SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

సీఎం సహాయనిధి పేదలకు వరం

సీఎం సహాయనిధి పేదలకు వరం ఊర్కొండ, ఆంధ్రప్రభ : సీఎం సహయ నిధి

ప్రభ న్యూస్ 4 Apr 2026 1:28 pm

ఉపాధి హామీ నిధుల్లో వివక్షపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

నర్సంపేట, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ (ఈజీఎస్) నిధుల కేటాయింపులో వివక్ష చూపడం

ప్రభ న్యూస్ 4 Apr 2026 1:27 pm

కేసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు

కేసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని

ప్రభ న్యూస్ 4 Apr 2026 1:25 pm

28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర పటంలో మార్పులు చేసిన ప్రభుత్వం, రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్‌ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని […] The post 28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 1:19 pm

మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి

మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : ఏప్రిల్ మాసంలో

ప్రభ న్యూస్ 4 Apr 2026 1:18 pm

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల

ప్రభ న్యూస్ 4 Apr 2026 1:18 pm

క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ దే

హైదరాబాద్: క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా బిఆర్ఎస్ అభ్యర్థి గొడిసల సంధ్యారాణిని,  వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీకి చెందిన అభ్యర్థి మిట్టపల్లి సరితను బిఆర్ఎస్, సిపిఐ సభ్యులు ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో బిఆర్‌ఎస్‌, ఏడు వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలిచారు. బిఆర్‌ఎస్‌-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠంను కైవసం చేసుకుంది. గతంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఇవాళ క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికను నిర్వహించారు. దీంతో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కూడా బిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మున్సిపల్ చైర్మన్‌గా బిఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ ఎన్నికయ్యారు.  

మన తెలంగాణ 4 Apr 2026 1:14 pm

ఉట్నూర్ లో ఘనంగా రన్ ఫర్ జోసెఫ్ కార్యక్రమం

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్, ఉట్నూర్

ప్రభ న్యూస్ 4 Apr 2026 1:13 pm

రాజముద్ర పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా

రాజముద్ర పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రీసర్వే

ప్రభ న్యూస్ 4 Apr 2026 1:13 pm

ప్రజాబాటతో విద్యుత్ సమస్యల పరిష్కారం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్ గ్రామ

ప్రభ న్యూస్ 4 Apr 2026 1:10 pm

మరోసారి అదే తప్పు.. శ్రేయస్ అయ్యర్‌కి భారీ జరిమానా

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చేధించి.. తన సత్తా చాటింది. అయితే ఈ విజయోత్సాహంలో ఉన్న పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌తో పాటు జట్టు సభ్యులకు ఐపిఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా అయ్యర్‌తో పాటు ఇతర ఆటగాళ్లపై భారీ జరిమానా విధించింది. అయ్యర్‌కు రూ.24 లక్షలు, ప్లేయర్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రెండోసారి స్లో ఓవర్‌రేట్‌ను ఎదుర్కొంది. ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం.. కెప్టెన్ శ్రేయస్‌పై రూ.24 లక్షలు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా మిగితా ఆటగాళ్లపై రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాను మ్యాచ్ రిఫరీ విధించారు’’ అని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. అయితే ఇదే తప్పు మూడో సారి జరిగితే గతంలో ఒక మ్యాచ్ నిషేధం ఉండేది. కానీ, గత సీజన్ ఐపిఎల్ కొన్ని నిబంధనలు మార్చింది. ఐపిఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. మూడో సారి తప్పిదానికి పాల్పడినా.. ఆ కెప్టెన్‌పై జరిమానా పెరుగుతూ పోతుంది. అంతేకానీ, నిషేధం ఉండదు. ఒకవేళ మళ్లీ శ్రేయస్ అయ్యర్ ఇదే తప్పిదానికి పాల్పడితే అతడిపై రూ.36 లక్షలు జరిమానా పడుతుంది. అలాగే ప్లేయర్లపై 50 శాతం వరకూ మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 4 Apr 2026 1:09 pm

Rockcrete Housing Scam: Case Filed as ₹4 Crore Loss Exposes Major Lapses

A major housing scam involving the Rockcrete company is now under legal scrutiny, as a criminal case has been registered at Nunna Police Station in Vijayawada. The firm, reportedly linked to former YSRCP MLA Thopudurthi Prakash Reddy, is accused of abandoning large-scale housing projects meant for the poor, leaving thousands of beneficiaries in distress. The […] The post Rockcrete Housing Scam: Case Filed as ₹4 Crore Loss Exposes Major Lapses appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 12:59 pm

అమరావతి పనుల్లో వేగం పెంచండి..: సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న రూ.57,821 కోట్ల […] The post అమరావతి పనుల్లో వేగం పెంచండి..: సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 12:56 pm

హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం

హైదరాబాద్ నుంచి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోమశిల మీదుగా సాగే ఈ యాత్రలో కృష్ణానది, నల్లమల అడవుల అందాలను గగనతలం నుంచి వీక్షించే అద్భుత అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థతో కలిసి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రపంచస్థాయి […] The post హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 12:43 pm

ఆరాంఘర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలపై కొరడా

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఫుట్ పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారుల కొరడా ఝుళిపిస్తున్నారు. రాజేంద్రనగర్ లోని ఆరాంఘర్ వద్ద ఫుట్ పాత్ లపై ఆక్రమణలను జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. కూల్చివేతల సందర్భంగా అధికారులు, చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డును ఆక్రమించి డబ్బాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. 

మన తెలంగాణ 4 Apr 2026 12:43 pm

బావిలో పడిన కారు..... ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి

ముంబయి: మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... డిండోరి ప్రాంతానికి చెందిన సునీల్ దత్తు (32) అనే వ్యక్తి తన భార్య రేష్మా, కుటుంబ సభ్యురాలు ఆశా, ఆరుగురు పిల్లలతో కలిసి కారులో శివాజీ నగర్ ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా వీరి కారు అదుపుతప్పి బావిలో పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో డిండోరి ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మన తెలంగాణ 4 Apr 2026 12:37 pm

17 Ships In Que : ఇదిగో గ్రీన్ సాన్వీ Andhra Prabha SPL Story

17 Ships In Que : ఇదిగో గ్రీన్ సాన్వీ Andhra Prabha

ప్రభ న్యూస్ 4 Apr 2026 12:27 pm

అనుమతుల లేమితో నిలిచిపోయిన జెయింట్ వీల్

బెజ్జంకి, ఆంధ్రప్రభ : జాతర సందడి, వెలుగుల మధ్య ఒక విషాద గాథ

ప్రభ న్యూస్ 4 Apr 2026 12:24 pm

వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ నూతన

ప్రభ న్యూస్ 4 Apr 2026 12:21 pm

AR Rahman gets his Biggest Pay

Legendary music composer AR Rahman has won an Oscar for the country. He has several films lined up. AR Rahman is the music composer for the mythological film Ramayana which is mounted on a lavish scale. The first installment of the film will release during Diwali this year and AR Rahman started working on the […] The post AR Rahman gets his Biggest Pay appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 12:20 pm

Prasanth Varma’s Mythological Attempt

Hanuman is a milestone in the career of Prasanth Varma and the film’s success has changed him. He is lined up with several films and he is also working on several scripts and they will be made on his production house. Prasanth Varma has been working on a mythological script from a long time. He […] The post Prasanth Varma’s Mythological Attempt appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 12:19 pm

మాచర్లలో నిర్భయ తరహా దాడి..

పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళపై జరిగిన పాశవిక దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మాచర్లలో ఒంటరిగా ఉంటున్న 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగినిపై ఒక దుండగుడు కిరాతకంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటన గత గురువారం సాయంత్రం జరిగింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సత్తెనపల్లికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతుండగా… నీళ్లు కావాలంటూ దుండగుడు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత కత్తితో బెదిరించి ఆమెపై దాడికి దిగాడు.బాధితురాలిని వివస్త్రను చేసి, కాళ్లు చేతులు కట్టేసి, […] The post మాచర్లలో నిర్భయ తరహా దాడి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 12:15 pm

Ramayana OTT Deal: True of PR Stunt?

Ramayana is the costliest film made in Indian cinema till date. The film releases in two parts and the first part is slated for Diwali release this year. Bollywood media started speculating that the digital players offered a whopping Rs 700 crores for the digital rights of both the parts including all the languages. This […] The post Ramayana OTT Deal: True of PR Stunt? appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 12:12 pm

ఆలేరులో వైద్య శిబిరం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని పోచమ్మగుడి

ప్రభ న్యూస్ 4 Apr 2026 12:09 pm

6 zones |రోడ్డు విస్తరణ పనులు వేగవంతం

6 zones | రోడ్డు విస్తరణ పనులు వేగవంతం 6 zones |

ప్రభ న్యూస్ 4 Apr 2026 12:01 pm

బెంగాల్‌లో అలజడికి కుట్రలు

బీజేపీ, ఎంఐఎంపై మమత ఆరోపణ కోల్‌కతా: ఎన్నికల వేళ తమ రాష్ట్రంలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు అలజడి సష్టించడానికి కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో భాగంగా జాబితా నుంచి తమ పేర్లు గల్లంతు కావడాన్ని నిరసిస్తూ కొందరు స్థానికులు ఏడుగురు న్యాయాధికారుల్ని మాల్దా జిల్లాలో ఘెరావ్ చేసిన సంఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎంఐఎం పార్టీకి చెందిన ఒక వ్యక్తిని శుక్రవారం అరెస్టుచేశారు. రాష్ట్రంలో అలజడి […] The post బెంగాల్‌లో అలజడికి కుట్రలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 11:58 am

రాజకీయాల్లో హాట్ టాఫీక్ గా నిరాహార దీక్ష..

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా నాయకుడు ధర్మపురి సంజయ్ కు కాంగ్రెస్

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:57 am

4th April 2026 |తిరుమల సమాచారం

4th April 2026 | తిరుమల సమాచారం తిరుమల, ఆంధ్రప్రభ : కొనసాగుతున్న

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:54 am

Fair Festival | 30 మందికి అస్వస్థత..

Fair Festival | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లా సింగుపురం

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:51 am

నేను అనుష్కను తన్నినప్పుడు ఆమె మెడ భాగంలో గాయమైంది: అడివి శేషు

హైదరాబాద్: డెకాయిట్ సినిమాలో హీరో అడివి శేషు నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడి స్నేహితుడు శానిల్ దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని విడుదల చేస్తున్న సందర్భంగా పెద్ద ప్రమోట్ చేస్తున్నాడు. ఏ చిన్న అవకాశాన్ని కూడా అడివి శేషు వదులుకోవడం లేదు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళీ బాషల్లో విడులు చేస్తున్నారు. తాజాగా సుమకు ఇచ్చిన ఇంటర్యూల్లో బహుబలి సినిమాలో అనుష్కతో నటించిన సన్నివేశాన్ని శేషు గుర్తు చేశారు. బహుబలి సినిమాలో భల్లాళదేవుడైన రానా కుమారుడిగా శేషు నటించారు. ఓ సన్నివేశంలో అనుష్క శేషు తన్నాల్సిన సీను ఉంది. తాను నెమ్మదిగా తన్నడంతో సీన్ పర్‌ఫెక్ట్ రాలేదని, ఫోర్స్‌పుల్‌గా తన్నామని డైరెక్టర్ రాజమౌళి చెప్పడంతో అనుష్కను గట్టిగా తన్నానని, సీన్ మాత్రం బాగా వచ్చిందని, ఆమె ముఖంలో ఎక్కడా బాధ కనిపించలేదని గుర్తు చేశారు. తాను తన్నినప్పుడు ఆమె మెడ భాగం వణికినట్లు కనిపించిందన్నారు. ఆమె పేరుకు తగ్గట్లే ఆమె చాలా స్వీటీ అని శేషు ప్రశంసించారు. దీనికి సంబంధించినే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మన తెలంగాణ 4 Apr 2026 11:34 am

యువ ఓటర్లపై టీవీకే గురి

వారి లక్ష్యంగానే మ్యానిఫెస్టో రూపకల్పన చెన్నై: తమిళనాడులో ఎన్నికల వాతావరణం రసవత్తరంగా ఉంది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో విజయ్ పార్టీ టీవీకే ఉత్సాహంగా ప్రచారం సాగిస్తోంది. ఆ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా వచ్చిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) యువ ఓటర్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వారిని లక్ష్యంగా చేసుకునే టీవీకే అధినేత విజయ్ మ్యానిఫెస్టోను రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ, గ్రామీణ యువతను ఆకర్షించేలా విద్య, ఉద్యోగాలు, అందుకోసం ఆర్థిక సహకారం వంటి హామీల్ని […] The post యువ ఓటర్లపై టీవీకే గురి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 11:33 am

మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి

ఇబ్రహీంపట్నం, జనం సాక్షినేడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కానున్న సందర్భంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి …

జనం సాక్షి 4 Apr 2026 11:29 am

స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి

-సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సంప్రీత్ సింగ్ వర్ధన్నపేట,ఏప్రిల్ 4( జనం సాక్షి): ఐనవోలు మండలం పున్నేలులో మానవత్వాన్ని మరిచిన దారుణ ఘటన …

జనం సాక్షి 4 Apr 2026 11:25 am

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తాడూరు, ఆంధ్రప్రభ ; తాడూరు మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:24 am

చిట్యాలలో బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్

చిట్యాల, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టుల తో ప్రజా పోరాట

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:19 am

AP CM |చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

AP CM | చంద్రబాబు తీవ్ర ఆగ్రహం AP CM | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:15 am

గెలుపు కోసం ‘సీట్ల పెంపు’ వ్యూహం

దక్షిణ భారతదేశంలో బిజెపికి కనిష్ట ఎన్నికల బలం ఉన్నప్పటికీ ఉత్తర భారత రాష్ట్రాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకుని 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారం లోకి రావడానికి బిజెపి ఇప్పటినుంచే కొత్త ఎత్తుగడలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీగా సీట్లు గెలవడం ద్వారా కేంద్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చని బిజెపి నమ్ముతోంది. దక్షిణాదిలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజెపికి బలం తక్కువ. 2024లో తమిళనాడులో 39/39 సీట్లు డిఎంకె గెలుచుకుంది. అయినప్పటికీ తమిళనాడులో ఓటుశాతం పెంచుకోవడం పైనా, కేరళలో ఓటు బ్యాంకు విస్తరణ పైనా బిజెపి దృష్టి పెట్టింది. ఇప్పుడు తమిళనాడు, కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు 2029 నాటికి పునాదిగా భావిస్తోంది. ఈమేరకు నియోజకవర్గాల పునర్విభజన 2029 నాటికి పూర్తి చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ , రాష్ట్రాల అసెంబ్లీల సీట్లు 50 శాతం వరకు పెంచుకోవాలని ఆలోచిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన అన్న మాట లేకుండా సీట్లు పెంచుకోవడమే తమ లక్షంగా బయటకు నమ్మిస్తోంది. అదే జరిగితే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816 వరకు, అసెంబ్లీ స్థానాలు 4123 నుంచి 6385 వరకు పెరుగుతాయి. దక్షిణాదితో పోలిస్తే జనాభాలో వ్యత్యాసాల ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఉంటున్నాయి. ఈ వ్యత్యాసాలను సవరించాలని దక్షిణాది రాష్ట్రాలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. 1951లో దేశం మొత్తంమీద జనాభాలో దక్షిణాది రాష్ట్రాల్లో 26 శాతం జనాభా ఉండగా, 2022 నాటికి ఇది 19 శాతానికి తగ్గింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సీట్ల పెంపు వ్యూహం గురించి ఎన్‌డిఎ మిత్రపక్షాలతోనే చర్చించారు తప్ప ఇతర రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపకపోవడం బిజెపి వ్యూహంలో మర్మం తెలుస్తోంది. సీట్ల పెంపు ఫార్ములా ప్రకారం ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 543 నుండి 816 కి పెరగడం తప్పదు. ఉత్తరభారత రాష్ట్రాల్లో 150 నుంచి 200 సీట్లు వరకు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తర భారత రాష్ట్రాల్లో “అన్యాయంగా బలమైన మెజారిటీ” లభిస్తుందని, దక్షిణ భారత రాష్ట్రాలను రాజకీయంగా నిర్వీర్యం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో సీట్లు 80 నుంచి 120 కి పెరుగుతాయి. అదే సమయంలో తెలంగాణ సీట్లు 17 నుంచి కేవలం 26 వరకు మాత్రమే పెరుగుతాయి. ప్రస్తుతానికి ఉన్న 63 సీట్ల వ్యత్యాసం భవిష్యత్తులో 94 సీట్ల వరకు పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకనే జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తరువాతనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉండే సీట్ల సంఖ్యను జనాభా నిష్పత్తి ప్రకారం పెంచాలని, అదనపు సీట్లు ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్లకుండా పరిమితం విధించాలని కోరుతోంది. ఇప్పటికే హిందీ ప్రాంతానికి పరిమితమైన పార్టీగా బిజెపికి ముద్ర ఉంది. నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల ఆమోదం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవుల నియామకం తదితర విషయాల్లో ఇప్పటికే ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య వ్యత్యాసం కనిపిస్తుండగా, సీట్ల పెంపు జరిగితే మరింత వ్యత్యాసం పెరుగుతుందన్న విమర్శ వస్తోంది. నిధుల కేటాయింపులో కానీ, అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరులో కానీ కేంద్ర ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజనకు మోడీ ప్రభుత్వం గతంలో ప్రయత్నించగా దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో వెనక్కు తగ్గింది. ఇప్పుడు దక్షిణాది సీట్లు నేరుగా తగ్గించకపోయినప్పటికీ 50 శాతం సీట్ల పెంపు ప్రయత్నం దక్షిణాదికి అన్యాయమే చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రతి దశాబ్దానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కానీ అసమానంగా జనాభా పెరిగినందున లోక్‌సభ నియోజకవర్గాల సీట్ల విస్తరణను 25 సంవత్సరాల పాటు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్తంభింప చేశారు. ఆ తరువాత అటల్ బిహారీ వాజ్‌పాయ్ కూడా 2001లో అదే పద్ధతిని అనుసరించారు. 1976, 2002 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గాల సరిహద్దు మార్చారు. మళ్లీ 45 ఏళ్ల తరువాత మోడీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు ప్రయత్నాలు ప్రారంభించింది. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్రం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గకపోయినా, సాపేక్షంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో పెరిగిన సీట్లవల్ల దక్షిణాదికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఈ అసమానత ఉత్తరాది రాష్ట్రాల శాసనసభ ఆధిపత్యం పెరిగిపోవడానికి దారితీస్తుంది. అంతేకాదు సెక్యులరిజం, ఫెడరలిజం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నష్టం కలిగించే పాలకవర్గాల విధానాలను దక్షిణాది రాష్ట్రాలు ప్రతిఘటించడం కష్టతరమవుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం మత, కుల విభేదాలను వాడుకుంటోందని బిజెపిపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రాంతీయ విభజనలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మన తెలంగాణ 4 Apr 2026 11:11 am

ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు

నిరూపించిన మారుమూల తాండ యువతి నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 04: (జనం సాక్షి ) సిరికొండ కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీ లేదని ఎదుగుదలకు పేదరికం …

జనం సాక్షి 4 Apr 2026 11:11 am

జనవాసాల మధ్య ట్రాన్స్‌ఫార్మర్లు పేలుడు

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్‌గోడు గ్రామంలో జనవాసాల

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:07 am

Accident | 9 మంది మృతి

Accident | 9 మంది మృతి Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:06 am

నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు

_భక్తులతో నిండిపోయిన గంభీరావుపేట.. _స్వామి వారిని దర్శించుకున్న పలువురు సర్పంచులు.. రాజకీయ నాయకులు.. గంభీరావుపేట ఏప్రిల్ 04 (జనం …

జనం సాక్షి 4 Apr 2026 11:04 am

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని మొండికుంట

ప్రభ న్యూస్ 4 Apr 2026 11:00 am

డొనాల్డ్ ట్రంప్ మలి జూదం

ఫిబ్రవరి 28 నుంచి మార్చి చివరి వరకు 32 రోజులపాటు సాగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి జూదం విఫలమైంది. దానితో ఆయన యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ఏప్రిల్ 1న ప్రసంగించిన తర్వాత మలి జూదం ఆరంభించినట్లు కనిపిస్తున్నది. ఆ విధంగా, మరుసటి రోజున ఇరాన్‌లోని పౌర సదుపాయాలపై దాడులు మొదలుపెట్టారు. తన ప్రణాళికలకు సరిగా ఉపయోగపడటం లేదని కావచ్చు తమ సీనియర్ సైనికాధికారులకు ఉద్వాసన చెప్పటం చేశారు. ఇకనైనా ఇరాన్ తన షరతులకు పూర్తిగా అంగీకరించి ఒప్పందం చేసుకోనట్లయితే అతి భీకరమైన యుద్ధం సాగించి ఇరాన్‌ను ‘శిలాయుగం’ నాటి పరిస్థితులలోకి తీసుకు వెళ్లగలనని హెచ్చరించారు. ఈ మలి జూదం రాగల వారాలలో ఎట్లా సాగగలదో, ఈసారి అయినా ట్రంప్ నెతన్యాహూ కోరుకున్న ఫలితాలను ఇవ్వగలదేమో చూడవలసి ఉంది. ఇరాన్ మాత్రం అమెరికా అధ్యక్షుని ప్రసంగం తర్వాత ఒకసారి, ఆ తర్వాత పౌర సదుపాయాలపై దాడులు మొదలైన తర్వాత మరొకసారి సమాధానమిస్తూ, తమను ఇవేవీ లొంగదీయలేవని ధిక్కరించింది. అంతటితో ఆగక ఆ వెంటనే ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాలలోని అమెరికన్ సైనిక స్థావరాలపై, అమెరికాకు చెందిన హైటెక్ కంపెనీలు, స్టీల్ కంపెనీలపై ఎదురు దాడులు జరిపింది. అమెరికా దాడుల వల్ల ఇరాన్‌లో కలిగిన నష్టాల చిత్రాలు వెంటనే ప్రసారమయ్యాయి. వాటిలో ఒకటి ఇంకా నిర్మాణంలో ఉన్న చాలా ఎత్తయిన వంతెన కాగా, మరొకటి ఔషధ కర్మాగారం. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలో జరిగిన నష్టాల చిత్రాలు మాత్రం రాలేదు. ఆ దేశాలన్నీ కఠినమైన సెన్సారింగ్ విధించినట్లు పాశ్చాత్య దేశాల మీడియానే ప్రకటిస్తున్నది. అయితే ఈ దాడి గురించి స్వయంగా ఇజ్రాయెల్ ప్రభుత్వమే, ఇరాన్ ఇంతటి భారీ దాడి జరపటం ఇదే మొదటిసారని అంగీకరించటం గమనించదగ్గది. మొదటి దశ యుద్ధ కాలమంతా అమెరికా, ఇజ్రాయెల్ చెప్తూ వచ్చిందేమిటి? ఇరాన్‌ను సైనికంగా 90 శాతం వరకు తుడిచిపెట్టామని, అణు పరిశోధనా కేంద్రాలు, క్షిపణి నిల్వలు, డ్రోన్లు, వాటి నిల్వలు, తయారీ కేంద్రాలు, లాంచర్లు ధ్వంసమైపోయాయని, ఇరాన్ సైన్యంలో అతి కీలక విభాగమైన రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జిసి) నిర్వీర్యమైపోయిందని, వైమానిక బలం యావత్తు మట్టిపాలు కాగా, నౌకాబలమంతా సముద్రం అడుగుకు మునిగిపోయిందని. ఇవన్నీ ట్రంప్ మాటలే. అది తాను ఒకటి రెండు సార్లు కాదు, పదే పదే అంటూ వచ్చారు. అమెరికా సైనిక పాటవం యావత్ ప్రపంచంలోనే అత్యంత బలోపేతమైనది సుమా అని కూడా ప్రతిసారి ఇరాన్‌తోపాటు అన్ని దేశాలకు గుర్తు చేస్తూ వస్తున్నారు. మొదటి దశ దాడులు రెండు రోజులలో ముగియగలవని వారు అంచనా వేయగా 32 రోజులు సాగాయి. అమెరికా తోపాటు ఇజ్రాయెల్ ఉమ్మడి బలాన్ని తట్టుకున్న ఇరాన్ ఇంతకాలం తన ఎదురు దాడులతో ఆ ఇద్దరితోపాటు గల్ఫ్ రాజ్యాలకు తీవ్రమైన నష్టాలను కలిగించింది. వివరాలు ఇక్కడ రాయనక్కరలేదు గాని, అమెరికా, ఇజ్రాయెల్ ప్రచారం చేసినట్లు ఇరాన్ సైనిక శక్తి ధ్వంసం మాత్రం కాలేదని ప్రపంచానికి అర్థమైంది. ఇరాన్ ప్రత్యర్థులకు మరింత బాగా అర్థమైంది. ఇందుకు అదనంగా హర్మూజ్‌ను ఇరాన్ దిగ్బంధించగా, బాబ్ అల్ మందెల్‌ను కూడా దిగ్బంధించేందుకు హూతీలు సిద్ధపడుతుండటం, లెబనాన్, ఇరాక్‌లలోని మిలిటెంట్ సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్ సంబంధిత స్థావరాలపై దాడులు ఆరంభించటంతో ఆ రెండు దేశాలకు ఊపిరి సలపకుండా ఉంది. ఇటువంటి స్థితిలో ఏమి చేయాలో తోచని ట్రంప్, ఇరాన్‌పై భూతల యుద్ధం కోసమంటూ సేనలను మోహరించి కూడా వాటిని ఓడలపై నుంచి నేలపైకి దింపటానికి గాని లేదా పారాచూట్ల ద్వారా విమానాల నుంచి జారవిడవటానికి గాని సాహసించటం లేదు. ఈ పరిస్థితుల ప్రభావంతో చమురు కొరతలు ఏర్పడి, ధరలు పెరుగుతూ ఇంటా బయటా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్, తమకు సాయంగా వచ్చేందుకు యూరప్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా ఏ ఒక్కరూ ముందుకు రాకపోవటంతో వారిపై ఆగ్రహిస్తూ, అమెరికా మాత్రం నాటోలో ఎందుకుండాలని ప్రశ్నించటం మొదలు పెట్టారు. దీనంతటి సారాంశం ఏమంటే, 32 రోజుల తొలి దశ యుద్ధం పూర్తిగా విఫలమైంది. దాడులకు ముందు ప్రకటించిన అరడజను లక్షాలలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. మొదటి దశ చివరకు వస్తున్న వేళ, ఇరాన్‌తో రాజీకోసమంటూ 15 షరతులు ప్రకటించారు. ఇరాన్ అడగకుండానే తనంతటతానే అందుకు ప్రతిగా ఇరాన్ అయిదు షరతులు ముందుంచింది. ఆ మొత్తం 20లో ఏ ఒక్కటీ జరిగేది కాదని వాటిని చూసిన వెంటనే అందరికీ అర్థమైంది. జరిగింది కూడా అదే. ఆ విధంగా సాగిన మొదిటి దశకు, ఏప్రిల్ 1 నాటి ట్రంప్ ప్రసంగానికి మధ్య గల సంధి దశలో అమెరికా అధ్యక్షుడు ఎపుడేమి అంటున్నారో తెలియని విధంగా ఊగిసలాడారు. లక్షాలన్నీ దాదాపు సాధించి వేశామని, ఇక ఏ క్షణమైనా నిష్క్రమిస్తామని ఒకసారి, దాడులు ఇంకా తీవ్రం చేస్తామని మరొకసారి, ఇరాన్ లొంగిపోవాలని ఒకసారి, లొంగకున్నా సరేనని మరొకసారి, హర్మూజ్‌ను తెరిపించి తీరుతామని ఒకసారి, అటువంటి అంగీకారం కుదరకున్నా పరవాలేదని మరొకసారి, యూరప్ తమకు తోడు రావాలని ఒకసారి, రాకున్నా సరేనని ఇంకొకసారి, అక్కడి చమురు తమకు అవసరం లేదు గనుక మీరే పోయి తెచ్చుకొండని ఒక రోజు మాట్లాడుతూ తమ బలహీనతలను తానే బయట పెట్టుకుంటూపోయారు. తమను అనవసరంగా యుద్ధంలోకి లాగారని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఇజ్రాయెల్ ప్రధానిపై కేకలు వేసే వరకు వెళ్లింది పరిస్థితి. మామూలుగానైతే ఇన్నిన్ని వైఫల్యాల దృష్టా అమెరికన్లు ఈ మొదటి దశ అనంతరం యుద్ధం నుంచి నిష్క్రమించాలి. ఇరాన్‌కు చాలా నష్టాలే కలిగించినందున విజయం సాధించినట్లేనని ప్రకటిస్తూ ఇక వెళ్లిపోవటం గౌరవప్రదంగా ఉంటుందని పలువురు నిపుణులు ట్రంప్ కు సూచించారు కూడా. చాలా లక్షాలు నెరవేరాయని ట్రంప్ కూడా అంటుండినందున, నిష్క్రమించగలమనే సూచనలు కూడా చేస్తుండినందున, అదే విధంగా జరగగలదని పలువురు భావించారు. తన ఏప్రిల్ 1 ప్రసంగంలో అదే విషయం ప్రకటించగలరనే అభిప్రాయం కూడా ఏర్పడింది. కాని అంతలోనే ఏమి జరిగిందో తెలియదు గాని, ఆయన మలి దశ యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధం పట్ల దేశంలో వ్యతిరేకత పెరుగుతుండటంతో (ఒక అంచనా ప్రకారం మూడింట రెండు వంతులు. ఆ వ్యతిరేకులలో తన ‘మాగా’ మద్దతుదారులు కూడా ఉన్నారు.) వారికి నచ్చచెప్పటం కోసమా అన్నట్లు కొన్ని మాటలు చెప్పారు. యుద్ధం చేస్తున్నది వారి ‘భవిష్యత్ కోసం పెట్టుబడి’ అన్నారు. గతంలో అనేక యుద్ధాలు నెలలు, సంవత్సరాల తరబడి సాగటాన్ని గుర్తు చేస్తూ అమెరికన్లు కాస్త ఓపిక పట్టాలని కోరారు. ఇంతవరకు జరిగిన యుద్ధంలో లక్షాలు అధిక భాగం నెరవేరాయని నమ్మించజూసారు. అణ్వస్త్రాలు తయారు చేస్తున్న ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టనట్లయితే అమెరికాకు, ఇజ్రాయెల్‌కు, గల్ఫ్ దేశాలకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని భయపెట్టజూసారు. కాని ఆయన ఎంతో శ్రమపడి మరొక మారు చెప్పిన అవే పాత మాటలు ఎవరినీ నమ్మించలేదు. ఆ వెంటనే చమురు ధరలు పెరగగా, స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ప్రజలలో నమ్మకం పెరగలేదు. ఇదంతా ఎట్లున్నా లెక్క చేయదలచుకోని ట్రంప్, తన ప్రసంగం ముగిసి ఒక రోజైనా గడవక ముందు రెండవ దశ యుద్ధం మొదలు పెట్టారు. ఈ దాడులు వంతెనలు, మందుల కంపెనీల వంటి పౌర కేంద్రాలతో ఆరంభం కావటం గమనించదగ్గది. రాగల రోజులలో ఏమయేదీ చూడవలసి ఉంది. లక్షాలను చేరలేకపోయినట్లు అంగీకరించి (పరోక్షంగానైనా కావచ్చు) వైదొలగితే ప్రపంచంలో, స్వదేశంలో పూర్తిగా మొహం చెల్లకపోవటం, నవంబర్ మధ్యంతర ఎన్నికలలో పరాజయ అవకాశాలు, ఇజ్రాయెల్ ఒంటరి కావటం, గల్ఫ్ రాజ్యాలకు నమ్మకం పోవటం, యూరప్ మరింత దూరం కావటం, రష్యా, చైనాల పలుకుబడి పెరగటం, ఇరాన్ మరింత స్వతంత్రంగా ఎదగటం వంటి అవకాశాలన్నీ ట్రంప్‌ను బాగా భయపెట్టినట్లున్నాయి. అందుకే, ఒక జూదగాడు చివరి గేమ్‌లో సర్వస్వం ఒడ్డినట్లు, ఈ మలి దశ జూదంలోకి దిగినట్లు కనిపిస్తున్నది.   - టంకశాల అశోక్ ( దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు

మన తెలంగాణ 4 Apr 2026 10:57 am

అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ దాడి

ఎఫ్15, ఏ10 ఫైటర్ జెట్‌లు ధ్వంసం తెహ్రాన్: యుద్ధం వేళ అమెరికాకు ఇరాన్ సామర్ధ్యం అంతు బట్టడం లేదు. అంతా అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడా తగ్గేది లేదని ఇరాన్ తన పని తాను చేసుకుపోతోంది. అమెరికా దాడులను తిప్పి కొడుతూ ధీటైన సమాధానం చెబుతోంది. అమెరికాకు షాక్‌లు మీద షాక్‌లు ఇస్తోంది. ఒకే రోజు అగ్రరాజ్యానికి చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. మరో రెండు హెలికాప్టర్ల పైనా […] The post అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ దాడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Apr 2026 10:56 am

జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులుగా రాంపూర్ సాయి కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తా నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 04:(జనం సాక్షి ) కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని జనం పాట కల్చరల్ …

జనం సాక్షి 4 Apr 2026 10:52 am

పందుల సంచారం.. ఆరోగ్యానికి ముప్పు..

పందుల సంచారం.. ఆరోగ్యానికి ముప్పు.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో పందుల

ప్రభ న్యూస్ 4 Apr 2026 10:50 am

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

భీమదేవరపల్లి:ఏప్రిల్04(జనం సాక్షి) మండలంలోని కొప్పూరు గ్రామానికి చెందిన ఉగ్గే మధుకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.ఈ నేపథ్యంలో శనివారం స్థానిక సర్పంచ్ గద్ద …

జనం సాక్షి 4 Apr 2026 10:49 am

పాషాణ హృదయాలపై ‘పెంబి’ ఆదివాసీల గర్జన

తెలంగాణ మ్యాప్‌లో ప్రస్తుత నిర్మల్ జిల్లాలోని ‘పెంబి’ ఒక చిన్న మండలం కావచ్చు, కానీ అక్కడ నివసించే గిరిజనుల పోరాట చరిత్ర హిమాలయమంత సాంద్రత కలిగినదిగానే చూడక తప్పదు. నిర్లక్ష్యానికి గురైన ఒక జాతి, తమ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పాలకుల కోటల పునాదులను కదిలించే ఒక ‘ప్రజా ఉద్యమం’ సాగించిన చరిత్రక ఆనవాళ్లతో తమ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని ప్రస్తుతం నినదిస్తున్నారు. నాడు కొమురం భీమ్ సాగించిన జల్ జంగిల్ జమీన్ పోరాటం నేటికీ పెంబి అడవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉందనట్లుగా ప్రస్తుత పరిస్థితి తెలుపుతున్నది. అభివృద్ధి అంటే హైవేలు, ఐటి టవర్లు, కాంక్రీట్ కట్టడాలు అని భావించే వారికి, పెంబిలోని దోత్తివాగు, కడం వాగులు ఒక చేదు నిజాన్ని గుర్తు చేస్తున్నాయి. వర్షాకాలం వస్తే ఈ మండలంలోని పలు ఆవాస గూడేలు ఒక ‘బహిరంగ జైలు’గా మారుతోందనటమే ఇందుకు సాక్ష్యం. ‘పెంబి’ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా 3 గ్రామపంచాయతీల పరిధిలోని 16 ఆవాస గ్రామాల పరిస్థితి అగమ్యగోచరమే. ఈ 16 ఆదివాసీ ఆవాస గ్రామాలు (గోండు కోలం నాయకపోడు) వర్షకాలంలో ఎక్కడికక్కడ స్తంభించిపోవడం తప్ప మరోమార్గం లేని పరిస్థితి. దొందారి గ్రామపంచాయతీ పరిధిలోని చాకీరేవు గూడెంలో సుమారు 30 కుటుంబాలు ఉండగా ఒకటే బోరింగ్ ఉంది. ఈ లెక్కన కనీసం సరిపడ తాగునీటి వసతి కూడా లేదనేది అర్థం చేసుకోవాల్సిన అంశం. పక్కనే ఉన్న వాగులో అన్నీ రకాల నీటి సౌకర్యం తీర్చుకోవాల్సిందే. కరెంట్ ఉండదు. ఈ గూడెంలో ఫోన్ సిగ్నల్ ఉండదు. ఆ మండలంలో ఆదివాసీ ఆవాసాలకు, గూడెలకు వంతెనల నిర్మాణం లేకపోవడం వల్ల కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే ఆగడం లేదు. అక్కడ ఒక తరం విద్యకు, మెరుగైన వైద్యానికి దూరమవుతోందని గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ లేకపోవడం, అంగన్‌వాడీ పోస్టులు కూడా భర్తీ కాకుండా ఖాళీగా ఉండటం అంటే పెంబి మండలంలో పుట్టబోయే తరాన్ని పౌష్టికాహార లోపానికి, మరణానికి దగ్గర చేయడమే అవుతుంది. పసుపుల, మందపెళ్లి, రాజురా వంతెనలు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటం అనేది ఇంజనీరింగ్ లోపం కాదు, అది ప్రభుత్వ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య లోపం అనడంలో తప్పేమీ లేదేమో..! ముందే చెప్పినట్లుగా అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు కట్టడాలు మాత్రమే కాదు. అడవి బిడ్డల కన్నీళ్లు కూడా తుడవడమని పాలకులు ఎప్పుడు గుర్తిస్తారు? అభివృద్ధి నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నా పెంబి గడ్డపై ఆదివాసీల జీవితాలు మాత్రం ఇంకా వాగుల మధ్య, అడవి కంచెల మధ్య బందీ అయి ఉన్నాయంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి పరిస్థితిలో తాజాగా సిపిఎం పార్టీ నేతృత్వంలో (మార్చి 21, 2026న) యాపలగూడ నుంచి ప్రారంభమైన పాదయాత్రను పెంబి గిరిజనులు ప్రారంభించారు. దీనికి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, నిర్మిల్ జిల్లా కార్యదర్శి గౌతం కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు సురేష్, స్థానిక నాయకులు శంభు, నిర్మలాభాయ్, ధర్మరాజు, పగ్గు తదితరులు నాయకత్వం వహిస్తున్నారు. పెంబి మండల అభివృద్ధిని కాంక్షిస్తూ తలపెట్టిన ఈ పాదయాత్రను రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా స్వాగతించాలి. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. ఒక రకంగా ఇది పెంబి గిరిజన గుండె రగిలించిన నిప్పుకణికగా భావించాల్సి వస్తున్నది. ఎందుకంటే దోత్తివాగు, కడం వాగులు నేటికీ ఆదివాసీలకు శాపంగా మారాయి. మరోవైపు అత్యవసర వైద్యం అందక గర్భిణులు, రోగులు వాగుల ఒడ్డునే ప్రాణాలు వదిలేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ స్థితిని చూసి పాలకులు, ప్రభుత్వాధికారుల గుండె కరగకపోవడం శోచనీయమే అవుతుంది. మరోవైపు పసుపుల, మందపెళ్లి, రాజురా వంతెనల నిర్మాణం దశాబ్దాలుగా ఎందుకు అసంపూర్తిగా ఉందో సమాధానం చెప్పే నాథుడే లేడు. ఇంకోవైపు పోడు భూములే గిరిజనుడి జీవనాధారం. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పట్టాలు ఇవ్వకుండా అటవీ శాఖ అడ్డంకులు సృష్టించడం అన్యాయమే అవుతుంది. ‘అడవి మాది.. అడవిలో పుట్టిన చెట్టు, పుట్ట మావి.. కానీ మా భూమి మాది కాదా..?’ అని పెంబి ప్రాంత గిరిజనులు పడుతున్న ఆవేదన నేడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒకరకంగా ‘అడవిని నమ్ముకున్న వాడికి అడవిపై హక్కు లేకపోవడం’ ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం. పోడు భూములకు హక్కు పట్టాలు ఇవ్వకపోవడం ద్వారా ప్రభుత్వం గిరిజనులను వారి సొంత గడ్డపైనే ‘ఆక్రమణదారులు’గా చిత్రీకరిస్తోంది. అడవి అంటే చెట్లు మాత్రమే కాదు, ఆ చెట్ల నీడన బతికే మనుషులు కూడా అని ఈ వ్యవస్థ గుర్తించకపోవటం దురదృష్టకరమైన అంశం. ఇలాంటి అనేక సమస్యలన్నీ పెంబి మండలాన్ని వెనుకబాటుతనానికి సాక్ష్యంగా నిలుపుతున్నది. ఈ పరిస్థితుల్లో సిరిచల్మా నుంచి పులగంపండ్రి వరకు రహదారులు పడాలన్నా, ప్రతి గిరిజనుడికి పట్టా అందాలన్నా, కరెంటు వెలుగులు వికసించాలన్నా ఐక్యతతోనే సాధ్యం. ఆ ఐక్యతను చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. పెంబి గడ్డపై జరుగుతున్న ప్రస్తుత పాదయాత్ర కేవలం నడక మాత్రమే కాదు, అభివృద్ధిని నిలదీసే నడక. హక్కులను సాధించుకునే వరకు విశ్రమించని పోరాటంగా చూడక తప్పదు. అడవి బిడ్డల ఆత్మగౌరవం చాటడానికి, రాబోయే తరాల బంగారు భవిష్యత్తు కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పాలకులారా మాకు కావాల్సింది ఓట్ల పండగలో ఇచ్చే హామీలు కావు, మా వాగులపై వంతెనలు, మా భూములపై హక్కులు, మా గూడెంలో విద్య, వైద్యం!’ సొంతగూడు కావాలని ఈ పాదయాత్రలో వినిపించే ప్రతి అడుగు చప్పుడు పాలకుల నిద్రను చెడగొట్టేలా ఉండాలి. ఇది కేవలం సిపిఐ(ఎం) పిలుపు మాత్రమే కాదు, పెంబి గడ్డపై దశాబ్దాలుగా అణచివేయబడిన ఆవేదనకు ప్రతినిధిగా నిలువాల్సి ఉంది. కేవలం తమ పార్టీ కార్యక్రమంలాగా కాకుండా పెంబి మండల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే యుద్ధభేరి కావాల్సిన అవసరం ఉంది. - రాజేందర్ దామెర

మన తెలంగాణ 4 Apr 2026 10:46 am

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు..

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు.. ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Apr 2026 10:35 am

ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ఏలూరు శ్రీ చైతన్య విద్యార్థులు..

ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ఏలూరు శ్రీ చైతన్య విద్యార్థులు.. ఏలూరు ఎడ్యుకేషన్,

ప్రభ న్యూస్ 4 Apr 2026 10:24 am

AP to Expand NH-16 to Six Lanes Between Rajamahendravaram and Anakapalli

Andhra Pradesh is moving ahead with a major highway upgrade to ease growing traffic congestion along the busy Chennai–Kolkata corridor. The stretch of National Highway 16 between Rajamahendravaram and Anakapalli will be expanded from four lanes to six lanes, offering faster and smoother travel for commuters and transport vehicles. The project covers a distance of […] The post AP to Expand NH-16 to Six Lanes Between Rajamahendravaram and Anakapalli appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 10:18 am

Amaravati Set to Receive Its Own PIN Code as Capital Status Gains Momentum

Amaravati is moving closer to becoming not just the administrative heart of Andhra Pradesh, but also a fully recognized postal hub with its own unique PIN code. This development follows the Union Government’s move to amend the Andhra Pradesh Reorganisation Act and formally establish Amaravati as the permanent capital of the state. The bill has […] The post Amaravati Set to Receive Its Own PIN Code as Capital Status Gains Momentum appeared first on Telugu360 .

తెలుగు 360 4 Apr 2026 10:16 am

ప్రపంచ శాంతి కోరుతూ శాంతి ర్యాలీ..

ప్రపంచ శాంతి కోరుతూ శాంతి ర్యాలీ.. గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ

ప్రభ న్యూస్ 4 Apr 2026 10:11 am

Telangana : మీ బ్యాంకు అకౌంట్ లో నగదు పడిందా? అయితే సరిచూసుకోండి

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతుంది

తెలుగు పోస్ట్ 4 Apr 2026 10:10 am

హర్మూజ్.. ఇరాన్ ట్రంప్ కార్డ్

మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రదేశాల్లో ఒకటి హర్మూజ్ జలసంధి. గల్ఫ్ ప్రాంతాన్ని ప్రపంచంతో కలిపే ఈ సన్నని సముద్ర మార్గం, కేవలం ఒక భౌగోళిక మార్గం మాత్రమే కాదు -ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఒక వ్యూహాత్మక కేంద్రం. ప్రపంచంలోని సముద్ర మార్గంద్వారా జరిగే ముడి చమురు రవాణాలో సుమారు ఇరవై శాతం ఈ జలసంధి ద్వారా జరుగుతుంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ నియంత్రణ ఇరాన్‌కు ఒక శక్తివంతమైన భౌగోళిక ఆయుధంగా మారింది. ఇరాన్ భౌగోళికంగా హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్నందున, ఈ ప్రాంతంలో దానికి సహజ ఆధిక్యం ఉంది. ఒకవైపు ఇరాన్ తీరప్రాంతం, మరోవైపు ఒమాన్ - ఈ రెండింటి మధ్య ఉన్న ఈ మార్గం అత్యంత సన్నని భాగంలో కేవలం 30- 40 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంటే, ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యవేక్షించడం, నియంత్రించడం సాధ్యమే. ఇదే అంశం ఇరాన్ వ్యూహానికి బలాన్నిస్తుంది. సంప్రదాయ నావికాదళ శక్తిపరంగా అమెరికా వంటి దేశాలతో పోలిస్తే ఇరాన్ వెనుకబడి ఉండొచ్చు. కానీ, ఇక్కడ కూడా ఇరాన్ తన ప్రత్యేకమైన అసిమెట్రిక్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. పెద్ద యుద్ధ నౌకలతో ప్రత్యక్షంగా పోరాడే బదులుగా, చిన్న వేగవంతమైన పడవలు, సముద్ర మైన్స్, గెరిల్లా నావల్ టాక్టిక్స్‌ను వినియోగిస్తోంది. ‘ఇది తక్కువ వనరులతో ఎక్కువ ప్రభావం’ అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. ఇరాన్ నౌకాదళంలో ఉపయోగించే చిన్న పడవలు (ఫాస్ట్ ఎటాక్ క్రాఫట్స్) ఈ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పడవలు వేగంగా కదలడం, అకస్మాత్తుగా దాడి చేయడం, వెంటనే తప్పించుకోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. పెద్ద యుద్ధ నౌకలు ఈ రకమైన దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడం కష్టం. ఒకేసారి వందల సంఖ్యలో ఈ పడవలు దాడి చేస్తే, అది శత్రు నౌకాదళానికి పెద్ద సవాలుగా మారుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన ఆయుధం - సముద్ర మైన్స్. హర్మూజ్ జలసంధి వంటి సన్నని ప్రాంతాల్లో మైన్స్ అమర్చడం ద్వారా నౌకాయానాన్ని పూర్తిగా నిలిపివేయవచ్చు. ఇది ప్రత్యక్ష యుద్ధం కాకుండా, ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే మార్గంగా పనిచేస్తుంది. ఒక చిన్న మైన్ కూడా ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్‌ను దెబ్బతీయగలదు. దీంతో బీమా ఖర్చులు పెరగడం, రవాణా ఆలస్యం కావడం, చివరకు ఆయిల్ ధరలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇరాన్ వ్యూహంలో మానసిక ఒత్తిడి కూడా కీలకం. హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని తరచూ హెచ్చరికలు ఇవ్వడంద్వారా, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని సృష్టిస్తుంది. ఈ అనిశ్చితి చమురు ధరలను ప్రభావితం చేస్తుంది. అంటే, ఇరాన్ ప్రత్యక్ష చర్యలు తీసుకోకపోయినా, కేవలం హెచ్చరికల ద్వారానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలదు. అయితే, ఈ వ్యూహానికి కూడా పరిమితులు ఉన్నాయి. హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడం అంటే, అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన ప్రతిచర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా నావికాదళం ఈ ప్రాంతంలో శక్తివంతంగా ఉంది. దీంతో విస్తృత స్థాయి యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంది. ఇది ఇరాన్‌కే కాకుండా మొత్తం ప్రాంతానికి నష్టం కలిగించవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం -ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఆయిల్ ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తే, ఇరాన్ స్వంత ఎగుమతులు కూడా ప్రభావితమవుతాయి. అంటే, ఈ వ్యూహం ఒక ద్వంద్వ కత్తిలాంటిది. శత్రువులకు నష్టం కలిగించగలిగినంతగా, తనకూ నష్టం కలిగించే అవకాశం ఉంది. అయినా, హర్మూజ్ జలసంధి ఇరాన్‌కు ఒక శక్తివంతమైన వ్యూహాత్మక లీవర్‌గా ఉంటుంది. ఇది కేవలం సైనిక సాధనం కాదు, ఒక ఆర్థిక ఒత్తిడి సాధనం కూడా. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని అత్యంత ప్రాధాన్యంగా చూస్తాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్‌కు ఒక చర్చా సాధనంగా (భార్గనింగ్ చిప్) కూడా ఇది ఉపయోగపడుతుంది.మొత్తానికి, హర్మూజ్ జలసంధి ఇరాన్ వ్యూహంలో ఒక కీలక స్థానం కలిగి ఉంది. చిన్న నావలు, మైన్స్, గెరిల్లా టాక్టిక్స్ వంటి అసిమెట్రిక్ విధానాలతో, ఇరాన్ తన పరిమిత వనరులను సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఇది ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. భౌగోళిక స్థానం కూడా ఒక శక్తివంతమైన ఆయుధం కావచ్చు. చివరగా, ఈ పరిస్థితి ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పుతోంది. ఆర్థిక వ్యవస్థలు ఎంత గ్లోబలైజ్డ్ అయినా, అవి కొన్ని కీలక మార్గాలపై ఆధారపడి ఉంటాయి. ఆ మార్గాలు భౌగోళికంగా సున్నితమైన ప్రాంతాల్లో ఉంటే, అవి రాజకీయ ఆయుధాలుగా మారే అవకాశముంది. హర్మూజ్ జలసంధి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇరాన్ ఈ వాస్తవాన్ని తన వ్యూహంలో భాగం చేసుకున్నది. కానీ, ఈ వ్యూహం శాంతి, స్థిరత్వాన్ని కాపాడే దిశగా ఉపయోగించబడితేనే, అది ప్రపంచానికి మేలు చేస్తుంది. - పులి అమృత్  99489 67077

మన తెలంగాణ 4 Apr 2026 10:00 am

అమ్మవారికి వెండి బహుకరిస్తున్న భక్తులు తోట ప్రసాద్, శ్రీలత..

అమ్మవారికి వెండి బహుకరిస్తున్న భక్తులు తోట ప్రసాద్, శ్రీలత.. కరీమాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Apr 2026 9:54 am

మద్యం మత్తులో యువకుల వీరంగం..

మద్యం మత్తులో యువకుల వీరంగం.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ ఖిలా

ప్రభ న్యూస్ 4 Apr 2026 9:40 am

గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేష్ థియేటర్ వద్ద అతి వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో వాహనంలో నలుగురు వ్యక్తులు ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. 

మన తెలంగాణ 4 Apr 2026 9:33 am

Narendra Modi : నేడు కేరళకు ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కేరళలో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 4 Apr 2026 9:29 am

గ్రామ సభల ప్రధాన ఉద్దేశం అదే..

గ్రామ సభల ప్రధాన ఉద్దేశం అదే.. ఆళ్లపల్లి / గుండాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Apr 2026 9:23 am

Summer Effect : వడగాలులు.. ఉక్కపోత.. ఉష్ణోగ్రతలు.. ప్రాణాలు నిలుపుకోవడమెలా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి

తెలుగు పోస్ట్ 4 Apr 2026 9:21 am

మిథిక్ సై-ఫైగా ‘ఎస్‌డిటి19’

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎస్‌డిటి19’ సినిమా ఊహకు అందని స్థాయిలో రూపొందుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న ఆయన ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది. దర్శక ద్వయం సుజిత్, సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరు క సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిథిక్ సై-ఫై నేపథ్యంలో హై-ఆక్టేన్ కథనాన్ని మిళితం చేస్తూ, గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. 

మన తెలంగాణ 4 Apr 2026 9:20 am

యడ్లపాడులో జాతీయ స్థాయి నాటకోత్సవాలు..

యడ్లపాడులో జాతీయ స్థాయి నాటకోత్సవాలు.. యడ్లపాడు, ఆంధ్రప్రభ : తన జీవితాన్ని సమాజసేవకు

ప్రభ న్యూస్ 4 Apr 2026 9:15 am

Telangana : నేడు మున్సిపల్ ఎన్నికల హీట్

నేడు తెలంగాణలో మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 4 Apr 2026 9:02 am

వేటాడుతూ.. హింసిస్తూ..

వేటాడుతూ.. హింసిస్తూ.. నేరం అంగీకరించిన నిందితుడు..గత కొంతకాలంగా కరీంనగర్ రేకుర్తి గ్రామానికి చెందిన

ప్రభ న్యూస్ 4 Apr 2026 9:02 am

గురువును కోల్పోయిన బాధతో చైర్మన్ కంటతడి..

గురువును కోల్పోయిన బాధతో చైర్మన్ కంటతడి.. స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్

ప్రభ న్యూస్ 4 Apr 2026 8:53 am

Gold Prices Today : షాక్ లు మీద షాక్ లు ఇస్తున్న బంగారం.. శాంతించిన వెండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి

తెలుగు పోస్ట్ 4 Apr 2026 8:52 am

అత్తాపూర్ లో రెచ్చిపోయిన జహౌర్ ఇక్బాల్ గ్యాంగ్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో జహౌర్ ఇక్బాల్ గ్యాంగ్ రెచ్చిపోయింది. సద్దాం అనే యువకుడిని ఇక్బాల్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చితక బాదారు. విచక్షణా రహితంగా కర్రలతో కొట్టడంతో సద్దామ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని సద్దాంను ఆస్పత్రికి తరలించారు. సిసి ఫుటేజ్ లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 25 మంది ఇక్బాల్ గ్యాంగ్ సభ్యులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మన తెలంగాణ 4 Apr 2026 8:44 am

ద్విచక్ర వాహనాన్ని పాల ఆటో ఢీ కొట్టడంతో..

ద్విచక్ర వాహనాన్ని పాల ఆటో ఢీ కొట్టడంతో.. గంగవరం, ఆంధ్రప్రభ : మండలంలోని

ప్రభ న్యూస్ 4 Apr 2026 8:42 am

Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే గంటల పాటు వెయిట్ చేయాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ నేడు భారీగా పెరిగిం

తెలుగు పోస్ట్ 4 Apr 2026 8:37 am

Nara Lokesh : నేడు కర్ణాటకకు లోకేశ్

నేడు మంత్రి లోకేశ్​ కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 4 Apr 2026 8:22 am

Amaravathi : నేడు అమరావతి ఏఐ సమ్మిట్

ఈరోజు విజయవాడ వేదికగా అమరావతి ఏఐ సమ్మిట్ జరగనుంది

తెలుగు పోస్ట్ 4 Apr 2026 8:17 am

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్కులు కలపాలని

పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది

తెలుగు పోస్ట్ 4 Apr 2026 8:10 am

చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్..

చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్.. చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 4 Apr 2026 8:04 am

IPL 2026 : చెన్నైకు తప్పని ఓటమి.. పంజాబ్ కు రెండో విజయం

చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ కూడా లక్కు కలసి వచ్చినట్లు కనిపించడం లేదు.

తెలుగు పోస్ట్ 4 Apr 2026 7:59 am

Cuba : గుడ్ ఫ్రైడే కి జీవిత ఖైదీల విడుదల.. కుటుంబాల్లో ఆనందం

హవానా నగర శివార్లలోని లాలిమా జైలు గేట్ల వద్ద కుటుంబ సభ్యులు గుమికూడారు

తెలుగు పోస్ట్ 4 Apr 2026 7:40 am

కూకట్ పల్లిలో ఓయో రూమ్ లో పెళ్లి దుస్తుల్లో యువకుడు ఆత్మహత్య

 హైదరాబాద్: ఓయో రూములో పెళ్లి దుస్తులు ధరించి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోేలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన లోకేష్(29) అనే యువకుడు హైదరాబాద్ లోని గండిమైసమ్మ ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ పెళ్లి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆర్యసమాజ్ లేదా గుడిలో పెళ్లి చేసుకుందామని ప్రేమజంట నిర్ణయించుకుంది. శుక్రవారం కెపిహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో రూమ్ లో ఇద్దరు తీసుకున్నారు. తాను పెళ్లి బట్టల్లో ఉన్నానని భోజనం తీసుకురావాలని ప్రియురాలికి లోకేష్ చెప్పాడు. యువతి వచ్చి ఎన్ని సార్లు పిలిచినా తలుపు తీయకపోవడంతో, ఓయో సిబ్బంది సహాయంతో తలుపు బద్దలుకొట్టి చూడగా అప్పటికే యువకుడు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

మన తెలంగాణ 4 Apr 2026 7:34 am

Earth Quake : ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై ఎంతంటే?

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వణికించింది

తెలుగు పోస్ట్ 4 Apr 2026 7:23 am

ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం..

ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి

ప్రభ న్యూస్ 4 Apr 2026 7:15 am

శనివారం రాశి ఫలాలు (04-04-2026)

మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృషభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. మిధునం నూతన ఋణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటకం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కన్య ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తుల బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది. వృశ్చికం చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ధనస్సు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. కుంభం ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. మీనం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.  

మన తెలంగాణ 4 Apr 2026 7:09 am

Andhra Prabha SPL Story |శాస్త్రవేత్తల పనిని స్వయంగా చేసే కొత్త టెక్నాలజీ..

Andhra Prabha SPL Story | శాస్త్రవేత్తల పనిని స్వయంగా చేసే కొత్త

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:43 am

Andhra Prabha SPL Story |మోడీ గెలుపు తర్వాత కేరళ రాజకీయ సమీకరణాలు..

Andhra Prabha SPL Story | మోడీ గెలుపు తర్వాత కేరళ రాజకీయ

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:33 am

4thAprileditorial |మాల్డా ఘటన పై రాజకీయ తుఫాన్..

4thAprileditorial | మాల్డా ఘటన పై రాజకీయ తుఫాన్.. 4thAprileditorial | పశ్చిమ

ప్రభ న్యూస్ 4 Apr 2026 6:16 am

టెక్స్‌టైల్స్‌లోనూ అగ్రగామిగా ఎదుగుదాం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేవలం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రపంచంలో ని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తు లే ధరించేలా చే యాలన్నది తమ లక్షమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన 13వ ఏషియన్ టెక్స్‌టైల్స్ కా న్ఫరెన్స్ 2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టెక్స్‌టైల్స్ మన డిఎన్‌ఏలోనే ఉందన్నారు. తెలంగాణకు వస్త్ర రంగంతో విడదీయలేని అనుబంధం ఉందని సిఎం గుర్తుచేశారు. టెక్స్‌టైల్స్ అనేది మనకు కేవలం ఒక పరిశ్రమ కాదని, అది మ న జీవనాధారమని ఆయన అన్నారు. నిజాం కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు వస్త్రాలు, ముత్యాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటివి మన సంస్కృతీలో భాగమని ఆయన అన్నారు. రా ష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను సి ఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతూ తెలంగాణను దక్షిణాసి యా టెక్స్‌టైల్స్ రాజధానిగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉందని, ఇందులో అనేక అపారెల్ పార్కులు ఉన్నాయని సిఎం తెలిపారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ఇక్కడి పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి పేరుందని ఆయన పేర్కొన్నారు. లండన్, పారిస్, దుబాయ్ వంటి ఫ్యాషన్ నగరాల్లో తెలంగాణలో తయారైన దుస్తులు మెరవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు. సినిమా, ఫ్యాషన్, గ్రీన్ టెక్నాలజీ సినిమా రంగానికి అవసరమైన ఫ్యాషన్ అవసరాలను కూడా తెలంగాణ నుంచే తీర్చేలా ప్రోత్సహిస్తామన్నారు. అలాగే, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ గ్రీన్ టెక్స్‌టైల్స్ హబ్’లను అభివృద్ధి చేస్తామని, మహిళలకు అధునాతన డిజైనింగ్, స్టిచింగ్‌లో శిక్షణ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మీ దగ్గర విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములమని ఆయన తెలిపారు. భూమి, విద్యుత్, నీరు, వేగవంతమైన అనుమతులతో పాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రండి, కలిసి ఒక కొత్త భవిష్యత్‌ను నిర్మిద్దామని పెట్టుబడిదారులకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఆపిల్ ఇయర్‌ఫాడ్స్ అందిస్తున్న తెలంగాణ ఇప్పుడు ప్రపంచం ధరించే దుస్తులను కూడా అందించే స్థాయికి చేరుకుంటుందని సిఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పత్తిపొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్, ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో తాము అనేక కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థల రాకతో హాలీవుడ్ స్థాయికి చేరుతోందని సిఎం అన్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించింద న్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లు ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయని, ఇప్పుడు హాలీవుడ్ కూడా ఇందులో చేరిందని ఆయన తెలిపారు. సినిమారంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే పొందేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.

మన తెలంగాణ 4 Apr 2026 6:00 am