తుంగతుర్తి పాఠశాల విద్యార్థులకు అరుదైన గుర్తింపు
నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినీ, విద్యార్థులకు అరుదైన గుర్తింపు లభించింది.
ఫిదాలో సాయిపల్లవికి అక్కగా నటించే ఛాన్స్ నాకే వచ్చింది: నటి కీలక వ్యాఖ్యలు
మొదట్లో బుల్లితెరపై అలరించి.. తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ల ఫ్రెండ్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి హరితేజ.
Beijing చైనా అణు సబ్ మెరైన్ లో ప్రమాదం .. మొత్తం 55 మంది నావికులు దుర్మరణం..
బీజింగ్: చైనాకు చెందిన అణుశక్తి సబ్మెరైన్ ‘093-417’ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఎల్లో సీలో జరిగిన ప్రమాదంలో అందులో ఉన్న 55 మంది సబ్మెరైనర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగినా.. చైనా ఇప్పటి వరకు నోరు మెదపలేదు. తాజాగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్’ బాంబులాంటి కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్, చైనా రెండూ […]
రేపల్లెలో కిరాతకం... స్మశాన వాటికలో డిగ్రీ విద్యార్థి దారుణ హత్య
బాపట్ల : రేపల్లె మండలం అరవపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని స్మశాన వాటికలో ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహం రక్తపుమడుగులో పడివుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే... రేపల్లెలోని 24వార్డులో నివాసముండే మేక సాయి(24) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతడికి జగనన్న కాలనీలో నివాసముంటున్న బ్లేడ్ హర్షతో గొడవలున్నాయి. పలుమార్లు వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో సాయిపై కక్ష పెంచుకున్న హర్ష మద్యంమత్తులో దారుణానికి పాల్పడ్డాడు. రేపల్లె సమీపంలోని అరవపల్లి శివారులోని స్మశాన వాటిక వద్ద సాయి, హర్ష గొడవపడ్డారు. అయితే సాయిని హత్యకు ముందే ప్లాన్ చేసిన హర్ష కత్తి వెంటతెచ్చుకున్నాడు.దీంతో విచక్షణారహితంగా పొడవడంతో సాయికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడు చనిపోయాడని నిర్దారించుకుని హర్ష అక్కడినుండి వెళిపోయాడు. Read More సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ? క్రైస్తవ స్మశానంలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మృతుడిని సాయిగా గుర్తించారు. హత్యకు పాల్పడింది బ్లేడ్ హర్షగా గుర్తించారు. నేరచరిత్ర కలిగిన హర్ష విజయవాడలో నగర బహిష్కరణకు గురయినట్లు అనుమానిస్తున్నారు. పరారీలో వున్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చెప్పుల స్టాండ్ లో పనిచేసిన రాహుల్ గాంధీ
చెప్పుల స్టాండ్ లో పనిచేసిన రాహుల్ గాంధీ
లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీలకు బెయిల్ మంజూరు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు ప్రస్తుత బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్లకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చెల్లి ఖుషి కపూర్ ఫొటోలపై అక్క జాన్వీ కపూర్ రియాక్షన్.. మరీ ఇంతలానా.!
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తాజాగా చెల్లెలు లెటెస్ట్ ఫొటోలపై అక్క జాన్వీ ఆసక్తికరంగా స్పందించింది. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుర్లు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Kushi Kapoor) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తమ గురించిన అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. తాజాగా ఖుషీ కపూర్ తన వెకేషన్ నుంచి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిపై అక్క జాన్వీ ఇంట్రెస్టింగ్ గా స్పందించింది. ప్రస్తుతం ఖుషీ కపూర్ పారిస్ లో సందడి చేస్తోంది. పారిసియన్ లుక్లో ఆకట్టుకుంది. మినీ స్కర్ట్, వైట్ స్వెటర్, మోకాళ్లపైకి ఉన్న షూస్ ధరించి స్టైలిష్ గా మెరిసింది. పారిస్ వీధుల్లో చక్కర్లు కోడుతూ ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ పిక్స్ లో తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈఫిల్ టవర్ అందాలను, సిటీ వ్యూను చూపించే ఫొటోలతోనూ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. పారిస్ లో షికార్లు చేస్తూ ఫొటోలకు ఇలా క్రేజీగా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. అయితే ఖుషీ కపూర్ ఫొటోలపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె లుక్ కు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్క జాన్వీ కపూర్ కూడా చెల్లెలి ఫొటోలపై స్పందించింది. కామెంట్ సెక్షన్లో ఇలా స్పందించింది. ‘అద్భుతమైన యువరాణి, నా లడ్డూ, నా జాంగ్రీ, నా మైసూర్ పాక్, నా బంగారం’ అంటూ చెల్లెలిపై ప్రేమవర్షం కురిపించింది. జాన్వీ కామెంట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చెల్లెలిపై జాన్వీకి ఇంత ప్రేమ ఉందా.. ఇంతలా ఆకాశానికి ఎత్తాలా అంటూ స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఖుషీ కపూర్ తన బాత్ రోబ్ ఫొటోలనూ షేర్ చేసింది. మిర్రర్ సెల్ఫీలతో ఆకట్టుకుంది. శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్ తన చెల్లెల్లితో కలిసి దిగిన ఫొటోలను తరుచూగా పంచుకుంటూ వస్తోంది. అలాగే ఖుషీ కపూర్ పోస్టులకు ఎప్పటికప్పుడు మద్దతిస్తుంటుంది. దీంతో చెల్లిలి విషయంలో జాన్వీ చాలా కేరింగ్ గానూ ఉంటుందని అర్థం అవుతుంది. ఇక ఖుషీ కపూర్ ‘ది ఆర్చీస్’ అనే చిత్రంతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేయనుంది. డిసెంబర్ లో విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే.
AP: బాపట్ల జిల్లాలో యువకుడి దారుణ హత్య
బాపట్ల జిల్లా రేపల్లె అరవపల్లి శివారు క్రైస్తవ స్మశాన వాటికలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణారహితంగా మరో యువకుడు పొడిచి చంపాడు. మృతిచెందిన యువకుడు 24వ వార్డు నివాసి మేక సాయి (24)గా గుర్తించారు. హత్యకు పాల్పడిన వ్యక్తి పట్టణంలోని జగనన్న కాలనీలో నివాసముంటున్న బ్లేడ్ హర్షగా పోలీసులు కనుగొన్నారు. మృతుడు సాయి నగరం ఎస్ వి ఆర్ ఎం కళాశాలలో డిగ్రీ ఫైనల్ […]
మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలి: పువ్వాడ అజయ్ కుమార్
మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలి: పువ్వాడ అజయ్ కుమార్
అర్ధరాత్రి నది ఉగ్రరూపం.. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు (వీడియో)
ఈశాన్య రాష్ట్రం సిక్కింను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. లాచెన్ లోయలో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా పోటెత్తిన వరదల ధాటికి 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.
కేసీఆర్స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ పూర్తి చేయాలి: కలెక్టర్ డాక్టర్ శరత్
కేసీఆర్స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ పూర్తి చేయాలి: కలెక్టర్ డాక్టర్ శరత్
ములకలపల్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల భిక్షాటన
ములకలపల్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల భిక్షాటన
తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను.. జర్నలిస్టుకి సిద్దార్థ్ వార్నింగ్..
ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ వస్తున్న హీరో సిద్దార్థ్.. ఇక తెలుగులో సినిమాలు రిలీజ్ చేయను అంటున్నాడు.
సంజూ శాంసన్ పెయింటింగ్ ముందు టీమిండియా ప్రాక్టీస్... వరల్డ్ కప్ టీమ్తోనే ఉన్నానంటూ..
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్కి కేరళలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మ్యాచుల కోసం కేరళకి వెళ్లిన టీమిండియాకి సంజూ శాంసన్, జట్టులో ఎందుకు లేడనే ప్రశ్నే అభిమానుల నుంచి ఎదురయ్యేది. తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ వార్మప్ మ్యాచ్ ఆడేందుకు తిరువనంతపురానికి వెళ్లింది భారత జట్టు... తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సంజూ శాంసన్ పెయింటింగ్ ఉంటుంది. ఈ పెయింటింగ్ ముందే భారత జట్టు నెట్ ప్రాక్టీస్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సంజూ శాంసన్ కూడా ఈ ఫోటోలపై స్పందించిన తీరు, అందర్నీ ఆకట్టుకుంటోంది.. ‘టీమిండియాతో ఉన్నా... @దేవుడి సొంత దేశంలో’ అంటూ కామెంట్ చేశాడు సంజూ శాంసన్. సెలక్టర్లు పట్టించుకోకపోయినా, టీమ్ మేనేజ్మెంట్ అస్సలు లెక్కచేయకపోయినా సంజూ శాంసన్, ఇంత పాజిటివ్గా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ యాటిట్యూడ్, సంజూకి మరింత ఫాలోయింగ్ తెచ్చిపెడుతోంది..వన్డేల్లో సంజూ శాంసన్కి 55కి పైగా సగటు ఉంది. అయితే టీ20ల్లో సరిగ్గా ఆడడం లేదనే ఉద్దేశంతో సంజూ శాంసన్ని వన్డే వరల్డ్ కప్ నుంచి పక్కన బెట్టేసింది టీమిండియా మేనేజ్మెంట్. వన్డేల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో బాగా ఆడుతున్నాడనే కారణంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది.. గౌహతిలో ఇంగ్లాండ్తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షంతో రద్దు అయ్యింది. నెదర్లాండ్స్తో వార్మప్ మ్యాచ్ కోసం 3400 కి.మీ.లు ప్రయాణించి, తిరువనంతపురం చేరుకుంది భారత జట్టు. అయితే వర్షంతో నెదర్లాండ్స్తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కూడా టాస్ కూడా వేయకుండానే రద్దు అయ్యింది.. అక్టోబర్ 5న అహ్మదాబాద్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. భారత జట్టు, అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘాన్తో, అక్టోబర్ 14న పాకిస్తాన్తో మ్యాచులు ఆడుతుంది భారత జట్టు..
Peddapalli: అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు ?… ఎమ్మెల్యే దాసరి
అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారని ప్రజలు మరోసారి ప్రతిపక్షాలను నమ్మి ఓటు వేస్తారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ… గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరుపేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని […]
రతిక లాంటి అమ్మాయితో పెళ్లి.. ఎందుకమ్మా నామీద నీకంత పగ
రతిక లాంటి అమ్మాయితో పెళ్లి.. ఎందుకమ్మా నామీద నీకంత పగ
TS: ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్
ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు.
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి : చంద్రమోహన్
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి : చంద్రమోహన్
గత ఆర్డీఓ, తహసీల్దార్లకు పాపం తగుల్తది: వనమా వెంకటేశ్వరరావు
గత ఆర్డీఓ, తహసీల్దార్లకు పాపం తగుల్తది: వనమా వెంకటేశ్వరరావు
తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ వివాదస్పద వ్యాఖ్యలు…!
ప్రధాని నరేంద్ర మోడీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రక్షించాలంటే గుజరాతీల వల్లే అవుతుందన్నారు నరేంద్ర మోడీ. 1948లో నిజాం నుండి తెలంగాణను విడిపించడానికి ఒక గుజరాతీగా వల్లభాయ్ పటేల్ వచ్చాడు… ఇప్పుడు తెలంగాణను కాపాడడానికి మరో గుజరాతీ బిడ్డగా నేను వచ్చానంటూ నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు . నిన్న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..తెలంగాణ సీఎం కేసీఆర్కు తన కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం లేదని అన్నారు. ‘తెలంగాణలో ఎవరు […] The post తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ వివాదస్పద వ్యాఖ్యలు…! appeared first on Telugu Bullet .
వీడిన ఉత్కంఠ.. తిరుపతి వైసీపీ అభ్యర్థి ఎవరనే దానిపై అధికారిక ప్రకటన..!
తిరుపతి: రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి అధికార వైసీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారనే ఉత్కంఠకు తెరపడింది. తిరుపతి అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి పోటీ చేస్తారని వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. వివరాలు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల కో ఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ఇటీవల తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి భూమన అభినయ్రెడ్డి పోటీ చేయనున్నారని విజయ సాయిరెడ్డి ప్రకటించారు. అభినయ్రెడ్డి.. తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభినయ్ రెడ్డి.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఇక, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించనప్పుడే.. ఇవే తన చివరి ఎన్నికలని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి.. తన వారసుడు అభినయ్ రెడ్డిని బరిలో నిలపాలని చూస్తున్నారు. ఇక, రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా.. ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని వైసీపీ కొన్ని నెలల కిందట అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి తిరుపతి వైసీపీ టికెట్ విషయంలో కూడా భూమన అనుచరలు.. అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. తాజాగా తిరుపతి వైసీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి పేరు ఖరారు కావడంతో.. వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.
మోదీ సభకు తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు
మోదీ సభకు తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు
మంత్రి, ఎంపీపై కేసు నమోదు చేయాలి : రఘునందన్రావు
మంత్రి, ఎంపీపై కేసు నమోదు చేయాలి : రఘునందన్రావు
చండ్రుగొండ లో 1.89 లక్షల చేప పిల్లలు పంపిణీ
చండ్రుగొండ లో 1.89 లక్షల చేప పిల్లలు పంపిణీ
AP: పలమనేరు నియోజకవర్గంలో చిరుత సంచారం
పలమనేరు నియోజకవర్గం పరిధిలోని వి.కోట సరిహద్దుల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా చిరుత వీ.కోట మండలం జవున్నిపల్లె పరిసరాల్లో సంచరిస్తోంది. చిరుతను గమనించిన పశువుల కాపరులు గ్రామంలో విషయం తెలపడంతో జవునిపల్లె పంచాయతీ ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. మంగళవారం సాయంత్రం కే.నక్కనపల్లి వద్ద కుక్కను వేటాడేందుకు చిరుత రావడంతో గమనించిన గ్రామస్తులు కేకలు వేయడంతో అది పరారైంది. చిరుత సంచరిస్తోందన్న విషయం తెలపడంతో భయంతో బాణసంచా పేల్చి దానిని గ్రామం వైపు […]
దూరం పెట్టిన ప్రియుడు... యాసిడ్ పోసి ప్రతీకారం తీర్చుకున్న ప్రియురాలు
ఆమెకు పెళ్లైంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటుంది.
నువ్వేదో పొడుస్తావని జనం గెలిపించలే.. పాలేరు ఎమ్మెల్యేపై పొంగులేటి శ్రీనివాస్ఫైర్
నువ్వేదో పొడుస్తావని జనం గెలిపించలే.. పాలేరు ఎమ్మెల్యేపై పొంగులేటి శ్రీనివాస్ఫైర్
ముఖానికి మాస్క్ తో గాలిలో కి డబ్బులు విసిరాడు..!
డబ్బులు ఎవరికీ చేదు కాదు. ప్రతి ఒక్కరూ తాము జీవించడం కోసం డబ్బు సంపాదించాలనే అనుకుంటూ ఉంటారు. దాని కోసం పగలు, రాత్రి కష్టపడేవారు కూడా ఉన్నారు. అలాంటి డబ్బును ఓ వ్యక్తి ఎవరికి కావాల్సినంత వారు ఏరుకోండి అంటూ, గాలిలో వెద జల్లాడు. ఈ సంఘటన జైపూర్ లో చోటుచేసుకుంది. గతంలో ఇలా డబ్బులు విసిరిన సందర్భాలు చాలానే చూశాం. అయితే, ఈ వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చి మరీ ఈ డబ్బులు చల్లాడు. అది కూడా మనీ హీస్ట్ మాస్క్ కావడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని మాల్వియా నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మనీహీస్ట్ అనే వెబ్ సిరీస్ లో చూపించినట్లుగా, ముఖానికి మాస్క్, అలాంటి డ్రెస్ వేసుకోసుకొని వచ్చాడు. స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద మాల్స్, కాంప్లెక్స్ల వద్దకు చేరుకున్నాడు. జన సందోహం మధ్యలోనే కారు ఆపి, కాసేపటికి ఏకంగా కారు పైకి ఎక్కేశాడు. అంతే, కారు పైకి ఎక్కిన తర్వాత తన దగ్గర ఉన్న బ్యాగ్ లో నుంచి డబ్బులు తీసి విసరడం మొదలుపెట్టాడు. మొదట అతను చేసిన పనికి అందరూ షాకయ్యారు. తర్వాత తేరుకొని ఆ డబ్బులను ఏరుకోవడం మొదలుపెట్టారు. కొందరు మాత్రం అతను చేస్తున్న పనిని కెమేరాల్లో బంధించడం మొదలుపెట్టారు. సుమారు 15 నుంచి 20 నిముషాల పాటు లక్షల రూపాయల మేర రూ.20, రూ.50 నోట్లను వెదజళ్లాడు. ఈ ఘటనను చాలా మంది తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డబ్బులు ఎక్కువయ్యి ఇలా చేస్తున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
FB, ఇన్స్టా ఫ్రీ కాదు.. నెలకు 14 డాలర్లు కట్టాలంట..!
FB, ఇన్స్టా ఫ్రీ కాదు.. నెలకు 14 డాలర్లు కట్టాలంట..!
సిద్దిపేట నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభం
సిద్దిపేట నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభం
నేషనల్ హైవే ..అలైన్మెంట్ మార్చాలి: నున్నా నాగేశ్వరరావు
నేషనల్ హైవే ..అలైన్మెంట్ మార్చాలి: నున్నా నాగేశ్వరరావు
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ధన్ పాల్
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ధన్ పాల్
సంగారెడ్డి జిల్లాలో మోకాళ్లపై నిలబడి ఈ పంచాయతీ ఆపరేటర్ల సమ్మె
సంగారెడ్డి జిల్లాలో మోకాళ్లపై నిలబడి ఈ పంచాయతీ ఆపరేటర్ల సమ్మె
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం….
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 25,952 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.77 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 19న గరుడ […]
నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ…!
నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరుగనుంది. ఓటుకు నోటు కేసు విచారణను జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ల ధర్మాసనం చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసు లో రెండు పిటిషన్లు ఏపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేశారు. అయితే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లలో ఏపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి స్పష్టంగా తెలిపారు. తెలంగాణ ఏసీబీ నుంచి కేసును […] The post నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ…! appeared first on Telugu Bullet .
వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైళ్లు ఇలానే ఉంటాయట
వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైళ్లు ఇలానే ఉంటాయట
రాత్రిపూట భోజనం మానేస్తే బరువు తగ్గుతారా? ఎలాంటి నష్టాలు!
పొద్దున్నే తినే ఆహారం రోజుకి అత్యంత ప్రాధాన్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొంతమంది బరువు తగ్గడానికి ..
ప్లాన్ ప్రకారమే నిర్మాత అంజిరెడ్డి హత్య
ప్లాన్ ప్రకారమే నిర్మాత అంజిరెడ్డి హత్య
Jagan to visit Delhi on October 5, what’s up?
AP Chief Minister Y S Jagan Mohan Reddy is scheduled to visit the national capital, Delhi, on October 5. He is likely to meet Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah during his visit. The visit was originally scheduled to have taken place in the third week of September, after Jagan returned […] The post Jagan to visit Delhi on October 5, what’s up? appeared first on Telugu360.com .
బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలి : మిట్టపల్లి వెంకటస్వామి
బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలి : మిట్టపల్లి వెంకటస్వామి
ఆర్ఐపై నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన
ఆర్ఐపై నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన
హైద్రాబాద్లో సినీ నిర్మాత అంజిరెడ్డి మృతిలో కీలక విషయాలు: ఆస్తి కోసం హత్య
హైదరాబాద్: నగరంలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ నిర్మాత అంజిరెడ్డి మృతి విషయంలో పోలీసులు కీలక విషయాలు తేల్చారు. అంజిరెడ్డిని హత్య చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29న గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో సినీ నిర్మాత అంజిరెడ్డి మృతి చెందాడు. పార్కింగ్ స్థలంలో వాహనం ఢీకొని అంజిరెడ్డి మృతి చెందినట్టుగా నిందితులు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ నిర్వహించిన సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంజిరెడ్డికి, కాట్రగడ్డ రవి మధ్య స్నేహం ఉంది. అంజిరెడ్డి తన పేరున ఉన్న ఆస్తులను విక్రయించి అమెరికాకు వెళ్లిపోవాలని భావించాడు.ఈ విషయమై రవికి చెప్పాడు. అయితే అంజిరెడ్డిని హత్య చేస్తే ఆస్తులన్నీ తనకు దక్కుతాయని రవి భావించాడని పోలీసులు చెప్పారు. అంజిరెడ్డి ఆస్తులను కొనుగోలు చేసేందుకు రాజేష్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి సిద్దంగా ఉన్నాడని అంజిరెడ్డిని నమ్మించాడు. అంజిరెడ్డి ఆస్తులను తన పేరున రాయించుకుని హత్య చేశాడని పోలీసులు చెప్పారు. అంజిరెడ్డిని హత్య చేసేందుకు ఇద్దరు బీహారీలకు కాట్రగడ్డ రవి సుఫారీ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు. అంజిరెడ్డిని హత్యలో పాల్గొన్న ఇద్దరు బీహారీలతో పాటు కాట్రగడ్డ రవిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి కొడుతున్న ఏడుగురు విద్యార్థుల అరెస్ట్
తల్లిదండ్రులు కష్టనష్టాలకు ఓర్చి తమ పిల్లలు ప్రయోజకులు కావాలని వారిని ఉన్నత చదువుల కోసం పట్నం పంపిస్తే.. వారు మాత్రం నిత్యం గంజాయి మత్తులో తూగుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు.
బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా..
(మొదటి లిస్ట్ లో 20 మందికి అభ్యర్థులకు చోటు) హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 20 మందితో కూడిన తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. అయితే మొదటి జాబితాలో తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా ఉంది. ఆయన అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం […] The post బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా.. appeared first on Aadab Hyderabad .
మంచిర్యాల మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ లీడర్ల ధర్నా
మంచిర్యాల మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ లీడర్ల ధర్నా
Brahmamudi Today : రాజ్ నటిస్తున్నాడని తెలుసుకున్న కావ్య..?
బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
దుబ్బతండాలో గడపగడపకు కాంగ్రెస్ : సుదర్శన్రెడ్డి
దుబ్బతండాలో గడపగడపకు కాంగ్రెస్ : సుదర్శన్రెడ్డి
ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ఇంట్లో ఇడి సోదాలు….
ఢిల్లీ: ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ఇంట్లో ఇడి సోదాలు నిర్వహిస్తోంది. నార్త్ అవెన్యూలోని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఛార్జిషీట్లో సంజయ్ పేరును ఇడి చేర్చింది. సంజయ్, శరత్ చంద్ర, దినేష్ అరోరా అప్రూవర్లుగా మారి కీలక వివరాలు ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అభిషేక్ బోయిన్పల్లి, దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, మాగుంట […]
తల్లిదండ్రుల కాళ్లుచేతులు కట్టేసి... నడిరోడ్డుపై కూర్చోబెట్టిన కసాయి కొడుకులు (వీడియో)
వేములవాడ : ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువే లేకుండా పోయింది. ధనదాహంతో కొందరు ఎంతకయినా తెగిస్తున్నారు. చివరకు నవమాసాలు కడుపున మోసిన తల్లి, అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రిని సైతం ఆస్తుల కోసం చిత్రహింసలు పెడుతున్నారు కొందరు సుపుత్రులు.ఇలాంటి కసాయి కొడుకుల చేతుల్లో తల్లిదండ్రులు బందీలయిన అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... వేములవాడ పట్టణంలో నివాసముండే వృద్ద దంపతులను ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారు. ఆస్తి విషయమై తల్లిదండ్రులతో పాటు మేనల్లుడితోనూ వీళ్లు పలుమార్లు గొడవపడ్డారు. ఇలా నిన్న(మంగళవారం) కూడా తల్లిదండ్రులతో గొడవకు దిగిన కొడుకులు అమానుషంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల కాళ్లు చేతులు కట్టేసి నడిరోడ్డుపై అవమానకరంగా కూర్చోబెట్టారు. వీడియో ఇదే సమయంలో మేనల్లుడితో మరింత దారుణంగా వ్యవహరించారు. మేనల్లుడి కాళ్లుచేతులు తాళ్లతో బంధించి ఓ స్తంభానికి కట్టేసారు. ఈ వ్యవహారంపై గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సదరు వ్యక్తులను మందలించి తల్లిదండ్రులు, మేనల్లుడి కట్లు విప్పించారు. వారిమధ్య గొడవలపై ఆరా తీసిన పోలీసులు విచారణ చేపట్టారు.
మౌనిక రెడ్డి విడాకులు తీసుకుంటుందా..? నిజమెంత..?
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపుని మౌనిక రెడ్డి ఇటీవల పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందా..?
ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా? : షబ్బీర్అలీ
ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా? : షబ్బీర్అలీ
తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్.. మూడు రోజులు మకాం
తెలంగాణలో ఎలక్షన్ కౌంట్డౌన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది.
కొత్త ఫ్రెండ్ను పరిచయం చేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోస్
కొత్త ఫ్రెండ్ను పరిచయం చేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోస్
మోడీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే!
బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందాన్ని తాను ముందే చెప్పానని.. దానిని నిజామాబాద్ వేదికగా ప్రధాని మోడీ బహిరంగంగా అంగీకరిచారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
Beauty Tips: మిగిలిపోయిన సబ్బు ముక్కలతో.. హెయిర్ రిమూవల్ సోప్ తయారు చేద్దాం!
Beauty Tips: అవాంచిత రోమాలని తొలగించుకోవడం కోసం ఇంటిలో మిగిలిపోయిన సబ్బు ముక్కలతోనే అద్భుతమైన సోప్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సాధారణంగా అవాంచిత రోమాలతో బాధపడే ఆడవాళ్లు వాటిని తొలగించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసే ఉంటారు. కొంతమంది రేజర్లు వాడతారు, కొంతమంది హెయిర్ రిమూవల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. అయితే వీటిని ఉపయోగించిన తరువాత చాలా సేపటి వరకు చికాకుగా, నొప్పిగా ఉంటుంది. అంతేకాదు ఆ ప్రొడక్ట్స్ కోసం చాలా ఖర్చు పెట్టవలసి కూడా వస్తుంది. అయితే ఇంట్లోనే మిగిలిపోయిన సబ్బు ముక్కలతో ఎలాంటి ఖర్చు లేకుండా హెయిర్ రిమూవల్ సోప్ ని తయారు చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించడం వలన ఎలాంటి బాధ, నొప్పి ఉండదు. దీనివలన హెయిర్ తొలగించుకోవడం సులభం అవుతుంది. అయితే ఈ సబ్బు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. మనం ఇంట్లో వాడే సబ్బు ముక్కలు ఆఖరు అయిపోయిన తర్వాత పారేస్తూ ఉంటాం. కానీ అలా చేయకుండా ఆ సబ్బు ముక్కలకి బేరియం సల్ఫేట్ పొడి, పసుపు కలిపితే హెయిర్ రిమూవల్ సోప్ తయారవుతుంది. అదెలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిగిలిపోయిన సబ్బు ముక్కలని తీసుకోండి. వాటిని వ్యాక్స్ హీటర్ ఆన్ చేసి అందులో వెయ్యండి. అది కరగడం ప్రారంభించినప్పుడు టెంపరేచర్ని తగ్గించండి. తద్వారా సబ్బు కలుగుతుంది. సబ్బు పూర్తిగా కరిగిపోయిన తర్వాత టేబుల్ స్పూన్ బేరియం సల్ఫేట్ పొడి, చిటికెడు పసుపు జోడించండి. తర్వాత సబ్బులో బేరియం సల్ఫేట్ పొడి బాగా కలిసేలాగా చూసుకోండి. ఇప్పుడు దాన్ని ఏదైనా షేప్ బౌల్లో నింపి ఆరనివ్వండి. ఇప్పుడు మీ చేతిలో రెడీ అయిన హెయిర్ రిమూవల్ సోప్ ఉన్నట్టే. ఇక దీనిని ఎలా ఉపయోగించాలంటే ముందుగా మీ చర్మాన్ని తడి చేసుకోండి.ఆ తర్వాత సబ్బుని అప్లై చేయండి. మీరు సబ్బుని రుద్దుతున్నప్పుడు జుట్టు నెమ్మదిగా రాలడం ప్రారంభించడాన్ని గమనిస్తారు. ఈ ప్రక్రియకు సమయం పట్టవచ్చు. కాబట్టి మీ సమయాన్ని వెచ్చించి నిదానంగా పనిచేయండి. జుట్టు రాలినప్పుడు నీళ్లతో కడిగేయాలి.కాళ్లు, చేతులు, పొత్తు కడుపు ప్రాంతాల్లో కూడా దీనిని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనిని వాడే ముందు చర్మానికి క్రీములు, ఆయిల్ వంటివి లేకుండా జాగ్రత్త పడండి.
వందే భారత్ స్లీపర్ వెర్షన్.. నమూనా చిత్రాలను షేర్ చేసిన కేంద్ర మంత్రి.. ఎలా ఉన్నాయో చూడండి..
దేశంలోని పలు మార్గాల్లో వందేభారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే స్లీపర్ కోచ్ వెర్షన్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. దేశంలోని పలు మార్గాల్లో వందేభారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వందేభారత్ రైళ్లలో సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే త్వరలోనే స్లీపర్ కోచ్ వెర్షన్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు భారతీయ రైల్వే ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రోజున వందే భారత్ స్లీపర్ కోచ్ల కొన్ని అద్భుతమైన నమూనా చిత్రాలను విడుదల చేశారు. ఇక, ఈ ఏడాది డిసెంబరు నాటికి స్లీపర్ ఎడిషన్ వందేభారత్ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని.. 2024 మార్చి నాటికి రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇక, అశ్విని వైష్ణవ్ విడుదల చేసిన చిత్రాలు పరిశీలిస్తే, స్లీపర్ ఎడిషన్ వందేభారత్ రైళ్లు.. అత్యాధునిక ఇంటీరియర్, సౌకర్యాలతో ప్రయాణీకులకు మరింత మెరుగైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందించే విధంగా ఉన్నాయి. ఈ ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్)లో విడుదల చేసిన అశ్విని వైష్ణవ్.. “కాన్సెప్ట్ రైలు - వందే భారత్ (స్లీపర్ వెర్షన్). త్వరలో… 2024 ప్రారంభంలో” అని పేర్కొన్నారు. ఇక, వందే భారత్ స్లీపర్ రైళ్లు.. రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించడానికి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండనున్నాయి.
రోడ్డు ప్రమాదానికి గురైన స్టార్ హీరోయిన్ దంపతులు
షారుఖ్ ఖాన్ 'స్వదేస్' మూవీలో నటించి గాయత్రి జోషి, ఆమె వ్యాపార వేత్త భర్త వివేక్ ఒబెరాయ్ ఇటీవల ఇటలీలో జరిగిన కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Peddha Kapu strategy goes Terribly Wrong
Srikanth Addala switched genres and tested his luck with Peddha Kapu, an action-packed political drama. Virat Karrna and Pragathi Srivastav played the lead roles and Peddha Kapu was made on a whopping budget. The film released on September 29th and it was rejected badly by the audience. The makers are so confident on the film […] The post Peddha Kapu strategy goes Terribly Wrong appeared first on Telugu360.com .
టమాటా రైతు చితికి పోతున్నాడు. మొన్నటి వరకూ వేల రూపాయలు పలికిన ధర నేడు పది రూపాయలు కూడా పలకడం లేదు
మాజీమంత్రి నారాయణకు మరదలిపోటు: ఐఆర్ఆర్ కేసులో సీఐడీకి ఆధారాలిస్తానంటూ ప్రియ వీడియో
మాజీమంత్రి పొంగూరు నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-2గా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
అందుకే బౌలింగ్ చేయడం ఆపేశా! అయితే వరల్డ్ కప్లో... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
స్టీవ్ స్మిత్ మాదిరిగానే స్పిన్నర్గా టీమ్లోకి వచ్చి, బ్యాటర్గా సెటిల్ అయ్యాడు రోహిత్ శర్మ. 2009 సీజన్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్కి ఆడిన రోహిత్ శర్మకు ఐపీఎల్లో హ్యాట్రిక్ కూడా ఉంది. ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసి, సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ కూడా రోహితే.. ఐపీఎల్ కెరీర్లో 15 వికెట్లు తీసిన రోహిత్ శర్మ, 2009 సీజన్లోనే 11 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో రెండు, వన్డేల్లో 8, టీ20ల్లో ఓ వికెట్ తీసిన రోహిత్ శర్మ.. ఓపెనర్గా మారిన తర్వాత బౌలింగ్ చేయడం పూర్తిగా తగ్గించేశాడు.. 2012 నుంచి 2016 వరకూ నాలుగేళ్లలో కేవలం నాలుగు వన్డేల్లో మాత్రమే బౌలింగ్ చేశాడు రోహిత్ శర్మ. 2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా బౌలింగ్ చేయడం మానేశాడు. ఐపీఎల్లో చివరిగా 2014లో బౌలింగ్ చేసిన రోహిత్, 2021లో అత్యవసర పరిస్థితుల్లో 7 బంతులు బౌలింగ్ వేశాడు.. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్లు తమ కెరీర్లో బ్యాటింగ్తో పాటు పార్ట్ టైమ్ బౌలర్లుగా కూడా రాణించారు. రెగ్యూలర్ బౌలర్లు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, వరుస ఓవర్లు బౌలింగ్ చేసి అలిసిపోయినప్పుడు పార్ట్ టైమ్ బౌలర్లు చాలా కీలకం అవుతారు.. అందుకే పార్ట్ టైమ్ బౌలర్గా టెస్టుల్లో 46 వికెట్లు తీసిన సచిన్ టెండూల్కర్, వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టాడు. సెహ్వాగ్ వన్డేల్లో 96, టెస్టుల్లో 40 వికెట్లు తీయగా సౌరవ్ గంగూలీకి కూడా వన్డేల్లో 100 వికెట్లు, టెస్టుల్లో 32 వికెట్లు దక్కాయి.. ‘బౌలింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి కాస్త ఇబ్బంది కలగడం మొదలైంది. అది నా బ్యాటింగ్పై ప్రభావం చూపించకూడదనే బౌలింగ్ వేయడం తగ్గించాను. అయితే ఇప్పటికీ కొన్నిసార్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అవసరమైతే బౌలింగ్ చేయడానికి సిద్ధమే.. చూద్దాం ఏం జరుగుతోందో..’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ.. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా టీ20, వన్డేల్లో నాలుగేసి వికెట్లు తీశాడు. 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో వికెట్ తీసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత బౌలింగ్ చేయడం మానేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో విరాట్ బౌలింగ్ చేస్తాడని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు..
వచ్చే ఏడాది క్రూడ్ 70 డాలర్లకు దిగొచ్చే చాన్స్
వచ్చే ఏడాది క్రూడ్ 70 డాలర్లకు దిగొచ్చే చాన్స్
చంద్రబాబు అరెస్టు బాధాకరం : ఎర్రబెల్లి దయాకర్ రావు
చంద్రబాబు అరెస్టు బాధాకరం : ఎర్రబెల్లి దయాకర్ రావు
Stock Market –రెండో రోజూ కొనసాగుతున్న నష్టాలు…. తొలి సెషన్ లోనే 450 పాయింట్ల పతనం
ముంబై – దేశీయ స్టాక్మార్కెట్లో పతనం బుధవారం కూడా కొనసాగింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే దేశీయ మార్కెట్లో భారీ పతనం కనిపించింది..సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ ప్రారంభమైన వెంటనే దాదాపు 125 పాయింట్లు పడిపోయింది. ప్రీ-ఓపెన్ సెషన్ నుంచే దేశీయ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. ప్రీ-ఓపెన్ సెషన్లో సెన్సెక్స్ 180 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా దాదాపు 0.30 శాతం నష్టాల్లో ఉంది. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 436.46 […]
సీఎం పేషీ కోసం.. రుషికొండపై వేగంగా కొనసాగుతున్న పనులు..!
విశాఖపట్నంలోని రుషికొండపై వేగంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పర్యాటకశాఖ రిసార్టులో పేరుతో ఈ భవనాలకు రూ.200 కోట్లు నిధులను ఖర్చు చేశారు. అయితే ఆ భవనాలను సీఎం కార్యాలయాల కోసమే అని చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం వాటిని పర్యాటక శాఖ కోసమే నిర్మిస్తున్నారని, నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రభుత్వం ఆ భవనాలను ఏ రకంగానైన వినియోగించుకోవచ్చని వైసీపీ నాయకులు పలు సందర్భాల్లో మీడియాతో గతంలోనే చెప్పారు. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడి అరెస్టు కాగా.. అక్టోబర్ 23, 24వ తేదీల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నానికి వస్తున్నారని, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడి నుంచే సాగుతుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాట్లు కొలిక్కి రావడాన్ని బట్టి సీఎంవో ఆఫీసుకు పూజ ముహూర్తం ఫిక్స్ చేస్తారని చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా.. రుషికొండలో పర్యావరణల అనుమతుల నేపథ్యంలో పర్మినెంట్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు వీలు కాకపోవడంతో.. కంటైనర్ మోడల్ లో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆఫీసర్లు చెప్పారని ‘ఈనాడు’ కథనం పేర్కొంది. సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ? దీని ఏర్పాటు అనంతరం భూగర్భ కేబుల్ తో అనుసంధానం చేస్తామని ఆఫీసర్లు పేర్కొన్నారు. రూ.7 కోట్ల వ్యయంతో కంటైనర్ సబ్ స్టేషన్ కోసం రెండు నెలల కిందట పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ పనులు చివరి దశకు వచ్చేశాయి. ఇదిలా ఉండగా.. రుషికొండపై ఇప్పటికే రెండు బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఇంటరీయర్, ఫర్నీచర్ పనులు కొనసాగుతున్నాయి. మెయిన్ రోడ్డు నుంచి రుషికొండ వరకు రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. జాక్ పాట్ అంటే ఇదే.. రూ.100తో లాటరీ టికెట్ కొని.. రూ.కోటిన్నర గెలుచుకున్న స్నేహితులు.. (వీడియో) అలాగే రుషికొండ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు, గ్రీనరీ పెంపొందించేందుకు పర్యాటక శాఖ టెండర్లను ఇప్పటికే ఆహ్వానించింది. రుషికొండ దగ్గరలో ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొంత కాలం కిందట సీఎంవో ఆఫీసు సెక్యూరిటీ టీం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. కాగా.. గతంలోనే జీ-20 సన్నాహక సదస్సు పేరుతో రుషికొండ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఇప్పుడు మిగిలిన పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు.
అభ్యంతరాలు వచ్చినా..మాస్టర్ ప్లాన్ను రద్దు చేయరా? : శ్రీహరి రావు
అభ్యంతరాలు వచ్చినా..మాస్టర్ ప్లాన్ను రద్దు చేయరా? : శ్రీహరి రావు
వరంగల్ జిల్లాలో స్పీడ్ పెంచిన నేతలు
వరంగల్ జిల్లాలో స్పీడ్ పెంచిన నేతలు
మానకొండూరు కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: కె.సత్యనారాయణ
మానకొండూరు కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: కె.సత్యనారాయణ
ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన మరో హాట్ యాంకర్.. ఎంత ముద్దుగా ఉందో తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్లు ట్రెండింగ్లో ఉన్నారు.
హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి: అమిత్ షాతో భేటీకి అవకాశం
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారంనాడు న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారంనాడు రాత్రి ఢిల్లీ నుండి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టుగా సమాచారం.ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటు, ములుగులో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది.ఈ విషయమై కిషన్ రెడ్డిని న్యూఢిల్లీకి రావాలని కోరినట్టుగా సమాచారం. దీంతో కిషన్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం తర్వాతకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారని సమాచారం.ఈ నెల 2వ తేదీన కూడ కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 3న నిజామాబాద్ లో జరిగిన ఇందూరు ప్రజా గర్జన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై బాంబు పేల్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరుతానని తనతో చెప్పారని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.ఈ విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ప్రధాని మోడీ తన స్థాయిని మరిచిపోయి అబద్దాలు చెప్పారని కేటీఆర్ విమర్శించారు.
పాకిస్తాన్ కు పవిత్ర జలం, గీత, జపమాలలను పంపుతున్న ఉత్తరాఖండ్ సూఫీ మందిరం.. !
Uttarakhand Sufi shrine: మతాల ఐక్యతను, మత సహనాన్ని నొక్కిచెప్పే ఒక ప్రత్యేకమైన ఘటనకు సాక్షంగా నిలుస్తోంది ఉత్తరాఖండ్ లోని సూఫీ పుణ్యక్షేత్రం. సబీర్ మఖ్దూం షా దర్గా ను సందర్శించే పాకిస్థానీయులకు గంగానది పవిత్ర జలం, భగవత్ గీత ప్రతిని, సహజ రుద్రాక్ష పూసల జపమాలను బహూకరించింది. సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ప్రేమ సందేశాన్ని అందించడం, మత సహనానికి, మత సామరస్యానికి ఆదర్శంగా నిలవడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ముస్లిం యాత్రికులు ఈ బహుమతులను తమ హిందూ సహచరులకు అందజేయాలనీ, హిందువుల ఉపయోగం కోసం దేవాలయాల్లో డిపాజిట్ చేయాలని కోరారు. పాకిస్తాన్ లోని హిందువులు గంగానది పవిత్ర జలం కోసం, వారి వస్త్రాల కోసం, వైద్యం చేసే శక్తులతో కూడిన పవిత్ర పూసల కోసం ఆరాటపడుతుంటారు. వసుధైవ కుటుంబకం సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షంస్ తెలిపారు. మన సంస్కృతిలో ప్రతి ఒక్కరినీ ప్రియమైన దేశంలో భాగంగా భావిస్తారు. పాకిస్థాన్ నుంచి వచ్చే పర్యాటకులకు ప్రేమ సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. వారికి గంగాజలం, గీతను కానుకగా ఇచ్చామని, తద్వారా వారు తమ దేవాలయాలకు పంపుతారని, తద్వారా భారతదేశం పట్ల ప్రేమ సందేశం అక్కడి దేవాలయాలకు చేరుతుందని అన్నారు. తాము ఇచ్చిన కానుకలను పాకిస్థాన్ లోని ఆలయాలకు అందజేస్తామని పాక్ యాత్రికులు హామీ ఇచ్చారని షాదాబ్ షంస్ తెలిపారు. దేవాలయాలకు లేదా వ్యక్తులకు కానుకలు అందజేసే వీడియోలను రూపొందిస్తామని యాత్రికులు హామీ ఇచ్చారు. వీటన్నింటినీ స్మారక చిహ్నాలుగా తీసుకెళ్లి తమ హిందూ సోదరులకు అప్పగిస్తామని పాక్ యాత్రికులు షాదాబ్ కు చెప్పారు. ఇది తమ ప్రేమ, సోదరభావ సందేశాన్ని పెంపొందిస్తుందన్నారు. పాకిస్తాన్ ప్రజలు అక్కడి దేవాలయాలతో అనుసంధానం కావాలనీ, అక్కడి సనాతన సంస్కృతిని ప్రోత్సహించాలని తాము కోరుకుంటున్నామని షాదాబ్ షంస్ అన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. 107 మంది పాకిస్తానీ యాత్రికులకు గీత, గంగా జలాలను బహుమతిగా ఇచ్చామని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలిపారు. ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుండి లక్షలాది మంది భక్తులు సూఫీ పీర్ వార్షిక ఉర్సులో పాల్గొనడానికి వస్తారు. యాత్రికులు ఐదు రోజులుగా దర్గాకు చేరుకుంటున్నారు. భారతీయులు, పాకిస్థానీలు ఒకరి మత విశ్వాసాలు, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవాలని షాదాబ్ అన్నారు. ఉత్తరాఖండ్ లో ఐదవ ధామ్ గా ప్రసిద్ధి చెందిన సబీర్ మఖ్దూం షా దర్గా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలోని కలియార్ లో ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని హార్ట్ లో 755 రబీ అల్-అవ్వాల్ 19 హిజ్రీలో జన్మించిన సూఫీకి చెందిన 592 సంవత్సరాల పురాతన దర్గా. అతని అసలు పేరు సయ్యద్ అలీ అహ్మద్. ఆయన అల్లావుద్దీన్ సబీర్ సిల్సైల్ ను స్థాపించారు. దీనిని అలియా చిష్తియా సబారియా అని పిలుస్తారు. (ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..)
పిట్లంలో ఎమ్మెల్యే షిండే సుడిగాలి పర్యటన
పిట్లంలో ఎమ్మెల్యే షిండే సుడిగాలి పర్యటన
ఆసియా క్రీడలు 2023: ఆర్చరీలో జ్యోతి- ఓజస్కు గోల్డ్
ఆసియా క్రీడలు 2023: ఆర్చరీలో జ్యోతి- ఓజస్కు గోల్డ్
క్రీడారంగ అభివృద్ధికి సర్కార్ కృషి : కోవ లక్ష్మి
క్రీడారంగ అభివృద్ధికి సర్కార్ కృషి : కోవ లక్ష్మి
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటించాలి: జీవన్ రెడ్డి
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటించాలి: జీవన్ రెడ్డి
మోదీ కామెంట్స్.. కేసీఆర్కే కాదట.. ఇటు చంద్రబాబుకూ
నిజామాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ హాట్ టాపిక్గా మారాయి
5 నెలల కనిష్టానికి ..మాన్యుఫాక్చరింగ్ రంగం
5 నెలల కనిష్టానికి ..మాన్యుఫాక్చరింగ్ రంగం
ఖానాపూర్ బీఎస్పీ అభ్యర్థిగా బన్సీలాల్ రాథోడ్
ఖానాపూర్ బీఎస్పీ అభ్యర్థిగా బన్సీలాల్ రాథోడ్
పరువాలకు అడ్డుగా ఉన్న పైట తీసేసి శ్రియ అరాచకం... దారుణమైన పోజుల్లో చెమటలు పట్టించిన బ్యూటీ!
వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుందిశ్రియ శరన్. జీరో సైజ్ భామ గ్లామరస్ లుక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా డిజైనర్ శారీలోసెగలు పుట్టించింది. స్టార్ లేడీ శ్రియ శరన్ మరోసారి రెచ్చిపోయింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, డిజైనర్ శారీలో మైండ్ బ్లాక్ చేసింది. శ్రియ ఎద అందాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ స్కూల్ చిత్రంతోశ్రియ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు పాపారావు బియ్యాల ప్రయోగాత్మకంగా మ్యూజిక్ స్కూల్ చిత్రం తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ పలు భాషల్లో ఈ చిత్రం విడుదల చేశారు.శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు. ఇక నలబై ఏళ్ల శ్రియ కెరీర్ ఎక్కడా నెమ్మదించలేదు. స్టార్ హీరోయిన్ హోదా పోయినప్పటికీ ఆఫర్స్ తగ్గలేదు. అడపాదడపా చిత్రాల్లో ఆమె నటిస్తూనే ఉన్నారు. 2022లోఆర్ ఆర్ ఆర్, తడ్కా, దృశ్యం 2 చిత్రాల్లోశ్రియ శరన్ నటించారు. 2023 ప్రారంభంలో కబ్జ చిత్రంలో మెయిన్ హీరోయిన్ రోల్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కబ్జనిరాశపరిచింది. ఉపేంద్ర హీరోగా కబ్జతెలిసిందే. ప్లాప్ అయినప్పటికీ కబ్జ చిత్ర సీక్వెల్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె జర్నీ సాగుతుంది. వెండితెరపై ఎలాంటి విరామం సత్తా చాటుతుంది. శ్రియ పారిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. శ్రియ తోటి హీరోయిన్స్ ఎప్పుడో ఫేడ్ అవుట్ అయ్యారు. 2001లో విడుదలైన ఇష్టం మూవీతో శ్రియ వెండితెరకు పరిచయమైంది. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే... వంటి వరుస హిట్స్ తో ఆమె స్టార్ అయ్యారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టారు. కెరీర్ నెమ్మదించాకరష్యన్ ప్రియుడు ఆండ్రూనిశ్రియ వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది.బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఇక పిల్లల్ని కూడా ఆమె రహస్యంగానే కన్నారు.లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకుజన్మనిచ్చింది.
అథ్లెటిక్స్లో సిక్సర్.. పారుల్ చౌదరి, అన్ను రాణికి గోల్డ్ మెడల్స్
కుందనపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్: అనుమాస శ్రీనివాస్
కుందనపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్: అనుమాస శ్రీనివాస్
Asian Games –టీమ్ ఇండియా కు ఆర్చరీ లో స్వర్ణం .. 35 కిలో మీటర్ల మిక్సెడ్ వాక్ లో కాంస్యం
ఆసియా క్రీడల్లో భారత్కు గోల్డ్ రష్ కొనసాగుతోంది. బంగారు పతకాలను భారత్ ఈజీగా గెలిచేస్తోంది. ఇవాళ ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చింది. జ్యోతి, ఓజాస్ టీమ్ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించారు. దీంతో ఇండియా మెడల్స్ సంఖ్య 71కి చేరుకున్నది. ఈ క్రీడల్లో భారత్కు ఇది 16వ స్వర్ణం కావడం విశేషం. జ్యోతి సురేఖా వెన్నం, ఓజాస్ దియోతలే.. చరిత్రాత్మక ఆట తీరను కనబరిచారు. మిక్స్డ్ ఆర్చరీ ఈవెంట్లో ఫెవరేట్గా ఉన్న దక్షిణకొరియా ఆటగాళ్లను […]
యంగ్ హీరోయిన్ నేహా శెట్టి స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అందాల రచ్చ చేసింది. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. నయా లుక్ తో కట్టిపడేసింది. ‘డీజే టిల్లు’ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రచ్చ చేస్తోంది. టాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. రీసెంట్ గానే ‘బెదురులంక2012’తో మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం నేహా శెట్టి ‘రూల్స్ రంజన్’ (Raules Ranjann) చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం సరసన నేహా నటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో (అక్టోబర్ 6న) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేసుకుంటోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. నయా లుక్స్ లో మెరుస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సరికొత్త ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. అప్పటికే ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధ వహించే ఈ ముద్దుగుమ్మ నాజుకూ అందాలతో మంత్రముగ్ధులను చేసింది. టైట్ డ్రెస్ లో టెంప్టింగ్ ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నేహా కిల్లింగ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వైట్ హెవీ ఎంబ్రాయిండింగ్ ఫ్యాషన్ వేర్ లో నేహా దర్శనమిచ్చింది. ఫుల్ స్లీవ్ టాప్, బాడీకాన్ లాంటి లెహంగాలో మతులు పోయేలా ఫొటోషూట్ చేసింది. అన్ని యాంగిల్లో అదిరే స్టిల్స్ తో పరువాల ప్రదర్శన చేసింది. ఫిట్ నెస్ చూపిస్తూనే గ్లామర్ మెరుపులతో కట్టిపడేసింది. ఇటీవల నేహా శెట్టి గ్లామర్ విందుతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనలోని ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపించేలా ఫొటోషూట్లు చేస్తోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ ఫోజులిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ గా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్,, కామెంట్లు పెడుతూ వైరల్ గా మారుస్తున్నారు. పొగడ్తలతోనూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా నేహా శెట్టి యూత్ ను తనవైపు తిప్పుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇక నేహా శెట్టి ‘మెహబూబా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు చిత్రాలతో మెరిసింది. ‘డీజే టిల్లు’తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం రూల్స్ రంజన్ తో అలరించబోతోంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో నటిస్తోంది.
విద్యార్థులకు 13రోజులుదసరా సెలవులు
ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు ఈ నెల 13 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు హైదరాబాద్: బతుకమ్మ, దసరా పం …
‘ఉపా’ కింద కేసు.. న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్..
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ ప్రబీర్ పుర్కాయస్థను ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం న్యూస్క్లిక్ కార్యాలయం, దానితో అనుసంధానించబడిన దాదాపు 40 మంది జర్నలిస్టులు, ఇతర సిబ్బంది నివాసాలపై ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యూస్క్లిక్ పోర్టల్ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.న్యూస్క్లిక్సంస్థ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ)ని ఉల్లంఘించి న్యూస్క్లిక్ విదేశీ నిధులు పొందిందని ఆరోపణలు ఉన్నాయి. చైనీస్ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్వర్క్లో న్యూస్క్లిక్ అవుట్లెట్ భాగమని న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా ఆరోపించింది. ఇక, న్యూస్క్లిక్పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున న్యూస్క్లిక్తో సంబంధం ఉన్న జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు నిర్వహించారు. ఢిల్లీతో పాటు ముంబైలోని పలు ప్రదేశాలలో సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా కొందరి నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం.. ప్రబీర్ పుర్కాయస్థతో పాటు న్యూస్క్లిక్ పోర్టల్ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ‘‘మొత్తం 37 మంది మగ అనుమానితులను ప్రశ్నించడం జరిగింది. 9 మంది మహిళా అనుమానితులను వారి సంబంధిత ప్రదేశాలలో ప్రశ్నించడం జరిగింది. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు మొదలైనవాటిని స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష కోసం వాటిని సేకరించారు. విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు నిందితులు.. ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు’’అని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, చైనాతో లింకులు ఉన్నాయని ఆరోపించిన సంస్థల నుంచి న్యూస్క్లిక్కి దాదాపు రూ. 38 కోట్లు అందాయని.. ఆ నిధులను వెబ్సైట్లోని చైనా అనుకూల కంటెంట్ను ప్రభావితం చేయడానికి ఉపయోగించారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఎగుమతి సేవలకు రుసుముగా రూ. 29 కోట్లు, షేర్ల ధరలను పెంచడం ద్వారా రూ. 9 కోట్లు ఎఫ్డిఐగా స్వీకరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిధులను కార్యకర్తలు తీస్తా సెతల్వాద్, గౌతమ్ నవ్లాఖాతో కూడా పంచుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సోదాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొంతమంది దీనిని పత్రికా స్వేచ్ఛపై అణిచివేత అని పేర్కొన్నారు. ఇక, ఈ సోదాలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. సరైన ప్రక్రియను అనుసరించాలని.. ప్రెస్ బెదిరింపులకు సాధనాలుగా క్రూరమైన క్రిమినల్ చట్టాలను రూపొందించవద్దని కేంద్రాన్ని కోరింది. ఈ దాడులు మీడియాను మభ్యపెట్టే మరో ప్రయత్నం అని ఆందోళన వ్యక్తం చేసింది.
నిర్మల్ జిల్లాకు కేటీఆర్.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి
నిర్మల్ జిల్లాకు కేటీఆర్.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి
సినిమాలకు స్క్రిప్ట్ లు రాసుకొండి.. మోడీ లాంటి మోసగాడితో కేసీఆర్ సహవాసం చేయరు : కేటీఆర్
KTR hits out at PM Modi: ఎన్డీయేలో కేసీఆర్ చేరాలనుకున్నారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పీఎం ఇలా అవాస్తవాలను ప్రచారం చేయడం సిగ్గుచేటని, ఖండించదగ్గ విషయమంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పోరాట యోధుడనీ, మోడీ లాంటి మోసగాడితో ఎప్పటికీ సహవాసం చేయరని తెలిపారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. ముఖ్యమంత్రిని మార్చడానికి మోడీ నుంచి ఎన్ వోసీ అవసరం లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారనీ, తాము ఢిల్లీ, గుజరాత్ లకు బానిసలం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన అరుపులు మమ్మల్ని కదిలిస్తాయనీ, లేదా మమ్మల్ని భయపెడతాయని మోడీ అనుకుంటే పొరపాటే అంటూ విమర్శలకు పదును పెంచారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణకు కాషాయ పార్టీ ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. గత దశాబ్దంలో తెలంగాణ కోసం మీరు ఏం సాధించారు, ఇక్కడి ప్రజలు మీకు, మీ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీలకు ఓటమి తప్పదని పేర్కొంటూ.. బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. “గాంధీ భవన్లో కూరుకుపోయిన దేవుడా నువ్వు! రాజకీయ వ్యభిచారానికి బ్రాండ్ అంబాసిడర్ నీవే! కెమెరాకు చిక్కిన దొంగ నువ్వు! అబద్ధంలో పడి లాగితే అది నువ్వే! 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి హుజూరాబాద్, నాగార్జున సాగర్, మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీలు అపవిత్ర పొత్తు పెట్టుకున్నాయి! మీ మిలాఖత్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు మరోసారి సమాధి కడతారు!’’ అని అందులో పేర్కొన్నారు. మోడీని మోసగాడు అని పేర్కొంటూ.. బీఆర్ఎస్- సీఎం కేసీఆర్ ఎప్పటికీ మోసగాడితో పొత్తు పెట్టుకోరని కేటీఆర్ అన్నారు. ఫేక్ న్యూస్ యూనివర్శిటీకి మోడీ నేతృత్వం వహిస్తున్నారనీ, ఝూత్, జుమ్లా ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకుంటున్నారని మోడీ చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇవి పచ్చి అబద్ధాలని అన్నారు. మతిస్థిమితం కోల్పోయి ఎన్డీయేలో చేరేందుకు మమ్మల్ని పిచ్చికుక్క కాటు వేయలేదు. ఎన్డీయే మునిగిపోతున్న ఓడ.. ఒక ప్రధాని ఇలాంటి తీరును ప్రదర్శించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పోరాట యోధుడనీ, మోడీ లాంటి మోసగాడితో ఎప్పటికీ సహవాసం చేయరని కేటీఆర్ అన్నారు. మోడీ సెలెక్టివ్ మతిమరుపుతో బాధపడుతున్నారని విమర్శించారు.
రైల్వే న్యూ టైం టేబుల్ రిలీజ్..
భారతీయ రైల్వే మంగళవారం అక్టోబర్ 1 నుంచి ‘ట్రైన్స్ ఎట్ గ్లాన్స్(టీఏజీ)’ పేరుతో కొత్త టైమ్ టేబుల్ని విడుదల చేసింది.
మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు
మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు
మా ఇద్దరికి మంచిదే.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన మౌనిక రెడ్డి
షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా తెరకెక్కిన ‘సూర్య’ వెబ్సిరీస్లో హీరోయిన్గా నటించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది మౌనిక రెడ్డి.