YSRCP : ఒక స్టాండ్ అంటూ లేకపోతే ఎలా గురూ?
రాజధాని అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారలేదని అర్ధమవుతుంది
సాగు, త్రాగు నీటి రక్షణకే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
సాగు, త్రాగు నీటి రక్షణకే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత అచ్చంపేట, ఆంధ్రప్రభ
ICDS Officials |అమ్మ ఒడికి దూరం..
ICDS Officials | అమ్మ ఒడికి దూరం.. ICDS Officials | మృత్యుంజయుడైన
మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..
ఆలేరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన
పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే..
పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే.. చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లి పోలీస్ స్టేషన్లో
మృత్యుంజయుడైన పసికందు! అరసవిల్లి ఆలయంలో మహదాశీర్వచనములు, వేదసదస్సు శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : అరసవిల్లి
Harish Rao |దశ, దిశ లేకుండా అసెంబ్లీ సమావేశాలు
Harish Rao | దశ, దిశ లేకుండా అసెంబ్లీ సమావేశాలు Harish Rao
Challapalli Ps Accident : పేలుడు కాదు…Andhra Prabha Latest News.
Challapalli Ps Accident : పేలుడు కాదు…Andhra Prabha Latest News. జస్ట్
Auto LPG |కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
Auto LPG | కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ Auto LPG |
రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్ బ్యాంకే దిక్కు
మార్చి31(జనంసాక్షి):రాష్ట్రాన్నినడిపేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించిన తాతాలిక రుణ సదుపాయాలను భారీ స్థాయిలో వినియోగించినట్టు కంప్ట్రోలర్ అండ్ …
today gold rate|మళ్లీ పెరుగుతున్న ధరలు
today gold rate| మళ్లీ పెరుగుతున్న ధరలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఇరాన్పై
Janasena : ముందు చూపు లేకుంటే... ముప్పు పొంచి ఉంటుందేమో?
జనసేన పార్టీ ఇప్పటి నుంచే నేతల కోసం అన్వేషణ చేయాల్సి ఉంటుంది
Risk100% |అవకాశాలా? ప్రమాదాలా?
Risk100% | అవకాశాలా? ప్రమాదాలా? Risk100% | యువతలో డేటింగ్ యాప్లపై పెరుగుతున్న
Nara Lokesh : టీడీపీ ఆఫీసులో నారా లోకేష్ ప్రజా దర్బార్
మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు
పవన్ శాఖకు అవార్డులు.. రివార్డులు
పంచాయతీరాజ్ శాఖ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వర్షం
ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వర్షం భూసిమెట్టలో గాలి వాన బీభత్సం…ఇళ్ల పై
Congress |జ్వరంతో ఆస్పత్రిలో చేరగా…
Congress | జ్వరంతో ఆస్పత్రిలో చేరగా… Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
గ్రామ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి…
వెల్డండ, ఆంధ్రప్రభ ; గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం అంటూ వెల్దండ స్థానిక
నల్లగొండలో యముడు.. చిత్రగుప్తుడు
నల్గొండ పోలీసులు విన్నూత్న తరహాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు
కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం
కడెం, ఆంధ్రప్రభ : “మన గ్రామం – మన ఆరోగ్యం” కార్యక్రమంలో భాగంగా
కడెంలో శ్రీ సాయిబాబా ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా
కడెం, ఆంధ్రప్రభ: మండల కేంద్రం కడెం పెద్దూరు సమీపంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో
విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి
విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
దూబే ఔట్... గన్ షాట్ సెలబ్రేషన్స్ అందుకే చేశాను: జడేజా
హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించారు. రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 127 పరుగులకే చెన్నై జట్టు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు జోప్రా ఆర్చర్, నంద్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీసి సిఎస్కె నడ్డి విరిచారు. రవీంద్ర జడేజా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఫస్ట్ ఓవర్ లోనే రెండో బంతికి ఎల్బి డబ్ల్యు రూపంలో సర్ఫరాజ్ ఖాన్ ఔట్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు శివమ్ దూబే దిగాడు. జడేజా విసిరిన మూడో బంతిని దూబే సిక్స్గా మలిచాడు. అదే ఓవర్లో చివరి బంతి ఆఫ్ సైడ్లో దూరంగా వేయడంతో దూబే సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు. బౌండరీ వద్ద రవి బిష్ణోయ్ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. వెంటనే రవీంద్ర జడేజా తుపాకీ పేల్చినట్టుగా సైగా చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత సీజన్ వరకు శివమ్ దూబే, రవీంద్ర జడేజా సిఎస్కె జట్టులో ఆడారు. ఇప్పుడు ఇద్దరు వేర్వేరు జట్లలో ఉన్నారు. తాజాగా గన్షాట్ సెలబ్రేషన్పై రవీంద్ర జడేజా స్పందించాడు. చెన్నై సూపర్ కింగ్స్లో జట్టులో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి నెట్స్లో ప్రాక్టీస్ చేసేవారమని, అతడు ఎలా ఆలోచిస్తాడో తనకు బాగా తెలుసునని చెప్పారు. అతడు స్పిన్ బౌలింగ్లో భారీ సిక్సర్లు కొట్టగలడని, అప్పటికే రాగానే తన బౌలింగ్లో ఒక సిక్స్ బాదాడని, ఆఫ్ స్టంప్కు దూరంగా బంతి వేయడంతో భారీ షాట్ ఆడాడని, బౌండరీ దగ్గర క్యాచ్ రూపంలో ఔట్ కావడంతోనే తాను గన్ షాట్ సెలబ్రేషన్స్ చేసుకున్నానని జడేజా వివరణ ఇచ్చాడు. ఇందులో మరో ఉద్దేశం ఏమీ లేదని, గౌహతి పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉందని ప్రశంసించారు. ఎక్కువ టర్నింగ్ ఉండడంతో బౌలింగ్లో అస్వాదించానని చెప్పారు. సరైన ప్రాంతంలో బంతిని విసిరితే వికెట్లు పడుతాయని రవీంద్ర తెలియజేశారు.
BRS |జాతర ఘటనపై విచారణకు పిలుపు
BRS | జాతర ఘటనపై విచారణకు పిలుపు BRS | ఆంధ్రప్రభ, వెబ్
BRS : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు
తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు
ఆ నీళ్లను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారా ? : నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టకుండా కాంగ్రెస్ ఉసురుపోసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద కృష్టా జలాలు ఆంధ్రాకు తరలిస్తున్నాడని, తాత్కాలిక కేటాయింపులకు కూడా కట్టుబడి ఎపి, రేవంత్ సర్కార్ ఉన్నారని విమర్శించారు. కృష్ణా నీళ్లను అడ్డగోలుగా ఎపి వాడుకుంటున్నా చోద్యం చేస్తుందని, నల్లొండ జిల్లాలో నోటికాడికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. తెలంగాణకు తక్కువ వాడుకుని ఆంధ్రాకు గురుదక్షిణ చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి నీళ్లు, రైతాంగ సమస్యలపై మాట్లాడరని, పోలవరం బనకచర్లతో 114 టిఎంసిల నీటిని యధేచ్ఛగా తీసుకుపోతున్నారని ధ్వజమెత్తారు. ఎపిని నిలువరించకుండా, కెఆర్ఎంబికి లేఖ రాయకుండా..తమాషా చేసి ఎవరిని ఫూల్ చేయాలనుకుంటున్నారని నిరింజన్ రెడ్డి నిలదీశారు. ఎస్ఎల్ బిసి టన్నెల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు పోతే వెలికితీయలేకపోతున్నారని, పదిశాతం మిగిలిపోయిన పాలమూరు- రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేస్తే 12 లక్షల ఎకరాలకు సమృద్ధిగా పండుతాయని, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే రేవంత్ ఇంటి ముందు ధర్నా చేయాలని బిఆర్ఎస్ నేతలకు సూచించారు. పాలమూరు- రంగారెడ్డి మిగులు పనులు పూర్తి చేయించడం చాతకాదని, అపెక్స్ కౌన్సిల్ వద్దకు నీటి తరలింపును కట్టడి చేసింది లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చే నీళ్లివ్వకుండా, పంటలు ఎండిపోతున్న దశలో స్పందిస్తే ఎలా? ప్రశ్నించారు. 2 పంపుల మరమ్మతుకు రూ.10 కోట్లు పెట్టలేకపోతున్నారని, కల్వకుర్తి- ఎత్తిపోతల పథకం కింద అదనంగా మరో 1600 క్యూసెక్కుల నీళ్లు అదనంగా వచ్చేవని తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ అత్యద్భుతంగా పాలమూరు- రంగారెడ్డి, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులతో..ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచారని నిరంజన్ రెడ్డి కొనియాడారు.
దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అసలైన బంగారాన్ని రోల్డ్గోల్డ్ వస్తువుల పేరుతో పక్కదారి పట్టించి కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయంలో హుండీల లెక్కింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు సమర్పించిన కానుకల్లోని అసలైన బంగారు ఆభరణాలను […] The post దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం! appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు
విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో… విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. మా ముఖ్యమంత్రి చెప్పింది చేశారు, చేస్తూనే […] The post విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
Andhra Pradesh : పోలీస్ స్టేషన్ లో పేలుడు.. పోలీసులకు గాయాలు
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడు సంభవించిం
చల్లపల్లి పోలీస్ స్టేషన్లోఅగ్ని ప్రమాదం #Explosion#Firecrackers#SeizedGoods#PoliceInjured#Accident
TDP : కడప రెడ్డమ్మకు కుర్చీ మీద ఉన్న శ్రద్ధ.. కార్యక్రమంపై లేకపోయెనే
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిత్యం వివాదాలను తానే కొని తెచ్చుకుంటున్నారు
మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన
తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ మే నెల నుంచి ప్రారంభం కానుంది
Karmeni Selvam |“కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకునే సినిమా
Karmeni Selvam | “కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకునే సినిమా Karmeni Selvam
Bihar Stampade : బీహార్ లో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది మృతి
బీహార్ లో విషాదం చోటు చేసుకుంది
అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి
కోల్కతాలో టెస్ట్ మ్యాచ్లు జరిగితే సంతోషిస్తాబీసీసీఐకే తన మద్దతు: గంగూలీ కోల్కతా: క్యాబ్ అధ్యక్షుడిగా కోల్కతాలో టెస్టు మ్యాచ్లు జరిగితే సంతోషిస్తాను, కానీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మ్యాచ్లు జరగాలని కోరుకుంటానని టీమఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. టీమఇండియా 2026-27 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల వేదికలనూ వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్ను కాదని…ఆసీస్తో టెస్టు సిరీస్కు గువాహతి […] The post అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి appeared first on Visalaandhra .
TG |ఏపీ అక్రమ నీటి తరలింపు ఆపేయాలి
TG | ఏపీ అక్రమ నీటి తరలింపు ఆపేయాలి TG | ఆంధ్రప్రభ,
శీతలామాతా ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి
పాట్నా: బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని శీతలా మాతా ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు చనిపోయారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మాఘ్రా గ్రామంలో చైత్రమాసం చివరి వారం కావడంతో శీతలా మాతా ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఎనిమిది భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వెంటనే పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది మంది మృతులు మహిళలుగా గుర్తించారు. బిహార్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ప్రతి మంగళవారం ఇక్కడ రద్దీ ఉంటుందని, తాము దర్శనం కోసం వచ్చామని పాట్నా నుంచి వచ్చిన ఓ భక్తురాలు తెలిపింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందని వివరించింది.
Aishwarya Rajesh |ఐశ్వర్య.. అలా అనడం వలనే ఇలా జరిగిందా..?
Aishwarya Rajesh | ఐశ్వర్య.. అలా అనడం వలనే ఇలా జరిగిందా..? Aishwarya
8women |శీతల మాత ఆలయంలో తొక్కిసలాట విషాదం
8women | శీతల మాత ఆలయంలో తొక్కిసలాట విషాదం 8women | భారీగా
pbksvsgt|నేడు పంజాబ్, గుజరాత్ ఢీ
pbksvsgt| నేడు పంజాబ్, గుజరాత్ ఢీ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఈ రోజు
Sharwa’s Biker Paid Premieres to deliver unmatched visual experience
Charming Star Sharwanand is known for his unique selection of scripts in diverse genres that provide wholesome entertainment to everyone. His upcoming film, Biker, being first of its kind motorcross racer film in Indian Cinema, the makers have went all out to achieve incredible technical and visual brilliance. Showcasing the same, they have decided to […] The post Sharwa’s Biker Paid Premieres to deliver unmatched visual experience appeared first on Telugu360 .
కృష్ణా జిల్లాలో పోలీస్ స్టేషన్లో పేలుడు... ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్ఐ సమక్షంలో మందుగుండు సామాగ్రిని పోలీసులు పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్ల తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిలిపి ఉంచిన వాహనం, వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. చల్లపల్లి సిఐ ఘటనా స్థలానికి చేరుకొని పేలుడు గల కారణాలపై ఆరా తీశారు. పిఎస్ లో ఉన్న బాణాసంచాను కోర్టుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
తాగడానికి నీళ్లు లేకుండా చేస్తారా? .. ఎపి ప్రభుత్వంపై జూపల్లి ఆగ్రహం
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పవర్ జనరేషన్ నిలిపివేయాలని నిబంధన ఉందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు లో 64 శాతం తెలంగాణకు వాటా ఉందని, నీటిని అక్రమంగా తరలించవద్దని కోర్టు ఆదేశాలున్నాయని, దీనికి భిన్నంగా అక్రమంగా ఎపి ప్రభుత్వం నీటిని వాడుతోందని విమర్శించారు. తాగడానికి నీళ్లు లేకుండా చేస్తారా? అని జూపల్లి ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల రైతులకు హక్కులు కాలరాస్తే ఊరుకోమని, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే వాడాలని సూచించారు. ఎపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నామని, తాము ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుందని మండిపడ్డారు. ఎపి ఇప్పుడు ఆపిందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.కేసు వివరాల్లోకి వెళితే… జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో జరిగినమినీ మేడారం (సమ్మక్క-సారలమ్మ) జాతర సందర్భంగా గొడవ చోటుచేసుకుంది. జాతరకు వెళుతున్న కౌశిక్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత […] The post బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు appeared first on Visalaandhra .
అర్ధరాత్రి అకాలవర్షం.. మామిడి రైతుకు అపర నష్టం
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పరిసర ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి
చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఎస్సై సహా నలుగురికి గాయాలు
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. మందుగుండు సామగ్రిని పరిశీలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఎస్సై సహా నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఏ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయట నుంచి స్వాధీనం చేసుకున్న కొంత మందుగుండు సామాగ్రిని స్టేషన్కు తీసుకొచ్చి పరిశీలిస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పేలింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎస్సై, పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, మరో […] The post చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఎస్సై సహా నలుగురికి గాయాలు appeared first on Visalaandhra .
మండలంలో హెచ్ పీవీ వ్యాక్సిన్ టీకా ప్రారంభం
వేంసూరు, ఆంధ్రప్రభ ; గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కట్టడి చేసేందుకు హెచ్ పివి
Anudeep |ఈసారైనా ప్లాన్ ఫలించేనా..?
Anudeep | ఈసారైనా ప్లాన్ ఫలించేనా..? Anudeep | జాతిరత్నాలు తర్వాత అనుదీప్కు
OTT Releases to Watch this Weekend
This weekend will have several options to watch in the digital space. Telugu films Hey Balwanth, Euphoria, Sampradayini Suppini Suddapoosani and Love Policy will be streaming this weekend. Here is the list of streaming films and other options this weekend: March 31st: Hey Balwanth (Telugu, Tamil, Kannada, Malayalam, Hindi): Zee5 Avatar: Fire and Ash (English): […] The post OTT Releases to Watch this Weekend appeared first on Telugu360 .
పట్టుబడ్డ నాగర్కర్నూల్ SI #latestnews #bribe #telugupost #telanganapolice
Airport | ఇద్దరు అరెస్ట్ Airport | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు
ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గణనీయంగా వంట గ్యాస్ కొరత పెరిగింది. దీనికి ప్రత్యామ్యాయాలపై కేంద్రం దష్టి సారించింది. వంట గ్యాస్ సమస్య తగ్గించే లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు ‘సుపీరియర్ కిరోసిన’ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్ను కేటాయించింది. హోర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం […] The post రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు appeared first on Visalaandhra .
తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు మొదలయ్యాయి
Andhra Pradesh : వారం రోజులు మాసం విక్రయాలపై నిషేధం
నందిగామ శివారు గ్రామంలో డయేరియా ప్రబలుతోంది
Zodiac Signs : మీ రాశిని చూసి దినఫలాలు తెలుసుకోవాలనుందా?
మంగళవారం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండనుంది
వేలానికి ముందే అక్రమ ఇసుక రవాణా యత్నం విఫలం
నార్సింగి, ఆంధ్రప్రభ ; మండలంలో అక్రమ ఇసుకను బహిరంగ వేలానికి నిర్ణయించిన నేపథ్యంలో,
Challapalli Ps Blast : చల్లపల్లి పీఎస్ లో పేలుడు Andhra Prabha Latest News
Challapalli Ps Blast : చల్లపల్లి పీఎస్ లో పేలుడు Andhra Prabha
టీఎన్జీవో జడ్చర్ల యూనిట్ అధ్యక్షుడిగా కే. తిరుపతయ్య
జడ్చర్ల, మార్చి 31 (జనంసాక్షి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జడ్చర్ల యూనిట్ నూతన అధ్యక్షుడిగా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న …
HYD |పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ చర్య
HYD | పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ చర్య HYD | ఆంధ్రప్రభ, వెబ్
Vijay |నియమావళి ఉల్లంఘన ఆరోపణలు
Vijay | నియమావళి ఉల్లంఘన ఆరోపణలు Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
విమర్శలను పక్కన పెట్టి ముందుకు సాగుతా: నిహారిక
హైదరాబాద్: విమర్శలు వస్తున్నాయని ఆగిపోతే అక్కడే ఉంటాం. తాను ఏం చేసినా కొందరు విమర్శిస్తున్నారు. అటువంటి విమర్శలను, అలాంటివారిని పట్టించుకోవడం మానేసినట్లు నిర్మాత నిహారిక చెప్పారు. ఆమె సొంత బ్యానర్పై వస్తోన్న చిత్రం ‘రాకాస’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీమ్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నిహారిక పాల్గొని మాట్లాడుతూ… నిర్మాతగా కెరీర్ ప్రారంభించగానే తనకు […] The post విమర్శలను పక్కన పెట్టి ముందుకు సాగుతా: నిహారిక appeared first on Visalaandhra .
తల్లిదండ్రుల సంరక్షణకు తెలంగాణ చారిత్రాత్మక చట్టం అమలులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాను ప్రత్యక్షంగా గమనించిన సంఘటనలను ఆయనే స్వయంగా చెబుతుంటే వృద్ధులైన తల్లిదండ్రులు ఎంత నిర్లక్షానికి గురవుతున్నారో తెలుస్తుంది. ‘ఒకాయన ప్రజాప్రతినిధిగా చాలా పైకి ఎదిగిండు, ఆయన తండ్రికి క్యాన్సర్ వస్తే అప్పుడు ఆయన మంత్రిగా ఉండి, తండ్రిని కనీసం పట్టించుకోలే.. తండ్రిని బజారుకు తీసుకెళ్లి పండ్లు కూడా కొనివ్వలేని పరిస్థితి ఆయనది.. ఇంట్లో తిండి పెట్టీ పెట్టక భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆయన చనిపోతే నాయకులంతా ఆ మాజీమంత్రిని పరామర్శ చేశారే తప్ప ఆ తండ్రి ఎలా చనిపోయాడో ఎవరూ తెలుసుకోలేదు.’ ఇలాంటి వాస్తవ సంఘటనలే తెలంగాణ ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణ చట్టం తీసుకురావడానికి దోహదం చేశాయి. తల్లిదండ్రుల భరణం, వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2007లో అమలులోకి తెచ్చింది. కానీ ఈ చట్టం అమలు కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రత్యేకత ఏమంటే ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ఎంఎల్ఎలు వంటి ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఉద్యోగుల జీతాల్లోంచి 15 శాతం లేదా రూ. 10 వేలు వంతున ఏది తక్కువ మొత్తం అయితే దానినే తల్లిదండ్రుల సంక్షేమం కోసం బదిలీ చేస్తారు. ఈమేరకు సమర్ధంగా నిర్వహించడానికి ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ప్రతిపాదించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే ఆదర్శాన్ని తరచుగా ప్రస్తావించే మన దేశంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక అత్యవసరాన్ని ప్రతిబింబిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తల్లిదండ్రుల సంక్షేమ చట్టం ఎందుకు సరిగ్గా అమలు కావడం లేదన్న ప్రశ్న ఎదురవుతోంది. అంటే అమలు చేసే యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడమే. 2021లో దేశంలో నిర్వహించిన దీర్ఘకాలిక వృద్ధాప్య అధ్యయనం ప్రకారం 2020లో దేశంలో 5.2 శాతం మంది వృద్ధులు తమ కుటుంబీకుల నుంచే లేనిపోని మాటల వేధింపులకు గురయ్యారని తేలింది. ఇలాంటి వేధింపులు సర్వసాధారమైపోతున్నాయి. తెలంగాణలో ఇలాంటి మాటల వేధింపుల బాధితుల సంఖ్య 2.1 శాతం వరకు ఉందని అధ్యయనంలో బయటపడింది. బాధితులైన వయోవృద్ధుల్లో సగానికి పైగా తమను కుటుంబం నిర్లక్షం చేసిందని నివేదించారు. ఇప్పుడు ఆ వేధింపులు తెలంగాణలో 68% వరకు పెరిగిపోవడం విడ్డూరం. ఇవన్నీ ఆయా వృద్ధులు ఫిర్యాదులు చేస్తేనే తెలిశాయి. మరి వాస్తవానికి చాలావరకు ఫిర్యాదులు చేయలేని సంఘటనలు ఎన్నో ఉన్నా వెలుగు లోకి రావడం లేదు. దీనికి కారణం కుటుంబం పరువు పోతుందనే సామాజిక ధర్మం పాటించి సహనం వహించడం, అలాగే బయటకు చెప్పకూడదని ఒత్తిళ్లు రావడం అని తెలుస్తోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సహజంగా ఉండవలసిన అనుబంధంలో చట్టం జోక్యం చేసుకోవలసిరావడం దురదృష్టకరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్షం చేస్తున్నారో వారు సామాజిక వ్యతిరేకతను ఎదుర్కొంటే తప్ప వారికి గుణపాఠం రాదని ముఖ్యమంత్రి సీరియస్గా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోక తప్పదు. తల్లిదండ్రులను, పెద్దలను దైవంతో సమానమైన ఉన్నత పీఠంపై మన భారత దేశ నాగరికతా సంస్కృతి పట్టంకట్టి ఆరాధిస్తోంది. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా నేడు చాలా మంది వృద్ధులు భావోద్వేగపరమైన వేధింపులను ఎదుర్కొంటుండడం అత్యంత శోచనీయం. తాము పెంచి పోషించిన పిల్లలే తమ సొంత ఆస్తిని గుప్పిటలో పెట్టుకుని తమకు పిడికెడు మెతుకులైనా పెట్టకుండా పీడించడం లేదా స్వంత ఇంటిలోనే నిలువనీడనీయకుండా చివరికి ఊరవతల శ్మశాన వాటికకు బతికి ఉండగానే తరలించడం వంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ అమానవీయ, నైతిక సంక్షోభం ఈ చట్టం వల్ల సమసిపోతుందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. కేంద్రం 2021లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ఎప్పుడైతే అమలులోకి తెచ్చిందో ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు అమలులోకి వచ్చాయి. కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటోంది. అయినప్పటికీ ఈ చట్టాన్ని సమస్య తీవ్రత దృష్టా పకడ్బందీగా అమలు చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. ఈ చట్టంపై విస్తృత అవగాహన కల్పించి సజావుగా అమలయ్యేలా మద్దతు ఇవ్వాలి. ఎవరికి వారు సొంతంగా బతుకుదామని, ఎంతో కొంత సంపాదించుకుందామని స్వతంత్రంగా నిర్ణయించుకోవడంతోనే ఉమ్మడి కుటుంబాలు చిన్నచిన్న పరిమిత కుటుంబాలుగా చీలిపోతున్నాయి. ఈ కుటుంబాలు బాగా అభివృద్ధి సాధించాలని తాపత్రయం పడడంలో తప్పులేదు. కానీ తల్లిదండ్రులు తాము పంచి ఇచ్చిన ఆస్తులను తిరిగి అప్పచెప్పాలని అడగడం లేదు. కుటుంబంలో తమ స్థానాన్ని అడుగుతున్నారు. జీతం ఇచ్చే యజమానికోసం కొన్ని గంటలు పనిచేస్తాం. కానీ జీవితం ఇచ్చే తల్లిదండ్రుల కోసం ఒక్క నిమిషమైనా వెచ్చించలేమా? చట్టం పేరిట కుటుంబాలను బలవంతంగా మెడలు వంచినంత మాత్రాన తల్లిదండ్రులకు సంరక్షణ కల్పించినట్టు కాదు. విస్తృతమైన నాగరికతా సాంస్కృతిక పునరుద్ధరణ పుట్టుకు రావాలి.
Young Actors missing Summer 2026
Several young actors of Telugu cinema have aimed to release their films in summer this year but most of them are missing the deadlines. Actors like Nani and Naga Chaitanya are occupied with big-budget films like The Paradise and Vrushakarma. Both these films were aimed for summer release but they were pushed because of the […] The post Young Actors missing Summer 2026 appeared first on Telugu360 .
Train |రాకపోకలకు తీవ్ర అంతరాయం
Train | రాకపోకలకు తీవ్ర అంతరాయం Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అకాల వర్షం.. భారీ నష్టం.. పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సోమవారం రాత్రి,
హోర్ముజ్ తెరవకున్నా.. యుద్ధాన్ని ఆపేస్తాం
మార్చి 31 (జనం సాక్షి):ఒకవేళ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకున్నా.. ఆ దేశంపై చేపట్టిన యుద్ధాన్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సహచరులతో వెల్లడించినట్లు …
Tragedy |భార్య, కుమారుడు మృతి.. కుమార్తె పరిస్థితి విషమం
Tragedy | భార్య, కుమారుడు మృతి.. కుమార్తె పరిస్థితి విషమం Tragedy |
నిరుద్యోగ యువతకు అవకాశాలు.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో
ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఆ.. ఇద్దరు పిల్లలు..
ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఆ.. ఇద్దరు పిల్లలు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్
బంగ్లాదేశ్లో 2026 సాధారణ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ మార్పులు భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. ఈ దశలో భావోద్వేగాల కంటే ఆచితూచి తీసుకునే వ్యవహారిక దృక్పథమే ప్రాధాన్యం పొందుతోంది. ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) తిరిగి అధికారంలోకి రావడం ఢాకా రాజకీయ పరిస్థితిని మార్చినప్పటికీ, ఇరుదేశాల మధ్య సహకారానికి ఉన్న ప్రాథమిక తర్కాన్ని మార్చలేదు. బదులుగా, పరస్పర అవసరాల ఆధారంగా మరింత మౌనంగా, లావాదేవీలకు దగ్గరగా ఉండే సంబంధం రూపుదిద్దుకుంటోంది. గత దశాబ్దానికి పైగా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు షేక్ హసీనా, అవామీ లీగ్తో ఉన్న సన్నిహిత భాగస్వామ్యంపై ఆధారపడ్డాయి. భద్రత, కనెక్టివిటీ రంగాల్లో విశ్వాసం, సహకారం అత్యున్నత స్థాయికి చేరాయి. భారత వ్యతిరేక తిరుగుబాటుదారులపై హసీనా ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు, ఆర్థిక మౌలిక వసతుల బలోపేతానికి చూపిన సంసిద్ధత, న్యూఢిల్లీ దృష్టిలో ఈ సంబంధాలను దక్షిణాసియాలో ఆదర్శంగా నిలిపాయి. అయితే ఆ రాజకీయ వ్యవస్థ అకస్మాత్తుగా ముగియడం, అనంతరం హసీనా భారత్లో ఉండటం, దౌత్య సమీకరణాలను క్లిష్టతరం చేశాయి. బిఎన్పి తిరిగి అధికారంలోకి రావడంపై మొదట న్యూ ఢిల్లీలో ఆందోళనలు ఉన్నప్పటికీ.. భారత్పట్ల గతంలో చూపిన సందిగ్ధత, వ్యతిరేక వైఖరి (కొన్నిసార్లు) కారణంగా.. ఇప్పుడు అవి సమతుల్య అంచనాలకు మారుతున్నట్లు కనిపిస్తోంది. గత అనుమానాలు, ప్రస్తుత సంబంధాలను ప్రభావితం చేయనివ్వకూడదనే భావన ఇరువైపులా స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తారిక్ రెహ్మాన్ను సంప్రదించడం, దానికితోడు ఢాకా నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, సందేశాలు, భౌగోళికఆర్థిక వాస్తవాలు విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని ఇరుదేశాల అవగాహనను సూచిస్తున్నాయి. భారత్ స్పందన గమనించదగ్గ రీతిలో మితమైనదిగా ఉంది. ఆర్భాట నిర్ణయాల కంటే, క్రమంగా ముందుకు సాగే చర్యలను న్యూఢిల్లీ ఎంచుకుంది. ఇంధనం వంటి కీలక సరఫరాల పునరుద్ధరణ, వీసా ప్రక్రియల సడలింపు, చర్చల సంస్థాగత మార్గాల పునఃప్రారంభం వంటి చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని, సంబంధాలను స్థిరపరచడమే లక్ష్యంగా నిశ్శబ్ద దౌత్యాన్ని అమలు చేస్తోంది. ఇది భారత్ పొరుగు దేశాల విధానంలో చోటుచేసుకుంటున్న మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ విధానం ఆదర్శాల కంటే కొనసాగింపు, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తుంది. బిఎన్పి ప్రభుత్వానికి ప్రధాన సవాలు దేశీయ రాజకీయ అవసరాలు, అంతర్జాతీయ వాస్తవాల మధ్య సమతుల్యత సాధించడం. తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ విదేశాంగాన్ని విభిన్న దిశల్లో విస్తరించాలనే సంకేతాలు ఇచ్చారు. ఇది భారత్ వ్యతిరేక ధోరణిగా భావించాల్సిన అవసరం లేదు. చైనా, పాశ్చాత్యదేశాలు, ఇతర ప్రాంతీయ భాగస్వాములతో సంబంధాలు పెంచుతూ, న్యూఢిల్లీతో ప్రామాణిక సంబంధాలను కొనసాగించాలనే వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని ఇది సూచిస్తుంది. ఆర్థిక సంబంధాలు ఇరుదేశాల మధ్య బలమైన ఆధారం. వాణిజ్యం, ఇంధన సహకారం, కనెక్టివిటీ ప్రాజెక్టులు పరస్పర ఆధారిత వ్యవస్థను ఏర్పరిచాయి. భారత్ బంగ్లాదేశ్కు ముఖ్య ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ భారత ఈశాన్య రాష్ట్రాలకు కీలక రవాణా మార్గాలను అందిస్తోంది. ఈ పరస్పర ఆధారిత వ్యవస్థను భంగం కలిగించడం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సహకారాన్ని పునర్నిర్మించుకోవడం అవసరమే. బంగ్లాదేశ్కు ఇంధన భద్రత, ఎగుమతుల విస్తరణ వంటి లక్ష్యాల సాధనకు భారత్తో స్థిరమైన సంబంధాలు అవసరం. భారత్కు కూడా బంగ్లాదేశ్ పొరుగు ప్రాంతానికే మొదటి ప్రాధాన్యత విధానంలో కీలక భాగస్వామి మాత్రమే కాకుండా, ఆగ్నేయాసియాతో అనుసంధాన లక్ష్యాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే, షేక్ హసీనా భారత్లో ఉండటం అత్యంత సున్నిత అంశంగా నిలుస్తోంది. ఒకవైపు ఆమె భారతదేశానికి అత్యంత సమీప మిత్రురాలు కాగా, మరోవైపు ఢాకాలోని కొత్త ప్రభుత్వం ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇలాంటి పరిస్థితిలో భారత్ తీసుకునే నిర్ణయం దౌత్య చాతుర్యానికి పరీక్షగా మారుతుంది. హసీనాను అప్పగిస్తే పాత భాగస్వామ్యానికి ద్రోహం చేసినట్లు అవుతుంది; తిరస్కరిస్తే ప్రస్తుత ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి తాత్కాలికంగా స్పష్టత లేని, సమతుల్య విధానాన్ని అనుసరించే అవకాశమే ఎక్కువ. భద్రతా అంశాలు కూడా ఈ సంబంధాల్లో కీలకంగా ఉన్నాయి. గతంలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్లో స్థలం లభించిన అనుభవం న్యూఢిల్లీ వ్యూహాత్మక ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించకపోయినా, భారత్ అప్రమత్తంగా గమనిస్తోంది. ఉగ్రవాద నిరోధం, గూఢచారి సమాచార పంపకం వంటి రంగాల్లో సహకారం, విశ్వాసాన్ని పెంచడం అవసరం. భారత్ ఈశాన్య ప్రాంతానికి ఈ సంబంధాల ప్రాధాన్యం మరింత ఎక్కువ. బంగ్లాదేశ్ పోర్టులకు ప్రవేశం, రహదారి రైల్వే కనెక్టివిటీ, ఆర్థిక కారిడార్ల అవకాశాలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డాయి. సంబంధాలు బలహీనపడితే తిరుగుబాట్లు, అక్రమ వలసలు, ఆర్థిక ఒంటరితనం వంటి పాత సమస్యలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. విస్తృత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ చైనాతో పెంచుకుంటున్న సంబంధాలు భారత్కు సవాలుగా మారుతున్నాయి. ఇవి పోటీని పెంచినా, ఆర్థిక దౌత్యం, మౌలిక వసతుల పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాల్లో భారత్ మరింత చురుకుదనం చూపాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. మొత్తంగా చూస్తే ఇది విభేదం కాదు, పునర్వ్యవస్థీకరణ. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు భావోద్వేగ దశ నుంచి వ్యావహారిక దశకు మారుతున్నాయి. ఈ మార్పు వేడి తగ్గించినప్పటికీ, దీర్ఘకాలంలో మరింత స్థిరత్వాన్ని అందించే అవకాశముంది. దక్షిణాసియాలో రాజకీయ మార్పులు ఒక్కసారిగా విదేశాంగ విధానాలను మార్చే పరిస్థితుల్లో, ఇరుదేశాలు సంయమనంతో, దూరదృష్టితో ఈ మార్పును నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వాలు మారినా భౌగోళిక వాస్తవాలు మారవని ఇది మరోసారి రుజువు చేస్తోంది. రానున్న నెలలు రెండు దేశాలకూ కీలకం. షేక్ హసీనా అంశం వంటి సున్నిత విషయాలను సమర్థంగా పరిష్కరించగలిగితే, భద్రతా సహకారం కొనసాగితే, ఆర్థిక బంధాలు మరింత బలపడితే, ఈ దశ స్థిరమైన భాగస్వామ్యంగా మారే అవకాశం ఉంది. లేకపోతే పాత అనుమానాలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పునర్నిర్మాణం గతంతో విరామం కాదు.. కొత్త రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా తీసుకున్న సమతుల్య అడుగు. అంతర్జాతీయ సంబంధాల్లో అవసరాలు చాలా సార్లు సిద్ధాంతాలను మితిమీరకుండా కట్టడి చేస్తాయని స్పష్టం చేస్తోంది. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.20 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసి ఈగల్ టీమ్ కు సమాచారం ఇచ్చారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడి వద్ద చెక్ చేయగా భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారని అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
Tirumala |స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..
Tirumala | స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం.. Tirumala | ఆంధ్రప్రభ వెబ్
స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..
స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమలలో జరుగుతున్న
హైదరాబాద్లోని జయలలిత భవనం సీజ్ #Hyderabad#JayalalithaBhavan#Seized#PoliceAction#GHMC#LegalAction
Amaravathi : రాజధానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చే అవకాశం లేదా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించలేదు
నియోజకవర్గాల పునర్విభజనలో సమన్యాయమే శ్రేయస్కరం
కేంద్రం ప్రభుత్వం 543/545 పార్లమెంట్ ఎంపి స్థానాలను 816కు (పెరిగేవి 273), 4123 అసెంబ్లీ స్థానాలను 6185కు (పెరిగేవి 2062) పెంచి 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావాల్ ఇటీవల ప్రకటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లోక్సభలో బిల్లు ఆమోదం పొందాక ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి చట్టసభల సీట్ల పెంపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందిన మహిళ బిల్లు (నారీశక్తి వందన్ అదినియమ్-2023) ప్రకారం చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లను కూడా అమలు చేయాలని భావించడం శుభపరిణామం. ఎందుకంటే మొట్టమొదట 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీలో మహిళలకు 33% రిజర్వేషన్ ఆమోదం పొంది, 1996లో హెచ్డి దేవెగౌడ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని బిల్లు ఆమోదం పొందక, 1998, 1999, 2003 లో ఎన్డిఎ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి ఏకాభిప్రాయం లేక పెండింగ్లో ఉండి, 2010లో యుపిఎ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించినప్పటికీ లోక్సభలో ఆమోదం పొందక కునారిల్లి 2023 సెప్టెంబర్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డిఎ ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదింపజేసి ఆచరణలోకి తేవడం ఆకాశంలో సగమన్న మహిళలకు, యావత్తు దేశ ప్రజానీకానికి శుభదాయకం. ప్రజాస్వామ్యానికి ప్రధాన ఆధారం సాధారణ ప్రజలే, ప్రజాస్వామ్యంలో ఓటు తూటా కంటే శక్తివంతమైనది. 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పెంపు సంతోషించదగ్గ పరిణామమే. ఎందుకంటే ప్రజల ప్రాతినిధ్యాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయడమే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెరగడం అంటే చట్టసభలలో జరిగే చర్చల్లో ఎక్కువ మంది ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం. 1952, 1963, 1979 లలో చట్టసభల స్థానాల పునర్విభజన మూడుసార్లు జరిగినప్పటికీ 1976 లోని ఇందిరా గాంధీ నిలిపివేసింది. 2002 పునర్విభజన చేసినప్పటికీ స్థానాల సంఖ్య మాత్రం పెరగలేదు. లోక్సభలో ఎస్సిలకు ప్రస్తుతము ఉన్న 84 స్థానాల నుండి 126 కు, ఎస్టిలకు 47 స్థానాల నుండి 70 కి పెరుగుతాయి. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించకుండా చట్టసభలలో స్థానాల పెంపు అనేది అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా అన్నిరాష్ట్రాలతో చర్చించి పెంచాలి. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడానికి అధికారిక ‘జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం’ ప్రపంచంలోనే మొదట 1952లో మన దేశంలో ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు పరచడంలో దక్షిణాది రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధించి జనాభా పెరుగుదల నెమ్మదింపజేసాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలను పరిశీలించినట్లయితే జనాభా పెరుగుదల రేటు గణనీయంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లలో జనాభా అధికం. ఈ 6 రాష్ట్రాల పెరిగే ఎంపి స్థానాలు 50% ప్రామాణికతతో పెంచితేనే సుమారు 396 స్థానాలు అవుతాయి. పెరిగిన జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే ఈ రాష్ట్రాలలో మరిన్ని ఎంపి స్థానాలు పెరుగుతాయి. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపి స్థానాలు తగ్గిపోతాయి. ఇప్పటికే దక్షిణాది ఉత్తరాది మధ్య ఉన్న అంతరం మరింత పెరుగుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో పార్టీ అయినా కేంద్రంలో సునాయాసంగా అధికారంలోకి రావచ్చు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అంతిమంగా అది బిజెపికి లాభిస్తుందని కాంగ్రెస్ భయపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం ఇప్పటికే వివక్ష చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టసభల స్థానాల పెంపుపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే కేంద్రం మంత్రి పదవులను దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత లేని శాఖలిస్తున్నారని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ఒకసారి దక్షిణాదికి కేటాయించిన మంత్రిత్వ శాఖలను పరిశీలిస్తే కేవలం నిర్మలా సీతారామన్ మాత్రమే ప్రాధాన్యత శాఖను నిర్వహిస్తున్నారు. మిగతా కీలక ప్రాధాన్యత శాఖలన్నీ ఉత్తరాది చేతుల్లోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో చట్టసభ సీట్లను పరిశీలిస్తే 50 శాతం పెంపుదల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి, 17 లోక్సభ స్థానాలు 26 కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలు 263కు, 25 లోక్సభ స్థానాలు 38కి పెరుగుతున్నాయి. చట్టసభల స్థానాల పెంపుదల అనేది ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా మనం రాజ్యాంగలో చెప్పుకున్న ‘సమన్యాయం’ ప్రతిపాదికన ఉత్తరాది రాష్ట్రాల, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి అన్యాయం జరగకుండా చట్టసభల స్థానాలను పెంచితే ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచినట్లు అవుతుంది.
Israel - Iran War :ఇజ్రాయెల్, అమెరికా దాడులు… గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్మీడియాలో చేసిన పోస్టులో ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇల్లును సీజ్ చేసిన జిహెచ్ఎంసి అధికారులు
హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్లోని ఇల్లును జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ భవనంపై ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సుమారు రూ.1.60 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయంపై పలుమార్లు జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరికి భవనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఆస్తి పన్ను బకాయి ఉన్నట్టు తెలిసింది.
2 Mn Bbl Oil Tanker Fired : కువైట్ ట్యాంకర్ ధ్వంసం
2 Mn Bbl Oil Tanker Fired : కువైట్ ట్యాంకర్ ధ్వంసం
అత్తాపూర్ లో రెచ్చిపోయిన పోకిరీలు..
అత్తాపూర్ లో రెచ్చిపోయిన పోకిరీలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పోలీసుల ముందే
భారత సర్వోన్నత న్యాయస్థానం 24 మార్చిన క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్సి హోదా వర్తించదని తీర్పుచెప్పిన విషయం తెలుగు ప్రజలకు విదితమే. ప్రచార మాధ్యమాలు ఇదే విషయాన్ని ప్రధాన వార్తగ ప్రచారం చేశాయి. తెలుగునేలపై ఇప్పటికీ ఇదే చర్చ జరుగుతుంది. కొన్ని సంఘాలు సుప్రీం తీర్పును తప్పుపడుతున్నవి. మరికొన్ని ఈ తీర్పును స్వాగతీస్తున్నట్టు ప్రకటనలు ఇస్తున్నవి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆనందపాల్, రామిరెడ్డిలకు చెందిన కేసులో ఈ తీర్పు రావడంతో ఆంధ్రప్రదేశ్లోని కూటమి నాయకులకు ముఖ్యంగా దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆంధ్ర శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు లాంటివారికి ఇది ఒక ఆయుధంగా దొరికింది. సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడాన్ని దళిత మేధావి వర్గం నుండి సాధారణ ప్రజలవరకు తప్పుపడుతున్నారు. ఈ తీర్పు అనేక మంది దళిత క్రైస్తవుల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నది సందేహం లేదు. కానీ ఇక్కడ సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ఆధారమైన రాష్ట్రపతి ఉత్తర్వు 1950, ఆ ఉత్తర్వు రాజ్యాంగంలో ఉన్న కారణంగా హైకోర్టులు మొదలు సుప్రీం కోర్టు ఈ తీర్పులు వెలువరిస్తున్నవి. ఈ తీర్పు మొదటిసారి వచ్చిందేమీ కాదు. గతంలో అనేక కేసులల్లో సుప్రీం ఇదే విషయాన్ని చెప్పింది. రాష్ట్రపతి (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు 1950 పేర మూడులో చూచించిన ప్రకారం హిందూ మతం పాటించని దళితులు ఎస్సి జాబితాలోకిరారు అనేదిదాని సారంశం. కాలనుగుణంగా 1957లో సిక్కుమతం ఆచరిస్తున్న దళితులకు, 1990లో బౌద్ధమతం స్వీకరించిన దళితులకు ఎస్సి రిజర్వేషన్ వర్తించేలా భారత పార్లమెంట్ రాష్ట్రపతి ఉత్తర్వుకు సవరణ చేయడం జరిగిందీ. ప్రస్తుతం క్రైస్తవం, ఇస్లాం స్వీకరించిన దళితులకు రాష్ట్ర పతి ఉత్తర్వు ప్రకారం ఎస్సి రిజర్వేషన్ వర్తించదు. ఇదే విషయాని సుప్రీం కోర్టు చెప్పింది. వివిధ రాష్ట్రాల నుండి సిఫారసు చేయబడిన దళితులను ఎస్సిలుగా గుర్తించి ఆ కులాలను ఎస్సి రిజర్వేషన్ జాబితాలో చేర్చే అధికారం ఆర్టికల్ 341 ప్రకారం భారత రాష్ట్రపతికి ఉన్నది. ఆనాడు మొదటి ఎస్సి జాబితాను ఈ దేశ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 10 ఆగస్టు 1950 నాడు రాష్ట్రపతి ఉత్తర్వు ఇవ్వడం జరిగినది. సెక్యులర్ అనే పేరుతో క్రైస్తవులను ఓటు బ్యాంకుగా మార్చుకుని దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు తీరని మోసం చేసింది. ఆనాడు ఈ రాష్ట్రపతి ఉత్తర్వును అన్యాయంగా రాజ్యాంగంలో చేర్చిన నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నెహ్రూ ప్రభుత్వమే. 1956లో దళిత సిక్కులకు ఎస్సి రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవులకు మొండి చేయి చూపింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మొదటినుంచి బాహాటంగానే దళిత క్రైస్తవులకు ఎస్సి రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. 2004 తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్రెడ్డి సిఎం అయ్యాక దళిత క్రైస్తవులకు ఎస్సి రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మెజారిటీ సభ్యుల ఆమోదంతో జరిగిన తీర్మానాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. ఆనాడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. వైయస్ రాజశేఖర్ రెడ్డి దళిత క్రైస్తవులకు ఎస్సి రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ధితో ఉన్నా అనాటి కాంగ్రెస్ పట్టించుకోలేదు. బిజెపి దళిత క్రైస్తవులకు ఎస్సి రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేఖిస్తుంది. ఎందుకంటే ఇతర మతాల వారు ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరులు అనే సిద్ధాంతంతో ఉన్న బిజెపి దళిత క్రైస్తవ సమాజానికి రావలసిన ఎస్సి రిజర్వేషన్ను వ్యతిరేకించడం సహజం. సుప్రీం కోర్టుకు వివరణ కోసం మోడీ ప్రభుత్వం ఇదే విషయంపై అధ్యయనం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బాలకిషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. మతం మారిన దళితులపై వివక్ష లేదు అని అనుకోవడానికి వీలు లేదు. అదే నిజమైతే కారంచేడులో హత్యకు గురైన మాదిగలు అందరూ క్రైస్తవ నేపథ్యం ఉన్నవారే. అయినప్పటికీ కారంచేడు అగ్రకుల దాడి దేశంలోనే సంచలనం సృష్టించింది. చుండూరులో హత్యకు గురైన మాలలు కూడా చర్చి నేపథ్యం ఉన్నవారే. ఇవే కావు ఇలాంటి అనేక సంఘటనలు దేశవ్యాప్తంగా ఉన్నవి. మతం మారినంత మాత్రాన దళితులపై సమాజ వైఖరి మారలేదు. అంతేకాదు మతం మారిన దళితులపై ముఖ్యంగా దళిత క్రైస్తవులపై దాడులు పెరిగినవి తప్పితే తగ్గలేదు. హిందూ విశ్వాసంలో ఉన్న దళితులపై కులం పేరుతో అగ్రకులాలు దాడి చేస్తే, దళిత క్రైస్తవులపై కులం పేరుతోపాటు, మతం పేరుతో కూడా దాడులు జరుగుతున్నవి. హిందూ మతం వదిలి వెళ్ళిన తరువాత అంటరానితనం క్రైస్తవంలో లేదు. అలాంటప్పుడు ఎస్సి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది బిజెపి వాదన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ దేశంలో దళితులు సామాజికంగా అణచివేయబడ్డారు. ఈ దేశం మొత్తం దళితులను అంటరానివారుగా చూచింది. చర్చిలో కులం లేదు, కానీ ఈ దేశంలో భాగమైన బడిలో కులం ఉన్నది, సంతలో కులం ఉన్నది, ప్రభుత్వ కార్యాలయాల్లో కులం ఉన్నది, పాలనలో కులం ఉన్నది. చర్చిలో కులం లేకున్నా ఊరు ఉమ్మడి ఆస్తి అయిన మంచినీళ్ళ చెరు వుకాడ కులం ఉన్నది. ఒక క్రైస్తవుడు జీవించేది చర్చిలో కాదు. ఈ దేశంలో అందునా కులం పేరుతో విడిపోయిన ఈ సమాజంలో కులం ఉన్నది. ఆరాధన పద్ధతిలో తేడా, నమ్మే దేవునిలో తేడా అంతేకానీ అణచివేత ఒక్కటే. సమాజంలోఉన్న కులఅణచివేత లేదాకుల గుర్తింపు మతవిశ్వాసాన్ని బట్టి రాలేదు. పుట్టిన ఇంటిని బట్టి వచ్చిది అనే విషయాన్ని గుర్తించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సి రిజర్వేషన్ సాధనకు ఐక్యసంఘటిత ఉద్యమమే పరిష్కారం. వర్గీకరణ పేరుతో విడిపోయిన మాలమాదిగలు దళిత క్రైస్తవ ఎస్సి రిజర్వేషన్ కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇద్దరి సమస్య, ఇక్కడ చర్చికి వెళ్ళే మాలలు, మాదిగలు బాధితులే వీరు మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో 59% కులాల సమస్య. కాబట్టి మాలమహానాడుతోనో, మాదిగదండోరాతోనో సాధ్యం కాదు. కొత్త నాయకత్వమే ముందుకు రావాలి. దలిత క్రైస్తవులకు ఎస్సి రిజర్వేషన్ కల్పించడానికి రెండు మార్గాలు. పార్లమెంటులో రాష్ట్రపతి ఉత్తర్వు 1950కి సవరణ చేసి ఆమోదించడం లేదా రాష్ట్రపత్తి ఉత్తర్వు 1950ను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం. పైరెండు మార్గాల ద్వారా దళిత క్రైస్తవులకు ఎస్సి రిజర్వేషన్ పొందే వీలు ఉన్నది. - వలిగొండ విజయరాజు 81434 46626
హైదరాబాద్ లో మాజీ సీఎం ఇంటిని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు
ఆందోళనలో చిట్యాల రైతులు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో సోమవారం రాత్రి వీచిన
Peddi Release: Buchi Babu gets Trolled
Buchi Babu Sana made an impressive debut with Uppena and the film ended up as a blockbuster. He waited for almost two years for the arrival of Charan and his next film Peddi featuring Ram Charan is in the final stages of shoot. The makers announced that the film releases on April 30th but there […] The post Peddi Release: Buchi Babu gets Trolled appeared first on Telugu360 .
Summer Effect : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ഫാക്ട് ചെക്ക്: ഇറാൻ യുഎസ് വിമാനവാഹിനിക്കപ്പൽ ആക്രമിച്ചോ? പ്രചരിക്കുന്ന വീഡിയോ എഐ നിർമിതം
യുഎസ്എസ് എബ്രഹാം ലിങ്കൺ ഇറാൻ തകർക്കുന്ന ദൃശ്യമെന്ന് വാദത്തോടെയാണ് വീഡിയോ പ്രചരിക്കുന്നത്
రేపు పార్లమెంట్లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు
రేపు పార్లమెంట్లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రానుంది
ఆమనగల్లులో భార్య, కుమారుడిని కత్తితో పొడిచి చంపి... కొనఊపిరితో కుమార్తె
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో భార్య, కుమారుడిని భర్త కత్తితో పొడిచి చంపాడు. కూతురు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాం నగర్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో బాణావత్ రాందాస్ నాయక్, కవిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు పవిత్ర, కమారుడు హర్షలు ఉన్నారు. ఆమనగల్లు పట్టణ సమీపంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్ లో రాందాస్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కవిత మేస్త్రి పని కూలికి వెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంది. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భార్య, కుమారుడు, కూతురును కత్తితో పొడిచాడు. భార్య, కుమారుడు ఘటనాస్థలంలోనే మృతి చెందగా కూతురు కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

31 C