ఘనంగా మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలు
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని చీలాపూర్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలను
Road Accident : లోయలో పడిన బస్సు.. పదిహేను మంది మృతి
జమ్ము కాశ్మీర్ లో బస్సు లోయలో పడి పదిహేను మంది మరణించారు.
గచ్చిబౌలిలోని అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టిఎన్జీవో కాలనీలోని ఒక అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో మంటలు చెలరేగడంతో అపార్ట్ మెంట్ మొత్తం మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బంది పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అపార్ట్ మెంట్ లో పై అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. బిల్డింగ్ సెల్లార్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తోనే భారీ అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎమ్మెల్యే చొరవతో కరెంటు కష్టాలకు చెక్..
ఎమ్మెల్యే చొరవతో కరెంటు కష్టాలకు చెక్.. పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు మండలం
హామీ పనులు పరిశీలించిన జాయింట్ కమిషనర్
బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండలం ఉట్ పల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధి
బీసీలను కరేపాకుల వాడుకుంటున్న కూటమి ప్రభుత్వం…
బీసీలను కరేపాకుల వాడుకుంటున్న కూటమి ప్రభుత్వం… కూటమి ప్రభుత్వంలో బీసీలపై చిన్నచూపు..ఇచ్చిన హామీలను
ఆంధ్రప్రభ, జగదేవపూర్ : సమాజానికి సేవ చేసే అవకాశం కలగడం దేవుడు కల్పించిన
బసవేశ్వర బోధనలు ఆచరణీయాలు: మాజీ సర్పంచ్
వికారాబాద్, ఆంధ్రప్రభ : సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుని బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో
సంచలన విషయాలు బయటపెట్టిన రషీద్.. భారత్ పౌరసత్వం తిరస్కరణ
అఫ్గానిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.‘‘Rashid Khan : From Streets to Stardom’’ అనే పుస్తకంలో రషీద్ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనకి ఆస్ట్రేలియా మరియు భారత్ నుంచి పౌరసత్వం తీసుకోవాలని ఆఫర్లు వచ్చాయని.. కానీ, అతడు వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. తన దేశం అఫ్గాన్ తరఫునే తాను ఆడుతానని చెప్పినట్లు తెలిపాడు. 2023 ఐపిఎల్ సందర్భంలో ఈ ఆఫర్లు వచ్చినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో అఫ్గాన్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని.. దీంతో తనకు ఆఫర్ వచ్చిందని.. అయినా కూడా తాను దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపాడు. ‘‘నాకు రెండు దేశాల నుంచి సిటిజన్షిప్ ఇస్తామని ఆఫర్లు వచ్చాయి. భారత్తో పాటు ఆస్ట్రేలియా నుంచి అందాయి. ఆ సమయంలో నేను ఒక్కటే చెప్పా. నా దేశం తరఫున క్రికెట్ ఆడకపోతే.. మరే ఇతర దేశం తరఫున కూడా ఆడనని అన్నాను’’ అని రషీద్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ బోర్డు నుంచి ఓ ఉన్నతాధికారి ఈ ఆఫర్ని తనకు ఇచ్చాడని రషీద్ అన్నాడు. ‘‘గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపిఎల్ ఆడుతున్న సమయంలో ఓ అధికారి నన్ను కలిశాడు. నన్ను కలవాలని అడిగారు. తర్వాత వెళ్లి కలిశా. మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ‘ఇప్పుడు అఫ్గానిస్తాన్ పరిస్థితులు బాగా లేవు. భారత్కు వచ్చి ఉండండి. మీకు అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తాం. ఇక్కడే జీవించండి. క్రికెట్ ఆడండి’ అని అన్నారు. ఆ మాటలకు నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. ఎలా స్పందించాలో కాసేపు అర్థం కాలేదు. నవ్వుతూనే ‘ధన్యవాదాలు. కానీ, నేను నా దేశం అఫ్గాన్ తరఫునే క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా’ అని చెప్పా’’ అని రషీద్ గుర్తు చేసుకున్నాడు.
లోయలో పడిన బస్సు: పది మంది మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని ఉధమ్ పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రామనగర్ టూ ఉధమ్పూర్ రహదారిలోని కనోటే గ్రామ శివారులో బస్సు లోయలో పడడంతో పది మంది మృతి చెందారు. పలువురు గాయపడడంతో ఆస్ప్రతులకు తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో బోల్తాపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూత ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థానిక పరిపాలన యంత్రాంగంతో పాటు రాజిందర్ శర్మ నేతృత్వంలోని మా స్థానిక కార్యకర్తల బృందంతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలియజేశారు.
ఉత్తర్ప్రదేశ్లో ‘టీ కప్ప్పు’ ధుమారం
లఖ్నవూ (ఉత్తర్ప్రదేశ్): రాష్ట్రంలో టీ కప్ప్పు రాజకీయ ధుమారం రేపింది. ఫతేపూర్ జిల్లాలో ఓ టీ కొట్టులో ఆహార భద్రత అధికారులు తనఖీలు జరిపి కొన్ని నమూనాలు పరీక్షకు తీసుకువెళ్లారు. దీనితో అది రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ‘సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఇటీవల మా ప్రాంతంలో పర్యటించారు. ఆయనకు మా అబ్బాయి అభిమానంగా టీ అందించాడు. అప్పటినుంచీ మాకు అధికారుల వేధింపులు పెరిగాయి’ అని స్థానిక చిరు వ్యాపారి శేషమణి యాదవ్ మీడియాతో చెప్పారు. […] The post ఉత్తర్ప్రదేశ్లో ‘టీ కప్ప్పు’ ధుమారం appeared first on Visalaandhra .
విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఘంటసాల – ఆంధ్రప్రభ : విజనరీ లీడర్
How did Bunny miss Investing in Mumbai?
Icon Star Allu Arjun is one of the richest actors of Telugu cinema. His father and the entire Allu family made wise real-estate investments in and around Hyderabad. Allu Arjun is shooting for Raaka in the direction of Atlee and the entire shoot is planned in Mumbai and abroad. There is no shoot in Hyderabad […] The post How did Bunny miss Investing in Mumbai? appeared first on Telugu360 .
మద్యం సేవించి రోడ్డు దాటుతుంటే..
మద్యం సేవించి రోడ్డు దాటుతుంటే.. చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని సుభాని
Chandrababu Naidu at 76: The Architect of Modern Andhra Politics
On his birthday, N. Chandrababu Naidu stands tall as one of the most enduring and influential leaders in Indian politics. His journey spans more than four decades and reflects resilience, constant reinvention, and a sharp focus on development-led governance. Early Political Journey Naidu entered politics at a young age . He began his career with […] The post Chandrababu Naidu at 76: The Architect of Modern Andhra Politics appeared first on Telugu360 .
20 నుంచి జయచందర్ ఆల్ స్టార్స్ ట్రోఫీ ఖమ్మం , ఏప్రిల్ 20, (జనంసాక్షి) : తెలంగాణ క్రికెట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక పోటీకి రంగం సిద్ధమైంది. …
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు ప్రమాదం... భార్య కళ్ళెదుటే భర్త మృతి
మాదాపూర్: హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద కారు ఢీకొట్టడంతో భార్య కళ్ళెదుటే భర్త మృతి చెందాడు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైన శ్యామ్ రాజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఫొటోలు దిగుతున్నాడు. అదే సమయంలో డబ్ల్యుబి 06 బి 7003 అనే నంబరు బిఎండబ్ల్యు కారు అతివేగంతో భర్తను ఢీకొట్టింది. వెంటనే అతడిని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల ఏకంగా కేబుల్ బ్రిడ్జి మీద ఉండే లైటింగ్ సెటప్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. గత ప్రభుత్వంలో కేబుల్ బ్రిడ్జిపై నిత్యం పోలీసుల గస్తీ ఉండేదని, ఎవరైనా వాహనాలను నిలిపితే హెచ్చరించేవారని, ప్రస్తుతం పోలీసుల గస్తీ కనిపించడంలేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఒక పోలీస్ అక్కడ కాపాలాగా ఉంచాలని వాహనాదారులు డిమాండ్ చేస్తున్నారు.
పెళ్లి వేడుకల ఆనందాన్ని చూపించే పాట
అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘సుర సుర’ రిలీజ్తో ఆసక్తి మరింత పెరిగింది. ‘సుర సుర’ సంప్రదాయ పెళ్లి వేడుకల ఆనందాన్ని చూపించే ఒక పూర్తి సెలబ్రేషన్ సాంగ్గా అలరించింది. ఈ పాట అదిరిపోయే బీట్తో పాటు కలర్ ఫుల్ విజువల్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాట, చిత్రంలోని సాంస్కృతిక నేపథ్యాన్ని, వైభవాన్ని చూపిస్తోంది. జునైద్ కుమార్, అభే అందించిన సంగీతం ట్రైబల్ సౌండ్స్, ఫోక్ ఎలిమెంట్స్ను పవర్ ఫుల్ ఆర్కెస్ట్రేషన్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాటలోని రిథమ్ సినిమాటిక్ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్లగొండ గద్దర్ వంటి గాయకులు తమ తమ ప్రత్యేక గాత్రంతో పాటకు మరింత ఎనర్జీ అందించారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాట ఒక విజువల్ వండర్గా నిలుస్తోంది. భారీ సెట్లు, ఆకట్టుకునే కాస్ట్యూమ్స్, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ అన్నీ కలిసి ఈ పాటను ఒక గ్రాండ్ వేడుకలా మార్చాయి. విరాట్ కర్ణ తన ఎనర్జీతో కట్టిపడేశారు, నభానటేశ్, ఐశ్వర్య మీనన్ గ్లామర్తో మరింత ఆకర్షణను జోడించారు. ఈ పాట మొత్తం ఒక పెద్ద సంబరంలా, ఆనందోత్సవంలా సాగుతుంది.
విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించాలిబత్తుల నర్సింహులు ముదిరాజ్
జడ్చర్ల, ఏప్రిల్ 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులై, తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని …
ఆప్తమిత్రుడంటూ.. చంద్రబాబుకు మోదీ
చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇరాన్ ‘తౌస్కా’ వాణిజ్య నౌకను సీజ్ చేసిన అమెరికా
హోర్మూజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం వాషింగ్టన్: ఇరాన్ వాణిజ్య నౌక ‘తౌస్కా’ను అమెరికా సీజ్ చేసింది. దీనితో హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి, ఆ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఈఘటన చోటుచేసుకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.‘ఇరాన్ పతాకంతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న రవాణా నౌక […] The post ఇరాన్ ‘తౌస్కా’ వాణిజ్య నౌకను సీజ్ చేసిన అమెరికా appeared first on Visalaandhra .
నేడు అన్నా క్యాంటిన్లలో ఉచిత భోజనం
ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు విజయవాడలో పర్యటిస్తున్నారు
చేతబడిపై చర్యలు తీసుకోండి': బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు? #telugupost #bcci #factcheck #viralvideo
Chandrababu : ఫిట్ నెస్.. ఆరోగ్య రహస్యం.. నిత్యం యువకుడిగానే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
Free MMTS Proposal is Revanth Reddy’s Political Move to Target BJP?
The Telangana Government’s proposal for free travel on Hyderabad MMTS services is being seen as a sharp political move aimed at the BJP-led Centre. The state government has officially asked South Central Railway to introduce free travel for all passengers on MMTS trains. Railway officials replied that a draft MoU should be submitted first, after […] The post Free MMTS Proposal is Revanth Reddy’s Political Move to Target BJP? appeared first on Telugu360 .
చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: ప్రధాని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి, తనకు మంచి స్నేహితుడు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రశంసించారు. ప్రజాసేవలో బాబు దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు. సిఎం చంద్రబాబుకు ఎపి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ సిఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి మంత్రులు, టిడిపి కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'స్ఫూర్తిదాయక నాయకులైన మిమ్మల్ని 'నాన్న' అని పిలుచుకునే అదృష్టం తనకు దక్కింది' అని పేర్కొన్నారు. ప్రతి ఏడాది గడిచే కొద్దీ ప్రజాసేవ పట్ల బాబుకు ఉన్న అభిరుచి మరింత బలపడుతోందని, అనుభవం, వివేకం ఇప్పుడు ముందుండి నడిపించే నూతన శక్తితో సజావుగా మేళవిస్తున్నాయన్నారు. ప్రతిరోజూ చంద్రబాబు నుంచి నేర్చుకునే అవకాశం లభించినందుకు తాను అదృష్టవంతుడిని అని భావిస్తున్నానని, బాబు ఆలోచన స్పష్టత, దృఢత్వం, ప్రజల పట్ల అచంచలమైన నిబద్ధత తనకు మార్గదర్శకంగా నిలుస్తూనే ఉన్నాయని వివరించారు. చంద్రబాబు నిరంతరం మంచి ఆరోగ్యం, బలం కలిగి ఉండాలని, మరెన్నో సంవత్సరాలు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం వహించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్..
చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
గ్రీన్ ఛానల్ వాహనాలకు 'ఈ-పాత్' #VijayawadaTraffic #EPathApp #GreenChannel #TrafficPolice #AITracking
పవన్ కళ్యాణ్ కోసం.. ప్రత్యేక పూజలు..
పవన్ కళ్యాణ్ కోసం.. ప్రత్యేక పూజలు.. బంటుమిల్లి – ఆంధ్రప్రభ : రాష్ట్ర
Summer Effect : నిప్పులు కురిపిస్తున్న సూరీడు.. ఎన్ని రోజులంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
భార్యతో విభేదాలు.. ఎనిమిది మంది చిన్నారులను కాల్చిన తండ్రి
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది
అంతర్జాతీయ యానం ‘హైదరాబాద్ టు షికాగో’
తాజా కితాబ్: మనిషి ప్రాచీన కాలం నుండి సంచార జీవి. ఆ సంచార తత్వమే నాగరికత అభివృద్ధికి మూలమైంది. నేటి ఆధునిక యుగంలో ఉద్యోగ రీత్యా పిల్లలు విదేశాల్లో స్థిరప డుతుంటే, వారిని చూడటానికి వెళ్లే తల్లిదండ్రుల అనుభవాలు మరెందరికో స్ఫూర్తినిస్తున్నాయి. అటువంటి అనుభవాల మేళవింపే శాంతిశ్రీ బెనర్జీ గారి ఈ యాత్రా సంపుటి. ‘మానవ సారం అంతా సామా జిక సంబంధాల సమా హారమే‘ అన్న మార్క్ మాటలను నిజం చేస్తూ, రచయిత్రి తన ప్రయా ణంలో తారసపడ్డ ప్రతి ఒక్కరినీ ఆ త్మీయంగా పలకరించారు. క్యాబ్ డ్రైవర్ల కుటుంబ విశేషాల నుండి, మ్యూజియంలలో పరిచయమైన స్నేహశీలుర వరకు అం దరినీ ఈ పుస్తకంలో భాగం చేశారు. ఇది కేవలం భౌగోళిక ప్ర యాణం మాత్రమే కాదు, హృదయాల ప్రయాణం కూడా. కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ పుస్తకం ఒక ఉత్తమ గైడ్గా ఉపయోగపడుతుంది. ప్రవేశ రుసుములు, హోటల్ బిల్లుల వంటి ఆర్థిక వివరాలు కూడా ఇవ్వడం వల్ల, పర్యాటకులు తమ ప్రణాళిక ను సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. త్వరలో బాలా పుస్తక ప్రచురణలు నుండి ఈ పుస్తకం రాబోతోంది. ఈ పుస్తకం కేవలం ప్రదేశాల వివరణకే పరిమితం కాలేదు. మహిళా దృక్పథంతో కూడా రాశారు. ఈ కథనాల్లో మరో ఆసక్తికర అంశం రుచులు. బెర్లిన్లో పాకిస్తానీ, థాయ్ వంటకాలు, ప్రాగ్ లో నేపాలీ రుచులు, న్యూయార్క్లో కొరియన్, మెక్సికన్ వంటకాల గురించి ఆమె వర్ణించిన తీరు పాఠకుల నో రూరిస్తుంది. ఏ రెస్టారెంట్ ఏ వీధిలో ఉంది? అక్కడ ఏ పదార్థం బాగుంటుంది? అనే సూక్ష్మ వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. విదేశీ యాత్ర చేయాలనుకునే వారు చదువాల్సిన పుస్తకం. పుస్తకం పేరు : హైదరాబాద్ టు షికాగో (యాత్రా కథనాలు) రచయిత్రి : శాంతిశ్రీ బెనర్జీ,ప్రచురణ : బాలా పుస్తక ప్రచురణలు
Analysis: Are our Producers not Ready to Save Theatres?
The digital deals have turned out to be the major source of recovery for the producers. But the digital platforms have slashed down the deals and they are imposing new rules and restrictions which is leaving the producers in stress. Several industry bigwigs and analysts have suggested a eight-week OTT window for South films which […] The post Analysis: Are our Producers not Ready to Save Theatres? appeared first on Telugu360 .
సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం..
సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దేశ రక్షణ, సనాతన
అధర్మం అడుగుపెట్టిన అగాధ లోతుల్లో మౌనం మృత్యువుకు సాక్ష్యమై నిలిచింది నిశ్శబ్దం బానిసత్వానికి లక్ష్యమై మారింది గుండె గూటిలో నిద్రాణమైన నిప్పుకణికలా గళమెత్తుదాం.. గమ్యం వైపు దూసుకుపోదాం తమస్సు రాజ్యమేలుతున్న ఈ దుర్వేళలో నయనాల్లో వెలిగే నవకాంతి రేఖలా అణచివేత సంకెళ్లను తెంచే వజ్రాయుధంలా గళమెత్తుదాం.. చైతన్యపు జలపాతమవుదాం స్తబ్దతలో నిశ్శబ్దం నీరసించిపోతుంటే సత్యపు శరమై, ధర్మపు బావుటావై నవసమాజ నిర్మాణ శంఖారావమై గళమెత్తుదాం, కేతనం ఎగురవేద్దాం కళ్ళలో కసి, గుండెల్లో సెగ మౌనం వీడి గళమెత్తితే, అది ప్రళయ గర్జన! అన్యాయపు కోటలు బద్దలుకావాలి అణచివేత సంకెళ్లు తెంచుకోవాలి నివురుగప్పిన నిప్పువు నీవని చాటు ప్రశ్నించే గొంతుకై లోకాన్ని ఏలు నీ గొంతుక ఒక అక్షయ అస్త్రం నీ వాక్కు ఒక అజేయ యుద్ధం అది ప్రభాత భానుడి తొలి సంతకం గళమెత్తుదాం... గళమెత్తుదాం... ఈ అంధకారాన్ని చీల్చి... వెలుగులు నింపుదాం! - రాము కోలా దెందుకూరు
పాశికంటి సంపత్ కు ఆత్మీయ సత్కారం
పాశికంటి సంపత్ కు ఆత్మీయ సత్కారం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు
దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘నవత - కవిత‘ కవిత ఆధునిక కవిత్వంలోని అయోమయాన్ని (Obscurity) ఎండగడుతూ, కవిత్వానికి ఉండాల్సిన ని జాయితీని, స్పష్టతను చాటిచెప్పే బలమైన హెచ్చరిక. అర్థంలేని ఇమేజరీని, అస్పష్టమైన అనుభూతుల్ని, పాశ్చాత్య అనుకరణ ల్ని ‘కవిత్వం’గా భ్రమపడవద్దని కవి స్పష్టం చేశారు. కవిత్వం కేవలం పదాల పేర్పు కాదు, అది ఒక ఆల్కెమీ (Alchemy). అది కాళిదాసు నుండి శ్రీశ్రీ వరకు సాగిన ఒక నిరంతర చైతన్యధార అని గుర్తుచేశారు. కవిత్వం ‘ట్రాన్స్పరెంట్ చీకటి‘లా (గంభీరంగా) ఉన్నా పాఠకుడికి అనుభూతిని అందించాలి. చైతన్యాన్ని విస్తరింపజేస్తూ, చివరికి అందం - ఆనందం అనే పరమావధిని చేరాలన్న కవి ఆకాంక్ష ఏ కాలానికైనా వాంఛనీయమే. బాహ్య ఆడంబరాల కంటే హృదయాలను వెలిగించే ‘మౌలికత’(Originality) కవిత్వానికి ప్రాణమనేది కవి ప్రబోధం. పొసగని అనుకరణలలోంచి బైటపడి సొంత అనుభవం నుంచి, మనసు లోతుల్లోంచి కవిత్వం రావాలనే కవి సూచన బుడిబుడి అడుగులు వేస్తున్న పెన్నులకైనా, తలలు పండిన కలాలకైనా, శిరోధార్యమే. 60 ఏళ్ళు దాటినా మెరుపు తగ్గని యవ్వనం ఈ కవిత ప్రత్యేకత. (కొత్త శీర్షిక ప్రారంభం ) తెలుగు వచన కవిత్వంలో అనేక మంది ప్రముఖ కవు లు అద్భుతమైన కవిత్వాన్ని రాసారు.కవితా వస్తువు లోనూ, శైలిలోనూ ఎంతో వైవిధ్యాన్ని, నవ్యతను తీసుకురావడమే కాక, అనేక ప్రయోగాలను కూడా చేశారు. ఆధునిక కవితా ధోరణులు, వారు రాసిన కవిత్వంలో ప్రతిఫలించాయి. అవి వైయక్తిక అనుభూతులైనా, సామాజిక సంఘర్షణలైనా, తాత్విక వెతుకులాటలైనా కాలానికి తట్టుకుని నిలిచిన పాత కవితలు అనేకం ఉన్నాయి. ఒక కవిత అలా కాల చక్రాల కింద నలిగి పాతదైనా, ఇంకా దానికి కాలం చెల్లక, సమసిపోకుండా నిలబడిందని అంటే, ఆ కవిత ఇంకా మనకి స్ఫూర్తిని అందిస్తూనే వుందంటే, ఆ కవిత ప్రాముఖ్యత లేనిదిగా అయిపోయే పరిస్థితులు సమాజంలో ఇంకా రాకపోయి ఉండవచ్చు. లేదా మనిషి అంతరాంతరాళాలను, హృదయాన్ని తాకగలిగిన, కదిలించ గలిగిన శక్తిని అది ఇంకా కోల్పోకపోవడం వల్ల కూడా కావచ్చు. కవులు కవులుగా పరిణామం చెందే, ఇతరుల రాసిన కవిత్వాన్ని ఇష్టంగా చదువుకునే కాలంలో వాళ్ళని ప్రభావితం చేసిన, లేదా వాళ్ళు ఎంతగానో ఇష్టపడ్డ కవితలు తప్పకుండా కొన్ని ఉండే ఉంటాయి. అలా ఇవాళ్టి యువ కవులు ఇష్టపడ్డ, ఇంకా పాతపడని ఒక కవితను వారి మాటల్లోనే, మెహాఫిల్ పరిచయం చేయాలని అనుకుంటున్నాం. అనేక మంది ముందు తరం కవులు ఉన్నారు. కాగా 1985 కి పూర్వం రాసిన కవుల కవిత్వాన్ని ఒక కాల నియతికోసం అనుకోవడం జరిగింది. తనకు నచ్చిన కవితను ఈ వారం సాంబమూర్తి లండ పరిచయం చేస్తున్నారు. మెహిఫిల్, గెస్ట్ ఎడిటర్ నవత - కవిత మిత్రమా! కవిత వున్నప్పుడే నవత రాణిస్తుంది అసలు కవితలోనే నవత కూడా వుంది కాని,మోడరన్ గా వుందామనీ, ఏదో అందామనీ తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని అర్థంలేని ఇమేజరీతో కలగాపులగపు వర్ణనలతో డిలాన్ థామస్ కు చేతగాని అనుకరణలతో ఒక దేశం, నిర్దేశం లేని వాక్యాల వికారంతో ఎందుకు బాధిస్తావు నన్ను, బాధపడతావు నువ్వు! ‘రాత్రి రెండో జాములో రెండు కత్తుల్ని తిన్నాను గుండెమీద, గుండుమీద సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసుకున్నాను నా పెదవుల్ని కత్తిరించి నీ వీపుమీద అతికాను ఈ నిమిషంలో విషంలో నా నేత్రాలు సువర్ణ ఝషాలు‘ ఇలా రాయడం కొత్తగా, గమ్మత్తుగా ఉంటుంది కాని, ఇది నాన్సెన్స్ ఇది పసితనం ప్లస్ వెర్రితనం ఇంటూ డికడెన్స్ ఈ కషాయం వికటిస్తుంది ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుంది కవిత్వంలో అబ్స్క్యూరిటీ కొన్ని సందర్భాలలో ఉండొచ్చును కాని, పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి హత్తుకోవాలి అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి, నిన్ను పలకరించాలి కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి,కదిలించాలి ప్రతి మాటకి శక్తి ఉంది,పదును ఉంది ప్రతి చిత్రణకీ అర్థం ఉంది, ఔచిత్యం ఉంది గులకరాళ్ళ డబ్బా మోగించి గొప్ప సంగీతం అని దబాయించకు అలిగి నన్ను శపించకు, అన్నా; నీ మీద నాకు కోపం లేదు. గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు ఖద్దరు ధరించిన ప్రతివాడూ గాంధేయుడుకాడు ఆధునికత ఉన్నంత మాత్రాన ప్రతిదీ శిరోధార్యం కాదు ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజవడు అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్ భావం పోయెట్రీ అవదు కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు కృష్ణశాస్త్రికి తెలుసు,శ్రీశ్రీకి తెలుసు. ఈ కాలంలో బ్రతుకు, ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించు ఇంటికున్న కిటికీలన్నీ తెరిచి అన్ని పవనాల్నీ ఆహ్వానించు నువ్వు చెప్పేది ఏదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి - చించుకుని రావాలి మాటలు పేర్చడం కవిత కాదు, మంత్రం, తంత్రం అసలే కాదు మళ్లీ యీనాడు చిత్రకవితల్నీ, అయోమయ బంధాల్నీ పునరుద్ధరించకు నిగ్రహ ప్రగ్రహాలులేని భావాశ్వాలని బరి మీద వదలకు అన్నా! కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి విస్తరించాలి చైతన్య పరిధి అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం, ఆనందం దాని పరమావధి. రచన : బాలగంగాధర్ తిలక్ సాంబమూర్తి లండ. వృత్తి: టీచర్. ఊరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒoకులూరు. అమ్మ(సుమిత్ర) నిష్క్రమణ పూడ్చలేని ఖాళీని సృష్టిస్తే కవిత్వం తన ఒడిలో చోటిచ్చి గుండెను నిమిరింది. వెలితిలోంచి వెలుగుల వైపు న డుస్తున్న అక్షరంగా నాది దాదాపు పుష్కరకాలపు నడక. బా ల్యంలో నాన్న (రామస్వామి) నేర్పిన అక్షరం, లాంతరు వెలుగులో అర్ధరాత్రి వరకూ చదివి వినిపించిన సాహిత్యం, రాయ ని బతుకు కథలు చెప్పే సముద్రం, సిక్కోలు వలస పక్షుల నిత్య రద్దీ, శోకతీరం లాంటి ఉద్దానం.. నన్ను కదిలించాయి. కవిత్వం కమ్మన్నాయి. 2020లో తొలికలల సంపుటి గాజు రెక్కలతూనీగ, 2022లో నాలుగు రెక్కలపిట్ట, 2024లో ‘ఆమెకు మిగలని ఆమె‘(కవిత్వం) ప్రచురించబడ్డాయి. - సాంబమూర్తి లండ
నేడు సింగపూర్ కు మంత్రి నారాయణ బృందం
ఈరోజు మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు
గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్
హిప్ కంపెనీ బేబీ ఫుడ్ అమ్మకాలు నిలిపివేత
హిప్ కంపెనీ బేబీ ఫుడ్ అమ్మకాలు నిలిపివేసింది
ఆ విధంగా సిక్స్ లు కొట్టాలంటే ధైర్యం కావాలి: శ్రేయస్ అయ్యర్
హైదరాబాద్: ఐపిఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ పంజా విసురుతోంది. ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి ఒక మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది. లక్నోపై 54 పరుగుల తేడాతో విజయదుదుంభి మోగించింది. రెండో వికెట్పై ప్రియాన్షు ఆర్యా-కూపర్ కనోలీ 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో ఆర్యా, కనోలీ బౌండరీల వర్షం కురిపించాడు. ఆర్యా 37 బంతుల్లో తొమ్మిది సిక్స్లు, నాలుగు ఫోర్లతో 93 పరుగులు చేశాడు. కనోలీ కూడా 46 బంతుల్లో ఏడు సిక్స్లు, ఎనిమిది ఫోర్లతో 87 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆర్యా మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా ప్రియాన్షుపై శ్రేయస్ అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మిడిల్ ఓవర్లో ఆ ఇద్దరు భాగస్వామ్యం అద్భుతంగా ఉందన్నారు. బ్యాక్ పుట్ మీద ఫాస్ బౌలర్లు వేసిన బంతులను సిక్స్లు కొట్టిన తీరు మ్యాచ్కే హైలెట్గా నిలిచాయని ప్రశంసించారు. ఐపిఎల్లో ఎవరు ఎక్కువగా సిక్స్లు కొడుతారో వారికే తన బ్యాట్ను బహుమతిగా ఇస్తానని చెప్పానని గుర్తు చేశాడు. ఎలా పడితే అలా కొడితే ఔటయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో షాట్లు ఎంపిక బాగుందని చెప్పాడు. మా కుర్రాళ్లు ఆడిన తీరు చాలా బాగుందని కితాబిచ్చాడు. ఆటగాళ్లకు స్వేచ్చనిస్తే ఫలితం ఇలాగే వస్తుందని తెలియజేశాడు. కోచ్ రికీ పాంటింగ్ కుర్రాళ్లలో స్ఫూర్తి నింపడంతో సలహాలు సూచనలు బాగా పని చేస్తున్నాయని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు. బ్యాటింగ్ అనుకూలమైన పిచ్పైనా అద్భుతంగా బౌలర్లు బౌలింగ్ చేశారన్నారు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ ఎలా చేయాలో మా బౌలర్లకు బాగా తెలుసునని, వారికి ఏమీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు.
ఆశా కే కయీ సామాన్ హమారే పాస్ పడేహై
ఆ గానం వెనుక గాధలెన్నో.. ఆశా భోస్లే మరణంతో హిందీ సినీ ప్రపంచంలో అలనాటి బంగారు శకం ముగిసింది. ఆమె వదిలి పెట్టి వెళ్లిన వేల పాటలు దేశంలో ఎక్క డో ఓ మూల ఎప్పటికీ అలా వినిపిస్తూనే ఉంటాయి. తన ఎనభై ఏళ్ళ కేరీర్ లో 20 భాషలలో 12,000లకి పైగా పాటలు పాడిన ఆశా భోస్లే జీవితం అంతా వివాదాల మయమే, మర్రి చెట్టు నీడన ఏ వృక్షం పెదగదన్నట్లు అక్క ఛాయలో తాను ఎదగలేనని అర్ధం చేసుకుని, తన అస్థిత్వం కోసం ఆమె నిరంతరం కృషిచేయాల్సి వచ్చింది. వివాదాస్పదమయిన వ్యక్తిగత జీవితం, రెండు వివాహాలు, ఇద్దరు భర్తలను కోల్పోవడం, ముదిమి వయసులో ఇద్దరు పిల్లలను కోల్పోవడం, అక్క లతా మంగేష్కర్ తో పెరిగిన దూరం, వ్యక్తిగత వివాదాలు, బెడిసిన మానవ సంబంధాలు, ఇవన్నీ ఆమె పాడే శక్తిని ద్విగుణీకృతం చేసాయి తప్ప, ఆమె ఎక్కడా డీలా పడలేదు. 92 ఏళ్ల ఆమె జీవితాన్ని పరిశీలిస్తే సంగీతాన్నీ జీవితంలో ప్రధమ స్థానంలో పెట్టి మిగతావన్నీ వెనక్కు నెట్టివేసిన ఆమె ఉక్కు సంకల్పం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశాకు సినీ అవకాశాలు అంత సులువుగా రాలేదు. తానే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లింది. హిమాలయ శిఖరంలా ఎదిగిన అక్కతో పోటిపడాల్సి వచ్చినప్పుడు ఒక నిశిత పరిశీలనతో అక్కను గమనిస్తూ తన కెరీర్కు బాట వేసుకుంది. లత పాడని, పాడడానికి ఇష్టపడని పాటలనే స్వీకరించి, వాటి ద్వారానే తానేంటో నిరూపించుకుంది. లత ఏ గ్రేడ్ సినిమాలలో పాడుతుంటే, ఆశ బీ గ్రేడ్ సినిమాలను ఎంచుకుని ఆ పాటలకే క్లాస్ను ఆపాదింంది. అక్క విభేదించిన సంగీత దర్శకులు, గేయ రచయితల పాటలను ఏరి కోరి పాడింది. అంతరించిపోతున్న గీతా దత్, శంషాద్ బేగంల కెరియర్లను తనకు అవకాశాలుగా మార్చుకుంది. కఠినమైన సినీ రంగంలో తన ఉనికి చాటడానికి ఆమె ఎన్నుకున్న మార్గాల పట్ల ఎంతమందికి అభ్యంతరాలు ఉన్నా, తన ప్రతిభను ప్రతి పాటతో సాన పెట్టుకుంటూ అద్భుతమైన గీతాలను ప్రజలకు అందించింది ఆశా. ఎనిమిది దశాబ్దాల ఆశా బోస్లే కెరీర్ లో రెండు జాతీయ అవార్డులు, నాలుగు BFJA అవార్డులు, పద్దెనిమిది మహారాష్ట్ర రాష్ట్ర అవార్డులు, ఒక జీవిత సాఫల్య పురస్కారంతో సహా తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా రికార్డు స్థాయిలో ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక పురస్కారాలు ఆమె సొంతమయ్యాయి.రెండు గ్రామీ నామినేషన్లు కూడా ఈమెను వరించాయి. 2000వ సంవత్సరంలో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో, పద్మవిభూషణ్ సత్కారాలను అందుకున్న ఆశా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికారడ్స్ 2011లో సంగీత చరిత్రలో అత్యధికంగా రికార్డ్ చేయబడిన కళాకారిణిగా శాశ్వత కీర్తిని సంపాదించుకుంది. ఆ రోజుల్లో మధుబాల లాంటి నటిమణులు లతే తమకు పాడాలి అనే కండిషన్తో సినిమాలుఒప్పుకునేవారు. ఆ సమయంలోనే “ఆయి యే మెహర్బాన్”, “అచ్ఛాజీ హరి చలో మాన్ జావోన్ లోమాన్జావోనా”, “ రాత్ సర్ద్ సర్ద్ హై” లాంటి పాటలు పాడి మధుబాల చిలిపితనాన్ని గాత్రంలో పలికించగల దిట్ట తానే అని నిరూపించుకుంది ఆశా. కామెడీ ట్రాక్లకు ఆమె పరిమితం అయిపోయిందనుకున్నంతలోనే “అబ్ కే బరస్ భేజ్ భైయా కో బాబుల్” అంటూ బందినీలోని పాటతో ఆశ్చర్యపరిచింది. “చోడ్ దో ఆంచల్ జమానా క్యా కహేగా” లాంటి పాటలతో తన ప్రత్యేకమైన స్టైల్ను చాటుకుంది. సాహిర్ లుథియాన్వీతో లతకున్న వైరం ఆశాకు ఎంతో ఉపయోగపడింది. అప్పటిదాకా సినిమాలో ఒకటో రెండో పాటలు పాడుతూ కెరియర్లో సాగితున్న ఆశ నయాదౌర్ సినిమాలో అన్నీ పాటలు పాడి ప్రముఖ గాయనిగా ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత బి.ఆర్. చోపా సినిమాలన్నిటిలో ఆశా ఉండాల్సిందే. ఆమె పాడిన పాటలన్నీ సూపర్డూపర్ హిట్లుగా నిలిచాయి. సినిమాలలో ట్రెండ్ మారుతున్న కొద్దీ తన గాత్రాన్ని దానికి అనుకూలంగా మార్చుకుంటూ హెలెన్ నటుల కేబరే ట్రాక్లకు, ఆశా పారేఖ్ పాత్రలకు గొంతుకగా మారి ఆశా అందించిన పాటలకు కొదవేలేదు. “తీసరీ మంజిల్” సినిమాలో హీరోయిన్ ఆశాపారేఖ్కు,వాంప్ పాత్రలో ఫైన్కు తానే పాడి తన గాన వైవిధ్యాన్ని చాటుకుంది. షమ్మీకపూర్ కెరీర్లో రఫీ ముఖ్యుడయితే, ఆశా పారేఖ్ మ్యూజికల్ హిట్లుగా వెనుక ఉన్నది. ఆశాభోస్లేనే. హెలెన్కు సుమారు 270 పాటలు పాడింది ఆశా. “పియ తూ అబ్తో “ఓ హసీనా జుల్ఫో వాలీ”, “ఏ మేరా దిల్”’ లాంటి పాటలను, అందులో ఆశా విరుపులను ఎవరు మర్చిపోగలరు. బర్సాత్కి రాత్లో “నాతో కార్వాన్ కీ హై”, “చౌదవీ కా చాంద్” సినిమాలో “షర్మా కె అగర్ పర్దానషీన్” లాంటి ఖవ్వాలీలకు ఆశా మొదటి ఎన్నిక కాదు. ఆ పాటలతో ఉర్దూ భాషీయులను సైతం మెప్పించి ఉమ్రావ్ జాన్లో జగహ్ హై దోస్తో”, “దిల్ చీజ్ క్యా హై” గజల్స్ను ఆశానే పాడాలేమో అన్నంతగా జనానికి చేరువయింది ఆశా. ఓ.పి నయ్యర్ ఆశా కోసం తనను పరిశ్రమకు పరిచయం చేసిన గీతాదత్నే పెట్టేశారు. లత అంటే ప్రాణంపెటే ్ట ఎస్. డి.బర్మన్ వైవిధ్యంతో కూడుకున్న కొన్ని పాటలకు ఆశాను ఎన్నుకోక తప్పలేదు. “హే నిగానే మస్తానా” పాటలో ఆశకు హమ్మింగ్ పదాలు లేవు. ఆ పాటను కిశోర్కుమార్తో ఆశ మెప్పించిన విధానం మర్చిపోలేం. తన గాత్రానికి భాష అక్కర్లేదని కవితకు అందని భావాలను తాను అలవోకగా పండించగలనని ఈ పాటతో నిరూపించుకుంది ఆశ. నటి సాధన కెరీర్తో ముడివేసుకుని ఉంటే, “అభీ నా జావో “యె పర్దా హటావో”, “బహుత్ ఘక్రియా”, లాంటి పాటలతో ఆశ ఆమె కరీర్కి ఊతం అయ్యారు. లతను తప్ప మరెవ్వరినీ ఇష్టపడని మదన్ మోహన్ కూడా ‘మెరా సాయా’ సినిమాకు అన్ని పాటలు లతతో పాడించినా ‘ఝుంకా గిరారే పాటకు ఆశానే ఎన్నుకున్నారంటే, అంతటి పోటీ, అంతటి ప్రతికూలత నడుమ కూడా ఆశా మార్కు కనిపించి తీరుతుంది. “యె రాతే యె మౌసం నదీ కా కినారా”, “చురాలియా హై”, “జానెజా ఢూంఢతా ఫిర్ రహో”, “ఎక్ మై ఔర్ ఏక్ తూ” “ఓ సాథి చల్”, “దం మారో దం”, “తన్హా తన్హా యహా పే పాటల దాకా ఆశా ప్రస్థానాన్ని గమనిస్తే అన్ని దశాబ్దాల హిందీ పాట పరిణామంలో ఒదిగిపోగలిగిన ఓ ప్రతిభాశాలి కనిపిస్తుంది. దుబాయ్లో హోటళ్లను తనపేరుతో తెరచిన మొట్టమొదటి బాలీవుడ్ దిగ్గజం కూడా ఆశానే. ఆశాను ప్రేమించే వాళ్లెంతమంది ఉన్నారో ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఓ.పి.నయ్యర్, ఆర్. డీ బర్మన్తో ఏర్పరుచుకున్న బంధాలను వ్యతిరేకించే అంతే ఉన్నారు. మహమ్మద్ రఫీ తన ముందు ఆవరేజ్ గాయకుడిని ప్రకటించిన ఆశాలోని అతి ఆత్మావిశ్వాసాన్ని నిరసించిన వాళ్ళూ ఉన్నారు. ఆమె అందించిన అపురూపమైన పాటలను ఆస్వాదించకుండా ఉండడం వీరికీ అసాధ్యం. “మేరా కుచ్ సామాన్ పాస్ హై”... ఓ రాత్ బుఝాదో మేరా వో సామాన్ లౌటాదో” అని తనను విమర్శించే వారిని ఆమె ఎప్పటికీ తనపాటతో సవాలు చేస్తూనే ఉంటుంది. ఆమెను విమర్శించినా, ద్వేషించినా మనజీవితంలో భాగం అయిపోయిన ఆశా, పాట ఉన్నంతవరకు జీవించే ఉంటుంది. - పి.జ్యోతి
Ys Jagan : రేపటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులోనే
రేపటి నుంచి మూడు రోజుల పాటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు.
మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం
మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Gold Price Today : భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. వెండి కూడా అంతే
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.
ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ వేగవంతం
ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ వేగవంతం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలోని
మామిడి సీజన్కు యుద్ధం షాక్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో
Disastrous Weekend for Telugu Cinema
Naga Shaurya’s Bad Boy Karthik, Thiruveer’s Papam Prathap and Kiran Abbavaram’s first production Thimmarajupalli TV released on Friday. All the three films opened on a poor note and received mixed response from the audience. Papam Prathap fared better than other films. Papam Prathap and Thimmarajupalli TV were made on a strict budget and they recovered […] The post Disastrous Weekend for Telugu Cinema appeared first on Telugu360 .
Revanth Reddy : నేడు భూపాలపల్లి జిల్లాకు రేవంత్
నేడు భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు
నేడు సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం ప్రారంభమయింది
డ్వాక్రా సభ్యులకు అదనపు రుణ సదుపాయం
డ్వాక్రా సభ్యులకు అదనపు రుణ సదుపాయం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మహిళలను
యువతి ప్రాణం తీసిన సెల్ ఫోన్ పిచ్చి
అమరావతి: సెల్ఫోన్ చూడొద్దని అక్కా, బావ మందలించినందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు మితాజెన్-అజయ్ కుమార్లు రాజంపేటలో నివసిస్తున్నారు. మితాజెన్ చెల్లెలు కూడా ఈ దంపతులతో కలిసి ఉంటుంది. అక్కా-బావ హోటల్లో పని చేస్తుండగా చెల్లెలు మాత్రం సెల్ఫోన్ ఎక్కువ వీక్షిస్తుండడంతో పలుమార్లు మందలించారు. సెల్ఫోన్ మాయ నుంచి ఆమె బయటకు రాకపోవడంతో ఫోన్ను అక్కాబావ పగులగొట్టారు. యువతి మానస్థాపానికి గురై రూమ్లో ఉరి వేసుకుంది. వెంటనే దంపతులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి
అమెరికాలోని లూసియానాలో కాల్పులు జరిగాయి
Fact Check: Viral CSK ‘Black Magic’ Complaint Letter is Fabricated
A video from the IPL 2026 match between Sunrisers Hyderabad and Chennai Super Kings is circulating on social media. It shows a fan in the stands of the Rajiv Gandhi International Stadium in Hyderabad on Saturday appearing to perform a “black magic” act involving a lemon. In the next moment, the camera shifts to the field where SRH bowler Sakib Hussain delivers a fast, full-length ball that goes on to hit the stumps of CSK batter Shivam Dube. Amid this, A letter circulating on social media claims that IPL team Chennai Super Kings (CSK) complained about supernatural practices and black magic during their match against Sunrisers Hyderabad (SRH) on April 18. The match, played at Uppal Stadium, saw SRH defeat CSK by 10 runs after successfully defending a total of 194 runs in a closely fought contest. The letter claims that some people in the crowd used “supernatural” and unfair practices during the April 18 match against SRH. It says these actions, including black magic and disturbing behaviour, affected the players’ performance and well-being. Haha What the Hell is This ? Is this really true? KAALA JADU چنائی نے آفیشل لیٹر لکھ دیا ہے ان پر حیدرآباد کے لوگوں نے کل کے میچ پر کالا جادو کیا ہے @ChennaiIPL pic.twitter.com/jnr8xZEpj6 — Aqsa Farooq (@Aqsa_Farook) April 19, 2026 You can find the screenshot below. Fact Check: The claim is false and the viral letter is fabricated. There is no official evidence or confirmation from CSK or the BCCI. To verify the claim, we conducted an investigation and searched for relevant keywords, but did not find any credible news on any prominent media platform. The letter is dated April 19th, for this date, there are no posts about this letter on Official social media handles of CSK . We examined the viral letter and found several inconsistencies that raise doubts about its authenticity. Wrong parent company name: The letter mentions CSK’s parent company as “Chennai Super Kings Private Limited,” which is incorrect. The correct name is Chennai Super Kings Cricket Limited (CSKCL), as per official company records. Incorrect recipient address: The letter is said to be addressed to the BCCI but only mentions Wankhede Stadium as the office address, which is wrong. The official BCCI address is 4th Floor, Cricket Centre, Wankhede Stadium, ‘D’ Road, Churchgate, Mumbai – 400020, India. Incorrect spelling of name: The CEO’s name is written as “Kasi Viswarathan” at the end of the letter, while the signature appears as “Viswanathan.” The correct spelling is Kasi Viswanathan. These errors make the letter look unprofessional and suggest it may be fake or created to imitate official communication. Hence we found that the claim that CSK wrote to the BCCI alleging “black magic” behind their defeat is completely false. The viral letter circulating on social media is fabricated, and there is no official confirmation or evidence supporting it.
పాలు పొంగాయని గొడవ... ప్రాణం తీసుకున్న భర్త
అమరావతి: దంపతుల మధ్య పాల విషయంలో గొడవ జరగడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీనగర్లో వెంటకసుబ్బయ్య(53), అనురాధ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వెంకటసుబ్బయ్య కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్టవ్పై పాలు పొంగిపోవడంతో భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయిక చేరుకోవడంతో భార్య ఇంటి బయట కూర్చుంది. భర్త ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కాసేపటికి భార్య ఇంట్లోకి వెళ్లగా భార్య ప్యాన్కు వేలాడుతుండడంతో కేకలు వేసింది. స్థానికులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
IPL 2026 : అవేం సిక్స్ లు రా సామీ.. ఛీర్ గర్ల్స్ కు కూర్చునే టైం లేదుగా?
చండీగఢ్ లో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లోనూ పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాన్ని చూసింది
ముంబైకి సవాల్.. నేడు గుజరాత్తో పోరు
అహ్మదాబాద్: ఐపిఎల్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్ ముంబై ఇండియన్స్కు సవాల్గా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. క్వింటన్ డికాక్ ఫామ్లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. పంజాబ్తో జరిగిన కిందటి మ్యాచ్లో డికాక్ అజేయ శతకంతో కదంతొక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ముంబై భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. బౌలింగ్ వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, తిలక్ వర్మ తదితరుల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య తన పాత్రను సమర్థంగా నిర్వర్తించలేక పోతున్నాడు. ఇలాంటి స్థితిలో ముంబైకి వరుస ఓటములు తప్పడం లేదు. గుజరాత్ ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో గెలిచింది. ఈసారి కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది.
North Korea : ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం.. అధికారిక ప్రకటన
ఉత్తర కొరియా సోమవారం క్లస్టర్ బాంబు వార్హెడ్లతో బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు ప్రకటించింది
America - Iran Talks : రేపు అమెరికా - ఇరాన్ ల మధ్య రెండో దఫా చర్చలు
అమెరికా - ఇరాన్ ల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి
అజహర్, కోదండరాం పేర్లు ఆమోదించండి
గవర్నర్ కోటా ఎంఎల్సిలపై గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసిన సిఎం రేవంత్ సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయినందున ఆమోదముద్ర వేయాలని వినతి మంత్రిగా అజహర్ పదవి చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు మాసాలు గవర్నర్ ఆమోదించకపోతే పదవి కోల్పోయే ప్రమాదం విద్యారంగ సమస్యలపై గవర్నర్తో సిఎం చర్చ మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రికి సూచించిన గవర్నర్ మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు నెలలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గవర్నర్తో సిఎం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ కోటా ఎంఎల్సిలుగా ప్రొఫెసర్.కోదండరామ్, అజారుద్దీన్ పేర్లు ఆమోదించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సిఎం రేవంత్రెడ్డి కోరారు. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ ప్రస్తుతం అజారుద్దీన్ మంత్రి కొనసాగుతున్నారు. ఆయన మంత్రి పదవి చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు నెలలు పూర్తి కానుంది. మంత్రిగా ఉన్నవారు శాసనసభ లేదా శాసనమండలిలో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ పేరును గవర్నర్ ఆమోదించకపోతే ఈ నెల 30 తర్వాత ఆయన మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సిఎం రేవంత్రెడ్డి గవర్నర్ను కలిసినట్లుగా తెలిసింది. గతంలో న్యాయస్థానంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయినందున, తక్షణమే ఆమోదముద్ర వేయాలని సిఎం రేవంత్రెడ్డి గవర్నర్ను కోరారు. కాగా, న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా అనే సందేహాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయ నిపుణులు గవర్నర్ వివరించినట్లు సమాచారం. విద్యారంగానికి సంబంధించిన అంశాలపై చర్చ విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాలపై సిఎంతో గవర్చర్ చర్చించారు. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సిఎంతో భేటీ సందర్భంగా గవర్నర్ సూచించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. జూన్ 12న ఎల్బి స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై గవర్నర్ సిఎంతో చర్చించారు. గవర్నర్ చేసిన ప్రతిపాదనల పట్ల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
నేడు కాటారంలో సిఎం రేవంత్ బహిరంగ సభ..
మధ్యాహ్నం కాళేశ్వరానికి సిఎం రేవంత్ ముక్తీశ్వరస్వామి దర్శనం, ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన తరువాత మేడిగడ్డకు ముఖ్యమంత్రి బ్యారేజీ పరిశీలన, అధికారులతో సమీక్ష రోడ్డు మార్గంలో కాటారం మీదుగా నస్తూర్పల్లి సభకు సభా వేదికపై ‘రైతు భరోసా’ రెండో విడత నిధులు విడుదల బహిరంగ సభలో ప్రసంగం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల, శ్రీధర్బాబు రైతుల ఖాతాల్లో జమకానున్న రూ.15వేల కోట్లు మనతెలంగాణ/ హైదరాబాద్/ జయశంకర్ భూ పాలపల్లి/ కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సిఎం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని, కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డ డ్యామ్ సైట్ను సిఎం పరిశీలించనున్నారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సిఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి నేరుగా కాటారం మండలం నస్తురపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకోనున్నారు. బహిరంగ స భ వేదికగా సిఎం రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం సిఎం రేవంత్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల రైతులకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ సం కల్పం అని, రైతు సమక్షంలో రైతు భరోసా వేసేందుకు కాటారం మండలాన్ని ఎన్నుకోవడం జరిగిందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్ది ళ్ళ శ్రీధర్బాబు అన్నారు. ఈ నెల 2౦న భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్రెడ్డితో కలిసి వీరు మండలంలోని నస్తూర్పల్లిలోని సభాస్థలాన్ని, హెలీప్యాడ్ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం రైతులకు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమచేయడం జరిగిందన్నారు. రేపు రైతుల సమక్షంలో రూ.15 వేల కోట్లు రైతుల ఖా తాలో జమ చేస్తామన్నారు. సిఎం రేవంత్ కాళేశ్వ రం దేవస్థానం ఆలయాభివృద్దికి శంకుస్థాపన చే స్తారని, మేడిగడ్డ సందర్శన అనంతరం రైతు భరో సా విడుదల చేస్తారని తెలిపారు. ఇచ్చిన మాటల కు అనుగుణంగా ప్రతి ఎకరానికి ఏటా రెండు ద ఫాలుగా రూ.12 వేల రైతు భరోసా విడుదల చేసి న రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు తెలిపారు.
నేడు జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు జెఇఇ మెయిన్ 2 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా, సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జెఇఇ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు జరగగా, ఫిబ్రవరి 16న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
అనుమతినిచ్చి.. కాల్పులు జరుపుతారా?
మీ జాబితాలో మా నౌక పేరు రెండోది? కాల్పులు ఆపండి హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌక నుంచి ఆర్తనాదాలు కలకలం సృష్టిస్తున్న ఆడియో దుబాయ్: హార్మూజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల సమయంలో ఒక నౌక నుంచి ఐఆర్జీసి నేవీకి అత్యవసర సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో బయటకు వచ్చింది. ప్రయాణానికి అనుమతి ఇచ్చిన తరువాత ఇరాన్ దళాలు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వినిపించడంతో, భారత జెండా కలిగిన ట్యాంకర్ నుంచి వెలువడిన ఆర్తనాద ఆడియో బయటకు రావడం కలకలం రేపింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న నౌకలు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నౌకా రవాణాను ట్రాక్ చేసే సముద్ర నిఘా సంస్థ ‘ట్యాంకర్ ట్రాకర్స్’ దీన్ని ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది. భారత జెండా కలిగిన ట్యాంకర్ నుంచి వెలువడిన ఆడియోలో, హార్మూజ్ జలసంధిలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాల సమయంలో జరిగిన సంభాషణ రికారైై్డైంది. ఇరాన్ దళాలు మార్గం దాటేందుకు ప్రయత్నించిన రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ ఆడియో సూచిస్తోంది. ఆ ఆడియోలో సన్మార్ హెరాల్డ్ అనే మోటార్ ట్యాంకర్ కెప్టెన్ అత్యవసరంగా ఇలా పిలుపునిచ్చినట్టు వినిపిస్తోంది: సెపాహ్ నేవీ! సెపాహ్ నేవీ! ఇది మోటార్ ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్! మీరు నాకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు! మీ జాబితాలో నా పేరు రెండోది! మీరు అనుమతి ఇచ్చారు! ఇప్పుడు మీరు కాల్పులు జరుపుతున్నారు! దయచేసి మాకు వెనక్కి తిరిగే అవకాశం ఇవ్వండి! ఈ ఆడియో వెలుగులోకి రావడం కంటే ఒక రోజు ముందే, భారత జెండా కలిగిన రెండు వాణిజ్య నౌకలు.. వాటిలో ఒకటి సూపర్ ట్యాంకర్.. శనివారం హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కాల్పులకు గురయ్యాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సిబ్బంది కాల్పులు జరపడంతో నౌకలు వెనుదిరిగినట్లు అధికారులు తెలిపారు. సంఘటన సమయంలో సూపర్ ట్యాంకర్ దాదాపు 20 లక్షల బ్యారెల్ల ఇరాకీ చమురును మోస్తున్నట్లు వెల్లడించారు. ఆడియో ఆధారాలు ప్రకారం, నౌకలను పశ్చిమ దిశగా మళ్లించే సమయంలో ఐఆర్జీసీ గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. యునైటెడ్ కింగ్డమ్ సముద్ర వాణిజ్య కార్యకలాపాల సంస్థ (యూకేఎంటీవో) కూడా హార్మూజ్ జలసంధిలో ఒక ట్యాంకర్పై రెండు ఐఆర్జీసీ గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు ధృవీకరించింది. ఇంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం, కేశ్మ్ దీవి, లారక్ దీవి మధ్య ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. దీంతో నౌకలు ప్రయాణాన్ని నిలిపివేశాయి. ఒక కంటైనర్ నౌక కూడా ఈ ఘటనలో దెబ్బతిన్నట్లు సముద్ర భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల మధ్య, ఆ ప్రాంతంలో ఉన్న అనేక నౌకలకు వీఎచ్ఎఫ్ ప్రసారాల ద్వారా హార్మూజ్ జలసంధి పూర్తిగా మళ్లీ మూసివేయబడింది అనే హెచ్చరికలు అందాయి. ప్రసారంలో ఇలా హెచ్చరించారు: అమెరికా ప్రభుత్వం చర్చలలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడంతో, ఇరాన్ హార్మూజ్ జలసంధిని పూర్తిగా మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఏ దేశానికి చెందిన నౌకలైనా ఈ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ రాయబారిని పిలిపించి అధికారికంగా నిరసన తెలిపింది. సంఘటనలో పాల్గొన్న నౌకల్లో ఒకటి సన్మార్ హెరాల్డ్ అని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. నౌక, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా స్పష్టం చేశాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఉన్నతాధికారి, న్యూఢిల్లీ ఆందోళనలను ఇరాన్ అధికారులకు తెలియజేయాలని రాయబారిని కోరారు. అలాగే భారత నౌకలకు సురక్షిత రవాణా త్వరగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన రాయబారి, ఈ అంశాన్ని తక్షణం తమ ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత నౌకలు, నావికుల భద్రతపై షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ (డీజీ షిప్పింగ్) కచ్చితంగా పర్యవేక్షణ కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. ఇక భారత్లో ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ ఈ ఘటనపై వచ్చిన ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు. తాను ఈ సంఘటన వివరాల గురించి తెలియదని, ఇరాన్- భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని తెలిపారు. ఇరాన్, భారతదేశం మధ్య సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయి. మీరు చెప్పిన ఈ ఘటన గురించి నాకు వివరాలు తెలియవు. ఇది సానుకూలంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
సైబర్ మోసాల నెట్వర్క్ గుట్టురట్టు
రూ.150కోట్ల మోసం, 52 మంది అరెస్ట్ నిందితుల్లో 32మంది బ్యాంకు అధికారులు నేరగాళ్లతో కుమ్మక్కు, అక్రమంగా ఖాతాలు తెరిచేందుకు సాయం ౩౫౦ బ్యాంకు ఖాతాల ద్వారా బాధితుల సొమ్ము దారి మళ్లింపు దేశమంతటా 850సైబర్ కేసులతో నిందితులకు సంబంధాలు 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల సోదాలు మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో తొమ్మిది రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో సై బర్ నేరాలు చేస్తున్న 52మంది, వారికి సహకరిస్తున్న 32మంది వివిధ బ్యాంకుల అధికారులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫో న్లు, 14 చెక్బుక్లు, రెండు పెన్డ్రైవ్లు, ల్యాప్టా ప్, 21 షెల్ కంపెనీల స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 850 సైబర్ నేరాల కేసుల్లో రూ.150 కోట్లు కొట్టేశారు. పెట్టుబడి, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను బెదిరించి నిందితులు భారీగా డబ్బులు దోచుకున్నారు. వీరికి బ్యాంకు అధికారులు సహకరించడంతో కొట్టేసిన డబ్బులు సులభంగా ట్రాన్స్ఫర్ చేశారు. 32 మంది బ్యాంకు అధికారుల్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మేనేజర్లు ఇద్దరు, బంధన్ బ్యాంకు మేనేజర్లు ఐదుగురు, బ్యాంక్ ఆఫ్ బరో డా మేనేజర్లు ఐదుగురు, ఫెడరల్ బ్యాంక్ మేనేజ ర్లు నలుగురు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మేనేజర్లు న లుగురు, ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్లు ఆరుగురు, కర్ణాటక బ్యాంక్ మేనేజర్లు ఇద్దరు, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్లు ఇద్దరు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ ఒకరు, హెచ్డీఎఫ్సీ మేనేజర్ ఒకరిని అరెస్టు చేశారు. బ్యాంక్ మేనేజర్లలో కొందరు సైబర్ నేరస్థులతో కుమ్మక్కై మధ్యవర్తులుగా ఉండగా, కొందరు మేనేజర్లు సైబర్ నేరస్థుల కోసం మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. కొట్టేసిన సొమ్మను మళ్లించేందుకు సైబర్ నేరస్థులు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో కొట్టేసిన డబ్బులను సైబర్ నేరస్థులు ఈ బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. 16 బృందాలు.. 9 రాష్ట్రాలు.. సైబర్ నేరస్థులను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 7 రోజుల పాటు 9 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశాయి. గతంలో నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్1లో 16 రాష్ట్రాల్లో ఉన్న 117మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేయగా, ఆపరేషన్2లో 74 మందిని అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులు సైబర్ నేరస్థులతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి కీలక నిందితులను, వారికి సహకరిస్తున్న బ్యాంకు అధికారులను అరెస్టు చేశారు. జీరో టాలరెన్స్ అమలు చేస్తున్నాం: వీసీ సజ్జనార్ (హైదరాబాద్ సీపీ) సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనలను పాటించడంలేదని, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఖాతాలు తెరవడానికి అనుమతించడం వల్లే మ్యూల్ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం నేరగాళ్లకు వరంగా మారుతోందని, బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా దర్యాప్తును ముమ్మరం చేశామని, నేర ముఠాల్లోని కీలక వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అధిక లాభాల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మకూడదని కోరారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడటానికి ఇచ్చి అక్రమాలకు సహకరిస్తే, వారిని కూడా నేరస్థులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.
జగిత్యాలకు నేడు సారు.. గులాబీ దళం హోరు
సుధీర్ఘ విరామం తరువాత నేడు ప్రజల్లోకి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జగిత్యాల ‘ప్రజా ఆశీర్వాద’ సభ వేదికగా బిఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి జీవన్రెడ్డి భారీగా జనసమీకరణకు గులాబీ నేతల ఏర్పాట్లు ఎర్రవల్లి నుంచి సాయంత్రం జగిత్యాల చేరుకోనున్న కెసిఆర్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ ముఖ్యనేతలతో భేటీ సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణానికి బయల్దేరనున్న కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సుధీర్ఘ విరామం తర్వాత ప్రజల్లోకి వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సోమవారం జగిత్యాలలో జరుగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. దాదాపు ఏడాది తర్వాత కెసిఆర్ ప్రజల్లోకి వస్తుండటంతో కెసిఆర్ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల సభలో కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఎంతో ప్రజాదరణ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత బిఆర్ఎస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆయన తగిన గౌరవం కల్పించేందుకే జగిత్యాల సభను బిఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు గులాబీ శ్రేణులు భారీ జనసమీకణ చేయనున్నారు. ఇప్పటికే జగిత్యాల పట్టణం మొత్తం గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. శనివారం, ఆదివారం కెటిఆర్, హరీష్రావు సహా పార్టీ ముఖ్యనేతలు జగిత్యాలకు చేరుకుని సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేలా స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సావం జగిత్యాలలో జరుగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అధిష్టానం భావిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత కెసిఆర్ బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనుండటంతో, ఆయన ఇచ్చే రాజకీయ సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీ బలోపేతంపై భవిష్యత్తు కార్యాచరణను కెసిఆర్ ఈ సభ వేదిక నుంచే ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కెసిఆర్ నేరుగా విమర్శలు గుప్పిస్తారా.. లేదా పాత వ్యూహాన్నే కొనసాగిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. అలాగే దేశరాజకీయాలలో తాజా పరిస్థితిపై కెసిఆర్ ఎలా స్పందిస్తారో అని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కెసిఆర్ స్పందన ఏ విధంగా ఉండబోతుందో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. జగిత్యాల సభ నుంచే పార్టీ పునర్వైభవం కోసం జైత్రయాత్ర- 2.0ను ప్రారంభించాలని కెటిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ పట్టును నిరూపించుకునేలా ఈ సభలో కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇరాన్ తీరు మారకపోతే భీకరదాడులు తప్పవు ఈ సారి ఒప్పందానికి రాకపోతే వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై విరుచుకుపడతాం మా ప్రతినిధులు మరోసారి పాకిస్థాన్ వెళ్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు మా అణు హక్కులు ఎవరూ కాదనలేరు రెండో దశ చర్చలపై నిర్ణయం తీసుకోలేదు ఇరాన్ నేతలు పెజెష్కియాన్, ఘాలిబాఫ్ ప్రకటన ఇస్లామాబాద్లో రెండో దఫా చర్చలకు ఖరారు కాని తేదీలు, మరోవైపు భారీ భద్రతా ఏర్పాట్లు వాషింగ్టన్/దుబాయ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చే శారు. ఇరాన్తో రెండో విడత చర్చల కోసం అమెరికా ప్రతినిధులు సోమవారం పాకిస్థా న్ రాజధాని ఇస్లామాబాద్కు వెళ్లనున్నట్లు తెలిపారు. శాంతి ఒప్పందం కుదరకపోతే గ ల్ఫ్ దేశమైన ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని మరోసారి హెచ్చరించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇ స్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య ప్ర త్యక్ష చర్చలు జరిగినప్పటికీ, అవి ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఈ పరిణామాల తర్వాత వారం రోజుల్లోనే ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నా ప్రతినిధులు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు వెళ్తున్నారు. వారు రేపు సాయంత్రానికి అక్కడ ఉంటారు. మరోసారి చర్చల్లో పాల్గొననున్నారు అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో వెల్లడించారు. అమెరికా చర్చల బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారా లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మొదటి విడత చర్చల సమయంలో వాన్స్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో, ఇరాన్ అణు ఇంధనం సమృద్ధి హక్కును వదులుకోవాలని అమెరికా పట్టుబట్టింది. ఇదిలా ఉండగా, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మధ్యప్రాచ్యానికి వెళ్తున్నట్లు తెలిపారు. వారు సోమవారం బయలుదేరతారు. మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభమవుతుంది. ఇది చాలా సరళమైన ఒప్పందం. దీనిలో ఎక్కువ భాగానికి ఇప్పటికే అంగీకారం లభించింది అని ట్రంప్ పేర్కొన్నారు. ఏప్రిల్ 8న అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియనుంది. ఉపాధ్యక్షుడు వాన్స్ నేతృత్వంలో జరిగిన మొదటి విడత చర్చలు 21 గంటల పాటు కొనసాగినా, శాశ్వత శాంతి ఒప్పందానికి దారితీయలేకపోయాయి. ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు తుది ఒప్పందం సాధించాలనే లక్ష్యంతో, మరో విడత చర్చలు జరగడానికి పాకిస్థాన్ మళ్లీ దౌత్య ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఏప్రిల్ 15 నుంచి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహ్బాజ్ షరీఫ్ సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాలను సందర్శించగా, రక్షణ దళాల ప్రధాన అధికారి ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇరాన్లో మూడు రోజుల పాటు పర్యటించారు. వివాదాస్పద అంశాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ పర్యటనలు చేపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయనే వార్తలు వినిపించాయి. మొదటి విడత చర్చల్లో ప్రధాన విభేదాంశంగా నిలిచిన హార్మూజ్ జలసంధిపై ఉద్రిక్తతలు శనివారం మరింత పెరిగాయి. అమెరికా, ఇరాన్ పోర్టులపై ఆంక్షలను కొనసాగిస్తున్న తరుణంలో, ఇరాన్ ఈ జలసంధిని మూసివేసి దాటేందుకు ప్రయత్నించిన నౌకలపై కాల్పులు జరిపినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యపై తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హార్మూజ్ జలసంధిలో నౌకలపై కాల్పులు జరిపిందని ఇరాన్పై ఆరోపించారు. నిన్న హార్మూజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులు జరపడం మా కాల్పుల విరమణ ఒప్పందానికి పూర్తిగా విరుద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరాన్ దళాలు ఫ్రాన్స్కు చెందిన ఒక నౌకను, బ్రిటన్ జెండా కలిగిన ఒక సరుకు నౌకను లక్ష్యంగా చేసుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. అయితే, అదే రోజున హార్మూజ్ జలసంధిలో దాడికి గురైన రెండు భారత నౌకల గురించి ఆయన ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఆదివారం ట్రంప్ మరింత కఠినంగా స్పందిస్తూ, ఇరాన్ హత్యా యంత్రం ఆగాల్సిన సమయం వచ్చింది అని పేర్కొన్నారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందాన్ని ఇరాన్ అంగీకరించకపోతే, ఆ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మేము చాలా న్యాయమైన ఒప్పందాన్ని అందిస్తున్నాం. వారు దాన్ని అంగీకరించకపోతే, ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుంది. ఇకపై మృదువైన వైఖరి ఉండదు అని ట్రంప్ స్పష్టం చేశారు. గత 47 సంవత్సరాల్లో ఇతర అధ్యక్షులు చేయాల్సిన పనిని తాను చేయడానికి వెనుకాడనని కూడా ఆయన పేర్కొన్నారు. మరోవైపు, హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం విచిత్రం అని వ్యాఖ్యానిస్తూ, అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అది ఇప్పటికే మూసివేసినట్లేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఉదయం ఎండ, మధ్యాహ్నం వాన ఒక్కసారిగా చల్లబడ్డ హైదరాబాద్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ద్రోణి ఆవర్తనంతో పాటు స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఉదయం నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం వేళల్లో మేఘావృతమయి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నా గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, ఆదివారం రాష్ట్రంలో ఆదిలాబాద్లో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదు కాగా, జగిత్యాలలో 42.9, నిర్మల్లో42.5, నిజామాబాద్లో 41.9, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిల్చోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 18 మంది మృతి
ఆరుగురికి తీవ్ర గాయాలు పేలుడు ధాటికి పరిశ్రమ ధ్వంసం కంపించిన పరిసర ప్రాంతాలు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు తమిళనాడులోని విరుద్నగర్ జిల్లా కట్టనార్పట్టి గ్రామంలో ఘోర విషాదం చెన్నై: తమిళనాడులోని విరుదునగర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పటాకుల తయారీ యూనిట్లో జరిగిన భారీ పేలుడు విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు కట్టనార్పట్టి ప్రాంతంలో ఉన్న ‘వనజా’ ఫైర్వర్క్స్ ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. ఈ యూనిట్ ముత్తుమాణిక్యం అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం వచకరపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారికి విరుదునగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా, ఈ యూనిట్కు నాగ్పూర్కు చెందిన పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పేసో) నుంచి అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో కర్మాగారంలో 100 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. పేలుడు ముందు భాగంలోని వరండాలో సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడ కార్మికులు పటాకులకు సంబంధించిన ముడి పదార్థాలను ఉపయోగించి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాదాపు మూడు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోని అనేక నిర్మాణాలు కూడా నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీశాం. వాటిలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి అని ఒక పోలీసు అధికారి తెలిపారు. తమిళనాడులోని విరుదునగర్ సమీపంలో జరిగిన పటాకుల కర్మాగార పేలుడు ఘటనలో గాయపడిన ఆరుగురిలో ముగ్గురు మహిళలే ఉన్నారని, వారికి సుమారు 60 శాతం కాలిన గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వ చ్చింది. ప్రారంభ పేలుడు అనంతరం కూడా పటాకులు వరుసగా పేలుతుండటంతో రక్షణ చర్యలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు అగ్నిమాపక వర్గాలు వెల్లడించాయి. ఇంకా శిథిలాల కిం ద మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆ ప్రాంతంలో జరిగిన అత్యంత ఘోర పారిశ్రామిక ప్రమాదంగా నిలిచింది. ఇదే జిల్లాలోని వెంబకొట్టై ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన పేలు డు ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి ఇద్దరు మంత్రులను ఘటన స్థలానికి పంపినట్లు తెలిపారు. ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఆయన, విరుదునగర్ జిల్లా కట్టనార్పట్టిలో జరిగిన పటాకుల కర్మాగార పేలుడు ఘటనలో పలువురు మరణించిన సంఘటన తీవ్ర వేదన కలిగించిం ది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. అదేవిధంగా, మంత్రులు కేకే ఎస్ఎస్ఆర్ రామచంద్ర న్, తంగం తేనారసులను వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని ఆ దేశించి, సహాయక చర్యలను పర్యవేక్షించాలని, బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్తో మా ట్లాడి, అవసరమైన అన్ని సహాయ చర్యలను సమన్వయం చే యాలని ఆదేశించాను అని సిఎం స్టాలిన్ వెల్లడించారు.
20thApril2026 |సోమవారం నేటి పంచాంగం
20thApril2026 | సోమవారం నేటి పంచాంగం 20thApril2026 | ఈరోజు తిథి, నక్షత్రం
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధురెడ్డి హైదరాబాద్లోని మణికొండలోని నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్గా మధురెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ‘దళం’, ‘దక్ష’, ‘అహ నా పెళ్ళంట’, ‘జగమేమాయ’, ‘వాలెంటైన్స్ నైట్’ వంటి చిత్రాలతో పాటు, త్వరలో విడుదల కానున్న ‘అగ్ని నక్షత్రం’ లాంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్ఫెక్ట్గా చూపించే విధానాన్ని తెలియజేస్తాయి. కేవలం ఫీచర్ ఫిలిమ్స్కు మాత్రమే కాదు.. ఆయన వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్గా కూడా పనిచేశారు. ‘జగడం’, ‘జల్సా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. ఆ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ ఎంతో ఉంది. తన వృత్తి పట్ల ఎంతో అంకితభావం, ఎప్పుడూ ఒదిగి ఉండే మనస్తత్వం మధురెడ్డి సొంతం. మధు రెడ్డి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సోమవారం రాశి ఫలాలు (20-04-2026)
మేషం అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సరిపడినంత ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృషభం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మిధునం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. కర్కాటకం దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దూరపు బంధువుల నుండి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సింహం దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఋణ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కన్య ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. పాత బాకీలు తీర్చగలుగుతారు. వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. తుల సోదరులు నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృశ్చికం ఇంటాబయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు అంతగా కలసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వృత్తి,వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. ధనస్సు ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చెయ్యలేరు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన రీతిగా ఉండవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో అలోచించి మాట్లాడటం మంచిది. మకరం బంధు మిత్రులని కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. కుంభం సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీనం వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. నూతనవస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.
ఎదురులేని పంజాబ్.. లక్నోపై భారీ విజయం
ముల్లాన్పుర్: ఐపిఎల్లో పంజాబ్ కింగ్స్ తన జోరును కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. ఈ సీజన్లో పంజాబ్కు ఇది ఐదో గెలుపు కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 254 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలిలు అద్భుత బ్యాటింగ్తో చెలరేగి పోయారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంశ్ 37 బంతుల్లోనే 9 సిక్స్లు, 4 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. కనోలి 46 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, 8 బౌండరీలతో 87 పరుగులు సాధించాడు. ద్దరు రెండో వికెట్కు 80 బంతుల్లోనే 182 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మిఛెల్ మార్ష్ (40), బడోని (35), కెప్టెన్ పంత్ (43), మార్క్రమ్ (42) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
400buffaloes బాదంపల్లి గోదావరి రేవులో పేలుడు ఘటన.. గేదెలకు తీవ్ర గాయాలు
400buffaloes బాదంపల్లి గోదావరి రేవులో పేలుడు ఘటన.. గేదెలకు తీవ్ర గాయాలు 400buffaloes
సౌతాఫ్రికా మహిళలకు రెండో విజయం
డర్బన్: భారత్తో ఆదివారం జరిగిన రెండో టి20లో ఆతిథ్య సౌతాఫ్రికా మహిళా టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో ౨-0 ఆధిక్యాన్ని అందుకుది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు లౌరా వల్వర్డ్, సునే లూస్లు జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్కు 106 పరుగులు జోడించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లౌరా 34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 54 పరుగులు చేసింది. లూస్ 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 57 పరుగులు చేసింది. తజ్మిన్ బ్రిస్ట్ 20 (నాటౌట్), డర్క్సెన్ 12 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ షఫాలీ వర్మ ఒక్కటే రాణించింది. ఒంటరి పోరాటం చేసిన షఫాలీ 7 ఫోర్లు, రెండు సిక్స్లతో 57 పరుగులు చేసింది. అనుష్క శర్మ (28) తవనంతు పాత్ర సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ట్రియాన్, టుమి మూడేసి వికెట్లను పడగొట్టారు.
ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి రావాలి: కవిత
ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి రావాలి ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారు కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారు బూర్జువా పార్టీలను వదిలి జాగృతిలో చేరండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎంఎల్ఎ రాథోడ్ బాపూరావు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలేసి కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న జాగృతిలో చేరాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారని చెప్పారు. బోథ్ మాజీ ఎంఎల్ఎ, కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ బాపూరావు ఆదివారం తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. 2007లో కుటుంబంతో సహా తాను బోథ్కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానని గుర్తు చేసుకున్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు, మన్నెం జ్వర పీడితులతో నిండి ఉండేదని.. ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలనే తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉందన్నారు. రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారని చెప్పారు. ఆయన తెలంగాణ జాగృతి నుంచే బిఆర్ఎస్లో చేరి రెండు సార్లు ఎంఎల్ఎ అయ్యారని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతున్నారని తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా నుంచి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు జాగృతిలో చేరారని అన్నారు. ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి జనగణనలో ఆదావాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషన్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జెఎసి జాతీయ అధ్యక్షుడు, ఖమ్మం జెడ్పి మాజీ చైర్మన్, మాజీ ఎంఎల్ఎ చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో జెఎసి నాయకులు ఆదివారం జాగృతి కార్యాలయంలో కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను చందా లింగయ్య దొర ఈ సందర్భంగా వివరించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెసా చట్టానికి తూట్లూ పొడుస్తూ ఆదివాసీల హక్కులను హరిస్తోందని అన్నారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో ఆదివాసీలకు ఉన్న రక్షణలను తొలగిస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని, తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని, దీంతో ఆదివాసీలు తమ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమే అని మండిపడ్డారు. ఆదివాసీలు తమ మతం చెప్పుకునేలా జనగణనలో ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భాష “కోయతూర్”ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులని వారి గౌరవాన్ని కాపాడేలా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ జెఎసి ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు. కవిత సిఎం కావాలి : మాజీ ఎంఎల్ఎ బాపూరావు తెలంగాణ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎంఎల్ఎ రాథోడ్ బాపూరావు ఆకాంక్షించారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎంఎల్ఎ అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని, తనకు మూడోసారి ఎంఎల్ఎ టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్లో చేరినా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని అన్నారు.
in15thdivision |చిత్తూరులోకి చిరుత పులులు
in15thdivision | చిత్తూరులోకి చిరుత పులులు in15thdivision |రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంకలవరపెడుతున్న
మహిళా రిజర్వేషన్ల కోసమే డీ లిమిటేషన్: ఎంపి కొండా
మన తెలంగాణ/హైదరాబాద్: లోకసభ స్థానాల పెంపుతో పాటు మహిళల రిజర్వేషన్లతో డిలిమిటేషన్ బిల్లు సరిసమానంగా ఉంటుందని చేవేళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరుపై ఆయన మండిపడ్డారు. గతంలో ఈ బిల్లును పలుమార్లు ప్రవేశపెట్టారని, 202౩లో మహిళ రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్కు అసదుద్దీన్ ఓవైసీ, మరొకరు మినహా కాంగ్రెస్ పార్టీతో సహ అన్ని పార్టీలు ఏకాభిప్రాయంగా ఆమోదం తెలిపాయని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై కాంగ్రెస్ పార్టీ తొందరపెట్టడంతోనే ప్రధాని నరేంద్రమోడీ మరోసారి చట్టసభ ముందుకు బిల్లును తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. 1963లో రెండవ డీ లిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యూహత్మకంగా వ్యవహరించి బిల్లును అడ్డుకున్నారని విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు.
మహిళల చరిత్రలో చీకటి రోజు.. కాంగ్రెస్ కూటమిపై కేంద్ర మంత్రి ఫైర్
మహిళలను వంచించిన కాంగ్రెస్ కూటమి ఈ నెల 17 మహిళల చరిత్రలో చీకటి రోజు బిల్లు వీగిపోతే ఇండి కూటమి సంబురాలు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మండిపాటు మన తెలంగాణ/హైదరాబాద్ః ఈ నెల 17వ తేదీ దేశ మహిళల చరిత్రలో ఒక చీకటి రోజుగా, బ్లాక్ డేగా మిగిలిపోతుందని, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండియా అలయన్స్ దేశంలోని మహిళలతో పాటు మొత్తం దక్షిణ భారత దేశాన్ని మోసం చేసిందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మండిపడ్డారు. మహిళలు చిరకాలంగా కోరుకుంటున్న 33 శాతం రిజర్వేషన్ బిల్లుతో పాటు, దక్షిణ దేశ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకునివచ్చిందని ఆమె ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు భవిష్యత్తులో జనగణన తర్వాత అన్యాయం జరగకుండా రక్షణ కల్పించడమే ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. అయితే లోక్సభలో ఈ బిల్లులు విఫలమైనప్పుడు కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీల నాయకులు దేశ ప్రయోజనాలను మరిచి, ఆ వైఫల్యాన్ని పండుగలా జరుపుకున్నారని వారి నవ్వులు, హగ్లు దేశాన్ని ఉత్తర-దక్షిణిగా విభజించే కుట్రకు నిదర్శనమని కేంద్ర మంత్రి శోభ మండిపడ్డారు. దక్షిణ భారతానికి న్యాయం చేసే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామని, కేవలం ఒక గంట సమయం ఇస్తే కొత్త బిల్లును తీసుకుని వస్తామని ప్రతిపాదించినప్పటికీ, కాంగ్రెస్, ఇండీ అలయన్స్ పార్టీలు దాన్ని తిరస్కరించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ రాజకీయ లాభాల కోసం, భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలను మరింత పెంచేలా వారు వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లుగా మహిళా సాధికారతకు పెద్ద పీట వేశామని విద్య, స్కాలర్షిప్లు, బీమా పథకాలతో పాటు ముద్ర లోన్లలో 60 శాతం, ఎంఎస్ఎంఇ సబ్సిడీల్లో 53 శాతం మహిళలకే అందించామని పేర్కొన్నారు. ప్రధానిగా ఎబి వాజపేయి ఉన్నప్పుడు స్వయం సహాయక సంఘాల ఆలోచనను విస్తరించి, ఇప్పుడు 3 కోట్లకు పైగా మహిళలను ‘లఖ్ పతి దీదీలు‘గా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, మహిళ చేతిలో డబ్బు ఉంటే కుటుంబానికి, దేశానికి మేలు జరుగుతుందని ఆమె అన్నారు. నేటి మహిళలు రక్షణ రంగంలో ఫైటర్ జెట్లు నడుపుతూ దేశానికి సేవ చేస్తున్నారని, అయినప్పటికీ రాజకీయాల్లో వారికి సరైన అవకాశాలు రాకుండా కాంగ్రెస్ వంటి పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో ముద్ర లోన్లలో 63-64 శాతం మహిళలకే దక్కాయని, ఎంఎస్ఎంఈ సబ్సిడీలు 53 శాతానికి పైగా మహిళలు పొందారని స్పష్టం చేశారు. కర్నాటక కోస్టల్ ప్రాంతంలోని మత్స్యకార మహిళల జీవనశైలిని ఉదాహరణగా చూపుతూ, మహిళల చేతిలో ఆర్థిక శక్తి ఉంటే నిర్ణయాధికారం ఎలా మారుతుందో ఆమె వివరించారు. కాంగ్రెస్లో వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్లో మహిళలకు అవకాశం అంటే అది కేవలం ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీ వంటి ఒకే కుటుంబానికి పరిమితమని విమర్శించారు. దేశంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళలలో సీట్లు పెంచే ప్రతిపాదనను అడ్డుకోవడం ద్వారా ఇండియా కూటమి దక్షిణ భారతాన్ని మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుండి 26కు, ఆంధ్రప్రదేశ్లో 25 నుండి 38కి పెరుగుతాయని, ఈ ప్రయోజనాన్ని ఇండీ కూటమి అడ్డుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వం గురించి మాట్లాడుతూ, ఆ పార్టీలో కేవలం ‘ఖాన్దాన్‘ (వారసత్వ) రాజకీయాలే నడుస్తాయని, జార్కిహోళి కుమార్తెకు టికెట్ ఇవ్వడాన్ని ఆమె ఉదహరించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో తనను తాను ‘జాదూగర్‘ (మాంత్రికుడు) అని సంబోధించుకుంటూ అపరిపక్వంగా ప్రవర్తించారని ఆమె విమర్శించారు. సిఎంపై నిప్పులు చెరిగిన శోభ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజలకు చేసిన అన్యాయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలో మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. చివరగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం హైకమాండ్ను సంతోషపెట్టడానికే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, హామీల అమలులో విఫలమై రాష్ట్ర ప్రజలను ‘పిక్ పాకెట్‘ చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఎంపీ డికె అరుణ తదితరులు పాల్గొన్నారు.
నా మాటలను వక్రీకరించారు: ప్రకాశ్ రాజ్
మన తెలంగాణ/హైదరాబాద్: తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించారు. ఇటీవల ఓ సాహితీ కార్యక్రమంలో తాను చేసిన పూర్తి ప్రసంగాన్ని వదిలేసి, అందులోని కొన్ని భాగాలను మాత్రమే తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను శ్రీరాముడిని కించపరిచానని, హిందువుల మనోభావాలను దెబ్బతీశానని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను అన్ని ధర్మాలను సమానంగా గౌరవిస్తానని, ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కొందరు రాజకీయ నాయకులు ‘హిందూ వ్యతిరేకి’ అనే ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే తన గొంతు నొక్కేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తాను పొలం పనులతో తీరిక లేకుండా ఉన్నానని, ఆ పనులు పూర్తయ్యాక ఈ విషయంపై మరింతగా మాట్లాడతానని ప్రకాశ్ రాజ్ తన పోస్ట్లో తెలిపారు.
పవన్ కల్యాణ్కు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. శని వారం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్కు ప్రధాని ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ’ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్తో మాట్లాడి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన చాలా ధైర్యవంతుడు, త్వరలోనే కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను‘ అని తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది : చిరంజీవి తన సోదరుడి ఆరోగ్యంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్ కల్యాణ్కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా, నిలకడగా ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు‘ అని చిరం జీవి తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ తిరిగి సాధారణ కార్యకలాపాల్లోకి రావడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని వైద్యులు సూచిం చినట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రార్థనలు చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ చిరంజీవి ధన్య వాదాలు తెలిపారు.
బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి
విరుద్నగర్: తమిళనాడులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విరుద్నగర్ జిల్లా కట్టనార్పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పరిశ్రమ ధ్వంసం కాగా.. పరిసర ప్రాంతాలు కంపించినట్లు సమాచారం. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. విరుద్నగర్ జిల్లాలోనే సత్తూర్లో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వారం క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికులు మరణించగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా… హేమాక్స్ లైట్ మినీ వాటర్ ట్యాంక్
నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం…
నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ పట్టణ
పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం…
పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం… కొత్త కాలువల నిర్మాణంతో మురుగు సమస్యకు
బుక్ పేరుతో రాజ్యాంగ విరుద్ధ పాలన…
బుక్ పేరుతో రాజ్యాంగ విరుద్ధ పాలన… రాష్ట్రంలో తిరోగమనంలో ప్రజాస్వామ్యంమాజీ మంత్రి ధర్మాన
మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు.
మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు. భవానిపురం, ఆంధ్రప్రభ :
చిట్యాల ఆణిముత్యం కలెక్టర్ నరసింహారెడ్డి
చిట్యాల ఆణిముత్యం కలెక్టర్ నరసింహారెడ్డి చిట్యాల, ఆంధ్రప్రభ : స్వయంకృషి, పట్టుదలతో కష్టాలను
ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి…
ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి… గిట్టుబాటు ధరను పొందాలి..మార్కెట్ చైర్మన్ ఉబ్బు
ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి
రోమ్: ఇటలీలోని బెర్గామో ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. కోవో పట్టణంలో భారతీయ సిక్కులు అక్కడున్న గిడ్డంగిలో ఏర్పాటు చేసుకున్న గురుద్వారా వెలుపల ఈ ఘటన జరిగింది. వైశాఖీ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న దశలో వారిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ సిక్కుల ప్రార్థనా స్థలి వద్ద కాల్పుల్లో మృతి చెందిన వారిని రాగీందర్ సింగ్, గుర్మీత్ సింగ్గా గుర్తించారు, కాల్పులకు దిగింది కూడా భారతీయుడేనని అక్కడున్న ప్రత్యక్ష సాక్షి మాటల ద్వారా వెల్లడైంది.
ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు
ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు పిల్లర్లతో కూడిన ప్లైఓవర్

35 C