SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

Earth Quake : అమెరికాలో భూకంపం

అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతగా నమోదయింది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 9:29 am

‘అఖండ 2’లో అబ్బురపరిచే వాహనం

అఖండ 2 సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ నడిపిన వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఎక్స్‌డ్రైవ్ అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, ఎక్స్ స్టూడియోస్ దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ “అమర్ ఈ వాహనాన్ని రాత్రి పగలు కష్టపడి గొప్పగా డిజైన్ చేశారు. అందుకు ఆయనని అభినందించాలి. ఈ వెహికల్ ని యాక్షన్‌లో ఎంత అద్భుతంగా వాడుకున్నామో అది మీరు థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అఖండ2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అభిమానులు అందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే సినిమా ఇది”అని అన్నారు. అమర్ మాట్లాడుతూ “అఖండ 2 సినిమాలో ఈ వాహనం స్క్రీన్ మీద అబ్బురపరుస్తుంది. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది”అని తెలిపారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:29 am

Chittoor |కాకరకాయ.. కాసుల వర్షం..

Chittoor | కాకరకాయ.. కాసుల వర్షం.. Chittoor, చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:22 am

Narendra Modi : నేడు రెండు రాష్ట్రాలకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 9:20 am

దోనీ ఇంటికెళ్లిన టీమిండియా ఆటగాళ్లు

రాంచీ: టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి వన్డే రాంచీలో జరుగుతుండడంతో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. రాంచీ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. దీంతో టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్‌తో ధోనీకి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ముగ్గురు కలిసి దోనీ ఇంటికి వెళ్లారు. రాంఛీలో టీమిండియా ఆడుతుండడంతో ధోనీ ఈ మ్యాచ్‌ను వీక్షిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఐపిఎల్ తరువాత ధోనీ ఇప్పటివరకు మైదానంలో చూడలేదు. ధోని తొలి వన్డే మ్యాచ్ కోసం మైదానానికి వస్తాడని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి గాయంతో ఆటకు దూరం కావడంతో కెఎల్ రాహుల్ వన్డే కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్, విరాట్ బ్యాటింగ్ చూసే అవకాశం అభిమానులకు దక్కింది. 

మన తెలంగాణ 28 Nov 2025 9:06 am

Gold Price Today : బంగారం బరువెక్కుతుంది.. వెండి వేడెక్కుతుందిగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:58 am

Makthal |రథోత్సవం..

Makthal | రథోత్సవం.. Makthal, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:53 am

Tirumala : తిరుమలకు నేడు వెళితే.. మీరు ఎన్ని గంటలు వెయిట్ చేయాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:40 am

TG |ఎన్నికల పంచాయితీ..

TG | ఎన్నికల పంచాయితీ.. TG, ఎడపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయితీల

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:38 am

భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన భర్త

అమరావతి: భార్య కాపురం చేయడానికి రావడం లేదని ఆమెకు భర్త డెత్ సర్టిఫికెట్ పంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా ముద్దనూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మి అనే యువతి 14 సంవత్సరాల క్రితం ముద్దనూరుకు చెందిన మారుతిరాజును పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆదిలక్ష్మి భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు ఫోన్ చేసి భార్యన ఇంటికి రమ్మని భర్త కబురు పంపాడు. ఆమె రాకపోవడంతో విసుగు చెంది భార్య పేరుతో డెత్ సర్టిఫికెట్ తయారు చేసి పోస్టులో పంపాడు. తాను బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ పంపడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మారుతిరాజు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన తల్లి పేరుతో ఉన్న డెత సర్టిఫికెట్ మారన్చి తయారు చేశానని ఒప్పుకున్నాడు.  

మన తెలంగాణ 28 Nov 2025 8:33 am

Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:26 am

Andhra King Taluka gains Momentum

The advance bookings of Ram’s recent offering Andhra King Taluka were quite low. The film released on Thursday and the openings are not great. Andhra King Taluka released between decent expectations with low footfalls all over. With word of mouth, the numbers picked up by afternoon and they have seen a rise by evening. The […] The post Andhra King Taluka gains Momentum appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:26 am

Photos: Vaanaram Movie Teaser Launch

The post Photos: Vaanaram Movie Teaser Launch appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:21 am

Photos: Anaganaga Oka Raju Song Launch Event

The post Photos: Anaganaga Oka Raju Song Launch Event appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:15 am

కాసు లిస్తేనే కుట్లు

విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : ఆ కమ్యూనిటీయల్ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే మద్యం మత్తులో కుట్లు వేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే కానీ కుట్లు వేయని ఉద్యోగి బాగోతం బయట పడింది. అతను మద్యం సేవించి విధులకు హాజరు అవుతారు. ఇతనిని ప్రశించే నాధుడే లేరు. కొవ్వూరు కమ్యూనిటీయల్ సెంటర్లో సౌకర్యాలు కరువయ్యాయని గతంలో వరుస కథనాలతో విశాలాంధ్ర పత్రిక సమస్యలను బయట పెట్టడంతో స్పందించిన అధికారులు […] The post కాసు లిస్తేనే కుట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 8:11 am

BB Telugu 9, Day 81: Ex-Housemates Stir Romance, Chaos and Competition

Day 81 brought a lively mix of romance, comedy and heated arguments as former Bigg Boss contestants Prince Yawar, Shobha Shetty and Syed Sohail entered the house. Their presence not only entertained but also played a decisive role in shaping the captaincy race for the week. Prince Yawar Brings Flirtation and Fun Season 7 contestant […] The post BB Telugu 9, Day 81: Ex-Housemates Stir Romance, Chaos and Competition appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:07 am

Amaravathi : అపూర్వ ఘట్టానికి నేడు ముహూర్తం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:06 am

రాజధాని రైతులకు ఇక సమస్యలుండవ్

రాజధాని ల్యాండ్ పూలింగ్ కు లంక భూములు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:03 am

Murder |మాజీ మావోయిస్టు హత్య..

Murder | మాజీ మావోయిస్టు హత్య.. తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:02 am

Telangana : మాజీ నక్సలైట్ దారుణ హత్య

వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:56 am

శిక్షణ కార్యక్రమం

రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం విశాలాంధ్ర -కొవ్వూరు : కొవ్వూరు డిఆర్డిఏ సెర్ప్ మరియు హిఫర్ ఇంటర్నేషనల్ వారి భాగ్యస్వామ్యంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందికి సుస్థిరత మరియు వృద్ధి శిక్షణ సమావేశం కొవ్వూరు వెలుగు కార్యాలయంలో గురువారం జరిగింది ఏపీఎంకే నిర్మల కుమారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డిఏ పిడి ఎన్ వీవీ ఎస్ మూర్తి డిఆర్డిఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్య నాయుడు హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారుల […] The post శిక్షణ కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:52 am

ఫ్యాక్ట్ చెక్: బైక్ మీద వెళుతున్న వ్యక్తిపై పులి దాడి చేస్తున్న వీడియో నిజమైనది కాదు. ఏఐ ద్వారా సృష్టించారు

బైక్ మీద వెళుతున్న వ్యక్తిపై పులి దాడి చేస్తున్న వీడియో. కొందరు పులి దాడి చేయడం చూడగానే పారిపోతూ కనిపించారు

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:50 am

Amaravathi : అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందే.. చంద్రబాబు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ భూసమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:50 am

కత్తికి తగ్గిన పదును.... కత్తికి దూరంగా వెళ్లిపోతున్న వైద్యులు

ఇటీవల కాలంలో మెడికల్ విద్యార్థులు సర్జరీ విభాగంలో పనిచేయడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ నెలలో జరిగిన నీట్ 2025 పరీక్షల కౌన్సిలింగ్ లో అత్యధిక మంది విద్యార్థులు జనరల్ మెడిసిన్ మరియు రేడియాలజీని తీసుకున్నారు. ఢిల్లీలో టాప్ 1,500 మంది అభ్యర్థులలో, 632 మంది విద్యార్థులు (42%) MD జనరల్ మెడిసిన్‌ను ఎంచుకున్నారు, ఇది అనేక మెడికల్ సూపర్‌స్పెషాలిటీలకు ప్రవేశ ద్వారంగా దాని స్థానాన్ని మనకు తెలియచేస్తుంది. రేడియోడయాగ్నసిస్‌ను నిశితంగా అనుసరించారు, 447 మంది అభ్యర్థులు ఎండి రేడియాలజీ (30%) తీసుకున్నారు, ఇది మరింత నిర్మాణాత్మక గంటలు, తక్కువ అత్యవసర పరిస్థితులను అందించే రంగంగా ఉంది. దీనికి విరుద్ధంగా, 99 మంది విద్యార్థులు (6.6%) మాత్రమే ఎంఎస్ జనరల్ సర్జరీని ఎంచుకున్నారు, ఇది అధిక-రిస్క్ అయినా ఆపరేషన్ల విభాగాన్ని విధానపరమైన విభాగాల పట్ల విముఖతను హైలైట్ చేస్తుంది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఆ కాలంలో ఎక్కువమంది సర్జరీ తీసుకునేవారు ఆర్థోపెడిక్స్ తీసుకునేవారు. చాలామంది సర్జరీ తీసుకుంటే మెడికల్ విషయాలలో తలనొప్పి అని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ చిన్న ఆపరేషన్ చేసినా కానీ ఎప్పుడైనా కాంప్లికేషన్ రావచ్చు దీనివలన డాక్టర్లపై దాడులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా కోర్టులలో వాజ్యాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి డాక్టర్లు దోచుకుంటా అన్నారు అని అనడం, దాడి చేయడం ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీలు పరీక్షలు ఐసియు ఛార్జీలు ఎక్కువ అయ్యి వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది. ఈ విషయం మన ప్రజలకు అర్థం కాకపోవడం వలన ఆపరేషన్లు ఫెయిల్యూర్ అయితే డబ్బులు ఖర్చయిపోయినాయి అని బాధపడి దాడులు చేస్తున్నారు. ఇది ఒక ముఖ్య కారణంగా విద్యార్థులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ కాలం శ్రమించి ఆపరేషన్లు నేర్చుకోవాలి, వాళ్లకు వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందువలన ఎందుకొచ్చిన తలకాయ నొప్పి అని ఆ బ్రాంచ్ ను తీసుకోవడం తగ్గించేసారు. శస్త్రచికిత్స వృత్తిలో స్థిరపడటానికి తరచుగా న్యూరోసర్జరీ, కార్డియాక్ సర్జరీ, యూరాలజీ లేదా పీడియాట్రిక్ సర్జరీ వంటి రంగాలలో మరింత సూపర్ స్పెషలైజేషన్ అవసరం, అలా చేయగలిగితేనే స్థిరత్వానికి మార్గాన్ని పొడిగిస్తుంది. దీనికి మరలా మూడు సంవత్సరాల ఎం సి హెచ్ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు మూడేళ్ల చదువు తమ ఎండి చేయడంలో కొనసాగించి ఎంబిబిఎస్ తో కలుపుకుంటే 9 ఏండ్లు అప్పటికే చదివి వింటారు.. ఇంకా మూడేళ్లు అనగా 12 ఏళ్లు చదవవలసి వస్తుంది. దాని తర్వాత ఆపరేషన్లలో సూపర్ స్పెషాలిటీలో నైపుణ్యం సంపాదించాలి అంటే మరో ఐదేళ్ల కాలం పడుతుంది. దీనికి ఈ కాలం విద్యార్థులు సిద్ధంగా లేరు... ఇందుకు కారణం చాలా లోతుగా ఉంది. ఈ సర్జరీ విభాగాలలో చేరితే ఎక్కువ పని గంటలు చేయాల్సి రావడం, ఎక్కువ అంకితభావంతో పనిచేయాల్సి రావడము, అధికమైన భావోద్వేగ పరిస్థితులలో పని చేయాల్సి రావటము వలన అత్యధికమైన మోటివేషన్ లేకుంటే బర్నౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ కాలేజీలలో విద్యను అభ్యసించి ఎక్కువ ఫీజులు చెల్లించి మెడిసిన్ చదివిన ఈ కాలపు యువతకు అంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అని భావిస్తున్నారు.. అందుకనే ఎక్కువ ప్రమాదం లేని రేడియాలజీ జనరల్ మెడిసిన్ లాంటి విభాగాలను ఎంచుకుంటున్నారు.. ఈ విధంగా తక్కువ రిస్క్ గల బ్రాంచ్ల వైపు విద్యార్థులు మారడాన్ని ఫ్యూచర్లో మనకు సర్జన్ల కొరత ఎక్కువ అయిపోయి కీలకమైన ఆపరేషన్లు చేసే సర్జన్లు తక్కువగా అయిపోయి ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇక సూపర్ స్పెషాలిటీ లైన గుండె ఆపరేషన్ల విభాగము ఎంసిహెచ్ సిటివిఎస్ న్యూరో సర్జరీ విభాగాలలో తీసుకునే వాళ్ళు విదేశాల్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ట్రెండ్ ఇప్పటికే అన్ని దేశాలలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు భారతీయ యువత కూడా చాలెంజింగా ఉండి ఎక్కువ రిస్క్ తో కూడిన ఆపరేషన్ చేసే వైపునుండి స్థిరత్వంగా ఆదాయం ఉండి తక్కువ పని గంటలు తక్కువ రిస్కు ఉండే రేడియాలజీ మెడిసిన్ లాంటి వైపుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందువలన కత్తికి పదును తగ్గి కత్తికి దూరంగా వెళ్లిపోతున్నారు. ఈ మార్పు మంచిదేనా సమాజానికి అనేది మనం గమనించాలి.. సమాజం పోకడల వలన విద్యార్థులు మారారా లేక విద్యార్థులలో రిస్కు తీసుకొని చాలెంజింగా వృత్తిని నిర్వహించాలి అనే స్పృహ తగ్గిందా? మీరు ఏమంటారు?   డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్  గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 28 Nov 2025 7:48 am

కలలకు ఆటంకం- గౌరమ్మ

బాల్య వివాహాలతో బాలికల బంగారు కలలకు ఆటంకం – బాల్య వివాహ ముక్త భారత్ కొవ్వొత్తుల ర్యాలీ – సిడిపివో జి.గౌరమ్మ విశాలాంధ్ర – రాజానగరం : బాల్య వివాహాలతో బాలికల బంగారు కలలకు ఆటంకపరచడంతో పాటుగా విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధి వంటి అవకాశాలను దూరం చేస్తుందనీ రాజానగరం చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపివో) జి.గౌరమ్మ అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో ఐసిడిఎస్ సిడిపివో అధ్యక్షతన ఉమెన్ అండ్ చైల్డ్ […] The post కలలకు ఆటంకం- గౌరమ్మ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:44 am

AP |స్టూడెంట్స్ కోసం..

AP | స్టూడెంట్స్ కోసం.. AP, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : డిసెంబర్ 5వ

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:43 am

పోలీస్ స్టేషన్ లో బంగారు వ్యాపారుల‌ను క్రూరంగా కొట్టిన వసంత్ ఎవరు: టిడిపి ఎంఎల్ఎ

అమరావతి: ఒక అనధికారిక వ్యక్తి వద్దకు తుపాకీ ఎలా వచ్చిందని పోలీసులను ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు వ్యాపారుల‌ను అత్యంత క్రూరంగా కొట్టిన విషయంలో విజయవాడ అడిషనల్ ఎస్పీ అని చెప్పుకున్న అనధికారిక వ్యక్తి వసంత్ ఎవరు? అని, ప్రొద్దుటూరు డిఎస్ పి ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసు అధికారి కాని వ్యక్తి తుపాకీ గురిపెట్టి నిరపరాదులను బెదిరిస్తారా? అని పోలీసులను వ‌ర‌ద‌రాజులురెడ్డి అడిగారు. ప్రొద్దుటూరు డిఎస్ పి కార్యాలయంలో వసంత్ అనే వ్యక్తి వచ్చి మాట్లాడారని మాకు సమాచారం ఉందని ఆరోపణలు చేశారు. పక్కనే ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎందుకు బదిలీ చేశారని అడిగారు. ఇలాంటి సంఘటన జరిగిన దానికి తాము సిగ్గుపడుతున్నామని, ఇక మీదట ఇలాంటి చర్యలు జరగకుండా శాసనసభ్యునిగా చూసే బాధ్యత తనపై ఉందన్నారు. ఈ విష‌యాన్ని డిఐజి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని వ‌ర‌ద‌రాజులురెడ్డి స్పష్టం చేశారు.  ఉన్నతాధికారుల ప్రమేయంతో పోలీసులు ప్రైవేట్ పంచాయితీలు చేస్తున్నారన్న వరదరాజులురెడ్డి గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసులు అనే బంగారు వ్యాపారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపణ చేసిన విషయం విధితమే. 

మన తెలంగాణ 28 Nov 2025 7:36 am

ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక బృందం చేసిన విన్యాసాలకు సంబంధించింది కాదు

నవంబర్ 2025లో దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళం చేసిన విన్యాసాలు

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:34 am

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

విశాలాంధ్ర – నిడదవోలు : దేవస్థానం అభివృద్ధి కి, ఆస్తుల పరిరక్షణ కు కృషి చేస్థామని శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు అన్నారు. నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వేంచేసి యున్న శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం నిర్వహించారు. ఉమా మల్లేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గొల్లపల్లి మురళి కృష్ణ పాలకవర్గ సభ్యులుగా భోగిరెడ్డి సుబ్బారావు, పులిమి సూర్యనారాయణ, సింగనపూడి మందేశ్వరరావు., అయినమిల్లి యేసు, గొలుగొండ వెంకటలక్ష్మి, […] The post ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:33 am

దేవదాసుకు పదోన్నతి

సీనియర్ అసిస్టెంట్ దేవదాసుకు పదోన్నతి. విశాలాంధ్ర – కడియం : కడియం మండల పరిషత్తు సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ దేవదాసు కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి దక్కింది. ఆయనను రాజనగరం మండలం జి ఎస్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎంపీడీవో గా నియమిస్తూ జిల్లా కలక్టర్ కీర్తి చేకూరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత మూడేళ్లుగా ఇక్కడ సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తూ అందరి మన్ననలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీపీ వెలుగుబంటి […] The post దేవదాసుకు పదోన్నతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:25 am

తోట పార్టీ

భూపతి పాలెం ఏపీఆర్ స్కూల్లో పిన్సిపల్ పి సత్య శేఖర్ ఆధ్వర్యంలో తోట పార్టీ ( గార్డెన్ పార్టీ )విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండలం భూపతి పాలెం గ్రామంలో నున్నా ఏపీ ఆర్ స్కూల్ లో గురువారం ప్రిన్సిపాల్ పి సత్య శేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గార్డెన్ పార్టీ . ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ సృజన్ సమక్షంలో ఆలుమిని ఎగ్జిక్యూటివ్ నెంబర్లు కలిసి స్కూల్లో చదువుతున్న […] The post తోట పార్టీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:21 am

Panchayat elections |యువత షరతు..

Panchayat elections | యువత షరతు.. Panchayat elections, టేకుమట్ల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:21 am

Telangana : తెలంగాణ అన్నదాతలకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:18 am

అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం

– జిల్లా అధ్యక్షుడు వర్మ విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది‌పై జరుగుతున్న అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం అని జిల్లా అధ్యక్షుడు పి. గిరి ప్రసాద్ వర్మ అన్నారు. వర్మ మాట్లాడుతూతూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పలు రాజకీయ ఒత్తిడులు, అనుచిత ప్రవర్తనల వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో నుంచి వైద్య ఆరోగ్య శాఖను తక్షణమే రక్షించాలని […] The post అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:01 am

Kavitha |పూజలు..

Kavitha | పూజలు.. Kavitha, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : కామారెడ్డి జిల్లా

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:59 am

జిల్లాలో డ్రైవ్ –జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ 

జిల్లాలో స్కూల్ బస్సుల ప్రత్యేక డ్రైవ్ – నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4* *భద్రతా తనిఖీలు & ప్రధాన ప్రమాణాలు* *బస్సు తనిఖీ లు యాజమాన్యాల బాధ్యత – లోపాలు కనపడితే కఠిన చర్యలు* జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :తూర్పు గోదావరి జిల్లాలోని విద్యాసంస్థల స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి రవాణా శాఖ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు […] The post జిల్లాలో డ్రైవ్ – జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:43 am

రైతన్న మీ కోసం లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రైతన్న మీ కోసం’ – తొర్రేడులో కరపత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి *వరి సాగు లాభాలపై రైతులతో ముఖాముఖి – కలెక్టర్ కీర్తి చేకూరి* *సేంద్రీయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన – పంట మార్పిడిపై దృష్టి సారించాలని సూచన* విశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ :గురువారం తొర్రేడు గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కరపత్రాలను పంపిణీ చేసి, రైతులతో నేరుగా మాట్లాడారు. వరి […] The post రైతన్న మీ కోసం లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:36 am

సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా

సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా ఎన్నికల అధికారులు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని ఒరిస్సా జిల్లా పరిషత్ ఛైర్మన్ మరియు సర్పంచ్ ఎన్నికల అధికారుల బృందం గురువారం సందర్శించింది. నర్సరీ రైతు పుల్లా పెద్ద సత్యనారాయణ వారికి మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. ఇక్కడి మొక్కలు ప్రకృతిలో సంభవిస్తున్న కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రిస్తున్నాయని వారికి వివరించారు. నర్సరీలో పలు రకాల మొక్కల శాస్త్రీయ నామాలు, వాటివల్ల ఉపయోగాలను వారు […] The post సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:16 am

ప్రణాళిక సిద్ధం

రాబోయే సవంత్సరoకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో గల స్త్రీ సమాఖ్య భవనంలో గురువారం యాన్యుల్ యాక్షన్ ప్లాన్ 2 తయారు చేయుటకు 59 మంది మండల సమాఖ్య కార్య నిర్వాహక సభ్యులుకు 4 రోజులు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఏ పి ఎమ్ జిలానీ అన్నారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ 8 అంశాల పట్ల ప్రత్యేక శిక్షణలో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలని అంశాల వారిగా వివరించడం […] The post ప్రణాళిక సిద్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:08 am

Accident |రోడ్డు ప్రమాదం..

Accident | రోడ్డు ప్రమాదం.. Accident, భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : మోర్తాడ్‌

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:08 am

పిల్లలకు వైద్య పరీక్షలు

అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు వైద్య పరీక్షలు విశాలాంధ్ర – సీతానగరం: అంగన్వాడీ కేంద్రాల పిల్లలలో పోషకాహార లోపాలపై ఉన్న వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని మండల వైద్య అధికారి డాక్టర్ ఏ వి కే చైతన్య అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ జిల్లా అధికారుల, జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆదేశాల మేరకు మండలంలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా గురువారం సీతానగరం గ్రామంలో […] The post పిల్లలకు వైద్య పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:05 am

ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలపై.. నిఘా ఏదీ..!

నెల్లూరు నగరంలోని బీఎంపీస్‌ పార్శిల్‌ సర్వీసుపై తాజాగా విజిలెన్స్‌ అధికారులు జరిపిన డాడుల్లో

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:04 am

దేశంలో ఇక ప్రైవేట్ అణుశక్తి

మన తెలంగాణ/హైదరాబాద్: అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రో త్సహించినట్ల్లే, అణుశక్తి రంగంలో కూడా ప్రైవేట్ రంగానికి దారులు తెరవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంతరి క్ష రంగంలో పరిశోధన బలోపేతం చేస్తున్నామని, అందు కోసం నేషనల్ రీసె ర్చ్ ఫౌండేషన్ (ఎన్‌ఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్కైరూట్ కంపెనీ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ -క్లాస్ రాకెట్ ‘విక్రమ్- 1’ను కూడా ఆవిష్కరించారు. ఈ రాకెట్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వీడియో ప్రసంగిస్తూ అంతరిక్ష రంగంలో సంస్కరణలు, వృద్ధి గురించి పలు అంశాలను వివరించారు. యు వత కోసం రూ.లక్ష కోట్లు విలువైన ఆర్‌అండ్‌డి, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పది వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇప్పటికే ఏర్పాటు కాగా, త్వరలో 50,000 కొత్త ల్యాబ్స్ రానున్నాయని వివరించారు. భారతదేశంలో అద్భుతమైన అంతరిక్ష రంగ వృద్ధి జరుగుతోందని ప్రధాని పేర్కొన్నా రు. స్కైరూట్ క్యాంపస్ గురించి వివరిస్తూ భారత యువశక్తి, ఆవిష్కరణ, స్టా ర్టప్ స్పూర్తికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, భరత్ ధాకా యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శమని అభినందించారు. రాకెట్ భాగాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన రోజుల నుండి, అత్యంత నమ్మకమైన ప్రయోగ వాహకాలను  తయారు చేసే దేశంగా భారత్ ఎదిగిందని అన్నారు. దశాబ్దాలుగా ఇస్రో భారత అంతరిక్ష సామర్థ్యానికి వినూత్నమైన గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పారు. 2022 నవంబర్‌లోనే స్కైరూట్ సబోర్టియల్ రాకెట్, విక్రమ్ ఎస్‌లను ప్రయోగించి దేశంలోనే వీటిని ప్రయోగించిన తొలి కంపెనీగా చరిత్రకెక్కిందని తెలిపారు. ప్రైవేటు అంతరిక్ష ప్రయోగాలకు అవకాశం కల్పించి వాటి ప్రయోగాలను విజయవంతం చేసేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కొత్త ఆవిష్కరణల సృష్టికర్తలు జెన్ జడ్ జెన్ జడ్ ఇంజినీర్లు, జెన్ జడ్ డిజైనర్లు, జెన్ జడ్ కోడర్సు, జెన్ జడ్ సైంటిస్టులు సాంకేతికంగా ఎన్నో కొత్త ఆవిష్కరణలు సృష్టించారని ప్రధాని కొనియాడారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఫలితంగా స్కైరూట్ వంటి పలు ఇతర సంస్థలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయని ప్రశంసించారు. అంతే కాకుండా భారత దేశంలో ఉన్న ప్రైవేటు అంతరిక్ష రంగ నైపుణ్యం ఉన్న వారి వల్ల ప్రపంచంలోనే కొత్త గుర్తింపు తీసుకు వస్తున్నారని కొనియాడారు. దీంతో ప్రస్తుతం దేశంలో 300కి పైగా స్పేస్ స్టార్టప్లు ఉన్నాయని, వీటిలో చాలా వరకు జెన్ జడ్ యువతే ఏర్పాటు చేసినవని తెలిపారు. గత 6-7 ఏళ్లలో భారత అంతరిక్ష రంగం ఓపెన్, సహకార పూర్వక, ఆవిష్కరణతో నడిచే వ్యవస్థగా మారిందని చెప్పారు. ఇన్-స్పేస్ ఏర్పాటు ద్వారా ప్రైవేట్ స్టార్టప్లకు ఇస్రో సౌకర్యాలు, సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. భవిష్యత్తులో భారతదేశం గురించి ఆయన వివరిస్తూ యువత, వారి ఆవిష్కరణలదేనని ప్రధాని మోదీ అన్నారు. రానున్న రోజుల్లో తన ప్రయోగ సామర్థ్యాన్ని భారీగా భారత్ భారీగా పెంచుతుందని తెలిపారు. అంతే కాకుండా 5 స్పేస్-టెక్ యూనికార్న్‌లను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ ఉపగ్రహ ప్రయోగాల్లో ప్రపంచ దిగ్గజంగా ఎదగొచ్చు ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ తక్కువ వ్యయంతో, ఉపగ్రహ ప్రయోగాల్లో ప్రపంచ దిగ్గజ దేశంగా ఎదగవచ్చని ప్రధాని మోడీ చెప్పారు. అనేక గ్లోబల్ కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో ఉపగ్రహాలను తయారు చేసి, భారత ప్రయోగ సేవలకు ఉపయోగించాలనే ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్, 1.5 లక్షలకుపైగా నమోదు చేసిన స్టార్టప్లతో ముందంజలో ఉందని తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలు ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల నుంచి మాత్రమే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామాల వరకు విస్తరించాయని మోడీ వివరించారు. ఇంతే కాకుండా భారత్ డీప్-టెక్నాలజీ, హార్డ్‌వేర్, తయారీ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. అనేక గ్లోబల్ కంపెనీలు భారత దేశంలో శాటిలైట్లను తయారు చేయాలని వాటిని ఇక్కడి నుంచి ప్రయోగించాలని ఆకాంక్షిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అంతే కాకుండా భారత దేశంతో సాంకేతిక భాగస్వామ్యం, ప్రయోగానికి అవసరమైన సహకారాన్ని కూడా అభ్యర్థిస్తున్నాయని, ఇదో మంచి అవకాశంగా తీసుకుని భారత యువత అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. .....................

మన తెలంగాణ 28 Nov 2025 6:00 am

బూడిదైన చెరకు తోట

బాణాసంచా నిప్పులు కారణం గా కాలి బూడిదైన చెరకు తోట* విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో వివాహం సందర్భన్గా వేసిన బాణా సంచా వల్ల నిప్పులు పడి చెరుకు తోట దగ్ధమై అగ్నికి ఆహుతి అయ్యింది. బల్లిపాడు కల్యాణ మండపం లో వివాహం సందర్భన్గా వేసిన తారాజువ్వలు పక్కనే ఉన్న చేరుకు తోటలో పడటం తో పూర్తిగా ఎండిపోయి కోయటానికి సిద్ధంగా ఉన్న చెరకు తోట కాలి బూడిద అయ్యింది. తాళ్లపూడి […] The post బూడిదైన చెరకు తోట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 5:53 am

అందరి కృషి అవసరం

బాల్య వివాహాలు అరికట్టేందుకు అందరి కృషి అవసరం విశాలాంధ్ర – తాళ్లపూడి :సమాజం లో బాల్య వివాహాలు జరుగుతున్నప్పటికి అధికారులు గా అడ్డుకోలేక పోయిన పరిస్థితులు వున్నాయని, దీన్ని పూర్తిగా అరికట్టాలంటే కేవలం తల్లి వల్లే సాధ్యం అవుతుందని పలువురు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఐ.సి.డి.ఎస్ అద్వర్యం లో *బాల్య వివాహ ముక్త భారత్* అనే కార్యక్రమాన్ని తాళ్లపూడి మండల పరిషత్ కార్యలయం లో తాళ్లపూడి సెక్టార్ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా తహశీల్ధార్ లక్ష్మీ లావణ్య, […] The post అందరి కృషి అవసరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 5:51 am

రైస్ మిల్లును తనిఖీ చేసిన తహశీల్ధార్

రైతుకు ఇబ్బంది కలిగించవద్దని సూచన విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మేలు కలిగేలా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లు, సంబంధిత పరిస్థితులు, మిల్లులో దిగుమతులు, ముఖ్యన్గా సంచులు కేటాయింపు వంటి విషయాలు ఎలా జరుగుతున్నాయన్న అంశాల పట్ల పరిశీలన నిమిత్తం తాళ్లపూడి మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య రైస్ మిల్లులు ను ఆకస్మిక తనిఖీ చేశారు. పైడిమెట్టలో గల శ్రీ సాయి రైస్ మిల్ ను ఆమె వి.ఆర్.వోలు ఇతర సిబ్బంది తో కలిసి […] The post రైస్ మిల్లును తనిఖీ చేసిన తహశీల్ధార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 5:39 am

రాష్ట్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహం

మనతెలంగాణ/హైదరాబాద్:ప్రపంచంతోనే పోటీపడేలా స్కిల్ యూత్ కొత్త రంగాల్లో, కొత్త మార్గాల అన్వేషణ చేపట్టే లా, తెలంగాణ అభివృద్ధి ప్రతిబింబించేలా తెలంగాణ రైజిం గ్- 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ ఈ డాక్యుమెంట్‌లో కనిపించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ల్ తెలంగాణ రైజిం గ్- 2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ పాలసీ డాక్యుమెంట్ గురించి అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకాన మి (క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూ రల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్)గా మూడు రీజియన్లను విభజించుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ మూడు రీజియన్‌లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసిసిలు, ఫార్మా, అగ్రికల్చర్‌తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏయే రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు, పోర్ట్, కనెక్టివిటీ ముఖ్యమైనవని చెప్పారు. ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్‌లో స్పష్టంగా ఉండాలి సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్ మెంట్ ఇలా ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యు మెంట్‌లో స్పష్టంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. పెట్టుబడుల అవకాశాలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తెలంగాణలో ఉన్నఅపారమైన పెట్టుబడుల అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచటంతో పాటు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెండు రోజుల్లో ప్రదర్శించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని సిఎం రేవంత్ తెలిపారు. అందుకే ఈవెంట్‌ను కూడా భవిష్యత్ ఫోర్త్ సిటీలో ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దార్శనిక భవిష్యత్ పత్రం, రాష్ట్ర భవిష్యత్‌కు సమగ్ర రూపంగా మారనుందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ తయారుచేశారన్నారు. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి , స్థిరమైన అభివృద్ధి - ఈ మూడు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసిందని సిఎం రేవంత్ తెలిపారు. తెలంగాణను భారత దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చైనా, జపాన్‌లతోనే పోటీ పడే లక్షంతో చిన్న రాష్ట్రమైనా ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియజేయాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించిందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్దిలో పక్క రాష్ట్రాలతో కాదు చైనా, జపాన్‌లతోనే పోటీ పడే లక్షంతో ముందుకుపోతున్నామన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేథస్సు (ఏఐ), స్టార్టప్, ఎంఎస్‌ఎంఈలు, టూరిజం, ఎగుమతులు వంటి రంగాలు రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలక రంగాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయన్నారు. ఈ బలాలే పునాదిగా మరింత పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్‌గా ఉండబోతోందని సిఎం తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా ఈ విజన్ డాక్యుమెంట్‌లో భాగమవుతోందన్నారు. రాష్ట్ర అభివృద్దిలో మహిళా సాధికారత కూడా అత్యంత ప్రధానమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. డెవలప్‌మెంట్ ఎకానమీలో కాలుష్యం వల్ల కలిగేనష్టాలపై కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఫోకస్ చేయనుంన్నారు. అందుకే నెట్-జీరో తెలంగాణను అవిష్కరించనుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్‌లో మూసీ పునరుజ్జీవనానికి రూపకల్పన చేశామని అందులో భాగంగా 2,959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రీయల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లు గ్రామాల్లో స్వచ్చమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించామని, మరో లక్ష్యంగా ఆధునిక రవాణ మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్‌రోడ్డును ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లను నిర్మించ నున్నట్టు సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రీయల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనున్నట్టు ఆయన తెలి పారు. వీటితో పాటు వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రాయాలను ఏర్పాటు చేయబోతున్నట్టుగా సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బందర్‌పోర్టు వరకు ఆధునిక హైవేను నిర్మించి సీపోర్టుకు అనుసంధానం చేయబోతున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్ విలేజీలు గ్లోబల్ వర్క్ ఫోర్స్‌తో పోటీపడేలా ప్రతి ఏడాది రెండు లక్షల తెలంగాణ యువతకు, లక్షమంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి టార్గెట్ గా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సిఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్ విలేజీలు నిర్మిస్తామన్నారు. మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోలిస్టిక్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ది, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించినట్టు సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యంగా రూపొందే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంతో పాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ -2047 మార్గదర్శకంగా ఉండబోతోందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 5:30 am

సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం సీరియస్

మనతెలంగాణ/హైదరాబాద్:తనకు తెలియకుండానే ఐఏఎస్‌లను బదిలీ చేయడంపై సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం రేవంత్‌రె డ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇద్దరు ఐ ఏఎస్‌లు తమ బదిలీ గురించి సిఎంకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం వివాదాస్పదం అయినట్టుగా సమాచా రం. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చిన రోజునే అంతర్గతం గా ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బదిలీ అయిన ఐఏఎస్‌లు బుధవారం విధుల్లో చేరడానికి వెళ్లినప్పుడు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ట్రాన్స్‌ఫర్‌లకు సంబంధించి అభ్యంతరం చెప్పడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నుంచి అనుమతి తీసుకొని రావాలని వారి కి సూచించడంతో ప్రస్తుతం ఈ విషయం బయటకు వచ్చినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఒక ఐఏఎస్‌ను అడిషనల్ సీఈఓగా బదిలీ చేసే సమయంలో ఆయన పేరును ప్రతిపాదించే ముందు కనీసం సిఎం రేవంత్‌రెడ్డికి ఆ ఐఏఎస్ నుంచి కూడా అనుమతి తీసుకోకుండా ఈ బదిలీ చేశారని ఈ నేపథ్యంలో ఆ ఐఏఎస్ కూడా సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతో జిఏడిలోని ఓ అధికారి నుంచి సిఎం రేవంత్‌రెడ్డి పూర్తి వివరాలు తెప్పించుకున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఆయన సీనియర్ ఐఏఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు ఎలా తీసుకొస్తారని సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం రేవంత్‌రెడ్డి మొట్టికాయలు వేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ తరువాత కొందరు సీనియర్ ఐఏఎస్‌లపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మన తెలంగాణ 28 Nov 2025 5:00 am

Anantapur |లాఠీలపై వేటు..

పోలీసులకు ఉద్యోగం భారంగా మారిపోయింది. రాజకీయ చక్రంలో పడి నలిగిపోతున్నారు. ఒకప్పుడు పోలీసులపై

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:00 am

బిసి కోటా కోసం ఉమ్మడి కార్యాచరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూ ల్లో సవరణ జరగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకం గా చర్చకు తీసుకురావాలని కోరారు. నిర్దేశిత ఫార్మేట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు తీసుకురావాలని సూచించారు. ప్రధానమంత్రిని కలిసి అన్ని పార్టీల ఎంపీలు ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని, ప్రధానమంత్రి సమయం ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించాలన్నారు. గురువారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఎపిక్ సర్వే జరిగిందని, ఎంపిరికల్ డాటా ఆధారంగా అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టగా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించారని, బిల్లు గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్లి అ క్కడ పెండింగ్ లో ఉందని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్టీల కు అతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను విజ్ఞప్తులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన సమాచారం నిమిషాల్లో లేదా గంటల్లో అందించేందుకు ఢిల్లీలో  ప్రణాళిక ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని, దీనిని ఎంపీలు వినియోగించుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వ శాఖలు ఏ విధంగా పూర్తి సంసిద్ధంగా ఉంటాయో పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండి సమాచారం అందించేందుకు ఏర్పాటు చేశామని భట్టి చెప్పారు. ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ప్రశ్నించడం, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలనుకుంటే విషయాన్ని వివరిస్తే చాలు నిర్దేశిత ఫార్మాట్లో సమాచారాన్ని, విజ్ఞాపన పత్రాలను ఢిల్లీలోని రాష్ట్ర అధికారులు ఎంపీలకు అందిస్తారని తెలిపారు. నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, జీఎస్టీ తదితర విషయాలకు సంబంధించి కేంద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాలకు సంబంధించి గతంలో లేఖలు రాశామని, ఆలేఖలు ఢిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపీ లకు అందుబాటులో ఉంటాయని, వాటి ఆధారంగా ఎంపీలు ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్ 9 నాటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాల వివరించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేయబోతున్నామన్నారు. దేశంలో, ప్రపంచంలో ప్రముఖులను దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని, 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యసాధనకు అవసరమైన వనరులు, ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కమిటీలు వేస్తున్నామని, కేంద్ర మంత్రులను, ఎంపీలందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న ఎంపీలు పేర్లు ఇస్తే కమిటీలు సభ్యులుగా నమోదు చేస్తామని, దేశంలో, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో ఎంపీలు ఎవరికైనా పరిచయం ఉంటే వివరాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వారిని గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తామన్నారు. సమావేశంలో కేంద్రానికి సంబంధించిన 12 శాఖల ద్వారా 47 అంశాలను గుర్తించామని, వీటితోపాటు సెమీ కండక్టర్లకు సంబంధించిన అంశం సమావేశంలో చర్చకు వచ్చిందని తెలిపారు. అలాగే పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సీఎస్ రామకృష్ణ రావు హాజరయ్యారు. ప్రధానిని సమిష్టిగా కలుద్దాం : మెదక్ ఎంపీ రఘునందన్ రావు రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర సమస్యలపై ప్రధాన మంత్రి సమయం తీసుకుని సమిష్టిగా కలుద్దామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. అంతేకాక ఆదిలాబాద్ పటాన్ చెరు రైల్వే లైన్‌పై సాధ్యాసాధ్యాలు, డీపీఆర్ ఏమైనా చేశారా అని అడిగారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఎఎస్, ఐపిఎస్ కేడర్ అలాట్‌మెంట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తే సంబంధిత మంత్రిని పార్టీలకు అతీతంగా కలిసి లేఖ ఇద్దామని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరం కలసికట్టుగా ముందుకు వెళదామని చెప్పారు. అంతేకాక రాష్ట్రానికి అవసరమైన బొగ్గు గనుల విషయంలో అందరం కలిసి కోల్ మినిస్టర్‌ను కలుద్దామని ప్రతిపాదించారు. కేంద్రానికి లేఖ రాయాలి : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మహబూబ్ నగర్ ఎయిర్‌పోర్టుపై పూర్తి సమాచారానికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గద్వాల డోర్నకల్ రైల్వేపైనా సమాచారాన్ని ఆయన కోరారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిపాదించిన విషయం అత్యంత ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర రహదారులు, పెండిగ్ అంశాలపై అఖిలపక్ష సభ్యులంతా కలిసి నేరుగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేఖ ఇద్దామని మల్లు రవి చెప్పారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో ప్రజలు నష్టం : మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్ వల్ల తమ నియోజక వర్గ ప్రజలు తీవ్రంగా నష్ట పోతారని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ప్రాజెక్టులో నీరు నింపితే వచ్చే బ్యాక్ వాటర్ ముంపు వల్ల లక్ష మందికి పైగా ముంపు బారిన పడే అవకాశం ఉందని, ఈ సమస్య పైనా పరిష్కారం కావాలన్నారు. ములుగు, ఏటూరు నాగారం రహదారిని కేంద్రం మంజూరు చేసినా ఇప్పటికీ టెండరు ఖరారు కాలేదని చెప్పారు. అటవీ, పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్లనే ఆలస్యమవుతోందని చెప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయడం కానీ, పార్లమెంట్‌లో ప్రస్తావన చేయడం కానీ చేయాలన్నారు. పేదలకు ఉపాధి కరువు : జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ రాష్ట్రంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమంలో పనిదినాలు బాగా తగ్గుతున్నాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ చెప్పారు. పని దినాలు తగ్గడం వల్ల పేదలకు ఉపాధి లేకుండా పోవడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచి పోతాయన్నారు. అంతేకాక లోక్‌సభ పరిధిలోని జహీరాబాద్ బీదర్ రహదారి అత్యంత కీలకమైందని, దీనిపై కేంద్రానికి లేఖ రాయడంతోపాటు పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావన తీసుకురావాలని కోరారు. విమానాశ్రయానికి 800 ఎకరాలు అవసరం : ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణం కోసం 800 ఎకరాలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిందని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ చెప్పారు. ఇప్పటికే అక్కడ 369 ఎకరాలు ఉన్నాయని, ప్రభుత్వం పేర్కొన్న 700 ఎకరాల్లో ఈ 369 ఎకరాలు అంతర్భాగమేనా లేక 700 ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారా అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధిత అధికారులు ఇతర అవసరాలకు మొత్తంగా వెయ్యి ఎకరాలు అవసరమవుతామని లేఖ రాశాన్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 700 ఎకరాల భూ సేకరణ చేయాలని చెప్పారు. అలాగే వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ కోసం ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని ఎంపీ కడియం కావ్య అడిగారు. ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు సమావేశాల్లో లేవనెత్తాలని కోరారు.

మన తెలంగాణ 28 Nov 2025 4:30 am

రేవంత్.. రియల్ ఏజెంట్

మనతెలంగాణ/హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవం త్ రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మొదట మూ సీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి.. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అ వకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చవకగా భూములు తీసుకున్నార ని, ఇప్పుడు ఆ భూముల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్ రెడ్డి అతి తక్కువ ధరకే అ నుమతులు ఇస్తూ రియల్ దందా చేస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాజీ ఎంఎల్‌ఎ జైపాల్ యాదవ్ ఆధ్వర్యం లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు క ప్పిపార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. దాదా పు 9,300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, 600 మంది కోసం 5 లక్షల కో ట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆ రోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రే వంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవే ట్ వ్యక్తులకు భూములను అప్పజెప్పే ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మోసం చేసిందని కెటిఆర్ దుయ్యబట్టారు. గత ప్రభుత్వం 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బిసి సోదరులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పాలమూరుకు రేవంత్ చేసింది శూన్యం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కెసిఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కెటిఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లను పూర్తి చేసి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్‌దేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డను అని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్‌టిఆర్ రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని పేర్కొంటూ కెటిఆర్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని, ప్రజలు కెసిఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్‌పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కెసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైపల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ఐక్యంగా ముందుకు సాగాలని కెటిఆర్ బిఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 28 Nov 2025 4:00 am

ప్రభుత్వ విధానాలపై విషప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్:ఇండస్ట్రీయల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొ ల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ ల క్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తె చ్చింది పారదర్శకమైన పాలసీ అని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీ డియాతో మాట్లాడుతూ బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల కు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కా లేదన్నారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బు రద జల్లుతున్నారని ఆయన ధ్వ జమెత్తారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ఓఆర్‌ఆర్ బయటకు పంపాలన్న డిమాండ్ ఉంద ని ఆయన గుర్తుచేశారు. ఈ పాలసీ తమ ప్రభు త్వం కొత్తగా తెచ్చింది కాదని, కెసిఆర్ ప్రభుత్వం లో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేది లేదని పాలసీ మార్చేది లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీయల్ పాలసీ రూపకల్పనలో తాను కూడా భాగమై ఉన్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. కొత్త ఇండస్ట్రీయల్ పాలసీతో రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాల నేతలకు వ్యతిరేకించాలన్న ఉద్దేశ్యం తప్పా ఏం లేదని ఆయన విమర్శించారు. అయి తే, నల్లగొండ డిసిసి నియామకంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. పార్టీ ఇంటర్నల్ విషయాలను బయట మాట్లాడనని పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో పెద్ద కుంభకోణం తమ ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో ఎలాంటి కుంభకోణం జరగలేదన్నారు. పవర్ గ్రిడ్‌లో ల్యాండ్ స్కాం జరుగుతోందని బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. ఓ పెద్దమనిషి తాము వస్తే పాలసీ మారుస్తామని అంటున్నారని, వారు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు పాలసీ మార్చబోయేది లేదని బిఆర్‌ఎస్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో రూ.50 వేల కోట్లు కాదు, 50 వేల రూపాయల కుంభకోణం కూడా జరగలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 2014 విభజన చట్ట ప్రకారం ఎన్టీపిసి ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో 4 వేల మెగా వాట్ల పవర్ పాంట్ ఏర్పాటు చేస్తామని అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్దమనుషులే జవాబు చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలోనే భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఇండియా బుల్ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని ఎక్వీప్‌మెంట్ ఎందుకు కొన్నదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి ప్రాజెక్టులో ఔట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అని ఉత్తమ్ విమర్శించారు. 

మన తెలంగాణ 28 Nov 2025 3:30 am

డ్రగ్స్ ముఠాలపై గరుడాస్త్రం

మన తెలంగాణ/హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణ లక్షంగా పని చేస్తున్న టీం భారీ సక్సెస్ సాధించిం ది. నైజీరియన్ డ్రగ్స్ ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాం చ్ ఆఫీసర్స్‌తో సహకారంతో రట్టు చేసింది. ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా పనిచేస్తు న్న ఈగల్ టీమ్ ఢిల్లీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా వ్యాపిం చిన నైజీరియన్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఈగల్ టీం డీకోడ్ చేసింది. ఈ జా యింట్ ఆపరేషన్‌లో భాగంగా 124 మంది ఈగల్ ఫోర్స్ (1ఎస్‌పి, 8డిఎస్పీ లు, 17ఇన్‌స్పెక్టర్స్, 16ఎస్‌ఐలు, 82 హోంగా ర్డులు/ పోలీసు కానిస్టేబుల్స్), 100 మంది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్‌తో మొత్తంగా 16 టీమ్స్ తో అంతర్రాష్ట్ర దాడులు చేపట్టింది. మెహ్రౌలీ, సంత్ గర్, ప్రతాప్ ఎన్‌క్లేవ్, పృథ్వీ పార్క్, నీలోతి, చంద్ర నగర్, మునిర్కా తదితర 20 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ క్రమంలో మొత్తం 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా డ్రగ్స్, నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ డ్రగ్ లింక్స్‌పై ఈగల్ టీమ్ దృష్టి సారించింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో మొత్తం 50 మంది ఓవర్ స్టే నైజీరియన్స్ పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖలో ఈ ఆపరేషన్ చేపట్టామని పోలీసులు వెల్లడించారు. డ్రగ్ కింగ్‌పిన్, డ్రగ్ సేల్ గరల్స్, సెక్స్ వర్కర్స్ పేర్లతో ఉన్న మ్యూల్ అకౌంట్ హోల్డర్లను  అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నోయిడా,గ్వాలియర్, విశాఖలో స్థానిక పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టామని ఈగల్ టీం అధికా రులు పేర్కొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 3:00 am

శుక్రవారం రాశి ఫలాలు (28-11-2025)

మేషం చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. వృషభం ముఖ్యమైన వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారమున అవరోధాలు తప్పవు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిధునం వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటకం బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాలలో ఎంత శ్రమపడిన ఫలితం అంతగా కనిపించదు. సింహం ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. కన్య వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన విద్య విషయాలలో మరింత కష్ట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో పునరాలోచన చేయుటం మంచిది. తుల స్థిరస్తి క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృశ్చికం దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించటం మంచిది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ధనస్సు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వాహన ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మకరం బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కుంభం ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగమున ఇతరులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలసివస్తాయి.

మన తెలంగాణ 28 Nov 2025 12:10 am

When will NTR and Nelson Film Kickstart?

Young Producer S Naga Vamsi has been working on a crazy project featuring NTR in the lead role. He locked Jailer fame Nelson Dilipkumar to helm the film and Nelson also received a big advance from the young producer. The project is planned to commence next year after NTR completes Prashanth Neel’s film. Meanwhile, Nelson […] The post When will NTR and Nelson Film Kickstart? appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 12:03 am

రిజర్వేషన్ల అమల్లో కాంగ్రెస్ తడిగుడ్డతో బీసీల గొంతు కోసింది: బిజెపి లక్ష్మణ్

 బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి చెప్పిన కాంగ్రెస్ పార్టీ చివరికి చేతులెత్తేసి భస్మాసుర హస్తంగా మారిందని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో జీవో నెం.46 తీసుకొచ్చి బీసీలను దగా చేస్తోందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం కాదు, కనీసం 20 శాతం కూడా ఇవ్వకుండా కేవలం 17 శాతం మాత్రమే కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన, సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్స్లు, జీవోలు అంటూ వెనుకబడిన వర్గాలను మైమరిపించి, ఆశలు రేకెత్తించి చివరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. కులగణన సర్వే పేరిట రూ.200 కోట్లు ఖర్చు చేశారు, ఏమైంది? కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు..? ఇప్పుడేమంటారు..? తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ మాటలు నమ్మి 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తారని రేవంత్ రెడ్డికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి రేవంత్ గౌడ్ అన్నరు, రేవంత్ యాదవ్ అన్నరు, రేవంత్ ముదిరాజ్ అన్నరు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏమైంది? బీసీలను కాంగ్రెస్ దోఖా చేసిందని మండిపడ్డారు. బీసీల సంక్షేమం, న్యాయం కాంగ్రెస్ ఆలోచనలో లేదని, నెహ్రూ కుటుంబమే ప్రధానంగా వారి ఆలోచన అని విమర్శించారు. బిహార్ ఎన్నికల్లో ఓట్ల కోసం తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసిందని ఆరోపించారు. కానీ అక్కడి ప్రజలు వాటిని నమ్మకుండా కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆంక్షలు, అమల్లో ఉన్న చట్టాలు అన్నీ పరిగణనలోకి తీసుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ అలవికాని హామీలను గుప్పించిందని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే కేవలం రూ.2,300 కోట్ల నిధుల కోసం మాత్రమే స్థానిక ఎన్నికలకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. కోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ నడుస్తున్నప్పటికీ ఎన్నికలు హడావుడిగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎన్టీ రామారావు హయాంలో 1988లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే ఇప్పుడు వాటిని కేవలం 17 శాతానికి తగ్గించారని ఆరోపించారు. పార్టీ పరంగా కాంగ్రెస్ అభ్యర్థులకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం అంటే ఎవరిని మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు.

మన తెలంగాణ 27 Nov 2025 11:40 pm

‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ లోగోను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ లోగోను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగే 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ లోగోని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రవీంద్రభారతిలో విడుదల చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను రూపుమాపి ప్రజల్లో పరివర్తన తీసుకువచ్చే దిశగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభాతభేరి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలోనే యువకులు, విద్యార్థుల్లో చైతన్యం కలిగించడానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ప్రభాతభేరి పేరిట విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యక స్టాల్, హోర్డింగ్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. అదే విధంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక శాఖ కార్యక్రమాల ప్రచార స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. దీనికి కోసం ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కవి యాకూబ్ కార్యదర్శి వాసు, ఉపాధ్యక్షులు మలుపు బాల్ రెడ్డి, కోశాధికారి పన్యాల నారాయణరెడ్డి, కార్యవర్గ సభ్యులు భూమి శ్రీనివాస్, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు ముచ్చర్ల దినకర్, తదితరులు పాల్గొన్నారు

మన తెలంగాణ 27 Nov 2025 11:30 pm

ముందుకొచ్చిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ..

ఆంధ్రప్రభ, విజయవాడ : యువతకు ఎయిడ్స్ వ్యాధి రావడానికి గల కారణాలు, డ్రగ్స్

ప్రభ న్యూస్ 27 Nov 2025 11:27 pm

విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి అవసరం…

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని శ్రీ స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్

ప్రభ న్యూస్ 27 Nov 2025 11:23 pm

మహబూబ్‌ పట్నం ఎన్నికలపై హైకోర్టు స్టే

మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టిలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆరుగురు ఎస్టి ఓటర్లు ఒకటే వార్డులో ఉంటే, మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. పంచాయతీలో రిజర్వేషన్లు సరిగా చేయలేదని, దీంతో రిజర్వేషన్లు మార్చాలని గ్రామానికి చెందిన మిట్టగుడుపుల యాకూబ్, శ్రీకాంతాచారి, లింగయ్య, నాగయ్య, విజయ్, వెంకటమల్లు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం మహమూద్‌పట్నంలో గ్రామపంచాయతీలో మూడు ఎస్టి కుటుంబాలకు చెందిన ఏడుగురు ఓటర్లుండగా, సర్పంచ్‌తో పాటు మూడు వార్డులు ఎస్టికి కేటాయించారని పిటిషనర్ తెలిపారు. మహమూద్‌పట్నం గ్రామ పంచాయతీ నుంచి తండాలను వేరు చేసి కొత్త జీపిలు ఏర్పాటు చేసిన అనంతరం గ్రామంలో 576 ఓట్లు ఉన్నట్లు పిటిషనర్ పేర్కొన్నారు. గ్రామంలో 199 మంది ఎస్సిలు, 358 మంది బిసిలు, 13 మంది ఓసిలు, ఏడుగురు ఎస్టిలు ఓటు హక్కును కలిగి ఉన్నారని, అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డులు ఎస్టికి దక్కాయని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు వివరించారు. జనాభా, ఓటర్ల లెక్క సరిగా లేకపోవడంతో రిజర్వేషన్లు తప్పుగా ఇచ్చిరని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలపై స్టే విధించి, ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది.

మన తెలంగాణ 27 Nov 2025 11:20 pm

నిరుపేదలకు అపార్ట్మెంట్లు సిద్ధం…

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : ఇల్లు లేని నిరుపేదలకు జి ప్లస్ త్రి

ప్రభ న్యూస్ 27 Nov 2025 10:50 pm

అన్ని వర్గాలకూ.. అగ్రతాంబూలం !!

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పట్టణ టీడీపీ అధ్యక్ష పదవి ఎంపిక కొలిక్కి

ప్రభ న్యూస్ 27 Nov 2025 10:44 pm

అర్హులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు..

ఆంధ్రప్రభ, పటమట : రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు

ప్రభ న్యూస్ 27 Nov 2025 10:39 pm

Aswapuram |పాఠశాలలపై పర్యవేక్షణ లోపం…..

Aswapuram | పాఠశాలలపై పర్యవేక్షణ లోపం….. అశ్వాపురం, ఆంధ్రప్రభ : గిరిజన గ్రామాల్లో

ప్రభ న్యూస్ 27 Nov 2025 10:32 pm

Photos: Vaanara Movie Teaser Launch

The post Photos: Vaanara Movie Teaser Launch appeared first on Telugu360 .

తెలుగు 360 27 Nov 2025 10:21 pm

నేటి వరకు 8.22 ల‌క్ష‌ల‌ మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : రైతులు దళారులను నమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన

ప్రభ న్యూస్ 27 Nov 2025 10:15 pm

Tirupati |రహదారులకు రాజయోగం

Tirupati | రహదారులకు రాజయోగం తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): జిల్లాలో రహదారుల అభివృద్ధికి

ప్రభ న్యూస్ 27 Nov 2025 10:06 pm

మెప్మా అక్రమాలపై నిగ్గు తేల్చాలి…

ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో: ఒంగోలు మెప్మాలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చాలని

ప్రభ న్యూస్ 27 Nov 2025 10:00 pm

Ongole |కథ అడ్డం తిప్పిన రాపిడ్ రైడ్..

ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ‌ : రైళ్లలో దోపిడీలు చేయడంలో చేయి తిరిగిన దొంగ…

ప్రభ న్యూస్ 27 Nov 2025 9:47 pm

Cyber ​​gang |సైబర్ గ్యాంగ్ ముఠా 13 మంది అరెస్ట్..

Cyber ​​gang | సైబర్ గ్యాంగ్ ముఠా 13 మంది అరెస్ట్.. భీమవరం

ప్రభ న్యూస్ 27 Nov 2025 9:36 pm

KVN Productions lining up Big Tollywood Films

K Venkata Narayana, a realtor based in AP has settled in Bengaluru and his construction firm Prestige Group is one among the leading construction companies of South. He floated KVN Productions and is currently producing Vijay’s Jana Nayagan and Yash’s Toxic. KVN has paid big advances for some of the happening stars and directors and […] The post KVN Productions lining up Big Tollywood Films appeared first on Telugu360 .

తెలుగు 360 27 Nov 2025 9:08 pm

జైలులో ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు.. స్పందించిన అధికారులు

లాహోర్ : మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక స్పందన వెలువడింది. ఆయన ఖైదీగా ఉంటున్న అడియాలా జైలు అధికారుల నుంచి గురువారం ఓ ప్రకటన వెలువరించారు. జైలులో ఆయన ఆరోగ్యం బాగా ఉందని, ఆయన పరిస్థితిపై వెలువడ్డ వార్తలు వదంతులే అని తెలిపారు. పాకిస్థాన్ తెహరీక్‌ఏ ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చిత్రహింసల పాలయ్యి , మృతి చెందాడనే వార్తలు పాకిస్థాన్‌లో భగ్గుమన్నాయి. ఆయన జైలులోనే బాగా ఉన్నారని, ఫిట్‌గా ఉన్నారని తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఫోటోలు ఏమీ పొందుపర్చలేదు. పార్టీ వర్గాలకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేశామని, వదంతులు నమ్మవద్దని తెలియచేస్తున్నామని పేర్కొన్నారు. రావల్పిండిలోని జైలు వద్ద పిటిఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున రెండు రోజులుగా తమ నేత ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జైలు అధికారులు స్పందించారు. ఆయన జైలులోనే ఆరోగ్యంగా ఉన్నారు. వేరే చోటికి తరలించారనే వాదన సరికాదని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 27 Nov 2025 9:02 pm

చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ కెటిఆర్: కడియం శ్రీహరి

అహంకారం, బలుపుతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని, దాన్ని ప్రజలు హర్షించరని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మాజీ మంత్రి కెటిఆర్‌ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెటిఆర్‌ సభ్యత, సంస్కారం మర్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కెటిఆర్‌ లాగా అయ్య పేరు చెప్పుకొని.. కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదన్నారు. నేను సొంతంగా ఎదిగిన నాయకుడిని అన్నారు. కెసిఆర్ లేకపోతే కెటిఆర్‌ ఎక్కడ ఉండేవాడో ఆయన ఊహకే వదిలేస్తున్నాను. కెటిఆర్ నాయకత్వంపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయన్నారు.కెటిఆర్‌ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత వెళ్లిందన్నారు. కెటిఆర్ కు సిగ్గుంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్యాసి కెటిఆర్ అన్నారు. తన దగ్గర ఆధారాలున్నాయి కాబట్టే కవిత ఆ విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు. ముందు నీ చెల్లికి సమాదానం చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.

మన తెలంగాణ 27 Nov 2025 8:40 pm

ఉర్రూతలూగిస్తున్న ‘భీమవరం బల్మా...’

వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ’అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది. ‘భీమవరం బల్మా’ పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య ప్రదర్శన కట్టిపడేసింది. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనగనగా ఒక రాజు చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీస్థాయిలో విడుదల కానుంది.

మన తెలంగాణ 27 Nov 2025 8:32 pm

ట్రాఫిక్ నియంత్రణలో రౌడీ షీటర్లు

రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను సామాజిక సేవలో భాగస్వాముల్ని చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

తెలుగు పోస్ట్ 27 Nov 2025 8:30 pm

కాలేయానికి లైఫ్ ఇచ్చే తులసి-28ఎక్స్‌

అనారోగ్యంతో కాలేయం దెబ్బతిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మందిని ఆసుపత్రుల్లో చూస్తున్నాం.

తెలుగు పోస్ట్ 27 Nov 2025 8:30 pm

డాక్టర్ షాహిన్ గర్ల్ ఫ్రెండ్ కాదు..నాభార్య : ఉగ్రవాది ముజమ్మిల్

ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో నిందితురాలు డాక్టర్ షాహిన్ గర్ల్‌ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహ నిందితుడు ముజమ్మిల్ షకీల్ విచారణలో వెల్లడించాడు. 2023 సెప్టెంబర్‌లో అల్ ఫలా యూనివర్శిటీ సమీపం లోని మసీదులో తమ నిఖా జరిగిందని దర్యాప్తు సంస్థలకు తెలిపాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తులో ముజమ్మిల్‌కు 2023లో ఆయుధాలు కొనేందుకు షాహిన్ రూ. 6.5 లక్షలు ఇచ్చినట్టు బయటపడింది. అలాగే 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనేందుకు రూ. 3 లక్షలు ఇచ్చింది. మొత్తం ఆమె జైష్ మాడ్యూల్‌కు ఆయుధాలు, పేలుడు పదార్ధాల కొనుగోలుకు రూ.27 లక్షల నుంచి రూ. 28 లక్షల వరకు ఇచ్చినట్టు బయటపడింది. అయితే ఈ డబ్బంతా జకత్ (మతపరమైన విరాళం) కిందే ఇచ్చినట్టు దర్యాప్తు అధికారులకు షాహిన్ వెల్లడించింది.

మన తెలంగాణ 27 Nov 2025 8:28 pm

సాంగ్‌ లాంచ్.. భీమవరంలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి డ్యాన్స్..

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్‌ పొలిశెట్టి, హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తొలి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. గురువారం భీమవరంలోని ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో 'భీమవరం బల్మా' అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. విద్యార్థుల కేరింతల మధ్య ఈ సాంగ్ కు నవీన్, మీనాక్షీ డ్యాన్స్ చేసి హుషారెత్తించారు. ఇక, విడుదలైన లిరికల్ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేథ్యంలో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా అనగనగా ఒక రాజు మూవీ రూపొందుతోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సూపర్ హిట్ మూవీ తర్వాత నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది.

మన తెలంగాణ 27 Nov 2025 8:28 pm

ప్రపంచ టాప్‌ 100 నగరాల్లో హైదరాబాద్‌

ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్‌-100 నగరాల్లో హైదరాబాద్‌ స్థానం సంపాదించింది.

తెలుగు పోస్ట్ 27 Nov 2025 8:20 pm

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్ ఓఎస్‌డి విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్‌డి రాజశేఖర్ రెడ్డిని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు ఆయన్ను విచారించిన అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధకిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధా కిషన్ రావు స్టేట్‌మెంట్‌లో మాజీ సిఎం కెసిఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, కెసిఆర్ కుటుంబ సభ్యులు, బిఆర్‌ఎస్‌లో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పని చేశామని గతంలో రాధా కిషన్ రావు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఓఎస్‌డి రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సైతం అధికారులు రికార్డు చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు నిందితులతో పాటు, భారీ సంఖ్యలో బాధితులను విచారించారు.

మన తెలంగాణ 27 Nov 2025 8:16 pm

హైదరాబాద్ లో నకిలీ ఐపీఎస్

నకిలీ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

తెలుగు పోస్ట్ 27 Nov 2025 8:09 pm

Video: Ram Achanta & Gopi Achanta Interview

The post Video: Ram Achanta & Gopi Achanta Interview appeared first on Telugu360 .

తెలుగు 360 27 Nov 2025 8:07 pm

సిగాచీ పేలుళ్ల ఘటనలో దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహాం

సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగాచీ పేలుళ్లపై బాబురావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన కాదని, 54 మంది కార్మికులు చనిపోయారన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటని, ఇంత పెద్ద ప్రమాదంలో బాధ్యత ఎవరిదో ఇప్పటికీ నిర్ధారణ కాలేదా? అంటూ ఏఏజీ రజినీకాంత్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తులో 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులెవరని తేల్చలేదా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే డిఎస్పిని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని ఏఏజిని సిజె నిలదీశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అని సిజె ప్రశ్నించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవారి వసుధా వాదనలు వినిపించారు. పేలుడు సంభవించి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిపుణల కమిటీ పరిశ్రమల నిర్వహణలో లోపాలున్నాయని తేల్చిందని, నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారని కమిటీ గుర్తించినట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు. పేలుడు తీవ్రతకు ఎనిమిది మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని న్యాయవాది వసుధా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏఏజీ రజినీకాంత్ కోర్టుకు తెలిపారు. దీనికిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో పోలీసు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏఏజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

మన తెలంగాణ 27 Nov 2025 8:05 pm

Rs. 1 lakh |నిందితుతులకు జైలు శిక్ష

Rs. 1 lakh | నిందితుతులకు జైలు శిక్ష Rs. 1 lakh

ప్రభ న్యూస్ 27 Nov 2025 8:01 pm

వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

 రైతులు చస్తే గాని భూ సమస్యలు పరిష్కరించరా... అయితే నా చావుతో నైనా మా భూ సమస్య పరిష్కారం కావాలని సూసైడ్ నోటు రాసుకొని ఒక యువకుడు వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజా అహమ్మద్ పల్లి గ్రామానికి చెందిన వడ్డె శ్రీనివాస్ కుటుంబానికి గ్రామ శివారులో 331 సర్వే నంబరులో 9 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. అయితే అందులో 6 ఎకరాల భూమిని వారి పెద్దలు ఇతరులకు విక్రయించారు. కాగా మిగిలిన మూడు ఎకరాల 26 గుంటల భూమి మిగిలి ఉంది. ఆ భూమి మొత్తం తమ ప్రస్తుతం 7 మంది కుటంబ సభ్యులకు పట్టా రికార్డు ఉంది. భూమి రికార్డులకు మాత్రమే ఉంది. కాని ఖాస్తులో మాత్రం వారు లేరు. ఈ విషయాన్ని వారు గమనించి తమ పొలాన్ని సర్వే చేయించారు. మండల సర్వేయర్, ఆర్డీఓ సర్వేయర్, జిల్లా సర్వేయర్‌తో సర్వే చేయించారు. తమకు న్యాయంగా రావాల్సిన పొలం రిజర్వు ఫారెస్టులో జమ ఉన్నట్లు సర్వేయర్లు రిపోర్టు ఇచ్చారని బాదితులు తెలిపారు. కాని అటవీశాఖ అధికారులు మాత్రం తాము ఎప్పుడు కలిసినా తమ భూమి తమకు అప్పజెప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము అన్ని రకాల సర్వేలు నిర్వహింప జేశామని, సమస్య పరిష్కరించాలని తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు ఎన్నో సార్లు విన్నవించినా అధికారులు మాత్రం స్పందించడం లేదన్నారు. చాలా సార్లు కలెక్టర్ కొడంగల్ అటవీశాఖ రేంజర్ అధికారిణి సవితకు సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినా అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 3 సంవత్సరాలుగా తాము ఈ భూ సమస్యపై సంబంధిత అధికారులతో ఎన్ని సార్లు విన్నవించినా లాభం లేదని, ఇక తమ సమస్య పరిష్కారానికి చావే శరణ్యమని వారు వాపోయారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా కలెక్టర్ కార్యాలయం దగ్గర శ్రీనివాస్ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సందర్భంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడి పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమస్యకు పరిష్కారం కొరకు ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆత్మహత్య చావుకు పరిష్కారం కాదని కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు.

మన తెలంగాణ 27 Nov 2025 8:00 pm

Election Commission |ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి..

Election Commission | ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి.. Election Commission |

ప్రభ న్యూస్ 27 Nov 2025 7:55 pm

ఆధార్ ఉంటే ఎవరికైనా ఓటు హక్కు ఇస్తారా?: సుప్రీంకోర్టు

 ఆధార్ కార్డు పౌరసత్వ పూర్తి స్థాయి ఆధారం కాదని, ఆధార్ ప్రాతిపదికన ఎన్నికల్లో ఓటుకు విదేశీయులకు అనుమతినిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల తుది విచారణల దశలో ఎన్నికల సంఘానికి గురువారం కీలక ప్రశ్నలు సంధించింది. చొరబాటుదార్లు ఆధార్ కార్డులు పొంది ఉంటే వారు ఓటు హక్కుకు అర్హులవుతారా? అని ప్రశ్నించింది. ప్రస్తుతం పలు రాష్ట్రాలు, యుటిలలో సర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆధార్ కార్డు వాడకం, ఓటు హక్కు వంటి ప్రశ్నలు తలెత్తాయి. ఆధార్‌ను పౌరసత్వ నిర్థారణ పత్రంగా పూర్తి స్థాయిలో భావించడానికి వీల్లేదు. ఈ క్రమంలో విదేశీయుల ఓటు హక్కు కూడా పరిగణనలోకి వస్తుందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాలా బాగ్చీతో కూడిన ధర్మాసనం వ్యాజ్యాలపై విచారణను వేగవంతం చేసింది ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు వాడే ఫారం 6 విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఫారంలోని సమాచారం అంతా సరైనదేనా? కాదా అనేది నిర్థారించుకునే అధికారం పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు. ఆధారే అన్నింటికీ ఆధారభూతం అని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా పౌరులు ప్రయోజనాలు పొందేందుకు రూపొందించిన అధికారిక సాధనం అంతే అని తెలిపారు. రేషన్ ఇతర విషయాలకు ఆధార్ జారీ అయిన వ్యక్తులను వారి ఆధార్ ప్రాతిపదికన ఓటరుగా చేర్చడం కుదురుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉదాహరణకు పొరుగుదేశం వ్యక్తి ఎవరైనా ఇక్కడికి వచ్చి రోజువారి కూలీగా పనిచేస్తూ ఉంటే , దీని ద్వారా రేషన్ వంటివి పొందుతూ ఉంటే వారు ఓటు వేసేందుకు వీలు కల్పిస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పోస్టాఫీసు కాదుగా ఎన్నికల సంఘం పోస్టాఫీసు కాదు. ఫారం 6 లో పొందుపర్చిన వాటన్నింటిని యధావిధిగా అంగీకరిస్తూ పోవల్సిన పనిలేదని , అవుననే వాదన కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లు కొందరు తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ లేవనెత్తిన అంశాలను బెంచ్ తోసిపుచ్చింది. సర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం సాధారణ పౌరులపై అనుచిత భారం మోపుతోందని , అనేకులు రాతకోతలతో చిక్కులు ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. దీనిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల సంఘాన్ని మీరు బట్వాడా విభాగం అనుకుంటున్నారా? అని చురకలు పెట్టింది. అత్యధిక వివరణలతో చివరికి ఓటరు కార్డులు తొలిగిపోయిన వారు ఉన్నారనే సిబల్ వాదన సరికాదని బెంచ్ తెలిపింది. రివిజన్ ఇసి విద్యుక్త ధర్మం కాదనడానికి వీల్లేదు రివిజన్ అనేది ఎన్నికల సంఘం అధికారంలో ఓ భాగం. దీని వల్ల ప్రజాస్వామికమైన ఓటుహక్కుకు విఘాతం ఏర్పడుతోందనే వాదన సమంజసమా? అని ప్రశ్నించారు. సరైన నోటీసు తరువాతనే జాబితాల్లో నుంచి పేర్ల తొలిగింపులు ఉంటాయని, ఇది తప్పనిసరి అని న్యాయస్థానం తెలిపింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో సర్ ప్రక్రియ సాగుతున్న దశలో ప్రత్యేక సందేహాలు సవాళ్లకు కోర్టు నిర్ధేశిత గడువులను విధించింది. తమిళనాడు పిటిషన్లపై ఎన్నికల సంఘం డిసెంబర్ 1లోగా వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. కేరళ పిటిషన్లపై విచారణ రెండున జరుగుతుంది. ఇక బెంగాల్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణ 9వ తేదీన ఉంటుంది. ఈ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు సర్ ప్రక్రియపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని వీటికి ప్రత్యేక నిర్థిష్ట గడువును ఖరారు చేశారు. 

మన తెలంగాణ 27 Nov 2025 7:53 pm

Manchiryala | 11 నామినేషన్ల స్వీకరణ

Manchiryala | 11 నామినేషన్ల స్వీకరణ Manchiryala | జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Nov 2025 7:49 pm