SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

39    C
...

Ys Jagan : పవన్ ఆరోగ్యంపై జగన్ ట్వీట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీశారు

తెలుగు పోస్ట్ 19 Apr 2026 12:30 pm

Hombale’s Mahavatar Parashuram: Forged In Fury, Rooted In Dharma

India’s Top production house Hombale Films continues its ambitious streak by delving deeper into India’s mythological legacy. Building on the momentum of its previous animated success, the banner now shifts its focus to a far more intense and layered tale- Mahavatar Parashuram. Unveiled on the sacred occasion of Parashuram Jayanti, the announcement signals more than […] The post Hombale’s Mahavatar Parashuram: Forged In Fury, Rooted In Dharma appeared first on Telugu360 .

తెలుగు 360 19 Apr 2026 12:29 pm

ఏప్రిల్ 20న రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ కార్యక్రమం

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండలంలోని రైతులు తమ సమీప రైతు వేదికల్లో

ప్రభ న్యూస్ 19 Apr 2026 12:27 pm

TG |ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఫ్రీ జ‌ర్నీ

TG | ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఫ్రీ జ‌ర్నీ TG | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 19 Apr 2026 12:24 pm

జుక్కల్ లో ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : సామాజిక,సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడని జుక్కల్ మండలానికి చెందిన

ప్రభ న్యూస్ 19 Apr 2026 12:24 pm

గౌతు లచ్చన్నకు ఘన నివాళులు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు

ప్రభ న్యూస్ 19 Apr 2026 12:20 pm

హయత్ నగర్ లో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం

హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం సృష్టించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తోర్రుర్‌లో రంగనాయకుల గుట్ట దేవాలయంలో హుండీ దొంగతనం జరిగింది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈ దేవాలయంలో ఇప్పటి వరకు మూడు సార్లు దొంగతనం జరిగింది. రంగనాథ స్వామి ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి రెండు హుండీలను దుండగులు ఎత్తుకొని వెళ్లారు. భక్తులతో పాటు స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 19 Apr 2026 12:14 pm

Deputy CM |త్వ‌రగా కోలుకోవాల‌ని ఆకాంక్షించిన ప్ర‌ముఖులు

Deputy CM | త్వ‌రగా కోలుకోవాల‌ని ఆకాంక్షించిన ప్ర‌ముఖులు Deputy CM |

ప్రభ న్యూస్ 19 Apr 2026 12:04 pm

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత అప్రజాస్వామికం

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత అప్రజాస్వామికం గరిడేపల్లి, ఆంధ్రప్రభ : దేశ మహిళల

ప్రభ న్యూస్ 19 Apr 2026 12:03 pm

ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకలు

ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ

ప్రభ న్యూస్ 19 Apr 2026 11:57 am

పశ్చిమ బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకున్నారు: మోడీ

పశ్చిమ బెంగాల్: మహిళలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా సర్కార్ ను ఓడించేందుకు ప్రజలు ఏకమవుతున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిష్ణుపూర్ లో ప్రసంగించారు. ఆలయాలకు ప్రసిద్ధి చెందిన బిష్ణుపూర్ లో సభ నిర్వహంచడం ఒక వరమని కొనియాడారు. బెంగాల్ లో ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పడుతున్నారని, సభ ప్రాంగాణాలు ముందే కిక్కిరిసిపోతున్నాయని ఇదొక అద్భుత రికార్డు అని మోడీ ప్రశంసించారు. ప్రజల ప్రేమ, ఆప్యాయత, ఉత్సాహం చూస్తుంటే సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని తెలుస్తుందని అన్నారు. బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకున్నారు కానీ, టిఎంసి పడనివ్వలేదని, టిఎంసి కాంగ్రెస్ తో కలిసి కుట్ర పన్నిందని విమర్శించారు. టిఎంసికి శిక్ష పడాలా? వద్దా? తమరే చెప్పండని, టిఎంసిని శిక్షించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అటవిక ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ వచ్చినప్పుడు ఎలా అవమానించారో దేశం మొత్తం చూసిందని, రాష్ట్రపతిని అవమానించడం తమకు అంగీకారమా? అని రాష్ట్రపతిని అవమానించే వారిని శిక్షించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై ఆలస్యం చేయొద్దని మోడీ సూచించారు.

మన తెలంగాణ 19 Apr 2026 11:55 am

జిల్లాలో యువకుడి దారుణ హత్య

జిల్లాలో యువకుడి దారుణ హత్య నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల జిల్లాలో

ప్రభ న్యూస్ 19 Apr 2026 11:55 am

డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారం

డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారం హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; ఒకవైపు ప్రజా

ప్రభ న్యూస్ 19 Apr 2026 11:50 am

కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రి పువ్వాడ

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తన పుట్టినరోజు సందర్భంగా

ప్రభ న్యూస్ 19 Apr 2026 11:28 am

పెడనలో ఘనంగా గౌతు లచ్చన్న 20వ వర్ధంతి

పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్

ప్రభ న్యూస్ 19 Apr 2026 11:24 am

Nagabandham’s Sura Sura: Visual Extravaganza

Nagabandham is steadily turning heads as it marches toward its grand theatrical release on July 3rd. Directed by Abhishek Nama and backed by NIK Studios, the Virat Karrna starrer is building strong anticipation with each promotional step. The makers have now dropped the second single, Sura Sura, and it arrives like a burst of celebration. […] The post Nagabandham’s Sura Sura: Visual Extravaganza appeared first on Telugu360 .

తెలుగు 360 19 Apr 2026 11:22 am

IPL Ticket Row: Kushita Kallapu Post Raises Questions Around Revanth Reddy

The excitement of the Indian Premier League has now entered Telangana politics. A recent match between Sunrisers Hyderabad and Chennai Super Kings at the Rajiv Gandhi International Cricket Stadium has sparked a fresh controversy online. The issue began when influencer Kushita Kallapu shared a photo of her match tickets on Instagram. The tickets clearly mentioned […] The post IPL Ticket Row: Kushita Kallapu Post Raises Questions Around Revanth Reddy appeared first on Telugu360 .

తెలుగు 360 19 Apr 2026 11:22 am

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

ఘంటసాల, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని

ప్రభ న్యూస్ 19 Apr 2026 11:20 am

నందికొట్కూరులో పరిశుభ్రతపై కఠిన చర్యలు

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలో పరిశుభ్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్

ప్రభ న్యూస్ 19 Apr 2026 11:18 am

19thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

19thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 19thAprilCartoon ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్య ప్రతిబింబంబెదిరింపుల

ప్రభ న్యూస్ 19 Apr 2026 11:14 am

విద్యాపీఠంలో 20న ఆద్యశిల మహోత్సవం

విద్యాపీఠంలో 20న ఆద్యశిల మహోత్సవం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మండలం

ప్రభ న్యూస్ 19 Apr 2026 10:58 am

Chandrababu : తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు

తెలుగు పోస్ట్ 19 Apr 2026 10:56 am

Registration |రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లలో గందరగోళం

Registration | రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లలో గందరగోళం Registration | పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు

ప్రభ న్యూస్ 19 Apr 2026 10:55 am

పవన్ కళ్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా

పవన్ కళ్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు

తెలుగు పోస్ట్ 19 Apr 2026 10:49 am

అమెరికా వెంట ఇజ్రాయెల్ నిలిచింది: ట్రంప్

వాషింగ్టన్: అమెరికాకు..ఇజ్రాయెల్ గొప్ప మిత్రదేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్ణించారు. ఇజ్రాయెల్ ను ప్రశంసలతో ట్రంప్ ముంచెత్తారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సంఘర్షణలో కొన్ని దేశాలు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టాయని, ఇతర దేశాల మాదిరి కాకుండా అమెరికా వెంట ఇజ్రాయెల్ నిలిచిందని తెలియజేశారు. ఇజ్రాయెలీలు ధైర్యవంతులు, సాహసవంతులు, విధేయులు, తెలివైనవారని కొనియాడారు. ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతుందని..ఎలా గెలవాలో వారికి తెలుసు అని ట్రంప్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 19 Apr 2026 10:46 am

భార్య కోసం కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి పిల్లలకు తాగించి

అమరావతి: భార్య కాపురానికి రావడంతో లేదని కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి ఇద్దరు పిల్లలకు తాగించి అనంతరం తండ్రి తాగాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... గంగుపల్లితండాలో దంపతులు మధ్య గొడవ జరగడంతో పిల్లలను వదిలేసి భార్య వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త కుంగిపోయాడు. కుల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపాడు. అనంతరం ఇద్దరు పిల్లలకు తాగించి తాను తాగాడు. వెంటనే స్థానికులు గుర్తించి వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 19 Apr 2026 10:37 am

మహిళాబిల్లు వీగిపోవడం దురదృష్టకరం..

మహిళాబిల్లు వీగిపోవడం దురదృష్టకరం.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : మహిళా రిజర్వేషన్ బిల్లు లోకసభలో

ప్రభ న్యూస్ 19 Apr 2026 10:31 am

కొండపల్లి బొమ్మల పండుగకు మంత్రి దుర్గేష్

కొండపల్లి బొమ్మల పండుగకు మంత్రి దుర్గేష్ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి బొమ్మల

ప్రభ న్యూస్ 19 Apr 2026 10:14 am

Three Releases for Suriya in 2026

Post pandemic, none of the films of Suriya performed well in theatres. Soorarai Pottru and Jai Bhim received exceptional response but they had a direct digital release. The actor has three films lined up and all these three films will release in a gap of six months in 2026. He is done with the shoot […] The post Three Releases for Suriya in 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 19 Apr 2026 10:14 am

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ముగ్గురు మృతి

హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన తల్లి, నాలుగేళ్ల కుమారుడిగా గుర్తించారు. యాదిగిరిగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామ పరిధిలో ద్విచక్రవాహనం, ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందాడు. బైక్ పైనుంచి కిందపడడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మరో ముగ్గురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 19 Apr 2026 10:11 am

మిద్దె వెంకటేశ్వర్లుకు ‘దళిత రత్న’ పురస్కారం..

మిద్దె వెంకటేశ్వర్లుకు ‘దళిత రత్న’ పురస్కారం.. సూర్యాపేట జిల్లా ​గరిడేపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Apr 2026 10:08 am

Injuries and Surgeries for Mega Heroes in 2026

2026 started on a grand note for Mega family after Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu ended up as one of the biggest blockbusters of Telugu cinema. Soon, Megastar took a break and he underwent shoulder surgery. He took rest and is back to work recently. Ram Charan suffered a small injury on the sets […] The post Injuries and Surgeries for Mega Heroes in 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 19 Apr 2026 10:04 am

సీఎం సభను విజయవంతం చేయాలి..

సీఎం సభను విజయవంతం చేయాలి.. చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా కాటారం

ప్రభ న్యూస్ 19 Apr 2026 9:59 am

అభివృద్ధి పనులను అడ్డుకుంటే..

అభివృద్ధి పనులను అడ్డుకుంటే.. కుభీర్, ఆంధ్రప్రభ : మండలంలో జరిగే అభివృద్ధి పనులను

ప్రభ న్యూస్ 19 Apr 2026 9:44 am

Train Journey : రైలు ప్రయాణమంటేనే హడల్.. మెడలో బంగారం ఉందా?

రైళ్లలో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువవుతున్నాయి

తెలుగు పోస్ట్ 19 Apr 2026 9:37 am

మైహోం పరిశ్రమలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు..

మైహోం పరిశ్రమలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు.. మేళ్లచెరువు, ఆంధ్రప్రభ : జాతీయ అగ్నిమాపక

ప్రభ న్యూస్ 19 Apr 2026 9:36 am

తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు

తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ మున్సిపల్

ప్రభ న్యూస్ 19 Apr 2026 9:31 am

నేడు తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు

ఈరోజు చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది.

తెలుగు పోస్ట్ 19 Apr 2026 9:23 am

Women’s Bill Fallout: How Modi Flipped a Setback Into a Narrative Win

Prime Minister Narendra Modi’s address to the nation after the defeat of the Constitution (131st Amendment) Bill and the Delimitation Bill was not just a response to a legislative setback. It looked like a carefully planned political move. On the surface, the government failed to secure the numbers needed to pass a major constitutional reform […] The post Women’s Bill Fallout: How Modi Flipped a Setback Into a Narrative Win appeared first on Telugu360 .

తెలుగు 360 19 Apr 2026 9:22 am

కరీంనగర్ మేయర్ ను కలిసిన బిజెవైయం నాయకుడు శరత్ కుమార్

కరీంనగర్ మేయర్ ను కలిసిన బిజెవైయం నాయకుడు శరత్ కుమార్ స్టేషన్ ఘన్

ప్రభ న్యూస్ 19 Apr 2026 9:21 am

Summer Effect : పగలవుతుందంటేనే వణుకు.. ఇవేం ఎండలురా సామీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 19 Apr 2026 9:15 am

మహాత్మ బసవేశ్వరుని తత్వాలు..

మహాత్మ బసవేశ్వరుని తత్వాలు.. డోంగ్లి, ఆంధ్రప్రభ : కుల,లింగ,వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా

ప్రభ న్యూస్ 19 Apr 2026 9:12 am

యువ బౌలర్లు ప్లాన్ వేసి గెలిపించారు: ఇషాన్ కిషన్

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. సిఎస్‌కెపై ఎస్‌ఆర్‌హెచ్ పది పరుగుల తేడాతో గెలుపొందింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ఇసాన్ మలింగ కీలకమైన మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మలింగకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా ఎస్‌ఆర్ హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మీడియాతో మాట్లాడారు. ఈ మ్యాచ్‌లో కనీసం తాము 20 నుంచి 40 పరుగులు చేయాల్సి ఉందని తెలిపారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేసినప్పుడు 230 పరుగులు చేస్తామని ధీమా వచ్చిందని, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేటలో వెనకబడిపోయామని వివరించారు. తమ టీమ్‌లో ముగ్గురు బ్యాటర్ లలో ఒకరు భారీ స్కోర్ చేస్తే కచ్చితంగా గెలుస్తామన్నారు. యువ బౌలర్లు బాధ్యత తీసుకొని ముందడుగు వేశారని ప్రశంసించారు. యువ బౌలర్లు ఫీల్డింగ్ సెట్ చేసుకొని బౌలింగ్ వేసి ఫలితం రాబట్టారని కొనియాడారు. కుర్రాళ్లు ప్లాన్ వేసి మ్యాచ్‌ను గెలిపించడంతో తన సంతోషానికి అవధులు లేకుండాపోయాయన్నారు. యువ బౌలర్లపై నమ్మకం పెడితే అద్భుతాలు చేసి నిరూపించారని ఇషాన్ మెచ్చుకున్నారు. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉందని, ఇలాంటి పిచ్‌పై తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలియజేశారు. ఒక్కో మ్యాచ్ గెలవడంపైనే దృష్టి పెట్టామని, పాయింట్ల పట్టిక గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని ఇషాన్ పేర్కొన్నారు. షాట్ల ఎంపికలో కొన్ని తప్పిదాలు చేశామని, తాము నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ఇషాన్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 19 Apr 2026 9:09 am

ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి ఆదర్శనీయుడు

ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి ఆదర్శనీయుడు చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 19 Apr 2026 9:05 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಬಾಲ್ಕನಿಯಿಂದ ಬೀಳುತ್ತಿದ್ದ ಮಗುವನ್ನು ಕೋತಿಯೊಂದು ರಕ್ಷಿಸಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಬಾಲ್ಕನಿಯಿಂದ ಬೀಳುತ್ತಿದ್ದ ಮಗುವನ್ನು ಕೋತಿಯೊಂದು ರಕ್ಷಿಸಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 19 Apr 2026 9:00 am

అలా జరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం..

అలా జరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం.. వికారాబాద్, ఆంధ్రప్రభ : చట్టసభల్లో మహిళా

ప్రభ న్యూస్ 19 Apr 2026 8:59 am

Gold Price Today : బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులేదు

తెలుగు పోస్ట్ 19 Apr 2026 8:52 am

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన ప్రదర్శన

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన ప్రదర్శన చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్

ప్రభ న్యూస్ 19 Apr 2026 8:47 am

రోడ్డు పై మురుగు నీరు..

రోడ్డు పై మురుగు నీరు.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్, హైదరాబాద్ మార్గంలో

ప్రభ న్యూస్ 19 Apr 2026 8:39 am

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి అదే కారణమా?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే ఉంది

తెలుగు పోస్ట్ 19 Apr 2026 8:37 am

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

మన తెలంగాణ/మోత్కూర్: వాహన దారులు విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సిఐ సి వెంకటేశ్వర్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే 108, 100,112 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఆరైవ్ , ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వాహనాల దారులకు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ..  వాహన దారులు తమ వాహనాలకు సంబందించిన పత్రాలు వాహనంతో పాటు ఉంచుకోవాలని, ద్వి చక్ర వాహన దారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపవద్దన్నారు. కార్లు,బస్సులు, ఆటోలు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కే సతీష్ , ఏ ఎస్ ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ, పోలీస్ సిబ్బంది రామనర్సయ్య, పోలీస్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 19 Apr 2026 8:28 am

Road Accident : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు

తెలుగు పోస్ట్ 19 Apr 2026 8:25 am

శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం..

శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం.. తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి

ప్రభ న్యూస్ 19 Apr 2026 8:23 am

అల్తాఫ్ బాబా పుట్టినరోజు వేడుకల్లో సర్వమత ప్రార్థనలు..

అల్తాఫ్ బాబా పుట్టినరోజు వేడుకల్లో సర్వమత ప్రార్థనలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కొండపల్లిలో సూఫీ

ప్రభ న్యూస్ 19 Apr 2026 8:17 am

Naredna Modi : కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది : నరేంద్ర మోదీ

కొందరికి దేశం కంటే రాజకీయాలే ఎక్కువని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

తెలుగు పోస్ట్ 19 Apr 2026 8:15 am

ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.O

ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.O ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గంజాయి ఇతర

ప్రభ న్యూస్ 19 Apr 2026 8:10 am

Andhra Pradesh : ఇంటర్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది

తెలుగు పోస్ట్ 19 Apr 2026 8:07 am

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 30 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తోంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అనంతరం బోల్తా పడింది. పలువురు ప్రయాణికులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 19 Apr 2026 7:57 am

‘పరమపద సోపానం’ ట్రైలర్ విడుదల

అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పరమపద సోపా నం’. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. గణపర్తి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రా న్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా... పులగం సుప్రి య కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక గ్రిప్పింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సం దర్భంగా ’కింగ్ ఆఫ్ కంటెంట్’ శ్రీవిష్ణు ’పరమపద సోపానం’ ట్రైలర్ ను లాం చ్ చేశారు. అనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, గ్రిప్పింగ్ గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నామనే ఆసక్తిని కలిగించింది. అర్జున్ అంబటి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

మన తెలంగాణ 19 Apr 2026 7:50 am

IPL 2026 : ఐపీఎల్ లో నేడు వీకెండ్ థమాకా

ఐపీఎల్ లో నేడు మరో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 19 Apr 2026 7:44 am

పనికి వెళ్లడం లేదని అడిగినందుకు ఉరేసుకున్న భర్త

అమరావతి: పనికి వెళ్లడం లేదని భార్య మందలించినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం పోలవరం పంచాయతీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాతపోలవరం గ్రామంలో సూరవరపు గంగాధర్(42), రామలక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతడ వంటి మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి పనులు లేకపోవడంతో మద్యం తాగుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పనికి వెళ్లకపోతే ఎట్లా అని భర్తను భార్య పలుమార్లు మందలించింది. మరుసటి రోజు ఉదయం పనికి వెళ్తున్నానని, వేడి వేడి గంజి కావాలని అతడు భార్యను అడిగాడు. భార్య గంజి కాసి ఇచ్చి బయటకు వెళ్లింది. తోడి కోడలు పిల్లలకు ఇంటికి వెళ్లి ఒకసారి బాబాయ్ ఇంట్లో ఉన్నాడా? చూసి రమ్మని చెప్పింది. గంగాధర్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతుడి భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 19 Apr 2026 7:43 am

IPL 2026 : చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ

చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది

తెలుగు పోస్ట్ 19 Apr 2026 7:32 am

Strait of Hormuz : హోర్ముజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ కఠిన నిర్ణయం

హోర్ముజ్ జలసంధి అంశంలో ఉద్రిక్తత మళ్లీ పెరిగింది

తెలుగు పోస్ట్ 19 Apr 2026 7:17 am

Iran - America Talks : ఇరాన్ - అమెరికా చర్చల మధ్య ప్రతిష్టంభన

ఇరాన్ అమెరికా తో మరో విడత ముఖాముఖి చర్చలకు ఇప్పుడే సిద్ధంగా లేదని సీనియర్ ఇరానీ అధికారి తెలిపారు

తెలుగు పోస్ట్ 19 Apr 2026 7:06 am

అంధకారంలో మూడు మండలాలు

అంధకారంలో మూడు మండలాలు మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం డంపింగ్ యార్డ్

ప్రభ న్యూస్ 19 Apr 2026 7:02 am

One Nation One Reservation |రిజర్వేషన్ వ్యవస్థలో అసమానతలు

One Nation One Reservation | రిజర్వేషన్ వ్యవస్థలో అసమానతలు One Nation

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:44 am

Revanth reddy |మహిళా సాధికారతలో తెలంగాణ ముందంజ

Revanth reddy | మహిళా సాధికారతలో తెలంగాణ ముందంజ Revanth reddy |

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:29 am

19thaprilchintana |అక్షయ తృతీయ ప్రాముఖ్యత..

19thaprilchintana | అక్షయ తృతీయ ప్రాముఖ్యత.. 19thaprilchintana | అక్షయ తృతీయ అర్థం

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:14 am

హర్మూజ్ జలసంధిలో భారత నౌకపై కాల్పులు

టెహ్రాన్: హర్మూజ్ జలసంధి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెరిచినట్టే తెరిచే గంటల వ్య వధిలో ఇరాన్ తిరిగి మూసివేసింది. దానికి అమెరికా అనుసరిస్తున్న వైఖరే కారణమని స్పష్టం చే సింది. శుక్రవారంనాడు జలసంధిని తెరిచిన ఇరా న్ శనివారంనాడు మూసివేసింది. హర్మూజ్‌ను తెరిచినప్పటికీ ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాం డ్ పేర్కొంది. ‘హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తిరిగి మొదటికి వచ్చింది. ప్రస్తుతం మా సాయు ధ దళాల నియంత్రణలో ఉంది. ఇరాన్ ఓడరేవుల పై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంత కా లం జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుం టాం’ అని ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేవరకు హర్మూజ్‌లో దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. ఆ వెంటనే హర్మూజ్‌లో రాకపోలను ఇరాన్ నియంత్రించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో జలసంధిని దాటేందుకు ముడి చమురు, గ్యాస్‌తో కూడిన 14 భారతీయ జెండాలతో కూడిన నౌకల కాన్వాయ్‌ను ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ అడ్డుకున్నారు. ఐఆర్‌జిసికి చెందిన రెండు గన్‌బోట్లు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వాటిలో ఒకదానిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నౌక కిటికీ అద్దం దెబ్బతింది. కెష్మ్‌లరాక్ దీవుల నడుమ ఈ ఘటన చోటుచేసుకుంది. ముడి చమురుతో కూడిన హెచ్‌పిసిఎల్‌కు చెందిన మరో నౌక మాత్రం సురక్షితంగా హర్మూజ్‌ను దాటి భారత్‌వైపు పయనిస్తోంది. మిగతా 12 నౌకలను గన్‌బోట్లు 37 కిలో మీటర్ల మేరకు వెంటాడి ఒమన్‌ను ఈశాన్య దిశలో అడ్డుకున్నాయి. దీంతో హర్మూజ్‌ను దాటకుండా ఆ నౌకలు వెనక్కి పయనమయ్యాయి. 14 నౌకలు ఏడు భారతీయ జెండాలతో కూడినవి కాగా, నాలుగు లైబీరియా, రెండు మార్షల్ దీవులు, మరొకటి వియత్నాంకు చెందినవి. వీటిలో ఆరింటిలో ముడి చమురు, మూడింటిలో ఎల్‌పిజి, నాలుగు ఎరువులతో నిండి ఉన్నాయి. ఈ నౌకలన్నింటినీ లరాక్ దీవులకు దక్షిణాన లంగరు వేయించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మిగతా నౌకలను కూడా క్షేమంగా హర్మూజ్ దాటించేందుకు పయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా దాడికి గురైన నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నాం.. మరోవైపు దేశం లోని పలు ఎయిర్ పోర్టులను తిరిగి తెరవడంతోపాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యురేనియంను అమెరికాకు అప్పగించేది లేదు: ఇరాన్ అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శుద్ధి చేసిన యురేనియ ం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్‌జడేహ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భవిష్యత్‌లో జరగనున్న చర్చలకు యురేనియం ప్రధాన అంశమని ట్రంప్ చేస్తున్న వాదనలను కొట్టి పారేశారు. టర్కీ లోని అంటల్యా సిటీలో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సయీద్ అమెరికాతో మరో దఫా ముఖాముఖి చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని వెల్లడించారు. ఎందుకంటే అమెరికా తన గరిష్టవాదాన్ని విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్‌లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని శుక్రవారం ట్రంప్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో సయీద్‌ఖతిబ్జ్‌దేహ్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

మన తెలంగాణ 19 Apr 2026 6:00 am

19aprSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

19aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఓ మనిషీ…నన్ను కాపాడు(కో)…! ముఖచిత్ర కథనం

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:00 am

19thApril2026 |ఆదివారం నేటి పంచాంగం

19thApril2026 | ఆదివారం నేటి పంచాంగం 19thApril2026 | దిన విశేషాలు &

ప్రభ న్యూస్ 19 Apr 2026 6:00 am

అనుకున్నదొకటి.. అయిందొకటి!

ఆటలో కచ్చితంగా ఓడిపోతామని తెలిశాక ఎవరైనా ఆడతారా? పరాజయంలో కూడా ఏదో ప్రయోజనం ఉంటే తప్ప ఎవరూ ఓడిపోయే ఆట ఆడాలనుకోరు. మరి కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఎందుకని అంకెలు అంత స్పష్టంగా కనిపిస్తూ ఉండగా ఓడిపోవడానికి సిద్ధపడింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పార్లమెంట్లో మొట్టమొదటిసారి ఓటమిని చవిచూడటానికి ఎందుకు సిద్ధపడింది? ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు బిల్లులు వీగిపోతాయని ఆరవ తరగతి చదివే విద్యార్థి కూడా చెప్పగలడు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే హాజరయిన సభ్యులలో తప్పనిసరిగా మూడింట రెండువంతుల బలం ఉంటే తప్ప సాధ్యం కాదన్న విషయం నరేంద్ర మోడీకి, ఆయన ప్రభుత్వంలోని పెద్దలందరికీ బాగా తెలుసు. అయినా సరే, కేంద్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను ప్రతిపాదించేందుకు ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? ఇందులో ఒకటి చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు. రెండవది నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించినది. మూడవది కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణకు సంబంధించిన బిల్లు. నిజానికి మామూలు పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కూడా వీటిని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ బిల్లు నిజానికి 2023లోనే ఏకగ్రీవంగా పార్లమెంట్ ఆమోదం పొంది ఉన్నది. దానిని ప్రస్తుతం డీలిమిటేషన్‌తో లింక్ చేస్తూ తీసుకురావడాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ భాషలో చెప్పాలంటే ప్రతిపక్షాలను వాటికి ఆమోదం కానీ అంశంలో ఒప్పించేందుకు ఒక చీరను చుట్టి తీసుకొచ్చారు. పోలిక అభ్యంతరకరంగా ఉండవచ్చు కానీ ఆయన ఉద్దేశం డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో తీసుకువచ్చారు అని. ఒకవైపు ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతుండగా, ముఖ్యమైన రెండు రాష్ట్రాలలో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు) పోలింగ్ ఇంకా జరగాల్సి ఉండగా ఇంత హడావుడిపడి బిల్లులు ఎందుకు ప్రవేశపెట్టాలనుకున్నట్టు? సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ నిన్నటి చర్చలో పాల్గొంటూ ఇది నారీ బిల్లు కాదు ఎన్‌డిఎ ‘నారా’ అన్నారు. ఉర్దూలో ‘నారా’ అంటే నినాదం. మహిళలను విపక్షాలనుండి దూరం చేసి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ఈ నారీశక్తి వందన్ అధినియం బిల్లును మరొకసారి తెరమీదకి తెచ్చిందని అఖిలేష్ యాదవ్ అభిప్రాయం. 2029 ఎన్నికలలో మహిళాబిల్లుకు విపక్షాలు అడ్డుకొట్టాయన్న నినాదం తీసుకుని జనంలోకి వెళ్ళే ఆలోచన బిజెపి చేస్తున్నదని. అదే నిజమని ఒకటికి రెండుసార్లు శుక్రవారం సభలోపలా వెలుపలా జరిగిన సంఘటనలు స్పష్టం చేశాయి. సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన వెంటనే భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాల మహిళాసభ్యులంతా ముందే తయారు చేయించి పెట్టుకున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం ఒక ఉదాహరణ. అంతేకాదు, అంతకు ముందురోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా దేశంలోని మహిళలంతా తమవైపు చూస్తున్నారనీ, విపక్షాలు మద్దతు ఇవ్వకపోయినా, బిల్లు వీగిపోయినా తనకే లాభం అని చేసిన హెచ్చరికలాంటి వ్యాఖ్యలు అయినా, చివరగా చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు అయినా కచ్చితంగా ఈ సవరణ బిల్లు వీగిపోనున్నదని వారికి ముందే తెలుసునన్న విషయం స్పష్టం చేశాయి. అంతేకాదు, ఇదంతా మోడీ ప్రభుత్వం ఒక రాజకీయ ఎత్తుగడగా చేసిందని అర్థమైంది. ఈ బిల్లును వ్యతిరేకించడానికి మొత్తం ప్రతిపక్షం ఒక్కటైందన్న విషయం కూడా రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష సభ్యులందరి మాటల్లో స్పష్టంగా అర్థం అయింది. ప్రజాస్వామ్యంలో ఒక్కోసారి ప్రతిపక్షానిది పైచేయి కావడం పెద్ద విశేషమేమీ కాదు. ప్రజాస్వామ్యానికి ఉండే గొప్పతనమే అదని మర్చిపోకూడదు. గెలుపు ఓటముల మాట అలా ఉంచితే ఎన్‌డిఎ ఎందుకు ఇలా చేసింది? ప్రతిపక్షాలు ఎందుకు దీనిని వ్యతిరేకించాయి? లోకసభలో ఓటింగ్ పూర్తయి మహిళా బిల్లు వీగిపోయిందన్న వార్త వెలువడిన క్షణాల్లోనే ఫెమినిస్టుల దగ్గరినుండి సామాన్యుల దాకా చాలామంది ‘అయిపోయింది, మహిళలకు మళ్లీ మొండిచెయ్యి చూపించారు’ అని సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడ్డారు. ఎన్‌డిఎ ఆశించింది అదే. ఇండియా కూటమితోబాటు మిగిలిన పక్షాలన్నీ దీని మీద మహిళా లోకానికి సంజాయిషీ లేదా వివరణ ఇచ్చుకుంటూ దేశమంతా తిరగాలన్నది ఎన్‌డిఎ పథకం. మహిళా సంఘాలు, ఫెమినిస్టులు మరోసారి నిరాశ చెందడానికి కారణం ఉంది.30 ఏళ్ళుగా వాళ్ళు ఎంత ప్రయత్నించినా మహిళా రిజర్వేషన్ల వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది. సభలో బిల్లు వీగిపోగానే అధికారపక్ష మహిళాసభ్యుల నిరసనతో మొదలై ఎన్‌డిఎ ఇచ్చిన పిలుపుమేరకు శనివారంనాడు దేశమంతటా ‘ప్రతిపక్షాలు మహిళా వ్యతిరేకులు’ అంటూ ఎన్‌డిఎ పక్షాలు నిరసన మొదలుపెట్టాయి. ‘చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు మేం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు వాళ్ళని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి’ అన్న ప్రచారం పెద్దయెత్తున ఎన్‌డిఎ పక్షాలు మొదలుపెట్టాయి. మీడియాలో అత్యధికులు దీనికి వంతపాడటంలో ఆశ్చర్యమేమీలేదు. కొన్ని తెలుగు పత్రికలు ‘నెగ్గని మహిళా కోటా, ఆమెకు మళ్లీ నిరాశే, నారి సారీ’ వంటి శీర్షికలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డం కొట్టాయన్న అర్థం వచ్చే విధంగా రాసాయి. ఇది విషయాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం అయినా కావచ్చు లేదా ఎన్‌డిఎ ఎజెండాను ముందుకు తీసుకుపోయే క్రమంలో ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి శీర్షికలు పెట్టి ఉండవచ్చు. ఈ సమయంలో ప్రముఖ విప్లవకవి శివసాగర్ కవిత ఒకటి గుర్తొస్తున్నది. ‘ఆకాశంలో సగం నువ్వు, అనంతకోటి నక్షత్రాల్లో సగం నువ్వు, సగం నేను’ అంటాడాయన స్త్రీని ఉద్దేశించి. ఆకాశంలో సగం అయితే అయింది గాని స్త్రీ మన చట్టసభల్లో మాత్రం సగం కాదు. గణాంకాలు పరిశీలించినట్లయితే 18వ లోకసభలో మహిళల ప్రాతినిథ్యం 13.6% అంటే 74 మంది మహిళ ఎంపీలు ఉన్నట్లు లెక్క. చట్టసభలకు ప్రతినిధులను పంపేందుకు జరిగే ఎన్నికలలో ఓట్లు వేసే మహిళల సంఖ్య పెరుగుతున్నదే తప్ప చట్టసభల్లోకి మాత్రం తక్కువమంది వెళ్తుండటం జీవిత సత్యం. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు, దేశంలోని నియోజకవర్గాల పునర్విభజన, వాటి సంఖ్య పెంపు. ఈ అంశాలను విడివిడిగా చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పెద్దది, చైతన్యవంతమైనది అయిన భారతదేశ ప్రజాస్వామ్యంలో నానాటికీ పెరుగుతున్న ఓటరు చైతన్యంలో మహిళల భాగస్వామ్యం విస్మరించడానికి వీల్లేనిది. చట్టసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో చైతన్యవంతులైన మహిళల సంఖ్య ఏ ఎన్నికకు ఆ ఎన్నికలో పెరుగుతున్నా అదే చట్టసభలలో వారి ప్రాతినిధ్యం మాత్రం పెరగడం లేదు. ఈనాటికీ వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య సగటున తొమ్మిది శాతం దాటడం లేదు. పార్లమెంటులో అది 15 శాతానికి మించడం లేదు. 147 కోట్ల జనాభా గలిగిన భారతదేశంలో 48% మహిళలు ఉన్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అదే నిష్పత్తిలో చట్టసభలలో వారికి ప్రాతినిధ్యం లేదు. నిజానికి 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన 33 శాతం రిజర్వేషన్లు కాకుండా జనాభా ప్రాతిపదికన వారికి 48 శాతం రిజర్వేషన్ కల్పించి, అది వెంటనే 2029లో జరగబోయే లోకసభ, దానికి ముందు వెనక జరిగే శాసనసభల ఎన్నికల్లో అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అన్ని రాజకీయపక్షాలది. డీలిమిటేషన్ తోటి, జనాభా లెక్కలతోటి సంబంధం లేకుండా 2023లో ఆమోదించిన బిల్లును చట్టం చేసి వెంటనే అమలు చేస్తే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యంపట్ల అధికారంలో ఉన్న రాజకీయపక్షాలకు చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతారు. ఎన్నికల్లో మహిళల ఓట్లు సంపాదించుకునేందుకు ప్రతిపక్షాల మీద బురద జల్లి ప్రయోజనం లేదు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే క్రమంలో అందులో కూడా వివిధ వర్గాలకు రిజర్వేషన్ల విషయం కూడా తేల్చాలి. ఒబిసిలు, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల ప్రాతినిధ్యం విషయంలో ప్రతిపక్షాలు తెస్తున్న ప్రతిపాదనల్ని పట్టింపులకు పోకుండా చర్చించి ఆమోదిస్తేనే ప్రభుత్వపక్షం ఈ అంశంలో నిజాయితీగా వ్యవహరిస్తోందని అనుకోవచ్చు. మహిళా రిజర్వేషన్ల శాతం ఒకసారి నిర్ణయిస్తే నియోజకవర్గాల సంఖ్య పెంచినప్పుడల్లా అదే శాతం వారికి వర్తింపజేయవచ్చు. దీనికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకొని దక్షిణాదిపట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదన్న అభిప్రాయం ప్రజల్లో పెరగకుండా చూడాలి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాలు రెండూ కేంద్రప్రభుత్వం తెచ్చిన సవరణకు మద్దతుగా నిలిచి మిగిలిన దక్షిణాది రాష్ట్రాల నుండి వేరుపడి విమర్శకు తావిచ్చాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది కాబట్టి ఇక లోకసభ స్థానాలు 2026 సెన్సస్ (జనాభా లెక్కల) ప్రకారం జరుగుతాయి. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ 5, తెలంగాణ 3, తమిళనాడు 10, కర్ణాటక 2, కేరళ 7, ఒడిశా 4, పశ్చిమ బెంగాల్ 4 సీట్లు ప్రస్తుతం ఉన్నసంఖ్య కంటే తగ్గుతాయని, ఉత్తరప్రదేశ్‌కు, బీహార్‌కు 10, మధ్యప్రదేశ్‌కు 5, రాజస్థాన్‌కు 7 స్థానాలు పెరుగుతాయని బిల్లు వీగిపోయి 24 గంటలైనా గడవకముందే ఎన్‌డిఎ అభిమానులు ప్రచారం మొదలుపెట్టారు. దీనివల్ల బిజెపికే లాభం జరుగుతుందని చంకలు గుద్దుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం అన్నిపక్షాలను సమావేశపరిచి, వారితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం కానీ, వాటి పునర్విభజన జరపడం కానీ చేయకపోతే ముందుముందు దేశ సమగ్రతకు నష్టం జరుగుతుందన్న విషయం బాధ్యతగల రాజకీయ పక్షాలన్నీ గుర్తించాలి. రాజ్యాంగ సవరణ మీద చర్చకు చివరగా సమాధానం ఇస్తున్న సందర్భంగా ఒక దశలో అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ 50 శాతం స్థానాలు పెరిగే విధంగా ఒక సవరణ బిల్లు తేవడానికి సిద్ధమని చెప్పిన విషయం మర్చిపోకూడదు. అంతా సవ్యంగా సాగితే డీలిమిటేషన్ వల్ల 273 లోకసభ స్థానాలు, రెండువేల అసెంబ్లీ స్థానాలూ పెరుగుతాయి. సహజంగానే రాజ్యసభ స్థానాలూ, శాసన మండలి స్థానాలు పెరగక తప్పదు. ఒక్కో పార్లమెంట్ సభ్యుడికి ఏడాదికి నాలుగు కోట్ల 29 లక్షల రూపాయలు వివిధ పద్దుల కింద ప్రజాధనం ఖర్చు అవుతున్నది. 273 మంది కొత్తగా చేరితే ఈ లెక్కన సంవత్సరానికి 1,171 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే, అయిదు సంవత్సరాలకు 5,855 కోట్లు అని ఒక అంచనా. ఇదంతా ఇప్పటికే లోకసభలో ఉన్న 543 మంది సభ్యులకు అయ్యే ఖర్చుకు అదనం. ఇక రాష్ట్రాల శాసనసభల సభ్యులకు అయ్యే ఖర్చు అదనం. వీటితోబాటు చట్టసభల నిర్వహణకు అవుతున్న వ్యయం వేరు. ఇన్ని వేలకోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నందుకు ప్రజోపయోగమయిన పనులు ఎన్ని జరుగుతున్నాయి? ఆమ్‌ఆద్మీ రాఘవ్ చడ్డాను అడగాలి. దేవులపల్లి అమర్

మన తెలంగాణ 19 Apr 2026 5:50 am

గుండెపోటు.. యువతపై పిడుగుపాటు

ఒకప్పుడు గుండెపోటు అనేది వృద్ధులకు మాత్రమే సంబంధించిన అనారోగ్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య యువతలో గుండెపోటు మరణాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ తీవ్రతను స్పష్టం చేస్తాయి. గత ఆరేళ్లలో (2020 నుంచి 2026 జనవరి వరకు) ఈ వయసు సమూహంలో దాదాపు 18వేల మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 2020లో 2,394 మరణాలు నమోదు కాగా, 2025లో 3,255కి పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సంఖ్యలు పెరుగుతున్న ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాజిక నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. యువతే దేశ భవిష్యత్తు. వారి మరణాలు కేవలం వ్యక్తిగత నష్టం కాదు, జాతీయ సంక్షోభం. ఈ పరిస్థితికి ప్రధాన కారణం జీవనశైలి. టెక్నాలజీ యుగంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. కార్యాలయాల్లో గంటల తరబడి కూర్చుని పని చేయడం, స్మార్ట్‌ఫోన్‌లకు అంటుకుపోయి ఉండటంవల్ల గుండె బలహీనపడుతోంది. అహారపు అలవాట్లు మరింత దారుణం. ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం, రాత్రి భోజనాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను పెంచుతున్నాయి. పొగతాగడం, మద్యపానం వంటి హానికర అలవాట్లు యువతను హత్తుకుంటున్నాయి. మరింత ముఖ్యం మానసిక ఒత్తిడి. ఉద్యోగ పోటీ, ఆర్థిక ఒత్తిడి, సామాజిక మీడియా ప్రభావంవల్ల యువత రోజురోజుకూ ఒత్తిడి హార్మోన్లతో బాధపడు తోంది. ఈ హార్మోన్లు గుండెపై అదనపు భారం వేసి, హార్ట్ అటాక్‌కు దారి తీస్తాయి. పట్టణీకరణ, రాత్రి షిఫ్టులు సర్కాడియన్ రిథమ్‌ను దెబ్బ తీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లో ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలుష్యం, పని ఒత్తిడి, నిద్రలేమి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిందనే అనుమానాలు ఉన్నాయి. వైరస్ లేదా వ్యాక్సిన్‌తో సంబంధం ఉందా అనే ప్రశ్నలు ప్రజల మనసులో తిరుగుతున్నాయి. కానీ హర్యానా ప్రభుత్వం సర్వే చేయలేదని తెలిపింది. ఇది ప్రధాన లోపం. అపోహలు పెరిగి, ఆరోగ్యంపై తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టి సత్వరం సమాధానం ఇవ్వాలి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వాలు చురుకైన చర్యలు తీసుకోవాలి. స్కూల్, కాలేజీలు, కార్యాలయాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో కార్డియాక్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉచిత పరీక్షలు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు బలోపేతం చేయాలి. యోగ, ధ్యానం వంటి కార్యక్రమాలను ప్రచారం చేయాలి. కానీ ప్రభుత్వాలు మాత్రమే కాదు, వ్యక్తుల బాధ్యత కూడా కీలకం. రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం, సమతుల ఆహారం, సకాలంలో నిద్ర, ఒత్తిడి నిర్వహణ అవసరం. పొగ, మద్యం వంటి వాటిని వదిలేయాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెట్టర్ దాన్ క్యూయర్ అనే సూక్తిని ఆచరణలో పెట్టాలి. లక్షణాలు తీవ్రమైన తర్వాతే వైద్యుల వద్దకు వెళ్లే మన దృక్పథం మారాలి. యువతలో ఈ మరణాలు మౌన సంక్షోభం. దీనిని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. ప్రభుత్వాలు సమగ్ర విధానాలు అమలు చేస్తే, వ్యక్తులు జాగ్రత్తగా ఉంటేనే భవిష్యత్ తరాలను రక్షించగలం. ఇప్పుడే చర్య తీసుకోకపోతే, రేపు యువత లేని దేశం మిగిలిపోతుంది. ఆరోగ్యం మన ఆస్తి. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని, ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించాలి. దయ్యాల అశోక్ 95508 89907

మన తెలంగాణ 19 Apr 2026 5:40 am

మేధావులు మౌనం వీడాలి

తెలంగాణ రాష్ట్రం సాధన ఒక చారిత్రాత్మక ఘట్టం. దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువత, రైతులు, ఉద్యోగులు మాత్రమే కాదు -మేధావులు కూడా కీలక పాత్ర పోషించారు. విశ్లేషణలతో, రచనలతో, సభలతో ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమానికి ఆలోచనా పునాది మేధావులే వేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే మేధావుల పాత్ర ఏమైంది? ఈ ప్రశ్న ఈ రోజు సామాన్య ప్రజలలో మాత్రమే కాదు, ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వర్గాలలో కూడా గట్టిగా వినిపిస్తోంది. ఉద్యమ సమయంలో ప్రజాస్వరంగా ఉన్న వారు, రాష్ట్రం వచ్చిన తర్వాత మౌన వీక్షకులుగా మారిపోయారా అనే అనుమానం పెరుగుతోంది. రాష్ట్రం వచ్చిన తొలిదశలో కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని భావించడం సహజమే. కొత్త వ్యవస్థను స్థిరపరచడానికి కొంత సమయం అవసరం ఉంటుంది. కానీ ఆ సమయం సంవత్సరాలుగా మారిన తర్వాత కూడా మేధావుల నుంచి స్పష్టమైన, నిరంతర ప్రజాపక్ష స్వరం వినిపించకపోవడం ఆందోళనకరమైన విషయం. పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ పారదర్శకత, ఆర్థిక అసమానతలు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చలు జరిపి ప్రజలను సమీకరించే ప్రయత్నాలు చాలా పరిమితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో ఒక ప్రధాన విమర్శ ఏమిటంటే -తెలంగాణ మేధావుల్లో చాలామంది స్వతంత్రత కోల్పోయి, రాజకీయ పార్టీలకు దగ్గరవుతున్నారనే భావన. ఉద్యమ సమయంలో అధికారాన్ని ప్రశ్నించిన వారు, ఇప్పుడు అధికారానికి అనుగుణంగా మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మౌనం, అదే ప్రభుత్వం మారిన తర్వాత గట్టిగా విమర్శలు చేయడం -ఈ ద్వంద్వ వైఖరి ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది కేవలం వ్యక్తుల వైఫల్యం కాదు -వ్యవస్థలో జరిగిన మార్పుల ప్రతిబింబం కూడా. ఉద్యమ కాలంలో విమర్శకులుగా, మార్గదర్శకులుగా ఉన్న మేధావులు, రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవస్థలో భాగస్వాములుగా మారారు. కొందరు నిజంగా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యవస్థలోకి వెళ్లినా, అధికారానికి దగ్గరయ్యాక స్వతంత్ర స్వరం బలహీనపడింది. మరికొందరు గుర్తింపు, నామినేటెడ్ పదవులు, ఆర్థిక లాభాల కోసం తమ వైఖరిని మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఒక పెద్ద నైతిక సంక్షోభం. మేధావి అనే పదానికి ఉన్న గౌరవం, బాధ్యత, సామాజిక కర్తవ్య భావన. ఇవి అన్నీ బలహీనపడుతున్నాయి. ఒక మేధావి తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలను ముందుకు పెట్టాలి. కానీ ప్రస్తుతం కొంతమంది వద్ద ఈ సమతుల్యత కనిపించడం లేదు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజా ఉద్యమాల బలహీనత. ఇక మరో ముఖ్యమైన అంశం-ప్రజా ఉద్యమాల బలహీనత. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన ఈ కాలంలో ప్రతి సమస్య ఒక డిబేట్‌గా మారుతోంది.కానీ అది మూవ్‌మెంట్‌గా మారడం లేదు. ఆన్‌లైన్ చర్చలు ఎక్కువగా ఉన్నా, ఆఫ్‌లైన్‌లో ప్రజలను సంఘటితం చేయడం లోపిస్తోంది. దీని వల్ల మేధావుల స్వరం కూడా ప్రభావం కోల్పోతోంది. కులాలు, వర్గాలు, మతాల ఆధారంగా సమాజంలో విభజనలు పెరగడం కూడా మరో పెద్ద సమస్య. ఒకే సమస్యపై కూడా ప్రజలు ఏకమవ్వలేకపోతున్నారు. ఈ విభజనల మధ్య మేధావులు కూడా తమ తమ వర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నారనే భావన కలుగుతోంది. ఫలితంగా సమాజాన్ని ఒకే దిశగా నడిపించే శక్తి బలహీనపడుతోంది. సంఘటిత శక్తి లోపిస్తుందా? అయితే పూర్తిగా మౌనం కూడా లేదు. కొంతమంది అకడమిక్‌లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు వివిధ అంశాలపై స్పందిస్తున్నారు. కోర్టుల్లో, పబ్లిక్ డిబేట్స్‌లో, స్వతంత్ర వేదికలలో తమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు విస్తృత ప్రజా ఉద్యమాలుగా మారడం లేదు. కారణం -సంఘటిత శక్తి లోపం, ప్రజల మద్దతు కొరత, కొన్నిసార్లు భయాలు. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతుంది: మేధావులు ప్రజల కోసం నిలబడకపోతే, మరి ఎవరు నిలబడాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క వర్గంతో రాదు. మేధావులు స్వతంత్రంగా నిలబడాలి. అదే సమయంలో ప్రజలు కూడా వారికి మద్దతు ఇవ్వాలి. విమర్శకులను పార్టీ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్టితో చూడాలి. మేధావులను ప్రోత్సహించాలి, రక్షించాలి. తెలంగాణ ఉద్యమం గొప్ప పాఠ్యం నేర్పింది తెలంగాణ ఉద్యమం మనకు ఒక గొప్ప పాఠం నేర్పింది. -సంఘటిత ప్రజాశక్తి ఏదైనా సాధించగలదు. అదే స్ఫూర్తి ఇప్పుడు మళ్లీ అవసరం. మేధావులు తమ పాత్రను తిరిగి నిర్వచించుకోవాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికలుగా మారాలి. కేవలం విమర్శలతో కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను సూచించాలి. ప్రజలు కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. సమస్యలపై స్పందించాలి. చర్చలను చర్యలుగా మార్చాలి. విభజనలను పక్కన పెట్టి సామాన్య ప్రయోజనాల కోసం ఏకమవ్వాలి. లేకపోతే, మేధావి అనే పదం కేవలం ఒక గుర్తింపుగా మిగిలిపోతుంది. సమాజాన్ని మార్గనిర్దేశం చేసే శక్తిగా కాదు, వ్యక్తిగత ప్రయోజనాల సాధనంగా మారిపోతుంది. ఇప్పుడు అయినా ఒక ఆత్మపరిశీలన అవసరం - మేధావులు తమ బాధ్యతను గుర్తించాలి. ప్రజలు తమ శక్తిని గుర్తించాలి. ఈ రెండూ కలిసినప్పుడే తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుంది. సిహెచ్ వి ప్రభాకర్ రావు 9391533339

మన తెలంగాణ 19 Apr 2026 5:30 am

బిల్లు ముసుగులో బిజెపి కుట్రలు

మన తెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం చట్టాల ఓటమి కాదని, అది మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి జరిగిన ఓటమి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్ల పెంపు (డీలిమిటేషన్), రిజర్వేషన్ల రద్దు వంటి ప్రయత్నాలను ప్రతిపక్షాలు కలిసికట్టుగా అ డ్డుకున్నాయని, ఇది బిజెపి అహంకారానికి చెంపపెట్టు అ ని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఓడిపోయింది మోడీ అహంకారం తప్ప మరొకటి కాదన్నారు. మహిళా రిజర్వేషన్‌లపై కాంగ్రెస్, బిజెపి చిత్తశుద్ది ఏమిటో తేల్చుకుందామని సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయన్నారు.2009లో డీలిమిటేషన్ జరిగిందని, ఆ లెక్కలతో ఆగష్టు 15, 2026 లోపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించవచ్చని సిఎం అన్నారు. ఆ రిజర్వేషన్లతో ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చన్నారు. ఆ విధంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే తెలంగాణ సిఎంగా తాను బాధ్యత తీసుకొని దక్షిణాది రాష్ట్రాల సిఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సిఎం రంగసా మిలతో చర్చలు జరుపుతానని, ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతారని ఆయన చెప్పారు. 2023లో పాస్ అయిన బిల్లులో సవరణలు చేయాలనుకుంటే ఒక చిన్న మార్పుతో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, బిజెపి ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు ఎత్తివేయడమేనని, పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ తీరును 140 కోట్ల మంది దేశ ప్రజలు చూశారని ఆయన తెలిపారు. మాకు గంట సమయం ఇస్తే బిల్లును మార్చేస్తా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శనివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లోనే ప్రజలు బిజెపి కుట్రలను ఓడించారని, ఇప్పుడైనా పంతాలకు పోకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్, సమగ్రతను బలహీనపర్చేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకువచ్చిందని దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లునేని మరేం కాదన్నారు. ప్రతిపక్షాలు నిలువరించింది, ఓడించింది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్నేనని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బిల్లుల విషయంలో బిజెపి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నిజాయితీ లేదని సిఎం విమర్శించారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసిందన్నారు. తమకు గంట సమయం ఇస్తే బిల్లును మార్చివేస్తామని అమిత్ షా అన్నారని సోమవారం వరకు సమయం ఉందని, ప్రస్తుతం ఉన్న 543 సీట్లతోనే బిజెపి మహిళా బిల్లు తీసుకువస్తే మంగళవారం పాస్ చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల ఎత్తివేయాలంటే బిజెపికి 2/3 వంతుల మెజార్టీ మూడొంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేయాలని అన్ని వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని బిజెపి భావిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకే చార్ సౌ పార్ (400 సీట్లకు మించి) నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్లారన్నారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ మార్పుతో పాటు, రిజర్వేషన్లు తొలగించాలని బిజెపి భావించిందన్నారు. ప్రజలు జాగృతమై 240 సీట్లకే బిజెపిని పరిమితం చేశారని, రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేయాలంటే బిజెపికి 2/3 వంతుల మెజారిటీ కావాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు బిల్లుల ముసుగులో రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బిజెపి మరోసారి చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు కలిసి ఓడించాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నాటికి కొత్త చట్టాలను రూపొందించాలి ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్‌లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమితో కలిపి 2023 మాదిరిగా ఆ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని, సోమవారం బిల్ పాస్ చేసుకొని మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని సిఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని, నిపుణు లతో చర్చించాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాలని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చని సిఎం అన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతానంటే దేశ ప్రజలు ఒప్పుకోరని, దీంతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మేం యోచిస్తే దానిని కాంగ్రెస్ అడ్డుకుందని తమను బద్నాం చేసే పనిలో మోడీ, బిజెపిలు ఉన్నాయని సిఎం విమర్శించారు. అందులో భాగంగానే ఆందోళనలు చేపట్టారన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్తశుద్ది చాటుకోవాలని, సరైన పద్ధతిలో బిల్లులు తయారు చేయాలని సిఎం సూచించారు. కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత ప్రజలు, చివరగా పార్టీ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ, బిజెపికి మాత్రం తొలుత పార్టీ, తర్వాత సొంత విషయాలు, ఆ తర్వాతే దేశమని సిఎం విమర్శించారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేనని దేశంలోనే దక్షిణాది ప్రజలు బతుకుతున్నారని, దేశ సేవలో తాము ఎవరికన్నా తక్కువ కాదని, దేశాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా డీలిమిటేషన్ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా డీలిమిటేషన్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందన్నారు. దేశానికి విధేయంగా వ్యవహారించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి జరిమానా విధిస్తామనడం ఏవిధంగా సరైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తల్లిని చంపి, బిడ్డను రక్షించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర విభజనపై పలుమార్లు ద్వేషం చూపారని ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపి తేజస్వీ సూర్య పయనిస్తున్నారని సిఎం మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపి లక్ష్మణ్ మోడీ దృష్టిని ఆకర్షించి ప్రమోషన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే తప్ప ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాను సూచించిన విధానం కిషన్ రెడ్డికి నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలే తప్ప ఎదురుదాడి చేయడమేమిటని సిఎం ప్రశ్నించారు. స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్‌కు మహిళా అధ్యక్షులు... మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఓటు హక్కు కోసం మహిళలు 150 సంవత్సరాలు పోరాడారని, కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేననన్నారు. దేశానికి మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కాంగ్రెస్ అందించిందని, లోక్‌సభ స్పీకర్‌గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్ పార్టీ చేసిందని సిఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్య్రానికి పూర్వమే మహిళలు అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, స్వాతాంత్య్రనంతరం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షులుగా సేవలందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియా గాంధీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పని చేశారని సిఎం తెలిపారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఫలితమే ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం 50 శాతానికి చేరుకుందన్నారు. 1980లో ఏర్పడిన బిజెపికి ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరూ కూడా మహిళ లేరని సిఎం తెలిపారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లు రెండు మూడు సార్లు అధ్యక్షులయ్యారని, కానీ, ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదన్నారు. అలాంటి బిజెపి మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తుందని సిఎం ప్రశ్నించారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు ? బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదని సిఎం రేవుంత్ రెడ్డి అన్నారు. బీహార్ మాజీ సిఎం నితీశ్ కుమార్, మహారాష్ట్ర మాజీ సిఎం ఏక్ నాథ్ షిండే పరిస్థితి చూస్తునే ఉన్నామని, భవిష్యత్‌లో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలో బిజెపికి సీట్లు తక్కువగా ఉన్నాయని అందుకే టిడిపికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. భవిష్యత్‌లో బిజెపి బలం పెరిగితే టిడిపిని పక్కన పెడతారన్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికేనని వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని ఆయన తెలిపారు. 2/3 మెజారిటి వచ్చినంత మాత్రాన అన్నీ చట్టాలు చేయలేమని, 2/3 మెజారిటీ ఉందని ప్రధానిగా ఉన్న వ్యక్తి తానే రాజునని చట్టం చేసుకుంటే కుదురుతుందా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎపిలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని, తానే రాజునని చంద్రబాబు చట్టం తెస్తే ఒప్పుకుంటారా? డిక్టేటర్ షిప్‌ని ఎవరూ అంగీకరించరన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని సిఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపిలు డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్‌లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 19 Apr 2026 5:00 am

జగిత్యాల నుంచే జైత్రయాత్ర

మన తెలంగాణ/ జగిత్యాల ప్రతినిధి: జగిత్యా ల పోరాటాల పురిటిగడ్డ అని, జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభిస్తామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆ ర్ అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏ ర్పాట్లను సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి త న్నీరు హరీష్‌రావుతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆ యనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల  సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు.కేసీఆర్ అనే సింహం బయటకు వస్తుందంటే గుంట నక్కల గుండెల్లో దడ పుట్టడం మొదలైందన్నారు. కేసీఆర్ సభ సక్సెస్ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని, కేసీఆర్ సభను డైవర్ట్ చేసేందుకే సీఎం రేవంత్ అదే రోజు మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారన్నారు. గత రెండున్నరేండ్లుగా మేడిగడ్డ వైపు కన్నెత్తి కూడా చూడని రేవంత్‌రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకొని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే, కోరుట్ల మార్గం నుంచి జగిత్యాల సభకు జనం రాకుండా అడ్డుకునేందుకు రోడ్డును తవ్వి వంతెన నిర్మాణ పనులు చేపట్టడం శోచనీయమన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఏ బ్రీడో తెలియడం లేదని, విలేకరుల సమావేశంలో నేను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకొంటూ కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చుంటున్నాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. రెండున్నరేండ్ల రేవంత్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని, ఇచ్చిన హామీలన్నీ గాలికివదిలేశారని విమర్శించారు. రేవంత్‌రెడ్డిది అట్టర్‌ఫ్లాప్ పాలన అని రాష్ట్ర ప్రజలంతా గొంతెత్తి చెప్తున్నారన్నారు. కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిని నియమించామని, వారంతా ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించి జనం సభకు తరలివచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 20న సాయంత్రం 5.30 గంటల వరకు కేసీఆర్ సభా స్థలికి చేరుకుంటారని, గంట పావు సేపు సభ జరుగుతుందన్నారు. సభకు వచ్చే జనానికి దాహార్తి తీర్చేందుకు మూడు లక్షల నీళ్ల సీసాలు, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోకుండా సభ విజయవంతం కోసం కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సుంకె రవిశంకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు కె.విద్యాసాగర్‌రావు, తుల ఉమ, దావ వసంత తదితరులున్నారు.

మన తెలంగాణ 19 Apr 2026 4:30 am

వేసవి తరువాతే పరిషత్ ఎన్నికలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవి కాలం ముగిశాకే జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగవచ్చని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. పలు కీలక అంశాలపై ఆయన స్పందిస్తూ ఎన్నికలు ఈ సమ్మర్ అయ్యా కే ఉండే అవకాశం ఉందని, కేబినెట్ విస్తరణపై చ ర్చ ఉందని విడతల వారీగా జరుగుతుందని ఆ యన తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయ న్న విషయమై ఆయన మాట్లాడుతూ ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని, అయితే, ఆయా శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమని ఆయన అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం త్వరలోనే ఉండబోతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మార్కెట్ వాల్యూ.. రాష్ట్రంలో త్వరలోనే భూముల విలువ పెరగనుందని ఈ మేరకు కసరత్తు జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూముల మార్కెట్ వ్యాల్యూ పెంచలేదన్నారు. ధరణి సమస్యలు భూ-భారతితో పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్‌ల సమయంలో మ్యాప్‌ను జతపరచడం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. మ్యాప్‌తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతుందని రెవెన్యూలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామని ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. నాలుగు రకాల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని ఆయన తెలిపారు. నాకు మంత్రులు మద్ధతుగా నిలిచారు.. అసెంబ్లీలో తనపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రతిపక్షం ట్రాప్‌లో తాను పడనని అందుకే ఎంత విమర్శించినా ఓపికగా ఉండి సమాధానం చెప్పానని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల జాబితా తయారవుతోందని సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయని మంత్రి హెచ్చరించారు.

మన తెలంగాణ 19 Apr 2026 4:00 am

ఎల్లుండి రైతు భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ఈనెల 20న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో 20న జరి గే బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులను రైతుల ఖాతా ల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.50కోట్ల ఎకరాలకు ‘రైతు భరోసా’ కింద ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఈ నిధులు జమ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడతగా ఒక్కో ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. మొదటి విడతలో దాదాపు రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో 45.11 లక్షల మందికి లబ్ధి రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకోనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. దీంతో రూ.5,653 కోట్లు రెండవ విడత రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి మాత్రమే సాయం అందించగా, రెండో విడతలో మిగిలిన భూమికి అర్హత మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం, మూడో విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గి సకాలంలో సాగు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో పారదర్శకత ఉంటోందని అధికారులు చెబుతున్నారు.

మన తెలంగాణ 19 Apr 2026 3:30 am

అటు వర్షం.. ఇటు వడగాలులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మండుతున్న ఎండల నుంచి కొంత ఉపశమనం ల భించనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే నాలుగు రోజులు పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఉపరితల చక్రవాక ఆవర్తనం, ద్రో ణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెపుతున్నారు. అయితే వర్షాలు కురిసినా పలు జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణలో వడగాలులు వీస్తున్నాయని దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబా ద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 3040 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జి ల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో 3రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా శనివారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5, జగిత్యాల జిల్లా ఎండపల్లి, నిర్మాల్ జిల్లా ఖానాపూర్‌లో 44.4 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సూర్యుడి ఎండ వేడిమికి కొంత విరామం లభించింది. శనివారం సాయంత్రం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. జయశర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో పెద్ద అంబర్‌పేట్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం నుంచే నగరంలో ఆకా శం మేఘావృతమయి చల్లబడింది. రాష్ట్రంలో మార్చి చివరి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రస్తుతం సా ధారణం కంటే మూడు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావర ణ శాఖ తెలిపింది. ఏప్రిల్ మొదటి వారంలో రా ష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆ తర్వాత ఎండలు మళ్లీ తీవ్రరూపం దాల్చా యి. ఏప్రిల్ చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత గా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఎల్ నినో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 0.51 డిగ్రీ మేర పెరగడంతో ఎల్ నినో ప్రభావం ఏర్పడిందని, దీని కారణంగా దక్షిణ భారతదేశంపై ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం తగ్గే అవకాశం ఉంది.

మన తెలంగాణ 19 Apr 2026 3:00 am

నాచారం లోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం

నాచారం పారిశ్రామిక వాడలోనీ డ్యూరో ఫెక్స్ పరుపుల కంపెనీలో శనివారం రాత్రి  భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద పేలుడు శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.  మంటలను గమనించిన స్థానికులు పోలీసులకి,అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు, రెండు ఫైర్ ఇంజన్ల తో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.నాచారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, డ్యూరుఫ్లెక్ పరుపుల కంపెనీ లో అగ్ని ప్రమాదం కాదు, అందులో ఉన్న మరో కంపెనీ హైదరాబాద్ టెంట్ హౌస్ అను గోదాం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది అని తెలిపారు. నాచారం ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం. డ్యూరో ఫెక్స్ పరుపుల కంపెనీలో ఉన్న టెంట్ గోదాం లో అగ్ని ప్రమాదం జరగడం తో మంటలు వ్యాపించినట్టు తెలిపారు. అందులో ఉన్న కుర్చీలు, టెంట్ బట్టలకు మంటలు పెద్ద ఎత్తున అంటుకోవడం తో ప్రమాదం జరిగింది అని, ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలిపారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 19 Apr 2026 12:40 am

అందరికీ చేరువయ్యే కథనంతో ‘రేజర్’.. ట్రైలర్ విడుదల

కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లై యింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవి బాబు ఒక డాగ్ గ్రూమర్‌గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్ ని కొనసాగిస్తూ, ఈసారి అందరికీ చేరువయ్యే కథనంతో ముందుకొచ్చారు. 

మన తెలంగాణ 19 Apr 2026 12:30 am

పాక్ హెడ్ కోచ్‌గా సర్ఫరాజ్ అహ్మద్

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును గాడిలో పెట్టేందుకు కీలక చర్య లు చేపట్టింది. ప్రపంచ క్రికెట్‌లో వరుసగా విఫలమవుతున్న జట్టును పటిష్టం చేసేందుకు ప్రణాళికను రూ పొందించిం ది. అందులో భాగంగా శనివారం కొత్త కోచ్‌లను నియమించుకుం ది. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూనియార్ స్థాయిలో కోచ్ గా సక్సెస్ అయిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రదాన కోచ్‌గా ఎంపిక చేయగా.. బౌలింగ్ కోచ్‌గా పేసర్ ఉమ మ్ గుల్, బ్యాటింగ్ కోచ్‌గా అసద్ ఫసిక్‌లకు బాధ్యలను ఒప్పజెప్పింది. కాగా, పాకిస్థాన్ జట్టు వచ్చే నెలలో బంగ్లాతో రెండు మ్యాచ్ టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో బంగ్లా పర్యలనలోనే జట్టును గాడిలో పడేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మన తెలంగాణ 18 Apr 2026 11:57 pm

జూన్‌లో తెలంగాణ టి20 లీగ్

టెండర్లు ఆహ్వానించిన హెచ్‌సిఎ హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సిఎ) కీలక ముందడుగు వేసింది. ఐపిఎల్ తరహాలో తెలంగాణ టి20 లీగ్ ఎడిషన్ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ లీగ్ నిర్వహణకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. మొదట 5 ఏళ్ల పాటు జట్టు యాజమాన్య హక్కులు ఉంటాయని, ఆ తరువాత మూడేళ్లకోసారి రిన్యూవల్ చేసుకోవాలని తెలిపింది హెచ్‌సిఎ. జట్టు బిడ్ ధర రూ.3 కోట్లుగా నిర్ణయించారు. ఆటగాళ్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు, వసతి, జెర్సీలు, ప్రయాణ ఖర్చులు సయితం ఫ్రాంచెజీలే భరించాలని, జట్టు కోనుగోలు చేసేందకు ఆసక్తి ఫ్రాంచైజీలకు ఈనెల 28వ తేదీలోపు టెండర్ పత్రాలు సమర్పించాలని స్పష్టం చేసింది. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ లీగ్‌కు ఈనెల 30న షార్ట్‌లిస్ట్ చేసి, ఫ్రాంచైజీలను ప్రకటించనున్నట్టు పేర్కోంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ టోర్నీలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జట్లుగా ప్రకటించారు. 21 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో ఉప్పల్ వేదికగా 32 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 11:53 pm

ఉత్కంఠ పోరులో చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం

ఉప్పల్ స్టేడయంలో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే, చివర్లో హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో తిరిగి పట్టు సాధించింది. ఈక్రమంలో విజయం కోసం ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు ఆడటంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో చివరి ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో చెన్నైపై హైదరాబాద్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

మన తెలంగాణ 18 Apr 2026 11:42 pm

రాజేంద్రనగర్ ఆర్‌డిఓకు ఆరు నెలల జైలు

అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు భూమి విచారణ చేపట్టిన ఆర్డీఓ తీర్పు వెల్లడించకపోవడం పట్ల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీలింగ్‌లో లేని భూమిలో హక్కుదారులను వెలువరచకపోవడంతో రెవెన్యూ డివిజనల్ అధికారి నిర్లక్ష్య వైఖరిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణగా పరిగణించి ఆర్డీఓ వెంకట్‌రెడ్డికి నెల రోజుల జైలుశిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించింది. అయితే అప్పీలు నిమిత్తం తీర్పు అమలును రెండు వారాలు వాయిదావేశారు. వివరాల్లోకి వెళ్తే... రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సుమారు 74 ఎకరాల పైచిలుకు భూమి సీలింగ్‌లో ఉన్నట్లు చూపారు. దాంతో సదరు భూమి హక్కుదారు మహ్మద్ యూసఫుద్దీన్ భూ సంస్కరణల అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా 2017లో కోర్టు రాజేంద్రనగర్ భూ సంస్కరణల అధీకృత అధికారి (ఆర్డీవో)ను విచారించాలని ఆదేశించింది. దాంతో విచారణ చేపట్టిన ఆర్డీవో తీర్పును వెలువరుచకపోవడంతో కోర్టు ఆరు వారాలలో తీర్పు వెలువరుచాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను ఆర్డీవో ఖాతరు చేయలేదు. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది. ఆర్డీవో వెంకట్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేస్తూ ఈ వివాదాన్ని మరో అధికారికి కేటాయించాలని జిల్లా కలెక్టరును ఆదేశించింది. కాగా, అప్పీలు నిమిత్తం తీర్పు అమలును రెండు వారాలు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే రాజేంద్రనగర్ ఆర్డీవో శనివారం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా, పెద్దషాపూర్ పరిధిలోని 74 ఎకరాల పైచిలుకు భూమి ప్రస్తుతం చాలా విలువైనదిగా స్థానికుల ద్వారా తెలిసింది. పాలమాకుల నుంచి పెద్ద గోల్కోండ ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లే రేడియల్ రోడ్డు ఇరువైపులా చిన్నజీయర్ ఆశ్రమం ఉన్నదని, దానిన తర్వాత ఉండే ఈ భూములున్నాయని తెలిసింది.

మన తెలంగాణ 18 Apr 2026 11:23 pm