Andhra Pradesh :చంద్రబాబును కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాలు
ఏపీఎన్జీవో సంఘ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. ఒక్కరోజే 180 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వైమానిక పరిమితులు విధించడంతో భారత్ లో భారీగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం విమాన సర్వీస్ లకు అంతరాయం కలిగింది. ముంబయిలో అత్యధికంగా 93 విమానాలు రద్దు చేశారు. వీటిలో 48 అవుట్బౌండ్.. 45 ఇన్బౌండ్ సేవలు ఉన్నాయి. ఢిల్లీలో 52 విమానాలను నిలిపేశారు. బెంగళూరులో 34 విమాన సర్వీసులు రద్దయాయి. వాటిలో 18 ఇన్కమింగ్ విమానాలు ఉన్నాయి.
Andhra Pradesh : సైబర్క్రైమ్ పోలీసులకు ఏపీ బీజేపీ ఫిర్యాదు
విజయవాడ సైబర్క్రైమ్ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫిర్యాదు చేసింది.
Telangana : అమిత్ షా తో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు
Telangana : నేడు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో నేడు నామినేషన్లను దాఖలు చేయనున్నారు
T20 World Cup : గెలుస్తూ వచ్చి చతికిలపడిన దక్షిణాఫ్రికా... పడుతూ లేస్తూ వచ్చి నిలిచిన న్యూజిలాండ్
దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది
ఇరాన్ హస్తగతమే ఆ ఇద్దరి లక్ష్యం?
అణు కార్యక్రమాలను ఇరాన్ విస్తరింప చేయడం ప్రపంచానికే ప్రమాదకరమని అవాస్తవాలు విస్తృతంగా ప్రచారం చేసి ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు భీకరంగా యుద్ధాన్ని సాగిస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇది ఇరాన్ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించడం కోసంకాదు. ఇరాన్ అభివృద్ధిని కాంక్షించే కొత్త తరం పాలన అందించడానికి అంతకన్నా కాదు. ఇరాన్లో నిక్షిప్తమై ఉన్న అపార చమురు నిల్వలను చేజిక్కించుకోవడానికి, తమకు గట్టి పోటీదారులుగా ఉన్న చైనా, రష్యాలను భౌగోళికంగా కుంగదీయడానికే. ఇరాన్ అణు క్షేత్రాలను, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను గత ఏడాది జూన్లో తాము ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్ మళ్లీ భూగర్భంలో అణుక్షేత్రాలను, బంకర్లను నిర్మించడం ప్రారంభించిందని, అందుకనే తాము అమెరికాతో కలిసి అత్యవసరంగా దాడి చేయక తప్పలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక ఇంటర్వూలో వెల్లడించడం అబద్ధాలను మరోసారి వాస్తవాలుగా చిత్రీకరించినట్టు అయింది. అలాగే పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే ప్రధాన కారణమని ఆ పాలన అంతమొందిస్తేనే పశ్చిమాసియాలో శాంతి లభిస్తుందని సమర్ధించుకున్నారు. మొత్తం మీద ఇరాన్లో ఖమేనీ తరం పాలన అంతమొందాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాన లక్షంగా స్పష్టమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ముజ్తబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికైనట్టు వార్తలు వెలువడుతున్న తరుణంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా వాళ్లని లక్షంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ నాయకుడిగా ఎవరు వచ్చినా అంతం చేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారంటే తాము ఆడించే కీలుబొమ్మ ప్రభుత్వం ఇరాన్లో వచ్చే వరకు అమెరికా ఇజ్రాయెల్ మారణ కాండ తప్పకపోవచ్చు. మరోవైపు ఇరాన్లో ప్రజా తిరుగుబాటును ప్రోత్సహించడానికి అమెరికా వ్యూహాలు రూపొందిస్తోంది. ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో చురుగ్గా ఉన్న కుర్దులకు ఆయుధాలు ఇవ్వాలని అమెరికా నిఘా సంస్థ సిఐఎ పన్నాగాలు పన్నుతోంది. ఈమేరకు డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్థాన్ అధ్యక్షుడితో ట్రంప్ మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇరాన్, ఇరాక్ సిరియా, టర్కీల్లో విస్తరించిన కుర్దుజాతి కొన్ని దశాబ్దాలుగా తమకు స్వతంత్ర దేశం కావాలని పోరాడుతోంది. ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో ఇరానియన్ కుర్దిష్ సాయుధ గ్రూపులకు వేల సంఖ్యలో బలగాలు ఉన్నాయి. ఈ బలగాలను కూడదీసుకోడానికి అమెరికా, ఇజ్రాయెల్ పావులు కదుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి లక్షం ఇరాన్ ఇంధనం కొల్లగొట్టడం. ప్రపంచం మొత్తం మీద రెండవ భారీ చమురు, సహజవాయు నిల్వలు ఇరాన్లోనే ఉన్నాయి. అమెరికా చెప్పుచేతల్లోని కొత్త ప్రభుత్వం ఇరాన్లో పాలనా పగ్గాలు చేపడితే కేవలం చమురు విక్రయాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన మార్కెట్ రూపురేకలనే మార్చి వేస్తుంది. ఇరాన్ ప్రధాన చమురు వినియోగదారు చైనా. ఆంక్షల యుగ వాణిజ్యంలో కీలక భాగస్వామి. రెండో అంశం చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కారిడార్ నిర్మాణంలో ఇరాన్ కీలకమైన భాగస్వామిగా ఉంటోంది. తూర్పు ఆసియా ఐరోపా మధ్య ఈ కారిడార్ అనుసంధాన వంతెనలా పనిచేస్తోంది. ఏదైనా మార్పు వచ్చి అమెరికా రెగ్యులేటరీ పరిధి లోకి ఇరాన్ ఎగుమతులు వస్తే చైనా ఇంధన భద్రత బలహీనం కాక తప్పదు. మూడో అంశం ఇటీవల గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, ఇరాన్ దేశాలు చాలా సన్నిహితంగా ఉంటున్నాయి. పశ్చిమ దేశాల మార్కెట్ లోకి ఇరాన్ ఇంధనం తిరిగి ప్రవేశిస్తే ఐరోపాపై రష్యా ఆధిపత్యం నాటకీయంగా సన్నగిల్లుతుంది. ఇదిలా ఉండగా భౌగోళిక రాజకీయాల ప్రభావంలో మార్పు కనిపిస్తోంది. ఇరాన్లో అంతర్గతంగా అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లు, ఆర్థిక లావాదేవీలు దెబ్బతినడం, సామాజిక అశాంతి, ఇరాన్ పాలకులకు అగ్నిపరీక్షగా మారాయి. ఇరాన్ ప్రజల ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో కర్కశంగా అణిచివేయడం పాలక వర్గంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసింది. దీన్ని అమెరికా బాగా వినియోగించుకుంది. ప్రజల్లో అసంతృప్తి కార్చిచ్చులా వ్యాపించింది. ఇరాన్ పాలన మార్పు విప్లవాన్ని పోలి ఉండనవసరం లేదు. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ పతనంగా భావించనక్కర లేదు. అలాగే రాచరిక వ్యవస్థ పునరుద్ధరణ కాదు. ఉన్నత వర్గాల పునక్రమణిక ద్వారా పరివర్తన ఉద్భవించవచ్చు. అయితే ఇరాన్ ప్రాంతీయ సంక్షోభాలను ఇజ్రాయెల్ అమెరికా కూటమి తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం లేకపోలేదు. పశ్చిమ దేశాల వ్యవస్థలోకి ఇరాన్ ప్రవేశిస్తే ఫలితం కేవలం ఆంక్షల ఉపశమనంతోనే సరిపోదు. ఇది పశ్చిమాసియా నిర్మాణాత్మక పునర్ వ్యవస్థీకరణకు మార్గం అవుతుంది. ఇజ్రాయెల్ గల్ఫ్ ఇరాన్ అనుసంధానం ఒకప్పుడు ఊహకు అందనిదైనా, అమెరికా పెత్తనం గొడుగు కింద ఆచరణాత్మక వాణిజ్య మండలంగా మారిపోతుంది. ఐరోపాకు ఇరాన్ నుంచి గ్యాస్ సరఫరా ప్రవాహం మాస్కోకు చోటు లేకుండా తుడిచిపెడుతుంది. చైనా యురేసియన్ కారిడార్కు ప్రమాణీకరణ అవసరం అవుతుంది. భూగర్భం లోని ఫలకలు చాలా అరుదుగా మారుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ సైద్ధాంతిక పునాదులతో స్థిరమైన దేశాల్లో అధికార పరివర్తన అంత సులువుగా జరగదు. అల్లకల్లోలం రేపుతుంది. ఇరాన్లో పాలన తరం మార్పు ఎలా జరుగుతుంది? అదేమైనా హింసాత్మకంగా మారుతుందా? ఎవరు ఇరాన్ దిశాదశను ఎలా మారుస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రేక్షక పాత్రను వహిస్తోంది. ఇరాన్పై రెండు దేశాల ముప్పేట దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ద్వయాన్ని ఒప్పించగల మధ్యవర్తిత్వం చేసే దేశాలు కరువైనాయి. నిరాయుధీకరణ నిత్య మంత్రం కావాలని ఐరాస బోధించడం మినహా చేసేది ఏమీ కనిపించడం లేదు. ఆయుధాలు, యుద్ధ వ్యాప్తి నిరోధక చర్యలు సాకారం కావాలని ఆకాంక్షిస్తున్న ఐరాస నేటి ఇజ్రాయిల్- అమెరికా సైనిక దాడులను ఆపమని ఒక్క మాట కూడా అనలేని నిస్సహాయ దుస్థితిలో ఉన్నది. ప్రపంచ శాంతి నెలకొనాలనే సదుద్దేశంతో 2022 నుంచి ఐరాస ప్రతి ఏటా అంతర్జాతీయ నిరాయుధీకరణ, వ్యాప్తి నిరోధక అవగాహన దినం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిస్ఆర్మమెంట్ అండ్ నాన్-ప్రొలిఫరేషన్ అవేర్నెస్) పాటించడం జరుగుతున్నది. అణ్వాయుధాలు, రసాయన, జీవాయుధాలవల్ల కలిగే అపార నష్టాలను అవగాహన పరుస్తూ నిరాయుధీకరణ సూత్రాలను వ్యాప్తి చేస్తున్నది. సామూహిక వినాశన ఆయుధాల వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా అంతర్జాతీయ భద్రత, మానవాళి రక్షణ, శాంతి నెలకొంటాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. 1945లో హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుబాంబు దాడుల విధ్వంసంతో 2 లక్షల మంది ప్రజలు మరణించగా, లక్షలాది మంది దీర్ఘకాలిక నష్టాలను కూడా నమోదు చేసుకున్నారు. 1945లో ప్రారంభమైన అణ్యాయుధ పరీక్షలు, దాదాపు నేటికీ 2,000 వరకు అణు పరీక్షలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి 24 ఫిబ్రవరి, 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్- రష్యా యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. అదే విధంగా 07 అక్టోబర్, 2023 నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి అంతం కనిపించడం లేదు. నేడు ఇరాన్పై ఇజ్రాయెల్ -అమెరికా మరో యుద్ధం కొనసాగిస్తూ క్షిపణుల వర్షంతో మధ్యప్రాచ్యం మంటల్లో భగ్గుమంటోంది. గల్ఫ్ దేశాల ఆకాశం బాంబు పేలుళ్లతో నల్లటి కారుమబ్బులతో నిండి ఉన్నది. నగరాలు, సైనిక స్థావరాలు, చమురు శుద్ధి కేంద్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర బాంబుల దాడితో ప్రపంచ శాంతి గాల్లో దీపమైంది. 3వ ప్రపంచ యుద్ధం రానుందా అనే వాదనలు బలపడుతున్నాయి. పిల్లిని గదిలో బంధించితే గత్యంతరం లేక తెగబడి ఎదురు తిరుగుతుందనే విషయం మనకు తెలుసు. నేడు ఇరాన్ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఇరాన్ అణు కార్యక్రమం మింగుడుపడని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా భీకర సైనిక దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని మట్టుపెట్టడంతోపాటు ఖమేనీ సమీప బంధువులు/ కుటుంబ సభ్యులు, అగ్రనేతలు, ఉన్నత సైనిక అధికారులు, సహాయకులు కలుపుకొని ఇప్పటికీ 800లకు పైగా నిండు ప్రాణాలను కోల్పోయారు. 1989 నుంచి నిన్నటి వరకు ఇరాన్ సుప్రీం నాయకుడిగా మూడున్నర దశాబ్దాలకు పైగా తిరుగులేని నాయకుడిగా శాసించడం చూసాం. ఇరాన్లో పార్లమెంట్, న్యాయవ్యవస్థ, పోలీస్ విభాగం, మీడియా, మతపరమైన వర్గాలను తన అదుపులో ఉంచుకొని ప్రత్యర్థులను అక్రమంగా అరెస్టులు చేయడం, మానవ హక్కులను హననం చేయడం, మహిళా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం, వ్యతిరేక ఉద్యమాలను అణచివేయడం తీవ్ర స్థాయిలో జరిగిపోయింది. ఇరాన్కు చెందిన వ్యూహాత్మక మిలిటరీ, వైమానిక, నావికా కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని వేల బాంబులను ఇజ్రాయెల్ -అమెరికాలు వేస్తున్నాయి. పశ్చిమాసిమాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ భీకర యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు ధరలు బంగారం వలే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇరాన్లో నిరంకుశ పాలన అంతం అయిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చిందని ఇరానియన్ ప్రజలకు ట్రంప్ ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ యుద్ధం ఇలాగే మరి కొన్ని వారాలు కొనసాగుతుందని నెతన్యాహు -ట్రంప్ ద్వయం ప్రకటిస్తున్నారు. రోజురోజుకూ యుద్ధం ముదురుతోంది. చమురు కేంద్రాలు భగ్గుమంటున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు ఇరాన్ అణుకేంద్రాలు, సైనిక స్థావరాలను నేలమట్టం చేశాయి. ప్రతీకార జ్వాలలతో రగులుతున్న ఇరాన్ రగిలిపోతూ అమెరికా సైనిక స్థావరాలున్న 8 దేశాలపై ఏకకాలంలో దాడులు చేసింది. నేడు ఇరాన్ చేసిన ఎదురు దాడుల్లో బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీఅరేబియా, యుఎఇ దేశాల చమురు శుద్ధికేంద్రాలు ప్రభావితం అయ్యాయి. నేడు ఇరాన్ పక్షాన మిలిటెంట్ గ్రూపులు కూడా రంగంలోకి దిగుతున్నాయి. అమెరికా చర్చలకు సిద్ధమని ప్రకటించినా ఇరాన్ ససేమీరా అంటోంది. ‘స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్’ జలసంధి సముద్ర రవాణా మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు సరఫరా ఆగిపోయింది. దీనితో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలకు చమురు రవాణా ఆగిపోయింది. 9 కోట్లకు పైగా జనాభా కలిగిన ఇరాన్కు 6.10 లక్షల క్రియాశీల సైన్యం ఉన్నది. 28 ఫిబ్రవరి రోజున ఇజ్రాయెల్ చేసిన సైనిక దాడుల్లో అపార ప్రాణ, ఆస్తినష్టాలు నమోదు అవుతున్నాయి. అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫలితంగా ఇరాన్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఆపరేషన్లో భాగంగా వైమానిక, సముద్ర తలాల మీదుగా ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నామని అనుకున్న అమెరికా - ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్నాయి. భారతదేశ చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నది. హోర్మోజ్ జల సంధి మూసివేయడంతో బ్యారెల్ ముడి చమురు ధరలు 80 డాలర్లకు చేరిందని, రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనితోపాటు గ్యాస్, ఖనిజాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారం, వెండి, వ్యవసాయ పరికరాలు, సన్ఫ్లవర్ ఆయిల్, సబ్బులు, తలనూనె, ఎరువులు, బిస్కెట్లు, షాంపులు లాంటి అనేక నిత్యావసర సరుకుల దిగుమతులు భారమై, రవాణా దూరమై ధరలు పెరగనున్నాయి. ఈ జలసంధిని మూసివేయడంతో 13 దేశాల నుంచి భారత్కు దిగుమతులు భారమైపోతున్నాయి. భారతదేశం రోజూ వినియోగించే 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు ఈ జలసంధి నుంచి మాత్రమే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉండగా, మరో 25 రోజులకు సరిపడా చమురు రవాణా మార్గంలో ఉన్నాయని భారత ప్రభుత్వం వెల్లడిస్తున్నది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలతో దగ్గరి సంబంధాలను కొనసాగిస్తున్న భారత్ నేడు ఈ దేశాలను సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కరించుకోవాలని ప్రకటన చేయడం మినహా మరోమార్గం కనిపించడంతో లేదు. ట్రంప్- నెతన్యాహు ద్వయానికి సత్వరమే సద్బుద్ధి కలగాలని, ఇరాన్ కూడా సంయమనం పాటించాలని కోరుతున్నది. ఏదిఏమైనా అంతర్జాతీయ నిరాయుధీకరణ, వ్యాప్తి నిరోధక అవగాహన దినం వేదికగా నేటి యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయదని ఆశిద్దాం. బుర్ర మధుసూదన్ రెడ్డి 99497 00037
నేటి నుంచి అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్లు
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో విద్యార్థులు గురువారం నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలకు హాల్ టికెట్లను ఇప్పటికే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించామని, గతంలో ప్రకటించిన విధంగా ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు ఇదే సమయం వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరునున్నట్లు పేర్కొన్నారు. హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు www.bse.telangana.gov.in అధికారిక వెబ్సైట్ ను సంప్రదించాలని, విద్యార్థులు తమ హాల్ టికెట్ల కోసం 8096958096 నంబర్కు Hi అని మెసేజ్ పంపి, ఆపై SSC Hall Ticket March-2026 అని టైప్ చేయడం ద్వారా కూడా పొందవచ్చని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, దీంతో పాటు 040-23230942 నంబర్ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
సమరానికి సర్వం సిద్ధం.. నేడు ఇంగ్లండ్తో భారత్ సెమీస్ పోరు
ముంబై: టి20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్ సమరానికి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, మాజీ విజేత ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ పోరు జరుగనుంది. సూపర్8లో ఇంగ్లండ్ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి సెమీస్కు దూసుకొచ్చింది. భారత్ మాత్రం కాస్త చెమటోడ్చి సెమీస్ బెర్త్ను దక్కించుకుంది. అయితే కచ్చితంగా గెలవాల్సిన చివరి రెండు మ్యాచుల్లో అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్తో పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. సంజు శాంసన్ ఫామ్లోకి రావడం భారత్కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సంజు తన మార్క్ బ్యాటింగ్తో చెలరేగితే టీమిండియాకు ఎదురే ఉండదు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తన పాత్రను సక్రమంగా నిర్వర్తించాలి. ఈ వరల్డ్కప్లో ఆరు మ్యాచులు ఆడిన అభిషేక్ కేవలం ఒక దాంట్లో మాత్రమే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. మిగతా వాటిల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్తో జరిగే సెమీస్ మ్యాచ్ అతనికి సవాల్గా మారింది. వరుస వైఫల్యాలకు పుల్స్టాప్ పెట్టి తన సహాజ శైలీలో బ్యాట్ను ఝులిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇషాన్ కిషన్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. అయితే ఇషాన్ బ్యాటింగ్లో నిలకడ లోపించడం ఆందోళన కలిగించే అంశమే. ఒక మ్యాచ్లో రాణిస్తే తర్వాతి పోరులో విఫలం కావడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ పద్ధతిని మార్చుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత ఇషాన్పై ఉంది. అందరి కళ్లు సూర్యపైనే.. మరోవైపు జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఏర్పడింది. కీలకమైన సెమీస్ మ్యాచ్లో సూర్య జట్టుకు కీలకంగా మారాడు. బ్యాట్తో పాటు కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలవాల్సిన పరిస్థితి సూర్యకు నెలకొంది. సూర్య తన మార్క్ ఆటతో చెలరేగితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్దీప్, బుమ్రా, వరుణ్, హార్దిక్, అక్షర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో భారత్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. జోరుమీదున్న ఇంగ్లండ్ ఇంగ్లండ్ కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. విల్ జాక్స్, సామ్ కరన్ ఆల్రౌండ్షోతో అదరగొడుతున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, రెహాన్, టామ్ బాన్టన్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లోనూ ఇంగ్లండ్ మెరుగ్గా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో సెమీస్ పోరు ఆసక్తి కరంగా సాగడం ఖాయం. రాత్రి 7 గంటల నుంచి స్టార్ నెట్వర్క్లో..
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపిఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చా లా ఆలస్యంగా 2025లో జరిగిందన్నారు. ఆ సమయంలోనూ కేవ లం 7 గురు ఐపిఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటా యించారని సిఎం వివరించారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కోంటోందని సిఎం తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ క మిషనర్, హైదరాబాద్ నగరంలో భారగీ పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపిఎస్ అధికారుల అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షాకు సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని కేంద్ర మంత్రి కి సిఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపిఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాలని సిఎం కోరారు. అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా... ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు వారి మధ్య చర్చకు వాచ్చియి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్లో గణనీయమైన మార్పులు వచ్చాయని సిఎం తెలిపారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి సిఎం తెలియజేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డిజిపి బి.శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషినల్ డిజిపి విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజిపి బి.సుమతి పాల్గొన్నారు.
` ఇరాన్ పగ్గాలు ముజ్తబా ఖమేనీకి అప్పగింత! ` అధికార మార్పిడి జరిగిందని ప్రచారం టెహ్రాన్(జనంసాక్షి): అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో …
ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా ఉక్కుపాదం
` దేశాన్నే ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ ` ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ధ్వంసం ` తామే దాడి చేశామని ఇజ్రాయిల్ రక్షణ దళం ప్రకటన …
సీఎం ఎదుట నేడు 100 మంది మావోయిస్టుల లొంగుబాటు!
ఆయుధాలతో సహా పీఎల్జీఏ నాయకులు సరెండర్ తెలంగాణలోనే ఇది మొట్టమొదటి భారీ లొంగుబాటు ప్రక్రియ హైదరాబాద్ (జనంసాక్షి) : గత రెండేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల పునరావాసానికి మెరుగైన …
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి
` ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. వేం నరేందర్రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను అధిష్ఠానం ఖరారు …
న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కూటమి నడుమ యుద్ధం గల్ఫ్ దేశాలను దాటి విస్తరిస్తోంది. బుధవారం తెల్లవారుజామున శ్రీలంక తీ రం ప్రాంతం గాలె సమీపంలో ఇరానియన్ నౌక పై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది మృతి చెందారు.78 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు 87 మృతదేహాలు సము ద్రం నుంచి వెలికి తీసినట్లు శ్రీలంక నౌకాదళం ప్రకటించింది. ఇరాన్కు చెందిన ‘ఐఆర్ఐఎస్ దే నా’ అనే యుద్ధనౌక శ్రీలంక తీర ప్రాంతం మీదు గా తిరిగి ఇరాన్ వెళుతుండగా ఈ దాడి జరిగిం ది. అది తమపనేనని అమెరికా సాయంత్రానికి ప్రకటించింది. జలాంతర్గామి టార్పెడోలతో ఇరాన్ యుద్ధ నౌక ను ముంచేశామని అమెరికా రక్ష ణ మంత్రి పీటర్ హెగ్సెత్ ప్రకటించారు. భా రతదేశంలోని విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ‘మిలాన్2026’ పలు దేశాల నావికా వి న్యాసాల లో పాల్గొన్న తర్వాత ఇరాన్కు తిరిగి వె ళ్తుండగా ఈ దాడి జరిగింది. స్వల్పంగా గాయప డిన వారికి చికిత్స అందిస్తున్నామని శ్రీలంక ఆ రోగ్యశాఖ ఉన్నతాధికారి డాక్టర్ అ నిల్ జా సింగ్ తెలిపారు. అనంతరం శ్రీలంక నౌకాదళం ఓ ప్రకటనలో మొత్తం 79 మందిని రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు, వారిలో ఒ కరు మరణించినట్లు, మ రో 101 మంది తప్పిపోయినట్లు తెలిపింది. నౌక మాత్రం సముద్ర జలాలలో మునిగిపోయిందని వివరించింది. దాదాపు 180 మం దితో కూడిన ఐఆర్ఐఎస్ దేనా నౌక ప్రమాదం లో ఉందని శ్రీలంక నావికా దళానికి అత్యవసర సందేశం అందిందని, వెంటనే ఓడలు, వై మానిక దళ విమానాలు సహాయ చర్యలకోసం పంపిన ట్లు లంక విదేశాంగమంత్రి విజిత హరా త్ పార్లమెంటులో ప్రకటించారు. పేలుడు వల్లే మునక.. పెద్ద పేలుడు సంభవించడంతో నౌక దెబ్బతిన్నద ని సిబ్బంది చెప్పినట్లు శ్రీలంక నావికా దళం వ ర్గాలు బుధవారం తెలిపాయి. నౌక మునిగిపోయిన ప్రాంతంలో కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఓడ మునిగిపోయిన ప్రాంతం నుంచి తాము కొందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరి కొందరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని శ్రీలంక నావికాదళ ప్రతినిధి బుద్ధిక సంపత్ కొలంబోలో విలేకరులకు తెలిపారు. అది మా పనే : అమెరికా హిందూ మహా సముద్రంలో ఇరాన్ నౌకను జలాంతర్గామి టార్పెడోలతో ముంచేశామని అమెరికా రక్షణమంత్రి పీటర్ హెగ్సెత్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శత్రుదేశంపై జరిగిన అతి భారీ దాడిగా ఆయన అభివర్ణించారు. త్వరలో మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. కొద్ది రోజుల్లో ఇరాన్ గగనతలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. ఇరాన్పై అమెరికా మరింత విజయం సాధించిందన్నారు. తమ వద్ద అపరిమిత సంఖ్యలో గ్రావిటీ బాంబులు ఉన్నాయని, వాటిని కూడా ఉపయోగిస్తామన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను బుధవారం సాయంత్రం ఎంపి క చేసింది. వీరిలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అ భిషేక్ మను సింఘ్వి, మరో అభ్యర్థిగా ముఖ్యమంత్రి సన్నిహితుడు, రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధిష్టానం ఎంపిక చేసింది. సింఘ్వి ఎంపిక ముందే ఖరారు కావడంతో ఆయన బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు. తన నామినేషన్కు సంబంధించిన ప్రక్రియపై పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్తో సమావేశ మై చర్చించారు. పలు సీనియర్ నాయకులు సిం ఘ్వికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మరో అభ్యర్థి ఎంపికపైనే చివరి వరకూ సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలతో చర్చించి వేం నరేందర్రెడ్డి ఎంపిను ఖరారు చేశారు. సా యంత్రం ఢిల్లీలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీకి ముందే రాష్ట్ర నాయకులకు ఫోన్ ద్వారా వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసిన విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రం నుంచి ఖాళీకాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం పార్టీ సీనియర్ నాయకులు తీవ్రం గా ప్రయత్నించినప్పటికీ చివరకు అధిష్టానం ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం మేరకు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ పదవి కోసం పార్టీ నుంచి పదహారు మంది ఆశావాహులు లా బీయింగ్ చేసినప్పటికీ చివరకు వారికి నిరాశే ఎ దురైంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అ త్యంత సన్నిహితుడు కావడమే కాకుండా తన రా జకీయ ప్రస్థానంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డికి తోడుగా ఉన్నారు. వీరిద్దరు గతంలో తెలుగు దే శం పార్టీలో కూడా కలిసి పని చేశారు. అదే పార్టీ లో వీరిద్దరు ఎమ్మెల్యేలుగా కూడా కొనసాగారు. రేవంత్ రెడ్డి టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన సమయంలోనే ఆయనతో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. సిఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి మొదటి నుంచి అత్యంత సన్నిహితునిగా కొనసాగడమే కాకుండా ఆయన కుడి భుజంగా పేరు తెచ్చుకున్నారు. సింఘ్వి ఎంపిక పూర్తిగా అధిష్టానం నిర్ణయమే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న సింఘ్వి రాజ్యసభకు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపికైనప్పటికీ ఆయన పదవీ కాలం అర్థాంతరంగా ముగిసింది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బిఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యునిగా రాజీనామా చేయడంతో ఏర్పడిన మిగిలిన పదవీ కాలానికి సింఘ్విని ఎంపిక చేయడం జరిగింది. అది కూడా ఏప్రిల్ తొమ్మిదో తేదీతో ముగియనుండడంతో ఈ సారి పూర్తి స్థాయి పదవీ కాలానికి సింఘ్విని రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. పార్టీకి సంబంధించిన కోర్టు వ్యవహారాలన్నింటినీ సింఘ్వి చూసుకుండడంతో పార్టీ పెద్దలు సింఘ్వి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఈ విషయాన్ని ఇటీవల రాహుల్ గాంధీ వికారాబాద్లో ఏర్పాటైన పార్టీ శిక్షణా తరగతులకు హాజరైన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి సింఘ్వి ఎంపికపై సంకేతం ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. నేడు నామినేషన్లు రాజ్యసభ పోటీకి నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి తేదీ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన ఇద్దరు అభ్యర్థులు అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఉదయం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ కూడా హాజరుకానున్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో ఐఏఎస్, ఐపిఎస్లను మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రావని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు టి.హరీశ్ రావు విమర్శించారు. సిఎం రేవంత్రెడ్డికి పరిపాలన రావడం లేదన్నారు. బుధవారం హై దరాబాద్లో మీడియాతో హరీశ్ రావు చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులను పదే ప దే మారుస్తున్నారని, ఇప్పటి వరకు ఐదుసార్లు భా రీగా మార్పులు, చేర్పులు జరిగాయన్నారు. విభా గాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదని విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలం లో ఐదుగురు అధికారులు మారారని ఆయన వి మర్శించారు. ఈ బదిలీలతో విద్యుత్ శాఖ అతలా కుతలం, అవినీతి మయం అయ్యిందన్నారు. రెం డేళ్ల పాలనలో రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్ట ర్లు మారారని, ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వ ల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని ఆయన తెలి పారు. అధికారులను ఇలా తరచూ మారిస్తే పాల న ఎలా నడుస్తుందని, ఇదంతా ఓ జోక్గా మారి పోయిందని ఆయన విమర్శించారు. కలెక్టర్కు జి ల్లాపై అవగాహన రావడానికే ఆరునెలల సమయం పడుతుందని, అలాంటిది ఆరునెలల్లోనే మారిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారని హరీష్రావు విమర్శించారు. నిత్యం బదిలీల వల్ల యువ కలెక్టర్లలో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని, వాళ్లకు నచ్చిన వాళ్లకు మంచి పోస్టింగ్లు, నచ్చని వారిని బదిలీలు చేస్తున్నారని హరీష్రావు ఆరోపించారు. సిఎం, మంత్రులకు నచ్చకపోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడిగింపు సాధారణం అయిపోయిందన్నారు. డజన్ మంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు ఎక్స్ టెన్షన్ ఇచ్చారని, వందల మంది ఇంజనీర్లకు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలో అధికారుల పదవీ కాలం పొడగింపుపై అప్పట్లె కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్ల అవినీతిని.... యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లను ఐదు శాతం ఎక్కువకు ఇస్తున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని హరీశ్ రావు ఆరోపించారు. ఇంజనీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోందని ఆయన అన్నారు. అధికారులను తరచూ బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదని గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. కలెక్టర్లకు కనీసం రెండేళ్లు ఒకే చోట ఉంటే ఫలితాలు వస్తాయని కెసిఆర్ హయాంలో రాష్ట్రం మోడల్ స్టేట్ అయ్యిదంటే దానికి అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లేనని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్ధతి కాదని, తమ అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సిఎం వారిని బెదిరిస్తూ బదిలీ చేస్తున్నారని హరీష్రావుఆరోపించారు. అధికారులను సిఎం బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని హరీష్రావు హితవు పలికారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు... వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారని హరీష్రావు ఆరోపించారు. ఐటీ కార్యదర్శిగా సిఎస్ ఎలా పని చేయగలుతారిన, సిఎస్కు చాలా బాధ్యతలు ఉంటాయని, అదనంగా ఐటీ కార్యదర్శిగా ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తారని హరీష్రావు ప్రశ్నించారు. 20 శాతం జీఓలు ఆన్లైన్లో ఉంచుతూ 80 శాతం ఆఫ్ లైన్లో ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశించినా జీఓలు ఆన్లైన్లో పెట్టడం లేదని ఆయన విమర్శించారు. తమ సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తే మంచిదని లేదంటే వారి ఖర్మ ఆయన అన్నారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇలా తయారైందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు.... ఫిరాయింపుల విషయంలో కౌన్సిలర్లకు ఓ నీతి? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరో నీతా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశం అంతా జోక్గా మారిపోయిందని అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ అసెంబ్లీ మాదిరిగా లేదని హౌజ్ కమిటీలు వేయడం లేదని, డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడం లేదని, చీఫ్ విప్ పదవి ఖాళీగా ఉందని, ఇలా ఎప్పుడు జరగలేదని, అసెంబ్లీ లైబ్రరీ కూడా సరిగా లేదని హరీష్రావు విమర్శించారు. రాజేంద్రనగర్లో మైనింగ్ దందా రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని, మొబైల్ క్రషింగ్ ప్లాంట్కు మాత్రమే నిబంధనలుండగా ఫికస్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపోలిస్లో పెట్టారని హరీష్రావు ఆరోపించారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలని, లెటర్లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని అక్కడ రెడీమిక్స్కు అనుమతి లేదని ఆయన అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యేకు, మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారని, ఓఆర్ఆర్కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉందన్నారు. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్లో మైనింగ్ దందా నడుపుతుందని ఆయన ఆరోపించారు. నేడు నిజానిర్ధారణ కోసం బిఆర్ఎస్ బృందం అక్కడకు వెళ్తుందన్నారు. రాజ్యసభ పోటీపై వేచిచూద్దాం... రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ ఉండనివ్వండి రేపటి వరకు వేచి చూద్దామని హరీష్రావు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చానని, జర్నలిస్టులకు పెట్టిన రూ.16 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎడ్యుకేషన్ పాలసీ బాగుంటే వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదన్నారు.
పట్నా: బీహార్ లో రాజకీయ పెనుమార్పులు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారని, బీజేపీ నాయకుడికి ముఖ్యమంత్రి పగ్గాలు దక్కనున్నాయని, నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 2025 లో బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయు అధినేత నితీష్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయనకు స్థాన భ్రంశం తప్పదనే అంశం ప్రచారంలో ఉంది. అయితే బీహార్ లో నితీష్ కుమార్ కు గల రికార్డు నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం జరగలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటి నుంచీ పార్టీ వర్గాలలో ముఖ్యమంత్రి పదవి కాషాయం పార్టీ నేతకే దక్కాలనే భావన నలుగుతోంది. ప్రధాని మోదీ మాటకు కట్టుబడి బహిరంగ ప్రకటనలు చేయకుండా పార్టీ వర్గాలు సర్దుకున్నాయి. రాజ్యసభ స్థానానికి నితీష్ కుమార్ నామినేషన్ కోసం సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని జేడీ(యు) వర్గాలు తెలిపాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం అయ్యాయి. ముఖ్యమంత్రి సంతకం పెట్టడమే ఇక తరువాయి. మార్చి 5న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 1న నితీష్ కుమార్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. మార్చి 16 తర్వాత సీఎం పదవికి నితీష్ రాజీనామా రాజ్యసభ ఎన్నికలు మార్చి 16వ తేదీన జరుగనున్నాయి. అప్పటివరకూ ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తేదీ తర్వాత నితీష్ పదవి నుంచి వైదొలగవచ్చు. ఆయన రాజ్యసభకు వెళ్తే.. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణమాలు జరిగే అవకాశం ఉంది. జేడీ(యు) శిబిరంలో కలకలం ఈ పరిణామాల పట్ల జనతా దళ్ (యునైటెడ్ ) సమావేశంలో కలకలం చెలరేగింది. సీనియన్ నాయకుడు, మంత్రి విజేంద్ర ప్రసాద్ యాదవ్ సీఎంను కల్సి చర్చలు జరిపారు. మరో మంత్రి అశోక్ చౌదరి కూడా సిఎంని కలిశారు. అదే సమయంలో జేడీ(యు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా నితీష్ కుమార్ అధికార నివాసానికి చేరుకున్నారు. వేగంగా జరుగుతున్న పరిణామాల పార్టీలో సంచలనంగా మారాయి. రానున్న రాజ్యసభ నామినేషన్ల చుట్టూ చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం ఛాన్స్ బీహార్ భవిష్యత్ ముఖ్యమంత్రి పై ఇప్పటికే సమాంతర చర్చలు మొదలయ్యాయి. బీజేపీ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. అదే సమయంలో నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టవచ్చునని జేడీ(యు) వర్గాలు చెబుతున్నాయి. ఆయనను డిప్యూటీ సీఎం చేయవచ్చుననే ఊహాగానాలు ఉన్నా, అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.
గురువారం రాశి ఫలాలు (05-03-2026)
మేషం కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపార కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్వల్ప ధనలాభం సూచనలు ఉన్నవి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. వృషభం ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. మిధునం నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. పాత ఋణాల తీర్చగలుగుతారు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నూతన భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహం ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాల అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యవిషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. కన్య నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు అనుకూల ఫలితాన్నిస్తాయి. స్థిరాస్థి క్రయవిక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. తుల చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణప్రయత్నాలు కలసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. వృశ్చికం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమకు అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామ్య సలహాలు కొన్ని విషయాలలో కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ధనస్సు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు. మకరం భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతారు. క్రయవిక్రయాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ సంబంధిత చర్చలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. కుంభం ధన పరమైన ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి. కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. చాలా కాలంగా వేచిచూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. మీనం చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి
. టెక్నికల్ కమిటీని నియమించండి. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు డీపీఆర్లు. అధికారులకు మంత్రుల ఆదేశం విశాలాంధ్ర – హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పై మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ శాఖ […] The post ‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి appeared first on Visalaandhra .
ఐఏఎస్, ఐపీఎస్లను మారిస్తే ఫలితాలు రావు
. కీలకశాఖల అధికారుల మార్పుతో రాష్ట్రానికి నష్టం. రేవంత్ మేనల్లుడి మనుషులు అక్రమ మైనింగ్. దందా నడుపుతున్న మంత్రి పొంగులేటి సంస్థ. నేడు మైనింగ్ ప్రాంతాలకు నిజనిర్ధారణ కమిటీ: హరీశ్ రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్లను తరచూ మార్చడం వల్ల ఫలితాలు రావని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయన్నారు. మీడియాతో బుధవారం ఆయన ఇష్టాగోష్ఠిగా […] The post ఐఏఎస్, ఐపీఎస్లను మారిస్తే ఫలితాలు రావు appeared first on Visalaandhra .
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు […] The post సీఎం నితీశ్ రాజీనామా? appeared first on Visalaandhra .
జిమ్ లో వర్కౌట్ చేస్తూ వ్యక్తి మృతి
జిమ్ లో వర్కౌట్ చేస్తూ వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వ్యాయామం చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
న్యూదిల్లీ: ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. చరిత్రలో మొదటిసారిగా రూపాయి విలువ 92 మార్కును దాటి పడిపోయింది. యుద్ధం కారణంగా ముడి […] The post రూపాయి విలువ మరింత క్షీణత appeared first on Visalaandhra .
ఇరాన్ ప్రతిదాడులు తీవ్రతరం . గల్ఫ్ లక్ష్యాలపైకి క్షిపణులు, డ్రోన్లు. లెబనాన్లో ఐడీఎఫ్ భూతల దాడులు. ఐదు రోజుల్లో 1,045 మంది మృతి. వారంలోగా ఇరాన్ గగనతలం స్వాధీనం: అమెరికా. ఒకట్రెండు వారాల్లో లక్ష్యాలన్నీ ధ్వంసం: ఇజ్రాయిల్ తెహ్రాన్: క్షిపణలు, బాంబులతో పశ్చిమాసియా మండుతోంది.అటు అమెరికాఇజ్రాయిల్, ఇటు ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరస్పర దాడులతో భీతావహం సష్టిస్తున్నాయి. అమెరికాఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం […] The post పోరు…హోరు appeared first on Visalaandhra .
తెహ్రాన్: అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఇప్ప్పుడు పాలనా పగ్గాలను ఖామేనీ కుమారుడు ముజ్తబా హుస్సేనీ ఖామేనీకి అప్పగించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ పదవి నిర్వహించిన అనుభవమేదీ లేని ముజ్తబా… త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఖామేనీ రెండో కుమారుడే ముజ్తబా. 1969లో ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ముజ్తబా పదేళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రెజా […] The post ముజ్తబాకు పగ్గాలు! appeared first on Visalaandhra .
. లడ్డూ అంశంపై మాటల యుద్ధం. ఆవేశంతో ఊగిపోయిన అధికార, ప్రతిపక్ష సభ్యులు. జగన్పై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు వైసీపీ నిరసన. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశంపై శాసన మండలి దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కల్తీ నెయ్యి పాపం మీదంటే మీదే నంటూ పరస్పర ఆరోపణలతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక దశలో చైర్మనం […] The post మండలి ఉద్రిక్తం appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసన మండలి చైర్మన్పై అవిశ్వాస అస్త్రానికి కూటమి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అదీ వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలతోనే వ్యూహాత్మకంగా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు లీక్లు వస్తున్నాయి. తాజాగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ పత్రికలోను ఈ విషయం వెల్లడి కావడంతో ఆ ప్రచారానికి కాస్త బలం చేకూరుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీతకు ఆ పార్టీ […] The post మండలి చైర్మన్పైఅవిశ్వాసం? appeared first on Visalaandhra .
20 నెలలు… 6.28 లక్షల ఉద్యోగాలు
. ప్రపంచంలో పేరున్న పరిశ్రమలన్నీ తీసుకొస్తున్నాం. పీపీపీ విధానంలో నిర్మిస్తే అది ప్రైవేట్పరం కాదు. ముమ్మాటికీ అది ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తి. వైసీపీ పాలనలో అతిపెద్ద మద్యం కుంభకోణం. అన్ని ప్రాంతాల సమగ్రాభివద్ధే లక్ష్యం. శాసనసభలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివద్దే లక్ష్యంగా గత 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఎంఎసఎంఈలో 2.48 లక్షలు, నైపుణ్యాభివద్ధి ద్వారా 1.46 లక్షలు, […] The post 20 నెలలు… 6.28 లక్షల ఉద్యోగాలు appeared first on Visalaandhra .
ఎవరి భయంతోనో తప్ప్పును సమర్థించం: పెడ్రో శాంచెజ్ మాడ్రిడ్: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై దాడులకు దిగడాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్రంగా ఖండించారు. లక్షల మంది జీవితాలు పణంగా ‘రష్యన్ రోలెట’ (ప్రమాదకర ఆట)ను ఇజ్రాయిల్, అమెరికా ఆడుతోందని విమర్శించారు. యుద్ధానికి మద్దతు ఇవ్వలేదన్న కారణంగా స్పెయిన్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడాన్ని పెడ్రో బుధవారం ఆక్షేపించారు. యుద్ధం వద్దు అంటూ మరోసారి స్పష్టంచేశారు. యుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకమని, ఎవరో […] The post యుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకం appeared first on Visalaandhra .
నేపాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
. బరిలో 67 పార్టీలు… 3,405 మంది అభ్యర్థులు. ఝాపా 5, సర్లాహి 4, రుకుం 1లో రసవత్తర పోటీ. నిర్భయంగా ఓటేయండి: ప్రధాని ఖార్కి ఖాట్మండు: నేపాల్ ఎన్నికలకు సర్వసన్నద్ధమైంది. బుధవారం పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. జెన్ జీ ఆందోళనలు రాజకీయంగా ప్రకంకనల నేపథ్యంలో తాజా ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 2006లో పౌర యుద్ధం ముగిసిన తర్వాత జరగబోయే కీలక ఎన్నికలుగా ఇవి నిలిచాయి. 2025 సెప్టెంబరులో జెన్ జీ ఆందోళనల్లో […] The post నేపాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం appeared first on Visalaandhra .
మూడు రోజుల విషాదం తర్వాతే ఖననం – అధినేతకు తెహ్రాన్ కన్నీటి వీడ్కోలు తెహ్రాన్: ఇరాన్ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీ (86) అంత్యక్రియలు పవిత్ర నగరం మషాద్లో జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. 36 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఖామేనీ… అమెరికాఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన పుట్టినది మషాద్లోనే. ఇది ఇరాన్లో రెండవ అతిపెద్ద నగరం. ఖామేనీ తండ్రి అంత్యక్రియలు కూడా అక్కడి ఇమామ్ రెజా పవిత్ర […] The post మషాద్లో ఖామేనీ అంత్యక్రియలు appeared first on Visalaandhra .
100 మందికిపైగా గల్లంతు?శ్రీలంక తీరంలో ఘటనకొలంబో: పశ్చిమాసియా అట్టుడికిపోతున్న వేళ శ్రీలంక తీరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించినట్లు శ్రీలంక తెలిపింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురికి అత్యవసర చికిత్స అవసరమైనట్లు వెల్లడించింది. ‘గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ‘ఐఆరఐఎస్ దేనా’ అనే ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందింది. సహాయక చర్యల […] The post ఇరాన్ యుద్ధ నౌక మునక appeared first on Visalaandhra .
పాక్ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర
ఇజ్రాయిల్, అఫ్గాన్, ఇరాన్, భారత్పై ఖాజా ఆసిఫ్ ఆరోపణలుఇస్లామాబాద్: పాకిస్థాన్ సరిహద్దుల వరకు తమ పట్టు పెంచుకునేలా ఇజ్రాయిల్ కుట్రచేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఆరోపించారు. ఇరాన్పై యుద్ధం వెనుక ఉద్దేశం ఇదేనన్నారు. తమ దేశాన్ని సామంత రాజ్యంగా మార్చే ఇజ్రాయిల్ కుట్రలో అఫ్గాన్, ఇరాన్, భారత్ భాగస్వామ్యం ఉన్నట్లు ఆయన ఎక్స్ మాధ్యమంగా ఆరోపణలు చేశారు. ఒక్కటిగా ఉండాలని… రాజకీయ, మతపరమైన విభేదాలను విడనాడి, విదేశీ శుత్రువుల కుట్రలను తిప్పికొట్టాలని పాకిస్థానీయులకు ఖాజా […] The post పాక్ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర appeared first on Visalaandhra .
అలెన్ విధ్వంసం.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో విధ్యంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సులతో వంద పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలెన్ తోపాటు మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కూడా మెరుపులు మెరిపించాడు. అతను 33 బంతులు ఎదుర్కొని 58 పరుగులతో రాణించాడు. దీంతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. దీంతో కివీస్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ అర్ద శతకంతో చెలరేగాడు. 30 బంతుల్లోనే 5 భారీ సిక్సులు, 2 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రెవిస్ 34 పరుగులు, స్టబ్స్ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్కాంచి, హెన్రీ తలో రెండు వికెట్లు తీయగా.. నీషమ్, ఫెర్గూసన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీలంక
బీజీఎం బాధ్యత తమనుహైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) అందించే బాధ్యత నుండి చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోగా, ఆ స్థానంలోఎస్.ఎస్.తమన్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామం పవన్ అభిమానులను, సినీ ప్రియులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో అల్లు అర్జున్ నటించిన […] The post ఉగాదికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’? appeared first on Visalaandhra .
చెన్నై: తమిళ నటుడు విజయ్ రాజకీయపార్టీని స్థాపించి సినిమాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. తన ఆఖరి చిత్రం జన నాయకుడు విడుదలకు ఇంకా నోచుకోలేదు కానీ ఈ వ్యవధిలో మాత్రం విజయ్ కి ఊహించని సమస్యలు వచ్చాయి. తన భార్య సంగీత… విజయ్ విడాకులు కావాలని కోరుతూ కోర్టు మెట్లుఎక్కడం షాకింగ్ గా మారింది. అయితే ఈ సమస్యపై మరో షాకింగ్ రూమర్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. తమ సమస్యని విజయ్ […] The post సంగీతతో రాజీకి విజయ్ సిద్ధం ? appeared first on Visalaandhra .
Photos: Virosh Wedding Reception
The post Photos: Virosh Wedding Reception appeared first on Telugu360 .
హైదరాబాద్: గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా హీరోయిన్స్ నయనతార, కియార అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్. కన్నడ, ఇంగ్లీష్ లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేసేందుకు మేకర్స్ఏ ర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు అభిమానులకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే…. మేకర్స్ ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. తాము ఎంతో […] The post ‘టాక్సిక్’ విడుదల వాయిదా appeared first on Visalaandhra .
తెలంగాణ విశ్వవిద్యాలయంలో మద్యం మత్తులో జూనియర్ పై సీనియర్స్ దాడి
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గల తెలంగాణ విశ్వవిద్యాలయం లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ కు ఘర్షణ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం హోలీ సంబరాల్లో భాగంగా జూనియర్స్ వర్సెస్ సీనియర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. సీనియర్ లు మధ్యం తాగి వచ్చి ఓ జూనియర్ పై దాడికి దిగారు. దీంతో రెండు రోజులుగా కళాశాలలో సీనియర్ వర్సెస్ జూనియర్లుగా విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. హిస్టరీ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థి విక్కీ, హిస్టరీ విభాగంకు చెందిన జూనియర్ రాజును వాటర్ జగ్గు తో దాడి చేశారు. దింతో గాయాల పాలైన రాజు ను చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టగా వసతి గృహం వద్దకు చేరుకున్న ఎస్ఐ ఆంజనేయులు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసిle వినలేదు. ఈ విషయమై దాడికి ప్రయత్నం చేసిన 8 మంది విద్యార్ధులను ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తాత్కాలిక సస్పెండ్ చేశారు.
ఆల్టైమ్ రికార్డ్ సృష్టించిన ‘పెద్ది’ పాట
హైదరాబాద్ : రామ్చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ద’ విడుదల కాకముందే సోషల్ మీడియాలో రికార్డుల వేట మొదలు పెట్టింది. ఆస్కార్ విజేతఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మోటివేషనల్ సాంగ్ ‘రై రై రా రా’ సౌత్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లోనేఅత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియో సాంగ్గా నిలిచింది. కేవలం తెలుగు వెర్షన్లోనే ఈ పాట 29.22 మిలియన్ల వ్యూస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది.ఈ క్రమంలో […] The post ఆల్టైమ్ రికార్డ్ సృష్టించిన ‘పెద్ది’ పాట appeared first on Visalaandhra .
లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేములవాడ పట్టణంలో ఓ లాడ్జ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. జాతర గ్రౌండ్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఇది హత్యనా..? లేక ఆత్మహత్యనా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు ఎవరు...? ఎక్కడి నుండి వచ్చాడు.. అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇరాన్ సుప్రీంగా ఆయతుల్లా కుమారుడు?
దుబాయ్ : ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా, పరిపాలకునిగా ఆయన కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీని పరిగణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో తన తండ్రి మృతి చెందక ముందు, యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఆయన ప్రభుత్వ పదవికి ఎంపిక కాలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్లో రహస్యమైన వ్యక్తిగా ఉన్న మొజ్తాబా శనివారం నుంచి బయటకు కనిపించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ వైమానిక దాడి సుప్రీం లీడర్ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని 86 ఏళ్ల తన తండ్రిని హత్య చేసింది. అంతేకాదు యువ ఖమైనీ భార్య జహ్రా హడ్డాద్అడెల్ను కూడా హత్య చేసింది. మొజ్తాబా ఖమేనీ సజీవంగానే ఉన్నట్టు నమ్ముతున్నారు. అమెరికాఇజ్రాయెల్ దాడుల కారణంగా అజ్ఞాతంలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఆయన ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేయలేదు. దైవ పరిపాలనగా ఇరాన్ పూర్వ వంశపారంపర్య రాజరికంపై విమర్శలు ఉన్నప్పటికీ మొజ్తాబా ఖమేనీ పేరు ప్రచారంలో కొనసాగుతోంది. మొజ్తాబా తండ్రి ఆయతుల్లా ఖమేనీ, భార్య జహ్రా హడ్దాద్ను అమరవీరులుగా ఇరాన్లో ప్రస్తుతిస్తున్నారు. 88 సీట్ల ఇరాన్ అసెంబ్లీలో వృధ్ధాప్య మతాధికారుల సంఖ్య పెరగడంతో ఖమేనీ వంశస్థుల సంఖ్య కూడా పెరిగింది. తదుపరి నాయకుడిని ఈ అసెంబ్లీయే ఎన్నుకుంటుంది. ఎవరైతే ఇరాన్ సుప్రీం అవుతారో వారు ఇప్పుడు యుద్దంలో ఇరాన్ మిలిటరీపై నియంత్రణ కలిగి ఉండటమే కాక, అణ్వాయుధ నిర్మాణానికి కావలసిన యురేనియం నిల్వలను కూడా పర్యవేక్షించవలసి ఉంటుంది. మొజ్తాబా 1969లో ఇరాన్ లోని మషాద్లో జన్మించారు. ఆయన పదేళ్ల వయసులో ఇరాన్లో 1979 లో ఇస్లామిక్ రివల్యూషన్ సాగింది. ఇరాన్లో షా మొహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా తన తండి ఆయతుల్లా ఖమేనీ ఉద్యమం సాగించారు. అలాంటి పరిస్థితుల్లో మొజ్తాబా పెరిగారు. షా సీక్రెట్ పోలీస్ “ఎస్ఎవిఎకె ” తమ ఇంటిపై దాడి చేసిన సమయంలో మొజ్తాబా,మిగతా కుటుంబీకులు తమ తండ్రి ఇంటిని విడిచి ఎక్కడికో వెళ్లారని సీక్రెట్ పోలీసులకు చెప్పారు. షా ప్రభుత్వం పతనమైన తరువాత ఖమేనీ కుటుంబం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకుంది. 1989 లో ఆయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయిన తరువాత తండ్రితో పాటు మొజ్తాబా అధికారిక కార్యకలాపాల్లోనే కాకుండా వాణిజ్యపరమైన ఆస్తులను విస్తరింప చేశారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా సైనికులకు అండగా ఉండి తీవ్రవాదుల మధ్య విశ్వసనీయతను పొందారు. చాలా కాలంగా పాలనలో శక్తివంతమైన వ్యక్తిగా, మతాధికారులు, రివల్యూషనరీ గార్డ్కమాండర్ల నెట్వర్క్ నిర్వహించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019లో అమెరికా ట్రజరీ మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. అతను ప్రభుత్వంలో ఎన్నుకోబడక పోయినా, అధికారిక హోదాలో తన తండ్రి తరఫున అధికారం చెలాయించాడని ఆరోపించింది. ఖమేనీ కుటుంబీకులు అనేక మంది హత్యకు గురైన సంఘర్షణ కాలంలో నిలబడిన నాయకునిగా మొజ్తాబా ఇమేజ్ దృఢ పడింది.
ఆశ చూపాడు,అందినకాడికి దోచాడు దమ్మపేట, ఆంధ్రప్రభ: గతంలో చిట్ ఫండ్ కంపెనీలో సభ్యులుగా
Breaking : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు
వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్లో 1040 మంది మృతి
దుబాయ్ ః అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా సాగిస్తున్న దాడులలో ఇరాన్లో మృతుల సంఖ్య బుధవారం కనీసం 1045 కు చేరుకుంది. పలు చోట్ల శిథిలాలు, రక్తసిక్త వీధులు కన్పిస్తున్నాయి. మృతుల సంఖ్యను ఇరాన్ ప్రభుత్వ పరిధిలోని అధికారిక సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది. రెండు దేశాల సైన్యం నివాసిత ప్రాంతాలపైనే నేరుగా దాడులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇరాన్కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ మార్టియర్స్, అండ్ వెటర్న్ సంస్థ ఎప్పటికప్పుడు బాధితులు, మృతుల సంఖ్య ఇతర వివరాలను అంతర్జాతీయ మీడియాకు వెలువరిస్తోంది. పలు చోట్ల సామూహిక ఖననాలకు ఏర్పాట్లు చేశారు. ఇక ఇరాన్ జరిపిన దాడులలో ఇప్పటివరకూ ఇజ్రాయెల్లో 11 మంది చనిపోయారు. కోన్ని ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగింది. కువైట్లో బుధవారం ఇరాన్ దాడుల శకలాలు తగిలి 11 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఇంతకు ముందు ఇక్కడ ఒక్కరు చనిపోయారు. యుఎఇలో ముగ్గురు, బహరైన్లో ఒక్కరు ఇరాన్ దాడులలో మృతి చెందారు. ఇక కువైట్లో ఇరాన్ దాడులలో ఇప్పటికే ఆరుగురు అమెరికా ఆర్మీ రిజర్వ్ సైనికులు చనిపోయారు.
రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు #VemNarenderReddy #TelanganaPolitics
ఢిల్లీలో లొంగిపోనున్న మావోయిస్ట్ అగ్రనేత
ఢిల్లీలో లొంగిపోనున్న మావోయిస్ట్ అగ్రనేత ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల
రంజాన్లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం, సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యంచేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోసెహ్రీలో బుద్ధిపూర్వక, పోషకమైన ఎంపికలు చేసుకోవడం వల్ల ఉపవాస అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, శక్తివంతంగా మార్చుకోవచ్చు. రోజంతా నిరంతర శక్తి కోసంచేర్చవలసిన ఐదు ఆహారాలు ఇక్కడ ఉన్నాయి : 1. కాలిఫోర్నియా బాదం: బాదంలో […] The post రంజాన్లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు appeared first on Visalaandhra .
క్రోమ్-అమర్చిన యెజ్డ్ రోడ్లర్ రెడ్ ఉల్ఫ్ విడుదల
ముంబయి : మార్చి 3, 2026న, చంద్ర గ్రహణం రోజున, జావా యెజ్డ్ మోటార్ సైకిల్స్ కొత్త యెడ్డీ రోడ్ స్టర్ రెడ్ ఉల్ఫ్ ను విడుదల చేస్తుంది. ‘బోర్న్ అవుట్ ఆఫ్ లైన్ ‘ రోడ్స్ట ర్ ఆధిపత్య స్ఫూర్తితో తయారు చేయబడిన రెడ్ ఉల్ఫ్ ప్రపంచంలోనే భారతదేశంలో తయారైన ఏకైక క్లాసిక్ మోటార్ సైకిల్ బ్యాడ్జీ నుండి ధైర్యంగా వచ్చిన రెట్రో లాంగ్-హౌల్రో డ్ స్టర్. యెజ్డ్ రోడ్ స్టర్ తాజా వ్యాఖ్యానం తిరగబడే […] The post క్రోమ్-అమర్చిన యెజ్డ్ రోడ్లర్ రెడ్ ఉల్ఫ్ విడుదల appeared first on Visalaandhra .
Rupee92Dollor |ఓ వైపు యుద్ధం.. మరోవైపు ఆర్థిక సంక్షోభం..
Rupee92Dollor | ఓ వైపు యుద్ధం.. మరోవైపు ఆర్థిక సంక్షోభం.. Rupee92Dollor |
VIROSH Reception: Megastar Attends
Tollywood actors Vijay Deverakonda and Rashmika Mandanna got married in a grand wedding in Udaipur on February 26th. A grand wedding reception is hosted by the couple for Tollywood celebrities. Megastar Chiranjeevi who skipped the pre-wedding bash of Allu Sirish on March 2nd in Allu Studios attended the wedding reception of VIROSH. Chiranjeevi dressed in […] The post VIROSH Reception: Megastar Attends appeared first on Telugu360 .
రెండు స్పా సెంటర్లపై దాడులు.. 20 మంది అరెస్ట్
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించామని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించి నందుకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. దాడి సందర్భంగా మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పేకాట స్థావరం పై దాడి.. ఐదుగురి అరెస్ట్
కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు ఆదిత్యనగర్ అడ్డగుట్టలోని ఒక ప్రైవేట్ లగ్జరీ స్టే ఇన్ గదిపై దాడి చేశారు. గదిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. దేవలరాజు వెంకట శేష చలం (48), పార్వతనేని వీరభద్రరావు (47), పెడ్డినేని పవన్ కుమార్ (36), ఓబిలినేని గణేష్ (36), పార్వతనేని రాంబాబు (45) పట్టుబడిన వారిలో ఉన్నారు.వారి వద్ద నుంచి రూ.39,010 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆరు సెట్ల పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.89,010/- గా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు
శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై జలాంతర్గామి దాడి..102 మంది గల్లంతు
ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కూటమి నడుమ యుద్ధం గల్ఫ్ దేశాలను దాటి విస్తరిస్తోంది. బుధవారం తెల్లవారుజామున శ్రీలంక తీరం ప్రాంతం గాలె సమీపంలో ఇరానియన్ నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 102మంది గల్లంతయ్యారు. 78 మంది గాయపడ్డారు. కొందరు నావికుల మృతదేహాలు లభించినట్లు శ్రీలంక వర్గాలు తెలిపాయి. ఇరాన్కు చెందిన ‘ఐఆర్ఐఎస్ దేనా’ అనే యుద్ధనౌక శ్రీలంక తీర ప్రాంతం మీదుగా తిరిగి ఇరాన్ వెళుతుండగా ఈ దాడి జరిగింది. అది తమపనేనని అమెరికా సాయంత్రానికి ప్రకటించింది. జలాంతర్గామి టార్పెడోలతో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ ప్రకటించారు. భారతదేశంలోని విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ‘మిలాన్2026’ పలు దేశాల నావికా విన్యాసాలలో పాల్గొన్న తర్వాత ఇరాన్ కు తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మునిగిపోతున్న ఇరానియన్ నౌకలోని 32 మందిని సైన్యం రక్షించిందని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వశాఖ అంతకుముందు తెలిపింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురికి అత్యవసర చికిత్స అందించామని, మరి కొందరు స్వల్పంగా గాయపడి చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి డాక్టర్ అనిల్ జాసింగ్ తెలిపారు. అనంతరం శ్రీలంక నౌకాదళం ఓ ప్రకటనలో మొత్తం 79 మందిని రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు, వారిలో ఒకరు మరణించినట్లు, మరో 101 మంది తప్పిపోయినట్లు తెలిపింది. నౌక మాత్రం సముద్ర జలాలలో మునిగిపోయిందని వివరించింది. దాదాపు 180 మందితో కూడిన ఐఆర్ఐఎస్ దేనా నౌక ప్రమాదంలో ఉందని శ్రీలంక నావికా దళానికి అత్యవసర సందేశం అందిందని, వెంటనే ఓడలు, వైమానిక దళ విమానాలు సహాయ చర్యలకోసం పంపినట్లు లంక విదేశాంగమంత్రి విజిత హరాత్ పార్లమెంటులో ప్రకటించారు. పేలుడు వల్లే మునక.. పెద్ద పేలుడు సంభవించడంతో నౌక దెబ్బతిన్నదని సిబ్బంది చెప్పినట్లు శ్రీలంక నావికా దళం వర్గాలు బుధవారం తెలిపాయి. నౌక మునిగిపోయిన ప్రాంతంలో కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఓడ మునిగిపోయిన ప్రాంతం నుంచి తాము కొందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరి కొందరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని శ్రీలంక నావికాదళ ప్రతినిధి బుద్ధిక సంపత్ కొలంబోలో విలేకరులకు తెలిపారు. అది మా పనే : అమెరికా హిందూ మహా సముద్రంలో ఇరాన్ నౌకను జలాంతర్గామి టార్పెడోలతో ముంచేశామని అమెరికా రక్షణమంత్రి పీటర్ హెగ్సెత్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శత్రుదేశంపై జరిగిన అతి భారీ దాడిగా ఆయన అభివర్ణించారు. త్వరలో మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. కొద్ది రోజుల్లో ఇరాన్ గగనతలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. ఇరాన్పై అమెరికా మరింత విజయం సాధించిందన్నారు. తమ వద్ద అపరిమిత సంఖ్యలో గ్రావిటీ బాంబులు ఉన్నాయని, వాటిని కూడా ఉపయోగిస్తామన్నారు.
’సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నవ్వులతో అలరిస్తుంది
మిస్సమ్మ, అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. లిటిల్ హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్గా వస్తున్న ’సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో హాస్య బ్రహ్మా బ్రహ్మానందం, బండ్లగణేష్ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ “పండగ వాతావరణంలో ఉన్న ఈ సినిమా అందరినీ నవ్వులతో అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, నిర్మాతగా శివాజీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. కథానాయకుడు శివాజీ మాట్లాడుతూ “సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఈటీవీ విన్ వారు థియేటర్లో ఈ సినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్లో కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్ కార్న్ను, మల్టీప్లెక్స్ థియేటర్స్లో 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్ పాప్కార్న్ను ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్రెండ్స్ ఇలా అందరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ను ప్రకటించారు. ఇందువల్ల సినిమా మరింత మందికి దగ్గరవుతుంది” అని తెలిపారు. ఈ వేడుకలో లయ, సాయికృష్ణ, వంశీ నందిపాటి, నితిన్ చక్రవర్తి, అలీ, సుదీర్ శ్రీరామ్, మిథిల్, రిత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యురోపియన్ దేశం, నాటో మిత్రదేశం స్పెయిన్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు కోపం వచ్చింది. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో స్పెయిన్ తన స్థావరాలను ఉపయోగించుకోవడానికి అమెరికా సైనిక దళాలను అనుమతించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే, స్పెయిన్ తో అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని, వాణిజ్య పరమైన ఆంక్షలు విధిస్తామని బుధవారం నాడు హెచ్చరించారు.స్పెయిన్ వైఖరి చాలా దారుణంగా ఉందని ట్రంప్ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. స్పెయిన్ తో అన్ని లావాదేవీలు నిలిపివేయాలని అమెరికా ఆర్థిక శాఖమంత్రి స్కాట్ బెసెంట్ తో చెప్పినట్లు ఆయన తెలిపారు. స్పెయిన్ తో అన్ని సంబంధాలను తాము తెగతెంపులు చేసుకుంటామని ప్రెసిడెంట్ అన్నారు.స్పెయిన్ లోని సోషలిస్ట్ నాయకత్వం ఇరాన్ పై దాడికి ఉపయోగించే విమానాలను రీఫిల్లింగ్ ట్యాంకర్ లు తాము అనుమతించబోమని ప్రకటించడంతో దక్షిణ స్పెయిన్ లోని రోటా,మోరాన్ మిలిటరీ స్థావరాలనుంచి అమెరికా తమ 15 ఎయిర్ క్రాఫ్ట్ లను, రీఫిల్లింగ్ ట్యాంకర్ లను వేరే ప్రాంతానికి తరలించవలసి వచ్చింది. నాటో సభ్యదేశాలన్నీ తమ జీడీపీలో 5 శాతం రక్షణ కోసం ఖర్చు చేయాలన్న అమెరికా పిలుపును స్పెయిన్ పట్టించుకోక పోవడం కూడా ట్రంప్ కోపానికి కారణమైంది. అందువల్ల ఇక స్పెయిన్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై స్పెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.ట్రంప్ తో సమావేశం అనంతరం జర్మన్ ఛాన్స్ లర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ గత సంవత్సరం అమెరికా -యురోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి స్పెయిన్ ను ప్రత్యేకంగా మినహాయించలేదని తాను ట్రంప్ తో ప్రత్యేకంగా చెప్పినట్లు పేర్కొనడం విశేషం.
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికలలో చైర్మెన్ ఎన్నిక విషయంలో నెలకొన్న దాడుల నేపద్యంలో జైలుకు వెళ్లిన పెద్దపల్లి మాజీ ఎంపి, చెన్నూర్ మాజీ ఎంఎల్ఎ మాజీ విఫ్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, చెన్నూర్ నాయకులు మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ లు 14 రోజుల రిమాండ్ తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి వారు విడుదల అయ్యారు. బాల్క సుమన్ కు బెయిల్ వచ్చిన నేపధ్యంలో మంచిర్యాల జిల్లా నుండి బిఆర్ఎస్ శ్రేణులు బుదవారం ఉదయమే ఆదిలాబాద్కు తరలివెళ్లారు. జిల్లా జైలు నుండి విడుదలైన వారిని బిఆర్ఎస్ శ్రేణులు శాలువలతో సత్కరించి, గజమాలలు వేసి జైలు గేటు వద్ద నుండి బుజాలపై ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకుని ఊరేగించారు. రాజీకీయలలో ప్రతిపక్ష ప్రత్యర్థులుగా చూశామే కానీ వ్యక్తిగత శత్రువులుగా చూడలేదని మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ అన్నారు. జైలు నుండి విడుదలైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి, చెన్నూర్ ఎంఎల్ఎ, మంత్రి గడ్డం వివేకానంద కండ్లు చల్లబడ్డాయా, కక్ష తీరాందా అని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను విస్మరించి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ క్యాతన్పల్లి లో తమపై రాళ్లదాడి చేసిందని, పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, తిరిగి సూమారు 25 మంది పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తనను జైలులో పెట్టించివా వారికి కక్ష తీరినట్లు లేదని, మళ్లీ జైలుకు పంపించాలని కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ మొదలు, మందమర్రి తహాసిల్దార్, డిసిపి, రామకృష్ణాపూర్ ఎస్ఐ లు కూడా ప్రభుత్వ శాఖలో పని చేయడం లేదని, మంత్రి విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా వ్యవహరిస్తున్నారన్నారు. తాము ఎప్పుడు రాజకీయంగానే ఎదుర్కొన్నామని, కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని.పదేళ్లు అధికారంలో ఉన్నా ఎవరిని జైలుకు పంపలేదన్నారు. మంత్రి వివేకానంద కోల్బెల్టును రావణకాష్టం చేస్తున్నారని విమర్శించారు. తాను 2014 లో పెద్దపల్లి ఎంపిగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా గడ్డం వివేకానంద పోటీ చేసి ఓడిపోయారని, ఆయనను బిఆర్ఎస్లో చేర్చుకుని ప్రభుత్వంలో సలహాదారుడిగా నియమించారన్నారు. తాను 2018 లో చెన్నూర్ ఎంఎల్ఎ గా పోటీ చేయగా తనపై కాంగ్రెస్ ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీ చేసిన బొర్లకుంట వెంకటేష్ నేత ఓడిపోతే, ఆయనను అక్కు న చేర్చుకుని 2019 లో టిఆర్ఎస్ పెద్దపల్లి ఎంపిగా నిలబెట్టి గెలిపించుకున్నామని అన్నారు. తాము కలుపుకు పోయే పనులు చేశామే తప్ప కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. నేడు ముఖ్యమంత్రి రేవెంత్రెడ్డి, మంత్రి వివేకానంద కక్ష కట్టి తనను జైలుకు పంపించడంతో పాటు బెయిల్ రాకుండా కుతాంత్రాలు చేశారని విమర్శించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటి విషయంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికైనా గౌరవించాలని ఆయన సూచించారు. ఆయన వెంట మాజీ మంత్రి జోగురామన్న, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్.. కష్టాల్లో సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడుతున్నారు. 77 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది సఫారీ జట్టు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు రెండో ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఈ ఓవర్ లో వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులతో చెలరేగడంతో సఫారీ బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. సగం ఓవర్లకే కీలక బ్యాటర్లు ఔట్ కావడంతో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. దీంతో సపారీ జట్టు 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్(13), యాన్సెన్(21)లు ఉన్నారు. ఇక, కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్కాంచి చెరో రెండు వికెట్లు తీయగా.. నీషమ్ ఒక వికెట్ పడగొట్టాడు
పెరిగినవ విద్యుత్ డిమాండ్.. ఒక్క రోజే 4421 మెగావాట్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం (మార్చి 3) రోజున గరిష్ట విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకుంది.ఇప్పటి వరకు నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇదే. గత ఏడాది మే 6న అత్యధికంగా 4,352 మెగావాట్ల రికార్డును ఈసారి మార్చి నెలలోనే అధిగమించడం విశేషం.సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ప్రధానంగా ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వినియోగం పెరుగుతుండటంతో డిమాండ్ భారీగా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా నిరంతర సరఫరా అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)జితేష్ వి పాటిల్, ఐఏఎస్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, 33 కేవీ/11 కేవీ ఫీడర్ల పై, సబ్ స్టేషన్ల లోని పవర్ ట్రాన్స్ ఫార్మర్ల లోడ్ ను పర్యవేక్షించాలని ఇప్పటికే క్షేత్ర స్థాయి అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
తెలంగాణలో ఆంధ్ర ఇసుక మాఫియా దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇసుక మాఫియా,
ఇరాన్ పై దాడులు.. క్షిపణి నిల్వలపై ట్రంప్ కు పెంటగాన్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు నాలుగో రోజుకు చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో మరో పది రోజుల పాటు దాడులు కొనసాగితే అమెరికాలోని క్షిపణి నిల్వలు పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుందని పెంటగాన్ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ఆయుధ, క్షిపణి నిల్వలను తిరిగి పెంచుకోవడానికి అత్యధికంగా వ్యయం చేయవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పెంటగాన్ తెలియజేసినట్టు నివేదికలు వెల్లడించాయి. ఈ కొరత వల్ల ఇరాన్ దాడులను తిప్పి కొట్టడం అసాధ్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరించాయి. ముఖ్యంగా ఇంటర్సెప్టర్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల నిల్వలు బాగా తగ్గినట్టు తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి మిత్రదేశాలకు సైనిక సహాయం అందిస్తుండడంతో అమెరికా వద్ద క్షిపణి నిల్వలు తగ్గినట్టు నివేదికలు తెలిపాయి.
దేవినేని కుటుంబం అంటే జిల్లాలో ఒక బ్రాండ్
దేవినేని కుటుంబం అంటే జిల్లాలో ఒక బ్రాండ్ విజయవాడ తూర్పు ప్రతినిధి, ఆంధ్ర
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని మూడు ప్రముఖ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తు లు బెదిరింపులు పంపడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కపిలతీర్థం దగ్గర రాజ్ పార్క్ హోటల్, పాయ్ వైస్రాయ్, ఉప్పరపల్లిలోని ఎస్ ఆర్బి హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తు తెలియన వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటల్లోనే తిరుపతిలో హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. హోటళ్ల సిబ్బంది సమాచారంతో అప్రమత్తం అయిన పోలీసులు తనీఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంలతో హోటల్ గదులు, పార్కింగ్ ఏరియా, లాబీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా హోటళ్లను ఖాళీ చేయించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి బాంబు సంబంధించిన వస్తువులు లభించలేదు. ప్రముఖులు విడిది చేసే ఇలాంటి హోటళ్లకు బెందిరింపులు రావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమెయిల్స్ ఎక్క డినుంచి వచ్చాయి? ఎవరూ పంపించా రు? అనే అంశాలతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీం ఈ-మెయిల్ ఐడిలను ట్రాక్ చేస్తోంది.
నాన్ టీచింగ్ స్టాఫ్ పై విద్యార్థి దాడి…
నాన్ టీచింగ్ స్టాఫ్ పై విద్యార్థి దాడి… గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా
ఇరాన్ సుప్రీం ఎవరైనా టార్గెట్ చేస్తాం : ఇజ్రాయెల్ హెచ్చరిక
జెరూసలెం: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ వారసులుగా ఎవరు వచ్చినా వారిని లక్షంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం హెచ్చరించారు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనుకునే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. 1979 ఇస్లామిక్ రివల్యూషన్ దగ్గర నుంచి రెండోసారి ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికైన వారు ఎవరైనా, లేదా ఎక్కడ దాగున్నా ఇజ్రాయెల్ ప్రధాని, తాను ఆపరేషన్ “లయన్స్ రోర్ ”లో భాగంగా మట్టుబెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఐడిఎఫ్ను ఆదేశించామని చెప్పారు. ఇదిలా ఉండగా టెహ్రాన్పై బుధవారం ఉదయం పదోసారి దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. టెహ్రాన్లో ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వ మౌలిక సౌకర్యాలను లక్షంగా చేసుకుని భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించినట్టు పేర్కొంది. అమెరికా భాగస్వామ్యంతో పూర్తి బలగాలతో దాడులు కొనసాగుతాయని వివరించింది.
వైయస్సార్ కాలనీలో అర్థరాత్రి బైకులు దగ్ధం..
వైయస్సార్ కాలనీలో అర్థరాత్రి బైకులు దగ్ధం.. చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్
యువత ఉపాధి వారసత్వ పరిరక్షణే లక్ష్యం…
యువత ఉపాధి వారసత్వ పరిరక్షణే లక్ష్యం… చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర పర్యాటక
HDFC Bank |బ్యాంకు ముందు పార్కు చేసిన బైక్ చోరి..
HDFC Bank | బ్యాంకు ముందు పార్కు చేసిన బైక్ చోరి.. పోలీసులను
ఎపిఎస్ఆర్టిసి కీలక నిర్ణయం.. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
అమరావతి: ‘ఇంధ్ర ధనస్సులో భాగంగా దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎపిఎస్ఆర్టిసి తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 18న సిఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్టిసి ఎండి ప్రకటించారు. 40 శాతం పైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. సిటి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దీన్ని అమలు చేస్తామని అన్నారు. దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఉంటుందని వివరించారు.
Notification |దరఖాస్తు చేసుకోండి
Notification | దరఖాస్తు చేసుకోండి Notification | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : మీరు
కలెక్టర్ అనురాగ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
కలెక్టర్ అనురాగ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి
జైల్లో నరకం చూపించారు.. క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ
4th day |ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం
4th day | ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం 4th day
కల్తీ పాల ఘటన.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు విడిచింది. కల్తీపాలు తాగి తీవ్ర అనారోగ్యానికి గురి కాగా.. కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో ఈ కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి గర్బిణీని తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్లో మహిళ ప్రసవించినట్లు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వారిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఈఎంటీ లక్ష్మణ్ తెలిపారు. వివరాలలోకి వెళితే.. లింగంపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన శైలజకు డెలివరీ కోసం మాత శిశు సంరక్షణ ఆస్పత్రి బాన్సువాడకు తీసుకుని వస్తుండగా తగిన పరీక్షలని నిర్వహించారు. ఈ క్రమంలో మహిళకు బిపి పెరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాన్సువాడ నుంచి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్లో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ లక్ష్మణ్ డెలివరీ చేశాడు. ఆడ బిడ్డకు జన్మనివ్వగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు ఈఎంటీ లక్ష్మణ్తో పాటు పైలట్ రాముకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి చికిత్స కోసం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగింది.
subsidy |ఆన్ లైన్ మోసాలు అరికట్టండి…
subsidy | ఆన్ లైన్ మోసాలు అరికట్టండి… బ్యాంకు అధికారులను ఆదేశించిన ఎంపీ
దైవదర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు
తిరుమల వెంకన్నను దర్శించుకోవాలన్న ఆ కుటుంబ ఆశలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. పుణ్యక్షేత్రానికి వెళ్తున్న ప్రయాణం మృత్యులోకానికి తీసుకెళ్లింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం పలమనేరు జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని ఓ కారు వెనుక వైపు నుంచి అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన లో ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించా రు. ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో వృద్ధులతోపాటు యువతులు కూడా ఉన్నా రు. మోహన్దాస్, నాగరాజారా వు, కుసుమ, జయంతి, పూజ మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలోని, బంధువర్గంలోని ఐదుగురు వ్యక్తులు మరణించడంతో రాజాజీనగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలమనేరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రాథమిక దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం కారు డ్రైవర్ అతి వేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్ర మాదం జరిగినట్టు తెలుస్తోంది. వేగం ఎక్కువగా ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న లారీని గమనించ లేక ఢీ కొట్టి నట్టు పోలీసులు భావిస్తున్నారు.
అంబరాన్నంటిన హోలీ సంబరాలు కుంటాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రం కుంటాల కల్లూరు ఓలా
Two-wheeler |ద్విచక్ర వాహనంపై వెళ్తూ…
Two-wheeler | ద్విచక్ర వాహనంపై వెళ్తూ… యువకుడు మృతి Two-wheeler | రొంపిచర్ల,
కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళన…
కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళన… ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే జూలకంటి మాచర్ల,
పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల
పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో పదో
సెమీ ఫైనల్ 1: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
కోల్కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్లు ఒక ఎత్తైతే.. ఇకపై జరిగే మ్యాచ్లో మరింత ఉత్కంఠగా ఉండనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్కు దూసుకుపోతుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పు చేసింది. రబాడా, మార్కో జెన్సన్, కేశవ్ మహరాజ్లను జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మ్యాచ్ హెర్నీ, నీశమ్లను జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: సౌతాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి. న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.
18th Division |సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం…
18th Division | సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం… 18th
నగరంలో మరో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు రట్టు
నగరంలో మరో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు బట్టబయలయ్యింది. కమిషనర్స్ టాస్క్ఫోర్స్(గోల్కొండ టీమ్),మాసబ్ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బంజారాహిల్స్ పరిధి భోలానగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న ‘ప్రైడ్ డెయిరీ’ కల్తీ నెయ్యి తయారీ కేంద్రం వెలుగుచూసింది. సుమారు రూ.18.26 లక్షల విలువజేసే కల్తీ నెయ్యి మరియు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకుని తయారీకేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. భోలానగర్కు చెందిన జునైద్ హుస్సేన్ తన ప్రైడ్ డెయిరీ యూనిట్లో లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ ఈ కల్తీ నెయ్యి కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తక్కువ నాణ్యత కలిగిన పామాయిల్,వనస్పతి(డాల్డా), ఇతర హానికరమైన పదార్థాలను ఆవు,గేదె మీగడలో కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తుండటంతో సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని అసలైన నెయ్యిగా నమ్మిస్తూ ప్రజలకు,హోటళ్లకు,శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. పోలీసులు తనిఖీల్లో రూ.18.26 లక్షల విలువజేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 460 కేజీల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యితో పాటు భారీస్థాయిలో కల్తీకి ఉపయోగించే 2090 కేజీల ఆవు మీగడ,1170కేజీల గేదె మీగడ స్వాధీనం చేసుకున్నారు. నగర అడిషనల్ డిసిపి(టాస్క్ఫోర్స్) అందె శ్రీనివాస్రావు పర్యవేక్షణలో గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్ వెంకటేశ్,మాసబ్ట్యాంక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్,ఎస్ఐలు విజయానంద్,చందన తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇరాన్ యుద్ధనౌకపై దాడి..100 మందికి పైగా గల్లంతు
శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరిగింది. ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా యుద్ధనౌకపై సబ్మెరైన్తో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతైనట్లు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మరో 78 మంది గాయపడినట్లు చెప్పారు. దాడి జరిగిన తర్వాత సమాచారం అందుకున్న శ్రీలంక నావికాదళం వెంటనే అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టింది. మునిగిపోతున్న ఇరాన్ యుద్ధనౌక నుంచి 32 మందిని రక్షించి ఆసుపత్రిలో చేర్చామని శ్రీలంక నేవీ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో యుద్ధనౌకలో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ
రేషన్కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ (మూడు నెలలకు) సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కోటికి పైగా ఉన్నాయి. ఒకేసారి మూడు నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో ఒకేసారి మూడునెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా మూడు నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమ యంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండటంతో పాటు డీలర్లు, హమాలీ కూలీ కలిసొచ్చే అవకాశముంది. కానీ, ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో డీలర్లకు సమస్యగా మారింది. ఇక మూడు నెలలకు సంబంధించి ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వస్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 1,5-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యల గురించి అధికారులు ఆలోచిస్తున్నారు.
మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు: మంత్రి పొన్నం
విద్వేషాన్ని రెచ్చగొట్టి మైనార్టీలను అణగారిన వర్గాలను బూచిగా చూపి అధికారాన్ని చెలాయిస్తున్నారని, నిత్యం మతవిద్వేశాలు రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై ధ్వజమెత్తారు.ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా తమ హక్కు. అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు...మరో వ్యక్తి కాదు.. ప్రజలే న్యాయ నిర్ణేతలని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావు, అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. ఈ దేశానికి పట్టిన గ్రహణం ఎవరో ప్రజలకు తెలుసునని, గత 12 ఏళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని, దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి తమాషా చూస్తున్నారని, దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన మీరా మాట్లాడేది..? అని ఆయన దుయ్యబట్టారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారిందని, ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయిస్తున్నారని ఆయన విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, పేదలను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈడి సిబిఐ కేసులతో విపక్ష ప్రభుత్వాలను కూలుస్తు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రాజకీయం మీదని ఆయన విమర్శించారు. దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజలకు ఐక్యతను చాటి మీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న రాహుల్ గాంధీని విమర్శించడం ఆకాశం మీద ఉమ్మిస్తే మీ ముఖం మీదే పడుతుందని ఆ వాస్తవాన్ని బండి సంజయ్ తెలుసుకోవాలని ఆయన సూచించారు.రెండు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయి తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకుని రాలేకపోయిన బండి సంజయ్ తన వ్యవహారశైలి మార్చుకోవాలని ఆయన హితవు చెప్పారు.

28 C