డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. వైద్యురాలు దీపిక ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అమర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతపురం మెడికల్ కాలేజీలో చదువుతూ విజయవాడ జిజిహెచ్లో వైద్యురాలిగా దీపిక విధులు నిర్వహిస్తున్నారు. నందిగామలో ప్రభుత్వ డాక్టర్ గా అమర్ విధులు నిర్వహిస్తున్నారు. దీపికతో ప్రేమయాణం నడిపించి చివరలో పెళ్లి చేసుకోనని అమర్ చెప్పడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు విచారణలో తేలింది. గత నెల 5న ప్రమాదకర ఇంజెక్షన్ చేసుకుని దీపిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు అమర్తో డాక్టర్ దీపిక మాట్లాడినట్టు కాల్ హిస్టరీలో తెలిసింది. అమర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకి అమర్ ను తరలించారు.
మున్సిపల్ అధికారులు ఎక్కడ..? వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి
పోలీసుల ఆధ్వర్యంలో జాగృతి కళా ప్రదర్శన..
పోలీసుల ఆధ్వర్యంలో జాగృతి కళా ప్రదర్శన.. పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని
వార్ ఎఫెక్ట్తో 100డాలర్లు దాటిన ముడిచమురు ధర కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 12లక్షల కోట్ల సంపద ఆవిరి చికాగో : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్కు వంద డాలర్లు దాటిపోయింది. యుద్ధ ముడి చమురుధర పెరగడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఒక్కరోజే రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. ముడి చమురు రవాణాకు కీలక ప్రాంతమైన హా ర్మూజ్ జలమార్గం మూసివేయడంతో ధరలు రె ట్టింపు అయ్యాయి. సోమవారం ఉదయం అంతర్జాతీయ ధరల ప్రకారం బ్రెంట్ చమురు ధర ఒక బ్యారెల్ 119.50 డాలర్ల వరకు చేరి, తర్వాత 106 డాలర్లకు తగ్గింది. అమెరికాలో ఉత్పత్తి అ య్యే వెస్ట్ టెక్సాస్ చమురు ధర కూడా 119 డాలర్లకు పైగా వెళ్లి తర్వాత 103 డాలర్లకు పడిపోయింది. బహ్రెయిన్ తమ దేశంలో కీలకమైన తాగునీటి శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ దాడితో బహ్రెయిన్ చమురు శుద్ధి కేం ద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో సరఫరా నిలిచిపోయింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లోని చ మురు నిల్వ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. రెండో వారం యుద్ధం కొనసాగడంతో చమురు ధరలు పెరగ్గా, దేశాలకు కష్టాలు మొదలయ్యాయి. పర్షియన్ గల్భ్ నుంచి ప్రపంచానికి చమురు, గ్యాస్ సరఫరా ఎంతో కీలకమైం ది. హార్ముజ్ సముద్ర మార్గం ద్వారా రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అ వుతుంది. అయితే క్షిపణి, డ్రోన్ దాడుల భయం తో అనేక ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణం నిలిపివేశాయి. దీంతో ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. శుక్రవారం యుఎ స్ఎస్ అండ్ పి 1.3 శాతం, నాస్డాక్ కంపోజిట్ 1.6 శాతం పడిపోయాయి. భారత మార్కెట్లు కూడా భారీగా నష్టాలను చూస్తున్నాయి. రూ.12 లక్షల కోట్లు ఆవిరి ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు భారీగా పెరడం గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్మార్కెట్లను కుదిపేసింది. సెన్సెక్స్ ఓ దశలో 2000 పాయింట్లకు పైగా పడిపోగా, ఆ తర్వాత కోలుకుని 1,353 పాయింట్లు (1.71 శాతం) తగ్గి 77,566 వద్ద ముగిసింది. నిఫ్టీ 422 పాయింట్లు (1.73 శాతం) పడిపోయి 24,028 పాయింట్లకు చేరింది. బ్యాంకింగ్, ఆటో, లోహ, ఇంధన, వినియోగ వస్తువుల రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. సోమవారం ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.12 లక్షల కోట్లు ఆవిరైంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఫిబ్రవరి ఫలితంగా పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.22 లక్షల కోట్లు తగ్గింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఫిబ్రవరి 27న రూ.463 లక్షల కోట్లు ఉండగా, మార్చి 9 నాటికి అది రూ.441 లక్షల కోట్లకు తగ్గింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లో చమురు ధరలు 60 శాతం పెరి గి ఒక బ్యారెల్కు 105 డాలర్ల వరకు చేరాయి. నిపుణులు ఈ ధరలు 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 92కి పడిపోయిన రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 46 పైసలు తగ్గి 92.33 వద్ద ముగిసింది. ఇదే ఇప్పటివరకు కనిష్ట స్థాయి, చమురు ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.1.60 లక్షలకు చేరింది. ఒక కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2.63 లక్షలుగా నమోదైంది. ఆసియా, అమెరికా మార్కెట్లలో కూడా పతనం కనిపించడం ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలను పెంచుతోంది.
ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగవేత పదవి కాపాడుకోవడానికి గాంధీ కుటుంబానికి ఏటా వెయ్యికోట్ల కప్పం ఆరు కాంగ్రెస్ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ బిల్లును అసెంబ్లీలో పెడతాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: కాంగ్రెస్ హ మీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రతిపాదిస్తున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్ఏ కెటిఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో వివిధ పార్టీల నాయకు లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు బిఆర్ఎస్లో చేరిన సందర్భంగా కెటిఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలన్నారు. కెసిఆర్ పాలనలో రైతులకు డిసెంబర్లో రైతుబంధు పడేదని, ఇప్పుడు మార్చి 9 వ తేదీ వచ్చిన మరో 15 రోజుల్లో పంటలు కోతకు వచ్చిన రైతు బంధు వేయలేదని, ఇప్పటికి మూడు సార్లు రైతు బంధు ఎగవేశారని, సిఎం రేవంత్ రెడ్డి రైతుబంధును ఎత్తే సి కొత్తగా రైతుబంధు బదులుగా రాహుల్ బంధు ప్రారంభించాడని కెటిఆర్ ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్రెడ్డితన పదవిని కాపాడుకోవడానికి ఏటా వెయ్యికోట్లు గాంధీ కుటుంబానికి కప్పం కడుతున్నాడని కెటిఆర్ ఆరోపించారు. రైతులకు బోనస్ లేదు, కాంగ్రెస్కు, రేవంత్కి సిగ్గు లేదని కెటిఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇండ్లు కూల్చడమా అని నిలదీశారు.ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో శత్రుదేశాలమీదకు యుద్ధానికి పోయినట్లు 3000 మంది పోలీసులతో వెళ్లి 1000 ఇండ్లు బుల్డోజర్లతో కూల్చేశారని, మహబూబ్ నగర్లో దివ్యాంగులు కట్టుకున్న150 నుండి 200 ఇండ్లు కూల్చేశారన్నారు. బఫర్జోన్లో కట్టిన ఇండ్లను కూలుస్తానని చెపుతున్న సిఎం రేవంత్రెడ్డి స్వయంగా కొడంగల్ సమీపంలోని కోస్గిలో రెడ్డికుంటలో తన ఇంటిని పూర్తిగా చెరువులోనే కట్టాడని దాన్నెందుకు కూల్చరని నిలదీశారు. సిఎం అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కట్టాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డా. వివేక్, పట్నం మహేందర్ రెడ్డి చెరువులో ఇండ్లు కడితే వాటినెందుకు కూల్చడం లేదని అన్నారు. గరీబోళ్ల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యామా అని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసగించి మరి కొద్ది రోజుల్లో వెయ్యి రోజులకు చేరుతున్నా ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్దత కల్పిస్తామని హమీ ఇచ్చిమర్చిపోయాడన్నారు. బిఆర్ఎస్ మాత్రం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ఈ నెల 16నుండి ప్రారంభమయేశాసనసభ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని పోరాడుతామన్నారు.ఆడవారికి ఫ్రీ బస్ అని మగవాళ్ల దగ్గర డబుల్ టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. తాము ఫ్రీ బస్ విధానానికి వ్యతిరేకం కాదన్నారు. కళ్యాణలక్ష్మి పథకంక్రింద కెసిఆర్ లక్ష రూపాయలిస్తే కాంగ్రెస్ వారు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీశారు. సిఎం ఆర్ధిక కష్టాలున్నాయంటున్నాడని మరి అలాంటప్పుడు లక్షన్నర కోట్లతో మూసి సుందరీకరణ ఎందుకని నిలదీశారు. ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలిస్తామన్న రాహుల్ గాంధీ పత్తాలేకుండా పో యాడన్నారు. ఇవన్నీ చూస్తూ ప్రజలు అన్నా కేసిఆర్ ఎక్కడున్నారు అని అంటున్నారని, మళ్లీ కేసిఆర్ సిఎం కావాలని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారన్నారు. ఫిబ్రవరి 9న రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు కాగానే రూ.లు 9 వేల కోట్లు రైతు బంధు వేస్తానని హమీ ఇచ్చారని అవి ఎటు పోయాయన్నారు.బిసిలకు బడ్జెట్లో లక్ష కోట్లు అన్నారు. ఇప్పటి వరకు మూడు బడ్జెట్లో పో యాయి ఇంతవరకు దిక్కులేదన్నారు. మార్చి 16 నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో బిసిలకు రూ.20వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాలన్నారు. అంబేద్కర్ అభయ హస్తం క్రింద రూ.12 లక్షలు ఇస్తామని మోసగించారన్నా రు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు పెన్షన్లు పెంచాడని,తెలంగాణలో కూడా ప్రజలు పెన్షన్ల పెంపుకోసం ఎదిరి చూస్తున్నారన్నారు. యువతకు ఏటా రెండు లక్షలు ఉద్యోగాలని ఇప్పటి వరకు కనీసం పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందన్నారు.తెలంగాణలో దుర్మార్గ, అప్రజాస్వామ్య, రాబంధు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊపిరి సల్పనివ్వకుండా బిఆర్ఎస్ చేయనున్న ఉద్యమాలకు ప్రజలందరూ కలిసి రావాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్లు
ముంబై/బెంగళూరు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరిపడా గ్యాస్ ఉత్పత్తి, సరఫరా మందగించడంతో వివిధ రంగాలపై ఆ ప్రభావం పడుతోంది. గ్యాస్ కంపెనీలు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో ముంబై, బెంగళూరులో హోటళ్లను రెండు మూడు రోజుల్లో మూసివేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు హోటళ్ల అ సోసియేషన్లు లేఖలు కూడా విడుదల చేస్తున్నాయి. వంట గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో హోటళ్లు మూసివేయాల్సి ఉంటుందని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ శెట్టి ప్రకటించారు.
కల్తీ నూనె, గోధుమ పిండి ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై ఎస్ఓటి పోలీసుల దాడి భారీగా పట్టుబడ్డ కల్తీ నూనె, గోధుమ పిండి గడువు ముగిసిన నూనె, గోధుమ పిండి సేకరించి కొత్త ప్యాకెట్లతో మార్కెట్లో విక్రయాలు మన తెలంగాణ/గచ్చిబౌలి: కల్తీ ఆహర పదార్థాలపై ఎస్ఓటి పోలీసులు చేస్తున్న దాడుల్లో రోజుకో కొత్త రకం కల్తీ పదార్ధాలు బయటపడుతున్నాయి. కల్తీ అల్లం పేస్ట్ కేసును మరవకముందే తాజాగా కల్తీ నూనె, గోధుమ పిండి పదార్థాలు పోలీసుల దాడుల్లో బయటపడ్డాయి. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో కల్తీ నూనె, గోధుమ పిండి తయారీ కేంద్రంపై సోవమవారం మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో భారీ మొత్తం లో 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, 5,192 కిలో ల గోధుమ పిండి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల ప్రకారం గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న జస్నాత్ ట్రేడర్స్ దుకాణం పై మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. రాజస్థాన్కు చెందిన దుకాణ యజమాని భన్వ ర్ రామ్ జాట్ (46), అతని కుమారు డు అశోక్ కుమార్ (22) జస్నాత్ ట్రేడర్స్ను నడుపుతున్నా రు. ఇద్దరూ గడువు ముగిసిన వివిధ కంపెనీల వం ట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనె తో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పా పాయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూ జా అయిల్ వంటి పేర్లతో మళ్లీ కొత్తగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో నూనెను విక్రయిస్తున్నా రు. అలాగే పలు కంపెనీలకు చెందిన గడువు ము గిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాత్ గోల్డ్ చ క్కి ఆట పేరుతో తిరిగి ప్యాక్ చేసి మార్కెట్ లో అ మ్ముతున్నారు. కాగా తండ్రి కొడుకులు కల్తీ నూనె, గోధుమ పిండి తయారు చేసి విక్రయిస్తున్నట్లు ప క్కా సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు దుకాణంపై దాడి చేశారు. దాడిలో సుమారు 10,55,460 లక్షల విలువ చేసే 5,026 లీటర్ల క ల్తీ నూనె, 3,11,520 లక్షల విలువ చేసే 5,192 కల్తీ గోధుమ పిండి, ఒక వెయింగ్ మిషన్, ఒక ఆ యిల్ ఫిల్టర్ మిషన్, ఒక గోధుమ ఫిల్టర్ మిషన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు, టిఎస్07యుఎల్2884 నెంబర్ గల ఒక టెంపో ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ క్వారీతో నాకు ఎలాంటి సంబంధం లేదు:పొంగులేటి
నాపై మొరిగే కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో నాకు తెలుసు ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో నిజమైన లబ్ధిదారులు 410 మంది మాత్రమే 330 మంది బోగస్ లబ్ధిదారులే నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కెసిఆర్తో సహా బిఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలి ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి హాజరై అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాం విలేకరులతో చిట్చాట్లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్రోడ్డు) పక్కన రాజేంద్రనగర్లో ఉన్న క్రషర్తో, క్వారీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. తనపై మొరిగే కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో తనకు తెలుసన్నారు. ఆ క్వారీ నాదని కొందరు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని, నాకు క్రషర్ నడిపే ఓపిక లేదని, అది నా క్రషర్ కాదని, బిఆర్ఎస్ నేతలు చెబుతున్నానని ఆయన తెలిపారు. తిరుమల క్రషర్కు వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ ఉందని, ఆ క్రషర్ కంపెనీకి మా కంటైనర్ను తీసుకువెళ్లిందని దానిపై ఉన్న పేరును తొలగించినట్లు ఉన్నారని, దానిని ఆధారంగా కొందరు పిచ్చికూతలు కూస్తున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో 410 మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారని అందులో 330మంది బోగస్ అని తేలిందని, నిజమైన 410 మంది లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని, తనపై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెబుతానని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వెలుగుపట్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుందని మరోమారు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన చాంబర్లో చిట్చాట్ చేశారు. బిఆర్ఎస్ శాసనసభ్యులు సభకు వచ్చి తమ వాదనలు వినిపించాలి ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కెసిఆర్తో సహా బిఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ హాజరై అడిగే ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బిఆర్ఎస్ శాసనసభ్యులు సభకు వచ్చి తమ వాదనలు వినిపిస్తే, ప్రతి విషయానికి సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ, ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వారి సొంత ఎజెండాతో సభకు వస్తున్నారన్నారు.
కొత్త వాటి పరిష్కారం పోలీసులకు సవాల్ సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పౌరులకు మెరుగైన సేవలు శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్లో సిఎం మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్- 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత బాగా పనిచేసినా ఈ వ్యవస్థలో మొదటగా బద్నాం అయ్యేది పోలీసులే అని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు ముందుగా సమస్యలను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. సమస్య అర్థమైతే సగం సమస్యను పరిష్కారం లభించినట్లేనని ఆయన తెలిపారు. దేశంలోని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారిందని, ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు నగరంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయని, అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక కోల్కత్తా గురించి చెప్పే అవసరమే లేదని, వాటితో పోలీస్తే మనం చాలా బెటర్ ప్లేస్లో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఛాలెంజ్లు రెండు రకాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని, మనం ఎక్కడున్నామో తెలుసుకోగలిగితే మనం ఎక్కడికి చేరుకోవాలో తెలుస్తుందని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. అందుకే ఈ రిట్రీట్ కార్యక్రమం ద్వారా సమస్యలు, పరిష్కారాల గురించి విశ్లేషించుకున్నామన్నారు. ఛాలెంజ్లు రెండు రకాలని, ఒకటి టెక్నికల్ ఛాలెంజ్, రెండోది అడాప్టివ్ ఛాలెంజ్ రిసోర్సెస్ అని ఆయన తెలిపారు. సమయాన్ని కేటాయిస్తే టెక్నికల్ ఛాలెంజ్ ను అధిగమించ వచ్చని, కానీ, అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో ఎదురైన సమస్య లోతును అర్థంచేసుకోవాలని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండకూడదనే ‘తెలంగాణ రైజింగ్ 2047’ పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించుకున్నామని ఆయన తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్గా పరిగణించుకుంటున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశా రు. సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టంను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్న సిబ్బంది, అధికారులను అప్గ్రేడ్ చేసుకోకపోతే నేరాలను నిరోధించలేమన్నారు. పనితీరు ఆధారంగానే పోస్టింగ్లు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటోమోడ్ కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరమన్నారు. పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాల్సిందేనని, అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ తెలిపారు. మీ పనితీరు ఆధారంగానే పోస్టింగ్లు ఉంటాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్- 2026 కార్యక్రమంలో భాగంగా విభాగాల వారీగా వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు సిఎంకు వివరించారు. భవిష్యత్ లో పోలీసింగ్ లో తీసుకురావాల్సిన మార్పులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులకు సిఎం రేవంత్రెడ్డి పలు సూచనలు చేశారు. సాంకేతిక పెరుగుతుండడంతో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సిఎం సూచించారు.
ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు
అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ వర్శిటీ ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఏర్పాట్లు చేయాలి ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలి క్రీడాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిఎం రేవంత్రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఒలింపిక్స్లో ప్రతిభ కనబర్చేలా క్రీడాకారులకు శిక్షణ ఇ వ్వడానికి అవసరమైన అన్ని వసతులతో స్పోర్ట్ యూనివర్సిటీని సిద్ధం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించా రు. ఒలంపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, ఒలంపిక్స్ లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్లోని తన ని వాసంలో ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ రెడ్డి క్రీడాశాఖపై సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అంతర్జాతీయ ప్రమాణాల తో అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటు గురించి చర్చించారు. గచ్చిబౌలి ఔట్డోర్ స్టేడియాన్ని పునర్నిర్మించి ఆధునీకరించడంతో పాటు ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడ ల కోసం మైదానాలు ఇతర శిక్షణా సదుపాయాలను స్టేడియం ప్రాంగణంలో అభివృద్ధి చేయాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. ప్రతిపాదిత నిర్మాణాలకు సంబంధించిన పలు ఆర్కిటెక్చర్ నమూనాలను సిఎం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా, భవిష్యత్లో ఒలింపిక్స్, కామన్వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు తెలంగాణను వేదికగా నిలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఒలంపిక్స్లో తెలంగాణ క్రీడాకారుల ప్రతిభను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడి యం, ఎల్బీ స్టేడియం, సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాలని సిఎం సూచించా రు. ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సిఎం ఓ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రాజు, శేషాద్రి, స్పోర్ట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా.జి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
10th March 2026 |మంగళవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
10th March 2026 | మంగళవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు
రామగుండం థర్మల్ విద్యుత్ను కొనుగోలు చేయండి బొగ్గు సమీకరణకు ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి సిఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్టిపిసి రెండో దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న (3X800) మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పిపిఏ) చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సూచించారు. ఇంకా 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడానికి ఎన్టిపిసికి తగిన స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుతూ సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రామగుండంలో ఎన్టిపిసి ఏర్పాటు చేసిన మొదటి దశకు దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 2X800=1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడి 2023 లో ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అనంతరం సెకండ్ ఫేజ్ లో భాగంగా 3X800=2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టిపిసి చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. మొదటి దశ తరహాలో రెండవ దశలో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85% విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 3 న మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని ఆయన తెలిపారు. రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుంది కాబట్టి రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ రంగం మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్లో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సి ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా 2047 నాటికి రాష్ట్రంలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో ఎన్టిపిసికి దేశంలోనే విశేషమైన అనుభవం ఉందని ఆయన తెలిపారు. గతంలో విద్యుత్ రంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇతర థర్మల్ పవర్ ప్రాజెక్టులతో పోలుస్తూ, మొదటి దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టు గురించి స్వయంగా మీరు ప్రశంసించారని ఆయన ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. రెండో దశ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడానికి ఎన్టిపిసికి స్వేచ్ఛను ఇస్తే, థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఎన్టిపిసి సిద్ధంగా ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి, ఈ విషయంలో మీరు చొరవ తీసుకుని,విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఎన్టిపిసి రెండో దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పిపిఏ) చేసుకునేలా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వానికి, ప్రజలకు మేలు చేకూర్చే రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
ఇరాన్కు రష్యా పూర్తి అండగా ఉంటుంది
మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయిల్, అమెరికాలతో సాగు తున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరా న్కు మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖామేనీకి పుతిన్ అభినందనలు తెలుపుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని సమర్థ వంతంగా నడిపించగలరని ఆశాభా వం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ […] The post ఇరాన్కు రష్యా పూర్తి అండగా ఉంటుంది appeared first on Visalaandhra .
నిందితులకుసుప్రీంలో చుక్కెదురు
రెవెన్యూ దస్త్రాల దహనం కేసు… న్యూదిల్లీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న మునిరత్నానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి పెద్దిరెడ్డి మాజీ పీఏ కాగా, మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. The post నిందితులకుసుప్రీంలో చుక్కెదురు appeared first on Visalaandhra .
. ఖామేనీ రెండో కుమారుడి ఎన్నిక. దేశవ్యాప్తంగా సంబరాలు. తెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ప్ర తి దాడులు తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖామేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స’ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు […] The post ఇరాన్ అధినేత ముజ్తబా appeared first on Visalaandhra .
పట్టుపట్టిన విపక్షాలుఅవకాశం లేదంటూ మొండికేసిన ప్రభుత్వం పార్లమెంటు ఆవరణలో నిరసన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పార్లమెంటును కుదిపేశాయి. అధి కార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పశ్చిమాసి యా పరిణామాలపై తక్షణమే చర్చిం చాలని ప్రతిపక్ష సభ్యులు లోక్సభలో డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు. స్పీకర్ అవిశ్వాసంపై చర్చ చేపడదామని ప్రభుత్వం వాదించింది. పశ్చిమాసియా రగులుతోందని, అక్కడ కోట్లమంది భారతీయులు చిక్కుకున్నారని, వారి భద్రత అత్యంత అవసరమని ప్రతిపక్షాలు స్పష్టంచేశాయి. యుద్ధం […] The post పశ్చిమాసియాపై చర్చించాల్సిందే appeared first on Visalaandhra .
భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్
. వచ్చే డిసెంబరుకు భూ వివాదాలన్నీ పరిష్కారం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. గత పాలనలో భూ అక్రమాలకు పాల్పడింది మంత్రుల ముఠాలే. నేడు అభివృద్ధి-సంక్షేమం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు […] The post భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ appeared first on Visalaandhra .
. మద్యం కేసులో కీలక నిందితుల విచారణ. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చే అవకాశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ భారీ కుంభకోణంలో వేల కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు, కమీషన్ల పంపకాలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక […] The post మద్యం కేసులోఈడీ దూకుడు appeared first on Visalaandhra .
. ముందుకు కదలని 66 పథకాలు. ఖాతాల్లో మూలుగుతున్న వేల కోట్ల కేంద్ర నిధులు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. అధికారుల అసమర్థతతో కుంటుపడుతున్న ప్రగతి విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు లేవంటూ సీఎం సైతం అనేక సభల్లో బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు… కానీ నిర్ణీత వ్యవధిలోగా కేంద్ర నిధులు వినియోగించుకోవాలన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి తట్టకపోవడం బాధాకరం. రాష్ట్ర వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసినట్లయితే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద […] The post నిధులున్నా పనులు సున్నా! appeared first on Visalaandhra .
తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
సారా ఆరోగ్యానికి హానికరం కాదు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో క్లారిటీ రావాల్సి ఉంది త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తా సచివాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిట్చాట్ మనతెలంగాణ/హైదరాబాద్: గతంలో సారా తాగిన వారు 115 సంవత్సరాల పాటు బ్రతికారని, ఇప్పుడు మద్యం తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని అందువల్ల తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తానని ఆయన తెలిపారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడానికి సచివాలయానికి వచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైంటిఫిక్గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని, అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో క్లారిటీ రావాల్సి ఉందన్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు. ఇటీవల కొన్ని రాష్టాలు సారా దుకాణాలు ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలు నడుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్తో యుద్ధం ముగింపుపైసరైన సమయంలో నిర్ణయం
. ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇరాన్ కొత్త నాయకత్వంపై స్పందించేందుకు నిరాకరణ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ముగింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై జరుగుతున్న సైనిక చర్యలను ఎప్పుడు నిలిపివేయాలన్న నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా తనదే అయినప్పటికీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో చర్చించి పరస్పర అవగాహనతో తుది నిర్ణయం తీసుకుంటా మని స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రా […] The post ఇరాన్తో యుద్ధం ముగింపుపైసరైన సమయంలో నిర్ణయం appeared first on Visalaandhra .
లెబనాన్పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం
అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంబీరుట్: ఇరాన్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్పై కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య కూడా దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. వారం రోజుల నుంచి ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా లెబనాన్ ప్రజలు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్పై కూడా దాడి చేసింది. ప్రజల నివాసాలపై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు […] The post లెబనాన్పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం appeared first on Visalaandhra .
. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో రష్యా తీవ్ర ఆందోళన. తక్షణం భద్రతా మండలి భేటీకి పిలుపు మాస్కో: ఇరాన్పై అమెరికా` ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో దాడులు కొనసాగించడంపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు (పి-5) తక్షణమే భేటీ కావాలని పిలుపునిచ్చింది. ప్రపంచ భద్రత, సుస్థిరతపై చర్చించేందుకు పి-5లోని రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ భేటీ కావాలని తమ అధ్యక్షుడు […] The post అంతర్జాతీయ న్యాయం నశించింది appeared first on Visalaandhra .
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଯୁଦ୍ଧକୁ ପେଟ୍ରୋଲ ଡିଜେଲ ସଙ୍କଟ ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା
ଇରାନ ଯୁଦ୍ଧ ପରେ ସୃଷ୍ଟି ହୋଇଥିବା ଆର୍ଥିକ ସଙ୍କଟ ମଧ୍ୟରେ ପାକିସ୍ତାନ ସରକାର ପେଟ୍ରୋଲ ଓ ଡିଜେଲର ଲିଟର ପିଛା ଦାମ ରେକର୍ଡ ପରିମାଣର ବୃଦ୍ଧି କରିଛନ୍ତି। ପେଟ୍ରୋଲ ଓ ହାଇସ୍ପିଡ ଡିଜେଲ ଦାମକୁ ରେକର୍ଡ ପିକେଆର ୫୫ ବା ଭାରତୀୟ ମୁଦ୍ରା ୧୮.୧୦ ଟଙ୍କା ବୃଦ୍ଧି କରିଛନ୍ତି। ସୂଚନା ଥାଉକି ପୂର୍ବରୁ ପାକିସ୍ତାନରେ ଗୋଟିଏ ଲିଟର ପେଟ୍ରୋଲର ଦାମ ୨୬୬.୧୬ ପିକେଆର ରହିଥିଲା। ଏବେ ଏହା ୩୨୧.୧୭ ପିକେଆରରେ ପହଞ୍ଚିଛି। ଇତିମଧ୍ୟରେ ପେଟ୍ରୋଲ ଡିଜେଲ ସଙ୍କଟ ନେଇ ସୋସିଆଲ ମିଡିଆରେ ଗୁଜବ ଦେଖିବାକୁ ମିଳିଛି । ଓଡ଼ିଶାର ମାଲକାନଗିରି ଜିଲ୍ଲାରେ ଲୋକଙ୍କ ଭିଡ଼ ଦେଖିବାକୁ ମିଳିଛି । ରାତିରୁ ପେଟ୍ରୋଲ ପମ୍ପ ଆଗରେ ଲାଗିଛି ଲମ୍ବା ଲାଇନ୍ ଲାଗିଛି । ବାଇକ୍ ପିଛା ୨ଶହ ଏବଂ କାର୍ ପିଛା ମାତ୍ର ୫ଶହ ଟଙ୍କାରେ ଦିଆଯାଉଛି ଡିଜେଲ । ମଧ୍ୟପ୍ରାଚ୍ୟ ଯୁଦ୍ଧ ଯୋଗୁଁ ତେଲ ମିଳୁନଥିବା ଗୁଜବ ନେଇ ଏଭଳି ଅବସ୍ଥା ଘଟିଛି ବୋଲି ଚର୍ଚ୍ଚାର ବିଷୟ ପାଲଟିଛି । ଉକ୍ତ ଗୁଜବର ଖବର କିଛି ଗାନ ମାଧ୍ୟମରେ ମଧ୍ୟ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି I ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିକୁ ଖଣ୍ଡନ କରିଛନ୍ତି ମନ୍ତ୍ରୀ, ରାଜ୍ୟରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଓ ଅତ୍ୟାବଶ୍ୟକ ସାମଗ୍ରୀ ମହଜୁଦ ଅଛି ବୋଲି ଯୋଗାଣ ମନ୍ତ୍ରୀ ଦେଇଛନ୍ତି ସୂଚନା । ଦାବିର ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଆବଶ୍ୟକିୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ସର୍ଚ୍ଚରୁ ଗ୍ରାଉନ୍ଡ ସ୍ଥରରେ ଏଭଳି କୌଣସି ଘଟଣା ଦେଖିବାକୁ ପାଇନଥିଲୁ । କେବଳ ମାଲକାନଗିରିରେ ଗୋଟିଏ ଦିନ ପାଇଁ ନାହିଁନଥିବା ଭିଡ଼ ଦେଖୁବାକୁ ପାଇଥିଲୁ । ଏନେଇ ଜଣେ ସ୍ଥାନୀୟ ବାସିନ୍ଦାଙ୍କୁ ଯୋଗାଯୋଗ କରିଥିଲୁ । ତାଙ୍କ କହିବା ଅନୁଯାୟୀ, ମାଲକାନଗିରି ଜିଲ୍ଲାରେ ଯୁଦ୍ଧକୁ ନେଇ ତେଲ ସଙ୍କଟ ଏକ ଗୁଜବ ବ୍ୟାପିଯାଇଲା । ଆବଶ୍ୟକ ଠାରୁ ଅଧିକ ଗ୍ରାହକଙ୍କ ଭିଡ଼ ଜମିବାରୁ ଟାଙ୍କିରେ ନାହିଁ ନଥିବା ଭିଡ଼ ଜମିଥିଲା । ଭିଡ଼ ନିୟନ୍ତ୍ରଣ କରିବାକୁ ଯାଇ, ୨ ଚକିଆକୁ ୨୦୦ ୪ ଚକିଆକୁ ୫୦୦ ଟଙ୍କାର ତେଲ ବିକ୍ରି କରିଥିଲେ । ଉକ୍ତ ଗୁଜବ ନେଇ ଏକ ସ୍ପଷ୍ଟୀକରଣ ଲେଖିଛି ଇଣ୍ଡିଆନ ଅଏଲ, ସୋସିଆଲ ମିଡିଆରେ ପେଟ୍ରୋଲ ଏବଂ ଡିଜେଲର ଅଭାବ ସମ୍ପର୍କରେ ରିପୋର୍ଟ ଭିତ୍ତିହୀନ। ଭାରତରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ଇନ୍ଧନ ଷ୍ଟକ୍ ଅଛି, ଏବଂ ଯୋଗାଣ ଏବଂ ବଣ୍ଟନ ନେଟୱାର୍କଗୁଡ଼ିକ ସ୍ୱାଭାବିକ ଭାବରେ କାର୍ଯ୍ୟ କରୁଛି । ଇଣ୍ଡିଆନଅଏଲ ସାରା ଦେଶରେ ନିରବଚ୍ଛିନ୍ନ ଇନ୍ଧନ ଯୋଗାଣ ବଜାୟ ରଖିବା ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ। ନାଗରିକମାନଙ୍କୁ ଆତଙ୍କିତ ନ ହେବାକୁ କିମ୍ବା ଇନ୍ଧନ ଷ୍ଟେସନଗୁଡ଼ିକରେ ଭିଡ଼ ନ କରିବାକୁ ଏବଂ ସଠିକ୍ ସୂଚନା ପାଇଁ କେବଳ ସରକାରୀ ଉତ୍ସ ଉପରେ ନିର୍ଭର କରିବାକୁ ଅନୁରୋଧ କରାଯାଇଛି । सोशल मीडिया पर पेट्रोल और डीज़ल की कमी को लेकर फैल रही खबरें पूरी तरह निराधार हैं। भारत में ईंधन का पर्याप्त भंडार उपलब्ध है और आपूर्ति व वितरण नेटवर्क सामान्य रूप से कार्य कर रहे हैं। इंडियनऑइल निर्बाध ईंधन आपूर्ति बनाए रखने के लिए पूरी तरह प्रतिबद्ध है। नागरिकों को आश्वस्त… — Indian Oil Corp Ltd (@IndianOilcl) March 6, 2026 ହିନ୍ଦୁସ୍ତାନ ପେଟ୍ରୋଲିୟମ ଉଲ୍ଲେଖ କରିଛି, ଭାରତରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ଅଶୋଧିତ ତୈଳ ଏବଂ ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଏବଂ ATF ସମେତ ସମସ୍ତ ପ୍ରମୁଖ ପେଟ୍ରୋଲିୟମ ଉତ୍ପାଦ ମହଜୁଦ ଅଛି। ସାରା ଦେଶରେ ଇନ୍ଧନ ଯୋଗାଣ ସ୍ୱାଭାବିକ ଭାବରେ ଚାଲିଛି । ସମସ୍ତ ତୈଳ ବିପଣନ କମ୍ପାନୀ ସେମାନଙ୍କର ବ୍ୟାପକ ଖୁଚୁରା ନେଟୱାର୍କ ମାଧ୍ୟମରେ ନିରବଚ୍ଛିନ୍ନ ଇନ୍ଧନ ଯୋଗାଣ ସୁନିଶ୍ଚିତ କରୁଛନ୍ତି। ନାଗରିକମାନଙ୍କୁ ଅନୁରୋଧ କରାଯାଉଛି ଯେ ସେମାନେ ଏପରି ଗୁଜବରେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ ନାହିଁ ଏବଂ ଆତଙ୍କିତ ହେବା ଏବଂ ପେଟ୍ରୋଲ ପମ୍ପରେ ଅଯଥା ଭିଡ଼ କରିବାରୁ ରକ୍ଷା ପାଆନ୍ତୁ। ସେହିପରି ଭାରତ ପେଟ୍ରୋଲିୟମ ଏନେଇ ଉଲ୍ଲେଖ କରିଛି, ହର୍ମୁଜ୍ ପ୍ରଣାଳୀ ଯୋଗୁଁ ପେଟ୍ରୋଲ ଏବଂ ଡିଜେଲ ଯୋଗାଣରେ ବାଧା ସୃଷ୍ଟି ହେବା ସମ୍ପର୍କରେ ଗୁଜବ ଭ୍ରାମକ। ଭାରତରେ କ୍ଷଣିକକାଳୀନ ବିଶ୍ୱ ବ୍ୟାଘାତ ପରିଚାଳନା ପାଇଁ ପର୍ଯ୍ୟାପ୍ତ ଇନ୍ଧନ ସଂରକ୍ଷଣ ଏବଂ ବିକଳ୍ପ ଯୋଗାଣ ଉତ୍ସ ଅଛି, ଏବଂ ବିପିସିଏଲ ସୁଗମ ଇନ୍ଧନ ଉପଲବ୍ଧତା ସୁନିଶ୍ଚିତ କରିଚାଲିଛି । ସେହିପରି ଗଣମାଧ୍ୟମକୁ ସୂଚନା ଦେଇ ଖାଦ୍ୟ ଯୋଗାଣ ଓ ଖାଉଟି କଲ୍ୟାଣ ମନ୍ତ୍ରୀ ଶ୍ରୀଯୁକ୍ତ କୃଷ୍ଣଚନ୍ଦ୍ର ପାତ୍ର ସୂଚନା ଦେଇଛନ୍ତି ଯେ, ରାଜ୍ୟରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଓ ଅତ୍ୟାବଶ୍ୟକ ସାମଗ୍ରୀ ମହଜୁଦ ଅଛି । କିଛି ଗଣମାଧ୍ୟମରେ ତୈଳ ସଙ୍କଟ ନେଇ ବିଭ୍ରାନ୍ତିକର ଖବର ପ୍ରଚାରିତ ହେଉଛି ବୋଲି କହିଛନ୍ତି ଖାଦ୍ୟ ଯୋଗାଣ ଓ ଖାଉଟି କଲ୍ୟାଣ ମନ୍ତ୍ରୀ । ⛽️ରାଜ୍ୟରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଓ ଅତ୍ୟାବଶ୍ୟକ ସାମଗ୍ରୀ ମହଜୁଦ ଅଛି ⛽️କିଛି ଗଣମାଧ୍ୟମରେ ତୈଳ ସଙ୍କଟ ନେଇ ବିଭ୍ରାନ୍ତିକର ଖବର ପ୍ରଚାରିତ ହେଉଛି ବୋଲି କହିଛନ୍ତି ଖାଦ୍ୟ ଯୋଗାଣ ଓ ଖାଉଟି କଲ୍ୟାଣ ମନ୍ତ୍ରୀ @_KrushnaChPatra #FuelAvailability #FuelUpdate pic.twitter.com/gQulonvDMA — DD News Odia (@DDNewsOdia) March 7, 2026 ତେବେ ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଯୁଦ୍ଧକୁ ନେଇ ବର୍ତ୍ତମାନ ସମୟରେ ପେଟ୍ରୋଲ ଡିଜେଲ ସଙ୍କଟ ଦାବିଟି ଭୁଲ୍ ଅଟେ । ଉକ୍ତ ଦାବିକୁ ଖଣ୍ଡନ କରିଛନ୍ତି ଯୋଗାଣ ମନ୍ତ୍ରୀ, ରାଜ୍ୟରେ ପର୍ଯ୍ୟାପ୍ତ ପରିମାଣର ପେଟ୍ରୋଲ, ଡିଜେଲ ଓ ଅତ୍ୟାବଶ୍ୟକ ସାମଗ୍ରୀ ମହଜୁଦ ଅଛି ବୋଲି ମନ୍ତ୍ରୀ କୃଷ୍ଣଚନ୍ଦ୍ର ପାତ୍ର ସୂଚନା ଦେଇଛନ୍ତି ।
కాట్మండు: నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్పీ)’ అఖండ విజయం సాధిం చింది. ఆ పార్టీకి చెందిన జెన్ జీ నేత బాలేంద్ర షా (బాలెన్) నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకా శాలు కనిపిస్తున్నాయి. నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలుండగా… వాటిలో 165 సీట్లకు సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. మిగతా 110 స్థానా లను దామాషా విధానంలో భర్తీ చేస్తారు. ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. […] The post నేపాల్ ప్రధానిగా బాలేంద్ర? appeared first on Visalaandhra .
వెనిజులా నుంచి అమెరికాకు బంగారం
కారకస్: వెనిజులా నుంచి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం వచ్చింది. ఇది మన కరెన్సీలో సుమారు రూ.923 కోట్లు. వెనిజులా వద్ద 500 బిలియన్ డాలర్ల బంగారు వనరులు ఉన్నాయని అమెరికా హోం మంత్రి డగ్ బర్గమ్ వెల్లడించారు. శుక్రవారం ఈ బంగారం వచ్చిందని, ఆ దేశం వద్ద పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయని తెలిపారు. వెనిజులా ప్రభుత్వ అధ్వర్యంలోని బంగారం మైనింగ్ కంపెనీ మినర్వెన్తో లావాదేవీలకు అనుమతిస్తూ అమెరికా ఇప్పటికే లైసెన్స్ జారీ చేసింది. […] The post వెనిజులా నుంచి అమెరికాకు బంగారం appeared first on Visalaandhra .
నాంపల్లి కోర్టు కీలక తీర్పు.. కెసిఆర్, కెటిఆర్లకు భారీ ఊరట
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకాలం నాటి పాత కేసు నుంచి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సహా కీలక నేతలకు ఊరట లభించింది. 2011లో నిర్వహించిన సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పుతో సుమారు 15 ఏళ్ల నాటి వివాదానికి తెరపడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో జెఎసి పిలుపునిచ్చిన సకల జనుల సమ్మెలో కెసిఆర్, కెటిఆర్, పద్మారావు గౌడ్, శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రైలు రోకోలు, రహదా రుల దిగ్బంధం వంటి నిరసనలు చేపట్టారు. దీనిపై అప్పట్లో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నింది తులపై సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతూ కేసును కొట్టేసింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే పలుమార్లు నేతలు కోర్టుకు హాజ రయ్యారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులుగా వారు వాదనలు వినిపించారు. తాజాగా వెలువడిన తీర్పుపై బిఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తు న్నాయి.
అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్
హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్ […] The post అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్ appeared first on Visalaandhra .
‘కరుప్పు’ విడుదల ఆలస్యం వెనుక కారణం?
చెన్నై: హీరో సూర్య నటిస్తున్న 45వ చిత్రం ‘కరుప్పు’. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో ఈ సినిమా విడుదల చర్చనీయాంశమైంది. ఆసక్తికర యాక్షన్-ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తయినా విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘డ్రీమ్ వారి యర్ పిక్చర్స’ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మిస్తు న్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా… సాయి అభ్యంకర్ […] The post ‘కరుప్పు’ విడుదల ఆలస్యం వెనుక కారణం? appeared first on Visalaandhra .
విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
చెన్నై: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా హీరోయిన్ పూజా హెగ్డే, మమితా బైజు కలయికలో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన సినిమా జన నాయగన్. ఇదే విజయ్ కి ఆఖరి సినిమా కాగా తెలుగులో జన నాయకుడు పేరిట విడుదలకి సిద్ధం చేస్తున్నారు.అయితే ఈ సినిమా ఎపుడో జనవరి లోనే విడుదల కావాల్సి ఉంది కాని సెన్సార్ సమస్యలు ఈ సినిమా విడుదల ఆపేశాయి. చివరిగా ఇప్పుడు సెన్సార్ కావాల్సి ఉండగా మళ్లీ దెబ్బ […] The post విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ! appeared first on Visalaandhra .
దూబే బ్యాట్తో అదరగొట్టా : అభిషేక్
అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్` 2026 ఫైనల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హీరోగా నిలిచాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి భారత్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తన విధ్వంసకర ఇన్నింగ్స్కు సహచర ఆటగాడు శివమ్ దూబే బ్యాటే కారణమని చెప్పాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఈ ఇన్నింగ్స్కు క్రెడిట్ శివమ్ దూబేకి దక్కుతుంది. నేను […] The post దూబే బ్యాట్తో అదరగొట్టా : అభిషేక్ appeared first on Visalaandhra .
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
మూడు ప్రాంతాలే లక్షంగా వైమానిక దళాల బీభత్సం లెబనాన్ గ్రామాలపై వైట్ ఫాస్పరస్ బాంబుల ప్రయోగం టర్కీ, దోహాపైకి ఇరాన్ క్షిపణులు, అడ్డుకున్న టర్కీ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తే ఇరాన్కు తగిన శాస్తి తప్పదు: యుఎఇ టెల్అవీవ్/దుబాయి : ఇరాన్, లెబనాన్లపై ఇజ్రాయెల్ సోమవారంనాడు భారీ ఎత్తున దాడులకు పూనుకుంది. టెహ్రాన్, ఇస్ఫహాన్, దక్షిణ ఇరాన్లపై వైమానిక దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఇరాన్లోని మూడు కీలక ప్రాంతాల్లో దాడులు జరుపుతున్నాం అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడిఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్కు చెందిన కమాండ్ సెంటర్తో పాటు ఇస్ఫహాన్లోని దాని వలంటరీ బసిజ్ ఫోర్స్ను లక్షంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. లెబనాన్లోని దక్షిణ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. బీరుట్ మీదుగా నింగిలో పెద్ద ఎత్తున నల్లని పొగలు వెలువడ్డాయి. అంతకుముందు ఇజ్రాయెల్ ఆర్మీ ఒక ప్రకటన చేసింది. హెజ్బొల్లాల ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా దాడులు జరపబోతున్నట్లు ప్రకటించింది. బీరుట్ దక్షిణాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. లెబనాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ వైట్ పాస్ఫరస్తో కూడిన బాంబులు జారవిడిచినట్లు మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. గ్రామాలపై చట్ట విరుద్ధంగా ఇలాంటి దాడులకు పాల్పడడమేంటని ప్రశ్నించింది. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడిలో తమ పౌరుడు ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 11కు చేరినట్లు వెల్లడించింది. ఇరాన్కు చెందని ఓ క్షిపణిని నేలకూల్చినట్లు టర్కీ ప్రకటించింది. దోహాలోనూ పేలుళ్ల శబ్దాలు వెలువడినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే ఊహించనంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. భారతీయుడికి గాయాలు.. ఇజ్రాయెల్ లక్షంగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షిపణి శకలాలు మీద పడడంతో అతడి మెడపై గాయాలయ్యాయని, టెల్ అవీవ్లోని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. భారతీయుడికి శస్త్ర చికిత్స అవసరం పడడంతో వైద్యులు దానిని విజయవంతంగా పూర్తి చేశారని, ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. టెల్ అవీవ్లోని భారత ఎంబసీ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. సౌదీలో భారతీయుడు మరణించలేదు.. సౌదీ అరేబియాలో ఆర్మీ ప్రొజెక్టైల్ పడిపోయిన ఘటనలో ఓ భారతీయుడు మరణించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి భారత ఎంబసీ స్పందించింది. దానిపై పూర్తి విచారణ జరిపిన అనంతరం అవన్నీ ఊహాగానాలేనని ప్రకటించింది. ఈ ఘటనలో భారతీయులెవరూ చనిపోలేదని వెల్లడించింది. అల్ఖర్జ్లోని నివాస ప్రాంతాల్లో ప్రొజెక్టైల్ కుప్పకూలింది.
ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తబా.. చైనా, రష్యా మద్దతు
టెహ్రాన్ : ఇరాన్లో రాజకీయాల్లో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ పీఠంపై వారసుడు కొలువుదీరారు. ఇరాన్ అత్యున్నత నేతగా 54 ఏళ్ల మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటన చేసింది. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఆయన నియామకం పట్ల ఇరాన్లోని కొన్ని మతపరమైన వర్గాల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కరుడుగట్టిన సిద్ధాంతకర్త అవసరమని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ భావించిందని సమాచారం. అందుకే మొజ్తబాను ఇరాన్ సుప్రీంగా నియమించినట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. 88 మంది సభ్యులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్’ వర్చువల్ సమావేశంలో మొజ్తాబాను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. మొజ్తబా ఖమేనీ గతంలో ఏ ప్రభుత్వ పదవి చేపట్టకపోయినప్పటికీ తెర వెనుక నుంచే ఇరాన్ అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నారనే ప్రచారం ఉంది. 2019లోనే ఆయనపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఆయన మధ్యస్థ స్థాయి మతాధికారి మాత్రమే అయినప్పటికీ ఐఆర్జీసీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలపై పూర్తి స్థాయిలో పట్టుంది. 1989లో అయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టాక 37 ఏళ్ల తర్వాత ఇరాన్ నాయకత్వంలో జరిగిన రెండో మార్పు ఇది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడానికి భద్రతా వ్యవస్థలతో సన్నిహిత సంబంధాలున్న మొజ్తబాయే సరైన వ్యక్తని ఐఆర్జీసీ బలంగా నమ్ముతోంది. వాస్తవానికి గతంలో ఇరాన్ నాయకత్వం వారసత్వ పాలనను తీవ్రంగా వ్యతిరేకించేది. కానీ అసాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాత సిద్ధాంతాలను పక్కనపెట్టి ఖమేనీ కుమారుడికే పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. మొజ్తబాను సుప్రీం లీడర్గా ఎన్నుకున్నట్లు ప్రకటన వెలువడగానే ఆయన మద్దతుదారులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆయనకు విధేయత ప్రకటిస్తూ నినాదాలు చేశారు. మా సంపూర్ణ మద్దతు మీకే: పుతిన్ ఇరాన్ కొత్త సుప్రీం నేతగా నియమితులైన మొజ్తాబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ వెల్లడించింది. మొజ్తాబా తన తండ్రి అలీ ఖమేనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశాన్ని ముందుకు నడిపించాలని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త నేత ప్రస్తుత సంక్లిష్ట దశలో దేశానికి దిశానిర్దేశం చేస్తూ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి: చైనా ఇరాన్ సుప్రీం నేతగా ఎవరిని ఎన్నుకున్నా తమ తదుపరి టార్గెట్ ఆయనే అవుతాడని ఇజ్రాయెల్ మిటలరీ ఇటీవల చేసిన హెచ్చరికలపై చైనా ఘాటుగా స్పందించింది. నాయకత్వ మార్పిడి అనేది ఆదేశ అంతర్గత వ్యవహారమని, ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాంతీయ సమగ్రతను తప్పనిసరిగా గౌరవించాలని బీజింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
స్మాల్ క్యాప్ ఫండ్ను ఆవిష్కరించిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్
ముంబైః పాంటోమత్ గ్రూప్ కంపెనీ అయిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ తన స్మాల్ క్యాప్ ఫండ్ — న్యూ ఫండ్ ఆఫరింగ్ (ఎనఎఫఓ)ను ప్రారంభించినట్లు నేడిక్కడ ప్రకటించింది. ఇది స్మాల్-క్యాప్ ప్రపంచంలో అధిక-వృద్ధి చెందుతున్న వ్యాపార సంస్థలను గుర్తించి వాటిలో పెట్టుబడి పెట్టడానికి రూపొందించ బడింది. వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి, శాస్త్రీయ శ్రద్ధ, డిస్ట్రిబ్యూటర్ -ఫస్ట్ పర్యావరణ వ్యవస్థను విశ్వసిస్తుంది. వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సంస్థాగత-నాణ్యత పరిశోధన, పీఈ […] The post స్మాల్ క్యాప్ ఫండ్ను ఆవిష్కరించిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ appeared first on Visalaandhra .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్టి
అమరావతి : యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, పర్యావరణ అనుకూల జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా, భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బివైఎస్ టి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ మరియు నానో వ్యాపార సంస్థలను విస్తరింప చేయటానికి, వాటిని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వాటికి అవసరమైన కౌన్సెలింగ్, శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక లభ్యత, చేయూత అందించటం ద్వారా బివైఎస్ టి మద్దతును అందిస్తుంది. 2026 అంతర్జాతీయ […] The post ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్టి appeared first on Visalaandhra .
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తొలి డీ ప్లస్ ‘ఎంజి మేజెస్టర’ కోసం ప్రత్యేక ప్రోగ్రామ్
ముంబయి: జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన ప్రత్యేక 5-5-5 యాజమాన్య కార్యక్రమం ద్వారా భారతదేశపు తొలి డీ ప్లస్ ఎస్యూవీ ఎంజీ మేజెస్టర్ కోసం దీర్ఘకాలిక భరోసాను వినియోగదారులకు అందిస్తోంది. పనితీరు, విస్తారమైన పరిమాణం, అత్యాధునిక సాంకేతికతలో గణనీయమైన పెట్టుబడులు పెట్టే ఈ విభాగంలో, 5-5-5 కార్యక్రమం ప్రారంభ దశ నుంచే నిర్వహణ ఖర్చులు, నిరంతర సేవలు మరియు దేశవ్యాప్తంగా మద్దతును సమగ్రంగా కవర్ చేస్తూ, ఇబ్బంది లేని యాజమాన్య అనుభవం, దీర్ఘకాలిక వ్యయ అంచనాను […] The post జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తొలి డీ ప్లస్ ‘ఎంజి మేజెస్టర’ కోసం ప్రత్యేక ప్రోగ్రామ్ appeared first on Visalaandhra .
ఏఐ, ఆటోమేషన్పై దృష్టి సారించండి: ప్రధాని మోడీ
ప్రపంచ వాస్తవ ఆర్థిక వ్యవస్థతో దేశ విద్యారంగాన్ని అనుసంధానించాలి వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ సహాయకులకు డిమాండ్ ప్రత్యేక వెబినార్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ విద్యా రంగాన్ని వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సోమవారంనాడు ఓ వెబినార్లో ప్రసంగించిన ఆయన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి వంటి అందుకు ఒక మాధ్యమంగా పనిచేస్తాయని అన్నారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అనేది కేవలం ఒక అంశం మాత్రమే కాదు, ఇది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మరియు తీర్మానం’ అన్నారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రైవేట్ రంగాల నిపుణులు పాల్గొన్న వెబినార్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో విద్యను ఉపాధి సంబంధిత సంస్థలతో అనుసంధానించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి రంగాలలో మార్కెట్ డిమాండ్లు, వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉండాల్సిన పాఠ్యాంశాలకు పునాదిని అందిస్తుందన్నారు. మన విద్యా వ్యవస్థను వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. మరో ముఖ్యమైన రంగం స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ అని ప్రధాని అన్నారు. దేశ పౌరులకు స్టెమ్ సైన్స్ పట్ల అత్యంత ఆసక్తి ఉండటం ఆనందంగా ఉందన్నారు. నూతన ఆవిష్కరణలపై పనిచేయడానికి యువ పరిశోధకులకు తగినంత అవకాశాలు లభించే పరిశోధనా పర్యావరణ వ్యవస్థను మనం సృష్టించాలి అని ఆయన అన్నారు. ఆరోగ్య రంగం బలోపేతం అయిందని, ఆయుష్మాన్ భారత్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింతగా వ్యాప్తి చేయడానికి దారితీశాయని ఆయన అన్నారు. శిక్షణ పొందిన సంరక్షకులు సీనియర్ సిటిజన్లకు సహాయపడే ‘కేర్ ఎకానమీ’ గురించి ప్రస్తావిస్తూ వృద్ధుల జనాభా పెరిగే కొద్దీ సంరక్షకుల డిమాండ్ కూడా పెరుగుతుందని మోడీ అన్నారు. కొత్త శిక్షణా నమూనాలను అభివృద్ధి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.
అది నిశ్చితార్థం కాదు.. కాబోయే భార్యని పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ #BellamkondaSaiSreenivas
Trump Self Goal : అమెరికా బొక్క బోర్లా Andhra Praprabha Analysis
Trump Self Goal : అమెరికా బొక్క బోర్లా Andhra Praprabha Analysis
ఐదు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో నమీబియా చిరుత జ్వాల సోమవారం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో మొత్తం చిరుతల జనాభా 53కు చేరుకుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ ప్రకటించారు. చిరుత గామినీ అదే పార్కులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన కొద్ది రోజుల్లోనే జ్వాల ఐదు పిల్లలకు జన్మనివ్వడం విశేషం. ‘విజయవంతంగా మూడోసారి తల్లి అయిన జ్వాల కునో జాతీయ ఉద్యానవనంలో ఐదు పిల్లలకు జన్మనివ్వడం ప్రాజెక్ట్ చిరుతకు ఎంతో గర్వకారణం.తాజా జననాలతో భారతదేశంలో జన్మించి, అభివృద్ధి చెందుతున్న చిరుత పిల్లల సంఖ్య 33 కి పెరిగింది. ఇది భారత గడ్డపై 10 వ విజయవంతమైన చిరుతగా గుర్తించబడింది. చిరుతల పరిరక్షణలో మరో ముఖ్యమైన మైలురాయి’ అని యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. క్షేత్ర స్థాయిలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది, పాల్గొన్న వారందరి అంకితభావం, నైపుణ్యం మరియు నిబద్ధతను ఆయన ప్రశంసించారు. ఈ పిల్లల రాకతో భారతదేశంలో మొత్తం చిరుత జనాభా ఇప్పుడు 53కి చేరుకుందన్నారు.
టివికె చీఫ్ విజయ్కు సిబిఐ సమన్లు
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మరో దఫా విచారణ కోసం నటుడు, టివికె చీఫ్ విజయ్కు సిబిఐ మంగళవారం సమన్లు జారీ చేసింది. గతంలో జనవరి 12,19 తేదీల్లో ఏజెన్సీ తన ప్రధాన కార్యాలయంలో విజయ్ను ఇప్పటికే ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ నుంచి కేసును స్వాధీనం చేసుకున్న సిబిఐ, గతేడాది సెప్టెంబర్లో తమిళనాడులోని కరూరులో జరిగిన విజయ్ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయి, 60 మందికి పైగా గాయపడిన తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. అక్టోబర్లో దర్యాప్తు చేపట్టడానికి ఒక సీనియర్ అధికారిని నియమించాలని సిబిఐ డైరెక్టర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరియు ఏజెన్సీ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
'ఎపిక్' నుంచి హృదయాన్ని తాకే మెలొడీ..
‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుంది. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు. దృశ్యపరంగా ఈ పాట లండన్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. బ్లాక్బస్టర్ బేబీ తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నైంటీస్ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
Peddi: A Perfect Comeback for AR Rahman
Legendary music composer AR Rahman has worked for many Bollywood, Tamil and international films over the years but he did not work for a straight Telugu film. Several filmmakers approached him but the project did not materialize. AR Rahman is finally composing the music for Peddi featuring Ram Charan, a straight Telugu film directed by […] The post Peddi: A Perfect Comeback for AR Rahman appeared first on Telugu360 .
హైదరాబాద్ టూ ముంబై సైక్లింగ్ యాత్ర
సైక్లింగ్, ఫిట్నెస్పై అవగాహన కోసం యాత్ర చేపట్టిన సైక్లిస్ట్ కాంతి దత్ ఏడు రోజులు 800 కి.మి సైక్లింగ్.. 30 చోట్ల అవగాహన సదస్సులు హైదరాబాద్: ఫిట్నెస్, సైక్లింగ్పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రముఖ సైక్లిస్ట్, వెల్నెస్ అడ్వకేట్ కాంతి దత్ హైదరాబాద్ నుంచి ముంబైకి సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. మార్చి 7 నుంచి మార్చి 14 వరకు సుమారు 800 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్పై ప్రయాణిస్తూ 30 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఫియర్ ప్రాజెక్ట్ పేరిట, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్నెస్ ప్రేమికులు మరియు ప్రముఖులు పాల్గొని కాంతి దత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడ నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా కాంతి దత్ మాట్లాడుతూ.. “మార్చి 7 నుండి మార్చి 14 వరకు హైదరాబాద్ నుండి ముంబై వరకు సైకిల్పై ప్రయాణం చేయబోతున్నాను. నోవాటెల్లో పలువురు అతిథుల సమక్షంలో ఈ యాత్రను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎనిమిది రోజుల ప్రయాణంలో పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో ఫిట్నెస్ మరియు సైక్లింగ్ గురించి చర్చలు జరపనున్నాను. సైక్లింగ్ వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ సందేశాన్ని ఎక్కువ మందికి చేరవేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు. సైక్లింగ్ను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, యువతలో ఫిట్నెస్పై ఆసక్తి పెంపొందించాలనేది ఈ సైక్లింగ్ యాత్ర లక్ష్యమని కాంతి దత్ తెలిపారు. అలాగే పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానంగా సైక్లింగ్ను ప్రోత్సహించడం కూడా ఈ యాత్ర ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా కాంతి చెప్పారు. మరిన్ని వివరాల కోసం: 95504 57149 (శ్రీహిత సొల్యూషన్స్)
లిక్కర్ స్కామ్ కేసు.. కవిత, కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు సోమ వారం నోటీసులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు ఊరట కలిగిస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సిబిఐ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదన లు వినిపించారు. సిబిఐ దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సిబిఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ విచారణాధికారిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు దర్యాప్తు సంస్థ, విచారణాధికారిపై ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, సిబిఐ కేసులో నిందితులు విడుదలయ్యారు కాబట్టి ఇడి దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా నిలిపివేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరగా హైకోర్టు భిన్నంగా స్పందించింది. సిబిఐ రివిజన్ పిటిషన్పై నిర్ణ యం తీసుకునే వరకు మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ స్కాం కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఇడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లలోని కొన్ని అంశాలపై స్పష్టత లేదని, సాక్ష్యాధారాల సేకరణలో జాప్యం జరుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. కొందరు నిందితులు తమపై ఉన్న కేసులను కొట్టివేయాలని (డిశ్చా ర్జ్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు సానుకూలంగా స్పందించింది. కేవలం ఆరోపణలతో కేసు దర్యాప్తు జరిగిందని, తగి నన్ని ప్రాథమిక ఆధారాలు లేకుండా నిందితులను ఎక్కువ కాలం జైల్లో ఉంచడం లేదా విచారణను సాగదీయడం సరికాదని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే 23 మంది నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ వారి లిక్కర్ పాలసీ కేసు నుంచి విముక్తి కల్పించింది. సిబిఐ ప్రస్తు తం ఈ అంశాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఆప్ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్లో భారీగా ముడుపులు చేతులు మారాయని, దీని వెనుక ఉన్న ’సౌత్ గ్రూప్’, ఇతర రాజకీయ నేతల ప్రమేయాన్ని నిరూపించడానికి మరింత లోతుగా దర్యాప్తు జరగా లని సిబిఐ వాదిస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 16కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.
ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ విభాగంలోకి ఏకత్రా రిటైల్ వెంచర్స్
పవిత్ర గాంధీ, సన్నీ సకారియా, సుస్సాన్నే ఖాన్, వాసుకి పుంజ్ మరియు చిరాయు యార్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏకత్రా రిటైల్ వెంచర్స్, విశ్వ ప్రయాణాన్ని సూచించే రీతిలో 108 కోణాలతో రూపొందించబడిన వజ్రం సృష్టి రత్నతో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన వజ్రాలు) ఆభరణాల ప్రపంచంలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. ఈ విడుదల, ఆచరణీయ విలాసం , జీవనశైలిలో ఆలోచనాత్మకంగా ఎంపికచేసిన, మహిళలు నేతృత్వంలోని ప్రయాణపు ప్రారంభాన్ని సూచిస్తుంది. సృష్టి రత్న అనేది ప్రకాశాన్ని పునర్నిర్వచించడానికి 108 ఖచ్చితంగా రూపొందించిన కోణాలతో జాగ్రత్తగా రూపొందించబడిన, ల్యాబ్ లో అభివృద్ధి చేయబడిన వజ్రం. బ్రాండ్ యొక్క ప్రధాన కలెక్షన్కు ప్రేరణగా నిలుస్తోన్న సృష్టి రత్న వజ్రమనేది ప్రతి సృష్టి ఆలోచనాత్మకంగా రూపొందించబడినదనేందుకు ఒక ప్రతీక లా నిలుస్తుంది. ఒక రత్నం కంటే ఎక్కువగా, ఇది ఒక అసాధారణమైన రాయిలో ఒడిసిపట్టబడిన సైన్స్, ఖచ్చితత్వం , మానవ కళాత్మకత యొక్క సామరస్యాన్ని సూచిస్తుంది. సహ వ్యవస్థాపకురాలు , డిజైన్ డైరెక్టర్ సుస్సానే ఖాన్ తో పాటుగా ప్రముఖులు జెన్నిఫర్ వింగెట్, అపూర్వ ముఖిజా మరియు ప్రగ్యా కపూర్, సమీప భవిష్యత్తులో ఏకత్రా జ్యువెల్స్ కోసం వారి వ్యక్తిగత ప్రయాణాలు , సృజనాత్మక ఆలోచనలను ప్రతిబింబించే కలెక్షన్ లను ఆవిష్కరించడానికి ఏకత్రాలో బృందంలో చేరనున్నారు. రాహుల్ దయామా కూడా భాగస్వామిగా చేరటంతో పాటుగా ఆధునిక వినియోగదారు బ్రాండ్లను నిర్మించడంలో మరియు వ్యాప్తి చేయడంలో లోతైన నైపుణ్యాన్ని తీసుకువస్తున్నారు. బ్రాండ్కు ఒక ముఖ్యమైన మైలురాయిగా, అధికారిక వెబ్సైట్ 8 మార్చి 2026న ప్రారంభించబడింది. ఈ విడుదల సందర్భంగా ఏకత్రా రిటైల్ వెంచర్స్ నుండి పవిత్ర గాంధీ మాట్లాడుతూ “సన్నీ సకారియా, వాసుకి పుంజ్ మరియు చిరాయు యార్డిలతో భాగస్వామ్యం, ఉత్తేజకరమైన ప్రయాణానికి నాంది. సుస్సాన్నే ఖాన్ను క్రియేటివ్ డైరెక్టర్గా తీసుకురావడం మా అత్యున్నత నిర్ణయాలలో ఒకటి..” అని అన్నారు.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఒటిటి రిలీజ్ ఎప్పుడంటే..
మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషిక రంగనాథ్లు హీరోయిన్లుగా నటించారు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. భార్య, ప్రేమించిన అమ్మాయి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ ఈ సినిమాలో కనిపించారు. అయితే ఈ సినిమా రిలీజై చాలాకాలమే అయినా.. ఒటిటిలో ఇప్పటివరకూ విడుదల కాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడు ఒటిటిలో వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఒటిటి రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది. ప్రముఖ ఒటిటి సంస్థ జి-5లో ఈ సినిమా విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు జి-5 అధికారికంగా ప్రకటించింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి: వినోద్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మహారాష్ట్రలోని లాతూర్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం సందర్బంగా ఇచ్చిన ఉద్యోగ ప్యాకేజిని కాజీపేట్ భూ నిర్వాసితులకు అమలు చేయాలని మాజీ ఎంపి వినోద్ కుమార్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రతినిధి బృందం రైల్వే జిఎంను శ్రీనివాస్తవను కోరింది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జి.ఎం. సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ సహా వరంగల్ జిల్లాకు చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు సోమవారం సికింద్రాబాద్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై వినతి పత్రాన్ని జిఎం శ్రీవాస్తవకు అందజేశారు. కాజీపేట్లో ఏర్పాటు అయింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీయేనని జిఎం స్పష్టత ఇచ్చారని వినోద్ కుమార్ తెలిపారు. కాజీపేట్లో రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని కూడా ఆ బృందం శ్రీవాస్తవను కోరింది. జిల్లాలో పలు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. దీంతో పాటు మరికొన్ని అంశాలను జిఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాలపై రైల్వే జిఎం శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారని బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. బిఆర్ఎస్ ప్రతినిది బృందంలో మాజీ ఎంఎల్ఎలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, తదితరులు ఉన్నారు.
ఇద్దరు మహిళా బీట్ ఆఫీసర్లకు.. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి..
ఇద్దరు మహిళా బీట్ ఆఫీసర్లకు.. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి.. జన్నారం, ఆంధ్రప్రభ
రాజ్యసభకు ఏకగ్రీవమైన వేం నరేందర్ రెడ్డి, సింఘ్వి..
మన తెలంగాణ/హైదరాబాద్ః రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీలేర్పడిన రెండు స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అసెంబ్లీ అదనపు కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి వారిరువురికీ నియామక (ధృవీకరణ) పత్రాలు అందజేశారు. సర్టిఫికేట్లు అందుకోవడానికి అభిషేక్ మను సంఘ్వి, వేం నరేందర్ రెడ్డి మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్నారు. వారిరువురిని అభినందించడానికి పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులూ చేరుకున్నారు. వారంతా తొలుత అసెంబ్లీ ఆవరణలోని సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన అనంతరం వేం, సింఘ్వి మంత్రులు, పార్టీ ఇతర నాయకులతో కలిసి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ఛాంబర్కు చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవమైన వేం నరేందర్ రెడ్డికి, అభిషేక్ మను సింఘ్వికి సర్టిఫికేట్లు అందజేశారు. అభినందన మందార మాల.. సర్టిఫికేట్లు అందుకున్న వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. మంత్రులు, పార్టీ ఇతర నాయకులూ వారిని అభినందించారు.
trump2countries |పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు… నాయకత్వం మారితే పరిస్థితి మారేదా?
trump2countries |పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు… నాయకత్వం మారితే పరిస్థితి మారేదా? trump2countries |అణు
పుస్తకాలు మానవాళికి మార్గదర్శకాలగును….
పుస్తకాలు మానవాళికి మార్గదర్శకాలగును…. బిజెపి నాయకులు బాజీరావు పటేల్ ముధోల్, ఆంధ్రప్రభ :
ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. #RaviTeja#BharthaMahasayulakuWignyapthi#ZEE5
విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యం…
విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యం… ప్రగతి ప్రణాళిక ర్యాలీ ని ప్రారంభిస్తున్న మున్సిపల్
తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోంది: రాంచందర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా లేక ఒవైసీ పాలన నడుస్తున్నదా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తున్నదని ఆయన సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుగా మజ్లీస్ అధినేత, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అనుమతి తీసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పాలన ఒవైసీ చేతుల్లో ఉందని ఆయన విమర్శించారు. ప్రజల కోసం కాదు ఒవైసీ కోసం పాలన చేస్తున్నట్లు ఉందని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి బండి ధ్వజం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రజలకు భూమి ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ఫీజు రీ-యంబర్స్మెంట్ నిధులు, విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు కొనిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పైగా అసద్ పిలుపునిస్తే వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కల్తీ వ్యాపారులపై పిడి యాక్ట్ పెట్టాలి…
కల్తీ వ్యాపారులపై పిడి యాక్ట్ పెట్టాలి… ఎంతటి వారినైనా శిక్షించాలి గ్రేటర్ కాంగ్రెస్
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం…
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం… నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట
అంగరంగ వైభవంగా అగ్ని గుండాల మహోత్సవం…
అంగరంగ వైభవంగా అగ్ని గుండాల మహోత్సవం… పూర్ణకుంభంతో ఎమ్మెల్యే మందుల సామెల్ కి
క్యూట్ మెసేజ్తో ప్రియురాలిని పరిచయం చేసిన సాయి శ్రీనివాస్
హైదరాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. రీసెంట్గా విజయ్ దేవరకొండ, రష్మికలు పెళ్లి చేసుకోగా.. అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ లిస్ట్లోకి యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆదివారం కావ్య అనే అమ్మాయితో శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగిందంటూ కొన్ని ఫోటోలు సోషల్మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే తన జీవిత భాగస్వామిని శ్రీనివాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేశాడు. ఆదివారం జరిగింది నిశ్చితారం కాదని.. అది కేవలం ఓ చిన్న వేడుక మాత్రమే అని పేర్కొన్నాడు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తానని అన్నాడు. ఇన్స్టాగ్రామ్లో కావ్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన శ్రీనివాస్.. ‘‘కావ్యమ్మకు.. జీవితానికి అందమైన సమయం ఉంది. అది నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నాపై విశ్వాసం ఉంచినందుకు, పాజిటివిటీ, అశేష చిరు నవ్వులతో నింపినందుకు థ్యాంక్స్. నీ మోముపై కూడా చిరు నవ్వులను ఎప్పటికీ వాడిపోనివ్వను. మనం కలిసి జీవించే క్షణం కోసం ఎంతో వేచి చూస్తున్నా.. - ప్రేమతో నీ శ్రీని’’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ జంటకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sreenivas bellamkonda (@sreenivasbellamkonda)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్ టి
అమరావతి: యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, పర్యావరణ అనుకూల జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా, భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బివైఎస్ టి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ మరియు నానో వ్యాపార సంస్థలను విస్తరింప చేయటానికి, వాటిని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వాటికి అవసరమైన కౌన్సెలింగ్, శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక లభ్యత మరియు చేయూత అందించటం ద్వారా బివైఎస్ టి మద్దతును అందిస్తుంది. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఎన్. చంద్రబాబు నాయుడు, ఎంఎస్ఎంఈ, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ సాధికారతలు, సంబంధాల మంత్రి శ్రీ. కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై బివైఎస్ టి సంతకం చేసింది, ఇది ఒక కుటుంబం, ఒక వ్యవస్థాపకుడు (OFOE) అనే లక్ష్యానికి మద్దతు ఇస్తుంది. ప్రతి ఇంటిలోనూ వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, బలమైన స్థానిక పర్యావరణ వ్యవస్థలను నిర్మించడం దీని లక్ష్యం. ఈ కార్యక్రమం విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, కడప మరియు అనంతపురం జిల్లాల్లో తొలుత అందుబాటులోకి తీసుకురానున్నారు. ఔత్సాహిక వ్యవస్థాపకుల ఆలోచనలను ఆచరణీయ వ్యాపారాలుగా మార్చడానికి అవకాశాలను అందించనున్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో, ఏపి ఎంఎస్ఎంఈ, సిస్కో ఇండియా సీఎస్ఆర్ ప్రయత్నాలు మరియు ఇతరుల మద్దతుతో బివైఎస్ టి 15,000 మంది మార్గదర్శకుల నెట్వర్క్ను నిర్మించడం ద్వారా మరియు 2,000 మందికి పైగా యువ వ్యవస్థాపకులకు ఆర్థిక అవకాశాలను సులభతరం చేయడం ద్వారా రాష్ట్ర వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) జూలై-సెప్టెంబర్ 2025 డేటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగిత రేటు 8.2% వద్ద ఉంది, ఇది జాతీయ సగటు 5.2% కంటే చాలా ఎక్కువ. ఇది వ్యవస్థాపకత , స్వయం ఉపాధి కోసం మార్గాలను విస్తరించాల్సిన తక్షణ అవసరాన్ని వెల్లడిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం ముఖ్యంగా ఎక్కువగా ఉందని, మహిళలు ఉపాధి పరంగా అధిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారని కూడా డేటా సూచిస్తుంది. బివైఎస్ టి వ్యవస్థాపకురాలు మరియు మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి లక్ష్మీ వి. వెంకటేశన్ మాట్లాడుతూ “భారతదేశపు యువత ఆలోచనలు , ఆశయాలతో నిండి ఉంది, కానీ వారి ప్రయాణం చాలాసార్లు ప్రారంభం కాకముందే ఆగిపోతుంది. ఎందుకంటే వారికి సరైన మార్గదర్శకత్వం, నైపుణ్య శిక్షణ లేదా ఆర్థిక లభ్యత లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ప్రారంభించటం ద్వారా, యువ వ్యవస్థాపకులను మార్గదర్శకత్వం, అభ్యాస అవకాశాలు , ఆర్థిక మార్గాలతో అనుసంధానించి దానిని మార్చడానికి బివైఎస్ టి కృషి చేస్తోంది. తద్వారా ఆశాజనకమైన ఆలోచనలు జీవనోపాధిని సృష్టించే మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే స్థిరమైన సంస్థలుగా ఎదగగలవు” అని అన్నారు. రాష్ట్రంలోని ఆరు కీలక జిల్లాల్లో 5,000 మంది యువత ఆధారిత వ్యాపార ఆలోచనలను గుర్తించి పెంపొందించడానికి ఈ భాగస్వామ్యం రాష్ట్రవ్యాప్తంగా 'వ్యాపార ఆలోచనల పోటీ'ని ప్రారంభిస్తోంది. 'యువ వ్యాపారిత్వ రథం' (యువ వ్యవస్థాపక వ్యాన్) ఈ ఆరు జిల్లాల్లో పర్యటిస్తుంది, పోటీ గురించి అవగాహన పెంచుతుంది. యువత తమ వ్యాపార ఆలోచనలను సమర్పించమని ప్రోత్సహిస్తుంది. ఎంపిక చేయబడిన అభ్యర్థులు వ్యవస్థాపక శిక్షణ, నిర్మాణాత్మక మార్గదర్శకత్వం మరియు అధికారికంగా ఆర్థిక సహాయం పొందడంలో మద్దతు పొందుతారు. వారి ఆలోచనలను ఆచరణీయమైన మరియు స్థిరమైన సంస్థలుగా మార్చడంలో వారికి సహాయమూ లభిస్తుంది. ఈ కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో , యువత ఉద్యోగార్ధుల నుండి ఉద్యోగ సృష్టికర్తలుగా మారడానికి వీలు కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కష్టాలు తప్పవు
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కష్టాలు తప్పవు సెక్యూరిటీ గార్డు పేషంట్లకు ఓపీలు రాయడం
అచ్చంపేటలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’
అచ్చంపేటలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అచ్చంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర
దశాబ్ద కాలపు నాలా సమస్యకు ‘ప్రజాపాలన’లో మోక్షం…
దశాబ్ద కాలపు నాలా సమస్యకు ‘ప్రజాపాలన’లో మోక్షం… యుద్ధప్రతిపదికన పూడికతీత పనులుహనుమాన్ బస్తీ,
Ap Cm Keynote : వైకుంఠపాళి కావొద్దు Andhra Prabha SPL News
Ap Cm Keynote : వైకుంఠపాళి కావొద్దు Andhra Prabha SPL News
వేగం తగ్గించండి…మద్యం సేవించి వాహనం నడపొద్దు
వేగం తగ్గించండి…మద్యం సేవించి వాహనం నడపొద్దు స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : రోడ్డు
కోవర్టు రాజకీయాలు మానుకోవాలి… తొర్రూరు, ఆంధ్రప్రభ : కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి
రేషన్ బియ్యం పట్టివేత…. –15,క్వింటాల రేషన్ బియ్యం, ట్రాలీ ఆటో స్వాధీనం, చిట్యాల,
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ అర్హులందరికీ
రైతుల సొమ్ముతో రాహుల్ బంధు పథకం…
రైతుల సొమ్ముతో రాహుల్ బంధు పథకం… సిరిసిల్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి
ప్రపంచకప్ మనదైంది.. టీం ఇండియా నెక్ట్స్ షెడ్యూల్ ఏంటంటే..
ఐసిసి టి-20 ప్రపంచకప్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కివీస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 96 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ తదుపరి షెడ్యూల్ ఏంటని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంకానుంది. మార్చి 28 నుంచి మే 31 వరకూ ఈ లీగ్ జరుగనుంది. ఆ తర్వాత భారత్ షెడ్యూల్ మొదలవుతుంది. జూన్ నెలలో అఫ్ఘనిస్తాన్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ న్యూ చంఢీఘడ్లో జరుగుతుంది. అనంతరం వన్డేలు జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగుతాయి. ఆ తర్వాత భారత్ జూలై నెలలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టి-20లు, 3 వన్డులు జరుగనున్నాయి. టి-20లు జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జరుగుతాయి. వన్డేలు ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా.. జూలై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి. అనంతరం భారత జట్టు ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో 2 టెస్టులు, 2 టి-20ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. ఆ తర్వాత భారత జట్టు స్వదేశంలో అఫ్ఘనిస్తాన్తో 3 టి-20లు, 3 వన్డేల సిరీస్లు ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టి-20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి-20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టి-20లు జరుగుతాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వైరా శాసన సభ్యులు మలోత్ రాందాస్
BSS Celebrates Lavish Roka With Kaavya Reddy
Young hero Bellamkonda Sai Sreenivas, who recently scored a big hit with his last outing Kishkindhapuri, is currently busy with multiple film commitments and has several exciting projects lined up. Amid this professional high, the actor also stepped into a new and joyous phase of his personal life. Yesterday, a lavish and traditional roka ceremony […] The post BSS Celebrates Lavish Roka With Kaavya Reddy appeared first on Telugu360 .
ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలి
ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలి మర్రిగూడ, ఆంధ్రప్రభ : గ్రామములో ప్లాస్టిక్ మహమ్మారిని
గాఢ నిద్రలో ఉపాధ్యాయుడు… కోటగిరి, ఆంధ్రప్రభ : మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత
KCR : ఏమయ్యా పెద్దమనిషీ.. చెప్పి ఎన్నిరోజులయింది? ఏ మయింది?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని ఒక్కటీ చేయరు
అలరించిన మాక్ పార్లమెంట్ కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం
కోకాపేటలో ప్రారంభానికి సిద్ధమైన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ #AlluCinemas#Kokapet#Hyderabad
మ్యాదరిపేటలో తీరని విషాదం…. దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్కు గురై మృతి
కల్తీ మాఫియా గుట్టురట్టు.. భారీగా నకిలీ పదార్ధాలు స్వాధీనం.
గచ్చిబౌలి: హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులు కల్తీ మాఫియా గుట్టు రట్టు చేశారు. 5 వేల లీటర్ల కల్తీ వంటనూనే, 5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.21 లక్షల విలువ చేసే నకిలీ పదార్ధాలను సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఓ గోదాములో కల్తీ ఆహార పదార్ధాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఒటి పోలీసులు దాడులు నిర్వహించారు. నిత్యావసర వస్తువులు కల్తీ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన …
ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన … కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ :
భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య…
భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య… భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో
Telangana : ఖమ్మంలో కవిత అరెస్ట్
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు
అంగన్ వాడి పిల్లలకు విద్య సామగ్రి పంపిణీ…
అంగన్ వాడి పిల్లలకు విద్య సామగ్రి పంపిణీ… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ :
బోర్డు పరీక్షల్లో చాట్జీపీటీతో చీటింగ్.. 81 మంది సస్పెన్షన్ #ChatGPT#BoardExams#MassCopying
Chandrababu : ముగ్గురు పిల్లలు.. ముద్దు ఇదే నా నినాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా పెరుగుదలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు
Sancharame from Epic: Feels like an Epic Melody in every way
The first single from EPIC – FIRST SEMESTER, titled “Sancharame,” arrives as a refreshing musical experience that blends soulful melody with lyrical richness. Composer Hesham Abdul Wahab delivers a gentle yet emotionally resonant composition that instantly impresses. The highlight of the track lies in the evocative and beautiful lyrics written by Goreti Venkanna, who crafts […] The post Sancharame from Epic: Feels like an Epic Melody in every way appeared first on Telugu360 .
బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా
బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం
Police | కవిత అరెస్టు Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సైబర్క్రైమ్ ఎస్సైలు
హైదరాబాద్: ఎల్బీనగర్ సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు ఎస్సైలు ఎసిబికి చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు ఎస్సైలు లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటుండగా.. బాబునాయక్, ప్రమోద్ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ పోలీస్స్టేషన్లో సోదాలు నిర్వహించారు.
Telangana : రాజ్యసభ సభ్యులు ఇద్దరూ ఏకగ్రీవ ఎన్నిక
రాజ్యసభ ఎన్నికలలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు

22 C