పెట్రో ఉత్పత్తులపై సుంకంలో కోత
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పెట్రోలు, డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం అర్థరాత్రి నోటిఫికేషన్ వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ సంక్షోభం, హర్మూజ్ జలసంధి మారంగంలో రవాణాకు అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగకుండా ఉండేందుకు, క్రమేపీ గణనీయంగా తగ్గేందుకు ఈ సుంకం తగ్గింపు నిర్ణయం దారితీస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పెట్రోలుపై ఇంతకు ముందు ఉన్న లీటర్కు రూ.13 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఇకపై రూ.3గా కుదించారు. డీజిల్పై ఇది ఇంతకు ముందు రూ 10 ఉండగా దీనిని ఇప్పుడు పూర్తిగా ఎతివేశారు. ఈ చర్యతో ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా రూ 1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ సుంకం భారీ స్థాయి తగ్గింపు వల్ల ముందుగా చమురు పంపిణీ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. క్రమేపీ దీని పరిణామాలలో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీ స్థాయిలోనే తగ్గుతాయి. పైగా చమురు సంక్షోభం దశలో వెనువెంటనే దేశంలో ఇందన ధరలు పెరగకుండా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి నిర్ణయాలలో భాగంగా ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్)పై సుంకాలను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో డీజిల్పై ఇది లీటర్కు రూ 21.5గా ఉంటుంది. ఎటిఎఫ్పై ఇది రూ 29.5గా పడుతుంది. ధరల్లో మార్పు ఉండదు: ఆర్థిక మంత్రి కేంద్రం పెట్రోల్పై సుంకాలను తగ్గించినా డీజిల్పై లేకుండా చేసినా వెనువెంటనే ఈ సవరణలతో పెట్రోల్ పంపులలో ధరలలో మార్పు ఉండదు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో వినియోగదారులపై ఇంధన ధరల పెంపు ప్రభావం పడకుండా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. సరఫరాల హెచ్చుతగ్గులు, సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పడకుండా చేయడానికే ఈ నిర్ణయం ఉపకరిస్తుందన్నారు. ఈ దిశలోనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ముడిచమురు ధరల ప్రభావంతో అంతర్జాతీయంగా పలు దేశాలలో గడిచిన నెలరోజుల్లో విపరీత ప్రభావం పడిందన్నారు. అంతకు ముందు బ్యారెల్కు 70 డాలర్లు ఉండగా ఇది ఇప్పుడు 100 డాలర్లు దాటుతోందని అన్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులపై పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం అన్ని దేశాలలో పడుతోందన్ని, ఆగ్నేయాసియా దేశాలలో ఈ ధరలు దాదాపుగా 30 నుంచి 50 శాతం పెరిగాయన్నారు. ఆఫ్రికా దేశాలలో ఇది 20 నుంచి 50 శాతంగా పెరిగాయని, ఈ దశలో భారత్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, దానిని నివారించేందుకు ప్రభుత్వం వద్ద రెండే మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటి ధరలు గణనీయంగా పెంచడం లేదా ప్రభుత్వ సంస్థలుఈ భారం భరించడం అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం వెలువడిందని మంత్రి తెలిపారు. ఇప్పటికిప్పుడు ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఇంధన ధరలు వెంటనే మార్కెట్లో దిగకపోవచ్చు. అయితే ఇప్పుడు సుంకం కుదింపుతో వెనువెంటనే అనివార్యంగా జరగాల్సిన రీతిలో ఇంధనల ధరలు పెరిగే అవకాశం ఉండదు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ విషమ పరిస్థితికి కళ్లెం పడిందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికలపై దృష్టితోనే : కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాల కోతకు దిగింది కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లాభం పొందేందుకే అని కాంగ్రెస్ విమర్శించింది. గతంలో పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు ఏడుసార్లు పడిపోయినా దేశంలో వినియోగదారులకు ధరల వెసులుబాటు కల్పించలేదని , ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం ఈ నాటకమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఎప్రిల్ 30 వరకూ చూడండీ ఈ ప్రభుత్వమే తిరిగి ఏ విధంగా దెబ్బ తీస్తుందో అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం: బిజెపి ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి దిగుతున్నాయని బిజెపి ఎదురుదాడికి దిగింది. కేం ద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇకపై వినియోగదారులకు ఇంధనం తక్కువ ధరలకు దొరుకుతుందని, కాంగ్రెస్ ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
మనతెలంగాణ/మాదాపూర్ : ఒంటిపై కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో తిరిగే బంగారుబాబుకు ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లగా ఢిల్లీ ఎ యిర్పోర్టులో అనుమానం వచ్చి ఆదాయం పన్ను శాఖ అధికారులు అడ్డుకున్నారు. సుమారు నాలుగున్నర కిలోలకు పైగా ఉన్న ఈ ఆభరణాల విలు వ రూ.7 కోట్లకుపైగా ఉండటంతో ఐటి అధికారు లు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించా రు. ఇందుకు సంబంధించిన బిల్లులు చూపించాలని అధికారులు కోరగా బిల్లులు హైదరాబాద్లో ఉన్నాయని, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వ చ్చానని, తర్వాత బిల్లులు ఇస్తానని చెప్పడంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని వదిలినట్లు సమాచారం. శేరిలింగంపల్లి చందానగర్కి చెందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ న్యూఢిల్లీలో జరుగుతున్న హకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లారు. వంటినిండా బంగారంతో కనిపించిన ఆయనను ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆదాయపుపన్ను అధికారులు గురువారం నాడు అడ్డుకున్నారు. బంగారం గు రించి ఆరా తీశారు. ఈ మేరకు రెండు గొలుసుల ను తీసుకుని వాటికి సంబంధించిన బిల్లులు చూ పించాలని నోటీసులు ఇచ్చారు. అనంతరం న్యూ ఢిల్లీలో జరిగిన హకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న అనంతరం శుక్రవారం సా యంత్రం హైదరాబాద్కు తిరిగి వచ్చారు.
శనివారం రాశి ఫలాలు (28-03-2026)
మేషం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వృషభం ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిధునం ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కర్కాటకం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. సింహం ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కన్య ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. తుల సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చికం ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. ధనస్సు ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మకరం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. కుంభం ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. మీనం బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
రూ.351 కోట్లతో రామాలయ అభివృద్ధ్ది పనులు
భద్రాచలంలో రూ.351 కోట్ల తొలి విడత నిధులతో చేపట్టే రామాలయ అభివృద్ధ్ది పనులకు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మిథిలా స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంను ఆవిష్కరించడంతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పనుల ద్వారా యాత్రికులకు మెరుగైన వసతులు, భద్రత ఏర్పాట్లు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.
فیکٹ چیک: بیلجیم کی ٹرین پر 'اسرائیلی فورسس کی موت' کی تحریر کی جانئے پوری حقیقت
وائرل پوسٹس میں دعویٰ کیا گیا کہ بیلجیم ریل محکمے نے ایران جنگ کے تناظر میں ٹرین پر 'آئی ڈی ایف کی موت' کی گریافیٹی تحریر کی۔ تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو اکتوبر 2025 کا ہے جسے من گھڑت دعوے کے ساتھ شیئر کیا گیا۔
రేపు హైదరాబాద్తో బెంగళూరు తొలి పోరు
ఐపిఎల్ సీజన్ 2026కి సర్వం సిద్ధమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేత సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఈ టోర్రమెంట్కు తెరలేస్తోంది. ఇక ఇటు హైదరాబాద్ అటు బెంగళూరు జట్లు విజయమే లక్షంగా పెట్టుకున్నాయి. రజత్ పటిదార్ సారథ్యంలోని బెంగళూరు భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో బెంగళూరు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ, పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, బెథెల్, భువనేశ్వర్ కుమార్, జోర్డాన్, డఫీ, కృనాల్ పాండ్య,షెఫర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరులో ఉన్నారు. ఇక ఈ టోర్నీకి కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. మరోవైపు హైదరాబాద్లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో సన్రైజర్స్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రాత్రి 7.30 గంటల నుంచి స్టార్ నెట్వర్క్..జియో హాట్స్టార్లో..
IrIrgc Warning : వాళ్లని వదలం Andhra Prabha Detail Report
Irgc Warning : వాళ్లని వదలం Andhra Prabha Detail Report (
ఈనెల 31న మహిళా రైతు రాష్ట్ర సదస్సు
ఈ నెల 31న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జరిగే మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, టి సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఆర్టిసి క్రాస్ రోడ్ లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మహిళా రైతుల రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు వివిధ జిల్లాల నుండి మహిళా రైతులు హాజరవుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్న కొద్ది పురుషుల సంఖ్య తగ్గి మహిళల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. వ్యవసాయాన్ని మహిళలే కొనసాగిస్తున్న పరిస్థితి ఉందని, వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే విత్తనబిల్లు, మార్కెట్ ముసాయిదా బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులు తీసుకొచ్చారు. గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న అవకాశాలను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు భూమిపై ఎలాంటి హక్కులు లేవు, జాయింట్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికి ఎన్నికలకు ముందు పాలకులు వాగ్ధానాలు చేస్తున్నారే తప్ప ఆచరణలో అమలు కావడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి సందర్భంగానైనా ఈ అంశం ఉండే విధంగా చూసుకుంటే ఉపయోగకరంగా ఉండేదని సూచించారు. కౌలు రైతులలో కూడా మహిళలు గణనీయంగా ఉన్నారని, వీరికి పెట్టుబడి కోసం జాయింట్ లయబుల్ గ్రూపులను ఏర్పాటు చేసి వీటి ద్వారా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అరిబండి ప్రసాద రావు, పెసరగాయల జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితలులు పాల్గొన్నారు.
కేరళ స్టార్ క్యాంపెయినర్గా సిఎం రేవంత్ రెడ్డి
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. కేరళ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం ఆ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్గా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాషపై పట్టు ఉండడం, హావభావాల పట్ల ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ముగ్దుడైనందున ప్రత్యేకించి ఆ రాష్ట్రానికి ఎంపిక చేసి ఉంటారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం కూడా ఆ రాష్ట్రంలోనే ఉండడం గమనార్హం. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ కూటమిని అధికారంలోకి తీసుకుని రావాలన్న పట్టుదలతో అధిష్టానం ఉంది.ఇదిలాఉండగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు జరిగనున్న ఎన్నికలకు రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్నూ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు. అయితే ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రభృతులు ఉన్నారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
వారం రోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరట్వాడ నుంచి కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమయిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
కొండగట్టుకు హనుమాన్ భక్తుల పాదయాత్ర
కొండగట్టుకు హనుమాన్ భక్తుల పాదయాత్ర కొండగట్టుకు పాదయాత్రకు బయలుదేరుతున్న హనుమాన్ భక్తులు కుంటాల,ఆంధ్రప్రభ
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటా
ఎపిలోని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఆరోపణలు గుప్పిస్తున్న బాధితురాలు హర్షవీణ మరో కొత్త వీడి యోను విడుదల చేశారు. తన సమస్యపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాలని, ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ కార్యా లయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు సంబంధించి తాను ఎన్ని వీడియోలను రిలీజ్ చేసిన జన సేన పార్టీ తన సమస్యను పట్టించుకోలేదని, పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధిష్టానం ఆదే శాలను ధిక్క రించి కార్యక్రమాలలో పాల్గొంటున్న అరవ శ్రీధర్కు, జనసేన పార్టీకి విలువలు లేవా? అంటూ ఆమె ప్రశ్నించింది.
చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య గీసుగొండ, ఆంధ్రప్రభ : మద్యానికి బానిసైన వ్యక్తి
కర్నూల్లో ఎండల తీవ్రత . 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు… .. రాబోయే
శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో కారు దగ్ధం
శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో కారు దగ్ధం శంషాబాద్, ఆంధ్రప్రభ : శంషాబాద్ ఎయిర్పోర్ట్
నాపై హత్యాయత్నం జరిగింది : రఘు రామకృష్ణరాజు
ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరామనవమి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పెదపేట లోని పురాతన రామాలయ దర్శనానికి వెళ్లిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాన్వాయ్పై జరిగిన దాడి రాజకీయంగా సంచలనం రేపింది. మేకుల కర్రలు, చాకులతో జరిగిన ఈ భయానక దాడిలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంతో ఆకివీడు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిపై రఘురామ స్పందిస్తూ తనపై జరిగిన దాడి కేవలం ఆకస్మికం కాదని, అది ముందస్తుగా ప్లాన్ చేసిన హత్యాయత్నం అని ఆరోపించారు. నిన్న సాయంత్రమే బయటి ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు ఆకివీడుకు చేరుకున్నారని, రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందు కు వాళ్లు వచ్చారని ఆయన పేర్కొన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ రామాలయాన్ని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, వారు హిందువులే అయి నప్పటికీ వేరే మతం ముసుగులో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాన్ని శుభ్రం చేయడానికి కూడా వారు అభ్యంతరం చెబుతున్నా రని తెలిపారు. దాడి చేసిన వారు రామ భక్తుల వేషంలో ఉండి ఒక్కసారిగా విరుచుకుపడ్డారని, తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించు కున్నానని వెల్లడించారు. లేనిపక్షంలో పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఇలాంటి వికృత చేష్టలను ఆదిలోనే అరికట్టకపోతే అవి సమాజానికి పెద్ద ముప్పుగా మారతాయని రఘురామ హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించానని, వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు.
2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల
2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల మోర్తాడ్/భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
చౌటుప్పల్లో వైభవంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం
చౌటుప్పల్లో వైభవంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు
చెన్నూరులో మారుమోగిన రామనామం! చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు లో
గ్రేటర్ పరిధిలో ఎల్పిజి, సిఎన్జీ కొరత
ఎల్పిజి, సిఎన్జీ కొరతతో ఆటోలు, క్యాబ్లు రోడ్డెక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఊబర్, ర్యాపిడ్లో ఆటోలు, క్యాబ్లను బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అవుతున్నాయి. ఒకవేళ బుక్ అయినా చార్జీలను అధికంగా పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఆటోలకు ఎల్పిజి గ్యాస్ దొరకడం కష్టంగా మారింది. ప్రస్తుతం పిల్లింగ్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. సిఎన్జీ కొరతతో క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని లక్డీకాపూల్, ఖైరతాబాద్, అత్తాపూర్, ఎల్బినగర్ తదితర ప్రాంతంలో సీఎన్జీ, ఎల్పిజి గ్యాస్ కోసం బంకుల వద్ద ఆటోలు, క్యాబ్లు బారులు తీరుతున్నాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లో వాహనదారులు వేచి ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో పెట్టిన ఆటోలయితే తెల్లవారుజాము వరకు బంక్ దగ్గరే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధన కొరతపై వస్తున్న వదంతులతో తీవ్రమైన రద్దీ నెలకొందని బంక్ యజమానులు పేర్కొన్నారు.
‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ వచ్చేస్తున్నాడు
హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా ’బ్యాడ్ బాయ్ కార్తిక్’ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో చేతి పిడికిలి బిగించి నాగ శౌర్య కనిపించడం, ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ’బ్యాడ్ బాయ్ కార్తిక్’ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను జీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన విధి కథానాయికగా నటిస్తుండగా, శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నేపాల్ 47వ ప్రధానిగా ‘బలేన్’ ప్రమాణ స్వీకారం
ర్యాపర్గా పేరు పొందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన బలేంద్ర షా ‘బలేన్’ నేపాల్ 47వ ప్రజాస్వామ్య ప్రధానిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ ఉద్యమం తర్వాత కె.పీ. శర్మ ఓలి ప్రభుత్వం కూలిన దాదాపు ఆరు నెలల తరువాత ఆయన పదవిలోకి వచ్చారు. 35 ఏళ్ల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) నేత అయిన బలేన్కు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, శీతల్ నివాస్లో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలా 34 నిముషాలకు ప్రమాణం చేయించారు. కాఠ్మండు మాజీ మేయర్ అయిన బలేన్, నేపాల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధానిగా నిలిచారు. మధేశ్ ప్రాంతం నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి కూడా ఆయనే.ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిందూ, బౌద్ధ సంప్రదాయాల సమ్మేళనం కనిపించింది. ఏడు మంది బ్రాహ్మణులు శంఖనాదం చేయడం, 108 మంది హిందూ బటుకులు స్వస్తి వచనాలు చదవడం, 107 మంది లామాలు బౌద్ధ మంగళ వచనాలు పఠించడం వంటి విశేషాలు చోటుచేసుకున్నాయి.ఇదే రోజు రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం అధ్యక్షుడు బలేన్ను అధికారికంగా ప్రధానిగా నియమించారు. బలేన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-నేపాల్ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ‘రోటి- బేటీ’ బంధం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. నేపాల్ సముద్రతీరంలేని దేశం కావడంతో రవాణా, వాణిజ్య అవసరాల కోసం భారత్పై అధికంగా ఆధారపడుతోంది. దేశానికి సముద్ర మార్గం కూడా భారత్ ద్వారానే అందుతోంది.గత ఏడాది సెప్టెంబర్లో అవినీతి, బంధుప్రీతి, సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన జెన్- జెడ్ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఓలి ప్రభుత్వం పడిపోయింది. అనంతరం మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలన్న ఆహ్వానాన్ని బలేన్ తిరస్కరించి, పూర్తి కాలం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో జ్హాపా-5 నియోజకవర్గంలో నాలుగు సార్లు ప్రధానిగా ఉన్న ఓలిని భారీ మెజారిటీతో ఓడించారు. మొత్తం 275 స్థానాల్లో 182 సీట్లు గెలుచుకున్న ఆర్ఎస్పీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.బలేన్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. స్వర్ణిమ్ వాగ్లే ఆర్థిక మంత్రిగా, శిశిర్ ఖనాల్ విదేశాంగ మంత్రిగా, సుదన్ గురుంగ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బలేన్ రక్షణ, పరిశ్రమ-వాణిజ్య శాఖలను కూడా తన వద్ద ఉంచుకున్నారు. ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా నియామకాలు చేపట్టారు.
కుళ్లిన చికెన్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
కుళ్లిన చికెన్ సరఫరా చేస్తున్న వ్యక్తిని హెచ్ఫాస్ట్, సనత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 352కిలోల కుళ్లిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...కూకట్పల్లి, రాజీవ్గాంధీనగర్కు చెందిన సూరజ్పాల్ ఎస్పిఆర్ పేరుతో చికెన్ వ్యాపారం చేస్తున్నాడు. కుళ్లిన చికెన్ను కొనుగోలు చేసి స్థానికంగా ఉంటున్న చికెన్షాపులు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన హెచ్-ఫాస్ట్ బృందం, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న మెసర్స్ ఎస్.పి.ఆర్ చికెన్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ను గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఎస్పిఆర్ సంస్థకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ముగిసినట్లు అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని సనత్నగర్ పోలీసులకు అప్పగించారు. చ్-ఫాస్ట్ ఇన్స్స్పెక్టర్, సిబ్బంది, సనత్ నగర్ పోలీసులు పాల్గొన్నారు.
శివాలయంలో గోపురాని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ గీత
శివాలయంలో గోపురాని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ గీత చిట్యాల,ఆంధ్రప్రభ : శ్రీరామనవమి పర్వదినాన్ని
2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL News
2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL
ఆలయాల అభివృద్ధికి వెదిరె బ్రదర్స్ లక్ష విరాళం
ఆలయాల అభివృద్ధికి వెదిరె బ్రదర్స్ లక్ష విరాళం మునుగోడు, ఆంధ్రప్రభ : శ్రీరామ
హత్య కేసులో నిందితుడిపై పోలీసుల కాల్పులు
ఎపిలోని తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసుల కాల్పులు జరిపారు. ఘట నకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్తి కోసం అత్తమామల మీద కోపంతో ఐదేళ్ల బావమరిదిని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అనంత పురం జిల్లాలో బాలుడి హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో ఐదేళ్ల బావ మరిది హేమచంద్రను బావ సర్వేశ్కుమార్ కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలికి వెళ్లిన సమయంలో పోలీసులపై నిందితుడు తిరగబడి బీర్ బాటిల్తో దాడి చేయడంతో పోలీసులు నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు. అతడికి గాయాలు కాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సిఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ చేతికి గాయాలవడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స అందించారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది.
జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ
జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ :
కల్తీ కారంపై అధికారుల దాడులు వరుస దాడులతో వ్యాపారాల్లో గుబులుప్రజల ప్రాణాలతో చేలాగాటమాడితే
వైభవ్ పుట్టినరోజు.. తొలగిన ఐసిసి నిబంధన అడ్డంకి
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శుక్రవారం తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 13 ఏళ్ల వయస్సులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టి.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు వైభవ్. ఆ తర్వాత అండర్-19 జట్టులో చేరి అద్భుతాలు సృష్టించాడు. అయితే ఈ 15వ పుట్టిన రోజుతో వైభవ్కి ఉన్న ఏకైక అడ్డంకి తొలగిపోయింది. అండర్-19లో రాణించిన వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని ఎన్నో డిమాండ్లు వచ్చాయి. అయితే వైభవ్ వయస్సు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఎందుకుంటే జాతీయ జట్టులో అవకాశం రావాలంటే 15 ఏళ్ల వయో పరిమితి ఉంది. ఇప్పుడు వైభవ్ ఆ వయస్సుకు రావడంతో అతడికి ఉన్న అడ్డంకి తొలగిపోయినట్లైంది. దీంతో త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
స్టేషన్ ఘన్పూర్ మండలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
స్టేషన్ ఘన్పూర్ మండలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు –కన్నులపండువగా సీతారాముల కల్యాణం-గ్రామాల్లో భక్తులతో
కనకదుర్గమ్మ దర్శనానికి యువ బైకర్ తాప్సీ
కనకదుర్గమ్మ దర్శనానికి యువ బైకర్ తాప్సీ మిషన్ హెల్తీ భారత్’ యాత్రకు ఆధ్యాత్మిక
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ దంపతులు
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ దంపతులు విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు నేటి పూర్ణాహుతితో పరిసమాప్తంపుష్పార్చనతో భక్తులను అలరించిన అమ్మవారి సేవలు
అమ్మ సన్నిధిలోవైభవంగా శ్రీరామనవమి వేడుకలు..
అమ్మ సన్నిధిలోవైభవంగా శ్రీరామనవమి వేడుకలు.. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణంభక్తజన సందోహంతో కళకళలాడిన
కిసాన్సాగర్ ఆర్బిఎల్ బ్యాంక్లో భారీ కుంభకోణం..
కరీంనగర్: కిసాన్సాగర్ అర్బిఎల్ బ్రాంచ్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 7 మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. మ్యూల్ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు. చైనా వ్యక్తులతో కలిసి బండారి సాయిరామ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రతి లావాదేవీపై క్రిప్టో కరెన్సీ ద్వారా సాయిరామ్ 2 శాతం కమీషన్ తీసుకున్నట్లు బయటపడింది. మొత్తం 8 కేసుల్లో 13 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిపి గౌస్ ఆలం తెలిపారు. ‘‘నిందితులకు సుమారు రూ.2 కోట్ల కమీషన్ వచ్చింది. ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0లో భాగంగా మ్యూల్ ఖాతాల నెట్వర్క్ చేధించాం. డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు నిందితులుగా ఉన్నారు’’ అని సిపి తెలిపారు.
ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ: కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాజకీయ యువనికపై మరోకొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు ఆశించిన రీతిలో సాకారం కాలేదని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు మేడ్చల్ నియోజక వర్గంలోని మునీరాబాద్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నేను నిజామాబాద్ కోడలిని.. ఇక్కడ పుట్టిన ఏ ఆలోచనైనా విజయవంతం అవుతుంది” అని కవిత ధీమా వ్యక్తం చేశారు. రాముడు తన ప్రజలను గుండెకు హత్తుకుని పాలించినట్లుగా, తాము కూడా అన్ని వర్గాల వెలుగుల కోసం పని చేస్తామన్నారు. శ్రీరామ నవమి పర్వదినం రోజున పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని, అంతకంటే ముందే కాశీకి వెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసి వస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం బలమైన ప్రాంతీయ పార్టీ లేని లోటు కనిపిస్తోందని, తమ పార్టీ ప్రతి ఇంటి పార్టీగా మారుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పక్కనపెట్టి రీల్స్ చూస్తున్నారని కవిత విమర్శించారు. ప్రశంసిస్తే పనులు జరగవు. ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడాన్ని ఆమెతప్పు బట్టారు. తెలంగాణ జాగృతి ద్వారా తాము చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ, ఖమ్మం వెలుగు మట్లలో నిర్వాసితుల కోసం చేసిన పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చి పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అర్వింద్పై నిప్పులు : స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్పై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు మతిమరుపు రాజకీయాలు చేస్తున్నారని, అర్వింద్ కూడా అందులో ఒకరిని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆర్వీబీ రాలేదని అంటున్నాడు. తాను అధికారం కోల్పోయి ఏడేళ్లవుతున్నా ఆ బ్రిడ్జి పనులు ఎందుకు పూర్తి కాలేదు? ఎక్కడ మర్చిపోయారు? అని నిలదీశారు. 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పెద్దపల్లి రైల్వేలైన్ను తాను పట్టుబట్టి మూడేళ్లలో సాధించానని ఈసందర్భంగా వివరించారు. కార్యకర్తలకు పిలుపు : వచ్చే నెల 25న జరిగే పార్టీ ప్రకటన కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటలకే మేడ్చల్కు చేరుకోవాలని సూచించారు. తాము ఎవరికీ ‘బీ’ పార్టీగా ఉండబోమని, నంబర్ వన్ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ ఆవిర్భావం తర్వాతే ప్రకటిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా తెలంగాణ జాగృతి నేతలు పాల్గొన్నారు.
వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్
వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్ వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్
ప్రపంచశాంతికి బౌద్ధమే శరణ్యం: మంత్రి జూపల్లి
యుద్ధ వాతావరణంలో పలు దేశాలు తలడిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యమని, శ్రీలంక బుద్ధ శాసన, సాంస్కృతిక వ్యవహారాల శాఖా మంత్రి ఆచార్య హినీదుమే సునీల్ సెనేవి అన్నారు. ఋద్ధవనం, వియత్నాం బౌద్ధ సంఘం సంయుక్తంగా బేగంపేట్ లో ది ప్లాజా హోటల్లో నిర్వహిస్తున్న ప్రపంచ శాంతి పై అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో శుక్రవారం ఆయన, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావులు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక వలయాన్ని అభివృద్ధి చేసి, బుద్ధవనాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్నారు. బుద్ధుని బోధనలు ఆచరిస్తే శాంతి దానంతట అదే చేకూరుతుందని మంత్రి తెలిపారు. వియత్నాం బౌద్ధ సంఘ అధ్యక్షులు పూజ్యనీయ తిచ్ నాత్ తు ప్రసంగిస్తూ, శాంతి ముందుగా వ్యక్తుల మనసులో ప్రారంభమవుతుందని, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. నవనలంద మహా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ ఆచార్య సిద్ధార్థ సింగ్ కీలకోపన్యాసం చేస్తూ, కుశల ఆలోచనలు, చర్యలు, మనిషిని సర్వతోన్నతునిగా తీర్చిదిద్ది, సమాజ హితానికి తోడ్పడుతుందని, ఆ ఉద్దేశంతో ప్రపంచ ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని, బౌద్ధాన్ని ఆచరిస్తే యుద్ధాలకు తావుండదని పేర్కొన్నారు. సదస్సులో శ్రీలంక బౌద్ధ భిక్షు, ఆచార్య కసప్ప మహా ధేరో, రష్యా బౌద్ధ సంఘ, అధ్యక్షులు, అండ్రే దొందుకుబెవ్, లావోస్ కేంద్ర బౌద్ధ సంఘ, అధ్యక్షులు, వంఖరి వాంగ్ ససులిన్, మహాబోధి సొసైటీ, జనరల్ సెక్రెటరీ, ఆనందబిక్కు ప్రసంగించారు. బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా, శ్రీలంక మంత్రి ఆచార్య హనీ దుమీ, రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, తీచ్ నాత్ తులకు అంతర్జాతీయ అవార్డులు అందజేసి మూన్ యాంగ్ జో సత్కరించారు. బుద్దవనం ప్రత్యేక అధికారి లక్ష్మయ్య మాట్లాడుతూ 22 దేశాల నుంచి 80 మంది ప్రతినిధులు సదస్సులో ప్రసంగించారని చెప్పారు.
శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.
శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం. ఆకట్టుకున్న అడుగులభజన చెక్కభజన పోటీలు.. ఊట్కూర్,ఆంధ్రప్రభ :
ఘనంగా రాములోరి కళ్యాణ మహోత్సవం….
ఘనంగా రాములోరి కళ్యాణ మహోత్సవం…. స్వామివారిని దర్శించుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
శ్రీరామలింగేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ
శ్రీరామలింగేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు
వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 12.26కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లికి చెందిన హేమా చంద్రకాంత్ హట్వాలే, సాకేత్ శంకర్, కసాబ్ రాజు ముగ్గురు గంజాయి విక్రయిస్తుండగా వారికి శివరాజ్ హట్ గడ, అక్షయ్, జావెద్ సహకరిస్తున్నారు. నిందితులు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బంది హేమా చంద్రకాంత్ హట్వాలే, సాకేత్ శంకర్, కసాబ్ రాజును అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 10.16కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ముగ్గురు నిందితులను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2.1కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని శివసాయి నగర్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ సిబ్బంది నిఘా పెట్టారు. మహ్మద్ అర్బాజ్, సయ్యద్ ఇస్రా ఉద్దిన్ను అరెస్టు చేశారు. గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న మరో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.
ఎక్సైజ్ సుంకం తగ్గంచడం సాహసోపేతమైన నిర్ణయం:బిజెపి రాంచందర్ రావు
ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం ఒక సాహసోపేతమైన నిర్ణయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అభివర్ణించారు. దేశ ప్రజలకు తీపి కబురు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, జనరంజకమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా ’సున్నా’ స్థాయికి తగ్గించడం పెట్రోల్పై కూడా రూ. 10 భారాన్ని తగ్గించి కేంద్రం తన బాధ్యతను చాటుకుందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తుందని రాంచందర్ రావు ప్రశ్నించారు.
అనిల్-వెంకీ-కళ్యాణ్రామ్ చిత్రం.. శ్రీ రామ నవమి అప్డేట్
ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ని అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తదుపరి చిత్రం వెంకటేష్, కళ్యాణ్ రామ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి సందర్భంగా సినిమా నుంచి ఓ అప్డేట్ని విడుదల చేశారు. అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి సినిమాలు తీసిన సాహు గారపాటి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అలానే సురేశ్ బాబు, జీ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనున్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా పోస్టర్ని రిలీజ్ చేసి.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో వెంకీ, కళ్యాణ్ రామ్కు జోడీగా.. కీర్తి సురేశ్, కృతి శెట్టిలు నటిస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema)
పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం నివారణకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం.
అమెరికా కాగిత కరెన్సీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండనుంది. 250 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ గురువారం ప్రకటించింది. ప్రస్తుత పదవిలో ఉన్న అధ్యక్షుడి సంతకం కరెన్సీపై ముద్రించబడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నిర్ణయంతో 165 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి కూడా తెరపడింది. 1861లో ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ట్రెజరర్ సంతకం కరెన్సీపై తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు మొదటిసారి ఆ సంతకాన్ని తొలగిస్తున్నారు.ట్రెజరీ వివరాల ప్రకారం, ట్రంప్ సంతకం, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంతకాలతో కూడిన తొలి 100 డాలర్ల నోట్ల ముద్రణ జూన్లో ప్రారంభం కానుంది. తరువాతి నెలల్లో ఇతర నోట్లపై కూడా ఈ మార్పులు అమలవుతాయి. ఈ నిర్ణయం దేశ ఆర్థిక ప్రగతిని ప్రతిబింబిస్తుందని ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ పేర్కొన్నారు. దేశ విజయాలు, 250వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసే విధంగా ట్రంప్ పేరును కరెన్సీపై ముద్రించడం సముచితమని ఆయన అన్నారు.ఇదే సమయంలో అమెరికా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఇది సరైనదే కాకుండా సముచిత గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మాత్రం మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్, ట్రెజరర్ లిన్ మలెర్బా సంతకాలతో ఉన్న నోట్ల ముద్రణ కొనసాగుతోంది. 1861 నుంచి కొనసాగుతున్న ట్రెజరర్ సంతకాల సంప్రదాయానికి మలెర్బా సంతకం చివరిది కానుంది. ఇక 250వ వార్షికోత్సవ వేడుకల భాగంగా ట్రంప్ గౌరవార్థం మరిన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన చిత్రంతో 24 క్యారెట్ బంగారు స్మారక నాణెం రూపకల్పనకు అనుమతి లభించింది. ఈ నాణెం జూలై 4 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విడుదల కానుంది.
More Delays for Vijay’s Jana Nayagan
Ilayathalapathy Vijay’s last film Jana Nayagan is stuck with censor hurdles and the film’s release is pushed from January. The censor hurdles are expected to be cleared very soon and the film will obtain the censor certificate. With Assembly Elections scheduled in Tamil Nadu, there are reports that Jana Nayagan will have its release in […] The post More Delays for Vijay’s Jana Nayagan appeared first on Telugu360 .
రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు 1730 పోస్టుల మంజూరునంద్యాల జిల్లాలో.. 21
Sai Pallavi about Getting Married
Sai Pallavi is one of the most disciplined actresses and she is focused on doing character-driven roles. She is against glamorous roles and she followed the same despite not getting big offers. The actress has big projects lined up and she is busy with the mythological epic Ramayana. During a public event, Sai Pallavi responded […] The post Sai Pallavi about Getting Married appeared first on Telugu360 .
వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం
వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఉరవకొండ రూరల్,ఆంధ్రప్రభ : మండలం లోని బూదగవి
Us 10k Troops : అటు ఇటు Andhra Prabha Analysis
Us 10k Troops : అటు ఇటు Andhra Prabha Analysis (
పెళ్లి వేడుకలో విషాదం. . తుంగభద్రలో ఈతకు వెళ్లి నలుగురు మృతి.. ఆనందం
సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు
వివాహితుడు ఒక మహిళతో పరస్పర సమ్మతితో సహజీవన సంబంధంలో ఉంటే అది నేరం కాదని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో నైతికత (మొరాలిటీ) కంటే చట్టమే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. ఒక వివాహితుడు, ఒక మహిళతో పరస్పర అంగీకారంతో సహజీవన బంధంలో ఉంటే, దాన్ని ఏ విధంగానూ నేరంగా పరిగణించలేం. చట్టం, నైతికత రెండూ వేరువేరు. చట్టపరంగా నేరం లేనప్పుడు, సామాజిక అభిప్రాయాలు లేదా నైతిక విలువలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయవు అని ధర్మాసనం పేర్కొంది.ఈ కేసులో సంబంధిత మహిళ స్వచ్ఛందంగానే ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నానని పోలీసులకు తెలిపినప్పటికీ, కుటుంబ సభ్యుల నుంచి గౌరవ హత్య (ఆనర్ కిల్లింగ్) బెదిరింపులు ఉన్నప్పటికీ పోలీసులు స్పందించలేదని కోర్టు గమనించింది. పెద్దవారైన ఇద్దరు కలిసి జీవిస్తే వారి రక్షణ బాధ్యత పోలీసులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనా ధర్మాసనం మాట్లాడుతూ, ఈ ఫిర్యాదుపై పోలీసు సూపరింటెండెంట్ చర్యలు తీసుకోకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు పెద్దవారు కలిసి జీవించే హక్కును కాపాడటం పోలీసుల కర్తవ్యం అని పేర్కొంది.ఈ కేసుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు, ఏప్రిల్ 8కి విచారణను వాయిదా వేసింది. అంతవరకు ఆ జంటకు తక్షణ రక్షణ కల్పించాలని ఆదేశించింది. వారి భద్రతకు షాజహాన్పూర్ ఎస్పీ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనం కల్పించిన కోర్టు, అనామిక, నేత్రపాల్లను అరెస్ట్ చేయరాదని ఆదేశించింది. అలాగే మహిళ కుటుంబ సభ్యులు ఆ జంటకు హాని చేయకుండా, వారి నివాసానికి రావడం లేదా ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదించడం కూడా నిషేధించింది.
మెగాస్టార్ గొప్ప మనసు.. కొడుకు పుట్టినరోజున భారీ విరాళం
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన కుమారుడు రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ విరాళం ఇచ్చారు. చిరంజీవి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల్లో ఎన్టిఆర్ జాతీయ బహుమతిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు వచ్చిన రూ.10 లక్షలను స్వచ్ఛంద సంస్థలకు విరాళమిచ్చారు. పలువురు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పని చేస్తున్న దేవనార్ ఫౌండేషన్, చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా మెగాస్టార్ విరాళం ఇచ్చారు. ఇటీవల సినిమా షూటింగ్లో రామ్ చరణ్ని కలిసిన వృద్ధులను మెగాస్టార్ తన బ్లడ్ బ్యాంక్కు ఆహ్వానించారు. వారందరికీ బర్త్డే గిఫ్ట్గా కొత్త దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం తానే స్వయంగా వారందరికీ భోజనాలు పెట్టించారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిండి చింతపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
డిండి చింతపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్?
మార్కాపురం బస్సు దగ్దం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
అపోహలు సృష్టిస్తే నమ్మొద్దు : సీఐ సత్యనారాయణ
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరా
BRS : కారు పార్టీకి ఎన్ని ఇబ్బందులో.. తట్టుకుని నిలబడగలదా?
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది
రామగిరి ఆలయానికి భారీ అభివృద్ధి ప్రణాళిక
నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా
Helium |ఇరాన్ దాడుల ప్రభావం: ఎంఆర్ఐ ఖర్చులు పెరుగుదల?
Helium | ఇరాన్ దాడుల ప్రభావం: ఎంఆర్ఐ ఖర్చులు పెరుగుదల? Helium |
అయోధ్య బాల రాముడి నుదుట సూర్య తిలకం #telugupost #ayodhyarammandir #ramnavami #lordrama
ట్రాన్స్జెండర్లకు షాక్… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఒలింపిక్ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Chadndrababu :ప్రధాని నిర్ణయంతో చంద్రబాబు హర్షం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు
శోభాయమానంగా శ్రీరామనవమి… జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన నవమి పందిళ్లు.స్వామికి పట్టు వస్త్రాలు
Telangana : రేపటి నుంచి ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు
ఈ నెల 28, 29 తేదీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్, నాటక ప్రదర్శనలు జరగనున్నాయి
దారుణం: పెళ్లి వేడుకకు వచ్చి.. నదిలో మునిగి నలుగురు మృతి
కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద దారుణం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగరు మృత్యువాత పడ్డారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత ఇవాళ ఉదయం వారంతా సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగిన నలుగురు ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
Kavitha : కవిత కొత్త పార్టీ ఏప్రిల్ 25న
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు.
Chaitanya – Raviteja |తెర వెనుక ఏం జరిగింది..?
Chaitanya – Raviteja | తెర వెనుక ఏం జరిగింది..? Chaitanya –
Sahu Garapati Boards Anil Ravipudi’s Next With Venky, NKR
Anil Ravipudi’s next big entertainer brings together a powerhouse combination- Victory Venkatesh and Nandamuri Kalyan Ram. Successful producer Sahu Garapati has come on board to bankroll the project under the Shine Screens banner, with Suresh Productions and Smt Archana presenting it and Zee Studios joining as co-producer. Planned as a vibrant festival entertainer for Sankranthi […] The post Sahu Garapati Boards Anil Ravipudi’s Next With Venky, NKR appeared first on Telugu360 .
RGIAలో కాంటీన్ భోజనంలో రాయి.. ఫుడ్ నాణ్యతపై సందేహాలు #RGIA #FoodSafety #HyderabadAirport #TGPWU
దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం..
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం; దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర ,కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ సికిందర్.. […] The post దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం.. appeared first on Visalaandhra .
danger2050 |పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రపంచానికి పెద్ద ముప్పు!
danger2050 | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రపంచానికి పెద్ద ముప్పు! danger2050 | భూతాపం
WAR | మాంసప్రియులకు చేప షాక్.. WAR | మాంసప్రియులకు చేప షాక్..
Kadiyam Kavya |గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి ప్రమాదకరం
Kadiyam Kavya | గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి ప్రమాదకరం వరంగల్ సిటీబ్యూరో,
జైపూర్లో రోడ్డుపై యువతి వీరంగం #telugupost #jaipur #women #viralvideo
విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. మరో ముగ్గురి అరెస్ట్
విజయవాడ: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అజ్మతుల్లా ఖాన్, జిషాన్ అబ్దుల్, షేక్ ఫైజ్ను అరెస్టు చేసి.. విజయవాడ తీసుకొచ్చారు. మరికాసేపట్లో వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. విజయవాడలో ముగ్గుర్ని, హైదరాబాద్, బీహార్లో ఒక్కొక్కరు చొప్పున ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యారు. మిగితా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి
శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి […] The post ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి appeared first on Visalaandhra .
ఖిల్లా రామాలయానికి రూ.10 కోట్ల అభివృద్ధి
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర పథకాలు అందేలా
‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?” […] The post పట్టపగలే ఎర్ర మట్టి దందా… appeared first on Visalaandhra .
ఖిల్లా రామాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల
Incident |పాపం ఈతకెళ్లి నలుగురు…
Incident | పాపం ఈతకెళ్లి నలుగురు… Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక తిక్కయ్య స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కల్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించగా, ముత్యాల తలంబ్రాలతో పాటు పూజా సామగ్రిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. […] The post ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం appeared first on Visalaandhra .
Anxiety |జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
Anxiety | జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం Anxiety | ఆంధ్రప్రభ,
ఉట్నూర్ లో ఘనంగా బోగ్ బండార్ పూజలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; శ్రీరామనవమి సందర్భంగా, దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి గిరిజనులు ,
బస్సు ప్రమాద బాధితులను మంత్రుల పరామర్శ..
బస్సు ప్రమాద బాధితులను మంత్రుల పరామర్శ.. ఒంగోలు రిమ్స్ లో మణెమ్మను పరామర్శించిన
Anumana Pakshi Gulab Jam Song: Ramana Gogula hits Big
With DJ Tillu, writer-director Vimal Krishna made a solid impression on Telugu audiences. Now, he is back with Anumana Pakshi starring Rag Mayur and Merin Philip in leading roles. The movie is produced by Rajiv Chilaka, Meghha Chilakka, Sneha Rajesh Jagtiani, Vihaan Dand, Sricharan Marneni. The makers have impressed with the promotional material till date […] The post Anumana Pakshi Gulab Jam Song: Ramana Gogula hits Big appeared first on Telugu360 .
గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) తలారి నాగన్న శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పుల్లలరేవు, గొందిరెడ్డిపల్లి గ్రామాల వి.ఆర్.ఏగా పని తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర మండల కార్యాలయాల సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, ప్రజలతో మమేకమై ఉంటూ మృదుస్వభావిగా మంచి గుర్తింపు పొందారు. విధుల నిమిత్తం గురువారం ఉదయం కూడా అధికారులతో కలిసి పుల్లలరేవు పొలాల రీసర్వే ప్రక్రియలో పాల్గొన్నారు. […] The post గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి appeared first on Visalaandhra .
శ్రీరామనవమి రోజున మతసామరస్యం చాటిన ముస్లిం సోదరులు #Bhadrachalam #SriRamaNavami
Andhra Prabha Smart Edition |TS|సీతమ్మ మురిపెం/వార్కు విరామం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 27-03-2026, 4.00PM ts రామయ్యతో పరిణయం.. సీతమ్మ

24 C