ప్రస్తుతం ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ బ్యాంక్ పార్ట్-టైమ్ ఛైర్మన్ అటాను చక్రవర్తి తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా కార్పొరేట్ దిగ్గజాలు వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు చెబుతుంటారు. కానీ అటాను చక్రవర్తి
ఏప్రిల్ 1 నుండి పెరగనున్న FASTag ధరలు:..పూర్తి వివరాలు మీకోసం!
హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఫాస్టాగ్ (Fastag) వార్షిక పాస్ (Annual Pass) ధరలను పెంచుతున్నట్లు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి, అంటే ఏప్రిల్ 1, 2026 నుండి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ ఇది.. గత కొంత కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలను నేడు కుప్పకూలాయి. ఉగాదికి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిస్తూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా
LPG సంక్షోభంపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని స్పష్టం..
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు LPG సరఫరా కొరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి, అలాగే విశాఖపట్నంలో అదనంగా 24 వేల MT నిల్వలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. ఈ మేరకు మంగళవారం
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ఎఫెక్ట్.. ధరల పెరుగుదలపై ఆందోళన..
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది. మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ ఘర్షణలో అమెరికా తన సైనిక చర్యలను మరింత విస్తరించే అవకాశాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా అదనపు సైనిక బలగాలను పంపాలా అనే అంశంపై అమెరికా ప్రభుత్వం లోపల తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం,
బంగారం ధరలు పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. ఇరాన్ యుద్ధంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పెట్టుబడిదారులు Gold మీదనే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి. డాలర్ బలహీన పడటం కూడా బంగారం ర్యాలీకి కలిసి వస్తోంది. దేశీయ మార్కెట్లో
Bengaluru: ఆపదలో పుట్టిన ఆలోచన! గ్యాస్ సమస్యకి సామాన్యుడి అద్భుత పరిష్కారం..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా మన దేశంలోని మెట్రో నగరాల్లో ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత సామాన్యుడిని, హోటల్ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో బెంగళూరు (Bengaluru) కు చెందిన ఒక రిటైర్డ్ ఇంజనీర్ చేసిన ఆవిష్కరణ ఇప్పుడు అందరి దృష్టిని
Gold prices: యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు? ఇన్వెస్టర్ల భయం ఇదే..
సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా లేదా ఉద్రిక్తతలు పెరిగినా ఇన్వెస్టర్ల మొదటి ఛాయిస్ బంగారమే. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు అందరూ మొగ్గు చూపుతారు. దాంతో వెంటనే బంగారం ధరలు పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నా, ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్నా బంగారం ధరలు (Gold Prices) ఆశించిన స్థాయిలో పెరగకపోవడం
జీతం పెంపులో అలసత్వం.. జాబ్ వదిలేసిన బెస్ట్ ఇంజనీర్.. తీవ్రంగా నష్టపోయిన కంపెనీ..
కంపెనీలో ఓ విలువైన ఉద్యోగి పోతే ఆ కంపెనీ ఎంత నష్టపోతుందో తెలిపే కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .జీతం ఎక్కువ అడిగారని ఆ ఉద్యోగిని తీసేయడం ద్వారా కంపెనీ డబుల్ నష్టపోయిందని ఆ పోస్ట్ చెబుతోంది. ఒక విలువైన ఉద్యోగి తొలగించడం ద్వారా.. కార్పొరేట్ మేనేజర్లు ఎంత తక్కువ ప్రయత్నంతో తమ సంస్థ నిర్మాణాన్ని
Ugadi 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేస్తే మీ దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది!
మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది అంటే కేవలం కాలం మారడమే కాదు, మన జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వడం. 2026 మార్చి 19న మనం జరుపుకోబోయే ఉగాది 'పరాభవ' నామ సంవత్సరం మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. సాధారణంగా అందరూ పంచాంగ శ్రవణం విని, ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అని
EPFO పెన్షన్ డబ్బులు పెరుగుతున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు, EPFO పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న EPS-95 కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. పెన్షన్ మొత్తాన్ని పెంచుతారని ఆశించిన వారికి ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానం కొంత నిరాశ కలిగించేలా ఉంది. ప్రస్తుతం అందుతున్న రూ. 1,000 కనీస పెన్షన్ను ఇప్పట్లో
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల సంక్షేమానికి మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naidu బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మంత్రి Nara Lokesh కలిసి దివ్యాంగులతో
Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!
మనం ఎక్కడ ఉండాలి? ఏ ఉద్యోగం చేయాలి? అనే విషయాలను నిర్ణయించడంలో ఆ నగరం యొక్క జీవన వ్యయం (Cost of Living) కీలక పాత్ర పోషిస్తుంది. 2026 మార్చి నాటికి అందిన తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశంలోని మెట్రో నగరాల్లో బ్రతకడం మునుపటి కంటే కొంచెం భారంగానే మారింది. ముఖ్యంగా ఐటీ రంగంలో దూసుకుపోతున్న బెంగళూరు
బెంగళూరు నుండి 2 వేల స్సెషల్ బస్సులు.. ఉగాది నాడు ప్రయాణికులకు KSRTC గుడ్ న్యూస్..
ఉగాది, రంజాన్ పండుగల సమీపంలో బెంగళూరులో ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే గణనీయంగా పెరుగుతుంది. దీనిని ముందే నియంత్రించడానికి.. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బెంగళూరు నుండి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు సుమారు 2 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ అదనపు సర్వీసులు మార్చి 19 నుండి 21 వరకు అందుబాటులో ఉంటాయి.
మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు..కేంద్రంపై ధ్వజమెత్తిన రాఘవ్ చద్దా..
బ్యాంకులు పేదోడి బతుకుతో ఆటలాడుతున్నాయి. మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయడం లేదని భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంపై పార్లమెంట్ వేదికగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గళమెత్తారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కరెంట్ బ్యాంకింగ్ వ్యవస్థపై రాఘవ్ చద్దా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24, 2024-25)..
Gold: ఉగాదికి బంగారం కొనొచ్చా? ఈ ఏడాది డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీనా?
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది అంటేనే కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. ఈ పండుగ రోజున బంగారం (Gold) కొనడం శుభప్రదమని, అది ఇంట్లో సిరిసంపదలను పెంచుతుందని మన నమ్మకం. అయితే ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో బంగారం కొనడం లాభదాయకమేనా? ఈ ఏడాది నిపుణుల అంచనాలు
విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్! ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!
గత నెలల్లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారతీయ విమానయాన సంస్థలకు కొత్త ప్రయాణీకుల నియమాలను ప్రకటించింది. విమాన ప్రయాణాన్ని మరింత స్పష్టంగా మరియు ఒత్తిడి లేకుండా చేయడానికి ఈ మార్పులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. విమానయాన సంస్థలు కార్యాచరణ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, అనేక మంది ప్రయాణీకులు ఈ చర్యను స్వాగతించారు. సీటు ఛార్జీలు, సీటింగ్ న్యాయబద్ధత మరియు
Tax Regime: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ టాక్స్ రూల్స్.. ఎంత ఆదాయం వరకు పన్ను కట్టక్కర్లేదు?
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పన్ను చెల్లింపుదారులందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. రెండు రకాల పన్ను విధానాల్లో (Tax Regime) ఎంత వరకు పన్ను ఉండదు?. ఈ ఏడాది నుంచి 'ఆదాయపు పన్ను చట్టం 2025' , 'ఆదాయపు పన్ను రూల్స్ 2026' అమలులోకి రానున్నాయి. ఇవి
బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోండి.. మార్చి 18, బుధవారం ధరలు ఇవే..
బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా నెలకున్న పరిస్థితుల మధ్య విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా పెరుగుతూ అదే సమయంలో ఒక్కసారిగా ఢమాల్ అవుతున్నాయి. పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉండగా.. పసిడి ప్రియులు బంగారాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే..అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు, ఇరాన్ యుద్ధ ప్రభావం అని చెప్పవచ్చు.
ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం.. అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ భారతీయులకు ఆఫర్..
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) విభాగం బుధవారం భారతదేశం, చైనా, కొలంబియా వలసదారులకు 2,600 డాలర్ల ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి స్వచ్ఛంద దేశ బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా విడిచి వెళ్లే వలసదారులు స్వదేశానికి ఉచిత విమాన టిక్కెట్లు పొందగలుగుతారు. DHS ప్రకటనలో.. వలసదారులు CBP హోమ్ మొబైల్ యాప్ ద్వారా స్వచ్ఛంద
బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ ప్రభావంతో స్టాక్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్ వరకు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. అయితే ఈ ఆందోళనకర పరిస్థితులు పెట్టుబడిదారులను వణికిస్తున్నాయి. ఇక పసిడి ధరల మార్పు ఎలా ఉంటుందోనని అందరూ అంచనా వేసుకుంటున్నారు. తాజాగా రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత,
ఉజ్వల పథకం ఎఫెక్ట్.. దేశంలో రికార్డు స్థాయికి పెరిగిన LPG వినియోగం..డిమాండ్ ఎంతలా అంటే..
భారతదేశంలో వంటగ్యాస్ (LPG) వినియోగం విపులంగా పెరుగుతూ.. దేశీయ ఉత్పత్తి పెరుగుదలతో కూడా దిగుమతులపై ఆధారపడటం కొనసాగుతోంది. ఒక్కో ఎల్పిజి ట్యాంకర్కు సుమారు 46 వేల టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ.. మనీకంట్రోల్ విశ్లేషణ ప్రకారం, దేశీయ ఉత్పత్తి 30-50 శాతం పెరుగుదల పొందిన తర్వాత కూడా, భారతదేశానికి నెలకు 29-34 ఎల్పిజి ట్యాంకర్లు అవసరమవుతాయని తెలిపింది. 2027
Bank balance: మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
ఈ రోజుల్లో ప్రతి చిన్న అవసరానికి బ్యాంక్కు వెళ్లడం లేదా ఏటీఎం కోసం వెతకడం కష్టమైన పని. సాంకేతికత పెరిగిన తర్వాత మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ద్వారానే సెకన్ల వ్యవధిలో బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా, స్మార్ట్ఫోన్ ఉన్నా లేదా సాధారణ ఫీచర్ ఫోన్ ఉన్నా.. మీ అకౌంట్
IT Jobs: జీతం కంటే అదే ముఖ్యం.. ఐటీ రంగంలో మారుతున్న ట్రెండ్..!
ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే ఒక పెద్ద కంపెనీలో స్థిరమైన ఉద్యోగం సాధించి, రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండాలని అందరూ భావించేవారు. కానీ నేటి తరం జెన్ జీ (Gen Z) ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సంప్రదాయబద్ధమైన 9-to-5 ఐటీ జాబ్స్ (IT jobs) కంటే.. ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీలాన్సింగ్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వైపే యువత
Bengaluru: గ్యాస్ కొరత సాకుతో అదనపు బాదుడు.. వైరల్ అవుతున్న బెంగళూరు కేఫ్ బిల్లు!
ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) లో గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యులనే కాకుండా హోటల్ యజమానులను కూడా కలవరపెడుతోంది. అయితే ఈ కష్టాన్ని సాకుగా చూపిస్తూ కొన్ని రెస్టారెంట్లు కస్టమర్ల నుంచి వింత వింత ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాజాగా నగరంలోని 'థియో కేఫ్' (Theo cafe) అనే రెస్టారెంట్ తన కస్టమర్
Elon musk: ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్మాన్.. 134 బిలియన్ డాలర్ల కేసులో ఊహించని ట్విస్ట్!
టెక్ ప్రపంచంలో ఇప్పుడు అందరి కళ్లు ఎలన్ మస్క్ , ఓపెన్ ఏఐ మధ్య జరుగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటంపైనే ఉన్నాయి. ఈ క్రేజీ లీగల్ బ్యాటిల్లో తాజాగా ఎలన్ మస్క్ (Elon Musk) ఒక కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో తాను గెలిస్తే వచ్చే భారీ మొత్తాన్ని తన సొంతానికి వాడుకోనని, ఆ డబ్బు మొత్తాన్ని
Green card: పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు.. అమెరికా వీసా రూల్స్లో ఈ తేడా ఎందుకు?
అమెరికాలో స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయుల కల. కానీ, ఆ కల నెరవేరడం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారుతోంది. అమెరికా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ (Green Card) లేదా పర్మినెంట్ వీసా కోసం భారతీయులు ఏకంగా 134 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ లేదా
అఫ్గానిస్థాన్పై దాయాది దేశం పాకిస్థాన్ విరుచుకుపడింది. కాబూల్లోని ఓ ఆస్పత్రిపై అర్థరాత్రి వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం 400 మంది మరణించారని.. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అఫ్గాన్ అధికారులు తెలిపారు. డ్రగ్స్కు బానిసలైన వారికి చికిత్స అందించే ఓ ఆస్పత్రిపై పాకిస్తాన్ దాడులు జరిపిందని ఆప్గానిస్థాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి
Bengaluru: గ్యాస్ సిలిండర్లతో పనే లేదు.. AI తో నడుస్తున్న బెంగళూరు కిచెన్లు! ఇదెలా సాధ్యం?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లోని అనేక హోటళ్లు , రెస్టారెంట్లు కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వంట గ్యాస్ (LPG) సరఫరా నిలిచిపోవడంతో కొన్ని చోట్ల వ్యాపారాలు కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే బెంగళూరులోని కొన్ని కమ్యూనిటీ
మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు కేటాయింపులు ఎక్కువగా జరిగే ఛాన్స్..
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్నటి నుంచి (మార్చి 16) ప్రారంభం అయ్యాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడింది. నేటి నుంచి రెండు రోజుల పాటు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, అలాగే చర్చలు నడువనున్నాయి. ఇక ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. ఈ సభలో
Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) లో ఐటీ ఉద్యోగం అంటే అది ఒక కల. కానీ, అదే నగరంలో రూ. 68 లక్షల ప్యాకేజీని వదులుకుని, ఐర్లాండ్కు వెళ్లిన ఒక టెక్కీ కథ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కేవలం 27 ఏళ్ల వయసులోనే అమెజాన్ కంపెనీలో భారీ ఆఫర్ కొట్టడమే కాకుండా అక్కడి
Dhurandhar 2: ధురంధర్ 2 కోసం ఆ స్టార్కి భారీ రెమ్యునరేషన్.. మిగతా వాళ్లకు ఎంతంటే..
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' విడుదలకు సిద్ధమైంది. మార్చి 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం 'ధురంధర్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 1300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దీంతో
Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడంతో మార్చి 17న భారత్లో బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. MCXలో ఏప్రిల్ 2026 గడువు ముగిసే గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 10 గ్రాములకు దాదాపు రూ. 1,56,800 వద్ద ట్రేడ్ అయింది. అయితే, ఉదయం ట్రేడింగ్లో ఈ ధర రూ. 1.57 లక్షల మార్కుకు చేరువైంది. మరోవైపు, మే 2026
పెళ్లయిన దంపతులు వేర్వేరుగా పన్ను దాఖలు చేయడమెందుకు.. పార్లమెంటులో గళమెత్తిన రాఘవ్ చద్దా..
తన పదునైన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు Raghav Chadha మరోసారి పార్లమెంట్ లో తన గళాన్ని లేవనెత్తారు. సోమవారం సాధారణ భారతీయులు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలను పార్లమెంట్ వేదికగా వెలుగులోకి తెచ్చారు. వాటి కోసం ప్రభుత్వాన్ని నిర్మాణాత్మక మార్పులు చేపట్టాలని కోరారు. ఆయన ప్రతిపాదించిన అంశాలలో మొదటగా..

26 C