యురోపియన్ దేశం, నాటో మిత్రదేశం స్పెయిన్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు కోపం వచ్చింది. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో స్పెయిన్ తన స్థావరాలను ఉపయోగించుకోవడానికి అమెరికా సైనిక దళాలను అనుమతించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే, స్పెయిన్ తో అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని, వాణిజ్య పరమైన ఆంక్షలు విధిస్తామని బుధవారం నాడు హెచ్చరించారు.స్పెయిన్ వైఖరి చాలా దారుణంగా ఉందని ట్రంప్ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. స్పెయిన్ తో అన్ని లావాదేవీలు నిలిపివేయాలని అమెరికా ఆర్థిక శాఖమంత్రి స్కాట్ బెసెంట్ తో చెప్పినట్లు ఆయన తెలిపారు. స్పెయిన్ తో అన్ని సంబంధాలను తాము తెగతెంపులు చేసుకుంటామని ప్రెసిడెంట్ అన్నారు.స్పెయిన్ లోని సోషలిస్ట్ నాయకత్వం ఇరాన్ పై దాడికి ఉపయోగించే విమానాలను రీఫిల్లింగ్ ట్యాంకర్ లు తాము అనుమతించబోమని ప్రకటించడంతో దక్షిణ స్పెయిన్ లోని రోటా,మోరాన్ మిలిటరీ స్థావరాలనుంచి అమెరికా తమ 15 ఎయిర్ క్రాఫ్ట్ లను, రీఫిల్లింగ్ ట్యాంకర్ లను వేరే ప్రాంతానికి తరలించవలసి వచ్చింది. నాటో సభ్యదేశాలన్నీ తమ జీడీపీలో 5 శాతం రక్షణ కోసం ఖర్చు చేయాలన్న అమెరికా పిలుపును స్పెయిన్ పట్టించుకోక పోవడం కూడా ట్రంప్ కోపానికి కారణమైంది. అందువల్ల ఇక స్పెయిన్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై స్పెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.ట్రంప్ తో సమావేశం అనంతరం జర్మన్ ఛాన్స్ లర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ గత సంవత్సరం అమెరికా -యురోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి స్పెయిన్ ను ప్రత్యేకంగా మినహాయించలేదని తాను ట్రంప్ తో ప్రత్యేకంగా చెప్పినట్లు పేర్కొనడం విశేషం.
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికలలో చైర్మెన్ ఎన్నిక విషయంలో నెలకొన్న దాడుల నేపద్యంలో జైలుకు వెళ్లిన పెద్దపల్లి మాజీ ఎంపి, చెన్నూర్ మాజీ ఎంఎల్ఎ మాజీ విఫ్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, చెన్నూర్ నాయకులు మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ లు 14 రోజుల రిమాండ్ తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి వారు విడుదల అయ్యారు. బాల్క సుమన్ కు బెయిల్ వచ్చిన నేపధ్యంలో మంచిర్యాల జిల్లా నుండి బిఆర్ఎస్ శ్రేణులు బుదవారం ఉదయమే ఆదిలాబాద్కు తరలివెళ్లారు. జిల్లా జైలు నుండి విడుదలైన వారిని బిఆర్ఎస్ శ్రేణులు శాలువలతో సత్కరించి, గజమాలలు వేసి జైలు గేటు వద్ద నుండి బుజాలపై ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకుని ఊరేగించారు. రాజీకీయలలో ప్రతిపక్ష ప్రత్యర్థులుగా చూశామే కానీ వ్యక్తిగత శత్రువులుగా చూడలేదని మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ అన్నారు. జైలు నుండి విడుదలైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి, చెన్నూర్ ఎంఎల్ఎ, మంత్రి గడ్డం వివేకానంద కండ్లు చల్లబడ్డాయా, కక్ష తీరాందా అని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను విస్మరించి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ క్యాతన్పల్లి లో తమపై రాళ్లదాడి చేసిందని, పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, తిరిగి సూమారు 25 మంది పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తనను జైలులో పెట్టించివా వారికి కక్ష తీరినట్లు లేదని, మళ్లీ జైలుకు పంపించాలని కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ మొదలు, మందమర్రి తహాసిల్దార్, డిసిపి, రామకృష్ణాపూర్ ఎస్ఐ లు కూడా ప్రభుత్వ శాఖలో పని చేయడం లేదని, మంత్రి విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా వ్యవహరిస్తున్నారన్నారు. తాము ఎప్పుడు రాజకీయంగానే ఎదుర్కొన్నామని, కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని.పదేళ్లు అధికారంలో ఉన్నా ఎవరిని జైలుకు పంపలేదన్నారు. మంత్రి వివేకానంద కోల్బెల్టును రావణకాష్టం చేస్తున్నారని విమర్శించారు. తాను 2014 లో పెద్దపల్లి ఎంపిగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా గడ్డం వివేకానంద పోటీ చేసి ఓడిపోయారని, ఆయనను బిఆర్ఎస్లో చేర్చుకుని ప్రభుత్వంలో సలహాదారుడిగా నియమించారన్నారు. తాను 2018 లో చెన్నూర్ ఎంఎల్ఎ గా పోటీ చేయగా తనపై కాంగ్రెస్ ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీ చేసిన బొర్లకుంట వెంకటేష్ నేత ఓడిపోతే, ఆయనను అక్కు న చేర్చుకుని 2019 లో టిఆర్ఎస్ పెద్దపల్లి ఎంపిగా నిలబెట్టి గెలిపించుకున్నామని అన్నారు. తాము కలుపుకు పోయే పనులు చేశామే తప్ప కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. నేడు ముఖ్యమంత్రి రేవెంత్రెడ్డి, మంత్రి వివేకానంద కక్ష కట్టి తనను జైలుకు పంపించడంతో పాటు బెయిల్ రాకుండా కుతాంత్రాలు చేశారని విమర్శించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటి విషయంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికైనా గౌరవించాలని ఆయన సూచించారు. ఆయన వెంట మాజీ మంత్రి జోగురామన్న, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్.. కష్టాల్లో సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడుతున్నారు. 77 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది సఫారీ జట్టు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు రెండో ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఈ ఓవర్ లో వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులతో చెలరేగడంతో సఫారీ బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. సగం ఓవర్లకే కీలక బ్యాటర్లు ఔట్ కావడంతో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. దీంతో సపారీ జట్టు 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్(13), యాన్సెన్(21)లు ఉన్నారు. ఇక, కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్కాంచి చెరో రెండు వికెట్లు తీయగా.. నీషమ్ ఒక వికెట్ పడగొట్టాడు
పెరిగినవ విద్యుత్ డిమాండ్.. ఒక్క రోజే 4421 మెగావాట్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం (మార్చి 3) రోజున గరిష్ట విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకుంది.ఇప్పటి వరకు నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇదే. గత ఏడాది మే 6న అత్యధికంగా 4,352 మెగావాట్ల రికార్డును ఈసారి మార్చి నెలలోనే అధిగమించడం విశేషం.సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ప్రధానంగా ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వినియోగం పెరుగుతుండటంతో డిమాండ్ భారీగా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా నిరంతర సరఫరా అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)జితేష్ వి పాటిల్, ఐఏఎస్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, 33 కేవీ/11 కేవీ ఫీడర్ల పై, సబ్ స్టేషన్ల లోని పవర్ ట్రాన్స్ ఫార్మర్ల లోడ్ ను పర్యవేక్షించాలని ఇప్పటికే క్షేత్ర స్థాయి అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
ఐదు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సౌతాఫ్రికా
కోల్కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సఫారీలను బ్యాటింగ్కి అహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన సౌతాఫ్రికా 12 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 55 పరుగుల వద్ద కెప్టెన్ మార్క్రమ్(18) ఔట్ అయ్యాడు. ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం డేవిడ్ మిల్లర్(6) స్వల్పస్కోర్కే పెవిలియన్ చేరాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజ్లో స్టబ్స్(7), జెన్సన్ (17) ఉన్నారు.
తెలంగాణలో ఆంధ్ర ఇసుక మాఫియా దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇసుక మాఫియా,
దేవినేని కుటుంబం అంటే జిల్లాలో ఒక బ్రాండ్
దేవినేని కుటుంబం అంటే జిల్లాలో ఒక బ్రాండ్ విజయవాడ తూర్పు ప్రతినిధి, ఆంధ్ర
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని మూడు ప్రముఖ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తు లు బెదిరింపులు పంపడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కపిలతీర్థం దగ్గర రాజ్ పార్క్ హోటల్, పాయ్ వైస్రాయ్, ఉప్పరపల్లిలోని ఎస్ ఆర్బి హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తు తెలియన వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటల్లోనే తిరుపతిలో హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. హోటళ్ల సిబ్బంది సమాచారంతో అప్రమత్తం అయిన పోలీసులు తనీఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంలతో హోటల్ గదులు, పార్కింగ్ ఏరియా, లాబీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా హోటళ్లను ఖాళీ చేయించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి బాంబు సంబంధించిన వస్తువులు లభించలేదు. ప్రముఖులు విడిది చేసే ఇలాంటి హోటళ్లకు బెందిరింపులు రావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమెయిల్స్ ఎక్క డినుంచి వచ్చాయి? ఎవరూ పంపించా రు? అనే అంశాలతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీం ఈ-మెయిల్ ఐడిలను ట్రాక్ చేస్తోంది.
నాన్ టీచింగ్ స్టాఫ్ పై విద్యార్థి దాడి…
నాన్ టీచింగ్ స్టాఫ్ పై విద్యార్థి దాడి… గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా
ఇరాన్ సుప్రీం ఎవరైనా టార్గెట్ చేస్తాం : ఇజ్రాయెల్ హెచ్చరిక
జెరూసలెం: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ వారసులుగా ఎవరు వచ్చినా వారిని లక్షంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం హెచ్చరించారు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనుకునే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. 1979 ఇస్లామిక్ రివల్యూషన్ దగ్గర నుంచి రెండోసారి ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికైన వారు ఎవరైనా, లేదా ఎక్కడ దాగున్నా ఇజ్రాయెల్ ప్రధాని, తాను ఆపరేషన్ “లయన్స్ రోర్ ”లో భాగంగా మట్టుబెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఐడిఎఫ్ను ఆదేశించామని చెప్పారు. ఇదిలా ఉండగా టెహ్రాన్పై బుధవారం ఉదయం పదోసారి దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. టెహ్రాన్లో ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వ మౌలిక సౌకర్యాలను లక్షంగా చేసుకుని భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించినట్టు పేర్కొంది. అమెరికా భాగస్వామ్యంతో పూర్తి బలగాలతో దాడులు కొనసాగుతాయని వివరించింది.
వైయస్సార్ కాలనీలో అర్థరాత్రి బైకులు దగ్ధం..
వైయస్సార్ కాలనీలో అర్థరాత్రి బైకులు దగ్ధం.. చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్
యువత ఉపాధి వారసత్వ పరిరక్షణే లక్ష్యం…
యువత ఉపాధి వారసత్వ పరిరక్షణే లక్ష్యం… చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర పర్యాటక
అబూధాబిపై ఇరాన్ దాడి.. తెలంగాణ వ్యక్తికి గాయాలు
అబూధాబి ఎయిర్పోర్టులో ఘటన సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె వాసి కొడుకు కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు కరీంనగర్: గల్ఫ్ యుద్ధం ప్రభావం ఓ తెలంగాణ కుటుంబంపై పడింది. అబూధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల దశలో అక్కడున్నన తెలంగాణ ప్రాంతపు వ్యక్తి ఒకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు బుధవారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోతిరెడ్డి పల్లెకు చెందిన ఎన్ రాజేశ్వర రావు అనే వ్యక్తి చాలా కాలంగా అబూధాబి ఎయిర్పోర్టులో హౌస్ కీపింగ్ విభాగంలో ఉద్యోగిగా ఉన్నాడు. మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్రతరం అయిన దశలో అబూధాబిపై ఇరాన్ సేనలు దాడులకు దిగుతున్నాయి. ఈ దాడుల్లో తాను మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు రాజేశ్వర రావు ఫోన్లో తల్లిదండ్రులకు తెలిపారు. దీనితో ఊరిలో ఆయన కుటుంబంలో కలవరం చెలరేగింది. తమ కుమారుడికి ఏమైందో తెలియడం లేదని, ఏడాది నుంచి అక్కడ పనిచేస్తున్నాడని, గాయపడ్డట్లు తెలిసిందని , వీడియో కాల్ చేసి మాట్లాడాడని తండ్రి ప్రభాకర రావు వార్తా సంస్థలకు తెలిపారు. కొడుకు తిరిగి మన దేశం రావాలని కోరుకుంటున్నానని వాడు క్షేమంగా ఇంటికి చేరేలా ప్రభుత్వం చూడాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. తాను బాగానే ఉన్నానని చెపుతున్నాడని, అయితే తమకు వాడి పరిస్థితి గురించి దిగులు పట్టుకుందని, తిరిగి వచ్చేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించారు. గల్ఫ్ ప్రాంతంలో దాడులతో అక్కడి పరిస్థితి దిగజారుతోంది. ఈ ప్రాంతంలోని పలు దేశాల నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు అతికొది విమానాల రాకపోకలు ఆరంభం అయ్యాయి. బుధవారం కొందరు ప్రయాణికులు జెడ్డా, సౌదీ నుంచి బిక్కుబిక్కుమనుకుంటూ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమకు పెద్దగా ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదని తెలిపారు. దాడుల సమయంలో అబూధాబిలో తమకు సరైన ఏర్పాట్లు, సౌకర్యాలు ఉన్నాయని మదీనాకు వెళ్లి వచ్చిన అక్కడి నుంచివచ్చిన వారు తెలిపారు. మహ్మద్ అబ్దుల్ రజాక్ పలుసార్లు విమానాల రద్దు తరువాత క్షేమంగా హైదరాబాద్ చేరాడు. ట్రావెల్ ఏజెన్సీ వారు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని సంతోషం వ్యక్తం చేశారు.
HDFC Bank |బ్యాంకు ముందు పార్కు చేసిన బైక్ చోరి..
HDFC Bank | బ్యాంకు ముందు పార్కు చేసిన బైక్ చోరి.. పోలీసులను
Notification |దరఖాస్తు చేసుకోండి
Notification | దరఖాస్తు చేసుకోండి Notification | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : మీరు
కలెక్టర్ అనురాగ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
కలెక్టర్ అనురాగ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి
జైల్లో నరకం చూపించారు.. క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ
4th day |ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం
4th day | ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం 4th day
కల్తీ పాల ఘటన.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు విడిచింది. కల్తీపాలు తాగి తీవ్ర అనారోగ్యానికి గురి కాగా.. కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో ఈ కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి గర్బిణీని తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్లో మహిళ ప్రసవించినట్లు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వారిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఈఎంటీ లక్ష్మణ్ తెలిపారు. వివరాలలోకి వెళితే.. లింగంపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన శైలజకు డెలివరీ కోసం మాత శిశు సంరక్షణ ఆస్పత్రి బాన్సువాడకు తీసుకుని వస్తుండగా తగిన పరీక్షలని నిర్వహించారు. ఈ క్రమంలో మహిళకు బిపి పెరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాన్సువాడ నుంచి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్లో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ లక్ష్మణ్ డెలివరీ చేశాడు. ఆడ బిడ్డకు జన్మనివ్వగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు ఈఎంటీ లక్ష్మణ్తో పాటు పైలట్ రాముకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి చికిత్స కోసం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగింది.
Congress Hits Back at Bandi Sanjay Over Rahul Gandhi Remarks
Hyderabad: A political war of words erupted between the BJP and Congress in Telangana after Union Minister Bandi Sanjay Kumar targeted Rahul Gandhi and Chief Minister Revanth Reddy over remarks made during a Congress training programme. Bandi Sanjay alleged that Rahul Gandhi signalling willingness to become Prime Minister showed a “dynastic mindset.” He said the […] The post Congress Hits Back at Bandi Sanjay Over Rahul Gandhi Remarks appeared first on Telugu360 .
subsidy |ఆన్ లైన్ మోసాలు అరికట్టండి…
subsidy | ఆన్ లైన్ మోసాలు అరికట్టండి… బ్యాంకు అధికారులను ఆదేశించిన ఎంపీ
అంబరాన్నంటిన హోలీ సంబరాలు కుంటాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రం కుంటాల కల్లూరు ఓలా
Two-wheeler |ద్విచక్ర వాహనంపై వెళ్తూ…
Two-wheeler | ద్విచక్ర వాహనంపై వెళ్తూ… యువకుడు మృతి Two-wheeler | రొంపిచర్ల,
కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళన…
కఠిన శిక్షలతోనే ఫ్యాక్షన్ సమూల నిర్మూళన… ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే జూలకంటి మాచర్ల,
పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల
పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో పదో
సెమీ ఫైనల్ 1: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
కోల్కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్లు ఒక ఎత్తైతే.. ఇకపై జరిగే మ్యాచ్లో మరింత ఉత్కంఠగా ఉండనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్కు దూసుకుపోతుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పు చేసింది. రబాడా, మార్కో జెన్సన్, కేశవ్ మహరాజ్లను జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మ్యాచ్ హెర్నీ, నీశమ్లను జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: సౌతాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి. న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.
18th Division |సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం…
18th Division | సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం… 18th
నగరంలో మరో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు రట్టు
నగరంలో మరో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు బట్టబయలయ్యింది. కమిషనర్స్ టాస్క్ఫోర్స్(గోల్కొండ టీమ్),మాసబ్ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బంజారాహిల్స్ పరిధి భోలానగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న ‘ప్రైడ్ డెయిరీ’ కల్తీ నెయ్యి తయారీ కేంద్రం వెలుగుచూసింది. సుమారు రూ.18.26 లక్షల విలువజేసే కల్తీ నెయ్యి మరియు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకుని తయారీకేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. భోలానగర్కు చెందిన జునైద్ హుస్సేన్ తన ప్రైడ్ డెయిరీ యూనిట్లో లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ ఈ కల్తీ నెయ్యి కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తక్కువ నాణ్యత కలిగిన పామాయిల్,వనస్పతి(డాల్డా), ఇతర హానికరమైన పదార్థాలను ఆవు,గేదె మీగడలో కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తుండటంతో సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని అసలైన నెయ్యిగా నమ్మిస్తూ ప్రజలకు,హోటళ్లకు,శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. పోలీసులు తనిఖీల్లో రూ.18.26 లక్షల విలువజేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 460 కేజీల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యితో పాటు భారీస్థాయిలో కల్తీకి ఉపయోగించే 2090 కేజీల ఆవు మీగడ,1170కేజీల గేదె మీగడ స్వాధీనం చేసుకున్నారు. నగర అడిషనల్ డిసిపి(టాస్క్ఫోర్స్) అందె శ్రీనివాస్రావు పర్యవేక్షణలో గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్ వెంకటేశ్,మాసబ్ట్యాంక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్,ఎస్ఐలు విజయానంద్,చందన తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇరాన్ యుద్ధనౌకపై దాడి..100 మందికి పైగా గల్లంతు
శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరిగింది. ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా యుద్ధనౌకపై సబ్మెరైన్తో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతైనట్లు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మరో 78 మంది గాయపడినట్లు చెప్పారు. దాడి జరిగిన తర్వాత సమాచారం అందుకున్న శ్రీలంక నావికాదళం వెంటనే అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టింది. మునిగిపోతున్న ఇరాన్ యుద్ధనౌక నుంచి 32 మందిని రక్షించి ఆసుపత్రిలో చేర్చామని శ్రీలంక నేవీ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో యుద్ధనౌకలో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు: మంత్రి పొన్నం
విద్వేషాన్ని రెచ్చగొట్టి మైనార్టీలను అణగారిన వర్గాలను బూచిగా చూపి అధికారాన్ని చెలాయిస్తున్నారని, నిత్యం మతవిద్వేశాలు రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై ధ్వజమెత్తారు.ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా తమ హక్కు. అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు...మరో వ్యక్తి కాదు.. ప్రజలే న్యాయ నిర్ణేతలని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావు, అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. ఈ దేశానికి పట్టిన గ్రహణం ఎవరో ప్రజలకు తెలుసునని, గత 12 ఏళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని, దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి తమాషా చూస్తున్నారని, దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన మీరా మాట్లాడేది..? అని ఆయన దుయ్యబట్టారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారిందని, ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయిస్తున్నారని ఆయన విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, పేదలను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈడి సిబిఐ కేసులతో విపక్ష ప్రభుత్వాలను కూలుస్తు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రాజకీయం మీదని ఆయన విమర్శించారు. దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజలకు ఐక్యతను చాటి మీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న రాహుల్ గాంధీని విమర్శించడం ఆకాశం మీద ఉమ్మిస్తే మీ ముఖం మీదే పడుతుందని ఆ వాస్తవాన్ని బండి సంజయ్ తెలుసుకోవాలని ఆయన సూచించారు.రెండు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయి తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకుని రాలేకపోయిన బండి సంజయ్ తన వ్యవహారశైలి మార్చుకోవాలని ఆయన హితవు చెప్పారు.
Frequent IAS Transfers Have Turned Governance Into a Joke: Harish Rao
Hyderabad: Former minister and BRS Legislature Party deputy leader T. Harish Rao on Wednesday alleged that governance in Telangana has suffered due to frequent transfers of senior officials under the Congress government led by Chief Minister Revanth Reddy. Speaking to reporters, Harish Rao said nearly 140 IAS officers have been transferred since the new government […] The post Frequent IAS Transfers Have Turned Governance Into a Joke: Harish Rao appeared first on Telugu360 .
సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు .. అక్కచెల్లెళ్లకు సన్మానం
సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు .. అక్కచెల్లెళ్లకు సన్మానం జన్నారం, ఆంధ్రప్రభ : సెంట్రల్
2sides |భార్య-తల్లి మధ్య గొడవ… మగవాడు ఎటువైపు?
2sides | భార్య-తల్లి మధ్య గొడవ… మగవాడు ఎటువైపు? 2sides | మగవాడి
Collector |మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి…
Collector | మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి… Collector | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ
Achennaidu : తాను క్షమాపణ చెప్పినా వైసీపీ సభ్యులు అడ్డుకోవడమేంటి?
శ్వాసాలపై వైసీపీ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Education Department Paid for CM Revanth Reddy’s Harvard Program Visit: RTI
Hyderabad: An RTI reply from the Telangana government has revealed that the expenditure for Chief Minister A. Revanth Reddy’s visit to the United States to attend a program at Harvard Kennedy School was borne by the state’s Education Department. The information came in response to an RTI application filed by Hyderabad resident Kareem Ansari seeking […] The post Education Department Paid for CM Revanth Reddy’s Harvard Program Visit: RTI appeared first on Telugu360 .
ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్న కిరాతక దాడి విషయంలో ప్రధానమంత్రి మోదీ ఎటు వైపు ఉన్నారో తేలిపోయింది. ఇరాన్ మీద దాడిని మోదీ ఇప్పటివరకు ఖండించ లేదు. ఇరాన్ అధినేత అలీ ఖామేనీని హతమార్చిన తరవాత మోదీ కనీసం సంతాపం అయినా తెలియజేయలేదు. అంటే ఆయననిర్మొహమాటంగా ఇజ్రాయెల్, అమెరికా మొదలుపెట్టిన యుద్ధాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నట్టే. యుద్ధంలో బాధకు గురవుతున్న ఇరాన్ మీద మోదీకి ఏ మాత్రం చింతలేదు. తరతరాలుగా ఇరాన్తో మనకున్న మైత్రీ బంధం […] The post మోదీ తలుపు చాటు దౌత్యం appeared first on Visalaandhra .
Registrar |రిజిస్ట్రార్ తొలగింపునకు విద్యార్థి సంఘాల ముట్టడి….
Registrar | రిజిస్ట్రార్ తొలగింపునకు విద్యార్థి సంఘాల ముట్టడి…. కోట్ల రూపాయల అవినీతి
అమెరికాతో అంటకాగినందుకు పశ్చాత్తాపం!
కన్వల్ సిబల్యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాల్లోని సైనిక స్థావరాలు, ఇతర ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా తమనుకాపాడుతుందని భావించిన ఈ దేశాలకు, ఇప్పుడు తాము అమెరికా రక్షణలో లేమనే చేదు నిజం అర్థమవుతోంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీనిఅమెరికా అత్యంత దారుణంగా చంపేసింది. ఈ రాజకీయ హత్య మధ్యప్రాచ్యంలో ఒక తీవ్రమైన పరిణామం. ఇరాన్ అమెరికాపై ఎటువంటి దాడి చేయలేదు, అయినప్పటికీ దాని అగ్రనేతను, జనరల్స్ను భౌతికంగా తొలగించారు. […] The post అమెరికాతో అంటకాగినందుకు పశ్చాత్తాపం! appeared first on Visalaandhra .
మనిషికి అంతులేని ఆశలు సహజసిద్ధం. వయస్సు పెరిగే కొద్దీ కొన్ని ఆశలు చచ్చిపోతాయి, కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. సంపాదన యావలో పడి యుక్తవయస్సులో అనుభవించలేని కోర్కెలను, వ్యవహారాలను వయస్సు మళ్లిన తర్వాత తీర్చుకోవాలని తపనపడతారు. ఇందుకోసం ఒక తరహా మానసిక యుద్ధమే చేస్తూ ఉంటారు.ఈ విషయంలో ఎదుటవారి హక్కులకు భంగం వాటిల్లినా, ‘తగ్గేదేలే దంటూ దూసుకుపోతూ ఉంటారు. ఇటీవల అత్యంత ప్రమాదకరమైన, నీచమైన, నికృష్టమైన ధోరణి ఒకటి ప్రబలింది. పైగా దీనికి ‘న్యూ ట్రెండ్’ అని పిలుస్తూ […] The post భాగస్వామి హక్కుకు భంగమా? appeared first on Visalaandhra .
చిత్తూరు జిల్లాలో దారుణం.. నాటు తుపాకీతో కాల్చి యువకుడి హత్య
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తుమ్మదపాలెంలో కాల్పుల కలకలం రేగింది. సాయి కుమార్ అనే యువకుడిని మరో యువకుడు ఢిల్లీ నాటు తుపాకీతో కాల్చాడు. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఢిల్లీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా సిసిటివి ఫుటేజులను పరిశీలిస్తున్నారు. మృతుడు, నిందితుడి మధ్య ఉన్న గత పరిచయాలపై ఆరా తీస్తున్నారు. త్వరగా కేసును చేధస్తామని పోలీసులు తెలిపారు.
లిక్విడ్ ట్యాంకర్ ఢీకొని మహిళ మృతి..
లిక్విడ్ ట్యాంకర్ ఢీకొని మహిళ మృతి.. ముండ్లమూరు, ఆంధ్రప్రభ : మండలంలోని పోలవరం
Hyderabad : యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోలు బంకుల వద్ద పెరిగిన రద్దీ
హైదరాబాద్ లో పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది
బాల్క సుమన్ కు స్వాగతం.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా జైల్
వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి..
వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి.. బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ
Telangana : తెలంగాణలో రికార్డుస్థాయికి చేరుకున్న విద్యుత్తు వినియోగం...ఎంతంటే?
తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది
2.40 lakhs |సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…
2.40 lakhs | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ… 2.40 lakhs
ఒటిటిలోకి వస్తున్న కార్తీ లేటెస్ట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే,,
తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ. కార్తీ నటించిన రీసెంట్ చిత్రం ‘వా వాతియర్’. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్తో ఈ సినిమాను విడుదల చేశారు. నలన కుమారస్వామి దర్శకతంలో తెరకెక్కిన ఈ సినిమాను కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్ ఒటిటిలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్లోమార్చి 6వ తేదీ నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ప్రైమ్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఇందులో కార్తి స్వయంగా తన సినిమా విశేషాలను పంచుకున్నారు.‘‘ అన్నగారి ఆగమనం. ‘అన్నగారు వస్తారు’మార్చి 6 నుంచి నుంచి ప్రైమ్ వీడియోలో’’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను విడుదల చేశారు.
వైభవంగా తిరునాళ్ల ప్రారంభం.. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : కొలిచిన వారికి కొంగు బంగారంగా
హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. నిజామాబాద్,ఆంధ్రప్రభ : రంగుల్లా మన జీవితాలు కూడా
Vijay Appeals for One Chance at Thajavur
Actor turned politician Vijay has begun stepping up his political campaign in Tamil Nadu, but his latest public appearance revealed pressure as he prepares for the upcoming Assembly elections. Speaking at a Tamilaga Vettri Kazhagam functionaries’ meeting near Thanjavur, Vijay directly appealed to the people of the state. He asked voters to give him one […] The post Vijay Appeals for One Chance at Thajavur appeared first on Telugu360 .
T20 World Cup |రికార్డులు మరో లెవెల్
T20 World Cup | రికార్డులు మరో లెవెల్ T20 World Cup
నల్ల నల్లితో రైతులు కుదేల్… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : నిన్న మొన్నటి వరకు
అవి నిజం కావు… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఇజ్రాయోల్, ఇరాన్ యుద్దం సమయంలో
ప్రజాసేవలో కౌన్సిలర్.. మంథని టౌన్: మంథని మున్సిపల్ నాలుగో వార్డ్ కాంగ్రెస్ పార్టీ
కార్మిక సంఘాల సంయుక్త సమావేశం..
కార్మిక సంఘాల సంయుక్త సమావేశం.. కరిమాబాద్, ఆంధ్రప్రభ : మార్చి 9న ఢిల్లీలోని
Video: Sudhan Master Exclusive Interview
The post Video: Sudhan Master Exclusive Interview appeared first on Telugu360 .
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్
విద్యార్థులే ఉపాధ్యాయులైనవేళ… ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని
Thaman’s Touch for Ustaad Bhagat Singh?
Rockstar Devi Sri Prasad is the music composer for Pawan Kalyan’s upcoming release Ustaad Bhagat Singh. The final post-production works are happening currently. The latest speculations say that one more top composer Thaman has joined the team and he is working on the background score. Thaman also worked for the background score for Pushpa 2: […] The post Thaman’s Touch for Ustaad Bhagat Singh? appeared first on Telugu360 .
Lebanon | 16 గ్రామాల ఖాళీకి ఆదేశాలు
Lebanon | 16 గ్రామాల ఖాళీకి ఆదేశాలు Lebanon | ఆంధ్రప్రభ, వెబ్
Andhra Prabha Smart Edition |AP|ఇరాన్కు ఝలక్/మల్లన్న చెంతకు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 04-03-2026, 4.00PM ap ఇరాన్కు ఝలక్.. హ్యాండిచ్చిన
Andhra Prabha Smart Edition |TS|ఇరాన్కు ఝలక్/ఉద్యోగాల స్కామ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 04-03-2026, 4.00PM ts ఇరాన్కు ఝలక్.. హ్యాండిచ్చిన
24 Karat Gold |భారత్లో బంగారం ధరల అస్థిరత..యుద్ధ ప్రభావంతో భవిష్యత్తు ఎలా?
24 Karat Gold | భారత్లో బంగారం ధరల అస్థిరత..యుద్ధ ప్రభావంతో భవిష్యత్తు
Trivikram Vs Basil Joseph for Allu Arjun
Icon Star Allu Arjun is gearing up to shoot for back-to-back films. He has spent ample time on Pushpa franchise and he is also shooting for Atlee’s film for over a year. The actor has signed a film with Lokesh Kanaraj and the shoot commences this year. The shoot will be completed in quick schedules. […] The post Trivikram Vs Basil Joseph for Allu Arjun appeared first on Telugu360 .
క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: భక్తి, ఐక్యత, ఆనందోత్సాహాల
Big News: Ustaad Bhagat Singh Preponed?
Powerstar Pawan Kalyan completed the shoot of Ustaad Bhagat Singh last year and the makers have announced that the film will have its release on March 26th across the globe. Dhurandhar: The Revenge and Toxic are releasing on March 19th during Ugadi and Eid weekend. Toxic is postponed now and there are strong speculations that […] The post Big News: Ustaad Bhagat Singh Preponed? appeared first on Telugu360 .
కొమ్మాల జాతరలో అగ్ని ప్రమాదం గీసుగొండ, ఆంధ్రప్రభ: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని
210 cases |మద్యం సీసాలను రోడ్డు రోలర్తో ధ్వంసం
210 cases | మద్యం సీసాలను రోడ్డు రోలర్తో ధ్వంసం 210 cases
టి-20 ప్రపంచకప్.. రికార్డు స్థాయిలో చూసేశారు..
ప్రస్తుతం జరుగుతున్న టి-20 ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ దేనికదే సాటి అన్నట్లు ఉత్కంఠగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్ వ్యూయర్షిప్ పరంగా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ భారత్లో ఈ టోర్నమెంట్ను 50 కోట్ల మంది వీక్షించినట్లు ఐసిసి ఛైర్మన్ జై షా తెలిపారు. టి-20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే రికార్డు అని వెల్లడించారు. జియో హాట్స్టార్ యాప్లో గరిష్టంగా 6.05 కోట్ల మంది వీక్షించినట్లు పేర్కొన్నారు. రానున్న మ్యాచులు కూడా ఇదే స్థాయిలో వీక్షిస్తే.. కొత్త రికార్డును నమోదు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ‘‘ప్రస్తుత టి-20 ప్రపంచకప్ 2026ను అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్గా మార్చాలనే ఆశయంతో ప్రారంభించాం. భారత దేశంలో ఈ ఈవెంట్ వీక్షకుల సంఖ్య 50 కోట్లను (500 మిలియన్లు) దాటింది. టి-20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యధికం. జియో హట్స్టార్లో వీక్షకుల సంఖ్య 6.05 కోట్లకు (60.5 మిలియన్లు) చేరుకుంది. ఈ రాత్రి నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. వీటిని భారత అభిమానులు వీక్షించి, మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిస్తున్నాం’’ అని జై షా పేర్కొన్నారు.
పరిశ్రమలతో ప్రాణాలు పోతున్నాయి…
పరిశ్రమలతో ప్రాణాలు పోతున్నాయి… బిక్కనూరు, ఆంధ్రప్రభ : కెమికల్ పరిశ్రమలతో ప్రాణాలు పోతున్నాయని
Christian Identity Remark Sparks Major Uproar in Andhra Pradesh Legislative Council
A fresh controversy erupted in the Andhra Pradesh Legislative Council during the heated debate on the Tirumala Laddu adulteration issue. A remark about religious identity sparked a sharp confrontation and ultimately forced the House to adjourn. The situation escalated when Minister Kinjarapu Atchannaidu used the term “Christians” while responding to opposition members during the discussion […] The post Christian Identity Remark Sparks Major Uproar in Andhra Pradesh Legislative Council appeared first on Telugu360 .
రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి
అసైన్డ్ భూముల బిల్లు.. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను మండలి ఆమోదించింది. అసైన్డ్ భూముల సవరణ బిల్లు – 2026 మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు […] The post రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి appeared first on Visalaandhra .
America |యుద్ధాన్ని తక్షణమే ఖండించాలి…
America | యుద్ధాన్ని తక్షణమే ఖండించాలి… America | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ
way2future |మీ డీఎన్ఏ.. ఏ వ్యాధికి మూలం
way2future |మీ డీఎన్ఏ.. ఏ వ్యాధికి మూలం కృత్రిమ మేథ (ఏఐ) విప్లవం
డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ
దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక […] The post డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ appeared first on Visalaandhra .
Heated Confrontation in Andhra Pradesh Legislative Council
The Tirumala Laddu adulteration controversy triggered intense scenes in the Andhra Pradesh Legislative Council, turning the House into a battleground between the ruling alliance and the opposition. Sharp exchanges, political accusations, and procedural disputes dominated the discussion. The confrontation began as ministers questioned the YSR Congress Party for attempting to introduce two motions on the […] The post Heated Confrontation in Andhra Pradesh Legislative Council appeared first on Telugu360 .
అమరావతి: బెలూన్ గొంతులో ఇరుక్కోవడంతో చిన్నారి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... నాలుగేళ్ల వయసు గల శిరీష అనే చిన్నారి బెలూన్తో ఆడుకుంటుంది. బెలూన్ ఊదుతుండగా గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పిపడిపోయింది. వెంటనే చిన్నారిని గుంటూరులోని జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బెలూన్ ఎంత పని చేసిందిరా? నయానా అంటూ తల్లి కన్నీరుమున్నీరు అవుతోంది. పెద్దకాకాని గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
మాట జారి వెనక్కి తీసుకున్న మంత్రి
మాట జారి వెనక్కి తీసుకున్న మంత్రి ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: శాసన మండలిలో
Ys Jagan : వైసీపీలో ఆధిపత్య పోరు.. జగన్ చుట్టూ మళ్లీ కోటరీ అలుముకుంటుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఆధిపత్యం మొదలయింది
‘విరోష్’ లవ్స్టోరీ.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే..
టాలీవుడ్ హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మికలు ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు నుంచే వీరిద్దరు సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత ఎక్కడ చూసినా వీళ్ల టాపిక్ యే కనిపిస్తోంది. చాలాకాలం తమ ప్రేమ విషయాన్ని దాచి పెట్టిన ఈ కపుల్ చాలా దాన్ని బయటపెట్టారు. తామిద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ వెల్లడించాడు. ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ‘‘మా మొదటి సినిమా ‘గీత గోవిందం’ చేసేప్పుడు మేము కేవలం కో-స్టార్స్గా మాత్రమే ఉన్నాము. ఆ తర్వాత నెమ్మదిగా మంచి స్నేహితులమయ్యాము. మా రెండో సినిమా ‘డియర్ కామ్రేడ్’ సమయంలో మా మధ్య ఉణ్న స్నేహం.. ప్రేమగా మారింది. అందరూ అనుకున్నట్లు నేను కాకుండా, రష్మికనే ప్రపోజ్ చేసింది’’ అని అన్నాడు. దీంతో రష్మికే ముందుగా ప్రపోస్ చేసిందన్న విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కాగా, విజయ్, రష్మికలు కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
అగ్నిగుండంలో పడిన భక్తులు.. 10 మందికి గాయాలు #Nalgonda#Amanagallu#TempleFestival#FirePit#Stampede
100 Million |నిల్వలు ఎన్ని..? ఎన్ని రోజులకు..??
100 Million | నిల్వలు ఎన్ని..? ఎన్ని రోజులకు..?? 100 Million |
100 Million |మనకు చమురు సంక్షోభం తప్పదా…?
100 Million | మనకు చమురు సంక్షోభం తప్పదా…? 100 Million |
అత్త కూరవండనివ్వలేదని.... టెక్కీ ఆత్మహత్య
బెంగళూరు: అత్త కూర వండనివ్వలేదని టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుష్మా అనే యువతి పునీత్ కుమార్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. గతంలో ఆమె డెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసింది. ఇప్పుడు మరో కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తోంది. దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట చేసేటప్పుడు అత్త, కొడలు మధ్య గొడవ జరిగింది. కోడలు వంట చేస్తుండగా అత్త వద్దని చెప్పడంతో మనోవేధనకు గురైంది. తన రూమ్లోకి వెళ్లి సుష్మా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్త కుమారుడిని తీసుకొని పారిపోయింది. అత్తింటి వారి వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత…
వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత… కడెం ( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ :
మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రం….
మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రం…. బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో
విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన..
విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన.. ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి అడుగు: అదనపు ఎస్పీ హుస్సేన్
ముంబైలో అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్ వివాహ వేడుకల సందడి #ArjunTendulkar #WeddingCelebrations

30 C