Nara Lokesh : నారా లోకేశ్ కు కూటమి ముద్ర వేసినట్లుందిగా.. పాజిటివ్ గానే వెళుతున్నారుగా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేశ్ ఒకరకంగా భావి నేతగా అవతరిస్తున్నారు.
తగ్గిన బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. రికార్డు స్థాయిలో లక్ష 70వేల రూపాయలకు పైగా నమోదైన బంగారం ధరలు.. ప్రస్తుతం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.450 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.490 తగ్గింది. ఇక, వెండిపై కూడా భారీగా ధర తగ్గింది. కేజి వెండి ధరపై ఏకంగా 5వేల రూపాయలు తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,170కు తగ్గింది. 22 క్యారెట్ల 10 గోల్డ్ ధర రూ. 1,45,900కు పడిపోయింది. ఇక, వెండి విషయానికొస్తే, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.2,70,000కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Exam |పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Exam | పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ Exam | శ్రీకాకుళం,
Governor |పారిశ్రామికవాడగా కొండగల్ ప్రాంతం
Governor | పారిశ్రామికవాడగా కొండగల్ ప్రాంతం Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
కల్వకుర్తి నియోజకవర్గం పాఠశాలకు నిఘా కేంద్రాల వితరణ
వెల్దండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని రాచూర్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు
ఫ్యాక్ట్ చెక్: ఢాకాలో చోటుచేసుకున్న ఘటనను భారత్ లో జరిగినదిగా ప్రచారం చేస్తున్నారు
సోషల్ మీడియా ఒక శక్తివంతమైన డిజిటల్ సాధనం. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ లభ్యత పెరగడంతో భారతదేశంలో
100 Calling | 8గంటల్లో ఛేదించిన ఉప్పల్ పోలీసులు
100 Calling | 8గంటల్లో ఛేదించిన ఉప్పల్ పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్
మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..
కడెం, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన
అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉంది: చంద్రబాబు
అమరావతి: అహింసా మార్గంలో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని అన్నారు. 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహమిది. పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకు చంద్రబాబు, డిప్యూటి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొని.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..పొట్టి శ్రీరాములు మన జాతిపిత మహాత్మ గాంధీ నాయకత్వంలో పనిచేశారని, అనేక సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారని తెలియజేశారు. ఆరు నెలల్లో మొదటి దశ పనులు పూర్తయ్యాయని, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారని, పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ తరం వాళ్లు తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాజధాని లేని రాష్ట్రంలో వైసిపి మూడు ముక్కలాట ఆడిందని, అమరావతిని గత పాలకులు శ్మాశానం అని అవహేళన చేశారని విమర్శించారు. అమరావతిని శ్మశానం అని.. ఎడారి అన్నారని.. అమరావతిని గురించి గత ప్రభుత్వంలో ఎన్నో మాటలన్నారని మండిపడ్డారు. ఎపికి పోలవరం జీవనాడి అని.. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 ఎకరాల భూమిని ఇచ్చారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ ల్యాండ్ పూలింగ్ కు సహకరించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చరిత్రలో మంచీ, చెడు రెండిటినీ గుర్తు పెట్టుకోవాలని, 21 నెలల కూటమి పాలనలో మంచి ఫలితాలు వస్తున్నాయని, అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉందని పేర్కొన్నారు. అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని.. రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు..
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.. జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల బ్యూరో,
రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరం..
రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరం.. మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ :
ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి…
ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి… రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ
సీీపీఎం బెజ్జంకి శాఖ కార్యదర్శి బొమ్మిడి సాయి కృష్ణ ముందస్తు అరెస్ట్
బెజ్జంకి, ఆంధ్రప్రభ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసనకు బయలుదేరుతున్న అంగన్వాడీలను,
భారత జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ ను ఇజ్రాయెల్ దళాలు అరెస్ట్ చేశాయనే వాదనలో ఎలాంటి నిజం లేదు
అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని […] The post అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు appeared first on Visalaandhra .
మీరు ఎలాగూ గెలవరూ.. కనీసం ట్రోఫీలైనా దొంగిలించండి: అక్మల్
ఇటీవల టి-20 ప్రపంచకప్లో సూపర్-8 వరకూ చేరి.. ఓటమిపాలై.. ఇంటి ముఖం పట్టిన పాకిస్థాన్కు తాజాగా మరో పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ పర్యటనలో మూడో వన్డేలో ఓటమిపాలైన పాక్.. 2-1 తేడాతో సిరీస్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.. తమ టీమ్పై దారుణంగా సెటైర్లు వేశాడు. పాక్కు ఎలాగూ ట్రోఫీలు గెలిచే సత్తా లేదని.. కనీసం ట్రోఫీలు అయినా దొంగిలించాలని చురకలు అంటించాడు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నెదర్లాండ్ సైతం పాక్ను ఓడించి.. టెస్ట్ క్రికెట్ హోదా కైవసం చేసుకుంటుంది. ఇదీ పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి. బంగ్లాదేశ్ నిజానికి చాలా తేలికగా 350 పరుగులు చేసేలా కనిపించింది. కానీ వాళ్లు 290కే పరిమితమయ్యారు. లిటన్ దాస్ నెమ్మదిగా ఆడాడు. అయినా ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మ్యాచుల్లో ప్రత్యర్థులను ఓడించలేకపోతే.. మీరు ఇఖ ఐసిసి ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తెచ్చుకోవాల్సిందే’’ అని అక్మల్ అన్నాడు.మీరు ఎలాగూ గెలవరూ.. కనీసం ట్రోఫీలైనా దొంగిలించండి: అక్మల్ అన్నాడు.
నేను బతికే ఉన్నా అంటూ కేఫ్ లో ప్రత్యక్షమైన నెతన్యాహు #Netanyahu#IsraelPM#FakeNews#IranAttackRumours
మొయినా బాద్ డ్రగ్స్ పార్టీపై కీలక అంశాలివే
మొయినా బాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు
DSP | ఫైళ్లపై విచారణ.. DSP | బాలాపూర్, మార్చి 16 ఆంధ్రప్రభ
టీకా కార్యక్రమం ప్రారంభం మొవ్వ – ఆంధ్రప్రభ : మొవ్వ మండలం పెదముత్తేవి
పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ , జగన్ శుభాకాంక్షలు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని లోకేశ్ సూచించారు. ‘ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి. 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు […] The post పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ , జగన్ శుభాకాంక్షలు.. appeared first on Visalaandhra .
పొట్టి శ్రీరాములుకు నివాళులు పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ పీ-4
అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు..
అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి గ్రామం నందు
తెలుగు జాతి గుర్తింపు కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు
తెలుగు జాతి గుర్తింపు కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు పురపాలక సంఘ కార్యాలయంలో
BRS : బీఆర్ఎస్ నిరసన.. అసెంబ్లీలో నిల్చుని
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు
ఉగాది మహోత్సవములు ఘనంగాప్రారంభం..
ఉగాది మహోత్సవములు ఘనంగాప్రారంభం.. నేటి నుండి 20 వ తేది వరకు.. నంద్యాల
కొత్త మద్ది పడగలో చలివేంద్రం ప్రారంభం
కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని కొత్త మద్ది పడగ గ్రామంలో వేసవికాలం
Legislature |తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
Legislature | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ Legislature | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
తెలంగాణ శాసనసభ ఆవరణలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర గౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్టించడం పట్ల […] The post అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ appeared first on Visalaandhra .
Putta Mahesh : నాకు ఏ పాపం తెలియదు.. ఏ తప్పు చేయాలేదు
డ్రగ్స్ ఆరోపణలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ స్పందన చూసిన వారికి ఎవరికైనా ఇదే అనుమానం కలుగుతుంది
సిట్ ఎదుట విచారణకు లక్ష్మీదుర్గ
సిట్ ఎదుట విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరైన అనంతబాబు భార్య
ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ అజ్ఞాతాన్ని వీడి, ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. రాజమహేంద్రవరం కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన వెసులుబాటు కల్పిస్తూ, ఈ నెల 16 నుండి 30వ […] The post డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరైన అనంతబాబు భార్య appeared first on Visalaandhra .
గన్నవరం, ఆంధ్రప్రభ ; గన్నవరం పట్టణంలోని ఆర్సీఎం చర్చి సమీపంలో సోమవారం ఉదయం
Chandrababu Unveils 58-Foot Statue of Potti Sriramulu in Amaravati
Amaravati witnessed a historic moment as Chief Minister N. Chandrababu Naidu unveiled the towering statue of Amarajeevi Potti Sriramulu. The 58-foot bronze statue stands as a powerful tribute to the man whose sacrifice made the formation of Andhra State possible. The ceremony marked the conclusion of the 125th birth anniversary celebrations of the legendary freedom […] The post Chandrababu Unveils 58-Foot Statue of Potti Sriramulu in Amaravati appeared first on Telugu360 .
Amaravathi : అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
అమరావతి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.
UBS: Pawan’s Dances Set For A Mass Banger
It’s been quite some time since Power Star Pawan Kalyan went all out with his signature dance energy on the big screen. Ustaad Bhagat Singh is all set to fill that gap. Although he once captivated youth with his graceful yet effortless dance moves, Pawan has not shown the same inclination toward dance in recent […] The post UBS: Pawan’s Dances Set For A Mass Banger appeared first on Telugu360 .
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం : మంత్రి నారాయణ
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోంది: గవర్నర్
హైదరాబాద్: దేశానికి దిక్సూచీగా మన రాష్ట్రం నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొనియాడారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి ప్రసంగం చేశారు. తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులేస్తున్నామని, శ్రమించే తత్వంగల శాంతికాముకులు తెలంగాణ ప్రజలు అని తెలియజేశారు. తెలంగాణ పురోగతిలో ప్రతీపౌరుడు భాగస్వామి అని..ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని, ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అందరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని, జిహెచ్ఎంసిని మూడు కార్పొరేషన్లుగా, కోర్,ప్యూర్, రేర్ గా తెలంగాణను విభజించామని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిహెచ్ఎంసి విభజన చేశామని, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించేలా 4 కమిషనరేట్లు ఏర్పాటు చేశామని అన్నారు. హిల్ట్ పాలసీతో పరిశ్రమ భూముల బదలాయింపు జరిగిందని, మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేశామని గవర్నర్ అన్నారు. మూసీలో మురుగునీరు చేరకుండా 39 ఎస్టిపిలు నిర్మాణం జరిగిందని, ఒఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామని అన్నారు. 55కి.మీ. మేర మూసీని పునరుజ్జీవింప చేస్తామని, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్ ప్రెస్ వే, బుల్లెట్ ట్రైన్ కు శంషాబాద్ కు కేంద్రంగా మారబోతోందని గవర్నర్ పేర్కొన్నారు. వరంగల్, అదిలాబాద్ కు ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని, గ్లోబల్ సమ్మిట్ తో రూ. 5 లక్షల 72 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణను అభివృద్ధిలో గ్లోబల్ హబ్ గా మార్చాలనుకుంటున్నామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో బిఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభలో నిలబడే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగాన్నితిలకించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం.. ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్న పరీక్షలుకట్టుదిట్టమైన
Telangana : ప్రజా సంక్షేమ పాలన దిశగా ప్రభుత్వ నిర్ణయాలు
తెలంగాణాలో ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు
మొజ్తాబా బతికి ఉన్నారో లేదో: ట్రంప్
దుబాయ్: ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తాబా ఖామేనీపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన బతికే ఉన్నారో…లేదో…అనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్ షరతులు సరిగా లేకపోవడంవల్ల కాల్పుల విరమణ ఒప్పందానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు.బాగానే ఉన్నా: నెతన్యాహుతన మరణంపై వచ్చిన వదంతులకు ఇజ్రాయెల్ ప్రధాని […] The post మొజ్తాబా బతికి ఉన్నారో లేదో: ట్రంప్ appeared first on Visalaandhra .
Telangana |ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
Telangana | ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం Telangana | ఆంధ్రప్రభ,
ఎద్దుకు పునర్జన్మ ఇచ్చిన పశువైద్యాధికారి..
కుభీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలో
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురు ఎస్ఐలు మృతి
బెంగళూరు: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఎస్ఐలు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ ప్రాంతం చెళ్లకెర తాలూకాలోని బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గంగావతి ప్రాంతానికి చెందిన మంజునాథ్, సింధనూర్కు చెందిన అంబరీశ్ బార్గీ, తీర్థహళ్లికి చెందిన సచిన అనే ముగ్గురు పోలీసులు కర్నాటక రిజర్వు పోలీస్ దళంలో ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు ఎస్ఐలు తన స్నేహితుడిని పెళ్లికి హాజరయ్యేంపదకు కారులో బయలుదేరారు. హగ్గరే గ్రామ శివారులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఎస్ఐలు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చిత్రదుర్గ ఎస్పి రంజిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఝార్ఖండ్ కు చెందిన ట్రక్కు తుముకూర్ నుంచి బళ్లారిలోని జిందాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Dhurandhar Director’s Bold Decision
Dhurandhar is one of the biggest hits of Indian cinema. The film’s second part titled Dhurandhar: The Revenge is all set for release on March 19th and the advance bookings are stupendous. The premiere shows sales alone surpassed the opening numbers of several biggies. The film’s director Aditya Dhar produced Dhurandhar along with Jio Studios. […] The post Dhurandhar Director’s Bold Decision appeared first on Telugu360 .
హత్యకు గురైన గిరిజనుడు కురిసెంగ అర్జున్
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్గూడ
ఏఐ టూల్స్ నేర్చుకుంటేనే పదోన్నతులు యాక్సెంచర్ చీఫ్ జూలీ స్వీట్ ఐర్లాండ్: ఏఐ(కత్రమ మేధ) సాంకేతిక పరిజ్ఞానానికి అన్నింటా ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఏఐ పరిజ్ఞానం అత్యవసరం అయింది. దిగ్గజ కన్సల్టింగ్, ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ తన కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. కెరీర్లో వృద్ధి కోసం ఉద్యోగులు ఏఐ టూల్స్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించింది. కార్యకలాపాలను ఏఐతో అనుసంధానం చేయడానికి వచ్చే మూడు సంవత్సరాల్లో 3 బిలియన్ డాలర్ల (దాదాపు […] The post యాక్సెంచర్… ‘స్వీట్’ కబురు appeared first on Visalaandhra .
కొడిమ్యాల, ఆంధ్రప్రభ ; మండలంలోని గంగారం తండాలో గత రెండు రోజులుగా పెద్దపులి
క్షేత్ర పర్యటన యాత్ర ప్రారంభం..
క్షేత్ర పర్యటన యాత్ర ప్రారంభం.. బంటుమిల్లి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా ఉద్యానవన శాఖ
పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన
అబ్దుల్లాపూర్ మెట్ (జనం సాక్షి ): పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మేట్ …
May15 |ఇద్దరిలో గెలిచేది ఎవరు..?
May15 | ఇద్దరిలో గెలిచేది ఎవరు..? May15 | బాక్సాఫీస్ వద్ద సూర్య
Exams | విద్యార్థుల పరుగులు.. Exams | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
వెనక్కి వచ్చిన ఎమిరేట్స్ విమానం… దుబాయ్: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నడుమ ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తోంది. పలు దేశాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు జరుపుతోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున డ్రోన్ల దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ డ్రోన్ ఇంధన ట్యాంక్ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసి, విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, […] The post దుబాయ్ ఎయిర్పోర్టు మూసివేత appeared first on Visalaandhra .
జగద్గిరిగుట్టలో చిన్నారిని నేలకేసికొట్టిన మందుబాబు
కూకట్ పల్లి: పెద్దల మధ్య మధ్య గొడవ చిన్నారి ప్రాణం తీసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి మండలంలో జరిగింది. జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతం దేవేందర్ నగర్ లోని కట్ట మైసమ్మ నగర్ లో కృష్ణవేణి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటుంది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో కొద్ది రోజులుగా భర్తకు దూరంగా ఉంటుంది. గాలిపోచమ్మ బస్తీకి చెందిన శివ తరచుగా కృష్ణవేణి ఇంటివద్దకు మద్యంతాగి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం కూడా తాగి వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో కోపంతో కృష్ణవేణి చిన్న కూతురు వెన్నల (4)ను అమాంతం పైకి లేపి కింద పడేసి కొట్టాడు. దీంతో చిన్నారి తలకు తీవ్రంగా గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయింది. స్థానికులు శివకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
CC Camera | అదుపులో నిందితుడు CC Camera | ఆంధ్రప్రభ, వెబ్
గండిపేటలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి
గండిపేట: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గండిపేట మండలంలోని ఇస్తాం చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం… ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ముగ్గురు యువకులు లోతైన నీటిలో మునిగిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Anand Deverakonda |సరికొత్తగా వస్తున్న ఎపిక్..
Anand Deverakonda | సరికొత్తగా వస్తున్న ఎపిక్.. Anand Deverakonda | ఆనంద్
Iran - Israel War : ఇరాన్ యుద్ధం ప్రభావంతో చమురు ధరల పెరుగుదలపై ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరలో జరగాల్సిన చైనా పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని సూచించారు
గింజలతోనే కాదు… ఆకులతోనూ కాఫీ తయారీ#CoffeeLeaf#BlackCoffee#AlluriDistrict#OrganicCoffee
Odisha | 10 మంది మృతి.. Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
నార్సింగిలో బాలికపై అత్యాచారం.. హత్య
నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికపై కామాంధుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. బాలిక నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజీని కూడా పరిశీలించారు. సిసిటివి ఫుటేజీలో బాలికను కామాంధుడు తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. వెంటనే హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. రాత్రి ఒంటి గంటకు బాలిక మృతదేహాన్ని హంతకుడు చూపించాడు. అత్యాచారం అండ్ మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి..
కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి.. పాయకాపురం, ఆంధ్ర ప్రభ : కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి
Andhra Pradesh : నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది
ఆ ఇద్దరు దేవతలకు జలాభిషేకం.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గౌడ
‘బైకర్’ హాలీవుడ్ స్థాయిలో తీసిన సినిమా
చార్మింగ్ స్టార్ శర్వా స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవిక నాయ ర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్ద మొదటి పూర్తి మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ఇది. క్యారెక్టర్ గ్లింప్స్, సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ సినిమా మేకింగ్ ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. దర్శకుడు అభిలాష్ ఆలోచన కూడా అదే. ఇందులో కేవలం రేసింగ్, యాక్షన్ మాత్రమే కాదు, చాలా బలమైన ఎమోషనల్ ఫ్యామిలీ కంటెంట్ కూడా ఉంది. మేము మా సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులకు కూడా అది నచ్చుతుందని చాలా నమ్మకంగా ఉన్నాం. రేసింగ్ సన్నివేశాల్లో బైక్స్ నుంచి వచ్చే సౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సౌండ్స్ వల్ల మ్యూజిక్ వినిపించకుండా పోకూడదు. అందుకే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉండేలా చేశాం’ అని అన్నారు.
అమెరికాలో వరంగల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
న్యూయార్క్: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ మృతి చెందాడు. వరంగల్లోని జితేందర్ అనే వ్యాపార వేత్తకు రాకేశ్(40) అనే కుమారుడు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివసిస్తున్నాడు. రాకేశ్ తన భార్య తేజస్విని ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం రాకేశ్కు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. దీంతో వరంగల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
Allu Cinemas: First Impressions
Allu family has prestigiously built Allu Cinemas in the costliest location of Kokapet. Allu Cinemas opened doors for the first Dolby Cinema for the patrons and the experience is quite impressive. The Dolby Screen has a 75-feet Flat Screen and the experience is phenomenal. Right from the seating to the interiors, everything was well equipped […] The post Allu Cinemas: First Impressions appeared first on Telugu360 .
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన‘. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీలక్ష్మి పిక్చర్స్ సంస్థ ‘సుయోధన’ సినిమాను విడుదల చేస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా ఈ కథ అనుకున్నాక, ప్రియదర్శిని కలిశాను. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన ఓకే చెప్పా రు. ‘సుయోధన’ మూవీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది’ అని అన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధ న, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపింది. ద్రిషిక ఈ మూవీలో చాలా బాగా నటించింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, ద్రిషిక చందర్ , బోసుబాబు నిడుమోలు, చోటా కె ప్రసాద్ నాయుడు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా..
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : మార్చి 16వ
The 98th Academy Awards event took place in Dolby Theatre in Los Angeles today. One Battle After Another bagged six Oscar awards and Michael B Jordan has been named as the Best Actor for his performance in Sinners. Jessie Buckley is the Best Actress for Hamnet and Paul Thomas Anderson bagged the Best Director award […] The post Oscars 2026 Full Winners List appeared first on Telugu360 .
నా ఊపిరి నన్ను మాత్రమే కాదు నాలో నిక్షిప్తమైన నీ జ్ఞాపకాల్ని నాలో సజీవమైన నీ తలపుల్ని ఎప్పటికీ బతికిస్తూనే వుంది నువ్వు దూరంగా వుంటేనేం నీ శ్వాస పరిమళం నన్ను అంటుకునే వుంటుంది నీ మాటల మధురిమలు నన్ను పట్టుకునే వుంటాయి ఏకాంతంలోనూ నేను ఒంటరి కానే కాదంటూ గడిపిన నీ సాంగత్యంలోని క్షణాలు నిన్ను నా గుండె భుజాలపై అలా నాతోపాటు తీసుకొస్తుంటాయి మనతోపాటు కలుసుకున్న మన ఊపిరి స్పర్శలు అదేదో మొక్కను అంటుకట్టినట్టు కొంగ్రొత్త ఊపిరికి ప్రాణం పోసింది నాతోనే నాలోనే నన్ను స్పృశిస్తూ... నిన్ను చూడాలనుకున్నప్పుడు నా కనురెప్పలు మూస్తాను నిన్ను కలవాలన్నప్పుడు నీ జ్ఞాపకాల్ని ఊపిరితో నిమురుతాను నీ ఒడిలో సేదతీరిన అనుభూతికై... - యు.ఎల్.ఎన్.సింహా
చిన్నప్పుడు పొలానికి వెళ్తే మట్టిపై నడిచిన పాదాలకి కూడా పూలు పూసినట్టు అనిపించేది రైతు చేతివేళ్ళ మధ్య నుంచి జారిపడిన వడ్ల గింజ కొద్ది రోజులకే మొలకెత్తి పచ్చని ఊపిరిలా నిలబడి మన కళ్లలో మెరుపులు నింపేది అది నేల మన కన్న తల్లి నేలకు మాటలు రావు కానీ ఆ నేల హృదయం తడితో నిండి కమ్మని వాసనతో మనల్ని పరవశుల్ని చేస్తుంది నేల నిశ్శబ్దంగా మన పాదాల చెమటని తుడిచి మన భవిష్యత్తును ఓ పచ్చని వాకిట్లో నడిచేలా చేస్తుంది కానీ ఇప్పుడా నేల పాత పుస్తకంలా మౌనంగా గదిలో ఓ చివరి మూలన పడుకుని ఉంది ఇక ఇప్పుడు నేల కాదు మనల్ని మనమే చూసుకోవాల్సిన సమయం వచ్చింది ఇవ్వాళ మన చలనాలు నగరాల్లోనూ, నగిషీల్లోనూ వేగంలోనూ తల మునకలయి పోయాయి పొలాలు పాత స్నేహితుల్లా, దూరంగా నిలబడిపోయాయి ఒకప్పుడు వర్షంతో కబుర్లు చెప్పిన నేల ఇప్పుడా వర్షం కోసం మౌనంగా ఎదురు చూస్తోంది ‘నేల అమ్మ లాంటిదిరా, ఆమె ఒంట్లో తడి ఆరితే ఇంట్లో భోజనం కూడా కమ్మగా రాదు’ మా చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి మనం నేల అవసరాన్ని, దాహార్తినీ మరిచిపోయాం వాతావరణంలో గాలి వేడెక్కింది, జలాలు క్షీణించాయి పచ్చదనం కాలిపోయింది, పర్వతాలు కూలిపోయాయి జీవవైవిధ్యం గాజు గుళికల్లా పెటిల్లుమని విరిగిపోతోంది నన్ను కాపాడితేనే మీ భవిష్యత్తు పచ్చగా ఉంటుంది అని నేల మాట్లాడదు అది మౌనంగానే ఉంటుంది ఆ నేల నిశ్శబ్దమే మనకు గుణపాఠం ఇప్పుడా నేలను రక్షిద్దాం నేలను రక్షించుకోకపోతే రేపు మనకు అన్నం ఎవరు పెడతారు ఈ నేల కేవలం మట్టి ముద్ద కాదు అది మన ఊపిరి మన బతుకు మన భవిష్యత్తు నేలతల్లిని మర్చిపోతే మట్టి మౌనం వహించదు మన కథే ముగిసిపోతుంది - వారాల ఆనంద్
Telangana : గుడ్ న్యూస్.. మీ సెల్ ఫోన్ల మెసేజ్ లు చెక్ చేసుకోవచ్చు
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
రాయడం నా బాధ్యత.. ప్రజల కోసం వారి భాషలో, యాసలో
నేను నా సాహితీ యాత్ర: నేను గుంటూరు జిల్లా ‘ప్యాపర్రు’ అనే ఒక చిన్న గ్రామంలో దళిత మాల సామాజిక వర్గంలో పుట్టాను. మా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. మేము మొత్తం ఆరుగురం పిల్లలం. అందరిలోనూ యూనివర్సిటీ చదువుదాకా వచ్చింది నేనే! గ్రామీణ దళిత నేపథ్యం వలన కుల వివక్ష, శ్రమ దోపిడీ, పేదరికం నేరుగా అనుభవంలోకి వచ్చాయి. అలాగే యింట్లో పితృస్వామ్యం కూడా వుండేది. అవి చదువు, వుద్యోగ జీవితంలో కూడా వివిధ రూపాలలో అనుభవంలో వుంటూనే వస్తున్నాయి. నేను ఒకటవ తరగతి నుండి హైస్కూల్ వరకు మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. కాలేజీ చదువు పొన్నూరు, గుంటూరులలో జరిగింది. తరువాత ఎం.ఏ (ఆర్కియాలజీ, ఫిలాసఫీ), ఎమ్.ఫిల్ (హిస్టరీ), పి.హెచ్.డి ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో పూర్తి చేశాను. మొదటి ఉద్యోగం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శ్రీశైలం క్యాంపస్లో తొమ్మిది సంవత్సరాలు చేశాక, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేరాను. ప్రొఫెసర్ గా, డీన్గా, ప్రిన్సిపల్గా ఇలా రకరకాల హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలోనే కొనసాగుతున్నాను. మాది సాహిత్య వాతావరణం బొత్తిగాలేని కుటుంబం. ఉపాధ్యాయులు, స్నేహితుల ప్రభావంతో మంచి సాహిత్యాన్ని కాలేజీ రోజుల నుంచి చదవడం ప్రారంభించాను. ఈ క్రమంలోనే నేను కాలేజీ చదివే రోజుల్లో ప్రకృతి, స్నేహం, బాల్యం, ఇలాంటి అనుభూతి కవితలు అప్పుడప్పుడు రాసేదాన్ని. తరవాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరాక అక్కడ ఉండే ఉద్యమ, సాహిత్య వాతావరణం ప్రభావం వల్ల సామాజిక చైతన్యంతో కూడిన కవితలు, కథలు, వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. ఇది అంతా 90వ దశకం ప్రారంభం నాటి మాట. అప్పటి దళిత, స్త్రీవాద ఉద్యమాలు, అంబేద్కర్ సాహిత్యం నా కవిత్వాన్ని ప్రభావితం చేసిన విషయాలు. నేను వచ్చిన సామాజిక నేపథ్యం కూడా, నేను వాటిపట్ల ఆసక్తి పెంచుకోవడానికి దోహదపడి ఉంటుంది. ఒకవైపు కులం, మరోవైపు పితృస్వామ్యం, శ్రమ దోపిడీ దళిత స్త్రీమీద ముప్పేట దాడి చేస్తే ఆమె దళితులలోనే దళితగా, స్త్రీలలో అంటరానిదిగా అందరికంటే పీడితురాలిగా వుంటుంది. 80, 90వ దశకాలలో వుధృతంగా వచ్చిన దళిత, స్త్రీవాద సాహిత్యాలలో దళిత స్త్రీ కోణం మిస్సయ్యింది. దళిత స్త్రీకోణం నుంచి ఆసామాజిక వర్గాల స్త్రీలు రాయడం లేని రోజుల్లో నేను రాయడం వలన నా రచనల్ని సాహిత్య విమర్శకులు కూడా బాగానే పరామర్శించారు. నేను ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు మూడు వ్యాస సంపుటాలు, ఇతర సిద్ధాంతపరమైన పుస్తకాలు మొత్తం 15 దాకా పుస్తకాలు రాసి ప్రచురించాను. 1995 నుంచి పత్రికలలో కవిత్వం వస్తున్నప్పటికీ నామొదటి కవితా సంపుటి ‘మంకెనపూవు’ 2005లో శిఖామణి గారి సహాయంతో ప్రచురించగలిగాను. నా రచనలకు సాహిత్యంలో మంచి గుర్తింపు వచ్చింది. నా కవితలు ఇంగ్లీష్, హిందీ, కన్నడ, గుజరాతి వంటి భాషలలోకి అనువాదం అయ్యాయి. కొన్ని కవితలు ఇంటర్మీడియట్ స్థాయి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు పాఠ్యాంశాలుగా తీసుకున్నారు. యూనివర్సిటీలలో పరిశోధక విద్యార్ధులు నా రచనలపైన ఎం. ఫిల్, పి.హెచ్ డి డిగ్రీలు కూడా చేస్తున్నారు. యివన్నీ నాకు ఎంతో సంతృప్తినిచ్చిన విషయాలు. నాకు అనంతపురం నుంచి శాంతి నారాయణ గారు ప్రారంభించిన విమలాశాంతి సాహిత్య పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్రం జాషువా సాహిత్య పురస్కారం, గిడుగు రామ్మూర్తి స్మారక భాషా పురస్కారం, ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు, దాడులు వంటి సమస్యల మీద రాసే వారికి ఇచ్చే లాడ్లీ మీడియావంటి అవార్డులు కొన్ని వచ్చాయి. చెన్నై హిందూ లిటరరీ ఫెస్టివల్, ముంబై గేట్ వే లిటరరీ ఫెస్టివల్, లక్నో లిటరరీ ఫెస్టివల్, బెంగుళూరు బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్, హైదరాబాద్ ఛాయ లిటరేచర్ ఫెస్టివల్, సమూహ లిటరరీ ఫెస్టివల్ మొదలైన వాటిలో నేను వక్తగా ఆహ్వానం అందుకుని పాల్గొన్నాను. ఇవన్నీ నాకు కొత్త మిత్రులను సమకూర్చి పెట్టాయని చెప్పొచ్చు. రాయడంతో పాటు నేను అనేక పట్టణ స్థాయి సదస్సులు, గ్రామీణ స్థాయి సభలలో దళిత సమస్యమీద ముఖ్యంగా కులానికి అనుబంధ ప్రశ్నలపైన మాట్లాడతాను, జనంతో నేరుగా సంభాషిస్తాను. రాయడాన్ని నేను ఒక బాధ్యతగా భావిస్తాను. సమస్యల పరిష్కారం కోసం అన్ని కోణాలలో వ్యక్తులు తమకు చేతనైన పనులు చేయాలి. నేను యెవరినుద్దేశించి రాస్తానో వారితో నాకు ప్రత్యక్ష సంబంధాలు వున్నాయి. నా అక్షరాలలో వారు తమను తాము చూసుకుంటారు. వారి జీవితం, వారి భాష నా రచనలో నేరుగా వుండడం వలన వారు రాతలతో మమేకం అవుతారు. చరిత్రలో విస్మరణకు గురైన దళిత, బహుజన స్త్రీ పోరాట యోధులపైన నేను రాసిన ‘మిణుగురులు’ పుస్తకాన్ని తెనాలి దగ్గర కొల్లిపర అనే గ్రామంలో ఆవిష్కరిస్తే ఆసభకు చుట్టుపక్కల గ్రామాలనుంచి సుమారు 500 మందిహాజరయ్యారు. వారిలో పేద దళిత స్త్రీలే యెక్కువగా వుండడం నాకెంతో సంతోషం కలిగించింది. ఇప్పుడు సాహిత్యానికి పాఠకులు తగ్గిపోయారు అనేది పైకి అందరూ అనుకున్నప్పటికీ, నిజానికి సీరియస్ సాహిత్యానికి పాఠకులు పెరుగుతూనే ఉంటారనేది నా అనుభవం. మనం చేయాల్సింది రాయడం, ఎవరి మెప్పు కోసమో కాదు, ప్రజల కోసం వారి భాషలో, యాసలో రాయాలి, మన రాతలో వారు తమ కష్టాలు, కన్నీళ్లు, మొత్తంగా వారి బతుకు చిత్రం కనబడిందని అనుకుంటే చాలు. - చల్లపల్లి స్వరూపరాణి
10వ తరగతి పరీక్షలు ప్రారంభం.. గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడలో 10 వ
మూడో వన్డేలో బంగ్లాదేశ్ గెలుపు
ఢాకా: మూడో వన్డేలో పాకిస్థాన్పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగల భారీ స్కోరును సాధించింది. బంగ్లా బ్యాటర్లలో తాంజిద్ హాసన్ తమిమ్(107) సెంచరీతో కదంతొక్కగా.. లిట్టన్ దాస్(41), తౌహిద్ హిరోయ్(48 నాటౌట్)లు బ్యాట్ ఝలిపించారు. పాక్ బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించారు. దీంతో బంగ్లా భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన పాక్.. 279 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్ సల్మాన్ అఘా(106) సెంచరీతో రాణించినా మిగతావారు విఫలమవడంతో పాక్ ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో తాస్కిన్ లహ్మద్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లా గెలుపు కీలక ప్రాత పోషించాడు.
Andhra Pradesh : నేటి నుంచి ‘రైతన్నా... మీ కోసం’
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచే ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం కానుంది.
కోత్కతా నైట్రైడర్స్ సారధిగా మరోసారి కొనసాగింపు.. కోల్కతా: ఈనెల చివరి వారంలో ఇండియాన్ ప్రీమిర్ లీగ్(ఐపిఎల్ 2026) 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది దీంతో ఫ్రాంచైజీలన్నీ జట్టు కూర్పుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ వేటలో తలమునకలైంది. గతేడాది తేలిపోయిన కోల్కతా నైట్రైడర్స్, ఈసారి కూడా అజింక్య రహానెకే సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 18వ ఎడిషన్లో అజింక్య రహానె నాయకత్వంలోని కోల్కతా పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి కెప్టెన్ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, రహానె అనుభవం జట్టుకు అవసరమని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రహానె మాకు బెస్ట్ ఛాయిస్. అతడి అనుభవం జట్టుకు ఎంతో కీలకం. ఫ్రాంచైజీ ఇప్పటికే దీనిపై ఒక స్పష్టతకు వచ్చింది అని కోల్కతా టీమ్కు సంబంధించి పలువురు ప్రముఖులు తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి సయితం రహానే జట్టును నడిపించే బాధ్యలు చేపట్టనున్నాడని వార్తలు షీకార్లు చేస్తున్నాయి.
ప్రేమ పేరుతో ట్రాన్స్జెండర్ని మోసం చేసి..
ప్రేమ పేరుతో ట్రాన్స్జెండర్ని మోసం చేసి.. కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రేమ పేరుతో
తెలుగు రాష్ట్రాల సిఎంలు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో ఆదివారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం మీద మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, ప్రముఖ దర్శకులు అజయ్కుమార్ పాల్గొనగా ఎంతో మంది సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుండి శిఖరాగ్రం వరకు‘ పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా వారికి శ్రీనివాసరావు చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరిగింది. ఆ తర్వాత సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు, మోహన్ గోటేటి, బాల్రెడ్డి, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావుతో పాటు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాదరావు, కార్యదర్శి సురేశ్ కొండేటి కలిసి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకి ఘన సత్కార కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత సన్మాన పత్రా న్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సహకారం కన్నా కూడా మా ఫిలిం ఇండస్ట్రీ సహకారం అనేది చాలా అవసరం. అంతేకాక మా ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సపోర్ట్ చాలా అవసరం. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, విజయ్దేవరకొండ నుంచి ప్రతీ ఒక్కరూ కూడా చిన్న సినిమానుంచే పైకి వచ్చారు. ఆఖరికి రాజమౌళి, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరా వు కూడా చిన్న సినిమాల నుంచే పైకి వచ్చారు. గతంలో 20, 30ఏళ్ళ క్రితం చంద్రబాబు హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవారు. రెండు ప్రభుత్వాలు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నా ను. రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి. చిన్న సినిమా అనేది తీయడం వరకు తీస్తున్నాం కానీ దాన్ని బ్రతికించడం కష్టం అయిపోయింది. ఓటీటీ కాదు థియేటర్లలో రిలీజ్ చేయడం చాలా కష్టమయిపోయింది. ప్రభుత్వం మొత్తం విధానాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభు సతీమతి అయిన స్వర్గీయ మాధవి పేరు మీద ఉన్న ట్రస్ట్ ద్వారా క్రిటిక్స్ అసోసియేషన్కి ప్రభు.. చదలవాడ శ్రీనివాసరావు చేతుల మీదుగా యాభైవేల చెక్కును అందజేశారు.
Weather Report : నేటి నుంచి అకాల వర్షాలు.. మండుతున్న ఎండల్లో ఉపశమనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేటి నుంచి అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా హీరోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ నిర్మించిన చిత్రం “కేడీ : ది డెవిల్’. ఈ మూవీని దర్శకుడు ప్రేమ్స్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేశ్ అరవింద్, రీష్మా నానయ్య తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ ప్రాజెక్ట్ని ఏప్రిల్ 30న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా ఓ మంచి ఊపునిచ్చే మాస్ బీట్ను విడుదల చేశారు. నోరా ఫతేహీ, సంజయ్ దత్ కాంబోలో వచ్చే ఈ మాస్ బీట్ యూత్ను ఉర్రూతలూగించేలా ఉంది. ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటను తెరకెక్కించిన తీరు, కంపోజ్ చేసిన స్టెప్పులు, నోరా ఫతేహీ గ్లామర్ ట్రీట్ ఆడియెన్స్కి కిక్కిచ్చేలా ఉన్నాయి. అర్జున్ జన్య ఇచ్చిన మాస్ బాణీకి, మంగ్లీ గాత్రం మరింతగా తోడైంది. ఈ పాటకు చంద్ర బోస్ అందించిన సాహిత్యం కూడా ఎంతో సరళంగా, వినసొంపుగా ఉంది. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట విజువల్ ట్రీట్లా మారింది.
Jaag Laadki Returns : జాగ్ లాడ్కీ వచ్చేస్తోందోచ్ Andhra Prabha Detail Report
Jaag Laadki Returns : జాగ్ లాడ్కీ వచ్చేస్తోందోచ్ Andhra Prabha Detail
Amaravathi : నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
అమరావతిలో నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ జరగనుంది
పేరు చిన్నది- ప్రయోగం గొప్పది..’ లిటిల్ థియేటర్‘ ప్రస్థానం
శంకర్ మెల్కొటె సుప్రసిద్ధ సినీ నటులు. ఆయన అభిరుచులు బహుముఖం. విద్యార్థి దశ నుంచే రంగస్థలంపై అనురక్తి పెంచుకున్నా రు. అనేక నాటకాల్లో నటించారు. ఆయన సంగీత ప్రియులు. ఫిలిమ్ లవర్ కూడా. చిత్రకళపై మక్కువతో ఎన్నో పెయింటింగ్స్ కలెక్ట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన మరో అంశం ఆయన మహా చ దువరి. ఎప్పుడు ఆయన దగరికి వెళ్లినా ఏదో ఒక కొత్త పుస్తకం చదువుతూనే కనిపిస్తారు. టీపాయ్ మీద చదివేసిన పుస్తకాలు, చదవాల్సిన పుస్తకాల దొంతరలుంటాయి. అందులో ఏ ఒక్కటీ కాలక్షేప పు పఠనీయం ఉండదు. ఆయన చెప్పే విషయాలు కూడా ఎక్కువగా పుస్తకాల గురించే. అనుబంధ అంశాల్లో సినిమా, నాటకం, సంగీత ప్రస్తావనలు ఉంటాయి.! పుస్తకాధ్యయనం అన్నా, నాటకం అ న్నా అంత ఆపేక్ష, అనుబంధం ఉండబట్టే కొం దరు మిత్రులతో కలిసి ఆయన ఒక విశిష్ట ప్రయోగానికి నాంది పలికారు. అదే ద లిటిల్ థియేటర్ హైదరాబాద్ ఏర్పాటు. పుస్తక పఠనాన్ని ప్రదర్శన స్థాయికి తీర్చి, వేనోళ్ల ప్రసంశలందుకున్న ఈ ప్ర యోగం గురించి మనవాళ్లకి కొంచెం తక్కువే తె లుసని చెప్పాలి. పాతికేళ్లు పైబడిన ‘లిటిల్ థియేటర్’ ప్రస్థానం గురించి ఇటీవల ఆయనను కదిలిస్తే ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నారు. ‘డ్రమటిక్ సర్కిల్ హైదరాబాద్’ అనే ఒక ఇంగ్లీష్ థియేటర్ గ్రూపు ఉండేది. ఇందులో శంకర్ మె ల్కొటెతో సహా ఆయన మిత్రులు కొందరు నాటకా లు వేసేవారు. రిహార్సర్స్కి చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ‘మెల్కొటె అండ్ కో’లో చాలా మంది మధ్య వయస్కులయ్యారు. కొందరు బిజినెస్లో, మరికొందరు ఉద్యోగపరంగా ఉన్నత బాధ్యతల్లో ఉండేవారు. అవి చూసుకున్న తర్వాత రిహార్సల్స్ చేసేవారు. ఇంటికి తిరిగొచ్చే సరికి ప దో, పదకొండో అవుతుండేది. ఇక మీదట ఇలా కుదరదని శంకర్ మెల్కొటెకి అనిపించింది. కానీ ఎన్నో ఏళ్లుగా నాటకాలు వేయడం వల్ల లైవ్ ఆడియన్స్తో అనుబంధం అలవాటయిపోయింది. వ దులుకోలేని పరిస్థితి. దీనికి తరుణోపాయం ఏమి టా అని తర్జనభర్జనలు పడుతున్నప్పుడు ‘డ్రమటి క్ రీడింగ్స్’ తమకి సూటవుతాయి కదా అని మె ల్కొటె గారికి తోచింది. ఇలాంటి రీడింగ్స్ కి ఒకటి రెండు రిహార్సల్స్ చేస్తే చాలు. ఆలోచన రావడాని కి గట్టి కారణం మరొకటి ఉంది. అది పుస్తక పఠనాసక్తిని పెంపొందదించాలన్నది. బుక్ రీడింగ్ పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు, ఇంగ్లీషులో ఉన్న సాహిత్యాన్ని పాఠకులకి దగ్గర చేయాలన్న ఉద్దేశంతో ‘ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ గ్రూపు ఏర్పాటుకి సంకల్పించారు. సన్నిహితులైన బిఎస్ ప్రకాష్, విజయ్ మారూర్లతో తన ఆలోచన పంచుకుంటే వారు ఏకీభవించారు. వ్యవస్థాపక సభ్యులుగా ఈ త్రయం ఒక బృందా న్ని కూడా తయారుచేసుకున్నారు. ఎనిమిది నుం చి పది మంది కోర్ గ్రూపుగా ఉండేవారు. వారిలో కొందరు భౌతికంగా ఇప్పుడు లేరు. సచి మాధవ న్, సరళ మహీధర, చందన చక్రవర్తి, విఠల్ రాజ న్, శ్రీకుమార్ తదితరులు ‘డ్రమటిక్ రీడింగ్స్’కి ఒక ఒరవడి దిద్దిన వారిలో ఉన్నారు. వీరంతా సా హిత్యంపై ఆసక్తి ఉన్నవారే. ఈ అంశమే లిటిల్ థియేటర్ లో వారిని భాగస్వాములను చేసింది. స్మాల్ ఈజ్ బ్యూటిపుల్ అని మెల్కొటె ప్రగాఢంగా నమ్ముతారు. అందుకు తగినట్టుగా తమ గ్రూప్కి ‘ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ అన్న పేరు పె ట్టుకున్నారు. “1999లో మా మొదటి ప్రదర్శనని హైదరాబాద్ సైనికపురిలోని నాటి మేజర్ జనరల్ గోర్తి వాళ్ల డ్రాయింగ్ రూంలో ఇచ్చాం. Bertolt Brecht రాసిన Life of Galileo నాటకం నుంచి కొన్ని భాగాలు చదివాం. కొద్ది మందే ప్రేక్షకులు. అయినా ఆ ‘డ్రమటిక్ రీడింగ్’కి మంచి స్పందన వచ్చింది” అని ఆనాటి సందర్భాన్ని ఇష్టంగా తలుచుకుంటారు శంకర్ మెల్కొటె. ఈ ప్రదర్శనకి రెస్పాన్స్తో ’ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ టీమ్ కి కొండంత బలం వచ్చింది. డ్రాయింగ్ రూమ్స్, గార్డెన్స్, చిన్న చిన్న గేదరింగ్స్, హోటళ్లు.. ముఖ్యంగా స్కూళ్లు- ఇవే వారి ప్రదర్శనలకి వేదికలు. ఈ బృందం పరిగణనలోకి తీసుకున్న మరొక బలమైన అంశం- భాష! మన ప్రాంతీయ భాషల్లో ఎన్నో గొప్ప గొప్ప కథలున్నాయి. ఇంగ్లీష్ లిటరేచర్ కి తీసిపోని స్థాయిలో మనకి సాహిత్య సంపద ఉంది. మెల్కొటె టీమ్ లిటిల్ థియేటర్ మొదలుపెట్టే నాటికి అప్పుడప్పుడే ఉత్తమ ప్రమాణాలు కలిగిన అనువాదాలు వస్తున్నాయి. భారతీయ భాషలకు సంబంధించి చాలా పుస్తకాలు వారికి అందుబాటులో ఉన్నాయి. అందులోంచి ఎంపిక చేసిన కవిత్వం, కథ, నవల, బయోగ్రఫీ, హిస్టరీ వంటివి వీరు చదివేవారు. కథ లేదా కవితలు అయితే తమ రీడింగ్స్ లో పూర్తి పాఠాన్ని చదివేవారు. అదే నవల, బ యోగ్రఫీ, చరిత్రకి సంబంధించిన పుస్తకాల్లో మా త్రం ఎంచుకున్న భాగాలు చదివేవారు. ప్రత్యేకించి పిల్లల కోసం ఈ బృందం చాలా స్కూల్స్లో ప్రదర్శనలిచ్చింది. డ్రమటిక్ రీడింగ్స్ లో ఉన్న సాహిత్యపు రుచి వారిని కూడా ఆకట్టుకున్న మాట వాస్తవం. లిటిల్ థియేటర్ ప్రదర్శనలు క్రమేపీ పుంజుకున్నాయి. తొలి రోజుల్లో ఈ రీడింగ్స్ కి పది పదిహేను మంది ప్రేక్షకులు ఉండేవారు. అదే ఐఐటి చెన్నైలో ప్రదర్శన ఏర్పాటుచేస్తే 500 మంది వచ్చారు. హాలు నిండిపోతే చాలా మంది విద్యార్ధులు కింద కూర్చుని కూడా చూశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, బెంగుళూరు.. ఇలా అనేక చోట్ల లిటిల్ థియేటర్ ప్రదర్శనలు జరిగాయి. మెల్కొటెగారు అమెరికా వెళ్లినప్పుడు కాలిఫోర్నియాలో కూడా ఒక ప్రదర్శన ఇచ్చారు. ప్రేక్షకులలో ఆసక్తి పెంచడానికి ఈ రీడింగ్స్ కి మ్యూజిక్ టచ్ కూడా ఇచ్చారు. అంటే వాయిద్య, గాత్ర సహకారాన్ని జోడించారు. దీం తో ప్రేక్షకుల అటెన్షన్ బాగా పెరిగింది. వాళ్లకు న్యూ లిటరేచర్ కూడా పరిచయం అయ్యింది. ‘ఈ పాతికేళ్లలో లిటిల్ థియేటర్ టీమ్ రెండు వందల యాభైకి పైగా ప్రదర్శనలు ఇచ్చాం. అంటే సుమా రు రెండు వందల యాభైకి పైగా సాహిత్యకారుల రచనలు చదివాం. ఇందులో అత్యధికంగా భారతీ య భాషా సాహిత్య గ్రంథాలే ఉన్నాయ‘ని చెప్పా రు మెల్కొటె. తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదమైన చాసో, చలం వంటి అనేక మంది ప్రసిద్ధుల రచనలు కూడా చదివారు. హైదరాబాద్ లి టరరీ ఫెస్టివల్ ప్రతి ఎడిషన్లోనూ నిర్వాహకులు ‘లిటిల్ థియేటర్’ని పిలవడం, వీరక్కడ ప్రదర్శన ఇవ్వడం ఒక సంప్రదాయంగా మారింది. ఇన్నేళ్ల లో ఈ బృందంలో సుమారు యాభ్భై మందికి పైగా పాల్గొని డ్రమటిక్ రీడింగ్స్ చేశారు. గాత్ర, వాయిద్యకారులు ఇందులో భాగం. కెకి ధారువాలా, గిరీ ష్ కర్నాడ్ వంటి ప్రముఖుల సంస్మరణగా కూడా లిటిల్ థియేటర్ ప్రదర్శనలు నిర్వహించింది. “రీడింగ్ అనేది కమ్యూనికేషన్ కదా. మా టీమ్కి ఇదే ప్రథమ నియమం. ప్రేక్షకుల ఏకాగ్రత పెరిగేందుకు శ్రద్ధవహిస్తాం. ఒక్కొక్కరు మూడు నిముషాల వ్యవధికి మించని టెక్సెట్ ఎంచుకుని చదువుతాం. ఉచ్చారణలో స్పష్టత ఉండేలా జాగ్రత్త పాటిస్తాం. మాతృభాషలో ఎలా మాట్లాడతామో అదే స్లాంగ్ లో సాగుతుంది ప్రదర్శన” అని చెప్పుకొచ్చారు శం కర్ మెల్కొటె. తెలుగు, తమిళ, కన్న డ, మలయాళ, హిందీ, గుజరాతీ భాషలవారు ‘లిటిల్ థియేటర్’ టీమ్ లో భాగంగా ఉండేవారు. వీరంతా తమతమ పలుకుబడి శైలిలోనే రీడింగ్స్ చేయడం వల్ల ఆ ప్రదర్శనలకి వైవిధ్యం చేకూరేది. ఇతర భాషల్లో రీడింగ్ క్లబ్స్ వంటివి ఉన్నా సాహి త్య పఠనాన్ని నాటక కళతో ముడిపెట్టడం వల్ల ‘లిటిల్ థియేటర్’కి అనతికాలంలోనే ప్రత్యేక గుర్తిం పు వచ్చింది. పైగా ఒక స్పష్టమైన రాజకీయ స్పృ హ, సాహిత్య పరిమళం కలిగిన పుస్తకాలనే ఈ ప్రదర్శనల ద్వారా పాఠకులకి పరిచయం చేసేవారు. ‘లిటిల్ థియేటర్’కి ఉన్న ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ పేజీల ద్వారా తమ కార్యక్రమాల గురించి తెలియచేసేవారు. శంకర్ మెల్కోటె నాటకరంగం నుంచి రావడం వల్ల తమ ప్రదర్శనలకి కూడా ఆ తరహా హంగు లు ఉంటే బాగుంటుందనిపించింది. అందుకు అనుగుణమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. దీనికొక చిన్న ఉదాహరణ. Shashi Deshpande రాసిన Small Remedies నవల ముగ్గురు స్త్రీలకి సంబంధించిన కథ. ఇందులో ఒక క్యారెక్టర్ మ్యుజీషియన్. ఆ నవల ఆయనకు చాలా నచ్చింది. ప్రమీలా నానీ వాడేకర్ అని మ్యూజిక్ రిసోర్స్ పర్సన్ ఉన్నారు. ఆమెకి Small Remedies నవల ఇచ్చి ‘మనం ఇది చేయాలి’ అన్నారు. రెండు మూడు రోజుల్లో ఆమె నవల చదివేసి చేద్దాం అన్నారట. దాదాపు 13-, 14 రాగాలు అందులో వాడాలని ప్లాన్ చేశారు. అంటే ప్రదర్శన జరిగేటప్పుడు నేపథ్యంలో ఆలాపనలు వస్తాయి. 12 మంది సంగీతకారులు, ఒక వాయిద్యకారుని సహకారం తీసుకునేలా డిజైన్ చేశారు. హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో ప్రదర్శనకి వేదిక ఫిక్స్ చేశారు. ప్రదర్శనకు కొద్ది ముందు శంకర్ మెల్కొటె వేరే ఒక పనిమీద బెంగుళూరు వెళ్లారు. అక్కడ టెలిఫోన్ డైరెక్టరీ వెదికి Shashi Deshpandeకి ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేశారట. ఆమె లిఫ్ట్ చేశారట. తమ ప్రదర్శన గురించి ఆమెకి వివరించారట. “మీ కథకి నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఇదీ అని వివరించి మీరు వస్తే బాగుంటుందని” అడిగాను. ఆమె చెప్పిన తేదీన ప్రదర్శన పెట్టుకున్నాం. Shashi Deshpande తన భర్తతో కలిసి వచ్చి ప్రదర్శన చూశారు. రెండు వందల మంది వరకు ప్రేక్షకులు వచ్చారు. బ్రేక్ లేకుండా గంటన్నర సేపు సాగిన ఈ ప్రదర్శనకి అద్భుతమైన స్పందన వచ్చింది. Shashi Deshpande కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ప్రేక్షకులు మూడుసార్లు ‘స్టాండింగ్ ఒవేషన్ చేశారు’ అని నాటి స్మృతిని గుర్తుచేశారాయన. ఆ తర్వాత చెన్నైలో, బెంగుళూరులో కూడా ఈ ప్రదర్శనలు నిర్వహించారు. అక్కడా మంచి ప్రశంసలు వచ్చాయి. (తరువాయి వచ్చే సోమవారం) ఒమ్మి రమేష్ బాబు
రైతు ఆత్మహత్య. అసలు ఏం జరిగింది..?
రైతు ఆత్మహత్య. అసలు ఏం జరిగింది..? తుగ్గలి, ఆంధ్రప్రభ : అప్పుల భారాన్ని
నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
నేటి నుంచి శ్రీశైలంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి
డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్రెడ్డితో పాటు రితీష్ రెడ్డి, నమిత్ శర్మకు 14 రోజుల రిమాండ్ #DrugsCase
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసనలు
ప్రేమజంట గొంతు కోసి... బావిలో మృతదేహాలు పడేసి... కనిపించడంలేదని ఫిర్యాదు
అహ్మదాబాద్: నెల రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమ జంట మృతదేహాలు బావిలో కనిపించిన సంఘటన గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాథి అలియా సోనూ రాబారి అనే యువతి(19), నవీన్ జివబాయ్ రాబారి అనే యువకుడు(21) గాఢంగా ప్రేమించుకున్నారు. నాథి ప్రేమ వ్యవహారం తండ్రికి తెలియడంతో ఆమెపై అగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో ఆగ్రహం తండ్రి రగిలిపోయాడు. ప్రేమ జంటను చంపేయాలని తండ్రి నిర్ణయం తీసుకున్నాడు యువతి తండ్రి, మేనఅల్లుడు ప్రేమ జంటను పట్టుకొని ఖంబాలా గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం తండ్రి, తల్లి, సోదరుడు, మేనల్లుడు యువతి, యువకుడి గొంతు కోసి బావిలో మృతదేహాలు పడేశారు. తన కూతురు కనిపించకపోవడంతో స్థానిక నఖత్రానా పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 3న తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు తన కుమారుడు కనిపించకపోవడంతో నవీన కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అందరూ వేర్వేరు సమాధానాలు చెప్పడంతో తనదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. వారు నిజాలు ఒప్పుకోవడంతో వెంటనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

33 C