డ్రగ్స్ ఘటనపై పారదర్శక విచారణ జరపాలి
అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ మనతెలంగాణ/హైదరాబాద్ : మొయినాబాద్లోని మాజీ ఎంఎల్ఎ రోహిత్ రెడ్డి ఫార్మ్హౌస్లో జరిగిన డ్రగ్స్ ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలని బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి పెద్దవారైనా చట్టం ముందు సమానంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి జరిగిన విందులో టిడిపి ఎంపీ మహేష్ యాదవ్తో పాటు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని సమాచారం ఉందని, ఆ ఫార్మ్హౌస్లో డ్రగ్స్ దొరికాయని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో నిజానిజాలను పూర్తిగా వెలికితీయాలని అన్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా కెటిఆర్పై కావాలని బురద జల్లుతోందని మండిపడ్డారు. పిసిసి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి సహవాస దోషంతో కెటిఆర్పై అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడిగా తన హోదాకు తగ్గట్టు వ్యవహరించకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొయినాబాద్ ఫార్మ్హౌస్ ఘటనకు కెటిఆర్ను లింకు పెట్టడం అంటే మోకాలికి బోడి గుండు కు సంబంధం అంటగట్టినట్లేనని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు ఉందా..? అని ప్రశ్నించారు. చెర్లపల్లిలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను ముంబై పోలీసులు పట్టుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముంబై పోలీసులు వచ్చే వరకు రాష్ట్రంలోని ఈగల్ పోలీసులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఇది సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా..? అని ప్రశ్నించారు. డ్రగ్స్ అంశంపై ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, డ్రగ్స్ టెస్ట్కు బిఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం కాగానే అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఎంఎల్ఎలు, ఎంఎల్సిలువరుసగా నిలబడి డ్రగ్ టెస్ట్ చేయించుకుందామని దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. దీనికి సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమా..? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఉప్పల్ లో ప్లే గ్రౌండ్లో ఘర్షణ… మెయిన్ రోడ్డుపై కానిస్టేబుల్ హత్య
చిల్కానగర్లో దారుణ ఘటన పిలిపించి పబ్లిక్ చూస్తుండగానే కత్తులతో వెంటపడి దాడి భయంతో పరుగులు తీసిన స్థానికులు మన తెలంగాణ / ఉప్పల్: ఉప్పల్ పరిధిలోని చిల్కానగర్ రోడ్డులో ఆదర్శనగర్ సాయిబాబా గుడి వద్ద ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం… చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న సుధీర్ రెడ్డి (35) హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం చిల్కానగర్ రోడ్డులోని ఆదర్శనగర్ ప్లే గ్రౌండ్ వద్ద కొంతమంది యువకులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం దుండగులు సుధీర్ రెడ్డిని వెంబడిస్తూ మెయిన్ రోడ్డువరకు వచ్చి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. పలుమార్లు కత్తులతో పొడవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఘటన అనంతరం నిందితులు బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు. పబ్లిక్ చూస్తుండగానే ఈ దాడి జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడు సుధీర్ రెడ్డి స్నేహితుడైన సంతోష్ నాయక్ అనే వ్యక్తి పేరు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చిల్కానగర్ ప్రాంతానికి పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. పరీక్షకు కెటిఆర్ సిద్ధమా ?
ప్రశ్నించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరమూ డ్రగ్స్ పరీక్ష చేయించుకుందాం.. అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా? అని ఆయన ఆదివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాం హౌస్లో డ్రగ్స్ పట్టుబడడంపై కెటిఆర్, ఇంకా ఆయన బృందం స్పందించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేదని, ఈగల్ టీంకు లభించిన సమాచారం మేరకు తన కర్తవ్యాన్ని నిర్వహించిందని ఆయన చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఈగల్ టీం తమకు లభించిన పక్కా సమాచారం, ఆధారాలతో దాడులు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. మొయినాబాద్ ఫాం హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరి కొందరు నాయకులు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం తెలిసే ఈగల్ టీం దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. నో-డ్రగ్స్- సేవ్ తెలంగాణ ఇదిలాఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణలో నో-డ్రగ్స్&సేవ్ తెలంగాణ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ కెటిఆర్ను, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తూర్పారబట్టారు. డ్రగ్స్ సంస్కృతి తెచ్చిందే కెటిఆర్ ఎంతో ప్రశాంతంగా ఉండే మొయినాబాద్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను డ్రగ్స్ వైపు కెటిఆర్ ఉసిగొల్పారని పిసిసి అధికార ప్రతినిధి గౌరి సతీష్ ఆరోపించారు. సమాజంలో సంఘవిద్రోహ శక్తులుగా కెటిఆర్ నిలిచిపోతారని ఆయన హెచ్చరించారు.
ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా నా పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుంది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తాను డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్ను ఆయన స్వీకరించారు. డ్రగ్స్ వాడేవారు ఎవరైనా, ఏ పార్టీకి చెందినవారైనా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ఏ టెస్టుకైనా తాను సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయించుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని, మనమే ఉదాహరణగా నిలుద్దాం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అని పేర్కొన్నారు. డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా తాను వ్యతిరేకం అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ పార్టీపై బురద చల్లడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతీ డ్రగ్స్ కేసులోకి అనవసరంగా తన పేరును లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
దంచికొడుతున్న వర్షాలు #telugupost #heavyrains #summer #latestnews #weatherreport
ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు
మొదటి విడతలో ఒక ఎకరం వరకు 70 లక్షల మంది ఖాతాల్లో రూ.3,590 కోట్లు 20 రోజుల్లో రూ.2,650 కోట్లు సిఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేయనున్నట్లు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈమేరకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సిఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాల్లో నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి నుండే రైతు భరోసా తొలి విడుత నిధులు విడుదల చేయనున్నారు. తొలి విడత రైతు భరోసాలో ఒక ఎకరం భూమి కలిగిన 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తరువాత రెండో విడత రైతు భరోసా నిధులు రూ. 2,650 కోట్ల రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివర వరకు మూడోవిడతగా మొత్ంత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని, మూడు విడతలుగా మొత్తం సుమారు తోమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది
పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది నమిలిగొండలో పారిశుధ్య కార్మికులకు ఘనంగా
ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి
ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర
బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం ఆశయాలను సాధించాలి
బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం ఆశయాలను సాధించాలి బీఎస్పీ నేతలు శ్రీరామ్ కృష్ణ, సుభాష్
కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి
కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఎంపీకి బాధితుల వినతి చౌటుప్పల్,ఆంధ్రప్రభ :
విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత […] The post వైసిపి నేత ఇఫ్తార్ విందు.. appeared first on Visalaandhra .
అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
బాబాపూర్ లో వరకట్నం నిషేధం ఇంటింటికి తోచినంత సహాయం వధువుకు అందజేత ఉట్నూర్,
కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి
విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్ వెల్ కూలీ సంతురాం (35) మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా బోర్ వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న సంతురాం, పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో సంతురాం వాహనం కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ […] The post కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి appeared first on Visalaandhra .
వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి
వడ్డీ డబ్బులు అడిగినందుకు ఇంటిపై దాడి అప్పుతీసుకొన్న వ్యక్తికి తెగిన చేతివేళ్లు గంగవరం,
విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్లో కుటుంబంతో నివసిస్తూ జీవనం […] The post అప్పుల బాధతో రైతు ఆత్మహత్య appeared first on Visalaandhra .
ముత్తారం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి
ముత్తారం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి ముత్తారం, ఆంధ్రప్రభ : ముత్తారం, మృతుల
ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి
ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన మర్రి ప్రశాంత్, శ్రావణి అనే దంపతులు హైదరాబాద్ లోని రాంనగర్ లో నివసిస్తున్నారు. దంపతులు తమ కుమారుడు సహస్రాతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి ఎరుపు రంగు కారు ఢీకొట్టడంతో వారు కిందపడిపోయారు. భార్యభర్తలు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో ఉద్యోగిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజీకి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉ.8 నుంచి మ.12:30 వరకు తరగతులు టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లకు పరీక్షలు జరిగే రోజుల్లో మ.1 గంట నుంచి సా. 5 వరకు క్లాసులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం ఒంటిపూట బడులు (హాఫ్డే స్కూల్స్) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. అయితే, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. అలాగే, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కేంద్రాలు కూడా 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక
పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు
మూసీ భూములు ప్రపంచ బ్యాంక్కు కట్టబెట్టే యత్నం
రేవంత్రెడ్డి చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారు పూర్తి డిపిఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన పేరుతో దాని పరివాహక ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటి వరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డిపిఆర్ను ప్రభుత్వం విడుదల చేయలేదని, ఫేజ్ -1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను మాత్రమే చూపించిందని అన్నారు. పూర్తి వివరాలు ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని విమర్శించారు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో ఈ ప్రాజెక్టుకు రూ. 5,641 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపిందని, అయితే ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు రూ. 1,400 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగిందని అన్నారు. ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ, సిఎం రేవంత్రెడ్డి, హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాతో కలిసి సిఎం రేవంత్రెడ్డి అరాచకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇప్పటివరకు ఆరు ఫిర్యాదులు చేశామని ప్రస్తావించారు. అవసరమైతే హైడ్రా కమిషనర్, ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నాళాలను ఆక్రమించి విల్లాలు నిర్మిస్తున్న సంస్థ తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు పెడుతున్నారని.. మీరేమైనా కంటెంట్ రైటర్లా ...? అంటూ ధ్వజమెత్తారు. హైడ్రా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. తాను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం, హైడ్రా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. హైడ్రా చేసిన ట్వీట్లు వెంటనే డిలీట్ చేయాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం చిన్న మోదీలా ఉంది గాంధీ విగ్రహం కోసం రూ.70 కోట్లు, రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే ప్రభుత్వం, సిఎం ఇంటి నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇళ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో చిన్న మోదీలా ఉందని వ్యాఖ్యానించారు. 2017లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును తిరస్కరించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అనుమతులు ఇచ్చిందని అన్నారు. మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నగరంలోని 16 నాళాల నుంచి మురికి నీరు మూసీలోకి వస్తోందని, నగర వ్యర్థాలన్నీ మూసీలోకే వెళ్తున్నాయని తెలిపారు. 1,430 ప్రాపర్టీలను కూల్చివేస్తామని ప్రభుత్వం చెబుతోందని, దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, అసలైన బాధితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాను, విశారదన్ కలిసి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఖమ్మంలో పర్యటిస్తామని కవిత తెలిపారు. వెలుగుమట్లలో నిజమైన బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తాను, విశారదన్ కలిసి చేసిన పోరాటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆమె పేర్కొన్నారు.
బడ్జెట్ సమావేశాలకు కెసిఆర్ వస్తారా..?
ఎప్పటిలానే దూరంగానే ఉంటారా...? మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా...? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెసిఆర్ సభకు హాజరవడంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలకు రాకపోవచ్చని పలువురు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. తర్వాత రెండు రోజులు మంగళ, బుధవారాలు రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇతర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం కిలో రూ.320..రానున్న రోజుల్లో రూ.380కి చేరే ఛాన్స్? మన తెలంగాణ/హైదరాబాద్ : అన్సీజన్లోనూ చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ట్రిపుల్ సెంచరీ దాటడంతో సామాన్యులకు చికెన్ కూర దూరమవుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సాధారణంగా డిమాండ్ తక్కువగా ఉండే అన్ సీజన్లోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటేసి కిలోకు రూ.320 వరకు అమ్ముడవుతున్నాయి. స్థానిక మార్కెట్లలో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం తో.. సామాన్య జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ ధర ఎంత అని అడిగి మరీ కొనకుండా వెళ్లిపోతున్నారని వ్యాపారాలు అంటున్నా రు. ఇదే ధరకు హాఫ్ కేజీ మటన్ వస్తది కదా అంటూ కొనకుండా కొనుగోలు దారులు వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం షాప్స్ అన్ని ఖాళీగా దర్శన మిస్తు న్నాయి. గతంలో ఇదే సమయంలో చికెన్ ధరలు తక్కువగా ఉండేవి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాపారులు చెబుతున్నా రు. పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా తగ్గిపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వారు వాపోతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో మార్కెట్లో చికెన్కు కొరత ఏర్పడిందని వ్యాపారుల మాటగా వినవస్తోం ది. ఈ కారణాల వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశ ముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనే కిలో చికెన్ ధర రూ.380 వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత భారంగా మారే అవకాశముందని సామాన్యులు ఆందోళన వ్యక్తపరుస్తు న్నారు.
సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం…
సాగు నీరు అందిoచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
రామప్ప దేవాలయ పరిసరాలలోని జైన గుడిని పరిరక్షించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయ పరిసరాల్లోని సా.శ.13వ శతాబ్దికి చెందిన వర్ధమాన మహావీరుని జైన గుడిని పదిలపరిచి, పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఇఒ, డా. ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి, అరవింద్ ఆర్య కోరారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనగుడిని కూడా ఆ జాబి తాలో చేర్చాలని కోరారు. ఆదివారం రామప్ప పరిసరాల్లోని కాకతీయ ఆనవాళ్లను పరిశీలించిన వారిద్దరు, జైనాలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గర్భాలయం, అర్దమండపం, రెండిటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణ కలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన (శిఖరం), దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్దం పడుతున్నాయన్నారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం శిల్పం చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుని లాంఛనమని, అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరునికి అంకితం చేయబడిందని చెప్పొచ్చని శివనాగిరెడ్డి, అరవింద్ ఆర్య చెప్పారు. అద్భుత కాకతీయ వాస్తు నైపుణ్యం ఉట్టిపడుతున్న ఈ ఆలయాన్ని కూడా పదిలపరిస్తే రామప్ప ఆలయ సందర్శకులకు మరో పర్యాటక ఆకర్షణ అవుతుందని వారన్నారు.
ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం
ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని
సీఎం చంద్రబాబు సీరియస్ ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్
పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న కలెక్టర్…
పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న కలెక్టర్… అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం…95,598 మంది
సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ
సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ మోత్కూర్, ఆంధ్రప్రభ : జిల్లా రచయితల
జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత
జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ కాంగ్రెస్
వదంతుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటన టెల్ అవీవ్ : ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలో మరణించి ఉంటారని వస్తున్న ఊహాగానాలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. నెట్టింట ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేసింది. ఇక నెతన్యాహు తనయుడు కూడా కొన్ని రోజులుగా కనిపించట్లేదన్న వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయన మార్చ్ 9 నుంచి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత శుక్రవారంనాడు నెతన్యాహు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన వీడియో సందేశంతో కూడిన పోస్ట్పై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ వీడియోలో పలు మార్లు నెతన్యాహు చేతి వేళ్లు ఆరు ఉన్నట్లు కనిపించాయి. అది ఏఐ వీడియో అని, నెతన్యాహు మరణించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
రైతన్నా మీకోసం.. రైతుల్లో అవగాహన…
రైతన్నా మీకోసం.. రైతుల్లో అవగాహన… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం
అక్కడ సరదా కోసం మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్
‘ఖర్గ్’పై సరదాగా మరిన్ని దాడులు చేస్తాం చమురు క్షేత్రాలను లక్షంగా చేసుకోలేదు సైనిక స్థావరాలను దారుణంగా దెబ్బతీశాం మొజ్తాబా బతికి ఉన్నాడనేది అనుమానమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు న్యూయార్క్ : పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారంనాడు ఓ వార్త సంస్థకకు ఇచ్చిన ఇంటర్వూలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న ఖర్గ్ ద్వీపంపై సరదాగా మరిన్ని దాడులు చేస్తామని అన్నారు. ఇప్పటికే మేం జరిపిన దాడుల్లో భారీగా దెబ్బతిందని, అధిక భాగం ధ్వంసమైందన్నారు. అత్యధికంగా సైనిక స్థావరాలనే లక్షంగా ఎంచుకున్నామని ట్రంప్ తెలిపారు. చమురు క్షేత్రాలను దాడులకు లక్షంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు దిశగా ఒప్పందానికి ఇరాన్ సంసిద్ధంగా ఉందని, అందుకు ప్రతిపాదిస్తున్న షరతులు మాత్రం అంగీకార యోగ్యంగా లేవన్నారు. యుద్దం ముగింపునకు తాము సిద్ధంగా లేమంటూనే ఇరాన్ విధిస్తున్న షరతులేంటో చెప్పేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడనడానికి రుజువులేంటని ట్రంప్ ప్రశ్నించారు. ఆయన బతికి ఉన్నట్లు లేడని తాను విన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు కదా అని ప్రశ్నించారు. ఒక వేళ బతికి ఉంటే ఆ దేశం కోసం.. లొంగిపోయేందుకుతెలివైన నిర్ణయం తీసుకుని ఉండేవారన్నారు.
నెతన్యాహు బతికి ఉంటే వెంటాడి చంపుతాం
నెతన్యాహు చిన్నారుల హంతకుడు ఇప్పటికీ ఆయన ఉనికిపై అనుమానాలు ఉన్నాయి ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరిక టెహ్రాన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బయటి ప్రపంచానికి కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఉనికిపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతుతన్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఘాటు హెచ్చరిక చేసింది. నెతన్యాహు బతికి ఉన్నట్టయితే ఆయనను వెంటాడి మరీ అంతమొందిస్తామని హెచ్చరించింది. చిన్నారులను పొట్టనపెట్టుకున్న హంతకుడిగా నెతన్యాహును అభివర్ణించింది. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారా అనేది మాత్రం అనుమానమేనని ఇరాన్ అభిప్రాయపడింది. నెతన్యాహు మరణించి ఉంటాడని?.. లేకపోతే కుటుంబంతో పాటు దేశాన్ని వీడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇటీవల నెతన్యాహు పత్రికా సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వీడియోలో నెతన్యాహు చేతికి ఏకంగా ఆరు వేళ్లు ఉండటం గమనించిన కొందరు అది ఏఐతో చేసిన వీడియో అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో అమెరికా రాజకీయాల విశ్లేషకురాలు కాండిస్ ఓవెన్స్ కూడా నెతన్యాహు ఎక్కడ? అని ప్రశ్నించడం మరింత కలకలం రేపింది.
అనాధ పిల్లలకు అభిమన్యు గ్రూప్ ఆత్మీయ సహాయం
అనాధ పిల్లలకు అభిమన్యు గ్రూప్ ఆత్మీయ సహాయం రూ. 90,500 సహాయం చేసి
Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry Polls Scheduled
The Election Commission of India has announced the schedule for the upcoming Assembly elections in five states. The elections will take place in Tamil Nadu, Kerala, West Bengal, Assam, and the Union Territory of Puducherry. The current terms of these assemblies are set to end in May and June, so the polling process will be […] The post Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry Polls Scheduled appeared first on Telugu360 .
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన
10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున
10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున రాప్తాడు, ఆంధ్రప్రభ :
ఎడపల్లి మండలంలో అకాల వర్షం… ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో ఆదివారం
ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్
ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం
కొండపల్లిలో ఉపేంద్ర దాస్కు ఘన స్వాగతం…
కొండపల్లిలో ఉపేంద్ర దాస్కు ఘన స్వాగతం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గంగోత్రి నుంచి
ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం
ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం జనగామ అర్బన్, ఆంధ్రప్రభ :
మాన్యవర్ కాన్షీరాంకు వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలి….
మాన్యవర్ కాన్షీరాంకు వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలి…. బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన సీనియర్
சிலிண்டர் இலவசமாக வழங்கப்படும் என பிரதமர் மோடி அறிவித்தாரா?
இலவச சிலிண்டர் வழங்கப்படும் என பிரதமர் மோடி அறிவித்ததாக தவறான தகவலுடன் டீப்பேக் வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது.
ఎడపల్లి, ఆంధ్రప్రభ: రాణి శీలం జానకీబాయి పేరుతో ఏర్పడిన జానకంపేట గ్రామంలో యువకులు
కాంగ్రెస్ తోనే ముస్లింల అభివృద్ధి సాధ్యం
తొర్రూరు, ఆంధ్రప్రభ : ముస్లింల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే
మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత…
మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత… రాయపర్తి, ఆంధ్రప్రభ : కొండూరు గ్రామ మత్స్యకార
తొర్రూరులో చికిత్స కోసం వచ్చిన యువతితో వైద్యుడు అసభ్య ప్రవర్తన...
తొర్రూరు: చికిత్స కోసం వచ్చిన యువతితో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. పేషెంట్ తరఫు బంధువులు డాక్టర్కు దేహశుద్ధి చేశారు. 21 ఏళ్ల యువతి జ్వరంతో బాధపడుతూ డాక్టర్ కిరణ్ కుమార్ వద్దకు చికిత్స కోసం వచ్చింది. సదరు యువతికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం ఆమెతో వైద్యులు అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో తన భర్తకు యువతి వాట్సాప్ మెసేజ్ చేసింది. డాక్టర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో యువతి బంధువులు దేహశుద్ధి చేశారు.
నేత్రదానంతో ‘సజీవం’.. సత్యప్రకాష్ కుటుంబీకుల ఆదర్శం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తన నేత్రాల
నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీలివే.. షెడ్యూల్ ఇదే
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది
ఇల్లు దగ్దం.. కుటుంబానికి సహాయం…
ఇల్లు దగ్దం.. కుటుంబానికి సహాయం… 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ హసన్
బాలికలు తువ్వాలు చుట్టుకుని నృత్యం #telugupost #dance ##viralvídeo #westbengal #schooldance
డ్రగ్స్ కేసులో టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ లభించింది. టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి రోహిత్ రెడ్డిని తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే టిడిపి ఎంపిని వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండడంతోనే స్టేషన్ బెయిల్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపి పుట్టా మహేష్కు సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురికి పాజిటివ్ రాగా అందులో బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ పెలైట్ రోహిత్ రెడ్డి తో పాటు అయన సోదరుడికి పాజిటివ్ వచ్చింది.
గ్రామ పంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానం
ములకలపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ కార్మికుల ను కమాలపురం సర్పంచ్ వగ్గేల
నాలుగు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్లో మాత్రం రెండు దశల్లో అంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. కాగా మే 4న కౌంటింగ్ జరుగనుంది. పుదుచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు షెడ్యూల్ ప్రకటించారు.
చిలుపూరులో వైభవంగా సుదర్శన హోమం
చిలుపూర్, ఆంధ్రప్రభ: చిలుపూర్ మండల కేంద్రంలోని బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ
Biotechnologies |పీ4తో పేదరికం నుంచి పురోగతి వైపు..
Biotechnologies | పీ4తో పేదరికం నుంచి పురోగతి వైపు.. జిల్లాలో విజయవంతంగా పీ4
పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం..
పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :
అండర్-19 ఎంపిక ట్రయల్స్.. కే డి సి ఏ ఆధ్వర్యంలోమార్చి 19న విజయవాడలో
అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి
అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; అంబేద్కర్
దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్..
దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్.. విజయవాడ, ఆంధ్రప్రభ :
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం: కెటిఆర్
హైదరాబాద్: టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరినట్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం మని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. డ్రగ్స్ వాడకం, చట్ట విరుద్ధ కార్యకలాపాలను బిఆర్ఎస్ ఖండిస్తుందని చెప్పారు. డ్రగ్స్ వినియోగించేది ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘‘రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలి. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశా. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలి. డ్రగ్స్ కేసులో నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా’’ అని కెటిఆర్ అన్నారు.
పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది
పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : గ్రామం పరిశుభ్రంగా
ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు.. చారిత్రక ఆధారాలను పరిశీలించిన దేవస్థానం బృందంఇంద్రకీలాద్రి పర్వత శిఖరం
తెలంగాణలో కుక్కల సామూహిక హత్య కలకలం #straydogs #streetdogs #mancherial #viralnews #telugupost
Moinabad Drugs Case: Putta Mahesh Granted Station Bail; KTR Accepts Drug Test Challenge
The drugs case linked to former MLA Pilot Rohith Reddy’s farmhouse in Moinabad is creating fresh political and legal controversy. Police carried out a raid at the farmhouse after receiving specific information about a drugs party. The Eagle Team conducted the operation and detained ten people who were present at the location. Among those at […] The post Moinabad Drugs Case: Putta Mahesh Granted Station Bail; KTR Accepts Drug Test Challenge appeared first on Telugu360 .
భజరంగ్ దళ్ కన్వీనర్ గా కొమ్ము శ్రావణ్
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ భజరంగ్ దళ్
విశ్రాంత ఉద్యోగి గోద్రుకు నివాళి..
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచంలొద్ది
KTR |డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది…
KTR | డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది… KTR | డ్రగ్స్ ఘటనపై
అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన మొక్క #telugupost #henckeliamonophylla #latestnews #rareplants
నాగబంధం చిత్రం నుంచి ‘నమో రే నమో రే’ సాంగ్ విడుదల
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి సింగిల్ని విడుదల చేశారు. ‘నమో రే నమో రే’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించారు. జునైద్ కుమార్ ఈ పాటకు సంగీతం అందించగా.. సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ పాటని కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పోలిన భారీ సెట్లో చిత్రీకరించారు. ఈ పాటని గణేశ్ ఆచార్య, శ్రేష్ఠి కొరియోగ్రాఫీ చేశారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ పాట ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు ఆ సాంగ్ను చూసేయండి..
మాన్కుగూడ గ్రామంలో ఆదర్శ కార్యక్రమం
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోనిమాన్కుగూడ గ్రామంలో
USERS | వంటగదిలో యుద్ధం.. USERS | ఒకవైపు కేవైసీ గందరగోళం.. మరోవైపు
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన సర్పంచ్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బెల్లంపల్లి
అన్నమయ్య జిల్లా / పుంగనూరు, ఆంధ్రప్రభ : నిన్నటి వరకు ఆ ఇంట్లో
శానిటరీ వర్కర్లకు సన్మానం… బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ASI #telugupost #cyberfraud #cybercrime #telanganapolice #latestnews
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బత్తుల మల్లేష్
దేవరపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవరపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇందిరమ్మ ఇండ్లతో పేదల గృహ కల సహకారం
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులు
ఇందిరాపార్క్ వద్ద ఆందోళన రీయంబర్స్మెంట్ బకాయిల విడుదల చేయాలివిద్యార్థులు, ప్రజా సంఘాల నాయకుల
రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ..
రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ.. రాష్ట్ర ప్రభుత్వ నుండి
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ..
కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్మ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, ఆంధ్రప్రభ
నలుగురు మృతి.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నల్గొండ జిల్లాలో ఇవాళ (ఆదివారం) ఘోర
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం వంగాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఆదివారం
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సంతకాలు సేకరణ
జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన
kate sharma |బికినీలో కేట్ శర్మ అందాలు
kate sharma |బికినీలో కేట్ శర్మ అందాలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : భారతీయ
ప్రభుత్వం అసమర్థత కారణంగానే ఈ దుస్థితి దాపురించింది: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలను ఎగ్గొట్టిన మొదటి సిఎం రేవంత్ రెడ్డి అని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మూడు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారని, రైతులు రైతుభరోసాపై ఆశలు వదులుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాసి.. అంశాలను వెల్లడించారు. వనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి..రాజకీయ నాయకుల కొమ్ము కాయొద్దు అని..ప్రశ్నించే వారిని అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలియజేశారు. సకాలంలో కరెంట్, యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం అసమర్థత కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, రామన్న గట్టు రిజార్వాయర్ శంకుస్థాపన చేసినా ఇంతవరకూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇరిగేషన్ చీఫ్ అందుబాటులో లేక సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, జిల్లా మంత్రులకు కక్షసాధింపు చర్యలు తప్ప.. ప్రజా సంక్షేమం పట్టదు అని ధ్వజమెత్తారు. 7 టిఎంసిల సామర్థ్యం ఉన్న ఎదుల రిజర్వాయర్ ను రెండేళ్లలోనే పూర్తి చేశామని అన్నారు. 2 టిఎంసిల రామన్న గట్టు రిజర్వాయర్ ను పూర్తి చేయలేకపోతున్న కాంగ్రెస్ అని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

27 C