Ustaad Bhagat Singh Feast from December
Ustaad Bhagat Singh is the next prestigious film of Powerstar Pawan Kalyan and the actor has completed shooting for his part. The pending shoot is expected to be completed before December and the film releases during the first quarter of 2026. The film’s director Harish Shankar has revealed that the promotional activities of Ustaad Bhagat […] The post Ustaad Bhagat Singh Feast from December appeared first on Telugu360 .
Jagan’s Unreal Plan vs NDA’s Real Action: The Visakha Steel Contrast
Former Chief Secretary LV Subrahmanyam has made explosive comments about YS Jagan Mohan Reddy’s plans during his term as Chief Minister. In a recent interview, he revealed that Jagan once proposed removing the Visakhapatnam Steel Plant and building a new capital city on its land. Subrahmanyam said he was stunned when he first heard this […] The post Jagan’s Unreal Plan vs NDA’s Real Action: The Visakha Steel Contrast appeared first on Telugu360 .
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్కె గోల్డెన్ ఆర్ట్, చందమామ క్రియేషన్స్, ఎన్విఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ‘టార్టాయిస్’. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రల్లో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ల్యాబ్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “టార్టాయిస్‘ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ, దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది”అని తెలిపారు. దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ “రాజ్ తరుణ్ కి కెరీర్ లో బెస్ట్ సినిమా ఇదవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ కథతో వస్తున్న మంచి థ్రిల్లర్ చిత్రమిది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం”అని అన్నారు.
Relationship | అమానవీయ ఘటన.. దయనీయం.. మృతదేహంతో బేరం..! Relationship, మంచిర్యాల జిల్లా
Hyderabad : పిస్తా హౌస్ పై ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Telangana : నేడు స్పీకర్ ఎదుటకు తెల్లం
తెలంగాణ శాసనసభ స్పీకర్ నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారించనున్నారు
Manohar Lal Khattar |దక్షిణాది రాష్ట్రాల సమావేశం..
Manohar Lal Khattar | దక్షిణాది రాష్ట్రాల సమావేశం Manohar Lal Khattar
కుల వ్యవస్థ మీద వ్యంగ్యంగా అద్భుతమైన కథ
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం కలర్ ఫోటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 25న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ టీజర్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ “మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్గా అద్భుతమైన కథను రాసుకున్నారు. బిందు మాధవి, నవదీప్, నందు బాగా నటించారు”అని అన్నారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ .. “దండోరా’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా ఇంతకు మించి అనేలా ఉంటుంది”అని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ.. “దండోరా’ టీజర్ను చూసి అల్లు అర్జున్ అభినందించారు. అదే మాకు పెద్ద సక్సెస్. ఇది చాలా మంచి చిత్రం. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఇలాంటి సందేశాన్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పారా? అని మూవీని చూసిన తరువాత ఆడియెన్స్ అంతా సర్ప్రైజ్ అవుతారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవదీప్, నందు, బిందు మాధవి, మురళీకాంత్, రవికృష్ణ, మౌనిక, మణిక, సృజన అడుసుమిల్లి పాల్గొన్నారు.
Bigg Boss Telugu 9: Nomination Drama, Emotional Manipulation & Tanuja’s Power Play
This week’s nomination episode began even before Bigg Boss made an announcement. Tensions were high, emotions were fragile, and the game took a turn toward heavy manipulation — both by contestants and, surprisingly, by Bigg Boss itself. Morning Fight Sets the Tone: The day began with a petty fight between Pavan and Ritu, escalating into […] The post Bigg Boss Telugu 9: Nomination Drama, Emotional Manipulation & Tanuja’s Power Play appeared first on Telugu360 .
ACB |చెవిరెడ్డి పిటిషన్ పై విచారణ..
ACB | చెవిరెడ్డి పిటిషన్ పై విచారణ.. ACB, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Andhra Pradesh : నేడు పుట్టపర్తికి చంద్రబాబు
పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు
Andhra Pradesh : అన్నదాతకు తీపికబురు.. రేపే డబ్బులు.. అందకుంటే ఇలా చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తుంది.
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలు సృష్టించాయి. మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. అఖండ 2 సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ను నవంబర్ 18న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఈ సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ గా ఉండబోతోంది. తమన్ థియేటర్స్ దద్దరిల్లే పాటని కంపోజ్ చేశారు. గ్రాండ్ సెట్ లో షూట్ చేసిన ఈ సాంగ్లో బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ ని అద్భుతంగా అలరించనున్నాయి. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్లో బాలయ్య ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది. వైజాగ్ జగదాంబ థియేటర్ లో గ్రాండ్ గా జరగనున్న సాంగ్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణ తో పాటు చిత్ర యూనిట్ హాజరుకానున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
HYD |డాక్టర్ గారూ.. మీరెక్కడ..
HYD | డాక్టర్ గారూ.. మీరెక్కడ.. ఎల్బీనగర్, ఆంధ్రప్రభ : పేదలకు మెరుగైన
Delhi Bomb Blast Case : పదిహేనుకు చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో మృతుల సంఖ్య 15కు చేరింది
Digital arrest |బెంగళూరు మహిళ డిజిటల్ అరెస్ట్..
Digital arrest | బెంగళూరు మహిళ డిజిటల్ అరెస్ట్.. Digital arrest, బెంగళూరు:
` ఆరోగ్యశాఖలో పూర్తయిన 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ` సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ` గడిచిన రెండేళ్లలో 9 …
జూబ్లీహిల్స్ దెబ్బకు బీఆర్ఎస్, బీజేపీలు గల్లంతు
` మరో 15 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం ` ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం ` ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తాం ` ఓ పార్టీకి …
` ఢాకా ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు ` అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగంలో దోషిగా నిర్దారణ ఢాకా(జనంసాక్షి):ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ …
ఎమ్మెల్యే అనర్హతపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి
` స్పీకర్ సుప్రీం హుకుం న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై విూరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని …
ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ‘స్థానిక’ పోరు
` డిసెంబర్ రెండో వారంలో షెడ్యూల్ ` సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం ` ప్రజాపాలన వారోత్సవాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో …
` ‘ఐ బొమ్మ’ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం `అతడి హార్డ్ డిస్క్లో 21 వేలకు పైగా సినిమాలు ` బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేలా …
India | అఖిలేష్ నేతృత్వం.? India kutami, న్యూఢిల్లీ : ఇండియా కూటమికి
Winter | వామ్మో.. చలి Winter, న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : వామ్మో..
మన తెలంగాణ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దాదాపు 1.30 గంటలకు హైదరాబాద్ యాత్రికులు వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకరుని ఢీకొంది. మక్కా నుంచి మదీనాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనయ్యారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరం లో ఈ బస్సు చమురు ట్యాంకర్ను ఢీకొంది. వీరి లో 18మంది మహిళలు, 17మంది పురుషు లు, 10మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృ తుల సంఖ్య ఎక్కువగా 45కు చేరిందని చెబుతున్నారు. బస్సులో ఉన్న వారందరూ హైదరాబాద్కు చెందినవారు. సిటి నుంచి 54మంది మక్కా యాత్ర కు వెళ్లగా అందులో 46మంది బస్సులో మక్కా నుంచి మదీనాకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో తీవ్ర విషాదం నెల కొంది. బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లో మొత్తం వ్యాపించడంతో ఒక్కరు మినహా 45 మంది సజీవ దహనం అయ్యారు. బాధితుల శవాలు కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. డ్రైవర్ పక్కనే కూర్చొని ఉండటం వల్ల షోయబ్ గాయా లతో బయటపడ్డాడని అధికారులు వెల్లడిం చారు. ప్రస్తుతం సౌదీ జర్మన్ హాస్పిటల్ ఐసియులో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అతడి కుటుంబం హైదరాబాద్లో ఆందోళనలో ఉంది. రియాద్ భారత రాయబారి కార్యాలయం, జెద్దా కాన్సులేట్ పూర్తి సహాయం అందిస్తోంది. జెద్దా కాన్సులేట్లో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, టోల్ఫ్రీ నంబర్ 8002440003 అందుబాటులో ఉంది. చనిపోయి నవారి మృతదేహాలు గుర్తింపు కోసం డిఎన్ఎ టెస్టులు జరిపారు. సౌదీలోనే అంత్యక్రియలు జరపాలని కుటుంబాలు కోరుతున్నాయి. ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఎల్ఎ మొహమ్మద్ మజీద్ హుస్సేన్ బాధిత కుటుంబాలతో సమావేశమై ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేక బృందాన్ని సౌదీ పంపుతోంది. అలాగే ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల బంధువులను సౌదీకి తీసుకెళ్లేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మం ది మరణించారు. విద్యానగర్కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబంతో కలిసి మ క్కాకు వెళ్లారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుటుంబానికి చెందిన 18 మంది చనిపోయారు. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లగా మరో నలుగురు మక్కాలోనే ఉన్నారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఇందులో ఒక యువకుడు బతికాడు. మిగిలిన 45 మంది మరణించారు. సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది మృతి చెందారని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ఈ క్రమంలో సీపీ వివరాలు వెల్లడించారు. సౌదీలో దగ్ధమైన బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని వివరాలు వెల్లడించారు. మొత్తం 54 మంది బృందం హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లిందని పేర్కొన్నారు. నవంబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు జెడ్డా టూర్ ప్లాన్ చేశారన్నారు. మృతులంతా హైదరాబాద్ వాసులే.. హజ్ కమిటీ సౌదీ ప్రమాదంలో 45 మంది మృతి చెందారని వారంతా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా పర్యాటకులంతా జెడ్డాకు వెళ్లారని పేర్కొంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు బస్సు ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సౌదీ అరేబియా మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మృతి చెందడంపై విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల కుటుంబాలకు రియాద్లో భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి మద్దతు అందిస్తున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో గత రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల బాధిత కుటుంబాలకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ ఘటనపై సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ, స్థానిక అధికారులతో సంప్ర దింపులు కొనసాగిస్తున్నట్లు రియాద్లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ తెలిపింది. అలాగే తెలంగాణ అధికారులతో, సంబంధిత కుటుంబాల తోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొంది. కాన్సులేట్ సిబ్బంది బృందం, భారతీయ వాలంటీర్లు వివిధ ఆస్పత్రిలో సహాయక చర్యల్లో నిమగ్న మైనట్లు తెలిపింది. దురదృష్టకరం: బండి సంజయ్ సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా, సౌదీ అరేబియా అధికారులతో మాట్లాడి, అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు. రూ.5లక్షల పరిహారం ప్రకటన సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభు త్వం రూ. 5లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం తీర్మానించింది. మక్కా నుంచి మదీనాకు యాత్రికులను తీసుకువెళుతున్న బస్సుకు ప్రమాదం జరిగిన దుర్ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం విదితమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ప్రభుత్వ ప్రతినిధి బృందంగా మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యే, మరియు మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారి వెంటనే సౌదీ అరేబియాకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.మరణిం చిన వారి కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు మృతదేహాలను అక్కడే మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, ఒక్కో బాధి త కుటుంబం నుంచి ఇద్దరు కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్లో సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపైనే ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు సై తం కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చ ర్చించింది. పార్టీపరంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. మొదటగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ఆ తర్వాత ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు వె ళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన వారోత్సవాలను, డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 20 25ను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్-ను నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా 8వ తేదీన ప్రజలకు వివరించే కార్యక్రమాలుంటాయి. డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం 15వ ఆర్ధిక సంఘం కాల పరిమితి వచ్చే 2026 మార్చి 31వ తేదీతో ముగియనుంది. అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయి. అందుకే ఈ డిసెంబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. డెడికేటెడ్ కమిషన్ బిసిలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇప్పటికే ఇచ్చింది. దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చాకే ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినేట్ నిర్ణయించింది. ---------కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు గడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయబావుట ఎగురవేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం ప్రముఖ సహజ కవి అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం తెలిపింది. అందెశ్రీ సేవలకు గుర్తుగా ‘అందెశ్రీ స్మృతివనం’ ఏర్పాటు, అలాగే ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న అంశాలపై కేబినెట్ చర్చించింది. అందెశ్రీ కుమారుడు ఎ. దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందెశ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ‘ గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధితకుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్ఆర్ఎస్ పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (ఆర్డిఆర్) ఎస్ఆర్ఎస్ పీ స్టేజ్ 2 కెనాల్ అని పేరు మార్చనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల ఉన్న ఇండస్ట్రీయల్ ల్యాండ్ను మల్టీ యూజ్ జోన్గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి)’కి కేబినెట్ ఆమోదం తెలిపింది.
మనతెలంగాణ/హైదరాబాద్: గిగ్, ప్లాట్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్ ఫారం బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ పేర్కొన్నారు కేబినెట్ భేటీ అనంతరం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని, వారి కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ఆయన హామీనిచ్చారని అందులో భాగంగానే వారి కోసం గిగ్వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని ఆయన తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిందని, ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని తెలిపారు. గిగ్ వర్కర్స్ బిల్లులోని కీలకాంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు గిగ్, ప్లాట్ఫాం వర్కర్లు ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం రవాణా (మొబిలిటీ), డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్నారు. వారు సాధారణంగా వారానికి 7 రోజుల పాటు రోజుకు 10 నుంచి-12 గంటల చొప్పున వర్క్ చేస్తున్నారు. వీరి ఆదాయంలో ప్లాట్ఫాంలు 20 శాతం నుంచి 30 శాతం వరకు కమిషన్గా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గిగ్ వర్కర్లకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. తాజా బిల్లులో గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘తెలంగాణ ప్లాట్ఫాం -ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు’ పేరుతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టనుంది. 1-2 శాతం వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి అగ్రి గేటర్లకు (ప్లాట్ఫాంలు) చెల్లించే సొమ్ములో 1--2 శాతం వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లీంచనున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తరఫున సిఎస్ఆర్ ఫండ్స్, విరాళాలు, గ్రాంట్లను ఈ నిధికి అందజేస్తుంది. ప్లాట్ఫాం చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనేది పర్యవేక్షించేందుకు రియల్-టైమ్ ‘వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ (డబ్ల్యుఎఫ్ఎఫ్ విఎస్)’ అందుబాటులోకి తీసుకురానున్నారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థ స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఉబర్, ఓలా వంటి ప్లాట్ ఫాంలు, కార్మికుల మధ్య తలెత్తే వివాదాలను ఇన్టైంలో పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పొందుపరిచింది. ఇందులో భాగంగా గిగ్ కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం, మోసాలు, అకారణంగా అకౌంట్లు సస్పెండ్ చేయడం.. లాంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారులను నియమిస్తారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చే సింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీ సుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూటి గా ప్రశ్నించింది. “ఎంఎల్ఎల అనర్హతపై ఈపాటి కి ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. ఇది తీవ్రమైన కోర్టు ధిక్కరణ. నూతన సంవత్సర వేడుకలను ఎక్కడ నిర్వహించుకోవాలో ఇక ఆయనే నిర్ణయించుకోవాలి” అని సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ గవాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్పై స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్ను ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో రెండు వేర్వేరు పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఈ సందర్బంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పామని గుర్తుచేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సిజెఐ గవాయ్ స్పష్టం చేశారు. దీంతో, స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎంఎల్ఏల అనర్హతపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనానికి తెలిపారు.
న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత 50 శాతం కోటా దాటరాదు. ఈ రేఖను పాటించి తీరాలని సుప్రీంకో ర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే నెలలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నిక లు జరుగుతాయి. తాము విధించిన ఈ 50 శాతం లక్ష్మణ రేఖను దాటితే ఉల్లంఘిస్తే ఎన్నికలను నిలిపివేస్తామని ఘాటుగా హెచ్చరించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, జాయ్మాలా బగ్చీతో కూ డిన ధర్మాసనం వెలువరించిన రూలింగ్ కోటా పెం పుదల నిర్ణయాలకు దిగనున్న పలు ఇతర రాష్ట్రాల కు షాక్గా మారింది. 2022 జెకె బంతియా కమిష న్ నివేదిక ముందటి పద్ధతిని పాటించాలి. అప్పటి రిజర్వేషన్ల ప్రాతిపదికననే ఎన్నికలు జరపాలి. కమిషన్ రిపోర్టులో ఇతర ఒబిసిలకు 27 శాతం కోటా అమలుకు సిఫార్సు చేశారు. 50 శాతం పరిమితి దాటరాదని పేర్కొన్న ధర్మాసనం ఈ దశలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జ నరల్ తుషార్ మెహత అభ్యర్థన మేరకు తదుపరి వి చారణను బుధవారానికి వాయిదా వేశారు. అయి తే రాష్ట్ర ప్రభుత్వం తాము విధిస్తున్న కోటాను దాటరాదని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎన్నికలపై ప్రభావం పడరాదనే వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదేమీ కుదరదు. కో టా పరిమితి దాటితే తాము ఎన్నికలపై స్టే విధిస్తామని తెలిపారు. ఈ విషయంలో కోర్టు అధికారాల ను పరీక్షించరాదని చురకలు పెట్టారు. రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటరాదని రాజ్యాంగ ధర్మాసనం తెలిపి ఉంది. దీనిపై తమ ద్విసభ్య ధర్మాసనం ఏమీ చేయలేదు. పైగా బంతియా కమిషన్ రిపోర్టు కోర్టు విచారణ పరిధిలోనే ఉంది. అంతకు ముందటి పరిస్థితులకు అనుగుణంగానే కోటా అమలు , ఎన్నికలు జరగాల్సిందే అని ధర్మాసనం తెలిపింది. కొన్ని సందర్భాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా 70 శాతం వరకూ చేరిందనే వాదనపై సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు వెలువరించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ మెహతా తమ వివరణ ఇచ్చారు. నామినేషన్ల ఘట్టం తుది దశ సోమవారంతో అయిపోయింది. పైగా ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మే ఆరవ తేదీన వెలువరించిన రూలింగ్ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై జస్టిస్ బగ్చీ స్పందించారు. అన్ని విషయాలు తమకు తెలుసునని , కమిషన్ ముందటి పరిస్థితి ఉండాలని తాము తెలియచేశామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని చెప్పడం జరిగితే దీని అర్థం కొన్ని వర్గాలకు 27 శాతం కోటా వర్తింపచేసుకోవచ్చునని చెప్పడమా? అని ప్రశ్నించారు. పరిమితి దాటవచ్చునని చెప్పడం జరిగితే , ఇక తమ ఇంతకు ముందటి పరిమితి దాటరాదనే రూలింగ్ మాట ఎటుపోతుందని ధర్మాసనం ప్రశ్నించింది. వేరే రూలింగ్ అమలుకు ఇంతకు ముందటిది చెల్లకుండా పోతుందా? ఒకదానికి పోటీగా మరోటి వెలురించినట్లుగా భావిస్తారా? అని ద్విసభ్య ధర్మాసనం సొలిసిటర్ జనరల్ను మందలించింది.
18 Nov Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
ఒకే కుటుంబానికి చెందిన 18మంది మృతి
సౌదీ అరేబియా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యానగర్ ప్రాంతానికి చెందిన 18మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 18మంది ఈ ఘటనలో అగ్నికి ఆహుతి కాగా వీరిలో 11 మంది ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటికి తాళం వేసుకుని పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన వీరంతా నిమిషాల వ్యవధిలోనే కాలి బూడిద కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు సౌదీ అరేబియా రహదారిపై డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం అగ్నికి ఆహుతి అయిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ బస్సులో విద్యానగర్ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు. విద్యానగర లోని మారక్స్ భవన్ పక్కన విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ (66) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఉమ్రా యాత్ర కోసం నసీరుద్దీన్ సహ కుటుంబ సభ్యులు 18మంది ఈనెల 9వ తేదీన సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లారు. అల్ మక్కా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలో 14 రోజుల ప్యాకేజ్ పై నసీరుద్దీన్తోపాటు అతని భార్య అత్తర్ బేగం (60 ), చిన్న కుమారుడు సల్లావుద్దీన్ (38), చిన్న కోడలు ఫరానా( 35) సహ వీరి ముగ్గురు పిల్లలు జైన్, ఫరీదా, శ్రీజ, నసీరుద్దీన్ పెద్ద కోడలు సన(40), ఆమె ముగ్గురు పిల్లలు మెహరీన్, మోజా, అజర్ సహ నసీరుద్దీన్ ముగ్గురు కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వాన బేగం, వీరి పిల్లలు హనీశ్, జాఫర్, మరియానా(12), సహజ(5)లు ఉమ్రా యాత్రకు వెళ్ళారు. అమెరికాలో ఉన్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్, ముషీరాబాద్, ముసారాంబాగ్ లో ఉండే ముగ్గురు అల్లుళ్ళు, మరో ఇద్దరు మనుమలు మాత్రం వారితో వెళ్ళలేదు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా, విద్యానగర్ లోనే ఉండే చిన్న కుమారుడు సలావుద్దీన్ అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఉమ్రా యాత్ర పూర్తిచేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళుతున్న వీరంతా బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. మొత్తం 8మంది పెద్దలు, 10 మంది పిల్లలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో విద్యానగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యానగర్ లోని నసీరుద్దీన్ ఇంటికి చేరుకున్న బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులందరిని తీసుకుని యాత్రకు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ బంధువులు విలపించారు. సిరాజుద్దీన్ ఒక్కడే అమెరికాలో ఉన్నందున బతికిపోయాడని, మొత్తం మూడు తరాలు ఒకే సారి మంటల్లో కాలిపోయారని చెపుతూ బంధువులు బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది.
فیکٹ چیک: 2023 کا سعودی عرب واقعہ کا ویڈیو حالیہ عمرہ بس حادثے کے گمراہ کن دعوے کے ساتھ وائرل
سوشل میڈیا میں وائرل ویڈیو میں دعویٰ کیا گیا ہیکہ یہ ویڈیو حالیہ سعودی بس حادثہ کا ہے جس میں 45 بھارتی عمرہ زائرین جاں بحق ہوئے۔ تاہم، تحقیقات سے پتہ چلتا ہے کہ یہ دراصل 2023 کا حادثہ ہے جو مقدس شہر مکہ کے قریب پیش آیا تھا۔
ఢిల్లీ పేలుడు కేసులో మరో నిందితుడు అరెస్ట్
జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం నాడు శ్రీనగర్ లో జాసిర్ బిలాల్ వాని అనే కుట్రదారుడిని అరెస్ట్ చేసిందని అధికారులు తెలిపారు. గతవారం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీకి జాసిర్ బిలాల్ వాని... క్రియాశీల సహ కుట్రదారుడుగా అధికారులు పేర్కొన్నారు.వాని జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీ గుండ్ నివాసి. అతడినికి డానిష్ అనే మారుపేరు కూడా ఉంది. నవంబర్ 10న కారు బాంబు పేలుడుకు ముందు డ్రోన్ లను సవరించడం, రాకెట్లను తయారు చేయడానికి ప్రయత్నించడం ద్వారా టెర్రరిస్ట్ దాడులు చేయడానికి సాంకేతిక సహాయం అందించాడని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వాని వెనుక చురుకైన కుట్రదారుడు, దాడి ప్లాన్ చేయడానికి ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేశాడని ఆ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 10న దేశ రాజధానిలో జరిగిన పేలుడు వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి ఏజెన్సీ వివిధ కోణాలను అన్వేషిస్తోంది. దాడిలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి రాష్ట్రాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.జాసిర్ బిలాల్ వాని పొలిటికల్ సైన్స్ చదివాడు. అతడిని ఉమర్ చేరదీసి కొన్నేళ్లపాటు ఆత్మాహుతి బాంబర్ గా మార్చే విధంగా తీవ్రంగా బ్రెయిన్ వాష్ చేశాడు. గత సంవత్సరం అక్టోబర్ లో కుల్గామ్ లోని ఒక మసీదులో డాక్యర్ మాడ్యూల్ ను కలవడానికి వాని అంగీకరించాడు. ఆ తర్వాత ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అద్దె ఇంట్లో చేరాడు.జమ్మూకశ్మీర్ పోలీసులు వానిని మొదట అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా మాడ్యూల్ లోని ఇతరులు తనను జేష్ -ఎ- మొహమ్మద్ లో ఉండాలని కోరినా, ఉమర్ తనను ఆత్మాహుతి బాంబర్ గా తయారయ్యేలా బ్రెయిన్ వాష్ చేశాడని పేర్కొన్నాడు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్కృష్ణలో ఉదయం 11.30 గంటలకు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారు. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అన్నీ వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందితే ఆ సర్టిఫికెట్ను సైతం వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రజలకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించడానికి ఉద్దేశించిన ఈ అధునాతన సేవలను ప్రభుత్వం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పత్తి కోనుగోళ్లు
సిసిఐ నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మెకు దిగడంతో సోమవారం రాష్ట్ర వ్యప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి అమ్ముకునేందుకు సిసిఐ కేంద్రాలకు తీసుకుని వచ్చినా సమ్మెతో కొనుగోళ్లు జరగకపోవడంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. సిసిఐ విధించిన ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యను పరిష్కరించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. రెండు దఫాలుగా ప్రభుత్వానికి అసోసియేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం నుండి సానుకూల వైఖరి లేకపోవడంతో అసోసియేషన్ సమ్మె బాట పట్టింది. సిసిఐ అవలంబిస్తున్న అసమతుల్య అలాట్మెంట్, స్లాట్ బుకింగ్ విధానాలతో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం చేయడంతో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్1, ఎల్2, ఎల్3 విధానంతో వెసులుబాటు కల్పించి అన్ని మిల్లులు నడిపేవిధంగా అమలు చేయకపోవడం, దీని ఫలితంగా జాబ్వర్క్ కొన్ని మిల్లులకే కేటాయించడంతో మిల్లులు నష్టపోతున్నట్లు మిల్లర్లు వాపోతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్కు పని లేక వెనుదిరిగి పోతున్నారని, మిల్లుల నెలవారీ మెయింటనెన్స్ చార్జీలు అదనంగా మిల్లర్లపై పడుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్, సిసిఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తూ మిల్లర్లు సమ్మెకు వెళ్లారు. పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పత్తిని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు భారీ సంఖ్యలో మిల్లుల ఎదుట బారులు తీరాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కొనుగోలు నిలిపివేయడంతో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు ఎక్కిడికక్కడే నిలిపిచిపోయింది. ఎనుమాముల మార్కెట్ తో పాటు జిన్నింగ్ మిల్లుల్లో సైతం పత్తి కొనుగోళ్లు అగిపోయాయి. విషయం తెలియక పత్తి తీసుకొచ్చిన రైతులు పత్తి యార్డు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని అనుశ్రీ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. కాగా, పత్తి కోనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో మిల్లర్లతో మంగళవారం జరిగే ప్రభుత్వం చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కుమార్తెను హత్య చేసిన తండ్రి అరెస్ట్
కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమార్తెను హత్య చేసి, కుమారునిపై హత్యాయత్నం చేసిన కేసులో వారి తండ్రి, నిందితుడు అనవేణి మల్లేష్ (38) సోమవారం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనవేణి మల్లేష్, పోసవ్వను 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి హర్షిత్ (కొడుకు), హర్షిత (కూతురు) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దురదృష్టవశాత్తు, ఆ ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే మానసిక, శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్, నేషనల్ హ్యాండీక్యాప్డ్ హాస్పిటల్ (బోయినపల్లి), కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రులు, తిరుపతి బర్డ్స్ , స్విమ్స్ వంటి అనేక ఆసుపత్రులలో పరీక్షలు చేయించినా, పిల్లల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. స్విమ్స్ వైద్యులు పిల్లల పరిస్థితి జీవితాంతం మారదని స్పష్టం చేయడంతో నిందితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈనెల 15న మధ్యాహ్నం నిందితుడి భార్య శనివారం మార్కెట్కు వెళ్లిన సమయంలో, మొదట కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపి పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించగా, వారు నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.అనంతరం, నిందితుడు ఒక కాటన్ టవల్ను రెండు ముక్కలుగా చేసి, వాటిని ఉపయోగించి కూతురు (హర్షిత), కొడుకు (హర్షిత్) మెడకు ఉరి వేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ చర్యలో కూతురు మరణించగా, కొడుకుపై హత్యాయత్నం జరిగింది. హత్య అనంతరం, నిందితుడు టవల్ ముక్కలను బయట పారవేసి ఇంటినుంచి పారిపోయాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు అదే సాయంత్రం కరీంనగర్ నుండి హైదరాబాద్ జెబిఎస్కు చేరుకుని, అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. మరుసటి రోజు మంచిర్యాలలో తిరుగుతూ, పోలీసుల భయంతో తలదాచుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నట్లు సిఐ జాన్ రెడ్డి తెలిపారు.
రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్గా సంగక్కర
రానున్న ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్రధాన కోచ్గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఎంపికయ్యాడు. ఇప్పటికే సంగక్కర రాజస్థాన్ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్గా ఉన్నాడు. తాజాగా జట్టు యాజమాన్యం టీమ్ ప్రధాన కోచ్గా కూడా నియమించింది. సంగక్కర వచ్చే సీజన్లో ఈ రెండు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. విక్రమ్ రాథోడ్ను అసిస్టెంట్ కోచ్గా నియమించింది.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ అవుతున్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. అద్భుతమైన కొండల మధ్య సాగే సినిమా మనసుకు హత్తుకునే ప్రేమకథ ప్రధానంగా ఉంటుంది. మేకర్స్ జయ కృష్ణ ఘట్టమనేని సరసన హీరోయిన్గా రషా తడానిని అధికారికంగా ప్రకటించారు. రషా... హీరోయిన్ రవీనా టండన్, ప్రముఖ నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూసర్ అనిల్ తడాని కుమార్తె. ఇక రషా... అజాద్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పుడు ‘ఎబి4’తో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
‘శ్రీ చక్ర’ హాస్పిటల్లో దారుణం
హనుమకొండలోని శ్రీ చక్ర హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జ్వరంతో ఐలావోని మండలం, గార్లపల్లి గ్రామానికి చెందిన కల్పన (40) ఆర్ఎంపి డాక్టర్ ని సంప్రదించగా హన్మకొండ శ్రీ చక్ర హాస్పిటల్కి రెఫర్ చేయడంతో ఆమె అడ్మిట్ అయింది. డాక్టర్ వెంటనే పరీక్షలు నిర్వహించాలని, దానికి సంబంధించిన డబ్బులు కట్టాలని చెప్పగా వెంటనే ఆ మహిళ కూతురు, భర్త కలిసి రూ.20 వేలు చెల్లించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయిందని, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటూ డబ్బులు కట్టమని అడగగా వారి వద్ద ఉన్న మరో రూ.20 వేలు కట్టారు. ఒకరోజు గడిచిన తర్వాత మళ్ళీ ఇంకా డబ్బులు కావాలి.. లక్ష రూపాయల వరకు అవుతుంది.. డయాలసిస్ చేయాలని డాక్టర్ చెప్పగా ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని, రేపు ఉదయానికల్లా సర్దుబాటు చేసి కడతామని చెప్పగా డాక్టర్, సిబ్బంది వినకుండా పేషంటు భర్తను, వారి కుమార్తెను భయభ్రాంతులకు గురిచేశారు. డబ్బులు కట్టకుంటే వైద్యం చేయమంటూ పెట్టిన వెంటిలేషన్ను తీసివేయగా పేషంటు ప్రాణాలు పోయాయి. డబ్బులు కట్టకుంటే పేషెంట్ ప్రాణాలు తీస్తారా అంటూ మృతురాలి భర్త, వారి కుమార్తె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేషంట్ బంధువులకు సమాచారం ఇవ్వగా బంధువులంతా హాస్పిటల్ చేరుకొని నిరసన తెలిపారు.
WhatsApp stock trading scam: స్టాక్ ట్రేడింగ్ పేరుతో టెకీకి భారీ మోసం
ఎల్బీనగర్కు చెందిన 42 ఏళ్ల టెకీకి WhatsApp స్టాక్ ట్రేడింగ్ గ్రూప్ పేరుతో రూ.3.37 కోట్లు పోయాయి
కాలనీల సమస్యలను గాలికొదిలేస్తున్న అధికారులు ప్రజలంటే పట్టింపు లేదా-డిప్యూటీ కమిషనర్ నరసింహతో కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజా సమస్యలపై అధికారులకు అలసత్వమెందుకని,కాలనీల సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మొద్దు నిద్రను వీడడం లేదని కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు సోమవారం కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి,సుభాష్ నగర్ 130 డివిజన్ లో నెలకొన్న సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నరసింహకు […] The post ప్రజా సమస్యలపై అలసత్వమెందుకు appeared first on Visalaandhra .
– Anna Datha : మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు
– Anna Datha : మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు పాలకోడేరు (భీమవరం), ఆంధ్రప్రభ:
వరి కోత మిషన్ లో పడి రైతు మృతి..
పెద్దమందడి, ఆంధ్రప్రభ : వరి కోత మిషన్ లో ప్రమాదవశాత్తు పడి రైతు
ADB |గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు..
ADB | గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు.. జైనూర్, ఆంధ్రప్రభ :
గర్భంలోనే ఇద్దరు కవల పిల్లలతో భార్య మృతి..మనస్తాపంతో భర్త ఆత్మహత్య
భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందాలని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ ఆర్జిఐఎ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి అన్న ప్రవీణ్ ఫిర్యాదు మేరకు ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ఆర్జిఐఎ పోలీస్ స్టేషన్ ఐన్స్పెక్టర్ బాల్రాజ్ వివరించారు.. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు రాష్ట్రానికి చెందిన ముత్యాల విజయ్ (40) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శంషాబాద్లోని సామ ఎన్క్ల్యూవ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భవతి.. ఆమెకు చెకప్ చేయించేందుకు అత్తాపూర్లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వారి వెంట శ్రావ్య తల్లి కూడా వచ్చింది. డాక్టర్లు ఆమెకు చెకప్ చేసి కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన చికిత్స అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమెను గుడిమల్కాపూర్లోని మైత్రి హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించిచడంతో హుటాహుటిన నగరంలోని సరోజిని హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రావ్య కడుపులో ఇద్దరు కవలలు, శ్రావ్య మృతి చెందారు. విషయాన్ని శ్రావ్య తల్లికి డాక్టర్లు తెలిపారు. ఆమె తన అల్లుడు విజయ్కి ఫోన్ ద్వారా చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై శంషాబాద్లోని తన రూమ్కు వెళ్లాడు. విజయ్ కోసం వెతికిన అతని మేనమామ ఫోన్ చేశాడు. కానీ రెస్పాండ్ కాకపోవడంతో హుటాహుటిన శంషాబాద్లోని రూమ్కు వచ్చిచూడగా విజయ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే విజయ్ అన్నయ్య ప్రవీణ్ కు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన శంషాబాద్లోని సామ ఎన్క్లూవ్కు చేరుకున్నాడు. తన తమ్ముడిని చూసిన ప్రవీణ్ శోకసముద్రంలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం పోలీస్ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన కారింగుల వెంకన్న, పద్మ దంపతులు.దంపతుల మధ్య కొద్దిరోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం నెలకొని వెంకన్న భార్య(40)ను రోకలిబండతో తలపై కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లి సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో కొరవడిన పాఠశాలలు:ఎంపి మధుయాష్కీ
ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని పిసిసి ప్రచార కమిటి చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం రాజ్భవన్లో జరిగిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మధుయాష్కి అతిథిగా హాజరయ్యారు. మేరా యువ భారత్ అధ్వర్యంలో వ ట్రైబల్ యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు. చివరి రోజున సోమవారం వారు రాజ్భవన్ను సందర్శించారు. వారం రోజుల పాటు వారు నేర్చుకున్న అంశాలను గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్య్రం లభించి డ్బ్బై ఐదు సంవత్సరాలు దాటినా గిరిజన ప్రాంతాల్లో ఇంకా అవసరమైన మేరకు పాఠశాలలు, ఆసుపత్రులు లేవని, తాగు నీరు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా ఆదివాసి యువత తమ హక్కుల కోసం ప్రశ్నించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యువజన అధికారి ఖుష్బు, రైల్వే బోర్డు సభ్యుడు నిర్మలా దేవి తదితరులు పాల్గొన్నారు.
నందీశ్వరుడి అభిషేకంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డా. వాణి…
సూర్యాపేట రూరల్: కార్తీక సోమవారం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాలను తెలంగాణ
కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన గౌరవ్ #UP #Bijnor #Snakebite #Hospital #ViralNews
ఎసిబి వలలో సివిల్ సప్లై డిప్యూటి తహసిల్ధార్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఎసిబి దాడులలో అవినీతి అధికారులు పట్టుబడి జైలుకు వెళ్తున్న ధన అశ తీరుతో ప్రభుత్వ అధికారులు మారడం లేదు. ఇదే క్రమంలో లంచం తీసుకుంటూ ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటి తహసిల్ధార్, టెక్నికల్ అసిస్టెంట్, రేషన్ డీలర్ సోమవారం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎసిబి డిఎస్పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7వ తేదిన మండలంలోని ఓ రేషన్షాప్కు తనిఖికి వెళ్ళిన సివిల్ డిటి మహమ్మద్ యాకుబ్ పాషా షాప్ లో నిలువలు తక్కువగా వున్నాయని అట్టి షాప్ ను సీజ్ చేస్తా అన్నాడు. మరల రేషన్ షాప్ను నడిపేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు రేషన్షాప్ డీలర్ను అసిస్టెంట్ విజయ్, రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతు శబరిష్తో 30వేల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంత డబ్బు ఇవ్వలేక రేషన్ డీలర్ ఎసిబి అధికారులను సంప్రదించాడు.దీంతో రేషన్ డీలర్ ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు పట్టణంలోని జగదాంబ సెంటర్లో గల ఓ సెల్ఫోన్ షాపులో రేషన్ డీలర్ మధ్యవర్తి శబరీష్కు డబ్బులు అందజేస్తుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకోని తహసిల్ధార్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. అట్టి విచారణలో సివిల్ సప్లై డిటి యాకుబ్పాషా, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఆదేశాల మేరకు డీలర్ నుండి డబ్బులు తీసుకున్నట్లు శబరీష్ ఒప్పుకోవడంతో ముగ్గురిపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో సైతం పట్టుబడ్డ యాకుబ్పాషా ఎసిబికి పట్టుబడ్డ ఇల్లందు సివిల్ సప్లై డిటి మహమ్మద్ యాకుబ్పాషాపై అనేక ఆరోపణలు వున్నాయి, గతంలో కొణిజర్లలో 30వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అవినీతికి అలవాటు పడ్డ అధికారి మారకపోగా మరల ఇల్లందు రేషన్డీలర్లను ఇబ్బందులకు గురిచేస్తు దొరికిపోయాడని ఎసిబి డిఎస్పి రమేష్ తెలిపారు. ప్రజల పనులకు ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే తమకు ఫోన్ నెంబర్ 1064 ద్వారా సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా వుంచుతామన్నారు.
MBNR |ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : పదర మండలం మద్దిమడుగులో నవంబర్ 30 నుంచి డిసెంబర్
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు వెల్లడి
రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు,తుది మెరిట్ జాబితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టిజి ఎంహెచ్ఎస్ఆర్బి) వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్టూ, మెడికల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల మొత్తం 24,045 మంది దరఖాస్తు చేసుకోగా.. గతేడాది నవంబర్ 10న జరిగిన ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షకు 23,323 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను పూర్తి చేసిన అనంతరం తాజాగా బోర్డు 1,260 మందితో తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. దివ్యాంగుల కేటగిరీకి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 2 పోస్టులను భర్తీ చేయలేదు. అలాగే హైకోర్టులో కొనసాగుతుండటంతో 4 పోస్టులను ఖాళీగా ఉంచింది. అదేవిధంగా, స్పోర్ట్ కేటగిరీలో ఉన్న 18 పోస్టులకు ఎంపిక జాబితాను వేరేగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టుల భర్తీ : మంత్రి రాజనర్సింహ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులతో పాటు, వైద్య సేవలు మెరుగుపర్చేందుకు అవసరమైన ఇతర అన్నిరకాల పోస్టులనూ భర్తీ చేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి డాక్టర్లు, సిబ్బంది లేక వెలవెలబోయిన హాస్పిటళ్లు, ఇప్పుడు కలకలలాడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. డాక్టర్లు, సిబ్బంది రాకతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
FIXED DIPOSIT : వారసులకే పరిహారం
FIXED DIPOSIT : వారసులకే పరిహారం (మచిలీపట్నం – ఆంధ్రప్రభ) వరకట్నం
ఉమ్రా యాత్రికుల మరణం పట్ల కెసిఆర్ సంతాపం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురై 42 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కెసిఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కెసిఆర్ ప్రార్థించారు. అత్యంత బాధాకరం : కెటిఆర్ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాడ సంతాపం తెలిపారు. మక్కా నుండి మదీనాకు వెళుతున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. లాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సర్కారు అండగా నిలవాలని తెలిపారు.
బోరబండలో ట్రాన్స్జెండర్ల మధ్య ఘర్షణ
ట్రాన్స్జెండర్ల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ పుట్టిన రోజు వేడుకల్లో రెండు ట్రాన్స్జెండర్ల గ్రూపులు కలిశాయి. ఈ సమయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో తిట్టుకోవడమే కాకుండా దాడులు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం వారి లీడర్ మోనాలిసా వద్దకు చేరింది. ఓ గ్రూపునకు చెందిన వారిని మోనాలిసా దూషించిందని మిగతా వారు ఆరోపించారు. మోనాలిసాకు వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్లు బోరబండ బస్స్టాప్ వద్ద ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారిని అడ్డుకోవడంతో ట్రాన్స్జెండర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హంగామా చేశారు. మోనాలిసాపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ట్రాన్స్జెండర్లు ఆరోపించారు.
నిప్పంటించుకుని డ్రైఫ్రూట్ వ్యాపారి మృతి
ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రైఫ్రూట్ వ్యాపారిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించిన తరువాత పోలీసులు విడిచిపెట్టేశారు.అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్ లోని ఖాజీగుండ్లో ఈ సంఘటన జరిగింది. ఇటీవల వైట్ కాలర్టెర్రర్ మాడ్యూల్ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఛేదించారు. డాక్టర్ల ముసుగులో కొందరు ఉగ్రవాద కుట్రకు పాల్పడినట్టు మొదట ఫరీదాబాద్లో బయటపడింది. నిందితుడైన డాక్టర్ అధీల్ రాథర్ను ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్లో జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ అదీల్ పొరుగున నివసించే ఫ్రూట్స్ వ్యాపారి బిలాల్ అహ్మద్, అతడి కుమారుడు జిస్రార్ బిలాల్ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఆదివారం కస్టడీ లోకి తీసుకున్నారు. ప్రశ్నించిన తరువాత బిలాల్ అహ్మద్ను విడిచిపెట్టేశారు. తరువాత ఖాజీగుండ్కు చేరుకున్న బిలాల్ అహ్మద్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బిలాల్ అహ్మద్ కుమారుడు జిస్రార్ బిలాల్ను మరింత ప్రశ్నించేందుకు ఇంకా పోలీస్ కస్టడీ లోనే ఉంచారు.
Maktal |శ్రీ సరస్వతీ శిశుమందిర్లో 19న సప్తశక్తి సంఘం మాతృ సమ్మేళనం…
మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ
బంగ్లాదేశ్ పదవీచ్యుత, ప్రవాస ప్రధాన మంత్రి షేక్ హసీనాకు దేశ ప్రధాన ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అమానుష నేరాలు, ఊచకోత అభియోగాలపై ఈ 78 సంవత్సరాల అవామీ లీగ్ నేత హసీనాకు విచారణ గైర్హాజరీ దశలోనే శిక్ష తీర్పు వెలువరించారు. బంగ్లాదేశ్కు చెందిన అంతర్జాతీయ నేరాల విచారణ ట్రిబ్యునల్ (ఐసిటి) నెలరోజుల విచారణ తరువాత అత్యంత సంచలనాత్మక, అంతర్జాతీయ పరిణామాల ప్రకంపనల నిర్ణయం వెలువరించింది. హసీనా ప్రస్తుతం పొరుగుదేశం భారత్లో అజ్ఞాత ప్రాంతంలో కుటుంబంతో గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి నివసిస్తున్నారు. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు గత ఏడాది జులై చివరిలో తనకు వ్యతిరేకంగా చెలరేగిన తీవ్రస్థాయి నిరసన ప్రదర్శనలను హసీనా అత్యంత పైశాచికంగా, అమానుషంగా అణచివేశారని , ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 1300 మందికి పైగా చనిపోవడానికి కారకులు అయ్యారని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై అభియోగాలు మోపింది. అణచివేత చర్యలకు ఆమెను ప్రధాన సూత్రధారి, ప్రేరకురాలని ఇందుకు మరణశిక్షకు గురి కావల్సిందే అని ఐసిటి తమ తీర్పులో తెలిపింది. గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రత్యేకించి విద్యార్థుల నిరసనల అణచివేత క్రమంలో తలెత్తిన రక్తపాతాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఘటనల తరువాత తలెత్తిన తిరుగుబాటు క్రమంలో బంగ్లా ప్రధాని హసీనా దేశం విడిచి పారిపోయారు. మిత్రపక్ష దేశం భారత్లో తలదాచుకున్నారు. పలు సార్లు సమన్లు పంపించినా ఆమె విచారణకు రాకపోవడంతో ఆమెను కోర్టు ఫరారీ నేతగా ప్రకటించింది. ఆమె పరోక్షంలోనే విచారణ జరిపింది. బంగ్లాదేశ్లో పార్లమెంటరీ ఎన్నికలకు నెలల ముందు తీర్పు వెలువడింది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీకి అవామీలీగ్పై అనర్హత వేటు ప్రకటించింది. ఢాకాలో ఉన్న ట్రిబ్యునల్ కార్యాలయం వెలుపల అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోపల తీర్పు చదివి విన్పించారు. నిరాయుధులైన పౌరులు, విద్యార్థులపై ఆటవిక దాడి, పైశాచిక రీతిలో భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ఇందుకు హసీనా చేసిన కవ్వింపు రెచ్చగొట్టే ప్రకటనలు, తన అధికార దుర్వినియోగం కారణం అని తీర్పులో తెలిపారు. కాల్పుల్లో ఢాకా, ఇతర ప్రాంతాలలో వందలాది మంది దారుణ రీతిలో ప్రాణాలు వదలడానికి కారణం అని తేలిన వ్యక్తి వేరే చోటకు వెళ్లి ఉంటే శిక్షను తప్పించుకుంటుందా? అని పేర్కొంటూ మరణశిక్షను విధిస్తూ , అమలు చర్యలకు ఆదేశించారు. విద్యార్థుల సారధ్యంలో తలెత్తిన నిరసనల అణచివేత చర్యలలో 1400 మంది చనిపోయ్యారని ఐరాస మానవ హక్కుల సంస్థ కార్యాలయం తెలిపిన విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు కూడా మరణశిక్ష విధించారు. అప్పటి పోలీసు విభాగం అధినేత చౌదురి అబ్దుల్లా అల్ మామూన్కు ఐదేళ్ల జైలు విధించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న " ప్రేమంటే " చిత్ర బృందం #Tirumala #TTD #Cinema #Premante #FilmTeam
Solution |వ్యవసాయ మార్కెట్ సమస్యలకు పరిష్కారం చూపండి..
Solution | వ్యవసాయ మార్కెట్ సమస్యలకు పరిష్కారం చూపండి.. Solution | కంటోన్మెంట్,
కుంగిన 5 అంతస్తుల భవనం#TeluguPost #telugu #post #news
MP Etela |ప్రభుత్వానికి ముందు చూపు లేదు..
MP Etela | ప్రభుత్వానికి ముందు చూపు లేదు.. కంటోన్మెంట్, ఆంధ్రప్రభ :
HIGH ACCiDENT : తప్పిన పెనుప్రమాదం
HIGH ACCIDENT : తప్పిన పెనుప్రమాదం ఆస్పరి (కర్నూలు జిల్లా), ఆంధ్రప్రభ :
Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ
Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్
బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలి:కల్వకుంట్ల కవిత
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని విఆర్ ఓసి గేట్ మీటింగ్లో ఆమె కార్మికులను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అపరిషృ్కతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 19న సింగరేణి సిఎండి కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ గతంలో సింగరేణి సంస్థ కోసం చాలా సహకరించారని, తద్వారా చాలామందికి ఉద్యోగాలు కల్పించగలిగామంటూ తండ్రిని యాదికి తెచ్చుకున్నారు. ప్రస్తుత సిఎం రేవంత్రెడ్డి పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలిశారని, ఎన్నడూ సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సమస్యలను పట్టించుకోవట్లేదని, రెండేళ్లుగా మెడికల్ బోర్డ్ కోసం కొట్లాడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి అక్షరాలా రూ.40 వేల కోట్లు అప్పు ఉందని, ప్రభుత్వాన్ని ఆర్థికంగా నడపగల సత్తా సింగరేణి సంస్థకి ఉందని, అటువంటి సంస్థ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఇప్పుడున్న స్థితిలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకోలేకున్నామని, సొంతింటి కల నెరవేరే మార్గం కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిదని, సమస్యల సుడిలో ఉన్న సంస్థ, కార్మికుల కోసం జాగృతి, హెచ్ఎంఎస్ పోరాడుతుందని అన్నారు. కేంద్రం బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేలం పాటలు నిర్వహిస్తోందని, దీనికి జాగృతి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, అప్పటి వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న రూ.470 రోజు వారీ వేతనాన్ని వేజ్ బోర్డు నిబంధనలు, లేబర్ చట్టాలకు అనుగుణంగా మారుస్తూ రూ.1200కు పెంచాలని, అందుకోసం తాను పోరాడుతానని అన్నారు. జెన్కో, ట్రాన్స్ కో మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. సింగరేణి గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ కట్ చేయకూడదని గతంలో తాను ఎంపిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు. అనంతరం మండల పరిధిలోని యాతాలకుంట గ్రామ సమీపంలో గల సీతారామ కాలువ పనుల పురోగతిని, భూ నిర్వాసితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి, గుంటి సుందర్, సాగర్, ఆంజనేయులు, వరికూటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, అజ్గర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడుగా తేజస్వియాదవ్
బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడుగా ఆర్జెడి నేత తేజస్వియాదవ్ సోమవారం ఎన్నికయ్యారు. అసెంబ్లీలో విపక్ష నాయకునిగా గుర్తింపు పొందడానికి అసెంబ్లీ మొత్తం బలంలో కనీసం 10 శాతం సీట్లను సాధించాలి. ఈమేరకు మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడికి 25 స్థానాలు లభించాయి. తేజస్వి తన సమీప ప్రత్యర్థి బీజేపికి చెందిన సతీష్ కుమార్పై 14,552 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన కుటుంబానికి కంచుకోటగా ఉంటున్న రాహోపూర్ నుంచి ఎన్నికయ్యారు.
HYD|వైభవంగా చివరి సోమవారం కార్తీక పూజ పూజలు..
HYD| వైభవంగా చివరి సోమవారం కార్తీక పూజ పూజలు.. కంటోన్మెంట్, ఆంధ్రప్రభ :
మహిళ నుంచి రూ.32 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
సిబిఐ అధికారులమని చెప్పి బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ నుంచి డిజిటల్ మోసగాళ్లు రూ.32 కోట్లు కాజేశారు. ముందుగా డీహెచ్ఎల్లో ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి నమ్మించాడు. ఆమె పేరు మీద మూడు క్రెడిట్ కార్డులు, నాలుగు పాస్ పోర్టులు, నిషేధిత ఎండిఎంఎ ఉన్న ఓ పార్శిల్ ముంబై లోని అంధేరీ డీహెచ్ఎల్ కేంద్రానికి వచ్చిందని చెప్పాడు. ఆ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని, తాను బెంగళూరులో నివసిస్తున్నట్టు ఆమె చెప్పింది. అయితే ఫోన్ చేసిన వ్యక్తి మీ ఫోన్ నెంబర్పార్శిల్లో లింక్ అయ్యి ఉందని, అది సైబర్ క్రైమ్ కావొచ్చని హెచ్చరించాడు. వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారని బెదిరించాడు. సీబీఐ అధికారుల నుంచి ఫోన్కాల్ వస్తుందని తెలిపాడు. అలాగే కాసేపటికి సీబీఐ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పార్శిల్లో ఉన్న ఆధారాల ద్వారా ఆమెను డిజిటల్ అరెస్టు చేసినట్టు బెదిరించాడు. అంతేకాదు మీపై నేరస్థులు నిఘా పెట్టారని, పోలీసులను సంప్రదించవచ్చని సూచించాడు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే అన్ని ఆస్తులను ఆర్బిఐ కి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని నమ్మించాడు. వారి మాటలకు భయపడిపోయిన మహిళ వారు చెప్పినట్టు చేసింది. మొత్తం తన వద్ద ఉన్న ఆస్తులు , డబ్బు అంతా వారికి అప్పగించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర సేవింగ్స్ను మోసగాళ్లు పంపిన 187 బ్యాంకు ఖాతాలకు విడదల వారీగా బదిలీ చేసింది. ఇలా దాదాపు ఆరు నెలల్లో ఆమె నుంచి రూ.32 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. క్లియరెన్స్ పూర్తయ్యాక ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగి ఇస్తామని నమ్మించారు. ఆ మేరకు నకిలీ క్లియరెన్స్ లెటర్ను కూడా జారీ చేశారు. కొన్నిరోజులకు ఆమె తన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేసింది. అయినా అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇలా కొన్నిరోజుల తరువాత వారు ఆమెతో కమ్యూనికేషన్ను ఆపేశారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
HYD |పడిపూజలో కార్పొరేటర్ ముద్దం ప్రత్యేక పూజలు…
HYD | పడిపూజలో కార్పొరేటర్ ముద్దం ప్రత్యేక పూజలు… ఓల్డ్ బోయిన్పల్లి ,ఆంధ్రప్రభ
Premante Trailer: Crackling Fun Entertainer
Priyadarshi delivered a big hit like Court this year and his upcoming film, Premante, has generated significant buzz with its engaging teaser and music. Directed by Navneeth Sriram and produced uncompromisingly by Jhanvi Narang and Pushkar Rammohan Rao, the project is backed by a robust promotional campaign orchestrated by Rana Daggubati’s Spirit Media. Today, the […] The post Premante Trailer: Crackling Fun Entertainer appeared first on Telugu360 .
డిజిటల్ అరెస్టు పేరిట.. ఏకంగా రూ.32 కోట్ల సైబర్ మోసం#TeluguPost #telugu #post #news
శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి #telugupost #latestnews #ibomma #viralnews
What’s the Next Target after iBomma?
The massive piracy network iBomma, once believed impossible to shut down, has finally been dismantled by the Telangana Cybercrime Police. The site’s operator, Imandi Ravi, who had been hiding in the Caribbean islands, was arrested and made to close both iBomma and Bappam TV using his own server access. Police also seized hundreds of hard […] The post What’s the Next Target after iBomma? appeared first on Telugu360 .
Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh : రైతులకు గుడ్న్యూస్....ఈ నెల 19న రైతుల ఖాతాల్లో డబ్బులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Hanumakonda | డబ్బు కోసం… ప్రాణం తీసిన వైద్యులుఆరోపిస్తున్న బాధితురాలి బంధువులు Hanumakonda
Akbaruddin Owaisi ఫ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఎంఐఎం పరిస్థితి ఏంటి?
ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
Awas plus gramin yojana Survay : స్పీడ్ అప్
Awas plus gramin yojana Survay : స్పీడ్ అప్ ఇళ్ల పన్ను
ఉగ్రవాదులకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు.. పాక్కు మరోసారి హెచ్చరిక
న్యూఢిల్లీ : దాయాది పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి గట్టిగా హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటలు మాత్రమేనని, దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. భారత్ను లక్షంగా ఉగ్రవాద ముఠాలకు మద్దతు కొనసాగిస్తే పాకిస్థాన్ తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని, ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాల గురించి ప్రపంచానికి ఆధారాలు చూపించామని, చర్చలు, ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని పాక్కు గట్టిగా హెచ్చరించారు. బ్లాక్ మెయిళ్లకు భయపడే స్థితిలో భారత్ లేదని, శత్రువులను ఎదుర్కోవడానికి దేశం లోని నేతలంతా ఏకతాటిపై పనిచేస్తున్నారన్నారు. ఆర్టికల్ 37ం తరువాత జమ్ముకశ్మీర్లో పరిస్థితి మెరుగుపడిందన్నారు. గతం కన్నా ఇప్పుడు పొరుగుదేశ మైన చైనాతో భారత్ సంబంధాలు బలపడుతున్నాయని ద్వివేది పేర్కొన్నారు.
Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మరణించారు
Srikakulam |రాకపోతే నోటీసులే !!
Srikakulam | రాకపోతే నోటీసులే !! శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజా
MLA |బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
MLA | బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి భక్తులకు ఎలాంటి అసౌకర్యములు కలగకుండా చర్యలు
మనతెలంగాణ/సిటీబ్యూరోః ఉప ఎన్నిక ప్రక్రియ ముగియడంతో జూబ్లీహిల్స్లో అమలులో ఉన్న ఎన్నికల కోడ్ను ఎత్తివేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 6న ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేయడంతో కోడ్ అమలులోకి వచ్చిన తెలిసిందే. ఈనెల 11న ఎన్నిక,14న ఎన్నికల ఫలితం వెలువడిన విషయమూ విధితమే. అయితే, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసిసి)ను ఎన్నికల కమిషన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అమలులో ఉన్న ఎంసిసి,ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక కోఢ్ వర్తించదని ఉత్తర్వులో పేర్కొన్నది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ ను కోరింది
AP | మామిడి రైతును ఆదుకుంటాం… చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: మామిడి రైతులను
విశాలాంధ్ర కందుకూరు: కందుకూరు పట్టణం కాళిదాసు వారి వీధిలో ఉన్న సుచిత భారత్ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే రెండు ఆటోల ఫిట్నెస్ కూడా ఉత్తి గ్యాస్ ను తలపించే విధంగా ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. ఏపీ 27 టి టి 32 32., ఏపీ 26 టి ఈ 49 21. అను నెంబర్ గల వాహనాలు దశాబ్దాలకు పైబడి ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా తిరగడం ఎంతవరకు సమంజసమని […] The post ఆటోల ఫిట్నెస్ లోను… గ్యాస్! appeared first on Visalaandhra .
Traffic Police |ఆక్రమణల తొలగింపు
Traffic Police | ఆక్రమణల తొలగింపు నిజాంపేట్ కార్పొరేషన్లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్
Krishna district |బంగారం చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం
సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది
TRAFFIC |ట్రాఫిక్ నిబంధనలు పాటించండి
TRAFFIC | ట్రాఫిక్ నిబంధనలు పాటించండి TRAFFIC | బాసర, ఆంధ్రప్రభ :

16 C