అమెరికా ఇరాన్ మధ్య రెండవ విడత చర్చలంటూ జరిగితే ఈసారైనా ఒక రాజీ అంటూ జరిగేనా? ఎవరూ చెప్పలేరు. చర్చలు ఎపుడు జరగవచ్చు? ప్రస్తుత సూచనలను బట్టి బహుశా వచ్చే వారం. మొదటి చర్చలు 12న విఫల మైన తర్వాత రెండు రోజులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనంతట తానే తిరిగి చర్చలు ‘రెండు మూడు రోజుల్లో’, మళ్లీ ఇస్లామాబాద్లోనే అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇటువంటి తీవ్రమైన విషయమై దౌత్య చర్చలు మొదటి విడతలోనే ఒక కొలిక్కి రావటం జరగదు. ఒకోసారయితే నెలలు, సంవత్సరాల తరబడి చర్చలు సాగుతూనే ఉంటాయి. ప్రస్తుత యుద్ధంలో ఇమిడి ఉన్న అంశాలు చాలా తీవ్రమైనవి. వాటికి దశాబ్దాల నేపథ్యం ఉందన్నది తెలిసిందే. అమెరికా ఇరాన్ల మధ్య సమస్య ఇరాన్ ప్రధానమంత్రి మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికన్ సిఐఎ, బ్రిటిష్ ఎంఐ6 లు కలిసి అక్కడి చమురు కోసం 1953లో కూలదోయటం నుంచి మొదలై పలు కారణాలతో, పలు రూపాలలో నేటికీ కొనసాగుతున్నది. పశ్చిమాసియా అంతటా తనదే ఆధిపత్యం కావాలని, గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడాలని, స్వతంత్ర పాలస్తీ ఎన్నటికీ ఏర్పడరాదని, ఈ లక్షాల కోసం ఇరాన్ విచ్ఛన్నం కావాలని కోరుకునే ఇజ్రాయెల్ అందుకు తోడైంది. ఇరుపక్షాల వివాదానికి మధ్యలో ఇరాన్ అణుపరిశోధనల వివాదం వచ్చి చేరింది. ఈ మౌలికమైన చిక్కుముళ్లు తేలకుండా, తన స్వాతంత్య్రానికి, సార్వభౌమతకు, అంతర్జాతీయ హక్కుల పరిరక్షణలు భరోసా అన్నది ఇరాన్కు లభించకుండా ఎన్ని విడతల చర్చలు జరిగినా సమస్య తేలుతుందా అన్నది ప్రశ్న. ఎంతో కొంత కాలం కాల్పుల విరమణలు ఏవో కొన్ని రాజీలు కుదరటం వేరు, శాశ్వత మైన పరిష్కారాలు వేరు. మొదటి విడత చర్చలకు ముందు, ఇపుడు రెండవ విడత చర్చలు జరగనుండగా కూడా అమెరికా కోరుకుంటున్నది తాత్కాలిక విరామాలను మాత్రమే. అంతేతప్ప తన ఆధిపత్య ఆలోచనలను వదలుకునే లక్షణాలు చూపటం లేదు. ఇరాన్ మాత్రమే ప్రతిసారి కేవలం కాల్పుల విరమణలు కాదు, శాశ్వత పరిష్కారాలు అవసరమని, తాత్కాలికాల వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేస్తున్నది. ఈ పరిస్థితి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ ఉభయుల మధ్య వివాదంలో ఇతర అంశాలు ఎట్లున్నా, నాటో సైనిక కూటమిలో ఉక్రెయిన్ చేరకపోవటం తమకు అన్నిటికన్న ప్రధానమని, అందుకు ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, నాటో కూటమి, అమెరికా హామీ ఇస్తే అపుడు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, అట్లాగాక స్వల్పకాలిక యుద్ధ విరమణల వల్ల ఉపయోగమేమిటని రష్యా ప్రశ్నిస్తున్నది. ఇరాన్ వైఖరి కూడా అటువంటిదే. కాని అమెరికా ఆ జోలికి వెళ్లకుండా, తాత్కాలికమైన వేవో చేసి, ఇరాన్ను రకరకాలుగా ఒత్తిడి చేస్తూ, తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనజూస్తున్నది. ఇజ్రాయెల్ గురించి అయితే చెప్పనక్కర లేదు. వారికి అసలు తాత్కాలిక విరమణలు గాని, అరకొర పరిష్కారాలు గాని సరిపడవు. ఏదో విధంగా అమెరికాను ఉపయోగించుకుంటూ ఇరాన్ను ఛిన్నాభిన్నం చేయటమే వారికి కావలసింది. ఈ మాట ఇతరులు అంచనా వేయనక్కర లేకుండా స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తరచు బహిరంగంగానే అంటుంటారు. ఇది ఇటీవలనే రెండుసార్లు రుజువైంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు అమెరికా ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదరనుండగా దానిని భంగపరచేందుకు ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. మొన్న మొదటి విడత చర్చలకు గల షరతులలో లెబనాన్ పై కూడా దాడుల విరమణ అన్నది ఒకటి కాగా, అందుకు పాకిస్థాన్ ద్వారా మొదట ఒప్పుకుని అంతలోనే ఉల్లఘించటం మొదలుపెట్టారు. అదేమిటని ఇరాన్ ప్రశ్నించగా, కాల్పుల విరమణ ఒప్పందంలోకి లెబనాన్ రాదని ఇజ్రాయెల్ ఆ తర్వాత ట్రంప్ వాదించారు. అక్కడ కూడా విరమణ జరిగితే తప్ప తాము చర్చలలో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేయటంతో, లెబనాన్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని అపుడన్నారు. అవి ఎక్కడ తేలేదీ, తేలనిదీ చెప్పలేమన్నది అట్లుంచితే, మొత్తం మీద చర్చలు, పరిష్కారాలపట్ల ఎవరి వైఖరి ఏమిటన్నది ఈ వివరణలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదటి విడత వైఫల్యం తర్వాత కూడా అమెరికా అధ్యక్షుని తీరు ఎంతమాత్రం మారలేదు. ప్రతిసారీ ఒకవైపు చర్చలు, మధ్యలోనే దాడులు అనే కనీవినీ ఎరుగని ధూర్తమైన దౌత్యాన్ని ప్రదర్శించే ఆయన, ఈసారి చర్చలు ముగిసినాక రెండవసారి చర్చలని అంటూనే హర్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని ప్రకటించారు. ఆ విధంగా ఇరాన్ ఒత్తిడికి లోనై లొంగిపోతుందని తన అంచనా అనుకోవాలి. కాని ఏమైంది? ఒకవైపు ఇరాన్ ముప్పు, మరొక వైపు అమెరికా ముప్పుతో రవాణా స్తంభించిపోయింది. ఇరాన్ రేవుల నుంచి రవాణా తగ్గింది గాని పూర్తిగా ఆగలేదు. వారు ఇతర ప్రత్యామ్నాయాల కనిపెట్టారు. నిత్యావసర సరకుల రవాణా చైనాలోని శియాన్ నగరం నుంచి మధ్య ఆసియా మీదుగా రైలు మార్గంలో మొదలైంది. హర్మూజ్లో కుడి వైపున ఇరాన్ రేవులు పెద్దవి మూడు మాత్రమే ఉండగా, ఎడమ వైపున అమెరికా మిత్రులైన గల్ఫ్ రాజ్యాలవి తొమ్మిది ఉన్నాయి. అమెరికా దిగ్బంధంతో ఎవరికి ఎక్కువ నష్టం? అందుకే వెంటనే సౌదీ అరేబియా దిగ్భంధం తగదని అమెరికాను హెచ్చరించింది. విషయం అంతటితో ఆగలేదు. యుద్ధం మొదలైన తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మొదటిసారిగా మాట్లాడుతూ, ఇరాన్తో తమ వాణిష్య సంబంధాలు తామిద్దరి స్వేచ్ఛ తప్ప, అందులో దిగ్భంధనాల ద్వారా జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసారు. దానితో దిగివచ్చిన ట్రంప్, చైనా నౌకలపై ఏ ఆంక్షలు లేవన్నారు. నిజానికి చైనా నౌకలు అప్పటికే యథేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి. స్వయంగా ఇరాన్ కూడా, మొదటి విడత చర్చల సమయానికే తనంతట తానుగా ఇండియా, ఫ్రాన్స్ సహా పలు దేశాలుపై ఆంక్షలు ఎత్తివేయటం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్తో సహకరిస్తున్న వారిపై మాత్రమై ఆంక్షలు ఉంటాయన్నది. ఇపుడు రెండవ విడతకు ముందు అమెరికా హర్మూజ్ను దిగ్భంధించగా, అందుకు ప్రతిగా తాము, హూతీలు కలిసి పర్షియన్ గల్ఫ్తోపాటు బాబ్ అల్ మెందర్, ఎర్ర సముద్రాలను మూసివేయగలమని హెచ్చరించింది. హర్మూజ్ మూసివేత వల్లనే ఇంతటి కల్లోలం ఏర్పడి 20 శాతం రవాణా స్తంభించగా, తక్కిన రెండు చోట్ల కూడా అది జరిగితే 35 శాతం వరకు ఆగి ఇక ఏమి జరిగేదీ ఎవరైనా ఉహించవచ్చు. ఈ నేపథ్య వివరాలన్నీ ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, కనీసం రెండవ విడత నాటికైనా అమెరికా అధ్యక్షునికి వివేకం కలుగుతుందా? నెతన్యాహూ ప్రభావం నుంచి కొంతైనా బయటపడగలరా అన్నది ఈ పరిస్థితులను బట్టి వేచిచూడవలసి ఉంటుంది. మొదటి విడత వైఫల్యం తర్వాత ట్రంప్ అన్నది, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల తయారీపై తప్ప అన్ని అంశాలపై అంగీకారం కుదిరినట్లేనని. వాస్తవానికి అది కూడా ఒక సమస్య కానేకాదని ప్రపంచానికంతా తెలుసు. ట్రంప్, నెతన్యాహూలకు కూడా తెలుసుగాని, ఇతర లక్షాల కోసం దానిని ఒక సాకుగా ముందుకు తెస్తున్నారు. శాంతియుత అవసరాల కోసం అణు శుద్ధి హక్కు, అంతర్జాతీయ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పిటి)పై సంతకం దారుగా ఇరాన్కు చట్టబద్ధంగా లభించింది. అణ్వస్త్ర తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం కాగా, వారు 60 శాతాన్ని ఎప్పుడూ మించలేదు. వారి అణు కేంద్రాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు తరచు తనిఖీ చేస్తూనే ఉన్నారు. తాము అణ్వస్త్రాలు తయారు చేయబోమని అయతొల్లా ఒకటికి రెండుసార్లు ఫత్వా సైతం జారీ చేసారు. అయినా స్వయంగా అణ్వస్త్రాలు గల అమెరికా, ఇజ్రాయెల్లు ఈ విధంగా ప్రవర్తిస్తున్న స్థితిలో, రెండవ విడత చర్చలలో రాగల షరతులేమిటో, కుదరగల రాజీలేమిటో, అంతా దైవాధీనం అన్నట్లుగా తయారయింది పరిస్థితి. - టంకశాల అశోక్ (దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు
నేడు జగిత్యాలకు కేటీఆర్, హరీష్ రావు
నేడు జగిత్యాలకు కేటీఆర్, హరీష్ రావు బయలుదేరి వెళుతున్నారు
Rashmika trains eight hours non-stop for Mysaa
Rashmika Mandanna is leaving no stone unturned for her highly anticipated action thriller, Mysaa. The actress has flown to Bangkok and is currently undergoing intense martial arts and stunt training. Working closely with the renowned Jaika Stunt Team, she is dedicating a grueling eight hours every day to perfect her combat skills and hand-to-hand techniques. […] The post Rashmika trains eight hours non-stop for Mysaa appeared first on Telugu360 .
హైదరాబాద్: హోరాహోరీగా సాగుతోన్న ఐపీఎల్ పోటీల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. జోరుమీదున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస విజయాలతో ఫామ్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయిదు మ్యాచ్ల్లో రెండేసి విజయాలతో ఒకే స్థితిలో ఉన్న ఈ జట్ల మధ్య పోరుకు శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. గాయం కారణంగా తొలి అయిదు మ్యాచ్ల్లో ఆడని చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తి […] The post ధోని ఈరోజైనా దిగుతాడా? appeared first on Visalaandhra .
Revanth Reddy : ఓల్డ్ ఫ్రెండ్స్ తో తెలంగాణ సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన పాత మిత్రులను కలుసుకున్నారు
గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన నాబార్డ్ అధికారులు
మంథని, ( జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ శివారులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.40 కోట్ల వ్యయంతో పిఎం కుసుమ్ …
ఆంధ్ర నేతల ఢిల్లీ విధేయత సంక్షోభానికి సంకేతం
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి, పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ సవరణ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి విధేయత చూపుతూ, దక్షిణ భారత రాష్ట్రాల సహకారాన్ని విరమించుకోవడం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఉన్న లోతైన నైతిక సంక్షోభాన్ని సూచిస్తోంది. వివిధ చర్యలు, లోపాల ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధాంతపరంగా బలహీనంగా మారి, ఢిల్లీ దర్బార్ ముందు వినయపూర్వకంగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల తరువాత, పార్లమెంట్లో పూర్తి మెజారిటీ కోల్పోయిన బిజెపి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ మూడు పార్టీలు వివిధ అంశాలపై బిజెపికి మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే, జనాభా, ఆర్థిక పరంగా మెరుగైన ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై పార్లమెంటరీ శక్తి సమతౌల్యాన్ని దెబ్బతీయాలనే ప్రతిపాదనపై ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి విడిపోయి తీసుకున్న నిర్ణయం రాజకీయ విధేయతకు మించిన సేవాభావాన్ని సూచించే చర్యగా భావించాల్సి వస్తోంది. విచిత్రంగా, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ‘తెలుగువాడి ఆత్మగౌరవం’ అనే భావనపై ఆవిర్భవించాయి. టిడిపి స్థాపకుడు ఎన్.టి. రామారావు ‘కేంద్రం అనేది ఒక భావనాత్మక మిథ్’ అని పేర్కొంటూ, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమలు చేసిన అధికార కేంద్రీకరణ విధానాన్ని సవాలు చేశారు. ఆయన ఒత్తిడితో కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా, జగన్ మోహన్రెడ్డి తన తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ ఆధారిత వర్గం తన కుటుంబంపట్ల ఎలా ప్రవర్తించిందనే విషయంపై నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ‘ఆత్మగౌరవం’ అనే భావనతో రాజకీయంగా ఎదిగిన నాయకులకు, తెలుగువారిలో పెద్దగా ప్రాధాన్యం లేని ఒక జాతీయ పార్టీ నాయకత్వానికి లొంగిపోవాల్సిన పరిస్థితి నిజం గా అవమానకరంగా మారింది. రాజకీయ ప్రాధాన్యత, అధికారాన్ని కాపాడుకోవాలనే ఆశతో వారు చూపుతున్న విధేయత, కొత్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వంలో ఉన్న లోతైన సంక్షోభాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. మరోవైపు, రాజ్యాంగ సవరణ అంశంపై తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల స్పందన పూర్తిగా భిన్నంగా కనిపించింది. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ పూర్వం తెలంగాణ రాష్ట్ర సమితి), కాంగ్రెస్ పార్టీలు ఇతర దక్షిణాది రాష్ట్రాలతో కలిసికట్టుగా నిలిచాయి. ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపుని సూచిస్తోంది. ప్రాంతీయ పార్టీగా బిఆర్ఎస్ తన ప్రాంత ప్రయోజనాలపట్ల నిబద్ధత చూపడం సహజమే. అలాగే, కర్ణాటక, తెలంగాణలో రాష్ట్ర స్థాయి బలమైన నాయకత్వం కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో ఐక్యతను ప్రదర్శించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనను ప్రాంతీయ నాయకుడిగా ప్రతిష్టించుకునే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఈ వేదికను బిఆర్ఎస్ ఏకాధిపత్యంగా మార్చకుండా నిలబడ్డారు. తెలంగాణ అభివృద్ధి పట్ల బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకత్వం చూపిన కట్టుబాటు, ఆ రాష్ట్ర రాజకీయాల్లో బిజెపిని పక్కకు నెట్టడం లో కీలక పాత్ర పోషించింది. ప్రారంభంలో హిందుత్వ అజెండాతో కొంత చురుకుదనం ప్రదర్శించిన బిజెపి, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం కోల్పోయిన స్థితికి చేరుకుంది. కొత్త ఆంధ్రప్రదేశ్లో అసలు సంక్షోభం ఏమిటి? ఇది పాలనాపరమైన సంక్షోభం. వరుసగా అధికారంలోకి వచ్చిన నాయకత్వాల అధిక అవినీతి కారణంగా పరిపాలన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా, ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు, జగన్రెడ్డి. ఇద్దరూ జైలుశిక్ష అనుభవించిన వారు. ఇక్కడ అవినీతి సమస్య ఎంత తీవ్రమో, అంతకంటే లోతుగా విస్తరించినది కులవాదం. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు, మూడు ప్రధాన కులాలకు ప్రతినిధులుగా మారాయి. తెలుగు దేశం పార్టీపై కమ్మ కుల ఆధిపత్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రెడ్డి కుల ఆధిపత్యం, జనసేనపై కాపు సమాజ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పరిపాలన, రాజకీయాలు, వ్యాపారాల్లో కులవాదం విస్తృతంగా వ్యాపించింది. రాష్ట్ర సమస్యలను మరింత తీవ్రతరం చేసిన అంశం, దాని దారుణమైన ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడాల్సి వస్తుందని ప్రారంభం నుంచే స్పష్టమైంది. ఏకీకృత ఆంధ్రప్రదేశ్ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ప్రాంతం సృష్టించిన మిగులు ఆదాయంపై ఆధారపడి ఉండేది. హైదరాబాద్ అభివృద్ధి దానికి ప్రధాన కారణం. హైదరాబాద్ లేకుండా కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిన స్థితిలోనే ప్రారంభమైంది. ఇలాంటి పాలనాపరమైన సవాళ్లను ఆంధ్ర రాజకీయ పరిస్థితులు మరింత క్లిష్టం చేశాయి. అధికారంలోకి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు, ఆశయపరుడైన పవన్ కళ్యాణ్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. మరోవైపు, ఇంకా ఎక్కువ ఆశలు పెట్టుకున్న తన కుమారుడు నారా లోకేష్, తండ్రి స్థానాన్ని త్వరగా స్వీకరించాలనే తపనతో ముందుకు వస్తున్నారు. టిడిపిలో తరాల మార్పు రాజకీయాలు కూడా పాలనపై ప్రభావం చూపుతున్నాయి. ఎన్టిరామారావు కుటుంబం ఇప్పటికీ నాయుడు తన మామగారిని ఎలా మోసం చేశాడనే విషయంపై అసంతృప్తితో ఉండటం, అలాగే లోకేష్ త్వరగా నాయకత్వం చేపట్టాలని కోరుకోవడం వంటి అంశాలు రాష్ట్ర పాలనను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అమరావతిని కొత్త రాజధానిగా నిర్మించాలనే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష, రాష్ట్రంలో అత్యవసరమైన పట్టణాభివృద్ధి సవాళ్లపై దృష్టిని మళ్లించింది. కఠిన మౌలిక సదుపాయాల నిర్మాణం (హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)తో పాటు పట్టణీకరణకు అవసరమైన సామాజిక -ఆర్థిక వ్యవస్థల (సాఫ్ట్ సూపర్స్ట్రక్చర్) అభివృద్ధి వంటి కీలక అంశాలు పక్కన పడిపోయాయి. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి వ్యాపార వర్గాలు మారాల్సి ఉంటుందని భావించారు. తెలంగాణ నాయకత్వం, హైదరాబాద్ అభివృద్ధి ప్రయోజనాలను స్వాధీనం చేసుకుంటూ, ప్రాంతీయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర వ్యాపార వర్గాలపై విమర్శలు చేసింది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర వ్యాపార, ప్రొఫెషనల్ వర్గాలను దూరం చేయకుండా ఉంచాలనే టిఆర్ఎస్ నాయకుడు కెటిఆర్ (కె.టి. రామారావు) తీసుకున్న తెలివైన నిర్ణయం, హైదరాబాద్లోనే మూలధనం, ప్రతిభ నిలిచేలా చేసింది. దీనివల్ల ఆ నగరం నిరంతర అభివృద్ధి సాధించింది. ఆంధ్రాలోని కమ్మ, రెడ్డి వర్గాల వ్యాపార ప్రముఖులు హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టడం లేదా విదేశాల్లో, ముఖ్యం గా అమెరికాలో స్థిరపడటాన్ని కొనసాగించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇప్పటికీ తిరిగి రాలేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నాయుడు, జగన్రెడ్డి నాయకత్వాలకు పెద్దగా సవాల్ విసరలేకపోవడంతో, రాష్ట్ర రాజకీయాలు వ్యక్తిగత ప్రతిష్టా పోరాటం, కుల రాజకీయాల మధ్య చిక్కుకుపోయాయి. 1969-72 మధ్య జరిగిన మొదటి ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల తర్వాత, హైదరాబాద్ అనేక ప్రభుత్వాల పాలనలో స్థిరమైన అభివృద్ధిని సాధించింది. చంద్రబాబు నాయుడు భారత వ్యాపార వర్గాలకు ప్రీతిపాత్రుడిగా ఎదిగినా, ఆయన తరువాత ముఖ్యమంత్రులైన వై.ఎస్. రాజశేఖరరెడ్డి, కె. చంద్రశేఖరరావు కూడా నగర అభివృద్ధిని కొనసాగించే దిశగా చర్యలు తీసుకున్నారు. దీని ఫలితంగా, 1980 నుంచి 2015 వరకు దాదాపు మూడు దశాబ్దాలపాటు ఆంధ్ర వ్యాపార వర్గాలు, ప్రతిష్ఠాత్మక వర్గాలు హైదరాబాద్ను తమ కేంద్రంగా చేసుకున్నాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఢిల్లీపై ఆధారపడాల్సిన పరిస్థితి, రాష్ట్ర నాయకత్వంపై విచారణ సంస్థల ప్రభావం, అలాగే ఆంధ్ర ఎలైట్ వర్గాలు హైదరాబాద్పైనే చూపుతున్న మక్కువ.. ఇవన్నీ కలిసివచ్చి రాష్ట్ర రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరిచాయి. ఫలితంగా, వారు ఢిల్లీ దర్బార్కు ఆధీనంగా మారే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఆంధ్రా వర్గాలను ఆకర్షించే కేంద్రంగా కొనసాగుతున్నంత కాలం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలు ఆధునిక పట్టణ, సాంసృ్కతిక కేంద్రాలుగా అభివృద్ధి చెందడంలో ఆలస్యం అనివార్యం. ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఉన్న నగరాల చుట్టూ స్థానిక వ్యాపార, విద్యా, సాంసృ్కతిక కేంద్రాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలి. భారీ ఖర్చుతో కూడిన అమరావతి రాజధాని ఒక మాయాజాల కేంద్రంగా మారుతుందనే ఆశపై ఆధారపడడం కంటే, స్థిరమైన, సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అవసరం. - సంజయ్ బారు
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ట్రంప్ ప్రశంసలు
దిల్లీ: ఇటీవల దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తరణ్జీత్ సింగ్ సంధూపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఆయన ఈ మేరకు ట్రూత్ సామాజిక వేదికగా సోస్టు చేశారు. ‘దిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన తరణ్జీత్ సంఇంగ్ సంధూకి అభినందనలు. అమెరికా మాజీ రాయబారిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు తరణ్జీత్ ఎంతో నిబద్ధత చూపించారు’. అని తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది వరకు ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. […] The post దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ట్రంప్ ప్రశంసలు appeared first on Visalaandhra .
Summer Effect : రోళ్లు పగులుతున్నాయ్.. రోడ్లపై ఆమ్లెట్ వేసుకునేంతగా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ముల్కనూర్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ భీమదేవరపల్లి:ఏప్రిల్ 17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో …
Chandrababu: రెండో విడత భూ సమీకరణపై చంద్రబాబు
రెండో విడత భూసమీకరణపై రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు.
Telangana : తెలంగాణలో మొరాయించిన సర్వర్లు..నిలిచిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి
Gold Prices Today : గుడ్ న్యూస్.. త్వరపడండి..బంగారం కొనేయండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
రాష్ట్ర పరిపాలన అనే విస్తారమైన వ్యవస్థలో ఒక అచంచలమైన సత్యం ఉంది. ప్రజల సంక్షేమం కోసం రూపుదిద్దుకున్న ప్రతి పథకం, ప్రతి నిర్ణయం చివరికి కార్యరూపం దాల్చేది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదుగానే. పాలన అనే యంత్రాంగం ఎంత శక్తివంతంగా కనిపించినా, దానికి ప్రాణం పోసేది ఉద్యోగులే. వారి కర్తవ్య నిబద్ధత, నిజాయితీ, సేవాభావం లేకపోతే ప్రభుత్వ లక్ష్యాలు కేవలం కాగితాలకే పరిమితమైపోతాయి. ప్రజల ఆశలు, ప్రభుత్వ సంకల్పాల మధ్య నిలిచే సజీవ వారధి -అదే ప్రభుత్వ ఉద్యోగి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఇ జెఎసి) నిన్న 17 ఏప్రిల్ రోజున చేపట్టిన కార్యాచరణను ఒక సాధారణ నిరసనగా చూడలేం. ఇది ఒక బాధ్యతతో కూడిన వినతి, వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోని నిశ్శబ్ద ప్రతిఘటన, న్యాయమైన హక్కుల కోసం వినిపిస్తున్న గంభీర స్వరం. ఉద్యోగులు ఎంచుకున్న మార్గం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. విధులను విస్మరించకుండా, ప్రజాసేవలకు అంతరాయం కలగకుండా, క్రమశిక్షణతో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడం. రాష్ట్రవ్యాప్తంగా మండల, డివిజనల్ కేంద్రాలలో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించడం. ఇది ఒక ప్రతీకాత్మక చర్య మాత్రమే కాదు; ఇది ప్రభుత్వ వ్యవస్థపై ఉద్యోగులకు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించే చర్య. రోడ్లపై ఆందోళనలు, నినాదాలకంటే, విధి నిర్వహణలో భాగంగానే తమ గళాన్ని వినిపించడంద్వారా వారు ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రతిష్ఠించారు. ఈ వినతి పత్రాలలో ప్రతిఫలించిన అంశాలు ఉద్యోగుల జీవన వాస్తవాలను, వారి భవిష్యత్ భద్రతను ప్రతిబింబిస్తున్నాయి. పిఆర్సి అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డిఎల విడుదల, 61 సంవత్సరాలు నిండిన విఆర్ఎల సమస్యల పరిష్కారం, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, సాధారణ బదిలీల నిర్వహణ, ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర కార్యాచరణ. ఇవి కేవలం ఆర్థిక అంశాలు మాత్రమే కాదు; ఇవి ఉద్యోగుల గౌరవం, భద్రత, స్థిరత్వానికి సంబంధించిన మూల సూత్రాలు. ప్రభుత్వ ఉద్యోగి పాత్రను సమగ్రంగా పరిశీలిస్తే, అది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత, ఒక ధర్మం. గ్రామంలో భూమి సమస్య పరిష్కారం నుండి పట్టణంలో సంక్షేమ పథకాల అమలు వరకు, విద్యా రంగంలో ఉపాధ్యాయుడిగా జ్ఞానాన్ని పంచడం నుండి ఆరోగ్యరంగంలో సేవలను చేరవేయడం వరకు. ప్రతి రంగంలో ఉద్యోగుల పాత్ర అపారమైనది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుండి సహాయక చర్యలు చేపట్టేది ఉద్యోగులే; ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియను సజావుగా నడిపేది ఉద్యోగులే; సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేసేది కూడా వారే. ప్రజలకు ప్రభుత్వం అనిపించేది చాలాసార్లు ఒక కార్యాలయంలో కూర్చున్న ఉద్యోగి రూపంలోనే. ఒక రైతు సమస్యకు పరిష్కారం చూపినప్పుడు, ఒక పేద కుటుంబానికి పింఛన్ అందినప్పుడు, ఒక విద్యార్థికి స్కాలర్షిప్ చేరినప్పుడు, ప్రభుత్వం అంటే ఇదే అన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టేది ఉద్యోగులే. అందుకే వారి సేవ కేవలం విధి నిర్వర్తన కాదు; అది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే శక్తి. అయితే ఈ సేవామార్గంలో ఉద్యోగులు ఎదుర్కొనే సవాళ్లు కూడా చిన్నవి కావు. పెరుగుతున్న పనిభారం, పరిమిత వనరులు, సమయపాలన ఒత్తిడి, ప్రజల అంచనాలు ఇవన్నీ ఒక ఉద్యోగిని నిరంతరం పరీక్షిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో వారి సంక్షేమం, ఆర్థిక భద్రత, సేవా నిబంధనల పరిరక్షణ మరింత ముఖ్యమవుతుంది. ఉద్యోగి బలంగా ఉంటేనే పరిపాలన బలంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగి వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం ఆశలు, ఆర్థిక బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు all these depend on the employee. ఒకవైపు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత, మరోవైపు కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత, ఈ ద్వంద్వ పాత్రలో ఉద్యోగి జీవితం సాగుతుంది. అయినప్పటికీ, అతను తన కర్తవ్యాన్ని ఎప్పుడూ ముందుకు ఉంచుతాడు. అదే అతని సేవాతత్వం. ప్రభుత్వం ప్రజల మధ్య ఉన్న అనుబంధం ఒక భావోద్వేగ సంబంధం. ఆ బంధాన్ని బలపరచేది ఉద్యోగులే. ప్రజల సమస్యలను వినిపించి, పరిష్కారం చూపే సమయంలో వారు చూపే సహానుభూతి, సహనం, సేవా దృక్పథం ఇవి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతాయి. అదే విధంగా ప్రభుత్వం కూడా ఉద్యోగులను కేవలం యంత్రాంగంగా కాకుండా, తమ వ్యవస్థలో కీలక భాగస్వాములుగా చూడాలి. రాబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2కు ముందే ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఉద్యోగులు కోరడం వెనుక ఉన్న భావన గంభీరమైనది. అది ఒక గడువు మాత్రమే కాదు; అది ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, ఆశ, విశ్వాసానికి ప్రతీక. అలాగే వచ్చే నెల 5వ తేదీన జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు అందజేయడానికి సిద్ధమవడం. ఇది వారి పోరాటం శాంతియుతంగా, క్రమబద్ధంగా కొనసాగుతుందనే సంకేతం. ఈ దశలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం. ఉద్యోగుల సమస్యలను వేరుచేసి చూడకుండా, పరిపాలనా వ్యవస్థలో భాగంగా పరిగణించి, ఒక సమగ్ర, సమయబద్ధ పరిష్కారం అందించాల్సిన అవసరం ఉంది. ఒకసారి సమస్యలు పరిష్కారమైతే, ఉద్యోగుల్లో నూతనోత్సాహం పుడుతుంది. ఆ ఉత్సాహం ప్రజా సేవల నాణ్యతలో ప్రతిఫలిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం. ఉద్యోగులు కేవలం జీతం కోసం పనిచేసే వారు కాదు; వారు సమాజానికి సేవ చేయాలని నమ్మే వ్యక్తులు. వారి పనిలో ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. ఆ విలువను గుర్తించడం, గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. మొత్తానికి, ఈ ప్రతిఘటన ఒక విరోధం కాదు, ఇది ఒక విజ్ఞప్తి. ఒక న్యాయమైన, సమంజసమైన అభ్యర్థన. ప్రజల సేవలో అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించడం సహజం. ఈ పిలుపును ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తే, అది ఉద్యోగులకే కాదు, ప్రజా సేవల నాణ్యతకు, రాష్ట్ర అభివృద్ధికి, సమాజ స్థిరత్వానికి కూడా దోహదపడుతుంది. - (రచయిత తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒఎస్డి)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణమే.. అదే కారణమా?
తిరుమలలో భక్తుల రద్దీ కొంత సాధారణంగానే ఉంది
రొటీన్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా సినిమా బ్యాడ్ బాయ్ కార్తీక్. ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని మంచి విజయాలందుకున్న నాగశౌర్య మూడేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఇది. శుక్రవారం ఈ హీరో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం. కథ: కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అయిన తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తీక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెకు ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటిది తన అక్కను ఎవరో చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి.. వాళ్ల సంగతేంటో తేల్చడానికి సిద్ధమవుతాడు కార్తీక్. ఈ క్రమంలోనే కదిరికి వస్తాడు. ఆ ప్రాంతానికే చెందిన రాజకీయ నాయకుడు గోవిందప్ప (మీమ్ గోపి)నే తన అక్కను టార్గెట్ చేశాడని తెెలుసుకుని అతడిని కస్తూరి కళ్ల ముందే చంపేస్తాడు కార్తీక్. అయితే కదిరికే చెందిన మరో రాజకీయ నాయకుడు వరదా రెడ్డి (సముద్రఖని) రూపంలో కస్తూరి కి ఇంకా పెద్ద ముప్పు పొంచి ఉందని కార్తీక్ తెలుసుకుంటాడు. ఇంతకీ గోవిందప్ప, వరదారెడ్డిలతో కస్తూరికి ఉన్న గొడవేంటి.. ఈ ఇద్దరి నేపథ్యం ఏంటి.. గతం తెలిశాక కార్తీక్ ఏం చేశాడు.. తన అక్కను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ. కథనం, విశ్లేషణ: హీరో నాగ శౌర్య తన అక్కను కాపాడుకునే తమ్ముడి పాత్రలో పర్వాలేదనిపించాడు. కథలో అంతబలం లేకపోయి నా, తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయ త్నం చేశాడు. అయితే అవుట్డేటెడ్ కథ, కథనాలే ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. చాలా రొటీన్ కథని ద ర్శకుడు ఈ సినిమా కోసం తీసుకున్నాడు. ఇదే కథ, కథనాలతో తెలుగులో ఎన్నో సినిమాలు మనం చూశాం. దీంతో ఈ సినిమా రొటీన్ మాస్ ఎమోషనల్ డ్రామాగా అనిపిస్తుంది. అలాగే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోదు. అసలు వారి మధ్యలో ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా అర్ధం కానీ విధంగా వీరి నడుమ సీన్స్ ఉంటాయి. ఇక టాలీవుడ్ మాస్ హీరోలు దశాబ్దాల ముందు చేసిన యాక్షన్ విన్యాసాలను ఇందులో నాగశౌర్య ప్రయత్నించాడు. తనకు ఏమాత్రం సెట్ కానీ ఎన్నెన్నో మాస్,యాక్షన్ విన్యాసాలు చేశాడు శౌర్య. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లు.. ఎవరినో అనుకరిస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప.. ఎక్కడా ఒరిజినాలిటీ అన్న దే కనిపించదు. చాలా చోట్ల సీన్స్ బోర్ కొడతాయి. అలాగే కొన్ని చోట్ల కామెడీ సీన్స్ కూ డా వర్కవుట్ కాలేదు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది.
బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు విజయాలు సాధించిన ఆర్సిడి ఈసారి కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్లు జోరుమీదున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక కెప్టెన్ రజత్ పటిదార్, జితేశ్ శర్మ, దేవ్దుత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, రొమరియో షెఫర్డ్, కృనాల్ పాండ్యలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతో పాటు భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, హాజిల్వుడ్, కృనాల్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో బెంగళూరు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇక ఢిల్లీలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కెఎల్ రాహుల్, నితీశ్ రాణా, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ అక్షర్ పటేల్, నిసాంకా తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లో కూడా ఢిల్లీ పటిష్టంగానే ఉంది. దీంతో ఢిల్లీ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.
నేడు ఉప్పల్లో చెన్నైతో పోరు మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా శనివారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన చెన్నై ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. ఇక రెండు మ్యాచుల్లో విజయం సాధించిన హైదరాబాద్కు కూడా ఈ పోరు కీలకంగా మారింది. కిందటి మ్యాచ్లో బలమైన రాజస్థాన్ను ఓడించడంతో సన్రైజర్స్ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇందులో కూడా గెలిచి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానాన్ని సాధించాలనే లక్షంతో ఉంది. ఇటు చెన్నై అటు హైదరాబాద్లోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో కూడా సన్రైజర్స్ బాగానే ఉంది. కిందటి మ్యాచ్లో యువ బౌలర్లు ప్రఫుల్ హింగె, సకిబ్ హుస్సేన్లు, మలింగ తదితరులు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న సన్రైజర్స్కు సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం మరింత కలిసి వచ్చే అంశంగా మారింది. సమరోత్సాహంతో.. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన చెన్నై టీమ్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే తహతహలాడుతోంది. కోల్కతా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో జరిగిన మ్యాచుల్లో చెన్నై ఘన విజయాలను అందుకోంది. దీంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. సంజు శాంసన్ ఫామ్లోకి రావడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం జట్టును కలవర పెడుతోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా రుతురాజ్ రాణించలేక పోయాడు. కనీసం ఈసారైన అతను మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. డెవాల్డ్ బ్రెవిస్, అయుష్ మాత్రె, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె తదితరులతో చెన్నై బ్యా టింగ్ బలంగా కనిపిస్తోంది. అంతేగాక నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్, అకిల్ హుస్సేన్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వం లో తానే హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ “మంచి కథా వస్తువుతో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నాం”అని అన్నారు.
ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದ ಮುರ್ಷಿದಾಬಾದ್ನಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಹಿಂದೂಗಳು ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು 2022ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
Zodiac Signs : ఈ రాశి వారికి నేడు శుభదినమే
ఎక్కువ మంది దినఫలాలను చూసుకుని మరీ ముందుకు వెళుతుంటారు
18thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
18thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 18thAprilCartoon సంఖ్యాబలం తెలియని అమాయకత్వమా.. లేక
మంచిర్యాలలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం.... పసికందుతో ధర్నాకు దిగిన ప్రియురాలు
మంచిర్యాల: ఓ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ఓ యువతిని లొంగదీసుకున్నాడు. అనంతరం సదరు యువతిని గర్భవతిని చేసి అనంతరం బిడ్డ పుట్టగానే వదిలేసి పారిపోయాడు. దీంతో పసికందుతో తల్లి ధర్నాకు దిగిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముదిగుంట గ్రామానికి చెందిన సాయిరాజ్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ యువతిని లొంగదీసుకున్నాడు. సదరు యువతిని గర్భవతి చేసి బిడ్డ పుట్టగానే వదిలేసి పారిపోయాడు. దీంతో కానిస్టేబుల్ ఇంటి ముందుకు చేరుకొని పసికందుతో ధర్నాకు దిగింది. దీంతో కానిస్టేబుల్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పారిపోయాడు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది.
Ys Jagan : బిల్లు వీగిపోవడంపై వైఎస్ జగన్ ట్వీట్ ఇదే
మహిళ రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు
KTR : మహిళ బిల్లు వైఫల్యానికి బీజేపీదే బాధ్యత
మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీ పార్టీదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
Naga Shaurya’s Film Shocks Telugu Film Industry
After the debacle of Rangabali, Naga Shaurya has calmed down. After three years, he tested his luck with Bad Boy Karthik. The makers have spent Rs 30 crores on the film. The director was changed and the film underwent several unexpected changes. The trailer and the songs failed to generate the need buzz. Naga Shaurya […] The post Naga Shaurya’s Film Shocks Telugu Film Industry appeared first on Telugu360 .
Bandi Sanjay : కాంగ్రెస్ పై బండి ఫైర్
మహిళ రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు
18aprilchintana |ధర్మం ఎందుకు క్షీణిస్తోంది?
18aprilchintana | ధర్మం ఎందుకు క్షీణిస్తోంది? 18aprilchintana | కలియుగ లక్షణాలు మరియు
Revanth Reddy : బిల్లుల వీగిపోవడంపై రేవంత్ ఏమన్నారంటే?
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు
Exclusive: Ajay Bhupathi to work with Koratala Siva
Ram Gopal Varma’s protege Ajay Bhupathi made an impressive debut with RX 100. His second film Maha Samudram was a disaster and he bounced back with Mangalavaaram. The film’s technical aspects were well appreciated and he is currently busy with Srinivasa Mangapuram which introduces Ghattamaneni youngster Jaya Krishna to Telugu cinema. The film releases in […] The post Exclusive: Ajay Bhupathi to work with Koratala Siva appeared first on Telugu360 .
IPL 2026 : కోల్ కతా కు సుడి లేదు... గుజరాత్ ను లక్కు వదలలేదు
గుజరాత్ టైటాన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అత్త పక్కనే పడుకున్న చిరుత.... కాపాడిన కోడలు
బెంగళూరు: చిరుత పులి బారి నుంచి అత్తను కోడలు కాపాడిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు నగరంలో జరిగింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... రాచనగరి మైసూరు నగరంలోని సిద్ధార్థనగర్లో సుజాత అనే మహిళ తన భర్త, అత్త శైలజతో కలిసి ఉంటుంది. అత్త పడుకున్న రూమ్లో కోడలు వెళ్లింది. మంచం కింద చిరుత పులిని గమనించి అత్తను చాకచక్యంగా బయటకు తీసుకొచ్చింది. అనంతరం ఆ రూమ్ గడియ వేసి పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. సుజాత సమయస్ఫూర్తిని స్థానికులు, అటవీ శాఖ అధికారులు ప్రశంసించారు. చిరుత పులి చూసిన కూడా ప్రాణ భయం లేకుండా అత్తను కాపాడిన కోడలు ధైర్య సహసాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.
18aprileditorial |రాజ్యాంగ సవరణ బిల్లు వీగింది..
18aprileditorial | రాజ్యాంగ సవరణ బిల్లు వీగింది.. 18aprileditorial | రాజ్యాంగ సవరణ
Strait of Hormuz : ఆంక్షలు కొనసాగితే.. మళ్లీ హోర్ముజ్ జలసంధి మూసేస్తామన్న ఇరాన్
హోర్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకలకు పూర్తిగా తిరిగి తెరిచినట్టు ఇరాన్ ప్రకటించింది
కూతురి అశ్లీల వీడియోలు క్రియేట్ చేసి తండ్రికి పంపిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరగాళ్ల వికృత చేష్టలకు పాల్పడ్డారు. కూతురు పేరుతో ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె తండ్రికి సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియోలు పంపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచవానిసింగారం ప్రాంతంలో నివాసం ఉండే వ్యక్తి(50)కి తన కూతురి పేరిట నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించి సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియోలు పంపారు. ఆ వీడియోలను బంధువులకు కూడా పంపిస్తామని బెదిరిస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Strait of Hormuz : హార్ముజ్ జలసంధి తెరుచుకున్నా… పెట్రోల్ ధరలు వెంటనే తగ్గవట
హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోవడతో చమురు ధరలు తగ్గాయి
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్, అలా గే ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయ ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. నియోజకవర్గాల పు నర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ వల్ల ప్రతి నియోజకవర్గంలో ఓ టర్ల సంఖ్యను సమతుల్యం చేయవచ్చని, ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో సుమారు 40 లక్షల వరకు ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నా రు. మహిళా కోటా చట్ట సవరణకు సంబంధించిన మూడు బిల్లులు, అలాగే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అంశంపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలను డీలిమిటేషన్ నుండి దూరం పెట్టిందని, ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ చర్చను ఎవరైనా జాగ్రత్తగా వింటే, మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఎవరూ ప్రత్యక్షంగా మాట్లాడలేదని అర్థమవుతుంది. అందరూ ‘మేము స్వాగతిస్తున్నాం’ అని చెప్పారు. కానీ ఇండి యా కూటమికి చెందిన సభ్యులంతా వాస్తవానికి మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా నిలిచారు అని అమిత్ షా అన్నారు. ఈ చర్చలో రెండు రోజులపాటు సుమారు 130 మంది ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం నిర్దిష్ట వ్యవధుల్లో డీలిమిటేషన్ నిర్వహించాల్సి న బాధ్యత ఉందని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్యను పెంచే నిబంధనలు కూడా అందులో భాగమని ఆయన వివరించారు. డీలిమిటేషన్ను వ్యతిరేకించేవారు, వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపును కూడా వ్యతిరేకిస్తున్నట్టే అంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ వెనుక దాగి ఉన్న ఉద్దేశాలపై ప్రతిపక్షం చేసి న ఆరోపణలకు అమిత్ షా ఘాటుగా ప్రతిస్పందించారు.డీలిమిటేషన్ ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించడంపై సభలో పలువురు సభ్యు లు సందేహాలు వ్యక్తం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపా రు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం 2026 తర్వాత జరగనున్న జనగణన అనంతరం జరిగే డీలిమిటేషన్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు. 1971లో ఇందిరా గాంధీ ప్రభు త్వం సీట్ల సంఖ్యను నిలిపివేసింది (ఫ్రీజ్ చేసింది). ఆ ఫ్రీజ్ను ఎత్తివేస్తేనే ‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలులోకి వస్తుంది. అందుకే మేము ఈ చర్యలు చేపట్టాం అని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న 127 నియోజకవర్గాలు ఉ న్నాయని, ఇది ‘ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ’ అనే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధమని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో 45 లక్షల మంది ఓటర్లకు ఒకే ప్రతినిధి ఉంటే, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానం గా ఉండడం లేదు అని వివరించారు. మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా కుల గణనను ఆలస్యం చేయాలనే ఉద్దేశం ఉందన్న ప్రతిపక్ష ఆరోపణలను అమిత్ షా ఖండించారు. 2025లో కేంద్ర కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కుల గణన నిర్వహించాలనే నిర్ణ యం తీసుకున్నారు. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తే, లోక్సభ సీట్లను రాష్ట్రాల వారీగా 50 శాతం పెంచే అధికారిక సవరణను తీసుకువస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ప్రతిపక్షం మద్ద తు లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందదు. కానీ దేశ మహిళలు ఎవరు అడ్డంకిగా నిలుస్తున్నారో గమనిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చర్చలో ఉన్న మూడు బిల్లులు.. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో ఉన్న సభ్యులలో రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుత బలం ప్రకారం, ఎన్డీయేకు ఈ బిల్లును ఆమోదింపజేసేందుకు తగిన సంఖ్య లేదు.
దేశ రాజకీయ ముఖచిత్రం మార్చే కుట్ర
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ముఖచిత్రాన్ని మా ర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాల కిందికే వస్తుంద ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోటా చట్టానికి ప్రతిపాదిత సవరణలపై చర్చలో శుక్రవారం రాహుల్ గాంధీ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు , మహిళ కోటాకు లింక్ పెట్టడం కేవలం బి జెపి ప్రభుత్వం రాజకీయ లబ్థికి దిగడమే అని రా హుల్ తెలిపారు. ఎన్నికల ముఖచిత్రం మార్చడం ద్వారా రాజకీయ స్వరూపం తమ చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోవడమే ఈ ప్రభుత్వ ఆలోచన అని విమర్శించారు. కేంద్రం అత్యంత దుర్మార్గంగా డి లిమిటేషన్ ద్వారా దక్షిణాది, ఈశాన్య, చిన్న రా ష్ట్రాల సభా ప్రాతినిధ్యాలను దెబ్బతీస్తోంది. ఇది పూ ర్తి స్థాయిలో జరుగుతున్న దేశ వ్యతిరేక చర్య అని తెలిపారు. దేశంలోని మహిళల కొంగుచాటున సా గుతూ దేశ ఎన్నికల ముఖచిత్రం మార్చేందుకు ఈ మాయోపాయానికి దిగిందని విమర్శించారు. ఇ ప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చింది మహిళా బిల్లు కాదని, ఇందులో మహిళా సాధికారికత విషయం ఏదీ లేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆమోదం పొంది ఉన్న 2023 మహిళా చట్టం అమలులోకి తీసుకురావచ్చు. ఇందుకు ప్రతిపక్షాలు అన్ని సహకరిస్తా యి. కాలాయాపన కూడా ఉండదన్నారు. ఈ ప్ర భుత్వానికి వెనుకబడిన వర్గాలకు , ఆదివాసీలకు ఇతర అణగారిన వర్గాలకు అధికారంలో సరైన ప్రా తినిధ్యం కల్పించే ఆలోచన లేదని, ఇందుకు ఈ విధమైన నానా దారులు వెతుక్కుంటోందని విమర్శించారు. కులగణనను నామమాత్రం చేస్తున్నా రు. వచ్చే 15 సంవత్సరాల వరకూ దీని వల్ల ఎటువంటి ప్రాతినిధ్యానికి వీలు ఉండదని తెలిపారు. ప్రధాని మోడీ పెద్ద జాదూగర్: రాహుల్ బిజెపి నిరసనలు ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు అని, బాలాకోట్ , పెద్ద నోట్ల రద్దు, తరువాత ఆపరేషన్ సిందూర్ ఇ వన్నీ ఆయన తంత్రాలని లోక్సభలో మహిళా బి ల్లు చర్చ సందర్భంగా రాహుల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బిజెపి సభ్యులు అడ్డుతగిలారు. ప్రధా ని మోడీపై రాహుల్ అనుచిత పదజాలాలకు దిగారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజి జూ మండిపడ్డారు. పైగా రాహుల్ మరోసారి దేశ సైనిక బలగాలను కించపర్చే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయాలని రక్షణ మంత్రి రాజ్నా థ్ సింగ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశా రు. దీనితో స్పీకర్ రాహుల్ను ఉద్ధేశించి సరిగ్గా మా ట్లాడాలని, విషయానికి పరిమితం కావల్సి ఉందని స్పష్టం చేశారు. తప్పుడు పదజాలాలను అనుమతించేది లేదన్నారు. ప్రధాని మోడీ, నేను భార్య బాదరబందీ లేనోళ్లమే రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు భార్య బాదరబందీ లేదన్నారు. అం దరికీ జీవితంలో మహిళల నుంచి ఏదో ఒక పాఠం అబ్బుతుంది. తనకు సోద రి తల్లి నుంచి ఆత్మీయత దక్కుతుంది. ఇదే విధం గా ప్రధాని మోడీకి కూడా ఇదే స్పందన ఉంది. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మం త్రి కిరెణ్ రిజిజూ సభలో మాట్లాడుతూ కేంద్ర న్యా యశాఖ మంత్రి అర్జున్ రామ్ తన భార్య గురించి కవిత చెప్పారని, అప్పటి నుంచి రాహుల్కు ఇంట్లో తిట్లు పడి ఉంటాయని నవ్వుతూ వ్యాఖ్యానించా రు. దీనిపై రాహుల్ స్పందిస్తూ అవును తనకు మోడీజి మాదిరిగానే ఈ అనుభూతి లేదు ఏం చేద్దామని చమత్కరించారు.
18thApril2026 |శనివారం నేటి పంచాంగం
18thApril2026 | శనివారం నేటి పంచాంగం 18thApril2026 | ఈరోజు పంచాంగం ముఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్: లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన నల్ల బిల్లును ఇండియా కూ టమి చిత్తుగా ఓడించిందని వ్యాఖ్యనించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం పన్నిన డీలిమిటేషన్ కుట్రను ప్రజాస్వామ్య శక్తులు సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక బిల్లు వీగిపోవడం కాదు, సమాఖ్య స్ఫూర్తికి దక్కిన విజయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణల పేరుతో దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీసేందుకు ఏ శక్తులు ప్రయత్నించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వాటిని తిప్పికొడుతుందని ఈ ఓటింగ్ నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
టెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చో టు చేసుకుంది. ఇజ్రాయెల్లెబనాన్ మధ్య కా ల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు పెద్ద ఉపశమ నం కలిగించేలా ఇరాన్ శుక్రవారం హార్మూజ్ జ లసంధిని అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అ నుమతించనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అ బ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. లెబనాన్తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకు న్న నేపథ్యంలో ఇరాన్ నుండి ఈ ప్రకటన వెలువడింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉ న్నంత వరకు హార్మూజ్ జలసంధి తెరిచే ఉం టుంది అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, లెబనాన్లో కాల్పుల విరమణకు అనుగుణంగా, హార్మూజ్ జలసంధి ద్వారా అన్ని వాణిజ్య నౌకలకు ప్రయాణం పూర్తిగా అనుమతించబడుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో, కాల్పుల విరమణ కాలం మిగిలిన భాగం వరకు ఈ అనుమతి అమల్లో ఉంటుంది అని వెల్లడించారు. ఈ నిర్ణయం వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. ఆయన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ, హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచారని, అన్ని రవాణాలకు సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. ధన్యవాదాలు! అని పేర్కొన్నారు. అయితే, ఇరాన్ నౌకాశ్రయాల నుంచి వెళ్లే లేదా అక్కడికి వచ్చే నౌకలపై అమెరికా నౌకాదళ ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి పూర్తిగా తెరవబడి వ్యాపారానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇరాన్కు సంబంధించిన నౌకలపై నౌకాదళ ఆంక్షలు కొనసాగుతాయి. మా-కు, ఇరాన్ కు మధ్య ఒప్పందం పూర్తిగా ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది, ఎందుకంటే చాలా అంశాలు ఇప్పటికే చర్చించి, నిర్ణయించబడ్డాయి అని ట్రంప్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధి: ఘటనల కాలక్రమం మార్చి 2న, అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్ సైనిక మౌలిక వసతులు, ఉన్నతాధికారుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత, ‘స్నేహపూర్వకంగా లేని దేశాలకు’ చెందిన నౌకల రాకపోకలను హార్మూజ్ జలసంధిలో పరిమితం చేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసింది. చమురు ధరలు వేగంగా పెరిగాయి. భారత్లో కూడా కొంతకాలం ఎల్పీజీ కొరత కనిపించింది, ఎందుకంటే హార్మూజ్ ప్రాంతంలో కొన్ని నౌకలు దెబ్బతిన్నాయి. అయితే, ఆ తర్వాత ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా ఈ మార్గాన్ని దాటడంతో పరిస్థితి త్వరగా సాధారణమైంది. నేడు ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెట్ ధర 8 శాతం మేర క్షీణించి 90 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ మే నెల కాంట్రాక్ట్ 9.8 శాతం క్షీణించి బ్యారెట్ ధర 85 డాలర్లకు చేరువైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లు పైనే ట్రేడవుతూ వచ్చింది. క్రూడాయిల్ తగ్గుముఖం పట్టడం వల్ల దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు మేలు చేకూరుతుంది.
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుకు స్టీరింగ్ కమిటీ
మన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత ప రిష్కార మార్గాలను అన్వేషించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పనుల స మన్వయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉ న్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీల క నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడు, రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మెంబర్లుగా కె.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ (టెక్నికల్), ఎంఎస్ఎన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, సిడిఓ, సెల్వ బాలన్, అడిషనల్ డైరెక్టర్, సిడబ్లూపిఆర్ఎస్, సాయికృష్ణ, ఎండి, ఎంఎస్ ఆఫ్రి ఇండియా లిమిటెడ్, ఎస్.సురేష్కుమార్, జనరల్ మేనేజర్, ఎల్ అండ్ టి, మల్లికార్జున రావు, వైస్ ప్రెసిడెంట్, ఆఫ్రాన్స్, మాధవ్, ప్రాజెక్టు మేనేజర్, నవయుగ, టి.శ్రీనివాసరావు గుప్తా, సీఈ, రామగుండం (మెంబర్ కన్వీనర్గా) వ్యవహారించనున్నారు. ఈ కమిటీ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేయడంతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురానుంది. వారానికి రెండుసార్లు సమావేశమై పనుల పురోగతిని ఈ కమిటీ సమీక్షిస్తుంది. ప్రతిరోజూ జరిగే పనులపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 30వ తేదీ లోపు కసరత్తు పూర్తి.. వర్షాకాలం ప్రారంభం కాకముందే కీలకమైన పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. బ్యారేజీల పునాదుల పటిష్టతను తెలుసుకోవడానికి మే 30వ తేదీ లోపు జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, అనుమతుల మేరకు మాత్రమే ఈ మరమ్మతు పనులు సాగనున్నాయి. ముందుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, మేడిగడ్డను పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మెమో నెంబర్ 8141/ప్రాజెక్ట్ IV/A1/2023, తేదీ 13.04.2026 ఇరిగేషన్ సెక్రటరీ ఈ.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
30లక్షల ఎంటిల బాయిల్డ్ రైస్ సేకరించాలి
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి పం టకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్ష ల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్ రైస్ మిల్లింగ్కు అనుకూలమని వారు కేంద్ర మం త్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి జోషిని ఆయన నివాసంలో సిఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బా యిల్డ్ రైస్కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 ఎల్ఎంటి ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుకూలంగా ఉంటుందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్ఎంటి బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటి రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను.. 201415 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని.. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసిడిఎస్ల పరిధిలో పంపిణీ చేసేవారని ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునః ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, సెక్రటరీ కో ఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. శుక్రవారం ఉద యం నుంచి సెంట్రల్ సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వర కు తరబడి వేచిచూశారు. 2002లో ఏర్పా టు చేసిన సర్వర్లో కొన్ని రోజులుగా సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతుండడంతో రెం డు, మూడు గంటల పాటు రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం శుక్రవా రం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు సర్వర్లో ఇబ్బందులు తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. టెక్నికల్ టీంతో సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి సాయంత్ర 7 గం టల వరకు కృషి చేశారు. ఈ టీంలతో పాటు సబ్ రిజిస్ట్రార్లతో ఎప్పటికప్పుడు ఆ శాఖ డిఐజీ సుభాషిణి నిరంతరం సంప్రదింపులు జరిపారు. మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే, 2002లో ఏర్పాటు చేసిన సర్వర్ స్థానంలో కొత్త సర్వర్ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో ఆ శాఖ ఉన్నతాధికారులు టెండర్లను సైతం పిలిచారు. నాలుగైదు నెలల్లో కొత్త సర్వర్ అనుసంధానం పూర్తయితే మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ మధ్యన స్లాట్ బుకింగ్, ఈ సిగ్నచర్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా అమల్లోకి తీసుకురావడంతో సర్వర్పై అదనపు భారం పడి అది మొరాయిస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం సర్వర్ కొనుగోలు కోసం సుమారుగా రూ.12 కోట్ల నిధులను సైతం కేటాయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు పూర్తయితే రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడదని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. సర్వర్ మొరాయించడంతో శుక్రవారం బుక్ అయిన స్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను శనివారం చేస్తామని, వీటితో పాటు శనివారం బుక్ చేసుకున్న స్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లను కూడా ఇదే రోజు పూర్తి చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
డిమాండ్ల సాధనకు ఉద్యోగుల ఉద్యమబాట
మనతెలంగాణ/హైదరాబాద్: సమస్యల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కారు. పీఆర్సీతోపాటు పెండింగ్ బకాయిలను, ఈహెచ్ఎస్ కార్డులు, సిపిఎస్ రద్దుతోపాటు 60పైచిలుకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మం డల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని అన్ని హెచ్ఓడి కార్యాలయాలు, సెక్రటేరియేట్ లలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు నల్లబ్యాడ్జిలు ధరించి ఈ నిరసన కార్యక్ర మం చేపట్టారు. టిజిఈజేఏసీ ఉద్యోగ సంఘా ల చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీ, కో-చైర్మన్స్లు చావా రవి, వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్కుమార్, ఎం.బి కృష్ణయాదవ్, శ్రీకాంత్, జి.నిర్మల, రమేష్ పాక, గండూరి వెంకట్లతో పాటు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్లు, సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ల ఆధ్వర్యంలో లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బకాయిలను విడుదల చేయాలి: జగదీశ్వర్, ఏలూరి 2వ పిఆర్సి కమిటీని వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదికను సమర్పించలేదని, పీఆర్సీ నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్మెంట్తో జూన్ 2వ తేదీలోపు 2వ పిఆర్సిని అమలు చేయాలని టిజిఈజేఏసీ ఉద్యోగ సంఘాల చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు రూ. 13,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలి: లచ్చిరెడ్డి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని అనంతరం ఉద్యోగులు జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. సిపిఎస్ను రద్దు చేయాలి: స్థితప్రజ్ఞ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్లు డిమాం డ్ చేశారు. ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్కు భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,316 మంది సిపిఎస్ ఉద్యోగులు పదవీ విరమణ పొందారని, వారికి కనీస సామాజిక భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందిన సిపీఎస్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ద్వారా నగ దు రహిత వైద్య సౌకర్యాల ను ఎలా వర్తింపజేస్తుందో త క్షణమే స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఆరో గ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద ని వారు గుర్తు చేశారు.
కెపిహెచ్ బీ లో తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు
కెపిహెచ్ బీ పోలీస్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబర్ 734 దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జెఎన్టీయూ నుంచి కూకట్ పల్లి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లో మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో బస్సు పూర్తిగా తగలపడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఐపిఎల్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. కోల్కతాకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్ 7 ఫోర్లు, 4 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్మన్ గిల్ 8 ఫోర్లు, 4 సిక్స్లతో 86 పరుగులు చేసి గుజరాత్ను గెలిపించాడు.
కెటిఆర్ పాదయాత్ర ఇప్పుడెందుకు?
పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను కలవని వారికి ఇప్పు డు ఒక్కసారిగా జ్ఞానోదయమై పాదయాత్రలు గుర్తొచ్చాయా..? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉం డి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు. హరీష్రావుది అంతా కుట్ర రాజకీయం అని, ఆయనను తాను ఎప్పటికీ నమ్మను అని పేర్కొన్నారు. పార్టీ లో గ్రూప్ రాజకీయాలు పెంచి పోషించిందే హరీష్రావు అని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, కొం దరు మాజీ ఎంఎల్ఎలు తనను కలిసి లోగుట్టు విప్పారని చెప్పారు. జాగృతి కార్యాలయంలో శుక్రవారం సిపియుఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రా ష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు కవితను కలిసి తమ మద్దతు తెలిపారు. అనంతరం కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు అధికారం దక్కాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ కనీసం గ్రామ వార్డు పదవి కూడా పొందని కులా లు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భౌగోళిక తె లంగాణ సాధించుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ మాత్రం తెచ్చుకోలేకపోయామని అన్నారు. ఉద్యమ సమయంలోనే ఈ అంశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ప్రస్తావించిన విషయాన్ని కవిత గుర్తు చేసుకున్నారు. భారత్కు స్వాతంత్రం వచ్చిన సమయంలో నూ గాంధీ, అంబేడ్కర్ ముందు కూడా ఇదే సమస్య వ చ్చిందని. భారత కుల వ్యవస్థలో ఈ అంశం నిరంత రం మన ముందుంటుందని జయశంకర్ సార్ అన్నారని చెప్పారు. ముందు మనం భౌగోళిక తెలంగాణ సా ధించుకొని ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ ఎన్నో కులాలు అధికారానికి దూరంగా ఉ న్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు అధికారం కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. కులాలు బలంగా ఉన్నప్పుడే వారికి రా జకీయ అధికారం దక్కుతుందని బలంగా నమ్మిన వ్య క్తి మారోజు వీరన్న అని కవిత చెప్పారు. రాష్ట్రంలో కు ల సంఘాలకు కర్త, కర్మ, క్రియ ఆయనే అని గుర్తు చే శారు. కులాల అస్తిత్వాన్ని, విప్లవ ఉద్యమాలకు జత చే సి సామాజిక న్యాయం కోసం వీరన్న కృషి చేశారని పే ర్కొన్నారు. ఆయన మన ముందు పెట్టిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మోసం ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచిస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో కి వచ్చిన ఆరు నెలల్లో పిఆర్సి అమలు చేస్తామని న మ్మబలికి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని మండిపడ్డా రు. ఎన్నికల హామీలైన సిపిఎస్ రద్దు, పాత పెన్షన్స్కీం పునరుద్ధరణను గాలికి వదిలేసి కాంగ్రెస్ తన నైజాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. మధ్యాహ్న భోజ న సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నిరసనకు జాగృతి తరఫున మద్దతు ప్రకటించారు.
మహిళలను బిజెపి వంచించింది: కల్వకుంట్ల కవిత
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బిజెపికి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయ్యిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బిజెపి కుట్ర పూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లు వీగిపోవడంపై శుక్రవారం కవిత వీడియో సందేశం విడుదల చేశారు. మహిళా కోటా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును ముడి పెట్టడంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి లోక్సభలో బిల్లు వీగిపోయేలా చేశాయని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే బిజెపి ఈ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టీ పాస్ చేసి దానిని సెన్సెస్కు లింక్ చేశారని తెలిపారు. ఇప్పుడు 2011 సెన్సెస్ అధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెడుతున్నట్టు చెప్పి మరోసారి వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆడబిడ్డలు బిజెపి మోసాన్ని గుర్తించాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో ఒక మహిళ నాయకత్వం వహిస్తోందని, ఈ మోసకారి బిజెపిని ఓడించి ఆ మహిళను గెలిపించాలని బెంగాల్లో ఉన్న మిత్రులకు చెప్పాలని రెండు రాష్ట్రాల మహిళలకు విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ మళ్లీ ఏకగ్రీవ ఎన్నిక
నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ శుక్రవారం రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి తరఫున సభా నాయకుడు జె.పీ. నడ్డా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఎస్. ఫాంగ్నోన్ కొన్యాక్ మద్దతు ఇవ్వగా, వాయిస్ ఓట్ ద్వారా అది ఆమోదం పొందింది. హరివంశ్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మొత్తం ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం, హరివంశ్ గారు రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రకటిస్తున్నాను అని సభాపతి సి.పి. రాధాకృష్ణన్ వెల్లడించారు. తదుపరి, సభా నాయకుడు నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే హరివంశ్ను ఉపాధ్యక్షుని స్థానానికి తీసుకెళ్లాలని సభాపతి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో వారు ఆయనను ప్రతిపక్ష నాయకుడి పక్కన ఉన్న ఉపాధ్యక్షుని సీటుకు తీసుకెళ్లారు. హరివంశ్ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియడంతో రాజ్యసభ ఉపాధ్యక్షుని పదవి ఖాళీగా మారింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను మళ్లీ రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. హరివంశ్ ఎన్నికపై ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఇది అనుభవానికి ఇచ్చిన గౌరవం, ఆయన సహజమైన పని విధానానికి గుర్తింపు అని మోదీ పేర్కొన్నారు. హరివంశ్ గారి నాయకత్వంలో సభ కార్యకలాపాల సామర్థ్యం పెరిగిన విధాన్ని మనందరం గమనించాం. ఆయన కేవలం సభను నడిపించడం మాత్రమే కాకుండా, తన జీవిత అనుభవాలను ఉపయోగించి సభను మరింత సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నారు అని ప్రధాని అన్నారు. మూడోసారి ఈ పదవికి ఎన్నిక కావడం ద్వారా సభకు ఆయనపై ఉన్న నమ్మకం, ఆయన అనుభవం ఎంత గొప్పదో స్పష్టమవుతుందని మోదీ పేర్కొన్నారు. నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఒక నామినేటెడ్ సభ్యుడు ఈ పదవికి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. హరివంశ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ఉపాధ్యక్షుడు ప్రతిపక్షానికి తగిన సమయం కేటాయించి వారి అభిప్రాయాలను వినేలా చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన మూడో పదవీకాలంలో హరివంశ్ ప్రతిపక్షానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. లోక్సభలో ఉప సభాపతి పదవి 2019 నుంచి ఖాళీగా ఉండటం రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమని ఖర్గే వ్యాఖ్యానిస్తూ ఆ విషయం తనను బాధించిందన్నారు. ఇక హరివంశ్ ఎన్నిక సందర్భంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలు నిరసనగా వాక్అవుట్ చేశాయి. హరివంశ్కు మద్దతుగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ మద్దతు తెలిపారు. మరో తీర్మానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా, బీజేపీ ఎంపీ సురేంద్ర సింగ్ నగర్ మద్దతు ఇచ్చారు. జేడీయూ ఎంపీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా ప్రవేశపెట్టిన మరో తీర్మానానికి ఆర్ఎల్ఎం ఎంపీ ఉపేంద్ర కుశ్వాహా మద్దతు తెలిపారు. అలాగే ఆర్ఎల్డీ ఎంపీ, కేంద్ర మంత్రి జయంత్ చౌధరి ఇచ్చిన నోటీసుకు శివసేన ఎంపీ మిలింద్ ముర్లీ దేవోరా మద్దతు తెలుపుతూ హరివంశ్ ఎన్నికకు మద్దతు ప్రకటించారు.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం, అదానీ నికర ఆస్తి విలువ 92.6 బిలియన్ డాలర్లు (రూ.8.59 లక్షల కోట్లు) గా నమోదైంది. గతంలో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రస్తుతం 90.8 బిలియన్ డాలర్ల (రూ.8.42 లక్షల కోట్లు) నికర విలువతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. అదానీ గ్రూప్ షేర్ల విలువ పెరగడంతో గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది 8.1 బిలియన్ డాలర్లు (రూ.75,110 కోట్లు) పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే ఆయన ఆస్తి రూ.33,010 కోట్లు పెరిగింది. మరోవైపు, రిలయన్స్ షేర్ల విలువ తగ్గడం వల్ల అంబానీ సంపద ఈ ఏడాది రూ. 1.57 లక్షల కోట్ల మేరకు క్షీణించింది. అంతర్జాతీయంగా చూస్తే 656 బిలియన్ డాలర్ల ఆస్తితో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
మహిళా కోటా ఇప్పుడు అమలు చేసినా మద్దతిస్తాం: రాహుల్ గాంధీ
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల పేరిట తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఒక రకంగా రాజ్యాంగపై దాడి అని లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆ బిల్లును ఓడించామన్నారు. మహిళలకు కోటా కల్పించడం దీని లక్షం కాదని, వారి పేరు మీద దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే కుట్ర అని మండిపడ్డారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీకి మళ్లీ చెబుతున్నా...2023 మహిళా బిల్లును అమలు చేయండి. మేం తప్పకుండా సహకరిస్తాం. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహి బిల్లు కాదు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఏకపక్షంగా మార్చే కుట్ర. అందుకే అడ్డుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఆమోదించిన మహిళ రిజర్వేషన్ బిల్లును ఈ రోజు నుంచి అమలు చేసినా తాము సంపూర్ణంగా మద్దతు పలుకుతామన్నారు. అందుకు యావత్ ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉందన్నారు.
గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 181
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో180 పరుగులకు ఆలౌటైంది. కామోరూన్ గ్రీన్ 79: (55 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్స్ లు ) కష్టాల్లో పడిన కోల్కతా నైట్ రైడర్స్ను అర్ధ శతకంతో ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కగిసో రభడ 3, సిరాజ్ 2, అశోక్ శర్మ 2, రషీద్ ఖాన్,ప్రసిద్ధ్ క్రిష్ణ తలో వికెట్ తీశారు.
ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి
జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. శుక్రవారంనాడు హజారీబాగ్ జిల్లాలోని బటుకా ప్రాంతంలోని కెరెదారి పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, పోలీసులకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం కూంబింగ్కు వెళ్లిన మావోయిస్టులు తారసపడడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మృతి చెందిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు నేత సహదేవ్ మహతో, రంజిత్ గంజూ, బుదన్ కర్మాలి, ఉన్నారు.
Unanimous Rejection for Ustaad Bhagat Singh on OTT
Ustaad Bhagat Singh is one of the biggest debacles of Telugu cinema in this year and it is the biggest flop in Pawan Kalyan’s career. Apart from criticism, the entire team was badly trolled and the makers lost big money. Ustaad Bhagat Singh is now streaming on Netflix since yesterday. Usually after the release of […] The post Unanimous Rejection for Ustaad Bhagat Singh on OTT appeared first on Telugu360 .
రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9మంది మృతి
కర్నాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. శుక్రవారంనాడు సుర్పూర్ తాలుకాలోని శాంతపుర క్రాస్ వద్ద దుర్ఘటన జరిగింది. కారు, ఓ ప్రైవేటు బస్సు పరస్పరం ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కృష్ణనాయక్(52) ఆయన భార్య అనంతకళ(45)తో పాటు కుమారుడు, కోడలు, మనవలు, మనవరాళ్లు మొత్తం 9మంది మృత్యువాతపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. దుర్ఘటన నుంచి 10 సంవత్సరాల బాలుడు విరాట్ గాయాలతో బయటపడ్డాడు. కారు రన్నింగ్లో ఉండగా టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుర్ఘటన సమయంలో కారులో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు.
నున్న మ్యాంగో మార్కెట్ లో జోరు - రైతులకు ఆశలు #NunnaMarket #MangoSeason #Banganapalli #Totapuri
Major Setback for Centre as Women’s Reservation-Linked Delimitation Bill Fails in Lok Sabha
In a significant political development, the Central government faced a major setback in Parliament today. A crucial Constitutional Amendment Bill linked to women’s reservation and Lok Sabha delimitation failed to secure approval in the Lok Sabha. The bill required a two-thirds majority to pass. However, the NDA government fell short during voting. The proposal could […] The post Major Setback for Centre as Women’s Reservation-Linked Delimitation Bill Fails in Lok Sabha appeared first on Telugu360 .
సోనియా గాంధీని బలిదేవత అనలేదా ?: బండి సంజయ్
ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ చేసిన వల్లే తెలంగాణలో వెయ్యి మంది బలయ్యారని, ఆమె బలిదేవత అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లోగడ విమర్శించలేదా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడలేదా? అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మీరు మంత్రులుగా ఎలా కొనసాగుతున్నారని ఆయన బిజెపిని విమర్శిస్తున్న రాష్ట్ర మంత్రులనుద్ధేశించి ప్రశ్నించారు. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి యూ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులుగా పోల్చుతూ బిజెపి ఎంపీ తేజస్వీ దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే వివాదం చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల తప్పిదాలవల్లే లక్షల మంది చనిపోయింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 2009లో తెలంగాణ ప్రకటించి కాంగ్రెస్ యూ-టర్న్ తీసుకోవడం వల్లే 1400 మంది యువకులు బలిదానమైంది నిజం కాదా? అని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంతో తమ పార్టీకి క్రెడిట్ వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు.కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు ఫోన్లో మాట్లాడుకునే ఈ కుట్రలకు తెరదీశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలెవరూ మోసపోవద్దని కోరుతున్నానని, రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటి నుండి చిత్తశుద్ధితో పని చేసింది తమ పార్టీయేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడితే బిఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.వాజ్పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు చత్తీష్ఘడ్, జార్ఝండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింద్న వాస్తవాలను ప్రజలకు చెబితే మీకు ఎందుకు అక్కసు అని ఆయన ప్రశ్నించారు.
Satya’s Jetlee Locks Its Release Date
Satya has teamed up once again with director Ritesh Rana, reviving their successful collaboration for Jetlee, a film that leans heavily into offbeat humor and action-packed storytelling. Known for their distinctive style from the Mathu Vadalara series, the duo appears ready to deliver another entertaining ride filled with quirky moments and unexpected twists. Promotions for […] The post Satya’s Jetlee Locks Its Release Date appeared first on Telugu360 .
రాహుల్పై కేసు నమోదు చేయండి: అలహాబాద్ హైకోర్టు
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్పై శుక్రవారంనాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.రాహుల్ గాంధీ భారత్తో పాటు బ్రిటీష్ పౌరసత్వం కూడా కలిగి ఉన్నారని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన ఎస్.విఘ్నేష్ శిశిర్ అనే బిజెపి కార్యకర్త అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. లోతైన విచారణ అవసరమని పేర్కొంటూ రాయ్బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సుభాశ్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పౌరసత్వానికి సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు తీర్పునిస్తూ ఈ వ్యవహారంపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా విచారణ చేపట్టాలని లేదా కేంద్ర సంస్థకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈనెల 20న కాళేశ్వరానికి సిఎం రేవంత్రెడ్డి
ఈనెల 20వ తేదీన కాళేశ్వరం బ్యారేజీలను సిఎం రేవంత్రెడ్డి పరిశీలిస్తారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శిస్తారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్డీఎస్ఏ అధికారులతో కాశేశ్వరం గురించి చర్చించామని ఆయన చెప్పారు. కాళేశ్వరం మరమ్మతులో అంతర్జాతీయ సంస్థ ఆఫ్రీ భాగస్వామ్యం ఉందన్నారు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. కాళేశ్వరం బిఆర్ఎస్ కట్టిందని వారి హయాంలోనే కూలిపోయిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వానికి దురుద్దేశం లేదన్నారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తామని ఉత్తమ్ చెప్పారు.
పేద విద్యార్థినులకు లాప్టాప్ల పంపిణీ చేసిన కెటిఆర్
పేద విద్యార్థినుల విద్యా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న ‘టచ్ ఏ లైఫ్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేద విద్యార్థులకు లాప్టాప్లను పంపిణీ చేశారు. శుక్రవారం నందినగర్లోని నివాసంలో మాజీ కార్పొరేటర్ సామల హేమ సారధ్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా విద్యార్థినులతో కలిసి కెటిఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. స్వయం సమృద్ధి సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని సూచించారు. ఈ సందర్బంగా కెటిఆర్ పంపిణీ చేసిన లాప్టాప్లను అందుకున్న నామాల రేష్మ, సలికంటి శ్రీవాణి, చింతగుట్ట వేదశ్రీ, ధుళ్ల రాజేశ్వరి, అతికా బారి, సనా సుల్తానా, కర్రె ఆర్తి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫౌండేషన్ చేస్తున్న కృషిని కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా మాట్లాడుతూ, తెలంగాణవ్యాప్తంగా బస్తీలు, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులను గుర్తించి, వారికి స్కాలర్షిప్లు, మెంటార్షిప్, నిరంతర మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే తమ లక్ష్యమని వివరించారు.
మహిళా రిజర్వేషన్ల అంశంలో బహిర్గతమైన బీజేపీ కపట నీతి : మంత్రి సీతక్క
‘లక్ష్యం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలు కూడా మంచివే కావాలని’ మహాత్మా గాంధీజీ చెప్పిన ఆలోచన ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మార్గదర్శకం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం జరిగిన పరిణామాలు బీజేపీ కపట నీతిని బహిర్గతం చేశాయని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళల సాధికారతపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, సింపుల్ మెజారిటీతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కావాలని డీ లిమిటేషన్ అంశాన్ని జోడించి బిల్లును సంక్లిష్టం చేశారని ఆరోపించారు. ఇది మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాదని, రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల దృష్టి కోణంతోనే ఈ బిల్లును ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం మీలో కనిపిస్తోందని మంత్రి విమర్శించారు. బిజెపి భావజాలమే మహిళా వ్యతిరేకమైనదని ఆమె విమర్శిస్తూ లోక్సభ సాక్షిగా బీజేపీకి మహిళా రిజర్వేషన్లపై నిజమైన నిబద్ధత లేదనే విషయం నిరూపితమైందని వెల్లడించారు. ఇది ప్రజాస్వామ్యానికి, మహిళల హక్కులకు మద్దతుగా నిలిచిన విజయంగా మంత్రి అభివర్ణించారు. ఈ దేశానికి మహిళా ప్రధానిని, మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్యా ఉపాధి అవకాశాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. మహిళల సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా, తక్షణమే అమలు చేయాలని తాము మరోసారి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఇంతకాలం మూలకు పడి ఉన్న మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 గురువారం నుంచి అమలులోకి వచ్చింది. అత్యంత కీలకమైన అనివార్య సాంకేతిక కారణాలతో ఈ చట్టం ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం పార్లమెంట్లో మహిళా చట్టం సవరణల రాజ్యాంగ బిల్లు చర్చకు వచ్చింది. అయితే ముందు చట్టం అమలులో ఉంటేనే , ప్రతిపాదిత సవరణలు వాస్తవికత దాల్చడానికి , వీటిపై చర్చకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తప్పనిసరిగా 2023 మహిళా చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించాల్సి వచ్చిందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు. ఇంతకాలం ప్రభుత్వం ద్వారా మహిళా రిజర్వేషన్ల చట్టం తద్వారా వారికి అందే 33 శాతం కోటా వర్తింపును రాజ్యాంగంలో భాగం చేయలేదు. పలు కారణాలతో చట్టం అమలులోకి రాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. చట్టం అనేది అమలులో ఉంటేనే దానికి సవరణలు లెక్కలోకి వస్తాయనేది కీలక విషయం కావడంతో, పార్లమెంటరీ, రాజ్యాంగ నిపుణులు పరిస్థితిని సమీక్షించి తక్షణ సర్దుబాటు చర్యకు దిగారు. బుధవారం ఓ వైపు సవరణలపై తీవ్రస్థాయి చర్చలు జోరందుకున్న దశలోనే 2023 చట్టం అమలులోకి వచ్చిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ చట్టం అమలులోకి వచ్చినట్లు రాత్రి పది గంటల సమయంలో నోటిఫికేషన్లో తెలిపారు. ఇప్పుడు దీని కొనసాగింపుగా ఈ చట్టం సవరణలపై పార్లమెంట్లో చర్చ తరువాత , చట్టం 2029 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విధంగా మహిళా రిజర్వేషన్ల కోటా వర్తింపు ఆరు సంవత్సరాలకు కానీ కార్యరూపం దాల్చదు. ఇప్పుడు రిజర్వేషన్ల చట్టం అమలులోకి వచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు సాంకేతిక కారణాలతో రిజర్వేషన్లను అమలు చేయడం ఇప్పటి సభ ద్వారా కుదరదని అధికారులు తెలిపారు. తదుపరి జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగే డిలిమిటేషన్ తరువాతనే మహిళలకు 33 శాతం కోటా కట్టబెట్టడానికి వీలుంటుంది. 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నారీ శక్తి వందన్ అధినియమ్ పేరిట ఈ మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టం మేరకు దేశంలోని మహిళలకు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు కేటాయింపు, తద్వారా వారికి చట్టసభలలో సాథికారికతకు వీలేర్పడుతుంది. అయితే మూడు సంవత్సరాలుగా ఈ కోటా చట్టం పెండింగ్లో ఉన్న దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించకపోవడం కీలక విషయం అయింది.
లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యంగ సవరణ బిల్లు
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డిఎ సర్కార్కి షాక్ తగిలింది. సర్కార్ ప్రవేశపెట్టిన 131వ రాజ్యంగ సవరణ బిల్లు కూడా మెజారిటీ సాధించలేకపోయింది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. అయితే ఎన్డిఎ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. మొత్తం 489 మంది సభ్యులు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. బిల్లు ఆమోదానికి 326 కావాల్సి ఉంది. అయితే బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓవర్లు వచ్చాయి. దీంతో బిల్లు వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై 528 సభ్యులు ఓటు వేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయినందున మిగితా రెండు బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అనంతరం లోక్సభ వాయిదా పడింది.
ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు: రాహుల్ గాంధీ
ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు అని, బాలాకోట్ , పెద్ద నోట్ల రద్దు, తరువాత ఆపరేషన్ సిందూర్ ఇవన్నీ ఆయన తంత్రాలని లోక్సభలో మహిళా బిల్లు చర్చ సందర్భంగా రాహుల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బిజెపి సభ్యులు అడ్డుతగిలారు. ప్రధాని మోడీపై రాహుల్ అనుచిత పదజాలాలకు దిగారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ మండిపడ్డారు. పైగా రాహుల్ మరోసారి దేశ సైనిక బలగాలను కించపర్చే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. దీనితో స్పీకర్ రాహుల్ను ఉద్ధేశించి సరిగ్గా మాట్లాడాలని, విషయానికి పరిమితం కావల్సి ఉందని స్పష్టం చేశారు. తప్పుడు పదజాలాలను అనుమతించేది లేదన్నారు. దీని తరువాత రాహుల్ గాంధీ తాను వాడిని ఇంద్రజాలికుడు పదం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన దేశంలోని సైనిక దళాలను తాను కించపర్చడం లేదని, బిజపి వారే ఈ విధంగా చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా రాహుల్ పదేపదే అంతా 16 అంకెలో దాగి ఉందని వ్యాఖ్యానించారు. గురువారం ప్రధాని మోడీ తమ ప్రసంగం దశలో నీరసంగా కన్పించారు. ఎందుకు అని ఆరాతీశానని , వెంటనే 16వతేదీ గుర్తుకు వచ్చింది. 16 కిటుకు వేరే కూడా ఉందని రాహుల్ తెలిపారు.ఈ దశలో ఆయన ఈ ప్రభుత్వం 16 మంది టిడిపి ఎంపిల మద్దతుపై ఆదారపడి పనిచేస్తున్న విషయం పరోక్షంగా ప్రస్తావించినట్లు వెల్లడైంది. రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు భార్య బాదరబందీ లేదన్నారు. అందరికీ జీవితంలో మహిళల నుంచి ఏదో ఒక పాఠం అబ్బుతుంది. తనకు సోదరి తల్లి నుంచి ఆత్మీయత దక్కుతుంది. ఇదే విధంగా ప్రధాని మోడీకి కూడా ఇదే స్పందన ఉంది. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ సభలో మాట్లాడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ తన భార్య గురించి కవిత చెప్పారని, అప్పటి నుంచి రాహుల్కు ఇంట్లో తిట్లు పడి ఉంటాయని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ అవును తనకు మోడీజి మాదిరిగానే ఈ అనుభూతి లేదు ఏం చేద్దామని చమత్కరించారు.
Nagabandham’s Sura Promo: Visually Stunning
The Secret Treasure, directed by Abhishek Nama and starring Virat Karrna, is shaping up as a grand blend of mythology and action mounted on an impressive scale. The makers have now unveiled the promo of the film’s second single, Sura Sura, which is set for release on the 19th of this month. Going by the […] The post Nagabandham’s Sura Promo: Visually Stunning appeared first on Telugu360 .
డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని నిందితులను ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6.09 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...మురళీ అనే వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్కు తీసుకుని వచ్చి కొండాపూర్, మాదవహిల్ స్ట్రీట్ ప్రాంతంలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేస్తున్న వికాస్, భరత్ చౌదరి డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇద్దరు నిందితులను గతకొంత కాలం నుంచి ఇంటీరియర్ డిజైన్ పేరుతో లగ్జరీ కార్లలో తిరుగుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. నిందితులపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది వికాస్ ,భరత్ చౌదరి డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్ గ్రాముకు రూ.5,000 చొప్పున విక్రయిస్తున్నారు. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మురళీ, మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం ముగ్గురిని కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. సిఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది నిందితులను పట్టుకున్నారు.
Jai Bhim has been a memorable film in the career of Suriya. The film had a direct digital release on OTT due to the ongoing coronavirus pandemic. The latest news is that Jai Bhim combo is back on cards. TJ Gnanavel will soon direct Suriya in one more film and it is said to be […] The post Jai Bhim Combo Back on Cards appeared first on Telugu360 .
ఎంఎల్ఎ మల్రెడ్డి రంగారెడ్డి పారిపోయాడు: మంచిరెడ్డి కిషన్రెడ్డి
బహిరంగ చర్చకు రాకుండా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పారిపోయాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం యాచారం మండలంలోని మేడిపల్లిలో ఉదయం 10 గంటలకు పార్మాసిటీ భూములపై అవకతవకలు జరిగాయని చెప్పిన మల్రెడ్డి రంగారెడ్డి దమ్ము, ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడని మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం రోజు క్రితం మేడిపల్లిలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే పోలీసులతో హౌస్ అరెస్టు చేసి బంధించారని గుర్తుచేశారు. పార్టీ కార్యాలయంలో మల్రెడ్డి రంగారెడ్డిపై వ్యతిరేకంగా నినాదాలు, సాగర్ రోడ్డుపై బైటాయింపు, మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. పార్మాసిటీపై ఇప్పటికైనా తప్పు తనదేనని ఒప్పుకోవాలని సవాల్ చేశారు. తప్పుడు మాటలు చెప్తూ ఎమ్మెల్యే కాలం వెళ్లదీస్తునారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండున్నరేండ్లలో కేవలం రూ.220 కోట్లు నిధులు తీసుకరావడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అనంతరం క్యామ మల్లేష్, ఎస్వీ రమణారెడ్డిలు మాట్లాడుతూ.. గతంలో మూడు సార్లు కిషన్రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలైన మల్రెడ్డి రంగారెడ్డి తప్పుడు మాటలు మానుకొని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దండెం రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్రెడ్డి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవీణ్, గూడూరి యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, జెర్కోని రాజు, నిట్టు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
100%grant |మంత్రి లోకేష్కు నర్సెస్ అసోసియేషన్ వినతి
100%grant | మంత్రి లోకేష్కు నర్సెస్ అసోసియేషన్ వినతి 100%grant | సమస్యల
మహిళ కారులో నుండి కింద పడినట్లుగా వైరల్ అవుతున్న వీడియో. వైరల్ వీడియో భారత్ కు సంబంధించింది కాదు. ఇది కుటుంబ కలహాలకు సంబంధించిన వీడియో
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెకెఆర్
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో కెకెఆర్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్లో అయినా నెగ్గి గెలుపు ఖాతా తెరవాలని కెకెఆర్ ఆశపడుతోంది. మరోవైపు గుజరాత్ గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. దీంతో ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో కెకెఆర్ ఇక మార్పు చేసింది. అలెన్ స్థానంలో సైఫర్ట్ని జట్టులోకి తీసుకుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్లోని జట్టునే కొనసాగిస్తోంది. తుది జట్లు: కెకెఆర్: టిమ్ సైఫర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానె(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), రోవ్మెన్ పొవెల్, రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి. జిటి: శుభ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.
grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి
grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి రాప్తాడు ఏప్రిల్ 17 ఆంధ్రప్రభ
7500people |రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో….
7500people | రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో…. 7500people | రోడ్డు
ఇంద్రకీలాద్రి కొండ స్థిరత్వం పై NIRM బృందం అధ్యయనం #Indrakeeladri#DurgaTemple#NIRM
భారతదేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్: సిఎం రేవంత్
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి ఉప రాష్ట్రపతిగా సేవలందించారని సిఎం రేవంత్రెడ్డి కొనియాడారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపిలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డిలు పాల్గొన్నారు.
Breaking : గుడ్ న్యూస్.. పెట్రోలు ధరలు ఇక పెరగవ్
ప్రపంచ దేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది.
M3Media&MahaMovies |జేడీ చక్రవర్తి లీడ్గా…
M3Media&MahaMovies | జేడీ చక్రవర్తి లీడ్గా… M3Media&MahaMovies | రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా
మహిళ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి : అమిత్ షా
మహిళ బిల్లును సమర్థిస్తున్నామంటూనే విపక్షాలు వ్యతిరేకించాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు
ఎసిబి వలలో చిక్కిన మరో అవినీతి అధికారి
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం కల్లు దుకాణం నిర్వాహకుడి వద్ద బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కల్లు దుకాణం ఒకచోట నుంచి మరో చోటకు మార్చేందుకు సదరు ఎక్సైజ్ సీఐ రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పన్నిన వలలో ఎక్సైజ్ సీఐ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షలతో పాటు ఎక్సైజ్ సీఐ బ్యాగులో దొరికిన రూ.45,760 లను స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్లోని ఎక్సైజ్ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించగా రూ.12 లక్షలు దొరికాయని, వాటిని కూడా సీజ్ చేశామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి శనివారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఎక్సైజ్ సీఐ ఆస్తులు, తదితర విషయాలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
సురక్ష పీపుల్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
సురక్ష పీపుల్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోగికి
Hyderabad : ఎంఐఎం కోట బద్దలు కానుందా? ఒవైసీకి షాక్ ఇవ్వనున్నారా?
అసదుద్దీన్ ఒవైసీకి ఇదే ఆఖరి ఛాన్స్ కానుందా? అంటే అవుననే అంటున్నారు
టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం…
టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం… కార్యకర్త అధినేత..పొలిట్ బ్యూరో గా గ్రామస్థాయి నుంచి
ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనలో జిల్లా ముందంజలో ఉండాలి.
ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనలో జిల్లా ముందంజలో ఉండాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.గణిత
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి తొర్రూరు,ఏప్రిల్17(ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): సంగారెడ్డి
కృత్యాలతో చిదివితే చిన్నారులు మర్చిపోలేరు
కృత్యాలతో చిదివితే చిన్నారులు మర్చిపోలేరు సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): గతేడాది
డగౌట్లో ఫోన్ వాడకం.. రాజస్థాన్ మేనేజర్కి జరిమానా
ఐపిఎల్-2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ మేనేజర్ రోమి బింధర్ డగౌట్లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. బింధర్ ఫోన్ వాడుతు కనిపించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై బిసిసిఐ చర్యలు చేపట్టింది. బింధర్కురూ.లక్ష జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూసుకవాలని హెచ్చరించింది. ఇదే తొలిసారి కావవడంతో అతను నిషేధం నుంచి తప్పించుకున్నాడు. వైభవ ఈ వివాదం నుంచి బయటపడ్డాడు. రోమి బింధర్ ఫోన్ వాడుతున్న సమయంలో ఆ పక్కనే కూర్చున్న వైభవ్ ఆ ఫోన్ని చూశాడు. దీంతో అతడికి కూడా శిక్ష పడుతుందని అనుకున్నారు. కానీ, వైభవ్కు ఎలాంటి తప్పు చేయలేదని.. లీగ్ రూల్స్ గురించి అతడికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బిసిసిఐ భావించింది.

34 C