వడపప్పు, పానకం ప్రసాదాలు పంపిణి
వడపప్పు, పానకం ప్రసాదాలు పంపిణి మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో
దేవాలయానికి మూడు కియోస్క్ మిషన్లు అందజేత..
దేవాలయానికి మూడు కియోస్క్ మిషన్లు అందజేత.. మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి
మాజీ మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం..
మాజీ మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం.. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మాజీ
రాములోరి కల్యాణం... పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్
మన తెలంగాణ/భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరుగుతోంది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజకీయ నాయులు, భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందు భద్రాచలం ఆలయ అభివృద్ధికి సిఎం రేవంత్ భూమి పూజ చేయడంతో తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన కూడా చేశారు.
Jio Studios’ Bet on Ram Charan’s Peddi
Jio Studios has become the talk of the country after the release of Dhurandhar. After the first part ended up as a super hit, the second part released recently and it is racing towards the biggest ever blockbuster of the country. Jio Studios produced Dhurandhar and they released the film on their own across the […] The post Jio Studios’ Bet on Ram Charan’s Peddi appeared first on Telugu360 .
ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని పెద్దగూడెంలో ఉన్న
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెడన – ఆంధ్రప్రభ : పెడన మండలం
Rupee Falls to 94.29 : 100 కు చేరువలో .. రూపాయి
Rupee Falls to 94.29 : 100కు చేరువలో . రూపాయి (
కాలుష్యం కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి
కాలుష్యం కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి
మళ్లీ లాక్డౌన్పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్లో లాక్డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన […] The post మళ్లీ లాక్డౌన్పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన appeared first on Visalaandhra .
ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : శ్రీ రామనవమి
Pooja hegde |ఈసారైనా ఫామ్ లోకి వచ్చేనా..?
Pooja hegde | ఈసారైనా ఫామ్ లోకి వచ్చేనా..? Pooja hegde |
Varun Tej and Niharika Film Update
Mega girl Niharika Konidela is producing films on Pink Elephant Pictures. After the super success of Committee Kurrollu, her second production titled Rakasa is slated for April 3rd release. Niharika is all set to produce the next film of Mega hero Varun Tej. The film will be launched in a grand manner with a pooja […] The post Varun Tej and Niharika Film Update appeared first on Telugu360 .
Bhadrachalam: భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది
భద్రాద్రి: దర్గాలో రామయ్య పెళ్లి.. ఫలహారం తిన్న ఉడుత #Bhadrachalam #Harmony #RamNavami
ఇంకా తేలని లక్షలాది ఓటర్ల భవిత
పశ్చిమబెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నా ఇంకా కొన్ని లక్షల మంది ఓటర్ల భవిత ఎటూ తేలక న్యాయ పరిశీలనలో ఉండడం ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రక్షాళన ప్రక్రియలో దాదాపు 64 లక్షల ఓటర్ల పేర్లు తొలగించడం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీంతో తొలగింపునకు గురైన ఓటర్ల విషయంలో సుప్రీం కోర్టు జోక్యంతో న్యాయపరిశీలన జరుగుతున్నప్పటికీ ఇంకా దాదాపు 30 లక్షల మంది తుది నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారంటే ఈ ఎన్నికలు ఎంత గందరగోళం రేపుతున్నాయో తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్) చేపట్టక ముందు పశ్చిమబెంగాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7కోట్ల 89 లక్షలు ఉండేది. స్థానికంగా వారు లేరని, కొందరికి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, మరికొందరికి సరైన రికార్డులు లేవని ఇలా వివిధ కారణాలతో ఎన్నికల కమిషన్ 64 లక్షల ఓటర్లను జాబితాల్లోంచి తొలగించింది. మరింత స్క్రూటినీ అవసరం అన్న కేటగిరి కింద మరో 60 లక్షల మంది ఓటర్ల పేర్లు ఉంచింది. దీనిపై ఫిర్యాదుల వెల్లువ రావడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్ పక్కన పెట్టిన ఓటర్ల వివరాలను పరిశీలించి న్యాయం చేకూర్చాలని ప్రత్యేకంగా న్యాయాధికారులను ఏర్పాటు చేయించింది. అలాగే వచ్చిన వివాదాలను పరిష్కరించడానికి కలకత్తా హైకోర్టు పర్యవేక్షణలో 19 ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. పెండింగ్లో ఉన్న 60 లక్షల ఓటర్లలో న్యాయాధికారులు పరిష్కరించిన 29 లక్షల ఓటర్ల జాబితా సోమవారం రాత్రి విడుదలయింది. సోమవారం ప్రకటించిన తొలి అనుబంధ జాబితాలో మంత్రి గులాం రబ్బనీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పేర్లు కూడా ఉండడం గమనార్హం. బుధవారం వరకు 60 లక్షల ఓటర్లలో 32 లక్షల ఓటర్లు న్యాయపరిశీలనలోనే ఉన్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. ఈ 32 లక్షల ఓటర్ల పేర్లలో కనీసం 40 శాతం అంటే దాదాపు 13 లక్షల మంది పేర్లు జాబితా లోంచి తొలగించినట్టు అనధికారిక సమాచారం. ఇంకా 28 లక్షల మంది ఓటర్ల పేర్లు న్యాయపరిశీలనలోనే చిక్కుకున్నాయి. వీరంతా తాము ఈసారి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభిస్తుందో లేదో అన్న సందిగ్ధంలో నిరీక్షిస్తున్నారు. ఎన్నికల కమిషన్ మొదటి సప్లిమెంటరీ జాబితా 10 లక్షల పేర్లతో మార్చి 23 అర్ధరాత్రిని విడుదల చేసింది. ఆ జాబితా విడుదల చేసి 40 గంటలైనా కూడా మొదటి జాబితాలో పేర్లు ఎందుకు తొలగించారో అధికారిక సమాచారం ఏదీ లేదు. రాష్ట్రం మొత్తం మీద 60 లక్షల పేర్లు 700 జ్యుడీషియల్ అధికారుల పరిశీలనలో ఉన్నాయి. నియోజకవర్గాలు, బూత్లవారీగా ఆన్లైన్లో డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ కాగితాలపై జాబితాలు కనిపించడం లేదని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. డిజిటల్ సదుపాయం లేకుంటే వారికి ఎలాంటి సమాచారం అందనట్టే. అదీ కూడా ఎలెక్షన్ కమిషన్ వెబ్సైట్ లోకి పేర్లు వెళ్లినప్పుడే ఓటర్లు వ్యక్తిగతంగా పరిశీలించుకోగలుగుతారు. ఎవరి పేర్లు అయితే తొలగించబడ్డాయో వారు రాష్ట్రం లోని జిల్లాల్లో ఏర్పాటు చేసిన 19 ట్రిబ్యునళ్లలో అప్పీలు చేసుకోవచ్చు. ఆ విధంగా వచ్చిన అభ్యంతరాలను ట్రిబ్యునళ్లు తిరిగి పరిశీలిస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ కేవలం నెలరోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిశీలన పూర్తవుతుందా? అన్నదే ప్రశ్న. పరిష్కరించిన ఓటర్ల సప్లిమెంటరీ జాబితాలను ప్రతీ శుక్రవారం ప్రకటించే బదులు, ప్రతిరోజూ విడుదల చేయడానికి కలకత్తా హైకోర్టు అనుమతిని ఎన్నికల అధికారులు పొందారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక మంది తమ పేర్లు తొలగించబడడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు మాల్దా జిల్లా సుజాపూర్ నియోజకవర్గం లోని శిలంపూద్ ఒకటో గ్రామ పంచాయతీ ఏరియాలో 522 మంది ఓటర్లు న్యాయపరిశీలనలో ఉన్నారు. అయితే వీరిలో 427 మంది పేర్లు తొలగించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామ పౌరులమైన తాము ఇప్పుడేం చేయాలి? అని 70 ఏళ్ల వృద్ధుడు ప్రశ్నిస్తున్నారు. ఈ వృద్ధుని పేరు కూడా జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగించేశారు. సర్ ప్రక్రియ నిర్వహించినప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ భారీ ఎత్తున పేర్లు తొలగించబడ్డాయని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బెంగాల్లో మరో సమస్య తెరపైకి వచ్చింది. సరిహద్దు లోని ఓటర్లు చొరబాటుదారులుగా వారిని ఈసారి గుర్తించడం లేదు. 1972 లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగినప్పుడు బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో కాందిశీకులు భారత్కు తరలి వచ్చారు. వారిలో అత్యధికులు ముస్లింలు. 1974 లో భారత్ బంగ్లాదేశ్ భూసరిహద్దు ఒప్పందం అమలు లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా తమకు భారత పౌరసత్వ గుర్తింపు లభించినప్పటికీ వీరిని ఎన్నికల కమిషన్ ‘అనిశ్చితి’ కేటగిరిలో ఉంచింది. 2002 ఓటర్ల జాబితాలో వీరికి చట్టపరమైన డేటా లేదని ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెబుతోంది. ఇటువంటి వందల కుటుంబాలు ఇప్పుడు ఓటు హక్కు కోల్పోయి తార్కిక వాదంలో ఇరుక్కున్నారు. మార్చి 23న ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తొలి జాబితాలో వీరి పేర్లు లేవు. ఈ కారణంగా వీరి ఓటు హక్కు సందిగ్ధంలో ఊగిసలాడుతోంది. పౌరులుగా ధ్రువీకరణ పత్రాలు లేక ఓటు హక్కు కోల్పోయిన ఇటువంటి వారి ఓటు హక్కు రక్షణ కోసం గట్టిగా పోరాటం సాగిస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
ఇరాన్పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్పై సైనిక దాడుల నిలిపివేతను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 6 వరకు ఆ దేశ ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో జరుపుతున్న చర్చలు అద్భుతంగా ముందుకు సాగుతున్నాయని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ […] The post ఇరాన్పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా appeared first on Visalaandhra .
Revanth Reddy : భద్రాచలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు
Blockbuster Connection To Bad Boy Karthik
Hero Naga Shaurya is gearing up to deliver an intense mass-action entertainer with Bad Boy Karthik, directed by debutant Raam Desina. Backed by Srinivasa Rao Chintalapudi under the Sri Vaishnavi Films banner, the film features Vidhi as the leading lady, with music composed by Harris Jayaraj. Meanwhile, Zee Studios, which recently secured digital rights for […] The post Blockbuster Connection To Bad Boy Karthik appeared first on Telugu360 .
స్త్రీల ఉద్యమాలు దేశం నలుమూలలా ఎగిసిపడుతున్న రోజులవి! హైదరాబాద్ నగరంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అనంతరం వేళ్ళూనుకున్న పౌరహక్కుల ఉద్యమంలో, స్త్రీలపై హింస, అత్యాచారాలను (రమాజాబీ ఘటన) నిరసిస్తూ, విదేశాలకు కూరగాయలని ఎగుమతి చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చెలరేగిన ఉద్యమాలలో భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న స్త్రీశక్తి సంఘటన స్త్రీల ఉద్యమ నిర్మాణానికి పూనుకుంది. సంఘటనలో సభ్యులు కొందరు వామపక్షవాద నేపథ్యంలో వచ్చిన వాళ్ళయితే, కొందరు స్త్రీవాద రాజకీయాల స్ఫూర్తితో వచ్చిన వాళ్ళు. పైన చెప్పిన ఉద్యమాల్లో పాల్గొన్న ఇతర స్త్రీలు చాలా మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉండటం, వాళ్ళు మాతో గత అనుభవాల్ని పంచుకోవటం, మాలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. 1948, 50 సంవత్సరాలలో జరిగిన ఆ చరిత్రాత్మక రైతాంగ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ అనుభవాలను సేకరించి దేశంలో స్త్రీ ఉద్యమ చరిత్రగా మలచాలనేది మాలో కలిగిన తలంపు మరుగునపడిపోయిన ఆ స్త్రీల జీవిత కథలు, మన దేశ ప్రజల పోరాటాల్లో స్త్రీల చరిత్రల్ని పొందుపరిచి ‘మనకు తెలియని మన చరిత్ర’ రూపొందించాలనే సంకల్పానికి అది దారి తీసింది. ‘మనకు తెలియని మన చరిత్ర’ తొలిసారి 1986లో తెలుగు ప్రచురణ అయింది. 1986లో దాని ఇంగ్లీషు అనువాదం ‘కాళి ఫర్ ఉమెన్’ ప్రచురణ కర్తలు, 1989లో జెడ్ బుక్స్ ప్రచురించారు. ఈ పుస్తకం తెలుగులో తిరిగి 2002లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఇంగ్లీషులో మాత్రం ఇప్పటి వరకూ తిరిగి ముద్రణ జరగలేదు. 80లలో ‘మనకు తెలియని మన చరిత్ర’ అధ్యయన సమయంలో స్త్రీ శక్తి సంఘటనలో ‘మౌఖిక చరిత్ర’లను సేకరించే ప్రయత్నం చేస్తున్నామన్న అవగాహనకన్నా, ఒక రాజకీయ స్పృహతో ఉద్యమంలో స్త్రీల జీవిత కథనాలను, వారి స్వీయానుభవాలను వారి మాటల్లో, వారి వారి భాషల్లోనే రికార్డు చేయటం, వాటిని యథాతథంగా పాఠకులకు అందించటం అన్న లక్ష్యాలు ప్రధానంగా ఉండేవి. తర్వాత కాలంలో పుస్తకాన్ని స్త్రీల అధ్యయన కేంద్రాలు, చరిత్ర బోధించే విశ్వవిద్యాలయ అధ్యాపకుల రాజకీయ పోరాటాలలో స్త్రీల గురించి అధ్యయనం చేసే స్త్రీవాద ఉద్యమాలూ, రాజకీయ కార్యకర్తలు మనకు తెలియని మన చరిత్రను ఒక మార్గదర్శక గ్రంథం textగా వాడుతూ వస్తున్నారు. పోరాటాలు, ఉద్యమాలు, వ్యూహాలు నిర్మించటంలో చరిత్రల్లో స్త్రీలున్నా, లిఖించే సమయానికి వాళ్ళ ప్రసక్తి కనుమరుగైపోవటం సర్వసాధారణం. అంతేకాదు, వాళ్ళ చరిత్రల్ని వాళ్ళే రికార్డు చేసుకోలేని నిరక్షరాస్యులైన స్త్రీల చరిత్రల్ని రాయటానికప్పుడు మౌఖిక చరిత్ర ఒక రాజకీయ పంథా అవుతుంది. ఈ మౌఖిక చరిత్ర సంప్రదాయమే ప్రధాన స్రవంతి పరిశోధనా పద్ధతులకు ఒక సవాలయింది. మనకు తెలియని మన చరిత్ర ముద్రణ జరిగిన సందర్భంలో వెతికితే మౌఖిక చరిత్రలు అతి తక్కువగా కనిపిస్తాయి. బహుశ ప్రపంచవ్యాప్తంగా కూడా చేతివేళ్ళ మీద లెక్కించవచ్చన్న విషయంలో సందేహం లేదు. విప్లవంలో స్త్రీల గురించిన పాండినోస్ డాటర్స్‘, బొలీనియన్ గనుల్లో స్త్రీ కార్మికురాలు డొమితులా ఆత్మకథ’ వంటి పుస్తకాలు మాకు స్ఫూర్తినిచ్చినయి. ‘మనకు తెలియని మన చరిత్ర’ తర్వాత మౌఖిక చరిత్ర ఒక మౌలిక అధ్యయన పద్ధతిగా స్థిరపడింది. స్త్రీల చరిత్రను అధ్యయనం చేయటానికి స్త్రీలను కేంద్రంగా చూసే దృక్పథాన్ని ఎంచుకుంది. స్త్రీ శక్తి సంఘటన స్త్రీలు నిర్దేశించే విలువలతో పరిశీలిస్తే స్త్రీల చరిత్ర ఎట్లా ఉంటుంది? ఈ ప్రయత్నానికి కొత్త విజ్ఞానం, విభాగాలు, కొత్త మూలసూత్రాలు, కొత్త పునాదులు ఏర్పరచే అవసరం, కొత్త సాధనాల్ని సమకూర్చుకునే అవసరం ఎందుకు ఉంటాయనేది మనకు తెలియని మన చరిత్ర రుజువు చేసింది. ఉద్యమంలో స్త్రీల పాత్రను ఒక వాస్తవిక సంఘటనగా మాత్రమే కాకుండా ఆయా ఉద్యమాల అవగాహనల్లో ‘స్త్రీల ప్రశ్న’ ఏమిటన్న విషయాన్ని ప్రపంచం ముందుకు తెచ్చినటువంటి ప్రయత్నం అది!. తెలంగాణ రైతాంగ పోరాటంలో స్త్రీల ప్రశ్న గురించి కొత్త కోణాలలో అధ్యయనం చేసిన మనకు తెలియని మన చరిత్ర వైవిధ్యమైన అస్తిత్వాల రాజకీయ ప్రశ్నలు లేవదీయటానికి కొత్త దారులేసిందనే చెప్పాలి. అటువంటి కొత్త రాజకీయ ప్రశ్నలలో ‘దళిత’ ప్రశ్న ఒకటి. 1980ల దశకం చివర్లోని (85లో కారంచేడు, 90లో చుండూరు) సంఘటనల సందర్భంగా దళిత ఉద్యమాలు నిర్మించి దళిత సంఘాలు స్థిరపడటం ఒక విశిష్ట ప్రక్రియ. ఇది ఏర్పడే వరకు దళిత ప్రశ్నను కొత్త కోణాలలో ఆవిష్కరించే సందర్భం, కొత్త దృక్కోణాలను, దృక్పథాలను పెంచుకోగలిగే మేధోపరమైన, భౌతికమైన పరిస్థితులు ఏర్పడలేదు. మనకు తెలియని మన చరిత్ర రాసే సమయానికి (1982-86ల మధ్య) ఆ పరిస్థితులు దాదాపు లేవనే విషయం గుర్తుంచుకోవాలి. విప్లవోద్యమాలలో, కమ్యూనిస్టు రాజకీయాలలో అంతర్భాగంగా స్త్రీలెట్లా ఉంటూ వచ్చారో, దళితలు కూడా అదే విధంగా ఉండి చరిత్ర లిఖించే సమయానికి వాళ్ళ ఉనికి లేకుండా పోవటం యాదృచ్ఛికం (accidental) కాదు అనే అవగాహన దళిత ఉద్యమం నిర్మించిన సందర్భంలోనే సాధ్యపడింది. వామపక్ష ఉద్యమాలలో దళితుల అస్తిత్వాన్ని గురించి, నాయకత్వ స్థానాల్లో వాళ్ళెప్పుడూ కనిపించక పోవటం గురించీ, వామపక్ష సంఘాలు, పార్టీలు దళిత బహుజనులను నిరంతరం అంచులకు పెట్టివేయటాన్ని ప్రశ్నిస్తూ దళిత రచనలు, వ్యాఖ్యానాలు రావటం అప్పుడే మొదలయింది. దళిత బహుజన నాయకులు పౌరహక్కుల సంఘాలలో, వామపక్ష పార్టీలలో దళిత ప్రశ్నలను లేవదీయటం ప్రారంభమయింది. మనకు తెలియని మన చరిత్ర ప్రచురణ తర్వాత వామపక్ష వర్గాల నుంచి ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంది. ఈ పుస్తకాన్ని అశాస్త్రీయ దృక్పథంతో రాసినదిగా; అట్టడుగు వర్గాల్లో, పోరాటాల్లో మమేకం కావల్సిన స్త్రీల ఉద్యమాల్ని విప్లవోద్యమాల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నంగా తిరస్కరించారు. ఇంకొక వ్యాఖ్యానంలో ‘స్త్రీ శక్తి సంఘటన వ్యక్తిగత అనుభవాల్ని చరిత్ర గురించి స్వీయాత్మక ధోరణిలో చర్చించి విశ్లేషణలను గాలికి వదిలి వేశారు’ అన్నారు. అశాస్త్రీయమైన అవగాహనలు ముందు ముందు ఇతర అస్తిత్వం (subjectivities) ఉద్యమాలకు దోవచూపి కమ్యూనిస్టు ఉద్యమాన్ని దెబ్బ తీసిందిగా రూపొందే ప్రమాదం ఉందనే వ్యాకులత (anxiety) కనిపిస్తుంది. ఆ వ్యాకులత వెనుక విప్లవ ఉద్యమాలలో అన్ని విధాల అణచివేతలు, స్త్రీలకు విప్లవ ఉద్యమాలలో అన్ని విధాల అణచివేతలు, స్త్రీలకు సంబంధించినవైనా, దళిత, బహుజనులకు సంబంధించినవైనా అన్నీ విప్లవోద్యమంలో భాగంగా (అంతరంగికంగా) పోరాడాలే తప్ప, ప్రత్యేక ఉనికి (existence)ని చాటుకునేవిగా ఉండకూడదు అనే దృష్టి కోణానికి చెందినవి. ఈ విమర్శల మూలంగా పార్టీలు, మనకు తెలియని మన చరిత్రను పక్కకు పెట్టినా, ఉద్యమాలలో భాగమైన ఎంతో మంది స్త్రీలు దీన్ని చదివి స్ఫూర్తి పొందారు. వాళ్ళు భాగమైన పార్టీల్లో వారి స్థానాన్ని, ఉనికిని, ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషించుకోగలిగే శక్తి నిచ్చింది ఈ పుస్తకం. వామపక్ష పార్టీలలో పని చేసిన తర్వాత తరాల స్త్రీ కార్యకర్తలలో ‘స్త్రీల ప్రశ్న’ గురించీ, స్త్రీవాదం గురించీ కుల, వర్గ దృక్పథాలతో ముడిపడి ఉన్న ఒక పటిష్టమైన అవగాహనను ఏర్పరచటానికి మనకు తెలియని మన చరిత్ర దోహదం చేసిందనటంలో సందేహం లేదు. తెలంగాణ నూతన రాష్ట్రంలో ఎన్నో రకాల రాజకీయ కార్యక్రమాల్ని ఉద్యమాల్ని నిర్వహిస్తున్న ఐక్యకార్యాచరణ చొరవలలో ఎక్కువ భాగం స్త్రీల, కుల, వర్గ, మతపరమైన సెక్సువల్ మైనారిటీల సంక్లిష్ట దృక్పథాలతో పని చేస్తున్న కార్యకర్తలు కనిపిస్తారనేది వాస్తవం! అలాగే ‘మనకు తెలియన మన చరిత్ర’ పుస్తకంలో ఉన్న జీవితాలేవీ దళిత స్త్రీలవి కాదనీ, పుస్తక రచయితలలో కుల దృక్పథం గురించి ఏ మాత్రం అవగాహనలేదని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ పరిశోధన జరిగిన కాలంలో కులప్రశ్నకు అప్పటి సందర్భంలో తావులేదనే విషయాన్ని అంగీకరించారు. మనకు తెలియని మన చరిత్రలో దళిత ప్రశ్నతోపాటు ఇతర వైయక్తికత (subjective) ప్రశ్నలు (మైనారిటీ, గిరిజన, ఆదివాసీ) కూడా కనిపించవు. 90లలో మనకు తెలియని మన చరిత్రపై దళిత విమర్శ ముందుకొచ్చిన తర్వాత కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో దళిత స్త్రీల గురించిన అధ్యయనం ఇప్పటికీ జరగలేదనేది వాస్తవం. తెలంగాణ భాష గురించి, దాని రాజకీయాల గురించి జీవిత కథనాల్ని స్త్రీల గొంతుల్లో స్వయంగా వాడిన పద ప్రయోగాల్లో వారి వారి స్వంత భాషల్లో పాఠకులకు అందచేయాలనే తపన ఈ పుస్తకంలో వుంది. మనకు తెలియని మన చరిత్ర తెలంగాణ భాషను వ్యక్తీకరించిన పుస్తకాలలో ఒకటని భావించటం జరిగింది. ఉమెన్స్ స్టడీస్ మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానూ ఒక నూతన విజ్ఞాన విభాగంగా రూపొందే సందర్భంలో (80లలో) ‘మనకు తెలియన మన చరిత్ర’ ప్రముఖమైన స్త్రీవాద గ్రంథంగా తెచ్చుకుంది. ఇంతకు ముందే ప్రస్తావించినట్టు, మొదటిసారిగా మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అతికొద్ది పుస్తకాలలో ఒకటిగా; ఒకమౌలిక, మౌఖిక చరిత్రగా; రాజకీయ ఉద్యమాలలో ‘చరిత్ర వంటి జ్ఞాన విభాగంలో స్త్రీల చరిత్రను చూసే దృక్పధాన్ని స్థిరపరిచింది. ఇతర స్త్రీవాదులు మనకు తెలియని మన చరిత్ర ప్రారంభించిన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళారు. షీలా రొబోతమ్ ‘తెలియని మనచరిత్ర’ పుస్తకంపై చేసిన సమీక్షలో ‘ఇది ఒక స్త్రీల వీరోచితచరిత్ర మాత్రమే కాదు. ఈనాటి ప్రపంచంలో సోషలిజం, ఫెమినిజంలో ఉన్న సందిగ్ధాలు, ఊగిసలాటలు గురించిన గ్రంథం’ అని రాసింది. ఇవే ప్రశ్నలు ఇప్పటికీ వామపక్షాలలో సభ్యులైన స్త్రీలను వేధిస్తున్నాయనటంలో సందేహం లేదు. హైదరబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకంలో రెండు జీవిత కథల్ని కొండపల్లి కోటేశ్వరమ్మ, మల్లు స్వరాజ్యం సంపూర్ణమైన ఆత్మకథలుగా మలిచి ముద్రించింది. తెలుగు స్త్రీవాద పత్రిక భూమికలో అన్ని జీవిత కథలు సంచికలుగా ముద్రించబడినయి. కె. లలిత, అన్వేషి
Maoists : నాలుగు రోజులే గడువు.. గణపతి లొంగుబాటుకు రెడీ
మావోయిస్టు అగ్రనేత గణపతి త్వరలో లొంగిపోనున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది
Fuel Taxes Cut and Prices Stay the Same
Global crude oil prices are rising sharply. This puts direct pressure on fuel prices in India. In such a situation, petrol and diesel rates should have increased significantly. In fact, there were strong chances that prices could have crossed ₹150 per litre. That did not happen because of the government’s decision. Instead of allowing prices […] The post Fuel Taxes Cut and Prices Stay the Same appeared first on Telugu360 .
భారత్-అమెరికా వాణిజ్యంలో అసమానతలు
భారత్ అమెరికా మధ్య 2022 నుండి 2025 వరకు వాణిజ్య సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. అయితే ఈ విస్తరణ వెనుక ఒక ముఖ్యమైన ఆర్థిక వాస్తవం దాగి ఉంది. వాణిజ్య లోటు (ట్రేడ్ డెఫిసిట్). భారత్కు అమెరికాతో ఉన్న వాణిజ్యం పరిమాణంలో పెరుగుతున్నప్పటికీ, సమతుల్యత లోపం మాత్రం మరింత స్పష్టమవుతోంది. ఈ కాలంలో ఎగుమతులు, దిగుమతుల గణాంకాలు మాత్రమే కాకుండా, వాటి నిర్మాణం, విధానపరమైన మార్పులు, గ్లోబల్ రాజకీయాల ప్రభావం కూడా ఈ అసమానతను అర్థం చేసుకోవడానికి కీలకం. 2022 సంవత్సరంలో భారత్ నుండి అమెరికాకు జరిగిన ఎగుమతులు సుమారు 75 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో అమెరికా నుండి భారత్కు దిగుమతులు సుమారు 50 బిలియన్ డాలర్ల వరకు నమోదయ్యాయి. అంటే భారత్కు సుమారు 25 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కనిపించింది. ఇది చూస్తే భారత్ కు లాభదాయకంగా అనిపించినా, ఈ లాభం కొన్ని ప్రత్యేక రంగాలపై అధికంగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఐటి సేవలు, ఔషధాలు, వస్త్రాలు వంటి రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి. 2023లో ఈ వాణిజ్య పరిమాణం మరింత పెరిగింది. భారత్ ఎగుమతులు 78 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా దిగుమతులు భారత్ లోకి 55 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఏడాది కూడా భారత్కు సుమారు 23 బిలియన్ డాలర్ల మిగులు ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కాలంలో అమెరికా భారత్కు ఎగుమతులు చేసే వస్తువుల విలువ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రక్షణ సామగ్రి, ఇంధన వనరులు, సాంకేతిక పరికరాలు వంటి రంగాల్లో అమెరికా ప్రభావం పెరిగింది. 2024 నాటికి ఈ వ్యాపారం మరింత వ్యూహాత్మకంగా మారింది. భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు సుమారు 82 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా నుండి భారత్కు దిగుమతులు 60 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య మిగులు సుమారు 22 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం భారత్ అమెరికా నుండి పెరుగుతున్న ఇంధన దిగుమతులు, ముఖ్యంగా క్రూడాయిల్, ఎల్ఎన్జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్). రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో మార్పులు చోటుచేసుకోవడం దీనికి కారణం. 2025లో ఈ ధోరణి మరింత స్పష్టమైంది. భారత్ ఎగుమతులు సుమారు 85 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా నుండి దిగుమతులు 65 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య మిగులు 20 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంటే నాలుగేళ్లలో భారత్కు ఉన్న వాణిజ్య లాభం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఒక ఆందోళనకరమైన సంకేతంగా భావించాలి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తుంది. భారత్ ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ, అమెరికా నుండి దిగుమతులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక బలహీనతలు. ముఖ్యంగా హైటెక్ తయారీ, అధునాతన రక్షణ ఉత్పత్తులు, ఇంధన స్వావలంబన లోపం వంటి అంశాలు భారత్ను అమెరికాపై ఆధారపడేలా చేస్తున్నాయి. విమర్శనాత్మకంగా చూస్తే ఈ వాణిజ్య సంబంధం సమాన భాగస్వామ్యం కంటే, ఆధారపడే సంబంధంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. అమెరికా తన ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యాన్ని ఉపయోగించి భారత్ మార్కెట్ను విస్తరిస్తోంది. మరోవైపు భారత్ తన సేవా రంగం ద్వారా మాత్రమే ప్రతిస్పందిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరమైన అసమతుల్యతకు దారితీయవచ్చు. మరొక ముఖ్యమైన అంశం గ్లోబల్ రాజకీయాల ప్రభావం. అమెరికా, -చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. కానీ అదే సమయంలో అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలకోసం భారత్ను వినియోగించుకుంటోంది. రక్షణ ఒప్పందాలు, ఇంధన సరఫరా ఒప్పందాలు ఈ దిశగా స్పష్టమైన ఉదాహరణలు. 2022 నుండి 2025 వరకు అమెరికా- భారత్ వాణిజ్య సంబంధాలు విస్తరించినప్పటికీ, సమతుల్యత లోపం ఒక ప్రధాన సమస్యగా నిలుస్తోంది. గణాంకాల ప్రకారం భారత్కు ఇంకా మిగులు ఉన్నప్పటికీ, అది క్రమంగా తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. దీన్ని సరిదిద్దాలంటే భారత్ తన తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి. ఇంధన స్వావలంబన సాధించాలి, సాంకేతికతలో ముందడుగు వేయాలి. లేకపోతే ఈ వాణిజ్య సంబంధం ఏకపక్షంగా మారే ప్రమాదం ఉంది. కోలాహలం రామ్కిశోర్ 98493 28496
ఇరాన్ ధాటికి చేతులెత్తేసిన డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్కు విధించిన 48 గంటల గడువు పూర్తి కాకుండానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తాత్కాలికంగా యుద్ధం ఆపివేస్తున్నానని ప్రకటించడం చాలామందికి విస్మయం కలిగించింది. పశ్చిమాసియాలో 25 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో ఇంకేమాత్రం యుద్ధం చేయలేక ట్రంప్ చేతులెత్తేసారా? అనే అనుమానం నేడు ప్రపంచం అంతటా కలుగుతుంది. ఇరాన్లో ప్రభుత్వం మారాలి, ఆ దేశంలో అణుసామర్థ్యం పూర్తిగా తుడిచి పెట్టుకుపోవాలి, ఆ దేశం సైనిక సామర్థ్యం అంతరించిపోవాలి అంటూ నిత్యం ఎన్నెన్నో ప్రకటనలు చేస్తూ వచ్చిన ఆయన రాజీకోసం రెండు రోజులుగా ఇరాన్తో జరుపుతున్న చర్చల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యప్రాచ్యంలో మన మధ్య ఉన్న శతృత్వాలకు పూర్తి పరిష్కారంపై గత రెండు రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య చాలా మంచి ఫలవంతమైన చర్యలు జరిగాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. లోతైన, విశ్లేషణాత్మక, నిర్మాణాత్మక చర్యలు ఈ వారంలో కూడా కొనసాగుతాయి. కొనసాగుతున్న సమావేశాలు, చర్చలు విజయవంతం కానున్నందున, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సాదుపాయాలపై అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని నేను భద్రతా దళాన్ని ఆదేశించాను అని ప్రకటించారు. ట్రంప్ వాదనలను కొట్టిపారేసిన ఇరాన్ ట్రంప్ భయపడ్డారని ఎద్దేవా చేసింది. తాము ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది. తమ హెచ్చరికలతోనే ట్రంప్ భయపడిపోయి వెనక్కి తగ్గినట్టు పేర్కొన్నది. తమ విద్యుత్ ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకొంటే, అదే రీతిన ప్రతిదాడులు చేయడంతోపాటు హర్మూజ్ జలసంధిని కూడా పూర్తిగా మూసివేస్తామన్న తమ హెచ్చరికలతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్టు ఇరాన్ వెల్లడించింది. కానీ, ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తహతహలాడుతున్నట్టు చెబుతున్న ట్రంప్ ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రతినిధులు ఇరాన్కు చెందిన ఓ గౌరవప్రదమైన నేతతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఏదిఏమైనా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడటం మొత్తం ప్రపంచ ప్రజలకు ఊరట కలిగిస్తోంది. ఇటీవలకాలంలో మొత్తం ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేసిన మరో యుద్ధం లేదని చెప్పవచ్చు. అందుకు ప్రధాన కారణం చమురు సరఫరాకు ఆటంకం కలగటమే. కాగా, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడిన తర్వాతనే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన చేశారని ఐరోపా పత్రికలు చెబుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం, ఇరాన్కు చెందిన ఉన్నత స్థాయి నాయకులతో ఈ వారంలోనే చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్ను ఒక వేదికగా పాకిస్తాన్ ప్రతిపాదించిందని తెలుస్తున్నది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ కూడా సోమవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో చర్చలు జరిపారు. అమెరికా, ఇరాన్ల మధ్య ‘అంతరాన్ని పూడ్చేందుకు’ పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టులతో కలిసి ‘చురుకైన రహస్య దౌత్యం’లో నిమగ్నమై ఉందని, ఈ విషయాన్ని ఒక అధికారి ధృవీకరించారని పాకిస్తాన్ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘డాన్’ కూడా నివేదించింది.ఈ ప్రక్రియలో మధ్యప్రాచ్యానికి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా పాలుపంచుకున్నారని ఆ అధికారి తెలిపారు. ఈ మొత్తం యుద్ధం సమయంలో ఓ విధంగా ‘ప్రేక్షక పాత్ర’ వహించిన భారత్ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉద్రిక్తలను అదుపు చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించే ఓ అద్భుత అవకాశాన్ని కోల్పోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఇరాన్పై దురాక్రమణలను అరికట్టడంలోనూ, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడంలోనూ బ్రిక్స్ కూటమి స్వతంత్ర పాత్ర పోషించాలని ఇరాన్ అధ్యక్షుడు డా. మసూద్ పెజెష్కియన్ ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి సూచించడం గమనార్హం. అణుకార్యక్రమం రద్దు చేసుకోవడమే కాకుండా, తమ దేశంలో ఈ విషయమై ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతోపాటు అమెరికా ప్రతినిధులు కూడా తనిఖీలు చేసుకొనేందుకు కూడా ఇరాన్ సమ్మతి తెలిపింది. ఆ తనిఖీల విషయమై తదుపరి సాంకేతికపరమైన చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో యుద్ధం ప్రారంభించారు. అయితే, వెనెజులాలో మాదిరిగా ఇరాన్ అత్యున్నత నేతలను చంపివేస్తే ఆ దేశం లొంగిపోతుందని అమెరికా, ఇజ్రాయెల్ వేసుకున్న అంచనాలు తలకిందులు కావడంతో ఆ దేశంనుండి వారెవ్వరూ ఊహించని విధంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. గత 20 ఏళ్లుగా ఇరాన్ ప్రభుత్వం తమ ఉనికిని ప్రశ్నిస్తున్న ఇజ్రాయెల్, అమెరికాల నుండి ముప్పు ఉందని, ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యంగా గత జూన్ లో 12 రోజుల యుద్ధం జరిగినప్పటి నుండే పూర్తిస్థాయి యుద్ధం కోసం సన్నాహాలు ప్రారంభించింది. పైగా, ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకొంటూ, సొంతంగా ఆ దేశం ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుందని గ్రహించలేకపోయారు. ఈ యుద్ధం గల్ఫ్ దేశాలకు సైతం ఓ పెద్ద గుణపాఠం అని చెప్పాలి. 200కు పైగా బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాతో ఏర్పాటు చేసుకున్న రక్షణ ఒప్పందాలు ఇరాన్ నుండి వాటికి భద్రతను కల్పించలేకపోయాయి. వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్పై కన్నా గల్ఫ్ దేశాలపై ఎక్కువగా డ్రోన్లను ప్రయోగించడం ద్వారా అమెరికా ప్రయోజనాలపై ఎవ్వరూ ఊహించని విధంగా దెబ్బతీశారు. అందుకనే భారీ వ్యయంతో ఆయుధాలను సమకూర్చుకోవడంకన్నా ఆధునిక కాలంలో దౌత్య సంబంధాలే గట్టి రక్షణ కల్పించగలవనే సందేశాన్ని ఇరాన్ ఇవ్వగలిగింది. ఈ సందేశం ప్రపంచంలో పొరుగుదేశాలతో ఘర్షణలు ఎదుర్కొంటున్న అన్ని దేశాలకు ఓ గుణపాఠం కాగలదు. తనను చంపటమే అమెరికా మొదటి లక్ష్యం అని ఖమేనీ ముందే గ్రహించారు. తాను చనిపోయినా అమెరికా ఒత్తిడులకు లొంగని నాయకత్వాన్ని ఆయన నిర్మించుకుంటూ వచ్చారు. అటువంటి ప్రణాళికలు, సన్నాహాలు అమెరికా, ఇజ్రాయెల్ లలో కనిపించడంలేదు. పైగా, అమెరికా సైన్యం ‘ప్రచ్ఛన్న శీతల యుద్ధం’ కాలంలో పోరాడే విధంగా, ఆధిపత్యం కోసం, కండరాలను వంచడానికి, తమ ఆర్థిక- సైనిక బలగాలను చూపి బెదిరింపులతో లొంగదీసుకోవడానికి పేరొందింది. పటిష్టమైన యుద్ధ సన్నద్ధతకు తోడు కంటికి కనిపించని, తేలికగా లొంగిపోని ‘మొజాయిక్ డిఫెన్స్’ అనే రక్షణ కోట వ్యూహాత్మక అడుగులు అమెరికాను ఆశ్చర్యపరిచాయి. ఈ దళానికి ఆద్యుడు మహమ్మద్ అలీ జఫారీ. వెనుజువెలా తరహాలో ఒక్కరోజులోనే ఇరాన్లో నాయకత్వ మార్పు తీసుకురావాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం బెడిసికొట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ, సైనిక అధికారులు, అణు ఇంధన శాస్త్రవేత్తలు నేలకొరిగినా ఇరాన్లోని మూడు వారాలు దాటినా ఇరాన్ సైన్యం ప్రతిఘటిస్తూనే ఉండటాన్ని మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపరచేటట్లు చేసింది. కేంద్రీకృతంగా కాకుండా పలు అంచెలుగా విభజితమై శత్రుసేనల్ని కంగుతినిపించే సామర్ధ్యం కలిగిన మొజాయిక్ డిఫెన్స్ తమ స్టయిల్ దాడులతో అమెరికాను ఆశ్చర్యానికి గురిచేసింది. వీటన్నింటిని మించి ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకులు ఎవ్వరూ ట్రంప్ లేదా అమెరికాను నమ్మటం లేదని ఈ సందర్భంగా స్పష్టం అయింది. అందుకనే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ వీధులలో భీకర నిరసనలు తెలుపుతున్న మహిళలు, యువత, మరెవ్వరూ యుద్ధం ప్రారంభం కాగానే అమెరికాకు మద్దతుగా రాలేదు. ‘మీ ప్రభుత్వాన్ని మీరే ఎన్నుకోండి’ అంటూ ట్రంప్ వారిని రెచ్చగొట్టినా వారెవ్వరూ స్పందించలేదు. అమెరికన్ సైన్యం 21వ శతాబ్దపు ఆధునిక యుద్ధంతో పోరాడటానికి సిద్ధంగా లేదని పలువురు నిపుణులు భావిస్తున్నారు. అదీగాక, భారీ అమెరికా యుద్ధ యంత్రాంగం ఖరీదైనది. అది నిదానంగా, నెమ్మదిగా కదిలేది. వేగంగా, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టే విధంగా తిరగబడే స్వభావం దానికి లేదు. బలప్రదర్శనతో విర్రవీగడమే గాని వ్యూహాత్మకంగా అడుగులు వేసే అలవాటు లేదు. వీటన్నిటితోపాటు, అమెరికా సైన్యం అవినీతికి పేరొందింది. పెంటగాన్, జనరల్స్ ముడుపులు తీసుకొని ఆయుధాలు, యుద్ధ పరికరాలను అప్పగించడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుత యుద్ధంలో అమెరికా కన్నా ఇరాన్ వ్యూహాత్మకంగా ముందంజలో ఉందని ట్రంప్ వ్యవహారాలపై నిశితంగా అధ్యయనం జరుపుతున్న ప్రొఫెసర్ జియాంగ్ జోక్విన్ తెలిపారు. చలసాని నరేంద్ర 98495 69050
రాజన్న నిదర్శించుకున్న మంత్రి, విప్
రాజన్న నిదర్శించుకున్న మంత్రి, విప్ వేములవాడ ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ
మాజీ ప్రొఫెసర్ కు సైబర్ నేరగాళ్లు కోటి టోకరా
వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు
కన్నుల పండుగగా రాములోరి కల్యాణం
కన్నుల పండుగగా రాములోరి కల్యాణం ఇల్లందకుంట ఆంధ్రప్రభ : అపర భద్రాద్రిగా పేరుగాంచిన
AP |బావమరిదిని హత్య చేసిన నిందితుడిపై కాల్పులు
AP | బావమరిదిని హత్య చేసిన నిందితుడిపై కాల్పులు AP | ఆంధ్రప్రభ,
మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును తీసుకెళ్లిన మందు బాబు #Visakhapatnam #APSRTC #BusHijack #DrunkDriving
రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. మేడ్చల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలందరికి
బెంగళూరులో బస్సు అగ్నిప్రమాదం #breakingnews #telugupost #banglore #fireaccident
ఘనంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర..
ఘనంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : శ్రీ రామనవమి పర్వదినాన్ని
ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట... పెద్ది గ్లింప్స్ విడుదల
హైదరాబాద్: హీర్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్ను విడుదల చేశారు. పెద్ది మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఎఆర్ రహమాన్ సంగీతమందిస్తున్నాడు. పెద్ది అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా? ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట అనే డైలాగు బాగుంది. ఇప్పుడు సెప్పు ఉంటావా? పోతావా?.. ఆటే నా పొగరు అనే డైలాగ్ సూపర్గా ఉంది. రామ్ చరణ్కు తోడు జాన్వీ కపూర్ నటిస్తోంది. పెద్ది చిత్రం ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సినిమా బృందం ప్రయత్నిస్తోంది.
Video: Sri Gouri Priya Exclusive Interview
The post Video: Sri Gouri Priya Exclusive Interview appeared first on Telugu360 .
Captains |ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏమిటి?
Captains | ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏమిటి? Captains | ఆల్రౌండర్లపై
హైదరాబాద్లో శ్రీరామనవమి ఊరేగింపుకు కట్టుదిట్టమైన భద్రత #Hyderabad #Ramanavami #PoliceSecurity
శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు..
శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో
Srirama Navami : శ్రీరామనవమి ప్రసాదానికి ప్రత్యేకతలివే
హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగకో ప్రసాదం ఉంటుంది.
నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు..
నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని సావర్
Ayodhya : అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు నేడు అత్యంత వైభవంగా జరగనున్నాయి
స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 27 (జనంసాక్షి):హరి హర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా …
భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్
భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది
జనసందోహం నడుమ ఆశీర్వాదం అంత్యక్రియలు..
జనసందోహం నడుమ ఆశీర్వాదం అంత్యక్రియలు.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఎస్సీ
Second Weekend: Dhurandhar: The Revenge is Unstoppable
Dhurandhar: The Revenge has completed its first week across the globe on an outstanding note and several records are broken. There is a big task ahead for the film to break all the existing records of Indian cinema and trade analysts believe that Dhurandhar: The Revenge is one film that has the potential to achieve […] The post Second Weekend: Dhurandhar: The Revenge is Unstoppable appeared first on Telugu360 .
Charan’s Peddi Pehelwan: Non-Stop Goosebumps
On the occasion of Mega Power Star Ram Charan’s birthday and Sri Rama Navami, the makers of Peddi unveiled a riveting glimpse- highlighting a journey carved out of pain, perseverance, and an unbreakable spirit. The glimpse opens with a powerful voiceover, declaring that wrestling isn’t a playful sport of bats and balls, but a life-or-death […] The post Charan’s Peddi Pehelwan: Non-Stop Goosebumps appeared first on Telugu360 .
Weather Report : ఈ నెలాఖరు వరకూ వానలే.. ఎల్లో అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది
జిమాడుగుల మండలం ఏజెన్సీలో కుప్ప కూలిన భారీ డ్రోన్ #AgencyArea #DroneCrash #AlluriDistrict #RedWing
26marchchintana |ఆదర్శ పురుషుడు.. మన రాముడు
26marchchintana| ఆదర్శ పురుషుడు.. మన రాముడు 26marchchintana | శ్రీరాముడు – ధర్మానికి
భద్రాచలం శ్రీరామనవమి వేడుకకి వెళితే..
భద్రాచలం శ్రీరామనవమి వేడుకకి వెళితే.. భద్రాచలం (టౌన్) ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా
Gold Prices Today : కొనాలా? వద్దా? బంగారం ధరల హెచ్చు తగ్గుదలతో మీమాంస
ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
దిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పెట్రో ధరలు భారీగా తగ్గనున్నాయి. పెట్రోల్పై లీటర్కు రూ.3 మోడీ ప్రభుత్వం తగ్గించింది. డీజిల్పై దీనినిపూర్తిగా ఎత్తివేసింది. గతంలో పెట్రోల్పై లీటరు రూ.13 ఎక్సైజ్ సుంకం ఉండగా ఇప్పుడు మూడు రూపాయలు తగ్గించారు. డీజిల్పై పది రూపాయలు ఉండగా జీరోకు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా మార్పులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా సంక్షోభం కొనసాగుతున్న సమయంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరామనవమి వేడుకలతో మెరిసిన భద్రాచలం పుణ్యక్షేత్రం #Bhadrachalam#SriRamaNavami#RamaNavami2026
Narendra Modi : నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు
ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి..
ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఓబీసీ సమస్యల పైన
Tirumala : నేడు తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. క్యూ లైన్ లో ఎంతసేపు ఉండాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది
ఏజెన్సీలో కూలిన భారీ డ్రోన్... వీడియో వైరల్
అమరావతి: ఏజెన్సీలో భారీ డ్రోన్ కుప్ప కూలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం బోయితల్లి గ్రామ శివారులో జరిగింది. రెడ్ వింగ్ సంస్థ ఏజెన్సీలో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. బొయితిలి గ్రామ శివారులో డ్రోన్ దారి తప్పి చెట్లలో పడిపోయింది. రెడ్ వింగ్ సంస్థ ఉద్యోగులు అక్కడికి చేరుకొని డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ మినీ హెలికాప్టర్ లాగా కనిపించడంతో పలు గ్రామ ప్రజలు డ్రోన్ ను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు.
సీతారాముల దాంపత్యం అజరామరం.. తిరువూరు, ఆంధ్రప్రభ : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని
Jogi Ramesh : జోగి రమేష్ పై మరో కేసు
మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదయింది
ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు..
ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : శ్రీ సీతారాముల కళ్యాణ
శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..
శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం
Amaravathi : అమరావతి అగ్నిప్రమాదాల కేసులో పురోగతి
అమరావతిలో వరుస అగ్నిప్రమాదాల కేసులో పురోగతి కనిపించింది
విశాఖకు ఎల్పీజీ గ్యాస్ నౌకలు
విశాఖకు ఎల్పీజీ గ్యాస్తో నౌకలు చేరుకున్నాయి
మృతుని కుటుంబానికి జనసేన పరామర్శ..
మృతుని కుటుంబానికి జనసేన పరామర్శ.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ లో
Ontimitta : నేడు ఒంటిమిట్టలో నవమి బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి
పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం..
పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పేద
ట్రాన్స్జెండర్తో మంత్రి రాసలీలలు... సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ముంబయి: మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ తన నివాసంలో ఓ ట్రాన్స్జెండర్తో రాసలీలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. నరహరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. నాసిక్ జిల్లాలోని డిండోరి నియోజవర్గం నుంచి ఎన్సిపి తరఫున నరహరి ఎంఎల్ఎగా గెలిచారు. బిజెపికి ఎన్సిపి మద్దతు ఇవ్వడంతో నరహరికి ఆహార ఔషదాల నియంత్రణ మంత్రిత్వ శాఖ కేటాయించారు. నాసిక్ జిల్లాలో నరహరికి గిరిజన నేతగా మంచి గుర్తింపు ఉంది. ట్రాన్స్జెండర్తో రాసలీలల వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఆయను మంత్రి వర్గం నుంచి తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కుట్రతోనే ఆ వీడియోలను మార్ఫింగ్ చేశారని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సర్కార్ నామా సౌజన్యంతో
Srirama Navami : నేడు శ్రీరామ నవమి.. ఈరోజు ఏం చేయాలంటే?
చైత్ర శుద్ధ నవమి రోజున హిందువులంతా శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు.
Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది
Bhadrachalam : సీతారాముల కల్యాణ్యం చూతము రారండి
శ్రీరామ నవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబయింది.
Srirama Navami : శ్రీరాముడు చాటి చెప్పిందేమిటి? ఆయన చూపిన మార్గామేమిటో తెలుసా?
భారతదేశానికి సనాతమైన పరిపాలనకు మార్గదర్శిగా శ్రీరాముడిని ఉదాహరణగా చూపుతారు
Iran - America War : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న దాడులు.. చర్చల్లేవ్.. కొనసాగుతున్న యుద్ధం
అమెరికాతో ఇరాన్ చర్చలు జరపడం లేదు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది
ఇన్స్టాగ్రామ్ ఎంత పని చేసింది... ఇద్దరు పిల్లల తల్లితో ప్రేమపెళ్లి... కాలువలో దూకి
ఏలూరు: సోషల్ మీడియాలో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు పిల్లల తల్లిని ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. గోడవలు జరుగుతుండడంతో ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో నాచుగుంట గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యర్రమళ్ల గ్రామానికి చెందిన మావుళ్లయ్య(25) ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో పాటు చేపల ప్యాకింగ్ చేస్తూ తల్లిదండ్రులు సత్యనారాయణ, వీరమ్మలతో కలిసి ఉంటున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇర్రి రమతో(35) ఇన్స్టాగ్రామ్లో మావుళ్లయ్యకు పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో యర్రమళ్లకు వచ్చి మావుళ్లయ్య కుటుంబ సభ్యులతో అతడు గొడవకు దిగాడు.అనంతరం భార్య రమను తీసుకొని భర్త తన సొంతూరు సింగుపురానికి వెళ్లిపోయాడు. మావుళ్లయ్య తన అన్న కుమారుడు సతీష్కు ఫోన్ చేసి ఇద్దరం ఉంగుటూరులో ఉన్నామని, నాచుగుంటకు రమ్మని కబురు పంపాడు. అన్న కుమారుడు అక్కడికి చేరుకొనేసరికి కాలువ గట్టున మావుళ్లయ్య వస్తువు కనిపించడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని రమ, మావుళ్లయ్య మృతదేహాలను బయటకు తీశారు. దీంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు.
Israel - Iran War : యుద్ధంతో నగరం మొత్తం నిర్మానుష్యం..ఇళ్లు ఖాళీ
రోమన్ శిథిలాలు, తెల్లటి ఇసుక తీరాలతో ప్రసిద్ధి చెందిన దక్షిణ లెబనాన్ తీరనగరం టైర్ ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా మారింది
పసికందు గొంతునులిమి చంపి.. నాకు గుడ్ న్యూస్... నీకు బ్యాడ్ న్యూస్ అని భర్తకు ఫోన్ చేసిన భార్య
అమరావతి: ఆరు నెలల కూతురు ఏడుస్తుందని తల్లి పసికందును గొంతు నులిమి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేశ్, హేమ అనే దంపతులు ఎన్ఆర్ అగ్రహారంలో అద్దె ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వెంకటేష్ ఓ ఇటుకల భట్టీలో పనిస్తుండగా భార్య ఇంట్లోనే ఉండి ఆరు నెలల కూతురు, ఐదేళ్ల కుమారుడిని చూసుకుంటుంది. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆకలితో కూతురు ఏడుస్తుండడంతో భార్యను లేపాడు. అనంతరం పనికి వెళ్తున్నానని చెప్ప బయటకు వెళ్లాడు. కూతురు అలాగే ఏడుస్తుండడంతో గొంతు నులిమి భార్య కన్నబిడ్డను చంపేసింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి తనకు గుడ్ న్యూస్, నీకు బ్యాడ్ న్యూస్ అని జరిగిన సమాచారం చెప్పింది. వెంటనే తండ్రి ఇంటికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మన తెలంగాణ/భద్రాచలం : భద్రాచలంలో నేడు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరగనుంది. ఇందుకోసం భద్రాచలం ప ట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రూ. 8 లక్షలతో 40 రకాల పూలతో అందంగా అలంకరించిన మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కల్యాణం జరగనుంది. భద్రాచలంలో ఈ నె ల 19న వసంతపక్ష తిరుకల్యాణ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా తొలి రోజున అంకురార్పణ నిర్వహించారు. 23న కలశ, యాగశాల అలంకరణ పూజలు, 24న గరుడ ధ్వజ పట మండల లేఖనం, 25న ధ్వజారోహణం, అగ్ని ప్ర తిష్ట నిర్వహించగా గురువారం రాత్రి ఎదుర్కోలు నిర్వహించారు. నేడు శ్రీ సీతారామచంద్రస్వామి వారికి మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపం లో 40 రకాల పూలతో అలంకరించిన వేదికపై స్వామి వారికి కల్యాణం జరగనుంది. ఇందుకోసం భద్రాచలంను సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దా రు. భక్తులకు అందుబాటులో ఉండేలా సమాచా ర కేంద్రాలు, ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే భద్రాచలం పట్టణంలో భక్తులకు వివిధ సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత క్లాక్ రూ ములు, అన్నదానం, తాగునీరు, పులిహోర పొట్లా ల పంపిణీ నిర్వహించనున్నారు. కరకట్ట, గోదావ రి పరిసరాల్లో షామియానాలతో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. పట్టణంతో పాటు మిథిలా స్టేడియంలో తాగునీరు సౌకర్యం కల్పించారు. కల్యాణ వేడుకను పురస్కరించుకొని రామాలయానికి ఏర్పా టు చేసిన రంగురంగుల విద్యుత్ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టు కుంటోంది. ఈసారి నవమికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ 470 బస్సులను నడుపుతోంది. దేవస్థానంలో భక్తుల రద్దీని త ట్టుకొనే విధంగా ఏర్పాట్లు చేశారు. రెండు రోజులపాటు ఉత్సవాలు జరగనున్న దృష్ట్యా మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం 26 సెక్టార్ల లో 31,480 మంది స్వామి వారి కల్యాణం తిలకించేందుకు అవకాశం ఉంది. ఇందులో 16,480 టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి కళ్యాణం తిలకించేందుకు అవకాశం ఉండగా, స్టేడియంలోని గ్యాలరీ ద్వారా 15 వేల మంది స్వామి వారి కల్యాణాన్ని ఉచితంగా తిలకించేందుకు అవకాశం ఉం ది. అలాగే మిథిలా స్టేడియంలో స్వామి వారి క ల్యాణం భక్తులు వీక్షించేందుకు ప్రతీ సెక్టార్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రత చర్యల్లో భా గంగా సీసీ కెమెరాలు ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు వేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. 250 కూల ర్లు, 50 టన్నుల ఏసీలను, 250 ఫ్యాన్లను ఏర్పా టు చేశారు. అదేవిధంగా కల్యాణంకు తలంబ్రా లు, పట్టువస్త్రాలను సీఎం రేవంత్రెడ్డి దంపతులు సమర్పించనుండగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి వి క్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొండా సురేఖ, వాకాటి శ్రీహరి, సీతక్కలు రానున్నారు. రెండోసారి తలంబ్రాలు సమర్పిస్తున్న సిఎం భద్రాచలంలో సిఎం రేవంత్రెడ్డి నేడు రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గత ఏడాది ఏప్రిల్ 6న జరిగిన కల్యాణంలో తొలిసారిగా రేవంత్రెడ్డి పాల్గొన్నారు. మరోసారి నేడు భధ్రాచలంకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి హాజరవుతున్నారు. సిఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్దమవుతున్నారు. రూ.351 కోట్లతో రామాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన భద్రాచలంలో నేడు రామాలయం అభివృద్ది పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన, భూమిపూజ ని ర్వహించనున్నారు. భద్రాచలంను అభివృద్ది చేసేందుకు రూ.586 కోట్లతో అంచనాలు రూపొందించగా తొలి విడతగా రూ.351 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులను పుష్కరాల వరకు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సం బంధించిన ఏర్పాట్లను గురువారం మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రామాలయ అభివృద్ధి నమూనా ను ఆవిష్కరించారు. రెండువేల మందితో పోలీసు బందోబస్తు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భద్రాచలంలో పోలీసు శాఖ ఆద్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. వరంగల్ రేంజి ఐజీ పర్యవేక్షణలో భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ రోహిత్రాజు ఆధ్వర్యం లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ రెం డువేల మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించదు న్నారు. ఇందులో ఇడిషనల్ ఎస్పీలు ఇద్దరితో పాటు 20 మంది వరకు సీఐలు ఉండనున్నారు. అలాగే ఎస్సైలు, ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబు ళ్లు, కానిస్టేబుళ్లతో పాటు మహిళా పోలీసు అ ధికారులు, స్పెషల్ పార్టీలు, ఆర్మ్ డ్ రిజర్వుడు సెక్షన్లు, బాంబ్ డిస్పోజబుల్ బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
27marcheditorial|ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం
27marcheditorial|ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం 27marcheditorial | ఐక్యరాజ్యసమితి శాంతి యత్నాలపై సందేహాలుహార్మూజ్ జలసంధి
27marcheditorial |అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు..
27marcheditorial | అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. 27marcheditorial | ఐక్యరాజ్యసమితి శాంతి
27thMarch 2026 |శుక్రవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
27thMarch 2026 | శుక్రవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 27thMarch
మన తెలంగాణ/హైదరాబాద్: విద్యం, వైద్యం ప్రభుత్వానికి ప్రాధ్యానతా అంశాలు అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సిఎం మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రయివేట్ ఆసుపత్రులు మూతపడున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభు త్వం చేసిన పనులకు వారసత్వంగా వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెలా ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బిఆర్ఎస్ ప్రభు త్వం ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందని, వాటిని మోస్తూనే పరిమితిని రూ.5లక్షల నుంచి పది లక్షలకు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.627 కోట్లు పాత బకాయిలు ఉన్నాయని సిఎం చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో ఆరోగ్యశ్రీకి రూ.2,408 కోట్ల చెల్లించగా, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927 కో ట్లు, ప్రయివేట్ ఆసుపత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించామని, ప్రస్తుతం ఉన్న బకాయిలు కేవలం రూ.727 కోట్లు మాత్రమేనని, బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నామని, ఇవి గత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలే అని సిఎం పేర్కొన్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా తక్కువగా ఉన్నాయని, ఆరోగ్యశ్రీ లో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగిందని సిఎం తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో గతంలో అనేక అవకతవకలు జరిగాయని, కొంత మంది ఈ సహాయ నిధిని దుర్వినియోగం చేశారని, వారిపై కేసులు కూడా పెట్టిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆన్లైన్లో సిఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, దీంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని సిఎం వివరించారు. ఇప్పటికే సిఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 2,046 కోట్లు లబ్దిదారులకు ఇచ్చామని, ఆరోగ్యశ్రీ సుమారు రూ.2,400 కోట్లతో కలిపి ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో రెండు పథకాలకు రూ.4,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, టీచింగ్ కాలేజీలకు రోగులు రావడం లేదని, ప్రభుత్వాసుపత్రులకు వైద్యం కోసం రోగులు వెళితే అక్కడ నాణ్యమయిన వైద్యులు ఉండటం లేదని తెలిపారు. దీన్ని పరిష్కరించేందుకు రాష్ట్రంలోని టీచింగ్ కాలేజీలకు ఆరోగ్యశ్రీని అనుసంధానం చేసే దిశగా ఆలోచిస్తున్నామని, ఆరోగ్యశ్రీతో పాటు సిఎం రిలీఫ్ ఫండ్ను ఈ ఆసుపత్రులకు ఇస్తామని సిఎం ప్రకటించారు. ఆసుపత్రుల్లో పనిచేసే ఉన్నత చదువులు చదివిన వైద్యులు, ఆసుపత్రుల నిర్వహణ, రోగుల వైద్యం చూసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించామని, ఈ సమస్య పరిష్కారానికి ఆసుపత్రుల నిర్వహణకు గ్రూప్ 1 అధికారిని నియమించడంపై చర్చిస్తున్నామని, దీంతో నిర్వాహణ, వైద్య సేవలు వేరు వేరుగా ఉంటాయని సిఎం చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ కుటుంబ బీమాతో రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా కల్పించబోతున్నామని, ఇందిరమ్మ బీమాతో, కుటుంబానికి ధీమా ఉంటుందని సిఎం పేర్కొన్నారు. విదేశాల్లోని రాష్ట్ర వైద్యులతో ప్రభుత్వాసుప్రతుల్లో వైద్యానికి ప్లాట్ పాం ఏర్పాటు రాష్ట్రానికి చెందిన విదేశాలల్లో పనిచేస్తున్న ఉన్నతమయిన డాక్టర్లతో రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందిచేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని సిఎం ప్రకటించారు. అనేక పనుల మీద విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వైద్యులు వారి పనులు ముగించుకున్న తరువాత మిగిలిన రోజుల్లో వారి వెసులుబాటుతో ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అందించేందుకు ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేశామని త్వరలో తుదిదశకు చేరుకుంటుందని సిఎం తెలిపారు. వరంగల్, అల్వాల్, ఎల్బినగర్, సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రులను స్పెషలైజేషన్ ఆసుపత్రులుగా మారుస్తున్నామని, ఆరోగ్యశ్రీ, సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చే నిధులు అధికంగా ఈ ఆసుపత్రులకు కేటాయిస్తామని సిఎం తెలియజేశారు. గోషామహాల్లో మూడు వేల కోట్లతో 30 ఎకారాల్లో ఉస్మానియా నూతన ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, అదనంగా పదివేల బెడ్లు రోగుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నామని, టిమ్స్ ఆసుపత్రుల పనుల్ని వేగంగా పూర్తి చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. గతంలో జరిగిన పోరపాట్లను సరిదిద్దుకుంటూ వస్తున్నామని, వైద్యంలో నిరంతరం కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వైద్య ఆరోగ్యశాఖ సవాల్ లాంటిదని, శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు వైద్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉందని సిఎం తెలిపారు. భవిష్యత్తులో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నామని, పేదల విద్య, వైద్యం కోసం ఖర్చు చేసే వాటిలో కోత విధించమని, అవసరమయితే మరిన్ని నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువును ప్రభుత్వం పెంచింది. పిఆర్సీ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. ప్రస్తుత పిఆర్సీ కమిటీ గడువు మరో ఐదు రోజుల్లో (31 మార్చి)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు క మిటీ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పిఆర్సీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త పిఆర్సీ నివేదిక ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. ఈ తరుణంలో కొత్త పిఆర్సీ కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని, కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావొస్తున్నా పిఆర్సీ ఇవ్వలేదని ప్రశ్నించారు. మళ్లీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకుని ఉద్యోగులకు కొత్త పిఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలని రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మాత్రం మరోసారి పిఆర్సీ పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: గల్ఫ్ యుద్ధం, తలెత్తుతున్న చ మురు సంక్షోభం ఇతర కీలక విషయాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మో డీ శుక్రవారం మాట్లాడనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఇంటర్నెట్ ద్వారా పరిస్థితి ని సమీక్షిస్తారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు గురువారం తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మాట్లాడుతారు. ప్ర స్తుత దశలో రాష్ట్రాల సన్నద్ధత, తీసుకోవల్సిన చర్యలు సమీక్షిస్తారు. రాష్ట్రాల వారిగా ఆలోచనలను తెలుసుకుంటా రు. గల్ఫ్ యుద్ధం తీవ్రరూపం తరువా త ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష కు దిగడం ఇదే తొలిసారి. వీడియో కా న్ఫరెన్స్ సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది. సమస్య తలెత్తుతున్న దశలో దేశం అంతా జట్టుగా వ్యవహరించే క్రమంలో పూర్తి స్థాయి సమన్వయం పై దృష్టి సారించేందుకు ఈ సమావేశం ఏర్పాటు అవుతోంది. ఇంధన భద్రత, సరఫరాల వ్యవస్థలు, విదేశాల్లోని భారతీయుల రక్షణ, తరలింపు వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అంతర్జాతీయ అస్థిరతల దశలో అంతర్గత సుస్థిరతల నిర్వహణ కీలక అంశం కానుంది. కోడ్ కారణంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల సిఎంలు ఈ సమీక్షలో పాల్గొనడం లేదు. మరో వైపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రెటరీలు వేరుగా సమీక్ష జరుపుతారు. సిఎంలతో ప్రధాని అంతర్గత సమీక్ష, ప్రభుత్వాధికారుల సమావేశం క్రమంలో దేశంలో ఏదైనా విధాన నిర్ణయం అమలులోకి తీసుకువస్తారా? ఇంధన సరఫరాకు కేంద్రం నుంచి ఏదైనా విధివిధానాలు ప్రకటన ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.
మన తెలంగాణ/హైదరాబాద్: గత ప్ర భుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతున్నామని, రాష్ట్రం లో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ మేనేజిమెంట్ సిస్టమ్) ను వచ్చే నెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు మం త్రి పొంగులేటి ప్రకటించారు. గురువారం రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా భూపరిపాలన సేవలను మరింత వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ భూభారతి పోర్టల్ను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా పోర్టల్ ఉంటుందని ఆయన తెలిపారు. నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్లు కేటాయించాం ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ను నారాయణపేట జిల్లా కొస్గీ, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపి భూ భారతి పోర్టల్ను కూడా తీసుకొచ్చామన్నారు. భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ను జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ మాదిరిగానే భూధార్ నంబర్ను ఇస్తామన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్లను కేటాయించినట్లు తెలిపారు. మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ ఒక క్లిక్తో రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా, చాలా సులువుగా, సులభతరంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆధార్ నెంబర్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావలసిన సమాచారం లభిస్తుందని ఆయన తెలిపారు. అదే విధంగా పోర్టల్లో ప్రధానంగా సమాచారం సేవలు, సర్వే సేవలు, కరెక్షన్ సేవలు, అప్పీల్ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలతో పాటు సిటిజన్ డాష్ బోర్డు సేవలకు సంబంధించి మై ల్యాండ్ పోర్ట్ ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్ఓఆర్, భూధార్ నెంబర్, దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్, ఈసీ, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నంబర్కు మ్యాప్, ఆర్ఓఆర్, గ్రామాల నక్షా, పాస్ బుక్ కరెక్షన్ వంటి పూర్తి సమాచారం ఉంటుందన్నారు. అన్ని రకాల సేవలు లభించేలా మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ భూ భారతి పోర్టల్ను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి స్టేజ్ లో దాని వివరాలను తెలియజేస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఖాతాదారునికి సమాచారం అందుతుందన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎన్ఐసి అధికారులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్లు కొంతమే ర కోలుకున్నాయి. బుధవారం మూతపడిన బంక్ల్లో కొన్ని తిరిగి గురువా రం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీలతో సమీక్షలు జరిపి ట్యాంకర్లను సకాలంలో బంక్లకు తీసుకురావడంతో కొంతమేర సఫలీకృతమయ్యింది. దీంతో క్యూ లైన్లు కొంతమేర తగ్గాయి. శుక్రవారం నాటికి క్యూ లైన్లు లేకుండా చూస్తామని ఫౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నా రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన బంక్లు తిరిగి ప్రారంభమయితేనే ఇబ్బందులు ఉండవని వాహనదారులు పేర్కొంటున్నా యి. కొన్ని బంక్ల్లో క్యూ అధికంగా ఉండడంతో గురువారం కూడా ఆ యా బంక్ల యజమానులు రేషనింగ్ పద్ధతిని ద్విచక్ర వాహనానికి రూ. 200ల పెట్రోల్, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.2 వేల పెట్రోల్, డీజిల్ను మాత్రమే పోయడం విశేషం. అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టంతో బ్లాక్మార్కెట్ తగ్గిందని వాహనదారులు పేర్కొంటున్నారు. అయితే, గ్యాస్తో నడిచే ఆటోలకు మాత్రం తిప్పడం తప్పడం లేదు. ఆటోల లైన్లు మాత్రం కిలోమీటర్ల మేర ఉంటున్నాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో ఆటోలకు పూర్తిస్థాయిలో గ్యాస్ అందడం లేదని బంక్ యజమానులు పేర్కొంటున్నారు. ధరలను పెంచిన నయారా ఎనర్జీస్ ప్రస్తుతం ప్రయివేట్ రంగ సంస్థ అయిన నయారా ఎనర్జీస్ పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచింది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ ’రాస్నెఫ్ట్’ భాగస్వామ్యం కలిగిన నయారా ఎనర్జీ లీటరు పెట్రోల్పై దాదాపు రూ. 5లు, డీజిల్పై రూ. 3 వరకు పెంచి సామాన్యుడికి షాక్ ఇచ్చింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్థిరంగా లేకపోవడం ఇంధన ధరలు పెంచినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,000 ఔట్లెట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ పెరిగిన ధరలను అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. వివిధ రాష్ట్రాలు విధించే వ్యాట్ (వ్యాట్) ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈ పెంపు గరిష్టంగా లీటరుకు రూ. 5.30 వరకు చేరింది. మరోవైపు దేశంలో 90 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియ కంపెనీల ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉండడం వాహనదారులకు పెద్ద ఊరటనిస్తోంది.
పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి
` దేశంలో ఇంధనానికి కొరత లేదు.. ` 60 రోజులకు సరిపడా స్టాక్ ` ప్రజలు ఆందోళన చెందొద్దు:కేంద్రం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్కు కొరత లేదని కేంద్ర …
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ మతి
అబుధాబీలో క్షిపణి దాడి.. భారతీయుడి మతి అమెరికాను ఎదుర్కొనేలా ఇరాన్ ఎత్తులు ఖర్గ్ ఐలాండ్లో మందుపాతరలు పశ్చిమాసియా ఘర్షణల వేళ.. రష్యా నుంచి ఇరాన్కు డ్రోన్లు..! టెహ్రాన్(జనంసాక్షి):ఇరాన్కు …
` టిప్పర్ను ఢీకొని మంటల్లో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్ బస్సు ` ఘోర దుర్ఘటనంలో 13మంది ప్రయాణికుల మతి ` పలువురికి తీవ్ర గాయాలు ` మార్కాపురం …
పేదల వైద్యం.. అత్యంత ప్రాధాన్యం
` ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2,408 కోట్లు చెల్లించాం ` గత ప్రభుత్వం 600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది ` విద్య,వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం ` …
మీ తీర్పుపై మాకు వివరణ ఇవ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్: “బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మీరు ఇచ్చిన తీర్పుపై మాకు వివరణ ఇవ్వండి..” అని హైకోర్టు ధర్మాసనం గురువారం స్పీకర్ (ట్రిబ్యునల్) గడ్డం ప్రసాద్ కుమార్ను ఆదేశించింది. అదేవిధంగా పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ తీర్పు ఇచ్చిన ఎమ్మెల్యేలకూ స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు పంపించాలని ధర్మాసనం ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, కె. సంజయ్పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహీయుద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. కేసు విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. స్పీకర్తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా బుధవారం ఏడు మంది ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్పై బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగుల సాక్షాధారాలను స్పీకర్కు అందజేసినా, స్పీకర్ ప్రసాద్ కుమార్ వారు పార్టీ ఫిరాయించారనడానికి ఆధారాలు ఏమీ లేవంటూ కేసులను కొట్టి వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు గురువారం తన వాదన వినిపించారు. దీంతో ధర్మాసనం స్పీకర్తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ నోటీసులు పంపించాలని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై ఇచ్చిన తీర్పుపై తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది.
శుక్రవారం రాశి ఫలాలు (27-03-2026)
మేషం ఇతరులతో ఏర్పడిన వివాదాలలో ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వృషభం ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువర్గంతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. మిధునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కర్కాటకం ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. సింహం నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కన్య సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృశ్చికం స్థిరస్తి వివాదాలు మరింత బాధిస్తాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులలలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహవాతావరణం ఉంటుంది. ధనస్సు స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విషయమైన పెద్దల సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. దైవచింతన పెరుగుతుంది. మకరం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. కుంభం బంధువులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమను ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. మీనం ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వెయ్యవలసి వస్తుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

33 C