హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ కు హార్ముజ్ తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా దాడులు చేయడంతో ఇరాన్.. హార్ముజ్ ను మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో హార్ముజ్ ను ఓపెన్ చేయాలంటూ అమెరికా హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. అయితే, హార్ముజ్ ను పూర్తిగా మూసివేయకుండా తమ మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది. తాజాగా దీనిపై స్పందించిన ఇరాన్.. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో భారత్తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై దిగ్బంధనం విధించబోమని ప్రకటించింది. భారత్తో పాటు, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్లకు చెందిన నౌకలను హార్ముజ్ గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయబడలేదని, ఇరాన్తో మిత్ర సంబంధాలున్న పలు దేశాలకు చెందిన నౌకల ప్రయాణానికి అనుమతించామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. పలు దేశాలు మమ్మల్ని సంప్రదించి, హార్ముజ్ జలసంధి గుండా తమ నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతించాలని అభ్యర్థించాయి. మిత్ర దేశాలుగా భావించే కొన్ని దేశాలకు హార్ముజ్ తెరిచేందుకు నిర్ణయించుకున్న సందర్భాలలో, మా సాయుధ దళాలు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాయి అని తెలిపారు.
Gold Price Today : బ్యాడ్ లక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
Varanasi: Rajamouli doing it First Time
SS Rajamouli is a man who thrives for perfection. Most of his films got delayed by months as he never compromised on the output. There is a huge delay in the post-production work as Rajamouli never compromises on the visual output. There are long breaks between the shooting schedules of his films as Rajamouli has […] The post Varanasi: Rajamouli doing it First Time appeared first on Telugu360 .
Sharwa–Rajasekhar’s Bond: Emotional Engine Of Biker
Charming Star Sharwa’s sports drama Biker has already created solid buzz, with the trailer elevating expectations to a whole new level. The promo clearly establishes the intense father–son dynamic, with Rajasekhar portraying Sharwa’s strict father and uncompromising mentor. But Biker isn’t merely a film about bikes or racing. It carries a strong emotional core. Rajasekhar […] The post Sharwa–Rajasekhar’s Bond: Emotional Engine Of Biker appeared first on Telugu360 .
Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది
మల్కాపూర్ లోని మల్లేపల్లి వద్ద మద్యం మత్తులో యువతి హల్ చల్ #Lavanya #DrunkAndDrive #RoadAccident
Bus Accident : నిద్రలోనే పోయిన ప్రాణాలు.... ప్రమాదానికి నిర్లక్ష్యం డ్రైవింగే కారణమా?
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి భారత చమురు ట్యాంకర్ ఇరాన్కు
హంద్రీ బ్రిడ్జిపై మృత్యు విరుచుకుపాటు..
హంద్రీ బ్రిడ్జిపై మృత్యు విరుచుకుపాటు.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగర
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు గురువారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఇక, బుధవారం తిరుమల వెంకన్నను 73,411 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 30,474 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
26marchspecialstory2 |ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం
26marchspecialstory2 | ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం 26marchspecialstory2 ప్రపంచవ్యాప్తంగా అవినీతి పరిస్థితిఅత్యల్ప
Pic Talk: Kiara Advani is a Stunner
After her maternity break, Bollywood beauty Kiara Advani continued to get back into the news. She is busy with her commitments and the clicks from her public outings have become quite popular. The actress sizzled in a brown body-hugging leather gown for a film award event. Kiara Advani looked super hot, fit and beautiful in […] The post Pic Talk: Kiara Advani is a Stunner appeared first on Telugu360 .
రాజ్బారి వద్ద విషాదం.. 40 మంది ప్రయాణికులతో బస్సు నదిలోకి #Bangladesh #BusAccident #PadmaRiver
మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా రవీందర్..
మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా రవీందర్.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ
Tirumala : తిరుమలకు నేడు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
శ్రీరామ హోమం.. చేస్తే.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
Zodiac Signs : గురువారం.. మీ రాశిఫలాల్లో ఆకస్మిక ధనలాభం ఉందా?
ప్రతిరోజూ రాశిఫలాలు చూసుకుని దినచర్యను ప్రారంభించడం చాలా మందికి అలవాటు
26marchchintana |రాగద్వేషాలు అంటే..? మనశ్శాంతికి మార్గం ఏమిటి?
26marchchintana | రాగద్వేషాలు అంటే..? మనశ్శాంతికి మార్గం ఏమిటి? 26marchchintana రాగద్వేషాల అర్థం,
పెట్రోల్, గ్యాస్పై ఆందోళన వద్దు: కిషన్ రెడ్డి
పెట్రోల్, గ్యాస్పై ఆందోళన వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
మహేందర్ ముందస్తు అరెస్ట్.. వికారాబాద్, ఆంధ్రప్రభ : రైతు సమస్యల పరిష్కారం కోసం
గుడ్ న్యూస్.. ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: పొంగులేటి
తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.
చదువుతో పాటు పరిశోధనలపై దృష్టి పెట్టాలి..
చదువుతో పాటు పరిశోధనలపై దృష్టి పెట్టాలి.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : భవిష్యత్తులో
26marcheditorial | 15 షరతులు, యుద్ధం కొనసాగింపుపై అనిశ్చితి
26marcheditorial | 15 షరతులు, యుద్ధం కొనసాగింపుపై అనిశ్చితి 26marcheditorial | అమెరికా
Bus Accident : మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు దగ్దం.. పన్నెండు మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు మంటల్లో దగ్దం కావడంతో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు.
42Years |జీవన్ రెడ్డి గుడ్బైతో రాజకీయ సమీకరణాలపై చర్చ
42Years | జీవన్ రెడ్డి గుడ్బైతో రాజకీయ సమీకరణాలపై చర్చ 42Years |
విద్యుత్ పరికరాలు చోరి.. ఆవేదనలో రైతులు..
విద్యుత్ పరికరాలు చోరి.. ఆవేదనలో రైతులు.. కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన
మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – బస్సు దగ్ధం, 10 మంది సజీవదహనం #Markapuram #RoadAccident
వారి పై చర్య తీసుకోవాలి –మారేపల్లి మల్లేష్..
వారి పై చర్య తీసుకోవాలి – మారేపల్లి మల్లేష్.. చిట్యాల, ఆంధ్రప్రభ :
26marchspecialstory1 |ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం
26marchspecialstory1 | ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం 26marchspecialstory1 యుద్ధం కొనసాగుతూనే ఉంది:
వాణి విద్యానికేతన్ ఉత్తమ ఫలితాలు..
వాణి విద్యానికేతన్ ఉత్తమ ఫలితాలు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని చల్లగరిగ వాణి
Israel - Iran War : కాల్పుల విరమణకు నో... ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు… ఇజ్రాయెల్పైనా మిసైళ్లు
ఇరాన్ బుధవారం అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించింది
Cuba : క్యూబాలో విద్యుత్తు సంక్షోభం.. చమురు ఆంక్షలు
మిగెల్ డియాస్-కానెల్ బుధవారం కీలక ప్రకటన చేశారు
సబ్ ఇన్స్ పెక్టర్ పై సస్పెన్షన్ వేటు..
సబ్ ఇన్స్ పెక్టర్ పై సస్పెన్షన్ వేటు.. వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ :
కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్బై
` నాలుగు పేజీల రాజీనామా లేఖ విడుదల ` పదేళ్లుగా అవమానాలు భరించాక కూడా…పట్టించుకోరా? ` కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న భావనే లేదు ` ఇక రేవంత్ …
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
ఇంధన ధరల్లో కూడా మార్పులు లేవు దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్ గ్యాస్ సరఫరా బ్లాక్ మార్కెటింగ్పై దాడులు కొనసాగిస్తున్నాం పైప్డ్ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో …
పెట్రోల్ కొరతపై పుకార్లు షికార్లు
` బంకుల వద్ద భారీగా క్యూలైన్లు ` నగరంలో పలుచోట్ల పెట్రో బంకుల ముందు నోస్టాక్ బోర్డులు హైదరాబాద్(జనంసాక్షి):అమెరికా`ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, …
రాష్ట్రంలో పెట్రోలియం కొరతలేదు
` సరిపడా నిల్వలున్నాయి ` ఇంధన సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవు ` అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందొద్దు ` ఉప ముఖ్యమంత్రి భట్టి …
మండుతున్న ఇం‘ధనం’ వేళ..సర్కారు చల్లని కబురు
` ప్రయాణికుల కోసం 30 శాతం భారీ రాయితీ ` ఆర్టీసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో అమలు ` రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ` …
26thMarch 2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
26thMarch 2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 26thMarch
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని ఆయన సూచించారు. రా ష్ట్రంలో రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలున్నాయని ఆయన స్పష్టం చేశారు. డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా, వాణిజ్య గ్యాస్కు కొంత ఇబ్బంది ఉందన్నది వాస్తవమేనని, దీనిపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని ఆయన వివరించారు. అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్పిజి సమృద్ధిగా అందుబాటులో ఉందని, హైదరాబాద్ లో కొందరు పుట్టించిన పుకార్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రజలు పెట్రోల్, డీజిల్ లభ్యతపై ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ సూచించారు. 1,200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నాం బుధవారం మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి అసెంబ్లీలోని తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ను మించి సరఫరా కొనసాగుతోందని, బుధవారం 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు. దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1,200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. వినియోగ దారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో రోజు వారి డిమాండ్ ఒక్కసారిగా 25 శాతం పెరిగిందని, రోజువారీ సరఫరా సగటున పోల్చిచూసినప్పుడు ఎక్కడా అంతరాయం కలగకుండా అదనంగా 22 శాతం అందుబాటులో ఇంధన వనరులు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. 596 పెట్రోల్ బంక్లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంక్లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కుడా కొరత లేదని, అహ్మదాబాద్, సూరత్, బెంగుళూరు, ధారవాడ, బెల్గాం వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ,ప్రజలేవరు అయోమయానికి గురి కావొద్దని,వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉగ్ర నెట్వర్కులో హైదరాబాద్ మహిళ
మన తెలంగాణ/హైదరాబాద్ : విజయవాడలో సంచలనం సృష్టించిన దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కే సులో కీలక నిందితురాలిగా భావిస్తున్న హైదరాబాద్ చంచల్ గూడలోని సైదా బేగం నివాసంలో పోలీసులు బుధవారం ఉదయం ముమ్మర సోదాలు నిర్వహించారు. 41-ఎ నోటీసులు జారీ చేశారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా సైదా బేగం కదలికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పో లీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రలింకులో నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే కోణంలో విచారణను వేగవంతం చేశారు. సైదా బేగం గు రించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సైదాబాద్ కు చెందిన ఆమె, ఏడాది క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న సైదా బేగం స్వస్థలం మహారాష్ట్ర లోని సోలాపూర్గా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో సైదా బేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్ ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టింగ్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ కార్యకలాపాలు ఎక్కువగా సాగినట్లు గుర్తించారు. సైదా బేగం విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ, వారి సూచనల మేరకు టెర్రర్ కంటెంట్ ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, యువతను రాడికలైజ్ చేసి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఇదే కేసులో కర్ణాటక బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఎపి ఇంటెలిజెన్స్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, జైలుకు పంపిన విషయం విదితమే. ముగ్గురు నిందితులు అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఎక్యూఐఎస్), ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లతో సంబంధం ఉన్న విదేశీ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ, దేశ వ్యతిరేక లక్ష్యాల కోసం పనిచేస్తున్నారు. యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించడం, వారిని జిహాద్కు సిద్ధం చేయడం, దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ను విస్తరించడం అనే లక్ష్యంతో ఈ ముగ్గురూ అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ఎక్యూఐఎస్, ఐఎస్ఐఎస్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నారని, విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కనుగొంది. ఈ ముగ్గురూ గజ్వా-ఎ-హింద్(భారతదేశంపై యుద్ధం) అనే భావన కోసం పనిచేస్తున్నారని, వివిధ ప్రాంతాలలోని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ తమ నెట్వర్క్ను పలు రాష్ట్రాలకు విస్తరించారని ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు సైతం ధృవీకరించినట్లు తెలిసింది. సోషల్ మీడియా ప్రభావంపై పోలీసుల ప్రత్యేక నజర్ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రభావం పెరుగుతుండటంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిందితులను మరింతగా విచారించేందుకు పోలీసులు వారం రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అదుపులో మరో ఏడుగురు...? పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ రాష్ట్రాలకు 9 ప్రత్యేక బృందాలను పంపి, ఆయా ప్రాంతాల్లో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉండి కార్యకలాపాలు నడిపిస్తున్న ఏ6 ఆల్ హకీమ్ షుకూర్ (హ్యాండ్లర్)తో పాటు బీహార్కు చెందిన దిల్ఖాష్ (ఏ4), అస్మాను ల్లా ఖాన్ (ఎ8), ఢిల్లీకి చెందిన లక్కీ అహమ్మద్ (ఎ7), రాజస్థాన్కు చెందిన జిషణ్ (ఎ9), పశ్చిమ బెంగాల్కు చెందిన మీరా ఆసిఫ్ అలీ (ఎ10), మహారాష్ట్రకు చెందిన షారుక్ ఖాన్ (ఏ12), షేక్ ఫీజర్ రెహమాన్ (ఏ13)లను ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న వారిని స్థానిక పోలీసుల సహకారంతో లోతుగా విచారిస్తున్నారు.
ట్రంప్ శాంతి మంత్రం..ఇరాన్ తిరస్కారం
టెహరాన్: తమ షరతులకు అమెరికా ,ఇజ్రాయె ల్ తలొగ్గితేనే యుద్ధం ఆగుతుందని ఇరాన్ బుధవారం స్పష్టం చేసింది. చర్చలకు వచ్చిన ట్రంప్ , తమకు షరతులు విధించడం కుదరదు. ట్రంప్ అ దుపాజ్ఞలు, ఆదేశాలు చెల్లనేరవని పేర్కొంటూ ఇ రాన్ అమెరికా శాంతి ప్రతిపాదనలను తిరస్కరించింది. దీనితో ప్రస్తుత గల్ఫ్ యుద్ధ సంక్షోభం కొనసాగే పరిస్థితి తలెత్తింది. ట్రంప్ గడువులు, కాలపరిమితి సందేశాలను తాము అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. పశ్చిమాసియా యుద్ధం దశలో అ మెరికా ప్రతిపాదనలు అతిగా ఉన్నాయని ఇరాన్ అధికారికంగా తేల్చిచెప్పినట్లు ఇరాన్ ప్రెస్ టీవీ తెలిపింది. యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షులు చేసిన 15 అంశాల ఫార్మూలాను, హర్మూజ్పై ఉమ్మడి నియంత్రణ అంశాన్ని ఇరాన్ పూర్తి స్థాయిలో సమీక్షించుకుంది. ఈ ప్రతిపాదనలు తమ దేశానికి ఆమోదయోగ్యంగా లేవని ఇరాన్ తేల్చిచెప్పింది. ట్రంప్ ప్రతిపాదనలను తిప్పికొట్టిం ది. అమెరికా నుంచి వెలువడ్డ ప్రతిపాదనలకు త మ తొలిస్పందన సానుకూలంగా ఉందనే వాదన సరికాదని , ఇప్పటికీ వీటిని పరిశీలించడం జరుగుతోందని ఇరాన్ ఉన్నత స్థాయి వ్యక్తి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఏది ఏమైనా యుద్థాన్ని ఎప్పుడు ముగించాలనేది ఇరాన్ నిర్ణయాధికారంపైనే ఆధారపడి ఉంటుంది. ఇతరుల ఆదేశాలకు అనుగుణంగా యుద్ధం విరమించుకుని , మోసపోయే స్థితిలో ఇరాన్ లేదని తెలిపారు. తాము పెట్టే షరతులకు అమెరికా సరేనంటేనే తమ దేశం చర్యలు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. ఒకటి రెండు కాదు. మొత్తం తమ షరతులు అంగీకరించాల్సిందే అని ట్రంప్ దౌత్యానికి సవాలు విసిరారు. ఇతరుల ఆధిపత్యం లేకుండా హర్మూజ్పై ఇరాన్ సార్వభైమాధికారానికి కట్టుబడి ఉండాలనేది తమ ప్రధాన డిమాండ్ అని ఇరాన్ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై తమకు సహజసిద్ధమైన చట్టపర హక్కు ఉందన్నారు. ఇక ఇప్పటి యుద్ధంపై బాధ్యత ఎవరిది అనేది నిర్థారణ కావల్సి ఉంది. ఇది తేలితే జరిగిన నష్టానికి పరిహారానికి గ్యారంటీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎప్పుడూ ఇరాన్పై శత్రుపక్షం దాడికి దిగరాదని, ఈ హమీ ఇవ్వాలని తెలిపారు. తమ అన్ని షరతులు ఆమోదించేంత వరకూ ఇప్పుడు సాగుతున్న తమ దేశ చర్యలన్నింటిని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో గల్ఫ్పై దాడులు ఆగబోవని పరోక్షంగా వెల్లడించారు.
మనతెలంగాణ/హైదరాబాద్: ఇప్పసారాపై అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ఇప్పపువ్వు సారాకి ఒక నేత పేరు పెట్టవద్దని ఎమ్మెల్యే రాకే ష్ రెడ్డి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ ప్పపువ్వు సారా గురించి చర్చ సందర్భంగా బిజె పి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభ లో ఒక్కసారిగా దుమారం రేగింది. మంత్రులు వర్సెస్ బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిల మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో బుధవారం జడ్చ ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ‘ఇప్ప పుప్పు సారా’పై మాట్ల్లాడగా అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాల పేలాయి. ఈ క్రమంలోనే బిజె పి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్ప పు వ్వు సారా అంశం ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని, ఆ ఉత్పత్తి ద్వారా 130 దేశాల్లో ఆదా యం వస్తుందంటూ అనిరుధ్ రెడ్డి చేసిన ప్రసంగంపై ఆయన సెటైర్లు వేశారు. ఇప్పపువ్వు సా రాకు ‘ఇప్పటకీలా అనండి’ ఇంకేమైనా పేరు పె ట్టండి కానీ, ఒక నేత పేరు పెట్టకండి అనటంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అ యితే, రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాగా ఉందా రాకేశ్ రెడ్డి అంటూ మంత్రి పొన్నం మండిపడ్డారు. సారా అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు సభలో ఆ నేత పేరు తీసినందుకు రాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అ నంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆ నేతపై అంత కక్ష ఎందుకు?, మహిళా నేతను కించ పరిచిన ఎమ్మెల్యే రాకేశ్ రె డ్డి క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాం డ్ చేశారు. సంక్షేమ పథకాలకు మాత్రమే ఆ నేత పేరు పెడతామన్నారు. సంక్షోభం తెచ్చేవాటికి కాదన్నారు. ఇప్ప పువ్వు సారా అంశంలో ఆ నే త పేరు ఎత్తడం మహిళా లోకాన్ని అవమానించడమేనని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బిజెపి క్షమాపణలు చెప్పాలని మంత్రి శ్రీధర్బాబు పట్టుబట్టారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ నేత పేరుని అవమనిస్తారా అని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు బిజెపి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. రాకేశ్ రెడ్డి నోరు జారారని, క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సభ గౌరవాన్ని కాపాడాలి: ప్యానల్ స్పీకర్ బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ ఆ నేత పేరుపై గంటకు పైగా సభా సమయం వృథా చేయడం సరికాదన్నారు. సభ్యుడు తప్పుగా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తే సరిపోతుందని హరీష్రావు అభిప్రాయపడ్డారు. స్వర్గస్తులైన ఆ నేతపై సభలో కామెంట్స్ చేసిన రాకేష్రెడ్డి క్షమాపణ చెప్పాలని ప్యానల్ స్పీకర్ బాలు నాయక్ సూచించారు. సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. సభలో రాకేష్రెడ్డి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు బాలునాయక్ ప్రకటించారు. ఎవరూ అపార్థం చేసుకోవద్దు: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా చర్చ సందర్భంగా తాను మాట్లాడిన మాటలను ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పపువ్వు సారాను అందుబాటులోకి తెస్తే, దానికి ఆ నేత పేరు పెట్టవద్దని చెప్పడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ తాను మాట్లాడిన మాటలు తప్పనిపిస్తే వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన పేర్కొన్నారు. తన మాటలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈ సందర్భంగా రాకేశ్రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఆ నేతను అవమానించలేదని ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ నేత ఉక్కు మహిళ, ప్రపంచస్థాయి నేత అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఆ నేత పేరు పెడుతుంటారు. ఇప్పపువ్వు సారా పథకానికి గొప్ప మహిళానేత పేరు పెట్టొద్దని గౌరవంతో సూచించానని, అవమానించాలని కాదని ఆయన అన్నారు. నా వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, తమాషా చేస్తున్నారా అంటూ నన్ను బెదిరిస్తారా?, నేనేం తప్పు మాట్లాడానో రికార్డులు పరిశీలించాలని ఆయన సూచించారు. అవసరమైతే హౌస్ కమిటీ వేయండి, క్షమాపణ చెప్పాల్సి వస్తే చెబుతా, మాజీ ప్రధాని అంటే తమకు ఎప్పుడూ గౌరవమేనని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలుగజేసుకొని రాకేశ్ రెడ్డి ఎక్కడా అసభ్య పదజాలం వాడలేదని స్పష్టం చేశారు. మంత్రులు అనవసరంగా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాకేశ్ రెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి ధ్వజమెత్తారు.
మన తెలంగాణ /జగిత్యాల ప్రతినిధి : ఆత్మాభిమానం చంపుకుని కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక, పార్టీతో ఉన్న 42 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో తన అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి, ఎఐసిసి సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాసిన నాలుగు పేజీల రాజీనామా పత్రాన్ని చూపించారు. సమావేశంలో జీవన్రెడ్డి సుమారు గంటకు పైగా మాట్లాడి గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తాను ఎ దుర్కొన్న పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పడే నాటికి తాను పట్టభద్రుల ఎంఎల్సిగా ఉన్నానని, మండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక సభ్యుడిగా ఉండి బిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని, పార్టీలో సీనియర్లకు అవకా శం కల్పించాలని కోరుతూ పలువురి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించానన్నారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్న తర్వాత నామినేటేడ్ పదవుల విషయాన్ని పక్కనబెట్టారని ఆయన వివరించారు. 20 23 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలుచుకోవడంతో పాటు సిపిఐ పార్టీకి చెందిన ఒకరు ఉం డగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమోచ్చిందని ఆయన ప్రశ్నించారు. అప్పుడే నా ఎంఎల్సి పదవికి రాజీనామా చేస్తానంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు సముదాయించి పార్టీలో మీకు సముచిత స్థానం ఉం టుందని సర్ధి చెప్పడంతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షీ నా గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నా బాధను దిగమింగుకుని పార్టీలో కొనసాగానన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నా ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి పట్టపగలు నడి వీధిలో హత్యకు గురి కాగా పార్టీ నుంచి కనీసం ఓదార్పు చేయలేదని ఆరోపించారు. ము న్సిపల్ ఎన్నికల సందర్బంగా గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించా రు. ఆయన మన పార్టీ కాదని స్పీకర్ పేర్కొంటుండగా, కాంగ్రె పార్టీతో సంబంధం లేని ఎమ్మెల్యేను పార్టీ కార్యాలయానికి ఎలా పిలుస్తారని ప్రశ్నిస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చానన్నారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన నన్ను ప్రతి విషయంలో అణగదొక్కాలని చూశారని, నాకు పోరాటాలు కొత్త కాదని, టిడిపి హాయాంలో చంద్రబాబు నాయుడు, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్పై పోరాటం చేశానని అదే తరహాలో ఇప్పుడు రేవంత్రెడ్డిపై పోరాటం చేస్తానన్నారు. ఎంత కాలం ఈ అవమానాలు భరిస్తూ ఉండాలి?, నీ చెప్పు చేతల్లో ఉండే వాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? నిన్ను ఎదురించేటోడు పార్టీలో ఉండొద్దా? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటోడిని అణగదొక్కుతున్నావా అంటూ రేవంత్రెడ్డి తీరును ఆయన తప్పుబట్టారు. నాకు అడ్డం వస్తే తొక్కేస్తానంటూ రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని, ఎంత మందిని తొక్కుతావు... మేం జగిత్యాలలో ఎదురు తిరిగితే మమ్మల్ని ఎవరూ ఆపలేరన్నారు.
గురువారం రాశి ఫలాలు (26-03-2026)
మేష రాశి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది. మిధునం ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కర్కాటకం గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సింహం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కన్య వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. తుల వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి. వృశ్చికం ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగం వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది. ధనస్సు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది. కుంభం మిత్రుల నుంచి శుభవర్తలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. మీనం వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మారులుంటాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు.
ఫ్యాక్ట్ చెక్: ఎల్పీజీ బుకింగ్ గడువును 35 రోజులకు ప్రభుత్వం పెంచలేదు
ఎల్పీజీ బుకింగ్ గడువును 35 రోజులకు ప్రభుత్వం పెంచలేదు
దేశంలో ఐఎఎస్, ఐపిఎస్ పోస్టులు ఖాళీ
దేశవ్యాప్తంగా మొత్తం మీద 1300 ఐఎఎస్, 505 ఐపిఎస్ పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని బుధవారం సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వక సమాధానంలో తెలిపారు. కీలక పోలీసు అధికారుల నియామకాలలో మంజూరి అయిన పోస్టుల సంఖ్య మొత్తం మీద 5099. అయితే నియమిత ఐపిఎస్ల సంఖ్య ఇప్పుడు 4594గా ఉంది. కాగా పరిపాలనా నిర్వహణ సంబంధిత ఐఎఎస్ పోస్టుల మంజూరీ సామర్థం 6877. అయితే నియుక్త అధికారుల సంఖ్య 5577గా ఉంది. ప్రభుత్వ రిజర్వేషన్ నియమావళి మేరకు ఐఎఎస్ పోస్టుల భర్తీ జరుగుతోందని మంత్రి వివరించారు. ఎప్పటికప్పుడు ఖాళీలను సమీక్షించుకుంటూ , రిజర్వేషన్ల ప్రక్రియకు అనుగుణంగానే ఐఎఎస్ ఖాళీల భర్తీ జరుగుతోంది.
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన రాజ్తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య
డ్రంక్ అండ్ డ్రైవ్లో రాజ్తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య పోలీసులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. పోలీసులు సాధారణంగా నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా ఒక కారును ఆపారు. ఆ కారులో లావణ్య ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా ఆమె మద్యం సేవించినట్లు తేలింది. దీంతో పోలీసులు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు. భవిష్యత్తులో ఆమెకు కౌన్సిలింగ్ కోసం నోటీసులు ఇవ్వొచ్చని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో మరో ఘటన కూడా వెలుగుచూసింది. మల్కాపూర్ మండలం మల్లెపల్లి గ్రామం వద్ద లావణ్య ప్రయాణిస్తున్న కారు, బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆగకుండా వెళ్లిపోవాలని ప్రయత్నించగా, గ్రామస్థులు కారును అడ్డుకున్నారు. గ్రామస్థులు ఆమెను ఆపి క్షమాపణ చెప్పాలని కోరగా, లావణ్య వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ సమయంలో కారులో ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కూడా కొంతసేపు లావణ్య వారితో వాదించినట్లు తెలిసింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం కారులో మద్యం బాటిళ్లు కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇక లావణ్య పేరు ఇదే మొదటిసారి వార్తల్లోకి రావడం కాదు. గతంలో ఆమె సినీ నటుడు రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అలాగే గర్భస్రావం చేయించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఈ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుతం జరిగిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మరోసారి లావణ్యను వార్తల్లో నిలిపింది. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.
‘అబ్రహం లింకన్’పై ఇరాన్ దాడులు
పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్, అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన అనంతరం, అమెరికాకు చెందిన విమాన వాహన నౌక యూఎస్ఎస్ అబ్రహామ్ లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ లో వీడియోను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఘటనపై అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఇరాన్ సైన్యం పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకారం, తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు అమెరికా యుద్ధనౌక దిశగా వెళ్లినట్లు పేర్కొంది. ఇది జరగడానికి ముందు, ఇరాన్ నౌకాదళం అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ సముద్ర పరిధికి సమీపంలోకి వస్తే యూఎస్ఎస్ అబ్రహామ్ లింకన్ను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని హెచ్చరించిన గంటలోపే దాడి చేసింది. ప్రెస్ టీవీ నివేదిక ప్రకారం, ఇరాన్ నౌకాదళాధిపతి రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ, ఆ యుద్ధనౌక ఇరాన్ క్షిపణి పరిధిలోకి వస్తే దానిపై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆ నౌకను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో, ఇరాన్ సైన్యాధికారులు అమెరికా ప్రభావాన్ని తక్కువగా చూపిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి, అమెరికా చెప్పుకునే వ్యూహాత్మక శక్తి ఇప్పుడు వ్యూహాత్మక వైఫల్యంగా మారిందని విమర్శించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు ఇచ్చిన గడువును వెనక్కి తీసుకోవడం, పరిస్థితులను కొంత శాంతింపజేసే చర్యగా భావిస్తున్నారు. ఇరాన్ నుంచి ప్రతిదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: RG Kar బాధితురాలి తల్లికి బిజెపి టికెట్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మూడవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు జాబితాలను రిలీజ్ చేసిన బిజెపి.. మూడో జాబితాలో కీలక నియోజకవర్గాల నుంచి మరో 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆర్.జి. కార్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్కు బిజెపి టికెట్ ఇచ్చింది. బిజెపి, ఆమెను పానిహటి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోంది. తన కుమార్తెకు న్యాయం కోసం, పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు రత్న దేబ్నాథ్ గతంలో చెప్పారు.
సోనియా గాంధీకి అస్వస్థత.. నిలకడగా ఆరోగ్యం
కాంగ్రెస్ నాయకురాల సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమెను వెంటనే స్థానిక సర్ గంగారామ్ హాస్పిటల్లో చికిత్సలకు చేర్పించారు. సోనియా గాంధీ ఆరోగ్యంనిలకడగా ఉంది. పూర్తిగా వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తమ ప్రకటనలో తెలిపారు. కడుపులో , మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలను గుర్తించారు. వీటిపై పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని అజయ్ స్వరూప్ వివరించారు. అంతకు ముందు పార్టీ వర్గాలు ఓ ప్రకటన వెలువరించాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వివరించారు. వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, పరిస్థితి విషమంగా లేదని తెలిపారు.
IPL 2026... హర్షిత్ రాణా స్థానంలో సైనీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా ఐపిఎల్ కు దూరమయ్యారు. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఐపిఎల్ కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రాణా తన కుడి మోకాలిలోని లిగమెంట్కు గాయం కావడంతో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేశాడు. తర్వాత అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ను తీసుకున్నారు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న రాణా.. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నందున ఐపీఎల్ 2026 నుండి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో నవదీప్ సైనిని తీసుకున్నట్లు కోల్కతా ప్రకటించింది. కుడిచేతి వాటం పేసర్ నవదీప్ సైని ఇప్పటివరకు ఆడిన 32 ఐపీఎల్ మ్యాచ్లలో 23 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో కూడా 23 వికెట్లు తీశాడు. గాయపడిన హర్షిత్ స్థానంలో అతను 75 లక్షల రూపాయలకు కేకేఆర్లో చేరనున్నాడు. అలాగే, గాయపడిన పృథ్వీరాజ్ యర్రా స్థానంలో ఖేజ్రోలియాను గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఎంపిక చేసింది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఖేజ్రోలియా గతంలో జీటీ, కేకేఆర్, ఆర్సీబీ తరఫున ఆడాడు. ఇప్పుడు 30 లక్షల రూపాయలకు జీటీలో చేరనున్నాడు.
న్యూజిలాండ్తో బుధవారం జిరగిన ఐదో, చివరి టి20 మ్యాచ్లో సౌతాఫ్రికా 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 32తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కానర్ విధ్వంసక బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న కానర్ 33 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, ఐదు ఫోర్లతో 75 పరుగులుచేశాడు. రుబిన్ హర్మాన్ (39), వియాన్ ముల్డర్ (31), డియాన్ ఫారెస్టర్ 21 (నాటౌట్) తమవంతు సహకారం అందించడంతో సఫారీ టీమ్ ప్రత్యర్థి ముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బెవన్ జాకబ్స్ (36) ఒక్కడే కాస్త పోరాడాడు.
యువతిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు
యువతిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కాసిపేట
పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దు
పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్
Heat Wave Alert AP 2026 : ఆ 3 నెలలు యమ డేంజర్ Andhra Prabha news
Heat Wave Alert AP 2026 : ఆ 3 నెలలు యమ
పాలకుల వివక్ష కు వ్యతిరేకంగా…కదంతొక్కిన కలం కార్మికులు
పాలకుల వివక్ష కు వ్యతిరేకంగా..కదంతొక్కిన కలం కార్మికులు ఐఅండ్ పీఆర్ కమీషనరేట్ ముట్టడిజర్నలిస్టుల
సమన్వయంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి
సమన్వయంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తొర్రూరు, ఆంధ్రప్రభ
సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరంజన్ గౌడ్
సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరంజన్ గౌడ్ మహిళా విభాగం జిల్లా
మోత్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు ..?
మోత్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు ..? మోత్కూర్,ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ,
క్రికెటర్ దినేష్ కార్తిక్కు అరుదైన గౌరవం
భారత స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. దినేష్ కార్తిక్పై తమ అభిమానాన్ని చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అమృత విద్యా సంస్థల వార్షిక క్రీడోత్సవంలో భాగంగా కార్తిక్ జెర్సీ నంబర్ ‘19’ ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అమృత విద్యా సంస్థలకు చెందిన దాదాపు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరంత కలిసి సిఎడికె19 అనే ఆకారంలో మానవహారాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఒక క్రీడాకారుడి జెర్సీని ప్రతిబింబించే మానవహారంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడంతో దీనికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు లభించింది. అమృత గ్రూప్ చైర్మన్ భూమినాథన్, డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.నారాయణ స్వామి, స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉగాది, శివరాత్రి రోజున మాంసం తింటా.. సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సమర్థిస్తూ.. నేను ఉగాది, శివరాత్రి రోజులలో మాంసం తింటా. రాహుకాలాన్ని నమ్మను అని అన్నారు. దీంతో ఆయన కొత్త రాజకీయ చర్చకు తెరలేపారు. చాలా మంది హిందువులు అశుభకరమైనదిగా భావించే 'రాహుకాలం' తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష నాయకులు విమర్శించడంతో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాష్ట్ర శాసనసభలో సిఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. తాను రాహుకాలం వంటి భావనలను పాటించనని అన్నారు. అధికారులు, తన భార్యతో సహా కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతే బడ్జెట్ సమయాన్ని నిర్ణయించానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. అలాంటి కాలాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తనకు ఎలాంటి సంకోచం లేదని, పాలన నిర్ణయాలు మూఢనమ్మకాలతో నడవకూడదని ఆయన చెప్పారు. జ్యోతిష్యపరమైన అంశాల కంటే ప్రజాస్వామ్య ప్రక్రియలకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ఉగాది, మహాశివరాత్రి వంటి పండుగలను హిందువులు భక్తికి చిహ్నంగా శాకాహారంతో జరుపుకుంటారు. అయితే, అటువంటి ఆచారాలు వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమని.. వ్యక్తిగత నమ్మకాలు వేర్వేరుగా ఉంటాయని, ఆహారపు అలవాట్లను మత ఆచారాలు ఎందుకు నిర్దేశించాలని ఆయన ప్రశ్నించారు. కాగా.. ఉగాది, శివరాత్రి వంటి పండుగల్లో మాంసాహారం తినడంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపి... ఇంట్లో పాతిపెట్టిన కూతురు
ప్రియుడి మోజులో పడి కన్నతల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిందో కూతురు. పది నెలల క్రితం జరిగిన ఈ ఘటన నగర శివారు ప్రాంతమైన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్నగర్లో చోటు చేసుకుంది. తన ప్రేమకు అడ్డు వస్తుందన్న కారణంతో తల్లి అంజు డిఆర్(40)ని ప్రియుడితో కలిసి చంపింది.ఆపై శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. కాగా తల్లి కనిపించక పోవడంతో మృతురాలు పెద్ద కూతురు డి.రోషిని కుమారి 2025 అక్టోబర్ 17న జవహర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు మృతురాలి చిన్న కూతురు(17),ఆమె ప్రియుడును తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో ఆమెతో పాటు ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్నగర్లో అంజు(45)తన మైనర్ కూతురుతో కలిసి నివాసముంటోంది. అంజు తన మైనర్ కూతురు ఇషికాకు మౌంటికుమార్ సింగ్ అలియాస్ మోంటి రాజ్(22)లు ప్రేమించుకుంటున్నారు. గత కొంత కాలంగా వారు సహజీవనం చేస్తున్నారు. ఈ విషయంలో తల్లి అంజు తన కూతురు మైనర్ కావడం, కుల విభేదాల కారణంగా వారి ప్రేమ వ్యవహరాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అక్టోబర్ 2024లో మైనర్ బాలికతో ఇంట్లో పట్టుబడగా తల్లి అంజు జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేయగా 50 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైన తర్వాత కూడా వారు సంబంధాన్ని కొనసాగించగా మరోసారి జనవరి 2025లో పోక్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో తల్లిపై కక్షగట్టిన కూతురు తల్లిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఎవరికి అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో ప్రియుడితో కలిసి తల్లిని చంపి ఇంట్లోనే గోతిని తవ్వి పూడ్చిపెట్టింది. ఇటివల గర్బవతి కావడంతో ఆమెను మౌంటిరాజ్ యాదగిరిగుట్టలో వివాహం చేసుకోని కలిసి జీవిస్తున్నారు. తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు అందుకున్నపోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తుండగా ఇటివల మృతురాలి టూ వీలర్ను మౌంటికుమార్ విక్రయించడంతో కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరుపై వాహనాన్ని మార్చుకొనే క్రమంలో ఈ విషయం బయట పడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మర్డర్ వ్యవహారం బయట పడింది.హత్యకు ఇషికాకు ఆమె ప్రియుడు కూడా సహాకరించినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో పోలీసులు,క్లూస్ టీం సహాయంతో తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలికను జువైనల్ హోమ్కు తరలించి ఆమె భర్త మౌంటీరాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
The Paradise: Nani Delighted with the Buzz
Natural Star Nani is one actor who has a habit of completing his film shoots in quick schedules and he moves on to his next project. But things are completely different for The Paradise. He is teaming up with Dasara director Srikanth Odela for the second time. The Paradise is a big-budget attempt and Nani […] The post The Paradise: Nani Delighted with the Buzz appeared first on Telugu360 .
మానికొండలో రైతన్న మీ కోసం కార్యక్రమం…
మానికొండలో రైతన్న మీ కోసం కార్యక్రమం… రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాంఎమ్మెల్యే
Ippasara Debate Sparks Uproar in Telangana Assembly
The Telangana Assembly witnessed a highly charged session as a discussion on Ippasara turned into a full-scale political confrontation, marked by sharp exchanges, personal remarks, and mounting tensions between ruling and opposition members. The debate was initially triggered by Jadcherla MLA Anirudh Reddy, who proposed that Ippasara, a beverage made from ippapuvvu, could be developed […] The post Ippasara Debate Sparks Uproar in Telangana Assembly appeared first on Telugu360 .
పల్లెసీమల సమగ్ర వికాసమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి
పల్లెసీమల సమగ్ర వికాసమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి స్వర్ణ పంచాయతీ, మూడు సీసీ
జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్కు విస్సన్నపేట బాలిక ఎంపిక
జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్కు విస్సన్నపేట బాలిక ఎంపిక ఆర్థిక సహాయం చేసిన
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు
మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఒబిసి మహిళలకు సబ్ కోటా కేటాయించాలి: కల్వకుంట్ల కవిత
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరే సమయం ఆసమన్నమవుతున్న తరుణంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆ రిజర్వేషన్లలో ఒబిసి మహిళల కోసం సబ్ కోటా ఉండటం అంతే ముఖ్యం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్సభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కవిత స్పందించారు. మహిళా బిల్లులో ఒబిసి మహిళలకు ఉప కోటా కల్పించకపోవడం అంటే మెజారిటీ ప్రజలను మోసం చేయటమే అని పేర్కొన్నారు. చట్టసభల్లో సామాజిక సమానత్వం రావాలంటే ఒబిసి మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. రిజర్వేషన్లలో రిజర్వేషన్ ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒబిసి మహిళలకు ఉప కోటా లేకుండా ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తే మరోసారి పోరాటం తప్పదని హెచ్చరించారు. దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయటమే సామాజిక న్యాయమని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఒబిసి వర్గాల మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే వారికి ఎలా న్యాయం దక్కుతుందని ప్రశ్నించారు. ఎస్సి,ఎస్టి మహిళలకు రాజ్యాంగబద్ద వాటా ఉందని...కానీ ఒబిసిల పరిస్థితి ఏంటనీ నిలదీశారు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులు, ఆయా పార్టీల్లో ఉన్న ఒబిసి మహిళ నేతలు, మహిళా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఒబిసి మహిళలకు ఉప కోటా కేటాయించే వరకు జాగృతి తరఫున మరోసారి పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
కడియం శ్రీహరి బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టాడు: ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి
కడియం శ్రీహరి బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఆయన నిజాయితీ గల నాయకుడు కాదని తీవ్రంగా విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త తానేనని కడియం శ్రీహరి చెప్పుకోవడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేవాదుల ప్రాజెక్టు కోసం కడియం శ్రీహరి ఎలాంటి పాత్ర పోషించలేదని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తానే సృష్టికర్తనని చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడారు. కడియం శ్రీహరికి మాజీ సిఎం కెసిఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఎంపీ, డిప్యూటీ సిఎం, ఎంఎల్సి, ఎంఎల్ఎ వంటి కీలక పదవులతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. ఇక డీలిమిటేషన్ జరిగినా జనగామ ప్రజలకు సేవ చేయడం కొనసాగిస్తానని,అక్కడి ప్రజలతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
దిమ్మదుర్తిలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభం
దిమ్మదుర్తిలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభం మామడ, ఆంధ్ర ప్రభ: మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో
ఆడ-మగ మొక్కజొన్న… రైతులో ఆందోళన
ఆడ-మగ మొక్కజొన్న… రైతులో ఆందోళన కొనుగోళ్లలు చేయని కంపెనీ యజమానులు,చాందిని సీడ్ కంపెనీ
మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మున్సిపల్ చైర్ పర్సన్ పావని
వెకేషన్ లో విరోష్ జంట.. స్పెషల్ వీడియో షేర్ చేసిన రష్మిక
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఆనందమైన క్షణాలను ఎంజాయ్ చేసేందుకు వెకేషన్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ మీడియోను రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానుతో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఫిబ్రవరి 26, గురువారం రాజస్థాన్లోని ఉదయపూర్ లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 25, బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. హల్దీ ఫోటోలను కూడా రష్మిక ఇటీవల షేర్ చేసింది.
Rs 3.40cr ramatheertham road : రాములోరికి సుమమాల Andhraprabha latest News
Rs 3.40cr ramatheertham road : రాములోరికి సుమమాల Andhraprabha latest News
Peddi: Charan’s Power-Packed Birthday Blast
Mega Power Star Ram Charan’s birthday on March 27th is all set to become a high-voltage celebration, thanks to a massive surprise lined up from his Pan-India extravaganza Peddi. The makers have officially confirmed that a special blast will be dropped in 2 more days, amplifying the already sky-high anticipation surrounding the film. The film’s […] The post Peddi: Charan’s Power-Packed Birthday Blast appeared first on Telugu360 .
మూడేళ్లుగా ప్రేమ… పెళ్లికి నిరాకరణ
మూడేళ్లుగా ప్రేమ… పెళ్లికి నిరాకరణ ఊట్కూర్, ఆంధ్ర ప్రభ : ప్రేమ పేరుతో
పాఠశాలలో వేదిక కోసం లక్ష రూపాయల విరాళం…
పాఠశాలలో వేదిక కోసం లక్ష రూపాయల విరాళం… జుక్కల్,ఆంధ్రప్రభ : మారుతున్న కాలంతోపాటు
ఘనంగా ముగిసిన ఉర్సు మహోత్సవం ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు
డ్రంకెన్ డ్రైవ్ లో నలుగురికి జరిమానా…
డ్రంకెన్ డ్రైవ్ లో నలుగురికి జరిమానా… పట్టుబడ్డ 4 గురు వ్యక్తులకు 4
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రభుత్వం ప్రణాళిక: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తుందని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలు నూనాయక్, కందుకూరు జయవీర్తో పాటు పలువురు సభ్యలు విద్యుత్ రంగంపై అడిగిన ప్రశ్నలకు డిప్యూటి సిఎం సమాధానం చెప్పారు. విద్యుత్ రంగంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేదిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహ ఉపయోగ, వ్యవసాయ రంగానికి సంబంధించి 81 గ్రామాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను చేపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 38,216 గ్రామాలు, 16,078 వ్యవసాయ పంప్ సెట్ లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గృహ ఉపయోగ రూఫ్ టాప్ సోలార్ కింద, పీఎం సూర్యగర్ ప్రభుత్వ బిజిలీ కింద 40,349 గృహాల్లో 2 కే సామర్థ్యం రూప్టాఫ్ సోలార్ ఏర్పాటు చేశామని తెలియజేచేశారు. వ్యవసాయ సేవల్లో భాగంగా పిఎం కుసుమ కాంపోనెంట్ సి కింద 7.5 కిలోవాట్ హై రిజ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో16,708 వ్యవసాయ సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశామని డిప్యూటి సిఎం పేర్కొన్నారు. అయితే పలువురు సభ్యలు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు, వ్యవసాయంలో రైతులు సాంప్రదాయ విద్యుత్ వినియోగం, మోటార్ వాడకానికి అలవాటు పడి సోలార్ అంటే అవగాహాన లేక, లేనిపోని అపోహలతో ముందుకు రావడం లేదని తెలిపారు. దీనిపై అధికారులతో విస్తృత అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భట్టి స్పందిస్తూ గతంలో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించామని, వాటిని మరింత ఎక్కువగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
హోటల్ పరిశ్రమను ఆదుకోండి… ముఖ్యమంత్రికి హోటల్ అసోసియేషన్ విన్నపం విజయవాడ, ఆంధ్రప్రభ :
అనర్హత పిటిషన్లపై స్పీకర్కు హైకోర్టు నోటీసు
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురికీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారు పార్టీ ఫిరాయించలేదని ఈ నెల 11వ తేదీన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం హైకోర్టు వీటిని పరిశీలించి స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఇంకా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 16న విచారణ చేపడతామని, ఈ లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొరత లేదు..
వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. చిట్యాల,ఆంధ్రప్రభ : మండల పరిధిలో వాహన
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పాసిగడ్డ తండా
సంపద సృష్టించేందుకు సీ అండ్ డీ ప్లాంట్…
సంపద సృష్టించేందుకు సీ అండ్ డీ ప్లాంట్… కమిషనర్ ధ్యాన చంద్ర విజయవాడ
అదనపు ఛార్జీలు వసూలు చేస్తే.. చర్యలు తప్పవు: సిసిపిఎ హెచ్చరిక
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరతను అవకాశంగా తీసుకొని కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్పిజి ఛార్జీలు, ఇంధన వ్యయం పేరుతో అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సిసిపిఎ) తెలిపింది. అదనంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘‘కొన్ని హోటళ్లు, రెస్టరెంట్లు వినియోగదారుల నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు ఫిర్యాదులతో పాటు మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. మెనూలో పేర్కొన్న వాటికంటే అదనంగా వసూలు చేయవద్దు. అందులో పేర్కొన్నవే తుది ధరలు. అదనపు ఛార్జీల పేరుతో వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదు. వినియోగదారుల చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’’ అని సిసిపిఎ పేర్కొంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ
Rakasa Trailer: Fun and Fantasy Loaded
Niharika Konidela floated Pink Elephant Pictures and produced Committee Kurrollu in the past. Her second film as producer is titled Rakasa and it is gearing up for April release. The film is a horror comedy set in a village backdrop. The trailer of Rakasa is out and it is thoroughly entertaining. The real plot is […] The post Rakasa Trailer: Fun and Fantasy Loaded appeared first on Telugu360 .

30 C